breaking news
-
రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్కేసు బాంబులను ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. -
హెచ్ఎంఏ అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి హెచ్ఎంఏ తన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కార్యవర్గ సమావేశంలో అల్వాల దేవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈయన ఈరైడ్ విద్యుత్ వాహనాల సంస్థ వ్యవస్థాపకుడు.శరత్ చంద్ర మారోజును ఉపాధ్యక్షుడిగా, వాసుదేవన్ను కార్యదర్శిగా కార్యవర్గం ఎన్నుకుంది. కొత్త మేనేజ్మెంట్ కమిటీలో ఇంకా సిండిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శరత్ చంద్ర మారోజు, ఈక్విటాస్ బ్యాంక్ జాతీయ అధిపతి వాసుదేవన్, ధ్రుమతారు కన్సల్టెంట్స్ వ్యవస్థపకులు, సీఈఓ చేతనా జైన్, స్టెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకులు వి.శ్రీనివాసరావు, సిటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకర వెంకట కృష్ణ ప్రసాద్ ఉన్నారు.ఈ సందర్భంగా హెచ్ఎంఏ నూతనాధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, “వివిధ పరిశ్రమల్లో యాజమాన్య విధానాలను మరింత బలోపేతం చేయడంపై మేం ప్రధానంగా దృష్టిపెడతాం. అదే సమయంలో విద్యార్థుల సామర్థ్యాలను కూడా పెంపొందిస్తాం. వాళ్లను ఆంత్రప్రెన్యూర్లుగా లేదా కార్పొరేట్ ఉద్యోగాలకు సరిపోయేలా తీర్చిదిద్దుతాం” అని తెలిపారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) 1964 నుంచి నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ. సరికొత్త యాజమాన్య విధానాలపై యువ మేనేజర్లు, వృత్తినిపుణులు, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతుంది. -
‘మరాఠిని అవమానిస్తే ఉపేక్షించం’
ముంబై: ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీ భాషకు సంబంధించి రగడ మొదలైంది. ఇప్పటికే త్రి భాషా పాలసీ తీర్మానాన్ని రద్దు చేయించడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రతిపక్ష పార్టీలు.. ఇప్పుడు మరాఠి భాషను ఎవరైనా అవమానిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు పంపుతున్నాయి. . ఓ షాపు కీపర్ మరాఠి భాష మాట్లాడలేదనే కారణంతో అతనిపై ఓ వర్గం దాడికి దిగడంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. ఎవరూ కూడా ఈ తరహా దాడులు చేసి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దంటూనే మరాఠీ భాషను మహారాష్ట్రలో ఉండేవారు ఎవరైనా అవమానిస్తే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎమ్మెన్నెస్కు చెందిన కార్యకర్తలు పలువురి కలిసి ఓ స్టీట్ షాపు కీపర్పై దాడి చేశారు. సదరు షాప్ కీపర్ మరాఠీ మాట్లాడనందుకు, ఆ భాషా మాట్లాడటం ఏమైనా తప్పనిసరి చేశారా? అని ప్రశ్నించినందుకు ఎమ్మెన్నెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జరిగి ఒక రోజు తర్వాత ఆదిత్యా ఠాక్రే మాట్లాడారు. ఎవరైన మరాఠీ భాషను అవమానిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. అదే సమయంలో ఎవరూ భౌతిక దాడులకు దిగవద్దని, మరాఠీ భాషన అవమానించే వారికి చట్టపరంగా బుద్ధి చెబుదామన్నారు.ఇప్పుడు దీనిపై అధికార బీజేపీకి ప్రతిసక్ష పార్టీలకు మహారాష్ట్రలో తీవ్ర రగడ జరుగుతోంది. మరాఠీ భాష మాట్లాడడం అనేది తప్పనిసరిక, కానీ ఇలా భాష మాట్లాడలేదని దాడులకు దిగి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం తగదని మహారాష్ట్ర మంత్రి,, శివసేన నాయకుడు యోగేష్ కదమ్ స్పష్టం చేశారు. -
వైరల్ ఎలా అవ్వాలంటోన్న శ్రీలీల.. అసలు విషయం ఏంటంటే?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఏడాది నితిన్ సరసన రాబిన్హుడ్లో మెప్పించిన భామ.. ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈనెల 4న వైరల్ వయ్యారి అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీల, దేవీశ్రీ ప్రసాద్ చేసిన ప్రమోషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీకి కాల్ చేసిన శ్రీలీల.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మీ రీల్సే కనిపిస్తున్నాయి.. మీలా వైరల్ ఎలా అవ్వాలో నేర్పిస్తారా అని అడిగింది. ఏంటీ వైరల్ ఎలా అవ్వాలో మీకు నేర్పాలా?కామెడీ వద్దమ్మా? మీరే నాకు నేర్పాలని దేవీశ్రీ అన్నారు. నిజమే కదా.. మీరు వయ్యారంగా ఓ మాస్ స్టెప్ వేస్తే అదే వైరలైపోద్ది అని చెప్పాడు. అదేదో మీరే ఇవ్వండి సార్ అని శ్రీలీల ముద్దుగా అడగడంతో.. వైరల్ వయ్యారి అంటే ఎలా ఉంది సాంగ్ అంటూ దేవీశ్రీ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఇదంతా వైరల్ వయ్యారి పాట కోసమే వీరిలా వైరైటీ ప్రమోషన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.#Junior second single #ViralVayyari out on July 4thIn cinemas July 18th. @sreeleela14 @ThisIsDSP pic.twitter.com/TDAbv8w5Rz— ScreenTimeGuru (@ScreenTimeGuru) July 1, 2025 -
ప్రజాగ్రహం దెబ్బకు తలొగ్గిన ఢిల్లీ ప్రభుత్వం
సాక్షి,ఢిల్లీ: ప్రజాగ్రహంతో ఢిల్లీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఇటీవల ప్రకటించిన ‘ఎండ్ ఆఫ్ లైఫ్’ (EOL) వెహికల్ పాలసీపై తీవ్ర విమర్శల నేపథ్యంలో.. పాత వాహనాలపై నిషేధంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు నష్టపోకుండా.. ప్రయోజనం చేకూరేలా కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తామంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.వాహనం వయస్సు ఆధారంగా కాకుండా వాతావరణం కాలుష్యం చేసే వాహనాలపై మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. వాహనాల కాలుష్యం విషయంలో యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చేలా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ విధానం ఢిల్లీతో పాటు ఇతర ఎన్సీఆర్ ప్రాంతాల్లోనూ అమలు చేయాలన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది.క్వాలిటీ ఎయిర్ మేనేజ్మెంట్ నుంచి తదుపరి మార్గదర్శకాలు వచ్చే వరకు పాలసీ అమలును నిలిపి వేయనుంది. ఇది వాహన యజమానులకు తాత్కాలిక ఊరట కలిగించినా, కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. Delhi Environment Minister Manjinder Singh Sirsa writes to the Commission for Air Quality Management to place on hold the enforcement of Direction No. 89, which mandates the denial of fuel to End-of-Life (EOL) vehicles in Delhi"We urge the Commission to put the implementation… pic.twitter.com/mgg1Ymdaes— ANI (@ANI) July 3, 2025 -
పీఎస్లే కేంద్రంగా పంచాయితీలు
‘పోలీసుస్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయి. వీటిని సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా మార్చారు. సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినా బెదిరింపులకు దిగుతూ ఏదో ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు’రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగోలు పోలీసుస్టేషన్లో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. సాక్షి, హైదరాబాద్: సివిల్ వివాదం.. ఇదంటే పోలీసులకు వీనుల విందు, బహు పసందు కూడా. క్రిమినల్ కేసులో ఏముంటుంది... పరిశోధన, తిరగడం, చాకిరీ... అదే సివిల్ కేసుల్లో అయితే... డబ్బే డబ్బు. నగరంతో పాటు చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు రావడంతో అదే స్థాయిలో అక్రమాలు పెరిగిపోయాయి. ఇలాంటి వివాదాలన్నీ చివరకు పోలీసుల వద్దకే చేరుతున్నాయి. దీంతో కొందరు పోలీసులు తమ సివిల్ సెటిల్మెంట్లకు పోలీసుస్టేషన్లనే అడ్డాలుగా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి గతంలో న్యాయస్థానాలు, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. ఆ విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తూ... ఇప్పుడు అనేక పోలీసుస్టేషన్లలో భూ వివాదాలను పరిష్కరించడం మామూలు విషయంగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే సివిల్ వివాదాలు లేకపోతే స్టేషన్తో పాటు అధికారుల ఖర్చులు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. తమ జేబులు నింపేవి కూడా అవే కావడంతో కింది స్థాయి పోలీసులు వాటి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే బయటపడితే ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో సాధ్యమైనంత వరకు కేసు రిజిస్టర్ చేయకుండానే వ్యవహారం చక్కబెడుతుంటారు. అప్పటికీ సెటిల్ కాకపోతే తాము ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు ఇరు వైపుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఆ తర్వాత కథ నడిపిస్తున్నారు. కేసు నమోదయితేనే సివిల్ కేసుల్లో తలదూర్చుతున్నారని తెలుస్తోంది. అసలు కేసే నమోదు చేయకపోతే? పోలీసులకు ఇబ్బందే ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం కేసు నమోదు తప్పనిసరిగా మారుతుంది. అలాంటప్పుడు తమకు అనుకూలమైన లాయర్ల వద్దకు క్లైంట్స్ను పంపే పోలీసులు కోర్టు రిఫర్డ్ ద్వారా రమ్మని చెప్పి కేసులు నమోదు చేస్తుంటారు. వాటి విభజన చాలా కష్టం... ‘ఇచ్చట సివిల్ కేసులు నమోదు చేసుకోం... వివాదాలు పరిష్కరింపబడవు’ దాదాపు ప్రతి పోలీసుస్టేషన్లోనూ ఈ బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. అయితే సివిల్ కేసులు నమోదు చేసుకోవడం మానేసిన ఖాకీలు... వచ్చిన కేసునల్లా సెటిల్మెంట్ చేయడం మాత్రం మర్చిపోవట్లేదు. దీనికి కారణం భూ వివాదాల్లో సివిల్, క్రిమినల్ విభజించడం చాలా కష్టం. ఈ రెండింటి మధ్యా ఓ చిన్న గీత మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే... అది సివిల్ వివాదం అవుతుంది. దీనిపై న్యాయస్థానంలోనే తేల్చుకోవాలి. అదే వ్యక్తి స్థలాన్ని ఆక్రమించే క్రమంలో కూల్చివేతలు, బెదిరింపులకు, దాడులకు దిగితే అది క్రిమినల్ కేసుగా మారుతుంది. అంటే.. పోలీసుల చేతికి వచ్చినట్లే. ఈ పరిణామాల నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు, కఠిన చర్యలు లేకుండా పోలీసులను, సివిల్ కేసులను వేరు చేయడం సాధ్యంకాదని వినిపిస్తోంది. అవన్నీ అటకెక్కిపోయాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసుల సివిల్ వ్యవహారాల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ 2010 నవంబర్ 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.చదవండి: అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల కూడా.. అప్పట్లో రాచకొండ లేకపోవడంతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసు కమిషనర్ అధ్యక్షుడిగా, ఐజీ స్థాయి అధికారులైన అదనపు కమిషనర్ (సమన్వయం), అదనపు కమిషనర్ (నేరాలు) సభ్యులుగా, సైబరాబాద్ కమిషరేట్ విషయానికి వస్తే అధ్యక్షుడిగా పోలీసు కమిషనరే ఉన్నప్పటికీ సభ్యులుగా పరిపాలన విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు, క్రైమ్ డీసీపీ వీటిని ఏర్పాటు చేశారు. ఆపై ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లకు (ఎస్ఓపీ) రూపమిచ్చి వెబ్సైట్లలో పొందుపరిచారు. కాలక్రమంలో ఇవన్నీ అటకెక్కిపోవడంతో ఠాణాల్లో సెటిల్మెంట్లు కొనసాగుతున్నాయి. -
రాబోతోంది పెను మార్పు.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్
ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద మార్పు రాబోతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచియిత రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. "కృత్రిమ మేధ (AI ) చాలా మంది 'స్మార్ట్ విద్యార్థులు' తమ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుంది.. భారీ నిరుద్యోగం కలిగిస్తుంది.. విద్యా రుణాలు పెరగిపోతాయి.." అని అప్రమత్తం చేస్తూ తాజాగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో కలగనున్న పరిణామాలపై కియోసాకి విద్యార్థులను అప్రమత్తం చేశారు. చాలా మంది తెలివైన విద్యార్థులు కూడా ఉద్యోగాలు కోల్పోక తప్పదన్నారు. ఒకప్పుడు డోకా లేదనుకున్న ఉద్యోగాలను కూడా ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. రుణ సాయంతో విద్యను పూర్తి చేసి ఉద్యోగాల కోసం వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లేక రుణ భారం తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను తొలగించలేదు" అంటూ ఉద్యోగం కంటే వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్లే నయమని చెప్పే ప్రయత్నం చేశారు.సాంప్రదాయిక విద్య, ఉద్యోగ మార్గాన్ని కియోసాకి ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బడికి వెళ్లడం, మంచి గ్రేడ్లు సాధించడం, ఉద్యోగం సంపాదించడం, డబ్బు ఆదా చేయడం వంటి విధానాలు ఇకపై ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వవని ఆయన వాదిస్తున్నారు. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తన "రిచ్ డాడ్" మనస్తత్వానికి అనుకూలంగా తన "పూర్ డాడ్" సలహాను ఎలా విస్మరించిందీ వివరించారు. సంప్రదాయ మార్గానికి విరుద్ధంగా ఎంట్రెప్రెన్యూర్ అయ్యానని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టానని, బంగారం, వెండి, ప్రస్తుతం బిట్కాయిన్లలో పొదుపు చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ ఆర్థిక పరివర్తన కాలంలో నిష్క్రియాత్మక పరిశీలనకు గురికావద్దని కియోసాకి తన ఫాలోవర్లకు సూచించారు. "దయచేసి చరిత్రలో ఈ కాలానికి బలైపోవద్దు" అని హెచ్చరించారు. స్వతంత్రంగా ఆలోచించాలని, వ్యక్తిగత ఎదుగుదలకు పెట్టుబడులు, సాంప్రదాయ వ్యవస్థలకు వెలుపల ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అన్వేషించాలని హితవు పలికారు. BIGGEST CHANGE in MODERN HISTORYAI will cause many “smart students” to lose their jobs.AI will cause massive unemployment.Many still have student loan debt.AI cannot fire me because I do not have a job.If you are in this category please take proactive action. Please do…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2025 -
Shubman Gill: ఎవరికీ సాధ్యం కానిది చేశాడు.. చరిత్ర సృష్టించాడు
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు లంచ్ తర్వాత గిల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. గిల్కు టెస్ట్ల్లో ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ మైలురాయిని గిల్ 311 బంతుల్లో చేరుకున్నాడు. ఈ డబుల్తో గిల్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గా.. ఇంగ్లండ్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా.. టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్గా.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్గా పలు రికార్డులు సాధించాడు.తొలి ఆసియా కెప్టెన్ ఈ డబుల్తో గిల్ చరిత్ర సృష్టించాడు. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. గిల్కు ముందు శ్రీలంక సారధిగా తిలకరత్నే దిల్షన్ చేసిన 193 పరుగులే అత్యధికంగా ఉండింది. 2011లో దిల్షన్ లార్డ్స్లో (ఇంగ్లండ్) ఈ స్కోర్ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ ఇప్పటికే భారీ స్కోర్ చేసేసింది. డబుల్ సెంచరీ తర్వాత కూడా గిల్ జోరు కొనసాగుతుంది. 231 పరుగుల వద్ద గిల్ బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా వాషింగ్టన్ సుందర్ (24) క్రీజ్లో ఉన్నాడు. 129 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 510/6గా ఉంది.310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. లంచ్ విరామానికి ముందు రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, సిక్సర్) వికెట్ కోల్పోయింది. 41 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జడేజా గిల్తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్కు 203 పరుగులు జోడించారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్చ జోష్ టంగ్ తలో వికెట్ పడగొట్టారు. -
‘కేసీఆర్ మాట్లాడితే నేను మాట్లాడతా.. వారితో సంబంధం లేదు’
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్నిఅంశాలపై చర్చ జరుపుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. కేసీఆర్, మేము ఉద్యమంలో పని చేశామని, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి అన్నారు. తమకు హరీష్ రావు, కేటీఆర్లతో సంబంధం లేదని, వారు తమ లెక్కల్లోకి రారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘ హరీష్రావు ఉత్తి ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులను చెప్పాలి. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటాం. కేసీఆర్తోనే లెక్క.. హరీష్రావు ఎవరో నాకు తెలీదు. ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్రావు, కేటీఆర్లు,. కేసీఆర్ చుట్టూ ఉంటూ కేసీఆర్కు చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావు, కేటీఆర్లు కీలకం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. -
అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల కూడా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని మణిహారంగా ఉన్న జలమండలి ఇక మహా జలమండలిగా మారనుంది. తాగునీటి, సీవరేజీ నెట్వర్క్ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాలకు నెట్వర్క్ ఉండగా, వెలుపల కూడా విస్తరించే చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో నాలుగు దిక్కులా విస్తరిస్తున్న నగర భవిష్యత్తు, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టి పెట్టుకొని సీవరేజీ, వాటర్ ప్రాజెక్టు సమగ్ర నివేదిక రూపకల్పనకు ఆదేశించారు. 2050 చదరపు కిలోమీటర్లు జలమండలి నెట్వర్క్ 1,450 చదరపు కిలోమీటర్ల వరకు ఉండగా.. 2,050 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కోర్ సిటీలో 169.3 చ. కి.మీటర్లు, చుట్టుపక్కల 518.9 చ.కి.మీటర్లు, ఓఆర్ఆర్ పరిధిలో 762 చ.కి.మీటర్లు విస్తరించి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరో 600 చ.కి.మీటర్ల నెట్వర్క్ కోసం కసరత్తు చేస్తోంది. మహా విస్తరణ మాస్టర్ ప్లాన్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించి మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది. వాటర్, సీవరేజ్ పైప్లైన్లతోపాటు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టి శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగం కోసం కూడా దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేయాలని యోచిస్తోంది.జలమండలి పరిధిలోకి... శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, పెద్దఅంబర్పేట, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలు ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్నాయి. దీంతో వాటిని కూడా జలమండలి (Jalamandali) పరిధిలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.చదవండి: అక్కడ అలా.. ఇక్కడ ఇలా..! ఓఆర్ఆర్ పరిధిలో.. ఇప్పటికే ఓటర్ రింగ్రోడ్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల తాగునీటి సరఫరా కోసం ఓఆర్ఆర్ తాగునీటి ప్రాజెక్టు–1, 2 దశలను పూర్తి చేసి సేవలందిస్తోంది. ఓఆర్ఆర్–1 కింద జీహెచ్ఎంసీ పరిధి అవతల ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 190 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేందుకు సుమారు రూ.124 కోట్ల అంచనా వ్యయంతో 70 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల 164 రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు దాదాపు రూ.527 కోట్ల వ్యయంతో 1,601 కిలో మీటర్ల మేర పైపులైన్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది. ఓఆర్ఆర్ ప్రాజెక్టు–2 కింద సుమారు 189 కోట్ల అంచనా వ్యయంతో 140 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన 71 సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణం, సుమారు రూ.778 కోట్ల అంచనా వ్యయంతో 2,758 కిలోమీటర్ల మేర కొత్త పైపులైను నెట్వర్క్ పూర్తి చేసి సేవలు అందిస్తోంది. -
IND vs ENG: గంభీర్ ఏం చేస్తున్నాడు?.. కుమార్ సంగక్కర ఫైర్
ఇంగ్లండ్తో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా తీసుకున్న నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగర్కర విమర్శించాడు. సిరీస్ గెలవడం కంటే కూడా.. లార్డ్స్ టెస్టే ముఖ్యమా అంటూ భారత జట్టు నాయకత్వ తీరును ప్రశ్నించాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ (Leeds Test)లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది. ఇందులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా సిరీస్లో 0-1తో వెనుకబడింది. ఇక టెస్టు జట్టు కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన శుబ్మన్ గిల్కూ పరాజయం రూపంలో చేదు అనుభవమే మిగిలింది.విశ్రాంతి పేరిటకాగా భారత్ -ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం (జూలై 2) రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్కు.. విశ్రాంతి పేరిట భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం అతడిని ఇంగ్లండ్లో కేవలం మూడు టెస్టులే ఆడిస్తామన్న మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇక టాస్ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కెప్టెన్ శుబ్మన్ గిల్.. లార్డ్స్లో జరిగే మూడో టెస్టులో బుమ్రాను ఆడిస్తామని చెప్పాడు. అక్కడి పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి బుమ్రా తప్పక ఆడతాడని చెప్పాడు.విమర్శల వర్షంనిజానికి.. తొలి టెస్టుకు.. రెండో టెస్టుకు మధ్య వారం రోజుల విరామ సమయం దొరికింది. అయినప్పటికీ కీలక మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ తదితరులు తప్పుబట్టారు. ఇక సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అయితే.. టీమిండియా మేనేజ్మెంట్ తీరును తనదైన శైలిలో విమర్శించాడు.రొనాల్డో లేని పోర్చుగల్ మాదిరి‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్ అయిన రొనాల్డో లేకుండా పోర్చుగల్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందో.. బుమ్రా లేని టీమిండియాకు కూడా అదే పరిస్థితి. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అంటూ స్టెయిన్ చురకలు అంటించాడు. ఇక ఈ జాబితాలో తాజాగా.. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర కూడా చేరిపోయాడు.ఈ నిర్ణయం ఎవరిది?.. కోచ్ ఏం చేస్తున్నాడు?‘‘అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఆటగాళ్లను, ఫిజియోలను సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? సిరీస్ గెలవడం కంటే లార్డ్స్ టెస్టే ముఖ్యమని మీరు భావిస్తున్నారా?బుమ్రాను మూడు టెస్టులే ఆడించాలని భావిస్తే.. 1-3-5 మాత్రమే ఎందుకు కావాలి? కావాల్సినంత విరామం దొరికింది.. విజయం కోసం జట్టు పరితపిస్తోంది. మరి అలాంటపుడు కోచ్ బుమ్రా దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పవచ్చు కదా!’’ అని కుమార్ సంగక్కర స్కై స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు.కాగా ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాలను ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లతో భర్తీ చేసింది.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
రజినీకాంత్ కూలీ చిత్రం.. అమిర్ ఖాన్ పాత్రపై అఫీషియల్ ప్రకటన
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో దహా అనే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన అమిర్ ఖాన్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కూలీ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.Introducing #AamirKhan as Dahaa, from the world of #Coolie 😎⚡#Coolie is all set to dominate IMAX screens worldwide from August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv @girishganges… pic.twitter.com/Z8pI5YJzRe— Sun Pictures (@sunpictures) July 3, 2025 -
భారత్కు రానున్న పాకిస్తాన్ జట్టు..!
ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్) తర్వాత భారత్, పాక్ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్, జూనియర్ వరల్డ్కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్లు భారత్కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.వచ్చే నెల (అగస్ట్) 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్లోని రాజ్గిర్లో ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీ కోసం 31 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టుకు భారత్కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్స్స్టార్కు చెప్పాడు. జూనియర్ హాకీ వరల్డ్కప్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్, పాకిస్తాన్ త్వరలో క్రికెట్ ఆసియా కప్లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది క్రికెట్ ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
సిగాచి పరిశ్రమలో నిపుణుల కమిటీ..
సంగారెడ్డి: ఇటీవల పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి 40 మంది వరకూ మృత్యువాత పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచిపోయింది దీనిపై నిపుణుల కమిటీ బృందం ఈ రోజు(గురువారం, జూలై 3వ తేదీ) సిగాచి పరిశ్రమలో ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. మూడున్నర గంటల పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీసింది. పేలుడు తర్వాత సేఫ్టీ వాల్వ్ పని చేసిందా?, చేయలేదా అనే దానిపై నిపుణుల కమిటీ ప్రధానంగా పరిశీఇంచింది. దీంతో పాటు అసలు పరిశ్రమలో తయారీకి తీసుకున్న అనుమతి ఏంటి?, తయారు చేస్తున్నదేంటి అన్న కోణంలో సైతం విచారణ చేపట్టింది నిపుణుల కమిటీ బృందం. పరిశ్రమ ఏర్పాటు చేసిన 30 ఏళ్లలో ఇప్పటికి ఎన్నిసార్లు మిషనరీ మార్చారో నిపుణులు కమిటీ తలుసుకుంది. చివరిగా పరిశ్రమలో సెఫ్టీ తనిఖీలు ఎప్పుడు చేశారు..? అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ నిపుణుల కమిటీ విచారణ చేస్తుంది. -
యశోదా ఆసుపత్రికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమాజీగూడ యశోదా ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ ఉన్నారు. మూడు రోజుల పాటు నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు.సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్.. ఫాంహౌస్ నుంచి నందినగర్ నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో నందినగర్ నివాసంలో కేసీఆర్కు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు యశోదా ఆస్పత్రికి వెళ్లారు కేసీఆర్. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్కు మెడికల్ టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్యం గురించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. -
Siddaramaiah: ‘సీఎం సిద్ధరామయ్య నా మీదే చెయ్యెత్తుతారా?’
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ధార్వాడ జిల్లా ఏఎస్పీ నారాయణ భరమణి (ASP Narayan Venkappa Baramani) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు బహిరంగ సభలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య (cm siddaramaiah).. తనని కొడుతానంటూ చెయ్యెత్తడం తనని మానసికంగా కలచివేసిందంటూ ఏఎస్పీ నారాయణ భరమణిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేసిన తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ప్రకటించారు.ఈ మేరకు కర్ణాటక పోలీస్ శాఖకు ఏఎస్పీ నారాయణ భరమణి లేఖ రాశారు. వీఆర్ఎస్ లేఖలో..‘ అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగింది. ఆ సంఘటన నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కుటుంబం బాధపడింది. నా భార్య, పిల్లలు కన్నీళ్లతో నిశ్శబ్దంగా గడిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. పలువురు నన్ను అవమానిస్తూ కామెంట్లు పెట్టారు. 31 ఏళ్లుగా పోలీస్ శాఖలో అంకిత భావంతో పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. ఏఎస్పీ నారాయణ భరమణి వీఆర్ఎస్ ప్రకటించడంపై కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర .. ఏఎస్పీ నారాయణ భరమణిని సంప్రదించి బెళగావి డీసీపీ (Belagavi)గా కొత్త పోస్టింగ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను భరమణి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. The Police, who was insulted on stage by Congress leader & CM Siddaramaiah has resigned.The cop served for 31 years, joined force as his dream wish, worked hard.In his resignation, ASP Narayan Baramani has said he felt humiliated & traumatizedpic.twitter.com/ZxBCvSSF9h— Karthik Reddy (@bykarthikreddy) July 3, 2025పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో (2025 Pahalgam attack) ‘పాకిస్తాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’అంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. పలువురు సిద్ధరామయ్య పాకిస్తాన్ వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్ తర్వాత ఏప్రిల్ 28న బెలగావిలో కాంగ్రెస్ సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.సహనం కోల్పోయిన సిద్ధరామయ్యఅయితే, ఆసభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుతగిలారు. గో టూ పాకిస్తాన్ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్ చేయడంలేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.ఆ ఘటనపై రాజకీయ వివాదం జరిగింది. ప్రతిపక్షాలు ఆయన తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్ పరిపాలనతో పోల్చాయి. ఆ ఘటనపై ఏఎస్పీ నారాయణ్ భరమణి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వీఆర్ఎస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చాంశనీయంగా మారింది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన శుబ్మన్ గిల్
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా గిల్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. గిల్ కంటే ముందు.. విరాట్ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఒక్కో సెంచరీ బాదారు.విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్ సౌండ్లో 200 పరుగులు సాధించాడు.👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్ కంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు.🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..🏏శుబ్మన్ గిల్- 2025లో ఎడ్జ్బాస్టన్ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..🏏సచిన్ టెండుల్కర్- 1999లో అహ్మదాబాద్ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..🏏విరాట్ కోహ్లి- 2016లో నార్త్ సౌండ్ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...500 పరుగుల మార్కు దాటిన టీమిండియాఎడ్జ్బాస్టన్ వేదికగా ఓవైపు శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్ 24, గిల్ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్ కాగా.. తొలిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
వైద్య విద్యార్థులపై మరోసారి పోలీసు జులుం.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి..
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల కోసం వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మెడికల్ విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు.. మెడికల్ విద్యార్థులను దారుణంగా కొట్టిన పోలీసులు.. ఆడపిల్లలని కూడా చూడకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తమను చంపేయండి అంటూ మహిళా విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.విదేశీ వైద్య విద్యార్థులను ఏఆర్ గ్రౌండ్స్కి పోలీసులు తరలించారు. గాయాలపాలైన విద్యార్ధులకు వైద్య సదుపాయం కూడా అందించలేదు. విద్యార్థులను కలిసేందుకు ఏఆర్ గ్రౌండ్స్కు వచ్చిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ రాగా.. విద్యార్థులను కలవడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఏఆర్ గ్రౌండ్స్లోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేసేశారు.విదేశీ వైద్య విద్యార్థులను పరామర్శించేందుకు ఏఆర్ గ్రౌండ్స్కి వచ్చిన సీపీఎం నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసులపై సీపీఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇక్కడ వైద్య విద్యను అభ్యసించే అవకాశం కల్పించలేకపోతున్నారని.. అందుకే ఏటా వందల మంది విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల ఆందోళన చేస్తున్నా హెల్త్ మినిస్టర్ కనీసం పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ సాక్షిగా విద్యార్థులపై దాడి జరగడం హేయమైన చర్య, దేశమంతా ఒక రూలు.. ఏపీలో మరొక రూలా? ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అంటూ బాబురావు ప్రశ్నించారు. -
ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్ల మధ్య అసలేం జరుగుతోంది?
అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో డిన్నర్ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్సింధూర్ తర్వాత పాక్ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్ కొట్టిన దెబ్బతో పాక్ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్(ఫైల్ఫోటో)చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?పాక్కు భారత్ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ ఆర్మీనే పదే పదే యూఎస్కు ట్రంప్ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్ ప్రధానిని పక్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలుఇటీవల సమకూరిన నిధులతో పాక్లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్ కొనుగోలుకు ఇప్పటికే పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్కు అమెరికా ఎంత సపోర్ట్గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?ఇక చైనా కూడా పాక్కు అండగానే ఉంటుంది. ఇటీవల భారత్తో జరిగిన యుద్ధంలో కూడా పాక్కే సపోర్ట్ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్ మ్యాన్కు అర్థం అవుతున్న విషయం. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్లో పాక్ ఆర్మీ అధికారుల దర్శనం ఏమిటి?, అమెరికా-పాక్ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. -
ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మూవీ.. ఆ నాలుగు పాత్రలపైనే ఆసక్తి!
మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో చిత్రం అలరించేందుకు సిద్ధమైంది. ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ జూలై 25న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో థియేటర్లలోకి రానుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్కి మధ్య జరగబోయే భీకర పోరాటం ఈ సినిమాలో చూపించనున్నారు. ఫైట్స్, విజువల్స్ చూస్తే ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది. 1960ల నాటి రెట్రో-ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్లో ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలోని నలుగురి పాత్రలపై ఓ లుక్కేద్దాం. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ కనిపించనున్నారు. ఫెంటాస్టిక్ ఫోర్కు నాయకుడిగా ఉంటారు. రీడ్ రిచర్డ్స్ తన శరీర ఆకృతి మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సూ స్టార్మ్ (ఇన్విజిబుల్ ఉమెన్)గా వెనెస్సా కిర్బీ కనిపించనుంది. ఆమె క్షిపణుల నుంచి వచ్చే ఇంటర్ డైమెన్షనల్ శక్తి దాడులను నిరోధించేంత శక్తివంతమైన పాత్ర పోషించింది. జానీ స్టార్మ్ (హ్యూమన్ టార్చ్) గా జోసెఫ్ క్విన్ నటించారు. బెన్ గ్రిమ్ (ది థింగ్) పాత్రలో ఎబోన్ మోస్-బచ్రాచ్ కనిపిస్తారు.కాగా.. ఈ చిత్రానికి మాట్ షాక్మాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కెవిన్ ఫీజ్ నిర్మించారు. 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో జూలై 25, 2025న విడుదల కానుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్, సారా నైల్స్ కూడా కనిపించనున్నారు. -
లిస్టింగ్ సూపర్హిట్.. ఇన్వెస్టర్లకు వరుస లాభాలు
హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగులు సూపర్హిట్టయ్యాయి. మార్కెట్ అనిశ్చితుల్లోనూ అదిరిపోయే అరంగేట్రం చేసి ఇన్వెస్టర్లకు తొలిరోజే లాభాలు పంచాయి. హెచ్డీబీ ఫైనాన్స్ షేరు ఇష్యూ ధర(రూ.740)తో పోలిస్తే బీఎస్ఈలో 13% ప్రీమియంతో రూ.835 వద్ద లిస్టయ్యింది.ఇంట్రాడేలో 15% ఎగసి రూ.850 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 14% లాభంతో రూ.841 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.69,758 కోట్లుగా నమోదైంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు రెండో రోజూ గురువారం లాభాలను కొనసాగించింది. రూ.890 వరకూ పెరిగి రూ.865 వద్ద ముగిసింది.సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగూ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.82)తో పోలిస్తే బీఎస్ఈలో 34% ప్రీమియంతో రూ.110 వద్ద లిస్టయ్యిది. ట్రేడింగ్లో 35% పెరిగి రూ.111 వద్ద గరిష్టాన్ని తాకింది. గరిష్టాల వద్ద స్వల్ప లాభాలు చోటు చేసుకున్నప్పటికీ.., చివరికి 19% లాభంతో రూ.98 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,875 కోట్లుగా నమోదైంది. -
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్ వైరల్
లివర్పూల్ ఫుట్బాల్ స్టార్ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్ ఫుట్బాలర్కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది. మర్చిపోలేని రోజుఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్ లైఫ్లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం. View this post on Instagram A post shared by Diogo Jota (@diogoj_18) రొనాల్డో భావోద్వేగంపోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. డియోగో జోటా ఫొటో షేర్ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్తో వైరల్గా మారింది.లివర్పూల్ తరఫున ఐదు టైటిళ్లులివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ తరఫున డియోగో జోటా ప్రీమియర్ లీగ్తో పాటు రెండు నేషన్స్ లీగ్ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్ఎల్ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్ ప్లేయర్ మృతి పట్ల లివర్పూల్ ఎఫ్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) -
Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్
భారతదేశంలో అత్యంత చౌకగా లభించే తృణధాన్యం.దీన్నే ఆంగ్లంలో ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు.ఈ చిరు ధాన్యాలలో కాల్షియం, ఇనుము , విటమిన్లు బి1 నుండి బి3 లాంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా రాగా మాల్ట్ లేదా రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దాం.మొలకలతో పిండి రాగి మాల్ట్ తయారు చేయడానికి రాగులను నానబెట్టి, మెత్తని బట్టలో కట్టిపెట్టి, మొలకెత్తించి, నీడలో ఎండబెట్టి, పిండిగా తయారు చేసుకోవాలి. మొలకెత్తిన రాగులతో తయారుచేసిన రాగి మాల్ట్ మరింత పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేది కాబట్టి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా దీన్ని నిస్సంకోచంగా తీసుకోవచ్చు.రాగి మాల్ట్ తయారీస్టవ్ మీద పాన్ లేదా కుండలో రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ లోపు ఒక కప్పు నీళ్లలో రాగుల పిండి జారుగా కలుపుకోవాలి.నీళ్లు మరుగుతున్నపుడు కలిపిన రాగిపిండిని పోసి, ముద్దలు లేకుండా తరచుగా కలుపుతూ ఉడికించుకోవాలి. మిశ్రమం కాస్త చిక్కగా గరిటె జారుగా అయ్యేలా చూసుకోవాలి.ఇందులో మజ్జిగ, ఉప్పు కలుపుకొంటే కమ్మటి రాగి జావ రెడీ.ఇందులో ఇష్టమున్న వారు బెల్లం, నెయ్యికలుపుకొని తాగవచ్చు. అలాగే ఉడికించే నీళ్లలో కొంచెం పాలనుకూడా కలుపుకోవచ్చు.ఇంకా బాదం పౌడర్ లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ లేదా సన్నగా తరిగిన ముక్కలతో గార్నిష్తో చేస్తే పిల్లలకు చాలామంచిది. రాగుల జావ, ఆరోగ్య ప్రయోజనాలురాగి జావలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బాడీకి శక్తినిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.రాగి జావలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, సాయ పడుతుంది.మధుమేహాన్ని నియంత్రిస్తుంది: రాగి జావలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.రాగి జావలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది.రాగి జావలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది.రాగి జావలో ఉండే పోషకాలు జుట్టు రాలడం నివారించడంలో సహాయపడతాయి.రాగి జావలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.రాగి జావను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది. లేదా, భోజనానికి ముందు లేదా తర్వాత తాగవచ్చు. -
ఓటీటీలో పోటాపోటీగా సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని తెరకెక్కిన 'ది హంట్' వెబ్ సిరీస్ జులై 4న ఓటీటీలో విడుదల కానుంది. 'సోనీలివ్' (SonyLiv) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ వర్షన్లో స్ట్రీమింగ్ కానుంది. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమిత్ సియాల్తో పాటు సాహిల్ వైద్, భగవతీ పెరుమాళ్ తదితరులు నటించారు. 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. అయితే, ఈ హత్యకు వారి ఉద్దేశ్యం ఏంటి..? హత్య, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి అనే కోణాల్లో ఈ మూవీ ఉండనుంది.హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh)- హీరో సుహాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ 'ఉప్పు కప్పురంబు' (Uppu Kappurambu). ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్ వసంత్ కథ అందించారు. జులై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.మణిరత్నం దర్శకత్వం వహించిన 'థగ్ లైఫ్' (Thug life) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జులై 3 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం,హిందీ మలయాళం, కన్నడలో ఉంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిన ఈ చిత్రం భారీ డిజాస్టర్గా నిలిచింది.నటి, దర్శకురాలు రేవతి తెరకెక్కించిన ‘గుడ్వైఫ్’ (Good Wife) వెబ్సిరీస్ జులై 4న విడుదల కానుంది. ఇందులో ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించారు. ఆమెకు భర్తగా సంపత్ రాజ్ నటించారు. 'జియో హాట్స్టార్' (Jio Hotstar) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ సిరీస్ 'ది గుడ్వైఫ్' ఆధారంగా ఈ వెబ్ సిరీస్ను ఇండియాలో తెరకెక్కించారు. -
‘సోలో బాయ్’ ప్రతి ఒక్కరిలో కనిపిస్తాడు : సెవెన్ హిల్స్ సతీష్
సొంతంగా కష్టపడి తన కాళ్ళ మీద తాను బతకాలనుకునే ఆలోచన గల వ్యక్తి చుట్టు తిరిగే కథే ఇది. ప్రతి ఒక్కరిలోను సోలో బాయ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అన్నారు నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సతీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ గతంలో బట్టల రామకృష్ణ బయోపిక్ సినిమా తీసినప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ లాగా చేశాం. అది మాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ సమయంలో నేర్చుకున్న వాటిని బేస్ చేసుకుని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ సోలో బాయ్ సినిమా చేశాము. కానీ ప్రస్తుతం స్టార్స్ ఉన్న సినిమాలకు థియేటర్లు ముందుగానే బ్లాక్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ పై ఇంకా బ్యాలెన్స్ కాలేదు.→ ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకునేప్పటికీ రెండు గంటల పది నిమిషాలు ఫైనల్ అవుట్ పుట్ వచ్చింది. U/A సర్టిఫికేట్ తో ఆంధ్ర తెలంగాణలో కలిపి సుమారు 120 నుండి 150 స్క్రీన్స్ మధ్యలో విడుదల కానుంది.→ గౌతమ్ ఈ సినిమా ప్రమోషన్లలో 100% మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ రెండు సీజన్లో ఉండటం వల్ల అతని ఫేమ్ ఈ సినిమాకు మరింత తోడ్పడుతుంది అనుకుంటున్నాను.→ నాకు ఉన్న బడ్జెట్లో నాకు ఉన్న సర్కిల్లో నేను మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేశాను. అది కచ్చితంగా ప్రేక్షకులను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అనుకుంటున్నాను.→ ఈ చిత్ర కథలు నా ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము. నా మిత్రులు ఎవరైనా నిర్మాతలుగా ఆ కథకు నేను దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను. అనుకున్న బడ్జెట్ కంటే కొంత తక్కువలోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాం→ నార్నె నితిన్ తో ఒక సినిమా చేయబోతున్నాను. థ్రిల్లర్ జోనర్ లో కథ ఒకే అయింది. -
ENG VS IND 2nd Test: పాపం జడేజా.. తృటిలో సెంచరీ మిస్..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ లంచ్ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. 114 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు బరిలోకి దిగిన శుభ్మన్ గిల్ 150 పరుగులు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 41 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన రవీంద్ర జడేజా 89 పరుగుల స్కోర్ (137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో) వద్ద ఔటయ్యాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా గిల్తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్కు 203 పరుగులు జోడించారు. గిల్తో పాటు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జడేజా సెంచరీ మిస్ చేసుకోవడంతో టీమిండియా అభిమానులు పాపం అంటున్నారు. తొలి టెస్ట్లో సామర్థ్యం మేరకు రాణించలేక (11, 25 నాటౌట్) విమర్శలు ఎదుర్కొన్న జడేజా ఈ మ్యాచ్లో తానేంటో నిరూపించుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి జడేజా ఔటయ్యాడు. లంచ్ విరామం సమయానికి గిల్ 168, వాషింగ్టన్ సుందర్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్తో గిల్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (168) సాధించిన భారత క్రికెటర్గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (149) పేరిట ఉండేది. టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు. -
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు ఎత్తేసిన మరో బ్యాంక్..
అన్ని సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస బ్యాలెన్స్ నిర్వహణ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. జూలై 7 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనివల్ల మరింత మందికి బ్యాంకింగ్ సేవలు చౌకగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.మరోవైపు ఇండియన్ బ్యాంక్ ఏడాది కాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 5 బేసిస్ పాయింట్లు (0.05శాతం) తగ్గించి 9 శాతానికి సవరించినట్టు ప్రకటించింది. 3వ తేదీ నుంచి ఈ రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనివల్ల రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లకు ఏడాది కాల ఎంసీఎల్ఆర్ బెంచ్మార్క్గా ఉంటుంది.పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించకపోతే విధించే జరిమానా ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా ఇదివేరకే ప్రకటించింది. అంతకు ముందు కెనరా బ్యాంక్ కూడా అన్ని పొదుపు ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిర్వహించనందుకు విధించే పెనాల్టీ ఛార్జీలను తొలగించింది. ఎంఏబీ అనేది ఒక నిర్దిష్ట కాలంలో (సాధారణంగా నెల) మీ పొదుపు ఖాతాలో నిర్వహించాల్సిన సగటు మొత్తం. -
‘సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది’
విశాఖ: హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు‘శవరాజకీయాలపై పేటెంట్ హక్కు చంద్రబాబుది. సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది. అంబులెన్స్లో నా భర్తకు ఏదో జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను లోకేష్ మనుషులు ఎందుకు బెదిరించారు. వైఎస్ జగన్ను చూసి పాలక పక్షం భయపడుతోంది. ఏఐ ద్వారా జగన్పై తప్పుడు ప్రచారం చేశారు. తండ్రీ కొడులు ఇద్దరూ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి పిచ్చెక్కిపోతున్నారు. కూటమికి ఓటు వేసి ప్రజలు మోసపోయారు..షరతులు పెట్టి తల్లికి వందనం కట్ చేశారు.. పురుగులు పట్టిన అన్నం విద్యార్థులకు పెడుతున్నారు. హోమ్ మంత్రి అనిత చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. బొద్దింక ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.’ అని జూపూడి డిమాండ్ చేశారు. -
రెండో భర్తతోనూ విడాకులు.. అందుకేనన్న బాలీవుడ్ నటి!
పలు సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించిన బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా. తన అందం, అద్భుతమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్లో ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలతో పాటు బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్లో చాహత్ నటించింది. అయితే 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడిన ముద్దుగుమ్మ.. నాలుగు నెలలకే విడాకులిచ్చింది. ఆ తర్వాత 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతనితో కూడా తెగదెంపులు చేసుకుంది. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది చాహత్ ఖన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె రెండోసారి విడాకులు తీసుకోవడంపై మాట్లాడింది. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది.రెండోసారి విడాకుల గురించి చాహత్ మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ నాకు సరైనది అనిపించిన దాన్నే చేశా. దానికే కట్టుబడి ఉంటా. ఏదైనా తప్పని అనిపిస్తే అలాంటి పని చేయను. ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా చెప్పే ధైర్యం నాకు ఉంది. ప్రపంచం ఏమి చెప్పినా నేను ఎప్పుడూ తప్పును సమర్ధించను. మీకు ఆ రకమైన నమ్మకం, ధైర్యం, ఆత్మగౌరవం ఉండాలి. కేవలం ఒక మహిళగా మాత్రమే కాదు, ఒక మనిషిగా.. ఏదైనా కరెక్ట్ కాదనిపిస్తే అందులో భాగం కాలేను. అలాంటి వాటికి నేను దూరంగా వెళ్తాను. అలాగే మనం పిల్లల కోసం ఆలోచిస్తూ మనకు సరిగాలేని వివాహ బంధంలో ఉండిపోకూడదు. ఎందుకంటే పిల్లలు మనకంటే ఎక్కువగా ప్రభావితమవుతారు. అది కలిగించే నష్టం మీకు కూడా తెలియదు. వారు పెద్దయ్యాక వారి స్నేహితుల నుంచి విన్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. అందుకే నా కుమార్తెల కోసం నేను దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా' అని తెలిపింది. -
Finger Millet: పోషకాల రాగి
ప్రధాన ఆహార పంటల్లో రాగి పంట ఒకటి. చిరుధాన్యం పంటగా రాగి పండిస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు వేసవిలో కూడా రాగి సాగు అధికంగా చేస్తారు. రాగిలో క్యాల్షియం అధికంగా ఉండడం, కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండడం, పీచుపదార్థం కావడం, వరి, గోధుమల కంటే పోషకాల శాతం ఎక్కువ ఉన్న మంచి పౌష్టికాహారం కావడంతో ఇటీవల కాలంలో రాగి వినియోగం పెరిగింది. దీంతో రాగి సాగు విస్తీర్ణం ప్రస్తుతం పెరిగింది. ప్రభుత్వాలు కూడా రాగి పంటకు మద్దతు ధర కల్పించడంతో రైతులు లాభాలు పొందుతున్నారు. బంగారుపాళెం: నియోజకవర్గంలో రైతులు చిరుధాన్యాల పంటల సాగుపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాగి పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. నీటి తడులకు అవకాశం ఉన్న రైతులు రాగి పంటతో పాటు వేరుశనగ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రాగులకు మంచి గిరాకీ ఉంది. గతంలో గ్రామాల్లో రాగి, జొన్న, సజ్జ, కొర్ర, సామ, అరికె పంటలు సాగు చేసేవారు. క్రమంగా ఆయా పంటల సాగు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో రాగి, కొర్ర పంట సాగు చేస్తున్నారు. గ్రామాల్లో మధ్యాహ్న రాగి సంగటి వాడుతున్నారు. హోటళ్లలో కూడా రాగిసంగటి అందుబాటులో ఉంటోంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా రాగి సంగటి తినడానికి ఇష్టపడుతున్నారు. దీంతో రాగి «ధాన్యానికి డిమాండ్ పెరిగింది. వరి కోసిన తరువాత రాగిపంట సాగు చేస్తున్నారు. రాగులు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర పలుకుతోంది. దీంతో రాగి పంట సాగుతో మంచి లాభాలు రాబడుతున్నారు. అధిక దిగుబడినిచ్చే రకాలు.. రాగి పంటలో అధిక దిగుబడినిచ్చే రకాల్లో మేలైన రకం మారుతిరకం. ఈ రకం పంట 85 రోజుల నుంచి 90 రోజుల్లో దిగుబడి వస్తుంది. తెగుళ్లను తట్టుకుని 10 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. అన్ని ప్రాంతాల్లో సాగు చేసేందుకు వీలుగా ఉంటుంది. మిగతా రకాలైన వేగావతి, సువర్ణముఖి, వకుళ, భారతి, హిమ, శ్రీచైతన్య రకాలు కూడా అధిక దిగుబడినిస్తాయి. బంగారుపాళెంలో సాగు చేసిన రాగి పంట విత్తనశుద్ధి ఇలా.. రాగి పంట సాగు చేసే సమయంలో విత్తనశుద్ధి అవసరం. కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం అనే మందు కలిపి విత్తనశుద్ధి చేయడం ద్వారా పంటకు తెగుళ్లు సోకకుండా ఉంటాయి. నారు నాటే పద్ధతిలో అయితే ఒక ఎకరానికి నారు కావాలంటే 2 కేజీల విత్తనాన్ని 5 సెంట్ల భూమిలో నారుమడిలో పోయాలి. 21 రోజుల తరువాత నారు నాటాలి. పొలం దున్నిన తరువాత ఆఖరి దుక్కిలో మూడు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువులు వాడాలి. ఖరీఫ్లో వర్షాధారంగా పండించే రాగి పంటకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం వేయాలి. అగ్గి తెగుళ్ల నివారణకు ట్రై సైక్లోజెల్ 6 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వెర్రి తెగులు నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ను లీటరు నీటిలో కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. కాండం తొలిచే పురుగు నివారణకు కొరాజిన్ 3 మిల్లీలీటరును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈవిధంగా పంట సస్యరక్షణ చేస్తే పంట అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. రాగితో ఆరోగ్యం.. రాగి ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. రాగులతో చేసే సంగటి, రాగి జావ, రొట్టె తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు 100 గ్రాములు తీసుకుంటే, అందులో 344 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 328 క్యాలరీలు, 3,6 గ్రాముల పీచు పదార్థాలు, 7.3 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అందుకే పూర్వం ఎక్కువగా రాగులతో చేసిన పదార్థాలే తినేవారు. రాగి జావ తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగులు వాడకంతో బరువు తగ్గుతారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా విజయ్భాస్కర్రెడ్డి
తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకాశం జిల్లాకు చెందిన చిట్యాల విజయ భాస్కర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గీతం విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్లో గోల్డ్ మెడల్ సాధించిన విజయ భాస్కర్ రెడ్డి బెంగళూరులో 2010వ సంవత్సరంలో వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం స్థాపించారు. ఈ ఫోరం ఆధ్వర్యంలో బెంగళూరు, పూణే నగరాల్లో ఐటి ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పలు సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించారు.ప్రతిష్టాత్మక పులివెందుల, కడప ఉపఎన్నికల్లో ఫోరం టీం సభ్యులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ పెట్టక ముందు వైఎస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రలో చురుకుగా పాల్గొన్నారు. అప్పటి నుంచి తాను తన ఉద్యోగ, వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూ తాను ఎంతగానో ఆదర్శంగా తీసుకుని ప్రేరణ పొందిన నాయకుడు వైఎస్ జగన్తో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన సేవలను అందిస్తూ వస్తున్నారు.అలానే ఇటీవల తన తాత పేరు మీద ఒక ట్రస్ట్ నెలకొల్పి పలువురు బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. తన మండల పరిధిలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. తెలంగాణా రాష్ట్రంలో తాను ఎన్నో ఏళ్లుగా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు గాను ఇటీవల ప్రతిష్టాత్మక సౌత్ ఇండియా సిఎస్ఆర్ అవార్డు అందుకున్నారు. చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషి, వృత్తిపరమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి చెందిన కీలకమైన రాష్ట్ర ఐటి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు.ఈ సందర్భంగా చిట్యాల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎంతగానో అభిమానించే పార్టీ అధినాయకులు జగన్ అన్న నాయకత్వంలో కీలకంగా పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టం అని తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను రాష్ట్ర విభాగ అధ్యక్షులు, అన్ని స్థాయిలలోని కమిటీ సభ్యులతో కలిసి సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, ముంబయి, పూణే లాంటి వివిధ నగరాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐటి, ఇతర నిపుణులను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యున్నతికి తన వంతుగా శక్తి వంచనలేకుండా అంకిత భావంతో కృషి చేస్తానని తెలియజేశారు. వైఎస్సార్ స్ఫూర్తిని, ఆశయాలను అనుసరిస్తూ ఈ బృహత్తర బాధ్యతలను అప్పగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. -
'కుబేర' నుంచి తొలగించిన వీడియో సాంగ్ వచ్చేసింది
ధనుష్, నాగార్జున కాంబినేషన్లో దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar kammula) తెరకెక్కించిన చిత్రం 'కుబేర'.. ఇందులో రష్మిక మందన్న కీలకపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ మూవీ రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి 'పీ పీ డుమ్ డుమ్' అంటూ సాగే వీడియో సాంగ్ను యూట్యూబ్లో విడుదల చేశారు. ఇందులో రష్మిక వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే. అయితే, ఈ పాట సినిమాలో లేదు. రన్టైమ్ ఎక్కువగా ఉండటంతో దీనిని తొలగించారు. ఓటీటీ విడుదల సమయంలో మళ్లీ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. చైతన్య రాసిన ఇంగ్లిష్ లిరిక్స్ యూత్ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సాంగ్ మొత్తం ఇంగ్లిష్ పదాలతోనే ఉండడం విశేషం. మంగ్లీ సోదరి ఇంద్రావతి ఈ పాటను ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు. -
చరిత్ర తిరగరాసిన శుబ్మన్ గిల్.. అత్యధిక స్కోరుతో..
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. తొలిరోజే శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గురువారం నాటి రెండో రోజు ఆటలో 150 పరుగుల మార్కు అందుకున్నాడు. 263 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో గిల్ ఈ మేర స్కోరు చేశాడు.తద్వారా టీమిండియా దిగ్గజ బ్యాటర్, కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్గా అవతరించాడు. ఇంతకు ముందు 2018 నాటి టెస్టు మ్యాచ్లో కోహ్లి ఇదే వేదికపై 149 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా గిల్ కోహ్లిని అధిగమించి ఎడ్జ్బాస్టన్లో చరిత్ర తిరగరాశాడు. ఇక టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం ఇదే తొలిసారి.భారత రెండో కెప్టెన్గా..ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు.మూడో సారథిగా..అదే విధంగా.. 26వ పడిలో అడుగుపెట్టక ముందే టెస్టు ఇన్నింగ్స్లో 150 పరుగుల మార్కు దాటిన భారత మూడో కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు మన్సూర్ అలీఖాన్ పటౌడీ రెండుసార్లు ఈ ఘనత సాధించగా.. సచిన్ టెండుల్కర్ కూడా ఈ ఫీట్ నమోదు చేశాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడే నిమిత్తం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ సిరీస్తో గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఐదు వికెట్లు తేడాతో ఓటమిపాలైంది.జడేజాతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యంఈ క్రమంలో బుధవారం (జూలై 2) నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసిన భారత్.. గురువారం నాటి రెండో రోజు 400 పరుగుల మార్కు దాటింది. 107 ఓవర్లుముగిసే సరికి గిల్ 164, జడేజా 88 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును ఆదుకున్నారు. అయితే, తన స్కోరుకు మరో పరుగు జతచేసిన తర్వాత జడ్డూ జోష్ టంగ్ బౌలింగ్లో వికెట్ కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.లంచ్ బ్రేక్ సమయానికి స్కోరు ఎంతంటే?గురువారం భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: 419/6 (110). గిల్ 168, వాషింగ్టన్ సుందర్ ఒక పరుగుతో ఉన్నారు.చదవండి: ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్ -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. బుధవారం (జూలై 2) రాత్రి చికాగోలో డ్రైవ్ బై కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికాగో స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చికాగో నగరంలోని రివర్ నార్త్ (River North) ప్రాంతం ఆర్టిస్ లాంజ్ (Artis Lounge) అనే నైట్క్లబ్లో రాపర్ మెలో బక్స్ (Mello Buckzz) ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతోంది.ఆ సమయంలో ఓ వాహనం లోపల ఉన్న అగంతకులు నైట్క్లబ్ వెలుపల గుమికూడిన జనంపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దుర్ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అగంతకులు జరిపిన కాల్పుల్లో 13 మంది మహిళలు, 5 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ట్రోజర్ హాస్పిటల్, నార్త్వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్స్కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో మరోసారి కాల్పులు జరగడం గమనార్హం.Yet another mass shooting in Chicago media won't tell you about.Initial reports of 3 dead, 20+ injured following gunfire after a record release party.But it's only Black people with illegal handguns again so, HO, HUM, doesn't fit the narrative. pic.twitter.com/DNm5sXLd1i— BarleyPop (@MikePilbean) July 3, 2025 -
రోప్పార్టీలపై ఎందుకీ దాగుడు మూతలు?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు సంబంధించిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో ఇవాళ(గురువారం, జులై 3న) విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున మాజీ ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. హెలిప్యాడ్ కోసం సూచించిన స్థలం మనుషులు సంచరించడానికి వీల్లేకుండా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ నెల్లూరు హెలిపాడ్ అనుమతి పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. ‘‘హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వడంలేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే.. హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపికచేశారు. ఇదే హెలిపాడ్ అంటున్నారు. ఆ స్థలంలో తుప్పలు, డొంకలు ఉన్నాయి. మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉంది. హెలిపాడ్ కోసం ఆ స్థలాన్ని సిద్ధం చేయాలంటే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేలా ఉంది...మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి విషయంలో కేంద్ర ప్రభుత్వపు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. ఆ మార్గదర్శకాల ప్రకారం.. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్పార్టీలు ఇవ్వాలి కదా?పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్ చేయడానికి రోప్ పార్టీలు అత్యంత అవసరం. జగన్లాంటి వ్యక్తికి సేఫ్ ల్యాండింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ మూవ్ అనేది కల్పించాలి కదా. రోప్పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వ ఎందుకు దాగుడుమూతలు ఆడుతుందో అర్థం కావడంలేదు’’ అని లాయర్ శ్రీరాం వాదించారు. పై విషయాలన్నింటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదు. పైగా వైఎస్ జగన్ భద్రత గురించి వేసిన 2 పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. జడ్ ప్లస్ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామంటూ చెప్పారు. అలాంటప్పుడు రోప్ పార్టీలు లేవు కదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరాం మరోసారి ప్రశ్నించారు. దీంతో.. ఈ పిటిషన్పై వాదనలకు మరింత సమయం కావాలని ఏజీ కోరడంతో.. కోర్టు వచ్చే బుధవారానికి(జులై 9) విచారణ వాయిదా వేసింది. -
ఊహలకందని విధ్వంసం.. 78 బంతుల్లో 28 సిక్సర్ల సాయంతో 263 పరుగులు
అమెరికాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్లో ఊహలకందని విధ్వంసం జరిగింది. ఎడిసన్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించే ఓ ఆటగాడు 78 బంతుల్లో 17 ఫోర్లు, 28 సిక్సర్ల సాయంతో 337.18 స్ట్రయిక్రేట్తో 263 పరుగులు (నాటౌట్) చేశాడు. క్రికెట్ చరిత్రలో బహుశా ఇంతటి విధ్వంసం ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్కు అధికారిక గుర్తింపు ఉందో లేదో తెలియదు కానీ.. సోషల్మీడియాలో మాత్రం ఈ వార్త హల్చల్ చేస్తుంది. ఇంతటి విధ్వంసానికి కారకుడు ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by Loudoun Cubs Cricket Academy (@loudouncubs)వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట అమెరికాలో క్రికెట్ లీగ్ ఆఫ్ న్యూజెర్సీ (CLNJ) అనే క్రికెట్ టోర్నీ (40 ఓవర్ల ఫార్మాట్) జరిగింది. ఇందులో భాగంగా ఎడిసన్ క్రికెట్ క్లబ్, ఈసీసీ షార్క్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రౌనక్ శర్మ (ఎడిసన్ క్రికెట్ క్లబ్) అనే ఆటగాడు సిక్సర్ల సునామీ సృష్టించి 78 బంతుల్లో అజేయమైన 263 పరుగులు చేశాడు. ఇందులో రౌనక్ తన తొలి సెంచరీని కేవలం 27 బంతుల్లోనే చేయడం మరో విశేషం.Raunaq Sharma lit up club cricket with a jaw-dropping 263 off just 78 balls against ECC Sharks!🔥💯His knock, in a 40-over clash, stands as one of the most explosive and highest-scoring innings in limited-overs cricket history. (official or unofficial) pic.twitter.com/3MuBcCQ2QW— CricTracker (@Cricketracker) July 3, 2025ఇదే టోర్నీలో అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లోనూ రౌనక్ ఇదే తరహాలో విధ్వంసం సృష్టించాడు. NJ Lions CCతో జరిగిన మ్యాచ్లో 81 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 209.88 స్ట్రయిక్రేట్తో 170 పరుగులు చేశాడు.దీనికి ముందు జరిగిన మరో టోర్నీలో (WMCB T20 League Elite Division) కూడా రౌనక్ ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. ఓ మ్యాచ్లో 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్లు ఆడిన రౌనక్.. 220.65 స్ట్రయిక్రేట్తో 50.75 సగటున 406 పరుగులు చేశాడు. 33 ఏళ్ల రౌనక్ శర్మ భారత్లోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ఆయన.. క్రికెట్ అవకాశాల కోసం యూఎస్ఏకు వలస వెళ్లాడు. ప్రస్తుతం రౌనక్ హ్యూస్టన్ స్టార్స్ అనే అమెరికన్ జట్టుకు ఆడుతున్నాడు. రౌనక్కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో మంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు చిన్నతనంలో కలిసి ఆడారట. -
చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,గుంటూరు: అమరావతి విస్తరణ కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు షాకిచ్చారు. రాజధాని విస్తరణకు తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.అమరావతి రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. రాజధానికి సమీపంలోని 11 గ్రామాల్లో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం బేజాత్ పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబులో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.అయితే, అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెప్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది.ల్యాండ్ పూలింగ్కురాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే.రాజధాని భూముల్ని అమ్మేందుకు కుట్రమరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు.మండిపడుతున్న అమరావతి రైతులుఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు. -
ట్రోలింగ్స్.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీటీడీ నెయ్యి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులు క్రితం సింగయ్య కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పిటిషన్ను అనుమతించిన వ్యవహారంపై సోషల్ మీడియాలో న్యాయమూర్తి శ్రీనివాస్రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్’’ అంటూ న్యాయమూర్తి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారుఇప్పుడు నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్కు బాగా పనికొస్తాయంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కేసులు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి.. తన ముందున్న బెయిల్ పిటిషన్లను వచ్చే వారం వేరే బెంచ్ ముందు ఉండేలా చూసుకోవాలన్నారు. -
క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!
ఓ చిరుద్యోగం చేసుకునే మహిళ ఎంతో కష్టపడి, ఇష్టపడి కారు కొనుక్కుంటే..ఆ ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేసిన ఘటన చర్చకు దారితీసింది. మంచి జీవితం గడపడం కూడా తప్పేనా అంటూ బాధిత మహిళ సోషల్ మీడియాలో తన గోడును వెళ్ల బోసుకుంది. దీంతో ఈ స్టోరీ వైరల్గా మారింది.దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఒక గ్యారేజ్లో క్యాషియర్గా పనిచేస్తోంది అసేజా లిమెలింటాకా (28) భారతీయ సంతతికి చెందిన షిరాజ్ పటేల్ ఆమె బాస్. సెకండ్హ్యాండ్ హోండా కారు కొనుక్కుని ఆ కారులో ఆఫీసుకు వెళ్లడమే ఆమె చేసిన నేరం. జీతం తక్కువగా ఉన్నా, కారు కొన్నావా అంటూ తన బాస్ తనను తొలగించారని ఆమె ఆరోపించింది. కష్టపడి ఎన్నో నెలల పొదుపు చేసుకుని, లోన్ తీసుకుని మరీ తన కారు కొన్నానని వాపోయింది.ఇవన్నీ చెప్పినా కూడా బాస్ పటేల్ తనను నమ్మ లేదని , వేరే చోట పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ఆమె బ్యాంక్ ఖాతాను చూపించాలని డిమాండ్ చేశాడని ఆమె ఆరోపించింది. వివరాలు చూసి కొత్త ఫర్నిచర్ కొంటున్నావ్, ఇక నువ్వు క్యాషియర్గా ఉండటానికి వీల్లేదంటూ తనను తీసేసారని ఆమె ఫేస్బుక్ పోస్ట్లో రాసింది.అంతేకాదు దొంగతనం ఆరోపణలు కూడా చేశాడని పేర్కొంది. పెట్రోల్ పంప్ అటెండెంట్గా పనిచేయాలని లేదా రాజీనామా చేయాలని అతను ఆమెకు అల్టిమేటం ఇచ్చాడని ఆమె అన్నారు.అయితే బెర్క్లీ మోటార్ గ్యారేజ్ యజమాని లిమెలింటకా చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమెను తొలగించలేదని పేర్కొన్నారు. తామె ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదద చాలా నిజాలని దాచిపెట్టిందన్నారు. అలాగే కంపెనీపై తప్పుడు ఆరోపణలు చేసినందు వల్ల ఇకపై అప్రమత్తంగా ఉంటామని తెలిపాడు. -
అనుమానాస్పద స్థితిలో నటి మృతి.. అతిగా డ్రగ్స్ తీసుకుందా?
ప్రముఖ అడల్ట్ ఫిల్మ్ స్టార్ కైలీ పేజీ(28) అనుమానాస్పదంగా మృతి చెందారు. జూన్ 25న ఆమె లాస్ ఏంజిల్స్లోని తన నివాసంలో మరణించినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు. ఆమె మరణానికి గల కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. కానీ మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవలడం వల్లే ఆమె చనిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్ సంబంధిత వస్తువులు ఆమె ఇంటిలో కనిపించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అంతేకాదు ఆమె గదిలో ఇతరులు సన్నిహితంగా ఉన్న గ్రాఫిక్ ఫోటోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడం వల్ల చనిపోయిందా లేదా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.కైలీ పేజీ అసలు పేరు కైలీ పైలెంట్. 2016లో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి దాదాపు 200పైగా సినిమాల్లో నటించింది. 2017లో వచ్చిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ "హాట్ గర్ల్స్ వాంటెడ్: టర్న్డ్ ఆన్"లో కూడా కనిపించారు, ఇందులో ఆమె అడల్ట్ ఇండస్ట్రీలోని తన అనుభవాలు, అక్కడ ఎదురయ్యే సవాళ్ల, సమస్యలను గురించి ఓపెన్గా మాట్లాడింది. కైలీ మరణ వార్త తెలియగానే ఆమె స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. -
హ్యాట్సాప్ బామ్మ.. ఆ వయసులో ఎంతటి స్థైర్యం..!
మన పర్యావరణం కోసం ఓ విదేశీయురాలు ఎంతలా తపిస్తుందో తెలిస్తే విస్తుపోతారు. మన దేశంలో కూడా ఎందరో పర్యావరణ ప్రేమికులు, సామాజకి వేత్తలు అందుకోసం కృషి చేస్తున్నారు. వారంత తమ గడ్డపై నడుంబిడిస్తే..ఆ విదేశీయురాలు మన దేశంలోని ఒక సరస్సు కోసం ఐదేళ్లుగా కష్టబడుతోంది. ఆ సరస్సు అందాలను బావితరాలకు తెలిసేలా చేయాలని తన సేవను కొనసాగిస్తుంది. ఎవరామె అంటే..68 ఏళ్ల ఎల్లిస్ హుబెర్టినా స్పాండర్మాన్ అనే డచ్ మహిళ కశ్మీర్ పర్యావరణాన్ని కాపాడేందుకు ఒంటిరిగా కృషి చేస్తోంది. ప్రకృతిపై ఉన్న ప్రేమే ఆ బామ్మను శ్రీనగర్లోని దాల్ సరస్సు అందాలను కాపాడేందు పురిగొల్పింది. అంతేగాదు రెండు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఆ సేవకే అంకితం చేశారు. నిజానికి ఆమె కశ్మీర్తో అనుబంధం ఎల ఏర్పడిందంటే..సుమారు 25 ఏళ్ల క్రితం తొలిసారిగా కాశ్మీర్ లోయను సందర్శించినప్పుడు ప్రారంభమైందట. దాని చుట్టు ఉన్న ప్రకృతి రమణీయతకు ఆకర్షితురాలైంది. అది ఎంతలా అంటే ఆ కాశ్మీర్లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్నంతగా ప్రేమను పెంచుకుంది. అలా ఇక్కడే ఉండి ఈ ఐకానిక్ సరస్సు వైభవాన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అంతేగాదు ఆమె ఆ సరస్సు నుంచి బాటిళ్లను, చెత్తను తీస్తున్న వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా.ఆ వీడియోలో ఎల్లిస్ మన స్వర్గాన్ని శుభ్రంగా, సహజంగా ఉండేలా చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చింది. ఆ వీడియోని చూసిని నెటిజన్లు ఆమె నిస్వార్థ సేవను కొనియాడుతూ.. నిజంగా ఆ బామ్మ చాల గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఈ సైక్లిస్ట్, ప్రకృతి ప్రేమికురాలు శ్రీనగర్ వీధుల గుండా వెళ్తూ..పర్యావరణ అనుకూల జీవనం, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి అవగాహన కల్పిస్తోందామె. స్థానికులు, పర్యావరణ వేత్తులు ఆ బామ్మ సేవనిరతికి మంత్ర ముగ్దులవుతున్నారు. ఎంత ధైర్యవంతమైన మహిళ, ఈ వయసులో ఆమె అభిరుచి, లక్ష్యం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అంటూ ఆమె మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు వారంతా. Kudos to Dutch national Ellis Hubertina Spaanderman for her selfless efforts in cleaning Srinagar's Dal Lake for past 5 years. This dedication serves as an inspiration to preserve Kashmir's natural beauty. Let's join hands to keep our paradise clean & pristine. @ddprsrinagar pic.twitter.com/YINLbm3X1z— Kashmir Rights Forum🍁 (@kashmir_right) June 29, 2025 (చదవండి: Zohran Mamdani: 'చేత్తో తినడ'మే ఆరోగ్యానికి మంచిది..! పరిశోధనలు సైతం..) -
F-35 Row: రిపేర్ కుదరదు, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్!
అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35(F-35 fighter) ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. 20 రోజుల తర్వాత మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్నే పరిశీలిస్తున్నట్లు సమాచారం.బ్రిటన్కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు. అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. ఈలోపు.. సుమారు 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు మరమ్మతుల కోసం కేరళకు వచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని విడదీసి ఆ భాగాల్ని తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులకుగానూ.. విమానం పార్కింగ్, హ్యాంగర్ ఛార్జీలను చెల్లించాలని UK ప్రభుత్వం నిర్ణయించింది. భారత వైమానిక దళం, నౌకాదళం, తిరువనంతపురం విమానాశ్రయ అధికారుల సహకారానికి UK హై కమిషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.మీమ్స్ వైరల్తిరువనంతపురంలో నిలిచిపోయిన బ్రిటన్ ఎఫ్-35బీ యుద్ధ విమానం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. OLXలో 4 కోట్లకే అమ్మకానికి! అని ఓ యూజర్ చమత్కరించారు. ఇది స్టెల్త్ కాదు... స్టక్! అంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశారు. బ్రిటన్ టెక్నాలజీ.. చివరకు భారతీయ భూభాగంలో ఓడింది అంటూ ఓ మీమ్ దేశభక్తి టచ్తో వైరల్ అయ్యింది. ఇది ఫైటర్ జెట్ కాదు... పార్కింగ్ జెట్ అంటూ మరో యూజర్ ఎద్దేవా చేశారు. ఇది టూమచ్ గురూ.. F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.పార్కింగ్ ఫీజు ఎంత చెల్లిస్తారంటే.. తిరువనంతపురం ఎయిర్పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు ₹40–60 లక్షలు, అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. -
ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతానికి 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అయితే, భారత్ రెండో టెస్టుకు ఎంపిక చేసిన తుదిజట్టుపై విమర్శలు వస్తున్నాయి.మూడు మార్పులుబర్మింగ్హామ్లో బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. తొలి టెస్టులో విఫలమైన సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూలను జట్టు నుంచి తప్పించింది.వీరి స్థానాల్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఎడ్జ్బాస్టన్ పిచ్ స్పిన్కు కాస్త ఎక్కువగానే సహకరిస్తుందనే విశ్లేషణల నడుమ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను టీమిండియా పక్కనపెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.విమర్శల వర్షంఅంతేకాదు.. బ్యాటింగ్ ఆర్డర్ను మరింత పటిష్టం చేసేందుకు ఆల్రౌండర్లు నితీశ్, వాషీలను తీసుకున్నామని.. ఆఖర్లో కుల్దీప్ను కూడా పక్కనపెట్టాల్సి వచ్చిందని కెప్టెన్ శుబ్మన్ గిల్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ టీమిండియా నాయకత్వ బృందంపై విమర్శలు గుప్పించారు.ఎనిమిది రోజుల విరామం తర్వాత కూడా బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని రవిశాస్త్రి తప్పుబడితే.. కుల్దీప్ను ఎలా పక్కనపెడతారంటూ గావస్కర్, గంగూలీ ఫైర్ అయ్యారు. కీలక మ్యాచ్లో తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదంటూ విమర్శించారు.ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్అయితే, బుధవారం నాటి తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్క మాటతో ఈ విమర్శలను తిప్పికొట్టాడు. ఆట పూర్తైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లేదు.. తుదిజట్టు ఎంపికలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు’’ అంటూ విమర్శకులకు ఇచ్చిపడేశాడు. తమ ప్రణాళికలకు అనుగుణంగానే మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్గా, కెప్టెన్గా అతడు అద్బుతం. జట్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అతడికి స్పష్టమైన అవగాహన ఉంది. మేము అనుకున్న పని పూర్తి చేస్తాం’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. బర్మింగ్హామ్ వేదికగా రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసింది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (2) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ అద్భుత అర్ధ శతకం(87) సాధించాడు. ఇక కరుణ్ నాయర్ (31) మరోసారి నిరాశపరచగా.. రిషభ్ పంత్ 25 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ గిల్ శతక ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా అతడికి అండగా నిలిచాడు. బుధవారం ఆట పూర్తయ్యేసరికి గిల్ 114, జడ్డూ 41 పరుగులతో అజేయంగా ఉన్నారు.చదవండి: గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
బ్యాంక్ షేర్లు పతనం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్, ఎఫ్ఐఐ అమ్మకాల ఒత్తిడిపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సానుకూలంగా ప్రారంభమై స్వల్ప లాభాలతో ట్రేడయిన భారత బెంచ్మార్క్ సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో స్థిరపడ్డాయి.ఇంట్రాడేలో 83,850 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 170.22 పాయింట్లు (0.2 శాతం) క్షీణించి 83,239.7 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 48.1 పాయింట్లు (0.19 శాతం) క్షీణించి 25,405.3 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ సానుకూల దిశలో ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.26 శాతం నష్టపోయింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 0.89 శాతం క్షీణించి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, రియల్టీ, బ్యాంక్, ఫియాన్షియల్ సర్వీసెస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.నిఫ్టీ మీడియా, ఆటో, ఫార్మా, హెల్త్కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.48 శాతం క్షీణించి 12.38 పాయింట్ల వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదేసమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. -
Doddi Komaraiah తెలంగాణ వేగు చుక్క
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మలుపు తిప్పిన ఘటన దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) తెలంగాణ వేగు చుక్క మరణం. కొమురయ్య కడవెండి గ్రామ యువకుడు. నిజాం రాజ్యంలో ప్రముఖుడైన విస్నూర్ దేశ్ముఖ్ రాపాక రామ చంద్రారెడ్డి కింద ఉన్న 60 గ్రామాలలో కడవెండి ఒకటి. ఇక్కడే దేశ్ముఖ్ తల్లి జానమ్మ నివసిస్తూ తన అకృత్యాలను కొనసాగిస్తూ ఉండేది. ఆంధ్ర మహాసభ ప్రవేశించకముందే ఈ గ్రామం దేశముఖ్ అకృత్యాలనూ, పెత్తందారీ సంస్కృతినీ విమర్శించడం, ధిక్కరించడం మొదలు పెట్టింది. దున్నేవానికే భూమి, అక్రమ పన్నుల రద్దు వంటి కమ్యూనిస్ట్ నినాదాలతో ప్రేరేపితమయ్యింది. వెట్టి చాకిరీ, రకరకాల పన్నులు, వడ్డీ వ్యాపారుల దోపిడీ వంటి వాటికి వ్యతిరేకంగా గ్రామం సంఘటితమవుతూ ఉంది. ఈ క్రమంలో కడవెండి గ్రామానికి 1946 జూలై 4న నిజాం రాజ్య రెవెన్యూ అధికారులు లెవీ ధాన్యపు సేకరణకు వచ్చారు. తమ దగ్గర తినడానికే ధాన్యం లేదనీ, లెవీ ధాన్యం ఎక్కడి నుంచి తేవాలనీ ప్రశ్నించారు గ్రామస్థులు. లెవీ వసూలుకు వ్యతిరేకంగా, దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా రెతులు, కూలీలు ఆ రోజు ఒక ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో దొడ్డి కొమురయ్య– మల్లయ్య సోదరులు కూడా పాల్గొన్నారు. వారు ముందువరుసలో ఉండి నినాదాలు చేస్తూ ముందుకు కదులుతుండగా మిస్కిన్ అలీ నేతృత్వంలో దొర గుండాలు ఊరేగింపుపై కాల్పులు జరిపారు. తూటాలు తగలడంతో కొమురయ్య మృతిచెందాడు. అనేకమందికి గాయాలయ్యాయి. కొమురయ్య అంత్యక్రియలకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. అతడి మరణంతో కమ్యూనిస్టులు తామూ ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో సాధారణ రైతాంగ పోరాటం మహత్తర సాయుధ పోరాటంగా మారింది. ఉద్యమం తాకిడికి భూస్వాములు గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్లిపోవడంతో వారి భూములను పేద రైతులు, కూలీలకు పంచారు నాటి ఉద్యమ నాయకులు. – అస్నాల శ్రీనివాస్ ‘ దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ (జులై 4 దొడ్డి కొమురయ్య వర్ధంతి) -
‘నిజం చెప్పినందుకు లోకేష్ మనుషులు బెదిరిస్తారా?’
తాడేపల్లి: సత్తెనపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు. నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నారు. సత్తెనపల్లి లో జరిగిన సింగయ్య మరణంపై చంద్రబాబు నీచంగా మాట్లాడటం ద్వారా తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే కుక్క పిల్లలా లాగిపడేశారని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబు తనకు ఉన్న చులకలభావాన్ని చాటుకున్నారు. సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని, వైఎస్ జగన్పై పన్నిన కుతంత్రంను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేశారు.దళితులంటే అంత చులకనా బాబూసింగయ్య భార్య లూర్దు మేరి వైఎస్ జగన్ని కలిశారు. తమ కుటుంబానికి వైఎస్ జగన్ అంటే అభిమానమని, ఆయన్ను చూడటానికి తాను, తన భర్త సింగయ్య బయటకు వచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు తన భర్తే స్వయంగా మా పేర్లు, ఫోన్ నెంబర్లు చెప్పారని, అంబులెన్స్ లోకి చేరేవరకు బాగానే ఉన్నారని, బాగానే మాట్లాడుతున్నారని, తనకు కొద్దిపాటి దెబ్బలే తగిలాయని చెప్పిన విషయం ఆమె గుర్తు చేశారు. ఆటోలో తీసుకెళ్తామని చెప్పినా వినకుండా అంబులెన్స్లో తరలించారు. బాగా మాట్లాడుతున్న వ్యక్తి ఎలా చనిపోయాడని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఎస్పీ సైతం ప్రమాదం జరిగిన్పపుడు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారు. నారా లోకేష్ 50 మందిని తన ఇంటికి పంపించి బెదరించారని బాధితురాలు మేరీ చెబుతోంది. ఇవన్నీ సింగయ్య మరణంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దళితుల పట్ల చంద్రబాబు ఎంత ప్రేమ ఉందనేది మా అందరికీ తెలుసు. మొన్న తెనాలిలో దళిత యువకులను పోలీసులు లాఠీలు విరిగేలా కొడితే వారిపై చర్యలు తీసుకోకుండా గంజాయి బ్యాచ్ అని విషప్రచారం చేశారు. గత చంద్రబాబు పాలనను పక్కన పెడితే, ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్ననే చంద్రగిరిలో దళిత మహిళను బట్టలు చించి కొట్టారు. జేమ్స్ అనే యువకుడితే మూత్రం తాగించారు. దళితుల మీద సాంఘిక బహిష్కరణలు ఎక్కువైపోయాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా కనీసం దానిపై ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా? మంగళగిరి నియోజకవర్గంలో దళితులు నడిచారని రోడ్డు మైలపడిందని పసుపు నీళ్లతో కడిగిన దారుణం ఇప్పటికీ మా కళ్లలో కదులుతూనే ఉంది. సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై టీడీపీ యువకులు 16 మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తే వారి కుటుంబానికి న్యాయం చేశారా? ఆ బాలిక తండ్రి మీ పార్టీ కార్యకర్త అని, మీ పార్టీ విజయోత్సవ సంబరాల్లో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ వారి కుటుంబాన్ని ఆదుకోకపోగా ఇంత దారుణంగా మృతుడి కుమార్తెకి అన్యాయం చేస్తారా? ఇలా ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకున్నారా? ఒక దళితుడిని కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్లినంత మాత్రాన దళితులను ఉద్దరించినట్టు ప్రజలకు అనుకుంటారనే భ్రమల్లో నుంచి బయటకు రండి. మైకులు పెట్టి ఇచ్చిన స్ర్కిప్టు చదివితే మేం నమ్మేస్తామని ఎలా అనుకుంటారు? మీ హయాంలో జరిగిన వాటికి ఏం సమాధానం చెబుతారు?నాడు సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్లో ఉండగా గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట జరిగి 29 మంది అమాయక భక్తులు చనిపోయారు. చంద్రబాబు నిర్వహించిన కందుకూరు రోడ్ షోలో 7 మంది చనిపోయారు. గుంటూరులో చంద్రబాబు బహిరంగ సభ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస జాగ్రత్తలు పాటించని కారణంగా ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ప్రమాదాలు జరిగిన అన్ని సందర్భాల్లో అక్కడ చంద్రబాబు ఉన్నారు. వీటన్నింటికీ ఆయన ఏం సమాధానం చెబుతారు. అన్ని వర్గాల్లోనూ కూటమి ప్రభుత్వంపై రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది. వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుని, ఆయన పర్యటనలకు బ్రహ్మరథం పడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైఎస్ జగన్కి ఉన్న ప్రజాభిమానాన్ని తక్కువ చూసి చూపించడానికి వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఆయన బయటకు రాకుండా చేయాలనే కుట్రతో ఆయన పర్యటనలకు అనుమతులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై చర్చ జరిగితేనే పాలన మెరుగువుతుందన్న కీలక విషయాన్ని చంద్రబాబు మర్చిపోతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక మందం అనడం దేనికి సంకేతం? పోలీసులను కూడా పార్టీల వారీగా విభజించి వేధిస్తున్న ఘనత చంద్రబాబుది.ఇంత వికృతమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారో చర్చించటానికి మేము సిద్ధం. మా హయాంలో జరిగిన అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేశారు. లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని సింగయ్య భార్య చెప్పింది. దీనిపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పటం లేదు?, ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై లైంగిక దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారు?, ఆ బాలిక తండ్రి టీడీపీ కార్యకర్త. చంద్రబాబు మీటింగుకి వెళ్లి ఆయన చనిపోయారు. అలాంటి కుటుంబానికి చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?, చంద్రబాబు గానీ ఆయన మంత్రులుగానీ కనీసం పరామర్శించకపోవటానికి కారణం ఏంటి?, లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని శైలజానాత్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య -
ENG VS IND 2nd Test Day 2: ప్రమాదంలో కోహ్లి రికార్డు
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అజేయ సెంచరీతో (114), రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 87, కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు.రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో రోజు గిల్ మరో 36 పరుగులు చేస్తే, ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్పై 150 పరుగులు మార్కును తాకిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఎడ్జ్బాస్టన్లో భారత్ తరఫున ఇప్పటివరకు ఎవరూ 150 పరుగుల మార్కును తాకలేదు. 2018లో విరాట్ 149 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకు ఎడ్జ్బాస్టన్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది. విరాట్ రికార్డును ఛేదించే క్రమంలో గిల్ సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్లను అధిగమించే అవకాశం ఉంది. ఎడ్జ్బాస్టన్లో సచిన్ 122, పంత్ 146 పరుగులు చేశారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు.ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ల్లో అద్బుతంగా ఆడారు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదయ్యాయి. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు.ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో కదిలిన డొంక
సాక్షి, విశాఖపట్నం: మరో బెట్టింగ్ యాప్ ముఠాను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో డొంక కదిలింది. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విశాఖ పోలీసులు.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. బెంగళూరులో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేసి బెట్టింగ్కు పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన నిందితుడు కీలక పాత్ర వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ ముఠా సభ్యులు వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ టాప్లు, 132 ఏటిఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఒక కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. -
రూ.84 లక్షల బెంజ్ కారు.. రూ.2.5 లక్షలకే..
ఢిల్లీలో కొత్తగా అమల్లోకి వచ్చిన కఠినమైన ఇంధన నిషేధం ఖరీదైన కార్ల యజమానులకు శాపంగా మారింది. చాలా మంది తమ ఖరీదైన పాత ప్రీమియం కార్లను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయకూడదు. రాజధానిలో నెలకొన్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు నిషేధాన్ని అమలు చేస్తున్నారు.మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. వరుణ్ విజ్ అనే వ్యక్తి తన లగ్జరీ ఎస్యూవీ 2015 మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ 350ని తప్పని పరిస్థతిలో చాలా చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. పదేళ్ల కిందట ఈ వాహనాన్ని ఆయన రూ.84 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాత వాహనాలకు ఇంధన నిషేధం కారణంగా కేవలం రూ.2.5 లక్షలకే అమ్ముడుపోయింది.దశాబ్ద కాలంగా తమ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా ఉన్న కారును ఇప్పుడు వదిలించుకోవాల్సి రావడం వల్ల కలిగే భావోద్వేగాన్ని విజ్ వివరించారు. తన కుమారుడిని హాస్టల్ నుండి తీసుకురావడానికి వారానికి కేవలం 7-8 గంటల ప్రయాణానికి మాత్రమే ఈ కారును వినియోగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తంగా 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు రొటీన్ సర్వీసింగ్, టైర్ రీప్లేస్మెంట్లకు మించి మరే ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇంత చౌకగా అమ్ముడుపోయిందని విజ్ ఆవేదన వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.62 లక్షలతో ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లు విజ్ తెలిపారు. ప్రభుత్వం ఇలా మరోసారి విధానం మార్చుకోకపోతే 20 ఏళ్ల పాటు దీన్ని వాడుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.రితేష్ గండోత్రా అనే వ్యక్తి కూడా తాను రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును చౌకగా అమ్మాల్సి వస్తోందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్సీఆర్లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాల కారణంగా నా కారును విక్రయించవలసి వస్తోంది. అది కూడా ఎన్సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు. -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం.. లేకపోతే చంపేస్తా!
అనంతపురం: పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అంటూ ఓ యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన యువతి సాయినగర్ ఏడో క్రాస్లోని లేడీస్ హాస్టల్లో ఉంటోంది.రెండు సంవ త్సరాల క్రితం అనంతపురం నగరంలోని బస్టాండు వద్ద ఉన్న ప్రియదర్శిని హోటల్లో పార్టం ఉద్యోగం చేస్తున్న ఈమెకు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అగ్రహారంకు చెందిన ప్రవీణ్ కుమార్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అని చెప్పగా యువతి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ నగర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోంలోన్ విభాగంలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరింది.విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ మళ్లీ ఆమె వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. మంగళవారం హాస్టల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. బైకులో బలవంతంగా ప్రసన్నాయ పల్లి రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి దాడి చేశాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపుతా అని బెదిరించాడు. తిరిగి బైక్పై హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీనిపై తన సోదరితో కలిసి యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
హీరో చెంప చెళ్లుమనిపించింది.. ఆ దెబ్బతో ఇమేజ్ డ్యామేజ్!
ఆవేశం అనర్థదాయకం అని ఈ హీరోయిన్ విషయంలో రుజువైంది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది. టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాల్లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఫరా నాజ్. ఆమె సోదరి టబు.చిన్న వయసులోనే..హైదరాబాద్లో పుట్టిన ఫరా నాజ్ (Farah Naaz Hashmi) తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. యష్ చోప్రా 'ఫాల్సే' మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 17 ఏళ్లు మాత్రమే! ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి, టాలెంట్కు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులిచ్చారు. మార్తే డం టక్, నసీబ్ అప్నా అప్నా, లవ్ 86, ఇమాందార్, వీరు దాదా, దిల్జలా, బాప్ నంబ్రీ బేటా దస్ నంబ్రీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది.ఆవేశంస్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఫరా నాజ్కు ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవపడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు, కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయటపెట్టిందట! తన బాధ ఇంట్లోవాళ్లకు అర్థమవ్వాలనే అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది.చెంప చెళ్లుమనిపించిందికసం వర్దీకీ సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్కు ఒళ్లంతా మండిపోయింది. ఆవేశం పట్టలేక అతడి చెంప చెళ్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన రఖ్వాలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఫరాకు బదులు మాధురీ దీక్షిత్ను హీరోయిన్గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్టయ్యేదని అనిల్ కపూర్ ఫీలయ్యాడట! ఈ విషయం తెలిసిన ఫరా.. అనిల్ను బెదిరించినట్లు భోగట్టా! ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగెటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్ను దెబ్బ తీసింది.చెల్లితో అసభ్యంగా..జాకీ ష్రాఫ్తో కలిసి దిల్జలా మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెంజోంగ్ప ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా.. టబును తీసుకుని వెళ్లింది. తను తాగి పడిపోయింది. అప్పుడు పూటుగా తాగిన జాకీ ష్రాఫ్.. టబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్ను బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా.. మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతరకాలంలో మాత్రం అపార్థం చేసుకున్నానని యూటర్న్ తీసుకుంది.రెండు పెళ్లిళ్లుఫరా.. రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ను పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన ఆరేళ్లకే విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాదే నటుడు సుమీత్ సైగల్ను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనక్కూడా ఇది రెండో పెళ్లే! అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఫరా.. తెలుగులో ఒంటరి పోరాటం, విజేత విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.చదవండి: ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ -
హైదరాబాద్లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. టాలీవుడ్లోని సినిమాలను పైరసీ చేసిన తూర్పుగోదావరికి చెందిన జన కిరణ్కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వనస్థలిపురంలో ఏసీ టెక్నిషియన్గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు 65 సినిమాలకు రికార్డు చేసినట్లు కిరణ్ పేర్కొన్నాడు. హెచ్డీ ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.నిందితుడిపై 66(c), 66(e) ఐటీ యాక్ట్, 318(4),r/w 3(5), 338 BNS, 63, 65 కాపీ రైట్, 6-AA,6AB,7(1A) సినిమాటోగ్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కామ్ కార్డ్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్కుమార్.. 1TAMILBLASTERS, 5MOVIEZRULZ, 1TAMILMV వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఒక థియేటర్ వేదికగా ఈ పైరసీకి పాల్పడినట్లు తేలింది. పైరసీ కారణంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు 3.7కోట్ల నష్టం ఏర్పడింది. టెలిగ్రామ్లో సైతం కొత్త పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారుగా ఏడాదిన్నర నుంచి హైదరాబాద్లోని పలు థియేటర్స్లో 40 సినిమాలు రికార్డింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.సినిమా థియేటర్లోనే పైరసీ చేసి మాఫియాకి అమ్ముతున్న కిరణ్.. ఒక్కొక్క సినిమాకి 400 క్రిప్టో కరెన్సీని తీసుకుంటున్నాడు. క్రిప్టోతో పాటు బిట్ కాయిన్స్ రూపంలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ ఛేంజర్, సినిమాల ఫైల్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడు కిరణ్ నుంచి రెండు మొబైల్స్ను సీజ్ చేశారు. -
బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదు
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి అనేలా బ్యాంకులు పట్టుబట్టకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ వాడకం ప్రజల స్వచ్ఛంద నిర్ణయంగా ఉండాలని తెలిపింది. బ్యాంకింగ్ వంటి సేవలకు ఆధార్ను తప్పనిసరి చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఉటంకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఆధార్ వివరాలు లేవనే కారణంతో ఖాతా తెరవడంలో జాప్యం చేసిన బ్యాంకుకు, ఓ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ తీర్పు వెలువడింది. కంపెనీ ప్రత్యామ్నాయంగా నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాలను అందించినప్పటికీ బ్యాంకు ఆధార్ కోసం పట్టుబట్టింది. ఫలితంగా కొంతకాలం బ్యాంకు ఖాతా తెరవడం ఆలస్యం అయింది. ఇది కంపెనీ నిర్వహణ అంతరాయాలకు, ఆర్థిక నష్టానికి దారితీసిందని సంస్థ పేర్కొంది.బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధం..బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్ను స్వచ్ఛందంగా ఇవ్వగలిగినప్పటికీ, దాన్ని తప్పనిసరి చేయకూడదని నొక్కి చెప్పింది. పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఆధార్ వినియోగం నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకే పరిమితమని మరోసారి స్పష్టం చేసింది. చట్టసభల మద్దతు లేకుండా ప్రైవేటు సేవలకు దీన్ని తప్పనిసరి చేయకూడదని పేర్కొంది.The Bombay High Court has held that a bank could not have insisted on Aadhaar as a mandatory requirement for opening a bank account after the Supreme Court's verdict in Justice K.S. Puttaswamy v. Union of India (2018), and awarded ₹50,000 in compensation to a company whose… pic.twitter.com/aHDMMKuat3— Live Law (@LiveLawIndia) July 2, 2025ఇదీ చదవండి: భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలునష్టపరిహారం చెల్లింపుఖాతా తెరిచేందుకు జాప్యం జరిగిన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడినట్లు సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని గుర్తించిన బాంబే హైకోర్టు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కేవైసీ నిబంధనలు చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని ఈ తీర్పు ఆర్థిక సంస్థలకు గుర్తు చేస్తోంది. ప్రత్యేకించి ప్రత్యామ్నాయ, చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన డాక్యుమెంటేషన్ అందించినప్పుడు కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తెలుపుతుంది. -
అప్పుడు రూ.60, ఇపుడు రూ. 6 లే : సిద్దూ సైకిల్ భళా..!
తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామానికి చెందిన రాజపు సిద్దూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఇంటి నుంచి రాజాంలో తను చదువుతున్న కళాశాలకు వెళ్లేందుకు 17 కిలోమీటర్ల దూరం. మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి బస్సు, లేదంటే ఆటో ఎక్కివెళ్లాలి. బస్సు రావడం ఆలస్యమైతే కళాశాలకు సమయానికి చేరుకోలేని పరిస్థితి. రానుపోను చార్జీలకు రోజుకు రూ.60లు ఖర్చయ్యేది. ఈ సమస్యలను అధిగమించాలని సిద్దూ తలచాడు. రూ.30వేలు ఖర్చుచేసి ఆన్లైన్లో రాజస్థాన్, ఢిల్లీ నుంచి సామగ్రిని తెప్పించుకున్నాడు. పాఠశాల దశలో విజ్ఞాన ప్రదర్శనల్లో ప్రదిర్శంచేందుకు రూపొందించిన ప్రాజెక్టుల అనుభవాన్ని రంగరించి మరో స్నేహితుడితో కలిసి బ్యాటరీతో నడిచే సైకిల్ను తీర్చిదిద్దాడు. కేవలం 3 గంటల విద్యుత్ చార్జింగ్తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా మలిచాడు. కేవలం రూ.6 ఖర్చుతో కళాశాలకు వెళ్లి తిరిగొస్తున్నాడు. కుమారుడి ప్రతిభను చూసి కూలీలైన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. విద్యార్థి సృజనాత్మక ఆలోచనతో ముందుకు సాగుతున్న విద్యార్థిని గ్రామస్తులతో పాటు కళాశాల అధ్యాపకులు అభినందిస్తున్నారు. ఇదీ చదవండి: కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోందిఆ విజ్ఞానంతోనే.. ఇంటి నుంచి తరగతులకు సమయానికి వెళ్లేలేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యేవాడిని. తన సమస్యకు పరిష్కారంకోసం నిరంతరం ఆలోచించేవాడిని. హైసూల్లో చదువుకొనే రోజుల్లో పాల్గొనే సైన్స్ విజ్ఞాన ప్రదర్శనల అనుభవంతో ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్ తయారు చేసేందుకు పూనుకున్నాను. దీనిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలు రాజస్థాన్, ఢిల్లీ నుంచి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. వీటిని స్నేహితుని సహాయంతో రెండు రోజుల్లో సైకిల్కు బిగించాను. ప్రస్తుతం ప్రతిరోజూ కళాశాలకు ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్పైనే వెళ్తున్నాను. నా సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉంది. – సిద్దూ, జె.కొత్తవలసచదవండి: బోయింగ్ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్, కడసారి సందేశాలు -
పెళ్లైన పదిరోజులకే ఫుట్బాల్ స్టార్ దుర్మరణం
లివర్పూల్ ఫుట్బాలర్, పోర్చుగీస్కు చెందిన డియోగో జోటా (Diogo Jota) దుర్మరణం చెందాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్లోని జమోరా ప్రావిన్స్లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా ప్రమాద సమయంలో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రీ కూడా కారులోనే ఉన్నాడు. అతడు కూడా ప్రొఫెషనల్ ఫుట్బాలరే!.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కారు రోడ్డును ఢీకొట్టిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందులోని వారు సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.కాగా 28 ఏళ్ల జోటా పదిరోజుల క్రితమే పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి, జీవిత భాగస్వామి అయిన రూటే కార్డెసోను వివాహమాడాడు. ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడం విషాదం. కాగా జోటాకు భార్య రూటేతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కీలక విజయాల్లో పాత్రపోర్టోలో జన్మించిన జోటా.. 2016లో అట్లెటికో మాడ్రిడ్ క్లబ్లో చేరాడు. ఆ తర్వాత ప్రీమియర్ లీగ్, వోల్వర్హాంప్టన్ వాండరర్స్ తరఫున సత్తా చాటిన జోటా.. లివర్పూల్తో జట్టు కట్టిన తర్వాత తన కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. జర్గన్ క్లాప్ నాయకత్వంలో ఎఫ్ఏ కప్, లీగ్ కప్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే లివర్పూల్ అటాకింగ్ విభాగంలో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. ఇక 2024-25 సీజన్లో లివర్పూల్ ప్రీమియర్ లీగ్ గెలవడంలోనూ జోటాది కీలక పాత్ర. ఇక పోర్చుగల్ జట్టు తరఫున కూడా అతడు రాణించాడు.రొనాల్డో సంతాపంజోటా మృతిపై పోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. నువ్వులేని లోటు ఎవరూ తీర్చలేరని.. నీ భార్యా, పిల్లలు, కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు.. లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ జోటా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాదకర విషయాన్ని నమ్మలేకపోతున్నామంటూ సంతాపం వ్యక్తం చేసింది.చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా? -
కేరళలో విషాదం.. కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం ఆసుపత్రిలోని 14వ వార్డుకు ఆనుకుని ఉన్న భవనం ఉదయం 11 గంటల ప్రాంతంలో కూలిపోయింది.తక్షణమే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా దాదాపు వంద మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పరిశీలించారు.అధికారులు ఈ భవనం వాడుకలో లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, భవనం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఆసుపత్రిలో రోగులు ఆ టాయిలెట్లను ఉపయోగించారంటూ కొందరు తెలిపారు. -
జానీ మాస్టర్ ఎఫెక్ట్.. 'నయనతార' దంపతులపై తీవ్ర విమర్శలు
మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన కొంతకాలం జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. నయనతార, విఘ్నేష్ శివన్లు తమ సినిమా కోసం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రకటించారు. దీంతో ఈ దంపతులపై కోలీవుడ్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు బాలీవుడ్ మీడియా కూడా పలు కథనాలు ప్రచురించింది.నయనతార, విఘ్నేష్ శివన్లు నిర్మిస్తున్న కొత్త సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కోసం కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ పనిచేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని చెబుతూ కొన్ని ఫోటోలను కూడా జానీ షేర్ చేశాడు. అయితే, ఈ ప్రకటన వెలువడిన తర్వాత నయనతార దంపతులను కోలీవుడ్ మీడియా తప్పుబడుతుంది. తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన బాలికపైనే లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కొరియోగ్రాఫర్గా ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తప్పనిపించలేదా..? కోలీవుడ్లో మీకు ఎవరూ కొరియోగ్రాఫర్ దొరకలేదా..? అంటూ విమర్శించారు.నేరస్థులకే ఛాన్సులు: చిన్మయికోలీవుడ్ టాప్ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. జానీ మాస్టర్, విఘ్నేష్ ఫోటోలను షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'జానీ, ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చాడు. మనం 'ప్రతిభావంతులైన' నేరస్థులను ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటి వారిని ప్రోత్సహిస్తూనే ఉంటాము. వారినే అధికార స్థానాల్లో ఉంచుతాము. మహిళలను ఎక్కువగా వేధించేది నేరస్థులే అని గుర్తుపెట్టుకోవాలి. 'నాకు ఏమీ జరగకుండా చూడండి' మనం ఏం చేస్తున్నామో ఆలోచించండి స్వీట్' అంటూ ఆమె తెలిపారు.చిన్మయి చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది. ఆన్లైన్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. తీవ్రమైన నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి పనిచేయాలనే ఈ జంట నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు. మరికొందరు వారు "లైంగిక వేటగాడిని వేదికగా చేసుకున్నారని" ఆరోపించారు. నయన్ తనను తాను స్వయంకృషి కలిగిన మహిళగా చెప్పుకుంది. మహిళా నటుల కష్టాలను ఆమె తెరపైకి తీసుకొచ్చింది. వేదికలపై తారలు మాట్లాడాలని కోరింది. కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. అయినప్పటికీ, పోక్సో కింద నిందితుడైన వ్యక్తికి తన భర్త మద్దతు ఇవ్వడం ఆమెకు బాగానే ఉంది అంటూ కొందరు విమర్శించారు. ఏదేమైన నయనతార దంపతులు తీసుకున్న నిర్ణయం పట్ల కోలీవుడ్ నుంచి తీవ్రంగా వ్యతిరేఖత వస్తుంది.Jani is out on conditional bail involving a minor’s sexual assault.We as a people seem to love ‘talented’ offenders and will keep promoting them and keeping them in positions of power which the offenders use to harangue the women more - “See nothing will happen to me.” It is… pic.twitter.com/irXOqZp824— Chinmayi Sripaada (@Chinmayi) July 2, 2025Nayan called herself a self-made woman who knows the struggles of female actors, urged stars to speak out, and thanked those who supported her. Yet she's fine with her husband backing a man accused under POCSO. Why the double standards? #Jani #VigneshShivan pic.twitter.com/Bz1sXpumvq— Films Spicy (@Films_Spicy) July 2, 2025don't know when wikki is gonna understand he's not a single person anymore.Whatever he does/speaks directly attached to #Nayanthara.She is a self made woman who stood up for herself and women in cinema in the past.A happy post with a pedophile dance master is seriously a big mess pic.twitter.com/SaG9sT2kQD— common_man (@IronladyNa5366) July 2, 2025It's not news that Vignesh Shivan and Nayan support predators. Why are y'all surprised? pic.twitter.com/f9u97SB2Ko— ஜமுனா (@velu_jamunah) July 2, 2025 -
వధువు సోదరి, వరుడు సోదరుడు ‘చమ్మక్ చల్లో..’ వైరల్ వీడియో
పెళ్లిళ్లలోఅందమైన అమ్మాయిలు, టీనేజ్ కుర్రాళ్లదే సందడి అంతా.వధూవరులు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే, వీరుమాత్రం ‘కళ్లు కళ్లు కలిసేనే...’ ‘కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్టు ఇన్ఫ్యాట్యుయేషన్’ అంటూ ఆనందం, ఆశ్చర్యంతో ఉత్సాహంగా స్టెప్లు లేస్తారు. అలాంటి డ్యాన్స్ ఒకటి నెట్టింట తెగ వైరలవుతోది.పెళ్లిళ్లలో సంగీత్ వేడుక అనేది పెళ్లికి ముందు జరిగే వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబాలు కలిసి ఆడిపాడతారు. అయితే ఒక పెళ్లి వరుడి సోదరుడు,వధువు సోదరి ఇద్దరూ కలిసి స్టెప్పులతో ఇరగదీశారు. బాలీవుడ్ హిట్ మూవీ రా.వన్లోని సూపర్సాంగ్ ‘ చమ్మక్ చల్లో’’ కి చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అబ్బాయి సూట్లో, అమ్మాయి లెహంగాలో అందంగా మెరిసిపోతూ, చక్కటి డ్యాన్స్ వేసి అక్కడున్నవారినందర్నీ మెస్మరైజ్ చేశారు. View this post on Instagram A post shared by WeddingDreamCo | Wedding Content Creator Chennai (@weddingdreamco) ఈ వీడియోను @weddingdreamco ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, 8.6 మిలియన్ల వీక్షణలు , 902వేల లైక్స్తో తెగ వైరల్గా మారింది. నెటిజన్లు ప్రశంసలు, కామెంట్లతో సందడిచేశారు. ‘‘వార్నీ..వీళ్లిద్దరూ ఇప్పటికే డేటింగ్లో ఉన్నట్టున్నారు. అందుకే పేరెంట్స్ను ఒప్పించడానికి వారు వారి అన్నయ్యలను వివాహం కోసం ఏర్పాటు చేసుకున్నారు.” ‘‘అమ్మాయి డ్యాన్స్తో చంపేసింది’’, అని ఒకరంటే.. ‘హే.. వాళ్లిద్దరూ చాలా మర్యాదగా ప్రవర్తించారు. అబ్బాయి అయితే ఒక్కసారి కూడా టచ్ చేయకుండా డ్యాన్స్చేశారు అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.వధూవరుల తోబుట్టువులు పెళ్లిలలో ఇలాంటి డ్యాన్సులతో అతిథుల మనసు దోచుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు నెట్టింట సందడి చేశాయి. -
'చేత్తో తినడం' ఇది ఎప్పటి అలవాటంటే..!
న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ చేతులతో బిర్యానీ తింటున్న వైరల్ వీడయో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఉంటూ ఇలా చేత్తో తినడం అనాగరికం అని, మీరు థర్డ్ వరల్డ్లోనే బతకండి అంటూ మామ్దని తీరుని తప్పుపట్టారు. అయితే కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలిచి చేత్తో తింటే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చేత్తో తినడం అనే అలవాటు ఏనాటిది? పాశ్చాత్యులు తొలి నుంచే ఫోర్క్లు, స్పూన్లు,చాకులతోనే తినేవారా అంటే..చేతులతో తినడం అనేది పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన అలవాటు కాకపోయినా..ఇది మన భారతీయ ఆచారం. అది మన సంస్కృతిలో భాగం కూడా. సింపుల్గా చెప్పాలంటే భారతీయులకు కేవలం పోషణ కాదు ఒక విధి విధానం. చరిత్ర ప్రకారం ఆదిమానవుల కాలం నాటిది ఈ అలవాటు. ఈజిప్షియన్లు, గ్రీకులు, మెసొపొటేమియన్లు, సింధులోయ నాగరికత ప్రజలు అంతా చేత్తోనే తినేవారు. ఇది మైండ్ఫుల్గా తినేందుకు చిహ్నం.అంతేగాదు జీర్ణక్రియకు నేరుగా ఆహారాన్ని అందించే ప్రక్రియ అని ఆయుర్వేదం చెబుతోంది. ఇక భారతీయ గ్రంథలు, ఉపనిషత్తులు కూడా చేతులతో తినడం అనేది శరీరాన్ని ఆత్మకు అనుసంధానం చేసే ఒక ప్రక్రియగా పేర్కొన్నాయి. ఎందుకంటే చూడటం, వాసన రుచి, స్పర్శతో కూడిన ఇంద్రియానుభవమే భోజనం అని పురాణాలు చెబుతున్నాయి. మన భారతీయ భోజనం బియ్యం, కూరలు కలయిక. కాబట్టి వాటిని తినాలంటే చేతులతో కలుపుకుని తింటే చక్కటి రుచిని ఆస్వాదించగలరు. అదే పాశ్చాత్యులకు రోస్ట్లు, గ్రిల్డ్ మాంసం, పాస్తా, బ్రెడ్ వంటివి ఆహారాలు. వాటిని తినాలంటే వాళ్లు చాక్లు, ఫోర్క్లు ఉపయోగించి తినాల్సిందే. ఎందుకంటే వాటిని అలానే తినేయం సాధ్యం కాదు. అయినా భారతీయుల ఆహారం అంతలా ఘనపదార్థాలుగా ఉండదు కాబట్టి ఆ అవసరం మనకు రాలేదు. పైగా ఇది మన సంస్కృతిలో భాగం. చాప్స్టిక్స్ సంగతేంటి?చైనా, జపాన్లోని ప్రజలు చాప్స్టిక్లను ఉపయోగిస్తారు. వాళ్లు వీటిని క్రీశ 400 ఏళ్ల నాటి నుంచి ఆచరిస్తున్నారట. ఇటీవలే వాళ్ల భోజన విధానంలో ఫోర్క్లు, చాక్లు వచ్చాయట. ప్రస్తుతం అది ఆదునికతకు గుర్తుగా మారిందని చెబుతున్నారు నిపుణులు. ఇక చైనా, జపాన్లో చాప్స్టిక్తో తినడానికి కారణం.. బుద్దిపూర్వకంగా మనసుపెట్టి తినాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అదీగాక వాళ్ల ఆహారం చాలామటుకు చిన్ని చిన్న ముక్కులుగానే ఉంటుంది. వాళ్లకు భోజనం అనేది ఏకాగ్ర చిత్తంతో చేసే ప్రక్రియ. ఈ విధానంలో తింటే మాటలు దొర్లవు, తింటున్న దానిపై ఫోకస్ ఉంటుదంట. అందులోనూ ఆకలితో ఉంటే..స్పీడ్గా తినాంటే ఆ చాప్స్టిక్లపై ఫోకస్ పెడితేనే తినగలరు లేదంటే వాటి మధ్య నుంచి ఆహారం జారిపోతుంది. పైగా అలా గనుక ఆహారం పారేస్తుంటే చైనా పెద్దలు తిట్టడమే గాక మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే తినమని ఆదేశిస్తారట.చేత్తో తినడం మంచిదేనా.. చేత్తో తినడం పరిశభ్రకరమైనదా అని పాశ్చాత్యులు ప్రశ్నిస్తుంటారు. కాని ఇది పరిశుభ్రతకు సంబంధించిన అంశమని నొక్కిచెబుతున్నారు శాస్త్రవేత్త అదితి. ఎందుకంటే భోజనానికి ముందు తర్వాత చేతులు తప్పక కడుక్కుంటారు. అలాగే కుడిచేయి అనేది పవిత్రమైన పనులకే ఉపయోగిస్తారు భారతీయులు. తిలకం పెట్టుకోవడం దగ్గర నుంచి ఇతరులకు డబ్బులు ఇవ్వడం, శుభాకార్యలకు అన్నింటికి కుడి చేతినే ప్రధానం ఉపయోగిస్తారు. అలాగే ఎడమ చేతిని వ్యక్తిగత పరిశుభ్రతకే కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఇక చేత్తే తినడం వల్ల మనసారా తింటున్న అనుభూతి తోపాటు జీర్ణక్రియ నేరుగా వెళ్లి సులభంగా అరిగిపోయేలా చేయడంలో దోహదపడుతుందట. చేత్తో తింటేనే త్వరితగతిన అరిగిపోతుందని, ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైందని చెప్పుకొచ్చారు వైద్యులు.(చదవండి: Zohran Mamdani: పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!) -
మెట్లు ఎక్కలేని స్థితిలో స్టార్ హీరో కూతురు.. ఇప్పుడేకంగా హీరోయిన్గా!
తండ్రి బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమైంది విస్మయ (Vismaya Mohanlal). మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో కాలు మోపనుంది. తుడక్కం అనే మలయాళ చిత్రంతో వెండితెరపై రంగప్రవేశం చేయనుంది. అయితే విస్మయ ఇప్పటికే రచన, మార్షల్ ఆర్ట్స్లో ఆరి తేరింది. 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్' అనే పుస్తకంతో రచయిత్రగా ప్రయాణం ప్రారంభించింది. థాయ్లాండ్లో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంది. ఇప్పుడు హీరోయిన్గా అలరించనుంది.థాయ్ల్యాండ్లో ఫిట్నెస్ ట్రైనింగ్విస్మయ మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది. థాయ్ల్యాండ్లో ఫిట్నెస్ క్యాంప్నకు వెళ్లి తన శరీరంపై ఫోకస్ చేసింది. అటు మార్షల్ ఆర్ట్స్, ఇటు ప్రత్యేక వ్యాయామాలతో 22 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని 2020 డిసెంబర్లో తనే ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. నాలుగు మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేది. ఫిట్గా ఉండాలనిపించేది కానీ అందుకోసం ఏదీ చేయకపోయేదాన్ని. కానీ, ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయింది.నా వల్ల కాదనుకున్నప్పుడల్లా..కొండలు ఎక్కేస్తున్నాను. ఎక్కువసేపు స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇదంతా నా కోచ్ వల్లే సాధ్యమైంది. నాకోసం 100 శాతం కష్టపడ్డాడు. ఎప్పుడూ నా వెంటే ఉన్నాడు. గాయాలవుతున్నా సరే.. నా ఫిట్నెస్ జర్నీ ఆపకూడదని నాకు ధైర్యాన్ని నూరిపోశాడు. నా వల్ల కాదనుకున్న ప్రతిసారి.. కచ్చితంగా అవుతుందని వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఇక్కడకు వచ్చాక కేవలం బరువు తగ్గడమే కాదు, కొత్త విషయాలు నేర్చుకున్నాను, కొత్తవారిని కలిశాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. నా జీవితమే మారిపోయిందినేను చేయలేను అనే ఆలోచన నుంచి ఏదైనా చేయగలిగేలా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక నా జీవితమే మారిపోయింది అని రాసుకొచ్చింది. అప్పటినుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తోంది. తుడక్కం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి జూడ్ ఆంథొనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జూడ్ ఆంథొని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంథొనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Vismaya Mohanlal (@mayamohanlal) చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
ఒకే ఒక పెద్ద సినిమా.. టాలీవుడ్కి ఏమైంది?
టాలీవుడ్లో మొన్నటి వరకు పోటీ లేకుండా సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఒకేవారం పెద్ద సినిమాతో పాటు మూడు, నాలుగు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అయ్యేవి. కానీ సమ్మర్ నుంచి టాలీవుడ్లో పెద్దగా పోటీ లేకుండా సినిమాలు వస్తున్నాయి. ఇక గత నెలలో థగ్లైఫ్, కుబేర, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు వచ్చినా.. వాటి మధ్యలో కూడా వారం, వారం గ్యాప్ ఉంది. వీటితో పాటు రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక జులైలో టాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెల మొత్తంలో ఒకే ఒక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. మిగిలిన సినిమాలన్ని పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి.జులై మొదటి వారంలో తమ్ముడు చిత్రంలో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ హీరోయిన్లుగా నటించగా, లయ కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మేరకు అయినా సినిమా ఆడుతుందో లేదో జులై 4న తెలుస్తుంది. ఇక అదే రోజు సిద్ధార్థ్ నటించిన 3 బి.హెచ్.కె కూడా విడుదల కానుంది. తమ్ముడుతో పోలిస్తే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్కి వెళ్లి చూసే పరిస్థితి అయితే ఈ సినిమాకు లేదు.ఇక రెండో వారంలో అనుష్క షూటీ రిలీజ్ కావాల్సింది. కానీ అది వాయిదా పడింది. దీంతో ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సింగిల్గా బరిలోకి దిగుతున్నాడు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ జులై 11న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. మరి సింగిల్గా వస్తున్న సుహాస్.. సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.ఇక మూడో వారంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ(జులై 17) అనే చిన్న సినిమాతో పాటు జూనియర్(జులై 18 అనే కన్నడ-తెలుగు సినిమా కూడా ఇక్కడ విడుదల కాబోతుంది. గాలి జనార్థన్రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా నటిస్తున్న జూనియర్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం, హీరోయిన్గా శ్రీలీల నటించడం, మరో కీలక పాత్రలో జెనీలియా కనిపించడంతో జూనియర్పై టాలీవుడ్లో మంచి హైప్ క్రియేట్ అయింది.ఇక చివరి వారంలో (జూలై 24) హరిహరి వీరమల్లు రాబోతుంది. ఈ నెలలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఇదే. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎంఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాలో నిధి అగర్వాల హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిది. -
ఆ హక్కు ఆయనది మాత్రమే.. దలైలామా వారసుడి ఎంపికపై భారత్ స్పందన
దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు ధర్మశాల ముస్తాబయ్యింది. మెక్లియోడ్గంజ్లోని ప్రధాన ఆలయమైన సుగ్లగ్ఖాంగ్లో వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారత ప్రభుత్వం తరఫున హాజరు కాబోతున్నారు. తాజాగా.. దలైలామా వారసత్వం ఎంపికపై చర్చ నడుస్తుండడంతో ఆయన స్పందించారు. న్యూఢిల్లీ: తన వారసుడి ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు గురువారం ప్రకటించారు. టిబెట్ను గుప్పిట పెట్టుకోవడానికి తమ అదుపులో ఉండే వ్యక్తిని దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దలైలామాదే అంతిమ నిర్ణయమని కిరణ్ రిజిజు అన్నారు. ‘‘15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుంది. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది’’ అని కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కొత్త దలైలామాను తామే ఎన్నుకుంటామంటూ చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దలైలామా ఎంపిక 600 సంవత్సరాలుగా బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతోందని, తాను ఏర్పాటు చేసిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ తదుపరి దలైలామా ఎంపిక ప్రక్రియను చేపడుతుందని, ఇందులో ఎవరి జోక్యం ఉండబోదని కుండబద్ధలు కొట్టారు. దలైలామా తన వారసుడు చైనా వెలుపల జన్మించాలని, బీజింగ్ నుంచి ఎంపిక చేసిన వ్యక్తిని ఎవరినైనా తిరస్కరించాలని ఆయన సూచించారు. అయితే చైనా 14వ దలైలామా ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టిబెట్ చైనాకి చెందిన భూమిగా పేర్కొంటూ.. దలైలామా ఎంపికపై తమకే హక్కు ఉందని డ్రాగన్ వాదిస్తోంది. దలైలామా, పాంచెన్ లామా, ఇతర ప్రముఖ బౌద్ధ గురువుల ఎంపిక తప్పనిసరిగా 'గోల్డెన్ అర్న్' పద్ధతిలో.. అదీ చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ పద్ధతి 18వ శతాబ్దంలో చింగ్ వంశాధిపతి ప్రవేశపెట్టిన విధానమని పేర్కొన్న ఆమె.. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, అలాగని మత సంబంధిత వ్యవహారాలపై నియంత్రణలు, బౌద్ధ గురువుల నియామకాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి అని ఆమె గుర్తు చేశారు.దలైలామా (Dalai Lama) వారసుడి (successor) ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా (China) డిమాండ్పై అమెరికా ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఆ దేశ పార్లమెంట్లో ఓ ప్రత్యేక చట్టాన్ని కూడా చేసింది. వారసత్వంలో జోక్యం చేసుకోవడం మానేయాలని, మత స్వేచ్ఛను గౌరవించాలని చైనాను కోరుతూనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తాజాగా తెలిపారు. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. 14వ దలైలామా ఎంపిక తర్వాత.. టిబెటన్ సంప్రదాయంలో.. ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి ఆత్మ అతని మరణం తర్వాత ఒక చిన్నారి శరీరంలోకి ప్రవేశించి.. పునర్జన్మ పొందుతుందని నమ్ముతారు. జూలై 6, 1935న టిబెట్ క్వింఘై ప్రావిన్స్లోని ఒక రైతు కుటుంబంలో జన్మించిన టెన్జిన్ గ్యాట్సోను.. రెండేళ్ల వయసులో 14వ దలైలామా గుర్తించారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా దళాలు టిబెట్ను ఆక్రమించుకున్నాయి. 1959లో టిబెట్ ధైవభూమి లాసాలో తిరుగుబాటు విఫలం తర్వాత వెయ్యి మందికిపైగా బౌద్ధ సన్యాసులతో దలైలామా భారత్కు శరణార్ధిగా వచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. -
ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు
ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత్ ఎంచుకున్న తుదిజట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కీలక మ్యాచ్లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినివ్వడంతో పాటు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.తప్పని ఓటమిలీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఐదు శతకాలు సాధించినా.. లోయర్ ఆర్డర్, బౌలర్లు, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా పరాభవం తప్పలేదు. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో గిల్ సేన 0-1తో వెనుకబడింది. అయితే, రెండో టెస్టులోనైనా పొరపాట్లు సరిచేసుకుంటుందని భావిస్తే.. తుదిజట్టు కూర్పే సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి.తొలి టెస్టులో ఆడిన బుమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్లను ఎడ్జ్బాస్టన్ టెస్టుకు తీసుకుంది.ఇద్దరు బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘‘ఈ మ్యాచ్లో టీమిండియా తమ ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లతో ఆడుతుందని నాకు అనిపించడం లేదు. ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది.టీమిండియాకు ఇదే మంచి అవకాశం. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే సానుకూల ఫలితం రాబట్టగలము’’ అని పేర్కొన్నాడు ఇక భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ మాత్రం మేనేజ్మెంట్ తీరుపై ఘాటు విమర్శలు చేశాడు. ‘‘కుల్దీప్ యాదవ్ను తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎడ్జ్బాస్టన్ లాంటి పిచ్పై బంతి కాస్త టర్న్ అవుతుందనీ తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.గిల్పై గావస్కర్ ఆగ్రహం!అంతేకాదు.. బ్యాటింగ్లో డెప్త్ కోసం ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లను తీసుకున్నామన్న కెప్టెన్ శుబ్మన్ గిల్ సమర్థనను కూడా గావస్కర్ తప్పుబట్టాడు. ‘‘మీ జట్టులోని టాపార్డర్ విఫలమవుతుంటే.. వాషింగ్టన్ ఏడో స్థానంలో వచ్చి.. నితీశ్ రెడ్డి ఎనిమిదో స్థానంలో వచ్చి ఏం చేయగలరు?వాళ్లేమీ తొలి టెస్టులో విఫలమైన బ్యాటర్ల మాదిరి కాదు కదా!.. మీరు మొత్తంగా 830కి పైగా పరుగులు చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్లో కనీసం 380 స్కోరు చేయలేక ప్రత్యర్థికి అవకాశం ఇచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేస్తున్నామని చెప్పడం కాదు.. వికెట్లు తీసే బౌలింగ్ విభాగాన్ని ఎంచుకోండి’’ అని గావస్క కెప్టెన్ గిల్, హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఇంగ్లండ్తో బుధవారం మొదలైన ఎడ్జ్బాస్టన్ టెస్టులో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు ఆడుతున్నారు. వీరిలో ఒకరికి బదులు స్పెషలిస్టు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేయాల్సిందని గావస్కర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87), కెప్టెన్ శుబ్మన్ గిల్ (114 నాటౌట్)లతో పాటు రవీంద్ర జడేజా (41 నాటౌట్) రాణించాడు.ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్ -
ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర.. 51 ఏళ్ల రికార్డు బద్దలు
ఇంగ్లండ్ టూర్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. వన్డే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను యశస్వి ఉతికారేశాడు.తన మెరుపు బ్యాటింగ్తో భారత్కు ఘనమైన ఆరంభాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్లో 107 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.51 ఏళ్ల రికార్డు బద్దలుఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఓపెనర్గా జైశ్వాల్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్ పేరిట ఉండేది. సుదీర్ నాయక్ 1974లో ఇదే మైదానంలో 77 పరుగులు చేశారు.ఇప్పుడు తాజా మ్యాచ్తో నాయక్ పేరిట ఉన్న 51 ఏళ్ల రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. జైశ్వాల్, సుదీర్ తర్వాతి స్ధానాల్లో సునీల్ గవాస్కర్ (68), చేతేశ్వర్ పుజారా (66), చేతన్ చౌహాన్ (56) వంటి భారత ఓపెనర్లు ఉన్నారు.సునీల్ గవాస్కర్ రికార్డుపై కన్ను..భారత టెస్టు జట్టులో యశస్వి కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2023లో టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ బ్యాటింగ్లో రాణిస్తూ వస్తున్నాడు. కేవలం 21 టెస్ట్ మ్యాచ్ల్లోనే యశస్వి.. ఐదు సెంచరీలు, పన్నెండు అర్ధ సెంచరీలతో సహా 1,990 పరుగులు చేశాడు.ఈ ముంబై ఆటగాడు టెస్ట్ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండవ ఇన్నింగ్స్లో అతడు 10 పరుగులు సాధిస్తే.. టెస్టుల్లో అత్యంతవేగంగా రెండు వేల పరుగులు చేసిన భారత ఆటగాడిగా గవాస్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు.సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ను తన 23వ టెస్ట్లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు.చదవండి: SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు -
బాబు.. సెక్యూరిటీ లేకుండా వెళ్లండి.. ప్రజలే చెబుతారు: పెద్దిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రజల్ని మోసం చేసి సుపరిపాలన అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని అన్నారు. అలాగే, బనకచర్లపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఏడాది పాటు ప్రజలను ఎలా మోసం చేశాడో మనం ప్రజలకు వివరించాలి. ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టారు. రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం ఎత్తివేశారు.. రెండు రూపాయల కిలో బియ్యం ఆపేసి ప్రజలను మోసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తరహాలో ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారు. 2014లో కూడా మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేశారు. 2024లో మరోసారి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. గ్రామాల్లో తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మనం వివరించాలి. బాబు ష్యూరీటీ మోసం గ్యారంటీ అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించాలి.బనకచర్ల ప్రాజెక్ట్ పై గురు శిష్యులు దోబూచులాడుతున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకరిపై మరొకరు పెట్టుకొని బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి తెర లేపారు. బాబుకు బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆలోచన లేదు. అందుకే వాటిని వివాదాస్పదం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలి. ఒక్క సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పుడు సుపరిపాలనా అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గు చేటు. సంక్షేమ పథకాలను ఏడాది విస్మరించిన చంద్రబాబు సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం ఏంటి?.రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక ఆయన హయాంలోని సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కారు. హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. మోసపురిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు చేసినా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. ప్రతీదీ అబద్దాలు చెప్పడం మోసపురిత వాగ్దానాలను చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..త్రికరణశుద్ధితో సంక్షేమ పథకాలు కులాలు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత జగన్కే దక్కింది. ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. తల్లికి వందనంలో సాంకేతిక కారణాల పేరిట దగా చేశారు. పోలీసుల పహారా మధ్య ఇంటింటికి.. సెక్యూరిటీ లేకుండా వెళ్ళితే ప్రజలు చొక్కా పట్టుకుంటారు. సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలే చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
జనసేనకు షాక్.. వైఎస్సార్సీపీలోకి దేవమణి
ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు యేశపోగు దేవమణి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి సుబ్బారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో జెడ్పీటీసీ సభ్యురాలు దేవమణి శ్రీనివాస్ వైఎస్సార్ సీపీ తరుపున ఎన్నికయ్యారు. తరువాత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి జనసేనలో చేరారు. జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చక తిరిగి సొంతగూటికి వచ్చారు. ఈ సందర్భంగా సుబ్బా రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విలువ ఇప్పుడు పేద ప్రజలకు తెలుస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధికి మారుపేరన్నారు. రానున్న కాలంలో పార్టీనుండి వెళ్లిన అందరూ తిరిగి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, వత్సవాయి ఎంపీపీ కొలుసు రమాదేవి పాల్గొన్నారు. -
భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలు
భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్ గ్లోబల్ హబ్గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.గత రెండు నెలల్లో భారత్లో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్కాన్ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్ ఎగుమతులకు చెక్ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.అసలేం జరిగిందంటే..యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్ ఐఫోన్ 17ను లాంచ్ చేయనుంది. ఈమేరకు భారత్లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్కాన్పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్ సైట్ల్లో ఉంచుతుంది.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే హెల్ప్ అయ్యే 'జీరో కేలరీ ఫుడ్స్' ఇవే..
బరువు తగ్గడమే సవాలుగా మారింది యువతకు. ఎందుకంటే దాదాపు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరిని బాధించే భారమైన సమస్య ఇది. అయితే ఎంతలా డైట్ పాటించినా..ఒక్కోసారి చీట్ మీల్స్ తినక తప్పదు. అలాంటప్పుడూ కడుపు నిండుగా..బరువు పెరగకుండా ఉండే కొన్ని రకాలా ఆహారాలు ట్రై చేస్తే చాలంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ సామ్ ఎవెరింగ్హామ్. జస్ట్ అవి శ్రద్ధ పెట్టి తీసుకుంటే చాలట బరువు పెరిగే ప్రసక్తే లేదంటున్నారు. భోజనంలోనూ, బ్రేక్ఫాస్ట్లోనూ ఈ ఆహారాలను జోడిస్తే..హాయిగా కడుపు నిండా తిన్న అనుభూతి తోపాటు బరువు తగ్గుతారని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..!కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు మొత్తం 20 ఉన్నాయట. ఇవన్నీ జీరో కేలరీ ఆహారాలట. వీటిని డైట్లో జోడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా హెల్దీగా కూడా ఉంటామని నమ్మకంగా చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సామ్. మరి అవేంటొ చూసేద్దామా..పూల్మఖానా – 100 గ్రాములకు 15 కిలో కేలరీలుస్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు 32 కిలో కేలరీలుపుట్టగొడుగులు – 100 గ్రాములకు 22 కిలో కేలరీలుబ్రోకలీ – 100 గ్రాములకు 34 కిలో కేలరీలుక్యారెట్లు – 100 గ్రాములకు 41 కిలో కేలరీలుటమోటాలు – 100 గ్రాములకు 18 కిలో కేలరీలుకీరదోసకాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలుకాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుక్యాప్సికం – 100 గ్రాములకు 31 కిలో కేలరీలుపైనాపిల్ – 100 గ్రాములకు 50 కిలో కేలరీలుయాపిల్స్ – 100 గ్రాములకు 52 కిలో కేలరీలుఊరబెట్టిన దోసకాయలు (గెర్కిన్స్) – 100 గ్రాములకు 12 కిలో కేలరీలుకొత్తిమీర– 100 గ్రాములకు 14 కిలో కేలరీలుఉల్లిపాయలు – 100 గ్రాములకు 40 కిలో కేలరీలునిమ్మకాయ/నిమ్మకాయ – 100 గ్రాములకు 29 కిలో కేలరీలుపాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలుకాలే(క్యాబేజీ జాతికి చెందిన కూరగాయ) – 100 గ్రాములకు 35 కిలో కేలరీలుక్యాబేజీ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుప్రయోజనాలు..వీటిలో ఎక్కువగా నీరు, పైబర్ని ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడం సులభం అవ్వడమే కాదు అదుపులో పెట్టొచ్చు. ఇవి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అతిగా తినడం నివారించగలుగుతాం. అదీగాక దీనిలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని నివారించి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇందులో చాలా వరకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుంటే అదనపు కేలరీల కోసం అదనంగా పోషకాలను జోడించాల్సిన అవసరం రాదు అని చెబుతున్నార ఫిట్నెస్ కోచ్ సామ్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యుల లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
‘భాగస్వామ్యమే కాదు.. సహ ప్రయాణం’.. ఘనాలో ప్రధాని మోదీ
అక్రా: ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, సహ ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తరువాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి ప్రకటన చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇరు దేశాలు ద్విమార్గ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని, భారత్.. ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా అభివృద్ధి ప్రయాణంలో సహ ప్రయాణం చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయన్నారు. రాబోయే ఐదేళ్లలో పరస్పర వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. I thank the people and Government of Ghana for conferring ‘The Officer of the Order of the Star of Ghana’ upon me. This honour is dedicated to the bright future of our youth, their aspirations, our rich cultural diversity and the historical ties between India and Ghana.This… pic.twitter.com/coqwU04RZi— Narendra Modi (@narendramodi) July 2, 2025ఫిన్టెక్ రంగంలో, భారతదేశం ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. రక్షణ, భద్రతా రంగంలో తాము సంఘీభావం ద్వారా భద్రత అనే సూత్రంతో ముందుకు సాగుతామన్నారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా సంస్కృతి, సాంప్రదాయ వైద్యంతోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా? -
SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు
29 పరుగుల వద్ద తొలి వికెట్... సరిగ్గా 100 పరుగులు పూర్తి చేసిన తర్వాత రెండో వికెట్.. మరో రెండు పరుగులు జతచేసి రెండు వికెట్లు (102/4).. ఆ తర్వాత వైడ్ రూపంలో ఒక పరుగు అంటే అప్పటికి స్కోరు 103/4.. అదే స్కోరు వద్ద ఐదో వికెట్ కూడా డౌన్.. ఒక్క పరుగు జతచేర్చిన వెంటనే ఆరో వికెట్ కూడా పడింది (104/6)..మళ్లీ ఆలస్యం చేయకూడదు అనుకున్నారేమో బ్యాటర్లు.. అదే స్కోరు వద్ద ఏడో వికెట్ కూడా డౌన్.. వైడ్ రూపంలో మరో పరుగు రాగానే ఎనిమిదో వికెట్ కూడా పడిపోయింది.. అప్పటికి స్కోరు 105/8.. మరో పందొమ్మిది పరుగులు రాగానే తొమ్మిదో వికెట్ కూడా పడింది.. 167 పరుగులకు ఆలౌట్..ఐదు పరుగులు, ఏడు వికెట్లుశ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిన విధానం ఇది.. 100-1తో పటిష్టంగా కనిపించిన బంగ్లా.. కేవలం ఐదు పరుగుల వ్యవధిలోనే మరో ఏడు వికెట్లు కోల్పోయింది. తమ స్కోరుకు కేవలం ఐదు పరుగులు జతచేసి ఏడు వికెట్ల నష్టాన్ని చవిచూసింది. లంక బౌలర్ల ధాటికి తాళలేక 167 పరుగులకే కుప్పకూలి.. 77 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ మేరకు బంగ్లాదేశ్కు చుక్కలు చూపించిన శ్రీలంక ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్ చరిత్రలో.. అత్యధికసార్లు ప్రత్యర్థి జట్టు మీద ఏడు లేదా అంతకంటే తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన తొలి జట్టుగా లంక నిలిచింది. లంక ఇలా ప్రత్యర్థిని కుదేలు చేయడం ఇది మూడోసారి.2008లో జింబాబ్వే మీద మూడు పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన లంక.. 2024లో అఫ్గనిస్తాన్ మీద. ఏడు పరుగుల వ్యవధిలో ఈ ఘనత సాధించింది. తాజాగా బంగ్లాదేశ్ మీద ఐదు పరుగుల వ్యవధిలో ఈ ఫీట్ నమోదు చేసింది.వన్డే క్రికెట్ చరిత్రలో తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన జట్లు🏏శ్రీలంక- 2008లో హరారే వేదికగా- జింబాబ్వేను 124-3 నుంచి 127-10కి పడగొట్టింది.🏏శ్రీలంక- 2025లో కొలంబో వేదికగా- బంగ్లాదేశ్ను 100-1 నుంచి 105-8కు పడగొట్టింది.🏏వెస్టిండీస్- 1986లో షార్జా వేదికగా- శ్రీలంకను 45-2 నుంచి 51-9కు పడగొట్టింది.🏏శ్రీలంక- 2024లో పల్లెకెలె వేదికగా- అఫ్గనిస్తాన్ను 146-3 నుంచి 153-10కు పడగొట్టింది.🏏నేపాల్- 2020లో కీర్తిపూర్ వేదికగా- యూఎస్ఏను 27-2 నుంచి 35-9కి పడగొట్టింది.🏏భారత్- 2014లో మిర్పూర్ వేదికగా- బంగ్లాదేశ్ను 50-3 నుంచి 58-10కు పడగొట్టింది.వన్డేల్లోనూ శుభారంభంసొంతగడ్డపై బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు... వన్డేల్లోనూ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చరిత అసలంక (123 బంతుల్లో 106; 6 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (43 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.టెస్టు సిరీస్లో దంచికొట్టిన పాథుమ్ నిసాంక (0), నిశాన్ మధుషనక (6), కమిందు మెండిస్ (0) ఈసారి విఫలమయ్యారు. జనిత్ లియాంగె (29), మిలాన్ రత్ననాయకె (22), వనిందు హసరంగ (22) ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. తన్జీద్ హసన్ (61 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్), జాకీర్ అలీ (64 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకాలతో పోరాడగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. లంక బౌలర్ల ధాటికి కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ (0), లిటన్ దాస్ (0), పర్వేజ్ (13), నజు్మల్ షంటో (23), తౌహిద్ హృదయ్ (1) పెవిలియన్కు వరుస కట్టారు. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. సంక్లిప్త స్కోర్లు🏏శ్రీలంక- 244 (49.2)🏏బంగ్లాదేశ్- 167 (35.5).చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగాBangladesh’s batting: now you see it, now you don’t 🎩The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025 -
సూర్య, దీపికా పదుకొణెలతో 8 వసంతాలు..: డైరెక్టర్
8 వసంతాలు (8 Vasantalu Movie).. ఇది ప్రేమ కథ కాదు, ప్రేమ కావ్యమని చెప్పొచ్చు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి దుగ్గిరాల, హనురెడ్డి, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. కవిత్వం, భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా చాలామందికి నచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు మొదట స్టార్ హీరోహీరోయిన్లను అనుకున్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సూర్య, దీపికతో..ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. 8 వసంతాలు మూవీ పెద్దవాళ్లతో చేద్దామనుకున్నాను. సూర్య, దీపికా పదుకొణెను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అందుకే డైలాగులు అంత బలంగా ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గరకు కథ తీసుకెళ్లినప్పుడు కొత్తవాళ్లతో అయితే ఇంకా బాగుండొచ్చు అన్నారు. పెద్దవాళ్లతో అంటే ఇబ్బందులు ఎదురవొచ్చేమో, కథ ఎక్కడైనా పాడవుతుందేమో.. ఒక్కసారి ఆలోచించు అన్నారు. అప్పుడు నేను ఆలోచించి కొత్తవాళ్లతో ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చారు.చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
వైఎస్ జగన్కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. -
మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025 -
డాలస్లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో "అడాప్ట్-ఎ-విలేజ్" ఘన విజయం
డాల్లస్, టెక్సాస్ - జూన్ 28 టెక్సాస్లోని ఇర్వింగ్లోని జాక్ సింగ్లీ ఆడిటోరియం లో శంకర నేత్రాలయ USA మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) చొరవకు మద్దతుగా మ్యూజిక్ & డ్యాన్స్ ఫర్ విజన్ అనే దాతృత్వ వేడుకను ఘనంగా నిర్వహించారు. 400 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతో సమాజం, కళ ,సేవా శక్తిని ప్రదర్శించింది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, "కరుణ సమాజాన్ని కలిసినప్పుడు మనం ఏమి సాధించగలమో ఈ కార్యక్రమం నిదర్శనం" అని పాలకమండలి సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి అన్నారు. "MESU చొరవ కేవలం మొబైల్ సర్జరీ గురించి కాదు - ఇది ఆశను సమీకరించడం గురించి" అని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి వ్యాఖ్యానించారు.ఒక చిరస్మరణీయ సాయంత్రానికి హృదయపూర్వక ప్రారంభంప్రతిభావంతులైన గాయకులు,వాయిద్యకారులు ప్రదర్శించిన భక్తి మరియు శాస్త్రీయ కూర్పుల శ్రేణి ప్రేక్షకులను కదిలించాయి. - జానకి శంకర్, సంతోష్ ఖమ్మంకర్, ప్రభాకర్ కోట, భారతి అంగలకుదిటి , కామేశ్వరి చరణ్ తమగానంతో ఆకట్టుకున్నారు. రవి తుపురాని సజావుగా సమన్వయం చేసిన వారి కళాత్మకత ప్రశంసలను పొందింది. నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్, కూచిపూడి కళాక్షేత్రం, అభినయ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, తత్యా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, నాట్యోం డ్యాన్స్ అకాడమీ, తాండవం స్కూల్ ఆఫ్ కూచిపూడి, రాగలీన డ్యాన్స్ అకాడెమీ నృత్య ప్రదర్శనలతో సహా డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని డాన్స్ అకాడమీలు - సంప్రదాయం, కథనాల్లో పాతుకుపోయిన నేపథ్య ఘట్టాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథి, మెగా దాతకు సత్కారంశంకర నేత్రాలయ USA ముఖ్య అతిథి మరియు సలహాదారుల బోర్డు సభ్యురాలు ప్రసాద రెడ్డి కాటంరెడ్డి , కరుణామయ దాత శ్రీమతి శోభా రెడ్డి కాటంరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాటంరెడ్డి కొత్త మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) స్థాపనకు 5 లక్షల డాలర్ల విలువైన స్మారక విరాళాన్ని అందించారు.ఈ అసాధారణ దాతృత్వ చర్య పేద గ్రామీణ సమాజాలలో వేలాది మందికి దృష్టిని రక్షించే శస్త్రచికిత్సలను తీసుకువస్తుంది. దృష్టి సంరక్షణ కోసం వారి అచంచల నిబద్ధతను గుర్తించి, ఈ జంటను హృదయపూర్వకంగా సత్కరించారు. నివారించదగిన అంధత్వాన్ని తొలగించే లక్ష్యంలో తమ ముఖ్య అతిథిగా , నిజమైన భాగస్వామిగా కలిగి ఉండటం చాలా గౌరవంగా ఉందని అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి కొనియాడారు.ఛాంపియన్స్ ఆఫ్ విజన్: మా అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లకు గౌరవంఅలాగే ముగ్గురు విశిష్ట సమాజ నాయకులు AVN రెడ్డి, డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ గౌరవ అతిథులుగా చాలా కాలంగా భారతీయ-అమెరికన్ సమాజంలో సాంస్కృతిక పరిరక్షణకు మార్గదర్శకులుగా ఉన్నారు. 35 MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు మరియు అనేక మంది కరుణామయ వ్యక్తిగత దాతల అచంచల మద్దతు ద్వారా 4లక్షల డాలర్లకుపైగా నిధులను సేకరించింది. ఆనంద్ దాసరి, ఉన్నత సలహాదారు, బెనిఫాక్టర్ స్పాన్సర్లు ప్రకాష్ బేడపూడి, మూర్తి రేకపల్లి, శ్రీని వీరవల్లి, కిషోర్ కంచర్ల, అరవింద్ కృష్ణస్వామి, మరియు MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, తిరుమల్ రెడ్డి కుంభం, బుచ్చిరెడ్డి గోలి, సునీత & డాక్టర్ రాజు కోసూరి, శ్రీకాంత్ బీరం, శ్రీని SV, ఆండీ ఆశావ, సతీష్ కుమార్ సేగు, డాక్టర్ కల్వకుంట్ల లక్ష్మణ్ రావు, డాక్టర్ రూపేష్ కాంతాల, అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, రావు కల్వల, అర్జున్ మాదాడి (స్వర్గీయ భాను మాదాడి జ్ఞాపకార్థం), ప్రవీణ్ బిల్లా, శివ అన్నపురెడ్డి, డాక్టర్ పవన్ పామదుర్తి, డాక్టర్ శ్రీనాధ రెడ్డి వట్టం, రమన్ రెడ్డి క్రిస్టపాటి లకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అసాధారణ దాతృత్వం దాదాపు 6,000 కంటిశుక్లం శస్త్రచికిత్సలుగా మారుతుంది - ప్రతి ఒక్కటి దృష్టి లోపంతో బాధపడుతున్న పేద వ్యక్తులకు జీవితాన్ని మార్చే బహుమతి. "ప్రతి అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ మొత్తం సమాజానికి ఆశాకిరణంగా మారారు. మీ నిబద్ధత ఆర్థిక సహాయం కంటే చాలా ఎక్కువ - ఇది వేలాది మందికి దృష్టి, గౌరవం మరియు అవకాశాన్ని పునరుద్ధరించే శక్తివంతమైన చర్య అంటూ శంకర నేత్రాలయ USA తరపున డాక్టర్ రెడ్డి ఊరిమిండి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నృత్య గురువులు, గాయకులు,కళా ప్రదర్శకులను సత్కరించారు. శంకర నేత్రాలయ USA కోశాధికారి మూర్తి రేకపల్లి, కార్యదర్శి వంశీ ఏరువారం, పాలక మండలి సభ్యులు మెహర్ చంద్ లంక, నారాయణరెడ్డి ఇందుర్తి, ఆది మొర్రెడ్డి, చంద్ర మౌళి సరస్వతి, మహిళా కమిటీ చైర్పర్సన్ రేఖ రెడ్డి, కమిటీ సభ్యులు మోహన నారాయణ్ లను పాలక మండలి సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి, డాక్టర్ ప్రవీణ వజ్జ, డల్లాస్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ చినసత్యం వీర్నపు, కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమం విజయవంతంకావడంలో కీలక పాత్ర పోషించారు. 35 మంది అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లతో పాటు, అనేక మంది వ్యక్తిగత దాతలను కూడా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా పరిమళ మార్పాక వ్యవహరించారు.మరిన్ని వివరాలకు లేదా విరాళం ఇవ్వడానికి, దయచేసి www.sankaranethralayusa.org ని సందర్శించండి లేదా (855) 463-8472 కు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి. -
చినబాబు దర్శనానికి రూ.40 లక్షలు..!
సాక్షి, అమరావతి: ముడుపులు ముట్టచెబితేనే ముఖ్యనేత, ఆయన కొడుకు అపాయింట్మెంట్లు దొరుకుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కరకట్ట క్యాంపు కార్యాలయంలో దీనిపై పెద్ద రగడే జరిగినట్లు తెలిసింది. మంత్రిగా ఉన్న చినబాబును కలిసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు గుంటూరులోని ఓ ఎల్లోమీడియా మాజీ ప్రతినిధి, మంత్రి చుట్టూ తిరిగే పీఏను సంప్రదించగా. వారిద్దరూ మరో పీఏతో కలిసి వ్యాపారవేత్తలు ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షల చొప్పున రూ.40 లక్షలు తీసుకుని అపాయిట్మెంట్ ఇప్పించారని సమాచారం.ఆ సమయానికి కరకట్ట క్యాంపునకు వెళ్లిన పారిశ్రామికవేత్తలు మంత్రి అందుబాటులో లేరని తెలుసుకుని అక్కడే పీఏలతో గొడ వకు దిగారని తెలిసింది. విషయం ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన పీఏకు కబురుపెట్టారని, ఈలోపే విషయం మంత్రికి చేరడంతో ఆయన ఆ అధికారికి ఫోన్ చేసి తన పీఏనే పిలుస్తారా? తమాషాగా ఉందా? అంటూ చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. అక్రమ వసూ ళ్లకు చినబాబే అనుమతిచ్చారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో ఆయనకూ వాటాలు న్నాయని ప్రచారం. ముఖ్య నేతను కలవాలన్నా.. డబ్బు ముట్టజెప్పాల్సిందేనని కరకట్ట క్యాంపులో చర్చ జరుగుతోంది. -
'రామాయణ' సినిమా నుంచి ఫస్ట్ వీడియో విడుదల
'రామాయణ' సినిమా నుంచి పాత్రల పేర్లను పరిచయం చేస్తూ ఒక వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రాజక్ట్ నుంచి విడుదలైన తొలి వీడియో ఇదే కావడం విశేషం. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రాముడిగా రణ్బీర్కపూర్ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఏఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 2026 దీపావళీ సందర్భంగా రామాయణ-1 విడుదల కానుంది. 2027 దీపావళీకి పార్ట్-2 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్ కేసు
ముంబయిలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రిమినల్ కేసులో బలమైన ఆధారాలేవీ లేవని, పెండింగ్ చెల్లింపులపై ఒత్తిడి తప్పా మరేమీ కాదని జగదీషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.జగదీషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆసుపత్రి ట్రస్టీలు నమోదు చేయించిన ఎఫ్ఐఆర్కు బలమైన ఆధారాలు లేవని, ఆసుపత్రి నుంచి డబ్బు రికవరీ చేయడానికి బ్యాంకు ప్రయత్నిస్తున్నందునే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని వాదించారు. ఈ కేసును బాంబే హైకోర్టులోని మూడు వేర్వేరు బెంచ్లు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ విచారించలేకపోయాయని ఆయన అన్నారు.కొద్దిసేపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ కేసును శుక్రవారంకు వాయిదా వేశారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ చీఫ్పై ఇలా ఎఫ్ఐఆర్ నమోదు కావడానికిగల కచ్చితమైన కారణాలను ఇరువర్గాలు పంచుకోలేదు. అయితే కొన్ని సంస్థలు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ట్రస్ట్ ఆరోపణలు..ట్రస్ట్ పాలనపై అనవసర నియంత్రణ కోసం జగదీషన్ మాజీ ట్రస్టీ చేతన్ మెహతా నుంచి అనధికారికంగా రూ.2.05 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా ఆయన స్వచ్ఛంద సంస్థ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ట్రస్ట్ పేర్కొంది. లీలావతి ఆస్పత్రిలో జగదీషన్, తన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించారని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ట్రస్ట్ డిపాజిట్ల కింద రూ.48 కోట్లు ఉన్నాయని చెప్పింది. -
అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లోకి పాము.. ఉలిక్కిపడిన ఆటగాళ్లు! వీడియో
కొలంబో వేదికగా తొలి వన్డేలో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ను వీక్షించడానికి అనుకోని అతిథి స్టేడియం వచ్చింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా సుమారు 6 అడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రత్యక్షమైంది. బిగ్ స్క్రీన్లో పామ్ను చూసిన అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు.ఆటగాళ్లు సైతం కాస్త గందరగోళానికి గురయ్యారు. వెంటనే మైదాన సిబ్బంది దాన్ని అక్కడినుంచి బయటకి పంపించారు. దీంతో తిరిగి మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా శ్రీలంక మైదానాల్లో సరృసృపాలు ప్రత్యక్షం కావడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది శ్రీలంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా వరుసగా రెండు మ్యాచ్లకు పాము హాజరై కలకలం రేపింది. అదేవిధంగా బంగ్లా-శ్రీలంక టెస్టు సిరీస్ సందర్భంగా పాములు పట్టుకుని స్నేక్ క్యాచర్ కూడా కెమెరాకు చిక్కాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ను 77 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక(106) సెంచరీతో మెరిశాడు.బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయసంగా గెలిపించేలా కన్పించిన బంగ్లాదేశ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్Bangladesh’s batting: now you see it, now you don’t 🎩The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025#snake #Cricket pic.twitter.com/Y5KMfE94aZ— ABHISHEK PANDEY (@anupandey29) July 3, 2025 -
రామ్దేవ్ పతంజలికి డాబర్ దెబ్బ
బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థకు ఢిల్లీ హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. డాబర్ చ్యవన్ప్రాష్(Chyawanprash)ను లక్ష్యంగా చేసుకుని పతంజలి ప్రసారం చేస్తున్న సెటైరిక్ యాడ్ను తక్షణమే నిలిపివేయాలని ఉన్నతన్యాయస్థానం గురువారం ఆదేశించింది. న్యూఢిల్లీ: చ్యవన్ప్రాష్ను తాము మాత్రమే ఆయుర్వేద గుణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నామని, డాబర్(Dabur)లాంటి కంపెనీలు సాదాసీదాగా తయరు చేసి మార్కెట్లోకి వదులుతున్నారని పతంజలి గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కంపెనీకి చెందిన పాపులర్ ప్రొడక్టుపై పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణమే ఆ ప్రచారాన్ని నిలిపివేసేలా ఆదేశించాలని డాబర్ కంపెనీ పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. తమ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించినందుకుగానూ రూ.2 కోట్ల పరిహారం పతంజలి నుంచి ఇప్పించాలని డాబర్ కోరింది. మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఉత్పత్తులు తయారు చేస్తున్నామని, ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుడు దారి పట్టించేలా ఉన్నాయంటూ పేర్కొంది. ‘‘మా(డాబర్) చ్యవన్ప్రాష్లో 40 మూలికలు ఉన్నాయని, కాబట్టి ఇది సర్వసాధారణమైందని పతంజలి ప్రచారం చేస్తోంది. అలాగే.. పతంజలి ప్రకటనల్లో తమ ఉత్పత్తిలో 51కు పైగా ఔషధ మూలికలు ఉన్నాయని చెప్పినా, వాస్తవానికి 47 మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా, పతంజలి ఉత్పత్తిలో మెర్క్యురీ వాడుతున్నారని, ఇది పిల్లలకు హానికరం’’ అని డాబర్ తన పిటిషన్లో ప్రస్తావించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జడ్జి మినీ పుష్కర్ణా యాడ్ నిలిపివేయాలని ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జులై 14వ తేదీన జరగనుంది. చ్యవన్ప్రాష్ (Chyawanprash) అనేది ఆయుర్వేద లేహ్యం. ఇది శరీరానికి బలం, రోగనిరోధక శక్తి, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వాడే ఔషధ గుణాలు కలిగిన మిశ్రమం. ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు చ్యవన్ ఋషి అనే మహర్షి ఈ లేహ్యాన్ని తయారు చేసినట్లు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. -
యజమానురాలు తిట్టిందని.. తల్లీ కుమారులపై సహాయకుని ఘాతుకం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని లజ్పత్ నగర్-Iలో ఘోరం చోటుచేసుకుంది. ఎంతో నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యజమానురాలితో పాటు, ఆమె కుమారుని గొంతు కోశాడు. యజమానురాలు తిట్టిందని, ఆగ్రహంచిన ఆ సహాయకుడు ఇంతటి దారుణానికి తెగించాడు.లజ్పత్ నగర్లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కుమారుడు వారి ఇంటి లోపల హత్యకు గురయ్యారనే వివరాలు తెలియగానే, రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంటి నుంచి పరారైన సహాయకుడు ముఖేష్(24)ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించడంతోపాటు ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. తన యజమాని రుచికా సేవ, ఆమె కుమారుడు క్రిష్ల గొంతులను కోసినట్లు నిందితుడు ముఖేష్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. #WATCH | Delhi's Double murder case | The bodies of a woman, Ruchika (42) and her son, Krish (14) were found at their residence in the Lajpat Nagar-1 area. The suspect house help has been apprehended. Further investigation underway: Delhi Police(Visuals from the spot) pic.twitter.com/bI338FWx1N— ANI (@ANI) July 3, 2025రుచిక భర్త కుల్దీప్ రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆయనకు మెట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్న తలుపును బలవంతంగా తెరిచారు. అక్కడ వారు రుచిక మృతదేహాన్ని బెడ్రూమ్లో, క్రిష్ మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించారు. ఇద్దరికీ మెడపై కత్తితో చేసిన గాయాలన్నాయి. ఈ ఘటనకు వారింటిలో పనిచేసే ముఖేష్ కారణమని భావించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ముఖేష్ తనను యజమానురాలు రుచిక తిట్టిందునే ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా? -
బతికి వస్తేనే మాకు బతుకు
అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిలి్చన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. సంగారెడ్డి: కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్డెస్క్కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.క్యాంపులో బిక్కుమంటూ..బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్డెస్్కలో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దేవుడా కనికరించు దేవుడా ఒక్కసారి కనికరించు... నా భర్తను క్షేమంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపు. గత జూలై 16న ధర్మరాజ్తో వివాహం జరిగింది. ఎనిమిది నెలల క్రితం నేను ఆయనతో కలిసి వచ్చి గృహిణీగా ఉంటున్నాను. సంవత్సరం తిరగక ముందే దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు. సిగాచి పేలుడులో నా భర్త గాయాలపాలయ్యాడు. ఐజీయూలో ఉన్న ఆయన ప్రాణాలతో తిరిగి రావాలని భగవంతుడిని కోరుకుంటున్న. – కశ్మీరా కుమారీ, బీహర్ నా భర్త రాజేష్ కుమార్ చౌదరీ సిగాచిలో లేబర్గా పని చేస్తున్నాడు. పొట్టచేత పట్టుకొని నగరానికి వలస వచ్చాం. అనుకోని ప్రమాదంలో నా భర్త తీవ్రంగా గాయపడటంతో ఎమి చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఐదుగురు ఆడపిల్లలు ఉండగా ఇప్పటికే ఇద్దరి పెళ్లిళ్లు చేశాం.ఆయన జీతంతోనే కుటుంబం గడుస్తోంది. ఐసీయూలో ఉన్న ఆయన బతికి తిరిగి వస్తేనే మాకు బతుకు ఉంటుంది. – సనాపతి, బీహర్ కళ్ల ముందే కకావికలం సోమవారం ఉదయం 9.30 తరువాత సిగాచిలో పేలుడు సంభవించింది. స్టోర్ అసిస్టెంట్ ఆఫీసర్గా ఉన్న నేను కంపెనీ భవనం బయట ఉన్నాను. ఒక్క సారిగా భారీ పేలుడు శబ్ధం రావడంతో ఉలిక్కి పడ్డాను అంతలోనే పెద్ధ ఎత్తున మంటలు, దట్ట మైన పొగ భవన శిథిలాలు ఎగిరి వచ్చి తగలడంతో శరీరానికి గాయాలయ్యాయి.ప్రమాదాన్ని ఊహించుకుంటే భయమేస్తుంది. మూడు రోజులుగా చికిత్స అందించగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను. –యశ్వంత్, విజయవాడ -
‘స్కామర్..’: భారతీయ టెకీపై అమెరికా సీఈవోలు ధ్వజం
అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటిభారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్లలో ఒకేసారి మూన్లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని తొలుత మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025 పరేఖ్ను బహుళ కంపెనీలలో మూన్లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు. PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు. అంతేకాదు పరేఖ్ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్ను 79 సార్లు హైర్ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.అయితే తప్పేంటి?మూన్లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్ అయ్యాడు. బెస్ట్ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్నిపుణురాలు ట్వీట్ చేశారు. -
సౌతాఫ్రికా ఆటగాడి సునామీ ఇన్నింగ్స్.. కేవలం 9 బంతుల్లోనే! వీడియో
మేజర్ లీగ్ క్రికెట్-2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో 43 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ విజయభేరి మ్రోగించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 87 పరుగుల భారీ స్కోర్ చేసింది.సూపర్ కింగ్స్ ఓపెనర్లు స్టోయినిష్(2), డార్లీ మిచెల్(6 రిటైర్డ్ హార్ట్) నిరాశపరిచినప్పటికి.. శుభమ్ రంజనే( 14 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 39 నాటౌట్), డోనోవన్ ఫెరీరా(9 బంతుల్లో 5 సిక్స్లతో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.సౌతాఫ్రికాకు చెందిన ఫెరీరా.. ఆఖరి ఓవర్ వేసిన మిచెల్ ఓవెన్ బౌలింగ్లో నాలుగు సిక్సర్లు, రెండు డబుల్స్ సాయంతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా వాషింగ్టన్ బౌలర్లలో నేట్రావల్కర్ ఓ వికెట్ సాధించాడు. అనంతరం 88 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిదిగిన వాషింగ్టన్ జట్టు నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులకే పరిమితమైంది. వాషింగ్టన్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(18) టాప్ స్కోరర్గా నిలిచాడు. కెప్టెన్ మాక్స్వెల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో బర్గర్ రెండు, అకిల్ హోసేన్, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. కాగా టెక్సాస్, వాషింగ్టన్ రెండు జట్లు ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకున్నాయి.DONOVAN FERREIRA - THE SUPERSTAR OF TEXAS SUPER KINGS.!!!- 6, 6, 6, 2, 2, 6 vs Mitchell Owen in the final over to finish 37* (9) .!!!pic.twitter.com/hbmUUZAWwC— MANU. (@IMManu_18) July 3, 2025 -
‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఆకస్మిక గుండె మరణాల పెరుగుదలకు కొవిడ్-19 వ్యాక్సిన్లతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఖండించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు అవాస్తవమని, వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపారు.‘భారత్లో అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను అత్యవసర వినియోగ ఆథరైజేషన్ ఫ్రేమ్వర్క్ కింద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన ప్రోటోకాల్స్ను అనుసరించి ఆమోదించారు. ఈ వ్యాక్సిన్లు హడావుడిగా ఆమోదించారని తెలపడం సరికాదు. ఇది ప్రజల్లో తప్పుడు సమాచారానికి దోహదం చేస్తుంది. ఈ వ్యాక్సిన్లు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే చాలా తక్కువ సంఖ్యలో కొందరిలో దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. నిందలు మోపడం కంటే వ్యాక్సిన్ల అభివృద్ధి వెనుక ఉన్న సైన్స్, డేటా-ఆధారిత ప్రక్రియలను గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాశారు.కమిటీ ఏర్పాటు..హసన్ జిల్లాలో గత నెలలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. పిల్లలు, యువకులు, అమాయకుల మరణాలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాల ఆందోళనలను తాము పంచుకుంటామని సిద్ధరామయ్య సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా ఆమోదించి ప్రజలకు పంపిణీ చేయడం కూడా ఈ మరణాలకు ఒక కారణం కావొచ్చని చెప్పారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సూచించాయని తెలిపారు.భాజపా రాజకీయ లబ్ధి కోసం..కర్ణాటక వ్యాప్తంగా యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కొవిడ్-19 వ్యాక్సిన్లతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను అధ్యయనం చేసే బాధ్యతను ఫిబ్రవరిలో ఇదే నిపుణుల కమిటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. గుండె సంబంధ వ్యాధిగ్రస్తులపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యలను భాజపా నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు.COVID-19 vaccines developed in India were approved under the Emergency Use Authorisation framework, following rigorous protocols aligned with global standards for safety and efficacy. To suggest that these vaccines were ‘hastily’ approved is factually incorrect and contributes to… https://t.co/uMEcMXzBV0— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 3, 2025ఇదీ చదవండి: ‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు: కేంద్రంసిద్ధరామయ్య వాదనలకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని అత్యున్నత ప్రజారోగ్య పరిశోధనా సంస్థలకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్లకు, హసన్ జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) సంయుక్త వివరణలో ప్రస్తుత విశ్లేషణలు కొవిడ్కు ముందు, కొవిడ్ అనంతరం సంభవించిన గుండె సంబంధిత మరణాల మధ్య పెద్ద తేడాలు గుర్తించలేదని తెలిపాయి. -
సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి
సినిమా అవకాశాల కోసం వెళ్తే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో! అయితే సినిమాలే కాదని ఓటీటీలో ఛాన్సులు కావాలంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెప్తున్నారు నటి హెల్లీ షా (Helly Shah). తనకు ఓ వెబ్ సిరీస్లో ఆఫర్ వచ్చిందట.. కానీ వాళ్లు చెప్పిన కండీషన్కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట! ఈ విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఓ మెసేజ్ వచ్చింది. కండీషన్కు ఒప్పుకుంటే..అది చూడగానే.. నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాం అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ అంతలోనే.. ఓ కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను.ఆన్లైన్లో అయినా ఓకేఅప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్లోనే నేను చెప్పింది చేయండి. ఆన్లైన్లో అయినా నాకేం పర్లేదని బదులిచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్లిస్ట్లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు.సీరియల్స్- సినిమాహెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇకపోతే హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిష్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్లలోనూ మెరిశారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
తప్పుడు కేసులు పెట్టినోళ్లు శిక్ష అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: మద్యం కుంభకోణం కేసు నిందితులను మూడో రోజు సిట్ తమ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలో.. విజయవాడ జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేశ్ నాయుడ్ని తొలుత జీజీహెచ్కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. జైలు నుంచి తరలించే సమయంలో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టిన వారు ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు అని చెవిరెడ్డి అన్నారు. ఆ సమయంలో మీడియా కాస్త దూరంలో ఉండగా.. చెవిరెడ్డిని మాట్లాడనీయకుండా పోలీసులు దురుసుగా నెడుతూ వాహనంలోకి తరలించారు. ఇదీ చదవండి: వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది! -
ఈసీతో వైఎస్సార్సీపీ నేతల భేటీ.. చివరి గంటలో పోలింగ్ శాతంపై చర్చ..
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ సందర్భంగా గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ అంశాలపై వివరణ ఇచ్చేందకు వైఎస్సార్సీపీని ఈసీ ఆహ్వానించింది. దీంతో, ఈసీ దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన్న చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లింది. అనంతరం, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించాం. గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతంపై వివరణ కోరాం. కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని ఆహ్వానించింది. ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి తదితరంశాలపై చర్చలు జరిగాయి. 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్లను పోల్చి చూడాలని చెప్పాం. ఈవీఎంలలో బ్యాటరీలపైన కూడా సందేహాలు ఉన్నాయి. ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగింది. ఆరు తర్వాత జరిగిన పోలింగ్లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయి. దీనిపై ఎంక్వైరీ చేయాలి.విజయనగరం పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ కంపారిజన్ చేయమని కోరాము. కానీ, వీవీప్యాట్ల కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పింది. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేదు. అందుకే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి. రాయచోటిలో ఓటర్ల సంఖ్య చాలా పెరిగింది. బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరాము. దానికి ఈసీ ఒప్పుకుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం 38వ పోలింగ్ బూత్లో అసెంబ్లీ, పార్లమెంట్కు భిన్నమైన పోలింగ్ నమోదు అయ్యింది. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరగాలి’ అని చెప్పుకొచ్చారు. -
ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా.. చావ మంటారా!
జగదేవ్పూర్(గజ్వేల్): ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ పేద కుటుంబం పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపింది. ఈ ఘటన మండలంలోని చాట్లపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి 19 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. బుధవారం గ్రామ కార్యదర్శి సాయిబాబాతోపాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోసేందుకు వెళ్లారు. గ్రామానికి చెందిన స్వప్న రమేష్ దంపతులు తమది పేద కుటుంబమని, అన్ని అర్హతలు ఉన్నా.. మొదటి విడతలో ఇల్లు రాలేదని తెలిపారు. తమ పేరు ఎందుకు రాయలేదని అక్కడికి వచ్చిన అధికారులు, కమిటీ సభ్యులను నిలదీశారు. ఇల్లు మంజూరు చేయకుంటే ఇక్కడే పురుగుల మందు తాగుతామని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో దంపతులిద్దరూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దంపతులను సముదాయించారు. అనంతరం ఎంపీడీఓ రాంరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రెండో విడతలో ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు. -
సినిమానే వదిలేస్తా కానీ..తెరపై ఆ పని చేయలేను : రష్మిక
రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఈ పేరు ఇప్పుడు కుర్రకారుకు తారక మంత్రంగా మారింది. కన్నడంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ భామ ఇప్పుడు జాతీయ స్థాయి క్రష్ హీరోయిన్గా మారారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా పయనాన్ని మొదలెట్టినా, ఈమెను క్రేజీ హీరోయిన్ను చేసింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమనే అనేది ఎవరూ కాదనలేని నిజం. అక్కడ ఛలో చిత్రంతో కెరీర్ను ప్రారంభించి ఇటీవల విడుదలయిన కుబేర వరకూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. అదే విధంగా తమిళంలోనూ సుల్తాన్, వారిసు చిత్రాల్లో మెరిశారు. ఇకపోతే గుడ్బై అంటూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా అక్కడ తొలి చిత్రం యావరేజ్ అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన యానిమల్ చిత్రం సూపర్హిట్ అయ్యింది. రణ్బీర్ కపూర్కు జంటగా నటించిన యానిమల్ చిత్రం గత 2023 డిశంబర్ నెలలో తెరపైకి వచ్చి రక రకాల విమర్శనలను ఎదుర్కొంది.ముఖ్యంగా నటుడు రణ్బీర్ కపూర్ పాత్రపై మాత్రం ఘోరంగా విమర్శలు ట్రోల్ అయ్యాయి. ఆయన ఎక్కువగా సిగరెట్స్ కాల్చే సన్నివేశాలపై తీవ్ర విమర్శలు దొర్లాయి. అయితే వసూళ్లను మాత్రం రికార్డు స్థాయిలో రాబట్టుకుంది. దీని గురించి ఇటీవల ఒక భేటీలో స్పందించిన నటి రష్మిక మందన్నా తాను ఆ చిత్రాన్ని చిత్రంగానే చూశానన్నారు. చిత్రంలో హీరో సిగరెట్టు తాగితే అది ఇతరులను సిగరెట్లు తాగే విధంగా ప్రేరేపిస్తున్నాయి అని అంటున్నారని, సమాజంలో ప్రజలు సిగరెట్స్ తాగడం అనేది సర్వ సాధారణం అని పేర్కొన్నారు. అయితే తాను మాత్రం సినిమాల్లో కూడా సిగరెట్స్ తాగే విధంగా నటించనని చెప్పారు. ఒకవేళ అలాంటి పాత్రలు వస్తే.. సినిమానే వదిలేస్తానని అన్నారు. ఇకపోతే చిత్రాన్ని చిత్రంగానే చూడమని, ఇతరులను చిత్రం చూడమని ఎవరినీ చిత్రం చూడమని వత్తిడి చేయడం లేదని అన్నారు. ఇక్కొక్కరికి ఒక్కో చెడ్డ అలవాటు ఉంటుందని దాన్ని యానిమల్ చిత్రంలో దర్శకుడు చూపించారు అంతే అని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. అయితే చిత్రం విడుదలై ఏడాదిన్నర పైగా అయినా యానిమల్ చిత్రం విమర్శల నుంచి తప్పించుకోలేకపోతోంది. -
ఆ టీచర్ కోసం యావత్తు గ్రామమే కన్నీళ్లు పెట్టుకుంది!
గురువు అన్న పదమే ఎంతో గౌవరనీయమైనది. ఇక ఆ స్థానాన్ని అలకంరించి.. ఎందరో విద్యార్థులను మేధావులగా తీర్చిదిద్దే వాళ్ల సేవ అజరామరం. అలాంటి వ్యక్తులు బదిలీ నిమిత్తం లేదా వ్యక్తిగత కారణాల రీత్యా దూరంగా వెళ్లిపోతున్నారంటే ఏదో కోల్పుతున్నంత బాధ కలగడం సహజం. అలా విద్యార్థుల ప్రేమను పొందిన ఉపాధ్యాయులెందరో ఉన్నారు. కానీ ఇక్కడ అనుకోకుండా బదిలిపై వెళ్తుతన్న ఓ మహిళా టీచర్కి విద్యార్థుల తోపాటు యావత్తు గ్రామం కన్నీటి వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకెళ్తే..బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక చిన్న గ్రామంలోని ఆదర్శ విద్యాలయంలో రేఖ అనే టీచర్ 22 ఏళ్లుగా టీచర్ పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థులను మంచి విద్యను బోధించడమే గాక ఆ గ్రామంలోని గ్రామస్తులుకు విద్య ప్రాముఖ్యత అవగాహన కల్పించేవారామె. గత 22 ఏళ్లుగా ఆ గ్రామంలో తన బోధన సేవతో గ్రామస్తులు, విద్యార్థుల మదిలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. అలాంటి ఆమె ఇప్పుడు బదిలిపై స్కూల్ని వీడక తప్పని పరిస్థితి. అయితే ఆమె లాస్ట్ వర్కింగ్ డే రోజున విద్యార్థుల తోపాటు పెద్ద ఎత్తున్న గ్రామస్తులు కూడా వచ్చి కన్నటి సంద్రంతో భారంగా వీడ్కోలు పలికారు. అంతేగాదు ఆ రోజు ఫంగ్షన్ ఏర్పాటు చేసి..గ్రామస్తులంతా ఆమె సేవలను కొనియాడుతూ సన్మానించడం కూడా జరిగింది. అలాగే విద్యార్థులు కూడా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గురించి షేర్ చేసుకున్నారు. ఇక వీడ్కోలు సమయానికి అంత ఆమె చుట్టుచేరి ఐ మిస్ యూ రేఖ మేడమ అంటూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. మొత్తం గామ్రమే ఆమె వెళ్లిపోతుంటే కన్నీటి సంద్రంలో మునిగిపోయి నిట్టూర్చింది. ఆ ఘటన మొత్తం కంటెంట్ క్రియేటర్ రీకార్డ్ చేసి పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. అది చూసిన నెటిజన్లు ఫేమస్ అవ్వాలంటే సోషల్ మీడియా అవసరం లేదు మన సేవాతత్పరత మనల్ని అందరికి చేరవయ్యేలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుపెడుతుందంటూ సదరు టీచర్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్కి సై) -
'హరి హర వీరమల్లు' ట్రైలర్ ఎట్టకేలకు విడుదల
పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన 'హరి హర వీరమల్లు'( Hari Hara Veera Mallu) మూవీ ట్రైలర్ వచ్చేసింది. సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన 'వీరమల్లు' ఎట్టకేలకు వచ్చేశాడు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు 5ఏళ్లకు పైగా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. దీంతో బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయిందని నిర్మాత ఎ.ఎం రత్నం చెప్పారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో జులై 24న విడుదల కానుంది. -
అందుకే ట్రంప్ నన్ను టార్గెట్ చేశారు
ట్రంప్-మామ్దానీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మమ్దానీని అరెస్ట్ చేయాలని, ఆయన్ని దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలపై మమ్దానీ ఘాటుగానే స్పందించారు. వాషింగ్టన్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి భారతీయ మూలాలున్న అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ.. తనను అరెస్ట్ చేసి, దేశం నుండి పంపించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నమేనని అన్నారాయన. 33 ఏళ్ల ఈ డెమొక్రటిక్ సోషలిస్ట్ ట్రంప్పై తీవ్ర విమర్శలే గుప్పించారు. వర్కింగ్ క్లాస్ పీపుల్ను ట్రంప్ మోసం చేశారు. ఆ విషయం నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకు ఆయన తనను లక్ష్యంగా చేసుకున్నారని మమ్దానీ అన్నారు. ‘‘నిన్న ట్రంప్ నన్ను అరెస్ట్ చేయాలని, దేశం నుండి పంపించాలని, పౌరసత్వం తీసేయాలని అన్నారు. నేను ఈ నగరానికి తరాలుగా మొదటి వలసదారుడిగా, మొదటి ముస్లిం, దక్షిణాసియా మూలాలున్న మేయర్గా నిలవబోతున్నాను. ఇది నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే, నేను ఏం కోసం పోరాడుతున్నానో దాన్ని దృష్టి మళ్లించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే అని మమ్దానీ అన్నారు. రిపబ్లికన్లపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారాయన. Donald Trump is attacking me because he is desperate to distract from his war on working people. We must and we will fight back. pic.twitter.com/pKEwnijJaG— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 2, 2025న్యూయార్క్ నగర మేయర్ పదవీ రేసులో.. డెమొక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోపై జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ఆపై ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ పెద్ద కమ్యూనిస్టు పిచ్చోడని.. న్యూయార్క్ను నాశనం చేయకుండా తానే కాపాడతానని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈలోపు.. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్పై మమ్దానీ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు అమెరికన్ల ఆరోగ్యాన్ని హరించివేస్తుందని, ఆకలితో ఉన్నవారి నుంచి ఆహారాన్ని లాక్కుంటుందని, ధనవంతులకే మళ్లీ లాభాలు చేకూర్చే విధంగా ఉంది అని మమ్దానీ విమర్శించారు. -
కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?
మీరట్: ఉత్తరాదిన జూలై 11న ప్రారంభమయ్యే వార్షిక కన్వర్ యాత్ర నేపధ్యంలో యూపీలోని మీరట్ జిల్లా యంత్రాంగం పలు నిబంధనలను విధించింది. కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఫుడ్ కోర్టులు తాము విక్రయించబోయే ఆహార పదార్థాల జాబితా, వాటి ధరలతో సహా ఇతర కీలక సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించాలని మీరట్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గత ఏడాది ఇటువంటి నిబంధనల నేపధ్యంలోనే ప్రభుత్వానికి వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తింది. మీరట్ డివిజనల్ కమిషనర్ హృషికేష్ భాస్కర్ యశోద్ మీడియాతో మాట్లాడుతూ కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఆహారశాలల వెలుపల ఆహార పదార్థాల ధరల జాబితాను ప్రదర్శించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. దీని వలన భక్తుల నుంచి అధిక ఛార్జీలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. అలాగే తమకు కావలసిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఆహారశాలల యజమానులు తమ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, ఆహార భద్రత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని హృషికేష్ భాస్కర్ యశోద్ తెలిపారు. ఆహార భద్రతా చట్టం, 2006లోని సెక్షన్ 55 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. #WATCH | Meerut, UP | Commissioner Meerut Division, Dr Hrishikesh Bhaskar Yashod says, "The district administration is ensuring that a list of food items and their prices is displayed outside all the food joints along the Kanwar yatra route. The food safety department will ensure… pic.twitter.com/9wrpzdS7rp— ANI (@ANI) July 2, 2025కన్వర్ యాత్రను శివ భక్తులు చేపడుతుంటారు. శ్రావణ మాసంలో గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి. శివునికి అభిషేకం చేస్తుంటారు. ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాగా 2024లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార బండ్లు నిర్వహించేవారు తమ పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. అయితే ఇది వివాదాస్పందంగా మారి, సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ చర్యను నిలిపివేసింది. ఆహారశాలల యజమానులు తాము అందించే ఆహార పదార్థాలను సూచిస్తే సరిపోతుందని, యజమానుల పేర్లు, వారి గుర్తింపులను ప్రదర్శించాలంటూ ఒత్తిడి చేయవద్దని పేర్కొంది.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్ హర్ మహదేవ్’ నినాదాలు -
భర్త వద్దు.. మామే కావాలి.. పెళ్లైన 45 రోజులకే..
పాట్నా: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో భర్త.. పెళ్లి అయిన 45 రోజులకు హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, తన మామతో జీవించేందుకే.. అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించింది. ఈ విషాదకర ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దీంతో, పెళ్లి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు (25), గుంజాదేవి (20)లకు రెండు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య 45 రోజుల క్రితమే వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గుంజాదేవికి తన మామ అంటే(భర్త తండ్రి కాదు) ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు నుంచే గుంజాదేవీ, ఆమె మామ జీవన్సింగ్ (55)లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా కూడా కలిసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన మామనే పెళ్లిచేసుకుంటానని.. గుంజాదేవీ తన పేరెంట్స్కు చెప్పింది. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.అనంతరం, ప్రియాంశుతో దేవీకి బలవంతంగా వివాహం చేశారు. తర్వాత.. తన మామను మరిచిపోలేక గుంజాదేవీ.. భర్తను దూరం పెడుతూ వస్తోంది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని తన మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో, తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో గుంజాదేవీ గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా.. జీవన్సింగ్తో తరచూ టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి అయిన నెలన్నరకే తమ కొడుకు ఇలా చనిపోయవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
రవిచంద్రన్ ఆశ్విన్ విధ్వంసం.. బెంబేలెత్తిన బౌలర్లు
తమిళనాడు ప్రీమియర్ లీగ్-2025లో దిండిగల్ డ్రాగన్స్ జట్టు క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది. బుధవారం ఎన్పీఆర్ కాలేజీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఎలిమినేటర్లో ట్రిచీ గ్రాండ్ చోళస్పై 6 వికెట్ల తేడాతో దిండిగల్ ఘన విజయం సాధించింది. దీంతో శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2లో చెపాక్ సూపర్ గిల్లీస్తో దిండిగల్ డ్రాగన్స్ అమీతుమీ తెల్చుకోనుంది.కాగా ఎలిమేనటర్లో టీమిండియా స్పిన్ లెజెండ్, దిండిగల్ కెప్టెన్ రవిచంద్రన్ ఆశ్విన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించిన ఆశ్విన్.. ఆ తర్వాత బ్యాటింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను ఆశూ ఉతికారేశాడు.కేవలం 48 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. ఆశ్విన్తో పాటు బాబా ఇంద్రజిత్(27) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ట్రిచీ బౌలర్లలో ఈశ్వరన్ రెండు వికెట్లు పడగొట్టగా.. శర్వన్ కుమార్, డేవిడ్సన్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ట్రిచీ గ్రాండ్ చోళస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ట్రిచీ బ్యాటర్లలో జాఫర్ జమాల్(33), వసీం అహ్మద్(36) రాణించారు. డ్రాగన్స్ బౌలర్లలో ఆశ్విన్తో పాటు జి పెరియస్వామి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్ -
మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖం పట్టినట్లేపట్టి మళ్లీ పెరుగుతోంది. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: ‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’ (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్గా రికార్డు
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తాజాగా హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా వెల్లడించింది. వినోదరంగంలో గణనీయంగా కృషి చేసినందుకుగాను ప్రతి ఏటా హాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ’ జాబితాను వెల్లడిస్తుంది. ఈ ఏడాది మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపికను ఎంపిక చేసినట్లు హాలీవుడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఈ జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ఉన్నారు. భారత్ నుంచి ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ జాబితాలో స్థానం పొందలేకపోవడం గమనార్హం.2006లో ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ సినిమా ఐశ్వర్యతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది దీపిక. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ఓం శాంతి ఓం తో మంచి గుర్తింపు సంపాదించుంది. 2017లో త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాలో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కల్కి 2898 ఏడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. -
కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోంది
రిలేషన్షిప్ ఎన్ని కొత్తపోకడలు పోయినా పెళ్లితోనే ఆ బంధానికి భద్రత అనుకునేవాళ్లే ఎక్కువ!అందుకే పెళ్లికి జాతకాలు,శాలరీ ప్యాకేజ్లు, ఆస్తులు, అంతస్తులు చూసుకున్నా...హక్కులు–బాధ్యతలు, ప్రణాళికలు, శక్తిసామర్థ్యాలు, పరస్పర గౌరవం, నమ్మకాలు, అండర్స్టాండింగ్, కంపాటబులిటీలకూ ప్రాధాన్యం ఇవ్వాలి! కాపురానికి కమ్యూనికేషన్ అత్యంత అవసరమని గ్రహించాలి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్, మానసిక, న్యాయ నిపుణులు.. ఈ తరం కూడా! ఆ అభిప్రాయాలతోనే ఈ క్యాంపెయిన్ను నేటితో ముగిస్తున్నాం! ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరుపెళ్లికి సంబంధించి మన దగ్గర రెండు విధానాలున్నాయి. ఒకటి రాజ్యాంగపరంగా జీవించడం, రెండు.. ఆచార వ్యవహారాలకనుగుణంగా ఉండటం. ఈ రెండోరకంలో పెద్దల నిర్ణయాలు, సమాజ కట్టుబాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిరకంలో రాజ్యాంగం వ్యక్తులకు ఏ హక్కులనైతే ఇచ్చిందో అవన్నీ కూడా జీవితభాగస్వాములకు అమలవుతాయి. రాజ్యాంగ పరంగా భార్యభర్తలు ఇద్దరూ సమానమే! కానీ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువల పరంగా ఆలుమగలిద్దరూ సమానం కాదు. అయినా అమ్మాయి చదుకోవాలి, ఉద్యోగం ఉండాలి, కట్నకానుకలు ఇవ్వాలి అనే అంచనాలూ ఉంటాయి. కానీ అమ్మాయి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరు. రాజ్యాంగబద్ధమైన వాటిల్లో కూడా భర్త సం΄ాదన మీద హక్కు కోరుకుంటున్న భార్య .. ఆయన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతల విషయంలో మాత్రం మిన్నకుంటోంది. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది ఏ పెళ్లిలో అయినా! అందుకే ఏ విధానంలోనైనా జీవితభాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. హక్కుల విషయంలో పరస్పర గౌరవంతో ఉండాలి. ఏరకమైన బాధ్యతలనైనా సమానంగా పంచుకోవాలి.– బీఎన్ నాగరత్న, ప్రెసిడెంట్ దలీప్ ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?గ్యాప్ పెరిగిపోతోంది పెళ్లికి కమ్యూనికేషన్ అండ్ టైమ్ చాలా ముఖ్యం. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈతరం కాపురాల్లో అవి రెండూ మిస్ అవుతున్నాయి. పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి మా దగ్గరకు వచ్చే జంటల్లో మేము నోటీస్ చేస్తున్న ప్రధాన సమస్య అదే. భార్య, భర్తలిద్దరిలో ఒకరికి డే షిఫ్ట్ ఉంటే, ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటోంది. వీకెండ్లో మాత్రమే ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అదీ ఎవరి ఫోన్లలో వాళ్లు! దీనివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగి΄ోతోంది. అండర్స్టాండింగ్ కొరవడుతోంది. మనం అనే భావన లేకుండా నాది అనే ఈగోనే వాళ్ల మ్యారిటల్ లైఫ్ని డామినేట్ చేస్తోంది. దీనివల్ల పిల్లల సంగతి అటుంచి వాళ్లు కలిసి కాపురం చేసే పరిస్థితే కనబడట్లేదు. అందుకే పెళ్లిని నిలుపుకోవాలంటే ఈకాలం జంటలకు కావాల్సింది కమ్యూనికేషన్ అండ్ ఇద్దరూ కలిసి స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్. దీని కోసం ఇద్దరూ కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. – డాక్టర్ ప్రశాంతి ఉప్పునూతలపేరెంట్స్కూ కౌన్సెలింగ్ అవసరంపెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. ఇరు కుటుంబాల మధ్య స్నేహం, బంధం, సాన్నిహిత్యం వంటివి పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తుల అంగీకారంపై ఆధారపడి ఉండలే తప్ప కుటుంబాల కలయిక కోసం పెళ్లిళ్లు జరగకూడదు. పెళ్లివ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించడంలో మనం విఫలమయ్యామని చెప్పుకోవాలి. పెళ్లి బంధంలో ఉండాల్సిన పరస్పర గౌరవం లాంటి ఎన్నో విషయాలు చాలామందికి అర్థం కావడం లేదు. దాంతో పెళ్లి తర్వాత గృహహింస లాంటి ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. విడాకుల వరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవలసిన పరిస్థితులను తరచుగా చూస్తున్నాం. పెళ్లికి ముందే అందరికీ సరైన రీతిలో లీగల్ – సైకలాజికల్ అవగాహన కల్పించినట్లయితే వివాహ వ్యవస్థ నిలబడడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. మన దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ కూడా సరిగా లేదు. అందులో భాగంగా ‘అంగీకారం’ అంటే ఛిౌnట్ఛn్ట – వ్యక్తిగత స్వేచ్ఛ, సేఫ్టీ వంటి అంశాలను బోధించాలి. లేకపోతే వైవాహిక జీవితమంతా వైధింపుల మయమవుతుంది. పెళ్లి చేసుకునే వారికే కాదు, వారి తల్లిదండ్రులకూ పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం. చాలామటుకు పెళ్లిళ్లలో తల్లిదండ్రుల జోక్యం వల్ల సులభంగా పరిష్కారమయ్యే సమస్యలు కూడా తెగేదాకా వెళ్తున్నాయి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది ఈ ఎడ్యుకేషన్ తప్పనిసరి అమ్మాయిలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నా.. డొమెస్టిక్ వ్యవహారంలో మాత్రం జెండర్ రోల్స్లో పెద్దగా మార్పు లేదు. ఇంటి పనులు, పేరెంటింగ్లో అబ్బాయిలకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు. భర్తతో సమానంగా సం΄ాదిస్తున్నా ఇల్లు, పిల్లల బాధ్యత ఆమెదే అన్న సంప్రదాయ భావనలోనే ఉన్నాం ఇంకా. దీనివల్ల ఆడపిల్లల మీద అదనపు భారం పడుతోంది. అందుకే చాలామంది అమ్మాయిలు పెళ్లి పట్ల విముఖత చూపిస్తున్నారు. అసలు మనదగ్గర వైవాహిక జీవితానికి సంబంధించి ఎడ్యుకేషనే లేదు. పెళ్లికి కులగోత్రాలు, జీతం, ఆస్తి, అంతస్తే ముఖ్యం అనుకుంటారు. ఇంటి బాధ్యత దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా అమ్మాయి, అబ్బాయి అంచనాలు, ప్రణాళికలు, పరస్పర గౌరవ నమ్మకాలు, ఎమోషనల్, ఫిజికల్ కంపాటబులిటీ లాంటివాటి మీద చర్చే ఉండదు. అసలు అలాంటి వాతావరణం తల్లిదండ్రుల మధ్యే కనబడదు కాబట్టి ఆ సంభాషణలు ఇంట్లో వినపడవు. కానీ ఈ తరం అమ్మాయి, అబ్బాయిలూ మాత్రం ఆ దిశగా ఆలోచించాలి. పెళ్లికి ముందు పెళ్లి తంతు, హనీమూన్కి ప్లాన్ చేసుకోవడం కన్నా పెళ్లి తర్వాత గడపబోయే సహజీవనం మీద శ్రద్ధ పెట్టాలి. జీతం, ఆస్తిపాస్తుల గురించి పెద్దలు ఎలాగూ చూస్తారు కాబట్టి.. పెళ్లి మీద ఇద్దరి అవగాహన, ఇంటి పనుల నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా ఇద్దరి ప్లాన్స్, సామర్థ్యాలు, కంపాటబులిటీల గురించి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సెలర్స్ సాయం తీసుకోవాలి. పెళ్లికి ముందే అన్నీ తెలుసుకునే వీలు లేక΄ోతే ముఖ్యమైన వాటి గురించైన ప్రాథమిక సమాచారం తీసుకుని పెళ్లి తర్వాత హనీమూన్ కన్నా ముందు కౌన్సెలింగ్కు ప్లాన్ చేసుకోవాలి. కాపురం సజావుగా సాగేందుకు ఇద్దరికీ అనుకూలమైన ఓ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – వర్ష వేముల, సైకోథెరపిస్ట్ పైపై బంధంగానే ఉంటుంది పెళ్లికి కేవలం జాతకాలు, శాలరీలతోనే చూస్తున్నవాళ్లు వాళ్ల ప్రధాన క్రైటీరియా అయిన కం΄ాటబులిటీని మాత్రం మ్యాచ్ చేయట్లేదు. కంఫర్టబుల్ లైఫ్ అండ్ డీసెంట్ లైఫ్ ఉండాలి.. కాదనట్లేదు. కానీ వైవాహిక జీవితానికి కావల్సిన చిన్న చిన్న విషయాలను కూడా మాట్లాడుకోవట్లేదు. ప్రేమ గురించిన వెంపర్లాట కనపడుతోంది తప్ప గౌరవం గురించి కాదు. రెస్పెక్ట్ ఉంటేనే కదా ప్రేమ ఉండేది! ఇలాంటివి అంటే మ్యాచ్ కాక΄ోతే, పరస్పర గౌరవం, కం΄ాటబులిటీ లేక΄ోతే పెళ్లి సఫకేటింగ్ చాంబర్లా మారుతుంది.. ముఖ్యంగా మహిళలకు. ఒక్కమాటలో చె΄్పాలంటే పెళ్లి అనేది రెండు కుటుంబా ప్రాపర్టీని రెట్టింపు చేసేదిగా, కుల అహంకారాన్ని ప్రిజర్వ్ చేసేదిగా, క్లాస్ని మెయింటేన్ చేసేదిగానే ఉంది. ఒక ప్రిస్టేజ్ సింబల్. ΄ాతికేళ్లు వచ్చాయా పెళ్లి చేసుకున్నామా .. ముప్పై ఏళ్లొచ్చాయా పిల్లల్ని కన్నామా.. సెటిల్ అయ్యామా అనే చూస్తున్నారు కానీ సంతోషంగా ఉన్నామా అని చూడట్లేదు. హారోస్కోప్ లో పద్దెనిమిదో ముప్పై ఆరో గుణాలు (ఛత్తీస్గుణ్) కలుస్తున్నాయా అని చూస్తున్నారు తప్ప పెళ్లిచేసుకోయే జంట కాబోయే తల్లిదండ్రులు కూడా కదా! వాళ్లు పిల్లల్ని కనాలనుకుంటున్నారా లేదా.. పేరెంటింగ్ బాధ్యతలను ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు లాంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చించట్లేదు. ఇవేవీ లేని పెళ్లి పైపై బంధంగానే ఉంటుంది. దానికన్నా అన్మ్యారీడ్గా ఉండటమే బెటర్. – హిమబిందు, సోషల్ యాక్టివిస్ట్పరిణతే ప్రామాణికం పెళ్లిని సమాజమెప్పుడూ వయసుకి సంబంధించిన అంశంగా చూస్తోంది. త్వరగా పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు పుడితే వృద్ధ్యాపంలో తోడుగా ఉంటారనే ఆధారపడే మనస్తత్వం అందులో కనిపిస్తుంది. అంతేకానీ పరిణతి, ΄ోషించే శక్తిసామర్థ్యాలను ్ర΄ామాణికంగా చూడట్లేదు. మారుతున్న కాలంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన అభి రుచులూ వేగంగా మారుతున్నాయి. భాగస్వామి వాటన్నిటినీ తీర్చలేక΄ోయినా కనీసం అర్థం చేసుకొని, గౌరవించే స్థాయిలో అయినా ఉండాలి. ఇటీవల జరిగిన అస్సాం, గద్వాల్ సంఘటనలను బూచిగా చూపించి పెళ్లికి ఆడవారి మనస్తత్వమే అడ్డు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ నేరాల్లో నిందితులకు సహకరించింది మగవారే అన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. పెళ్లి బంధంలోకి అడుగు పెట్టే ముందు మన మీద మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఎదుటివారినీ అర్థం చేసుకునే ఓర్పు కావాలి. – కెన్సారో వీవా, ఆంట్రప్రెన్యూర్ -
జంతు ప్రేమికులూ.. జర జాగ్రత్త..!
వర్షాలు ముసురుకుంటున్న సమయంలో కుక్కలకు ర్యాబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కుక్కలతో పాటు మనుషులకూ ఈ వ్యాధి వ్యాప్తిచెందొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో పేద, మధ్యతరగతి, ఉన్నత శ్రేణి అనే తేడా లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వివిధ జాతుల కుక్కలను, ఇతర జంతువులను పెంచుకుంటున్నారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆ పెట్స్ కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మూగజీవాలకు కొంత సమయం కేటాయిస్తూ వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒత్తిడిని జయించడానికి కొంత సమయం వాటితో ఆడుకోవడం అలవాటుగా మారుతోంది. ఈ సమయంలో ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధి సోకితే పెట్స్తో సహా మనుషులకూ ముప్పు పొంచి ఉంది. వీధి కుక్కలతో జర జాగ్రత్త.. వీధి కుక్కలు చిన్ననాటి నుంచి పుట్టి పెరిగిన, సంచరించే ప్రాంతానికి సరిహద్దులు (టెరిటరీ) నిర్ణయించుకుంటాయి. వాటి పరిధిలోకి వేరే కుక్కలను రానీయవు. ఇవి వాటి పరిధి దాటి వెళితే ఆందోళనకు గురవుతాయి. దీంతో కొత్త వ్యక్తులను చూసినప్పుడు భయంతో దాడి చేయడానికి ప్రయతి్నస్తాయి. అటువంటి వాటని ఐ కాంటాక్ట్ (కళ్లలోకి కళ్లుపెట్టి చూడటం) చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. పిల్లలు సహజంగానే కుక్కలు కనిపించినపుడు వాటి తోక, చెవులు పట్టుకుని లాగుతుంటారు. ఒక రకమైన ఇరిటేషన్లో ఉన్న కుక్కలను ఇలా చేస్తే అవి వెంటనే కరిచే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల నియంత్రణ వీధుల్లో వాటిని పట్టుకుని చికిత్సలు చేస్తున్నారు. అనంతరం ఎక్కడ నుంచి తెచ్చినవి అక్కడ విడిచిపెట్టకుండా ఏదో ఒక చోటు వదిలేస్తున్నారు. ఇది కూడా కుక్క కాట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. మెదడును ప్రభావితం చేస్తుంది.. పెట్స్కు ర్యాబిస్ సోకినప్పుడు వైరస్ అనేది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో కుక్క ఏం చేస్తుందనేది దానికి తెలియకుండానే నియంత్రణ కోల్పోతుంది. కోపం, దూకుడుగా, పచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంది. మనుషులకు వచ్చినట్లే కుక్కలకు సైతం విషజ్వరాలు వస్తాయి. లక్షణాలు గుర్తించినపుడు వైద్యులను సంప్రదించడం మేలు. రేబిస్ వ్యాధి అనేది కుక్కల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందుకు ముందుగానే జాగ్రత్త పడాలి. సొంగ కార్చే సమయంలో దాన్ని మనం చేతితో ముట్టుకోకుండా జాగ్రత్తపడాలి. కుక్క పిల్లలు ఆరు వారాల నుంచి 8 వారాల వయసులో పారో వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికీ ముందస్తుగా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రివెంటివ్ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. – డా.డీ.అశోక్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్.ఈ సీజన్లో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. వైరస్ వ్యాప్తికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంటో పెంచుకునే పెట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కళ్లు ఎర్రబడటం, జ్వరం రావడం, గొంతు కండరాలు బిగుసుకుపోయి నీళ్లు తాగడానికి ఇబ్బంది పడటం, నాలుగైదు రోజుల పాటు సొంగ కార్చడం, నురగలు కక్కడం వంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ర్యాబిస్ వైరస్కు సంబంధించిన లక్షణాలుగా పరిగణించాలి. ప్రాథమికంగా గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించినట్లైతే పెట్స్ను రక్షించుకోవచ్చు.నివారణ చర్యలు.. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. తద్వారా ర్యాబిస్ వ్యాప్తిని అరికట్టవచ్చు..దీంతో పాటు పెంపుడు జంతువులను నియంత్రణలో ఉంచాలి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి ఇళ్లలో పెంచుకునే వాటికి టీకాలు వేయించాలి. ఏదైనా జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలి. పెంపుడు జంతువులు లేదా బయటి జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినా.. అవి కాటు వేసినా.. గాయాన్ని సబ్బు నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. ర్యాబిస్ సోకిన జంతువు నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వైద్యుని సలహా మేరకు తగిన చికిత్స తీసుకోవాలి. ర్యాబిస్ వైరస్ సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులు, లేదా తరచూ జంతువులతో నివాసం ఉండాల్సిన పరిస్థితులు ఉన్న వ్యక్తులు ముందస్తుగా ర్యాబిస్ టీకా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో గబ్బిలాల నివాసం లేకుండా చూసుకోవాలి. ర్యాబిస్ సోకిన తర్వాత, లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స తీసుకోవడం చాలా కష్టం.. కాబట్టి నివారణా చర్యలు పాటించడం ఉత్తమం.. ఆరోగ్యకరం. (చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్
ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman gill) అద్బుతమైన సెంచరీ సాధించాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన శుబ్మన్ గిల్.. బాధ్యయుత ఇన్నింగ్స్తో కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన గిల్.. మొదటి 100 బంతుల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కున్నాక తనదైన శైలిలో గిల్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో శుబ్మన్ 199 బంతుల్లో తన ఏడవ టెస్ట్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. తొలి టెస్టులో కూడా గిల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో గిల్పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఆటను చూసి దక్షిణాఫ్రికా లెజెండ్ గ్రేమ్ స్మిత్ గర్వపడతుంటాడని యువరాజ్ కొనియాడాడు. కాగా గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా కెప్టెన్గా ఇంగ్లండ్లో తన తొలి టెస్ట్ సిరీస్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు గిల్ డబుల్ సెంచరీలు సాధించికపోయినప్పటికి.. వరుసగా రెండు సెంచరీలు మాత్రం నమోదు చేశాడు. ఈ క్రమంలోనే గిల్ను స్మిత్తో యువీ పోల్చాడు."జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది నేను ఉన్నా అంటూ ముందుకు వస్తారు. ఆ కోవకు చెందినవాడే శుబ్మన్ గిల్. టెస్టు కెప్టెన్గా వరుసగా సెంచరీలు చేసిన అతికొద్ది మందిలో ఒకడిగా గిల్ నిలిచాడు. ఎంతో ప్రశాంతత, ధైర్యవంతంగా బ్యాటింగ్ చేయడం, జట్టును విజయవంతంగా నడిపించాలనే తపన గిల్లో కన్పించాయి.అతడిని చూసి గ్రేమ్ స్మిత్ కచ్చితంగా గర్వపడుతుంటాడు అని ఎక్స్లో యువీ రాసుకొచ్చాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు.చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా -
170 కేజీల బరువు.. జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
బరువు తగ్గడానికి జిమ్కు వెళ్తున్నారా?.. అయితే ఈ వార్త తప్పకుండా చదవాల్సిందే. ఓ వ్యక్తి ఇలాగే జిమ్కు వెళ్లి వర్కవుట్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణం పొగొట్టుకున్నాడు. గత నాలుగు నెలలుగా కచ్చితమైన డైట్ పాటిస్తూ.. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తూ.. స్టెరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లకూ దూరంగా ఉంటున్నాడట. హర్యానా ఫరీదాబాద్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోట చేసుకుంది. నహర్ సింగ్ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్ శర్మకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. రెండున్నరేళ్ల పాప కూడా ఉంది. తండ్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడతను. అయితే అతని బరువు 170 కేజీలకు చేరింది. దీంతో బరువు తగ్గించుకునేందుకు జిమ్ను ఆశ్రయించాడు. గత నాలుగు నెలలుగా ఫరీదాబాద్ సెక్టార్ 9లో ఉన్న జిమ్కు క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. జులై 1వ తేదీన స్నేహితుడు రోహిత్తో కలసి జిమ్కు వెళ్లాడు. బ్లాక్ కాఫీ తాగిన తర్వాత.. షోల్డర్ పుల్-అప్స్ చేయడం ప్రారంభించారు. మూడో పుల్-అప్ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆ శబ్దానికి జిమ్లో వాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కాస్త స్పృహతో ఉన్న అతనికి నీటిని అందించడంతో.. వాంతులు చేసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో రెండుసార్లు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలోని ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించగా.. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా ఛానెల్స్కు చేరింది. అధిక బరువు ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలున్నవారు జిమ్ ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఎక్సర్సైజులు చేసేప్పుడు ఈ కింది విషయాలు గుర్తుంచుకోండిశరీర సామర్థ్యానికి మించి వ్యాయామాలు ప్రమాదకరంస్టెరాయిడ్స్, సప్లిమెంట్స్లాంటి వాటిని వీలైనంత దూరంగా ఉండాలి హార్ట్బీట్, బీపీలను నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలివ్యాయామాలకు ఉదయం సరైన సమయంజిమ్ చేసే టైంలో.. గుండె వేగంగా కొట్టుకున్నట్లు(గుండె దడ) అనిపిస్తే వెంటనే ఆపేయాలిఅలసిపోయినప్పుడు, జ్వరం లేదంటే బలహీనంగా అనిపించినా జిమ్కు వెళ్లకూడదుజిమ్ను కొత్తగా ప్రారంభించేవాళ్లు.. నిపుణుల సమక్షంలోనే మొదలుపెట్టడం ఉత్తమంభారీ బరువులు ఎత్తే ముందుకు సరైన శిక్షణ తీసుకుని ఉండాలి.. లేకుంటే ఎత్తకూడదుట్రెడ్మిల్ పరిగెత్తడానికి పరిమితి ఉండాలి.. అదే పనిగా చేయకూడదుఎక్సర్సైజుల మధ్యలో కొంచెం కొంచెంగా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇక్కడ త్రిమూర్తులకూ ఆలయాలు, ఎక్కడో తెలుసా?
కాకతీయ కాలం నాటి ఆధ్యాత్మిక శోభకు, శిల్పకళా వైభవానికి తార్కాణం 800 ఏళ్లనాటి ‘పిల్లల మర్రి’ (Pillalamarri )దేవాలయాలు. తెలుగు వారిని ఒకే తాటిమీదికి తీసుకువచ్చి సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయ రాజుల ఏలుబడిలో ఒక ఆధ్యాత్మిక, కళాక్షేత్రంగా వెలసిన కమనీయ సీమ సూర్యాపేట దగ్గర గల పిల్లలమర్రి.ముక్కంటికి మూడు ఆలయాలు..పిల్లలమర్రిలో మూడు ప్రసిద్ధ శైవక్షేత్రాలున్నాయి. 13వ శతాబ్దంలో వీటిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దం ఆరంభంలో కట్టిన గుడులు దాదాపు 150 సంవత్సరాలు వైభవోపేతంగా వెలిగాయి. ఆ తర్వాత పరదేశీ పాలనలో దోపిడీలకు గుర యినా, మధ్య మధ్య పునః ప్రతిష్టలు పొందాయి. బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ క్రీ.శ. 1208లో ఎరుకేశ్వర ఆలయాన్ని కట్టించారు. కాకతీయ శిల్పకళావైభవాన్ని చాటిచెప్పేలా చాలా ఎత్తుగా ఆలయం నిర్మించారు. దీని ముఖమండప స్తంభాలు నల్లరాయితో చెక్కారు. స్తంభాలు చాలా నునుపుగా అద్దం మాదిరిగా కనిస్తాయి. ముఖమండపంలోని స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినపడతాయి. ఆలయంలో కొలువైన స్వామివారిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని ప్రతీతి. బేతిరెడ్డి సోదరుడైన నామిరెడ్డి పిల్లలమర్రిలో రెండు శివాలయాలు కట్టించారు. తన పేరిట నామేశ్వర ఆలయం నిర్మించగా తన తల్లిదండ్రుల పేరిట త్రికూటాలయం నిర్మించారు నామేశ్వరాలయంలో నల్లరాతిపై చెక్కబడిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ద్వారాలు, ముఖమండపాలపై లతలు, పుష్పాలు, వివిధ భంగిమలలో నృత్యాలు కళాకారులు, గాయకులు, వాద్యకారులు, దేవతావిగ్రహాలు తదితర శిల్పాలు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవు. కొన్నిచోట్ల స్తంభాలపై సూక్ష్మాతిసూక్ష్మంగా అందమైన నగిషీలతో శిల్పాలను మలిచారు. కఠినమైన నల్లరాయి శిల్పుల చేతిలో మైనం లాæకరిగి΄ోయిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్తస్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తాయి. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతిదూలాలపై భారత రామాయణ గా«థలు, సముద్ర మథనం వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. నామేశ్వర ఆలయం పక్కనే త్రికూటేశ్వర ఆలయం ఉంది. ఒకేమండపంలో శివునికి మూడు వేర్వేరు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మూడు ఆలయాలకు కలిపి ఒకే నంది ఉండటం ఇక్కడ విశేషం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోకళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సేవలో వీరంగాలు వేయటం, అగ్నిగుండాలు కాల్చటం మొదలైన వేడుకలు నిర్వహిస్తున్నారు. చెన్నకేశ్వర... బ్రహ్మదేవాలయాలు... పిల్లలమర్రి శైవం, వైష్ణవం కలిసి పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. శివకేశవులకు భేదాలు లేవని చాటిచెప్పేలా మూడు ప్రసిద్ధ శివాలయాలు ఉన్న పిల్లలమర్రి గ్రామంలోనే ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయం ఉంది. 13వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. గర్భాలయంలో మకర తోరణం లో చెన్నకేశవస్వామివారి రూపలావణ్యం నయన మనోహరం. గర్భాలయం వెలుపల పన్నిద్దరు ఆళ్వారులు కొలువై ఉన్నారు. క్రీ.శ.1260లో చెన్నకేశ్వర ఆలయం ధ్వంసం అయ్యింది. 1899 ప్రాంతంలో గ్రామానికి చెందిన వుమ్మెత్తల చక్రయ్య గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని తిరిగి నిర్మించినట్లు చెబుతారు. చెన్నకేశ్వర ఆలయంతో΄ాటు నామేశ్వర ఆలయం ఎడమవైపు బ్రహ్మదేవుని ఆలయం ఉంది. బ్రహ్మ హంసవాహనారూఢుడై సరస్వతీమాతతో కలిసి దర్శనమిస్తారు. మహాదేవుని సేవ కోసం బ్రహ్మాసరస్వతులు హంసవాహనంపై ఇక్కడికి వస్తుంటారని స్థలపురాణం చెబుతోంది.ఎలా చేరుకోవాలంటే?ప్రసిద్ధ పురాతన ఆలయాలకు నెలవైన పిల్లల మర్రికి చేరుకోవడం చాలా సులువు. సూర్యాపేట జిల్లాలోని పిల్లల మర్రి గ్రామం హైదరాబాద్ నుంచి 134 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ నుంచి విరివిగా సూర్యాపేటకు బస్సులు ఉంటాయి. సూర్యాపేటలో దిగితే ఆక్కడినుంచి వాహనాల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామానికి చేరుకోవచ్చు.ఆ గ్రామం మూడు సుప్రసిద్ధ శైవ ఆలయాలకు నెలవు... ఒక్క ముక్కంటికే కాదు బ్రహ్మ, విష్ణువులకు సైతం ఆలయాలు ఉండటం మరో ప్రత్యేకత. త్రిమూర్తులలోని లయకారకుడైన శివుడు ఎరుకేశ్వరుడు, నామేశ్వరునిగా అవతరించగా స్థితికారకుడైన విష్ణువు చెన్నకేశ్వరునిగా వెలిశారు. ధరిత్రిపై పూజలు ఉండని శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడికి సైతం ఇక్కడ ఆలయం ఉండటం విశేషం. సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి హంస వాహనారూఢుడై దర్శనమిస్తాడిక్కడ. -
వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు
అచ్యుతాపురం రూరల్ : పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి యర్రయ్య(26) సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం నలుగురితో కలిసి యర్రయ్య సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపలు పట్టడం కోసం తాడును చేతికి కట్టుకుని గేలంతో చేపలను కొట్టాడు. ఈ క్రమంలో ఈ గేలానికి సుమారు 100 కేజీల బరువు ఉండే పెద్ద చేప చిక్కుకుంది. అయితే ఆ చేప బలంగా సముద్రంలోకి లాక్కుపోవడంతో యర్రయ్య గల్లంతైనట్టు తోటి మత్స్యకారులు తెలిపారు. తీరానికి సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో వేట సాగించామన్నారు. అధికారులు స్పందించి గల్లంతైన మత్స్యకారుడి కోసం గాలించాలని మత్స్యకార నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు కోరారు. -
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ
బుల్లితెర, వెండితెర, రాజకీయం.. అన్నిచోట్లా తనదైన మార్క్ చూపించారు స్మృతి ఇరానీ (Smriti Irani). సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి చిన్న వయసులోనే జీవితాన్ని చదివేశారు. కష్టాలు, తిరస్కరణలు తనను రాటు దేల్చాయి. అందుకే నటిగా మొదలైన తన ప్రయాణం కేంద్రమంత్రిని చేసింది. స్మృతి ఇరానీ మొదట యాడ్స్లో.. తర్వాత సీరియల్స్లో నటించారు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సీరియల్స్ కూడా నిర్మించారు. నా జీవితం అగ్నిపథ్ సినిమావంటిదిజై బోలో తెలంగాణ సహా పలు చిత్రాల్లో యాక్ట్ చేశారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ బీజేపీలో కేలక నేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తాజాగా స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్ జోహార్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్ కుచ్ హోతా హై మూవీ నుంచి నా లైఫ్ సడన్గా అగ్నిపథ్ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు. అమ్మకు అన్యాయంఏదైనా ప్రేమగీతం చెప్తారనుకుంటే ఇలా ప్రతీకారంతో రగిలిపోయే సినిమాను ఎంపిక చేసుకున్నారేంటని కరణ్ తిరిగి ప్రశ్నించారు. అందుకు స్మృతి స్పందిస్తూ.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొడుకు చేసే ప్రయత్నాలను అగ్నిపథ్లో చూపిస్తారు. అమ్మకు అన్యాయం జరిగిందన్నది అతడి ఆవేదన. నా లైఫ్లోనూ అదే జరిగింది. మా అమ్మకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని!అద్దె ఇంట్లో ఉన్న అమ్మకు..అగ్నిపథ్ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల క్రితం తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ.1 అద్దె కడుతోంది అని చెప్పుకొచ్చారు.కష్టాలతో సావాసంమరో ఇంటర్వ్యూలోనూ తన పేరెంట్స్ కష్టాలు బయటపెట్టారు స్మృతి ఇరానీ. నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీదాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. కాగా స్మతి పేరెంట్స్ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
మోసం చేస్తే మోసమే!
పూర్వం బాగ్దాద్ నగరంలో బహెలూల్ అనే పేరుగల ఒక దైవభక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆయన బాగ్దాద్ వీధుల్లో నడుస్తూ వెళుతున్నారు. అలా వెళుతూ వెళుతూ ఒకచోట విశ్రాంతి కోసం ఆగాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా బాధగా, ఆందోళనగా ఉన్నాడు. అది గమనించిన బహెలూల్ , ‘ఏమిటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, విషయం ఏమిటి?’ అని ఆరా తీశారు.‘అయ్యా.. ఏం చెప్పమంటారు? కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర కొంత పైకం అమానతుగా ఉంచాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే, అసలు నువ్వెవరివి..? నాకు పైకం ఎప్పుడిచ్చావు?’ అని బుకాయిస్తున్నాడు. ఎంత ప్రాధేయపడినా కనికరించకుండా, ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశాడు. కాని నా అమానత్తును మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి..? రిక్తహస్తాలతో మిగిలాను. ఏ మార్గమూ కానరావడం లేదు.’ అంటూ బోరుమన్నాడు. బహెలూల్ అతణ్ణి ఊరడిస్తూ.., ‘నువ్వేమీ బాధపడకు..దైవ చిత్తమైతే ఆ పైకం నేను ఇప్పిస్తాను.’ అన్నారు ప్రశాంతంగా..‘అవునా..! నా పైకం ఇప్పిస్తారా..?’ అంటూ ఆశగా చూశాడా వ్యక్తి.. ‘‘కాని ఎలా సాధ్యం? ఆవ్యక్తి పరమ దుర్మార్గుడు... నాకైతే ఏమాత్రం నమ్మకం కుదరడంలేదు.’ అన్నాడు నిరాశతో.. ‘‘అలా అనకు.. నిరాశ తిరస్కారం ( కుఫ్ర్ )తో సమానం.. దైవచిత్తమైతే నీ పైకం నీకు తప్పకుండా లభిస్తుంది.’ అన్నారు బహెలూల్. ’నిజమే.. ఆశ లేకపోతే మనిషి బ్రతకలేడు. కాని.. ఎలా సాధ్యమో కూడా అర్ధం కావడం లేదు.’’నువ్వు ఆందోళన చెందకు. నేను చెప్పినట్లు చెయ్ . నీ పైకం ఇప్పించే పూచీనాది.’ అన్నారు బహెలూల్ ధీమాగా..’సరే ఏం చేయమంటారో చెప్పండి. ’అన్నాడతను. ఆశగా.. ’రేపు ఉదయం ఫలానా సమయానికి నువ్వు ఆ వ్యక్తి దుకాణం దగ్గరికిరా.. నేనూ ఆ సమయానికి అక్కడికి వస్తాను. నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్న క్రమంలో నువ్వొచ్చి నీ అమానత్తును అడుగు.’ అన్నారు బహెలూల్ . సరేనంటూ ఆ వ్యక్తి బహెలూల్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.తెల్లవారి ఉదయం బహెలూల్ ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత, తాను కొన్నాళ్ళపాటు పని మీద ఎటో వెళుతున్నానని, కాస్త ఈ సంచి మీదగ్గర ఉంచితే తిరిగొచ్చిన తరువాత తీసుకుంటానన్నారు. ఇందులో వంద బంగారునాణాలు, కొంతనగదు ఉందని చెప్పారు. ఆ వ్యక్తి లోలోన సంతోషపడుతూ, సరేనని సంచీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మోస΄ోయిన వ్యక్తి వచ్చి తను అమానతుగా ఉంచిన పైకం ఇమ్మని అడిగాడు. ఆ వ్యాపారి ఒక్కక్షణం ఆలోచించి, ఇప్పుడు గనక ఇతనితో పేచీ పెట్టుకుంటే, విలువైన బంగారు నాణాల సంచి చేజారే అవకాశముందని గ్రహించాడు. వెంటనే అతని పైకం అతనికిచ్చేశాడు. అతను సంతోషంగా పైకం తీసుకొని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. బహెలూల్ కూడా తన సంచిని వ్యాపారి దగ్గర అమానత్తుగా ఉంచి తనదారిన తను వెళ్ళిపోయారు. కొంతసేపటి తరువాత, అతడు సంబరపడుతూ, బహెలూల్ దాచిన నాణాల సంచి విప్పి చూసి, నోరెళ్ళబెట్టాడు. అందులో గాజు పెంకులు, గులక రాళ్ళు తప్ప మరేమీ లేవు. తను చేసిన మోసానికి తగిన శాస్తే జరిగిందని భావించాడు. ఇకనుండి ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకొని ధర్మబద్ధమెన జీవనం ప్రారంభించాడు.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్∙ -
ఉమెన్ 'ఇన్నోవేటర్స్'..! ఆవిష్కర్తల కోసం..
పరిశ్రమలు, పారిశ్రామిక రంగంలో మహిళకు వ్యవస్థాపకులుగా, ఆవిష్కర్తలుగా సాధికారత కల్పిస్తూ వారందరినీ అనుసంధానం చేసే వినూత్న వేదికగా డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఉమెన్ ఇన్నోవేటర్స్ (డీఇడబ్ల్యూఐ) ప్రారంభమైంది. అంకుర సంస్థల ఔత్సాహిక మహిళల సమిష్టి ఉన్నతికి సహకారం, ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా నగరంలో డీఇడబ్ల్యూఐ ఆవిష్కృతమైంది. నగరంలోని హైటెక్స్ నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ డాక్టర్ నీలిమా వేములతో పాటు చైర్పర్సన్ డాక్టర్ కళ్యాణి గుడుగుంట్ల, వైస్ చైర్పర్సన్ – సహ వ్యవస్థాపకురాలు సత్యవతి ప్రసన్న మడిపడిగే, సహ వ్యవస్థాపకురాలు – బ్రాండ్ కస్టోడియన్ పల్లవి నాగళ్లతో పాటు ముఖ్య సలహాదారు రాజు మడిపడిగే డీఇడబ్ల్యూఐను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మహిళా దార్శనికులు, స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహిళా ఆవిష్కర్తలను ఒక చోటికి చేర్చారు. మహిళా శక్తికి లాంచ్ప్యాడ్.. ఈ సందర్భంగా డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఉమెన్ ఇన్నోవేటర్స్ వ్యవస్థాపకురాలు డా.నీలిమా వేముల మాట్లాడుతూ.. డీఇడబ్ల్యూఐ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఇదొక ఒక ఉద్యమం. ప్రధానంగా ఇండస్ట్రీ, ఇన్నోవేషన్లో బాధ్యతను కోరుకునే, ఒకరికొకరు ప్రోత్సాహం అందించుకునే ఔత్సాహిక మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు మహిళా శక్తిని, విజయాన్ని పునర్ నిర్వచించడానికి సిద్ధంగా ఉన్న మహిళలను అనుసంధానం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. డీఇడబ్ల్యూఐ అనేది మహిళల వ్యవస్థాపకతను పెంపొందించేందుకు కమ్యూనిటీ సహకారంతో పాటు మూలధనంపై దృష్టి సారించి, ఆశావహులైన–స్థిరపడిన మహిళా వ్యవస్థాపకులకు ఒక లాంచ్ప్యాడ్గా సేవలందించనుందని, ఇలాంటి వారి అభివృద్ధికి అవకాశాలు కల్పించే సమాంతర వ్యవస్థగా రూపొందించనున్నామని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో మహిళా నేతృత్వంలోని వెంచర్లను స్కేలింగ్ చేయాలనే సంస్థ లక్ష్యానికి భవిష్యత్తు పెట్టుబడిదారులు, నిధుల సేకరణదారులుగా విశిష్ట జ్యువెలరీ డైరెక్టర్ సింధుజా పలబట్ల, సురక్ష ఫార్మా డైరెక్టర్ పద్మజా మానేపల్లిని డీఇడబ్ల్యూఐ కుబేరులుగా ఎంపిక చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అలేఖ్య పుంజాల, ప్రముఖ ఫిట్నెస్ నిపుణురాలు దినాజ్ వెర్వత్వాలా, సినీ నటుడు అలీ జీవిత భాగస్వామి జుబేదా అలీ, వైద్య నిపుణురాలు, మహిళా ఆరోగ్య న్యాయవాది డాక్టర్ సునీత రెడ్డి (వైఎస్), వకుళ సిల్స్ వ్యవస్థాపకురాలు మాధురి దువ్వాడ, టీజీ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్కి సై) -
అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్ హర్ మహదేవ్’ నినాదాలు
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని పవిత్ర అమర్నాథ్ గుహాలయంలో గురువారం ఉదయం మొదటి హారతి అందించడంతో వార్షిక అమర్నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం 5,892 మంది యాత్రికుల మొదటి బ్యాచ్ ప్రయాణాన్ని జమ్ములోని భగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందం కశ్మీర్ లోయకు చేరుకోగానే అక్కడి అధికారులు, స్థానికులు వారికి స్వాగతం పలికారు. The first batch of Shri #AmarnathYatra2025 pilgrims was flagged off by Srinagar Police and the CRPF from the Pantha chowk base camp and directed to the Baltal base camp.#spiritualjourney #amarnathcave #yatra2023 #jammukashmir #DivineJourney #religioustourism #mountainpilgrimage pic.twitter.com/KHI1zN9Z4t— crpf_fan (@CrprepostFan) July 2, 2025బాల్తాల్, నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంపుల మీదుగా యాత్రికుల మొదటి బృందం తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారంతా ‘హర్ హర్ మహాదేవ్’ అంటూ పెద్ద ఎత్తున శివనామస్మరణలు చేశారు. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర పహల్గామ్, బాల్తాల్ మార్గాల ద్వారా ముందుకు సాగనుంది. ఆగస్టు 9న రక్షాబంధన్తో ఈ యాత్ర ముగియనుంది. గత ఏడాది ఐదు లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ సందర్శించుకున్నారు. ఈ సంవత్సరం యాత్రా వ్యవధి తక్కువగా ఉన్నప్పటికీ యాత్రికులు అధికంగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 3.5 లక్షలకు పైగా భక్తులు యాత్ర కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆన్-ది-స్పాట్ రిజిస్ట్రేషన్ను సులభతరం చేసేందుకు జమ్ములో సరస్వతి ధామ్, వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ సభలలో అధికారులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజూ సుమారు రెండు వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. యాత్రామార్గంలో అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం -
వరంగల్ రాజకీయంలో కొత్త ట్విస్ట్.. మీనాక్షితో కొండా దంపతుల ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, మురళి ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. ఇంచార్జి మీనాక్షికి 16 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో వరంగల్ జిల్లాలోగ్రూప్ రాజకీయాల గురించి వివరించినట్టు సమాచారం.ఈ క్రమంలో తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరు సమాధానం చెప్పారు. ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గం వారిగా ఇంచార్జీకి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని కోరారు. రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని వారిద్దరూ నివేదికలో క్లారిటీ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు.అనంతరం, కొండా మురళి సాక్షితో మాట్లాడుతూ..‘నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని. నలభై నాలుగు ఏళ్ల నుండి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. వైఎస్సార్ హయం నుంచి మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. పని చేసే వారిపైనే విమర్శలు వస్తాయి. క్షమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మొదటిసారి కాంగ్రెస్ ఇంచార్జిని కలిశాను. రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ గెలిచేలా నేను తీసుకుంటాను. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. నేను ఎవరికి భయపడేది లేదు. బీసీ కార్డుతోనే పనిచేస్తా.. బీసీల అభ్యున్నతికి పనిచేస్తాను. సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటున్నాను. నాకు భయం లేదని ముందు నుంచే చెబుతున్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. పెద్ద పెద్ద కేసులకే నేను భయపడలేదు. ఇదే సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా నాకు భయపడరు. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు?. నా కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ అవుతుంది. మాది పరకాల.. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి?. భవిష్యత్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో గతంలో నటి సమంత, నటుడు నాగార్జునపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా మురళి తన లేఖలో వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన అంశాలను మాత్రమే తాను పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు మురళి వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా నేను ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించను అంటూ కామెంట్స్ చేశారు. -
Toli Ekadashi 2025: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?
ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని, తొలి ఏకాదశి అనీ పిలుస్తారు. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈ రోజు మొదటిది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు... అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలూ కలిగాయని పురాణోక్తి. చదవండి: హనుమకు ఆకు పూజ ఎందుకు ఇష్టం? సీతమ్మ సత్కారం -
పదేపదే చెవుల్లో మ్యూజిక్ వినిపించడం మానసిక సమస్య..?
నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను. కుటుంబపోషణ కోసం చిన్నప్పటినుంచే మా నాన్న గారి సెలూన్లో పని చేసేవాణ్ణి. పెళ్లిళ్లలో సన్నాయి వాయించడం కోసం కూడా వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. నా పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అయ్యారు. నేను సెలూన్ పని మానేసి పదేళ్లవుతోంది. సన్నాయి వాయించడం కూడా ఆపేశాను. కాలక్షేపం కోసం ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టుకున్నాను. నాకు ఒక సంవత్సర కాలం నుండి నేను గతంలో పెళ్లిళ్లలో వాయించిన సంగీతం, పాటలు చెవిలో మళ్లీ మళ్లీ వినపడుతున్నాయి, ముందు ఇంటి దగ్గర్లో ఏదైనా పెళ్లి అవుతుంటే అక్కడ నుండి వచ్చే శబ్దాలు, పాటలు అనుకున్నాను కానీ అని పగలు, రాత్రి, రోజంతా వినపడుతూనే ఉంటాయి. ఆ శబ్దాల వల్ల నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మాకే శబ్దాలూ వినపడట్లేదు. నువ్వు ఊహించుకుంటున్నావు అంటున్నారు. నాకే ఎందుకు ఇలా అవుతోంది... ఈ బాధ నుంచి నన్ను బయట పడేయండి డాక్టరు గారూ!– గురునాథం, కరీంనగర్ మీరు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మీ పిల్లల్ని మంచి స్థితికి తీసుకెళ్లినందుకు ముందుగా మీకు నా అభినందనలు. ఇక మీ సమస్య విషయానికి వస్తే మీకు ఉన్న కండిషన్ని ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అంటారు. మనం గతంలో విన్న పాటలు, శబ్దాలు అప్పుడుప్పుడు వినపడటం అందరికీ జరుగుతుంటుంది. ఉదాహరణకు పొద్దున మనకు నచ్చిన పాట వింటే అది కాసేపు అలాగే ‘మైండ్లో’ ప్లే అవడం, దాన్ని మనం ఎంజాయ్ చేయడం సర్వసాధారణం! కాసేపటికి వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ మీ విషయంలో ఎప్పుడో విన్న పాటలు, సంగీతం పదే పదే వినిపించడం, అవి మిగిలిన వాళ్ళకి వినపడకపోవడం, దానివల్ల డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు రావడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అనేది అరుదుగా కనబడే ఒక లక్షణం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముందుగా మీకు వినికిడి సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చెయించుకోండి. అలాంటిది ఏదైనా ఉంటే హియరింగ్ మెషిన్ వాడితే మీ సమస్య చాలావరకు తగ్గిపోతుంది. మీ వయస్సు 60 సంవత్సరాలు కాబట్టి పెద్ద వయసులో వచ్చే డిమెన్షియా, మెదడులో ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలి. ఇవేమీ లేవని నిర్ధారణ అయితే అప్పుడు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిస్తే మీకు పరీక్షలు చేసి ‘యాంటీ సైకోటిక్’ మందులు, అలాగే మీ డిప్రెషన్ తగ్గడానికి మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు. వాటిని కొంతకాలం వాడితే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండండి. (డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడమీ సమస్యలు, సందేహాలు sakshifamily3@gmail.com)(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్కి సై) -
Hanuman హనుమకు ఆకు పూజ ఎందుకు ఇష్టం?
తమిళనాడు రాష్ట్రం, కరూర్కి చెందిన ఒక బ్యాంకు ఉద్యోగి వేంకటేశ్వర స్వామి దర్శనార్థం కారులో తిరుమల బయలుదేరాడు.ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చేసరికి కొంచెం సేద తీర్చుకోవాలనుకున్నాడు. ఓ ఆంజనేయస్వామి గుడి వద్ద కారు ఆపాడు.ఆ పక్కనే ఓ భార్యాభర్తల జంట కొబ్బరికాయల కొట్టు పెట్టుకుని ఉన్నారు. భార్య అంగడిలో కూర్చుని ఉంది. భర్త అంగడి ముందర ఉన్న పూల మొక్కలకు నీళ్ళుపోస్తూ ఉన్నాడు. అతడి దగ్గరికి వెళ్ళాడు బ్యాంకు ఉద్యోగి. ఇక్కడ స్వామికి తమల΄ాకులతో పూజ చేస్తారా?’’ అని ప్రశ్నించాడు. ‘‘అవును’’ అని బదులిచ్చాడు వ్యాపారి.‘‘నేనెప్పుడూ చూడలేదు. దీని విశేషం ఏమిటి?’’ అని ఆసక్తిగా అడిగాడు బ్యాంకు ఉద్యోగి. ‘‘నేను పెద్దగా చదువుకున్న వాణ్ని కాదు. పెద్దలెవరైనా రామాయణం, మహా భారతం లాంటివి చెబుతూ ఉంటే కనీసం వినను కూడా వినలేదు. అయితే మా ఊరిలో ఈ ఆకు పూజ గురించి చెప్పుకునే కథ గురించి మాత్రం మీకు చెప్పగలను’’ అన్నాడు.‘‘నువ్వు విన్నదే చెప్పు. నాకెందుకో కుతూహలంగా ఉంది’’ అన్నాడు బ్యాంకు ఉద్యోగి.భక్తి భావంతో ఆ వ్యా΄ారి తను వేసుకున్న చెప్పులు తీసివేశాడు. తలకి చుట్టిన తువ్వాలును తీసి భుజాన వేసుకున్నాడు. చక్కగా నిలబడి ఆంజనేయ స్వామిని మనసులోనే ప్రార్థించి ఇలా చెప్పసాగాడు.‘‘అది లంకానగరంలో అశోక వనం. ఎక్కడ చూసినా కురూపులైన రాక్షస స్త్రీలు. వారి మధ్యలో సీతమ్మ.ఆమె ముఖం కళ తప్పి ఉంది. పది తలల రాక్షసుడు పెట్టే బాధలు సహించలేకపోతోంది. సరిగ్గా ఆ సమయంలో పిల్ల గాలి వీచింది. చెట్టు మీది పక్షుల రెక్కలు రెపరెపలాడాయి. ‘ఏమిటా’ అని సీతమ్మ చుట్టూ కలయచూసింది. ఎదురుగా ఒక కాంతి పుంజం. కళ్ళు వెడల్పు చేసి చూస్తే ఎదురుగా వినయ విధేయతలతో చేతులు జోడించిన ఆకారం. అది మానవాకారం కాదు, వానరాకారం. సీతమ్మ జడుసుకుంది. ‘ఇది రావణ మాయ ఏమో...’ అని అనుమానపడింది.అయితే ఆ వానరాకారం గౌరవంగా ‘అమ్మా’ అని సంబోధిస్తే ఉలిక్కిపడింది. ‘‘అనుమానం వలదు, నేను రామదూతను’’ అని హనుమంతుడు వినమ్రంగా విషయమంతా వివరించాడు. అంతా ఆసక్తిగా విన్నది సీతమ్మ. హనుమంతుడు చెప్పటం ఆ΄ాక సుగుణాభిరాముని క్షేమ సమాచారాలు అడిగింది. వాలి సుగ్రీవుల గురించి వాకబు చేసింది. శ్రీ రాముడు కపిసైన్యంతో రానున్నాడనే చల్లని కబురు తెలుసుకుని ఆనందపడింది. శ్రీరాముల వారు ఆనవాలుగా పంపిన ఉంగరం చూసి పరవశించిపోయింది.ఆ సంతోషంలో హనుమంతుడిని గౌరవించాలని అనుకుంది సీతమ్మ. చుట్టూ చూసింది. పూల చెట్లు ఏవీ కనిపించలేదు. కనీసం తులసీ బృందావనమైనా అక్కడ లేదు. పరిసరాలను మరింత సూక్ష్మంగా చూసింది. కంచెను అల్లుకుని ఉన్న తమలపాకు తీగలను చూసింది. వాటిని చిన్నగా గిల్లి దండగా మార్చింది. చిరునవ్వుల మోముతో హనుమ మెడలో వేసింది. ఈ హఠాత్పరిణామానికి హనుమ ఆశ్చర్యచకితుడయ్యాడు. హనుమ కంట ఆనందాశ్రువులు. ‘‘అంజన తనయా.. లోకంలో ఎవరు ఏ శుభ వార్త అందించినా బహుమతులివ్వడం మా ఆనవాయితీ. నువ్వు శ్రీ రాములవారి ఉంగరాన్ని నాకు చేరవేశావు. శ్రీరాముడు వస్తున్నాడన్న మంచి విషయం తెలియ జేశావు. ఈ దేశం కాని దేశంలో నీకు ఈ తమల పాకుల దండ తప్ప మరేమీ ఇవ్వలేను’’ అని చెప్పింది.ఊహించని సత్కారానికి హనుమంతుని ఒళ్లంతా పులకరించింది. ‘‘లోకమాత అయిన నీవు నా మెడలో తమలపాకుల మాల వేశావు, నా జన్మ చరితార్థమయ్యింది తల్లీ’’ అని రెండు చేతులూ జోడించి తల వంచాడు. ఇదే రానురాను ఆకు పూజకు నాంది పలికిందని ఇక్కడ చెప్పుకుంటారు. శివునికి బిల్వపత్రం, విష్ణువుకు తులసి లాగా హనుమంతునికి తమలపాకు ప్రియ మయిందని భావిస్తారు. హనుమంతునికి ఆకుపూజ చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చని ఇక్కడి వారి నమ్మకం’’ అని వివరించాడు. అప్పటికే ఆ బ్యాంకు ఉద్యోగి తమలపాకుల మాల, ఇతర పూజా సామగ్రి కొనుక్కుని గుడిలోకి వడివడిగా వెళ్తూ ఉన్నాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’
దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) రుణ ఖాతాను ‘ఫ్రాడ్’ అకౌంట్గా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వర్గీకరించనుంది. అలాగే రిజర్వ్ బ్యాంకుకి ఇచ్చే నివేదికలో సంస్థ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును కూడా చేర్చాలని నిర్ణయించింది. జూన్ 23వ తేదీతో ఎస్బీఐ నుంచి ఈ మేరకు లేఖ అందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆర్కామ్ తెలిపింది. దీని ప్రకారం ఆర్కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31,580 కోట్ల రుణం తీసుకున్నాయి.ఆర్కామ్కి పంపిన లేఖ ప్రకారం.. రుణంగా తీసుకున్న నిధులను సంక్లిష్టమైన విధంగా వివిధ గ్రూప్ సంస్థలు మళ్లించినట్లు గుర్తించామని ఎస్బీఐ పేర్కొంది. దీనిపై జారీ చేసిన షోకాజ్ నోటీసుకి కంపెనీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్కామ్ ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించాలని ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ నిర్ణయించినట్లు వివరించింది. ‘ఫ్రాడ్’గా మారిస్తే..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఏదైనా ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించినప్పటి నుంచి 21 రోజుల్లోగా ఆ విషయాన్ని ఆర్బీఐకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సీబీఐ/ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. మోసం చేసిన రుణగ్రహీతపై (ప్రమోటర్ డైరెక్టర్, ఇతరత్రా హోల్టైమ్ డైరెక్టర్లు సహా) కఠినచర్యలు ఉంటాయి. డిఫాల్ట్ అయిన రుణగ్రహీతలు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన అయిదేళ్ల వరకు మరే ఇతర బ్యాంకులు, డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థలు, ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీల నుంచి రుణాలు తీసుకోవడానికి ఉండదు.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’ఆర్కామ్ స్పందన ఇదే..ఎస్బీఐ నిర్ణయంపై ఆర్కామ్ స్పందించింది. తమ రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడమనేది ఆర్బీఐ మార్గదర్శకాలు, కోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధమని స్పష్టం చేసింది. జులై 2న బ్యాంకుకు ఆర్కామ్ లాయర్లు ఈ మేరకు లేఖ రాశారు. ఆరోపణలపై వ్యక్తిగతంగా వివరణనిచ్చేందుకు అనిల్ అంబానీకి కనీసం అవకాశం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎస్బీఐ నిర్ణయం తీసుకోవడం షాక్కు గురి చేసిందని, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఆర్కామ్లోని ఇతర నాన్–ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర డైరెక్టర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసును విత్డ్రా చేసుకున్న ఎస్బీఐ, అంబానీ కూడా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరే అయినప్పటికీ ఆయన్ను మాత్రం వేరుగా చేసి చూడటం సరికాదని లాయర్లు వివరించారు. షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన దాదాపు ఏడాది వరకు బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ వివరణ సంతృప్తికరంగానే ఉందని భావించినట్లు తెలిపారు. -
ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు.. ఆన్సర్ ఉందా బాబూ?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎవరివల్ల చెడ్డ పేరు వస్తోంది? అధినేతల లోపాల వల్ల ఎమ్మెల్యేలకు డ్యామేజ్ అవుతోందా? లేక ఎమ్మెల్యేల అక్రమాలు, అలసత్వాలు ప్రభుత్వం పరువును దిగజారుస్తున్నాయా? రెండూ కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే...ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కీలక మంత్రి లోకేశ్లు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేసిన భ్రమ కల్పించాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆగ్రహం పెరిగేందుకు కారణమవుతున్నాయి.అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపివ్వడం మంచిదే. ప్రజల్లో తిరిగితే కదా వారి మనోభావాలు, ప్రభుత్వం పనితీరు, రెడ్బుక్ హడావుడి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? లేదా? అన్నది తెలిసేది? విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వేధింపులు, అక్రమ అరెస్ట్, నిర్బంధాలతో సామాన్యులకు ఒరిగిందేమిటని కూడా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఏడాది కాలంలో తామోన్నో ఎన్నో విజయాలు సాధించేశామని చంద్రబాబు అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అన్ని విషయాలు తెలిసినా ఆయన చెప్పినదానికి ఊ కొట్టడం తప్ప మరో గత్యంతరం ఉండదు. ముందుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకుని ఆ తర్వాత తొలి అడుగో, మలి అడుగో వేస్తే అదో పద్దతి కాని, అదేమీ లేకుండా తాము బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చిందని, లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి ఎమ్మెల్యేలవే అన్నట్లుగా మాట్లాడితే ఆశ్చర్యం పోవడం తప్ప వేరే ఏమి ఉంటుంది?. 👉ఏడాది కాలం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైనదే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం ఒక ఏడాదిలోనే నెరవేర్చిన హామీలెన్ని? తెచ్చిన సంస్కరణలు ఏమిటి? ప్రజలకు ఎలా ఇళ్ల వద్దే ప్రభుత్వ సేవలు అందించింది అందరికి తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసి ప్రజలను రోడ్లపైకి తెచ్చిందన్నదీ పలువురు ఎమ్మెల్యేల భావన. ఉదాహరణకు జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని చంద్రబాబు ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తాము ఎవరి పొట్టగొట్టబోమని ఊదరగొట్టారు. కానీ.. 👉.. అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారా? లేదా? రేషన్ సరుకులను ప్రజల ఇళ్లవద్దకే చేర్చే వ్యవస్థ గతంలో ఉంటే, ఇప్పుడు దానిని ఎత్తివేశారా? లేదా? ప్రభుత్వ పరంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ రైతు భరోసా కేంద్రాలు వంటివాటిని గ్రామ, గ్రామానా, పట్టణాలలో వార్డు, వార్డులో జగన్ ప్రభుత్వం నెలకొల్పితే వాటన్నిటిని నీరు కార్చుతున్నారా? లేదా ?వారికి ఈ వ్యవస్థలపై నమ్మకం లేకపోతే, మంచివి కావని భావిస్తే ఎన్నికల ముందే ఆ విషయం చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా, అవన్నీ యథాతథంగా కొనసాగుతాయని ప్రచారం చేసి, తీరా పవర్ లోకి వచ్చాక అన్నిటిని నిర్వీర్యం చేస్తే ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందా? లేక చెడ్డ ప్రభుత్వం అవుతుందా?. హామీలపై ప్రజలకు బాండ్లు ఇచ్చారు కదా?. వాటిలో పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మొదటి ఏడాదిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదే! గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చి సరిపెట్టారే. తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఏబై ఏళ్లకే బలహీన వర్గాలకు పెన్షన్ మొదలైన వాటన్నిటికి తొలి ఏడాది ఎగనామం పెట్టారా? లేదా? ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారికి ఇచ్చిన బాండ్ల గురించి ,ఆయా వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే వారందరిని వైఎస్సార్సీపీ వారి కింద జమకట్టి కేసులు పెడతామని బెదిరిస్తారా? ముఖ్యమంత్రే స్వయంగా వైఎస్సార్సీపీ వారు నిలదీయడానికి లేదని, అలా చేస్తే తాట తీస్తామని అనడం దేనికి సంకేతం. రెండో ఏడాదిలో తల్లికి వందనం కొంతవరకు అమలు చేసినా, మొదటి ఏడాది బకాయిల మాటేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పాలి? తల్లికి వందనం ఈ మాత్రం అయినా అమలు అయిందంటే అది జగన్ ప్రభావం వల్లే అన్న సంగతి అందరికి తెలుసు. జగన్ ఎప్పటికప్పుడు దీని గురించి నిలదీస్తున్న ఫలితంగా ఈ స్కీమ్ ఈ మాత్రం అయినా ఇవ్వక తప్పలేదు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలలో వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేసి, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తెగ బాదుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందమని ఎమ్మెల్యేలు అనగలరా? ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారో, లేక ఆయన కుమారుడు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి గురించి ఎవరైనా అడిగితే జవాబు ఏమని చెబుతారు?. 👉మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తూ కాలం గడపాలని చంద్రబాబు సర్కార్ చేస్తున్న యత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరా? జగన్ టైమ్లో అప్పుల గురించి అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదిలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించింది కదా! అప్పట్లో 'దాన్ని తనఖా పెట్టారు.. దీన్ని తనఖా పెట్టార"ని ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఏకంగా అప్పులు ఇచ్చేవారికి ట్రెజరీనే తాకట్టు పెట్టి ఘన చరిత్ర నెలకొల్పారే. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అంగీకరిస్తారా? లేక వారిని కోప్పడతారా? వైసీపీ వారు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు అవేమిటో వివరించాలి కదా?. 👉నిత్యం విధ్వంసం అంటూ నిందలు వేసే చంద్రబాబు అదేమిటో ఎన్నడైనా చెప్పారా? కేవలం సినిమా డైలాగులు చెప్పి ప్రజలను మభ్య పెట్టే యోచన కాకుండా వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటారు.అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని ఎమ్మెల్యేలపైకి నెట్టేసి తప్పుకోవాలని చూస్తే వారు గుసగుసలాడు కోకుండా ఉంటారా? 1995 లొ ముఖ్యమంత్రి అయింది మొదలు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేలపై అసంతృప్తి అంటూ లీకులు ఇవ్వడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల వైఫల్యాలు లేవా అంటే చాలానే ఉన్నాయి. అనేక చోట్ల ఇసుక, మద్యం, గనులు, పరిశ్రమలు తదితర లావాదేవీలలో ఎమ్మెల్యేల దందా పై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. వెరసి అటు ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యేలు రెండువైపులా సాగుతున్న దందాల వల్ల ప్రజలు నలిగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలలోకి వెళ్లాలంటే భయం ఏర్పడిన మాట నిజం. కొనమెరుపు ఏమిటంటే కీలకమైన తొలి అడుగు సన్నాహక సమావేశానికి 56 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి..
ఎనభై సంవత్సరాల వయసులో కొద్ది దూరం నడిచినా అలసటగా అనిపిస్తుంది. ‘సాహసం’ అనే మాట ఊహకు అందదు. అయితే డా. శ్రద్దా చౌహాన్ మాత్రం ‘తగ్గేదే ల్యా’ అని డిసైడై పోయింది. సాహసానికి సై అంది. స్కైడైవింగ్తో తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న శ్రద్ధ చరిత్ర సృష్టించింది. ‘స్కైడైవింగ్’ అనే మాట తల్లి నోటి నుంచి వినిపించిన క్షణమే ‘ఓకే’ అన్నాడు ఆమె కుమారుడు సౌరభ్ సింగ్ షెకావత్. శ్రద్ధ భర్తతోపాటు, రెండవ కుమారుడు మాత్రం... ‘ఈ వయసులో చాలా కష్టం. వద్దు’ అన్నారు. వారిని ఒప్పించి రంగంలోకి దిగారు తల్లీకొడుకులు. స్కైడైవర్ అయిన షెకావత్ ‘స్కై హై ఇండియా’ చీఫ్ ఇన్స్ట్రక్టర్. పర్వతారోహణలో, గుర్రపు స్వారీలో దిట్ట అయిన షెకావత్కు సాహసాలు కొత్త కాదు. వర్టిగో, సర్వికల్ స్పాండిలైటిస్లాంటి సమస్యలతో బాధ పడుతున్నప్పటికీ 10,000 అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ. ‘ఏ మదర్: ఏ మైల్స్టోన్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియో విషయానికి వస్తే...షెకావత్ మొదట తన తల్లిని పరిచయం చేస్తాడు. ‘మా అమ్మతో కలిసి ఈ సాహసంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నాడు షెకావత్. స్కైడైవింగ్ చేయాలనేది శ్రద్ధ చౌహాన్ చిన్నప్పటి కల. ఎట్టకేలకు కుమారుడి సహకారంతో తన కల నెరవేర్చుకుంది. ‘ఇది నేను గర్వించే సందర్భం’ అని సంతోషం నిండిన కళ్లతో అంటుంది డా.శ్రద్ధా చౌహాన్. ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియో సాహసానికి మాత్రమే కాదు తల్లీకొడుకుల అనుబంధానికి కూడా అద్దం పడుతుంది. View this post on Instagram A post shared by Skyhigh (@skyhighindia) (చదవండి: Shubhanshu Shuklas mission: మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? ) -
సీఎం కరకట్ట నివాసం వద్ద యోగాసనాలతో నిరసన
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద గురువారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయన నివాసం ముందు యోగ టీచర్లు ఆందోళనకు దిగారు. చంద్రబాబు తనయుడు, విద్యా శాఖ మంత్రి అయిన నారా లోకేష్ తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యోగాసనాలతో తమ నిరసనలు తెలియజేశారు. అయితే.. సీఎం కరకట్ట నివాసం వద్ద నిరసనలకు పోలీసులు యోగా టీచర్లకు అనుమతించలేదు. వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. మర్యాదగా వెళ్లిపోవాలంటూ వార్నింగ్లు ఇచ్చారు. తమ సమస్యేంటో కూడా వినకుండా పోలీసులు తమను పంపించేస్తున్నారని టీచర్లు వాపోయారు. పాఠశాలల్లో పని చేస్తున్న 1,056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. ఈ విషయమై మంత్రి లోకేష్కు గతంలో విన్నవించినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఇలా యోగాసనాల నిరసనలతో అయినా వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశామని చెబుతున్నారు. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
ఇంగ్లండ్ గడ్డపై భారత అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. బుధవారం నార్తాంప్టన్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన మూడో యూత్ వన్డేలో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 269 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో తన తుపాన్ ఇన్నింగ్స్లో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సాధించిన రికార్డులు ఇవే..👉అండర్-19 వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 80 ప్లస్ రన్స్ చేసిన ఆటగాడిగా సూర్యవంశీ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా 2004లో స్కాట్లాండ్ అండర్-19 జట్టుపై 236.84 స్ట్రైక్రేట్తో 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో 31 బంతుల్లో 277.41 స్ట్రైక్రేట్తో 86 పరుగులు చేసిన వైభవ్.. రైనా ఆల్టైమ్ రికార్డు రికార్డు బ్రేక్ను చేశాడు.👉అండర్ 19 వన్డేలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. వైభశ్ సూర్యవంశీ కంటే ముందు రిషభ్ పంత్.. అండర్ 19 వన్డేల్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.👉అండర్-19 యూత్ వన్డేలో భారత తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మన్దీప్ సింగ్(8 సిక్స్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో 9 సిక్సర్లు బాది మన్దీప్ రికార్డును వైభవ్ అధగమించాడు.చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా -
విజయవంతంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ‘సాహిత్యంలో హాస్యం’ కార్యక్రమం
డాలస్, టెక్సస్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” ప్రతి నెలా ఆఖరి ఆదివారం (5 సంవత్సరాలకు పైగా) నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన 81వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం-అలనాటి విశిష్ట రచయితల హాస్యరచనా వైభవం” (గురజాడ, భానుమతి, మొక్కపాటి, ముళ్ళపూడి, చిలకమర్తి, భమిడిపాటి, శ్రీరమణ) ఆద్యంతం నవ్వుల జల్లులు కురిపించింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ - మనకున్న తెలుగు సాహితీవేత్తలలో కొంతమంది విశిష్టరచయితలు సృష్టించిన హాస్య సాహిత్యవైభవాన్ని ఈ రోజు ఈ వేదికమీద చర్చించుకోవడం ముదావహం అంటూ శుభాకాంక్షలుతెల్పి, అందరికీ ఆత్మీయఆహ్వానం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ”హాస్యంకోసం హాస్యరచనలు చేసినవారు కొందరైతే, ఆనాటి వాస్తవ సాంఘిక, సామాజిక సమస్యల ఇతివృత్తంగా కొంతమంది చేసిన రచనలు సహజంగా హాస్యాన్ని సృష్టించాయి. రచనలతో హాస్యం పండించడం, పాఠకుల్ని మెప్పించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అలాంటి దాన్ని అలవోకగా సాధించిన రచయితలలో కొంతమందిని ఎంపికచేసుకుని వారి రచనావైభవాన్ని మననం చేసుకోవడం, వారిని స్మరించుకోవడం చాలా సబబుగా ఉంది అన్నారు.” విశిష్ట అతిథులుగాపాల్గొన్న - ఆచార్య డా. చుండూరి మృణాళిని, ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, వక్త à గురజాడ అప్పారావు (రచయిత, సంఘ సంస్కర్త, హేతువాది, అభ్యుదయ కవి) గురించి; పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి భానుమతీ రామకృష్ణ (రచయిత్రి, నటి, నిర్మాత, దర్శకురాలు, గాయని, సంగీత దర్శకురాలు) గురించి; డా. కొచ్చెర్లకోట జగదీశ్, ప్రముఖ రచయిత à మొక్కపాటి నరసింహశాస్త్రి (ప్రముఖ హాస్యరచయిత) గురించి; యర్రంశెట్టి శాయి, ప్రసిధ్ధ తెలుగు కథా, నవలా రచయిత à ముళ్ళపూడి వెంకటరమణ (ప్రముఖ సినీ కథా రచయిత, హాస్య కథా, నవలా రచయిత) గురించి; కూచి, ప్రముఖ చిత్రకారుడు, హాస్య రచయిత à చిలకమర్తి లక్ష్మీనరసింహం (సుప్రసిద్ధ కవి, రచయిత, నాటకకర్త, సంఘసంస్కర్త) గురించి; డా. చిట్టెన్ రాజు వంగూరి, ప్రముఖ నాటకకర్త, రచయిత, నటుడు à భమిడిపాటి కామేశ్వరరావు (హాస్యబ్రహ్మ, ప్రముఖ రచయిత, నటుడు, నాటకకర్త) గురించి; ఫణి డొక్కా, ప్రముఖ రచయిత, దర్శకుడు శ్రీ రమణ (ప్రముఖ వ్యంగ్య వ్యాస, కథా, నవలారచయిత)లు సృష్టించిన అసంఖ్యాక రచనలోని విశేషాలను, పాత్రల స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరించి ఆద్యంతం నవ్వులు పూయించారు.హాస్యప్రధానంగా సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్టఅతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్.ఈ పూర్తి కార్యక్రమాన్ని క్రింది లంకెలో వీక్షించవచ్చును.https://youtube.com/live/x9kzttV6B_w -
Indonesia: బాలి తీరంలో ఫెర్రీ మునక.. ఇద్దరు మృతి, 43 మంది గల్లంతు
జకార్తా: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ రిసార్ట్ ద్వీపం బాలి సమీపంలో 65 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. వెంటనే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 43 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం తూర్పు జావాలోని కేతాపాంగ్ ఓడరేవు నుంచి బయలుదేరిన తును ప్రతమ జయ అనే ఫెర్రీ 30 నిమిషాల తర్వాత నీటి మునిగింది. ఆ సమయంలో ఫెర్రీ.. బాలిలోని గిలిమనుక్ ఓడరేవుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. 14 ట్రక్కులు సహా 22 వాహనాలను ఫెర్రీలో రవాణా చేస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికితీశామని, 20 మందిని రక్షించామని, వారిలో చాలా మంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు బన్యువాంగి పోలీసు చీఫ్ రామ సమతామ పుత్ర తెలిపారు. టగ్బోట్లు, తొమ్మిది పడవలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఇండోనేషియాలో ఫెర్రీ ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. దేశంలో ఫెర్రీలు కీలక రవాణా సాధనాలుగా ఉపయుక్తమవుతుంటాయి. గత మే నెలలో బెంగ్కులు ప్రావిన్స్లో ఒక చెక్క పడవ మునిగిపోవడంతో ఏడుగురు పర్యాటకులు మృతిచెందారు. 34 మంది గాయపడ్డారు. అదే నెలలో 89 మందితో ప్రయాణిస్తున్న పర్యాటక పడవ బాలి తీరంలో నీట మునిగింది. అయితే ఈ ఘటనలో రెస్క్యూ సిబ్బంది ప్రయాణికులందరినీ రక్షించారు.ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు తగ్గి 25,442కు చేరింది. సెన్సెక్స్(Sensex) 48 ప్లాయింట్లు నష్టపోయి 83,383 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే?
కొన్ని సినిమాలు థియేటర్లలో మ్యాజిక్ చేద్దామనుకుంటాయి. తీరా కనీస ఆదరణ కూడా దక్కక బొక్కబోర్లా పడతాయి. థగ్ లైఫ్ సినిమా అలాంటి కోవకు చెందినదే! మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఓటీటీలో థగ్లైఫ్ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో రూ.90 కోట్లే ఇస్తామని పేచీ పెట్టింది. చివరకు చర్చల అనంతరం రూ.110 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు భోగట్టా. అంతేకాదు సినిమా రిలీజయ్యాక 8 వారాల తర్వాతే ఓటీటీలో ప్రసారం చేస్తామన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దాంతో నాలుగు వారాల్లోనే థగ్ లైఫ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేడ (జూలై 3) సడన్గా నెట్ఫ్లిక్స్లో దర్శనమిచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.వివాదాలుథగ్ లైఫ్ రిలీజ్కు ముందు భారీ అంచనాలున్నాయి. ఎప్పుడైతే కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్లో కమల్ హాసన్ నోరు జారారో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో థగ్లైఫ్ కన్నడలో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ వ్యవహారం కోర్టుదాకా వెళ్లగా.. కర్ణాటకలో సినిమా రిలీజ్ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కానీ అప్పటికే థగ్లైఫ్ మిగతా చోట్ల రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. థగ్ లైఫ్ సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే నెట్ఫ్లిక్స్లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దాన్ని రద్దు చేయడం వల్ల మల్టీప్లెక్స్ థియేటర్లు.. థగ్లైఫ్ నిర్మాత కమల్ హాసన్పై రూ.25 లక్షల జరిమానా వేసినట్లు తెలుస్తోంది. Streaming now on NETFLIX #ThugLife pic.twitter.com/u3BxaX2Dfm— Christopher Kanagaraj (@Chrissuccess) July 2, 2025 చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
Chicken: భారీగా తగ్గిన చికెన్ ధర..
అనకాపల్లి టౌన్: మాంసాహార ప్రియులకు పండగే పండగ. చికెన్ ధర గణనీయంగా తగ్గింది. బుధవారం జిల్లాలో డ్రెస్డ్ కోడి మాంసం రూ.150లకు, స్కిన్లెస్ రూ.160లకు విక్రయించారు. ఆదివారం వచ్చిందంటే చికెన్ ముక్క లేనిదే చాలామందికి ముద్ద దిగదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎక్కువగా చికెన్ మాంసాన్ని ఇష్టపడతారు. ప్రొటీన్ శాతం ఎక్కువ ఉంటుందని వైద్యులు సైతం మేక మాంసం కంటే కోడి మాంసం మేలని చెబుతారు. ధర కూడా మేక మాంసం కంటే తక్కువ ఉండడంతో చాలామంది ఇళ్లలో చికెన్కే ప్రాధాన్యం. సాధారణంగా ఈ రోజుల్లో కేజీ చికెన్ ధర రూ.200 నుంచి రూ.250 మధ్య ఉంటుంది. కానీ మంగళ, బుధవారాల్లో లైవ్ చికెన్ రూ.90, డ్రెస్డ్ రూ.150, స్కిన్లెస్ రూ.160లకు లభించింది. గత వారం రూ.200 దాటిన కేజీ చికెన్ ధర ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆరా తీయగా పూరి జగన్నాథస్వామి ఉత్సవాల ప్రభావమే కారణమని తెలిసింది. అనకాపల్లి జిల్లా నుంచి ఒడిశా రాష్ట్రానికి బ్రాయిలర్ కోళ్లు ఎక్కువగా ఎగుమతి అవుతాయని, ప్రస్తుతం రథోత్సవం అనంతరం 10 రోజులపాటు వేడుకలు జరగడంతో డిమాండ్ గణనీయంగా తగ్గిపోయిందని హోల్సేల్ వ్యాపారులు తెలిపారు. జిల్లాలో కూడా దాదాపు అన్ని చోట్ల జగన్నాథస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. మారు రథయాత్ర జరిగే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. -
AUS Vs WI: ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
గ్రెనడా వేదికగా వెస్టిండీస్తో రెండో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గురువారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాలని కంగారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా టీమ్మెనెజ్మెంట్ తమ ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించింది.చేతివేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి గ్రెనడా టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. స్మిత్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్పై వేటు పడింది. తొలి టెస్టులో అవకాశం లభించినప్పటికి ఇంగ్లిష్ ఉపయోగించుకోలేకపోయాడు.అదేవిధంగా బార్బడోస్ టెస్టు రెండు ఇన్నింగ్స్లలో విఫలమైన సామ్ కాన్స్టాస్, ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్లకు ఆసీస్ టీమ్మెనెజ్మెంట్ మరో అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా తమ బౌలింగ్ లైనప్లో ఎటువంటి మార్పులు చేయలేదు. స్టార్క్, హాజిల్వుడ్, కమ్మిన్స్ ఆసీస్ ఫ్రంట్లైన్ పేసర్లగా ఉన్నారు.వీరితో పాటు నాలుగో పేసర్గా ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్ బంతిని పంచుకోనున్నాడు. ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్లో నాథన్ లియాన్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఉన్నాడు. తొలి టెస్టులో 159 పరుగుల తేడాతో విండీస్ను కమ్మిన్స్ సేన చిత్తు చేసింది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో ఆసీస్ బోణీ కొట్టింది.విండీస్తో రెండో టెస్టుకు ఆసీస్ తుది జట్టుఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ క్యారీ, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజిల్వుడ్చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా -
పాకిస్తాన్ సెలబ్రిటీలకు బిగ్ షాకిచ్చిన భారత్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్కు చెందిన సెలబ్రిటీలకు భారత ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. పాక్ సెలబ్రిటీలు, క్రికెటర్లు సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం మళ్లీ నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్కు చెందిన పలు ఛానళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, బుధవారం వారి అకౌంట్లు ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, అప్రమత్తమైన కేంద్రం.. వారి ఖాతాలపై మళ్లీ నిషేధం విధించినట్లు సమాచారం.ఇక, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు, పాకిస్తానీ క్రికెటర్ల ట్విట్టర్ అకౌంట్స్ అన్నింటినీ భారత్లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పాక్కు చెందిన పలు న్యూస్ ఛానెల్స్ను కూడా భారత్ బ్యాన్ చేసింది. అయితే బుధవారం నాడు ఈ ఛానెల్స్ అన్నీ భారత్లో ఆన్లైన్లో దర్శనం ఇచ్చాయి.An Indian soldier takes a bullet on the border.A Pakistani influencer takes creator payouts from Indian views.The government banned their content… then quietly unbanned it.This isn't soft diplomacy.This is soft headed.#BanPakContent pic.twitter.com/HlOZNvE2AX— SambhavāmiYugeYuge (Ministry of Aesthetics) (@Windsofchange72) July 2, 2025హనియా అమీర్, మహీరా ఖాన్, క్రికెటర్ షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్, సాబా కమర్, అహద్ రజా మిర్ వంటి పాక్ సెలెబ్రిటీల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాలు భారత్లో అన్బ్లాక్ అయ్యాయి. పలు పాక్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్లో దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ చూసిన భారత నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. భారత్లో పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీలపై బ్యాన్ తొలగించారా? అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నెటిజన్ల విమర్శల నేపథ్యంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా మరోసారి నిషేధం విధించినట్టు తెలుస్తోంది. -
'మ్యాడ్' హీరోతో నిహారిక కొత్త సినిమా షురూ
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా కొత్త సినిమా ఆరంభమైంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ వంటి హిట్ చిత్రం తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ద్వితీయ సినిమా ఇది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్స్ వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ‘‘ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరకెక్కనున్న చిత్రమిది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జరగనుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ ఇతర పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి సంగీతం: అనుదీప్ దేవ్, కెమేరా: రాజు ఎడురోలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
సర్ప్రైజ్ చేస్తానంటూ.. చంపేశాడు
హైదరాబాద్: తండ్రిని సర్ప్రైజ్ చేస్తానని చెప్పిన ఓ కుమారుడు.. కళ్లకు గంతలు కట్టి.. ఆపై కత్తితో పొడిచి హతమార్చిన వైనం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టిన డబ్బుల గురించి తండ్రి అడగడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కోతులకుంటకు చెందిన కెతావత్ హన్మంత్ (37) బతుకుదెరువు కోసం గోపన్పల్లి ఎన్టీఆర్ నగర్కు వలస వచ్చి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య జములమ్మ, కొడుకులు రవీందర్ (19), సంతోషిలు ఉన్నారు. హన్మంత్ ఇటీవల తన భూమిని కుదువబెట్టి రూ.6 లక్షల అప్పు తీసుకొని ఇంట్లో పెట్టాడు. ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కొడుకు కెతావత్ రవీందర్ యాప్లో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి రెండున్నర లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్లో పోగొట్టాడు. తండ్రి పదేపదే డబ్బుల గురించి అడగగా.. అవసరానికి స్నేహితునికి ఇచ్చానని త్వరలోనే తిరిగిస్తాడని నమ్మబలికాడు. దీంతో రోజూ ఇంట్లో డబ్బు గురించి గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో రవీందర్ తన స్నేహితుడు డబ్బులు ఇచ్చేందుకు వస్తున్నాడని మంగళవారం తండ్రిని ఎన్టీఆర్ నగర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తానని నమ్మించి తండ్రి కళ్లకు గంతలు కట్టాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన కత్తితో గొంతులో బలంగా పొడిచాడు. దాదాపు 100 మీటర్ల వరకు పరిగెత్తి కింద పడిపోయి హన్మంత్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అనంతరం రవీందర్ బాబాయ్ రమేశ్కు ఫోన్ చేసి నాన్న కత్తితో పొడుచుకొని చనిపోయాడని చెప్పాడు. ఆత్మహత్యగా కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కోతులకుంటకు తరలించారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘనపూర్ పీఎస్కు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలు నిర్వహిస్తే అందరిపై కేసు నమోదవుతుందని హెచ్చరించి, మంగళవారం రాత్రి హన్మంత్ మృతదేహాన్ని తిరిగి గచ్చిబౌలి పీఎస్కు తీసుకొచ్చారు. మృతదేహంతో పాటు వచ్చిన రవీందర్ను విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
యస్ బ్యాంక్లో వాటాపై సీసీఐకి దరఖాస్తు
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్లో 20 శాతం వాటా కొనుగోలుకి క్లియరెన్స్ను కోరుతూ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) దరఖాస్తు చేసింది. యస్ బ్యాంక్లో 20 శాతం వాటా విక్రయించేందుకు గత నెలలో పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ)తోపాటు ఇతర 7 బ్యాంకింగ్ సంస్థలు నిర్ణయించాయి. రూ.13,483 కోట్ల విలువలో వాటా విక్రయానికి ప్రతిపాదించాయి.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’దీని ప్రకారం యస్ బ్యాంక్లో వాటా మూలధనంతోపాటు.. ఓటింగ్ హక్కులను సైతం ఎస్ఎంబీసీ సొంతం చేసుకోనుంది. వెరసి దేశీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఈ డీల్ రికార్డ్ సృష్టించనుంది. జపాన్లో రెండో పెద్ద బ్యాంకింగ్ గ్రూప్ అయిన సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్(ఎస్ఎంఎఫ్జీ)నకు సొంత అనుబంధ సంస్థగా ఎస్ఎంబీసీ వ్యవహరిస్తోంది. -
ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం
బార్మర్: ఇద్దరు పిల్లలతో నిండుగా కళకళలాడుతున్న ఆ పచ్చని సంసారాన్ని కుటుంబ కలహాలు చిదిమేశాయి. క్షణికావేశంలో కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం స్థానికులకు తీరని ఆవేదనను మిగిల్చింది. రాజస్థాన్లోని బార్మర్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.బార్మర్కు చెందిన కవిత కవిత తన చిన్న కుమారుడు రామ్దేవ్కు బాలికల దుస్తులు ధరించి, కళ్లకు కాజల్ పెట్టి, బంగారు ఆభరణాలు వేసి, చూడముచ్చటగా తయారుచేసింది. ఆ తరువాత వారి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇంటిలోని భర్త, భార్య ఇద్దరు కుమారులు ఇంటికి సమీపంలో ఉన్న నీటి ట్యాంక్లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను శివలాల్ మేఘ్వాల్ (35), అతని భార్య కవిత (32), కుమారులు బజరంగ్ (9) రామ్దేవ్ (8)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శివలాల్ మేఘ్వాల్ కుటుంబం సామూహిక ఆత్మహత్య వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శివలాల్ మేఘ్వాల్ కుటుంబ సభ్యుల మృతదేహాలను వారి బంధువుల సమక్షంలో వాటర్ ట్యాంక్ నుండి వెలికితీశారు.శివలాల్ మేఘ్వాల్కు అతని సోదరుడు ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం రాకపోవడంతో, అతను పొరుగింటివారిని శివలాల్ మేఘ్వాల్ ఇంటికి వెళ్లి చూసిరమ్మనడంతో ఈ ఘటన వెలుగు చూసిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)మనారామ్ గార్గ్ మీడియాకు తెలిపారు. శివలాల్ మేఘ్వాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో తమ నిర్ణయానికి ముగ్గురు వ్యక్తులు కారకులని, వారిలో తన సోదరుడు ఒకరని రాసివుంది. కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం సంవత్సరాల తరబడి నడుస్తున్నదని లేఖలో వెల్లడయ్యింది. తమ నలుగురి అంత్యక్రియలు తమ ఇంటి ముందు నిర్వహించాలని ఆ లేఖలో శివలాల్ మేఘ్వాల్ అభ్యర్థించారు.మృతురాలు కవిత మామ తెలిపిన వివరాల ప్రకారం, శివలాల్ మేఘ్వాల్.. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన నిధులను ఉపయోగించి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అయితే అందుకు అతని తల్లి, సోదరుని నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. ఈ నేపధ్యంలోనే శివలాల్ మేఘ్వాల్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని కవిత మామ ఆరోపించారు. ఘటన జరిగిన రోజున ఇతర కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేదని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ -
టీవీఎస్ ఐక్యూబ్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే..
టీవీఎస్ మోటార్ తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ కొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. ఎక్స్–షోరూం ధర రూ.1.03 లక్షలుగా ప్రకటించింది. ఇందులో అమర్చిన 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వల్ల సింగిల్ ఛార్జింగ్తో 123 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్, బ్యాక్రెస్ట్ ఈ స్కూటర్ ప్రత్యేకతలు.‘ఇప్పటికే ఆరు లక్షలకు పైగా ఐక్యూబ్ యూనిట్లు విక్రయించాం. డ్యూయల్ టోన్ కలర్స్తో రోజు వారీ అనువైన ప్రయాణాలకు అనుగుణంగా తాజా ఐక్యూబ్ను తీర్చిదిద్దాం. కొత్త వేరియంట్ విడుదల ద్వారా విద్యుత్ వాహన విభాగాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాం’ అని టీవీఎస్ కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’టఫే, ఏజీసీవో వివాదం సెటిల్మెంట్మాసే ఫెర్గూసన్ బ్రాండ్ వివాదాన్ని టఫే, ఏజీసీవో కార్పొరేషన్ సంస్థలు కోర్టు వెలుపల పరిష్కరించుకున్నాయి. సెటిల్మెంట్ ప్రకారం ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టఫే) సంస్థ రూ.2,225 కోట్లు చెల్లించి మాసే ఫెర్గూసన్లో ఏజీసీవో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, నేపాల్, భూటాన్లో ఈ బ్రాండు పూర్తి యాజమాన్య హక్కు లు టఫేకు దక్కుతాయి. ఏజీసీవో కార్పొరేషన్ గత సెపె్టంబర్లో మాసే ఫెర్గూసన్ బ్రాండ్ లైసెన్స్ సహా టఫేతో ఉన్న పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది. -
ఐపీవోకు స్టీమ్హౌస్ ఇండియా
ఇండ్రస్టియల్ స్టీమ్ అండ్ గ్యాస్ సరఫరా కంపెనీ స్టీమ్హౌస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500–700 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. మెయిన్బోర్డులో లిస్టింగ్పై కన్నేసిన కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సైతం ప్రాథమిక పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడించింది. 2014లో ఏర్పాటైన సంజూ గ్రూప్ కంపెనీ సూరత్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు విస్తరించింది. 167 క్లయింట్లకు సర్వీసులు అందిస్తోంది.ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’పిరానా, దహేజ్ సెజ్సహా.. వపీ, అంకలేశ్వర్, నందెశారీ, పనోలీ ఫేజ్–2, 3లలో విస్తరణ చేపట్టింది. ఈ బాటలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, యూపీ, హర్యానా, రాజస్తాన్లలోనూ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. 2023–24లో రూ. 292 కోట్ల ఆదాయం, రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల రహస్య పద్ధతిలో ఫైలింగ్కు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాటా క్యాపిటల్, ఫిజిక్స్వాలా, ఇమేజిన్ మార్కెటింగ్(బోట్)తోపాటు.. షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్, గాజా ఆల్టర్నేటివ్ ఏఎంసీ, షిప్రాకెట్ ఇదే బాటలో సాగాయి. 2024 చివర్లో స్విగ్గీ, విశాల్ మెగామార్ట్ ఇదే విధంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. -
‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. భర్త, పిల్లలను వదిలేసి రా'
జనగాం: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్కుమార్తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్కుమార్కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్కుమార్ హుటాహుటిన మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్పాషా తెలిపారు. -
ప్రభాస్కు కథ చెప్పిన 'అమరన్' డైరెక్టర్!
హీరో ప్రభాస్ (Prabhas), ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ను కలిసి రాజ్కుమార్ ఓ కథ వినిపించారని, అది నచ్చి ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని భోగట్టా. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు రాజ్కుమార్ కూడా ధనుష్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ తమ కమిట్మెంట్స్ పూర్తి చేశాకే ఈ హీరో–దర్శకుడి కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ చిత్రాలున్నాయి. ఇందులో ది రాజాసాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది.చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
దొరకని ఆచూకీ ఆగని కన్నీళ్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచి పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిల్చిన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. కుటుంబసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్డెస్్కకు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. క్యాంపులో బిక్కుబిక్కుమంటూ... బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్డెస్్కలో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.స్నేహితుడి ఆచూకీ కోసం.. పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం ఒడిశా నుంచి పటాన్చెరుకు వచ్చారు 28 సంవత్సరాల దీపక్. తన స్నేహితులతో కలిసి ఇస్నాపూర్లోని ఓ గదిని అద్దెకుంటున్నాడు. మూగ్గురు మూడు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. మూడు నెలల క్రితమే దీపక్ ఈ సిగాచీ పరిశ్రమలో చేరారు. సోమవారం ఉదయమే పనికి వెళ్లిన దీపక్ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఒక్కడే ఇక్కడ ఉండటంతో ఆయనకు సంబంధించిన కుటుంబసభ్యులు ఎవరూ ఇక్కడ లేరు. దీపక్తో పాటు అద్దె గదిలో ఉంటున్న తన స్నేహితులు సునాముద్దీన్, బవుజీలు ఇతర స్నేహితులు ఇప్పుడు దీపక్ ఆచూకీ కోసం పరిశ్రమ వద్దకు వచ్చి అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అడిగితే అధికారుల నుంచి స్పందన లేదని సునాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐలా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరం వద్ద కూడా ఆరా తీశారు. ఎక్కడా తన స్నేహితుడి జాడ కనిపించకపోవంతో వీరంతా తీవ్ర ఆవేదనతో కాలం వెల్లబోసుకుంటున్నారు. -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత ప్లేయర్గా
భారత టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడిన టీమిండియాను జైశ్వాల్తో కలిసి గిల్ ఆదుకున్నాడు.ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నాక తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. సూపర్ ఇన్నింగ్స్తో భారత్ను భారీ స్కోర్ దిశగా శుబ్మన్ నడిపిస్తున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. గిల్కు ఇది ఏడో టెస్టు సెంచరీ.కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన శుబ్మన్ గిల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.గిల్ సాధించిన రికార్డులు ఇవే..👉కెప్టెన్గా వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన నాలుగో భారత కెప్టెన్గా గిల్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు విజయ్ హాజారే, సునీల్ గవాస్కర్ టెస్టు కెప్టెన్లుగా మొదటి రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లి వరుసగా మూడు మ్యాచ్లలో శతక్కొట్టాడు.👉ఇంగ్లండ్ గడ్డపై రెండు టెస్టు సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆసియా కెప్టెన్గా శుబ్మన్ నిలిచాడు. గిల్ కేవలం 25 సంవత్సరాల 297 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇంగ్లండ్లో అతి తక్కువ వయస్సులో రెండు టెస్టు సెంచరీలు పర్యాటక బ్యాటర్గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఈ ఘనతను 22 సంవత్సరాల 180 రోజుల వయస్సులో సాధించాడు. స్మిత్ తర్వాత ఈ ఫీట్ సాధించింది శుబ్మనే కావడం గమనార్హం.👉అదేవిధంగా ఇంగ్లండ్లో రెండుసార్లు టెస్టు మ్యాచ్ మొదటి రోజే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ భారత ఆటగాడిగా ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఓవరాల్గా 13వ ప్లేయర్గా గిల్ రికార్డులకెక్కాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్ -
ప్రియురాలితో గొడవపడి న్యాయవాది ఆత్మహత్య
ఉప్పల్(హైదరాబాద్): ప్రేమించిన యువతితో గొడవ జరగడంతో మనస్తాపానికి లోనైన ఓ యువ లాయర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ టీచర్స్ కాలనీకి చెందిన కల్లూరి సాయినాథ్ (30) ఉప్పల్ సూర్యానగర్ కాలనీలో ఉంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నాడు. అతను ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే సదరు యువతిని కాదని మరొకరికి పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో అతడి ప్రియురాలు సాయినాథ్ ఇంటికి వచ్చి గొడవ పడింది. దీంతో మనస్తాపానికి లోనైన సాయినాథ్ సూర్యానగర్లోని స్నేహితుల ఇంటికి వెళ్లాడు. స్నేహితులు డ్యూటీకి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయినా«థ్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటకి వచ్చిన అతడి స్నేహితులు తలుపులు తెరిచి చూడగా సాయినాథ్ అప్పటికే మృతి చెందాడు. వారి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గడ్డి మందు తాగి మరో యువకుడు.. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం, రామావరం ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్(25) డ్రైవర్గా పని చేసేవాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భారీగా హెరాయిన్ పట్టివేత మణికొండ: రాజస్థాన్ నుంచి హెరాయిన్ అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి భారీగా హెరాయిన్ స్వా«దీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ, వైఎస్సార్ కాలనీలో ఉంటున్న రాజస్థాన్కు చెందిన వైష్ణోయ్ చోగారాం బుధవారం నార్సింగిలో తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నుంచి 650 గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేశాడు. దానిని ఇంటికి తీసుకెళుతుండగా సమాచారం అందడంతో దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు సరుకు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని నార్సింగి పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.1.5 కోట్లు ఉంటుందనిపోలీసులు తెలిపారు. -
బల్కంపేట బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ పోలీసు శాఖలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం కారణంగా ఎస్ఐ రాజేశ్వర్ మృతి చెందారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. ఫిల్మ్ నగర్ ఎస్ఐ రాజేశ్వర్ నిన్న రాత్రి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో చేర్యాల వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా రాజేశ్వర్ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. -
ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్.. ఏపీ పోలీస్ బిగ్ బాస్ ఎంట్రీ!
సాక్షి, అమరావతి: వేధింపులు, అవమానాలతో ఐపీఎస్ సర్వీసుకు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా జీపీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్) సిద్ధార్థ్ కౌశల్పై ప్రభుత్వ పెద్దలు తమ ప్రతాపం చూపించారు. ‘ఐపీఎస్కు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై’ అనే శీర్షికతో ‘సాక్షి’ పత్రిక బుధవారం ప్రచురించిన కథనం పోలీసు శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది.అసలు రాష్ట్ర పోలీసు శాఖలో ఏం జరుగుతోంది.. ఎటువంటి పరిణామాలకు దారితీస్తోందని పోలీసు వర్గాలు తీవ్రస్థాయిలో చర్చించుకున్నాయి. రానున్న రోజుల్లో పోలీసు శాఖలో పరిస్థితులు మరింతగా దిగజారుతాయని ఆవేదన వ్యక్తంచేశాయి. తమ వేధింపుల వ్యవహారం మరోసారి బట్టబయలు కావడంతో హడలిపోయిన ప్రభుత్వ పెద్దలు వెంటనే పోలీస్ బిగ్ బాస్ను రంగంలోకి దించారు.కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎస్ సర్వీసు నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాలని సిద్ధార్థ్ కౌశల్పై డీజీపీ కార్యాలయం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. తాము చెప్పినట్టు ప్రకటన జారీ చేయకపోతే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం ఆయన చేసిన దరఖాస్తును ఆమోదించబోమని కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. పోలీస్ బిగ్ బాస్ ఒత్తిడికి ఆయన తలొగ్గారు. అనంతరమే సిద్ధార్థ్ కౌశల్ పేరుతో ఓ పత్రికా ప్రకటనను పోలీసు వర్గాలు విడుదల చేశాయి. సిద్ధార్థ్ కౌశల్పై డీజీపీ కార్యాలయం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆయనతో పత్రికా ప్రకటన జారీ చేయించిందని పోలీసు వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకే వీఆర్ఎస్: సిద్ధార్థ్ కౌశల్ సుదీర్ఘంగా ఆలోచించి, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని సిద్ధార్థ్ కౌశల్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న స్పష్టమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారిగా పని చేయడం తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన అనుభవమన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
గదిలో బంధించాడు వివస్త్రను చేశాడు!
కోల్కతా: లా కాలేజీ గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు మోనోజిత్ మిశ్రాపై మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరో విద్యార్థిని వెల్లడించింది. ఓ వేడుక సందర్భంగా గదిలో బంధించి, వివస్త్రను చేసి లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ‘‘2023 అక్టోబర్లో కాలేజీ వేడుకలో ఓ పక్క విద్యార్థులు డ్యాన్స్ చేస్తుండగా మా నాన్న ఫోన్ చేశారు. గోలగోలగా ఉండటంతో మాట్లాడటానికి పక్కనున్న ఖాళీ గదిలోకి వెళ్లాను. మాట్లాడి బయటికి రాబోతుండగా మోనోజిత్ లోపలికొచ్చి తలుపు లాక్ చేశాడు. మద్యం, గంజాయి తాగి ఉన్నాడు. నా మీదికొస్తుంటే నెట్టేశా. దాంతో తన జేబులోని రిమోట్తో వేదిక వద్ద మ్యూజిక్ సౌండు పెంచాడు. తర్వాత నా జుట్టు పట్టుకుని గదిలోని బాల్కనీలోకి ఈడ్చుకెళ్లాడు. నా బట్టలు విప్పడం ప్రారంభించాడు. వదిలెయ్యమని వేడుకున్నా. బిగ్గరగా అరిచా. అదృష్టవశాత్తూ ఒక సీనియర్ విద్యార్థి తలుపు తట్టడంతో మోనోజిత్ పారిపోయాడు’’ అని వెల్లడించింది. ఇష్టపూర్వక లైంగిక కలయికే: లాయర్ గ్యాంగ్ రేప్ కేసులో మోనోజిత్తో పాటు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ కస్టడీని కోర్టు మరో ఎనిమిది రోజులు పొడిగించింది. వారి తర్వాత అరెస్టయిన నాలుగో నిందితుడు, కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకీ బెనర్జీ కస్టడీనీ జూలై 4 వరకు పొడిగించారు. మోనోజిత్ ఆరోగ్య పరీక్షల సమయంలో సమయంలో అతని శరీరంపై రక్కిన గీతలను పోలీసులు గుర్తించారు. లైంగిక దాడిని బాధితురాలు ప్రతిఘటించిందనేందుకు అవి నిదర్శమని పోలీసు వర్గాలు తెలిపాయి. మోనోజిత్ కాల్ రికార్డులను సిట్ బృందం పరిశీలించింది. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నయనా చటర్జీతో అతనికి జరిగిన ఫోన్ సంభాషణల ఆధారాలను గుర్తించింది. కానీ మోనోజిత్ తరఫు లాయర్ రాజూ గంగూలీ మాత్రం బాధితురాలి ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఆరోపించారు. ‘‘ఆమె ఇష్టపూర్వకంగానే అతనితో లైంగికంగా కలిసింది. మోనోజిత్ మెడపై ఆమె గోటి గుర్తులే దానికి నిదర్శనం. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ కావాలనే దాస్తోంది’’ అని ఆక్షేపించారు. -
Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ
న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాలలో వరుస ఉగ్రవాద దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే నేపధ్యంలో మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అపహరించింది. దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తూ, మాలి ప్రభుత్వం ఆ ముగ్గురు భారతీయుల సురక్షితమైన విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.మాలిలోని కేస్లోగల డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆ ముగ్గురు భారతీయులు పనిచేస్తున్నారు. వీరి కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. జూలై ఒకటిన సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ప్రాంగణంలో దాడి చేసి, ముగ్గురు భారతీయులను బందీలుగా తమ వెంట తీసుకువెళ్లిందని ఎంఈఏ తెలిపింది.అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్ఐఎం)మాలి అంతటా జరిగిన దాడులకు బాధ్యత వహించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆ ముగ్గురు భారతీయుల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం ఖండిస్తోందని, అపహరణకు గురైన భారత పౌరులను సురక్షితంగా విడుదల చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఎంఈఏ కోరింది. మాలిలోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని,అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని ఎంఈఏ సూచించింది.ఇది కూడా చదవండి: విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే.. -
SpiceJet: గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్
ముంబై: గోవా నుంచి పుణెకు ప్రయాణిస్తున్న స్పైస్జెట్ క్యూ400 విమానం కిటికీ ఫ్రేమ్ హఠాత్తుగా ఊడిపోయింది. అయితే ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలుస్తోంది. పుణెలో విమానం ల్యాండవగానే ఊడిన కాస్మెటిక్ ఇంటీరియర్ కిటికీ ఫ్రేమ్ను బిగించామని స్పైస్జెట్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటనను ఆ విమాన ప్రయాణికులు తీవ్రంగా తప్పుబట్టారు. సరైన ముందుస్తు తనిఖీలు చేయకుండా విమానాలను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ కిటికీ అసెంబ్లీ యూనిట్ మొత్తం ఊడిపోయింది. అయినాసరే విమానాన్ని అలాగే పోనిచ్చారు. అసలీ విమానాన్ని ఎగిరే అర్హత ఉందా?’’ అంటూ ఒక ప్రయాణికుడు సంబంధిత కిటికీ ఫొటోను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు ట్యాగ్చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. #SpiceJet from Goa to Pune today. The whole interior window assembly just fell off mid flight. And this flight is now supposed to take off and head to Jaipur. Wonder if it’s air worthy @ShivAroor @VishnuNDTV @DGCAIndia pic.twitter.com/x5YV3Qj2vu— Aatish Mishra (@whatesh) July 1, 2025 -
గాల్లో ప్రాణాలు.. ఫోన్లలో వీలునామాలు
టోక్యో: తరుణ్, జెనీలియా జంటగా గతంలో వచ్చిన ‘శశిరేఖా పరిణయం’సినిమాలో గాయాలపాలైన హీరోయిన్ చనిపోతానన్న భయంతో అప్పటికప్పుడు తన ప్రేమను హీరోకు చెప్తుంది. అచ్చం అలాగే తాము చనిపోవడం ఖాయమని భావించిన విమాన ప్రయాణికులు అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్ఫోన్లలో వీలునామాలు, పాస్వర్డ్లు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఈ ఘటన జపాన్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జూన్ 30న చైనాలోని షాంఘై పుడోంగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరిన విమానం మార్గమధ్యంలో ఇలా సాంకేతిక లోపంతో హఠాత్తుగా కిందకు దిగొచ్చి ప్రయాణికులకు గాల్లోనే చుక్కలు చూపించింది. చివరకు పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎలాగోలా విమానాన్ని సమీప ఒసాకా నగరంలోని కన్సాయ్ విమానాశ్రయంలో రాత్రి 8.50 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బందిసహా విమానంలోని మొత్తం 191 మంది ఊపిరి పీల్చుకున్నారు. A Spring Airlines flight from Shanghai to Tokyo was forced to make an emergency landing at Kansai Airport after a sudden loss of cabin pressure triggered a rapid descent from 36,000 feet to just under 10,500 feet in ten minutes.Flight JL8696 was cruising over Japan when a… pic.twitter.com/2n8rDGfqu5— FL360aero (@fl360aero) July 1, 2025జపాన్లోని టోక్యో నరీటా ఎయిర్పోర్ట్కు బయల్దేరిన ఈ బోయింగ్ 737 విమానం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 6.53 నిమిషాలకు ఈ అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. విమానంలో తలెత్తిన ఈ సాంకేతిక సమస్యపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. రాత్రివేళ హాయిగా నిద్రపోతున్న వేళ విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనై కిందకు దూసుకురావడం, ప్రయాణికులు ఉన్నట్లుండి తమ సీట్లలోంచి ఎగిరి పైకప్పునకు ఢీకొనడం, ఆక్సీజన్లు మాసు్కలు పెట్టుకోండని సహాయక సిబ్బంది ఏడుస్తూ చెప్పిన దృశ్యాలను కొందరు ప్రయాణికులు రికార్డ్చేశారు.Passengers on a Japan Airlines flight had to wear oxygen masks after the plane fell nearly 26,000 feet pic.twitter.com/5nseotGv3n— daredevil (@daredevil_1010) July 2, 2025ఇక, తాము ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై చనిపోతామని భావించిన ప్రయాణీకులు.. అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్ఫోన్లలో వీలునామాలు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఇంకొందరేమో తమ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ల పిన్ నంబర్లు, లాగిన్ పాస్వర్డ్లు పంపించారు. మరి కొందరు బీమా మొత్తాలు, ఇన్సూరెన్స్ కంపెనీల వివరాలను మెసేజ్లుగా పంపించారు. 36,000 అడుగుల ఎత్తు నుంచి విమానం 10,500 అడుగుల దిగువకు స్వేచ్ఛగా పడిపోతుండటంతో తాము చనిపోవడం ఖాయమని భావించిన చాలా మంది ప్రయాణికులు ఇలా తమ చివరి కోరికలు, వీలునామాలను స్మార్ట్ఫోన్లో తమ కుటుంబసభ్యులకు చేరవేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (31 బంతుల్లో 86; 6 ఫోర్లు, 9 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన మూడో యూత్ వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది.నార్తంప్టన్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్ను వర్షం వల్ల 40 ఓవర్లకు కుదించగా ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఓపెనర్లు డాకిన్స్ (61 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్), ఇసాక్ మొహమ్మద్ (43 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు) తొలి వికెట్కు 78 పరుగులు జోడించి చక్కని ఆరంభమిచ్చారు. తర్వాత వన్డౌన్ బ్యాటర్ బెన్ మయెస్ (31) ఫర్వాలేదనిపించాడు.మిడిలార్డర్లో కెప్టెన్ థామస్ ర్యూ (44 బంతుల్లో 76 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడటంతో ఆఖర్లో స్కోరు వేగంగా దూసుకెళ్లింది. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్ 3 వికెట్లు పడగొట్టగా, దీపేశ్, విహాన్, నమన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ కెప్టెన్ అభిజ్ఞాన్ (12) వికెట్ను కోల్పోయింది.అయితే మరో ఓపెనర్ వైభవ్, వన్డౌన్లో వచ్చిన విహాన్ మల్హొత్రా (34 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా వైభవ్ భారి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టి20ను తలపించేలా 7.3 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద దాటింది.సూర్యవంశీ అవుటయ్యాక విహాన్, ఆ తర్వాత కనిష్క్ చౌహాన్ 42 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 34.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసి గెలిచింది. అలెగ్జాండర్ వేడ్కు 2 వికెట్లు దక్కాయి. -
విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే..
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జూన్ 12న ఘోర విమాన ప్రమాదం జరిగిన దరిమిలా అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముగ్గురు శిక్షణ పొందిన పైలట్లు ఎయిర్లైన్స్ బోయింగ్ 787 విమాన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ పైలట్లు విద్యుత్ వైఫల్యాలను తిరిగి సృష్టించారు. ఫలితంగా డ్యూయల్-ఇంజిన్ నిలిచిపోయంది. దీంతో విమానం టేకాఫ్ తర్వాత పైకి వెళ్లలేకపోయింది.ప్రమాద ఘటన అనంతరం జెట్లైనర్ బ్లాక్ బాక్స్ల నుండి ఇప్పటికే డేటాను డౌన్లోడ్ చేసుకున్న పరిశోధకులు, 787లోని ఇంధన స్విచ్ల స్థానాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇంధన స్విచ్ల శిధిలాలతో ఈ డేటాను ధృవీకరించనున్నారు. విమానం క్లిష్టమైన దశకు చేరుకున్నప్పుడు టేకాఫ్ రన్ సమయంలో పైలట్లు అనుకోకుండా ఏదైనా స్విచ్ ఆఫ్ చేశారా? అనేదానిని నిర్ధారించడానికి రీక్రియేషన్ ఉపకరించనుంది.రీక్రియేషన్ చేసిన పైలెట్లు ఘటన జరిగిన నాటి పరిస్థితులను తిరిగి సృష్టించారు. ఈ ఫలితాలతో ట్రిమ్ షీట్ డేటాను రూపొందించారు. ట్రిమ్ షీట్ అనేది విమానం సమతుల్యతను లెక్కించడానికి, రికార్డ్ చేయడానికి ఏవియేషన్లో ఉపయోగించే విధానం. ఇది విమానపు టేకాఫ్, ల్యాండింగ్ కోసం గురుత్వాకర్షణ కేంద్రం సురక్షిత పరిమితుల్లో ఉందని నిర్ధారిస్తుంది. శిక్షణ పైలట్లు ఒకే ఇంజిన్ వైఫల్యాన్ని రీక్రియేట్ చేసి, పలు వివరాలను సేకరించారు. కాగా ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలోని పైలట్లకు 400 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు డ్యూయల్-ఇంజిన్ వైఫల్యం తలెత్తితే, దానిని ఎదుర్కొనేందుకు శిక్షణ అందించలేదని సమాచారం. ఇది కూడా చదవండి: బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం -
విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం.. జీపీఎస్ స్పూఫింగ్?
సాక్షి, నేషనల్ డెస్క్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీని వెనుక కుట్రకోణం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్మ మొహోల్ సైతం చెప్పారు. గ్లోబల్ పోజీషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సంకేతాలను తారుమారు చేసి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయేలా ఎవరైనా కుట్రలు సాగించారా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే 2023 నవంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశ సరిహద్దుల్లో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అమృత్సర్, జమ్మూ ప్రాంతాల్లో అధికంగా జరిగాయి. గత నెలలో ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన ఎయిర్ విమానం కొద్దిసేపటికే తిరిగివచ్చింది. జీపీఎస్ సంకేతాల్లో ఏదో తారుమారు జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. పైలట్కు తప్పుడు సంకేతాలు భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన సి–130జే విమానం ఏప్రిల్లో మయన్మార్ గగనతలంపై ప్రయాణిస్తుండగా జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది. దాంతో అప్రమత్తమై సురక్షితంగా ల్యాండ్చేశారు. జీపీఎస్ సిగ్నళ్లలోకి అపరిచితులు, విద్రోహులు చొరబడుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. స్పూఫింగ్ లేదా జామింగ్ అనేది పెనువిపత్తుగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్పోర్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2023–2024 మధ్య జీపీఎస్లో ఇంటర్ఫియరెన్స్ రేటు 175 శాతం, జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు 500 శాతం పెరిగాయి. స్ఫూపింగ్ లేదా జామింగ్ చేస్తే విమానం కాక్పిట్లోని పైలట్కు తప్పుడు మార్గం, తప్పుడు గమ్యస్థానం కన్పిస్తాయి. నిర్దేశిత మార్గంలో వెళ్లాల్సిన విమానం మరో మార్గంలో వెళుతుంది. విమానం ప్రయాణించాల్సిన ఎత్తులోనూ మార్పులు వస్తాయి. దాంతో గగతలంలో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎత్తయిన భవనాలు, కొండలను ఢీకొట్టొచ్చు. అలాగే రన్వే కిందికి దూసుకెళ్లడం కూడా జరగొచ్చు. కల్లోలిత ప్రాంతాల్లో అధికం.. యుద్ధాలు జరిగే కల్లోలిత ప్రాంతాల్లో జీపీఎస్ స్పూఫింగ్ సమస్య అధికంగా ఉంది. 2024లో ఆయా ప్రాంతాల్లో శాటిలైట్ సిగ్నల్ జామింగ్ లేదా స్పూఫింగ్ ఘటనలు 4.3 లక్షలు నమోదయ్యాయి. 2023లో 2.6 లక్షలు నమోదయ్యాయి. అంటే ఏడాది కాలంలో 62 శాతం పెరిగాయి. ఈజిప్టు, లెబనాన్, నల్ల సముద్రం, రష్యా–ఎస్తోనియా, రష్యా–లాతి్వయా, రష్యా–బెలారస్ సరిహద్దుల్లో స్ఫూపింగ్ బెడద ఎక్కువగా ఉందని ఎయిర్లైన్స్ సంస్థలు చెబుతున్నాయి. మయన్మార్తోపాటు భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ వైమానిక పరిశ్రమ ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో జీపీఎస్ స్ఫూపింగ్, జామింగ్ కూడా ఒకటి. ఇలాంటి ఘటనలు తెలియపర్చడానికి అమెరికాలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ ఒక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగు తీసిన భక్తులు
సాక్షి, తిరుపతి: తిరుపతిలో భారీ అగ్నిప్రమాద ఘటన వెలుగుచూసింది. గోవిందరాజుస్వామి ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను చూసి భయంతో భక్తులు పరుగు తీశారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజుస్వామి ఆలయం సమీపంలోని ఓ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో, ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఎగిసి పడుతున్న మంటలను చూసి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా షాపులో ఉన్న ఇత్తడి సామాన్లు, బొమ్మలు దగ్దమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
థాయిలాండ్లో ఒకేఒక్కడు !
బ్యాంకాక్: 1999వ సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించిన హీరో అర్జున్ సినిమా ‘ఒకే ఒక్కడు’ గుర్తుండే ఉంటుంది. ముఖ్యమంత్రి పాత్రధారి రఘువరన్ దమ్ముంటే ఒక్కరోజు సీఎంగా పరిపాలించి చూడు ఆ కష్టమేంటో తెలుస్తుంది అంటూ కథానాయకుడికి సవాల్ విసరడం, సవాల్ను అంతేవేగంగా స్వీకరించి అర్జున్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని మెరుపువేగంతో పరిపాలనను చక్కదిద్దడం సినిమాలో చూశాం. సినిమాలో మాత్రమే సాధ్యమయ్యే ఈ అనూహ్య ఘటనకు ఇప్పుడు థాయిలాండ్ రాజకీయం వేదికైంది. కాంబోడియా ప్రధాని హున్సేన్తో ఫోన్ సంభాషణలో అతివినయం ప్రదర్శిస్తూ సొంత దేశ సైన్యాన్నే కించపరిచారంటూ ఆరోపణలు రావడంతో థాయిలాండ్ యువ మహిళా ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రను మంగళవారం దేశ రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్చేసింది. దీంతో ప్రధాని పీఠం ఖాళీ అయింది. రాజకీయ సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ వెంటనే రవాణా మంత్రి సూర్య జుగ్రూంగ్రియాంగ్కిట్ను ప్రధానిగా ప్రకటించింది. అయితే ఆయన కేవలం 24 గంటలపాటు మాత్రమే ప్రధానమంత్రి హోదా లో కొనసాగుతారని స్పష్టంచేసింది. దీంతో ఒక్క రోజు ప్రధాని అంశం మంగళవారం యావత్ థాయిలాండ్లో చర్చనీయాంశమైంది. ఒక్కరోజు లో కొత్త ప్రధాని ఏమేం బాధ్యతలు నెరవేర్చుతారు?. ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ మొదలైంది. ఈ విస్తృత చర్చల నడుమే సూర్య బుధవారం ఉదయం ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పటికే ఉపప్రధాని బాధ్యతలు నిర్వహిస్తున్న సూర్యకు ఇప్పుడీ ప్రధాని బాధ్యతలు అదనం. బుధవారం బ్యాంకాక్ నగరంలో ప్రధాని కార్యాలయ 93వ వార్షికోత్సవంలో సూర్య పాల్గొని తొలి అధికార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనీసం 93 గంటలుకూడా ప్రధాని కార్యాలయంలో గడిపే అవకాశంలేని నేత ఏకంగా ప్రధాని కార్యాలయ 93వ వార్షికోత్సవాన్ని ప్రారంభించారని విపక్ష పార్టీలు ఎద్దేవాచేశాయి. 24 గంటల్లో వ్యవస్థలోని అవినీతినంతా ఈయన ప్రక్షాళన చేస్తాడా అంటూ విమర్శలు గుప్పించారు. -
ఫస్ట్టైమర్లే విన్నర్లు!
బిహార్లో త్వరలో జరుగనున్న 18వ శాసనసభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అస్త్రశ్రస్తాలతో సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి పెట్టాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సిట్టింగ్లతో పోలిస్తే ఓటర్లు కొత్త అభ్యర్థులకే పట్టం కట్టడం బిహార్లో ఆనవాయితీగా వస్తోంది. 2010, 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. గత మూడు పర్యాయాలు అసెంబ్లీలో అడుగు పెట్టినవారిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు మొదటిసారి పోటీ చేసి గెలిచినవారే కావడం విశేషం. విజేతల్లో ఫస్ట్టైమ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడం బిహార్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. అభ్యర్థులను వరుసగా రెండోసారి గెలిపించడానికి ఓటర్లు ఇష్టపడడం లేదు. కొత్త ముఖాలు 50 శాతానికి పైగానే.. బిహార్లో శాసనసభ స్థానాల సంఖ్య 243. 2010 ఎన్నికల్లో ఏకంగా 150 మంది మొదటిసారి విజయం సాధించారు. అంటే 61.7 శాతం మంది తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించారు. 2015లో వీరి సంఖ్య కొంత తగ్గింది. 243 మందికి గాను 131 మంది తొలిసారి గెలిచారు. 53.9 శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. 2020 ఎన్నికల్లో 127 మంది ఫస్ట్టైమ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ వీరి వాటా 52.3 శాతం. మొత్తానికి కొత్త ముఖాల సంఖ్య 50 శాతానికిపైగానే ఉండడం గమనార్హం. రెండోసారి కంటే మూడోసారి గెలిచిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఈసారి ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందా? లేక ఓటర్లు మనసు మార్చు కుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్లకు కష్టకాలమే రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోసారి పోటీచేసి నెగ్గడం గగనకుసుమంగా మారుతోంది. గత 20 ఏళ్లుగా వారి సక్సెస్ రేటు క్రమంగా పడిపోతోంది. 2005లో పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 71.4 శాతం మంది మళ్లీ గెలిచారు. 2010లో పోటీచేసినవారిలో కేవలం 55 శాతం మంది రెండోసారి ఎన్నికయ్యారు. 2015లో వీరి సంఖ్య 53.1 శాతానికి పడిపోయింది. 2020 ఎన్నికల్లో 48.6 శాతం మంది మరోసారి గెలిచారు. పాత ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్త నేతలకు ఓటర్లు పట్టం కడుతుండడం అశావహులకు వరం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా యువత ఈ అవకాశం సది్వనియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కురుస్తున్న వర్షం... రైతన్న హర్షం
సాక్షి, హైదరాబాద్: రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయం ఊపందుకుంది. ఇప్పటికే పత్తి సాగులో రైతులు బిజీగా ఉండగా, వర్షాల రాకతో వరిసాగు పెరుగుతోంది. చాలా జిల్లాల్లో బావులు, బోర్లు కింద ఇప్పటికే నారుమళ్లు పోశారు. కొన్ని జిల్లాల్లో నాట్లు ప్రారంభం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో నాట్లేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు దుక్కులు దున్నుతూ సేద్యానికి సిద్ధమవుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే రైతులు నారుమళ్లు పోసి.. వరి నాట్లేసే కార్యక్రమాలు ప్రారంభించారు. మహబూబ్నగర్, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో వరిసాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ అధికారులు తగిన సూచనలు, సలహాలతో పంటల సాగును పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్లో లక్షన్నర ఎకరాల్లో ఇప్పటికే సాగు నిజామాబాద్లో ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. కామారెడ్డిలో 27 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, జనగాంలో 15వేల ఎకరాల్లో సాగైంది. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ వారాంతానికి బోర్లు, బావులతోపాటు చెరువులు, కుంటల కింద కూడా నార్లు పోస్తారని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, దిగువ మానేరుతో పాటు దేవాదుల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల కింద నీటి లభ్యతను బట్టి వరిసాగు చేస్తారని తెలిపారు. పత్తి, మొక్కజొన్నకు జీవం ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల మెట్టభూముల్లో సాగైన పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసినట్టయ్యింది. నెలరోజుల క్రితం నుంచే పత్తి సాగు మొదలు కాగా, జూన్ మొదటి వారం నుంచే వరుణుడు మొహం చాటేయడంతో రైతులు ఆందోళన చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పత్తి మొలకెత్తలేదు. కొన్నిచోట్ల మొలకలు వచ్చినా, నీరు లేక ఎండిపోయాయి. కరీంనగర్, మెదక్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా వర్షాలు లేక పత్తి రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 43.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, అందులో పత్తి 31 లక్షల ఎకరాల్లో సాగయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే పత్తి అధికంగా సాగయ్యే ఆదిలాబాద్లో వాతావరణం కొంత అనుకూలంగా ఉండటంతో రైతులకు ఊరటనిచ్చింది. ఇదే జిల్లాలో సోయాబీన్, కంది కూడా ఎక్కువగానే సాగు చేశారు. ఈ వర్షాలతో ఆదిలాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కూరగాయల సాగుకు ఊతం రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కూరగాయల సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈసారి కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుందని ఉద్యానవనశాఖ అంచనా వేస్తుంది. -
అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు
‘‘ఓ నిర్మాతకు ఓ హీరోతో సినిమా కమిట్మెంట్ కావాలంటే అబ్నార్మల్ అడ్వాన్స్లు ఇచ్చి, వాళ్లను హోల్డ్ చేసుకుని సినిమా ప్లాన్ చేయాలి. అది నా ఫార్ములా కాదు. హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ల రూపంలో డబ్బులిచ్చి, వారిని కట్టడి చేయడం అనే దానికి నేను వ్యతిరేకం. ఓ దర్శకుడితో నాకు వేవ్ లెంగ్త్ సింక్ అయితే సినిమా చేస్తాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు పంచుకున్న విశేషాలు.→ కథగా చూస్తే ‘తమ్ముడు’ సింపుల్ స్టోరీ. అక్కా తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, వారు ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు? అనేది మూవీలో చూస్తారు. స్క్రీన్ప్లే పరంగా కొత్తగా చూపిస్తూ, యాక్షన్ సీక్వెన్స్లతో ఆసక్తికరంగా తీశాడు వేణు శ్రీరామ్. ఇది యాక్షన్ ప్యాక్డ్ సినిమా. మొదటి ఇరవై నిమిషాల తర్వాత ఈ సినిమాలోని మిగిలిన కథంతా ఒక్క రోజులో జరుగుతుంది. → మా బ్యానర్లోని గత సినిమాలు అమెజాన్లో స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ ఒకరితోనే ముందుకు వెళ్లలేం కదా. సో... ‘తమ్ముడు’ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్లో సినిమా ప్రదర్శనకు ముందు ఆ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో తెలిసేలా ఉండటం కరెక్ట్ కాదు. ఈ విషయం గురించి ఓటీటీ సంస్థలతో మాట్లాడినప్పుడు సపోర్ట్ చేస్తామన్నారు. → ఎఫ్డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ వేడుక చేశాం. అలాగే మన హైదరాబాద్లో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఈ ఏడాది ఎఫ్డీసీ ద్వారా నిర్వహించాలని అనుకుంటున్నాం. ఆన్లైన్ టికెటింగ్, రన్ట్రాక్ (సినిమా వసూళ్లను ట్రాక్ చేసే విధానం) లను తెలంగాణాలో తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. → మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్రాజు ప్రొడక్షన్స్ సంస్థల్లో ఈ ఏడాది నాలుగు సినిమాలు (రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి, మరో సినిమా స్క్రిప్ట్ స్టేజ్లో ఉంది) రెడీ అవుతున్నాయి. ఇంకా అనిల్ రావిపూడితో ఓ సినిమా, ‘మార్కో’ హనీఫ్తో ఓ సినిమా, ఓ ఇద్దరు కొత్త డైరెక్టర్స్ సినిమాలు ఉన్నాయి. ఇంకా ఓ అడ్వెంచరస్ సినిమా కూడా ఉంది. ప్రశాంత్ నీల్తో సినిమా ఉంటుంది. హోల్డ్లో ఉన్న ‘సెల్ఫిష్’ సినిమాపై ఈ వారంలో ఓ కార్లిటీ వస్తుంది. కొత్తవారిని ప్రోత్సహించే విధంగా ‘దిల్’ రాజు డ్రీమ్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ‘దిల్’ రాజు డ్రీమ్స్లో నిర్మాతలు కూడా దరఖాస్తు చేసు కుంటున్నారు. కథ బాగుంటే మేమే బడ్జెట్ కేటాయించి వాళ్లతో సినిమా చేస్తాం. వాళ్లు సినిమా చేసుకుని మా దగ్గరకు వస్తే మా గైడెన్స్తో ఆ సినిమాను రిలీజ్ చేస్తాం. ఇక పైరసీని అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘కుబేర, కన్నప్ప’ చిత్రాల పైరసీ ప్రభావం కాస్త తగ్గింది → ‘గేమ్ చేంజర్’ చిత్రా నికి నిర్మాత మీరేనా? జీ స్టూడియోస్ సంస్థనా? జీ స్టూడియోస్ తమ సినిమా అంటున్నారట? అనే ప్రశ్నకు– ‘‘ఒకవేళ వాళ్లే అయితే లాస్ కట్టమనాలి’’ అని ‘దిల్’ రాజు బదులిచ్చారు.అవమానపరచాలనుకోలేదు: నిర్మాత శిరీష్ ‘‘మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో చిరంజీవి, రామ్చరణ్గారికి ఎంతో అనుబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్చరణ్గారు ఒకరు. ఆయన్ని అవమానపరచడం, కించపరచడం చేయను. అది జరిగిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్లకు, చరణ్గారికి క్షమాపణలు చెబుతున్నాను. మా బ్యానర్లో చరణ్గారితోనే మరో సినిమా చేయబోతున్నాం’’ అంటూ శిరీష్ ఓ వీడియో బైట్ రిలీజ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తర్వాత ఆ చిత్రదర్శకుడు శంకర్, హీరో రామ్చరణ్ కనీసం ఫోన్ కూడా చేయలేదన్నట్లుగా శిరీష్ పేర్కొన్నారు. ఆ తర్వాత నెలకొన్న వివాదంపై తన స్పందనను ఇలా వీడియో బైట్ ద్వారా తెలియజేశారు. -
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఈనెల 31వ తేదీ వరకు చేరికలకు అవకాశం కల్పిస్తూ ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా అన్ని యాజమాన్యాల్లోని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. -
యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఆ విద్యార్థుల కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని.. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణు్ణలైన వారికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? ‘చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (ఎఫ్ఎంజీ) ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన తరువాత ఇక్కడే ఇంటర్న్షిప్ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా.. ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ.. ఇంటర్న్షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా.. ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే.. ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగా చూస్తూ వారి కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్లో భాగం కాదా?.విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ?డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా ఇక్కడే.. మన రాష్ట్రంలోనే.. ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటిద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే.. చంద్రబాబు గారూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే వాటిని వద్దు అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతి కోసం స్కామ్లు చేస్తూ ఆ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లను కూడా వద్దు అంటూ లేఖరాసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని.. కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.వైఎస్ జగన్కు గోడు వెళ్లబోసుకున్న యువ వైద్యులువిదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తిచేసుకున్న యువ వైద్యులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడంతో తామంతా విజయవాడలోని వైద్య విశ్వవిద్యాలయానికి మంగళవారం వెళ్లామన్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు తమపై దాడి చేశారని యువ వైద్యులు వైఎస్ జగన్కు వివరించారు. ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని చెప్పారు. తాము కష్టపడి మెడికల్ కోర్సులు పూర్తిచేశామని, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్ష, ఇంటర్న్షిప్ చేసినా తమకు పర్మినెంట్ నంబర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఎంజీ చేసిన మరికొంతమంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్షిప్ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకున్నారని యువ వైద్యులు వైఎస్ జగన్కు వివరించారు. యువ వైద్యుల వెంట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర ఉన్నారు. -
ఇల్లే ఆమె ట్యుటోరియల్ కాలేజీ
23 ఏళ్లకే ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యి 25 ఏళ్ల వయసులో జాయింట్ కలెక్టర్గా పని చేస్తున్న నేహా బైద్వాల్ ఒక స్ఫూర్తి పాఠం. అమ్మాయిల చదువును అంతగా ప్రోత్సహించని రాజస్థాన్ లో పుట్టిన నేహా మూడేళ్ల పాటు ఫోన్ ని తాకకుండా పట్టుపట్టి చదివి ఐ.ఏ.ఎస్. సాధించారు. గమ్యం చేరాలంటే ఫోన్ ని పక్కన పెట్టాలంటున్న ఆమె మాటలు చర్చను లేవనెత్తుతున్నాయి.‘మా ఇంట్లో టీవీ ఉండదు. మా నాన్నగారు టీవీని ఉండనివ్వలేదు. దాని బదులు ఒక బ్లాక్బోర్డ్ ఉంది. మాది జాయింట్ ఫ్యామిలీ. ఎప్పుడూ చదువుకుంటూ పరీక్షలు రాసే పిల్లలు ఐదారుమంది ఉండేవారు. వారికి ఆ బోర్డు మీద పాఠాలు సాగుతుండేవి. నేను కూడా అలాగే చదువుకున్నాను. మా నాన్న ఆఫీసు నుంచి వచ్చాక రాత్రి భోజనం దగ్గర పిల్లలందరూ ఆ వేళ ఏం చదివారో అడిగేవారు... జవాబులు తెలుసుకునేవారు. ఎవరైనా సరిగ్గా చదవలేదని అనిపిస్తే వారికి క్లాస్ పడేది. రాజస్తాన్ కుటుంబాల్లో/పల్లెల్లో ఆడపిల్ల చదువును ప్రోత్సహించరు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ఆయన ఉద్యోగ రీత్యా మేమంతా ఎక్కువ సంవత్సరాలు ఛత్తిస్గఢ్లోని రాయ్పూర్లో ఉండటం వల్ల మా చదువుకు ఎటువంటి ఆటకం కాలేదు. చదువు ముఖ్యం అని చిన్నప్పుడే మా నాన్న నూరి΄ోశారు’ అంటుంది నేహా బైద్వాల్.2023 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆమెకు 569 ర్యాంకు వచ్చింది. మొత్తం 960 మార్కులతో (ఇంటర్వూలో 151) ఆమె ఈ విజయం సాధించింది. అయితే ఇదంత సులువు కాలేదు. అందుకు నాలుగేళ్లు కష్టపడింది. మూడుసార్లు విఫలమయ్యి నాలుగోసారి విజయం సాధించింది.5వ తరగతి ఫెయిల్నేహా మొదటి నాలుగేళ్లు రాజస్థాన్లో ఉన్న తాతగారి ఇంట్లో చదువుకుంది. అది పల్లెటూరి. అక్కడ రాజస్థానీ మీడియంలోని చిన్న బడి ఉండేది. అయితే ఐదోక్లాస్ నాటికి తండ్రి ఆమెను తాను ఉద్యోగం చేస్తున్న చోటుకు తెచ్చి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో వేశాడు. అప్పటికి ఇంగ్లిష్లో ఏ మాత్రం ప్రవేశం లేని నేహా ఐదోక్లాస్లో ఫెయిల్ అయ్యింది. స్కూల్ వాళ్లు హిందీ మీడియంలోకి వేస్తామన్నారు. కాని నేహా పట్టుదలతో ఆరో క్లాస్ నుంచి ఇంగ్లిష్ మీడియంలో పుంజుకుంది.లాయర్ కావాలనుకుని...నేహా అడ్వకేట్ అవుదామనుకుంది. ‘బాధితులకు న్యాయం జరగాలంటే అదొక మంచి మార్గం అనుకున్నాను’ అంటుందామె. కాని అంతకంటే ఎక్కువమందికి నువ్వు మేలు చేయాలంటే ఐ.ఏ.ఎస్ కావాలి అని తండ్రి దిశా నిర్దేశం చేశాడు. రాయ్పూర్లోని మహిళా కళాశాలలో డిగ్రీ చదివిన నేహా అందుకు మార్గం ఏమిటని తండ్రిని అడిగితే కాలాన్ని గెలవడమే అని చె΄్పాడు. ‘పనికిరాని వాటికి సమయాన్ని వృథా చేయడం కంటే దానిని పూర్తిగా సద్వినియోగం చేయడమే విజయానికి మార్గం అని తెలుసుకున్నాను’ అంటుంది నేహా. టీవీ లేని ఆ ఇంట్లో ఆమె ఇక ఫోన్ కూడా పక్కన పెట్టేసింది. ఇల్లే ఆమె ట్యుటోరియల్ కాలేజీ, ప్రిపరేషన్ జరిగే చోటు.నాలుగోసారి‘నేను ఆశాజీవిని. ఓడి΄ోక ప్రయత్నించడం మన బాధ్యత’ అంటుంది నేహా. నేహాకు మొదటి అటెంప్ట్లో అసలేమీ రిజల్ట్ కనపడలేదు. రెండో అటెంప్ట్లో ప్రిలిమ్స్లో 2 మార్కులు తక్కువ రావడంతో అర్హత రాలేదు. మూడో అటెంప్ట్లో మెయిన్స్లో అర్హతకు 8 మార్కులు తక్కువ వచ్చాయి. మూడుసార్లు విఫలమయ్యాక నాలుగోసారి మళ్లీ పరీక్షకు కూచోవడం ఎవరికైనా కష్టమే. కాని నేహా నాలుగోసారి రాసింది. ఈసారి ఆమె శ్రమ వృథా కాలేదు. 2023 సంవత్సరంలో ఆమెకు 569వ ర్యాంకు వచ్చింది. గుజరాత్ కేడర్ అలాట్ అయ్యింది. శిక్షణ తర్వాత గుజరాత్లో అసిస్టెంట్ కలెక్టర్గా ΄ోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ‘నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నిన్ను నీవు మోసం చేసుకోకుండా కష్టపడితే విజయం తథ్యం’ అంటోందామె.అందరూ తోడేనేహా చదువుకుంటూ ఉంటే ఒక్కోరోజు ఒక్కొక్కరు తోడు కూచునేవారు. ఒకరోజు తండ్రి, మరోరోజు బాబాయి... ‘మేమున్నాం తోడుగా. నీ ప్రిపరేషన్ నువ్వు, మేము నీకు తోడు అనే భరోసా దీని ద్వారా అందేది’ అంటుంది నేహా. ఆమెకు ముగ్గురు తమ్ముళ్లు. వారిలో ఒక తమ్ముడు మెయిన్స్కు అన్ని ప్రశ్నలు సమయానికి రాయడం ఎలాగో టిప్స్ చెప్పి సాధన చేయించాడు. ‘మా ఇంట్లో రోజూ నాకు మాక్ ఇంటర్వ్యూలు ఉండేవి. రోజూ ఎవరో ఒకరు ఐ.ఏ.ఎస్. కోసం బోర్డు ఎలా అయితే ప్రశ్నలు అడుగుతుందో అలా ప్రశ్నలు ప్రిపేరయ్యి మరీ నన్ను అడిగేవారు. ఇది నాకు ఎంతో ఉపయోగపడింది’ అంటుంది నేహా. -
ఈసీ విశ్వసనీయతకు గొడ్డలిపెట్టు
భారతీయ ప్రజాస్వామ్యానికి దేశంలోని మరే ఇతర సంస్థ కన్నా కూడా ఎన్నికల కమిషనే (ఈసీ) ఎక్కువ నష్టం కలిగించింది. తెలిసో తెలియకనో వాటిల్లిన ఆ నష్టం వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాలక పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నికలను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఇపుడు ప్రజల మనసులలో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. దీనిలో ఉద్దేశపూర్వకంగా జరిగింది ఎంతో నాకు తెలియదు. దానికి సంబంధించి నా వద్ద ఎలాంటి సమాచారం కూడా లేదు. కానీ, ఒక సంస్థగా దాని వ్యవహార శైలిపై మరింత స్పష్టీకరణ, మరింత నిజాయతీతో కూడిన జవాబులు అవసరం. ‘సీఎస్డీఎస్’ సర్వేలలో ఈసీ విశ్వసనీయత స్థిరంగా తగ్గుతూ రావడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది! తన ప్రతిష్ఠను పునరుద్ధరించుకునేందుకు ఈసీ చేసుకున్నది కూడా ఏమీ లేదు. ఇప్పుడెందుకు సమీక్ష?బిహార్ శాసన సభ ఎన్నికల సందర్భంగా, ఆ రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా నిశితంగా సమీక్షించాలని ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బిహార్ ఎన్నికలను మరో రెండు నెలల లోపలే ప్రకటించనున్నారని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి సమయంలో ఎన్నికల జాబితాను విస్తృతంగా సమీక్షించవలసిన అవసరం ఏమొచ్చింది? కడపటి సమీక్షను 2003లో నిర్వహించారు. అది పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్ళు పట్టింది. ఇపుడు ఈసీ ఆ పనిని రెండు నెలల్లో పూర్తి చేయాలని కోరుతోంది. ఇది వర్షాకాలం. బిహార్లో చాలా భాగం వరద తాకిడికి గురవడం కూడా సర్వ సాధారణం. దీంతో ఓటర్ల జాబితా సమీక్ష మరింత క్లిష్టంగా మారుతుంది. అసలు అలా ఆదేశించడమే తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రమైన బిహార్లో వనరులు అరకొరగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు దేశం మొత్తంమీద నాసిరకమైనవి.ఈ నేపథ్యంలో, ఓటర్ల జాబితాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సవరించడం ఇంచుమించుగా అసాధ్యం. రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్లతోపాటు ఇతర పార్టీలు కూడా ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పాలక పార్టీకి సాయపడేందుకే అది ఈ ప్రక్రియను చేపట్టిందని నిందించడంలో వింతేముంది?ఈ పార్టీలు కొన్ని సమంజసమైన ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఓటర్ల జాబితా సంగ్రహ సవరణ జరిగినపుడు, మళ్ళీ ఈ తతంగం దేనికి? తప్పుడు ఓటర్ల జాబితాను ఆధారం చేసుకుని కడపటి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని ఈసీ భావిస్తోందా? కొద్ది నెలల క్రితం నిర్వహించిన సంగ్రహ సవరణ లోపాలతో కూడుకుని ఉందనీ, వాటిని ఇపుడు సరిదిద్దవలసి ఉందనీ భావిస్తోందా? అని అవి ప్రశ్నలను సంధిస్తున్నాయి. అదే నిజమైతే, దేనిని ఆధారం చేసుకుని ఆ రకమైన నిర్ధారణకు వచ్చిందో ఈసీ మొత్తం దేశానికి చెప్పవలసిన అవసరం లేదా? ఏదైనా దర్యాప్తు జరిపారా? నివేదిక దేనినైనా రూపొందించారా? ఈ అంశాలపై ఎవరూ నోరు విప్పడం లేదు. ఆధార్ పనికిరాదా?ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా నిశితంగా సవరిస్తామంటే ఏ పార్టీ అయినా వ్యతిరేకిస్తుందని నేను అనుకోను. క్రితంసారి 2003లో సవరించినపుడు, ఆ ప్రక్రియ సాధికారమైనదిగా ఉండేందుకు తగినంత సమయాన్ని ఇచ్చారు. ఈసారి కనిపిస్తున్నట్లుగా ఆదరాబాదరాగా ఎన్నడూ జాబితాలను సవరించిన దాఖలాలు లేవు. ఓటర్ల జాబితా (2003)కు ఎక్కని ప్రతి పౌరుడు/పౌరురాలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పడమే ప్రతిపక్ష నాయకుల మనసులలో తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది. అలాగే, 1987 తర్వాత పుట్టినవారు వారి తల్లితండ్రుల బర్త్ సర్టిఫికెట్ను సమకూర్చాలని చెబుతున్నారు. అది, అందులోనూ బిహార్ వంటి రాష్ట్రంలో చాలా బృహత్తరమైన కార్యం. బిహార్లో అక్షరాస్యత అత్యల్పం. ప్రభుత్వ యంత్రాంగం అంతంత మాత్రంగా ఉన్న చోట, చాలా తక్కువ వ్యవధిలో అటువంటి సర్టిఫికెట్లను పొందడం కుదిరే పని కాదు. పరమ దారిద్య్రంలోనున్న సమాజంలోని బడుగు వర్గాలు ప్రభుత్వ కార్యాలయం గడప తొక్కేందుకే జంకుతాయి. అలాంటిది తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలను వారు సమకూర్చుకోగలరని ఊహించడం కూడా అసంబద్ధమే అవుతుంది. ఈ ప్రక్రియ మరింత సందేహాస్పదంగా మారడానికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిణమించింది. ఈ ప్రక్రియకు ఆ కార్డు చెల్లదని చెబుతున్నారు. ‘ఎందుకని’ అనే దానికి వివరణ లేదు. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించడం తేలిక కనుక, అది అధికారికమైన గుర్తింపు పత్రంగా గణనకు రాదని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ లెక్కన, ఇతర డాక్యుమెంట్లు మాత్రం నకిలీవి కావనే గ్యారంటీ ఏమైనా ఉందా? దీనిపై ఈసీ నోరు విప్పుతుందా?తటస్థ అంపైర్ అనుకోవచ్చా?ఈసీ అసాధారణమైన రీతిలో న్యాయబద్ధత తాలూకు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సమాన పోటీ అవకాశాలను కల్పించి, తటస్థ అంపైర్గా ఉండవలసిన ఈసీ భారతీయ జనతా పార్టీ ఆడించే బొమ్మగా మారిందనీ, దాని స్వతంత్రత తీవ్ర రాజీకి లోనవుతోందనీ రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత జటిలం చేసింది. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానల్లో ప్రధాని, ప్రతిపక్ష నాయకునితోపాటు భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సుప్రీంకోర్టు తీర్పు చెబితే, సీజేఐ స్థానాన్ని ప్రభుత్వం ఒక క్యాబినెట్ మంత్రితో భర్తీ చేసింది. స్వతంత్రంగా వ్యవహరించే ఈసీ రావడం ప్రభుత్వానికి ఇష్టం లేదేమోననే అభిప్రాయాన్ని అది కల్పించింది.మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడం పైన, ఎన్నికల జాబితాలను ఇష్టానుసారం తారుమారు చేసేశారని ప్రశ్నలు రేకెత్తినపుడు, ఈసీ నుంచి విశ్వసనీయమైన వివరణ రాలేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లుగా పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీని ఇచ్చేందుకు కూడా ఈసీ తిరస్కరించింది. అందుకు అది సాంకేతిక కారణాన్ని సాకుగా చూపింది. వాస్తవానికి, ప్రభుత్వం నిబంధనను మార్పు చేసింది. వీడియో ఫుటేజీని 45 రోజులకు మించి అట్టేపెట్టకూడదని ఈసీ కూడా నిర్ణయించింది. అంతకు ముందు ఆ కాల పరిధి ఏడాదిగా ఉండేది. దేశంలో 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అత్యంత మతపరమైన ఎన్నికలు. ముస్లింలను నేరుగా లక్ష్యంగా చేసుకున్నా, ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఈసీ కనుక నిఘా నేత్రంగా వ్యవహరించి ఉంటే, అనేక మంది నాయకులు వారి ఓటింగ్ హక్కును కోల్పోయి ఉండేవారు. మతపరమైన ప్రచారం చేసినందుకు ఓసారి బాలాసాహెబ్ ఠాక్రే అలాగే ఓటు హక్కును కోల్పోయారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. సంస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని ఈసీ గ్రహించాలి. ఆ సంస్థ విశ్వసనీయతను కోల్పోతే, దేశానికి భవిష్యత్తు అనేదే ఉండదు. మాయోపాయాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఈసీ రాజీపడుతోందని అనుమానం ప్రబలితే, మొత్తం ప్రజాస్వామిక ప్రక్రియే సందేహాస్పదంగా మారుతుంది. చట్టబద్ధమైన ఓటర్లదే విజయమనే ప్రజా నమ్మకం వమ్ము అవుతుంది. ప్రజాస్వామ్యానికి అది మరణ శాసనం అవుతుంది.ఆశుతోష్ వ్యాసకర్త సత్యహిందీ డాట్కామ్ సహ–స్థాపకుడు, ‘హిందూ రాష్ట్ర’ పుస్తక రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
మైక్రోసాఫ్ట్లో మరిన్ని ఉద్యోగాలు కట్..
రెడ్మండ్ (అమెరికా): టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరిన్ని వేల మంది ఉద్యోగులను తీసివేసేందుకు కంపెనీ ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులను పంపించే ప్రక్రియ ప్రారంభించింది. ఎంత మందిని తీసివేస్తున్నదీ కంపెనీ నిర్దిష్టంగా వెల్లడించనప్పటికీ, దాదాపు 9000 మందికి నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్వాసనల తర్వాత గతేడాదితో పోలిస్తే సిబ్బంది సంఖ్య సుమారు 4 శాతం తగ్గుతుందని అంచనా. -
బీమా పథకాల మిస్–సెల్లింగ్ వద్దు..
న్యూఢిల్లీ: కస్టమర్లకు ఒక పాలసీ గురించి చెప్పి మరో పాలసీని అంటగట్టే (మిస్–సెల్లింగ్) ధోరణులను నివారించడంపై బ్యాంకులు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి ఎ నాగరాజు సూచించారు. ఇన్సూరెన్స్ అనేది చాలా సున్నితమైన ఆర్థిక సాధనమని, కస్టమర్లకు విక్రయించే ముందు, దాని గురించి క్షుణ్నంగా వివరించాలని పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటలీకి చెందిన జనరాలి గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగరాజు ఈ విషయాలు తెలిపారు. మిస్–సెల్లింగ్ వల్ల కస్టమర్లకు ప్రీమియంల భారం పెరిగిపోతుందని, ఫలితంగా పాలసీదారులు తమ పాలసీని మళ్లీ పురుద్ధరించుకోరని ఆయన పేర్కొన్నారు. ప్రీమియంలు అధికంగా ఉన్నా కూడా బీమా కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడరు కాబట్టి ప్రీమియంలు సహేతుకంగా ఉండేలా కంపెనీలు చూసుకోవాలని నాగరాజు సూచించారు. కస్టమర్ల క్లెయిమ్లు సకాలంలో, సముచితంగా ప్రాసెస్ అయ్యేలా బీమా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు, ఫ్యూచర్ జనరాలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 24.91 శాతం, ఫ్యూచర్ జనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 25.18 శాతం వాటాల కొనుగోలు పూర్తి చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. -
కూటమి ప్రభుత్వానికి సుప్రీం గట్టి షాక్.. రెండేళ్ల తర్వాత కేసా?
ఈ వ్యవహారం మొత్తం సివిల్ వివాదం. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మలుస్తారా? ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత కేసు నమోదు చేస్తారా? ఇదేమి తీరు? సరైన పద్ధతి కాదు. – రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సుప్రీం విస్మయం అక్రమ కేసులమీద అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలను జైలు పాల్జేయడమే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసుపై కూటమి సర్కారును నిలదీసింది. తప్పుడు కేసులతో 140 రోజులు జైల్లో ఉంచిన వంశీని బయటకు రాకుండా చేసిన ప్రయత్నాలకు సర్వోన్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. – సాక్షి, అమరావతి⇒ ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదుదారు వెనుకుండి వంశీ బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేయించిన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి చీవాట్లు పెట్టింది. వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.⇒ గన్నవరం మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే వంశీని అనేక కేసుల్లో అరెస్ట్ చేశారని ప్రభుత్వానికి గుర్తుచేసింది. గన్నవరం మైనింగ్ వ్యవహారంలో మైనింగ్ వాల్యుయేషన్ నివేదికను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుందరేష్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.2022–23లో ఘటన.. 2025లో కేసా?వల్లభనేని వంశీ, తదితరులు తమ ఆస్తి వివాదంలో జోక్యం చేసుకుంటున్నారంటూ సుంకర సీతామహాలక్ష్మి 2025లో గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. అయితే, ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మే 9న తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సీతామహాలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం వంశీకి బెయిల్ ఇస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. 2022–23లో ఘటన జరిగితే 2025లో కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం మొత్తం సివిల్ వివాదమని, దీనిని క్రిమినల్ కేసుగా ఎలా మారుస్తారంటూ పోలీసుల తీరును ఎండగట్టింది. వంశీ బెయిల్ను రద్దు చేయాలన్న సీతామహాలక్ష్మి అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఆమె పిటిషన్ను కొట్టివేసింది.⇒ గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరంతోపాటు విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు మైనింగ్ జరిపి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి మే 15న ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గన్నవరం పోలీసులు వంశీ, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి పలు షరతులతో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మే 29న ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్ వేసింది. దీనిపై బుధవారం సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. హైకోర్టు తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అక్రమ మైనింగ్తో రూ.195 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తెలిపారు. 700 పేజీల నివేదిక ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ దశలో బెయిల్ రద్దు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఆ నివేదికను సీల్డ్ కవర్లో తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ట్రావెల్ ఫుడ్ @ రూ. 1,045–1,100
న్యూఢిల్లీ: క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల(క్యూఎస్ఆర్)తోపాటు విమానాశ్రయాల్లో లాంజ్ బిజినెస్ నిర్వహించే ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 1,045–1,100 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభమై 9న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 4న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్ కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్ రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. తద్వారా ఐపీవో నిధులు మొత్తం ప్రమోటర్లకు అందనున్నాయి. ప్రమోటర్ సంస్థ కే హాస్పిటాలిటీ బ్రాండుతో ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్సహా విదేశాలలోనూ పలు ఆతిథ్య సేవలు, ఫుడ్ సర్వీసుల బిజినెస్లను నిర్వహిస్తోంది. ఈ ముంబై కంపెనీ తొలుత 2009లో తొలి ట్రావెల్ క్యూఎస్ఆర్ను ప్రవేశపెట్టింది. కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్తోపాటు ఎస్ఎస్పీ గ్రూప్ పీఎల్సీ కంపెనీని ప్రమోట్ చేశాయి. కంపెనీ ప్రధానంగా ఎంపిక చేసిన ఆహారం, పానీయాల(ఎఫ్అండ్బీ)ను ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా విమానాశ్రయాలు, కొన్ని జాతీయ రహదారి ప్రాంతాలలో సమకూర్చుతోంది. దేశీయంగా 14 విమానాశ్రయాలలో సర్వీసులు అందిస్తోంది. మలేసియాలో 3 ఎయిర్పోర్టులలో లాంజ్ సేవలు కలి్పస్తోంది. 2024 జూన్కల్లా దేశ, విదేశాలలో 117 పార్ట్నర్, సొంత బ్రాండ్లతో కలిపి 397 ట్రావెల్ క్యూఎస్ఆర్ ఔట్లెట్లను నిర్వహిస్తోంది. వీటిలో సుప్రసిద్ధ కేఎఫ్సీ, పిజ్జా హట్, కాఫీ బీన్, టీ లీఫ్, సబ్వే, బికనీర్వాలా, అడయార్ ఆనంద్ భవన్, వౌ మోమో తదితర బ్రాండ్స్ ఉన్నాయి. -
తెలంగాణలో పీవీఆర్ ఐనాక్స్ విస్తరణ
న్యూఢిల్లీ: సినిమా ఎగ్జిబిటర్ పీవీఆర్ ఐనాక్స్ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ వారంలో హైదరాబాద్లో కొత్తగా నాలుగు స్క్రీన్ల ప్రాపర్టీని ప్రారంభించనుంది. దీనితో రాష్ట్రంలో మొత్తం స్క్రీన్ల సంఖ్య 110కి చేరుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 26 స్క్రీన్లను జోడించనున్నట్లు వివరించారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మార్కెట్ తమకు అత్యంత ప్రాధాన్య మార్కెట్లలో ఒకటని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 200 స్క్రీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సంజీవ్ కుమార్ చెప్పారు. ఇందుకోసం రూ. 400 కోట్ల వరకు వెచి్చంచనున్నట్లు ఆయన వివరించారు. ప్రధానంగా దక్షిణాదిపై, చిన్న నగరాలు, పట్టణాలపై ఫోకస్ పెట్టనున్నట్లు వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 100 వరకు స్క్రీన్స్ ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా, ఇప్పటికే 20 ప్రారంభించామన్నారు. 100 స్క్రీన్ల లక్ష్యంలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, హుబ్లి సహా దక్షిణాదిలోని వివిధ నగరాల్లో 40 స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని సంజీవ్ కుమార్ వివరించారు. అలాగే సిలిగురి, జబల్పూర్, లేహ్, గ్యాంగ్టక్ వంటి చిన్న పట్టణాల్లో కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. కొత్తగా 200 స్క్రీన్ల రాకతో రెండేళ్లలో మొత్తం స్క్రీన్ల సంఖ్య దాదాపు 2,000కు చేరుతుందని సంజీవ్ కుమార్ తెలిపారు. -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం; తిథి: శు.అష్టమి ప.2.39 వరకు, తదుపరి నవమి; నక్షత్రం: హస్త ప.3.07 వరకు, తదుపరి చిత్త; వర్జ్యం: రా.11.55 నుండి 1.41 వరకు; దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు; అమృత ఘడియలు: ఉ.8.36 నుండి 10.22 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు; యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు; సూర్యోదయం: 5.33; సూర్యాస్తమయం: 6.35. మేషం.... శుభవర్తమానాలు అందుతాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. బాకీలు వసూలవుతాయి. ఆలయదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం.... వ్యయప్రయాసలు. బంధువిరో«ధాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాల విస్తరణలో చికాకులు. ఉద్యోగమార్పులు. కళాకారులకు సమస్యలు ఎదురవుతాయి.మిథునం... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనులు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.కర్కాటకం... కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. వాహనయోగం.సింహం.... కుటుంబం సమస్యలు. సోదరులు, సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగయత్నాలలో అవరోధాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.కన్య.... కొత్త పనులు చేపడతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.తుల.....బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులలో అవరోధాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.వృశ్చికం....శుభకార్యాల ప్రస్తావన. మీ అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు.ధనుస్సు....దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. దైవదర్శనాలు.మకరం....ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. విద్యార్థులకు చికాకులు.కుంభం...ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం.మీనం... దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక లావాదే వీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలం. సత్కారాలు. -
వొడాఫోన్ను పీఎస్యూగా మార్చే ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ టెలికం రంగంలో కనీసం 4 కంపెనీలు సేవలందించేలా చూడాల్సి ఉందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. ఒక ఆంగ్ల చానల్కు ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన దేశీ టెలికం రంగంలోని పలు అంశాలపై మాట్లాడారు. రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా(వీఐ)లో ప్రభుత్వం మరింత ఈక్విటీ వాటాను తీసుకోదని తేల్చి చెప్పారు. వీఐను ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)గా మార్చబోమని స్పష్టతనిచ్చారు. టెలికం కంపెనీలలో ప్రభుత్వ వాటా 49 శాతానికి మించడానికి అనుమతించబోమని తెలియజేశారు. ఇటీవల వీఐ ఈక్విటీ మారి్పడి అవకాశాలను అన్వేíÙస్తున్న నేపథ్యంలో సిందియా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా.. ప్రతీ టెలికం కంపెనీకి బకాయిలను ఈక్విటీ మార్పు చేయాలని కోరే హక్కు ఉన్నట్లు వెల్లడించారు. అయితే అన్ని కంపెనీలకూ ఒకే నిబంధనలు వర్తించవని, ఆయా కంపెనీల పరిస్థితులకు అనుగుణంగా టెలికం శాఖ(డాట్)తోపాటు.. ఆర్థిక శాఖ సాధ్యాసాధ్యాల పరిశీలన తదుపరి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని వివరించారు. భారతీ టెలికం ఈ హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై డాట్ పరిశీలన, విశ్లేషణ పూర్తయితే ఒక నిర్ణయాన్ని తీసుకోగలమని తెలియజేశారు. పోటీ ఉండాలి టెలికంలోనే కాకుండా ఏ రంగంలో అయినా రెండే కంపెనీలు ఆధిపత్యం వహించడం మంచి పరిణా మం కాదని సిందియా పేర్కొన్నారు. దేశీయంగా మొబైల్ టెలికం విభాగంలో పోటీ పరిస్థితులు కొనసాగాలని తెలియజేశారు. పోటీ నివారణ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. మొబైల్ టెలికం రంగంలో 4 కంపెనీలు సర్వీసులందిస్తున్న దేశాలు తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు. టెలికం పెట్టుబడి వ్యయాలలో దేశీ కంపెనీలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క భారత్లో మాత్రమే పెట్టుబడులపై మంచి రిటర్నులు లభిస్తున్నట్లు తెలియజేశారు. ఇది లాభదాయకతపై ఆయా కంపెనీలు, యాజమాన్యాల నిర్ణయాలను బట్టి ఉంటుందని వివరించారు. శాటిలైట్ సేవలు శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం స్పెక్ట్రమ్ ధరల నిర్ణయంపై టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) సన్నాహాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందుకు వీలుగా పలు సంస్థలు, వాటాదారులతో చర్చలు, సూచనలు తదితరాలకు తెరతీసినట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా తగిన సిఫారసులతోకూడిన నివేదికను దాఖలు చేయనున్నట్లు తెలియజేశారు. ట్రాయ్ సలహాలు అమలు చేసేందుకు రెండు నెలలు పట్టవచ్చని పేర్కొన్నారు. -
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఫండ్స్కు డిమాండ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు మంచి డిమాండ్ నెలకొంది. ఈ విభాగంలో సుమారు 22 మ్యూచువల్ ఫండ్స్ పథకాలు సేవలు అందిస్తున్నాయి. వీటి నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏడాది కాలంలో 37 శాతం వృద్ధితో రూ.48,000 కోట్లకు చేరుకున్నాయి. 2024 మే చివరికి వీటి నిర్వహణ ఆస్తులు రూ.34,971 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ విభాగంలోని పథకాలు మంచి పనితీరు చూపించడం ఏయూఎంలో బలమైన వృద్ధికి కారమైనట్టు తెలుస్తోంది. ఈ పథకాలు గత ఏడాది కాలంలో పెట్టుబడులపై 22 శాతం నుంచి 30 శాతం వరకు రాబడులను అందించడం గమనార్హం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న దీర్ఘకాల విశ్వాసానికి నిదర్శనంగా దీన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీఎస్ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 14 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో ప్రధాన సూచీ సెన్సెక్స్ పెరుగుదల 10 శాతంగానే ఉంది. అలాగే బీఎఫ్ఎస్ఐ రంగంలో బీమా, ఫిన్టెక్, వెల్త్ మేనేజ్మెంట్, డిజిటల్గా రుణాలు అందించే అన్లిస్టెడ్ కంపెనీల్లోనూ ఈ తరహా ఫండ్స్ పెట్టుబడులు పెడుతుండడం ఇన్వెస్టర్లు ఆకర్షిస్తోంది. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితంగా మారుతుండడం, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం విస్తరిస్తుండడంతో ఈ విభాగంలో బలమైన కంపెనీల సంఖ్య పెరుగుతోంది. దీంతో దీర్ఘకాలంలో మంచి పెట్టుబడుల అవకాశాలను ఈ రంగం ఆఫర్ చేస్తోంది’’అని వెల్త్ మేనేజర్ అల్ఫాషా పేర్కొన్నారు. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్.. జీసీసీలు టాప్గేర్
న్యూఢిల్లీ: ఆఫీస్ స్పేస్ లీజింగ్ (కార్యాలయ వసతులు) వృద్ధిలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) బలమైన పాత్ర పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో జీసీసీలకు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 24 శాతం శాతం పెరిగింది. 31.8 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కార్యాలయ వసతులను జీసీసీలు గత ఆర్థిక సంవత్సరంలో లీజుకు తీసుకున్నాయి. 2023–24లో జీసీసీలు తీసుకున్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25.6 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 31.8 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్లో 13.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు తీసుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 కంపెనీల లీజింగ్ 10.9 మిలియన్ ఎస్ఎఫ్టీ కంటే 25 శాతం అధికం. ‘‘గత కొన్ని సంవత్సరాలుగా భారత ఆఫీస్ మార్కెట్కు జీసీసీలు ముఖ్య వృద్ధి చోదకంగా నిలుస్తున్నాయి. వ్యయ నియంత్రణ వ్యూహాలు, నైపుణ్య మానవవనరుల లభ్యత, శరవేగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సానుకూల ప్రభుత్వ విధానాలు, వ్యాపార సులభతర నిర్వహణ పరిస్థితులు, సానుకూల వ్యాపార వాతావరణం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి’’అని వెస్టియన్ నివేదిక వెల్లడించింది. 42 శాతం జీసీసీల నుంచే 2024–25 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో జీసీసీల వాటా 42 శాతంగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 41 శాతంగా ఉన్నట్టు వెస్టియన్ తెలిపింది. రానున్న రోజుల్లో జీసీసీల వాటా మరింత పెరుగుతుందని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు అంచనా వేశారు. ఐటీ–ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, తయారీ, కన్సల్టింగ్ సేవల రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు విస్తరణపై దృష్టి సారించినట్టు చెప్పారు. నిపుణుల లభ్యతకు తోడు బలమైన ఎకోసిస్టమ్ అండతో భారత్ ఆశావహంగా మారినట్టు పేర్కొన్నారు. బెంగళూరులో అధిక వృద్ధి.. అత్యధికంగా బెంగళూరులో గత ఆర్థిక సంవత్సరంలో 12.43 మిలియన్ ఎస్ఎఫ్టీని జీసీసీలు లీజింగ్కు తీసుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో బెంగళూరులో జీసీసీల లీజింగ్ పరిమాణం 8.34 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. ముంబైలో జీసీసీల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 3.68 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లీజింగ్ 1.36 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 170 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. డీఎల్ఎఫ్, ఎంబసీ గ్రూప్, సత్వ గ్రూప్, ప్రెస్టీజ్ గ్రూప్, ఆర్ఎంజెడ్ గ్రూప్, టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర సంస్థలు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ప్రముఖంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ కూడా కార్యాలయ వసతుల లీజింగ్ మార్కెట్లోనే పనిచేస్తున్నాయి. -
బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ!
ఇదో అసాధారణ కేసు.. సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేం జోక్యం చేసుకోం.. కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసు.. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే.. జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదు.– సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటి ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. సింగయ్యను ఉద్దేశపూర్వకంగానే కారు కింద పడేసి తొక్కించారంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను హైకోర్టు ఎండగట్టింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై బీఎన్ఎస్లోని కఠిన సెక్షన్ 105 కింద కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. జీవిత ఖైదు పడే ఈ సెక్షన్ కింద జగన్ తదితరులపై ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఆక్షేపించింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సాధారణంగా ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో తాము జోక్యం చేసుకోమని, అయితే ఇది జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసని, అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని ప్రకటించింది. మాజీ సీఎం వైఎస్ జగన్తోపాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డిలపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్– ఓ వ్యక్తి మరణానికి కారణమైనప్పటికీ హత్య కానిది) కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిçÜ్తున్న ప్రయాణికులు మాత్రమేనని స్పష్టం చేసింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి అని, అప్పుడు మాత్రమే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే, జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదంది. సాధారణంగా తాము ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో జోక్యం చేసుకోబోమని, అయితే ఎఫ్ఐఆర్లోని నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవన్న నిర్ణయానికి వస్తే మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండలేమంది. జోక్యం చేసుకోకుండా ఉండే విషయంలో ఎలాంటి నిషేధం లేదంది. అలా జోక్యం చేసుకోవాల్సినటువంటి అరుదైన కేసుల్లో ఈ కేసు కూడా ఒకటని, అందువల్ల ఈ కేసులో జోక్యం చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. జగన్ తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది.దుర్గారావు చెప్పింది ఇదీ...‘ఈ కేసులో నిమ్మకాయల దుర్గారావు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ కోర్టు పరిశీలించింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఘటన జరిగిన రోజు ఉదయం 10.30–11 గంటలకు మాజీ సీఎం కాన్వాయి తాడేపల్లి వైపు నుంచి జాతీయ రహదారి వైపు వచ్చింది. కారు డ్రైవర్కు సమీపంలో మాజీ సీఎం నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలందరూ ఆయన వైపు పరిగెత్తుకెళ్లారు. దీంతో మాజీ సీఎం కారు నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ సమయంలోనే కారు ఎడమ వైపు సర్వీసు రోడ్డులోకి తిరిగింది. ఓ వ్యక్తి డ్రైవరు వైపు ఉన్న కారు చక్రం కింద పడ్డారు. వెంటనే కాన్వాయిలో ఉన్న నలుగురు ఆ వ్యక్తిని పక్కకు తీసి చెట్ల కిందకు తీసుకెళ్లారు. ఆ తరువాత కాన్వాయి సర్వీసు రోడ్డులోకి వచ్చింది. అనంతరం గాయపడిన వ్యక్తిని చూసేందుకు వెళ్లా. కొద్దిసేపటికి అంబులెన్స్లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ తరువాత నాకు తెలిసింది ఏమిటంటే గాయపడిన వ్యక్తి మరణించాడు..’ అని దుర్గారావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తెలిపారు. పోలీసులు దుర్గారావు ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని మొదట పెట్టిన బీఎన్ఎస్ సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యారంటూ)ను సెక్షన్ 105 కింద మార్చారని పేర్కొన్నారు.అలా చనిపోతారని జగన్ తదితరులకు తెలుసని పోలీసులు చెబుతున్నారు...దర్యాప్తులో భాగంగా పోలీసులు మాజీ సీఎం వెంట ఉన్న భద్రతా సిబ్బందిని విచారించారని న్యాయమూర్తి తెలిపారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారని, అనంతరం జూన్ 25న పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఓ మెమో దాఖలు చేశారన్నారు. టర్నింగ్ తీసుకునే సమయంలో కారును వేగంగా నడపడం వల్ల ప్రజలు కారు కింద పడి మరణిస్తారని డ్రైవర్తోపాటు ఆ కారులో ఉన్న జగన్ తదితరులకు స్పష్టంగా తెలుసునని పోలీసులు ఆ మెమోలో పేర్కొన్నారన్నారు. జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్కు చెప్పారని, అందువల్లే భారీగా జనాలు ఉన్న చోట కారును వేగంగా నడిపారని పోలీసులు ఆ మెమోలో చెప్పారని తెలిపారు. అయితే సెక్షన్ 105 వర్తించాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల చనిపోతాడని తెలిసి ఉండటం తప్పనిసరని, ఈ కేసులో జగన్ తదితరులకు చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదన్నారు. అందువల్ల వారిని సెక్షన్ 105 పరిధిలోకి తీసుకురాలేరని తేల్చి చెప్పారు. -
రూ.2,000 కోట్లు దోచేసే కుట్ర
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులు దోచుకొనే కుట్ర జరిగిందని ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలియజేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన ఆస్తులను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చట్టవిరుద్ధంగా సొంతం చేసుకొనేందుకు ప్రయ త్నించారని వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో బుధవారం ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియా, రాహల్కు 76 శాతం వాటాలున్నట్టు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు పేర్కొన్నారు. ‘‘ఆ సంస్థ ద్వారా ఏజేఎల్కు కేవలం రూ.90 కోట్ల రుణమిచ్చి దాన్ని తీర్చడం లేదన్న సాకుతో ఏజేఎల్కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కొట్టేయడానికి కుట్ర చేశారు. యంగ్ ఇండియా స్థాపనే దురుద్దేశపూరితం’’ అన్నారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. -
ఎల్లుండే మెగా సునామీ?
పెను ఉత్పాతానికి మరో రెండు రోజులేనా? శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దాంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్’ ఇప్పుడు ఆన్లైన్లో యమా ట్రండింగ్లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు. తత్సుకీ ఏం చెప్పారు? కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘‘జపాన్, ఫిలిప్పీన్స్ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరŠామ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’’ అంటూ వరి్ణంచారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరీ తత్సుకీ? తత్సుకీ జపాన్కు చెందిన మాంగా ఆరి్టస్టు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ఆక్రా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాకు చేరుకున్నారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామా ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. కొటోకా ఇంటర్నేషన్ ఎయిర్పోర్టులో మోదీకి ఘన స్వాగతం లభించింది. సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఘనా ప్రభుత్వాధి నేతలతో మోదీ సమావేశ మవుతారు. భారత్–ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు. ప్రధాని మోదీ ఘనాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. అలాగే గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధాని ఘనాలో అడుగుపెట్టడం కూడా ఇదే తొలిసారి. ఇండియా నుంచి బయలుదేరే ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గ్లోబల్ సౌత్లో భారత్కు ఘనా అత్యంత విలువైన భాగస్వామి అని పేర్కొన్నారు. ఘనా పర్యటన అనంతరం ఆయన ఈ నెల 3, 4వ తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టోబాగోలో, 4, 5వ తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు. తర్వాత బ్రెజిల్లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. చివరగా నమీబియాలో పర్యటించి, స్వదేశానికి చేరుకుంటారు. -
మనోళ్ల అక్రమ వలసలు తగ్గాయి
వాషింగ్టన్: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 10,300 మందికి పైగా భారతీయులు అక్రమంగా అమెరికా లోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. వైట్హౌస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. అయితే 2024తో పోలిస్తే భారతీయుల అక్రమ వలసలు 70 శాతం తగ్గినట్టు వెల్లడించింది. గతేడాది జనవరి– మే మధ్య 34,535 మంది భారతీ యులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. అంటే సగటున రోజుకు 230 మంది! 2025లో ఇది రోజుకు 69కి తగ్గింది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కఠినతరం చేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. అమెరికా లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో గుజరాత్కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ఊహించే స్మగ్లింగ్ సిండికేట్ 2024 చివరి నుంచి తమ కార్యకలాపాలను తగ్గించిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 6 లక్షలకు పైగా అక్రమ వలసదారులను అమెరికా సరిహద్దుల వద్ద అరెస్టు చేసింది. 2024లో ఇదే కాలంలో 12,33,959 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో 30 మంది ఒంటరి మైనర్లున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 500 మందికి పైగా భారతీయ మైనర్లను అమెరికా అరెస్టు చేసింది. అనేక దేశాల నుంచి ఏటా వేలాది మంది తమ పిల్లలను అమెరికా–మెక్సికో, అమెరికా–కెనడా సరిహద్దులో వదిలి వెళ్తారు. వారికి అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఇలా చేస్తుంటారు. ఈ పిల్లలంతా 12–17 ఏళ్లు, అంతకంటే చిన్న వయసు వారని నివేదికలు చెబుతున్నాయి.పత్రాల్లేని వారు 2.2 లక్షలుడిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 2024 ఏప్రిల్ నివేదిక ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతి పత్రాలూ లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివకరూ 332 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. అయినా ప్రమాదకరమైన డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి భారతీయులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లోనూ వెళ్తున్నారు. గత మే 9న కాలిఫోర్నియా తీరంలోని డెల్మార్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 ఏళ్ల భారతీయ బాలుడు, అతని 10 ఏళ్ల అతని సోదరి మరణించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జిన్పింగ్ శకానికి తెర?
చైనాలో షీ జిన్పింగ్ శకం ముగిసిందా? పలువురు అధ్యక్షులకు పట్టిన గతే ఆయనకు కూడా పట్టనుందా? నెల రోజులుగా డ్రాగన్ దేశంలో జరుగుతూ వస్తున్న పలు అనూహ్య పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మే 21 నుంచి జూన్ 5 దాకా జిన్పింగ్ రెండు వారాల పాటు ఆచూకీ లేకుండాపోయారు. అధికారిక కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కన్పించలేదు. ఆయన చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుని గురించిన వార్తలను ప్రతి రోజూ ఫ్రంట్ పేజీల్లో విధిగా ప్రముఖంగా ప్రచురించే చైనా అధికార మీడియాలోఆ రెండు వారాల పాటు ఎక్కడా కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు! అధ్యక్షుని గైర్హాజరీపై ప్రపంచమంతా జోరుగా చర్చ జరిగినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి రాలేదు. చివరికి జూన్ 5 తర్వాత జిన్పింగ్ తిరిగి దర్శనమిచ్చినా ఆయనలో ముందున్న కళాకాంతులేవీ కన్పించలేదు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకòÙంకోతో జరిగిన భేటీలో బాగా అనాసక్తంగా దర్శనమిచ్చారు. ‘‘జిన్పింగ్ బాగా నీరసించి, ఆరోగ్యంగా కన్పించారు’’ అని భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుని తరఫున వెలువడ్డ అధికారిక మీడియా ప్రకటన పేర్కొంది. దీనికి తోడు జిన్పింగ్కు భారీ స్థాయిలో ఉండే వ్యక్తిగత భద్రత కూడా కొద్దిరోజులుగా బాగా తగ్గిపోయింది. ఆయన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియానికి అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జిన్పింగ్ ఫోన్లో సంభాషించారు. దాన్ని గురించిన చైనా అధికార టీవీ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనంలో జిన్పింగ్ను ఎలాంటి హోదా లేకుండా సంబోధించడం విశేషం! అతి శక్తిమంతమైన డ్రాగన్ దేశాన్ని ఇనుప పిడికిలితో శాసిస్తూ వస్తున్న జిన్పింగ్కు పాలనకు నూకలు చెల్లాయనేందుకు ఇవన్నీ స్పష్టమైన సంకేతాలేనంటూ జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాలక కమ్యూనిస్టు పారీ్టలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జిన్పింగ్ను తప్పించే దిశగా సాగుతున్నాయంటూ ప్రవాస చైనా మేధావులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జిన్పింగ్కు ముందున్న అధ్యక్షుడు హూ జింటావో కూడా అధికారాంతానికి ముందు అచ్చం ఇలాగే కొతంకాలం పాటు అనూహ్యంగా కనబడకుండా పోవడం విశేషం. ఆ తర్వాత జిన్పింగ్ పగ్గాలు చేపట్టారు. అనతికాలంలోనే పార్టీలోని తన విరోధులు, వ్యతిరేకుల ఆట కట్టించి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు జిన్పింగ్కు కూడా అదే గతే పడుతోందంటూ ఆయన వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. నిజానికి జిన్పింగ్పై తిరుగుబాటుకు పథక రచన చేసింది, నిశ్శబ్దంగా తెర వెనక పావులు కదిపింది 82 ఏళ్ల జింటావోనే అని కూడా చెబుతున్నారు. ఇవేమీ నిజం కాదని, అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నారని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను కలకలం రేపుతోంది. బ్రెజిల్లోని రియో డిజనిరోలో శనివారం నుంచి జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్పింగ్ హాజరు కావడం లేదు. దీన్ని చైనా అధికారికంగా ధ్రువీకరించింది. మూడు రోజుల సదస్సుకు ఆయన బదులుగా ప్రధాని లీ కియాంగ్ భేటీలో పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేశారు. బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ డుమ్మా కొడుతుండటం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి! ఈ పరిణామం ఆయన భవితవ్యంపై అనుమానాలను మరింతగా పెంచుతోంది. జాంగ్ హవా! అధ్యక్షుడు జిన్పింగ్ అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి మాత్రమే గాక సర్వశక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ)కి చైర్మన్ కూడా. అయితే ప్రస్తుతం చైనాలో అధికార వ్యవహారాలన్నీ సీఎంసీ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియా కనుసన్నల్లో నడుస్తున్నాయని చెబుతున్నారు. జిన్పింగ్ చైనా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు సహకరించిన వారిలో జాంగ్ ముఖ్యుడు కావడం విశేషం! శక్తిమంతమైన 24 మందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్బ్యూరోలో ఆయన సభ్యుడు. అంతేగాక పారీ్టలోని సీనియర్ సభ్యుల్లో అత్యధికులు ప్రస్తుతం జాంగ్కు దన్నుగా నిలిచినట్టు వార్తలొస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు జింటావో అనుయాయులైన వారంతా జిన్పింగ్ను తొలినుంచీ లోలోపల వ్యతిరేకిస్తూ వస్తున్న వారేనని సమాచారం. నిజానికి సైనిక, ఆర్థిక తదితర కీలక వ్యవహారాల్లో కొన్నాళ్లుగా జిన్పింగ్ మాట సాగడం లేదని చెబుతున్నారు. అంతేగాక ఆయన అనుయాయులైన డజన్ల కొద్దీ సైనిక జనరళ్లు కొద్ది రోజులుగా అనూహ్యంగా మాయమవుతున్నారు. మరికొందరికి ఉన్నట్టుండి ఉద్వాసన పలికారు.వారసుడు వాంగ్! చైనా చైనా కమ్యూనిస్టు పార్టీ సారథిగా ఇటీవలే నియమితుడైన వాంగ్యాంగ్ త్వరలో జిన్పింగ్ స్థానంలో అధ్యక్షునిగా పగ్గాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. టెక్నోక్రాట్ అయిన వాంగ్కు మృదు స్వభావిగా, మార్కెట్ శక్తుల అనుకూలునిగా పేరుంది. అందుకే సంస్కరణవాది అయిన నాయకునిగా కమ్యూనిస్టు పార్టీ ఆయనను దేశ నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆషాఢం.. వైవిధ్యం
ఆదివాసీ గిరిజన గూడేలు భిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలకు నిలయాలు. ఏటా ఈ గ్రామాల్లో నిర్వహించే ఆషాఢ మాస పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని.. ఎటువంటి అరిష్టం దరిదాపులకు రాకుండా ఉండాలని వేడుకుంటూ గ్రామ పొలిమేరల్లో శంకుదేవుడికి పూజలు చేస్తూ పూర్వీకుల ఆచార వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. ముంచంగిపుట్టు: అల్లూరి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. తూచ తప్పకుండా పాటిస్తారు. పూర్వీకులు చూపించిన దిశ నిర్దేశాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. ఇదే కోవకు చెందినది ఆషాఢమాస పండగ. పూరీ జగన్నాథుని రథయాత్ర ముగిసిన తరువాత గ్రామపెద్దలు పండగ తేదీ నిర్ణయిస్తారు. ఈ ప్రకారం గ్రామాల్లో పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.అరిష్టాల నుంచి గట్టెక్కి.. ఆదివాసీ తండాల్లో పూర్వం అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు వేసుకునే సమయంలో దుక్కిటెద్దులు, పెంపుడు జంతువులు, అందరికీ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. ఈ మాసంలో అరిష్టాలు ఎక్కువై ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవించేవి. వీటి నుంచి బయటపడేందుకు ఆషాడ మాసంలో ఊరి పొలిమేర వద్ద మేక, కోడిని బలిదానం చేసి ప్రత్యేక పూజలు చేసేవారు. అప్పటి నుంచి అన్నీ నష్టాలు తొలగిపోతూ రావడంతో సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. తరాలు మారినా పూర్వీకుల ఆచార వ్యవహారాలను ఆచరిస్తున్నారు. ఏటా ఈ పండగ చేయడం వల్లే తమకు ఎంతో మేలు జరుగుతోందని ఆదివాసీలు చెబుతున్నారు. గ్రామ పొలిమేరలో.. గిరిజన గ్రామాల్లో పొలిమేరలోని రహదారి పక్కన ఆవు పేడతో అలికి శుద్ధి చేస్తారు. నాలుగు కర్ర పుల్లలతో పందిరి ఏర్పాటు చేసి శంకుదేవుడిని ప్రతిష్టిస్తారు. మామిడి ఆకులతో తోరణాలు కట్టి పందిరి కింద అరటి మొక్కను పాతుతారు. సాగుకు ఉపయోగించే కొత్త విత్తనాలను పందిరిపై చల్లుతారు. అలాగే మట్టితో కుండలు, ప్రమిదలు తయారు చేసి వాటిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తారు. మట్టితో తయారుచేసి రెండు ఎద్దుల విగ్రహాలకు చెక్క, కర్రతో సిద్ధం చేసిన రెండు చక్రాల బండిని అమర్చుతారు. దీనిని పందిరి ఉత్తర దిక్కుకు పెడతారు. ఇళ్ల వద్ద పనికిరాని పాత తట్టలు, బుట్టలు, చేటలు, చీపుళ్లను తీసుకు వచ్చి దిష్టి తీస్తారు. ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. అనంతరం కోడి లేక మేకను బలి ఇస్తారు. మాంసాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి కొద్ది కొద్దిగా పంచుతారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎటువంటి అరిష్టాలు ఎదురు కావని, పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరుగుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం. ప్రస్తుతం గ్రామాల్లో పండగ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది.దోషాలు పోతాయని మా నమ్మకం గ్రామాల్లో ఎటువంటి అరిష్టాలు కలగకుండా ఉండేందుకు ఆషాఢ మాస పండుగను ఏటా జరుపుకుంటున్నాం. జగన్నాథుని రథయాత్ర మొదలైన వారంలో ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. గ్రామ పొలిమేర వద్ద శంకుదేవుడికి పూజలు చేయడం వల్ల అన్ని దోషాలు పోయి మంచి జరుగుతుంది. – బొరిబొరి లచ్చన్న, గిరిజన రైతు, బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలంపూర్వీకుల నుంచి నిర్వహిస్తున్నాం పూర్వీకులు ఆచరించిన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. నాటి తరం నుంచి నేటి తరం వరకు ఈ ఆషాఢమాస పండగను జరుపుకుంటున్నాం. వ్యవసాయానికి, ఆరోగ్యానికి, గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా ఈ పండగ నిర్వహిస్తున్నాం. – రెయ్యల మత్స్యరావు, గిరిజన రైతు,బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలం -
క్లాసులు మొదలయ్యాక కౌన్సెలింగా!?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ‘ఉన్నత విద్య’ అగమ్యగోచరంగా తయారైంది. విద్యా సంవత్సరాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. వివిధ కోర్సుల ప్రవేశాల నిర్వహణలో తీవ్ర జాప్యంచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ అవగాహన రాహిత్యం ఉన్నత విద్యాశాఖకు శాపంగా మారింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఈసెట్ ప్రవేశాలను బీటెక్ రెండో ఏడాది తరగతులు ప్రారంభమయ్యాక కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేయడం సర్కారు చేతగానితనానికి అద్దంపడుతోంది.అభాసుపాలవుతున్న మంత్రి..టీడీపీ కూటమి ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖ మధ్య కోల్డ్వార్ నడుస్తున్నా మంత్రికి పట్టడంలేదు. అసలు ఉన్నత విద్యాశాఖలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని దుస్థితిలో ఆయనున్నారు. ఫలితంగా విద్యా వ్యవస్థలోని కీలక అంశాలు మరుగునపడుతున్నాయి. పగలంతా సొంత కార్యక్రమాలు చక్కబెట్టుకుని సాయంత్రం వేళల్లో సమీక్షల పేరుతో అధికారులతో టీ, బిస్కెట్ల మీటింగ్ పెట్టి మమ అనిపిస్తున్నారు. ఏడాది కాలంగా మంత్రి లోకేశ్ సమీక్షల్లో ప్రతిపాదించిన అంశాల్లో ఏ ఒక్కదానిలో పురోగతి లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య మంత్రి లోకేశ్ ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తట్టుకోలేక అభాసుపాలవుతున్నారు. తాజాగా.. ఈసెట్ కౌన్సెలింగ్ విషయంలోనూ మంత్రి ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టడం ద్వారా ఆయన అవగాహన రాహిత్యం బయటపెట్టింది.సెకండియర్ క్లాసులు మొదలయ్యాక కౌన్సెలింగ్..ఇక ఏటా ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేస్తుంది. ఇందులో డిగ్రీ, ఇంజనీరంగ్, బీఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు, తరగతుల నిర్వహణ, పరీక్షల తేదీల వంటి అంశాలను సమగ్రంగా పొందుపరుస్తుంది. ఈ క్రమంలోనే బీటెక్ రెండో ఏడాది తరగతులను జూన్ 30 నుంచి ప్రారంభించాలని పేర్కొంది. కానీ, బీటెక్లో లేటరల్ ఎంట్రీ ద్వారా చేరే ఈసెట్ విద్యార్థులను మాత్రం విస్మరించింది. మే 15న ఈసెట్ ఫలితాలు విడుదలైతే.. నెలన్నర తర్వాత జూలై 4 నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇచ్చింది. వాస్తవానికి.. ఈసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించకుండానే బీటెక్ రెండో ఏడాది తరగతుల నిర్వహణ చేపట్టాలని ఆదేశించడంతో విద్యార్థులను ఆందోళనలో పడేసింది. తాజాగా.. ఈసెట్ కౌన్సెలింగ్కు జూలై 4 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించి, 7 నుంచి ఆప్షన్ల ఎంపిక అనంతరం 14లోగా సీట్ల భర్తీని పూర్తిచేసేందుకు షెడ్యూల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది తొలిదశ కౌన్సెలింగ్ కాగా.. ఆ తర్వాత మరోదశ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి జూలై ముగిసిపోతుంది. ఫలితంగా విద్యార్థులకు ఒకనెల తరగతులు కోల్పోవాల్సి వస్తోంది. అసలు ఇంజినీరింగ్ సెకండియర్ తరగతులు మొదలయ్యే తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశాలను పూర్తిచేయాల్సి ఉండగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా పనిచేస్తూ విమర్శలపాలవుతోంది. -
ఊరు.. బేజారు!
‘కొత్త బట్టలు ఎక్కడ్నుంచి తేవాలయ్యా...? అర్థం చేసుకోవేం? ఏడాదిగా శని పట్టుకుంది. ఎట్లా చెప్పాల్రా నీకు..?’ – తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కుమారుడి ఎదుట వానపల్లి దుర్గాదేవి నిర్వేదం!‘నేనేం చేయనవ్వా? నన్నే తీసేశారు.. ఏడాదిగా దరిద్రాన్ని చూస్తున్నా..’ – జక్కంపూడి నగర్లో పెన్షన్ కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద మాజీ వలంటీర్ సయ్యద్ బాషా నిస్సహాయత!!‘పండగొస్తే గుండె దడ వస్తోంది. పైసా అప్పు కూడా పుట్టడం లేదు. చుట్టాలొస్తున్నారంటే భయమేస్తోంది. సంతోషంగా ఉన్న రోజు లేదు. ఊరంతా కలిసి పండగ చేసుకుని ఏడాది దాటింది...’ – అనపర్తి ఎస్సీ కాలనీలో లక్ష్మీ భవాని, కోటేశ్వరి ఆక్రోశం!‘అవును మరి.. తాపీగా కూసున్నా...! సెంద్రబాబు డబ్బులు పంపాడని...! వడ్లు కొని ఇరగదీశాడని...! మా ఆవిడ ఫ్రీ బసెక్కి ఊరెళ్లింది...ఇంటినిండా గ్యాస్ బండలున్నాయి..!’ – సింగగూడెం, లింగపాలెం దగ్గర గోదావరి జిల్లాల యాసలో గండుల సుబ్బారావు, పొట్టవూరు శ్రీనివాస్ వ్యంగ సంభాషణ!!వనం దుర్గాప్రసాద్ – ఉభయ గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గోదారి పల్లెలంటే.. ఉప్పొంగే సంతోషాల పరవళ్లు! పచ్చని తోరణాల లోగిళ్లు! మర్యాదలతో అతిథులను ఉక్కిరిబిక్కిరి చేసే గోదారమ్మ తీరం ఏడాదిగా బావురుమంటోంది! పల్లె కళ తప్పింది. గత ప్రభుత్వ హయాంలో సాఫీగా సాగిన బతుకు బండి ఇప్పుడు గతుకుల బాటలో కూరుకుపోయి నరకం అనుభవిస్తోంది! వైఎస్ జగన్ పాలనలో ఏదో ఒక పథకం కింద నెలనెలా డబ్బులొచ్చేవి. అమ్మ ఒడి... విద్యా దీవెన.. వసతి దీవెన.. రైతు భరోసా... చేయూత... చేదోడు.. కాపునేస్తం... వాహన మిత్ర.. ఇలా ఒకదాని వెంట మరొకటిగా డబ్బులు అందేవి. పండుగలు వస్తే పేదలు సంతోషంగా జరుపుకొనేవారు. నెలకు సరిపడా సరుకులు ముందే తెచ్చుకునేవారు. స్కూళ్లు తెరవటమే ఆలస్యం.. పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, పుస్తకాలు.. విద్యా కానుక సిద్ధంగా ఉండేది! చేతిలో ట్యాబ్లతో పిల్లలు ఆత్మ విశ్వాసంతో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేవారు. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలనలో అంతా తిరగబడింది! బతుకు బండి తలకిందులైంది!! మావోడు ఏమయ్యాడు..? ఊరితో బంధం తెగిందవ్వా..! కాళ్ల మండలం వేంపాడులో గ్రామ సచివాలయానికి వచ్చిన ఓ 60 ఏళ్ల అవ్వ ‘మావోడు ఏమయ్యాడయ్యా?’ అంటూ వలంటీర్ గురించి ఆరా తీసింది. ఇంటికే వచ్చేవాడు. పెన్ష¯న్Œ తెచ్చి ఇచ్చేవాడు. బిడ్డలా అండగా ఉండేవాడు.. అంటూ పేగు బంధమే తెగినంతగా బా«ధ పడింది. ఉండి దగ్గర ఉప్పులూరు గ్రామ వలంటీర్ కనిపించడంతో ఊరిలో వారంతా చుట్టూ చేరి ఆప్యాయంగా పలుకరించారు. ‘ఏమయ్యావ్ తండ్రీ..?’ అంటూ 80 ఏళ్ల లక్ష్మి ఆదుర్దాగా ఆరా తీసింది. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. రాజమహేంద్రవరంలో రోజూ కూలీకి వెళ్తున్నానని ఆ వలంటీర్ చెప్పాడు. ‘ప్రభుత్వం మారింది. మన ఊరితో బంధం తెగిందవ్వా..’ అంటూ కంట తడి పెట్టాడు. వీరవాసరం కొణితివాడలోనూ ఇదే సన్నివేశం. గణపవరం మండలం కొమ్మూరులో వలంటీర్ కోసం గ్రామస్తులు వాకబు చేస్తున్నారు. బడ్డీ కొట్టు బంద్.. కొవ్వూరు డివిజన్ పైడిమెట్ట, పోచారం, తాళ్లపూడి, బల్లిపాడు, చింతలపూడిలోని లింగపాలెం... ఇలా ఏ ఊరు చూసినా ఉసూరుమంటున్నాయి. ఆ పథకం... ఈ పథకం వచి్చందని, టీ కోసం నేను డబ్బులిస్తానంటే నేనిస్తానని పోటీ పడ్డ వాతావరణం ఇప్పుడు కానరావడం లేదు. బడ్డీ కొట్టు నరేష్ వ్యాపారం సాగక ఊరొదిలి వెళ్లాడు. ఊరందరికీ కూరలు అమ్మే సుజాత పట్నం చేరుకుంది. గ్రామంలో ట్యూషన్లు చెప్పే మాణిక్యం కాకినాడ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాడు. పథకాలు వచ్చినన్నాళ్లు జనం చేతిలో డబ్బులుండేవి. పిల్లలకు ట్యూషన్లు చెప్పించేవాళ్లు! ఏడాదిగా పైసా రాకపోవడంతో గ్రామాల్లో గుబులు రేగుతోంది! చిన్న వ్యాపారాలు నడవడం లేదు. ఆటోవాలాలు డీలా పడ్డారు. ‘మేం టీడీపీనే... అయినా జగన్ పాలనే బాగుంది..’ ధర్మాజీ గూడెం వద్ద ఆటోవాలా నరేష్ తేల్చి చెప్పేశాడు! రైతుల ఆనందం ఆవిరి.. గోదావరి జిల్లాల్లో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఈ ప్రభుత్వం దళారీల దయకు వదిలేసింది. ధాన్యం అమ్మితే డబ్బులివ్వకుండా తిప్పలు పెడుతోంది. తేమ శాతం అంటూ కోతలు పెడుతోంది. రైతు కూలీలకు పనులు లేవు. పట్టణాల్లో తాపీ పనులకు వెళ్తున్నారు. పిల్లల చదువులకు అప్పులే శరణ్యమయ్యాయి. వైఎస్ జగన్ పాలన సాగిన ఐదేళ్లూ స్వర్ణ యుగమని, ఇప్పుడు మాకు ఖర్మ పట్టుకుందని ఆవేదనగా చెబుతున్నారు. రైతుల ఆనందం ఆవిరైందని వ్యవసాయదారుడు సుబ్బారావు కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చెయ్యి తడిపితేనే అర్జీలు తీసుకునే పాడు రోజులు మళ్లీ దాపురించాయని చెప్పాడు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడకు చెందిన టైలర్ కృష్ణారావు ఏడాదిగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పథకాలు ఏవీ రాకపోవడంతో బట్టలు కుట్టించేందుకు తనవద్దకు ఎవరూ రావడం లేదని, గతంలో నెలకు రూ.15 వేలు సంపాదించిన తాను రూ.3 వేలు ఆర్జించడం కూడా గగనంగా ఉందని చెబుతున్నాడు. కుమార్తెను చదివించేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని, భీమవరం వస్త్ర దుకాణంలో సగం రోజులు కూలీకి వెళ్తున్నానని చెప్పాడు. ఆ దేవుడి దయే..! ఆ దేవుడే నాకు తిండి పెట్టే ఏర్పాటు చేశాడు.. పెన్షన్ మంజూరు చేశాడు (వైఎస్ జగన్ను తలచుకుంటూ...) వలంటీర్ ఇంటికొచ్చి పలకరించేవాడు. ఇప్పుడు పలకరించే దిక్కులేదయ్యా. ఊరే బావురు మంటోంది – జోగి రామలక్ష్మి, (జక్కంపూడి నగర్, తూ.గో)బంధం తెగిపోయింది ఇంటర్ వరకు చదివా. జగనన్న పుణ్యమా అని వలంటీర్గా చేరి ఊరందరి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం దక్కింది. మీకు ఐదు వేలు ఏమిటి.. పదివేలు ఇస్తానన్న చంద్రబాబు మమ్మల్ని రోడ్డున పడేశారు. దీనికి బాధపడటం లేదు గానీ మా పల్లెతో బంధం తెగిపోయిందని ఏడుపొస్తోంది. – సయ్యద్ బాషా (మాజీ వాలంటీర్) -
వివిధ సంస్థలకు ఐదు జిల్లాల్లో భూములు కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలకు ఐదు జిల్లాల్లో ప్రభుత్వ భూములను కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీ పురంలో 12.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా కేటాయించింది. పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి కోసం దీన్ని ఉపయోగించాలని సూచించింది. అలాగే వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నం గ్రామంలో 50 ఎకరాల భూమిని టూరిజం అథారిటీకి ఉచితంగా కేటాయించింది. గండికోట సమీపంలో ఒబెరాయ్ గ్రూప్ విల్లా రిసార్టు నిర్మించడానికి ఈ భూమిని అప్పగించింది. అందులో 11.50 ఎకరాల భూమి మైలవరం రిజర్వాయర్ బఫర్ జోన్లో ఉండడంతో అక్కడ నీటి వనరులకు హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నేళటూరు గ్రామంలో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.1.13 కోట్లకు సెంబ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ విద్యుత్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం జిల్లా గండిగుండం గ్రామంలో వెన్ ప్రాజెక్ట్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థకు 0.265 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిలో ఆ సంస్థ రహదారి నిర్మించి.. స్థానిక పాలనా సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా గుదెంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్)కు 1.70 ఎకరాల భూమిని అప్పగించింది. ఆ భూమి విలువ రూ.1.10 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. గతంలోనే భూమిని అప్పగించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలిపింది. ఈ భూముల్లో నీటి వనరులను సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తూ.. మూడేళ్లలో పనులు ప్రారంభించకపోతే భూమిని తిరిగి స్వా«దీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. -
శ్రీశైలం జలాశయానికి జలకళ
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా, బుధవారం నుంచి తుంగభద్రకు వరద పోటెత్తడంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నీటిలో సగభాగం విద్యుత్ ఉత్పాదన ద్వారా దిగువ నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్ట్ నుంచి 98,552 క్యూసెక్కులు వచ్చి చేరింది. రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్కు 49,575 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 8.722 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.892 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 1.60 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం సాయంత్రానికి జలాశయంలో 166.3148 టీఎంసీల నీరునిల్వ ఉండగా, డ్యాం నీటిమట్టం 875.60 అడుగులకు చేరుకుంది.తుంగభద్ర జలాశయ 6 గేట్లు ఎత్తివేతసాక్షి, బళ్లారి/హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి బుధవారం 6 క్రస్ట్ గేట్లను ఎత్తి అధికారులు నీటిని నదిలోకి వదిలారు. ఎగువన శివమొగ్గ జిల్లా, పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురవడంతో నది ప్రవాహం తుంగభద్ర జలాశయానికి పోటెత్తింది. జలాశయం ప్రస్తుత పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. కొత్త గేట్ల ఏర్పాటు దృష్ట్యా ఈ ఏడాది 80 టీఎంసీలకు కుదించారు. జలాశయానికి అమర్చిన 33 క్రస్ట్ గేట్లు దెబ్బతిని వరద ఉద్ధృతికి తట్టుకోలేని స్థితిలో ఉండడంతో వాటి స్థానంలో రూ.41.56 కోట్లతో కొత్తవి ఏర్పాటు చేసేందుకు 80 టీఎంసీల వరకే నిల్వ ఉంచుతూ మిగిలిన నీటిని దిగువకు వదలనున్నారు. దీంతో బుధవారం ఆ మట్టానికి నీరు చేరువవడంతో 6 గేట్లను ఎత్తి 9,400 క్యూసెక్కులను వదులుతున్నారు. దీంతోపాటు రివర్ ఔట్ ఫ్లో స్లూయీస్ ద్వారా వెయ్యి క్యూసెక్కులు, 701 క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 32,787, ఔట్ఫ్లో 11,101 క్యూసెక్కులుగా ఉన్నట్లు వెల్లడించారు. -
కాలయాపనతో... మైండ్ గేమ్!
డబ్బులు ఖర్చుచేశాం.. కాంట్రాక్టు పనులు పూర్తి చేశాం.. బిల్లులు చెల్లించండి అంటూ ఓవైపు కాంట్రాక్టర్లు ఏడాదిగా వేడుకుంటున్నారు..! కానీ.. పనుల నాణ్యతపై ఒకసారి విజిలెన్స్ విచారణ.. తప్పేమీ లేదని అందులో నివేదిక రావడంతో టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్స్ అంటూ మరోసారి.. కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంట్రాక్టర్లు చివరకు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆ కేసులు జడ్జిమెంట్ దశకు చేరుకున్నాయి. అయినా ఏడాదిగా కోర్టు ఉత్తర్వులు వెలువడకుండా కాలయాపన చేస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది. సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ పెద్దలు పులివెందులలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం చేయాలనే ఎత్తుగడ ఎంచున్నారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది. ఎన్నడూ లేని విధంగా మానసికంగా, ఆర్థికంగా దెబ్బకొట్టే చర్యలు తెరపైకి వస్తున్నాయి. పూర్తి చేసిన పనులకు బడ్జెట్ కేటాయించకుండా, సీఎఫ్ఎంఎస్లో ఉన్న బిల్లులను క్లియర్ చేయకుండా నాన్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కేసుల నంబర్లు అయ్యాయి. త్వరలో జడ్జిమెంటు ఉంటుందనుకున్న దశలో ప్రభుత్వం పనులపై తొలుత విజిలెన్స్ ఫర్ క్వాలిటీకి ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు తీసుకున్న కోర్ శ్యాంపిల్స్ను విజయవాడకు తీసుకెళ్లి పరీక్ష చేయించారు. సహజంగా జిల్లాకేంద్రాల్లోని ల్యాబ్లో పరీక్ష చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వం ఒత్తిడితో వేరేచోట చేశారు. అయితే, అన్ని శాంపిల్స్ (98 శాతం మెరిట్) పాస్ అయ్యాయి. నివేదికలు హైకోర్టుకు చేరితే బిల్లుల చెల్లింపులే తరువాయి అనుకున్న తరుణంలో జాప్యం కోసం కూటమి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఎంచుకుంది.» దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తయిన పనులకు టెండర్ వ్యాల్యూయేషన్పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సహజంగా టెండర్ వ్యాల్యూయేషన్ కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసిన తర్వాత ఎల్–1 ప్రకటించక మునుపే చేపట్టాలి. ఇంజినీరింగ్ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఎల్–1, ఎల్–2 ప్రకటిస్తారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ చేయించి పనులు కొనసాగిస్తారు. అగ్రిమెంట్ విధి విధానాల ప్రకారం సంబంధిత పనిని పూర్తి చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సరి్టఫికెట్ జత చేసి ఆ పనికి బిల్లు చెల్లించాల్సిందిగా ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ అయ్యాక కూడా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అక్కడ జాప్యం చేసేందుకు ఒకసారి విజిలెన్స్ ఫర్ క్వాలిటీ, ఆ ప్రక్రియ పూర్తికాగానే మళ్లీ మొదటికి వచ్చి టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్స్ అంటూ మరోసారి కాలయాపన చేసే ఎత్తుగడను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారని పలువురు వాపోతున్నారు. » ప్రభుత్వం 15 నెలలుగా బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసులు తీర్పు దశకు రాగా, దానిని అడ్డుకునే ప్రక్రియను చేపడుతున్నారని వాపోతున్నారు. » పులివెందుల పరిధిలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిని ప్రస్తుతం టీడీపీ వారు చేపడుతున్నారు. ఓవైపు బిల్లుల చెల్లింపునకు జాప్యం చేస్తూనే, టెండర్ వ్యాల్యూయేషన్ ఫర్ విజిలెన్స్, క్వాలిటీ ఫర్ విజిలెన్స్ అంటూ ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు అవే పెండింగ్ పనులను కొనసాగించడం విశేషం. » వైఎస్సార్సీపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం చూడకుండా.. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులందరీకి సంక్షేమ పథకాలు అందించింది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిçస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రయోజనాలకు సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు కేటాయించింది. కానీ, కూటమి సర్కార్ పులివెందులలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తుండడం, హైకోర్టు ఉత్తర్వులు సైతం జాప్యం అయ్యేలా మైండ్గేమ్ ఆడుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. -
వీణ్ని అంతం చేస్తే వైఎస్సార్సీపీలోకి ఇంకెవ్వరూ వెళ్లరు!
సాక్షి టాస్క్ ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుండగా.. వారికి వంత పాడుతున్న పోలీసుల అచేతనానికి రాష్ట్రం సిగ్గుపడాల్సి వస్తోంది. మహిళా సర్పంచ్ కుటుంబంపై మంగళవారం టీడీపీ మూకలు దాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే మరో ఘోరం జరిగింది. 11నెలల పసికందును చంకలో పెట్టుకుని తన భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న దళిత మహిళ బట్టలు చించి, పసికందుతో పాటు ఆ మహిళ గుండెలపై కాళ్లతో తొక్కి విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన అమానుష ఘటన సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత మండలం తిరుపతి జిల్లా చంద్రగిరిలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండల వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పనపాకం దళితవాడకు చెందిన అజయ్ పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీకి చెందిన జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడి అనుచరులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అజయ్ ఇంట్లో ఉండగా.. సుబ్రహ్మణ్యం అనుచరులు లోకేశ్, వామనమూర్తి, గురవయ్య, కిషోర్, చక్రవర్తి, నాగేష్, బుజ్జమ్మ, పద్మ, చంద్రకళ, మునిరాజమ్మలతో కలిసి ఇంటిపై గొడవకు వెళ్లారు. ‘వీడు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకుడు అయిన తర్వాత పార్టీ కోసం తిరుగుతున్నాడు. వీడిని అంతం చేస్తే ఇంకెవ్వరూ ఈ గ్రామం నుంచి ఆ పార్టీలోకి వెళ్లరు’ అంటూ ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. అజయ్ తల్లిదండ్రులు, చెల్లెలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారి కళ్లలో కారం కొట్టి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. మహిళ బట్టలు చించి.. గుండెలపై తొక్కి.! తన భర్త అజయ్పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడడంతో అతని భార్య 11 నెలల పసికందును చంకలో పెట్టుకుని పరుగున బయటకు వచ్చారు. దాడిని అడ్డుకొని వారిని ప్రశ్నించగా.. టీడీపీ గూండాలు దళిత మహిళ అని కూడా చూడకుండా ఆమె బట్టలు చించేసి దారుణంగా కొట్టారు. చంటి బిడ్డతో సహా ఆమెను కింద పడేసి, గుండెలపై కాళ్లతో తొక్కుతూ రాక్షసానందం పొందారు. గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు చేరుకున్నారని, లేకుంటే తమను చంపేసి ఉండేవారంటూ ఆ దళిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పథకం ప్రకారమే దాడి.. డీఎసీఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆదేశాలతో పక్కా పథకం ప్రకారమే తమపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అజయ్ వాపోయారు. ఏడాదిన్నరగా విడతల వారీగా వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి చొరవతో మాతమ్మ ఆలయాన్ని నిర్మించామని, ఏడాదిన్నరగా ఆలయంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా వైఎస్సార్సీపీ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. దాడిపై ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని బాధితులు కన్నీటిపర్యంతం అయ్యారు. అనంతరం టవర్క్లాక్ సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఘటనపై బాధితుడితో పాటు అతని భార్యను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. కాగా, ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దళితులపై దాష్టికాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టకుండా చోద్యం చూడటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. -
టైగర్పై సిండికేట్ పంజా..
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకానికి తోడు సిండ్కేట్గా మారిన కంపెనీల దెబ్బకు ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. ఇప్పటికే వెనామీ రొయ్య ధరలు దిగజారిపోగా, తాజాగా టైగర్ (నీలకంఠ) రొయ్యల ధరలు తగ్గించేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారిగా కౌంట్కు రూ.80 తగ్గించడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. వైట్స్పాట్, వెబ్రియా వంటి వైరస్లకు తోడు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల సాకుతో ధరలు తగ్గి, తీవ్ర నష్టాల పాలైన వెనామీ రైతులకు టైగర్ ప్రత్యామ్నాయంగా మారింది. వెనామీ తరహాలోనే ఎప్సీఎఫ్ టైగర్ బ్రూడర్స్ అందుబాటులోకి రావడంతో వెనామీకి ప్రత్యామ్నాయంగా 2021 నుంచి రాష్ట్రంలో టైగర్ రొయ్యల సాగు విస్తరిస్తోంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో 50 నుంచి 60 వేల ఎకరాల్లో టైగర్ రొయ్య సాగవుతుంది. వ్యాధుల బారిన పడకుండా రోజూ 0.3 గ్రాముల నుంచి 0.5 గ్రాముల ఎదుగుదలతో కేవలం 120 రోజుల్లోనే 20 కౌంట్ వద్ద పంట చేతికి కొస్తుంది. టైగర్ రొయ్య వెనామీకి దీటుగా అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు ఎగుమతవుతున్నాయి. దీంతో వీటిని సాగు చేసే రైతులు నాలుగైదేళ్లుగా మంచి లాభాలే చవిచూస్తున్నారు. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రతీకార పన్ను సాకుతో రొయ్యల కంపెనీలు, ఎగుమతిదారులు రొయ్యల కౌంట్ ధరలను తగ్గించేసారు. వెనామీ రొయ్యల ధరలు కౌంట్కు రూ.20 నుంచి రూ.50 మేర పతనమైనప్పటికీ టైగర్ రొయ్యల ధరలు కాస్త మెరుగ్గానే కొనసాగాయి. అలాంటిది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో కంపెనీలు సిండికేట్ అయిపోయి ఉన్నట్టుండి కౌంట్కు రూ.80 మేర తగ్గించేయడం టైగర్ రొయ్య రైతులకు శాపంగా మారింది. సాధారణంగా టైగర్ రొయ్యలు 20–40 కౌంట్ వద్దే పట్టుబడి పడుతుంటారు. మొన్నటి వరకు 20 కౌంట్ వద్ద పట్టుబడి పడితే రూ.650, 30 కౌంట్కు రూ.580, 40 కౌంట్కు రూ.480 చొప్పున ధర లభించింది. అలాంటిది ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో అధికంగా పట్టుబడి పట్టే 30 కౌంట్ ధరను రూ.500కు, 40 కౌంట్ ధరను రూ.400కు తగ్గించేశారు. కంపెనీలను నియంత్రించి, రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదు.వెనామీతో పోల్చుకుంటే టైగర్ రొయ్యల సాగుకు పెట్టుబడి అధికం. వెనామీ పిల్ల 30–32 పైసల మధ్య లభిస్తుండగా, టైగర్ రొయ్య పిల్ల ధర రూపాయి పైమాటే. పైగా మేత ధర కూడా వెనామితో పోల్చుకుంటే కిలోకు రూ.10–15 అధికంగా పెట్టాలి. ఎకరాకు 5.50 లక్షలు ఖర్చవుతుంది. 20 కౌంట్కు పడితే 2 టన్నులు, 30 కౌంట్కు పడితే టన్నున్నర, 40 కౌంట్ అయితే టన్నుకు మించి రాదు. అలాంటిది కిలోకు రూ.80 తగ్గించడంతో టన్నుకు రూ.80 వేల మేర రైతులు నష్టపోతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కంపెనీల మాయాజాలంఅంతర్జాతీయ మార్కెట్లో ఎలాంటి ఒడిదొడుకులు లేవు. టైగర్ రొయ్యలు ఎగుమతి అయ్యే దేశాల్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్తలేదు. పైగా ఆ దేశాల్లో వీటికి ఎనలేని డిమాండ్ ఉంది. ఆర్డర్లు కూడా బాగానే వస్తున్నాయి. అయినా కంపెనీలు సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో కౌంట్కు రూ.80కుపైగా తగ్గించడం దారుణం. ప్రభుత్వమూ పట్టించుకోవడంలేదు. – దుగ్గినేని గోపీనాథ్, అధ్యక్షుడు, రొయ్య రైతుల సంఘం, ప్రకాశం జిల్లా -
ఇంటింటా చేదు అనుభవం
కర్నూలు(హాస్పిటల్): ‘ఇంటింటికీ సుపరిపాలన’ పేరుతో కర్నూలు ప్రజల వద్దకు వెళ్లిన మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజుకు ఇంటింటా చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ ప్రజలు నిలదీశారు. పింఛన్ ఇవ్వట్లేదని, గ్యాస్ సబ్సిడీ అందడం లేదని, తల్లికి వందనం డబ్బులు పడలేదంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు బుధవారం ఉదయం నగరంలోని బుధవారపేటలో పర్యటించారు. ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. వారు తిరిగిన ఇళ్లల్లో అత్యధిక శాతం మంది తమకు సంక్షేమ పథకాలేవీ అందడం లేదని జవాబులివ్వడంతో.. టీడీపీ నేతలు కంగుతిన్నారు.పింఛన్ ఎందుకివ్వట్లేదు?పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని ఏడాదైనా ఇప్పటికీ మంజూరు చేయలేదని సుంకులమ్మ అనే వృద్ధురాలు ప్రశ్నించింది. తనకు పదేళ్ల క్రితం ప్రమాదంలో కాళ్లు పోయాయని.. అయినా వికలాంగుల పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదని సందెపోగు రఘు అనే వృద్ధుడు నిలదీశాడు. కనీసం వృద్ధాప్య పింఛన్ కూడా ఇవ్వట్లేదని మండిపడ్డాడు. పదో తరగతి చదువుతున్న తనకు తల్లికి వందనం డబ్బులు పడలేదని మేరి కుమారి అనే విద్యార్థిని వాపోయింది. తమకు ఉచిత గ్యాస్ పథకం ఎందుకు వర్తింపజేయలేదంటూ విజయ్కుమార్ అనే వ్యక్తి టీడీపీ నేతలను నిలదీశారు. తాను బీటెక్ పూర్తి చేశానని.. ఉద్యోగం ఇప్పించాలని మంత్రిని దీపిక అనే యువతి కోరారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాగానే ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి భరత్ జవాబివ్వడంతో ఆమె షాక్కు గురైంది. మంత్రి మీడియాతో మాట్లాడుతూ..ఎవరో ఒకరిద్దరు పథకాలు అందలేదని చెబితే ‘సాక్షి’లో అవే చూపిస్తారంటూ అక్కసు వెళ్లగక్కారు.వితంతు పింఛన్లు ఎప్పుడిస్తారు?జి.సిగడాం: ‘ఎంపీ బాబూ.. మా ఇంటి పెద్ద దిక్కు మరణించి ఏడాది కాలమైనా ఇంత వరకు వితంతువుల పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదు. మేమంతా అనాథలుగా ఉన్నాం. వీటితోపాటు తల్లికి వందనం కింద రూ.15 వేలు అన్నారు. రూ.13 వేలు మాత్రమే మా ఖాతాలో జమ చేశారు. ఇదేనా సుపరిపాలన?’ అంటూ వితంతువులు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం, ఆనందపురం గ్రామాల్లో నిలదీశారు. -
కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్కు తొలగిన ప్రధాన అడ్డంకి
సాక్షి, అమరావతి: 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కోటిపల్లి – నరసాపురం రైల్వేలైన్ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. రైల్వే లైన్ భూ సేకరణ, రీ అలైన్మెంట్ సర్వే విషయంలో గతంలో విధించిన స్టేని హైకోర్టు ఎత్తేసింది. అలైన్మెంట్ సర్వే కొనసాగించవచ్చని రైల్వే అధికారులను ఆదేశించింది. అలైన్మెంట్ మార్పు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపింది. ఫలానా మార్గంలోనే అలైన్మెంట్ వెళ్లాలని ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అధికారులకు స్పష్టం చేసింది. రీ అలైన్మెంట్ ద్వారా ఎవరైనా రాజకీయ నేతలు, ప్రముఖులు ప్రయోజనం పొందుతున్నారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలైన్మెంట్ మార్చడం వల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం తరఫున సీవీఆర్ రుద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్జీపీ సింగమనేని ప్రణతి వాదనలు వినిపించారు.విజయవాడ వరదల ప్రాణ నష్టానికిబాధ్యత ఎవరిది?బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలిరాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశంసాక్షి, అమరావతి: గత ఏడాది సంభవించిన విజయవాడ వరదల వల్ల 60 మంది ప్రాణాలు కోల్పోయారని, జరిగిన ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరిదని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎవరూ బాధ్యులు కాదంటే కుదరదని తేల్చి చెప్పింది. తగిన విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఇదే తామిచ్చే చివరి అవకాశమని, తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేస్తూ.. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరదల గురించి ముందే తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పాత్రికేయుడు నాతాని భూపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించాలని అందులో ఆయన పేర్కొన్నారు. -
పారదర్శకంగా గ్రూప్–1 నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలను పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) హైకోర్టులో వాదనలు వినిపించింది. మూల్యాంకనం, హాల్ టికెట్ల జారీపై పిటిషనర్ల వాదనను తప్పుబట్టింది. వందల పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాసినప్పుడు ఇలాంటి ఆరోపణలు సహజమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. 2024, అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు బుధవారం విచారణ కొనసాగించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదిస్తూ.. ఈ గ్రూప్–1లో ఎంపికవుతున్న వారు సమాజానికి కీలకమైన సేవలందిస్తారని, వీరంతా భవిష్యత్ తెలంగాణకు వెన్నెముక లాంటి వారని అన్నారు.వీరి ఎంపిక పారదర్శకంగా జరగకపోతే ప్రమాదకమని పేర్కొన్నారు. టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. రాజ్యాంగ సంస్థల అంశాల్లో సెక్షన్ 226 ప్రకారం రెండు సందర్భాల్లో మాత్రమే హైకోర్టు జోక్యం చేసుకోగలదని చెప్పారు. మోసపూరితంగా నిర్వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించారు. బండిల్ ఆధారంగా అభ్యర్థిని తెలుసుకోలేరు.‘ఒక్కో పేపర్ ముగ్గురితో దిద్దించాం. ఇద్దరు ఇచ్చి న అత్యధిక మార్కుల సరాసరిని పరిగణనలోకి తీసుకుని ఫలితాలు వెల్లడించాం. అందరు అభ్యర్థులకు ఇదే విధానాన్ని అనుసరించాం. పదే పదే మూల్యాంకనం అన డం కాదు.. అంతా కలిపి ఒక ప్రక్రియ. బండిల్ ఆధారంగా సెంటర్, అభ్యర్థిని తెలుసుకునే అవకాశమే లేదు. బార్ కోడ్ అధారంగానే జవాబు పత్రాలు దిద్దడానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ బార్ కోడ్, అభ్యర్థి ఎవరో మూల్యాంకనం చేసే వారికి తెలిసే అవకాశమే లేదు. ఒకట్రెండుసార్లు చిన్న చిన్న తప్పులు జరగడం సాధారణం. అయినంత మాత్రాన రాజ్యాంగబద్ధమైన సంస్థను పదే పదే తప్పుబట్టడం సరికాదు. ప్రక్రియనంతా ప్రధాన మూల్యాంకన దారు పర్యవేస్తుంటారు. నంబర్లు ఒక ఆర్డర్లో ఉండటం కోసమే మెయిన్స్కు విడిగా హాల్టికెట్లు ఇచ్చాం. గతంలో పోలీస్ బోర్డు, జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు కూడా ఇలాగే పరీక్షలు నిర్వహించారు. హాల్టికెట్లను అక్టోబర్లో జారీ చేశాం. దీనిని చాలెంజ్ చేస్తూ ఎవరూ కోర్టుకు రాలేదు. హాల్ టికెట్ అందలేదన్న అభ్యర్థులూ లేరు. అక్టోబర్లో జారీ చేసిన హాల్టికెట్లను మార్చి వరకు ఆగి, ఫలితాలు వెల్లడించాక ఎంపిక కాలేదని తెలుసుకుని చాలెంజ్ చేయడం సమంజసం కాదు’అని టీజీపీఎస్సీ న్యాయవాది వాదించారు. అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
రెండేళ్లు.. రెండు లక్షల మంది ఏఐ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో రెండు లక్షల మంది తెలంగాణ యువతను ఏఐ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. బుధవారం టీ–హబ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో తొలి ఏఐ అనుసంధానిత ‘తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ (టీజీడెక్స్)’ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి. తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చి దిద్దేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది.ఇప్పటికే తెలంగాణ ఏఐ స్ట్రాటజీ, రోడ్ మ్యాప్ను రూపొందించుకుని వడివడిగా అడుగులు వేస్తోంది. ఏఐను ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకుని అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా టీజీడెక్స్ పేరిట డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీని రూపకల్పనలో బెంగళూరు ఐఐఎస్సీ సహకారం అందించింది. ఇది దేశంలో ఏర్పాటైన మొదటి ఏఐ డేటా ఎక్సే్ఛంజ్. ఇది ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువతను అంతా ఒకే వేదికపై తీసుకొచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది’అని శ్రీధర్బాబు వివరించారు. టీజీడెక్స్ ద్వారా రైతులకు మేలు చేసే అగ్రిటెక్ స్టార్టప్స్కు డేటా లభిస్తుందన్నారు. త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని శ్రీధర్బాబు వెల్లడించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీ–హబ్ సీఈవో కవికృత్, టీ–వర్క్ సీఈవో జోగిందర్, జైకా ప్రతినిధులు టాకూచీ ఠాకూరో, యుషి నగానో తదితరులు పాల్గొన్నారు. -
ఈ నెలంతా వానలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానలు జోరందుకున్నాయి. గత నెలలో వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకోగా, ఈ నెలలో మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా ఉండనున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో ప్రస్తుతం వానలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై నెలలో వర్షాలు సాధారణం కంటే అధికంగా కురిసే అవకాశమున్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ మేరకు జూలై నెల వర్షాల అంచనాలను బుధవారం విడుదల చేసింది. ఈ నెలలో 22.74 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే... సాధారణం కంటే కనీసం 6 శాతం అధిక వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నెలలో రెండోతేదీ నాటికి సాధారణ వర్షపాతంలో 10 శాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో న్యూట్రల్ ఎల్నినో–దక్షిణ ఓసిలేషన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సీజన్ ముగిసే వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల్లో వర్షపాతం తక్కువగా నమోదు కావొచ్చని, కానీ తెలంగాణలో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వివరించింది.జూన్ నెలలో వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో నైరుతి సీజన్ ప్రారంభ నెలలో వర్షాలు అధికంగా కురుస్తాయి. గత ఐదేళ్లుగా వర్షపాత నమోదును పరిశీలిస్తే సాధారణం కంటే కనీసం 20 శాతం అధిక వర్షాలు నమోదవుతున్నాయి. కానీ ఈ ఏడాది జూన్ నెలలో తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నెలలో 13.03 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. కానీ నెల ముగిసే వరకు 10.42 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 20 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. గతేడాది గణాంకాలను పరిశీలిస్తే 15.90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత ఐదేళ్లలో తొలిసారిగా జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మూడు రోజులు..ఎల్లో అలర్ట్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. గురువారం వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, శుక్ర, శనివారాల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇచ్చోడలో 6.2 సెంటీమీటర్ల వర్షం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గద్వాల జిల్లా అయిజలో 6.13 సెం.మీ., బజార్హత్నూర్లో 5.25 సెం.మీ., సరికొండలో 4.1 సెం.మీ., వెంకటాపూర్లో 4.05 సెం.మీ. వర్షం కురిసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 14.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు రాష్ట్ర ప్రణాళిక విభాగం తెలిపింది. -
విదేశీ దిగుమతి యూరియాలో సగానికి సగం కోత!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు నాట్లు..మరోవైపు పత్తి, మక్కల సాగుతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జూలై నెలలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. అయితే నిండుకుంటున్న నిల్వలను చూసి వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రానికి ఈ వానాకాలం సీజన్లో కేటాయించిన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో సగానికిపైగా విదేశాల నుంచి దిగుమతి అయిన యూరియానే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ కేటాయిస్తుండడం ఇబ్బందిగా మారింది. రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో జూన్ వరకు 5 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, ఇందులో విదేశీ దిగుమతి యూరియా 2.60 ఎల్ఎంటీ. ఇందులో 1.36 లక్షల మెట్రిక్ టన్నులు కోత విధించగా, మరో 60 వేల మెట్రిక్ టన్నుల మేర దేశీయ తయారీ యూరియాలో కోత విధించింది. ఈ నేపథ్యంలో జూలై నెలలోనైనా యూరియా కేటాయింపులు సక్రమంగా జరపాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. జూలై నెల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1.60 మెట్రిక్ టన్నుల యూరియాలో 60 శాతం మేర 0.97 లక్షల మెట్రిక్ టన్నులు విదేశీ దిగుమతి యూరియానే ప్రభుత్వం కేటాయించింది. దిగుమతి చేసుకునే యూరియాను నౌకాశ్రయాల ద్వారా వెంటనే సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఆర్ఎఫ్సీఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్) కర్మాగారం నుంచి రాష్ట్ర కోటా కింద కేవలం 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం పంపిస్తోంది. వ్యవసాయ శాఖ ఈ కోటాను అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో జిల్లాలకు పంపించుకునేందుకు వినియోగించుకుంటోంది. కేంద్ర మంత్రి నడ్డాకు తుమ్మల లేఖ రాష్ట్ర కోటా కింద కేటాయించిన యూరియాలో కోతలను అరికట్టి, జూలై నెలలో పూర్తిస్థాయిలో యూరియా సరఫరా చేయాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రానికి విదేశీ దిగుమతి యూరియా కాకుండా దేశీయ ఉత్పత్తి ఎరువునే పంపించాలని కోరారు. ఆర్ఎఫ్సీఎల్ నుంచి యూరియా కేటాయింపును 60,000 మెట్రిక్ టన్నులకు పెంచాలని, ఏప్రిల్–జూన్ మధ్యలో వచ్చిన లోటును పూడ్చడానికి అదనపు సరఫరా ప్రణాళిక మంజూరు చేయాలని తుమ్మల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరిస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి ఆరోపించారు. -
ప్రతి కులానికీ గ్రేడింగ్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే(ఎస్ఈఈఈపీసీ)– 2024 గణాంకాల ఆధారంగా స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రతి కులానికి గ్రేడింగ్ ఇచ్చింది. ఎస్ఈఈఈపీసీ–2024ను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సర్వే గణాంకాలను లోతుగా పరిశీలించి, వివిధ కోణాల్లో విశ్లేషణ చేసిన అనంతరం రాష్ట్రంలోని 242 కులాలకు గ్రేడింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను సైతం రూపొందించింది. పది రోజుల్లో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీ సిద్ధమైంది. ఈ కమిటీ బుధవారం జూబ్లీహిల్స్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి, వైస్ చైర్మన్ కంచె ఐలయ్య, కన్వీనర్ ప్రవీణ్ చక్రవర్తి, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, డాక్టర్ సుఖ్దేవ్ థారోట్, డాక్టర్ హిమాన్షు, నిఖిల్ డే, ప్రొఫెసర్ భాంగ్య భుక్య, ప్రొఫెసర్ పురుషోత్తమ్రెడ్డి, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిటీ కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కన్వినర్లు మీడియాతో మాట్లాడారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఈఈఈపీసీ–2024 అత్యంత పారదర్శకంగా, క్రమపద్ధతిలో, శాస్త్రీయంగా నిర్వహించిందన్నారు. సర్వే నివేదిక దాదాపు మూడు వందలకు పైగా పేజీల్లో ఉందని, ఆ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత కులాల వారీగా గణాంకాలను క్రోడీకరించి ప్రతికులానికి (కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్) గ్రేడింగ్ (ర్యాంకింగ్) ఇచ్చినట్లు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి విశ్లేషణ ఏ రాష్ట్రంలో జరగలేదని, తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం పక్కా గణాంకాలతో నిర్వహించిందన్నారు. ఈ అధ్యయనానికి సంబంధించి తుది నివేదిక తయారైందని, వారం, పది రోజుల్లో ప్రభుత్వం సమయం ఇచి్చన వెంటనే నివేదికను సమర్పించనున్నట్లు వివరించారు. ఈ నివేదికను పబ్లిక్ డొమైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరతామన్నారు. -
టెన్త్ పాస్.. ఇంటర్ ఫెయిల్ 'ఎందుకిలా'?
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పూర్తి చేసిన విద్యార్థి ఇంటర్లో ఎందుకు ఉత్తీర్ణత సాధించడం లేదో ఆలోచించాలని విద్యా శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిపై అధ్యయనం చేయాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియెట్ పూర్తి చేసేలా చూడాలన్నారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తోందని, ఇంటర్లో ఆ శాతం గణనీయంగా తగ్గిపోతోందని చెప్పా రు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియెట్ కీలకమైందంటూ ఈ సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి పెట్టా లని కోరారు. బుధవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో 9 నుంచి 12వ తరగతి వరకూ విద్య అందుబాటులో ఉందని, ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి వరకూ ఉన్న పాఠశాలలను అధ్యయనం చేసి, ప్రభు త్వానికి నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు. విద్యా కమిషన్, ఆ విభాగంలో పనిచేసే ఎన్జీవోలు, పౌర సమాజం సూచనలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఇంటర్ విద్యపై అసెంబ్లీలో చర్చిస్తాం యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని చెప్పారు. పా ఠశాలల నిర్మాణ ప్రక్రియ ప్రగతిపై ప్రతి వారం తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించా రు. ఇంటర్మీడియెట్ విద్య మెరుగుకు చర్య లు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇంటర్లో విద్యార్థుల చేరిక తో పాటు వారి హాజరుపైనా దృష్టి పెట్టా లని సూచించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం నిర్మాణ నమూనాను సీఎం పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయా లని ఆదేశించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డిలు పాల్గొన్నారు. -
భారత్ జైత్రయాత్ర
చియాంగ్ మాయ్ (థాయ్లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో అద్వితీయ విజయాలు సాధించిన భారత్... బుధవారం మూడో మ్యాచ్లో 5–0 గోల్స్ తేడాతో ఇరాక్ను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. భారత్ తరఫున సంగీత (14వ నిమిషంలో), మనీషా (44వ నిమిషంలో), కార్తీక అంగముత్తు (48వ నిమిషంలో), నిర్మలా దేవి (64వ నిమిషంలో), రతన్బాలా దేవి (80వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఓవరాల్గా ఈ టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడిన భారత జట్టు... 22 గోల్స్ సాధించి ప్రత్యర్థికి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం విశేషం. తొలి మ్యాచ్లో 13–0 గోల్స్ తేడాతో మంగోలియాను చిత్తుచేసిన టీమిండియా... తిమోర్ లెస్టెపై 4–0 గోల్స్ తేడాతో నెగ్గింది. తాజా పోరులో సంగీత గోల్తో ఖాతా తెరిచిన భారత్... మనీషా గోల్తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 2–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో మూడు గోల్స్ కొట్టి మ్యాచ్ను ఏకపక్షం చేసింది. గాయం కారణంగా తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోగా... మరింత ఆధిక్యం సాధించే పలు అవకాశాలను మన ప్లేయర్లు సది్వనియోగం చేసుకోలేకపోయారు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉండగా... బుధవారమే జరిగిన మరో మ్యాచ్లో 11–0 గోల్స్ తేడాతో మంగోలియాపై గెలిచిన థాయ్లాండ్ కూడా 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. థాయ్లాండ్ కూడా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలవగా... ఓవరాల్గా 22 గోల్సే చేసిన థాయ్లాండ్ అచ్చం టీమిండియా లాగే ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. గ్రూప్ నుంచి ఒక్క జట్టే ముందంజ వేసే అవకాశం ఉండటంతో... ఇరు జట్ల మధ్య శనివారం జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచ్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్ ప్రధాన టోర్నీలో ఆడింది. ఆ తర్వాత భారత జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. -
కోకో గాఫ్కు 'షాక్'
వింబుల్డన్లో సంచలనాల మోత! ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకొచ్చిన కోకో గాఫ్, గత వారం జర్మనీలో ఇగా స్వియాటెక్ను ఓడించి టైటిల్తో ఈ గ్రాస్కోర్టులోకి దిగిన పెగూలా, రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ క్విటొవా, ఈ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ లోరెంజో ముసెట్టి, మూడు గ్రాండ్స్లామ్ టోర్నీల రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్, మెద్వెదెవ్, రూనె, ఐదోసీడ్ జెంగ్ క్విన్వెన్, 15వ సీడ్ కరోలినా ముకొవా... ఇలా టాప్ స్టార్లకు ఈ వింబుల్డన్ చేదు ఫలితాలనిచ్చింది. పెద్ద సంఖ్యలో సీడెడ్ ప్లేయర్లు మోయలేని భారంతో తొలి రౌండ్లోనే నిష్క్రమించేలా చేసింది. లండన్: గ్రాస్కోర్టు గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్ ఈ సారి మూడు రోజులకే వెలవెలబోతోంది. పలువురు మేటి స్టార్లంతా ఈ కోర్టులో తొలి రౌండ్లోనే ఆఖరి మ్యాచ్ ఆడేసి వెళ్లిపోయారు. మిగిలిన కొద్దిమందిలో ఇంకెంత మంది కనీసం ప్రిక్వార్టర్స్ వరకైనా చేరతారో తెలియని పరిస్థితి. సంచలన ఫలితాలతో పురుషులు, మహిళల సింగిల్స్లో ఒకరో ఇద్దరో కాదు... ఏకంగా 23 మంది సీడెడ్ స్టార్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్లో 10 మంది, పురుషుల సింగిల్స్లో 13 మంది స్టార్లు... 2001 నుంచి టాప్–32 సీడింగ్స్ను గుర్తించాక ఇంత మంది సీడెడ్లు తొలి రౌండ్లోనే కంగుతినడం మొత్తం గ్రాండ్స్లామ్ల చరిత్రలోనే మొదటిసారి! ఫ్రెంచ్ ఓపెన్ తాజా చాంపియన్, అమెరికన్ స్టార్ కోకో గాఫ్ కథ తొలిరౌండ్లోనే అది కూడా క్వాలిఫయర్ చేతిలో ముగిసింది. రెండు వింబుల్డన్ టైటిళ్ల విజేత పెట్రా క్విటోవా మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్లో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం విక్రమార్క పోరాటం చేస్తున్న సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్తో పాటు ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ శుభారంభం చేశారు. మూడో రౌండ్లో సబలెంక, అల్కరాజ్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో బెలారస్ స్టార్, టాప్ సీడ్ సబలెంక 7–6 (7/4), 6–4తో మేరి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ సీజన్లో రెండు గ్రాండ్స్లామ్ (ఆ్రస్టేలియా, ఫ్రెంచ్) టోర్నీల్లోనూ రన్నరప్గా నిలిచిన సబలెంకకు తొలిసెట్లో అన్సీడెడ్ ప్లేయర్ గట్టి పోటీ ఇచ్చినా టైబ్రేకర్తో గెలుపుబాట పట్టింది. మరో పోరులో ఆరో సీడ్ మాడిసన్ కీస్ 6–4, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై వరుస సెట్లలో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో వింబుల్డన్ (2023, 2024) ‘హ్యాట్రిక్’పై కన్నేసిన కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) సునాయాస విజయంతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో సీడ్ స్పెయిన్ స్టార్ 6–1, 6–4, 6–4తో బ్రిటన్ ప్లేయర్ టార్వెట్ను ఓడించాడు. రెండోరౌండ్లో 12వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫె (అమెరికా)కు చుక్కెదురైంది. గత యూఎస్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ టియాఫె 6–4, 4–6, 3–6, 5–7తో కామెరూన్ నోరి (బ్రిటన్) చేతిలో కంగుతిన్నాడు. 14వ సీడ్ రుబ్లెవ్ 6–7 (1/7), 6–4, 7–6 (7/5), 6–3తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. డయానా సంచలనం ఉక్రెయిన్ ప్లేయర్ డయానా యస్త్రెంస్కా లండన్లో టైటిల్ గెలవకుండానే పతాక శీర్షికల్లో నిలిచింది. 2018 నుంచి గ్రాండ్స్లామ్ బరిలో దిగుతున్నప్పటికీ ఏనాడూ సాధ్యమవని విజయాన్ని ఈ వింబుల్డన్ తొలి రౌండ్లోనే సాకారం చేసుకుంది. పారిస్ మట్టికోర్టులో (ఫ్రెంచ్ ఓపెన్)లో మహారాణిగా నిలిచిన అమెరికన్ స్టార్, రెండో సీడ్ కోకో గాఫ్కు కనీవినీ ఎరుగని షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ అనామక ప్లేయర్ను సులువుగానే ఓడిస్తుందనుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్ గాఫ్ 6–7 (3/7), 1–6తో 42వ ర్యాంకర్ డయానా య్రస్తెంస్కా చేతిలో ఘోర పరాభవానికి గురైంది.ప్రపంచ నాలుగో ర్యాంకర్ పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ తొలి రౌండ్ను వరుస సెట్లలోనే గెలిచింది. రష్యన్ ప్రత్యర్థి నుంచి తొలిసెట్లో ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఐదు గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్ అయిన స్వియాటెక్ 7–5, 6–1తో పొలినా కుడెర్మటోవాపై గెలుపొందింది. 17వ సీడ్ బార్బర క్రెజ్సికొవా (చెక్ రిపబ్లిక్) 3–6, 6–2, 6–1తో అలెగ్జాండ్రా ఎలా (ఫిలిప్పీన్స్)పై నెగ్గింది. ఇంతేనా... మిగిలింది! చెప్పుకోదగ్గ స్టార్లు, కనీసం సెమీఫైనల్ గ్యారంటీ అనుకున్న ప్లేయర్లు సైతం ఆదిలోనే కంగు తినడంతో ఇక మిగిలింది కొందరే! నంబర్వన్ సబలెంక, మూడో టైటిల్పై కన్నేసిన డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్, 2023 వింబుల్డన్ చాంపియన్ మార్కెటా వొండ్రుసొవా, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను, పదో సీడ్ ఎమ్మా నవారో, యానిక్ సినెర్, రజతోత్సవ టైటిల్పై కన్నేసిన జొకోవిచ్ తదితర స్టార్లే మిగిలారు. అయితే ఇంతటి సంచలనాల పర్వంలో ఇక వీరిలో ఎవరెవరు క్వార్టర్స్ దాటుతారనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. రెండో రౌండ్లోకి యూకీ జోడీ పురుషుల డబుల్స్లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన అమెరికన్ భాగస్వామితో కలిసి శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో 16వ సీడ్ యూకీ–రాబర్ట్ గాలొవే ద్వయం 7–6 (10/8), 6–4తో అర్నియోడో (మొనాకో)–గినార్డ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. రిత్విక్ బొల్లిపల్లి–బారియెంటోస్ (కొలంబియా) జోడీ 4–6, 6–4, 7–6 (13/11)తో గాఫిన్ (బెల్జియం)–ముల్లర్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. వెటరన్ స్టార్ రోహన్ బోపన్న ద్వయంకు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. బోపన్న–సాండర్ గిల్లీ (బెల్జియం) జోడీ 3–6, 4–6తో మూడో సీడ్ క్రావిట్జ్ (జర్మనీ)–ప్యూట్జ్ (జర్మనీ) జంట చేతిలో ఓడింది. జొకోవిచ్ కష్టపడి... బిగ్–3లో కెరీర్ను కొనసాగిస్తున్న సెర్బియన్ దిగ్గజం జొకోవిచ్ రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి సవాళ్లు ఎదురైనా అనుభవంతో అధిగమించాడు. ఆరో సీడ్ జొకో 6–1, 6–7 (7/9), 6–2, 6–2తో ముల్లర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. తొలిరౌండ్లో మూడు గంటలకు పైగానే కోర్టులో శ్రమించి టోర్నీలో శుభారంభం చేశాడు. ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) మాత్రం అలవోక విజయంతో ముందంజ వేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఫ్రెంచ్ రన్నరప్ సినెర్ 6–4, 6–3, 6–0తో తన దేశ సహచరుడు ల్యూకా నార్డిని ఓడించగా... నాలుగో సీడ్ డ్రాపర్ (బ్రిటన్) 6–2, 6–2, 2–1తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి బేజ్ (అర్జెంటీనా) రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–7 (6/8), 6–7 (8/10), 6–4, 7–6 (8/6), 6–4తో పెరికార్డ్ (ఫ్రాన్స్)పై ఐదు సెట్ల పోరాటం చేసి గట్టెక్కాడు. -
గిల్ 'శతక' మోత
యువ సారథి శుబ్మన్ గిల్ మరో సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధనాధన్ ఇన్నింగ్స్తో అలరిస్తే... రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్తో తన విలువ చాటుకున్నాడు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై రెండో రోజు గిల్, జడేజా జంట ఎంతసేపు నిలుస్తుందనే దానిపైనే భారత స్కోరు ఆధారపడి ఉంది.బర్మింగ్హామ్: పరాజయంతో ఇంగ్లండ్ పర్యటనను ప్రారంభించిన భారత క్రికెట్ జట్టు... రెండో టెస్టును మెరుగ్గా మొదలు పెట్టింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం మొదలైన రెండో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (216 బంతుల్లో 114 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఈ సిరీస్తోనే సారథ్య బాధ్యతలు చేపట్టిన గిల్... కెప్టెన్సీ ప్రభావం తన బ్యాటింగ్పై ఏమాత్రం లేదని మరోసారి నిరూపించాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన గిల్... రెండో టెస్టులోనూ దాన్ని పునరావృతం చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 87; 13 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా (67 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కరుణ్ నాయర్ (50 బంతుల్లో 31; 5 ఫోర్లు), రిషబ్ పంత్ (42 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 2 వికెట్లు పడగొట్టగా... కార్స్, స్టోక్స్, బషీర్ తలా ఒక వికెట్ తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న భారత జట్టు రెండో రోజు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది కీలకం. జైస్వాల్ దూకుడు గత మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ జట్టు... ఈ సారి కూడా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. లీడ్స్తో పోల్చుకుంటే ఈ పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలంగా ఉంటుందనే అంచనాల మధ్య తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 2) తొమ్మిదో ఓవర్లో అవుటయ్యాడు. తొలి స్పెల్ను కట్టుదిట్టంగా వేసిన వోక్స్కు ఈ వికెట్ దక్కింది. ఈ దశలో కరుణ్ నాయర్తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న ఈ జంట... ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. గత మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన నాయర్... ఈసారి వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు సాధికారికంగా ఆడిన అతడు కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్లో జైస్వాల్ అలవోకగా పరుగులు రాబట్టాడు. వన్డే తరహాలో ఆడుతూ పాడుతూ... 59 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో హాఫ్సెంచరీ పూర్తిచేసుకున్నాడు. లంచ్ విరామానికి కాస్త ముందు కార్స్ బౌలింగ్లో నాయర్ అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ సంయమనం... రెండో సెషన్లో గిల్, జైస్వాల్ జోరు చూస్తే భారత్కు తిరుగులేనట్లు అనిపించింది. మంచి బంతులను గౌరవించిన ఈ జంట... గతి తప్పిన బంతులపై విరుచుకుపడి పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో జైస్వాల్ మరో సెంచరీ చేయడం ఖాయం అనుకుంటే... ఇంగ్లండ్ కెపె్టన్ స్టోక్స్ అతడిని ఔట్ చేసి జట్టుకు బ్రేక్ త్రూ అందించాడు. చివరి సెషన్లో పంత్ ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. శార్దుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన నితీశ్ ఆరు బంతులాడి వోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో ఇంగ్లండ్ శిబిరంలో ఉత్సాహం పెరగగా... గిల్ సంయమనంతో ముందుకు సాగాడు. మరో ఎండ్ లో జడేజా అతడికి చక్కటి సహకారం అందించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) జేమీ స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (బ్యాటింగ్) 114 ; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (బ్యాటింగ్)41; ఎక్స్ట్రాలు: 9; మొత్తం (85 ఓవర్లలో 5 వికెట్లకు) 310. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211. బౌలింగ్: వోక్స్ 21–6–59–2; కార్స్ 16–2–49–1; టంగ్ 13–0–66–0; స్టోక్స్ 15–0–58–1; బషీర్ 19–0–65–1; రూట్ 1–0–8–0. -
‘ఇదేం సెలక్షన్’
ప్రపంచంలో బెస్ట్ బౌలర్ మీ జట్టులో ఉన్నాడు... అప్పుడప్పుడు ఫిట్నెస్ సమస్యలు ఉన్నా రెండు టెస్టుల మధ్య ఏడు రోజుల విరామం వచ్చింది. గత మ్యాచ్లో ఒక వేళ ఏమైనా ఇబ్బంది కలిగినా...ఫిట్నెస్ ట్రైనర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉన్నప్పుడు కోలుకునేందుకు ఏడు రోజుల సమయం కూడా సరిపోతుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడి జట్టు వెనుకంజలో ఉంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించి సింగిల్ హ్యాండ్తో గెలిపించగల సత్తా అతనికి ఉంది. అయినా సరే... భారత జట్టు జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్లో ఆడించలేదు. పైగా తర్వాతి టెస్టులో పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆడతాడని కెప్టెన్ గిల్ వ్యాఖ్యానించడం క్షమించరానిది! అతని స్థానంలో ఆకాశ్దీప్కు అవకాశం లభించింది. మరో వైపు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మళ్లీ అన్యాయం జరిగింది. రెండో స్పిన్నర్గా అతనికి ఈ మ్యాచ్లోనూ అవకాశం లభించలేదు. అటాకింగ్ బౌలర్ అయిన కుల్దీప్ గత టెస్టులో లేకపోవడం లోటుగా కనిపించింది. ఈ సారి ఇంగ్లండ్పై చెలరేగే అవకాశం ఉందని భావించగా ఈ సారి స్థానమే దక్కలేదు. పైగా గత మ్యాచ్లో లోయర్ ఆర్డర్ విఫలమైంది కాబట్టి బ్యాటింగ్ చేయగల బౌలర్ కావాలంటూ సుదర్శన్ స్థానంలో సుందర్ను తీసుకున్నారు. ఒక రెగ్యులర్ బౌలర్ను అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేయడం ఏమిటో అర్థం కాలేదు! శార్దుల్ ఠాకూర్కు బదులుగా అదే తరహా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, ఆంధ్రకు చెందిన నితీశ్ కుమార్ రెడ్డికి చాన్స్ ఇచ్చినా అతనూ విఫలమయ్యాడు. ‘బుమ్రాను తప్పించడం నమ్మశక్యంగా లేదు. అతని పని భారం తగ్గించాలని చూస్తే ఇప్పటికే తగినంత విశ్రాంతి లభించింది. ఎంతో కీలకమైన మ్యాచ్కు అతను లేకపోవడం ఆశ్చర్యకరం. ఆటగాడు తన ఇష్ట్రపకారం మ్యాచ్ను ఎంచుకునే అవకాశం ఇవ్వరాదు. ఇక్కడ టెస్టు గెలిచి 1–1తో సిరీస్ను సమం చేస్తే ఆ తర్వాత విశ్రాంతి ఇచ్చుకోవచ్చు’ అని రవిశాస్త్రి దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానించాడు. ఇలా బ్యాటింగ్ బలమే కావాలంటే సిరీస్ చివరకు వచ్చే సరికి బుమ్రా, మరో పది మంది బ్యాటర్లే బరిలోకి దిగుతారేమో! -
శిథిల బతుకులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించిన చోట శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నా యి. బుధవారం మరో రెండు మృతదేహాలు లభించినట్టు సమాచారం. తీవ్రగాయాల పాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మరణించినట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య 45కు చేరువైనట్టు అనధికారిక అంచనా. సిగాచి పరిశ్రమ యాజమాన్యం మాత్రం 40 మంది చనిపోయారని ప్రకటించింది. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నా పదిమంది ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ బుధవారం కూడా కొనసాగింది. డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. వర్షం, సాంకేతిక కారణాలతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. దీంతో శిథిలాల తొలగింపు ప్రక్రియ గురువారం కూడా కొనసాగనుంది. డీఎన్ఏ రిపోర్టుల రాక ఆలస్యం శిథిలాల్లో బయటపడిన మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేస్తున్నారు. మొత్తం 37 మృతదేహాలు పటాన్చెరు ఆస్పత్రికి చేర్చారు. ఈ మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఎన్ఏలు సరిపోయాకే మృతదేహాలను అప్పగిస్తున్నారు. అయితే ఈ రిపోర్టులు రావడానికి 24 గంటల నుంచి 48 గంటలు పడుతుందని అధికారులు చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మృత్యువాత తీవ్ర గాయాలపాలై సంగారెడ్డి జిల్లాతోపాటు, హైదరాబాద్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో బుధవారం ముగ్గురు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి కారి్మకులు చాలామంది 70 శాతం వరకు కాలిన గాయాలైన విషయం విదితమే. ఇందులో పలువురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారుల విడుదల చేసిన సమాచారం ప్రకారం.. – ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో పనిచేస్తున్నవారు : 143 – ప్రమాదం నుంచి బయటపడిన వారు : 60 – గాయపడి చికిత్స పొందుతున్నవారు : 35 – మరణించిన వారిలో పేర్లు గుర్తించిన మృతదేహాలు : 18 – పేర్లు గుర్తించని మృతదేహాల సంఖ్య : 20 – ఆచూకీ లభించకుండా పోయినవారు : 10 డీఎన్ఏ రిపోర్టుల సమాచారం : డీఎన్ఏ టెస్ట్ అయ్యాక ఆయా కుటుంబాలకు అప్పగించిన మృతదేహాల సంఖ్య : 18 – ల్యాబ్ నుంచి డీఎన్ఏ రిపోర్టుల రావాల్సిన మృతదేహాలు : 18 – డీఎన్ఏ పరీక్షల కోసం సేకరించాల్సిన శాంపిల్స్ : 2 – ల్యాబ్లో ప్రాసెస్ చేయాల్సిన కుటుంబసభ్యుల రక్త శాంపిల్స్ : 25 – ఇప్పటి వరకు జాడ తెలియని కుటుంబాల సంఖ్య : 3 – ప్రాసెస్ చేయబడిన, సరిపోలిన శాంపిల్స్ సంఖ్య : 5 మంత్రి దామోదర వాహనం అడ్డగింత రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించేందుకు వస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ వాహనాన్ని సిగాచీ పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాలు అడ్డున్నాయి. జస్టిన్ ఆచూకీ చెప్పాలని బాధిత కుటుంబ సభ్యులు మంత్రి వాహనానికి ఎదురుగా వెళ్లారు. దీంతో వాహనం దిగి వచ్చిన మంత్రి వారిని సుముదాయించి దైర్యం చెప్పారు. 18 బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం 18 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.18 లక్షలు చెల్లించారు. గాయపడిన 34 మందికి రూ.50 వేల చొప్పున రూ.17 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆచూకీ లభించని వారి కుటుంబాలకు తాత్కాలికంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించినట్టు అధికారులు తెలిపారు. పరిశ్రమలోకి దూసుకెళ్లేందుకు బాధిత కుటుంబాల యత్నం..ఉద్రిక్తత సిగాచీ పరిశ్రమలోకి కొందరు బాధిత కుటుంబ సభ్యులు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. బుధవారం సాయంత్రం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిశ్రమ గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదం జరిగి మూడు రోజులైనా, తమ వారి మృతదేహాలను అప్పగించకపోవడం దారుణమన్నారు. అధికారుల వైఫల్యం కారణంగానే మట్టి దెబ్బల కింద ఎంతోమంది విగతజీవులుగా పడి ఉన్నారన్నారు. ‘మీకు చేతకాకపోతే చెప్పండి.. ఎముకలైనా తవ్వుకొని తీసుకెళతాం’అని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ప్రమాదం జరిగిన రోజే శిథిలాలను తొలగించి వెతికి చూస్తే ఇంకా చాలామంది బతికే వారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రెండు మృతదేహాలు వెలికి తీశారని, అది కూడా తమ ఒత్తిడి మేరకే జరిగిందని వారు వివరించారు. ఒక మృతదేహంపై దుస్తులు కూడా ఉన్నాయని, శవాన్ని గుర్తించే స్థితిలో ఉందని వారు చెప్పారు.ఆ రోజే శిథిలాలను తొలగించి ఉంటే ఇంకొంతమంది ప్రాణాలతో బయటపడే వారిని బండ్లగూడకు చెందిన శిల్ప పేర్కొన్నారు. ఇద్దరి పరిస్థితి విషమం గచ్చిబౌలి: ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మదీనాగూడలోని ప్రణమ్ హాస్పిటల్లో 18 బాధితులకు చికిత్స అందిస్తున్నామని, గురువారం 10 మందిని డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ ఎండీ మనీష్గౌర్ తెలిపారు. ప్రమాదం జరిగిన రోజే ఈ హాస్పిట్కు 22మందిని తీసుకొచ్చారు. వీరిలో హేమసుందర్, లగ్నాజిత్, శశిభూషణ్లు మృత్యువాత పడ్డారు. ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జనరల్ వార్డులో 13 మందికి చికిత్స అందిస్తున్నారు. వెస్ట్ బెంగాల్కు చెందిన తారక్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మిషనరీ కాలం చెల్లిందని చెప్పినా... సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన విషయంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్కు చెందిన రాజనాల సాయియశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భానూరు పోలీసులు మంగళవారం కేసు (క్రైం నెం.184/2025) నమోదు చేశారు. అయితే ఈ పరిశ్రమలో మిషనరీ కాలం చెల్లిపోయిందని.. పాతబడిన ఈ మిషనరీని మార్చాలని.. తన తండ్రి రాజనాల వెంకట్జగన్మోహన్ పలుమార్లు యాజమాన్యం దృష్టికి తెచ్చారని సాయియశ్వంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణం ఈ యంత్రాలను మార్చకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లుతుందని ముందుగానే యాజమాన్యానికి చెప్పారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో 20 సంవత్సరాలుగా తన తండ్రి వెంకటజగన్మోహన్ (55) పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనలో ఆయన మరణించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు భానూరు పోలీసులు సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై బీఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద జూన్ 30న కేసు నమోదు చేశారు. వెంకటజగన్మోహన్ది స్వస్థలం ఒడిశాలోని గంజామ్ జిల్లా చత్రాపూర్. -
విద్యార్థి వీసాలపై ‘కాల పరిమితి’ కత్తి!
వాషింగ్టన్: విదేశీ వలసదారులపై బహిష్కరణ వేటు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా విదేశీ విద్యార్థులపై ‘కాల పరిమితి’ కత్తి దూసేందుకు సాహసించారు. విదేశీ విద్యార్థులకు కాలపరిమితితో సంబంధం లేకుండా ఇన్నాళ్లూ ఎఫ్–1 స్టూడెంట్ వీసాలు జారీచేస్తుండగా ఇకపై స్పష్టమైన తుదిగడువుతో విద్యార్థి వీసాలు జారీచేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. గడువు దాటాక అమెరికా గడ్డపై ఉంటే మళ్లీ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత ప్రతిపాదనలో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడితే ఇకపై విద్యార్థి అమెరికాలో చేయబోయే కోర్సు పూర్తయినా, పూర్తికాకపోయినా వీసాపై ముద్రించిన గడువుతేదీలోపు అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ ఇలాంటి గడువు అనేదే లేదు. అమెరికాలోకి అడుగుపెట్టినప్పుడు ఎంచుకున్న విద్యా కోర్సు సంపూర్ణంగా పూర్తయ్యేదాకా ఆ స్టూడెంట్ వీసా చెల్లుబాటులోనే ఉండేది. దీనినే ‘ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’గా పిలుస్తారు. ఈ స్టేటస్లో ఇకపై గడువు తేదీని ముద్రించాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. గతంలో కోర్సు ఆలస్యమైతే వీసా గడువు పొడిగింపు వంటి వెసులుబాట్లు ఉండేవి. ఇకపై అలాంటివి ఒప్పుకోబోమని ట్రంప్ సర్కార్ కరాఖండీగా చెబుతోంది. దీంతో ఎఫ్–1 వీసాలతో అమెరికా విద్యాభ్యాసం కోసం వచ్చే భారతీయ విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడనుంది. అనివార్య కారణాలతో కోర్సు ఆలస్యమైనాసరే వీసా గడువు మాత్రం పాత తేదీకే పూర్తవుతుంది. అలాంటి సందర్భాల్లో కోర్సు పూర్తికాకముందే అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకే మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆ దరఖాస్తు ఆమోదం కోసం వేచి ఉండటం, దరఖాస్తు, తదితరాల ఖర్చులు తడిసిమోపెడై విద్యార్థులకు ఖర్చు మరింత పెరగనుంది. ఎక్స్చేంజ్ విజిటర్లకూ కష్టాలే జే–1 వీసా సాధించి ఎక్స్చేంజ్ విజిటర్లుగా వచ్చే వాళ్లకూ ఇదే నిబంధనను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చిన్నారులకు ఇంట్లో సేవచేయడం అందుకు ప్రతిఫలంగా భోజన, వసతి, స్వల్ప భత్యం వంటి సదుపాయాలు పొందే ‘ఆపెయిర్’ యువతకు ఇదే గడువు విధించాలని చూస్తున్నారు. కొత్త ప్రతిపాదలు అమల్లోకి వస్తే విదేశీ విద్యార్థులతోపాటు ఎక్స్చేంజ్ విజిటర్ల విభాగంలోకి వచ్చే అధ్యాపకులు, విదేశీ మీడియా ప్రతినిధులు, విద్యావేత్తలు, కళాకారులు, ఉపాధ్యాయులు, ట్రైనీలు, ఇంటర్న్లు, వైద్యులు సైతం వీసా కాలపరిమితి కష్టాలను ఎదుర్కోనున్నారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ప్రతిపాదనలు చేసింది. ప్రతిపాదనలు ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగం పరిశీలిస్తోంది. వీటిని ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించాక 30 లేదా 60 రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. అత్యవసరమైతే దొడ్డిదారిన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కూడా ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చే ప్రమాదముందని తెలుస్తోంది. పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఇప్పటికే వీసా దరఖాస్తుదారుల ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా గ్రామ్, లింక్డి్డన్ వంటి సామాజిక మాధ్యమ ఖాతాలను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల పోస్ట్లు, ట్వీట్లు, వీడియోలు ఉన్నాయో లేదోనని పరిశీలించి ఆ మేరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇన్ని అడ్డంకులను దాటుకుని సంపాదించిన వీసాను కేవలం గడువు ప్రాతిపదికన మంజూరుచేయడం తగదని పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడువు విధింపు కారణంగా లక్షలాది మంది విద్యార్థులపై అదనపు ఒత్తిడి, ఆర్థికభారం తప్పదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అకడమిక్ కోర్సుల విధానం అస్తవ్యస్తమవుతుందని పలువురు పేర్కొన్నారు. గడువుదాటి అమెరికాలో ఉంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ మే 14వ తేదీన హెచ్చరించడం తెల్సిందే. -
14న రేషన్ కార్డుల పంపిణీ: ఉత్తమ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 14న కొత్త రేషన్కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై వృద్ధులు, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ ఈ విషయం వెల్లడించారు. 14న సాయంత్రం 6 గంటలకు తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగ సభలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులకోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 13లోగా పరిశీలించి, అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికలున్న చోట కొద్దిమందికి రేషన్ కార్డులు ఇచ్చిందే తప్ప అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్.. 44 కిలోమీటర్లలో 35 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే చేసి పనులు పునఃప్రారంభిస్తామన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: మంత్రి లక్ష్మణ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నిరకాలుగా అండగా ఉంటుందని మంత్రి లక్ష్మణ్కుమార్ తెలిపారు. ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, అలాకాకుండా తమ ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. వానాకాలంలో విద్యుత్తు సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రూ.1,200 కోట్లతో రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రూ.1,200 కోట్లతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణం చేపడతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. అధికారులు పథకాల అమలులో అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క నెల పనిచేయండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘రాష్ట్రంలో చదువుకున్న వైద్యులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఏడాదిలో 11 నెలలు మీకు నచ్చిన ఆసుపత్రిలో, మీకు నచ్చిన వేతనానికి పనిచేయండి. మీకు నచ్చిన జీవితాన్ని లీడ్ చేయండి. మిగతా నెలరోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయండి. సామాజిక బాధ్యతగా పేదలకు వైద్యం అందించండి..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. నిమ్స్, ఉస్మానియా వంటి ఆసుపత్రుల్లో వారం రోజులు పనిచేసినా చాలని, ఏ ఆసుపత్రిలో పనిచేయాలనుకుంటున్నారో ముందుగా తెలియజేయాలని కోరారు. అమెరికా నుంచి వచ్చే వైద్యులూ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇటువంటి వారందరినీ ఒక వేదికపైకి తీసుకొస్తామని తెలిపారు. బుధవారం బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రి ప్రారం¿ోత్సవంలో ఆయన మాట్లాడారు. రోగాల నివారణకు పరిశోధనలు జరగాలి ‘ఈ రోజు ఖరీదైనది ఏదైనా ఉందంటే అది వైద్యం. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రారంభించారు. అప్పట్లో రూ.2 లక్షలు ప్రకటిస్తే, ఈ రోజు దానిని రూ.10 లక్షలకు పెంచాం. సీఎంఆర్ఎఫ్ కింద రూ.1,400 కోట్లు చెల్లించాం. ఇదంతా రోగం వచ్చిన తర్వాత బాగు చేయడానికి ఖర్చు చేస్తున్నాం. కానీ రోగాలను నివారించేందుకు ముందస్తుగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ సమయంలో హైదరాబాద్లో ఐడీపీఎల్ ప్రారంభించారు. డాక్టర్ రెడ్డీస్, ఎస్ఓఎల్, హెటిరో యాజమాన్యాలు ఐడీపీఎల్ మాజీ ఉద్యోగులేనని భావిస్తున్నా. ఏఐజీ ఆసుపత్రికి వైద్య సేవల కోసం 66 దేశాల నుంచి రోగులు వస్తున్నారు. ఇది మనందరికీ గర్వకారణం. గతంలో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు వైద్యం అంటే లావాదేవీలన్నట్లుగా మారింది. అయితే నగర ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్రెడ్డిని అభినందిస్తున్నా. ఆయన హైదరాబాద్కు, తెలంగాణకు గొప్ప పేరు తీసుకొచ్చారు. నాగేశ్వర్రెడ్డి సేవలను గుర్తించిన కేంద్రం పద్మ విభూషణ్తో సత్కరించింది. ఆయనకు భారతరత్న ఒక్కటే మిగిలి ఉంది. భారతరత్నకు ఆయన అర్హులు. దీని కోసం ముఖ్యమంత్రిగా నావంతు ప్రయత్నం చేస్తా. ఆయనకు ఖచ్చితంగా భారతరత్న వస్తుందని భావిస్తున్నా..’ అని సీఎం చెప్పారు. డిసెంబర్ నాటికి అందుబాటులోకి 7 వేల పడకలు ‘గోషామహాహల్లో రూ.3 వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి పనులు ప్రారంభించాం. హైదరాబాద్ నిమ్స్, వరంగల్లో 2 వేల పడకల చొప్పున, టిమ్స్ అల్వాల్, ఎల్బీనగర్, సనత్నగర్లో వెయ్యి పడకల చొప్పున కొత్తగా మొత్తం 7 వేల పడకలు ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రి అనగానే ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని దూరం చేసేలా పనిచేస్తున్నా..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. జపనీస్ నేర్చుకోవాలి ‘రాష్ట్రంలో విద్యకు రూ.21,500 కోట్లు, వైద్యానికి రూ.11,500 కోట్ల వ్యయంతో అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. జీసీసీ, ఐటీ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ గమ్యస్థానంగా నిలుస్తోంది. మధ్య, తూర్పు దేశాల నుంచి వచ్చే రోగులు ఢిల్లీ, బెంగళూరు, కొల్కతాలో దిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రిని కలిసి హైదరాబాద్కు నేరుగా విమానాలు నడిపించాలని కోరాం. జపాన్లో వయసు పైబడిన వారు అధికంగా ఉన్నారు. అక్కడ వైద్య సేవలు ఎక్కువగా అవసరం ఉన్నాయి. కాబట్టి మన దగ్గర నర్సింగ్ సిబ్బంది జపాన్ భాష నేర్చుకోవాలి..’ అని రేవంత్ సూచించారు. తెలంగాణ ప్రణాళికలో నాగేశ్వర్రెడ్డి భాగస్వాములు కావాలి ‘భారత్ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా ముందుకెళుతోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రభుత్వం డాక్యుమెంట్ తయారు చేస్తోంది. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్గా ఉంటుంది. హైదరాబాద్ను హెల్త్ టూరిజం హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో కోటి మంది మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి, ఒక్కొక్కరికి యూనిక్ నంబరుతో గుర్తింపు కార్డు అందిస్తాం. రాష్ట్రం చేపట్టే ప్రణాళికలో డాక్టర్ నాగేశ్వర్రెడ్డి కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నా. మనమే నంబర్ వన్ తలసరి ఆదాయం, రెవెన్యూ, శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్ నియంత్రణలో మనమే నంబర్–1. డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఇటీవల దుబాయ్లో నిర్వహించిన పోటీలో హైదరాబాద్కు ప్రథమ బహుమతి వచ్చింది. నగర సీపీ సీవీ ఆనంద్ దాన్ని అందుకున్నారు. ఇలాంటివన్నీ మనం బ్రాండింగ్ చేసుకోవాలి. ఇటీవల ఒకవైపు యుద్ధ వాతావరణం.. మరోవైపు ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి. శాంతిభద్రతల సమస్యపై చర్చలు జరుగుతున్న సమయంలో.. హైదరాబాద్లో ప్రపంచ దేశాలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా హైలీ ప్రొటెక్టెడ్ సిటీ (అధిక రక్షణతో కూడిన నగరం) అనే విశ్వాసాన్ని కల్పించగలిగాం. అయితే కొన్ని దేశాలు భారత్ను ఇంకా వెనుకబడిన దేశంగానే చూస్తున్నాయి. దీన్నుంచి బయటపడాలి..’ అని సీఎం అన్నారు. 140 గ్రామాలు దత్తత తీసుకున్న ఏఐజీ ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. పటాన్చెరు సమీపంలోని 140 గ్రామాలను తాము దత్తత తీసుకున్నామని తెలిపారు. ఆయా గ్రామాల్లో మెడికల్ కేర్ బాధ్యతలు తాము నిర్వరిస్తున్నామని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీని సందర్శించి, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇలాంటి అధునాతన టెక్నాలజీ లేదని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. -
ఈ మధ్య అలానే కూర్చుంటున్నారు!
ఈ మధ్య అలానే కూర్చుంటున్నారు! -
సంక్షేమానికి ‘అగ్రజుల’ వాతలు!
సంక్షేమానికి భారీగా కోత పెడుతూ అమెరికా, బ్రిటన్ ఏకకాలంలో తీసుకొచ్చిన బిల్లులు మంగళవారం ఆమోదం పొందాయి. అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బిల్లు సంక్షేమానికి కోత పెట్టడంతో పాటు సంపన్నులు చెల్లించే పన్నుల్ని కూడా తగ్గించింది. అసలే రిపబ్లికన్లకు అరకొర మెజారిటీ ఉన్న సెనేట్లో ఆ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో అనుకూలురూ, వ్యతిరేకులూ సమంగా ఉన్న సభలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వేసిన ఒక్క ఓటుతో ఆ బిల్లు గట్టెక్కింది. రిపబ్లికన్లకు ఆధిక్యత ఉన్న ప్రతినిధుల సభలో అది సునాయాసంగా ఆమోదం పొందుతుంది. బ్రిటన్లో లేబర్ పార్టీ ప్రభుత్వానికి అంత ‘అదృష్టం’ లేదు. బిల్లుపై లేబర్ పార్టీలో తిరుగుబాటు చెలరేగటంతో ఆఖరి నిమిషంలో ప్రధాని కియర్ స్టార్మర్ దాని తీవ్రతను తగ్గించారు. ఈ కోతల ద్వారా ఖజానాకు ఏటా 600 కోట్ల పౌండ్లు మిగిల్చాలన్నది లేబర్ ప్రభుత్వం ధ్యేయమైనా, బిల్లు గట్టెక్కటానికి వీలుగా దిగిరాక తప్పలేదు. అగ్రరాజ్యాలు రెండింటిలో ఒకే రోజు సంక్షేమానికి కోత పెట్టే బిల్లులు రావటం ప్రభుత్వాల వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దం పట్టాయి. తప్పుడు ప్రాథమ్యాలూ, అనవసర వ్యయాలతో ఖజానాలను ప్రభుత్వాలు దివాలా తీయిస్తూ, పర్యవసానంగా వచ్చిపడుతున్న సంక్షోభాల నుంచి గట్టెక్కటానికి పౌరుల పట్ల తమ బాధ్యతల్ని వదిలించుకో జూస్తున్నాయి. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ చాలా చోట్ల ఈ ధోరణే కొనసాగుతోంది. కాకపోతే ట్రంప్ దేన్నయినా బాహాటంగా చేస్తారు. ట్రంప్ చర్య అమెరికాను రెండు రకాలుగా దెబ్బ తీయబోతోంది. దశాబ్దాలుగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు గండికొడుతుంది. దీన్ని పూడ్చుకోవటానికి ఆయన సంక్షేమంపై పడ్డారు. ఆరోగ్య బీమాకూ, ఆహార కూపన్లకూ కోత పెట్టడం వల్ల 2034 నాటికి అట్టడుగునున్న కోటి 20 లక్షలమంది జనాభాకు ఉన్న కాస్త ఆసరా ఎగిరిపోతుంది. ఆ మేరకు పన్నులు కూడా తగ్గిస్తున్నామన్న రిపబ్లికన్ల వాదన అర్థరహితం. ఎందుకంటే పారిశ్రామికవేత్తల మాట అటుంచి వార్షిక ఆదాయం 2,17,000 డాలర్లున్న ఉద్యోగికి 12,500 మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ వార్షిక ఆదాయం 35,000 డాలర్లున్న బడుగు ఉద్యోగికి లబ్ధి కేవలం 150 డాలర్లు. ఖజానా ఆదాయం పడిపోయాక తిరిగి అప్పులు చేయక తప్పదు గనుక 2034 కల్లా అమెరికా రుణం మరో 3.8 లక్షల కోట్ల డాలర్ల మేర పెరుగుతుంది. ప్రభుత్వంలో అనవసర వ్యయాన్ని తగ్గిస్తామనే పేరిట ‘డోజ్’ ద్వారా భారీయెత్తున ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ట్రంప్ ప్రభుత్వం తీరా సంపన్నులపై పన్నులు తగ్గించి దేశ రుణభారాన్ని మరింత పెంచుతోంది. ఇదంతా 2017లో తాను అమలు చేసిన పన్ను కోతల కొనసాగింపేనని ట్రంప్ అంటున్నా అందులో నిజం లేదు. దాన్ని కొనసాగించకపోతే పౌరులు అదనంగా 68 శాతం పన్నులు చెల్లించాల్సి వస్తుందని ఆయన ఊదరగొట్టారు. ఇదంతా అంతర్గత సమస్య. కానీ దీని పర్యవసానాలు అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ఉంటాయి. బహుళజాతి సంస్థలపై పన్ను విధింపు గురించి జీ–7, ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓసీడీఈ)లు 2021లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒకచోట పన్ను రాయితీ పొందిన సంస్థపై వేరే దేశంలో పన్ను విధించటానికి ఈ ఒప్పందం అనుమతిస్తోంది. దాని ప్రకారం ట్రంప్ కోతలతో లాభపడే సంస్థలపై పన్నులు వేసే అధికారం వేరే దేశాలకుంటుంది. కానీ ఈ పరిస్థితిని ట్రంప్ సహిస్తారా? కెనడా వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ఆ దేశం 2021 నాటి ఒప్పందానికి అనుగుణంగానే అమెరికన్ సంస్థలపై డిజిటల్ సర్వీస్ టాక్స్ (డీఎస్టీ) విధించింది. కానీ దీన్ని ఉపసంహరించుకోనట్టయితే భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించటంతో కెనడా డీఎస్టీ వసూలు నిలిపివేసింది. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ సైతం అమెరికా నుంచి ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొనక తప్పదు. అవి కెనడా మాదిరిగా రాజీకొస్తాయా లేదా అన్నది చూడాలి.మొత్తానికి ట్రంప్ చర్యల వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక అనిశ్చితి ఏర్పడబోతోంది. గత ఒప్పందంతో ద్వంద్వ పన్నుల మోత నుంచి తప్పించుకున్న బహుళజాతి సంస్థలు ఇకపై చాలా దేశాల్లో పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇది అంతిమంగా అమెరికాతో చాలా దేశాలకు వైషమ్యం తెస్తుంది. ఆ సంగతలా ఉంచి సెనేట్ ఆమోదించిన కోతల బిల్లుపై ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యులు ప్రభుత్వ వ్యయంపై మరింత కోత విధించాలని పట్టుబడుతున్నారు. అదే జరిగితే సాంఘిక భద్రతకు సంబంధించిన పథకాల్లో అత్యధిక భాగం రానున్న కాలంలో అదృశ్యమవుతాయి. బ్రిటన్ది వేరే కథ. మానసిక వైకల్యం కారణంగా ఉద్యోగం చేయలేమంటున్న వారికిచ్చే పింఛన్ నిబంధనల్ని కఠినం చేయటం ద్వారా 480 కోట్ల పౌండ్లు ఆదా చేయొచ్చని స్టార్మర్ ఆశించారు. కానీ స్వపక్షం నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆ నిబంధనల్ని కొత్త దరఖాస్తుదార్లకు పరిమితం చేశారు. దాంతో ప్రభుత్వం 200 కోట్ల పౌండ్లకు మించి ఆదా చేయలేకపోవచ్చని నిపుణుల అంచనా. రిటైరైన వారికిచ్చే రాయితీలూ వగైరాలపై కూడా కోతలు గణనీయంగా ఉన్నాయి. వీటి పర్యవసానంగా 2030 నాటికి లక్షన్నర మంది పౌరులు పేదరికంలోకి జారుకుంటారని అంటున్నారు. ఏడాది క్రితం అధికారంలోకొచ్చిన స్టార్మర్ కన్సర్వేటివ్ పార్టీ అడుగు జాడల్లో పయనిద్దామని ప్రయత్నించి భంగపడ్డారు. కానీ అమెరికాలో ట్రంప్ మాటే నెగ్గింది. మొత్తానికి రానున్న కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంక్షేమానికి గడ్డు రోజులే. -
శత్రు భీకర అపాచీలొస్తున్నాయ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న తరుణంలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి కబురు అందింది. ఐదేళ్ల క్రితంనాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్లు వచ్చాక వీటిని వాయుసేన దళాలకు అందించనున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్లలో ఇవి పాలుపంచుకోనున్నాయి. దాదాపు రూ.5,140 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్కు అమెరికా ఆరు అపాచీ ఏహెచ్–64ఇ రకం యుద్ధ హెలికాప్టర్లను అందచేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లను డెలివరీ చేయాల్సిఉన్నా ఇంతవరకు అది ఆచరణలో సాధ్యంకాలేదు. ఎట్టకేలకు ఈనెలలోనే మూడింటిని అప్పజెప్పనున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దులో మోహరించనున్నట్లు తెలుస్తోంది. రవాణాకు సంబంధించిన 2024 మార్చిలోనే కొన్ని హెలికాప్టర్లను అందుకున్నా యుద్ధ హెలికాప్టర్ల అందజేత మాత్రం ఇన్ని నెలలుగా ఆలస్యమైంది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్కు తొలుత గత మే–జూన్లో ఇస్తామని అమెరికా ప్రకటించింది. తర్వాత ఈ గడువును పొడిగించింది. తర్వాత డిసెంబర్కల్లా ఇస్తామని తెలిపింది. ఆ గడువు కూడా ముగిసింది. ఇక 2025 జూన్లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సరఫరా గొలుసులో అవాంతరాల కారణంగా భారత్కు అప్పగింత ఆలస్యమైందని అమెరికా వివరణ ఇచ్చింది. రెండో దఫా మూడు హెలికాప్టర్లను మరుసటి ఏడాదిలో అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది. పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనికదళాల ప్రత్యేక ఆపరేషన్లలో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు నెరవేర్చనున్నాయి. వేగం, దాడి, లక్ష్య చేధనలో తిరుగులేని సామర్థ్యాలు నూతన హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ములపొది మరింత శక్తివంతంకానుంది. 2015నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన, ఎటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యకం కావడంతో ఇలా నూతన తరం ఏహెచ్–64ఇ కోసం భారత్ అమెరికాకు ఆర్డర్ ఇచ్చింది. మెరుపుదాడిలో దిట్ట→ 2012లో తయారుచేసిన ఏహెచ్–64డీ బ్లాక్–3ని మరింత ఆధునీకరించి ఏహెచ్–64ఈ గార్డియన్గా రూపాంతరీకరించారు.→ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్టంగా ఏకధాటిగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.→ గరిష్టంగా 16 హెల్ఫైర్ రకం చిన్న క్షిపణులు, 2.75 అంగుళాల వ్యాసముండే 76 రాకెట్లు, వందల బుల్లెట్ల వర్షం కురిపించే 30 ఎంఎం బుల్లెట్ చైన్ ఇందులో అమర్చారు.→ గరిష్టంగా 10,543 కేజీల బరువులను మోసుకెళ్లగలదు. నిమిషానికి 2,800 అడుగుల ఎత్తుకు ఎగరగలదు.→ గరిష్టంగా 20,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు→ నూతన తరం హెలికాప్టర్లో జాయింట్ టాక్టిక్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకేసారి నిరాటంకంగా భిన్నరకాల సైనిక వ్యవస్థలతో ఇది అనుసంధానమవుతుంది. అంటే క్షిపణిని ప్రయోగించి మిస్సైల్ లాంచర్, భూస్థిర రాడార్లు, కమాండర్ కంట్రోల్ సెంటర్లు, తోటి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో ఇది అనుసంధానమై ఉంటుంది.→ కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, దాడికి సంబంధించి అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించారు.→ తాను సేకరించిన డేటాను, శత్రుజాడను రెప్పపాటు కాలంలో సైనిక స్థావరాలు, వ్యవస్థలకు చేరవేసి అప్రమత్తంచేస్తుంది. తనపై దాడికి తెగబడే శత్రు హెలికాప్టర్లు, భూ స్థిర స్థావరాలపై బుల్లెట్ల వర్షం కురిపించగలదు.→ ఇన్ఫ్రారెడ్ లేజర్ సాంకేతికతతో వర్షం వంటి అననుకూల పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని వేగంగా, సులభంగా గుర్తించి దాడి చేయగలదు→ టీ700– జనరల్ ఎలక్ట్రిక్701డీ రకం శక్తివంతమైన ఇంజిన్లు ఇందులో ఉంటాయి. అధునాతన రెక్కల కారణంగా ఇది చాలా వేగంగా నిట్టనిలువుగా గాల్లోకి ఎగరగలదు. → అన్ని రకాల డ్రోన్ల నుంచి సీ, డీ, ఎల్, కేయూ బ్యాండ్ల ద్వారా వీడియో డేటాను తెప్పించుకుని విశ్లేషించి కమాండ్ సెంటర్కు చేరవేయగలదు→ వీటిలో ఇంధన ట్యాంక్ కూడా పెద్దది. దీంతో ఎక్కువ సేపు శత్రువుతో పోరాడేందుకు ఇది ఎంతో అనువైంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పత్రికా స్వేచ్ఛ కొందరికే ప్రత్యేకమా?
ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే పదాలు గడచిన మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదాలు. బీఆర్ఎస్ నాయకులపై జుగుప్సాకరమైన థంబ్నైల్స్ పెట్టి వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు మహా టీవీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడి ముమ్మాటికీ ఖండనార్హమే. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదు. ఎవరు ఎవరిపై దాడి చేసినా కచ్చితంగా ఖండించాల్సిందే. ఇదే సమయంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛలు కొందరు ప్రత్యేకమైన జర్నలిస్టులకు, సెలక్టివ్ మీడియా గ్రూపులకు మాత్రమే ఉంటాయా? ఇంకెవరికీ ఉండవా? ఇప్పుడు ఈ ప్రశ్నలు సామాన్య ప్రజానీకాన్ని తొలిచేస్తున్నాయి.మహా టీవీ కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఛోటోమోటా నాయకులు సైతం తీవ్ర స్థాయిలో స్పందించి దాడిని తీవ్రాతి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా సంస్థలపై దాడులు హేయమైన చర్యగా అభివర్ణించారు. సరిగ్గా ఇక్కడే సామాన్య ప్రజానీకం గందరగోళానికి గురవుతున్నారు. ఈ దాడి జరగడానికి మూడు వారాల ముందు ‘సాక్షి’ టీవీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ఒక జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సదరు జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను, చర్చా కార్యక్రమం నిర్వహించిన యాంకర్కూ, ‘సాక్షి’ యాజమాన్యానికీ ముడి పెట్టి ఏపీలో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. గతంలో మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులు వేసినప్పుడు ఇది మీడియాపై దాడి అని రామోజీరావు అంటే... ఇవే రాజకీయ పార్టీలు, నాయకులు స్వరం కలపడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏకంగా యాంకర్గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టుపై అట్రాసిటీ కేసు కూడా పెట్టి అరెస్ట్ చేసింది. అయితే ఈ సందర్భంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, టీడీపీ మహిళా కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ‘సాక్షి’ పత్రిక ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి దాడులకు పూనుకున్నారు. ఆస్తులు ధ్వంసం చేశారు. కానీ ఈ సంఘటన ప్రజాస్వామ్యం మీద, పత్రికా స్వేచ్ఛ మీద దాడిలా ఎవరికీ కనిపించకపోవడం విచిత్రం. ఏకంగా పదికి పైగా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తే ఒక్క కేసు లేదు, ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అదే తెలంగాణకు వచ్చే సరికి... బీఆర్ఎస్ నాయకులపైనా, ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా జుగుప్సాకరంగా పెట్టిన థంబ్నైల్స్పై ఆగ్రహానికి గురైన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో సదరు టీవీ యాజమాన్యానికి సుద్దులు చెప్పడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. పైగా టీవీ ఛానల్కు అండగా నిలబడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల చర్యను తీవ్రంగా ఖండించారు. సాక్షిపై దాడి విషయంలో సమర్థింపు మాటలు మాట్లాడిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇప్పుడు మహా టీవీపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు అర్థంకాక సామాన్య ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి రాజకీయ పార్టీలు సొంతగా మీడియా సంస్థలు కలిగి ఉండటం తగదని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు మీడియా సంస్థలు కలిగి ఉండటం ఈ నాటిది కాదు. కాంగ్రెస్ పార్టీ సొంతగా నేషనల్ హెరాల్డ్ పత్రికను ఎన్నో దశాబ్దాలుగా నడుపుతోంది. వామపక్షాలు సైతం ప్రతి రాష్ట్రంలో ఎప్పటి నుంచో సొంత పత్రికలు నడుపుతున్నాయి. ఇక బీజేపీ ఎంపీలు ఒకరిద్దరికి మీడియా సామ్రాజ్యాలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సంస్థను ప్రారంభించారు. ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియా సంస్థ అయ్యింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు ఎప్పటి నుంచో వార్తా పత్రికలు ఉన్నాయి. విశాలాంధ్ర పేరుతో సీపీఐ, ప్రజాశక్తి పేరుతో సీపీఎం పార్టీలు దశాబ్దాలుగా పత్రికలు నడుపుతున్నాయి. అలాగే 10 టీవీ పేరుతో సీపీఎం, 99 టీవీ పేరుతో సీపీఐలు చెరో శాటిలైట్ న్యూస్ ఛానల్ను ప్రారంభించాయి. ఇప్పుడు ఆ ఛానళ్ళ యాజమాన్యాలు మారినప్పటికీ అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో చాలా మంది పార్టీల అనుబంధ సభ్యులే. ‘ఈనాడు’ రామోజీరావు స్వయంగా తాను కాంగ్రెస్కు బద్ద వ్యతిరేకినని న్యాయస్ధానాల్లో చెప్పుకున్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మంత్రి వర్గ కూర్పు, తనకు నచ్చని మంత్రులను క్యాబినేట్ నుంచి తీసివేయించే వరకూ ‘ఈనాడు’ ఎంత కీలకంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలందరికీ చర్విత చరణమే. ఇక ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ టీడీపీ కోసం ఏ విధంగా పనిచేస్తారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాధాకృష్ణ సహాయంతో టీడీపీలో టిక్కెట్లు ఖరారు చేయించుకున్న నాయకులెందరో లెక్కలేదు. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 7 గంటలు అవ్వగానే సాంబశివరావు అనే జర్నలిస్ట్ టీవీ 5 తెరమీదకు వచ్చి ఏడెనిమిది నిమిషాల పాటు ధర్మోపన్యాసం చేస్తూ జగన్ను తిట్టడం, చంద్రబాబును పొగడటం నిత్యకృత్యం అన్న విషయం ప్రేక్షకులందరికీ తెలుసు. సాంబశివరావు అటు వెళ్లిన వెంటనే ఇటు మూర్తి అనే మరో జర్నలిస్టు రాత్రి 9 గంటలకు వచ్చి ఇచ్చే ప్రవచనాలు వర్ణనాతీతం. ఈ ఇద్దరి మధ్యలో రాత్రి 8 గంటలకు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ అనే ఛానల్లో వెంకట కృష్ణ సూక్తిముక్తావళి ఉంటుంది. దీని సారంశం కూడా జగన్ను ఆడిపోసుకోవడం, చంద్రబాబును ఆకాశానికి ఎత్తడం! వీరందరి మధ్యలో మహా టీవీ వంశీ తనదైన శైలిలో న్యూస్ రూమ్లో కూర్చుని దర్బార్లు నడిపిస్తాడు. టీడీపీ సహజీవనం చేసే ఈ మీడియా సంస్థలు అన్నీ ఇప్పుడు ముసుగులు వేసుకుని ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతుంటే నమ్మే పరిస్థితుల్లో తెలుగు సమాజం లేదన్న విషయం అందరూ గుర్తించాలి. – రుద్రుడు ‘ తెలుగు పాఠకుడు -
ENG VS IND, 2nd Test: టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ 'గిల్' సెంచరీ
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్కు దక్కింది. వోక్స్ బౌలింగ్లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్కు 99 పరుగులు జోడించి ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. గిల్ 114, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 85 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 310/5గా ఉంది. -
'అలాంటి వారికే ఇండస్ట్రీలో గుర్తింపు'.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఆరోపణలతో టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన పూనమ్ మరో ట్వీట్ చేసింది. ఒరిజినల్ కంటెంట్, స్క్రిప్ట్ ఉన్న దర్శకుడు క్రిష్ అంటూ కొనియాడింది. ఎన్నో కాపీరైట్ సమస్యలు, పీఆర్ స్టంట్లు ఉన్న దర్శకుడికి వచ్చినంత గుర్తింపు, విజయం లభించడం లేదని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ చూస్తే మరోసారి త్రివిక్రమ్ను ఉద్దేశించే పరోక్షంగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్కు ముందు పూనమ్ చేసిన ట్వీట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెలలోనే రిలీజ్ కానుందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈనెల 3న ఉదయం 11 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. కారణాలేంటో తెలీదు గానీ మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు జ్యోతికృష్ణ.. డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో బాబీ డియోల్, అనుపమ ఖేర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు.Krish a director with original content and authentic scripts doesn’t get as much recognition or success like that of a director with multiple copyright issues and pr stunts.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 2, 2025 త్రివిక్రమ్పై మా అసోసియేషన్కు ఫిర్యాదుపూనమ్ కౌర్ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే మెయిల్ ద్వారా ఇప్పటికే మా అసోసియేషన్కు ఫిర్యాదు చేశానని తెలిపింది. క్లియర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్పైనే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు రాజకీయ, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో కాపాడుతున్నారని కూడా చెప్పానని పూనమ్ కౌర్ ప్రస్తావించింది. ఈ విషయంపై నేను మహిళల గ్రూప్తో మాట్లాడతానని కూడా పూనమ్ వెల్లడించింది. అంతేకాకుండా తన మెయిల్కు రిప్లై కూడా వచ్చిన స్క్రీన్షాట్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
ENG VS IND 2nd Test Day 1: జైస్వాల్ సెంచరీ మిస్.. పోరాడుతున్న గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్కు దక్కింది. వోక్స్ బౌలింగ్లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. గిల్ 86, రవీంద్ర జడేజా 30 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 76 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 270/5గా ఉంది. -
చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన
బోనెస్: భువన విజయం సంస్థ, జెట్ యుకే నిర్వహించిన కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు. ఆయనకు బోనెస్లో ఘన స్వాగతం లభించింది. జూన్ 29న బోనెస్లో జరిగిన ఉపన్యాస కార్యక్రమానికి దాదాపు 500 మంది భక్తజనం హాజరయ్యారు. స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి స్వామీజీకి పూలమాలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన తనయుడు అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి స్కాటిష్ కళైన బ్యాగ్పైప్ను స్థానిక కళాకారులతో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రసాద్ మంగళంపల్లి, ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ వారి సమూహం సాంప్రదాయ బద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ. శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి రాజశేఖర్ జాల జెట్ యూకేతో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం, వీణా వాయిద్య ప్రదర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, ప్రజ్ఞ పిల్లల శ్లోక పఠన కార్యక్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి.ఆ పిదప స్వామీజీ “Ego, Equality & Eternity — A Journey from Self to Supreme” అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, “అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం” అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు. ఆయన "భువన విజయం" అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు.కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. "పుష్ప స్వాగతం నుండి ప్రసాదం చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు సంప్రదాయాలను భక్తి, ఐక్యతతో మిళితం చేసింది" అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ అభిప్రాయపడ్డారు. జీయర్ స్వామి మీద కోదండరావు అయ్యగారి వ్రాసిన పద్యాలను ప్రశంస పత్ర రూపంలో భువన విజయం సభ్యులు స్వామి వారికి బహూకరించారు.