breaking news
-
విమానంలో ప్రాణదానం
సాక్షి, బళ్లారి: విమాన ప్రయాణంలో ఉండగా హఠాత్తుగా విదేశీ ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో మాజీ మహిళా ఎమ్మెల్యే వైద్యసేవలతో ఆమెకు ప్రాణం పోశారు. ఈ సంఘటన గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. గోవా నుంచి టేకాఫ్ తీసుకున్న 10 నిమిషాల్లోనే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ (31) అస్వస్థతకు గురైంది. గుండెపోటుతో సొమ్మసిల్లింది. అదే విమానంలో బెళగావి జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ ఢిల్లీ వెళ్తున్నారు. వెంటనే జెన్నీ పరిస్థితిని గమనించి సీపీఆర్తో ఆమెకు కృత్రిమ శ్వాస కల్పించారు. దీంతో జెన్నీ కోలుకుంది. ఆమె అభ్యర్థన మేరకు అంజలి విమానం దిగే వరకు పక్కనే కూర్చున్నారు. విమానం ఢిల్లీలో ల్యాండయిన వెంటనే జెన్నీని ఆస్పత్రికి తరలించారు. అంజలిని సీఎం, నెటిజన్లు అభినందించారు. -
బీజేపీ డీఎన్ఏలో ఓటు చోరీ
సాక్షి, న్యూఢిల్లీ: అసత్యం, ఓట్ల చోరీ బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలోనే ఉన్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సత్యం, అహింస అనే నినాదంతో బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రతిన బూనారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీతోపాటు ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో రాహుల్ గాంధీ విచుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వారంతా బీజేపీ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు అధికారం అండతో విచ్చలవిడిగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అనుసరించేవారి డీఎన్ఏలో సత్యం ఉంటుందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలో మాత్రం అసత్యం, ఓట్ల చోరీ మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం ‘‘సత్యమే మన ఆయుధం. సమయం పట్టొచ్చు గానీ ఎప్పటికైనా సత్యానిదే విజయం. ప్రపంచం సత్యాన్ని పట్టించుకోదని, అధికారాన్ని, బలాన్ని మాత్రమే చూస్తుందని ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ చెప్పడం దారుణం. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తున్న సంగతి నిజం కాదా? ఎన్నికల కమిషనర్లను కాపాడేందుకు ప్రధాని మోదీ కొత్త చట్టం తీసుకొచ్చారు. మేమే వచ్చాక ఈ చట్టాన్ని తప్పనిసరిగా మారుస్తాం’’ అని అన్నారు. దొంగతనమే వారి డీఎన్ఏ దొంగతనం బీజేపీ డీఎన్ఏలో ఉందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్లో పోస్టు చేశారు. డబ్బు దొంగతనం, భూమి దొంగతనం, వ్యవస్థల దొంగతనం, హక్కుల దొంగతనం, ఉద్యోగాల దొంగతనం, ప్రజా తీర్పును దొంగిలించడం, ప్రభుత్వాన్ని దొంగిలించడం, ఎన్నికలను, ఓట్లను దొంగిలించడం బీజేపీకి అలవాటేనని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకొని అధికారం అనే నిచ్చెనపైకి ఎగబాకడం బీజేపీ విధానమని దుయ్యబట్టారు. ప్రజల కోసమే రాహుల్ పోరాటం: ఖర్గే ప్రజల కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయనను బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్ చోర్–గద్దీ ఛోడ్ ధర్నాలో ఖర్గే ప్రసంగించారు. రాహుల్ గాం«దీకి మద్దతు ఇవ్వకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. దేశాన్ని, ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనమంతా కలిసి పోరాటం చేయాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, భావజాలం దేశాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. హిందూమతం, హిందుత్వం పేరుతో పేదలను బానిసలుగా మార్చడానికి ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దేశ ద్రోహులైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలకు, ఓట్ల దొంగలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి మరింత బలోపేతం చేయాలని ప్రజలకు ఖర్గే విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్లతో గెలిచే దమ్ముందా?బ్యాలెట్ పేపర్లతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి గెలిచే దమ్ముందా? అని బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘం ఏదో ఒకరోజు దేశ ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదంగా సాగుతోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం సహకరించకపోతే ఎన్నికల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గలేదని తేల్చిచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోదీ సర్కార్ ఎదుట మోకరిల్లుతున్నాయని ఆరోపించారు. -
తీర్పును టెక్నాలజీ మెరుగుపర్చగలగాలి
కటక్(ఒడిశా): నూతన సాంకేతికత అనేది న్యాయస్థానాల తీర్పును మరింత మెరుగుపర్చాలిగానీ తీర్పును అధిగమించేదిగా ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఒడిశాలోని కటక్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. పెండింగ్ కేసుల భారం దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు న్యాయ వ్యవస్థలోని ప్రతి స్థాయిలోనూ ఇబ్బందులను సృష్టిస్తున్నాయన్నారు. పైస్థాయిలో తలెత్తిన అడ్డంకులు దిగువ స్థాయిపై ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయని చెప్పారు. పెండింగ్ సమస్యను అధిగమించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సీజేఐ తెలిపారు. అవసరానికి తగినన్ని న్యాయస్థానాలు లేకుంటే, ఎంత చిత్తశుద్ధి కలిగిన న్యాయవ్యవస్థ అయినా కుప్పకూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతతో ఎన్నో సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ దు్రష్పభావాలు కూడా ఉన్న విషయం మరువరాదన్నారు. నేటి డీప్ ఫేక్లు, డిజిటల్ అరెస్ట్ల కాలంలో న్యాయస్థానాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పేదలు, వృద్ధులను పట్టించుకోని సంస్కరణ అస్సలు సంస్కరణే కాదు, అది తిరోగమనం కూడా అని తెలిపారు. -
ఢిల్లీలో ఆరుబయట ఆటలొద్దు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం నానాటికీ దిగజారుతోంది. దాంతో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఔట్ డోర్ క్రీడలన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని, నగర డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ)ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) ఆదేశించింది. లేదంటే పిల్లలు తీవ్ర అనారోగ్య బారి వాడటం ఖాయమని హెచ్చరించింది. ఢిల్లీతో పాటు హరియాణా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు కమిషన్ లేఖలు రాసింది. ‘ఆరుబయట ఆడే క్రీడలన్నింటినీ రద్దు చేయాలంటూ నవంబర్ 19నే మేం లేఖలు రాశాం. కానీ కొన్ని స్కూళ్లు, విద్యా సంస్థలు ఇంకా వాటిని కొనసాగిస్తున్నాయి‘ అంటూ ఆక్షేపించింది. ‘రోడ్లపై విపరీతమైన దుమ్ము పేరుకొని ఉంది. ఒకవైపు తీవ్ర కాలుష్యంతో సతమతమవుతూ ఉంటే వాటి నిర్వహణ ఇంత అధ్వానంగానా? సగానికి సగం రోడ్లపై మున్సిపాలిటీ వ్యాన్లు సేకరించిన చెత్త పడి ఉంది’ అంటూ నాలుగు పెట్టింది. శనివారం నుంచి ఢిల్లీ, ఎన్ సీఆర్ పరిధిలో అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను సీఏక్యూఎం నిషేధించడం తెలిసిందే. అలాగే ట్రక్కులకు నగరంలోకి ప్రవేశాలు నిలిపేశారు. ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. చలికాలంలో ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది.కర్టెన్లు చాలు: రామ్ దేవ్ఢిల్లీ కాలుష్యానికి ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకం పరిష్కారం కాదని యోగ గురు బాబా రామ్ దేవ్ అన్నారు. పైగా అది సంపన్నుల ఆడంబరం అంటూ ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ కొన్నిసార్లు గ్యాస్ చాంబర్ను తలపిస్తుంది. అంతమాత్రాన ఆందోళన పడాల్సిన పనిలేదు. డోర్ కర్టెన్లు వేసుకుంటే చాలు. వాటిని 20 రోజులకు ఒకసారి మూతికి మాస్క్ పెట్టుకొని దులుపుకుంటే సరిపోతుంది. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా అలవాటు చేసుకోవాలి’ అని ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో సూచించారు. ఇంత కాలుష్యంలో వ్యాయామమా అని ప్రశ్నించగా, కపాలభాతి వంటి శ్వాస వ్యాయామాలు చేయాలన్నారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
ప్రొవిడెన్స్: అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. రోడ్ ఐలాండ్స్లోని ప్రొవిడెన్స్ పట్టణంలోని బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడు కాలేజ్కు వచ్చి పరీక్షలు రాస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దాంతో ఇద్దరు మరణించారు. 9 మంది గాయపడ్డారు. వెంటనే దుండగుడు పరారయ్యాడు. అతను 30ల్లో ఉంటాడని, నలుపు దుస్తులు ధరించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఎప్పుడు, ఎక్కడ అతడు దొరికాడన్న విషయం పోలీసులు వెల్లడించలేదు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల శబ్దం వినగానే విద్యార్థులంతా హడలిపోయారు. రూమ్లో, బాత్రూమ్లలో, డెస్క్ కింద, జిమ్లో, ఎక్కడ వీలైతే అక్కడే గంటల తరబడి దాక్కున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాంతో వారాంతంలో అత్యంత సందడిగా ఉండే పట్టణ వీధులన్నీ దుండగుడు బయటే తిరుగుతున్నాడన్న భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయి. సెక్యూరిటీ చెకింగ్లను దాటుకుంటూ అతను కాలేజీలోకి హంతకుడు ఎలా రాగలిగాడు? ఫేస్ రికగి్నషన్ లాక్ రక్షణ ఉన్న క్లాస్ రూమ్ లోనికి ఎలా దూరాడు అన్నది ప్రశ్నగా మారింది. మృతులకు అమెరికా ట్రంప్ నివాళులు అర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దుండగుడు హ్యాండ్ గన్ వాడినట్టు భావిస్తున్నారు. -
పాటలతో పులులు పరార్!
పిలిభిత్: సంగీతంతో ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారని మనకు తెలుసు. కానీ, ఉత్తరప్రదేశ్లోని గ్రామీణులు ఏకంగా పులుల్నే భయపెడుతున్నారు. కత్తులు, కర్రలకు బదులుగా సంగీతంతో, అదీ మామూలు సినిమా పాటలతోనే వాటిని అదరగొడుతున్నారు. సంగీత ధ్వనుల ధాటికి పులులు అడవిని దాటి పొలాలు, జనావాసాల వైపు రావడానికి జంకుతున్నాయట. ఇప్పుడిక తాము ఊరు బయటకు, పొలాలు, చెరుకు తోటల్లోకి నిర్భయంగా వెళ్లివస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ వీళ్లు ఎలా పులుల్ని వణికిస్తున్నారంటే.. మాలా అటవీ రేంజ్లో పిలిభిత్ టైగర్ రిజర్వు ఉంది. పులుల సంరక్షణ ప్రాంతానికి ఆనుకుని డజను వరకు గ్రామాలున్నాయి. గ్రామాల చుట్టూ పొలాలు, దట్టంగా చెరుకు తోటలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో టైగర్ రిజర్వులోని పులులు పొలాలు, చెరుకుతోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆవాసాల సమీపంలో సంచరిస్తుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చర్యలు శూన్యం. దీంతో, జమునియా గ్రామానికి చెందిన కృష్ణకుమార్ ఓ ఉపాయం కనిపెట్టారు. ‘పెద్ద శబ్దాలను వింటే, జంతువులు భయపడి దూరంగా వెళ్లిపోతాయని నాకు తెలుసు. ఇదే ఉపాయాన్ని అమల్లో పెట్టా. సౌర శక్తితో పనిచేసే మైక్ సెట్ను మా చెరుకు తోట వద్ద ఏర్పాటు చేశాను. మైక్ ద్వారా పెద్ద శబ్దంతో వచ్చే సంగీతం, సినిమా పాటలతో పులి వంటి జంతువులు మా ఛాయలకు కూడా రావడం లేదు. మా పొలాలకు దూరంగా వెళ్లిపోతున్నాయి. నన్ను చూసి, మిగతా రైతులు కూడా ఇదే ఉపాయాన్ని అమలుచేస్తూ సత్ఫలితాలు సాధించారు. మా ఊరే కాదు, అజిత్పూర్, రామ్నగరియా, మహువా, మలా ఘెరా, రిచ్చోలా, బసంత్పూర్లాంటి పులుల భయమున్న గ్రామాల రైతులూ ఇదే ఉపాయం అమలు చేస్తున్నారు’అని కుమార్ తెలిపారు. -
వెండితెర సోగ్గాడు తిరిగొస్తున్నాడు
‘సోగ్గాడు’ తిరిగొస్తున్నాడు. శోభన్బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడు (1975)’. జయచిత్ర, జయ సుధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కె. బాపయ్య దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మించారు. 1975 డిసెంబరు 19న ఈ సినిమా విడుదలైంది. ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్లో స్వర్ణోత్సవం జరగనుంది. అదే రోజు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. ఆదివారం ‘సోగ్గాడు’ సినిమా స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్బాబు మాట్లాడుతూ – ‘‘సోగ్గాడు’ మా సంస్థకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెట్టింది. నేటి టెక్నాలజీని ఉపయోగించి, ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నాం. అలాగే మా సంస్థ చిత్రాలను ఏఐలోకి మార్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నాం’’ అని చెప్పారు. మురళీ మోహన్ మాట్లాడుతూ– ‘‘శోభన్బాబుతో నేను ‘ముగ్గురు మిత్రులు’ సినిమా తీశాను’’ అని అన్నారు. ఇంకా పలువురు దర్శక–నిర్మాతలు, అఖిల భారత శోభన్బాబు సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. -
అఖండ 2 కేవలం తెలుగు సినిమా కాదు
‘అఖండ 2: తాండవం’ కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు. భారతీయ చిత్రం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు సంబంధించిన సినిమా ఇది. సనాతన హైందవ ధర్మం పరాక్రమాన్ని చూపించిన చిత్రం. ఈ సినిమా చూశాక సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని అందరూ అంటున్నారు’’ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. సంయుక్త, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆంచట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఆదివారం యూనిట్ నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకువెళ్లిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మన సినిమాను గెలుపించుకోవాలని ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఆర్టిస్టు, టెక్నిషియన్ కు థ్యాంక్స్. ఆ శివుడే మా వెనకాల ఉండి నడిపించాడు’’ అన్నారు. ‘‘అఖండ 2’కు మ్యూజిక్ ఇవ్వడం చాలెంజింగ్గా అనిపించింది. ఈ సినిమా ఎప్పుడొచ్చినా సక్సెస్ అవుతుందని ధైర్యంగా అనుకున్నాం’’ అని చెప్పారు తమన్ . ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘బోయపాటిగారు బాలకృష్ణగారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ను డిజైన్ చేసి, ఒక సూపర్ హీరోని చేయడం అది బాలకృష్ణ, బోయపాటిగార్లకే చెల్లింది. తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజుకే మేం పే చేసిన దానికి 70 శాతం రెవెన్యూ రికవరీ అయ్యింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఇండస్ట్రీలో కీలకమైన వ్యక్తిగా నాకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో విజీ చంద్రశేఖర్, గంగాధర శాస్త్రి, కల్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
బాలు తొలి పాటకు అరవై ఏళ్లు
‘నా పాట పంచామృతం’ అన్న బాలు వాక్కులు నిజంగానే ‘బ్రాహ్మి’ (సరస్వతి) వాక్కులే!! నెల్లూరు జిల్లాలో కోనేటం పేటలో పుట్టిన ఈ బాలుడు పాటల కోనేటిరాయడై అఖిల భారతీయుల అభిమానాన్ని చూరగొంటాడని ఎవ్వరూ ఊహించలేదు. బాలు సైతం సినీ గాయకుడవుతానని కలలో కూడా ఊహించలేదు. ఆయనను ఇంజనీర్గా చూడాలనేది తండ్రి సాంబమూర్తి కల. కానీ ఆ కలకు భిన్నంగా బాలు తన ప్రతి భతో పాటల ఇంజనీరింగ్నే మార్చి ఆరు దశాబ్దాలు అప్రతిహతంగా సినీ సంగీత ప్రపంచానికి రారాజు అయ్యారు.కలయా... నిజమా....1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో బాలు ప్రతిభను మరో సంగీతదర్శకుడు ఎస్.పి. కోదండపాణి గమనించి, సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను నమ్మి బాలు కొన్నాళ్లు ఎదురు చూశారు. ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ప్రవేశించారు కానీ సినీరంగ ప్రవేశం మాత్రం జరగలేదు. బాలు కూడా క్రమంగా ఆ విషయం మరచిపోయారు. ఓ రోజు కోదండపాణి హడావుడిగా వచ్చి, బాలు గది తలుపు తట్టి, ‘ఏమయ్యా పంతులూ... నీ అడ్రస్ ఇవ్వకపోతివి... చాలా కాలంగా నీ కోసం వెతుకుతున్నాను. ఇక్కడ ఉంటివా’ అని చీవాట్లు వేసి ‘పద్మనాభం ఓ సినిమా తీయబోతున్నారు. పాట పాడడానికి నీకు అవకాశమిస్తాను... ఎ.వి.ఎం స్టూడియోలో రికార్డింగ్ ఉంది’ అని చిరునామా వివరాలు ఇచ్చి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు. బాలుకు తల గిర్రున తిరిగింది... తనేంటి? కలయా... నిజమా అనుకున్నారు. అనుకున్న రోజు రానే వచ్చింది... తన ఫ్రెండ్ మురళితో కలిసి బాలు సైకిల్ పై ఎ.వి.ఎం. స్టూడియోకి వెళ్ళారు.గేటు దగ్గరే నిలబెట్టేశాడుగేట్మేన్ బాలును ఆపి లోనికి పోవడానికి వీల్లేదని, నీలాంటి వారు రోజూ ఇలాగే వస్తుంటారని అడ్డుకున్నాడు. గేటు దగ్గరే నిలబెట్టేశాడు. చివరికి కనీసం మురళినైనా లోపలికి పంపించి, కోదండపాణిగారికి తను వచ్చిన విషయం చెప్పండని, ఒకవేళ ఆయన రావద్దంటే తిరిగి వెళ్లిపోతామని బాలు అనగానే గేట్మేన్ అంగీకరించి, మురళిని అనుమతించగానే ఆయన వెళ్లి కోదండపాణికి విషయం చెప్పడం, ఆయన స్వయంగా గేటు వద్దకు వచ్చి గేట్ మేన్ను తిట్టి బాలును లోనికి తీసుకెళ్ళడం జరిగింది.రావే కావ్య సుమబాల...ఆ రోజు 15 డిసెంబర్ 1966... మధ్యాహ్నం 2.30 ని.లకు బాలు తొలిసారిగా తన గళం విప్పారు. నటుడు, నిర్మాత పద్మనాభం నిర్మించిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రం అది. వీటూరి రాసిన ‘ఏమి ఈ వింతమోహం’ పాటను సుశీల, పీబీ శ్రీనివాస్, కె. రఘురామయ్య వంటి ఉద్దండ గాయకులతో కలిసి పాడారు. అది ఘంటసాల పాడాల్సిన వెర్షన్. ఆయన బదులు కొత్తవాడైన బాలు పాడ టం పద్మనాభానికి ఇష్టం లేదు. ఆ పాట కృష్ణ, శోభన్ బాబు, హరనాథ్, రామకృష్ణ, రాజశ్రీ వంటి తారలపై చిత్రించే మల్టీ స్టార్ సాంగ్ కావడం వలన ఆయన ఒప్పుకోలేదు. ఘంటసాల అనారోగ్యం వలన బాలుతో పాడిస్తున్నానని, ఒకవేళ బాగా లేకుంటే మళ్ళీ ఘంటసాలతో పాడిద్దామని కోదండపాణి ఒప్పించి రికార్డింగ్ పూర్తి చేశారు. వందకు పైచిలుకు వాద్యకారులున్న ఆర్కెస్ట్రా అది. ఆరు నిమిషాల రాగమాలికైన ఆ పాటలో కల్యాణి రాగంలో కంపోజ్ చేసిన ‘రావే కావ్య సుమబాల’ అనే చరణాన్ని బాలు పాడారు. బాలు పాడిన చరణాన్ని తెరపై శోభన్బాబు అభినయించారు. మరునాడు ఘంటసాలను ఆహ్వానించి, ఆ పాటను వినిపించగానే, ఆ మహానుభావుడు ఎంతో ఆనందించారు.అబ్బాయి బాగా పాడాడు...‘అబ్బాయి బాగా పాడాడు... ఎవరినీ అనుకరించలేదు... ఎంతో సహజంగా పాడాడు... ప్రతి సంగతిని చక్కగా వేశాడు. నేను పాడక్కరలేదు... ఈ పాటను ఇలాగే ఉంచండి..’ అని చెప్పి కొత్త గొంతును పరిచయం చేసినందుకు అభినందించారు. ఘంటసాల మాటలకు పద్మనాభం ఎంతో సంతోషించి, బాలుకు అదే చిత్రంలో మరో పాటను, పద్యాన్ని పాడడానికి అవకాశం ఇవ్వడం విశేషం.ఘంటసాలకు సిసలైన వారసుడుబాలు పాడిన మొదటి పాట రికార్డుని తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులకు వినిపించి, అవకాశాలు ఇప్పించేవారు కోదండపాణి. తొలి పాట పాడాక బాలుకు వెంటనే రెండవ చిత్రంలో అవకాశం ఇచ్చారు ఎం.ఎస్. రెడ్డి. ఆయన ‘కాలచక్రం’ అనే తమిళ డబ్బింగ్ సినిమాలో పాడించారు. 1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశారు బాలు. అందుకే అమర గాయకుడు ఘంటసాల ‘తన తరువాత బాలు మాత్రమే తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడు’ అని చెప్పిన జోస్యాన్ని బాలు నిజంగానే నిరూపించుకున్నారు. ఘంటసాల తెలుగు మినహా వేరే భాషల్లో పాడలేదు. బాలు దేశంలోని దాదాపు భాషలలో పాడి, లక్షలాది అభిమానులను సంపాదించుకొన్నారు.శంకరాభరణంతో...బాలు 1966 నుండి సినిమాలలో పాడుతున్నప్పటికీ ఆయన శాస్త్రీయ గీతాలను సైతం సశాస్త్రీయంగా పాడగలరని నిరూపించిన చిత్రం ‘శంకరాభరణం’ (1980). దానికి ముందు ఘంటసాల జీవించిన కాలంలో బాలుకు ఎక్కువ శాతం రొమాంటిక్ పాటలు పాడడానికే ఆహ్వానాలు అందేవి. అయితే కోదండపాణి తరువాత బాలులోని ప్రతిభను గుర్తించిన సంగీత దర్శకులలో సత్యం ఒకరు. హరనాథ్ హీరోగా నటించిన ‘ప్రతీకారం’ (1970) చిత్రంలో ‘నారీ రస మాధురి లహరి’ అనే పాటను సత్యం హంసానంది రాగంలో స్వరపరచి బాలుతో పాడించిన తొలి లలిత శాస్త్రీయ గీతం. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ పాట కూడా ఎవరికీ అంతగా తెలియదు.స్వర పారిజాతం‘కన్నె వయసు’ (1973)లో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాటను బాలుతో పాడించారు సత్యం. ఆ పాట క్లాసిజానికి మురిసిన జానకి తనతో కూడా పాడించాలని పట్టు పట్టడంతో ఆమెతో కూడా పాడించారు. జానకి అంచనా నిజమైంది... ఆ పాట బాలుకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి, ఆయనను నిజంగా ఈ భువిలో విరిసిన స్వర పారిజాతంగా మలచింది... ఘంటసాల మరణించాక (1974) గాయకునిగా బాలు విశ్వరూపమే ప్రదర్శించారు.రోజుకి పదహారు పాటలు...‘శంకరాభరణం, సాగర సంగమం’ లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ‘ఏక్ దూజే కే లియే’ లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. ‘త్యాగయ్య, అన్నమయ్య, సంగీత సామ్రాట్, భైరవ ద్వీపం’ చిత్రాలలో బాలు శాస్త్రీయ సంగీతంలో పాడిన పాటలే విమర్శకుల నోళ్ళు మూయించాయి... ఓ దశలో రోజుకు 16 పాటలు మూడు షిఫ్టులలో పాడి, బాలు తన అసమాన ప్రతిభను నిరూపించుకున్నారు.అరుదైన రికార్డుఅలనాటి రాజేశ్వర రావు మొదలు ఆధునిక యువ సంగీత దర్శకులందరికీ బాలు ఒక ఫేవరెట్ సింగర్. బాలు తన మిమిక్రీ కళతో రాజ్ బాబు, పద్మనాభం, మాడా, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, నూతన ప్రసాద్, ఎ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్, కమల్హాసన్ తదితరుల నటుల గొంతుకలకు అతి సన్నిహితంగా పాడి భళా అనిపించుకున్నారు. 50 ఏళ్ళకు పై సినీ ప్రస్థానంలో 40 వేల పాటలకు పైగా 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి, ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా బాలు పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు. ఆయనతో కలిసి ఆయన సమక్షంలో అనేక కార్యక్రమాల్లో పాటలు పాడిన అదృష్టం ఈ వ్యాస రచయితకు కూడా ఉన్నది.ఆ స్వరాలు అజరామరంబాలు 1993 ఫిబ్రవరి 14న లలిత కళాతోరణంలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టించారు. తరువాత 2003లో రవీంద్ర భారతి ప్రాంగణాన ఘంటసాల విగ్రహం స్థాపించడానికి మూల కారణమైన బాలు... ఆ మహనీయునితో కలిసి పాడుతానని కానీ మరణించిన తరువాత ఆయన విగ్రహం చెంతనే తన ప్రతిమ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. తెలుగు సినీ కళామ తల్లికి ఘంటసాల, బాలు రెండు కళ్ళ వంటివారు. వారు దివంగతులైనా ఆ స్వరాలు అజరామరం.– డా. వి.వి. రామారావురచయిత, గాయకుడు, ఆకాశవాణి వ్యాఖ్యాత -
జీవన నావకు స్నేహ సారథి
ఆపదలో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. యుద్ధంలో ధైర్యం చూపించేవాడే అసలైన వీరుడు. దానగుణం కలవాడే నిజమైన ధనవంతుడు. పేదరికంలోనూ పక్కన నిలబడేదే ఉత్తమ భార్య. కష్టాల్లో ఆదుకునేవారే నిజమైన బంధువులు. నిజమైన గుణగణాలు కష్ట సమయాలలోనే బయటపడతాయి. సుఖంలో నవ్వు పంచుకున్నవారంతా స్నేహితులు కారు; కష్టకాలంలో కన్నీళ్లు తుడిచేవాడే కల్మషం లేని బంధువు అని ఇది స్పష్టం చేస్తుంది. వారిచ్చే మానసిక ధైర్యం, ఆపత్కాలంలో మనకు పెద్ద ఆసరా.జీవితం ఓ అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు తోడుగా, నీడగా నిలిచే అనుబంధాలలోకెల్లా స్నేహం అత్యంత మధురమైనది, విలువైనది. రక్తసంబంధం లేకున్నా, ఆత్మ బంధాన్ని పెంచే మనసులతో పెనవేసుకునే ఈ బంధం, సంతోషాన్ని ద్విగుణీకృతం చేసి, దుఃఖాన్ని అర్థం చేసుకుని, భారంగా ఉన్నప్పుడు భుజం తట్టి, విజయాలను ఉత్సాహంగా పంచుకుని, వైఫల్యాలలో ఓదార్పునందించే అమృత భాండం. జీవితంలోని ప్రతీ మైలురాయి వద్ద తోడు నిలిచే స్నేహం, కాలంతో పాటు మరింత గాఢమవుతుంది. స్నేహం లేని జీవితం, రంగులు లేని చిత్రలేఖనంలా, సంగీతం లేని రాగంలా వెలవెలబోతుంది.స్నేహం – జీవన గీతంమన సనాతన ధర్మంలో స్నేహానికి అత్యున్నత స్థానం ఉంది. శ్రీ కృష్ణుడు, కుచేలుడు; రాముడు, సుగ్రీవుడు వంటి అనన్య స్నేహ బంధాలు మన ఇతిహాసాలలో నిబిడీకృతమై ఉన్నాయి. భగవద్గీతలో సైతం స్నేహితుని పట్ల ఉండాల్సిన ఆత్మీయత, త్యాగ భావన పరోక్షంగా ప్రస్తావించబడ్డాయి.‘న మిత్రార్థే పరిత్యజేత్ ప్రియమాత్మానమాత్మనః’. అంటే స్నేహితుడి కోసం తన ప్రియమైన ఆత్మను కూడా త్యజించకూడదు (అంటే, తన ఉనికిని కోల్పోకుండానే స్నేహితునికి ఎంతటి సహాయమైనా చేయాలి). ఇది స్నేహం తాలూకు ఉన్నతమైన ఆత్మార్పణ భావనను తెలియజేస్తుంది. నిజమైన స్నేహితుడు మన ఎదుగుదలకు తోడ్పడతాడే తప్ప, మన అస్తిత్వాన్ని హరించడు. స్నేహం పేరుతో ఒకరిపై ఒకరు ఆధారపడటమో, బలహీనతలను ఆసరాగా తీసుకోవడమో కాకుండా, ఇరువురూ తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే పరస్పరం శక్తిగా మారతారని ఈ సూక్తి తెలియజేస్తుంది.కష్టసమయాల్లో మనం కృంగి΄ోకుండా, మనలో ధైర్యాన్ని నింపి, సరైన మార్గంలో నడిపించేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే కేవలం కాలక్షేపం కాదు, అది పరస్పర గౌరవం, నమ్మకం, నిస్వార్థ ప్రేమల కలయిక.‘దద్యాత్ దద్యాన్న దద్యాత్ ఖలు మిత్రస్య మిత్రః సదా ప్రార్థనాశీలో న మిత్రం స్యాత్ సదా ప్రార్థనాశీలః.‘అనగా... ఇచ్చేవాడు స్నేహితుడు, కానీ ఎప్పుడూ యాచించేవాడు స్నేహితుడు కాడు. నిజమైన స్నేహం ఇవ్వడం, తీసుకోవడం అనే సమతుల్యతతో కూడుకున్నదని ఈ సుభాషితం తెలుపుతుంది. స్నేహంలో ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడమే గొప్పతనం. నిరంతరం ఏదో ఒకటి ఆశించే వ్యక్తి, నిజమైన స్నేహితుడు కాలేడు. స్నేహం అనేది త్యాగం, నిస్వార్థ ప్రేమల పునాదులపై నిర్మితమైన గొప్ప అనుబంధం. ఇవ్వడంలోనే నిజమైన ఆనందం, స్నేహ మాధుర్యం దాగి ఉన్నాయి.జీవిత గమనంలో స్నేహితుల చేయూత ఎల్లప్పుడూ తోడుగా నిలిచి, ప్రతీ అడుగులోనూ సరికొత్త స్ఫూర్తిని నింపుతుంది. మన జీవితాలను సుసంపన్నం చేసే ఈ అమూల్యమైన స్నేహ బంధాలను పదిలంగా కాపాడుకుంటూ, ప్రతిరోజూ ఆనందాన్ని, శక్తిని పొందుదాం.నిజమైన స్నేహితుడు మనకు లభించిన ఒక వరం. అటువంటి స్నేహాన్ని కాపాడుకోవడమే మన జీవితానికి అసలైన సంపద. మనసులోని మాటను పంచుకోవడానికి, ఆశలను, కలలను సాకారం చేసుకోవడానికి, ఒంటరితనాన్ని దూరం చేయడానికి స్నేహం కంటే గొప్ప ఔషధం లేదు.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
ఫ్యాన్స్ ఫుట్బాల్ ఆడేసుకున్నారు
ఫుట్బాల్ దేవుడు లియోనెల్ మెస్సీని కళ్లారా చూసేందుకు కోల్కతాలో అభిమానుల సాహసాలు, పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. కొందరు వేలకు వేలు చెల్లించగా, ఓ అభిమాని ఏకంగా తన పెళ్లి వేడుకలను పక్కనపెట్టి స్టేడియానికి వచ్చాడు. కానీ, అంతిమంగా వారందరికీ మిగిలింది తీవ్ర నిరాశే. ’గోట్ టూర్ 2025’లో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అడుగుపెట్టినప్పటికీ, ఆయన ముందుగానే నిష్క్రమించడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ అస్తవ్యస్థ, పేలవమైన నిర్వహణతో వేలాది మంది అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మెస్సీ కనిపించలేదు.. కార్పెట్ తీసుకుపోతున్నా! మెస్సీని దగ్గరగా చూడాలని రూ.10,000 చెల్లించిన ఓ అభిమాని, తీవ్ర నిరాశతో.. ఆవేశంతో ఊగిపోయాడు. స్టేడియం లోపలికి చొచ్చుకొచ్చి.. ఏకంగా మైదానంలోని గడ్డి కార్పెట్ను చుట్టి, మోసుకుపోతూ కనిపించాడు. ‘మెస్సీ ముఖం కూడా కనిపించలేదు. చాలా డబ్బు పోయింది, అందుకే ఈ కార్పెట్ను ఇంటికి తీసుకెళ్లి ప్రాక్టీస్ చేస్తా!’.. అని ఆగ్రహం, వ్యంగ్యం మిళితమైన స్వరంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నెటిజన్లు అతన్ని ’అత్యంత ప్రాక్టికల్ అభిమాని’గా అభివరి్ణంచారు. మెస్సీ కంటే ఎక్కువ సేపు స్టేడియంలో ఆ కార్పెట్ మాత్రమే ఉందంటూ మీమ్స్ వెల్లువెత్తాయి. కుండీలు మోసుకెళ్లిన మరో అభిమాని కార్పెట్ దొంగతనం జరిగిన కొద్దిసేపటికే, మెస్సీ జెర్సీ ధరించిన మరో వ్యక్తి సైతం మైదానం నుంచి రెండు పూలకుండీలను మోసుకెళ్తూ కనిపించాడు. పూలకుండీలను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా.. ‘వీటి ని మా ఆవిడకు ప్రేమగా బహుమతిగా ఇస్తాను’.. అని ఆ వ్యక్తి చెప్పాడు. అభిమానులు అందినకాడికి స్టేడియంలోని వస్తువులను దోచుకుపోయారు. మొత్తం మీద, మెస్సీని చూడాలనే ఆశ నెరవేరక, సోఫాలు పీకివేయడం, సీట్లు ధ్వంసం చేయడం, బాటిళ్లు విసరడం వరకు విధ్వంసం కొనసాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముద్దుల్లో ప్రపంచ రికార్డు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరం మరోసారి ముద్దుల పోటీకి వేదికైంది. ‘నేషనల్ కిస్ అండర్ ది నేషనల్ మిజిల్టో’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జంటలు తరలివచ్చాయి. ఆంథెమ్ రోలో వేలాడదీసిన మిజిల్టో మొక్కల కింద 480 మంది జంటలు ముద్దాడటం ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. అయితే, శనివారం జరిగిన కార్యక్రమానికి సుమారు 1,435 జంటలు వచ్చి ముద్దాడుకున్నాయి. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు తరఫున న్యాయ నిర్ణేతగా వచ్చిన మైకేల్ ఎంప్రిక్ ఇక్కడికి చేరుకున్న మూడు వేలమందిని చూసి ఆశ్చర్యమేస్తోంది. వీరంతా మిజిల్టో కింద ముద్దుల చరిత్రను సృష్టించారని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న రికార్డును వీరు సులభంగా బద్దలు కొట్టారు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు’అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. ఒంటరిగా ఇక్కడికి ఎవరూ రాలేదన్నారు. అందరూ జంటలుగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. వీరంతా ఏకకాలంలో ఐదు సెకన్లపాటు ముద్దులు పెట్టుకుని, రికార్డు నెలకొల్పారని ఎంప్రిక్ వివరించారు. తాము కేవలం 500 జంటలు మాత్రమే పాల్గొంటాయని భావించామని, అనూహ్యంగా 6 వేల జంటలు నమోదు చేయించుకున్నాయని నిర్వాహకుడు ఎబనీ వాల్టన్ చెప్పారు. ఈ కార్యక్రమం కోసం ఒరెగాన్లోని ఓ వ్యవసాయక్షేత్రం నుంచి 17,150 మిజిల్టో అనే గుబురుగా ఉండే పారాసైటిక్ నాచు మొక్కలను తెప్పించామన్నారు. -
పోర్టును గాలికొదిలేశారు..!
సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీపడుతూ.. సరకు రవాణాలో దూకుడుగా వెళ్తున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)కి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసేసింది. ఒకేసారి ఉన్నతాధికారులను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్తవారిని నియమించకుండా.. పోర్టు కార్యకలాపాలను గాలికొదిలేసింది. ఇదే అదనుగా ఓ మహిళా అధికారి పోర్టులో పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్చార్జ్ చైర్మన్ కూడా పట్టించుకోకపోవడంతో ఆయా విభాగాధికారులు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ముందుకు కదలని ఫైళ్లు విశాఖ పోర్టు అనాథగా మారిపోయింది. అధికారులంతా బదిలీ అవ్వడంతో కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలు అస్తవ్యస్తమైపోయాయి. పోర్టు చైర్మన్ డా.అంగముత్తుని ముంబై పోర్టు చైర్మన్గా బదిలీ చేయడంతో పాటు వీపీఏ ఇన్చార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. అయినా.. చైర్మన్ మాత్రం ముంబైకే పరిమితమయ్యారు. నెలలో ఒకట్రెండు సార్లు మాత్రమే పోర్టుకు వస్తూ.. తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించి వదిలేస్తున్నారు. దీంతో పాలన గాడితప్పింది. ఇక డిప్యూటీ చైర్మన్గా దుర్గేష్ కుమార్ దూబే పదవీ కాలం ఇంకో రెండు నెలలు ఉన్నా.. ఇటీవలే బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. పోర్టు చరిత్రకు భిన్నంగా డిప్యూటీ చైర్మన్ పదవీకాలం ఉన్నప్పటికీ బదిలీ చేసేశారు. రిలీవ్ అయ్యేందుకు ఈ నెల 19వ తేదీ వరకూ సమయం ఉన్నా బదిలీ విషయంలో జరిగిన అన్యాయంతో పోర్టు వ్యవహారాల్ని పట్టించుకోవడం మానేశారు. అదేవిధంగా ఏళ్ల తరబడి సెక్రటరీగా వ్యవహరించిన వేణుగోపాల్ని పారాదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్గా బదిలీ చేశారు. పరిపాలన వ్యవహారాల ఫైళ్లు ముందుకు కదిపే ఉన్నతాధికారులు లేకపోవడంతో పోర్టులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. అంతా ఆమె కనుసన్నల్లోనే..! ట్రాఫిక్ విభాగంలో ఉన్నతాధికారి అనారోగ్యం కారణంగా అంతంత మాత్రంగానే విధుల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నారు. దీంతో ఈ విభాగంలో కార్యకలాపాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం షిప్స్ బెర్తింగ్, లోడింగ్, అన్లోడింగ్ వ్యవహారాలు కిందిస్థాయి సిబ్బంది ద్వారా మేనేజ్ చేస్తున్నారు. ఇలా పోర్టులో ప్రతి విభాగాన్ని నడిపించే నాయకత్వం లేకపోవడంతో వ్యవహారాలు సరిగా జరడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులెవ్వరూ లేకపోవడంతో ఓ మహిళా అధికారి.. అంతా తానై పోర్టులో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమెపై గతంలో సీబీఐ దాడులు జరిగాయి. తర్వాత విధుల్లో చేరిన సదరు మహిళా అధికారి ఇప్పుడు పోర్టులో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారంటూ విమర్శలొస్తున్నాయి. పోర్టులో అన్ని విభాగాల్లోనూ ఆమె తలదూర్చి.. ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీలైనంత త్వరగా విభాగాధిపతులను నియమించి పోర్టును తిరిగి గాడిలో పెట్టాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు. -
ప్రవర్తన మార్పుతోనే దేశ ఇంధన ప్రగతి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రంగాలలో శక్తి (ఇంధన) సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రతి పౌరుడిలోనూ ప్రవర్తన మార్పు చాలా కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ’జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం’లో ఆమె మాట్లాడారు. ప్రకృతికి అనుగుణంగా సమతుల్య జీవనశైలిని అవలంబించాలనే చైతన్యం భారతదేశ సాంస్కృతిక సంప్రదాయంలో అంతర్లీనంగా ఉందని స్పష్టం చేశారు. ఈ భావనే ప్రపంచానికి మన సందేశంగా మారుతున్న ‘పర్యావరణం కోసం జీవనశైలి – లైఫ్’నినాదానికి ఆధారమన్నారు. కీలకమైన మార్పులు ‘భారతదేశ ఇంధన పరివర్తన విజయం కోసం ప్రతి రంగం, పౌరుల భాగస్వామ్యం అవసరం. అన్ని రంగాలకు ఇంధన సామర్థ్యాన్ని తీసుకురావడానికి ప్రవర్తనా మార్పు అత్యంత కీలకం.’.. అని రాష్ట్రపతి సూచించారు. ఇంధన సంరక్షణ అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే కాదని.. ప్రస్తుత అత్యంత ముఖ్యమైన అవసరమని తెలిపారు. సమర్థ వినియోగం జరగాలి శక్తిని ఆదా చేయడం అంటే తక్కువగా ఉపయోగించడం మాత్రమే కాదని, దానిని తెలివిగా, బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా వినియోగించడమని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. ‘అనవసరంగా విద్యుదుపకరణాలను వాడకుండా ఉండటం, శక్తి సామర్థ్యం గల పరికరాలను ఉపయోగించడం, మన ఇళ్లు, కార్యాలయాలలో సహజ కాంతి, గాలిని వినియోగించుకోవడం, లేదా సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన మార్గాలను స్వీకరించడం ద్వారా, మనం కేవలం శక్తిని ఆదా చేయడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించగలం’.. అని ముర్ము సూచించారు. పర్యావరణం, ఆర్థిక ప్రయోజనాలు స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన నీటి వనరులు, సమతుల్య పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికి కూడా ఇంధన సంరక్షణ చాలా ముఖ్యమని రాష్ట్రపతి చెప్పారు. ‘మనం ఆదా చేసే ప్రతి యూనిట్ శక్తి, ప్రకృతిపై మన బాధ్యతకు, భవిష్యత్ తరాలపై మన సున్నితత్వానికి చిహ్నంగా నిలుస్తుంది’.. అని స్పష్టం చేశారు. యువత, పిల్లలు ఇంధన సంరక్షణపై అవగాహన పెంచుకుని, ఈ దిశగా ప్రయత్నాలు చేస్తే, దేశం స్థిరమైన అభివృద్ధిని సాధించగలదని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు ’ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’, ’జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ వంటి కార్యక్రమాలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని ముర్ము గుర్తు చేశారు. ’పునరుత్పాదక వినియోగ బాధ్యత’, ’ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల’ ద్వారా ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని, శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.గణనీయంగా శక్తి ఆదా 2023–24లో భారతదేశ ఇంధన సామర్థ్య ప్రయత్నాల ఫలితంగా 53.60 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన శక్తి ఆదా అయిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ ప్రయత్నాలు వార్షికంగా గణనీయమైన ఆర్థిక పొదుపులకు, ఉద్గారాల తగ్గింపునకు దారి తీశాయని వెల్లడించారు. చివరగా, ఇంధన సంరక్షణ రంగంలో కృషి చేస్తున్న వాటాదారులందరినీ రాష్ట్రపతి అభినందించారు. సామూహిక బాధ్యత, భాగస్వామ్యం, ప్రజల సహకార స్ఫూర్తితో భారతదేశం ఇంధన సంరక్షణలో ప్రధాన పాత్ర పోషించి, ’హరిత భవిష్యత్తు’ లక్ష్యాలను సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ఆమె 2025 సంవత్సరానికి ’జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులు’, ’ఇంధన సంరక్షణపై జాతీయ చిత్రలేఖన పోటీ’ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
టెక్నా'లేజీ'
టెక్నాలజీ.. కాస్త టెక్నా‘లేజీ’ అవుతోంది.. పాశ్చాత్య నాగరికతకనుగుణంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. వయో భేదంలేదు అసలేలేదు.. అరచేతిలో స్వర్గం.. అనర్థాలు అధికమన్న విషయం తెలిసినా సామాజిక మాధ్యమాల్లోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది.. అతివినియోగంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది.. అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి.. ఫలితంగా చిన్నారులేకాదు.. 15 నుంచి 32 ఏళ్ల యువత కూడా డేంజర్ జోన్లోకి వెళ్లిపోతోంది.. సాక్షి, పుట్టపర్తి: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే.. టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా ప్రజలకు అందిన మేలు ఊహలకు అందదు. చావు కబురు చెప్పాలంటే టెలిగ్రామ్ పంపే రోజుల నుంచి నిమిషాల్లో సమాచారం చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. బంధువులను పండుగలు, శుభకార్యాల్లో మాత్రమే కలిసి రోజుల నుంచి నిత్యం టచ్లో ఉండేలా టెక్నాలజీ అందిపుచ్చుకున్నారు. మధ్య మధ్యలో మంచీచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలే దిక్కయ్యేవి. ఆ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సగటున స్మార్ట్ఫోన్ ఉంది. ఇంటింటా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం లభిస్తోంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్లో దొరుకుతోంది. పండుగలు, శుభకార్యాల కోసం మంచి బ్రాండ్ దుస్తులతో సహా ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొంటున్నారు. వ్యాపార రంగంలో ఆన్లైన్ బిజినెట్ వాటా సుమారు సగం పైగా ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా పిల్లల వీడియో గేమ్స్ యాప్స్ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగించకుండా రోజు గడవని స్థితి నెలకొంది. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. గూగుల్ మ్యాప్లో వెతుక్కుని వెళ్లే స్థితికి వచ్చారు. ఇదంతా పక్కన బెడితే.. మరో కోణంలో టెక్నాలజీని అతిగా వినియోగించి అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అలాంటి వారిలో 15 – 35 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. శారీరక శ్రమ తగ్గిపోతోంది.. టెక్నాలజీ ప్రభావంతో చదువులో వెనుకబడడం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా దృష్టి సారించలేకపోవడం, ఒకరినొకరు మాట్లాడడం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి. నిద్రలేమి వేధిస్తోంది. చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకోవడం వంటి ప్రభావాలు పడుతున్నాయి. ఆఖరుకు చిన్న పిల్లలు కూడా డేంజర్ జోన్లోకి వెళ్తున్నారని వైద్యనిపుణులు చెప్తున్నారు. మారుతున్న సాంకేతికత తెచ్చిన తంటా పెరిగిపోతున్న ఒత్తిడి.. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్తోనే టెక్నాలజీని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా చిన్నపిల్లలు, యువతకు ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. 40 ఏళ్ల లోపు వయసున్న వారికి టెక్నాలజీ అతి వినియోగం కారణంగా మానసిక, శారీరక సమస్యలు అధికమయ్యాయి. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో సమయం గడుపుతుండడంతో సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ఫోన్ తక్కువగా వాడేవారు పాజిటివ్ ధోరణితో ఉండగా.. అతిగా వినియోగించే వారు నెగిటివ్ ఆలోచనలో ఉంటారని నిపుణులు చెప్తున్నారు. ట్యాబ్లు, కంప్యూటర్లపై ఎక్కువగా ఆధారపడేవారు కంటి సమస్యతో బాధపడుతున్నారు. కొంత మందికి తలనొప్పి, భుజం, వెన్నునొప్పి సమస్యలు వస్తున్నాయి. » ఒకే ప్రదేశంలో కూర్చొని కంప్యూటర్ చూస్తూ గడిపే వారికి వెన్ను సమస్యలు అధికం అవుతున్నాయి. ఈ నొప్పితో ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. నిత్యం ఉద్యోగ ఒత్తిళ్లతో బిజీలో ఉండటంతో పాటు మధ్య మధ్యలో స్నేహితులతో ముచ్చటించటం.. పలు విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో కంప్యూటర్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.. ఫలితంగా మూడు పదుల వయసుకే వెన్నెముక బారిన పడుతున్నారు. ఇటీవల పుట్టపర్తిలో 36 ఏళ్ల వ్యక్తి వెన్నెముక నొప్పి బారిన పడడమే నిదర్శనంగా చెప్పవచ్చు. » స్మార్ట్ఫోన్లతో జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు. కనీసం కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితి. గణాంకాల విషయానికొస్తే క్యాలిక్యులేటర్ వాడుతున్నారు. ప్రైమరీ పాఠశాల నుంచి చిన్నారులు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడటంతో ఏ విషయం గుర్తుంచుకోలేకపోతున్నారు. ఫోన్ లేకుంటే ఏ పనీ చేయలేని స్థితిలోకి వెళ్తున్నారు. ఫలితంగా టీనేజీలోనే జ్ఞాపక శక్తి కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రెండు నెలల క్రితం హిందూపురంలో 16 ఏళ్ల బాలుడు జాపకశక్తి కోల్పోయి.. మానసికంగా దెబ్బ తిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. » పండుగ వచ్చినా.. ఫంక్షన్ రోజయినా.. ఎలాంటి శుభకార్యం కోసమైనా.. నేరుగా వెళ్లి పిలిచే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సమీప బంధువులను తప్ప మిగతా అందరినీ టెక్నాలజీ ఆధారంగా ఆహా్వనిస్తున్నారు. శుభవార్త, చేదువార్తలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే తెలియజేస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరూ అర్ధరాత్రి వరకు ఫోన్లతోనే గడిపేస్తున్నారు. మెసేజీలు, ఫోన్ కాల్స్, రీల్స్కు బానిసలుగా మారారు. ఆరోగ్యం ప్రధానం నిద్రపోయే గంట ముందే స్మార్ట్ఫోన్ వాడకం, టీవీ చూడటం మానేయాలి. అతి దగ్గరగా కూర్చొని టీవీ, ఫోన్ కూడా చూడరాదు. టెక్నాలజీని అవసరం మేరకే వాడుకోవాలి. లేదంటే సోమరితనం పెరిగిపోతుంది. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల వాడకం పూర్తిగా తగ్గించాలి. స్మార్ట్ఫోన్లలో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం గమనించడం తల్లిదండ్రుల బాధ్యత. లేదంటే పెడదారిలో వెళ్లే అవకాశం అధికంగా ఉంటుంది. – ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, శ్రీసత్యసాయి జిల్లాఅతిగా వినియోగించేవారి సంఖ్య : రోజుకు పది గంటల పైన మొబైల్కు బానిసలు: 17 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వారే అధికం మొబైల్ అతిగా వాడకంతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులు: 30 శాతం అనారోగ్యం బారిన పడిన వారు : 14 శాతం -
CO2 పెరిగితే.. పోషకాలు తగ్గిపోతాయ్!
గాలిలో అంతకంతకూ పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ (సీఓ2)కు.. మన ఆహారంలో పోషకాలకు ప్రత్యక్ష సంబంధం ఉందని మీకు తెలుసా? భూతాపం పెరుగుతున్న కొద్దీ మనం రోజూ తినే వరి బియ్యంలో, గోధుమల్లో, ఇంకా చెప్పాలంటే.. జొన్నల్లో కూడా పిండి పదార్థాల శాతం పెరిగిపోతోంది. ప్రొటీన్లు, సూక్ష్మపోషకాల శాతం ఆ మేరకు తగ్గిపోతోంది. అంతేకాదు, విషతుల్యమైన సీసం వంటి భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఆహార గింజల్లోకి చేరిపోతున్నాయి. టూకీగా చెప్పుకోవాలంటే.. భూతాపం పెరుగుతున్నకొద్దీ మన దైనందిన ఆహారంలో పోషకాల సమతుల్యత అస్తవ్యస్తమవుతోందని తాజా అధ్యయనం చెబుతోంది. – సాక్షి, సాగుబడిగాలిలో నానాటికీ పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ స్థాయులు వాతావరణ మార్పులకు కారణమవుతాయని అందరికీ తెలుసు. కానీ ఇటీవల వెలువడిన ఒక కొత్త అధ్యయనం.. అధిక సీఓ2 వల్ల ఇప్పుడు ఆహార పంటల పోషకవిలువలు స్థిరంగా క్షీణిస్తున్నాయని తేల్చింది. మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు పెరిగిపోయి, ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు తగ్గిపోతే.. అధిక బరువు, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఏకకాలంలో మరింత పెరుగుతాయి. ఆ మూడింటిలో..నెదర్లాండ్స్లోని లీడెన్ యూనివర్సిటీ నిపుణుల పరిశోధన వివరాలు ‘గ్లోబల్ ఛేంజ్ బయాలజీ’ జర్న ల్లో ప్రచురితమయ్యాయి. పెరుగుతున్న సీఓ2 ప్రభావం వల్ల పంటల్లో పోషకాలు తగ్గిపోయి, మనం తినే ప్రతి ముద్దలోనూ కేలరీలు గతం కన్నా ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. వరి, గోధుమ, జొన్న వంటి ప్రధాన ఆహార ధాన్యాల్లో పిండి పదార్థాలు పెరుగుతుండగా, ప్రొటీన్ తగ్గిపోతోందన్నారు. ఐరన్, జింక్, మెగ్నీషి యం, కాల్షియం వంటి అతిముఖ్యమైన సూక్ష్మపోషకాలు కూడా తగ్గిపోతున్నాయి. పప్పుధాన్యాల్లో జింక్ 38% తగ్గినట్లు గుర్తించారు.కిం కర్తవ్యం?!భారతీయులు ఆహారంలో కార్బోహైడ్రేట్ల (పిండి పదార్థాల)ను మితిమీరి తీసుకోవటం, ప్రొటీన్లను అవసరం కన్నా తక్కువగా తీసుకోవటం వల్ల ఊబకాయం, షుగర్ వంటి జీవనశైలి వ్యాధుల బెడద ఏటేటా పెరుగుతోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్న విషయం మనకు తెలిసిందే. రోజువారీ మొత్తం ఆహారంలో 45%కి మించి పిండి పదార్థాలు తీసుకోవద్దని, 15%పైగా ప్రొటీన్లు తీసుకోవాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సూచిస్తోంది. అయితే, ప్రజలు 62% మేరకు పిండి పదార్థాలు అధికంగా తింటున్నారని, 11.5% మేరకు ప్రొటీన్లు అవసరం కన్నా తక్కువగా తింటున్నారని ఇటీవలి సర్వేల్లో తేలింది. ప్రపంచ దేశాలన్నీ సీఓ2 స్థాయులు తగ్గించడంపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.ఎందుకిలా?గాలిలో ఒకప్పుడు 350 పీపీఎం స్థాయిలో ఉండే సీఓ2 ప్రస్తుతం 426 పీపీఎంకు పెరిగింది. గాలిలో సీఓ2 లభ్యత పెరుగుతున్నకొద్దీ మొక్కలు దాన్ని ఎక్కువగా తీసుకుంటూ షుగర్ను, పిండిపదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటున్నాయి. తత్ఫలితంగా మట్టి నుంచి వేర్ల ద్వారా ఇతర పోషకాలను తీసుకునే సామర్థ్యం తగ్గిపోతోంది. వరి, గోధుమ, జొన్నల్లో ఇలా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పిండి పదార్థాలు పెరగటం, ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు తగ్గటం అనేది మనం తినే గింజలు, పూలు, కాయలు, ఆకులు, దుంపలన్నిటిలోనూ ఒకేలా ఉన్నట్లు వారు తెలిపారు.భార లోహాల ముప్పు అధిక సీఓ2 ప్రభావంతో ధాన్యాల్లో క్రోమియం, నికెల్, సీసం వంటి విషతుల్యమైన భార లోహాలు ఎక్కువగా పోగుపడుతున్నాయని పరిశోధకులు తేల్చారు. ఇవి అతి స్వల్ప మోతాదుల్లో ఉన్నప్పటికీ మెదడు, గుండె, నాడీ మండలాలకు హాని చేస్తాయి. సీఓ2 స్థాయి పెరగటంతో గోధుమలో సీసం 170% పెరిగింది. -
యూదులపై ఉగ్రదాడి
సిడ్నీ: ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లింది. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదాంతంగా మారింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో బీచ్లో ఉత్సాహంగా పండగలో పాల్గొంటున్న యూదులపై ఇద్దరు ఉగ్రవాదులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మరణించారు. ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడ్డారు. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రకటించింది. మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకోవడం, ఆయుధాలతో విరుచుకుపడడంపై కచ్చితంగా ఉగ్రవాద దాడిగా ప్రభుత్వం పేర్కొంది. యూదులపై కాల్పుల జరిపిన ఇద్దరు ముష్కరులపై పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఒకరిని మట్టుబెట్టారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రెండో ఉగ్రవాది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఉగ్రవాద దాడిని ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా ఖండించారు. ఈ రాక్షస కాండ ఘటన ఆ్రస్టేలియా హృదయాన్ని గాయపర్చిందని ఉద్ఘాటించారు. దుశ్చర్య పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. యూదులపై విద్వేషాన్ని అల్బనీస్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తాజా దాడికి ఆయనే కారణమని ఆరోపించారు. విచ్చలవిడిగా కాల్పులు ప్రాచీన కాలంలో జెరూసలేం నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా యూదులు హనుక్కా పండుగను ప్రతిఏటా ఘనంగా నిర్వహించుకుంటారు. యూదులకు ఇది ప్రధానమైన పండుగ. ఆస్ట్రేలియాలోని యూదులు బాండీ బీచ్లో హనుక్కాలో పాల్గొనడానికి భారీగా తరలివచ్చారు. వందలాది మంది గుమికూడారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సంతోషంగా ఆటపాటల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో నల్లటి దుస్తులు ధరించి అక్కడికి చేరుకున్న ఇద్దరు ముష్కరులు తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే 16 మంది విగతజీవులయ్యారు. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. బీచ్లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. యూదులపై కాల్పుల్లో జరిపిన సాయుధ దుండగుల్లో ఒకరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తించారు. సిడ్నీ బానీరిగ్ ప్రాంతంలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రవాద దాడి పట్ల భారత ప్రధాని మోదీ ది్రగ్బాంతి వ్యక్తంచేశారు. ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో ఆ్రస్టేలియా ప్రజలకు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. యూకేలో భద్రత కట్టుదిట్టం ఆ్రస్టేలియాలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఖండించారు. యూదుల మరణించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. యూకేలో యూదులు నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా లండన్లో యూదుల ప్రార్థనా మందిరాలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలియజేశారు. సామూహిక వేడుకల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దేశంలో ఆయుధ చట్టాలు కఠినం ఆ్రస్టేలియాలో సామాన్య జనంపై కాల్పులు ఘటనలు చాలా అరుదే. 1996లో పోర్ట్ అర్థర్ టౌన్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆయుధ చట్టాలను కఠినతరం చేసింది. ఆయుధ లైసెన్స్లు సులభంగా దక్కకుండా చర్యలు చేపట్టింది. ఆ తర్వాత 2014లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు, 2018లో ఏడుగురు మృతిచెందారు. ఆయా ఘటనల్లో సాయుధులు తమ కుటుంబ సభ్యులపైనే కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019లో ఉత్తర ఆ్రస్టేలియాలోని డారి్వన్ సిటీలో జైలు నుంచి పెరోల్పై బయటకు వచి్చన ఖైదీ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 2022లో క్వీన్స్లాండ్ స్టేట్లో ఓ తీవ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. ఆ్రస్టేలియాలో భారీ ఎత్తున కాల్పులు జరగడం, పది మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. పెచ్చరిల్లుతున్న యూదు వ్యతిరేకత ఆ్రస్టేలియా జనాభా 2.8 కోట్లు. వీరిలో 1.17 లక్షల మంది యూదులు ఉన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఆ్రస్టేలియాలోని యూదులపై దాడులు పెరిగిపోయాయి. వారి ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయి. యూదు వ్యతిరేక ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గత ఏడాది సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో యూదులే లక్ష్యంగా దాడులు జరిగాయి. యూదుల ప్రార్థనా మందిరాలకు, వారి వాహనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు యూదులకు తగిన రక్షణ కల్పించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ్రస్టేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.రియల్ హీరో అహ్మద్ బీచ్లో ముష్కరులు కాల్పులు జరుపుతుండగా అహ్మద్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. చెట్టు చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ఓ ఉగ్రవాదిని గట్టిగా పట్టుకొని, తుపాకీను లాక్కొని అతడికే గురిపెట్టాడు. అహ్మద్ను గమనించిన మరో మరో ఉగ్రవాది కాల్పులు ప్రారంభించారు. దాంతో అహ్మద్ గాయాలపాలై కుప్పకూలిపోయాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అహ్మద్ సాహసోపేతంగా వ్యవహరించిన దృశ్యం ఆస్ట్రేలియా టీవీ చానళ్లలో ప్రసారమైంది. అతడు ధైర్యంగా అడుగు ముందుకు వేయకపోతే ఉగ్రవాదుల కాల్పుల్లో మరికొందరు మరణించేవారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రియల్ హీరో అహ్మద్ అంటూ జనం ప్రశంసిస్తున్నారు. -
రెండు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఆత్మకూరు/అచ్యుతాపురం రూరల్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి మోటారు సైకిల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామానికి చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు. వీరి కుమార్తె ఆత్మకూరులోని ఏపీ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆదివారం పేరెంట్ మీట్ ఉండడంతో వీరు వెళ్లారు. ఇంటివద్ద నుంచి భోజనం తీసుకెళ్లి కుమార్తెకు తినిపించారు. అక్కడి నుంచి బైక్ మీద ఇంటికి వెళుతుండగా.. నెల్లూరు–ముంబై రహదారిలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి బద్వేల్ నుంచి నెల్లూరు వెళుతున్న ఇన్నోవా కారు రాంగ్రూట్లో వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మంచులో దారి సరిగా కనిపించక.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో శనివారం రాత్రి మోటారు సైకిల్ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో మునగపాక మండలం గణపర్తి గ్రామానికి చెందన ధనువిజయ్ (19), చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూలి దుర్గ (20) మరణించారు. ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపిన మేరకు.. తండ్రి చనిపోవడంతో దూలి దుర్గ అచ్యుతాపురం మండలం చోడపల్లిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు. గణపర్తికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనువిజయ్ లైటింగ్ పనులకు సహాయకుడిగా వెళుతున్నాడు. వీరికి జగన్నాథపురానికి చెందిన ఇంటి జగన్ స్నేహితుడు. గణపర్తిలో శనివారం జరిగిన పండుగలో వీరు ఉత్సాహంగా గడిపారు. తరువాత దుర్గను చోడపల్లిలో డ్రాప్ చేయడానికి బైక్పై ముగ్గురూ బయలుదేరారు. జగన్నాథపురంలో జగన్ దిగిపోయి, తన బైక్ను దుర్గకు ఇచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో దుర్గ, ధనవిజయ చోడపల్లి వెళుతుండగా మంచు విపరీతంగా కురవడంతో దారి సరిగా కనిపించక జగన్నాథపురం సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. -
పార్లమెంటు స్థాయీ సంఘం నివేదికకు ఎల్లో మీడియా వక్ర భాష్యం
సాక్షి, అమరావతి: దేశంలో వైద్యవిద్య నాణ్యతపై ఇటీవల పార్లమెంటు స్థాయీ సంఘం విడుదల చేసిన నివేదికకూ ఎల్లో మీడియా వక్రభాష్యం పలికింది. కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలల ఆవశ్యకత, ఎంబీబీఎస్ సీట్ల పెంపు అవసరాన్ని స్థాయి సంఘం నొక్కివక్కాణిస్తే.. పీపీపీ విధానాన్ని సమర్థించినట్టు కట్టుకథలల్లుతోంది. కొత్తగా కళాశాలలు ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు కేవలం పన్ను రాయితీలు చాలన్న స్థాయీ సంఘం సూచనను వక్రీకరించి చంద్రబాబు ప్రైవేటీకకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినట్టు దుష్ప్రచారం చేస్తోంది. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు స్థాయి సంఘం చెప్పిందేమంటే..! ‘దేశంలో వైద్య విద్యకు ఉన్న పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. సీట్లు పరిమితంగా ఉండటంతో దేశం వెలుపల ఎంబీబీఎస్ అభ్యసించడానికి వలస వెళ్లే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది.’ అని పార్లమెంట్ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఇప్పటికే ప్రకటించినట్టు వచ్చే ఐదేళ్లలో 75 వేల సీట్లు జోడిస్తే విద్యార్థులు వలసలు వెళ్లడానికి అవసరం ఉండదని దృఢంగా అభిప్రాయపడింది. దేశంలో వైద్య విద్య నాణ్యతపై ఇటీవల స్థాయీ సంఘం నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక దేశంలోని అనేక రాష్ట్రాల్లోని వైద్య విద్యలో అసమానతలను బట్టబయలు చేసింది. దేశంలో వైద్య విద్యలో అసమానతలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని స్పష్టం చేసింది. దేశం మొత్తం 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య అసమానతలను ఎత్తి చూపింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 150కు దగ్గరగా ఎంబీబీఎస్ సీట్లు ఉండగా జాతీయ స్థాయిలో 75 సీట్లే ఉంటున్నాయని వివరించింది. 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లున్న రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఆయా రాష్ట్రాల పేర్లను నివేదికలో వెల్లడించలేదు. జాతీయ స్థాయిలో 10 లక్షల జనాభాకు 100 సీట్ల నిష్పత్తిని సాధించడానికి మరో 40 వేల సీట్లు కొత్తగా సమకూర్చాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 10 లక్షల జనాభాకు వంద కంటే ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి చేయాలని సిఫార్సు చేసింది. వైద్య కళాశాలలు అందుబాటులో లేని జిల్లాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైద్య విద్యలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖలకు పలు సూచనలు చేసింది. వైద్య విద్యలో అసమానతలు అధిగమించడంతోపాటు, నాణ్యత పెంపునకు స్థాయీ సంఘం చేసిన సిఫార్సులకు ఐదేళ్ల కిందటే వైఎస్ జగన్ రాష్ట్రంలో కార్యరూపం ఇచ్చిందని వైద్యవర్గాల్లో చర్చ ఊపందుకుంది. చంద్రబాబు సర్కారు గ్రహణం 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం బాబు గద్దెనెక్కడంతో మిగిలిన మెడికల్ కళాశాలలకు చంద్రగ్రహణం పట్టుకుంది. ఎక్కడికక్కడ గతేడాది జూన్ నుంచి నిర్మాణాలను ఆపేసి, పీపీపీలో వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టే కార్యక్రమానికి చంద్రబాబు తెరలేపారు. వైద్య విద్యపై బాబు చిన్న చూపు ఏపీ విద్యార్థులకు పెను శాపంగా మారింది. ఉమ్మడి ఏపీ నుంచి వేరుపడిన సందర్భంలో మన కంటే తెలంగాణలో తక్కువ సీట్లు ఉండేవి. ఇదిలా ఉండగా పదేళ్లలో ఆ రాష్ట్రంలో తొమ్మిది వేలకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2014లో కేంద్రంలోని ఎన్డీఏతో పొత్తులో ప్రభుత్వాన్ని నడిపిన బాబు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్కటంటే ఒక్క కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయలేదు. ఫలితంగా ఐదు కోట్లమందికిపైగా జనాభా ఉన్న ఏపీలో 2019–20లో 4,650 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో కేవలం రెండు వేల సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేట్ కాలేజీల్లోవి. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఏపీ కంటే ఎక్కువ సీట్లుండేవి. పోటీకి సరిపడా ఎంబీబీఎస్ సీట్లు లేక, ప్రైవేట్లో వైద్య విద్యను కొనే స్థోమత లేని వేల మంది విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, కజికిస్తాన్ వంటి విదేశాలకు పరుగులు తీశారు. సామాన్య ప్రజలు సైతం ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందక తీవ్ర అగచాట్లు పడేవారు. పీపీపీ పేరిట దోచిపెట్టే కుట్రలు దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వాలు పీపీపీలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వాలని పార్లమెంట్ స్థాయీ సంఘం సూచించింది. ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులను, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతోంది. 10 కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ప్రభుత్వమే భూములు సేకరించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి, నిర్మాణాల్లో మంచి పురోగతి సాధించిన కళాశాలలను పప్పుబెల్లాల మాదిరిగా ప్రైవేటుకు కట్టబెట్టేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బాబు సర్కారు అవలంబిస్తున్న విధానం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పార్లమెంట్ స్థాయి సంఘం సైతం కొత్త కళాశాలల ఏర్పాటు కోసం కేవలం పన్ను రాయితీలు మాత్రమే ఇవ్వాలని సిఫార్సు చేయడం గమనార్హం. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా బాబు సర్కారు అడుగులు వేస్తోంది. అంతేకాకుండా విద్యార్థుల నుంచి ఫీజులు, రోగుల నుంచి చార్జీల రూపంలో దోచుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఎకరం భూమికి కేవలం రూ.100 లీజు రూపంలో ఏకంగా 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కళాశాలలు పెట్టేస్తోంది. గతేడాది ప్రారంభం కాకుండా నిలిచిపోయిన పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలకు టెండర్లూ పిలిచింది. వాస్తవానికి పులివెందుల కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణం వైఎస్ జగన్ హాయంలోనే పూర్తయింది. ఈ నేపథ్యంలోనే బాబు ప్రభుత్వం ఏమీ చేయకున్నా పులివెందులకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 2024–25లోనే 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. అయితే కళాశాల మాకొద్దంటూ చంద్రబాబు సర్కార్ ఎన్ఎంసీకి లేఖలు రాసి, అనుమతులు రద్దు చేసింది. మిగిలిన మూడు కళాశాలలు ప్రారంభించకుండా వదిలేసింది. ఇప్పుడీ నాలుగింటిని తొలి దశలో ప్రైవేట్కు కట్టబెట్టడమే కాకుండా మరింత బరితెగించి, గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతుంది. రెండేళ్ల పాటు ఈ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఖజానా నుంచి వేతనాలు చెల్లించడం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు రూ.వందల కోట్లు దోచిపెట్టడానికి స్కెచ్ వేసింది.దోపిడీ విధానాన్ని సమర్థించుకోవడానికి పాట్లుపీపీపీ పేరిట దేశంలో ఎక్కడా లేనివిధంగా బాబు సర్కారు తెరలేపిన దోపిడీ విధానంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన నిరసన ర్యాలీలకు రాజకీయాలకు అతీతంగా విద్యార్థి, ప్రజా, మేధావి వర్గాలు తరలివచ్చాయి. ఈ నేపథ్యంలో తన దోపిడీ విధానాన్ని సమర్థించుకోవడానికి చంద్రబాబు సర్కారు నానా పాట్లు పడుతోంది. పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులకు వక్రభాష్యం చెబుతోంది. వైద్య కళాశాలల అభివృద్ధిలో పీపీపీ విధానమే ఉత్తమం అంటూ తన ఆస్థాన మీడియాలో ప్రచారం చేయించుకుంటోంది. అయితే పార్లమెంట్ స్థాయి సంఘం ఎక్కడా ప్రభుత్వం నిర్మించిన, నిర్మాణం ప్రారంభించిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని చెప్పనే లేదు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. మసిబూసి మారేడుగాయ చేయడంలో ఆరితేరిన చంద్రబాబు పార్లమెంట్ స్థాయి సంఘంలోని చిన్న అంశాన్ని ఆయుధంగా మలుచుకుని తాను చేసేదే కరెక్ట్ అన్నట్టు వక్రీకరించేస్తున్నారు.పీపీపీ తప్పితే ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు నిర్వహించడం వేస్ట్ అన్నట్టుగా తప్పుడు ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే పనిలోపడ్డారు. ప్లగ్ ప్లే తరహాలో తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పీపీపీనే ఉత్తమ విధానం అంటూ సమర్థించుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నారు. ఐదేళ్ల కిందటే వైఎస్ జగన్ కార్యరూపం ప్రతి 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లు రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని స్థాయి సంఘం ప్రభుత్వాలకు సూచించింది. వైద్య సౌకర్యాలు సరిగా లేని జిల్లాల్లో కళాశాలలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రైవేటులో వైద్య విద్యను అభ్యసించడానికి రూ. కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్న క్రమంలో సామాన్య విద్యార్థుల తెల్లకోటు కల సాకారం చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పింది. పార్లమెంట్ స్థాయీ సంఘం ఇప్పుడు చేసిన సిఫార్సులకు ఐదేళ్ల కిందటే, అంటే 2019లోనే వైఎస్ జగన్ కార్యరూపంలోకి తీసుకొచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానన్న హామీని అమలు చేస్తూ ఏకంగా రూ.8వేల కోట్లకుపైగా నిధులతో 17 కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ ఒక్క ప్రభుత్వ/ప్రైవేట్ వైద్య కళాశాల లేని పల్నాడు, ఏఎస్ఆర్, బాపట్ల, అన్నమయ్య, సత్యసాయి, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగులు వేశారు. మరోవైపు ప్రైవేట్ వైద్య కళాశాలే తప్ప ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని నంద్యాల, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లోనూ కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పడానికి నడుం బిగించారు. వీటితోపాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం, కర్నూల్ జిల్లా ఆదోని, వైఎస్సార్ జిల్లా పులివెందుల, ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో కొత్త కళాశాలల నిర్మాణాలను కరోనా సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించి ప్రారంభించారు. 2023లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, 2024లో పాడేరు వైద్య కళాశాలను ప్రారంభించారు. -
కోటి సంతకాల పత్రాలతో.. నేడు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు
సాక్షి, అమరావతి: పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ.. రూ.లక్ష కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి ‘నీకింత నాకింత’ అంటూ పంచుకు తినేందుకు చంద్రబాబు సర్కారు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పైగా.. ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగ–ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా కదంతొక్కడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడీ ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటాన్ని నిరసిస్తూ 175 నియోజకవర్గాల్లోనూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసిన పత్రాలను ఆయా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయాలకు భారీ ర్యాలీలతో తరలించారు. ఈ నేపథ్యంలో.. సోమవారం జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చాటిచెప్పేలా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది. ర్యాలీల్లో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు.. ఇక ఈ ర్యాలీలను అడ్డుకోవడానికి చంద్రబాబు సర్కారు అప్పుడే పోలీసులను ఉసిగొలిపింది. ర్యాలీల్లో పాల్గొనవద్దని.. పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలకు జిల్లాల్లో పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అయితే, ఈ బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయబోమని.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించే ర్యాలీల్లో కదంతొక్కుతామని వారు తేల్చిచెబుతున్నారు. కోటి సంతకాల పత్రాలతో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి.. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి, బినామీలకు కట్టబెట్టి కమీషన్ల దండుకోవడానికి వేసిన ప్రణాళిక.. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను దూరం చేయడానికి చేస్తున్న కుట్రను మరోసారి ప్రజలకు వైఎస్సార్సీపీ నేతలు వివరించనున్నారు. ఆ తర్వాత కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలను జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడానికి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఈ కోటి సంతకాల పత్రాలను ఈనెల 18న సా. 4 గంటలకు పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్కు నివేదిస్తారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వివరిస్తారు. ప్రభుత్వమే వాటిని పూర్తిచేసి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. వాహనాల ర్యాలీకి అనుమతివ్వండి.. కోటి సంతకాల ప్రతులున్న వాహనాల ర్యాలీలకు అనుమతివ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ర్యాలీల్లో పాల్గొనద్దంటూ జిల్లాల్లో పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా సజావుగా సాగేందుకు అనుమతి అవసరమని.. దీనికోసం అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని అప్పిరెడ్డి తన లేఖలో డీజీపీకి విజ్ఞప్తి చేశారు. -
ఏఎంఆర్ విజిలెన్స్ టీమ్ కలకలం!
చీమకుర్తి: ప్రకాశం జిల్లాలో గ్రానైట్ సీనరేజి వసూళ్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టు అప్పగించిన ప్రైవేటు ఏజెన్సీ ఏఎంఆర్ సంస్థ సిబ్బంది ఏకంగా విజిలెన్స్ అధికారుల అవతారమెత్తారు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులతో ఉన్న వాహనాల్లో వచ్చి పోలీసు అధికారులమంటూ గ్రానైట్ వాహనదారుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. వివరాల్లోకెళ్తే.. గ్రానైట్ వాహనాల నుంచి సక్రమంగా బిల్లులను చెక్ చేస్తున్నారా, లేదా? తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ సంస్థ సిబ్బంది.. విజిలెన్స్ టీమ్ సభ్యులమంటూ మూడు రోజులుగా చీమకుర్తి బైపాస్ రోడ్డుపై గ్రానైట్ వాహనాలను ఆపి ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి నంబర్ ప్లేట్లూ లేకుండా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులతో, చేతిలో లాఠీలతో హడావిడి చేస్తున్నారు. తాము సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ సిబ్బందిమని ఒకసారి, నెల్లూరు మైన్స్ అధికారులమని మరోసారి చెబుతూ లారీలను అడ్డుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేత గుండా శ్రీనివాసరావు వారిని ఫొటోలు తీసి చీమకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వాహనాలను స్టేషన్కు తరలించారు. పోలీసులు ఏఎంఆర్ సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించగా.. సంస్థ అనుమతితోనే వారి సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు ఇలా తనిఖీలు చేశారని యాజమాన్యం సమాధానమిచ్చింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వాహనాలను వదిలిపెట్టారు. -
మల్లన్న సన్నిధిలో మహాదోపిడీ!
సాక్షి, టాస్క్ఫోర్స్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరులు మహాదోపిడీకి పాల్పడుతున్నారు. దేవస్థానంలో ఏ పని చేయాలన్నా కాంట్రాక్టర్ నుంచి 7 శాతం బి–ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. చివరికి దాతలు వచ్చి భక్తులకు ఉపయోగపడే సత్రాలు, భవనాలు నిర్మించి ఇవ్వాలన్నా కమీషన్లు సమర్పించుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. వారు చెప్పినట్లు వినకపోతే ఏ పనీ జరగకుండా అడ్డుకుంటున్నారు. కాంట్రాక్టర్లపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. వసూళ్ల కోసమే మండలానికి ఒక ఇన్చార్జి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలం మండలానికి తన అనుచరుడిని ఇన్చార్జిగా పెట్టారు. ప్రతి శాఖ అధికారులను పిలిపించి ఆయనకు పరిచయం చేశారు. తన అనుచరుడు చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన దేవస్థానంలో ఏ పని చేస్తున్నా కాంట్రాక్టర్ నుంచి 7 శాతం బి–ట్యాక్స్ ముక్కుపిండి వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. క్యూ కాంప్లెక్స్ మరమ్మతులు, మాడవీధుల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, పుష్కరిణి అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి ఎమ్మెల్యే బుడ్డా అనుచరుడు బి–ట్యాక్స్ వసూలు చేసినట్లు సమాచారం. అదేవిధంగా శివరాత్రి, సంక్రాంతి, ఉగాది, దసరా, కార్తీకమాసం, శ్రావణమాసం తదితర ప్రత్యేక పర్వదినాల సమయంలో పెండాల్స్, షామియానాలు, తాత్కాలిక విద్యుత్ దీపాల అలంకరణ, భక్తులకు ఇతర సదుపాయాల కల్పన కోసం పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దేవస్థానం ఆదాయానికి భారీగా గండి కాంట్రాక్టర్లను సిండికేట్గా మార్చి కమీషన్లు వసూలు చేయడంలోనూ ఎమ్మెల్యే బుడ్డా అనుచరుడు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంట్రాక్టర్లను పిలిపించి ‘ఎవరు ఏ టెండర్ వేస్తారనేది ముందుగానే నిర్ణయించుకోండి. కేవలం 1 నుంచి 3 శాతం మాత్రమే నిర్ణీత ధర కన్నా తక్కువకు టెండర్ వేయండి. ఆ తర్వాత ఆఫీసులో నేను చూసుకుంటాను. మా కమీషన్ 7 శాతం ఇవ్వండి. మీరు పోటీ పడి 10 నుంచి 20 శాతానికి తక్కువకు టెండర్ వేసి నష్టపోవద్దు.’ అని హితబోధ చేస్తున్నట్లు తెలిసింది. తద్వారా దేవస్థానం ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. మరోవైపు శ్రీశైలం క్షేత్రం వద్ద భక్తులకు ఉపయోగపడేలా సత్రాలు, ఇతర ప్రైవేట్ భవనాలను నిరి్మంచే దాతలను బెదిరించి కూడా బి–ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీశైలంలో 4స్టార్ హోటల్ నిర్మించతలపెట్టిన హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త నుంచి కూడా బి–ట్యాక్స్ వసూలు చేశారని సమాచారం. బి–ట్యాక్స్ చెల్లించకపోతే దాడులే... ఎమ్మెల్యే బుడ్డా అనుచరులకు బి–ట్యాక్స్ చెల్లించకపోతే కాంట్రాక్టర్లపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. గతంలో దేవస్థానం నిర్వహించిన క్లోక్ రూమ్ టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన సున్నిపెంటకు చెందిన ఓ కాంట్రాక్టర్పై దాడి చేసి పంపించారు. తాజాగా ఈ నెల 11వ తేదీన తలనీలాలు పోగుచేసుకునే కాంట్రాక్టు కోసం రూ.50లక్షలు చొప్పున చెక్కులు తీసుకుని బహిరంగ వేలంలో పాల్గొనేందుకు దేవస్థానం పరిపాలన భవనం వద్దకు వచ్చిన కాంట్రాక్టర్లపైనా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టారు. తమ ఎమ్మెల్యేతో మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్న తర్వాతే రావాలని బెదిరించి పంపారు. ఇలా తరచూ కాంట్రాక్టర్లను బెదిరిస్తూనే ఉన్నారు. బుడ్డా బొమ్మ ఉంటే టిప్పర్ ఆగదుటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీశైలం మండలంలో ఇసుక, కంకర ఎవరూ అమ్మకూడదని ఎమ్మెల్యే బుడ్డా అనుచరుడు హుకుం జారీ చేశారు. ఇసుక, కంకర అమ్మేవారిపై పోలీసు కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురిచేశారు. అనంతరం ఇసుక, కంకర తన వద్దే కొనుగోలు చేసి అమ్ముకోవాలని చెప్పాడు. టన్నుకు అదనంగా రూ.100ఇవ్వాలని ఆదేశించాడు. దీనికి వ్యాపారులు అంగీకరించడంతో ఇసుక, కంకర రవాణా కోసం ఆయన ఏకంగా టిప్పర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ టిప్పర్లు ఎవరూ ఆపకుండా వాటిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఫొటోతో కూడిన స్టిక్కర్లను అతికించాడు. దీంతో ఎక్కడా వాటికి బ్రేకులు పడకుండా 24 గంటలూ తిరుగుతున్నాయి. మరోవైపు సున్నిపెంటలో ఉన్న రెండు మద్యం షాపుల నుంచి కూడా నెలకు రూ.2లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఆటుపోట్లున్నా ముందుకే..!
గత వారం తొలుత అంచనాలకు విరుద్ధంగా దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో కొంత కోలుకున్నాయి. వెరసి ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ముందుకుసాగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుల్లిష్ ట్రెండ్ కొనసాగవచ్చని భావిస్తున్నారు. మరోపక్క దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) విడుదలకానున్నాయి. అక్టోబర్(2025)లో ప్రతిద్రవ్యోల్బణం(మైనస్ 1.21 శాతం) నమోదుకాగా.. నవంబర్ నెలకు సైతం ధరల క్షీణత కనిపించనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో అక్టోబర్తో పోలిస్తే గత నెలలో కాస్తమెరుగ్గా మైనస్ 0.5 నుంచి –0.6 శాతంస్థాయిలో గణాంకాలు వెలువడవచ్చని చెబుతున్నారు. ఈ బాటలో నవంబర్ నెలకు వాణిజ్య సంబంధ గణాంకాలు విడుదలకానున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా పసిడి ధరలు భారీగా పెరగడంతో అక్టోబర్లో వాణిజ్య లోటు(ఎగుమతి, దిగుమతుల మధ్య అంతరం) రికార్డ్ గరిష్టం 41.68 బిలియన్ డాలర్లను తాకింది. నవంబర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్లో దిగుమతుల బిల్లు 76 బిలియన్ డాలర్లను దాటగా.. ఎగుమతులు 34.38 బిలియన్ డాలర్లు మాత్రమే. కరెన్సీ మారకంపై కన్ను గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఇంట్రాడేలో చరిత్రాత్మక కనిష్టం 90.56కు పడిపోయింది. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 98.4కు బలహీనపడగా.. 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ తొలుత నీరసించినప్పటికీ 4.18 శాతానికి కోలుకున్నాయి. ఫెడ్, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతలు కరెన్సీ, బాండ్లపై ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కాగా.. యూఎస్ విధించిన అదనపు టారిఫ్లకుతోడు మెక్సికో సైతం భారత్ దిగుమతులపై సుంకాలను పెంచడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్తో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు, మెక్సికో వాణిజ్య అధికారులతో భారత అధికారుల భేటీ టారిఫ్ల సమస్యలకు చెక్ పెట్టే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ గణాంకాలు యూఎస్, యూరోజోన్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. గత నెలకు యూఎస్ వినియోగ ధరలు, రిటైల్ అమ్మకాలు, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. వెరసి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతర్గత పటిష్టత, ద్రవ్యోల్బణ ఔట్లుక్ తదితర అంశాలు ఫెడ్ మానిటరీ పాలసీపై ప్రభావం చూపనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. ఈ బాటలో విడుదలకానున్న జపనీస్ ద్రవ్యోల్బణం, వాణిజ్య గణాంకాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ పరపతి సమీక్షను ప్రభావితం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లలో హెచ్చుతగ్గులకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చిన్న షేర్లు భళా అంచనాలకు అనుగుణంగా గడిచిన వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో 0.25 శాతం కోత పెట్టడంతో చివర్లో మార్కెట్లు రికవరీ అయ్యాయి. వెరసి ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,000 పాయింట్లకు ఎగువన, బీఎస్ఈ సెన్సెక్స్ 85,200స్థాయికి పైన నిలిచాయి. డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరడం, యూఎస్కు తోడు కొత్తగా దేశీ ఎగుమతులపై మెక్సికో సుంకాల పెంపు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం నికరంగా సెన్సెక్స్ 445 పాయింట్లు(0.51 శాతం) క్షీణించి 85,268 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 140 పాయింట్ల(0.53 శాతం) వెనకడుగుతో 26,047 వద్ద ముగిసింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం, స్మాల్ క్యాప్ 0.65 శాతం చొప్పున పుంజుకోవడం గమనార్హం! సాంకేతికంగా ముందుకే.. చార్టుల ప్రకారం గత వారం అంచనాలకు భిన్నంగా దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే రెండో సపోర్ట్ స్థాయిల వద్ద నుంచి కోలుకున్నాయి. వెరసి సాంకేతికంగా కీలకమైన 85,000 పాయింట్లు(సెన్సెక్స్), 26,000 పాయింట్ల(నిఫ్టీ) కీలకస్థాయిలకు ఎగువన ముగిశాయి. ఈ వారం సైతం ఆటుపోట్ల మధ్య బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → నిఫ్టీకి తొలుత 26,000 పాయింట్లు సపోర్ట్గా నిలవవచ్చు. తదుపరి 25,800 వద్ద తిరిగి మద్దతు లభించే వీలుంది. 26,000 పాయింట్ల స్థాయికి ఎగువన నిలదొక్కుకుంటే 26,350 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఆపై సమీప భవిష్యత్లో 26,900–27,000 వరకూ పుంజుకునే చాన్స్లున్నాయ్. → సెన్సెక్స్ జోరందుకుంటే తొలుత 85,700–85,800 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. ఈ స్థాయిలను అధిగమిస్తే 88,000–88,500 వరకూ బలపడే వీలున్నట్లు అంచనా. ఒకవేళ అమ్మకాలతో బలహీనపడితే 85,000 నుంచి 84,000 పాయింట్లవరకూ క్షీణించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మెదడు నష్టంపై కచ్చితమైన ‘మార్కర్’
సాక్షి, హైదరాబాద్: కార్డియాక్ అరెస్టు (గుండె స్తంభించడం) నుంచి బయటపడిన రోగుల్లో మెదడు పనితీరుకు సంబంధించిన నష్టాన్ని కచ్చితత్వంతో అంచనా వేయడానికి కొత్త తరహా రక్త పరీక్ష న్యూరోఫిలమెంట్ లైట్ (ఎన్ఎఫ్ఎల్)ఉపయోగపడనుందని అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. మల్టిపుల్ స్క్లెరోసిస్ (రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధి) రోగుల్లో ఇప్పటికే వినియోగిస్తున్న ఎన్ఎఫ్ఎల్ బయో మార్కర్ కార్డియాక్ అరెస్టు రోగుల విషయంలోనూ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్వీడన్లోని ఓ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నేతృత్వంలో యూరప్కు చెందిన 24 ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 819 మంది రోగులపై ఈ పరిశోధన జరిగింది. ‘ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ జర్నల్లో డిసెంబర్ 11న ప్రచురితమైన ఈ అధ్యయనంలో, కార్డియాక్ అరెస్టు తర్వాత ఆరు నెలలకు రోగుల పరిస్థితిని అంచనా వేయడంలో ఎన్ఎఫ్ఎల్ బయో మార్కర్ 92 శాతం కచ్చితత్వాన్ని చూపినట్లు వెల్లడైంది. ముఖ్యంగా కార్డియాక్ అరెస్టు జరిగిన 24 గంటల్లో రోగి మెదడుకు వాటిల్లిన నష్టం స్థాయిని అంచనా వేసే అవకాశం ఈ కొత్త పరీక్షతో లభిస్తుందని పరిశోధకులు తెలిపారు. 24 గంటల్లోనే ఫలితాలుఎన్ఎఫ్ఎల్ బయో మార్కర్ ప్రత్యేకత ఏమిటంటే, కార్డియాక్ అరెస్టు జరిగిన తర్వాత జరిపే ఈ పరీక్ష ఫలితాలు 24 గంటల్లోనే అందుబాటులోకి వస్తాయి. దీంతో ఐసీయూ వైద్యులు తొలిదశలోనే రోగి పరి స్థితిపై స్పష్టమైనఅవగాహన పొందగ లుగుతారని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న న్యూరాన్– స్పెసి ఫిక్ ఎనోలేస్ (ఎన్ఎస్ఈ), ఎస్–100 ప్రోటీ న్ వంటి బయో మార్కర్లకు కొన్ని పరిమితు లు ఉన్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ నిక్లాస్ నిల్సన్ తెలిపారు. మొత్తంగా నాలుగు రకాల బయో మార్కర్లతో పోల్చినప్పుడు ఎన్ఎఫ్ఎల్ మిగతా మూడింటికంటే మెరుగైన పనితీ రును చూపిందని అధ్య యనం రచయిత మారియోన్ మోసెబీ నాపే వెల్లడించారు.తీవ్రత గుర్తింపులో స్పష్టతఎన్ఎఫ్ఎల్ బయో మార్కర్ మెదడుకు జరిగిన నష్టం తీవ్రతను స్పష్టంగా గుర్తిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. కాగా ‘గ్లియల్ ఫైబ్రిల్లరీ ఆసిడిక్ ప్రోటీన్ –జీఎఫ్ఏపీ’ అనే మరో బయో మార్కర్ కూడా ప్రస్తుతం వాడుతున్న పరీక్షల కంటే మెరుగైన ఫలితాలు చూపుతున్నట్టుగా తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ అధ్యయనంలో రోగులను ఆసుపత్రిలో చేర్చిన సమయంలో, 24 గంటలు తర్వాత, 48 గంటలు, అలాగే 72 గంటల తర్వాత రక్త నమూనాలు సేకరించి విశ్లేషించారు. ఈ పరీక్ష ద్వారా రోగికి చికిత్స కొనసాగించాలా లేదా పల్లియేటివ్ కేర్ (సంరక్షణ విభాగం)కు మార్చాలా అనే క్లిష్ట నిర్ణయాల్లో వైద్యులకు కీలక మార్గనిర్దేశం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్టు రోగుల సంరక్షణలో ఇది గణనీయమైన మార్పు తీసుకువస్తుందని అంటున్నారు. -
కో–లివింగ్.. ఇన్వెస్ట్మెంటే!
ఒకప్పుడు సింగిల్గా అద్దెకుండే వారికి సింగిల్ రూమ్లు దొరికేవి. కానీ ఇప్పుడు ఆ జమానా పోయింది. అయితే సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలి. ఇపుడు అవీ దొరకటం లేదు. ఇక డబుల్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకుంటే అద్దెలు తడిసి మోపెడవుతాయి. హైదరాబాద్ వంటి నగరాల్లోనైతే కో–లివింగ్ లేదా షేర్డ్ రెంటల్ ఇళ్లు బాగా దొరుకుతాయి. అంటే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ను మూడు బెడ్రూమ్లుగా విభజించి... కిచెన్, హాల్ వంటివి కామన్గా వినియోగించుకోవటమన్న మాట. ఆ సింగిల్ బెడ్రూమ్లో ఒక్కరే గానీ, ఇద్దరు గానీ ఉండొచ్చు. దాన్ని బట్టే అద్దె ఉంటుంది. అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన కో–లివింగ్ రెంటల్ హౌసింగ్ విధానం ఇపుడు ద్వితీయ శ్రేణి (టైర్–2) నగరాల్లోనూ పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఈ సంస్కృతి ఇపుడిపుడే ప్రాచుర్యం అందుకుంటోంది. అటు ప్రొఫెషనల్స్తో పాటు ఇటు పెట్టుబడులపై అధిక రాబడులనిచ్చే కొత్త మార్గాలను అన్వేíÙస్తున్న ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి అవకాశమేనని చెప్పాలి. నాస్కామ్ తాజా నివేదిక ప్రకారం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాలు కొత్త టెక్నాలజీ, ఎడ్యుకేషన్ హబ్లుగా ఎదుగుతున్నాయి. దీనితో ఆయా ప్రాంతాలకు యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు బాగా వస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటూనే, తక్కువ అద్దెకు లభించే వసతి సదుపాయాల కోసం వారు వెతుక్కుంటున్నారు. ఫలితంగా... అలాంటి సౌకర్యాలను అందిస్తున్న కో–లివింగ్ ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. సింగిల్ బెడ్రూమ్ అద్దెకన్నా సుమారు 35 శాతం చౌకగా, సరళతరమైన నిబంధనలతో లీజుకు తీసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు వై–ఫై, క్లీనింగ్, కమ్యూనిటీ కార్యక్రమాల్లాంటి హంగులెన్నో ఉంటుండటంతో జెన్ జెడ్ వీటివైపు మొగ్గు చూపుతోంది. నిర్వహణ బాదరబందీ లేకుండా... ఇలాంటి ప్రాపర్టీలను కో–లివింగ్ తరహాలో అద్దెకు ఇవ్వాలనుకునే యజమానులకు నిర్వహణ బాధ్యతలను గానీ, కిరాయిదార్లతో డీల్ చేయటం వంటి బాధ్యతలు గానీ లేకుండా వాటన్నిటినీ తామే చూసుకునే నిర్వహణ ఏజెన్సీలు చాలా వస్తున్నాయి. నెస్ట్ అవే, స్టాంజా లివింగ్, కోలివ్, యువర్స్పేస్ లాంటి కంపెనీలు రకరకాల విధానాల్లో నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. కిరాయిదారుకు అద్దెకివ్వడం నుంచి గదుల మెయింటెనెన్స్, ఫరి్నíÙంగ్, అద్దెల వసూళ్లు మొదలైన పనులన్నీ ఓనర్ల ప్రమేయం లేకుండా అవే చూసుకుంటాయి. ఫలితంగా నిర్వహణ బాదరబందీ లేకుండా యజమానులకు స్థిరంగా నెలకి ఇంత చొప్పున అద్దె లభిస్తుంది. సాధారణ ఫ్లాటు కాస్త అధిక రాబడి అందించే సాధనంగా మారుతుంది. లాభసాటి ఇన్వెస్ట్మెంట్ కూడా... ఓనరు ఏమాత్రం కలుగజేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వసతి సదుపాయాలను మేనేజ్ చేసే సంస్థలిపుడు చాలా వస్తున్నాయి. వాటి కారణంగా ఇలాంటి ప్రాపర్టీలు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఉదాహరణకు వైజాగ్లో సాధారణ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు రూ.18,000 ఉందనుకుంటే, ఆ ఇంటినే కో–లివింగ్ కింద (మూడు వేర్వేరు గదులుగా) మారిస్తే రూ. 24,000– రూ. 30,000 వరకు వస్తోంది. అంటే దాదాపు 35–40 శాతం మేర అధికంగా రాబడి వచి్చనట్లే. సంప్రదాయ రెంటల్ విధానమైతే పెట్టుబడిపై వార్షికంగా సుమారు 2 నుంచి 3 శాతం మేర నికరంగా రాబడి లభిస్తుంటే... ఈ కో–లివింగ్ విధానంలో 5 నుంచి 7 శాతం రాబడి వస్తోంది. అదే ఎడ్యుకేషన్, టెక్నాలజీ సెంటర్లకు దగ్గర్లో ఉన్నవైతే కొన్ని సందర్భాల్లో 8 శాతం వరకు రాబడి ఉంటోంది. అంటే బ్యాంకు వడ్డీతో సమానంగా వస్తున్నట్లే. పైపెచ్చు దీర్ఘకాలంలో విలువ పెరగటం లాంటి రియల్ ఎస్టేట్ ఆస్తులకు ఉండే పెరుగుదల ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. ఖాళీగా ఉండేది తక్కువే.. సాధారణంగా విద్యార్థులు, జూనియర్ ఐటీ ఉద్యోగులు కొంత సమయం పాటు వచ్చి వెళ్లిపోతుంటారు. ఫలితంగా కో–లివింగ్ ప్రాపరీ్టలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. వైజాగ్లోని మధురవాడ, విజయవాడలోని బెంజ్ సర్కిల్లాంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా 90– 95 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంటున్నట్లు కన్సలి్టంగ్ సంస్థల చెబుతున్నాయి.రిస్క్ లు తెలుసుకోవాలి.. షరా మామూలుగా ఏ పెట్టుబడి సాధనంలోనైనా ఎంతో కొంత రిస్క్ లు ఉంటాయి. కో–లివింగ్లోనూ అలాంటివి కొన్ని ఉంటాయి. కిరాయిదారులు తరచుగా మారుతుండటం వల్ల ప్రాపర్టీ పాతబడిపోతుంటుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతుంటాయి. వివాదాలు తలెత్తవచ్చు. ప్రమాదాలు, డ్యామేజ్లకు ఆస్కారం ఉండటం వల్ల ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇవి కాకుండా జోనింగ్ పరిమితుల్లాంటి రెగ్యులేటరీ నిబంధనల అవరోధాలు, పరస్పరం సంబంధంలేని కిరాయిదార్లు, స్వల్పకాలిక రెంటల్ నిబంధనలపరంగా ఏవైనా వివాదాలు తలెత్తడంలాంటి సమస్యలు రావచ్చు. అయితే, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిస్క్ లతో పోలిస్తే ప్రయోజనాలే ఎక్కువన్నది నిపుణుల మాట. -
బావ చూపిన బాటలో..
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగిగా మారిన బావమరిదిని డ్రగ్ పెడ్లర్గా మార్చాడో బావ. ఏపీలోని ప్రకాశం జిల్లా కేంద్రంగా ఎండీఎంఏ మాదకద్రవ్యాల దందా ప్రారంభించిన ఇతగాడు హైదరాబాద్కు చెందిన ఇద్దరిని సబ్– పెడ్లర్స్గా మార్చుకున్నాడు. వీరితో కలిసి కొన్నాళ్లుగా వ్యవహారాలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ముగ్గురికీ చెక్ చెప్పారు. మాసబ్ట్యాంక్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఆపరేషన్లో వీరిని అరెస్టు చేయడంతోపాటు 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదివారం వెల్లడించారు. ఆ రెండింటిలో సక్సెస్ కాకపోవడంతో...ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు చెందిన ఉప్పుటూరి కార్తీక్ ఆర్థిక ఇబ్బందులతో చదువు పూర్తి చేయలేకపోయాడు. సొంతూరిలో పాల కేంద్రం, గ్రానైట్స్ వ్యాపారం చేసినా సఫలీకృతం కాలేదు. దీంతో దురలవాట్లకు బానిసగా మారాడు. రూ.2 కోట్ల వరకు అప్పులు చేశాడు. నెల్లూరు నుంచి వచ్చి నేరేడ్మెట్లో స్థిరపడిన సీహెచ్ బాలాజీ ఇతడికి బావ అవుతాడు. 2022లో తండ్రి చనిపోవడంతో బాలాజీ డెయిరీ వ్యాపారాన్ని నిర్వహిస్తూ నెలకు రూ.22 వేల వరకు సంపాదిస్తున్నాడు. సిగరెట్తో మొదలుపెట్టి ఎండీఎంఏ వినియోగం వరకు వెళ్లిన ఇతగాడు ఆ డ్రగ్కు ఉన్న డిమాండ్ను కార్తీక్కు చెప్పాడు. దీంతో కార్తీక్ కూడా ఈ దందా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తొలినాళ్లలో బెంగళూరు వరకు వెళ్లి నైజీరియన్ల నుంచి ఈ డ్రగ్ ఖరీదు చేసి తెచ్చేవాడు. కొన్నాళ్లుగా నైజీరియన్లు నేరుగా ఇవ్వకుండా తమ ఏజెంట్ల ద్వారా పంపిస్తుండటంతో బెంగళూరుతోపాటు ఆదిలాబాద్కూ వెళ్లి తేవడం మొదలెట్టాడు. దీన్ని ఒక గ్రాము చొప్పున రీప్యాక్ చేసి ఎక్కువ ధరకు అమ్మేవాడు. ఇతడి నుంచి బాలాజీ కూడా క్రమం తప్పకుండా డ్రగ్ ఖరీదు చేసేవాడు. ఈ దందాలో దిగిన కార్తీక్ తన పేరును అలెక్స్గా మార్చుకున్నాడు. ఓ దశలో బాలాజీ ఇతడికి సబ్–పెడ్లర్గా మారిపోయాడు. బీటెక్ చదువుతున్న జీడిమెట్లకు చెందిన టి.దీపక్ పార్ట్టైమ్గా టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు కూడా ఎండీఎంఏ వినియోగం నుంచి విక్రేతగా మారాడు. డెడ్ డ్రాప్ విధానంలో సరఫరా...ఈ ముగ్గురూ తమ ఉనికి బయటపడకుండా ఎండీఎంఏను విక్రయిస్తున్నారు. ఆన్లైన్, సోషల్మీడియా కస్టమర్లతో రేటు ఖరారు చేసుకుంటారు. ఆపై వారికి క్యూఆర్ కోడ్ పంపి డబ్బు బదిలీ చేయించుకుంటారు. ఆపై ఏదైనా ఓ ప్రాంతంలో డ్రగ్ పెట్టి దాని ఫొటోతోపాటు లొకేషన్ను వినియోగదారుడికి షేర్ చేస్తారు. మిగిలిన ఇద్దరూ అలెక్స్ నుంచే సరుకు తీసుకుని పరిచయస్తులైన కస్టమర్లకు అధిక ధరలకు అమ్ముతున్నారు. వీళ్లు ఒక్కో గ్రాము రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేలకు కొని... రూ.ఎనిమిది వేల నుంచి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. వీరి దందాపై సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ ఎస్.బాలస్వామి నేతృత్వంలో ఎస్సై బి.మనోజ్కుమార్తో కూడిన బృందం మాసబ్ట్యాంక్లో వలపన్నింది. ఎండీఎంఏ సరఫరా చేయడానికి వచ్చిన అలెక్స్తోపాటు తీసుకోవడానికి వచ్చిన మిగిలిన ఇద్దరినీ పట్టుకుంది. -
చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి...
మహబూబాబాద్ రూరల్: వారిది ప్రేమ వివాహం.. అయినా కొంతకట్నం ఇచ్చారు. పెళ్లయిన ఏడాదినుంచే అదనపు కట్నం తేవాలంటూ భర్తతోపాటు అత్తామామ, మరిది వేధింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమెను దారుణంగా కొట్టి చంపి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు యత్నించారు. ఈ దారుణం మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, మృతురాలి తల్లి కౌసల్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ అర్జున్, కౌసల్య దంపతుల కూతురు స్వప్న (26) అదే గ్రామానికి చెందిన బానోత్ కిషన్, బుజ్జి దంపతుల కుమారుడు రామన్న ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో 15 ఏళ్ల క్రితం రూ.3 లక్షల కట్నం, 8 తులాల బంగారం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన సంవత్సరం నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తుండగా పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, అదనపు కట్నం కింద ఎకరం భూమి కూడా ఇచ్చారు. అయినప్పటికీ అత్తింటివారి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలోనే ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు జని్మంచారు. ఇటీవల మళ్లీ అదనపు కట్నం కావాలంటూ స్వప్నపై వేధింపులు పెరిగాయి. గత మూడు రోజులుగా అత్తామామలు కిషన్, బుజ్జి, భర్త రామన్న, మరిది నవీన్ స్వప్నను చిత్రహింసలుపెట్టి, కిరాతకంగా కొట్టారు. శనివారం రాత్రి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోతుందని భయపడిన వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్వప్నను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని చెప్పారు. దీంతో కేసు తమపైకి వస్తుందని భావించిన అత్తామామలు, భర్త, మరిది మళ్లీ స్వప్న మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఆమె నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు నమ్మించాలని చూశారు. ఈ విషయం మృతురాలి గ్రామస్తులు, తల్లిదండ్రులకు తెలియగానే వారంతా రామన్న ఇంటికి చేరుకుని ఆగ్రహంతో అత్తింట్లో ఫరి్నచర్, టీవీ, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. అప్పటికే మృతురాలి అత్తామామలు, భర్త, మరిది పరారీలో ఉన్నారు. రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. శాఖలే మారుస్తారా? లేదంటే.. మంత్రులనే మారుస్తారా? అనే విషయంలో మాత్రం తనకు స్పష్టత లేదన్నారు. అయితే, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,« అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిందనని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్, సురేఖను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, వాళ్లిద్దరూ కాంగ్రెస్ నేతలే అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్ వచ్చారు. ఈసందర్భంగా ఆయన తెంగాణభవన్లో విలేకరులతో చిట్చాట్ చేశారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే నన్ను మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. స్వయంగా కేసీ వేణుగోపాల్ ప్రతిపాదన పెట్టారు. కానీ, నాకు మంత్రి పదవిపై మక్కువ లేదని చెప్పాను’అని అన్నారు. మహేశ్గౌడ్ ఇంకా ఏమన్నారంటే.. వేదికపైకి మంత్రులను పిలిస్తే బాగుండేది.. గ్లోబల్ సమ్మిట్లో రాజకీయ ప్రాధాన్యత ఉండొద్దనే ఉద్దేశంతోనే మంత్రులను స్టేజీ మీదకు ఆహ్వానించలేదు. అయితే, మంత్రులను కూడా వేదికపైకి పిలిస్తే బాగుండేది. కొందరు ఐఏఎస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ గ్లోబల్ సమ్మిట్కు కూడా వస్తే బాగుండేది. గ్లోబల్ సమ్మిట్ ప్రతిఏటా పెడితే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నాం. బీసీ ప్రైవేట్ బిల్లు పార్లమెంటులో పెడితే బాగుంటుందని రాహుల్ గాం«దీకి చెప్పాం. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ పదవులనూ తొలివిడతలోనే భర్తీ చేయాలి. కానీ, అక్కడ వచి్చన దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోలలేదు. అందుకే ఆ రెండింటిని పెండింగ్లో ఉంచాం. జనం కవిత మాటలు నమ్ముతున్నారు... బీఆర్ఎస్ కథ ముగిసిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని కవిత దగ్గర నుంచి చూసింది కాబట్టే.. ఆమె మాటలను ప్రజలు అంగీకరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేకుండా మనుగడ సాధించడం అంత సులభం కాదు. కేసీఆర్ ఇమేజ్ కేటీఆర్కు రాలేదు. హరీశ్రావు దెబ్బకొట్టడం ఖాయం. డబ్బులతో కేటీఆర్ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరుగుతుందో కేసీఆర్ ముందే ఊహించారు.. అందుకే ప్రచారానికి రాలేదు’ బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఏమాత్రం లేదు. బీజేపీ అధిష్టానానికీ ఆ విషయం తెలుసు. బీజేపీకి 60–70 స్థానాల్లో కనీసం కేడరే లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తు న్నారు. కానీ మేమే కొన్ని విలువలు పాటిస్తున్నాం. కాబట్టే.. అవకాశం ఇవ్వడం లేదు. మళ్లీ ప్రభుత్వం రావడం అనేది మాకు నల్లేరు మీద నడకే. ఇన్వెస్లర్ల చూపు హైదరాబాద్ వైపే... రేవంత్ రెడ్డి విజనరీ ఉన్న లీడర్. ఫోర్త్ సిటీ పూర్తయితే దేశంలోని మరే నగరం హైదరాబాద్తో తట్టుకోలేదు. కంపెనీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పాలసీలు రూపొందించాం. టెస్లాను హైదరాబాద్కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో సహకరించాలని రాహుల్ గాం«దీని కోరాం. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇన్వెస్టర్లు మాత్రం హైదరాబాద్ వైపే చూస్తున్నారు. హైదరాబాద్లోని ఏ పెద్ద వెంచర్లోకి వెళ్లినా పుణే, చెన్నై, ముంబై, బెంగళూరుకు చెందిన వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువశాతం వెంచర్లలో 25 నుంచి 30 శాతం మహారాష్ట్ర వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ ఇండియాలోనే నంబర్ వన్ నగరంగా మారబోతోంది. -
జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీపై పోరుబాట పట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం, నదీ జలాల కేటాయింపు వంటి అంశాలపైనా ఉద్యమించాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ స్వరూపం ఏ తరహాలో ఉండాలనే అంశంపై చర్చించేందుకు విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. బీఆర్ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈ సమావేశంలో పాల్గొంటుంది. నదీ జలాల పరిరక్షణలో విఫలం కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్ర ప్రదేశ్ కొల్లగొడుతున్నా అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫ లమైందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభు త్వం 90 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 45 టీఎంసీలు చాలంటూ కేంద్రం ముందు దేబిరిస్తోంది. 45 టీఎంసీలకు అంగీకరిస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రం ముందు మోకరిల్లారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ ఎలా పూర్తవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేలా ఉంది’అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ‘కృష్ణా, గోదావరి జలాలతోపాటు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదు. రైతాంగ ప్రయోజనాలకు బీజేపీ గండికొడుతోంది. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయం, కావేరీ అనుసంధానం పేరిట ఆంధ్ర జలదోపిడీకి సహకరిస్తున్న విధానంపై ప్రజా ఉద్యమం తప్పదు’అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి.ప్రజా ఉద్యమంపై లోతైన చర్చ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై ఈ నెల 19న జరిగే విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఓట్లే కాదు.. అన్నీ లాగేసుకుంటారు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ (ఓట్ల దొంగతనం) అనే అంశం ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్యే కాదు.. ఇది మొత్తం దేశం సమస్య..’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. లోక్సభలో ఓట్ చోరీపై జరుగుతున్న యుద్ధంలో ప్రతిపక్ష నేత రాహుల్గాందీకి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్గాంధీ ఒక సిపాయిలా మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణ నుంచి తాము వెన్నంటి ఉంటామని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’పేరుతో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాందీ, ఎంపీ ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ యుద్ధంలో రాహుల్ను గెలిపించాలి ‘దేశ ప్రజల రాజ్యాంగ హక్కు కోసం చేస్తున్న యుద్ధంలో రాహుల్ను దేశ ప్రజలు గెలిపించాలి. లేదంటే ఓటు హక్కును లాక్కుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ముందుగా ఓటరు లిస్టు నుంచి పేరు తొలగిస్తారు. ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్కార్డు, భూమి, ఆస్తులు కూడా లాక్కుంటారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో చట్ట సభలో విస్తృత్తంగా చర్చ జరిగింది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలని మహాత్మాగాం«దీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరారు. కానీ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్ గోల్వాల్కర్ తదితరులు ఈ వర్గాలకు ఓటు హక్కును నిరాకరించారు. కానీ మహాత్మాగాందీ, అంబేడ్కర్ పేదలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వారికి అవకాశం ఇచ్చారు..’అని సీఎం చెప్పారు. రాహుల్ ముందే హెచ్చరించారు.. ‘ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆలోచనా విధానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ, అమిత్షా గత పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలంటూ ఓటర్లను అడిగారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని రాహుల్గాంధీ అప్పుడు చెప్పారు. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 240 సీట్లతోనే సరిపెట్టారు. కాబట్టే రాజ్యాంగం రక్షించబడింది. ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయంటే వారికి 400 సీట్లు రాలేదు కాబట్టే. వారు ఎస్ఐఆర్ పేరిట ఓట్ చోరీ చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారు. గతంలో దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదలకు జరుగుతున్న అన్యాయానికి వ్య తిరేకంగా మహాత్మాగాందీ, అంబేడ్కర్ నిలబడ్డారు. ఇప్పుడు రాహుల్, ఖర్గే ఈ వర్గాలకు మద్దతుగా, మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా.. ఆర్ఎస్ఎస్, గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో మీ ముందు ఉన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్గాందీకి మద్దతుగా నిలవాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీపీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు కూడాధర్నాలో పాల్గొన్నారు. -
'రియల్'.. సీన్ రివర్స్!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి విజయవాడ, నెట్వర్క్: అభివృద్ధికి చిరునామా..! మంచి ప్రభుత్వం..! విజనరీ పాలన..! సంపద సృష్టిస్తానంటూ అంటూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవస్థలను దిగజారుస్తూ, అన్ని రంగాలను కుప్పకూలుస్తున్నారు. సంక్షేమం ఊసే పట్టించుకోకుండా.. అభివృద్ధి జాడే లేకుండా చేస్తున్నారు. ఒకవైపు పారిశ్రామిక విధానం ముసుగులో తమకు నచ్చినవారికి ఖరీదైన భూములను పప్పు బెల్లాల మాదిరిగా 99 పైసలకే కేటాయిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నీరుగార్చడంతో అవసరాలకు అమ్ముకోలేక రైతులు, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో సైతం ఇదే దుస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా విజయవాడ, బందరులో జిల్లా కేంద్రాలు, పోర్టు, కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా భూముల ధరలు బాగా పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. నెలకు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో పరిస్థితి తారుమారైంది. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో స్థిరాస్తి వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రచారం మినహా అభివృద్ధి జాడ లేకపోవడంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రివర్స్లో ప్రయాణిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మందగమనం కనిపిస్తోంది. రాష్ట్రం దూసుకుపోతోందంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. చంద్రబాబు సర్కారు మాటలు నిజమైతే స్థిరాస్తి మార్కెట్ కళకళలాడాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం పెరగాలి. కానీ మార్కెట్ బేల చూపులు చూస్తోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతంలో ఎన్నడూ లేనివిధంగా పడిపోవడమే ఇందుకు ఉదాహరణ. 2023–24లో రూ.12 వేల కోట్లుగా ఉన్న రిజి్రస్టేషన్ల టార్గెట్ తాజాగా 2025–26 ఏడాదిలో రూ.10,169 కోట్లకు తగ్గిపోవడం గమనార్హం. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు టార్గెట్ను పెంచుకుంటూ వెళ్లి అందుకనుగుణంగా ఆదాయాన్ని సముపార్జిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రివర్స్లో టార్గెట్ను తగ్గించుకుంటూ వెళుతోంది. తద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, స్థిరాస్తుల కొనుగోళ్లు జరగడం లేదని ప్రభుత్వమే అధికారికంగా నిర్థారించేసింది. 2023–24లో గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజి్రస్టేషన్ జరగగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో అక్టోబర్ నాటికి 13.92 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం దిగజారిన పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. కాగా దివంగత వైఎస్సార్ హయాంలో గొల్లపూడి నుంచి రామవరప్పాడు రింగ్ వరకు ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణంతోపాటు బుడమేరుపై ఫ్లైఓవర్లతో విజయవాడ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులను 2014–19 మధ్య టీడీపీ హయాంలో పట్టించుకోలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ పనులను 96 శాతం మేర పూర్తి చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరకుపైగా అవుతున్నా మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయడంలో విఫలమైంది. రిజిస్ట్రేషన్ల టార్గెట్లు రివర్స్ చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ పాలన, విచ్చలవిడి అవినీతితోపాటు సంక్షేమ పథకాలు అందకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఊహించని విధంగా పడిపోయాయి. కనీసం వసూళ్ల లక్ష్యాన్ని కూడా సరిగా నిర్దేశించుకోలేని స్థాయికి రిజిస్ట్రేషన్ల ఆదాయం క్షీణించింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం నిర్దేశించిన లక్ష్యం కంటే కూడా ప్రస్తుతం తక్కువ టార్గెట్ పెట్టుకోవడం ద్వారా స్థిరాస్తి క్రయవిక్రయాలపై చంద్రబాబు సర్కారు ఆశలు వదిలేసుకుంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని రూ.9,546 కోట్లు రాబట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. 2024–25లో రూ.11,997 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుని రూ.8,843 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంతకుముందు సంవత్సరం వచ్చి న ఆదాయాన్ని కూడా చంద్రబాబు సర్కారు తొలి ఏడాది సాధించలేకపోయింది. ఇక 2025–26లో లక్ష్యాన్ని రూ.10,169 కోట్లుగా పెట్టుకుని అక్టోబర్ నాటికి రిజి్రస్టేషన్ల ద్వారా రూ.7 వేల కోట్లు వసూలు చేయగలిగింది. వరుసగా రెండేళ్లపాటు లక్ష్యాన్ని తగ్గించుకోవడాన్ని బట్టి స్థిరాస్థి రంగంలో ఏమాత్రం వృద్ధి లేదని ఈ ప్రభుత్వమే బయటపెట్టింది. దీంతో తన హయాంలో పడిపోయిన ఆదాయాలనే కొలమానంగా తీసుకుని ప్రస్తుత ఆదాయాలను పోల్చుతుండడం విశేషం. ఆదాయాన్ని 2023–24 సంవత్సరంతో పోల్చకపోవడం, తక్కువ లక్ష్యాన్ని పెట్టుకుని దాంతో పోల్చడం ద్వారా ప్రజలను మభ్యపుచ్చేందుకు యత్నిస్తోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రబాబు సర్కారు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను సగటున 50 శాతానికిపైగా పెంచింది. దీంతో ప్రజలపై భారం పడి రిజిస్ట్రేషన్ల సొమ్ము ఎక్కువగా కట్టాల్సి వస్తోంది. చార్జీలు పెంచడం ద్వారా ప్రజలను బాది ఆదాయాన్ని పెంచుకున్నా రిజి్రస్టేషన్లు మాత్రం అమాంతం తగ్గిపోవడం గమనార్హం. లేదంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇంకా భారీగా పడిపోయేదని స్పష్టంగా తెలుస్తోంది. రాజధానిలో ‘రియల్’ షాక్..! రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రాజధానికి బడా కంపెనీలు, కార్యాలయాలు వచ్చేస్తున్నాయని చంద్రబాబు సర్కారు ప్రచారం చేస్తున్నా రియల్ వ్యాపారం మాత్రం పెరగడంలేదు. రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్త వెంచర్లు వేయడం తగ్గిపోయింది. ఇప్పటికే వేసిన వాటిలో స్థలాలు అమ్ముడు కావడంలేదు. అపార్టుమెంట్లలో ప్లాట్లు పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థలాలు, ప్లాట్ల కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనలో మునిగిపోయారు. స్వయంగా చంద్రబాబు రాజధానిలోని వెలగపూడిలో ఇల్లు నిర్మించుకుంటున్నట్లు చెబుతున్నా అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. రెండు, మూడు విడతల భూసమీకరణ ద్వారా మరింత భూమిని తీసుకుంటామని ప్రకటించడం, పూలింగ్కు భూములు ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరిస్తుండటంతో రాజధానిలో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. చంద్రబాబు సర్కారు భూదాహంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. పట్ణణాలు, నగరాల్లోనూ డీలాచంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాయలసీమను పట్టించుకోకపోవడం, ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకపోవడంతో రియల్ రంగం కుదేలైంది. వైఎస్ జగన్ హయాంలో సీమలో పరుగులు తీసిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇప్పుడు కుదేలయ్యాయి. ప్రధానంగా తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో భూముల అమ్మకాలు తగ్గిపోయాయి. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల దందాలు, భూములపై పెత్తనం చేస్తుండడంతో కొనాలనుకున్న కొద్దిమంది కూడా జంకుతున్నారు. క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాల్లోనూ రియల్ వ్యాపారం మందకొడిగా ఉంది. నగరాల్లోనూ అమ్మకాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ–మచిలీపట్నం రహదారికి ఇరువైపులా గతంలో కళకళలాడిన వ్యాపారం ఇప్పుడు పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం, ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, కార్పొరేట్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని చంద్రబాబు ప్రభుత్వం బడాయి పోతున్నా భూముల కొనుగోళ్లు మాత్రం లేకపోవడం గమనార్హం. 2019–24 మధ్య విశాఖలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లిన రియల్ వ్యాపారం ఏడాదిన్నరగా దిగజారిపోయింది. పెద్ద ప్రాజెక్టులు చాలా వరకూ ఆగిపోయాయి. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి. నిర్మాణ రంగం విలవిలఒకపక్క రియల్ రంగం తిరోగమనంలో ఉండడంతో మరోపక్క దానిపై ఆధారపడిన నిర్మాణ రంగం కూడా కుదేలైంది. భవన నిర్మాణ కారి్మకులకు పనులు తగ్గిపోయాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కార్మికులకు గతంలో చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు పని దొరకడం కష్టంగా మారింది. నిర్మాణ రంగంలో కీలకమైన ఇటుక, సిమెంట్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇనుము. ఎలక్ట్రిసిటీ, విక్రయాల వ్యాపారాలు క్షీణించాయి. ఇలా చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ విధానాల వల్ల కీలక రంగాలు చతికిలపడ్డాయి. వ్యాపారాలు తగ్గిపోవడంతో వాటిపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ తగ్గిపోవడంతో అన్ని వ్యాపారాలు తగ్గిపోయాయి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ హయాంలో మంచి రోజుల్లో సగటున రోజుకు 150, ఇతర రోజుల్లో 100–120 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు మంచి రోజుల్లోనూ 70–80 దాటడం లేదు. సాధారణ రోజుల్లో 50 రిజిస్ట్రేషన్లు కావడం గగనంగా ఉంది. 2019కి ముందు మచిలీపట్నం శివారులో సెంటు రూ.3 లక్షలు ఉంటే 2024లో రెట్టింపై రూ.6 లక్షలకు చేరుకుంది. తరువాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ధరలు పెరగలేదు. 2022–23లో తూర్పు గోదావరి జిల్లాలో 1,29,355 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా 2025–26 నవంబర్ చివరి నాటికి కేవలం 61,597 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. విజయనగరం పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.10 లక్షలు ఉన్న 200 గజాల ఇంటి స్థలం 2019 తరువాత వైఎస్ జగన్ హయాంలో రూ.25 – రూ.30 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు తగ్గిపోయాయి. మూడు నాలుగేళ్ల క్రితం కొన్న ధరకు అమ్ముకుందామన్నా కొనేవారు లేరని వ్యాపారులు చెబుతున్నారు. కడప అర్బన్, రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత ప్రభుత్వంలో రోజుకు సుమారు 250–300 రిజి్రస్టేషన్లు జరగగా ప్రస్తుతం 50–60 మించడం లేదు. ప్రొద్దుటూరు సబ్ రిజి్రస్టార్ కార్యాలయ పరిధిలో రోజుకు 80–90 రిజిస్ట్రేషన్లు నుంచి ప్రస్తుతం 30కి తగ్గిపోయాయి. ఆదోని మెడికల్ కాలేజీ పరిసరాల్లో గతంలో ఎకరం రూ.5 కోట్లు పలకగా ఇప్పుడు అడిగే నాథుడే కరువయ్యారు. 2023–24 వైఎస్ జగన్ హయాంలో ఇలా..1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.12,000 కోట్లు 2) రాష్ట్రంలో భారీగా పెరిగిన భూముల ధరలు 3) రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు.. 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ 4) రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, 30 లక్షలకుపైగా గృహ నిర్మాణాలు - ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం - తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు - గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణాలతో స్థానికంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధితో పాటు సంపద సృష్టిస్తూ అడుగులు 5) భవన నిర్మాణ కార్మికులకు సమృద్ధిగా పనులు 6) సంక్షేమ పథకాల అమలుతో పెరిగిన పేదల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు 7) రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలు కళకళ. జోరుగా గృహ నిర్మాణాలతో సిమెంట్, పెయింట్లు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యాపారాల జోరు 2025–26 బాబు ప్రభుత్వంలో.. 1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.10,169 కోట్లకు కుదింపు 2) భూముల ధరలు ఒక్కసారిగా పతనం.. రాజధానిలోనూ మందగమనం 3) రిజిస్ట్రేషన్లు పదుల సంఖ్యకే పరిమితం.. అక్టోబర్ దాకా 13.92 లక్షలే 4) కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోగా ఉన్న వ్యవస్థలే నిర్వీర్యం. 5) పొట్ట కూటి కోసం కార్మికుల అవస్థలు 6) పథకాలు అందక, అభివృద్ధి జాడ లేక పేదల దీనావస్థ 7) రియల్ ఎస్టేట్ వెలవెల. ఆగిన ఇళ్ల నిర్మాణాలు. వ్యాపారులు బేజార్కృష్ణాలో కుప్పకూలింది..! కృష్ణా జిల్లాలో ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 20 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు. అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. వైఎస్సార్ సీపీ హయాంలో బందరు పోర్టుకు శంకుస్థాపన చేసి పనులను పరుగులు పెట్టించింది. మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. గిలకలదిండి íఫిషింగ్ హార్బర్, పలు కొత్త హైవేలు రావడంతో జిల్లా పునర్విభజన సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. బందర్ హైవే వెంట నిడుమోలు, పామర్రు, ఉయ్యూరు. కంకిపాడు ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. కత్తిపూడి–ఒంగోలు హైవేతో పెడన, అవనిగడ్డ నియోజక వర్గాల్లో సైతం రియల్ భూమ్ అందుకొంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక వేగం మందగించడంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొంది. బాపట్లలో భవన రంగం బాధలు బాపట్ల జిల్లాలో ఏడాదిన్నరగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనమైంది. గత ప్రభుత్వంతో పోలిస్తే రిజి్రస్టేషన్లు సగం తగ్గాయి. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల జిల్లాలో 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 76,215 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 50,983 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గిపోగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా దొరకడం లేదని భవన నిర్మాణ కారి్మకులు వాపోతున్నారు. సిమెంట్, ఐరన్ విక్రయాలు పడిపోయాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో జిల్లాలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. తీరప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించడంతో రోడ్లు ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా జరిగాయి. బాపట్ల కేంద్రంగా గత ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేసింది. దీంతో 2019 తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అప్పటివరకూ తీర ప్రాంతంలో ఎకరం రూ.30 లక్షలు పలికిన భూమి తరువాత రూ.3 నుంచి 5 కోట్లకు చేరింది. గత ఏడాదిన్నరగా పరిస్థితి తారుమారైంది. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల మెడికల్ కళాశాల ప్రాంతంలో రూ.కోటిన్నర పలికిన ఎకరం భూమిని ప్రస్తుతం రూ.20 లక్షలకు కూడా కొనేవారు లేరు. అద్దంకి, రేపల్లె ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో ఎకరం రూ.కోటి దాకా పలికిన భూముల ధరలు తిరిగి రూ.20 లక్షలకు పతనమయ్యాయి.పల్నాడులో ధరలు పతనం.. పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల రాకతో పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజుపాలెం, మాచవరం తదితర మండలాల్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. రైతుల భూములు రెట్టింపు ధరలు పలికాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ఆదాయం అమాంతం పడిపోయింది. పల్నాడు జిల్లావ్యాప్తంగా 2023–24లో రిజి్రస్టేషన్ల ద్వారా రూ.472.38 కోట్ల ఆదాయం సమకూరగా 2024–25లో ఆదాయం రూ.396 కోట్లకు పడిపోయింది. 2025–26లో ఇప్పటిదాకా రూ.200 కోట్లు కూడా రాలేదు. గతంలో ఏటా సగటున 32 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా ప్రస్తుతం అది 14 వేలకు పడిపోయింది. దీంతో మధ్యవర్తులు ఉపాధిలేక హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్తున్నారు. గతంలో వెంచర్ల ఏర్పాటుతో ఉపాధి పొందిన వేలాది మంది కూలీలు, ట్రాక్టర్, జేసీబీ, ట్రక్కు డ్రైవర్లు ప్రస్తుతం పనుల కోసం అడ్డాలలో ఎదురు చూస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చేరువలోని కామేపల్లి గ్రామ పరిధిలో 2019కి ముందు ఎకరం పొలం రోడ్డు పక్కన సుమారు రూ.30 లక్షలు ఉండగా స్థానికంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏకంగా ఎకరం రూ.కోటిన్నర దాకా పలికింది. 2024లో వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి ఎకరం రూ.2 కోట్ల దాకా వెళ్లింది. అదే ఇప్పుడు కనీసం రూ.60 – రూ.80 లక్షలు కూడా పలకడం లేదు. కనీసం ధర గురించి అడిగే వారు లేరని రైతులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. నరసరావుపేటలోనూ వెంచర్లు వేసిన వ్యాపారులు స్థలాలు అమ్ముకోలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో నీరసించిన వ్యాపారం నెల్లూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ బాగుంటుందని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన రియల్టర్లు లేఅవుట్లు వేశారు. అన్ని సదుపాయాలతో అధునాతనంగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేశారు. ఇప్పుడు వాటిని కొనేవారు లేరు. గత 9 నెలలుగా ఖాళీగా ఉన్నారు. కొందరు బిల్డర్లు నూతనంగా నిర్మించిన ఇళ్లను బాడుగలకు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. భారీగా వడ్డీలు కట్టలేక లబోదిబోమంటున్నారు. ఇక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రకటన చేసినా రియల్ ఎస్టేట్ ఏమాత్రం ఊపందుకోలేదు. ఏడాదిలో ఒక్కటీ అమ్ముడుపోలేదుటీడీపీ అధికారంలోకి వచ్చాక భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది కాలంలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడు పోలేదు. పెట్టుబడులు మొత్తం ప్రాజెక్టులపై పెట్టాం. వ్యాపారం దివాలా తీస్తోంది. తెచి్చన పెట్టుబడులకు వడ్డీలు కట్టడమే సరిపోతోంది.– షేక్ కిరణ్బాబు, బిల్డర్, ఈడుపుగల్లు, కంకిపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా వలసలు పోతున్నారు ఏడాదిన్నరగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. స్థలం అమ్మేవారు ఉన్నా.. కొనేవారు లేరు. అందుకే రిజి్రస్టేషన్లు ఆగిపోయాయి. ఇల్లు కట్టించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఓపెన్ ప్లాట్లు కూడా అమ్ముడు పోవడం లేదు. దీంతో భవన నిర్మాణ కారి్మకులు తమ పనులను వదిలేసి బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. – నాగరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు, కదిరి, సత్యసాయి జిల్లాపూర్తిగా పతనమైన రియల్ ఎస్టేట్ ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌనైపోయింది. మార్కాపురం జిల్లా ప్రకటిస్తే మంచి ధరలు వస్తాయని ఆశించాం. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అమ్మే వారు ఉన్నాగానీ కొనేవారు లేరు. నేషనల్ హైవే పక్కన కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. సంతనూతలపాడు మండలంలో రియల్ ఎస్టేట్ భూం ఇప్పుడు పూర్తిగా పతనమైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నమోదవుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఇక్కడ 2022–23లో 6,029 రిజిస్ట్రేషన్లు జరిగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024–25లో ఆ సంఖ్య 3,972కు పడిపోయింది. – కుంచాల ఆంజనేయులు, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లాపూట గడవడమే కష్టంగా ఉందిరియల్ ఎస్టేట్ కుదేలైంది. భవన నిర్మాణాలు భారీగా తగ్గిపోయాయి. గతంలో నెలలో 20 రోజులకుపైగా పనులుంటే ప్రస్తుతం 10–15 రోజులు కూడా దొరకడం లేదు. భవన నిర్మాణ కార్మికులకు పూట గడవడమే కష్టంగా ఉంది. – జి.హరికృష్ణారెడ్డి, ఎనీ్టఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడునెలలో సగం రోజులే పనిరియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ నిలిచి పోయాయి. దీంతో నిర్మాణ పనులపై ఆధారపడి ఇక్కడ జీవిస్తున్న వేల మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాజధాని వస్తుందన్న సమయంలో భవనాల పనులు మొదలు పెట్టారు. అందరికీ చేతినిండా పని ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులు దొరకడం లేదు. రోజుకో బ్యాచ్కి పని సర్దుబాటు చేయాల్సి వస్తోంది. అంటే ఒక కార్మికుడికి నెలలో 15 రోజులు కూడా పని లేకుండా పోయింది. దీంతో కారి్మకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు దొరకకపోవడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. – వైఎస్ మూర్తి, శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మధురవాడ, విశాఖపని దొరకడం లేదు.. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులు పనులు దొరికేవి. ఈ ప్రభుత్వం వచ్చాక నెలకు పది రోజులు కూడా పనులు ఉండడం లేదు. ఉదయమే సెంటర్కు వచ్చి పడిగాపులు కాస్తున్నాం. కుటుంబ పోషణ భారంగా మారింది. – నాగూర్బాషా, భవన నిర్మాణ కార్మికుడు, ఉప్పరపాలెం, బాపట్ల జిల్లా. -
వైఎస్సార్ పిలిస్తే కాంగ్రెస్లోకి వచ్చా
సాక్షి, హైదరాబాద్: తాను హరీశ్రావుపై కోపంతో బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి వెళ్లానని కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్పిన మాటల్లో వాస్తవం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జ గ్గారెడ్డి పేర్కొన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు తాను కాంగ్రెస్లోకి వచ్చా నని స్పష్టం చేశారు. ‘నేను బీఆర్ఎస్ను వీడడానికి, హరీశ్రా వుకు సంబంధం లేదు. అసలు ఆయన కారణమే కాదు. నన్ను కాంగ్రెస్లోకి రమ్మని నా మిత్రుడు జెట్టి కుసుమకుమా ర్తో వైఎస్సార్ ఆహ్వానం పంపారు. నా రాజకీయం నచ్చి పిలిపించారు. కాంగ్రెస్లో చేరమన్నారు. సంగారెడ్డి నియోజ కవర్గానికి ఐఐటీతో పాటు ఫోర్లేన్ హైవే ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. అసలు కవితకు అప్పు డు రాజకీయాల్లో అ, ఆ లు కూడా రావు. మరోమా రు ఇలాంటివి మాట్లాడొద్దు..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.హరీశ్తో వార్ నడుస్తూనే ఉంటుంది..కేసీఆర్ కుమార్తె కాబట్టి కవిత లీడర్ అయిందని, తాను వ్యక్తిగతంగా ఎదిగిన నాయకుడినని జగ్గారెడ్డి అన్నారు. వాళ్ల పంచాయతీలోకి నన్ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో హరీశ్రావుకు, తనకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుందని చెప్పారు. తాను డైరెక్ట్గా రాజకీయం చేస్తే, హరీశ్రావు వెనుక నుంచి పొడిచే రాజకీ యం చేస్తాడని ఆరోపించారు. తాను రాజకీయంగా కొంత డిస్టర్బ్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. అయితే ఎందుకు మానసికంగా చలించాననే విషయం సమయం వచ్చిన ప్పుడు చెపుతానని, మేలో అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. తాను ఒక్కసారి డిసైడయ్యాక మళ్లీ వెనుకకు వచ్చే మనిషిని కాదని, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద కూడా ఆసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
రెండో విడతలో 85.86% ఓటింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లో మరింత భారీగా పోలింగ్ నమోదైంది. తొలివిడత ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్నమోదు కాగా.. రెండో విడతలో 1.58 శాతం ఎక్కువగా 85.86% ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. మొత్తం మీద రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్కేంద్రా ల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ముగియగా, ఆలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. పోలింగ్ముగిశాక కౌంటింగ్ప్రారంభించి విజేతలను ప్రకటించారు. ఏకగ్రీవాలను మినహా యిస్తే రెండు విడతల్లో కలిపి 7,745 పంచాయతీలకు ఎన్నికలు ముగియగా, మూడో దఫాలో భాగంగా ఈ నెల 17న మరో 3,759 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మహిళా ఓటర్లే ఎక్కువ.. రెండో దఫాలో 3,911 పంచాయతీలకు, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. మొత్తం 54,40,339 మంది ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72%, ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా నిజామాబాద్జిల్లాలో 76.71%, జగిత్యాలలో 78.34% ఓటింగ్ నమోదైంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ పాల్గొన్నారు. ఈ విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక మరో 416 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యాదాద్రి జిల్లా టాప్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈసారి 54,40,339 ఓటర్లు ఉండగా.. 46,70,972 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 27,82,494 ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 22,77,902 మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా 2,02,716 మంది ఓటర్లకు గాను..1,8,5937 మంది ఓటింగ్తో (91.72 శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,38,838 ఓటర్లు ఉండగా.. 1,83,219 మంది ఓటింగ్ (76.71 శాతం)తో చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లాలో 91.21%, సూర్యాపేట జిల్లాలో 89.55%, మెదక్88.74%, నల్లగొండ జిల్లాలో 88.74% నమోదు కాగా.. జగిత్యాల (78.34%), భద్రాద్రి కొత్తగూడెం (82.65%), నిర్మల్ (82.67%), వికారాబాద్ (82.72%)లో వరుసగా అత్యల్ప ఓటింగ్ నమోదైంది. తగ్గిన పోస్టల్ బ్యాలెట్లు: పోలింగ్ ముగిసిన తర్వాత మ ధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. గతంతో పోలి స్తే ఈసారి పోస్టల్బ్యాలెట్ఓట్లు భారీగా తగ్గినట్లు అధికారు లు పేర్కొన్నారు. కాగా వార్డుల వారీగా ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్లను ఎన్నుకున్నారు. రెండో విడత ఎన్నికలు మొత్తం మీద ప్రశాంతంగా ముగిశాయి.పోటెత్తిన మహిళలు ఈ విడతలో మొత్తం మహిళా ఓటర్లు 27,82,494 మంది ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో మహిళలు పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.62%, ఖమ్మం 90.88%, మెదక్ 89.28% అత్యధికంగా ఓటింగ్ నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం 81.38%, వికారాబాద్ 81.79%, ములుగు 82.79% ఓటింగ్ నమోదైంది. పురుషుల ఓటింగ్ శాతంలో కూడా యాదాద్రి (91.83%), ఖమ్మం (91.56%) జిల్లాలే ముందంజలో ఉన్నాయి.రాష్ట్రంలో ఎన్నికలు నోటిఫై అయిన పంచాయతీలు: 12,723ఏకగ్రీవమైనవి: 1205తొలిదశలో ఎన్నికలు జరిగినవి: 3,834రెండో విడతలో జరిగినవి: 3,911మూడో విడతలో జరిగేవి: 3,759(మిగిలిన వాటిలో కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు కాకపోగా, మరికొన్ని కోర్టు కేసులు ఇతర కారణాలతో ఎన్నికలు జరగడం లేదు) -
సచిన్... సచిన్... మెస్సీ... మెస్సీ
ముంబై: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్సీ తన ‘గోట్ టూర్’లో భాగంగా రెండో రోజు ముంబైని మురిపించాడు. భారత మాస్టర్ సచిన్ టెండూల్కర్తో కలిసి వాంఖెడేలో సందడి చేశాడు. మామూలుగా అయితే ఈ మైదానంలో టెండూల్కర్ ఉంటే ‘సచిన్... సచిన్...’ అనే గోలే వినిపించేది. కానీ ఆదివారం స్వరం మారింది. యువ తరం, నవతరం అంతా కలిసి తమ ఆరాధ్య క్రికెటర్తో పాటు అభిమాన ఫుట్బాలర్ పేరునూ మార్మోగించారు. దీంతో వాంఖెడే స్టేడియం ‘సచిన్... సచిన్... మెస్సీ... మెస్సీ...’ నామస్మరణతో మార్మోగిపోయింది. సచిన్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, పలువురు సెలబ్రిటీలతో స్టేడియమంతా తారతోరణం దిద్దుకుంది. వాంఖెడే పుటల్లో ఈ పూట క్రీడా ప్రపంచంలోనే అలుపెరగని దిగ్గజాలు ప్రత్యక్షంగా మైదానాన్ని, పరోక్షంగా యావత్ భారత్ను అలరించారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన పురిటి గడ్డపై జగద్విఖ్యాత ఫుట్బాలర్ లయోనల్ మెస్సీతో కలిసి సందడి చేశాడు. వాంఖెడే స్టేడియంలో దిగ్గజాల భేటీతో సరికొత్త అధ్యాయం ప్రారంభించినట్లయ్యింది. పోటెత్తిన అభిమానులతో కిక్కిరిసిపోయిన స్టేడియంలో వీరిద్దరే కేంద్ర బిందువులయ్యారు. భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి, రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సహా పుర ప్రముఖులు ఎందరున్నా... వేల కళ్లు సచిన్–మెస్సీల నుంచి చూపును తిప్పుకోలేకపోయాయి. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు తమ ఆరాధ్య దిగ్గజం సచిన్ను విఖ్యాత ఫుట్బాలర్తో కన్నుల పండుగగా చూసుకున్నారు. ఈ సందర్భంగా మహా సీఎం ఫడ్నవీస్ రాష్ట్రంలో యువ ఫుట్బాలర్ల ప్రతిభను సానబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రాజెక్ట్ మహాదేవ’ పేరిట ఫుట్బాల్ ప్రతిభావంతుల్ని తయారు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. అపురూపం... పరస్పర బహుమానం అర్జెంటీనా స్టార్కు టెండూల్కర్ తను స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన వన్డే జెర్సీని మెస్సీకి అందివ్వగా... ప్రతిగా మెస్సీ కూడా తన సంతకంతో కూడిన ఫుట్బాల్ను సచిన్కు ఇచ్చాడు. అన్నట్లు ఆటలు వేరైనా... దేశాలు వేరైనా... సచిన్ జెర్సీ నంబర్, మెస్సీ జెర్సీ నంబర్ ఒక్కటే 10! అదేనండీ ‘దస్కా దమ్’’! దిగ్గజాలు పరస్పర బహుమతులు ఇస్తూ స్వీకరిస్తుంటే అభిమానులంతా ఉప్పొంగిపోయారు. ఈ అపు‘రూపం’ను తమ ఫోన్ కెమెరాల్లో పదిలంగా బందీచేసుకున్నారంతా! నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ... ‘గోట్ టూర్’లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్సీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈరోజు మర్యాదపూర్వకంగా కలువనున్నాడు. మూడు రోజుల ‘గోట్ టూర్’ నేడు ఢిల్లీలో ముగియనుంది. ముంబై నుంచి సోమవారం ఉదయం 10 గంటల తర్వాత మెస్సీ ఢిల్లీ చేరుకుంటాడు. నగరంలోని క్రీడాభిమానులతో ‘మీట్ అండ్ గ్రీట్’ ముగించుకొన్న తర్వాత మెస్సీ... ప్రధాని మోదీతో భేటీ అవుతాడు. ప్రధాని నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య జరిగే మాటామంతీలో సాకర్ సూపర్ స్టార్ ఫుట్బాల్ ముచ్చట్లు పంచుకోకున్నాడు. ఆ తర్వాత భారత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ రాహుల్ నవీన్, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ ప్రఫుల్ పటేల్తో కూడా మెస్సీ భేటీ అవుతారని నిర్వాహకులు వెల్లడించారు. ఇలా పలువురు వీవీఐపీలను కలిసిన తర్వాత మెస్సీ మధ్యాహ్నం 3.30 గంటలకు అరుణ్ జైట్లీ స్టేడియానికి చేరుకుంటాడు. అక్కడ తన అభిమానుల్ని అలరించిన అనంతరం స్వదేశానికి పయనమవుతాడని నిర్వాహకులు వెల్లడించారు. నాకు ఇక్కడ (వాంఖెడే) మరుపేలేని మధుర జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. అందుకే మన ముంబై ఒక కలల నగరి. ఈ వేదికపై ఎంతో మంది స్వప్నాలు సాకారమయ్యాయి. 2011 నాకు బాగా గుర్తు. నా కల (వన్డే వరల్డ్కప్) కూడా ఇక్కడే నిజమైంది. ముఖ్యంగా మీ (అభిమానులు) మద్దతే లేకపోతే ఆ స్వర్ణానుభూతిని నేనైతే ఎప్పటికీ చూడలేను. ఇప్పుడు కూడా మెస్సీని ఇక్కడ చూస్తుంటే అలాంటి అనుభూతే కలుగుతోంది. మన యువ ఫుట్బాలర్లను ప్రోత్సహించిన మెస్సీకి మీ అందరి తరఫున, భారతీయుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. –సచిన్ టెండూల్కర్ -
‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్సీ ప్రస్తుతం ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా భారత్లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నాడు. ఈ టూర్ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా కాగా... తొలిరోజు కోల్కతాలో ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన కోల్కతా పోలీసులు జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా సాల్ట్లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడతాడంటూ ప్రముఖంగా ప్రచారం చేశారు. రూ. వేలల్లో టికెట్లను అమ్మారు. ఫుట్బాల్ క్రేజీ బెంగాలీ వాసులు సుమారు 80 వేల మంది వేలకువేలు వెచి్చంచి స్టేడియానికి తరలివెళ్లారు. కానీ తమ ఆరాధ్య ఫుట్బాలర్ మెస్సీ పట్టుమని పది నిమిషాలైనా మైదానంలో అలరించలేదు. ఆ ఉన్న కొద్దిసేపు కూడా చీమలదండు లాంటి భద్రతా వలయంతో ఏ గ్యాలరీలోని ప్రేక్షకుడు కూడా మెస్సీని చూడలేకపోయాడు. దీంతో సూపర్స్టార్ను ప్రత్యక్షంగా చూసి కన్నుల పండగ చేసుకుందామని రూ.వేలు వెచి్చంచిన అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా వేల మంది విరుచుకుపడటంతో కరతాళ ధ్వనులతో మార్మోగాల్సిన మైదానం రసాభాసగా మారింది. ఈ ఈవెంట్ నిర్వహణ వైఫల్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభిమానుల తాకిడి, అంచనాలకు విరుద్ధంగా ఏర్పాట్లు, నిర్వహణ వైఫల్యంపై చీఫ్ ఆర్గనైజర్ శతద్రు దత్తాను శనివారమే అదుపులోకి తీసుకొని ఆదివారం జడ్జి ముందు హాజరు పరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి... ముఖ్య నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో శతద్రును జైలుకు తరలించారు. -
సింగిల్స్ చాంప్స్ ఉన్నతి, కిరణ్
కటక్: ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత్కు రెండు టైటిల్స్ లభించాయి. మహిళల సింగిల్స్లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల ఉన్నతి హుడా... పురుషుల సింగిల్స్లో కేరళకు చెందిన కిరణ్ జార్జి చాంపియన్స్గా అవతరించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్లో ప్రపంచ 28వ ర్యాంకర్ ఉన్నతి 21–17, 21–10తో భారత్కే చెందిన ప్రపంచ 53వ ర్యాంకర్ ఇషారాణి బారువాను ఓడించింది. 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఉన్నతికి తొలి గేమ్లో కాస్త పోటీ ఎదురైంది. రెండో గేమ్లో మాత్రం ఆరంభం నుంచే ఉన్నతి జోరు కొనసాగింది. పురుషుల సింగిల్స్ తుది పోరులో ప్రపంచ 41వ ర్యాంకర్ కిరణ్ జార్జి 21–14, 13–21, 21–16తో ప్రపంచ 77వ ర్యాంకర్ మొహమ్మద్ యూసుఫ్ (ఇండోనేసియా)పై విజయం సాధించింది. 65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండో గేమ్లో తడబడ్డ కిరణ్ నిర్ణాయక మూడో గేమ్లో కీలకదశలో పాయింట్లు గెలిచి టైటిల్ను ఖాయం చేసుకున్నాడు. విజేతలుగా నిలిచిన ఉన్నతి, కిరణ్లకు 8,250 డాలర్ల (రూ. 7 లక్షల 46 వేలు) చొప్పున ప్రైజ్మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత్ భళా... సఫారీ డీలా
ధర్మశాల: ధర్మశాల అసలే శీతల ప్రదేశం. ఇక ఈ చలికాలమైతే మంచు గడ్డలా మారాల్సిందే. అలాంటి వేదికపై మన పేసర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సెగ పెట్టారు. ఆరంభంలో పేస్ ప్రతాపం, తర్వాత స్పిన్ మాయాజాలం భారత్ను సిరీస్లో 2–1తో ఆధిక్యంలో నిలిపింది. ఆదివారం జరిగిన మూడో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ మార్క్రమ్ (46 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే భారత బౌలింగ్కు ఎదురు నిలిచాడు. మ్యాచ్ మొదలైన కాసేపటికే అర్ష్ దీప్ (2/13), హర్షిత్ రాణా (2/34), హార్దిక్ పాండ్యా (1/23) పేస్కు సఫారీ కుదేలైంది. రిజా హెండ్రిక్స్ (0), డికాక్ (1), బ్రెవిస్ (2)లు పెవిలియన్ చేరడంతో ఒకదశలో 3.1 ఓవర్లలో సఫారీ స్కోరు 7/3. తర్వాత స్పిన్ తిరగడంతో 77 పరుగుల వద్ద 7వ వికెట్ను కోల్పోయింది. మార్క్రమ్ ఫిఫ్టీతో జట్టు కష్టంగా వంద పైచిలుకు స్కోరు చేసింది. మెరిపించిన అభిషేక్ భారత్ ముందున్న లక్ష్యం ఏమాత్రం కష్టమైంది కాదు. ఇలాంటి స్కోరు ఛేదించేందుకు దిగిన భారత్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్స్లు), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 28; 5 ఫోర్లు) చక్కని ఆరంభమిచ్చారు. అభిషేక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా స్కోరు 4.1 ఓవర్ల్లలోనే 50 పరుగులు దాటింది. ఓపెనింగ్ వికెట్కు చకచకా 60 పరుగులు జోడించిన అభిషేక్ తొలి వికెట్గా నిష్క్రమించాడు. తిలక్ వర్మ (34 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు), గిల్ కుదురుగా ఆడారు. స్వల్ప వ్యవధిలో గిల్, కెప్టెన్ సూర్యకుమార్ (12) నిష్క్రమించినప్పటికీ మిగతా లాంఛనాన్ని తిలక్, శివమ్ దూబే (10 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ముగించారు. ఐదు మ్యాచ్ల సిరీస్ తదుపరి నాలుగో టి20 బుధవారం (17న) లక్నోలో జరుగుతుంది.3 స్టబ్స్ను అవుట్ చేసిన హార్దిక్ అంతర్జాతీయ టి20 క్రికెట్లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న మూడో భారత బౌలర్. అర్ష్ దీప్, బుమ్రాలు ఇదివరకే వంద వికెట్ల క్లబ్లో ఉన్నారు.5 స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పొట్టి క్రికెట్లో 50 వికెట్లు పడగొట్టాడు.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షిత్ రాణా 1; హెండ్రిక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (సి) జితేశ్ (బి) అర్ష్ దీప్ 61; బ్రెవిస్ (బి) హర్షిత్ 2; స్టబ్స్ (సి) జితేశ్ (బి) హార్దిక్ 9; బాష్ (బి) దూబే 4; ఫెరీరా (బి) వరుణ్ 20; యాన్సెన్ (బి) వరుణ్ 2; నోర్జే (స్టంప్డ్) జితేశ్ (బి) కుల్దీప్ 12; ఎన్గిడి (నాటౌట్) 2; బార్ట్మన్ (సి) సూర్యకుమార్ (బి) కుల్దీప్ 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–7, 4–30, 5–44, 6–69, 7–77, 8–113, 9–115, 10–117. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–13–2, హర్షిత్ 4–0–34–2, హార్దిక్ పాండ్యా 3–0–23–1, వరుణ్ 4–0–11–2, శివమ్ దూబే 3–0–21–1, కుల్దీప్ 2–0–12–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) మార్క్రమ్ (బి) బాష్ 35; శుబ్మన్ (బి) యాన్సెన్ 28; తిలక్ వర్మ (నాటౌట్) 26; సూర్యకుమార్ (సి) బార్ట్మన్ (బి) ఎన్గిడి 12; శివమ్ దూబే (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 9; మొత్తం (15.5 ఓవర్లలో 3 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1–60, 2–92, 3–109. బౌలింగ్: ఎన్గిడి 3–0–23–1, యాన్సెన్ 3–0–24–1, బార్ట్మన్ 3.5–0–34–0, బాష్ 3–0–18–1, నోర్జే 3–0–14–0. -
హైదరాబాద్కు రెండో విజయం
పుణే: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ‘సూపర్ లీగ్’ దశలో హైదరాబాద్ జట్టు రెండో విజయంతో ఫైనల్కు చేరువైంది. రాజస్తాన్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్లో సీవీ మిలింద్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. మహిపాల్ లొమ్రోర్ (35 బంతుల్లో 48; 1 ఫోర్, 4 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (2/23), సీవీ మిలింద్ (3/25), తనయ్ త్యాగరాజన్ (3/38) రాణించారు. అనంతరం హైదరాబాద్ జట్టు ధాటిగా ఆడుతూ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయం సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తన్మయ్ అగర్వాల్ (41 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్లు), రాహుల్ బుద్ధి (36 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాజస్తాన్ బౌలర్ల భరతం పట్టి అర్ధ సెంచరీలతో మెరిపించారు. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో ప్రస్తుతం హైదరాబాద్ 8 పాయింట్లతోపాటు 2.999 రన్రేట్తో అగ్రస్థానంలో ఉంది. హరియాణా (4 పాయింట్లు; 0.234 రన్రేట్), ముంబై (4 పాయింట్లు; –0.371 రన్రేట్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగే చివరి రౌండ్ మ్యాచ్ల్లో హరియాణాతో హైదరాబాద్; రాజస్తాన్తో ముంబై తలపడతాయి. -
చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ జట్టు... తొలిసారి ప్రపంచకప్ టైటిల్ సొంతం
చెన్నై: స్వదేశంలో భారత స్క్వాష్ జట్టు చిరస్మరణీయ ప్రదర్శన చేసింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ మిక్స్డ్ టీమ్ స్క్వాష్ టోర్నమెంట్లో తొలిసారి చాంపియన్గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డు నెలకొల్పింది. హాంకాంగ్ జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ప్రపంచ 79వ ర్యాంకర్ జోష్నా చినప్ప 7–3, 2–7, 7–5, 7–1తో ప్రపంచ 37వ ర్యాంకర్ లీ కా యిపై గెలిచి భారత్కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్లో ప్రపంచ 29వ ర్యాంకర్ అభయ్ సింగ్ 7–1, 7–4, 7–4తో ప్రపంచ 42వ ర్యాంకర్ అలెక్స్ లాయుపై నెగ్గడంతో భారత్ ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్లో ప్రపంచ 28వ ర్యాంకర్ అనాహత్ సింగ్ 7–2, 7–2, 7–5తో ప్రపంచ 31వ ర్యాంకర్ టొమాటో హోపై గెలవడంతో భారత్కు ప్రపంచకప్ టైటిల్ ఖరారైంది. -
విశాఖ స్టీల్ ప్లాంటులో ప్రధాన ఉత్పత్తీ విభాగం ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల పిలుపు
విశాఖ స్టీల్ ప్లాంటులో ప్రధాన ఉత్పత్తీ విభాగం ప్రైవేటు పరం చేసేందుకు టెండర్ల పిలుపు -
యావన్మందికీ తెలియజేయునది ఏమనగా..?
రెండో విడత పంచాయతీ ఫలితాల్లోనూ..తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనేక సర్పంచ్ స్థానాలకు సమాన ఓట్లు రాగా, లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఒక్క ఓటుతోనూ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. పోటీలో ఉన్న వారి మేరకు విజ్ఞప్తి మేరకు రెండుమూడుసార్లు రీకౌంటింగ్ కూడా చేశారు. ధర్మసాగర్/ హవేళిఘణాపూర్/అనంతగిరి/ వేములపల్లి /పుల్కల్/ ఎల్లారెడ్డిరూరల్/ కౌటాల/కాసిపేట: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో ఎండీ సత్తార్, బీఆర్ఎస్ మద్దతుతో హఫీజ్ పోటీ చేశారు. 328 ఓట్లు పోల్ అవగా, సత్తార్, హఫీజ్లకు సమానంగా 164 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ సత్తార్ను విజయం వరించింది. టాస్ వేయాల్సి ఉండగా, డ్రా ఎందుకు తీశారని బీఆర్ఎస్ మద్దతుదారు హఫీజ్ నిరసన తెలుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మెదక్ మండలం చీపురుదుబ్బతండా సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బీమిలి, కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతకు చెరి 182 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీయగా.. సునీత సర్పంచ్ పీఠం కైవసం చేసుకుంది. వికారాబాద్ మండలం జైదుపల్లి సర్పంచ్గా ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్లోళ్ల మౌనిక, నాగిరెడ్డికి 302 చొప్పున ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా నిర్వహించగా మౌనికను అదృష్టం వరించింది.నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన సాయిని మౌనికకు సమానంగా 352 ఓట్ల చొప్పున వచ్చాయి. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఓట్లు సమానం రావడంతో ఇద్దరి మధ్య టాస్ వేశారు. టాస్ గెలిచిన ఉపేంద్రమ్మ సర్పంచ్ అయ్యారు.సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డులో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు సమానమైన ఓట్లు పొందారు. దీంతో అధికారులు టాస్ వేశారు. టాస్లో శ్రీకాంత్ను విజయం వరించింది.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మంగళి సంతోశ్కుమార్, పెంట మానయ్యలకు సరి సమానంగా 483 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేసి మంగళి సంతోశ్కుమార్ సర్పంచ్గా గెలుపొందినట్టుప్రకటించారు.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి సర్పంచ్ స్థానానికి జరగిన ఎన్నికలో బీఆర్ఎస్ బలపర్చిన రజినికాంత్కు 204 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతుదారు జాడి కావేరికి 204 ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రాలో కావేరి పేరు రావడంతో ఆమె గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడితండా(కే) గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన బలరాం రాంచందర్లకు 193 చొప్పున ఓట్లు పోల్ అయ్యాయి. రీకౌంటింగ్ జరిపినా అవే ఓట్లు వచ్చాయి. డ్రాలో బలరాంను అదృష్టం వరించింది.నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వెంకాయపల్లిలో కాంగ్రెస్ మద్దతుతో వెంకటేశ్వరమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో ఆలేటి ఇందు పోటీ చేశారు. ఇద్దరికి చెరి 236 ఓట్లు రాగాటాస్ వేయగా వెంకటేశ్వరమ్మ గెలిచారు. -
తొలిలాగే మలి!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపుగా తొలి విడత ఫలితాలే పునరావృతమయ్యాయి. మొదటి విడత తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే విజయం సాధించారు. ఆదివారం రాష్ట్రంలోని 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు 2,067 మంది గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 1,160 స్థానాలు గెలుపొందగా, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 250 మంది గెలిచారు. మరోవైపు స్వతంత్రులు, సీపీఎం, సీపీఐ పారీ్టలకు చెందిన వారు.. 429 మంది గెలుపొందారు. వీరు మొత్తం స్థానాల్లో 11 శాతానికి పైగానే గెలుపొందడం విశేషం. ఇక రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 4,500 దాటింది. బీఆర్ఎస్ బలపర్చిన 2,300 మంది విజయం సాధించగా, బీజేపీ బలపర్చిన వారు 440 మంది వరకు గెలుపొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎవరికి ఎంత శాతం..?తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలో కూడా 55 శాతం వరకు పంచాయతీలు కాంగ్రెస్ బలపర్చిన వారికే దక్కగా, అదే సమయంలో బీఆర్ఎస్ సైతం మంచి పోటీ ఇచి్చంది. ఆ పారీ్టకి 29 శాతం కంటే ఎక్కువగా పంచాయతీలు దక్కాయి. బీజేపీ మద్దతిచి్చన వారు 6 శాతానికి పైగా విజయం సాధించారు. -
కేరళ రాజధానిలో కమల వికాసం.. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
కేరళ రాజధానిలో కమల వికాసం.. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం -
ఈ రాశి వారు విచిత్రమైన సంఘటనలు ఎదుర్కొంటారు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువుమార్గశిర మాసం, తిథి: బ.ఏకాదశి రా.10.04 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: చిత్త ప.12.53 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: రా.7.03 నుండి 8.48 వరకు, దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.00 వరకు తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు, అమృత ఘడియలు: తె.5.34 నుండి 7.17 వరకు (తెల్లవారితే మంగళవారం), సర్వ ఏకాదశి.సూర్యోదయం : 6.25సూర్యాస్తమయం : 5.24రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం...చేపట్టిన కార్యకమాలలో విజయం. అందరిలోనూ గౌరవం. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.వృషభం....నిరుద్యోగుల ప్రయత్నాలలో కదలికలు. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.మిథునం....కార్యక్రమాలలో స్వల్ప అవరోధాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల ఒప్పందాలు వాయిదా. దేవాలయ దర్శనాలు. వత్తులు, వ్యాపారాలు ఒత్తిడుల మధ్య సాగుతాయి. దూరప్రయాణాలు.కర్కాటకం....దూరప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.సింహం..స్నేహితుల నుంచి ధనలాభం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సోదరులు సహాయపడతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తులు, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.కన్య....పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. వథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. విచిత్రమైన సంఘటనలు. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ.తుల....ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. యత్నకార్యసిద్ధి. శుభవర్తమానాలు. విద్యార్థులకు కీలక సమాచారం. వృత్తులు, వ్యాపారాలు మరింతగా అనుకూలిస్తాయి. కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.వృశ్చికం...కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ధనుస్సు...స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.మకరం....అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. ప్రయాణాలు వాయిదా. స్నేహితుల నుంచి ఆçహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దేవాలయ దర్శనాలు.కుంభం...ఆదాయం కొంత తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలలో ప్రతిబంధకాలు.వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం. దేవాలయ దర్శనాలు.మీనం....ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో వివాదాలు. స్వల్ప ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం చెందుతారు. కళాకారులకు ఒత్తిడులు. -
పది నీతులు, పది బూతులు
కుందవరపు చౌడప్ప పేరు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమే. ‘నీతులకేం కానీ, బూతాడక పోతే దొరకు నవ్వు పుట్టదు ధరలో’ అంటాడాయన. ‘సభలో పది నీతులూ, పది బూతులూ ఉన్న పద్యాలు చెప్పినవాడే అధికు’డంటూ నీతినీ, బూతునూ ఒకే గాటన కట్టిన తెంపరి ఆయన. అక్షరాన్ని సాక్షాత్తు ‘సరస్వతి’గా ఉపాసించారు కనుకనే పూర్వులు రచనను ‘సారస్వత’ మన్నారు. అలా అక్షరాన్ని పవిత్రంగా భావించేవారెవరైనా బూతు రాతలో రోతనే తప్ప నీతినీ, నవ్వునూ చూడలేరు. ఒకానొక విశ్వవిద్యాలయంలో తోటి ఆచార్యుని చర్మరోగాన్ని ఆక్షేపిస్తూ ఏకంగా పద్యాలే రాసి తనకు అబ్బిన పద్యవిద్యను బురదగుంటలో పొర్లించిన ఇటీవలి ఆచార్య పుంగవులూ లేకపోలేదు కానీ, తెలుగు సాహిత్యం అదృష్టం కొద్దీ బూతుకవిగా చౌడప్ప ఒక్కడే చరిత్ర కెక్కాడు. ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా బూతుల బుంగల్ని సృష్టించి సామాజిక మాధ్యమాలు ఆ హేయచరిత్రకు వేల సంఖ్యలో కొత్తపుటలు జోడిస్తున్నాయి. నిజానికి మాధ్యమాలు సామాజికీకరణ చెందడం ఎంతైనా స్వాగతించదగినదే; అందువల్ల తమ భావాలను ఇతరులతో పంచుకునే అవకాశం కొత్తకొత్త వర్గాలకు అందు బాటులోకి వచ్చింది. దాంతోపాటే అవి అసభ్యతా, అశ్లీలం, బూతు, వ్యక్తిగతమైన వేధింపు వగైరాల రూపంలో చెప్పలేనంత మురికినీ తెప్పలుగా పారిస్తున్నాయి. డ్రైనేజీ స్కీములేక అది డేంజర్గా మారుతోంది. కాకపోతే, మనందరికీ తెలిసిన ‘బూతు’లాంటి మోటు మాటలతో కాకుండా ఎక్కువమందికి తెలియని ‘ట్రోలింగ్’ అనే నాజూకు పేరుతో ఇది చలామణీ అవుతోంది. స్కాండెనేవియా జానపద కథల్లోని రాక్షసులు, మరుగుజ్జు ల్లాంటి జగడాలమారి, అసాంఘిక శక్తులను సంకేతించడంతో ప్రారంభించి, చేపలకు వేసే ఎర వరకూ పదిహేనో శతాబ్ది నుంచి రకరకాల అర్థాల్లో వాడుతూ వచ్చిన ఈ ‘ట్రోల్’ అనే మాట ఇప్పుడు రకరకాల అసహ్యార్థాలలో అంతర్జాల సంస్కృతిలో స్థిరపడింది. భారతీయ సమాజంలో తిట్టుకూ, బూతుకూ స్త్రీలనే లక్ష్యం చేసుకోవడం మొదటి నుంచీ ఉన్నదే. సామాజిక మాధ్యమాలు ఇందుకు కొత్తగా అందివచ్చిన రొచ్చుబండ లయ్యాయి. అక్కడక్కడ స్వయంగా మహిళలూ ఇందులో భాగస్వాములవడం ఈ అధః పతనంలో కొత్త లోతు. సహజంగా స్త్రీల నుంచే దీనిపట్ల తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. బూతులకు, వేధింపులకు గురవుతున్న కొంతమంది మహిళా యూట్యూబర్లు ఈ మధ్య ఒక పోలీస్ ఉన్నతాధికారిని కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అయినా దీనికి అడ్డుకట్టపడే సూచన కానీ, పడుతుందన్న ఆశకు ఆస్కారం కానీ కనిపించడం లేదు. ఫేస్బుక్ మాధ్యమంలో చురుగ్గా పనిచేస్తున్న ఒక గ్రూపు తన వంతుగా రంగంలోకి దిగి దీనిపై ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి, కొన్ని సందేశాత్మక వీడియోలను ప్రచారంలోకి తెచ్చింది. అయితే, సమస్య ఎన్నో శక్తుల భాగస్వామ్యంతో లోతుగా వేళ్లూనుకున్న స్థితిలో పై మెరుగుల చర్యల వల్ల ఫలితముంటుందా అన్న ప్రశ్నా ఎదురవుతుంది. ఉదాహరణకు, మహిళలు విద్యా, ఉద్యోగాల్లోనే కాక, ఆ యా సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలమవ డాన్ని కంటగించుకునే సాంప్రదాయిక శక్తులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ తమ అసహనాన్నీ, అక్కసునూ వెళ్ళగక్కుతున్నాయి. ఇంకోవైపు, వివిధ భావ జాలాల మధ్య ఘర్షణ పతాకస్థాయికి చేరుకున్న నేటి దేశీయ వాతావరణంలో వాటికి నాయకత్వం వహించే రాజకీయ పక్షాలు సాంప్రదాయిక మాధ్యమాలకు అదనంగా సామాజిక మాధ్యమాలనూ యథేచ్ఛగా వాడుకుంటున్నాయి. అధికార బలంతోపాటు అర్థబలం, అంగబలం దండిగా ఉన్న శక్తులు ఈ బూతులూ, తిట్ల పంచాంగాన్ని వ్యవస్థీకృతం చేసి తెర వెనుక నుంచి నడిపిస్తున్న సూచనలూ పొడగడుతున్నాయి. దేవుళ్ళూ, మతమూ, సంస్కృతీ, సభ్యతా, సంస్కారాలతో సహా మనవనుకునే అన్ని టినీ ఆకాశానికెత్తే నోళ్లే బూతులూ, అశ్లీలాల మురికిని పుక్కిలించడం ఈ మొత్తంలో ఒక అపహాస్యభరితమైన అతిపెద్ద వైరుద్ధ్యం. తమవైన వ్యవస్థలకూ, విలువలకూ తమ చేతులతోనే చెరుపుకోలేనంత మసీ, మకిలీ అంటించి చెరుపు చేస్తున్నామన్న స్పృహ కూడా లోపించిన పరిస్థితి. అన్ని తేడాలకూ అతీతంగా అందరూ ఒక్కటై కడతేర్చవలసిన సామాజిక రుగ్మతగా గుర్తించడమే దీనికి ఏకైక పరిష్కారం. -
ఇది ప్రజల గొంతుకను నొక్కడమే!
స్వేచ్ఛగా, విమర్శనాత్మకంగా పనిచేసే పత్రిక... ప్రజాస్వామ్యానికి రక్తనాళం లాంటిది.– నెల్సన్ మండేలాఈ మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు విని ఉండే అవకాశం లేదు. ఆయన దృష్టిలో పత్రికా స్వేచ్ఛ అంటే తనకు అనుకూల పత్రికల స్వేచ్ఛ మాత్రమే. ప్రశ్నించే పత్రిక అంటే భయం. అందుకే ‘సాక్షి’ మీడియా మీద కత్తి కట్టాడు. కక్ష పెంచుకుని వేధిస్తు న్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై 19 కేసులు పెట్టారు. దేశ చరిత్రలోనే ఇలాంటిది ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. జరిగే అవ కాశం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ఇది సాధ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం, విశ్వాసం, గౌరవం లేని నాయకుడు చంద్రబాబు.ఇదా విజనరీ లక్షణం?దేశం భద్రంగా ఉండాలంటే పత్రికా స్వేచ్ఛ అతి ముఖ్యం అంటాడు జాన్ ఆడమ్స్. అమెరికా వ్యవస్థాపకులుగా పిలవబడే ఐదుగురిలో ఆయన ఒకరు. తాము భద్రంగా ఉండాలంటే ప్రశ్నించే పత్రికలు ఉండకూడదని బాబు నమ్మకం. ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పట్టించిన వాళ్లలో ఈయన ప్రథముడు. కానీ ఆయన తనని తాను విజనరీ అని చెప్పుకొంటారు. విజనరీకి ఉండాల్సిన మొదటి లక్షణం పత్రికా స్వేచ్ఛను కాపాడడం. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో పత్రికా స్వేచ్ఛ ఒకటి. ఆ స్తంభం తన సొంత స్తంభం కావాలని చంద్రబాబు కోరిక. ‘సాక్షి’ అంటే చంద్రబాబుకు ఎందుకు భయమంటే... అది ప్రశ్నిస్తుంది; ప్రజల నిరసనను, అసహనాన్ని, కోపాన్ని, రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజల ఆగ్రహం నరసింహస్వామిగా మారి ఆ స్తంభంలోంచి ఉగ్రరూపం బయట పడుతుందని బాబు భయం. అందుకే ‘సాక్షి’ గొంతు నొక్కాలి, కేసులు పెట్టాలి, వీలైతే మూసి వేయించాలి. టీవీ ప్రసారాల్ని అడ్డుకోవాలి. అందుకే ఎడిటర్కూ, ఆ మీడియా జర్నలిస్టులకూ అన్ని వేధింపులు, కేసులు!చారిత్రక అవసరం లోంచి...‘సాక్షి’ ఒక చారిత్రక అవసరం లోంచి పుట్టింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల్ని, ప్రజా క్షేమం కోసం ఆయన చేస్తున్న మహోత్తర కార్యక్రమాల్ని, జనాన్ని ప్రేమించే ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నందుకు కత్తి కట్టి, మంచి పనుల్ని వక్రీకరిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ వచ్చింది. అబద్ధం నిజం అవుతున్నపుడు, నిజాల్ని పచ్చి నిజాలుగా చెప్పడానికి వచ్చింది. నిజం అంటే చంద్ర బాబుకు భయం. అందుకే ‘సాక్షి’ అంటే భయం. ప్రశ్నను భరించ లేని కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. ‘సాక్షి’లో వచ్చే కథ నాల్లోని కఠోర సత్యాలను భరించలేక భగ్గుమని ఒళ్లంతా కారం పూసుకుని మండి పడుతున్నారు. ఇంతకీ ‘సాక్షి’ ఏమడిగింది? నిజాలు చెప్పమని నిలదీసింది. పాలనలోని డొల్లతనాన్ని ప్రశ్నించింది. చంద్రబాబు వక్రీకరణలకు భాష్యం చెప్పింది. అభివృద్ధి, సంపద సృష్టి పదాలకు అసలు అర్థం అప్పులు, చంద్రబాబు సొంత సంపద సృష్టి అని తాత్పర్యం వివరించింది. బూటకపు మాటలకు ప్రతిపదార్థాన్ని విప్పి చెప్పింది. అందుకే కసి, క్రోధం, పగ! ప్రశ్నించడమే తప్పా?18 నెలల్లో చంద్రబాబు ఏం చేశాడు? ‘సూపర్ సిక్స్’ పేరుతో వంచించాడు. ఫించన్లు పెంచినట్టే పెంచి లక్షల్లో లబ్ధిదారుల్ని తగ్గించాడు. ‘అమ్మకు వందనం’ అంటూ తల్లుల్ని తొలగించాడు. ఏడాది ఎగ్గొట్టి, అరకొరగా ఇచ్చాడు. సిలిండర్ పథకంలో చంద్రబాబు గ్యాస్ కొట్టిందే ఎక్కువ. రైతులకు పంగనామాలు పెట్టి నామ్ కే వాస్తే నిధులిచ్చాడు. అన్ని బస్సులూ ఫ్రీ అని, కొన్ని బస్సుల్లోనే చెల్లెమ్మలు ఎక్కేలా చేశాడు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డల పథకం ఊసే లేదు. అయినా ‘సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్’ అని ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉంటే ‘సాక్షి’ ప్రశ్నించడం తప్పెలా అవుతుంది?ఎమ్మెల్యేలు తమ నియో జకవర్గాల్ని సంస్థానాలుగా భావించి ప్రజలతో కప్పం కట్టించుకుంటూ, పాలెగాళ్లలా అన్ని వనరుల్నీ దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడం తప్పా? పేకాట క్లబ్బులు, గంజాయి బ్యాచ్లు ఆడపిల్లలపై అత్యాచారాలు యథేచ్ఛగా సాగిస్తుంటే, పోలీసులు చూసీచూడనట్టు ఉంటే ‘సాక్షి’ కూడా చూసీ చూడనట్టుండాలా? అన్ని రంగాల్లో వైఫల్యాలు చెంది తండ్రీ కొడుకులు విమానాల్లో తిరు గుతూ, పెట్టుబడుల పేరిట దేశాలన్నీ పర్యటిస్తూ కాశీమజిలీ కథలు చెబుతూ ఉన్నా కూడా మౌనం వహించాలా? వైసీపీ హయాంలో, జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయి పోయిందని గోబెల్స్ ప్రచారం చేసినవాళ్లు 18 నెలల్లో చంద్రబాబు, ఆయన కూటమి ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లకు పైగా ఎందుకు అప్పులు చేశారో చెప్పగలరా? అనేక పథకాలతో ప్రజలకు చేరువై, ప్రజలకు మంచి చేస్తున్న జగన్ పై చిమ్మిన విషాన్ని చూసి ఒకవేళ గోబెల్స్ బతికి ఉంటే మళ్లీ ఆత్మహత్య చేసుకునేవాడు. సువిశాల రష్యాలోని జార్ చక్రవర్తుల అహంకారాన్ని, అరాచకాల్ని ‘ప్రావ్దా’ పత్రిక ద్వారా లెనిన్ కూల్చేశాడు. ప్రజల గొంతు పత్రిక ద్వారా వినిపించకపోతే పాలకుల గొంతే శిలాశాసనంగా మారుతుందని అంటాడు లెనిన్ . ప్రపంచానికి కమ్యూనిజాన్ని ప్రసాదించిన లెనిన్ పార్టీ నిర్మాణానికి, విప్లవానికి ప్రావ్దా మూలస్తంభం అంటాడు. పత్రికా స్వేచ్ఛను గౌరవించిన వాళ్లే చరిత్రలో నిలబడ్డారు. కూల్చేయాలని చూసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాదు, ప్రజాస్వామ్యం అంటేనే పత్రికా స్వేచ్ఛ అంటాడు ప్రముఖ అమెరికా పాత్రికేయుడు వాల్టర్ క్రాన్కైట్. కానీ మన చంద్రబాబు పాత్రికేయుల్ని జైల్లో పెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా మరుక్షణంలోనే పోలీసులు వాలిపోయే వ్యవస్థను సృష్టించాడు. ప్రజాస్వామ్యంలో పత్రికలపై పగబట్టిన వాళ్లంతా చిరునామా లేకుండా పోయారు. చంద్రబాబు కూడా అతీతుడు కాదు. స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని చూసిన వాళ్లంతా చరిత్రలో కలిసిపోయారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందని చెబుతున్న చంద్రబాబు చేతిలో అసలు దీపమే లేదు. ఆయన చేతిలో ఉన్నది అగ్గిపెట్టె మాత్రమే! దాంతో రాష్ట్రాన్ని తగలబెట్టే పనిలో ఉన్నాడు. సత్యం జయిస్తుంది. ‘సాక్షి’ కూడా జయిస్తుంది. దాని గొంతు నొక్కడం సాధ్యం కాదు, ఎందుకంటే అది ప్రజల గొంతు!వ్యాసకర్త: భూమన కరుణాకర రెడ్డిమాజీ ఎమ్మెల్యే -
విజృంభించిన బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత్ 117 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్లో సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్లో భారత్, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకొని సౌతాఫ్రికాను గడగడలాడించింది. అర్షదీప్ సింగ్ (4-0-13-2), వరుణ్ చక్రవర్తి (4-0-11-2), హర్షిత్ రాణా (4-0-34-2), కుల్దీప్ యాదవ్ (2-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-23-1), శివమ్ దూబే (3-0-21-1) చెలరేగడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్ (61) ఒంటరిపోరాటం చేయడంతో సౌతాఫ్రికా కనీసం మూడంకెల స్కోర్నైనా చేయగలిగింది.మిగతా ఆటగాళ్లలో ఫెరియెరా (20), నోర్జే (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్ (1), బ్రెవిస్ (2), స్టబ్స్ (9), కార్బిన్ బాష్ (4), జన్సెన్ (2), బార్ట్మన్ (1), ఎంగిడి (2 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. హెండ్రిక్స్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను భారత్ ధాటిగా ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత కాస్త నిదానించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించి ఔటయ్యాక శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 28; 5 ఫోర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఆచితూచి ఆడారు. శివమ్ దూబే (4 బంతుల్లో 10 నాటౌట్; ఫోర్, సిక్స్) వచ్చీ రాగానే బ్యాట్ ఝులిపించడంతో భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జన్సెన్, బాష్కు తలో వికెట్ దక్కింది. నాలుగో టీ20 లక్నో వేదికగా డిసెంబర్ 17న జరుగనుంది. -
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆంప్యూటేషన్ (కాళ్ల తొలగింపు)!
హైదరాబాద్: మన దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మధుమేహ బాధితులు ఎక్కువగా ఉన్నారని, వీరికి కాళ్లలో పుళ్లు పడినా నొప్పి తెలియకపోవడంతో అవి తీవ్రమై.. చివరకు కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వైద్య నిపుణులు తెలిపారు. ప్రతి నలుగురు మధుమేహ బాధితుల్లో ఒకరికి ఈ తరహా సమస్య వస్తోందన్నారు. ముందుగా గుర్తించగలిగితే వాస్క్యులర్ చికిత్సలతో కాళ్లను కాపాడుకునే అవకాశం ఉంటుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ బొల్లినేని తెలిపారు.అన్ని విభాగాలకు చెందిన వైద్యుల సమన్వయంతో మధుమేహ బాధితుల కాళ్లను తొలగించాల్సిన అవసరం లేకుండా కాపాడుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ అంశంపై ఆస్పత్రి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) సదస్సులో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో ప్రధానంగా వాస్క్యులర్ సర్జన్లు, ప్లాస్టిక్ సర్జన్లు, పోడియాట్రిస్టులు (పాదాల నిపుణులు), జనరల్ సర్జన్లు, ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు, ఇన్ఫెక్షువస్ డిసీజ్ స్పెషలిస్టులు ఉన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేష్ బొల్లినేని మరియు బృందం మాట్లాడుతూ, “చికిత్సా పద్ధతిని ప్రామాణీకరించడం ద్వారా మధుమేహ బాధితులలో కాళ్ల తొలగింపును నివారించడం, తగ్గించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ముప్పును ముందుగా గుర్తించడం, వాస్క్యులర్ చికిత్సలు చేయడం, ఇన్ఫెక్షన్లను నియంత్రించడం, గాయాలు, మృదు కణజాలాలకు చికిత్సలు అందించడం, దీర్ఘకాలం పాటు పాదాల సంరక్షణ ఎలా చేసుకోవాలో మధుమేహ బాధితులకు చెప్పడం లాంటివి చాలా ముఖ్యం.దేశంలో ఇతర ప్రాంతాల కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో మధుమేహం చాలా ఎక్కువమందికి ఉంటోంది. దానివల్ల కాళ్ల తొలగింపు ముప్పు కూడా ఇక్కడే ఎక్కువగా కనిపిస్తోంది. మధుమేహం ఉన్న ప్రతి నలుగురిలో తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి ఒకరికి కాళ్లలో పుళ్లు ఏర్పడతాయి. అయితే, వారికి స్పర్శ అంతగా తెలియకపోవడంతో ఆ విషయాన్ని గుర్తించరు. దీనివల్ల పుళ్లు ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి కాళ్లు తొలగించాల్సి వస్తోంది. అందువల్ల కేవలం మధుమేహ నియంత్రణకే వైద్యులు పరిమితం కాకుండా.. సమగ్ర చికిత్సలు చేయాల్సిన అవసరం ఉంది.అత్యాధునిక ఊండ్ కేర్ విధానాలు పాటించాలి. అలాగే ఇన్ఫెఫెక్షన్లను నియంత్రించాలి. మధుమేహ బాధితుల కాళ్లను కాపాడడంతో వాస్కులర్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. గతం కంటే ఇప్పుడు ఎండోవాస్క్యులర్ విధానాలు, ఆధునిక రీకన్స్ట్రక్టివ్ టెక్నిక్లు, డెర్మల్ సబ్స్టిట్యూట్లు రావడంతో చికిత్స ఫలితాలు మెరుగుపడుతున్నాయి. చాలా కేసుల్లో చివరి దశకు చేరుకున్న తర్వాతే రోగులు వైద్యులను సంప్రదించడం పెద్ద సవాలుగా మారుతోంది” అని తెలిపారు.ప్లాస్టిక్ సర్జన్ డా. శరత్ చంద్రరెడ్డి మరియు ఆయన బృందం మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారు కాళ్ల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, చిన్న గాయం కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని పలువురు ఇతర వైద్య నిపుణులు సూచించారు. ముందస్తు స్క్రీనింగ్, సరైన అవగాహనతో చాలావరకు కాళ్ల తొలగింపులను నివారించవచ్చని వారు స్పష్టం చేశారు. ఇలాంటి సీఎంఈ కార్యక్రమాల ద్వారా వైద్యుల్లో అవగాహనను పెంచుతూ, రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి కిమ్స్ ఆస్పత్రి కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు. -
నిధుల సమీకరణలో పర్సెప్టైన్
ఏఐ రోబోటిక్స్ అంకుర సంస్థ పర్సెప్టైన్ వచ్చే ఏడాది మరింతగా నిధులను సమీకరించడంపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే దేశీ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రూ. 30 కోట్లు సేకరించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు జగ్గరాజు నడింపల్లి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా చెప్పారు. ఇంటెల్ సీఈవో తదితరులు తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. గణనీయంగా పెరుగుతున్న క్లయింట్లకు తగ్గట్లుగా ఉత్పత్తులను అందించే సామర్థ్యాలను పెంచుకునేందుకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఆమ్ని, యునో, డ్యుయో అనే మూడు రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు వివరించారు. ఆటోమోటివ్, ఎల్రక్టానిక్స్ తదితర విభాగాల్లో తమకు క్లయింట్లు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏటా తొమ్మిది వేల పైచిలుకు రోబోలు దిగుమతవుతున్నాయని చెప్పారు.అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ ఒక్క దేశంపైనో ఆధారపడితే సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున దేశీయ పరిజ్ఞానంతో ఇంటెలిజెంట్ హ్యూమనాయిడ్ రోబోల తయారీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పైలట్ దశలో వందల స్థాయిలో ఉన్న ఉత్పత్తిని త్వరలో వార్షికంగా వెయ్యి రోబోల స్థాయికి పెంచుకోనున్నట్లు నడింపల్లి వివరించారు. ప్రస్తుతం సంస్థలో నలభై మంది వరకు సిబ్బంది ఉన్నారని చెప్పారు. రోబోటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, టెక్నీíÙయన్స్ మొదలైన విభాగాలవ్యాప్తంగా మరింత మందిని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. -
సినిమాలకు డిసెంబరు ఇలా కలిసి వచ్చేస్తుందేంటి?
సాధారణంగా డిసెంబరు నెల సినిమా ఇండస్ట్రీలకు సీజనే. కాకపోతే ఓ మాదిరి హిట్స్, కలెక్షన్స్ మాత్రమే వస్తుండేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే సీన్ పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్కి తెగ కలిసొచ్చేస్తోంది. పాన్ ఇండియా మూవీస్ అయితే కొన్ని వారాల పాటు ఆడేసి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇంతకీ డిసెంబరు సంగతేంటి? ఏయే సినిమాలకు ఎలా కలిసొచ్చిందనేది చూద్దాం.డిసెంబరు అంటే చలికాలం. క్రిస్మస్ పండగకు సెలవులు ఉంటాయి కాబట్టి చాలావరకు ఈ ఫెస్టివల్ టార్గెట్ చేసుకుని మూవీస్ రిలీజ్ చేస్తుంటారు. కానీ కొవిడ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఇదే నెలలో వివిధ తేదీల్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకుంటున్నాయి. కొవిడ్ తర్వాత ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. 2021 నుంచి ప్రతి ఏడాది ఏదో ఓ సినిమా ప్రేక్షకుల్ని అలరించి వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతూనే ఉంది.2020లో కరోనా రావడం వల్ల పెద్ద సినిమాల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. చాలా చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అలా 2021 డిసెంబరులో తొలుత 'పుష్ప' వచ్చింది. ఏ మాత్రం అంచనాల్లేకుండా రిలీజై పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దాదాపు నెలరోజుల పాటు సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఈ మూవీ ఒక ఊపు ఊపేసింది. వారం పదిరోజుల తర్వాత వచ్చిన రిలీజైన 'అఖండ' కూడా హిట్ అయింది. 2022లో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం టాలీవుడ్ నుంచి రాలేదు.2023 డిసెంబరులోనూ టాలీవుడ్ బాక్సాఫీస్కి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే నెల మొదట్లో సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' వచ్చి దుమ్ములేపింది. దర్శకుడు తప్ప మిగిలిన వాళ్లంతా హిందీ యాక్టర్సే అయినప్పటికీ తెలుగులోనూ అద్భుతమైన వసూళ్లు దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. నెల చివరలో వచ్చిన ప్రభాస్ 'సలార్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ.600 కోట్ల మేర వసూళ్లు సొంతం చేసుకుంది.గతేడాది జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప' మేనియాని కొనసాగిస్తూ సీక్వెల్ని గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి పార్ట్ ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తే.. దీనికి మాత్రం అంతకు మించి అనేలా స్పందన వచ్చింది. తెలుగు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఉత్తరాదిలో వచ్చిన కలెక్షన్స్ చూసి అందరికీ కళ్లు చెదిరిపోయాయి. చెప్పాలంటే మూవీ టీమ్ కూడా ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ వస్తాయని ఊహించి ఉండదు.ఈ ఏడాది కూడా డిసెంబరులో బాగానే కలిసొచ్చింది. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన బాలీవుడ్ మూవీ 'దురంధర్'.. అదిరిపోయే టాక్తో పాటు వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది. హిందీ వెర్షన్ మాత్రమే ఉన్నప్పటికీ హైదరాబాద్ లాంటి చోట కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. ఇక 'అఖండ 2' సీక్వెల్ తాజాగానే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడే దీని ఫలితం గురించి చెప్పలేం. ఎందుకంటే తొలి భాగంతో పోలిస్తే ఇందులో కాస్త అతి ఎక్కువైందని అంటున్నారు. కొన్నిరోజులు ఆగితే రిజల్ట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. ఇలా కొవిడ్ తర్వాత పాన్ ఇండియా సినిమాలకు డిసెంబరు అనేది లక్కీగా మారిపోయింది. చెప్పాలంటే ఇది ఎవరూ ఊహించలేదు. చూస్తుంటే ఇకపై సంక్రాంతి, దసరాలానే డిసెంబరు కూడా సినిమాలకు సీజన్ అయిపోతుందేమో చూడాలి? -
పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలుఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్లా మారిపోయాడని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్సీపీ ఖండిస్తోంది.మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్ జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తిపీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారంఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.స్థాయీ సంఘం పేరుతో అబద్దాలుకేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్ జగన్ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.వైఎస్ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు, పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని.. ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానాప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా... కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60 సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైందిమెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం 2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయంరాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు. -
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి భారత ప్లేయర్గా
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో వంద వికెట్ల మైలు రాయిని పాండ్యా అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1000 పరుగులతో పాటు వంద వికెట్లు సాధించిన తొలి భారత ప్లేయర్గా హార్దిక్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్గా పాండ్యా నిలిచాడు. అతడు ఇప్పటివరకు టీ20ల్లో 1939 పరుగులతో పాటు వంద వికెట్లను సాధించాడు. పాండ్యా దారిదాపుల్లో ఏ భారత ప్లేయర్ లేరు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ తలా రెండు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 61) టాప్ స్కోరర్గా నిలిచాడు.టీ20ల్లో 1000+ పరుగులు & 100+ వికెట్లు తీసిన ఆటగాళ్ళు:మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్) - 2417 పరుగులు & 104 వికెట్లుషకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 2551 పరుగులు & 149 వికెట్లుసికందర్ రజా (జింబాబ్వే) - 2883 పరుగులు & 102 వికెట్లువిరణ్దీప్ సింగ్ (మలేషియా) - 3180 పరుగులు & 109 వికెట్లుహార్దిక్ పాండ్యా (భారత్) - 1939 పరుగులు & 100* వికెట్లు -
అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలి
గోస్ట్ వేర్హౌస్లు గురించి చాలామంది వినే ఉంటారు. బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మనుషులు కనిపించరు, అందుకే వీటిని గోస్ట్ అని పిలుస్తారు. ఇక్కడంతా ఏఐ ఆధారిత రోబోట్స్ పనిచేస్తుంటాయి. 24/7 అలసట లేకుండా.. సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి తరహా విధానం చైనాలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అన్ని పనుల్లో రోబోలే!పాస్కల్ బోర్నెట్ (Pascal Bornet) అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. కొన్ని ఏఐ ఆధారిత రోబోటిక్ వాహనాలు నెమ్మదిగా కదులుతూ.. కంటైనర్లను మోసుకెళ్తుండటం చూడవచ్చు. వీడియోలో ఒక్క మనిషి కూడా కనిపించడు. గిడ్డంగులలో సరుకులు ఎత్తడం, కదలించడం, ప్యాక్ చేయడం వంటివన్నీ ఏఐ రోబోలే చూసుకుంటారు. కాబట్టి మనుషుల అవసరం ఉండదు.అలీబాబా, జేడీ.కామ్ వంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి ఏఐ రోబోట్స్ వినియోగిస్తున్నాయి. ఇలాంటి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. కార్మిక కొరత ఉండదు, మానవుల మాదిరిగా తప్పులు జరగవు, ఖర్చులు తగ్గిన్చుకోవచ్చు, పని కూడా వేగంగా.. నిరంతరాయంగా జరుగుతుంది.Ghost warehouses aren’t science fiction anymore — they’re already humming quietly in ChinaThey are warehouses run entirely by AI-powered robots, operating 24/7 with zero human presence.China and much of Asia have already embraced this shift, and they’re not slowing down.… pic.twitter.com/Spxwfaq7TJ— Pascal Bornet (@pascal_bornet) December 12, 2025మనుషులు చేయాల్సింది!ఈ వీడియో షేర్ చేసిన.. పాస్కల్ బోర్నెట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, పనులన్నీ రోబోలు చేస్తున్నాయి, మనుషులు ఏమి చేయాలో ఆలోచించాలని అన్నారు. రోబోలు ఎప్పుడూ ఒకే పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు డిజైన్, ఇన్నోవేషన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి వారిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. చివరగా మీరేమనుకుంటున్నారని.. ప్రశ్నిచారు.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..పని చేయడానికి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. చాలామంది ఉద్యోగావకాశాలు కోల్పోతారు. అయితే సంస్థలు కొత్త స్కిల్స్ రోబోల నుంచి ఆశించడం అసాధ్యం. రోబోట్స్ వినియోగం చైనా వంటి దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి విధానం ప్రారంభం కావడానికి ఎంతోకాలం పట్టకపోవువచ్చు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ''మనుషులు కష్టపడే యంత్రాలు కాదు - ఆలోచించే సృష్టికర్తలు''. కాబట్టి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. -
టీమిండియాకు ఊహించని షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడు. దీంతో ధర్మశాల వేదికగా సఫారీలతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20కు బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు మూడో టీ20కు అందుబాటులో లేడు. బుమ్రా తదుపరి మ్యాచ్లకు జట్టులో చేరే విషయంపై అప్డేట్ ఇస్తామని" బీసీసీఐ పేర్కొంది. ఇదే విషయాన్ని టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక జస్ప్రీత్ స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణా తుది జట్టులో వచ్చాడు. బుమ్రాతో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ధర్మశాల టీ20కు దూరమయ్యాడు. దీంతో కుల్దీప్ యాదవ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది. అయితే బుమ్రా తిరిగి జట్టులో చేరుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ సిరీస్లో భాగంగా నాలుగో టీ20 డిసెంబర్ 17న లక్నో వేదికగా జరగనుంది. రెండు రోజుల సమయం లభించడంతో అతడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన సఫారీలు తడబడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. హర్షిత్ రాణా రెండు , అర్ష్దీప్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు.తుది జట్లుదక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్మన్భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్కీపర్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Asia Cup 2025: పాకిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా.. -
గ్లామర్ బ్యూటీస్ క్లాస్ టచ్.. శ్రీలీల ఇలా మృణాల్ అలా
మరాఠీ స్టైల్లో చీరకట్టుతో మృణాల్ ఠాకుర్చీరలో అందాల ముద్దుగుమ్మలా అనసూయతెల్లని డ్రస్లో అతిలోక సుందరిలా శ్రీలీలబ్లాక్ అండ్ వైట్ శారీలో ముద్దొచ్చేలా నిహారికబెలూన్తో హీరోయిన్ అనన్య నాగళ్ల ఫన్నీ గేమ్జీన్స్లో రచ్చ లేపేస్తున్న ఆషికా రంగనాథ్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) -
ఇది సుమన్కు మాత్రమే సాధ్యం.. మళ్లీ జరగదు, జరగబోదు!
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఈ ట్యాగ్లైన్తోనే సీజన్ మొదలైంది. ఈ ట్యాగ్తోనే సీజన్ ముగింపు కాబోతోంది. కామనర్ కల్యాణ్, సెలబ్రిటీ తనూజలలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ కాబోతున్నారు. సీజన్ ముగింపుకు చేరుకోవడంతో హౌస్లో డబుల్ ఎలిమినేషన్ ప్రకటించారు. అందులో భాగంగా సుమన్ను ఎలిమినేట్ చేశారు.. నేటి ఎపిసోడ్లో భరణిని పంపించేయనున్నారు.ఒక్క కారణం..సుమన్ ఇన్ని వారాలు కొనసాగడమనేది కొంత ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు. ఎందుకంటే అతడు బలంగా గేమ్ ఆడింది లేదు, కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలు చేస్తూ సింపతీకి ప్రయత్నించిందీ లేదు, కంటెంట్ కోసం ఓవరాక్టింగ్ చేసిందీ లేదు. అయినా 14 వారాలు హౌస్లో ఉన్నాడు. అందుకు గల ఏకైక కారణం అమాయకత్వం.నవ్విస్తాడనుకుంటే..సినిమాల్లో కమెడియన్గా నవ్వించిన సుమన్ శెట్టి బిగ్బాస్ హౌస్లో కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా సైలెంట్గా ఉండిపోయాడు. సాధారణంగా అలా ముఖం పక్కకు తప్పుకుని కూర్చుంటే జనాలు వాళ్లను వీలైనంత త్వరగా హౌస్ నుంచి పంపించేస్తారు. కానీ, సుమన్ను ఎన్నో ఏళ్లుగా అభిమానించినవాళ్లకు అతడిని పంపించేసేందుకు మనసొప్పలేదు. అతడి ముఖంలో, ఆటలో, ప్రవర్తనలో అమాయకత్వాన్ని చూశారు.ఒక్క స్టెప్పేస్తే చాలువీలైనంత వరకు ఎవర్నీ నొప్పించకుండా మాట్లాడేవాడు. మాట్లాడింది తక్కువసార్లే అయినా.. అందులోనూ నీతి, నిజాయితీ వైపు నిలబడ్డ తీరుకు ఫిదా అయ్యారు. ఆయన ఒక్క స్టెప్పేస్తే చాలు.. జనం హాయిగా నవ్వుకునేవారు. తన బలం తనకు తెలియదన్నట్లు టికెట్ టు ఫినాలే రేసులో సుమన్ బాగా ఆడాడు. కానీ, అది సరిపోదు.. అంతా వదిలేసి చివర్లో కసితో ఆడితే ఏం లాభం.. అందుకే ఎలిమినేట్ అయ్యాడు.అందుకే 14 వారాలుకేవలం అమాయకత్వంతో 14 వారాలు హౌస్లో ఉండటం సుమన్ శెట్టి (Suman Shetty) కి మాత్రమే సాధ్యమైంది. ఆయన స్థానంలో ఎవరున్నా బిగ్బాస్ షోకి మీరు సెట్టవరు అని ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా పంపించేసేవారు. సుమన్ను మాత్రం ఆరాధించారు, అభిమానించారు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, జరగబోదు కూడా అన్నది సోషల్ మీడియాలో నెటిజన్ల వాదన! -
ప్రైవేటు వ్యక్తులకు లాభాలు, పేదలపై భారమా?: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లోమీడియా రాతలు రాయడం అన్యాయం, దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ‘‘గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్, విదేశీ దాడులకు సాఫ్ట్ టార్గెట్ అని రాశారని, విశాఖ భూకంపాల జోన్లో ఉంది. హైరిస్క్ ఏరియా అని రాశారని, గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది, కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు.‘‘ఇప్పుడు విశాఖపట్నం అద్బుతం, ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, బంగారం పండుతుంది, సిలికాన్ లభిస్తుంది, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు విజన్ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని రాస్తున్నారు’’ అంటూ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..ఆ సంఘం సిఫార్సులంటూ పిచ్చిరాతలు:పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఏడాదిగా చెబుతున్నారు. ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో ఇండిగో వ్యవహారంలో చూశాం. మన ఎంపీ కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారో చూశాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీలు లేకపోతే మన పరిస్ధితి ఏంటో అంతా అలోచించాలి. వైద్య వ్యవస్థలు ప్రైవేటు చేతుల్లో ఉంటే కరోనా లాంటి విపత్తుల్లో ఏం జరిగి ఉండేదో ఆలోచించాలి.ఇప్పుడు పార్లమెంటరీ స్దాయీ సంఘం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. నిజానికి కమిటీ ఏం చెప్పిందన్నది చూస్తే.. మెడికల్ కాలేజీల నిర్వహణకు ఎవరైనా ముందుకొస్తే రాయితీలు ఇవ్వాలని, అర్హులైన విద్యార్ధులుంటే స్కాలర్ షిప్పులు ఇవ్వాలని, వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి అని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పింది. వైద్య విద్య, సామాగ్రి ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే సిఫార్సు చేసింది.అంతే తప్ప ఉన్నవాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని ఎక్కడా చెప్పలేదు. అదే వాస్తవమైతే ఎయిమ్స్, జిప్ మర్, ఐఐటీ వంటి సంస్థలు కూడా పీపీపీ విధానంలో పెట్టుకోవాలి కదా?. ప్రైవేటువాళ్లు ముందుకొస్తే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టాలని మాత్రమే పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్తే ఉన్న కాలేజీల్ని ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం స్కాం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, వెన్నుపోటే కాదు పేదల కలకల్ని తుంచేయడమే అవుతుంది. దీనికి తోడు ప్రైవేటు ఆస్పత్రుల్లో జీతాలు కూడా ప్రభుత్వమే రెండేళ్ల పాటు ఇస్తుందంటున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా విన్నామా ? భూములు, భవనాలు, ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే లాభాలు ప్రైవేటుకు ఇచ్చి, భారం పేదలపై వేస్తారా? ఇదీ చంద్రబాబు చెప్తున్న పీపీపీ మోడల్. మొన్నటివరకూ పీపీపీ మోడ్ లో ఏర్పాటు చేసినా ప్రభుత్వం నిర్వహణ చూస్తుందన్నారు. అంటే జీతాలు ప్రభుత్వం ఇచ్చి లాభాలు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లడమా ?, ఇది కొత్త మౌలిక సదుపాయాల కల్పన కాదు, ఉన్న వాటినే ప్రైవేటు చేతుల్లో పెట్టడం. మెడికల్ కాలేజీలు కొత్త వారు ఏర్పాటు చేస్తామంటే వారికి రాయితీలతో అవకాశం ఇవ్వండి. అంతే తప్ప మనం డబ్బులు పెట్టి, భూసేకరణ చేసి, భవనాలు కట్టి ప్రైవేటుకు లాభాలు ఇస్తారా ? ఇది మంచి విధానం అంటూ ఆస్థాన కరపత్రికలతో పొగడ్తలా ?జగన్కి పేరు వస్తుందనే ఇదంతా..:మొన్నే రెండు వారాల క్రితం అమరావతి కోసం రూ.7500 కోట్లు అప్పు చేశారు. నిన్న దాన్ని క్యాబినెట్లో ఆమోదించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నారు. కలల రాజధానిలో కి.మీ రోడ్డు వేసేందుకు రూ.180 కోట్లకు టెండర్ ఇచ్చారు. అలా మూడు కి.మీ రోడ్డు కోసం రూ.540 కోట్లకు టెండర్ ఇచ్చారు. రెండు, మూడు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయిపోతుంది. కానీ మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంటున్నారు.పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు దోచి పెడుతున్నారు:అసలు మెడికల్ కాలేజీలకు కొత్తగా డబ్బు తీసుకు రావాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ హయాంలోనే నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. నాబార్డ్ను సంప్రదిస్తే మెడికల్ కాలేజీలకు నిధులు దొరుకుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. కేవలం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే దుగ్ద తప్ప ఇందులో మరొకటి లేదు. అందుకే వాటిని ప్రైవేటు వ్యక్తులకు, బినామీలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క మెడికల్ కాలేజీలో ఉద్యోగుల నెల జీతాలకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అవుతుంది. 10 మెడికల్ కాలేజీలకు ఇలా ఇస్తే రూ.700 కోట్లు అవుతుంది. రెండేళ్లు ఇలా ఇస్తారా?. ఇది ఎంత వరకు సబబు?ఇంకా 10 మెడికల్ కాలేజీలకు సుమారు 257 ఎకరాలు సేకరించాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల చొప్పున దోచి పెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీజీ సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ప్రైవేటుకు ఇచ్చేశారు. ఎన్నారై సీటు ఫీజు రూ.29 లక్షలని జీవో కూడా ఇచ్చారు. మేనేజ్ మెంట్ కోటా సీటు రూ.9 లక్షలని ఇచ్చారు.రికార్డుస్థాయిలో అప్పు:అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోంది? డబ్బుల్లేవంటూనే 18 నెలల్లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రానికి భారీ అప్పులు తెచ్చుకుంటూ మరోవైపు జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారు.కోటి సంతకాలు గవర్నర్కి సమర్పణ:10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలపై ప్రజా ఉద్యమం చేపట్టిన వైయస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించింది. దానికి అన్ని చోట్ల, అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఆ కోటి సంతకాల పత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకోగా, సోమవారం (డిసెంబరు 15వ తేదీ) అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అక్కణ్నుంచి అవి విజయవాడ చేరుకుంటాయి. ఆ పత్రాలను ఈనెల 18న గవర్నర్కి సమర్పిస్తాం. ఆ మేరకు ఆరోజు సా.4 గం.కు, మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్నజీర్తో భేటీ కానున్నారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వివరించారు. -
వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..
భారతదేశంలో.. చాలా ప్రభుత్వ & ప్రైవేట్ సంస్థలు వారానికి 5 రోజుల పని షెడ్యూల్ను పాటిస్తున్నాయి. కానీ ఇప్పుడు చాలామంది కార్మికులు వారానికి నాలుగు రోజులు పని చేసి మూడు రోజులు సెలవు తీసుకోవాలని కోరుకుంటారు. జపాన్, స్పెయిన్ & జర్మనీ వంటి దేశాలు వారానికి 4 రోజుల పని విధానాన్ని పాటిస్తున్నాయి. ఇది ఇండియాలో సాధ్యమవుతుందా? అని చాన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయంపైనే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.మంత్రిత్వ శాఖ.. వారానికి నాలుగురోజుల పనికి సమ్మతించినట్లు పోస్టులో వెల్లడించింది. అయితే కొన్ని షరతులను కూడా వెల్లడించింది. సవరించిన కార్మిక నియమావళి ప్రకారం.. నాలుగు రోజులు, రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులుగా పొందవచ్చని స్పష్టం చేసింది.మంత్రిత్వ శాఖ ప్రకారం వారానికి 48 గంటలు (4 రోజులు, రోజుకు 12 గంటలు) పనిచేయాలన్న మాట. ఉద్యోగులు దీనికి సిద్ధంగా ఉంటే.. ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు ఉండవు. ఈ సమయంలో రోజుకు 12 గంటలు పనిచేస్తే.. ఓవర్ టైం కింద జీతం పెరుగుతుందా? అనే ప్రశ్న తలెత్తింది. వారంలో 48 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే.. ఓవర్ టైంకి అదనపు చెల్లింపులు ఉంటాయి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.The Labour Codes allow flexibility of 12 hours for 4 workdays only, with the remaining 3 days as paid holidays.Weekly work hours remain fixed at 48 hours and overtime beyond daily hours must be paid at double the wage rate.#ShramevJayate pic.twitter.com/5udPMqRXbg— Ministry of Labour & Employment, GoI (@LabourMinistry) December 12, 2025నాలుగు లేబర్ కోడ్లుభారతదేశంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు.. వచ్చినట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు. అవి ''వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తి భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSHWC) (2020)''.వేతనాల కోడ్ (2019): కనీస వేతనాలను నోటిఫైడ్ 'షెడ్యూల్డ్ ఉద్యోగాల'కు అనుసంధానించే మునుపటి వ్యవస్థను భర్తీ చేస్తూ, అన్ని రంగాలలో కనీస వేతనాలు & సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును ఈ కోడ్ వివరిస్తుంది.పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020): ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు/మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం ఈ కోడ్ లక్ష్యం.సామాజిక భద్రత కోడ్ (2020): సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది. అంతే కాకుండా మొదటిసారిగా గిగ్ & ప్లాట్ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్వర్క్ను సృష్టిస్తుంది.OSHWC కోడ్ (2020): ఈ కోడ్ కార్యాలయ భద్రత & పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో విలీనం చేస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు -
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి.. భారత్లో ‘హై అలర్ట్’
ఢిల్లీ: భారత్లోని పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో యూదుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో హై-అలర్ట్ జారీ చేశారు.ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన యూదుల పండుగ హనుక్కా సందర్భంగా ఉగ్రవాదులు పెద్ద దాడులు చేయాలని యోచిస్తున్నట్లు భారత్లోని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇజ్రాయెల్కు సంబంధించిన సంస్థల్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.హనుక్కా పండుగ ఎప్పుడు?యూదులు ఘనంగా జరుపుకునే ఎనిమిది రోజుల పండుగ హనుక్కా. ఈ పండుగ డిసెంబర్ 14 నుండి ప్రారంభమైంది. ఈ పండుగ సమయంలో యూదులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తారు. అందువల్లే పండుగ పర్వదినాన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఏ నగరాలు ప్రధాన టార్గెట్?ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం యూదు సంస్థలు, ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద భద్రత పెంచారు. విదేశీ పర్యాటకులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం, రాష్ట్రాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. -
నిధి అగర్వాల్తో 'రాజాసాబ్' డ్యాన్స్.. ప్రోమో చూశారా?
డార్లింగ్ ప్రభాస్ ఫుల్ స్పీడుమీదున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన హారర్ మూవీ ది రాజాసాబ్. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి ఇటీవలే రెబల్ సాబ్ పాట రిలీజైంది. రెబల్ స్టార్ పేరుపై వచ్చిన సాంగ్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. సెకండ్ సాంగ్ ప్రోమోతాజాగా రాజాసాబ్ నుంచి సెకండ్ సాంగ్ 'సహానా సహానా' ప్రోమో వదిలారు. 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాటలో ప్రభాస్.. నిధితో స్టెప్పులేశాడు. తమన్ సంగీతం అందించాడు. సహానా సహానా ఫుల్ సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానున్నట్లు వెల్లడించారు. తొలిసారి హారర్ జానర్లో ప్రభాస్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కన్నా ముందే అంటే జనవరి 9న విడుదల కానుంది. It all begins with the #SahanaSahana PROMO setting the mood in pure soothing vibes ❤️🔥❤️🔥Video Song arrives on Dec 17th at 6:35 PM 💥💥A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas @AgerwalNidhhi @peoplemediafcy pic.twitter.com/mM4hiaj8QX— Director Maruthi (@DirectorMaruthi) December 14, 2025 -
జియో లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: యూజర్లకు పండగే!
రిలయన్స్ జియో తన కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్ఫోలియోను ''హ్యాపీ న్యూ ఇయర్ 2026'' ప్లాన్లను ఆవిష్కరించింది. ఇందులో నెల రోజుల ప్లాన్, ఏడాది ప్లాన్ రెండూ ఉన్నాయి. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హీరో యాన్యువల్ రీఛార్జ్ఏడాది పాటు రీఛార్జ్ కావాలనుకునే వారి కోసం రిలయన్స్ జియో ఈ ప్లాన్ పరిచయం చేసింది. రూ. 3599లతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.5 జీబీ 5జీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్కు 18 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ను పొందవచ్చు.సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ పేరుతో 500 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా జియో ప్రకటించింది. ఇది 28 రోజుల చెల్లుబాటు ఉన్నప్పటికీ.. రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా ఓటీటీ ప్రయోజనాలు (యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్స్టార్, సోని లివ్, జీ5 మొదలైనవి) లభిస్తాయి. యాన్యువల్ ప్లాన్ మాదిరిగానే 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా పొందవచ్చు.ఫ్లెక్సీ ప్యాక్ఫ్లెక్సీ ప్యాక్ పేరుతో.. 103 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. అయితే ఇందులో కేవలం డేటా మాత్రం లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుడు.. హిందీ, ఇంటర్నేషనల్, ప్రాంతీయ ప్యాక్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్లిమిటెడ్ కాల్స్ -
ఎనిమిదేళ్లు సాగిన కేసులో తుది తీర్పు.. హీరోయిన్ భావన రియాక్షన్
హీరోయిన్ భావన స్వతహాగా మలయాళీ. కానీ తెలుగులోనూ ఒంటరి, మహాత్మ తదితర సినిమాలు చేసింది. అయితే ఈమెపై 2017లో దారుణం జరిగింది. రాత్రిపూట ఈమెని కిడ్నాప్ చేసి, రెండు గంటల పాటు లైంగిక వేధింపులకు గురిచేశారు. తొలుత పదిమందిని అనుమానితులుగా చేర్చరు. తర్వాత హీరో దిలీప్ని కూడా అనుమానితుడిగా చేర్చారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ కేసులో రీసెంట్గానే తుదితీర్పు వచ్చింది. ఆరుగురుని దోషులుగా తేల్చారు. హీరో దిలీప్ని మాత్రం నిర్దోషిగా ప్రకటించారు.అయితే ఈ తీర్పు విషయమై హీరోయిన్ భావన అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఈ మాత్రం న్యాయమైనా జరిగింది అని ఆనందపడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ట్రయల్ కోర్టుపై తను నమ్మకం కోల్పోవడానికి కారణాలు బయటపెట్టింది. అలానే ఈ దేశంలో న్యాయవ్యవస్థ ముందు అందరికీ ఒకేలాంటి న్యాయం దొరకదని కూడా చెప్పుకొచ్చింది.'8 సంవత్సరాల 9 నెలల 23 రోజుల తర్వాత ఈ బాధాకరమైన ప్రయాణంలో చిన్నపాటి ఆశ కనిపించింది. ఆరుగురు నిందితులకు శిక్ష ఖరారైంది. నా బాధ అబద్ధం, ఇదంతా కట్టుకథ అనుకునే వాళ్లకు ఈ తీర్పు అంకితం. మీకు ఇప్పుడు మనశ్శాంతి దొరికిందని అనుకుంటున్నా''అందరూ అనుకుంటున్నట్లు మొదటి అనుమానితుడు నా డ్రైవర్ కాదు, అదంతా అబద్ధం. నేను చేస్తున్న ఓ సినిమా కోసం ప్రొడక్షన్ కేటాయించిన డ్రైవర్ అతడు. సంఘటన జరిగిన రోజు తప్పితే అంతకు ముందు ఒకటి రెండుసార్లు మాత్రమే చూశా. కాబట్టి అసత్య ప్రచారాలు ఆపండి. ఈ తీర్పు చాలామందికి ఆశ్చర్యపరిచి ఉండొచ్చు కానీ నాకు కాదు. ఎందుకంటే 2020 ప్రారంభంలోనే ఈ కేసులో ఏదో పొరపాటు జరుగుతుందనిపించింది. ప్రొసిక్యూషన్ కూడా కేసులో తేడా గుర్తించింది. మరీ ముఖ్యంగా ఓ అనుమానితుడు విషయంలో''ఇన్నేళ్లలో హైకోర్టు, సుప్రీంకోర్టుకి నేను పలుమార్లు వెళ్లాను. ట్రయిల్ కోర్టుపై నాకు నమ్మకం లేదని పేర్కొన్నాను. కానీ నా ప్రతి రిక్వెస్ట్ని తోసిపుచ్చారు. ఇన్నేళ్ల బాధ, కన్నీళ్లు, ఎమోషనల్ స్ట్రగుల్ తర్వాత.. 'దేశంలోని అందరికీ కోర్టులో ఒకేలాంటి ట్రీట్మెంట్ దొరకదు' అనే విషయం నాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇప్పటికీ నన్ను తిట్టే వాళ్లకు చెబుతున్నాను. మీరు అలానే అనుకోండి నాకేం అభ్యంతరం లేదు' అని భావన సుధీర్ఘ పోస్ట్ పెట్టింది.ట్రయల్ కోర్టుపై నమ్మకం కోల్పోవడానికి కారణాలు ఇవే అని భావన కొన్నింటిని ప్రస్తావించింది.నా ప్రాథమిక హక్కులకు రక్షణ దొరకలేదు. ఈ కేసులో కీలక సాక్ష్యమైన మెమొరీ కార్డ్ని మూడుసార్లు ట్యాంపర్ చేశారు. అది కూడా కోర్టు కస్టడీలో ఉండగానే.వాదనలు సాగుతున్నప్పుడే ఇద్దరు పబ్లిక్ ప్రొసిక్యూటర్స్ రాజీనామా చేశారు. ఈ కేసులో న్యాయం జరుగుతుందని ఆశపడొద్దని, కోర్టు వాతావరణం అస్సలు సరిగా లేదని నాతో చెప్పారు.మెమొరీ కార్డ్ ట్యాంపరింగ్ విషయంలో పక్కా దర్యాప్తు చేయమని ఎన్నోసార్లు అడిగా కానీ అది జరగలేదు. మళ్లీ మళ్లీ అడిగేంతవరకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా నాకు ఇవ్వలేదు.ఈ కేసు విషయమై న్యాయం జరగట్లేదని గౌరవనీయ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా స్వయంగా నేను లేఖ రాశాను.ఓపెన్ కోర్టులో ఈ కేసు విచారించాలని నేను అడిగాను. తద్వారా మీడియా, ప్రజలకు ఏం జరిగిందో తెలుస్తుందని అన్నాను. కానీ నేను అడిగిన విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు.ఈ సంఘటనకు కారణమేంటి?హీరో దిలీప్ తొలుత హీరోయిన్ మంజు వారియన్ని పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో బంధంలో ఉన్నప్పటికీ హీరోయిన్ కావ్య మాధవన్తో రిలేషన్ మెంటైన్ చేశాడు. కొన్నాళ్లకు మంజు విడాకులు ఇవ్వడంతో దిలీప్.. కావ్యని వివాహం చేసుకున్నాడు. అయితే కావ్య గురించి భావననే మంజుకి చెప్పిందని దిలీప్ అనుమానించాడు. ఈ క్రమంలోనే సుఫారీ ఇచ్చి భావనపై దారుణానికి ఒడిగట్టాడనేది ఆరోపణ. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
ఉగ్రమూకపై తిరగబడి.. వైరల్ వీడియో
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండై బీచ్లో ఉగ్ర దాడి వేళ ఓ పౌరుడు పెద్ద సాహసమే చేశాడు. ఉగ్ర మూకపై స్థానిక పౌరుడు తిరగబడ్డాడు. కాల్పులు జరుపుతున్న ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కొని అతడిపైనే కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతడిని తరిమికొట్టాడు. వందలాది మంది పర్యాటకులను ఉగ్రవాదుల నుంచి ఆ వ్యక్తి రక్షించాడు. ఈ వీడియో వైరల్గా మారింది.బాండి బీచ్ కాల్పుల ఘటనలో 10 మంది మరణించారు. బీచ్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైరింగ్ చేయడంతో వందల మంది పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగులను అదుపులోకి తీసుకున్నారు. హెలికాప్టర్లు, 30 అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH— Terrible Pics (@TerriblePic) December 14, 2025 -
మూడో టీ20లో టీమిండియా గెలుపు
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను టీమిండియా 117 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్లో సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్లో భారత్, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. మూడో వికెట్ డౌన్గెలుపు ఖరారయ్యాక టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ (12) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 109/3గా ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 30 బంతుల్లో మరో 9 పరుగులు చేస్తే చాలు. తిలక్ వర్మ (24), దూబే క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..92 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన గిల్.. మార్కో జాన్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత్ విజయానికి ఇంకా 26 పరుగులు కావాలి. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.10 ఓవర్లకు భారత్ స్కోరెంతంటే?10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్(28), తిలక్ వర్మ(17) ఉన్నారు. భారత్ తొలి వికెట్ డౌన్60 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులతో దూకుడుగా ఆడిన అభిషేక్.. బాష్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి.👉5 ఓవర్లకు భారత్ స్కోర్: 60/0. క్రీజులో అభిషేక్ శర్మ(35), గిల్(20) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న అభిషేక్118 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. 2 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 22), గిల్(5) ఉన్నారు.117 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ప్రోటీస్.. నిర్ణీత 20 ఓవర్లలో117 పరుగులకే ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించారు. సౌతాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 61) ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా ప్రోటీస్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.వరుణ్ మ్యాజిక్.. ఆలౌట్ దిశగా ప్రోటీస్స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. వరుణ్ దెబ్బకు ప్రోటీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఆరో వికెట్గా ఫెరీరా, ఏడో వికెట్గా జాన్సెన్ క్లీన్ బౌల్డయ్యాడు. 15.1 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 77/7ఐదో వికెట్ డౌన్..33 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కార్బిన్ బాష్(4).. శివమ్ దూబే బౌలింగ్లో ఔటయ్యాడు.పది ఓవర్లకు ప్రోటీస్ స్కోరెంతంటే?10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(28), బాష్(4) ఉన్నారు.సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్30 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.మూడో వికెట్ డౌన్.. బ్రెవిస్ ఔట్బ్రెవిస్(2) రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో బ్రెవిస్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ట్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు.సౌతాఫ్రికాకు భారీ షాక్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన అర్ష్దీప్ బౌలింగ్లో హెండ్రిక్స్ వికెట్ల ముందు దొరికిపోగా.. రెండో ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్లో క్వింటన్ డికాక్(1) ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(4), బ్రెవిస్)2) ఉన్నారు.ధర్మశాల వేదికగా మూడో టీ20లో సౌతాఫ్రికా-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత దూరమయ్యాడు.ఈ విషయాన్ని టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. అదేవిధంగా అక్షర్ పటేల్కు కూడా విశ్రాంతి ఇచ్చారు. వీరిద్దరూ స్ధానంలో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ వచ్చారు. సంజూ శాంసన్కు మరోసారి మొండిచేయి చూపించారు. సౌతాఫ్రికా కూడా మూడు మార్పులు చేసింది. మిల్లర్, లిండే, సిప్లామ దూరం కాగా.. బాష్, నోర్జే, స్టబ్స్ జట్టులోకి వచ్చారు.తుది జట్లుదక్షిణాఫ్రికా : రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్మన్భారత్ : అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్కీపర్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
పాకిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా..
అండర్-19 ఆసియాకప్ 2025లో యువ భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 90 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతం చేశారు. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక పాక్ చతికల పడింది. భారత బౌలర్ల ధాటికి పాక్ అండర్ 19 జట్టు 41.2 ఓవర్లలో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. దీపేష్ దేవేంద్రన్, కన్షిక్ చౌహన్ తలా మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు కిషాన్ కుమార్ రెండు వికెట్లు సాధించారు. పేసర్ దీపేష్ పవర్ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని దెబ్బతీశాడు.పాక్ బ్యాటర్లలో హుజైఫా అహ్సాన్(83 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 70) ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి అహ్సాన్ మాత్రం దూకుడుగా ఆడి భారత్పై ఒత్తిడిపెంచాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్లో ముగ్గురే ముగ్గురు డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు.అదరగొట్టిన ఆరోన్..ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్(85) టాప్ స్కోరర్గా నిలవగా.. కనిష్క్ చౌహాన్(46), మాత్రే(38) రాణించారు. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ(5) విఫలమయ్యాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్, అబ్దుల్ సుభాన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. చదవండి: IPL 2026: కేకేఆర్ కీలక నిర్ణయం..! కెప్టెన్గా అతడే? -
తమిళ్లో నాకు ఛాన్సులివ్వరు, ఇక్కడ ఆ ఐక్యత లేదు!
మాస్ మ్యూజిక్ ఇవ్వడంలో తమన్ దిట్ట. కిక్ నుంచి మొదలుపెడితే అఖండ 2 వరకు ఎన్నో సినిమాలకు బ్లాక్బస్టర్ సంగీతం అందించాడు. మాస్కే పరిమితం కాకుండా క్లాస్, లవ్ ఎంటర్టైనర్ సినిమాలకు సైతం మంచి మ్యూజిక్ కొట్టాడు. అప్పుడప్పుడూ తమిళ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే తమిళంలో తనకు అంతగా అవకాశాలివ్వడం లేదంటున్నాడు తమన్.ఇండస్ట్రీ కలుషితంతాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ కలుషితమైపోయింది. ఇక్కడ వెన్నుపోట్లే ఎక్కువయ్యాయి. మన ఇండస్ట్రీలో ఉన్నంత మ్యూజిక్ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలోనూ లేరు. అనిరుధ్కు తెలుగులో సినిమా ఛాన్స్ రావడం చాలా ఈజీ. కానీ నాకు తమిళంలో అవకాశం రావడం చాలా కష్టం. అక్కడ నాకు అవకాశాలివ్వరు.ప్రాంతీయభావం ఎక్కువతమిళనాడులో ప్రాంతీయభావం ఎక్కువ. వేరేవాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ, ఇక్కడ ఆ ఐక్యత లేదు. దేశంలో ఎక్కడినుంచి వచ్చినా మనవాళ్లు యాక్సెప్ట్ చేస్తారు. పోటీని నేను తప్పుపట్టను. అది మంచిదే! దర్శకులు వేరేవాళ్లను రిఫర్ చేస్తున్నారంటే వాళ్లేం కోరుకుంటున్నారో అది నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. తమిళ, కన్నడ, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్లందరూ తెలుగులో పని చేస్తున్నారు. పీఆర్తో పనివాళ్లందరూ పీఆర్ టీమ్ను పెట్టుకుని బాగా పని చేసుకుంటున్నారు. వారి వారి ఇండస్ట్రీలలో లక్షలు కూడా ఇవ్వరు, కానీ మనం వాళ్లను పిలిచి మరీ కోట్లు ఇస్తాం. వాళ్లేదో తెలుగు సినిమా అని కసితో చేయరు. ఇక్కడ డబ్బులు ఎక్కువిస్తారని పని చేస్తారంతే! మనం అలా ఫేక్గా బతకలేం. అభిమానులకు ఏం కావాలో అందుకు తగ్గట్లు కష్టపడతాం అని తమన్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్లేటు పట్టుకుని లైన్లో నిల్చోవాలా? నా వల్లకాదు! -
ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 365 రోజుల ప్లాన్ పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన రూ. 2399 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాల్స్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. నాన్ స్టాప్ కనెక్షన్ అని పోస్ట్ చేసింది.సంవత్సరం ప్లాన్ కోరుకునేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంటే తక్కువే. దీన్నిబట్టి చూస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లన్స్ పరిచయం చేస్తూ ముందుకు సాగుతుందని స్పష్టమవుతోంది.Attention !!!Non- stop connection at 2399/- for 365 days#BharatFibre #SuccessStory #Partnership #4Gmobile #BusinessSuccess #BSNLSelfCareApp #SwitchToBSNL #entertainment #mobilerecharge #fypage✨ #explorepage pic.twitter.com/774dFc3jeJ— BSNL_Kolkata (@BSNL_KOTD) December 13, 2025 -
న్యూ టీ20 మాస్ట్రో.. విరాట్ కోహ్లిని దాటేస్తాడా?
అభిషేక్ శర్మ.. టీ20 క్రికెట్లో భారత జట్టుకు దొరికిన అణిముత్యం. గతేడాది టీ20 దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన అభిషేక్.. తన ఐపీఎల్ దూకుడును అంతర్జాతీయ వేదికపై కూడా కొనసాగిస్తున్నాడు. ఈ పంజాబ్ బ్యాటర్ అతి తక్కువ కాలంలోనే టీ20ల్లో వరల్డ్ నంబర్ బ్యాటర్గా ఎదిగాడు. యువరాజ్ సింగ్ వంటి లెజెండ్ కోచింగ్లో రాటుదేలిన అభిషేక్ టీ20ల్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. మొదటి బంతి నుంచే భారీ షాట్ల ఆడే సత్తా అతడిది. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వణికిస్తున్నాడు.పరుగుల సునామీ..అభిషేక్ శర్మ గతేడాది జింబాబ్వేతో సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తన అరంగేట్ర సిరీస్లోనే 183.33 స్ట్రైక్ రేట్తో 110 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 2024 ఏడాదిలో 11 ఇన్నింగ్స్లలో 23.27 సగటుతో 256 పరుగులు చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 171.81 ఉంది. మెరుగ్గా రాణించకపోయినప్పటికి తనకు పవర్ హిట్టింగ్ స్కిల్స్ కారణంగా టీమ్ మెనెజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. దీంతో మెనెజ్మెంట్ నమ్మకాన్ని అభిషేక్ నిలబెట్టుకున్నాడు. 2025 ఏడాదిలో పరుగులు సునామీ సృష్టించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ దాదాపుగా తన బ్యాట్కు పనిచెబుతున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 790 పరుగులు చేశాడు. అతడి తర్వాతి స్ధానంలో తిలక్ వర్మ(468) ఉన్నాడు.కోహ్లి రికార్డుపై కన్ను..ఈ డేంజరస్ బ్యాటర్ ఇప్పుడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డుపై కన్నేశాడు. ఒకే క్యాలెండర్ ఈయర్లో టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ)లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచేందుకు అభిషేక్ చేరువయ్యాడు.ఆదివారం సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టీ20లో 81 పరుగులు చేస్తే ఈ అరుదైన ఫీట్ను అందుకుంటాడు. అభిషేక్ ఇప్పటివరకు ఈ ఏడాది టీ20ల్లో 41.43 సగటుతో 1514 పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. 2016లో కోహ్లి ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్తో కలిపి టీ20ల్లో 1614 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ సౌతాఫ్రికా సిరీస్ ముగిసేలోపు కోహ్లి ఆల్టైమ్ రికార్డు శర్మ బద్దలు కొట్టడం ఖాయం. అభిషేక్ ఐపీఎల్తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ-2025లోనూ దుమ్ములేపాడు. అయితే అభిషేక్ సఫారీలతో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇంకా తన విశ్వరూపాన్ని ప్రదర్శించలేదు. అదేవిధంగా ఒకే క్యాలెండర్ ఈయర్లో వంద టీ20 సిక్స్లు పూర్తి చేసుకున్న ఏకైక భారత ఆటగాడిగా కూడా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.విరాట్ కోహ్లి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 125 మ్యాచ్లు ఆడి 4188 పరుగులు చేయగా.. అభిషేక్ ఇప్పటివరకు 31 మ్యాచ్లలో 1046 పరుగులు చేశాడు. ఓవరాల్గా కోహ్లి టీ20 కెరీర్లో 13543 పరుగులు ఉండగా .. అభిషేక్ 4849 రన్స్ చేశాడు.చదవండి: IPL 2026: కేకేఆర్ కీలక నిర్ణయం..! కెప్టెన్గా అతడే? -
పైపుల్లో కరెంట్!: ఇంజినీర్ల మ్యాజిక్
ఇంటి దగ్గర ఉన్న సాధారణ నీటి పైపులు రాత్రి వీధి దీపాలను వెలిగించగలవంటే నమ్ముతారా? నిజమే. ఎలాంటి సౌర ఫలకాలూ లేకుండా, పెద్ద యంత్రాలను అమర్చే అవసరం లేకుండా కేవలం నీరు పారుతూనే విద్యుత్ తయారవుతోంది. ఇదే ఇజ్రాయెల్ ఇంజినీర్లు ఆవిష్కరించిన ‘స్మార్ట్ వాటర్ పైప్స్’ మ్యాజిక్! పైపుల లోపల చిన్న చక్రాలు లాంటివి అమర్చితే, నీరు ఒత్తిడితో ప్రవహించినప్పుడు అవి మెల్లగా తిరుగుతాయి. ఆ తిప్పుడే నీటి ప్రవాహాన్ని నేరుగా విద్యుచ్ఛశక్తిగా మారుస్తుంది. నీరు మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా తన దారినే ప్రవహిస్తుంది. నగరాలు ఇప్పుడు ఈ స్మార్ట్ ఎనర్జీ పైపులను పరీక్షిస్తున్నాయి.వీధి దీపాలు వెలిగించడం నుంచి నగరంలోని సెన్సర్లు పనిచేయించడం వరకూ ఇవే సరిపోతున్నాయని తేలింది. అంతేకాదు, పైపుల్లో ఎక్కడ లీక్ ఉందో, నీటి నాణ్యత ఎలా ఉందో కూడా వెంటనే తెలియజేస్తాయి. ఇలా మన చుట్టూ ఉన్న చిన్న వ్యవస్థలే భవిష్యత్తును ఎలా మార్చగలవో ఈ పైపులు చూపుతున్నాయి. -
ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు
జెరూసలేం: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ దాడి ఘటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. ముందే అలర్ట్ చేయడంతో ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదుల వేడుకలను టార్గెట్ చేసిన ఉగ్రమూక దాడిలో 10 మంది మృతిచెందగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్ట్లు హతమయ్యారు.యూదులపై దాడులు జరగవచ్చని ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని.. యాంటీ-సెమిటిజాన్ని అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని ఇజ్రాయెల్ విమర్శించింది. ఈ సందర్భంగా సిడ్నీ కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్ చేశారు. సిడ్నీ కాల్పుల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి’అని పేర్కొన్నారు. I'm appalled by the murderous shooting attack at a Hanukkah event in Sydney, Australia.These are the results of the anti-Semitic rampage in the streets of Australia over the past two years, with the anti-Semitic and inciting calls of “Globalise the Intifada” that were realized… pic.twitter.com/ZMveTRIvwx— Gideon Sa'ar | גדעון סער (@gidonsaar) December 14, 2025మరోవైపు, సిడ్నీ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ-సెమిటిజాన్ని ఎదుర్కోవడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మన సోదరులు, సోదరీమణులు.. ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారు’ అంటూ హెర్జోగ్ యెరూషలేములో జరిగిన ఒక కార్యక్రమంలో విచారం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను వేధిస్తున్న ‘యాంటీ-సెమిటిజం’ని ఎదుర్కోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఉగ్రదాడి యూదులే లక్ష్యంగా జరిగిందా? అనేదానిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.బాండీ బీచ్లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఈ ఘటన దృశ్యాలు కలచివేస్తున్నాయని.. బాధితులకు తన ప్రగాఢ సానుభూతి’’ అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు. -
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నబీన్
న్యూఢిల్లీ/లక్నో: అందరి అంచనాలను తలకిందుల చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం బిహార్ యువనేత నితిన్ నబీన్ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. నబీన్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం నోటిఫికేషన్లో ప్రకటించారు. కాయస్థ వర్గానికి చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బిహార్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో భవిష్యత్తులో ఈయన బీజేపీ చీఫ్ పదవిని చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. తద్వారా తక్కువ వయస్సులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. మోదీ అభినందనలు.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నబీన్ను ప్రధాని మోదీ అభినందించారు. కష్టించి పనిచేసే కార్యకర్తగా గుర్తింపు పొందిన నబీన్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్న విశ్వాసం తనకుందన్నారు. ‘యువకుడు, కష్టించి పనిచేసే నేత, సంస్థాగత వ్యవహారంలో అనుభవమున్న వాడు, ఎమ్మెల్యేగా మంచి రికార్డు ఉంది. బిహార్కు పలుమార్లు మంత్రిగా పనిచేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు బాధ్యతలు నిర్వర్తించారు’అని ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం లక్నోలో కేంద్రమంత్రి పియూష్ గోయెల్ ప్రకటించారు. ఈ పదవికి శనివారం పంకజ్ చౌదరి నామినేషన్ వేశారన్నారు. పోటీలో ఆయన ఒక్కరే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మొత్తం 1.62లక్షల బూత్ల ద్వారా ఈ ఎన్నిక జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నుంచి పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారని గోయెల్ తెలిపారు. యూపీ బీజేపీ 17వ అధ్యక్షుడిగా ఎన్నికైన పంకజ్ చౌదరి కుర్మి వర్గానికి చెందిన వారు. ఈ వర్గం ఇతర వెనుకబడిన కులా(ఓబీసీ)ల జాబితాలో ఉంది. ఈ సందర్భంగా పియూష్ గోయెల్ పార్టీ జాతీయ కౌన్సిల్లోని 120 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. వీరిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి, సీఎం ఆదిత్య నాథ్ గోరఖ్పూర్ నుంచి, రక్షణ మంత్రి రాజ్నాథ్ లక్నో నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు. 45 ఏళ్లకే 5 సార్లు ఎమ్మెల్యేగా.. బిహార్లో బీజేపీ సీనియర్ నేత, నాటి ఎమ్మెల్యే నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా 2006లో ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు నితిన్ నబీన్కు పార్టీ అధిష్టానం పటా్న(పశ్చిమ) నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తొలిసారిగా బరిలోకి దింపింది. ఏకంగా 60వేల ఓట్ల భారీ మెజారిటీతో నబీన్ గెలిచారు. అప్పట్నుంచి వరసగా దాదాపు రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. తాజాగా బిహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 51,000 ఓట్ల మెజారిటీతో బంకింపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా కేవలం 45 ఏళ్ల వయసుకే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం నితీశ్ ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. నబీన్ గతంలో యువ మోర్చాలో పనిచేశారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు. బీజేపీ చీఫ్గా నడ్డా స్థానంలో మరొకరిని నియమించాల్సిన సమయంలో నబీన్కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలను అప్పగించడం గమనార్హం. నడ్డా తర్వాత బీజేపీ నూతన చీఫ్ అయ్యే అవకాశాలు నబీన్కు అత్యధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు స్వయంగా చెబుతున్నాయి. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ నియమితులైనట్లు తెలియడంతో పటా్నలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్సవాలు మిన్నంటాయి. నితిన్ నబీన్కు శుభాకాంక్షల సందేశాలు వెల్లువలా వచ్చాయి. ఈ నియామకం పార్టీ కార్యకర్తలకు అంకితమిస్తున్నానని మీడియాతో నబీన్ పేర్కొన్నారు. తనపై విశ్వాసముంచి గురుతర బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధిష్టానం యువనాయకత్వం వైపు మొగ్గుచూపుతోందనడానికి నబీన్ నియామకం ఒక సంకేతమని వార్తలొచ్చాయి. #BREAKING: Nitin Nabin Appointed As National Working President of BJP. pic.twitter.com/rdCbo9KpYq— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 14, 2025 -
ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..
సాక్షి శబరిమల: శబరిమలలో అరవణ ప్రసాద కొరత తీవ్రంగా ఉన్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. ప్రస్తుతాని అధిక సంఖ్యలో ప్రసాదాలు అందుబాటులో లేనట్లు స్పష్టం చేసింది. అంతేగాదు ప్రతి భక్తుడు 20 ప్రసాదం డబ్బాలకు మించి కొనుగోలు చేయానికి వీల్లేదని సమాచారం. దీనికి ప్రధాన కారణం గతేడాది(జనవరి 2024) అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు కలకలం రేగిన ఘటనే. ఆ సమయంలో లక్షలాది డబ్బాలను అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.అదీగాక ఇటీవలే సరిగ్గా అలాంటి లోపాలే అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో కూడా ఉన్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) విజిలెన్స్ విభాగం గుర్తించింది. అంతేకాదు.. అయ్యప్ప స్వామి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను పకడ్బందీగా తనిఖీ చేయడానికి పంపాబేస్లో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’ ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆ నేపథ్యంలోనే ఈ అరవణ ప్రసాదం డబ్బాల కొరత ఏర్పడింది, అలాగే భక్తులకు కూడా పరిమితులు విధించారు ఆలయ అధికారులు. ఇక శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బైజు కూడా ప్రస్తుతానికి కొత్త స్టాక్ వినియోగాన్ని నిలిపివేశామని, అయ్యప్ప అభిషేకాలకు, ప్రసాదాల తయారీకి ఇప్పటికే స్టోర్లో నిల్వ ఉన్న స్టాక్ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: శబరిమలలో మరో అపచారం) -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘అడవి’.. స్టార్ హీరోల చూపులన్నీ అటువైవే!
టాలీవుడ్లో ఒకప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ స్టోరీల హవా నడిచేది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు లవ్స్టోరీ, కామెడీ ఎంటర్టైన్మెంట్ రాజ్యమేలాయి. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన స్టార్ హీరోలంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ స్టోరీలపై ఆసక్తి చూపిస్తున్నారు. పిరియాడిక్, హిస్టారికల్ చిత్రాలలో యాక్షన్ సన్నివేశాలను ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి. అడవి నేపథ్యంలో వచ్చిన కాంతార 1&2 బాక్సాఫీస్ని షేక్ చేసింది. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురమ్ భీమ్ ఎపిసోడ్తో పాటు అల్లూరీ యాక్షన్ సీన్ అడవి నేపథ్యంలోనే ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ సినిమా విజయం కీలక పాత్ర పోషించాయి. ఇలా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చిన కథలన్నీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండడంతో .. మరికొంత మంది స్టార్ హీరోలు కూడా అడవి నేపథ్యం కథలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.అందులో అతిపెద్ద సినిమా ‘వారణాసి’. మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ మూడు గెటప్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలన్నీ అడవి నేపథ్యంలోనే సాగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.అక్కినేని హీరో నాగచైతన్య కూడా అడవి బాటనే పట్టారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ అడ్వెంచరస్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామాలోని కీలక సీన్లన్ని అడవి నేపథ్యంలోనే తెరకెక్కస్తున్నారట. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.ఇక మేగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ కూడా అడవినే నమ్ముకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ కథ మొత్తం అడవి నేపథ్యంలోనే ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుది.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) కథ కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లోనే సాగుతుందట. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓ యాక్షన్ సీన్ ఈ సినిమాకే హైలెట్ అవుతుందట. శ్రీవిష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ చిత్రాల్లో కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాపే హైలెట్ కానుందనే టాక్ వినిపిస్తోంది. -
ఈ తెలుగు హీరో గుర్తున్నాడా? ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
ఇండస్ట్రీలో హీరోగా చేసి హిట్ కొట్టడం గొప్పకాదు. వచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడం గొప్ప. అలా చేయలేకే చాలామంది హీరోలు కనుమరుగవుతున్నారు. అలాంటి ఓ హీరోనే ఇతడు. 'రాజాసాబ్' డైరెక్టర్ మారుతి తీసిన తొలి మూవీ హీరో ఇతడే. కానీ గత తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇంతకీ ఇతడెవరు? ఇప్పుడేం చేస్తున్నాడు?(ఇదీ చదవండి: 'అఖండ 2'లో బాలకృష్ణ కూతురిగా.. ఎవరీ అమ్మాయి?)పైన ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు మంగం శ్రీనివాస్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. 'ఈ రోజుల్లో' హీరో శ్రీ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 2012లో ఈ సినిమా రిలీజైంది. అందరూ కొత్త నటీనటులతో తీసిన ఈ చిత్రం ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది. దర్శకుడు మారుతికి మంచి గుర్తింపు తెచ్చింది. అలానే హీరోగా చేసిన శ్రీ కూడా చాలానే అవకాశాలు సొంతం చేసుకున్నాడు. కాకపోతే సరైన ప్లానింగ్, గైడెన్స్ లేకపోవడం వల్ల కేవలం మూడు నాలుగేళ్లకే ఇండస్ట్రీకి దూరమైపోయాడు.'ఈ రోజుల్లో' సినిమా తర్వాత శ్రీ.. రయ్ రయ్, అరవింద్ 2, తమాషా, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్, గలాటా, సాహసం చేయరా డింభకా, లవ్ సైకిల్.. ఇలా మూడునాలుగేళ్లలో 12 వరకు మూవీస్ చేశాడు. కానీ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. శ్రీ కూడా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని చెప్పాడు. హీరోగా చేస్తున్న టైంలో తాహతుకు మించిన పనులు చేశానని, తన చిత్రాలు రిలీజ్, షూటింగ్ విషయంలో ఇబ్బందుల్లో ఉంటే సొంత డబ్బులు ఇచ్చానని.. అలా ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం సొంతూరు విజయవాడలో వ్యవసాయ సంబంధిత మెషీన్స్ తయారు చేసే ఓ కంపెనీ నడుపుతున్నాడు. ఇది శ్రీ కుటుంబ బిజినెస్. తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి ఇతడికి వచ్చింది. 2020లో కొవిడ్ కారణంగా నాన్న చనిపోవడంతో ఈ బిజినెస్లోకి వచ్చానని శ్రీ చెప్పాడు. దీనితో పాటు హైదరాబాద్లో వారాహి స్టూడియోస్ అని ఓ డబ్బింగ్ స్టూడియో ఉందని అన్నాడు. పెద్దల కుదిర్చిన సంబంధం చేసుకున్నానని, భార్య కూడా సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సాహిస్తుందని కానీ తనకే సరైన అవకాశాలు రాక ఇలా ఉండిపోయానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా తొలి సినిమాతో పోలిస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు ఈ హీరో.(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. 'అరోమలే' ఓటీటీ రివ్యూ) -
కేకేఆర్ కీలక నిర్ణయం..! కెప్టెన్గా అతడే?
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయో సీజన్లో కూడా తమ జట్టు కెప్టెన్గా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేను కొనసాగించాలని కేకేఆర్ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు సమాచారం.డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న మినీ వేలానికి కూడా అతడు హాజరు కానున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. గత సీజన్లో రహానే కెప్టెన్సీలో కేకేఆర్ దారుణ ప్రదర్శన కనబరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన నైట్రైడర్స్ ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్దానంలో నిలిచింది. అజింక్య తన కెప్టెన్సీ మార్క్ను చూపించలేకపోయాడు. దీంతో ఐపీఎల్-2026లో రహానేను కేకేఆర్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ కేకేఆర్ యాజమాన్యం మాత్రం రహానేకు మరో అవకాశమిచ్చేందుకు సిద్దమైంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.ఈ సీజన్లో అజింక్య రహానే ఇన్నింగ్స్ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి. అదేవిధంగా మరోసారి అతడు కేకేఆర్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశముంది. ఎందుకంటే కెప్టెన్సీ సత్తా ఉన్న ఆటగాడు ఎవరూ వేలంలో లేరు. యువ ఆటగాడు రఘువంశీ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అతడిని వికెట్ కీపర్ బ్యాటర్గా ఉపయోగించుకోవాలని కేకేఆర్ భావిస్తుందని బంగర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.గ్రీన్పై కన్ను..కాగా కేకేఆర్ రూ. 64.30 కోట్లు పర్స్తో వేలంలోకి వెళ్లనుంది. ఇది అన్ని జట్ల కంటే అత్యధిక మనీ కేకేఆర్ వద్దే ఉంది. నైట్రైడర్స్ మొత్తంగా 13 స్ధానాలను భర్తీ చేయనుంది. అందులో విదేశీ ఆటగాళ్ల స్ధానాలు ఆరు ఉన్నాయి. ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను దక్కించుకునేందుకు కేకేఆర్ ప్రయత్నించే అవకాశముంది.ఈ వేలానికి ముందు కేకేఆర్ రహానే పాటు రింకూ సింగ్, సునీల్ నరైన్, రోవ్మన్ పావెల్, వరుణ్ చక్రవర్తి, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, అంకుల్ రాయ్, రమన్దీప్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, వైభవ్ అరోరాతో సహా మొత్తం 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.వదేలిసిన ఆటగాళ్లు వీరే..ఆండ్రీ రస్సెల్ (₹12 కోట్లు)వెంకటేష్ అయ్యర్ (₹23.75 కోట్లు)క్వింటన్ డి కాక్రహమనుల్లా గుర్బాజ్అన్రిచ్ నోర్ట్జేమొయిన్ అలీచదవండి: IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ బౌలర్ల మీదే! -
సినీ నటి ప్రత్యూష బయోపిక్ ప్లాన్.. ఆమె మృతి కేసులో ఏం జరిగింది..?
తెలుగు సినీ నటి ప్రత్యూష మృతి కేసు 2002లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి శిక్ష అనుభవిస్తున్నాడు. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ.. అతనికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి కోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, ప్రత్యూష బయోపిక్ త్వరలో తెరకెక్కించనున్నట్లు టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆమె కథన రష్మిక ఇప్పటికే విన్నారని, త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఫిల్మ్ నగర్ టాక్.(Actress Pratyusha Biopic)ప్రత్యూష ఉదంతం 2002, ఫిబ్రవరిలో జరిగింది. సుమారు 23ఏళ్లు అవుతున్నా సరే ఇప్పటికీ తీర్పు రాలేదు. న్యాయం కోసం ఆమె తల్లి పోరాటం చేస్తూనే ఉంది. న్యాయం ఎప్పటికి వస్తుందో తెలియదు. నిందితుడు సిద్ధార్థ రెడ్డి తరఫు న్యాయవాది మరణించడంతో మరికొంత జాప్యం చోటు చేసుకుంది. న్యాయపరంగా ఇది లాంగ్-రన్నింగ్ కేసు, 23 ఏళ్ల తర్వాత కూడా తీర్పు రాకపోవడం న్యాయవ్యవస్థలో ఆలస్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రత్యూష మరణం ఆత్మహత్యగా పరిగణించబడినా, సిద్ధార్థరెడ్డి పాత్రపై వివాదం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే గానీ పూర్తి విషయాలు వెలుగులో వస్తాయి.ప్రత్యూష కేసులో సీబీఐ నివేదిక ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ఇద్దరూ ఇంటర్ చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. హైదరాబాద్లోనే వారిద్దరూ ఇంటర్ పూర్తి చేశారు. అయితే, చదువుకు ఫుల్స్టాప్ పెట్టిన ప్రత్యూష సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, సిద్ధార్థరెడ్డి మాత్రం ఇంజినీరింగ్లో చేరాడు. కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు రావడతో 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇద్దరూ విషం తాగారు. చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే, ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందన గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.నిందితుడు సిద్ధార్థరెడ్డి ఎక్కడ ఉన్నాడు..?ప్రత్యూష హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు. హైకోర్టు ఆయనకు శిక్ష విధించినప్పటికీ, అప్పీల్ కారణంగా ఆయన జైలు శిక్షను తప్పించుకుని బయట ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్లో ఉండటంతో తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఈ కారణంతోనే ప్రత్యూష తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది నవంబర్ 20 సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే ఆయన భవిష్యత్తు స్పష్టమవుతుంది.ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవేఅది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. అది కన్నడ సినిమాలో తొలి అవకాశం. ఫేషియల్, వ్యాక్సింగ్ చేయించుకోవడానికి కజిన్ శిరితో కలసి బ్యూటీపార్లర్కెళ్లింది. తనకిష్టమైన కెనెటిక్ హోండా మీదనే వెళ్లారిద్దరూ. పింకీ పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ వచ్చాట్ట. ఫేషియల్ పూర్తయ్యే వరకు వెయిట్ చేశాట్ట. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు రైడ్కెళ్లి వస్తానని శిరిని వెయిట్ చేయమని చెప్పింది. సిద్ధార్థ తన కారులో తీసుకెళ్లాడు. కొంత సేపటికి నాకు ఫోన్... ‘జయం సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, జయం ఆఫీస్కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే చివరి మాట. కానీ వాళ్లు మాత్రం జయం ఆఫీస్కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్లో ఉన్న శిరి ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తానన్నదట. ఆ తర్వాత ఫోన్ తియ్యలేదట. అప్పటి వరకు ప్రతి వివరమూ సరిగ్గా సరిపోలుతూనే ఉంది. ఆ తర్వాత అంతా మిస్టరీనే. (Actress Pratyusha Death Mystery)కేర్ నుంచి నిమ్స్కిపోస్ట్మార్టమ్ నిమ్స్లో. సాయంత్రం ఐదు దాటిందని అప్పుడు పోస్ట్మార్టమ్ చేయలేదు. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, ఒక వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా తెలుస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్ పోశారని నాకనిపించింది. హాస్పిటల్ వాళ్లు మాత్రం ‘ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు. పొరపాటు చేశాం.. ఖననం చేసి ఉంటే..!ప్రత్యూష మరణం గురించి ఆమె తల్లి ఇలా చెప్పారు. ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్ట్మార్టమ్ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుంది... అనే ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. మా ఊరికి తీసుకెళ్లి దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో ఇప్పటిలా మీడియా విస్తృతంగా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్ వచ్చేశాను. అప్పటి నుంచి మొదలైన నా న్యాయపోరాటం ఇంకా సాగుతూనే ఉంది.ప్రత్యూష సినిమా విశేషాలుసినీ నటి ప్రత్యూష సుమారు 12 సినిమాల్లో నటించింది. 1998–2002 మధ్యకాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో మెప్పించింది. ఆమె ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాల్లో గుర్తింపు పొందింది. ప్రత్యూష కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఆమె మరణం జరగడం సినీ రంగానికి పెద్ద షాక్. -
కేంద్రం,ఈసీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
సాక్షి,ఢిల్లీ: ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్లను ఓటర్ల జాబితానుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ ర్యాలీలో రాహుల్గాంధీ ప్రసంగించారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యి వ్యవస్థల్ని నిర్విర్యం చేస్తున్నారు. ఓట్ చోరీపై దేశ వ్యాప్తంగా 5.5కోట్ల మందికి పైగా సంతకాలు సేకరించాం. ఓట్చోరీపై అందరూ ఏకమవ్వాలి. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు జోడించారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత,నిస్పక్షపాతం ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలి’అని రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
ప్లేటు పట్టుకుని లైన్లో నిల్చోవాలా? తినకుండా వచ్చేస్తా!
పెళ్లి భోజనాలనగానే కొందరు పండగ చేసుకుంటారు. నచ్చిన వంటకాలను కడుపునిండా ఆరగించవచ్చని ఉబలాటపడతారు. మరికొందరు మాత్రం అంతమందిలో లైను కట్టి మరీ తినడానికి మొహమాటపడతారు. తనకు ఆ మొహమాటం కాస్త ఎక్కువేనంటున్నాడు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్.నాకంత ఓపిక లేదుకృతి కర్బందా, పులకిత్ సామ్రాట్ హోస్ట్ చేస్తున్న 'ద మాన్యావర్ షాదీ' షోకి తాజాగా కరణ్ జోహార్ హాజరయ్యాడు. కృతి, పులకిత్ పెళ్లి విందు గురించి మాట్లాడారు. ఎంతమంది జనాలున్నా సరే అందరూ తమ వంతు వచ్చేవరకు ఓపికగా నిల్చుకుని భోజనం చేస్తారని పేర్కొన్నారు. ఇంతలో కరణ్ కలగజేసుకుటూ తనకు మాత్రం అంత ఓర్పు, సహనం లేదన్నాడు.భోజనం చేయకుండా వచ్చేస్తా!పెళ్లిలో నేనెప్పుడూ భోజనం చేయలేదు. భోజనం దగ్గర పెద్ద పెద్ద లైన్లుంటాయి. ఆహారం కోసం ప్లేటు పట్టుకుని అంత పెద్ద క్యూలో నిల్చోవాలంటే నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే పెళ్లిళ్లకు వెళ్తాను.. కానీ అక్కడ భోజనం చేయకుండానే వెనుదిరుగుతాను అని పేర్కొన్నాడు. అతడి సమాధానం విని కృతి అవాక్కయింది.సినిమాఇకపోతే కరణ్ నిర్మించిన తాజా చిత్రం "తూ మేరీ మే తేరా -మే తేరా తు మేరీ". సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరూ గతంలో 'పతీ పత్నీ ఔర్ వో' సినిమాలో తొలిసారి జోడీ కట్టారు. ఇప్పుడు రెండోసారి జత కట్టిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.చదవండి: మౌగ్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ -
కొత్త కారు కొనే ముందు.. జాగ్రత్తలివి!
కొత్త కారు కొనుగోలు చేయాలని అందరికి ఉంటుంది. అయితే ఇది కొందరికి సాధ్యమవుతుంది. మరికొందరికి కొంత కష్టమే. ఒకవేళా ఎవరైనా కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే.. తప్పకుండా కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఆ విషయాలు, వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.బడ్జెట్కారు కొనడానికి ముందు.. ఆలోచించాల్సిందే బడ్జెట్. ఎంత డబ్బు వెచ్చించి కారు కొనాలి. తక్కువ బడ్జెట్లో కావాలా?, ఎక్కువ బడ్జెట్ పెట్టాలా? అనే విషయంపై స్పష్టత ఉండాలి. ఇక్కడ కారు ధర మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత ఉంటాయనే విషయాన్ని కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి.అవసరాలుకారును ఏ అవసరం కోసం కొంటున్నారనే విషయంపై స్పష్టత ఉండాలి. నగరంలో ప్రయాణించడానికా?, లేక లాంగ్ డ్రైవ్ చేయడానికా? అనే విషయంతో పాటు.. ఫ్యామిలీ కోసమా?, వ్యక్తిగత వినియోగం కోసమా? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. పెట్రోల్ / డీజిల్ / ఎలక్ట్రిక్ / హైబ్రిడ్ ఏది కావాలో ముందుగానే ఆలోచించండి.సేఫ్టీ ఫీచర్స్కారు బడ్జెట్, అవసరాలు వంటి విషయాలతో పాటు.. ఆ కారులో ఉన్న ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్స్ ఏమిటనేది తెలుసుకోవాలి. మల్టిపుల్ ఎయిర్బ్యాగ్స్, ఈబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సర్లు / కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, సేఫ్టీ రేటింగ్ వంటివన్నీ మీరు కొనే కారులో ఉండేలా చూసుకోవాలి.మైలేజ్ & పర్ఫామెన్స్దాదాపు అందరూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కొనాలని ఆలోచిస్తారు. కాబట్టి మంచి మైలేజ్ ఇచ్చే కారు ఏది? దాని పర్ఫామెన్స్ ఎలా ఉందనే విషయాలను ముందుగానే గమనించాలి. ఈ విషయాలను తెలుసుకోవడానికి రియల్-వరల్డ్ మైలేజ్ రివ్యూలు చూడటం మంచిది. ఇంజిన్ పవర్, డ్రైవింగ్ స్మూత్నెస్ కూడా పరిశీలించాలి.మెయింటెనెన్స్ & సర్వీస్కారు కొనేస్తారు. కానీ దానిని ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తుండాలి. కాబట్టి మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయా?, లేదా? గమనించాలి. అవసరమైన పార్ట్స్ లభిస్తాయి. సర్వీస్ ఖర్చులు ఎలా ఉంటాయనే విషయాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి.పైన చెప్పినవి మాత్రమే కాకుండా.. వారంటీ (స్టాండర్డ్ + ఎక్స్టెండెడ్ వారంటీ) & ఆఫర్లు (ఫెస్టివ్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్), టెస్ట్ డ్రైవ్, రీసేల్ వాల్యూ, ఇన్సూరెన్స్, డెలివరీకి ముందు తనిఖీ వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్, అవసరమైన అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది. -
ఆ తల్లి కొడుకు కార్పెంటర్ అయితే చాలు అనుకుంది..! కట్చేస్తే..
తల్లి ఎప్పుడూ తన పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలనుకుంటుంది. కానీ ఈ తల్లి తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జస్ట్ కార్పెంటర్ అయ్యి కుటుంబ పోషణ చూసుకుంటే చాలు అనుకుంది. అదే విషయం కొడుకుకి నూరుపోస్తూ ఉండేది. కానీ అతడు తన అమ్మ కూడా ఊహించని విధంగా సీఈవో అయ్యి ప్రభంజనం సృష్టించాడు. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా..గొప్ప టాలెంట్, శక్తి సామర్థ్యాలు ఉంటే..ఆకాశమంత కలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదని చాటిచెప్పి స్ఫూర్తిగా నిలిచాడు.అతడే మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్. 39 ఏళ్ల డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు అయిన సులేమాన్ బ్లూమ్బెర్గ్ ఇంటర్వ్యూలో తన సక్సెస్ జర్నీ గురించి ఇలా షేర్ చేసుకున్నాడు. తన తండ్రి టాక్సీ డ్రైవర్ కాగా, తల్లి ఎన్ఎహెచ్ఎస్ నర్సుగా పనిచేసేదని చెప్పుకొచ్చాడు. శ్రామిక వర్గానికి చెందిన కుటుంబం కావడంతో తన తల్లి 16 ఏళ్లు వచ్చేటప్పటికీ కార్పెంటర్గానో లేదా ఎలక్ట్రిషియన్ ఉంటే చాలని పదేపదే చెబుతుండేదని అన్నాడు. ఎందుకంటే 1980-90లలో తన కుటుంబం పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందని వివరించాడు. సరిగ్గా 16 ఏళ్లప్పుడు తన తల్లిదండ్రులు విడిపోవడంతో తాను తన తమ్ముడు ఒంటరిగా పెరిగామని నాటి స్థితిని గురించి బాధగా చెప్పుకొచ్చారు. అయితే ఆ ఏజ్ ఉడుకు రక్తంతో ఉరకలేస్తూ ఉండే వయసు కావడంతో పెద్దగా భయపడలేదని, ఏదో సాధించేస్తాననే ధీమా ఎక్కువగా ఉండేదని తెలిపాడు. అయితే తన తల్లిదండ్రుల ఆలోచనకు విరుద్ధంగా చదువులో బాగా రాణించి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంల సీటు సంపాదించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచ్చిన నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు సులేమాన్. అయితే అక్కడ చదువు పూర్తి చేయకుండా ప్రపంచాన్నే ఉద్ధరించేద్దామన్న ఉత్సాహంతో అమెరికా 9/11 వరల్డ్ట్రైడ్ సెంటర్ కూల్చివేతతో ముస్లిం యువతపై వచ్చిన వివక్షను రూపుమాపేందుకు కృషి చేసే పనికి పూనుకున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న ముస్లిం వ్యతిరేక భావాన నుంచి పుట్టికొచ్చిందే అతిపెద్ద కౌన్సెలింగ్ హెల్పలైన్ సేవ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్ ఇది అతిపెద్ద కౌన్సిలింగ్ సర్వీస్లలో ఒకటని తెలిపారు. కుటుంబం తల్లిందండ్రులతో సంబంధాలు తెగిపోయి, బెదిరింపులకు లోనై ఇబ్బందిపడుతున్న యువ బ్రిటిష్ ముస్లింలకు ఆ సర్వీస్ వరంగా మారింది. ఆ సామాజిక లక్ష్యమే చివరికి 2010లో డీప్మైండ్(మార్గదర్శక ఏఐ)ను స్థాపించడానికి దారితీసింది. ఆ తర్వాత గూగుల్ 650 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 5 వేల కోట్లకు పైనే) ఆ కంపెనీని కొనుగోలు చేసింది. ప్రస్తుతం సులేమాన్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏఐ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఏఐని "హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్"గా అభివర్ణిస్తాడు. తన శ్రామిక కుటుంబ నేపథ్యమే టెక్నాలజీవైపు ఆకర్షితుడిని చేసి..ఈ స్థాయికి చేర్చిందని అంటాడు. చివరగా జీవితంలో "మనంచేసే ఏ పనైన ది బెస్ట్గా చేయాలనుకుంటే కచ్చితంగా దిబెస్ట్ పొజిషన్లో ఉంటాం" అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తానని చెబుతున్నాడు సులేమాన్. (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..) -
నితీశ్ రెడ్డి అట్టర్ ప్లాప్.. అయినా ఆంధ్ర ఘన విజయం
పుణే వేదికగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఆంధ్ర ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో అన్మోల్ప్రీత్ సింగ్(47) టాప్ స్కోరర్గా నిలవగా.. సైల్ ఆరోరా(42), రమణ్దీప్ సింగ్(43), హర్నార్ సింగ్(42) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, సత్యనారాయణ రాజు, సౌరభ్ కుమార్, పృథ్వీరాజ్ తలా వికెట్ సాధించారు. మధ్యప్రదేశ్పై హ్యాట్రిక్తో సత్తాచాటిన నితీశ్ రెడ్డి.. ఈ మ్యాచ్లో ఒక్క వికెట్కే పరిమితమయ్యాడు.హేమంత్ రెడ్డి సూపర్ సెంచరీ..206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది. నితీశ్ కుమార్ బ్యాటింగ్లో కూడా విఫలమయ్యాడు. రెండు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. అతడితో పాటు శ్రీకర్ భరత్(1), అశ్విన్ హెబ్బర్(4), రికీ భుయ్(15) నిరాశపరిచారు. కానీ మర్మరెడ్డి హేమంత్ రెడ్డి సూపర్ సెంచరీతో సత్తాచాటాడు. 53 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. హేమంత్తో పాటు ఎస్డీఎన్వీ ప్రసాద్(35 బంతుల్లో 53 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఆంధ్ర తమ తదుపరి సూపర్ లీగ్ మ్యాచ్లో డిసెంబర్ 16న జార్ఖండ్తో తలపడనుంది. చదవండి: శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై -
ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్లికోసం ప్లానింగ్!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన ఎంగేజ్మెంట్ అయిపోయిందని వెల్లడించాడు. ప్రియురాలు గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్తో తన నిశ్చితార్థం జరిగిందని తెలిపాడు. ఈ విషయాన్ని రియా చక్రవర్తి చాప్టర్ 2 అనే పాడ్కాస్ట్లో వెల్లడించాడు. ఈ పాడ్కాస్ట్కు అర్జున్ ప్రేయసి గాబ్రియెల్లాతో కలిసి హాజరయ్యాడు. మాకింకా పెళ్లి కాలేదు. ఆరేళ్లుగా డేటింగ్అదెప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు? అని గాబ్రియెల్లా అంది. అందుకు అర్జున్ వెంటనే.. కాకపోతే మా నిశ్చితార్థం మాత్రం జరిగిపోయింది అన్నాడు. అలా నిశ్చితార్థం విషయాన్ని తొలిసారి బయటపెట్టారు. అంటే ఆరేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్న వీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట!!మొదటి పెళ్లికాగా అర్జున్ రాంపాల్.. 1998లో నిర్మాత మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2018 మేలో భార్యాభర్తలు విడిపోతున్నట్లు ప్రకటించారు. మరుసటి ఏడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది నటి గాబ్రియెల్లాతో ప్రేమలో పడటంతో పాటు ఆమెను గర్భవతిని చేశాడు అర్జున్. అలా పెళ్లికి ముందే వీరు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం.ఎవరీ గాబ్రియెల్లా?గాబ్రియెల్లా 16 ఏళ్లకే మోడలింగ్ చేసింది. పలు మ్యూజిక్ వీడియోల్లో నటించింది. ఇష్క్ ఝమేలా అనే హిందీ మూవీలో అర్జున్-గాబ్రియెల్లా కలిసి నటించారు. తెలుగులో ఊపిరి మూవీలో ఫ్రెంచ్ డ్యాన్సర్గా గాబ్రియెల్లా అలరించింది. ఇక అర్జున్ రాంపాల్ విషయానికి వస్తే.. ఆంఖేన్, డాన్, ఓం శాంతి ఓం, ఈఎమ్ఐ, హౌస్ఫుల్, రాజ్నీతి, చక్రవ్యూహ్, సత్యాగ్రహ, ధాకడ్, ధురంధర్ వంటి పలు హిందీ సినిమాలు చేశాడు. తెలుగులో భగవంత్ కేసరి చిత్రంలో నటించాడు.చదవండి: రెండోసారి విడాకులు తీసుకోబోతున్న దర్శకుడు! -
ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు
ఇదివరకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల గురించి విని ఉంటారు, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల గురించి తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ కథనంలో ప్రపంచంలోనే అత్యంత ధనికులైన రాజకీయ నాయకులు ఎవరు?, వాళ్ల నెట్వర్త్ ఎంత అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)రష్యన్ అధ్యక్షుడు పుతిన్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడు. ఈయనకు ప్రధానంగా ఇంధన & సహజ వనరుల కంపెనీలలో ఎక్కువ వాటా వస్తుందని సమాచారం. దీంతో ఆయనను అత్యంత సంపన్నుడిగా గుర్తించారు. అయితే ఈయన నెట్వర్త్ ఎంత అనే విషయం అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. 200 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. సుదీర్ఘ రాజకీయ జీవితం ఈ అపారమైన సంపదకు కారణమైందని పలువురు చెబుతున్నారు.అలెగ్జాండర్ లుకాషెంకో (Alexander Lukashenko)పలు నివేదికల ప్రకారం.. సుమారు 9 బిలియన్ డాలర్ల సంపద కలిగిన అలెగ్జాండర్ లుకాషెంకో ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజకీయం నాయకుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 1994 నుంచి బెలారస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయనకు.. విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ , వ్యవసాయ, మాన్యుఫ్యాక్టరింగ్ సంస్థలలో వాటాలు ఉన్నాయని సమాచారం.డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద.. ప్రధానంగా రియల్ ఎస్టేట్, బ్రాండింగ్, హోటల్స్ & గోల్ఫ్ రిసార్ట్ల నుండి వస్తుంది. ఈయన నెట్వర్త్ సుమారు 7.2 బిలియన్ డాలర్లు అని అంచనా. ఈయన రాజకీయ పదవిలో ఉన్న సమయం కంటే.. పెట్టుబడులు & మీడియా వెంచర్లలోనే సమయం గడిపారు. దీంతో ఆయన నెట్వర్త్ గణనీయంగా పెరుగుతూ ఉంది.కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నెట్వర్త్ దాదాపు 5 బిలియన్ డాలర్లు అని అంచనా. కానీ ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు ఈయన సంపద 40 బిలియన్ డాలర్లని చెబుతున్నారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం, సైన్యం, వ్యాపారాలన్నీ కిమ్ కుటుంబం నియంత్రణలోనే ఉంటాయి. అంతే కాకుండా.. బంగారం, బొగ్గు, ఆయుధాలు, సిగరెట్లు, మద్యం ఎగుమతులు ద్వారా కూడా వీరికి ఆదాయం వస్తుంది.జీ జిన్పింగ్ (Xi Jinping)బ్లూమ్బెర్గ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సంపద 1.5 బిలియన్ డాలర్లు. ఇందులో ఆయన కుటుంబ సంబంధిత ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. జిన్పింగ్ జీతం ఏడాదికి కేవలం 22,000 డాలర్లు మాత్రమే. ఇది కాకుండా ఈయనకు భూ ఖనిజాలు, టెక్ సంస్థలు, బంధువులతో ముడిపడి ఉన్న రియల్ ఎస్టేట్లో అనేక పెట్టుబడులు ఉన్నాయి.ఇదీ చదవండి: డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు.. -
'అఖండ 2'లో బాలకృష్ణ కూతురిగా.. ఎవరీ అమ్మాయి?
రీసెంట్గా రిలీజైన 'అఖండ 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బాలకృష్ణ అభిమానులకు ఇది నచ్చేస్తుండగా.. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఓకే ఓకే అనిపిస్తోంది. ఏదైతేనేం సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి డిస్కషన్ అయితే నడుస్తోంది. ఇందులో బాలయ్య కూతురిగా నటించిన అమ్మాయి సీన్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఐక్యూ 226, 17 ఏళ్లకే డీఆర్డీఓలో సైంటిస్ట్ అనే సన్నివేశాలపై మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?ఈ సినిమాలో అఖండ కూతురి పాత్రలో కనిపించిన నటి పేరు హర్షాలీ మల్హోత్రా. పంజాబీ హిందు కుటుంబానికి చెందిన ఈమె ముంబైలో పుట్టి పెరిగింది. ఏడేళ్ల వయసులోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' మూవీలో నటించింది. మున్నీ పాత్రలో మాటలు రానీ అమ్మాయిగా ఆకట్టుకుంది. ఈ మూవీ కంటే ముందే 2012లోనే అంటే నాలుగేళ్ల వయసులోనే 'ఖబూల్ హై', లాత్ ఆవో త్రిష, సావధాన్ ఇండియా సీరియల్స్లో నటించింది. 2017లో సబ్ సే బడా కళాకార్ అనే సీరియల్ కూడా చేసింది. దీని తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు నటనకు గ్యాప్ ఇచ్చింది.మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినిమా 'అఖండ 2'తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హర్షాలీ యాక్టింగ్కి ఓ మాదిరి ప్రశంసలు దక్కుతున్నాయి తప్పితే మరీ సూపర్గా చేసిందని ఎవరూ అనట్లేదు. కాకపోతే ఈమె క్యారెక్టర్కి సంబంధించిన సీన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా హర్షాలీ చాన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) -
ఆస్ట్రేలియాలో పహల్గామ్ తరహా టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. జమ్మూకశ్మీర్ పహల్గాం తరహాలో సిడ్నీ బాండీ బీచ్లో ఉగ్రదాడి జరిగింది. బీచ్లోని యూదులే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పదిమందికి పైగా పర్యాటకులు మృతిచెందారు. ముసుగు ధరించిన ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు.అయితే బీచ్లో సరదాగా గడుపుతున్న పర్యాటకులు.. కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీచ్లో ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.బీచ్లోకి పర్యాటకులను నిషేధించారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లొద్దంటూ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కాల్పుల తర్వాత ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.One of the shooters was disarmed and possibly shot by one of the Bondi Beach goers. He is the shooter who the police gave CPR.pic.twitter.com/LS6IP68jlH— Terrible Pics (@TerriblePic) December 14, 2025 -
రీసేల్..ఈజీ డీల్..
కొంత కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రీసేల్ మార్కెట్ అంటూ ప్రత్యేకమైన ఒరవడిని సృష్టిస్తోంది. కొత్త కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులతో పాటు రీసేల్ మార్కెట్ అత్యంత వేగంగా పెరుగుతున్న విభాగంగా మారింది. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయని భావించి ఈ రంగంలోకి అనేక మంది ప్రవేశిస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోలు, విక్రయాల్లో వినియోగదారులు, ఇన్వెస్టర్లు, బ్రోకర్లకు సమానంగా లాభాలు అందించడంలో ఈ రీసేల్ సెగ్మెంట్ కీలకపాత్ర పోషిస్తోంది. అదే సమయంలో నగర జీవనశైలిపై కూడా స్పష్టమైన ప్రభావం చూపుతోంది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగావకాశాలు పెరిగే కొద్దీ, వలసలు పెరుగుతున్నాయి. దీంతో స్థిరమైన నివాసాల కోసం డిమాండ్ వేగంగా పెరిగింది. చాలా మంది రెడీ టు మూవ్ ఇళ్లు, వెంటనే ఉపయోగించుకునే ఫ్లాట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త కన్స్ట్రక్షన్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడటం కంటే రీసెల్ ప్రాపర్టీ తీసుకోవడం సౌకర్యంగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.సులభంగా బ్యాంక్ లోన్లు.. రీసేల్లో ప్రధానంగా పెట్టుబడి తక్కువ. కొత్త వెంచర్లు వంటి భారీ ఖర్చులు, మార్కెటింగ్ వ్యయాలు, ప్రీలాంచ్ ప్రకటనలు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వంటి ఖర్చులు ఉండవు. ఇప్పటికే ఉన్న ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు తిరిగి మార్కెట్లోకి తీసుకురావడం వల్ల రిస్క్ కూడా తక్కువ. రీసేల్ ప్రాపర్టీలకు సాధారణంగా రెడీ డాక్యుమెంటేషన్ ఉండటం, బ్యాంక్ లోన్లు సులభంగా లభించడం, వాస్తు/ప్రాంతీయ వివరాలు ఇప్పటికే తెలిసి ఉండటం కొనుగోలుదారులకు అదనపు నమ్మకాన్ని ఇస్తుంది.ఇదే కారణంగా ఈ రంగంలో ఇన్వెస్టర్లు కూడా వేగంగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ రంగంలో ఏజెంట్లకు భారీ కమీషన్లు ఇచ్చే వ్యవస్థ తగ్గిపోతోంది. డిజిటల్ ప్లాట్ఫార్మ్లు, రియల్ ఎస్టేట్ లిస్టింగ్ యాప్లు, సోషల్ మీడియా మార్కెటింగ్తో ప్రాపర్టీ యజమానులు నేరుగా కస్టమర్లతో మాట్లాడే అవకాశం పెరిగింది. ప్రధానంగా మధ్యవర్తి ఖర్చులు తగ్గి, విక్రేతలకు ఎక్కువ లాభం, కొనుగోలుదారులకు తక్కువ ధరకు లభిస్తోంది. ఈ మార్పు రియల్ ఎస్టేట్ లావాదేవీలను మరింత పారదర్శకంగా చేస్తోంది.రెడీ ఇళ్లకు అధిక డిమాండ్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు.. శంషాబాద్, షాద్నగర్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లోని ప్లాట్లు, వెంచర్లు.. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, మణికొండ, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో రీసెల్ మార్కెట్ చురుగ్గా మారింది. ఐటీ ఉద్యోగస్తులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాల్లో రెడీ ఇళ్లకు డిమాండ్ నిరంతరం ఉంటుంది. ఇక అపార్ట్మెంట్లతో పాటు విల్లాలు, సొంత గృహాలు, జీ ప్లస్–1, జీ ప్లస్–2 హౌసింగ్ యూనిట్లు కూడా పెద్ద సంఖ్యలో రీసేల్ అవుతున్నాయి.లైఫ్స్టైల్ కోణం నుంచి చూస్తే రీసేల్ మార్కెట్ నగర జీవనశైలిలో కొత్త అనుభవాన్ని తెచ్చింది. ఉద్యోగ మార్పులు, నగరాల మధ్య తరలింపు, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ విస్తరణ.. వంటివి వేగంగా జరిగే ఈతరం వెంటనే మకాం మార్చుకునేందుకు వీలైన ఇళ్లు ప్రధాన అవసరంగా మారాయి. ఈ అవసరాన్ని తీర్చడంలో రీసేల్ సెగ్మెంట్ కీలక పాత్ర పోషిస్తోంది. భద్రత, రవాణా సౌకర్యాలు, స్కూళ్లు, హాస్పిటల్స్, మార్కెట్లు తదితర వాటిని చూసుకునే ఇంటిని నిర్మించుకుంటారు. దీంతో వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన వారికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.భవిష్యత్లో మరింత బలపడే అవకాశంప్రస్తుత మాంద్యం పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే, రెంటల్ ఇన్కమ్ కోసం ఇళ్లు కొనుగోలు చేసే వారికి రీసేల్ ప్రాపరీ్టలు తక్షణ లాభం అందిస్తున్నాయి. నగర వృద్ధి వేగం పెరగడంతో భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో రీసేల్ విభాగం సంప్రదాయ కొనుగోలు, అమ్మకాల నమూనాను మార్చి, కొత్త తరానికి అనుగుణంగా జీవన శైలిని ప్రతిబింబించే ట్రెండ్గా ఎదుగుతోంది. ఈ వినూత్న మార్పులు, తక్కువ రిస్క్, ఎక్కువ లాభాలు, స్మార్ట్ లివింగ్ అవసరాల కలయికగా ఈ రంగాన్ని రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యంతో ముందుకు నడిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో టీడీపీ కండువాలు వేసేందుకు బీటెక్ రవి వెళ్లారు. ఆయన రాకతో గ్రామస్తులు.. తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లారు.పోలీసు ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో నుంచి గ్రామం మొత్తం వైఎస్ కుటుంబం వెంటనే నడుస్తున్నామన్న గ్రామస్తులు.. టీడీపీ ఊరిలో అడుగు పెట్టడంతోనే ఊరు వదిలి రావాల్సి వచ్చిందని గ్రామస్తులు చెప్పారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వైఎస్సార్సీపీకి అమ్మగారిపల్లి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. అమ్మగారిపల్లి గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైఎస్సార్సీపీకి వెయ్యి ఏనుగుల బలం.‘‘టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడింది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా అమ్మగారిపల్లి గ్రామస్తులు తెగువ చూపించారు’’ అని సతీషరెడ్డి పేర్కొన్నారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఎప్పుడంటే?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న (శనివారం) బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం జరగనుంది. వచ్చే శనివారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. కృష్ణా,గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం,కార్యచరణపై చర్చ, రాబోయే ప్రజా ఉద్యమాలు,సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
పాక్తో మ్యాచ్.. వైభవ్ ఫెయిల్! భారత్ స్కోరెంతంటే?
అండర్-19 ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత యువ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ అండర్-19 జట్టు 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.సూపర్ ఫామ్లో ఉన్న స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయూష్ మాత్రే, హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అనంతరం మాత్రే ఔటయ్యాక విహాన్ మల్హోత్రా(12), వేదాంత్(7) వికెట్లను కోల్పోయింది. అనంతరం జార్జ్, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు(22) కాసేపు పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన కనిష్క్ చౌహాన్ కాస్త దూకుడుగా ఆడాడు. అయితే జార్జ్, చౌహన్ ఔటయ్యాక భారత టెయిలాండర్లు ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు.దీంతో మరో 17 బంతులు మిగిలూండగానే టీమిండియా ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్(85) టాప్ స్కోరర్గా నిలవగా.. కనిష్క్ చౌహాన్(46), మాత్రే(38) రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్, అబ్దుల్ సుభాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. నిఖాబ్ షఫీక్ రెండు వికెట్లు సాధించారు.చదవండి: శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై -
బేబమ్మని వెంటాడుతున్న బ్యాడ్ లక్.. డేంజర్ జోన్లో కెరీర్!
తొలి సినిమాతోనే సూపర్ హిట్ దక్కడం సినీతారలకు ఓ వరం లాంటింది. ఆ ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి. వరుస అవకాశాలు వస్తాయి. స్టార్ హీరోలతో నటించే చాన్స్ వస్తుంది. అయితే ఇదంతా ఒకటి, రెండు చిత్రాలకే పనికొస్తుంది. ఆ తర్వాత కూడా హిట్ రాకపోతే..అంతే సంగతి. హీరోలలాగా హిట్ లేకపోయినా..ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండలేదు. వయసు పెరిగేకొద్ది చాన్స్లు తగ్గిపోతుంటాయి. పైగా టాలీవుడ్లో అందాలకు కొదవేలేదు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పుటుకొస్తున్నారు. అందుకే హీరోయిన్ల హిట్ చాలా అవసరం. ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమా ఉప్పెనతో టాలీవుడ్లో ఓవర్నైట్ స్టార్గా ఎదిగింది. తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి హిట్లు పడడంతో తనకిక ఎదురులేదనుకున్నారు. కానీ ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా కిందకు పడిపోయింది ఈ బ్యూటీ. ఆమె హీరోయిన్గా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే లాంటి చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో టాలీవుడ్ ఆమెను పక్కకి పెట్టింది. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో.. మాలీవుడ్కి షిఫ్ట్ అయింది. అక్కడ కూడా కలిసి రాలేదు. ఆమె నటించిన 'ఆర్మ్' అనే సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కోలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. కార్తి 'వా వాథియార్'(అన్నగారు వస్తున్నారు), ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', రవి మోహన్ 'జీని' చిత్రాల్లో నటించింది. అయితే వీటిల్లో ఒక్కటి హిట్ అయినా చాలు.. కొన్నాళ్ల పాటు ఆమెకు ఢోకా ఉండదు. కానీ హిట్ సంగతి పక్కకుపెట్టు..కనీసం విడుదలకు కూడా నోచుకోవడం లేదు. ఆమె నటించిన సినిమాన్నీ వాయిదాలు పడుతున్నాయి. ఈ నెల 12న అన్నగారు వస్తున్నారు రిలీజ్ అవ్వాల్సింది. భారీ పబ్లిసిటీ కూడా చేశారు. కానీ హఠాత్తుగా ఇప్పుడా సినిమాను వాయిదా వేసినట్టు ప్రకటించారు.ఇప్పటికే రావాల్సిన మరో తమిళ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ 18న దానిని రిలీజ్ చేస్తామని ఆ మధ్య చెప్పారు. ఆ తర్వాత ఇది కూడా వాయిదా పడినట్లు ప్రకటించారు. అలానే ఆ మధ్య 'జయం' రవి నటించిన 'జీనీ' సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. అదీ త్వరలోనే విడుదల అవుతుందని అన్నారు. కానీ డేట్ ప్రకటించలేదు.ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ టెన్షన్ పడుతుంది కృతి శెట్టి మాత్రమే. అసలే హిట్ లేక చాలా కాలం అవుతుంది. వరుస సినిమా రిలీజ్ అయితే..ప్రేక్షకులు తనను మర్చిపోకుండా ఉంటారకుంది. అందుకే ఎంతో హుషారుగా ప్రమోషన్స్ చేసింది. అన్నగారు వస్తున్నారు సినిమాతో హిట్ పడుతుందని.. అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ మళ్లీ అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుంది. కానీ చివరికి వాయిదా పడడంతో బ్యాడ్లక్ అనుకొని సైలెంట్ అయిపోయింది. త్వరలోనే ఈ సినిమాలన్నీ రిలీజై..ఒక్కటి హిట్ అయినా కృతికి మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా ఫ్లాప్ అయితే మాత్రం.. కోలీవుడ్లో కూడా కృతికి అవకాశాలు రావు. ఓవరాల్గా ఆమె సినీ కెరీరే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది. -
శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 సూపర్ లీగ్ మ్యాచ్లో ముంబై అదరగొట్టింది. హర్యానా విధించిన 235 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్మని ఊదేసింది. దేశీ టీ20 టోర్నమెంట్ సూపర్ లీగ్లోని గ్రూప్-బిలో భాగంగా పుణెలోని డీవై పాటిల్ అకాడమీలో ముంబై- హర్యానా జట్లు ఆదివారం తలపడ్డాయి. 234 పరుగులుటాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. హర్యానా బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 234 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్లలో కెప్టెన్ అంకిత్ కుమార్ (42 బంతుల్లో 89) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటగా.. వన్డౌన్ బ్యాటర్ నిశాంత్ సంధు (38 బంతుల్లో 63 నాటౌట్) ధనాధన్ దంచికొట్టాడు. మిగిలిన వారిలో సమంత్ జేఖర్ (14 బంతుల్లో 31 రిటైర్డ్ అవుట్), సుమిత్ కుమార్ (4 బంతుల్లో 16 నాటౌట్) మెరుపులు మెరిపించారు.శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్ఇక హర్యానాకు ధీటుగా బదులిచ్చే క్రమంలో ముంబై ఓపెనర్, టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శతక్కొట్టాడు. కేవలం యాభై బంతుల్లోనే ఏకంగా 16 ఫోర్లు, ఒక సిక్స్బాది 101 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అజింక్య రహానే (10 బంతులల్లో 21) ఫర్వాలేదనిపించగా.. మూడో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan) అదరగొట్టాడు.కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన సర్ఫరాజ్.. మొత్తంగా 25 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2026 వేలానికి ముందు ఈ మేరకు సత్తా చాటి.. తానూ రేసులోనే ఉన్నానంటూ ఫ్రాంఛైజీలకు మరోసారి సందేశం ఇచ్చాడు.17.3 ఓవర్లలోనే ఇక మిగిలిన ముంబై ఆటగాళ్లలో అంగ్క్రిష్ రఘువన్షీ (7), సూయాంశ్ షెడ్గే (13), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (2) విఫలం కాగా.. సాయిరాజ్ పాటిల్ (3 బంతుల్లో 8), అథర్వ అంకోలేకర్ (2 బంతుల్లో 10) మెరుపులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. జైసూ, సర్ఫరాజ్ దంచికొట్టగా.. వీరిద్దరు ఆఖర్లో వేగంగా ఆడటంతో 17.3 ఓవర్లలోనే హర్యానా విధించిన లక్ష్యాన్ని ముంబై ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. యశస్వి జైస్వాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: IND Vs PAK: పాక్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ అట్టర్ఫ్లాప్ -
ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..
నిర్మాణ రంగంలో ముఖ్యంగా గృహ నిర్మాణంలో అనేక కొత్త కొత్త టెక్నిక్లు పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా ఐఐటీ తిరుచ్చి ఓ కొత్త కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. ఇలా గతంలో అనేక ఉన్నత విద్యా సంస్థల నుంచి కూడా పలు కొత్త నిర్మాణ నిర్మాణ పద్ధతులు తెరమీదకు వచ్చాయి. అవి ఏవి.. వాటిలో ఏవి విజయవంతమై క్షేత్ర స్థాయిలో వినియోగంలో ఉన్నాయి.. చూద్దాం ఈ కథనంలో..నెల రోజుల్లో నిర్మాణంఎన్ఐటీ తిరుచ్చి తాజాగా మరో కొత్త నిర్మాణ టెక్నిక్ను అభివృద్ధి చేసింది. నిర్మాణ సమయం, సిమెంట్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు భవనం ధృడంగా ఉండేలా రూపొందించిన కొత్త కోల్డ్ ఫార్మడ్ స్టీల్ (CFS)-కాంక్రీట్-బ్రిక్ కాంపోజిట్ హౌసింగ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రోటోటైప్ భవనం 'సెంటినెల్'ను ఆవిష్కరించింది సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ అండ్ ఇంక్యుబేషన్ (సీఈడీఐ) అధ్యాపకుల నేతృత్వంలోని స్టార్టప్.కాంక్రీట్ వినియోగాన్ని 40-50% తగ్గించడంతోపాటు భూకంపానికి తట్టుకునే సామర్థ్యం కూడా ఈ నిర్మాణానికి మెరుగ్గా ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు. ఈ 400 చదరపు అడుగుల సింగిల్-బీహెచ్కే యూనిట్ కోసం మొత్తం సివిల్ పని కేవలం 25 పని దినాల్లో పూర్తయింది. సాధారణంగా ఇదే పరిమాణంలో సాంప్రదాయ ఆర్సీసీ భవనం నిర్మించాలంటే 2-3 నెలలు పడుతుంది.గతంలో వచ్చిన టెక్నిక్లుదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన అనేక నిర్మాణ సాంకేతికతలు క్రమంగా ప్రయోగశాలలు, పైలట్ ప్రాజెక్టుల నుండి వాస్తవ ప్రపంచ వినియోగంలోకి మారుతున్నాయి. ప్రీకాస్ట్ నిర్మాణం, కోల్డ్-ఫార్మ్డ్ స్టీల్ సిస్టమ్స్, జియోపాలిమర్ కాంక్రీట్ ఇప్పటివరకు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన నిర్మాణ టెక్నిక్లు.వీటిలో, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, ఎస్పీఏ ఢిల్లీ వంటి సంస్థలు రూపొందించిన ప్రీకాస్ట్, మాడ్యులర్ నిర్మాణానికి విస్తృత ఆమోదం లభించింది. సైట్లో అసెంబుల్ చేసిన ఫ్యాక్టరీ-మేడ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్లను ఇప్పుడు సాధారణంగా పట్టణ హౌసింగ్, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ప్రభుత్వ హౌసింగ్ పథకాలలో ఉపయోగిస్తున్నారు.అదే విధంగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన విస్తృత పరిశోధనల ద్వారా అభివృద్ధి చెందిన జియోపాలిమర్ కాంక్రీట్ ప్రయోగాత్మక దశను దాటి ప్రాయోగిక వినియోగానికి చేరుకుంటోంది. ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాలతో తయారయ్యే ఈ పదార్థం ప్రస్తుతం రహదారి పేవ్మెంట్లు, ప్రీకాస్ట్ విడిభాగాలు, పారిశ్రామిక నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు.అయితే, అన్ని ఆవిష్కరణలు ఇంకా క్షేత్రస్థాయిలోకి ప్రవేశించడం లేదు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్లు ప్రదర్శించిన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నిక్.. అధిక పరికర వ్యయం, నైపుణ్యం కలిగిన ఆపరేటర్ల అవసరం కారణంగా ఇప్పటికీ పైలట్ హౌసింగ్ ప్రాజెక్టులు, క్యాంపస్ స్థాయి నిర్మాణాలకే పరిమితమై ఉంది.అలాగే, వెదురు మిశ్రమాలు, కంప్రెస్డ్ ఎర్త్ బ్లాక్స్ వంటి బయో-ఆధారిత నిర్మాణ పదార్థాలను ఎక్కువగా గ్రామీణ లేదా ప్రాంత-నిర్దిష్ట అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరోవైపు, ఏఐ, ఐఓటీ ఆధారిత స్మార్ట్ నిర్మాణ సాంకేతికతలు ప్రధానంగా నిర్మాణ పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కోసం పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఓ ఎంపికగా మాత్రమే అమలు చేస్తున్నారు. -
కాపీరైట్స్ కేసులలో 'ఇళయరాజా'ది తప్పేనా.. వారికి మాత్రమే నోటీసులు ఎందుకు?
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తరచుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. అనుమతి లేకుండానే తన పాటలను నేటి సినిమాల్లో వినియోగించడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తగిన చర్యలు తీసుకోవాలంటూనే నష్టపరిహారం కూడా చెల్లించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ అంశంలో ఆయన్ను సమర్ధించే వారు ఉన్నారు. మరికొందరు వ్యతిరేఖిస్తున్నారు.ఇళయరాజా సంగీతం అందించిన 5వేల పాటలను సోని మ్యూజిక్ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో నేటి తరం సినిమా నిర్మాతలు అందరూ సోని మ్యూజిక్తో ఒప్పందం చేసుకుని రైట్స్ కొనుగోలు చేస్తున్నారు. రీసెంట్గా డ్యూడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ విషయంలో అదే జరిగింది. మైత్రీ మూవీస్ కూడా ఇదే పేర్కొంది.ఇళయరాజాకు కౌంటర్ ఇస్తున్న లాయర్లుఒక సినిమా కోసం ఇళయరాజా పాటలు స్వరపరిచినందుకు నిర్మాత డబ్బులు చెల్లిస్తారు. అదే పాటను ఆ సంగీత దర్శకుడు మరో పది సినిమాలకు అమ్ముకోలేరని కౌంటర్ వేశారు. ఒక సంగీత దర్శకుడు అందించిన పాటను తమ సినిమాలో ఉపయోగించాలా వద్దా అనేది పూర్తిగా దర్శకుడు, నిర్మాత ఇష్టంపైనే ఉంటుందని గుర్తుచేశారు. సంగీతమనేది తన కష్టానికి ఫలితమైనప్పటికీ.. ఒక సినిమా కోసం దానిని అమ్మేసిన తరువాత యాజమాన్య హక్కులు ఎట్టిపరిస్థితిలోనూ కోరలేడని న్యాయవాదుల పేర్కొన్నారు. ఒక సంగీత దర్శకుడు అందించిన పాటను ఎవరైన నిర్మాత ఉపయోగించకుండా ఉన్నప్పటికీ కూడా ఆ పాటను మరో సినిమాకు సంగీత దర్శకుడు అమ్మలేరని తెలిపారు.తన పాటలను వేదికలపై పాడొద్దని ఎస్పీబాలు, చిత్ర, ఎస్పీ చరణ్లకు కూడా గతంలో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారనే విషయం తెలిసిందే.. నోటీసులు అందుకోగానే ఇళయరాజా పాటలు పాడటం ఆపేస్తున్నట్లు బాలు ప్రకటించారు. చట్టం గురించి తనకు తెలియకపోవడం వల్ల కచేరీలలో ఇళయరాజా పాటలు పాడానని బాలు చెప్పారు. ఇకపై షోలలో ఆయన పాటలు పాడలేనని సోషల్మీడియాలో ప్రకటించారు.1980 కాలంలో ఇళయరాజా టైమ్ కొనసాగుతుంది. ఆ సమయంలో ఆయన ఆడియో కంపెనీ కూడా ప్రారంభించారు. తనకు ఏదైనా సినిమా ఆఫర్ వస్తే దాని ఆడియో హక్కులు కూడా సొంత కంపెనీకే ఇవ్వాలని షరతు పెట్టేవారు. ఇలాంటి డీలింగ్స్ అన్నీ కూడా తన మేనేజర్ కల్యాణం చూసుకునేవారు. కనీసం తన ఫైనాన్స్ విషయంలో కూడా ఆయన వేలు పెట్టరు. ఇళయరాజా చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. తనకు టాలెంట్తో పాటు డబ్బు విలువ బాగా తెలుసు. ఇళయరాజా వల్లనే ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ముందే కాపీ రైట్స్ తన కంపెనీ చేతిలో పెట్టుకున్నారు.ఇళయరాజా అందరికీ నోటీసులు పంపారా..?తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇశయరాజా అందరికీ నోటీసులు పంపలేదు. చాలామంది సరదాగా ఆయన పాటలు పాడుతుంటారు. సినిమా పాట అంటేనే ఇలాంటివి సహజం. ఆయన ఎప్పడూ కూడా మామూలు జనాలకు నోటీసులు ఇవ్వలేదు. చిన్నాచితక ఆర్కెస్ట్రా వారికి కూడా ఇవ్వలేదు. తన పాట ఎక్కడా కూడా వినిపించకూడదనే కండీషన్ పెట్టలేదు. ఆయన అభ్యంతరం చేసింది కేవలం సినిమా వాళ్లనే.. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వంటి వారు సామాజిక ప్రయోజనాల కోసం ఇళయరాజా పాటలు పాడలేదు. వారు కూడా కమర్షియల్ కార్యక్రమంలోనే పాడారు. తద్వారా ఈవెంట్ నిర్వాహుకులకు డబ్బు వస్తుంది కదా అనేది ఇళయరాజా పాయింట్.. భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా తన పాటలను ఉపయోగించుకుని డబ్బు సంపాదించడం ఏమిటి అని ఇళయరాజా భావించి ఉండొచ్చు. అందుకే ఆయన నోటీసులు జారీ చేస్తున్నారు. -
శీతాకాలంలో ముఖం మెరుస్తూ ఉండాలంటే..!
ముఖంపై బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్, నల్లటి మచ్చలు లేకుండా కాంతిమంతంగా ఉండాలంటే ఈ డివైజ్ బెస్ట్. అలాగే శీతాకాలంలో ముఖం వడిలిపోకుండా తాజాగా ఉండాలంటే మాత్రం ఈ సింపుల్ టిప్ ఫాలో అయ్యిపోండి చాలు..మరి సులభమైన చిట్కాలు, హెల్ప్ అయ్యే బ్యూటీ డివైజ్ల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్, నల్లటి మచ్చలు, గీతలు, మొటిమలు ఇవి ముఖాన్ని కళావిహీనంగా మారుస్తుంటాయి. ఇలాంటి సమస్యలను దూరం చెయ్యడానికి ఇప్పుడు సాంకేతికత బాగానే తోడవుతోంది. చిత్రంలోని ఈ స్కిన్ క్రష్ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్ – చర్మాన్ని మెరిపించడానికి రూపొందించిన ఒక అధునాతన సాధనం. ఈ డివైస్తో చర్మాన్ని లోతుగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది చర్మం పైపొర నుంచి నిర్జీవ కణాలను ఇట్టే తొలగిస్తుంది. దాంతో చర్మం మరింత నునుపుగా, తాజాగా మారుతుంది. నిగారింపుకు రాసే సీరమ్, క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి అప్లై చేసుకునే సమయంలో కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.ఈ మెషిన్తో పాటు చాలా హెడ్స్ లభిస్తాయి. వాటిని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. నిజానికి ఈ పరికరాన్ని ఉపయోగించడం చాలా తేలిక. మొదటగా చర్మాన్ని చల్లటి నీళ్లతో కడుక్కుని, పొడి గుడ్డతో తుడవాలి. తర్వాత, చర్మాన్ని కొద్దిగా సాగదీస్తూ ఈ పరికరాన్ని చర్మానికి ఆనించి, పైకి లేదా వెలుపలి దిశలో నెమ్మదిగా కదిలించాలి. దీనిలో ఆన్, ఆఫ్తో పాటుగా ‘లో, మీడియం, హై’ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే, మీడియం మోడ్ సౌకర్యంగా అనిపిస్తేనే, హై మోడ్ పెట్టుకోవచ్చు. చర్మం ఎర్రబడినా, మంటగా అనిపించినా వెంటనే దీని వాడకం ఆపెయ్యడం ఉత్తమం. చికిత్స పూర్తయిన తర్వాత, తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా సీరమ్ రాసుకోవాలి. మంచి ఫలితాల కోసం, దీనిని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. అయితే, ఈ చికిత్స తర్వాత 24 గంటల పాటు లేదా చర్మం సాధారణ స్థితికి వచ్చే వరకు ‘విటమిన్ ఏ’ లేదా రెటినోల్స్ ఉన్న ఉత్పత్తులను ఉపయోగించకూడదు.మెరుపునిచ్చే చిట్కాశీతకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చర్మం వడిలిపోయినట్లు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. పొడి చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకోవడానికి, ఇలా ప్రయత్నిస్తే సరిపోతుంది. ఒక చిన్న బౌల్లో ఒక టీ స్పూన్ బాదం పేస్ట్ (4–5 బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసుకోవాలి.), 2 టీస్పూన్లు చిక్కటి పచ్చి పాలు, 4 చుక్కల గ్లిజరిన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి, 15 లేదా 20 నిమిషాలు ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత, గోరువెచ్చని నీటితో సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి. ప్యాక్ తొలగించిన తర్వాత చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఎందుకంటే బాదంలో విటమిన్–ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి చర్మానికి చక్కటి పోషణనిస్తుంది. పాలలో ఉండే కొవ్వు, లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తూ, తేమగా ఉంచుతాయి. అలాగే గ్లిజరిన్ చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది. దాంతో వారానికి ఒకసారి ఈ మాస్క్ పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..) -
IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ బౌలర్ల మీదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 వేలంలో దేశీ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, రవి బిష్ణోయి, సర్ఫరాజ్ ఖాన్ తదితరులు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. పాటు విదేశీ ప్లేయర్లు కామెరాన్ గ్రీన్, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ వంటి వారు హైలైట్ కానున్నారు. స్టార్లను మినహాయించితే ఈ ఐదుగురు భారత అన్క్యాప్డ్ బౌలర్లు కూడా ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది.ఆకిబ్ నబీజమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ. అనుభవం, నైపుణ్యాలు కలిగిన ఈ ఫాస్ట్బౌలర్ కోసం ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడం ఖాయం. తాజా దేశీ సీజన్లలో అతడు అద్భుత ప్రదర్శన కనబరచడం ఇందుకు కారణం. 2025-26 రంజీ సీజన్లో అదరగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దుమ్ములేపాడు.ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు 15 వికెట్లు కూల్చిన ఆకిబ్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. మధ్యప్రదేశ్తో మ్యాచ్లో బ్యాట్తోనూ సత్తా చాటాడు. వేలానికి ముందు అతడి ఈ అత్యుత్తమ ప్రదర్శన ఫ్రాంఛైజీలను ఊరిస్తోంది.ఈడెన్ ఆపిల్ టామ్కేరళకు చెందిన తాజా బౌలింగ్ సంచలనం ఈడెన్ ఆపిల్ టామ్. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్లలో రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు 20 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్. తాజా రంజీ సీజన్లో మధ్యప్రదేశ్పై (4/55 & 2/33) ఉత్తమ గణాంఖాలు నమోదు చేశాడు.ఇక మొత్తంగా ఏడు ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో కలిపి 19 వికెట్లు కూల్చాడు ఆపిల్. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడికి అనుభవం లేదు. అయినప్పటికీ అతడి నైపుణ్యాల కారణంగా కనీస ధర రూ. 20లక్షలకైనా అమ్ముడుపోయే అవకాశం ఉంది.రాజ్ లింబానిఅండర్-19 వరల్డ్కప్లో ఫైనల్ చేరిన భారత జట్టులో రాజ్ లింబాని సభ్యుడు. 2024లో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఇప్పటికి 11 మ్యాచ్లలో కలిపి 16 వికెట్లు కూల్చాడు. కొత్త బంతితో అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో అతడు అదరగొట్టాడు. డెత్ ఓవర్లలోనూ తనదైన శైలిలో రాణించాడు.ఆకాశ్ మధ్వాల్2023లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు ఆకాశ్ మధ్వాల్. ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్ ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటాడు. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్కు మారి అక్కడా తనను తాను నిరూపించుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్లో 17 మ్యాచ్లు ఆడి 23 వికెట్లు తీశాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో ఈ యార్కర్ల కింగ్ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. ఉత్తరాఖండ్ తరపున ఆరు మ్యాచ్లలో మూడు వికెట్లే తీశాడు. అయితే, అతడి అనుభవం దృష్ట్యా ఈసారి మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.అశోక్ శర్మసయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో రాజస్తాన్ తరఫున సత్తా చాటుతున్నాడు అశోక్ శర్మ. ఇప్పటికి ఏడు మ్యాచ్లలో కలిపి ఏకంగా 19 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లకు నెట్బౌలర్గా పనిచేసిన అశోక్ శర్మ ఈసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు. -
బంగారు కొండ.. మానుకొండ అంటూ పోస్ట్!
విజయవాడ: ఏపీలో అధికార టీడీపీ నేతలైన ఎంపీ కేశినాని చిన్ని-ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య నడుస్తున్న కోల్డ్వార్ తారాస్థాయికి చేరింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్గా కొలికపూడి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ హిట్ పుట్టిస్తున్నారు. కొలికపూడి పోస్ట్లతో ఎంపీ కేశినేని చిన్ని వర్గంలో కలవరం మొదలైంది. తాజాగా కేశినేని చిన్నిపై కొలికపూడి పెట్టిన పోస్ట్ వైరల్గా మారింంది. గంపలగూడెం టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోను పెడుతూ ‘ బంగారు కొండ.. మానుకొండ’ అంటూ పోస్ట్ పెట్టారు కొలికపూడి. ఈనెల 18 నుంచి గంపలగూడెం మండలంలో పల్లెనిద్ర అంటూ మరో పోస్టు పెట్టారు. కొలికపూడి వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపుతున్నాయి. -
గుండెల'ధర'గొట్టి..
నిడదవోలు: ఆకాశానంటుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలతో పప్పు ధాన్యాలు, అపరాలు, పంచదార కూడా కొనలేని పరిస్థితితో పేద ప్రజలు లబోదిబోమంటున్నారు. ఈ వారం మార్కెట్లో నిత్యావసర సరకుల ధరలను పరిశీలిస్తే ప్రతి వస్తువుపై కిలో రూ.10 నుంచి రూ.30లు పెరగడంతో పప్పుల జోలికే సామాన్య, మధ్య తరగతి ప్రజలు వెళ్లలేకపోతున్నారు. నూనె ధరలు పెరగడం కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయని వారు వాపోతున్నారు. ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మకాలు పట్టణంలో ఉన్న పలు దుకాణాల్లో వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక షాపులో ఉన్న ధర మరొక షాపులో ఉండట్లేదు. ప్రస్తుతం మార్కెట్లో హోల్సేల్, రిటైల్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి వారికి ఇష్టం వచ్చిన ధరలకు అపరాలు, నిత్యవసరాలు విక్రయిస్తున్నా పౌర సరఫరాల శాఖాధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ తగ్గినా పాత ధరలే.. నిత్యవసరాలు సరకులపై జీఎస్టీ తగ్గినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రభుత్వం తగ్గించిన కొత్త స్లాబులు అమలుకు నోచుకోవడం లేదు. మార్కెట్లో నిత్యావసరాల వస్తువులను పాత ధరలతోనే అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఇదే పరిస్థితి నెలకొనడంతో కొందరు వ్యాపారులు జీఎస్టీ తగ్గింపు విధానాన్ని బహిష్కరించినట్లుగా కనిపిస్తుంది. కొందరు ఉద్యోగులు, విద్యావంతులు సరకుల ధరలు, సబ్బులు, వంట నూనెలపై జీఎస్టీ తగ్గించాలని వ్యాపారస్తులను ప్రశ్నిస్తున్నా.. వంట నూనెలకు జీఎస్టీ తగ్గించలేదని వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. ఆన్లైన్లో ఒక రకం ధరలు క్షేత్రస్థాయిలో మరో రకం ధరలు అమలు చేస్తుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కానరాని నిబంధనలు ప్రతీ దుకాణం వద్ద తగ్గిన నిత్యావసర ధరలను ప్రదర్శించాలని జిల్లా అధికారులు సంబంధిత కింది స్థాయి ఉద్యోగుల ద్వారా దుకాణాదారులను ఆదేశించారు. అయితే, చాలా చోట్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యాపారులు, దుకాణదారులు అసలు జీఎస్టీ ఊసే ఎత్తడం లేదు. ధరల వ్యత్యాసాలపై ఎవరైనా వినియోగదారుడు వ్యాపారులను ప్రశ్నిస్తే ఇంకా అమలు కావడం లేదని, అమలు తర్వాత జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుందని కొనుగోలుదారులను నిలువునా ముంచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ధరల దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోతుందని మధ్య తరగతి, పేద ప్రజలు వాపోతున్నారు. కందిపప్పు ఇవ్వకపోవడంతో.. కందిపప్పు ధరలు ఆకాశానంటుతున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న కందిపప్పును ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం నిలిపివేసింది. రేషన్ షాపుల్లో తెలుపు కార్డుదారులకు కిలో రూ.67 కందిపప్పు అందించేవారు. అయితే, గత 10 నెలల నుంచి కందిపప్పు ఇవ్వకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ¯ð లబ్ధిదారుడు కందిపప్పు తీసుకునేందుకు రేషన్ షాపులకు వెళ్లగా.. కందిపప్పు ఇవ్వడం లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. నిడదవోలు పట్టణంలో 11,208, పెరవలి మండలంలో 22,463, ఉండ్రాజవరం మండలంలో 21,912, నిడదవోలు మండలంలో 23,912 తెలుపు కార్డులు ఉన్నాయి. ఇలా ప్రతీ వస్తువుపై ధరలు పెరిగిపోవడం పనులు లేక కూలీలు, పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ఆదాయ వనరుల బట్టి కుటుంబ పోషణకే కష్టమవుతున్న పరిస్థితుల్లో ఆడంబరాలకు దూరంగా బాధతో ఉంటున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వాలి ధరలు పెరిగిపోవడంతో ఏమీ కొనలేక పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కందిపప్పును రేషన్ షాపుల్లో తక్కువ ధరకు ఇవ్వాలి. జీఎస్టీ ధరలు ఎక్కడా కూడా అమలు చేయడం లేదు. పేదలు పప్పులు కొనాలంటేనే ధరలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీ పనులు చేసుకునే మాలాంటి వాళ్లం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. – మర్రిపూడి విజయ, గృహిణి, నిడదవోలు. -
రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్!
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాడంటూ కోలీవుడ్లో ప్రచారం ఊపందుకుంది. అందుకు కారణం లేకపోలేదు. భార్య, దర్శకురాలు గీతాంజలి.. తన సోషల్ మీడియా ఖాతాలో భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేసింది. పెళ్లయిన దాదాపు 14 ఏళ్లకు ఇలా ఫోటోలన్నీ సడన్గా తీసేయడంతో వీళ్ల మధ్య గొడవలు తలెత్తాయని కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే ఈ కాలంలో విడాకులు తీసుకునేముందు ఒకరినొకరు అన్ఫాలో చేసుకుని ఇలా ఫోటోలు డిలీట్ చేసుకుంటున్నారు. దీంతో ఈ జంట కూడా విడిపోయిందేమోనని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రచారంపై గీతాంజలి, సెల్వరాఘవన్.. ఎవరో ఒకరు స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.రెండు పెళ్లిళ్లుసెల్వరాఘవన్ (Selvaraghavan).. కాదల్ కొండేన్ అనే తమిళ చిత్రంతో వెండితెరపై దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. ఇందులో సెల్వ తమ్ముడు ధనుష్ హీరోగా నటించాడు. సోనియా అగర్వాల్ను హీరోయిన్గా బిగ్స్క్రీన్కు పరిచయం చేశారు. సెల్వ నెక్స్ట్ మూవీ 7/G రెయిన్బో కాలనీ (7/G బృందావనం) మూవీలోనూ సోనియానే హీరోయిన్! ధనుష్- సోనియాను జంటగా పెట్టి మూడో సినిమా తీశాడు. ఈ మధ్యకాలంలో సోనియాతో సాన్నిహిత్యం ప్రేమగా మారడంతో 2006లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.కానీ భార్యాభర్తలుగా ఎంతోకాలం కలిసుండలేకపోయారు. 2010లో సెల్వ- సోనియా విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది సెల్వ.. దర్శకురాలు గీతాంజలి (Gitanjali Raman)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. 14 ఏళ్లుగా ఎంతో బాగా కలిసున్న ఈ దంపతులు ఇప్పుడిలా విడిపోతున్నారన్న వార్త అభిమానులను కలిచివేస్తోంది. అటు సెల్వ తమ్ముడు ధనుష్ కూడా ఐశ్వర్య రజనీకాంత్తో విడాకులు తీసుకోవడం గమనార్హం!చదవండి: మ్యాచ్ చూసేందుకు వచ్చి మెస్సీ అంటే ఇష్టం లేదన్న అర్హ -
నాగార్జున వాయిస్ ఓవర్.. 'ఇట్లు అర్జున' టీజర్ రిలీజ్
అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తోన్న చిత్రం ఇట్లు అర్జున. ఈ మూవీతో అనీశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మొదటి సినిమాగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ను టాలీవుడ్ కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్తో రూపొందించారు. నాగార్జున చేతుల మీదుగా రిలీజైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తే భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.Loved doing the voice over for this love story!!To everyone who loved, But never said "I love you" ♥️Introducing #Aniesh as #NewGuyInTown in @WhatNextEnts’ Production No.1 - #ItlluArjuna ✨God bless🙏Discover the #SoulOfArjuna 💕🔗 https://t.co/E1KSWtAZOy@NewGuyInTown06…— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 14, 2025 -
చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, విప్రో
దేశీ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపింది. ఎంటర్ప్రైజ్లకు ఏఐ సొల్యూషన్లు అందించేందుకు వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బెంగళూరులోని పార్ట్నర్ ల్యాబ్స్లో మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ కేంద్రం(హబ్)ను ఏర్పాటు చేయనుంది.మూడేళ్లపాటు అమల్లోఉండే సహకారం ద్వారా ఎంటర్ప్రైజెస్కు కీలక కార్యకాలపాలలో ఏఐ అమలుకు వీలు కల్పించనుంది. ఒప్పందం ద్వారా విప్రోకున్న కన్సల్టింగ్, ఇంజినీరింగ్ ఆధారిత సామర్థ్యాలకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ స్టాక్ను జత కలుపుకోనుంది.ఏఐ స్టాక్లో భాగంగా అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్హబ్ కోపైలట్, అజ్యూర్ ఏఐ ఫౌండ్రీ తదితరాలను భాగం చేసుకోనుంది. వెరసి ఎంటర్ప్రైజ్లకు కార్యకలాపాలలో టెక్నాలజీ వినియోగానికి వీలుగా విభిన్న ఏఐ సొల్యూషన్లు సమకూర్చనుంది. -
ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..!
చెట్టును కావలించుకుని ఉండి ప్రపంచ రికార్డు స్థాపించింది. కెన్యాలో అడవుల నరికివేతపై అందరి దృష్టి పడేలా ఆమె ఈ నిరసన తెలియచేసింది. ప్రజలు ఆమె మద్దతుకు తండోప తండాలుగా కదిలి వచ్చారు. కెన్యాలోని న్యారీ కౌంటీలో పర్యావరణ కార్యకర్త ట్రంఫెనా ముతోని నాలుగు రోజుల క్రితం ఒక చెట్టును పట్టుకుని నిలబడిపోయింది. 72 గంటల పాటు ఆ చెట్టును వదలకుండా ఉంది. నిద్రపోలేదు. విశ్రాంతి తీసుకోలేదు. కాలకృత్యాల కోసం కూడా అతి తక్కువ సమయమే తీసుకుంది. ఒక దశలో వాటి అవసరమే రాలేదు. 72గంటల పాటు ఆమె చేస్తున్న నిరసనను ఆన్లైన్లో సోషల్ మీడియాలో జనం చూశారు. చాలామంది నేరుగా వచ్చి చూశారు. మరెంతో మంది దశలు దశలుగా చూస్తూ ఉండిపోయారు. ఆరోగ్య కార్యకర్తలు దగ్గరే ఉండి ఆమె ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చారు. జనం చప్పట్లతో ఆమెను ఉత్సాహపరిచి 72 గంటల తర్వాత నిరసనను ముగించేలా చూశారు. ముతోని గతంలో కూడా ఇలాగే 48 గంటల పాటు చెట్టును కావలించుకుని ఉండిపోయి రికార్డు స్థాపించింది. ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఇది గిన్నెస్ రికార్డు అని పరిశీలకులు భావిస్తున్నారు. ‘నేను ఈ పని ప్రచారం కోసమో, డబ్బు కోసమో చేయడం లేదు. నాలాంటి యువతీ యువకులు పర్యావరణ సంరక్షణ అవసరాన్ని తెలుసుకోవాలని చేస్తున్నాను. నన్ను చూసి ఏ మూల ఏ ఒక్కరైనా ఒక్క చెట్టు నాటినా నా నిరసనలోని ప్రతి సెకండ్ సద్వినియోగం అయినట్టే భావిస్తాను’ అని నిరసన ముగించాక ముతోని మీడియాతో అంది. ఈ 72 గంటలలో ఒక రాత్రి భారీగా వాన పడింది. అయినా ముతోని చలించలేదు. చెట్టును కరుచుకుని ఉండిపోయింది. ఆమె దృఢ నిరసనకు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో స్పందన వచ్చింది. కెన్యాలో అడవుల నరికివేత మాత్రమే కాదు మృగాల సంహారం కూడా సాగుతూ ఉన్న దరిమిలా ఈ నిరసన ఏ మార్పుకు కారణమవుతుందో చూడాలి.(చదవండి: మట్టితో... ఫేస్మాస్క్లు) -
అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
ఉప్పలగుప్తం: కన్న కూతురి చేయి పట్టుకుని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి.. ఆమె పైనే కన్ను వేసి, అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో జరిగింది. ఎస్సై సీహెచ్ రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్ పంపించి, 15 ఏళ్ల కుమార్తెతో కలసి ఉంటున్నాడు. కుమారుడిని తన అత్తవారింటి వద్ద ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంత కాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్సై రాజేష్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
మట్టితో... ఫేస్మాస్క్లు
సినిమాల్లో మనకు కనిపించే నటులు మేకప్తో సదరు పాత్ర ఆహార్యం ఉట్టిపడేలా తయారవుతుంటారు. ముఖ్యంగా ముఖ కవళికలే ఆ పాత్రను నడిపిస్తాయి. ఇప్పుడంటే మేకప్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ... కొన్నేళ్ల క్రితం కేవలం మొహాలకు మాస్కులు వేసుకుని నాటకాల్లో నటించే వారు. అలాంటి మాస్కులకు అస్సాంలోని మాజూలీ ప్రసిద్ధిగాంచింది. శ్రీమంత శంకరదేవుల వైష్ణవ సంప్రదాయం ఆధారంగా అభివృద్ధి చెందిన సంప్రదాయ మాస్క్లు ప్రసిద్ధికెక్కాయి. ఈ మాస్కుల తయారీ కళ 16వ శతాబ్దం నుంచి మనుగడలో ఉందని చరిత్ర చెబుతోంది. వారసత్వ కళగా ఉన్న ఈ ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలకు ఏఎస్ఆర్ఎల్ఎం వారధిగా నిలిచింది. మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎంఈడీపీ)లో భాగంగా కళాకారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉపాధిబాట పట్టించింది. వారి వారసత్వ కళను ప్రోత్సహించి వాటిని మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాటు చేసింది. కళాకారుల కుటుంబాల్లోని మహిళలతో స్వయం సహాయక సంఘం(ఎస్హెచ్జీ)గా ఏర్పాటు చేసింది. పదిహేను మంది ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇలా రెండు బృందాలు ఈ మాస్కులను తయారు చేస్తున్నాయి. సహజసిద్ధ రంగులతో తయారు చేసే ఈ మాస్కులను బహిరంగ మార్కెట్కు తరలించి విక్రయించడమే కాకుండా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ మార్కెట్లోకి సైతం అడుగుపెట్టింది. వీటికి గతేడాది మార్చిలో జీఐ ట్యాగింగ్(భౌగోళిక గుర్తింపు)ను ప్రభుత్వం ఇచ్చింది.సహజసిద్ధ సరుకుతో...అస్సాం రాష్ట్రంలోని మాజూలీ ద్వీపంలోని కళాకారులు ఈ ఫేస్ మాస్కులను తయారు చేస్తున్నారు. వెదురు కర్ర ముక్కలు, బ్రహ్మపుత్ర నదీలో లభించే బంక మట్టి, ఆవుపేడ, జూట్, పేపర్, కాటన్తో ఈ మాస్కులు తయారు చేస్తారు. ముందుగా తయారు చేసే ముఖ ఆకృతిని వెదురు ముక్కలతో ఫ్రేమ్ మాదిరి తయారు చేసి వాటికి బంకమట్టి, ఎండిన ఆవుపేడ పొడి కలిపిన మిశ్రమంతో ఆ ఫ్రేమ్పైన పూతలా అద్దుతారు. ఈ ప్రక్రియలో జూట్, పేపర్, కాటన్ను అనువైన రీతిలో వినియోగిస్తారు. ఈ నమూనా పూర్తిగా ఎండిన తర్వాత వాటికి అవసరమైన రంగులు అద్దుతారు. ప్రస్తుతం సూరత్ నుంచి దిగుమతి చేసుకునే రంగులను వినియోగిస్తున్నారు. సహజసిద్ధమైన రంగుల వినియోగం ఖరీదవుతుందని, త్వరలో ఈ రంగులను స్థానికంగా తయారు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో వీటినే వినియోగిస్తామని వాటిని తయారు చేస్తున్న మహిళలు చెబుతున్నారు. ఈ మాస్కులు మూడు రకాల పరిమాణంలో ఉంటాయి. మొదటి రకం కేవలం మొహాన్ని మాత్రమే కవర్ చేస్తుండగా... రెండో రకం నటుడి శరీరంలో మెజార్టీ భాగాన్ని కవర్ చేస్తుంది. మూడో రకం మాత్రం అవసరానికి అనుగుణంగా వాటిని తయారు చేస్తారు. ఈ కళను పరిరక్షించి ఆధునీకరించేందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హేమ్చంద్ర గోస్వామి కృషి చేశారు. ప్రస్తుతం వీటిని నాటకాల్లో మాత్రమే వినియోగించకుండా పర్యాటకుల జ్ఞాపికలుగానూ, అలంకరణ వస్తువులగానూ వినియోగిస్తున్నారు.మార్కెట్లో ఇలా...కళాకారులు తయారు చేసే మాస్కులపైనే ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఒక్కో మాస్కుపైన రూ.100 పెట్టుబడి పెడితే చాలు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. మహిళలు తయారు చేసే ఒక్కో మాస్కు కనీస ధర రూ.200 నుంచి ప్రారంభమవుతుంది. ఫేస్ మాస్క్ పరిమాణం ఆధారంగా వీటి ధర రూ.3వేల వరకు ఉంటుంది. ఈ మాస్కుల తయారీ ద్వారా మహిళా సంఘానికి నెలకు కనీసం రూ.50 వేల ఆదాయం లభిస్తోంది. ప్రస్తుతం ఈ తయారీ ప్రక్రియ ప్రారంభదశలో ఉండగా... రానున్న ఏడాదిలో ఆర్థిక స్థితి భారీగా వృద్ధి సాధిస్తుందని, ఈమేరకు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. మాజూలీ నుంచి– చిలుకూరి అయ్యప్ప, సాక్షి, (చదవండి: 'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్మస్క్పై నెటిజన్లు ఫైర్) -
రోషన్ కనకాల మౌగ్లీ.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా వచ్చిన తాజా చిత్రం మోగ్లీ 2025. సందీప్ రాజ్ డైరెక్షన్లో వచ్చిన డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.తొలి రోజే మౌగ్లీ కలెక్షన్ల పరంగా అదరగొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.1.22 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ప్రీమియర్స్తో కలిసి ఈ మొత్తం కలెక్షన్స్ సాధించిందని తెలిపింది. వైల్డ్ బ్లాక్బస్టర్ అంటూ పోస్టర్ను షేర్ చేసింది.అయితే మౌగ్లీ ముందు అనుకున్న ప్రకారం ఈనెల 12నే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా బాలయ్య నటించిన అఖండ-2 బాక్సాఫీస్ బరిలో నిలిచింది. దీంతో ఒక్క రోజు ఆలస్యంగా మోగ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈనెల 13న థియేటర్లలో రిలీజైంది. కాగా.. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు.#Mowgli gets off to a phenomenal start at the box office 🏇❤️Wild Blockbuster #Mowgli2025 grosses ₹1.22 crore worldwide on Day 1, including premieres ❤️🔥❤️🔥🎟️ https://t.co/HHe863GdbEA @SandeepRaaaj CinemaA @Kaalabhairava7 musical 🎵🌟ing @RoshanKanakala, @SakkshiM09 &… pic.twitter.com/WfhjIIEMgY— People Media Factory (@peoplemediafcy) December 14, 2025 -
బాబుగారి తాలూకా.. కక్షకట్టి.. పొట్ట కొట్టి
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పాలన గాడితప్పింది. దశాబ్దాలుగా పారిశుధ్య పనులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులపై ‘పద్మావతి ఏజెన్సీ’ కత్తిగట్టింది. వయసు, విద్యార్హత ఆంక్షల పేరుతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 50 ఏళ్లు వయసు పైబడిన వారు ఉద్యోగాలకు అవసరం లేదని తెగేసి చెప్పింది. జీవనాధారం కోల్పోతే కుటుంబ పోషణ ఎలా అన్న మానసిక క్షోభ కార్మీకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో కార్మీకులు తమ జీవనాధారాన్ని దెబ్బ తీయొద్దంటూ ఏజెన్సీ నిర్వాహకులను ప్రాధేయపడ్డారు. ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా ఫ్రంట్ వారియర్స్గా పనిచేసిన తమకు ఇదేనా మీరిచ్చే గుర్తింపు అని ప్రశ్నిస్తే.. కర్కశంగా సమాధానమిచ్చారు. మీరెటైనా చావండి.. మేము ఇతరులను పనిలోకి తీసుకుంటున్నాం అని తెగేసి చెప్పడంతో గుండె ఆగినంత పనైంది. ఎప్పుడు తమకు డ్యూటీ చివరి రోజు అవుతుందోనని భయం భయంతో విధులకు హాజరవుతూ రెండు నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వాహకుల బెదిరింపులతో మనస్తాపం చెందిన పద్మావతి అనే పారిశుధ్య కార్మీకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. చేతులెత్తేసిన అధికార యంత్రాంగం.. పారిశుధ్య కార్మీకుల సమస్యతో సర్వజనాస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన పారిశుధ్యంపై అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదు. నిబంధనల మేరకు కార్మీకులపై చర్యలుంటాయని, స్టేట్ పాలసీ అంటూ మాట దాటవేస్తున్నారు. దీనికి తోడు ఏజెన్సీ నిర్వాహకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిత్రులని, ఈ విషయంలో తామేమి చేయలేమని అధికారులే బహిరంగంగా చెబుతుండడం దుమారం రేపుతోంది. జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే ఎవ్వరూ కార్మికుల సమస్యను పట్టించుకోలేదు. దుర్వాసన వెదజల్లుతున్న వార్డులు.. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో శనివారం పారిశుధ్య కార్మీకులు విధులకు గైర్హాజరయ్యారు. రోజుకు మూడు, నాలుగుసార్లు శుభ్రం చేయాల్సిన వార్డులను ఒక్కసారి కూడా శుభ్రం చేయలేదు. ఎమర్జెన్సీ, అక్యూట్ మెడికల్ కేర్, ఐసీసీయూ, పీఐసీయూ, గైనిక్, లేబర్, ఆర్థో, మెడిసిన్, ఈఎన్టీ, ఆపరేషన్ తదితర వార్డులన్నీ దుర్వాసన వస్తున్నాయి. ఇప్పటికే శానిటేషన్ నిర్వాహకులు కనీసం డస్ట్బిన్లు, కవర్లను ఇవ్వలేదు. దీంతో రోగికి వినియోగించిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. పారిశుధ్యం నిర్వహణకు గాను ప్రతి నెలా రూ.70 లక్షలు ఏజెన్సీకి చెల్లించేలా ఒప్పందంలో ఉంది.జీవనాధారం పోతే ఏం కావాలి? ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 30 ఏళ్లుగా పని చేస్తున్నాం. పారిశుధ్య పనులు చేస్తూ ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఇప్పటికే నా భర్త కృష్ణా నాయక్, బిడ్డ కవిత, అల్లుడు నాగరాజు చనిపోయారు. మనవడు, మనవరాలు గంభీర్ (డిగ్రీ), గంగోత్రి (9వ తరగతి) ఆలనా, పాలన నేనే చూసుకోవాలి. ఇప్పుడేమో ఏజెన్సీ వాళ్లు పని నుంచి తొలగిస్తామని చెబుతున్నారు. నాకుటుంబానికి ఆధారమంతా ఇదే సార్. వచ్చే డబ్బులతోనే వారిని చదివించుకుంటున్నా. ఇప్పటి వరకు ఐదారు ఏజెన్సీలు వచ్చాయి. పద్మావతి ఏజెన్సీ అంత ఘోరంగా ఎవరూ సతాయించడం లేదు. – కాంతమ్మ, పారిశుధ్య కార్మికురాలుఇంతలా అంగలాపిస్తే ఎలా..? నేను, నా భర్త సిరాజ్ ఉంటున్నాం. ఆయన ఏ పనీ చేయలేని పరిస్థితి. 12 ఏళ్లుగా సర్వజనాస్పత్రిలో పని చేస్తున్నా. ఇక్కడ వచ్చే డబ్బులతోనే కుటుంబం గడుస్తుంది. ఈ వయసులో ఉద్యోగం లేదని, పనికి రావొద్దని చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేశాం. ఇప్పుడు ఉన్నఫళంగా వెళ్లిపొమ్మంటే ఏం చేయాలి. ఇంత అంగలాపిస్తే ఎలా? ఏజెన్సీ మేనేజర్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు మాతోటి స్వీపర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీళ్లు మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? – షమీమ్, పారిశుధ్య కార్మీకురాలు ఏజెన్సీ ముసుగులో దురుసు ప్రవర్తన..ఈ నెల 12న పద్మావతి అనే పారిశుధ్య కార్మీకురాలి పట్ల పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజరెడ్డి దురుసుగా మాట్లాడారు. చస్తే చావు అంటూ కర్కశంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురైన పద్మావతి చిన్నపిల్లల విభాగం అంతస్తుపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసి, ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ⇒ సర్వజనాస్పత్రిలో ఏజెన్సీ నిర్వాహకులు, పారిశుధ్య కార్మీకులకు మధ్య 20 సార్లకుపైగా వాగ్వాదం జరిగింది. పదుల సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు. నెల రోజులుగా కార్మీకులు తమకు న్యాయం చేయాలంటూ రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. ⇒ పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు ఇప్పటికే 50 మంది వరకు సూపర్వైజర్లు, పారిశుధ్య కార్మీకులను విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన వారిని విధుల్లోకి పురమాయించినట్లు తెలుస్తోంది. దీనికితోడు పారిశుధ్య కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఏజెన్సీ మేనేజర్లు ఆస్పత్రిలో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నా రు. ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అనే ఆలోచనలో నిమగ్నమయ్యారు.కార్మీకురాలికి పరామర్శ ఏజెన్సీ మేనేజర్లు దురుసుగా మాట్లాడటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికురాలు పద్మావతిని శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు పరామర్శించారు. కార్మీకులందరికీ యూనియన్ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, కార్యదర్శి బి.రాజశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి, జిల్లా కార్యదర్శి అనిల్కుమార్గౌడ్, నగర కార్యదర్శి రామాంజి రాయల్, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ హుస్సేన్, కాకర్ల శ్రీనివాస్రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ రాయల్, నగర కార్యదర్శి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మరో కాలానికి వెళ్లడం ఆసక్తిగా ఉంటుంది
రోషన్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చాంపియన్ ’. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రం సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్(Mickey J Meyer) మాట్లాడుతూ – ‘‘స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథతో ‘చాంపియన్’ సినిమా రూపొందింది. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం నాకు ఇలా ఇష్టం. ఎందుకంటే ఒక టైమ్ నుంచి మరో టైమ్లోకి వెళ్లి మరో కాలాన్ని చూడడమనేది ఆసక్తికరంగా ఉంటుంది. ‘మహానటి’ సినిమా నాకు అలాంటి అనుభూతినే ఇచ్చింది. ‘చాంపియన్’లో నిజాం బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ‘సల్లంగుండాలి, గిర గిర గిర గింగిరాగిరే..’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ జానపదంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ను మిళితం చేసి ఒక జానర్ను క్రియేట్ చేసే అవకాశం ఈ కథ కల్పించింది. ఈ కథలో హీరోకు సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. నేను కూడా సికింద్రాబాద్లోనే పెరిగాను. నాకు ఆ కల్చర్ పై అవగాహన ఉంది. యాక్టర్గా, డ్యాన్సర్గా... ఇలా రోషన్ ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రదీప్ చక్కగా డైరెక్ట్ చేశాడు’’ అని చెప్పారు. -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్మస్క్పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు. కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్కాస్టర్తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025 (చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు) -
మెస్సీ అంటే ఇష్టం లేదు: అల్లు అర్హ
ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మెస్సీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం నాడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంకి వచ్చిన ఫుట్బాల్ దిగ్గజాన్ని చూసి అభిమానులు ఆనందంతో గెంతులేశారు. మెస్సీ మైదానంలో సరదాగా ఆడుతూ గోల్స్ చేస్తుంటే అది చూసి ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు. ఈ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్ సైతం వెళ్లారు.అర్హ, అయాన్ వీడియో వైరల్మెస్సీ కోసం వచ్చావా? అని ఓ విలేఖరి అడిగితే.. కేవలం ఎక్స్పీరియన్స్ కోసం వచ్చానని ఆన్సరిచ్చాడు అయాన్. ఫుట్బాల్లో ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే రొనాల్డో అని చెప్పాడు. తర్వాత అర్హను ప్రశ్నలడిగారు. మెస్సీ అంటే ఇష్టమా? అని అడగ్గా.. తనకు ఇష్టం లేదని అర్హ నిర్మొహమాటంగా బదులిచ్చింది. మెస్సీ మ్యాచ్కు వచ్చి మెస్సీ అంటేనే ఇష్టం లేదని చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.Ayaan bhAAi asalu vere unnadu😂🤣Yela ra asalu ila 😭💯📈Entertainer "Ayaan" bolthe 💥🥁#ayaan #alluarjun pic.twitter.com/ekWkTYEHe6— sai (@nenupapinii) December 14, 2025 చదవండి: థియేటర్లో సుమ కన్నీళ్లు -
థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్!
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మౌగ్లీ. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అఖండ-2 రావడంతో ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.అయితే ఈ మూవీని యాంకర్ సుమ తన కుమారుడితో కలిసి వీక్షించింది. తెరపై కొడుకు నటనను చూసి తీవ్ర భావోద్వేగానికి గురైంది. థియేటర్లోనే తన కుమారుడు రోషన్ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అమ్మ ప్రేమ అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటించింది. టాలీవుడ్ నటులు బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలో మెప్పించారు.మోగ్లీ కథేంటంటే..తన ప్రేమకోసం మోగ్లీ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. మరి... మోగ్లీ ప్రేమ కథకు వచ్చిన అడ్డంకులు ఏంటి? క్రిస్టోఫర్ నోలన్ (ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్పాత్ర పేరు) నుంచి మోగ్లీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే అంశాలతో తెరకెక్కించిన కథే మౌగ్లీ. కొడుకు @RoshanKanakala విజయం చూసి తల్లి @ItsSumaKanakala ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.. #Mowgli 👋 pic.twitter.com/qUcMowK03Z— Milagro Movies (@MilagroMovies) December 13, 2025 -
నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. సచిన్, కోహ్లి దరిదాపుల్లో లేరు!
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మేనియాతో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. మెస్సీ నామస్మరణతో మహానగరం శనివారం మారుమోగ్రిపోయింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆద్యంతం చలాకీగా, సరదాగా గడిపిన మెస్సీ.. సరదా కిక్లతో ఫుట్బాల్ను స్టాండ్స్కు పంపించాడు. వాటిని అందుకుని అందుకున్న అభిమానులు ఇదేకదా అసలు ‘కిక్కు’ అంటూ మురిసిపోయారు.కాగా మెస్సీ.. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా సామాన్యులనూ ఆకర్షించిన అంశం.. వారిని ముక్కునవేలేసుకునేలా చేసిన విషయం ఏమిటంటే.. ఈ లెజెండరీ ఆటగాడితో ఫొటో దిగాలంటే ఏకంగా పది లక్షలు చెల్లించాల్సి ఉండటం. అయితే, మెస్సీ రేంజ్ గురించి తెలిసిన వాళ్లు మినమమ్ ఉంటది కదా! అని సరిపెట్టుకున్నారు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెస్సీ సంపాదన.. 2025 నాటికి ఏడు వేల కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా!ఫుట్బాల్కే ఆదరణ ఎక్కువభారత్తో పాటు క్రికెట్ ఆడే దేశాల్లో ప్రఖ్యాతి పొందిన భారత క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ (దాదాపు రూ. 1400 కోట్లు), విరాట్ కోహ్లి (సుమారుగా వెయ్యి కోట్లు)లతో పోలిస్తే మెస్సీ సంపాదన చాలా ఎక్కువ. భారత్లో క్రికెట్ మతమైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్కి ఆదరణ ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఒక్కో మెట్టు ఎక్కుతూ..పుట్టుకతోనే మెస్సీ కోటీశ్వరుడేమీ కాదు. చిన్ననాటి నుంచే ఫుట్బాల్పై ఉన్న మక్కువ.. ఆటలో అంకిత భావం, నైపుణ్యాలు అతడిని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. క్లబ్లకు ఆడుతూ పెద్ద మొత్తంలో ఆర్జించిన మెస్సీ.. ఇంటర్ మియామిలో చేరిన తొలి నాళ్లలో నెలకు మిలియన్ డాలర్లకు పైగా పొందాడు. ప్రస్తుతం ఈ క్లబ్ ద్వారా అతడు పొందే ఆదాయం నెలకు 2.67 మిలియన్ డాలర్లుగా ఉందంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక బార్సిలోనా క్లబ్ ద్వారా మెస్సీ లెక్కకు మిక్కిలి ఆర్జిస్తున్నాడు.అంతేకాదు.. టాప్ బ్రాండ్లకు అంబాసిడర్గా పనిచేస్తూ మెస్సీ దండిగా సంపాదన కూడబెట్టాడు. ఉదాహరణకు అడిడాస్, పెప్సీ వంటి బ్రాండ్లు మెస్సీ క్రేజ్ దృష్ట్యా అతడికి ఏడాదికి రూ. 70 మిలియన్లకు పైగా ముట్టజెప్పుతున్నట్లు వివిధ వార్తా సంస్థలు నివేదించాయి.రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాలుఇవే కాకుండా డిజిటల్ కాయిన్ల రూపంలోనూ అతడు మనీ సేవ్ చేస్తున్నాడు. ఇక ఆట, ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్లో పెట్టాడు. అంతేకాదు.. హోటల్ వ్యాపారాలనూ పెద్ద ఎత్తున విస్తరించాడు. ఇలా అటు క్లబ్లు.. ఇటు ఎండార్స్మెంట్లు, వ్యాపారాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న మెస్సీ... నికర ఆస్తుల విలువ ఏడు వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే.. మెస్సీ నెల ఆదాయం సుమారుగా రూ. 41.67 కోట్లు. అంటే ఏడాదికి దాదాపుగా రూ. 500 కోట్లు అన్నమాట. చదవండి: IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్ -
లిబియాలో భారత జంట కిడ్నాప్: రూ. రెండు కోట్లు డిమాండ్
మెహసానా : గుజరాత్లోని మెహసానా జిల్లాకు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెతో పాటు పోర్చుగల్కు వలస వెళ్లే ప్రయత్నంలో లిబియాలో కిడ్నాప్కు గురయ్యారు. వీరిని కిస్మత్సింగ్ చావ్డా, అతని భార్య హీనాబెన్, కుమార్తె దేవాన్షిగా గుర్తించారు. కిస్మత్సింగ్ సోదరుడు నివసిస్తున్న పోర్చుగల్లో స్థిరపడాలనే ఉద్దేశ్యంతో వీరు నవంబర్ 29న అహ్మదాబాద్ నుండి బయలుదేరారు. వీరు దుబాయ్ మీదుగా లిబియాలోని బెన్ఘాజీ నగరానికి విమానంలో చేరుకోవలసి ఉంది. అయితే ఇంతలోనే బెన్ఘాజీలో కిడ్నాప్కు గురయ్యారు.ఈ కుటుంబం పోర్చుగల్ కేంద్రంగా పనిచేసే ఒక విదేశీ ఏజెంట్ సహాయంతో ఈ ప్రయాణం చేస్తున్నట్లు మెహసానా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమాన్షు సోలంకి తెలిపారు. కిడ్నాపర్లు మెహసానాలోని చావ్డా బంధువులను సంప్రదించి, వారిని విడుదల చేయడానికి రూ. రెండు కోట్లు డిమాండ్ చేశారు.ఈ సమాచారం అందుకున్న బంధువులు.. సహాయం కోసం మెహసానా జిల్లా కలెక్టర్ ఎస్కే ప్రజాపతిని ఆశ్రయించారు.ఈ కిడ్నాప్ ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం.. విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఏజెంట్లు ఎవరూ భారతీయులు కాదని సోలంకి ధృవీకరించారు. దీనిలో అంతర్జాతీయ ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చన్నారు. కాగా ఇదే తరహాలో గత జూలైలో జమ్ముకశ్మీర్కు చెందిన రంజిత్ సింగ్ .. నైజర్లోని డోస్సో ప్రాంతంలో కిడ్నాప్కు గురయ్యారు.ఇది కూడా చదవండి: తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు? -
'బిగ్బాస్ తెలుగు 9' ప్రైజ్ మనీ ప్రకటించిన నాగార్జున
బిగ్బాస్ తెలుగు 9 ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. ప్రస్తుతం హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కానున్నారని నాగర్జాన ప్రకటించారు. భరణి ఎలిమినేట్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. అప్పుడు రేసులో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన మాత్రమే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన బిగ్బాస్ ప్రోమోలో విజేతకు అందే ప్రైజ్ మనీని నాగార్జున రివీల్ చేశారు.బిగ్బాస్ గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విజేతకు రూ. 50 లక్షలు అందుతాయని హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. అయితే, అందులో నుంచి ఎక్కువగా ట్యాక్స్ రూపంలో కట్ అవుతుందని అందరికీ తెలిసిందే. గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే హౌస్లో ఎవరికి ఎంత ఇస్తావని భరణిని నాగార్జున అడిగారు. తాను గెలుచుకున్న డబ్బు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఆ లిస్ట్లో ఇమ్మాన్యుయేల్, పవన్లు ఉంటారని భరణి అన్నారు. తాను గెలిస్తే రీతూ కోసం రూ. 5 లక్షలతో గిఫ్ట్ కొంటానని పవన్ చెప్పారు. -
OTT: ‘త్రీ రోజెస్ సీజన్ 2’ రివ్యూ
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్ సీజన్ 2’. 2021లో ఆహాలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన త్రీ రోజెస్ వెబ్ సిరీస్కి సీక్వెల్ ఇది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి త్రీ రోజెస్ సీజన్ 3 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (3 Roses Season 2 Review)కథేంటంటే.. రీతూ అలియాస్ రిత్విక (ఈషా రెబ్బా), మేఘన (రాశి సింగ్) , సృష్టి (కుషితా కల్లపు) ముంబైలో ఒకే హాస్టల్ ఉంటారు. సమీర్తో బ్రేకప్ తర్వాత రీతూ కెరీర్పై ఫోకస్ పెడుతుంది. వీరభోగ వసంత రాయలు(సత్య)తో విడాకులు తీసుకున్న మేఘన.. ఆ విషయం ఇంట్లో తెలియకుండా మ్యానేజ్ చేస్తూ మాజీ భర్త ఇచ్చిన భరణంతో లైఫ్ లీడ్ చేస్తుంది. సృష్టికేమో కొరియన్ డ్రామాల పిచ్చి. ప్రతీది కొరియన్ కళ్లతోనే చూస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఓ యాడ్ ఏజెన్సీ పెడతారు. కానీ వారికి ఒక్క యాడ్ కూడా రాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెడిసి కొడతాయి. చివరగా వీరికి ప్రసాద్(హర్ష చెముడు) గోల్డ్ జ్యూవెలరీకి సంబంధించిన యాడ్ ఇవ్వడానికి వస్తాడు. ప్రసాద్ ఎంట్రీతో ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పేంటి? వీరిని ట్రాప్ చేయాలనుకున్న వారి నుంచి ఈ ముగ్గురు అమ్మాయిలు ఎలా బయటపడ్డారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. విశ్లేషణతమకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకునే ముగ్గురు అమ్మాయిల కథ ఈ సిరీస్. అమ్మాయిల స్వేచ్ఛ, సాధికారతల గురించి ఈ సిరిస్లో వినోదాత్మకంగా చర్చించారు. ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అని తెలుసుకొని.. ఫేక్ బంధాల నుంచి బయటపడటంలోనే అసలైన ఆనందం ఉంటుంది అంటూ మంచి సందేశం అందించారు.సీజన్ 2లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా..ప్రస్తుతానికి మాత్రం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొదటి ఎపిసోడ్లో ప్రధాన పాత్రల పరిచయం మాత్రమే ఉంటుంది. ఇక రెండో ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. సీజన్ 1 లాగే సీజన్ 2లో కూడా కామెడీ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు. అయితే సీజన్ 1లో ముగ్గురు యువతులకు వేరు వేరు సమస్యలు ఉండగా...ఇందులో ముగ్గురు కలిసి ఒకే సమస్యను ఎదుర్కొంటారు.సొంతకాళ్లపై బతికేందుకు ముగ్గురు అమ్మాయిలు యాడ్ ఏజెన్సీ ఏర్పాటు చేయడం.. ఈ క్రమంలో గతంలో రిలేషన్షిప్లో ఉన్నవారే మళ్లీ రీతూ లైఫ్లోకి రావడం... మరోవైపు ఒంటరిగా ఉన్న అమ్మాయిల బలహీనలతను ఆసరాగా చేసుకొని.. తమకి అనుకూలంగా మార్చుకునేవాళ్లు.. ఈ క్రమంలో వచ్చే సీన్లన్నీ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇందులో మంచి సందేశం ఇచ్చారు. ఏది ప్రేమ, ఏది వ్యామోహమో తెలియకుండా ఎలా మోసపోతున్నారనేది చూపించిన తీరు బాగుంది. నాలుగు ఎపిసోడ్స్ ఇంకా రిలీజ్ కాలేదు..కాబట్టి పూర్తి కథనం చూసిన ఫీలింగ్ రాలేదు. రొటీన్ కథే అయినా.. కథణం బాగుంటుంది. నటీనటుల విషయానికొస్తే.. ప్రధాన పాత్రల్లో నటించిన ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు కూడా చాలా బాగా నటించారు. గ్లామర్ పరంగాను అలరించారు. సత్య కామెడీ నవ్వులు పూయించింది. ఇక అమ్మాయిల పిచ్చి ఉన్న పాత్రలో ప్రభాస్ శ్రీను కూడా తన పరిధిమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. వైవా హర్షతో పాటు మిగిలినవారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్కి ప్లస్ అయింది. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్గా కనబడుతుంది. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
వామ్మో.. ఘాట్ రహదారి
తాడిపత్రి టౌన్: నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆలూరు కోన రంగనాథ స్వామి క్షేత్రానికి వెళ్లే ఘాట్ రహదారి ప్రమాదకరంగా మారింది. ఘాట్ రోడ్డుకు ఉన్న రక్షణ గోడ కొన్ని చోట్ల దెబ్బతినగా.. మరి కొన్ని చోట పూర్తిగా నేలవాలింది. యాత్రికులు, భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల్లో ఘాట్ రోడ్డులో ప్రయాణించేందుకు జంకుతున్నారు. తాడిపత్రి పట్టణం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూరు కోన క్షేత్రం.. ప్రకృతి రమణీయతతో శోభాయమానంగా వెలుగొందుతోంది. క్షేత్రంలో స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేత శేషతల్పంపై భక్తులకు దర్శనం ఇస్తారు. ఏటా వైశాఖ మాసంలో స్వామికి బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి శని, ఆదివారాల్లో ఆలూరు కోనకు పెద్ద ఎత్తున పర్యాటకులు విచ్చేసి జలపాతంలో సేదతీరుతారు. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి వెళ్లే రోడ్డు మాత్రం అధ్వానంగా మారింది. రోడ్డుపై మోకాలు లోతు గోతులు పడటంతో భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే ఘాట్ రోడ్డులో కొండకు ఒక వైపు రక్షణ గోడ కూలిపోయింది. మరోవైపు రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు, పర్యాటకులు భయపడుతూ ఆలయానికి చేరుకుంటున్నారు. ఏవైనా పెద్ద ప్రమాదాలు జరగక ముందే అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు గుంతలమయం..తాడిపత్రి నియోజకవర్గంలో ఆలూరు కోన రంగనాయకుల స్వామి దర్శనానికి రోజూ పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. కోనకు వెళ్లే ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడ కూలిపోగా.. కొండకు మరో వైపు రక్షణగోడ లేకుండానే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. రోడ్డు కూడా గుంతలమయంగా మారింది. కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రోడ్డుకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. – యోగేశ్వర రెడ్డి, పర్యాటకుడు, తాడిపత్రి -
టెక్నా'లేజీ'.. అతివినియోగంతో తగ్గుతున్న జ్ఞాపకశక్తి
టెక్నాలజీ.. కాస్త టెక్నా‘లేజీ’ అవుతోంది.. పాశ్చాత్య నాగరికతకనుగుణంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. వయో భేదంలేదు అసలేలేదు.. అరచేతిలో స్వర్గం.. అనర్థాలు అధికమన్న విషయం తెలిసినా సామాజిక మాధ్యమాల్లోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది.. అతివినియోగంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది.. అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి.. ఫలితంగా చిన్నారులేకాదు.. 15 నుంచి 32 ఏళ్ల యువత కూడా డేంజర్ జోన్లోకి వెళ్లిపోతోంది.. సాక్షి, పుట్టపర్తి: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే.. టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా ప్రజలకు అందిన మేలు ఊహలకు అందదు. చావు కబురు చెప్పాలంటే టెలిగ్రామ్ పంపే రోజుల నుంచి నిమిషాల్లో సమాచారం చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. బంధువులను పండుగలు, శుభకార్యాల్లో మాత్రమే కలిసి రోజుల నుంచి నిత్యం టచ్లో ఉండేలా టెక్నాలజీ అందిపుచ్చుకున్నారు. మధ్య మధ్యలో మంచీచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలే దిక్కయ్యేవి. ఆ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సగటున స్మార్ట్ఫోన్ ఉంది. ఇంటింటా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం లభిస్తోంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్లో దొరుకుతోంది. పండుగలు, శుభకార్యాల కోసం మంచి బ్రాండ్ దుస్తులతో సహా ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొంటున్నారు. వ్యాపార రంగంలో ఆన్లైన్ బిజినెట్ వాటా సుమారు సగం పైగా ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా పిల్లల వీడియో గేమ్స్ యాప్స్ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగించకుండా రోజు గడవని స్థితి నెలకొంది. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. గూగుల్ మ్యాప్లో వెతుక్కుని వెళ్లే స్థితికి వచ్చారు. ఇదంతా పక్కన బెడితే.. మరో కోణంలో టెక్నాలజీని అతిగా వినియోగించి అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అలాంటి వారిలో 15 – 35 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. టెక్నాలజీ ప్రభావంతో చదువులో వెనుకబడడం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా దృష్టి సారించలేకపోవడం, ఒకరినొకరు మాట్లాడడం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి. నిద్రలేమి వేధిస్తోంది. చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకోవడం వంటి ప్రభావాలు పడుతున్నాయి. ఆఖరుకు చిన్న పిల్లలు కూడా డేంజర్ జోన్లోకి వెళ్తున్నారని వైద్యనిపుణులు చెప్తున్నారు. ⇒ ఒకే ప్రదేశంలో కూర్చొని కంప్యూటర్ చూస్తూ గడిపే వారికి వెన్ను సమస్యలు అధికం అవుతున్నాయి. ఈ నొప్పితో ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. నిత్యం ఉద్యోగ ఒత్తిళ్లతో బిజీలో ఉండటంతో పాటు మధ్య మధ్యలో స్నేహితులతో ముచ్చటించటం.. పలు విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో కంప్యూటర్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.. ఫలితంగా మూడు పదుల వయసుకే వెన్నెముక బారిన పడుతున్నారు. ఇటీవల పుట్టపర్తిలో 36 ఏళ్ల వ్యక్తి వెన్నెముక నొప్పి బారిన పడడమే నిదర్శనంగా చెప్పవచ్చు. ⇒ స్మార్ట్ఫోన్లతో జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు. కనీసం కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితి. గణాంకాల విషయానికొస్తే క్యాలిక్యులేటర్ వాడుతున్నారు. ప్రైమరీ పాఠశాల నుంచి చిన్నారులు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడటంతో ఏ విషయం గుర్తుంచుకోలేకపోతున్నారు. ఫోన్ లేకుంటే ఏ పనీ చేయలేని స్థితిలోకి వెళ్తున్నారు. ఫలితంగా టీనేజీలోనే జ్ఞాపక శక్తి కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రెండు నెలల క్రితం హిందూపురంలో 16 ఏళ్ల బాలుడు జాపకశక్తి కోల్పోయి.. మానసికంగా దెబ్బ తిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ⇒ పండుగ వచ్చినా.. ఫంక్షన్ రోజయినా.. ఎలాంటి శుభకార్యం కోసమైనా.. నేరుగా వెళ్లి పిలిచే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సమీప బంధువులను తప్ప మిగతా అందరినీ టెక్నాలజీ ఆధారంగా ఆహ్వానిస్తున్నారు. శుభవార్త, చేదువార్తలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే తెలియజేస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరూ అర్ధరాత్రి వరకు ఫోన్లతోనే గడిపేస్తున్నారు. మెసేజీలు, ఫోన్ కాల్స్, రీల్స్కు బానిసలుగా మారారు.పెరిగిపోతున్న ఒత్తిడి.. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్తోనే టెక్నాలజీని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా చిన్నపిల్లలు, యువతకు ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. 40 ఏళ్ల లోపు వయసున్న వారికి టెక్నాలజీ అతి వినియోగం కారణంగా మానసిక, శారీరక సమస్యలు అధికమయ్యాయి. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో సమయం గడుపుతుండడంతో సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ఫోన్ తక్కువగా వాడేవారు పాజిటివ్ ధోరణితో ఉండగా.. అతిగా వినియోగించే వారు నెగిటివ్ ఆలోచనలో ఉంటారని నిపుణులు చెప్తున్నారు. ట్యాబ్లు, కంప్యూటర్లపై ఎక్కువగా ఆధారపడేవారు కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఇంకొంత మందికి తలనొప్పి, భుజం, వెన్నునొప్పి సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యం ప్రధానం నిద్రపోయే గంట ముందే స్మార్ట్ఫోన్ వాడకం, టీవీ చూడటం మానేయాలి. అతి దగ్గరగా కూర్చొని టీవీ, ఫోన్ కూడా చూడరాదు. టెక్నాలజీని అవసరం మేరకే వాడుకోవాలి. లేదంటే సోమరితనం పెరిగిపోతుంది. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల వాడకం పూర్తిగా తగ్గించాలి. స్మార్ట్ఫోన్లలో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం గమనించడం తల్లిదండ్రుల బాధ్యత. లేదంటే పెడదారిలో వెళ్లే అవకాశం అధికంగా ఉంటుంది. – ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, శ్రీసత్యసాయి జిల్లా -
దసరా సూపర్ హిట్ కాంబో.. స్పెషల్ వీడియో రిలీజ్
దసరా బ్లాక్బస్టర్ హిట్ తర్వాత నాని మరోసారి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో జతకట్టారు. వీరిద్దరి కాంబో వస్తోన్న మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సూపర్ హిట్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఇవాళ దర్శకుడు శ్రీకాంత్ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ది ప్యారడైజ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఈ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. 'రక్తం పడిన తర్వాత చరిత్ర ఓపెన్ అవుతుంది' అని చెబుతూ.. ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలో చూపిస్తూ డైరెక్టర్ కనిపించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదల చేయనున్నారు. -
తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు?
తీహార్ జైలు.. దీనిని అధికారికంగా తీహార్ కారాగార ప్రాంగణం(Tihar Prison Complex) అని పిలుస్తారు. ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని ఈ జైలు.. ఖైదీల సంస్కరణ నిలయంగానూ ప్రసిద్ధి చెందింది. ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ హయాంలో దీనికి ‘తీహార్ ఆశ్రమం’ అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ కరుడుగట్టిన నేరస్తులు మొదలుకొని, పేరుపొందిన రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల వరకు పలువురు నేరస్తులు శిక్షలు అనుభవిస్తుంటారు. ఖైదీలకు వృత్తి విద్య, ఆధ్యాత్మిక శిక్షణ, యోగా, తీహార్ బ్రాండ్ కింద వివిధ ఉత్పత్తులను తయారుచేసే అవకాశాలు కల్పిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తీహర్ జైలు త్వరలో తరలిపోతున్నదనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తాజాగా నగరంలోని తీహార్ జైలును ఢిల్లీ శివార్లకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.తీహార్ గ్రామంలో..తీహార్ జైలు అనేది కేవలం ఒకే భవనం కాదు. పలు కేంద్ర జైళ్లతో కూడిన ఒక అతిపెద్ద సముదాయం. అధికారికంగా దీనిని ‘తీహార్ జైళ్లు’ అని పిలుస్తారు. ఇది పశ్చిమ న్యూఢిల్లీలోని తీహార్ గ్రామంలో 1958లో నెలకొల్పారు. తొలుత ఈ కేంద్ర జైలు 1,273 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యంతో ప్రారంభమైంది. జైలు పరిపాలనా నియంత్రణ మొదట్లో పంజాబ్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత 1966లో ఢిల్లీ పరిపాలనకు జైలు బదిలీ అయ్యింది. తీహార్ జైలు ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద జైలుగా పేరొందడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జైలు వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది.సామర్థ్యానికి మించి..కాలక్రమేణా తీహార్ జైలు సముదాయం భారీగా విస్తరించింది ప్రస్తుతం ఇందులో 10 వేర్వేరు కేంద్ర జైళ్లు (CJ-1 నుండి CJ-10 వరకు) ఉన్నాయి. ఈ జైలు అధికారికంగా దాదాపు 10,000 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, దీనిలో సామర్థ్యానికి మించి 15,000 నుండి 19,000 మంది ఖైదీలు ఉంటుంటారు. ఈ అధిక రద్దీ తీహార్ జైలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఈ సముదాయం శిక్ష పడిన ఖైదీలు, విచారణలో ఉన్న ఖైదీలు మహిళా ఖైదీల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.కిరణ్ బేడీ సంస్కరణలతో..1990లలో కిరణ్ బేడీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు)గా పనిచేసిన సమయంలో తీహార్ జైలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమె నాయకత్వంలో జైలులో పలు మానవతా సంస్కరణలు ప్రవేశపెట్టారు. వీటిలో ఖైదీల కోసం ధ్యానం, యోగా, వృత్తిపరమైన శిక్షణ, విద్యా కార్యక్రమాలు ప్రధానమైనవి. ఈ సంస్కరణలు జైలు వాతావరణాన్ని మెరుగుపరచడంలో, ఖైదీలలో సానుకూల మార్పులు తీసుకురావడంలో సహాయపడ్డాయి. ఈ సంక్షేమ కార్యక్రమాల కారణంగా తీహార్ జైలు కేవలం ఖైదీలను నిర్బంధించే స్థలంగానే కాకుండా, సంస్కరణల కేంద్రంగా కూడా పేరు పొందింది.హింస, గ్యాంగ్ వార్ ఘటనలతో..తీహార్ జైలును తరలించడానికి ఇక్కడ పెరుగుతున్న ఖైదీల సంఖ్య, భద్రతా సమస్యలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. సుమారు 10 వేల మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉన్న జైలులో ప్రస్తుతం 19 వేల మందికి పైగా ఖైదీలు ఉండటంతో భద్రత, నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే ఈ జైలు నివాస ప్రాంతాలకు దగ్గరగా (తిలక్నగర్, హరినగర్ వంటి జనావాసాలకు సమీపంలో) ఉండటం వల్ల, చుట్టుపక్కల ప్రజల భద్రత, రక్షణ కోసం దీనిని నరేలా వంటి నగర శివారు ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తున్నది. ఇటీవల జైలులో ఖైదీల మధ్య హింస, గ్యాంగ్ వార్ లాంటి సంఘటనలు పెరగడం కూడా ఈ యోచనకు ఒక కారణంగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: Monkey Day: అడవులను సృష్టించే ‘కోతి చేష్టలు -
IND Vs PAK: పాక్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ అట్టర్ఫ్లాప్
భారీ అంచనాల నడుమ పాకిస్తాన్తో మ్యాచ్లో బరిలోకి దిగిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. పాక్తో మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా గ్రూప్-‘ఎ’ లో ఉన్న భారత్- పాక్ (Ind vs Pak)మధ్య ఆదివారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా.. మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు.ధనాధన్ ఇన్నింగ్స్తో మొదలుపెట్టిన ఆయుశ్ఇక దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో దాయాదితో పోరులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. గత మ్యాచ్లో యూఏఈపై విఫలమైన ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) ఈసారి ధనాధన్ ఇన్నింగ్స్తో మొదలుపెట్టగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఆది నుంచే తడబడ్డాడు.పాక్ బౌలింగ్ అటాక్ను ఆరంభించిన అలీ రెజా.. తొలి ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. అతడి బౌలింగ్లో నాలుగో బంతికి ఆయుశ్ మాత్రే పరుగు తీశాడు. ఇక రెండో ఓవర్లో మొహమ్మద్ సయ్యామ్ బౌలింగ్లో ఆయుశ్ ఫోర్, సిక్స్, ఫోర్తో అలరించగా.. వైభవ్ మాత్రం ఇక్కడా ఖాతా తెరవలేదు.టచ్లోకి వచ్చినట్లే వచ్చిమూడో ఓవర్లో మళ్లీ రెజా రంగంలోకి దిగగా.. తొలి బంతినే బౌండరీకి తరలించి వైభవ్ టచ్లోకి వచ్చినట్లు కనిపించాడు. తర్వాత ఆయుశ్ రెజా బౌలింగ్లో రెండు ఫోర్లు బాది సత్తా చాటాడు. అయితే, నాలుగో ఓవర్లో మొహమ్మద్ సయ్యామ్ బౌలింగ్లో రెండో బంతిని వైభవ్ స్ట్రెయిట్ షాట్ బాదగా.. అతడు బంతిని క్యాచ్ పట్టాడు.దీంతో ఆరు బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు. అతడి స్థానంలో హైదరాబాదీ స్టార్ ఆరోన్ జార్జ్ క్రీజులోకి వచ్చాడు. కాగా ఆయుశ్ మాత్రే 25 బంతుల్లో 38 పరుగులు చేసి నిష్క్రమించగా.. విహాన్ మల్హోత్రా (12), వేదాంత్ త్రివేది (7) ఫెయిలయ్యారు. ఫలితంగా 20 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులే చేయగలిగింది. కాగా యూఏఈతో గత మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ భారీ శతకం (171) బాదిన విషయం తెలిసిందే. అయితే, సెమీస్ చేరడంలో కీలకమైన పాక్తో మ్యాచ్లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. UPDATE: Asia Cup 2025: పాక్తో మ్యాచ్.. భారత్ స్కోరెంతంటే? చదవండి: IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్ -
ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్లతో భూకబ్జాకు ఎత్తుగడ
రాప్తాడురూరల్: అది ప్రైవేట్ పట్టా భూమి. అలాంటి భూమికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఉండదు. అయినా తహసీల్దార్ పేరుతో ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఏకంగా ఫెన్సింగ్ వేశారు. బాధితులు వెళ్తే దౌర్జన్యానికి దిగుతున్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. రాప్తాడు మండలం మరూరులో జరుగుతున్న ఈ వ్యవహారం హాట్టాపిక్లా మారింది. బాధితురాలు తెలిపిన మేరకు...మరూరుకు చెందిన ఎం.గోపాల్రెడ్డి (లేట్) సతీమణి ఎం.వెంకటలక్ష్మమ్మ సర్వే నంబరు 978 (పాత సర్వే నంబరు 646)లో 1.47 ఎకరాల ప్రైవేట్ పట్టా భూమిని 1987లో కొనుగోలు చేసింది. ఇటీవల అదే గ్రామానికి చెందిన పి.ఆదినారాయణ, పి.ప్రభాకర్, చీర్ల భాస్కర్ జేసీబీలతో తన భూమిలోకి వచ్చి చదును చేశారని వెంకటలక్ష్మమ్మ వాపోతోంది. పి.వెంకటమ్మ, జె.నల్లమ్మ, చీర్ల లక్ష్మీదేవి, సావిత్రి, చీర్ల రాముడు పేర్ల మీద తన భూమిలో తహసీల్దార్ పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు నకిలీవి సృష్టించుకున్నారని ఆరోపించింది. ప్రైవేట్ భూమికి అధికారులు ఎలా పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తారని ప్రశ్నించింది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులను అడిగితే.. ఆ సర్వే నంబరులో అధికారికంగా తాము ఎవరికీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని ధ్రువీకరించారని తెలిపింది. ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించుకుని తన భూమిని ఆక్రమించాలని చూస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పింది. కోర్టులు అనుకూలంగా తీర్పు ఇచ్చినా... తన అనుభవంలో ఉన్న ఈ భూమిపై గతంలోనే తకరారు చేయడంతో జిల్లా కోర్టు, హైకోర్టును ఆశ్రయించానని బాధితురాలు వెంకటలక్ష్మమ్మ తెలిపింది. తనకే హక్కు ఉన్నట్లు రెండు కోర్టులూ ఉత్తర్వులు జారీ చేశాయని చెప్పింది. శాశ్వత ఇంజక్షన్ ఆర్డరు కూడా వచ్చిందని వెల్లడించింది. ఆర్డీఓ కోర్టు ద్వారా పాసు పుస్తకాలు కూడా మంజూరు చేశారని పేర్కొంది. అలాంటి భూమిలోకి కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వస్తున్నారని వాపోయింది. కలెక్టర్, ఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని వెంకటలక్ష్మమ్మ వేడుకుంటోంది. -
బంగారం ధరలు: ఒక్క వారంలో ‘ఎంత’ మారిపోయాయో..
దేశంలో బంగారం అంటే అందరికీ ప్రీతే. అవకాశం ఉన్నప్పుడల్లా కాస్తయినా పసిడిని కొంటుంటారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు ధరల్ని గమనిస్తూ ఉంటారు. తగ్గినప్పుడు కొనేసుకుందాం అనుకుంటారు. పెరిగినప్పుడు అయ్యో.. అంటూ నిరాశపడతారు. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా మారాయి.. ఎంత పెరిగాయి.. ఎంత తగ్గాయి.. ఆ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం..తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గడిచిన ఏడు రోజుల్లో హైదరాబాద్ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. మధ్యలో తగ్గుదల ఉన్నప్పటికీ వారాంతంలో బలమైన పెరుగుదలతో వారం ముగిసింది.ధరలు పెరిగాయిలా..డిసెంబర్ 7న 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,30,150గా ఉండగా, మరుసటి రోజు రూ.1,30,420కు కొద్దిగా పెరిగింది. డిసెంబర్ 9న అనూహ్యంగా రూ.1,29,440కు పడిపోయింది. అయితే మార్కెట్ త్వరగా రికవరీ అయింది. డిసెంబర్ 10న రూ.1,30,310కు, 11న రూ.1,30,750కు పెరిగింది.ఇక వారాంతంలో అసలైన ఊపు వచ్చింది. డిసెంబర్ 12న 24 క్యారెట్ బంగారం రూ.1,34,180కు ఎగిసింది. డిసెంబర్ 13, 14న రూ.1,33,910కు కొద్దిగా తగ్గినా, నికరంగా వారంలో రూ.3,760 ఖరీదైంది.ఇక 22 క్యారెట్ల బంగారం ధోరణి కూడా ఇదే. డిసెంబర్ 7న రూ.1,19,300తో ప్రారంభమై, 9న రూ.1,18,650కు తగ్గి, మధ్యలో రూ.1,19,450, రూ.1,19,850కు రికవరీ అయింది. డిసెంబర్ 12న రూ.1,23,000కు ఎగసి, వారాంతంలో రూ.1,22,750కు స్థిరపడింది. మొత్తంగా వారంలో రూ.3,450 పెరిగింది.పెళ్లిళ్ల సీజన్ డిమాండ్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, మిడిల్ ఈస్ట్ సంఘర్షణలు వంటి అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులతో బంగారం ధరలు పెరుగుతున్నాయని స్థానిక జువెలర్స్ పేర్కొంటున్నారు. -
రామ్, భాగ్యశ్రీ ప్రేమ గీతం.. ఫుల్ వీడియో వచ్చేసింది
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. నవంబర్ 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. అయితే, నెటిజన్లలో కొందరు సినిమా బాగుందని మెచ్చుకున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ‘చిన్ని గుండెలో’ అనే వీడియో సాంగ్ను విడుదల చేశారు. ఇందులో రామ్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ అదుర్స్ అని ప్రశంసలు వచ్చాయి. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ను మెర్విన్, సత్య యామిని ఆలపించగా.. వివేక్- మెర్విన్ స్వరాలు సమకూర్చారు. ఇందులో కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. -
జగనన్న 2.0 పాలనలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు
పులివెందుల: మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు గంటమస్తాన్ వీధిలో అనుబంధ విభాగాల కోర్ కమిటీ సమావేశాన్ని వైఎస్సార్సీపీ వార్డు నాయకులు బండల మురళి, చంద్రమౌళిల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ చైర్మన్లు చిన్నప్ప, రసూల్, పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ అనుబంధాల కోర్ కమిటీ సమావేశాలు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆదేశాల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రతి నాయకులు, కార్యకర్త సైనికుల్లా పనిచేస్తేనే కూటమి నాయకుల కుట్రలను తిప్పి కొట్టవచ్చునన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వార్డులోని ప్రజలకు వివరించాలన్నారు. 2.0 జగనన్న పాలనలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే పదవులు కూడా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కమిటీలను నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సోపాల వీరా, కనక, సంపత్, దశరథరామిరెడ్డి, రత్న, కిశోర్, మాబ్జాన్, బాషా, వినోద్, రమేష్, బాబు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. వేముల : గొందిపల్లె సమావేశంలో మాట్లాడుతున్న మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి , పెద్దముడియం : బీటిపాడులో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పులివెందుల రూరల్ : గ్రామస్థాయి కమిటీలతో వైఎస్సార్సీపీ బలోపేతమవుతుందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భాస్కర్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ సర్వోత్తమరెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బలరామిరెడ్డిలు పేర్కొన్నారు. శనివారం పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీలోని కొత్తపల్లె గ్రామంలో గ్రామ కమిటీలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బాల గంగిరెడ్డి, భాస్కర్రెడ్డి, రామమల్లేశ్వరరెడ్డి, ఉమేష్రెడ్డి, బాల ఓబుళరెడ్డి, గంగిరెడ్డి, చిన్న, మస్తాన్, ఎంపీటీసీ గంగన్న, రవీంద్రారెడ్డి, గుండాలయ్య, చంద్రమోహన్రెడ్డి, రామకృష్ణ, సూర్యుడు, రామచంద్ర, మనోహర్, వేణుగోపాల్ యాదవ్, రమేష్, అర్జున్, కృష్ణయ్య, రఫి, రజాక్, కొత్తపల్లె గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. లింగాలలో.. లింగాల : ప్రస్తుతం మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్సీపీ గ్రామ, వార్డు కమిటీల నియామకం జరుగుతోంది. కమిటీలు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోనాల గ్రామంలో గ్రామ కమిటీల ఏర్పాటుపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కమిటీలు అహరి్నశలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగపు నియోజకవర్గ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, అబ్జర్వర్ పి.శ్రీనివాసులరెడ్డి, ఐటీ వింగ్ సుదర్శన్రెడ్డి, సోషల్ మీడియా సుమంత్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, బోనాల గ్రామ నాయకులు, సర్పంచ్ రాము కార్యకర్తలు పాల్గొన్నారు. వేములలో.. వేముల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ పటిష్టతకు సంస్థాగత కమిటీలతో గ్రామస్థాయి నుంచే శ్రీకారం చుట్టారని ఆ పార్టీ మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకటబయపురెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని గొందిపల్లె గ్రామంలో శనివారం సంస్థాగత కమిటీల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసే సంస్థాగత కమిటీలే పారీ్టకి పట్టుకొమ్మలన్నారు. గ్రామాల్లో ఏర్పాటయ్యే ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకొకసారి సమావేశమై గ్రామ సమస్యలతోపాటు పార్టీ పటిష్టతపై చర్చించుకోవాలన్నారు. రాబోవు కాలంలో స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలలో సంస్థాగత కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. జగన్ 2.0 పాలనలో కమిటీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చల్లా వెంకటనారాయణ, గంగిరెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, రాఘవరెడ్డి, ఆనంద్రెడ్డి, నాగేంద్రారెడ్డి, విజయభాస్కర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, ప్రకాష్రెడ్డ, శేషారెడ్డి, దేవేంద్రారెడ్డి, రామాంజనేయులు, ముసలయ్య, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు. సింహాద్రిపురంలో.. సింహాద్రిపురం : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి పర్యవేక్షణలో శనివారం సింహాద్రిపురం మండలం సుంకేసుల, బి.చెర్లోపల్లె, లోమడ గ్రామాల్లో వైఎస్సార్సీపీ సంస్థాగత కమిటీ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అబ్జర్వర్లు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, నీలవర్థన్రెడ్డి, కె.భాస్కర్రెడ్డి, ద్వారకనాథరెడ్డి, ప్రసాద్రెడ్డి, లోమడ వైఎస్సార్సీపీ నాయకులు పవన్ చంద్రారెడ్డి, హృషికేశవరెడ్డి, జనార్థన్రెడ్డి, బషీర్, జయచంద్రారెడ్డి, దేవపుత్రారెడ్డి, రవిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, రాజబాబు, వి.రాజా, వీరప్రసాద్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు నాగరాజు, భరత్రెడ్డి, శ్రీకాంత్, నారాయణరెడ్డి, జగదీశ్వరరెడ్డి, భార్గవ్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, రామకోటిరెడ్డి, సోమశేఖరరెడ్డి, చంద్రమౌళి, వివేకానందరెడ్డి, పరమేశ్వరరెడ్డి, మోహన్రెడ్డి, పార్థసారథిరెడ్డి, వెంకటనారాయణరెడ్డి, సురేష్, షబ్బీర్, మనోహర్రెడ్డి, కృపాకర్రెడ్డి, శాలివాహనరెడ్డి, శంకర్రెడ్డి, శివారెడ్డి, శివానందరెడ్డి, రాజశేఖరరెడ్డి, హాజివలి, గోవర్థన్రెడ్డి, తిరుమన్రెడ్డి, చంద్రహాసరెడ్డి, ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగులో.. జమ్మలమడుగు : గ్రామ కమిటీలే పారీ్టకి బలమని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దముడియం మండలంలోని బీటిపాడు, పాపాయపల్లె గ్రామాల్లో గ్రామ కమిటీల ఎంపిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనిచేసిన ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని గ్రామ స్థాయి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. పారీ్టలతో సంబంధం లేకుండా సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో మండల పరిశీలకుడు జగదీశ్వరరెడ్డి, మండల కన్వీనర్ విష్ణువర్థన్రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్షుమయ్య, రామలింగేశ్వరరెడ్డి, చౌడయ్య, వెంకటరామిరెడ్డి, గిరీష్రెడ్డి, విశ్నాథ్రెడ్డి, పాపాయపల్లె వెంకటసుబ్బారెడ్డి, చిట్టేపు విశ్వనాథ్రెడ్డి, రెండు గ్రామాల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. వీరపునాయునిపల్లెలో వీరపునాయునిపల్లె: మండలంలోని ఇందుకూరు గ్రామంలో గ్రామ కమిటీ అనుబంద విబాగాల కమిటీలు సర్పంచు వెంకటేసు ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ రఘునాధరెడ్డి, స్థానిక నాయకులు గోపాల్రెడ్డి, రమేష్రెడ్డి, నందకుమార్రెడ్డి, రాంబాబు. జగన్, వీరపునాయునిపల్లె ఎంపీటీసి రాఘవ యాదవ్, వెంకటరామిరెడ్డి, గంగిరెడ్డి, శ్రీనివాసుల్రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మైలవరంలో.. మైలవరం : వైఎస్సార్సీపీని బలోపేతం చేయడంతోపాటు రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాలను గ్రామాలలో ఎగరడంతోపాటు మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చేసుకుందామని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. శనివారం పెద్దకొమెర్ల, కర్మలవారిపల్లె గ్రామ పరిధిలో ఉన్న గ్రామాల కార్యకర్తలతో ఆయన గ్రామ సభను నిర్వహించి మాట్లాడారు. గ్రామాలలో వైఎస్సార్సీపీ మరింత బలం పెరగాలన్నారు. అందుకోసం ప్రతికార్యకర్త మన ప్రభుత్వంలో చేసిన పనిని, ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేశారు, అమలు కాని హామీల గురించి వివరించాలన్నారు. కష్టపడిన ప్రతికార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచిగుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, జడ్పీటీసీ మహాలక్ష్మీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమెర్ల మోహన్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శివగుర్విరెడ్డి, రామాంజనేయుల యాదవ్, వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేంపల్లెలో.. వేంపల్లె : మండలంలోని గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె, వేంపల్లె 5వ ఎంపీటీసీ పరిధిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్రెడ్డిల ఆధ్వర్యంలో వార్డు, గ్రామ కమిటీ నియామక కోసం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో గ్రామ కమిటీలదే కీలకపాత్ర అని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మునీర్బాషా, రవిశంకర్గౌడ్, వైఎస్సార్సీపీ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, మణిగోపాల్రెడ్డి, కటిక చంద్రశేఖర్, బాబా షరీఫ్, నిస్సార్ బాషా, ఎంపీటీసీ ఎం.హెచ్.హబీబుల్లా, బండల షుకూర్, బీఎస్ షేక్షావలి, సురేంద్ర, ముత్యాల రమేష్బాబు, మల్లయ్య, పద్మనాభరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు’
హైదరాబాద్: ఏపీలోని కూటమి ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నా జీవో ఇవ్వడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం లేకండానే విచ్చలవిడిగా అప్పుల తెస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్ 14వ తేదీ) సోమాజిగూడ ప్రెస్క్లబ్ నంచి మాట్లాడిన ఆయన.. ‘బేవరేజ్ల బాండ్లను రూ. 5,750 కోట్లకు మార్కెట్లో పెట్టారని విమర్శించారు. ఇవే బాండ్లను తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ కోంస అమ్మకం పెడితే నానా రాద్దాంతం చేశారన్నారు. ‘‘ప్రస్తుత కూటమి ప్రభుతం బేవరేజ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. బేవరేజ్ చెల్లించకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. బేవరేజ్లకు వచ్చే ఆదాయంలో డైరెక్ట్గా అప్పుదారుడు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇంత చేస్తున్న కూటమి ప్రభుత్వం.. మా ప్రభుత్వం హయాంలో గగ్గోలు పెట్టింది. కూటమి మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించింది. కేబినెట్ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారు. బాండ్లు తాకట్టుపెట్టి రూ. 5,750 కోట్లు కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. 9 శాతం పైగా వడ్డీతో రూ. చంద్రబాబు అప్పు తెచ్చారు.స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్య నిషేధం ఉండదని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు విషపు మాటలు, ఈనాడు విషపు రాతలు రాసింది. కేబినెట్ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. మా ప్రభుత్వంలో బాండ్లు ఇష్యూ చేస్తే అప్పుకిక్కు అని వార్తలు రాసిన కూటమి పత్రికలు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు అప్పు కిక్కి కనిపించడం లేదా.మేము చేస్తే అప్పు. కూటమి ప్రభుత్వం చేస్తే మాత్రం సంపద సృష్టి అన్నట్లు వారి మీడియా వార్తలు రాస్తుంది’ అని మండినడ్డారు బుగ్గన. -
ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా!
ఇప్పుడు చెప్పబోయే విషయం బాగా ఆశ్చర్యపర్చవచ్చు లేదా మీరు అస్సలు నమ్మలేక పోవచ్చు. కాన్సెప్ట్ అలాంటిది. ఈ కథనంలో విషయం విన్న తరువాత ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. ఆలస్యం చేయకుండా అసలు విషయం చెప్పేస్తాను, చకచక చదివేయండి మరి..!. ఈ ఆధునిక సమాజంలో బంధం అనేది పిడికిలిలో ఉన్న మట్టి లాంటిది. ఎంత సేపు ఒడిసి పట్టుకున్నా వేళ్ళ సందుల్లోంచి జారిపోతాయి ఈబంధాలు. అటువంటి బంధాలకు సంబంధించినదే ఈ స్టోరీ. ఇటీవల ఓ సర్వే ప్రకారం మగవాళ్ల గురించి పెద్ద మార్కులే వేసింది. అది మార్క్ డీబుల్ సర్వే. దీని ప్రకారం 66శాతం మగవాళ్లు ఏకపత్నీవ్రతులుగా తేలారు. ఇది నిజమా అబద్ధమా అన్నది ఓ సారి చూద్దాం. అసలు ముందు మార్క్ డీబుల్ అనేది డాక్టర్ మార్క్ డైబుల్ అనే సైంటిస్టు నుంచి పుట్టిన పేరు. ఆయన 2025లో *Proceedings of the Royal Society: Biological Sciences*లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, మగవాళ్ళలో 66 శాతం ఏకపత్నీత్వ రేటు ఉంది. ఇది సాదా సీదా సర్వే కాదు, అంటే ఆయన ప్రపంచంలోని అన్నీ జీవచరాలలో ఉన్న మగజాతిపై చేసిన సర్వే. అసలు ఆయన ఈ సర్వే ఎలా చేశాడంటే.. ఏకంగా 11 జాతుల మామల్స్ తోపాటు 94 మానవ సమాజాల డేటాను వాడి, కంప్యూటేషనల్ మోడల్తో విశ్లేషించారు. ఈ సర్వే ప్రకారం ఏకపత్నీతత్వంలో ఏఏ జాతులు, ఏఏ ప్రాంతంలో ఉన్నాయో ఓ సారి చూద్దాం. టాప్లో కాలిఫోర్నియా ప్రాంతంలోని డీర్మౌస్ వందశాతంతో , ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ లు 85శాతంతో ఉన్నాయి. ఇక చివర్లో మౌంటైన్ గొరిల్లాలు 6శాతం చింపాన్జీలు 4శాతంగా ఉన్నాయి. అంటే వీటికి అచంలత్వం ఎక్కువ. ఇక మనుషులు 4 శాతం మాత్రం ఉన్నారు. భారతదేశంలో ఏకపత్నీత్వం సాంప్రదాయం ఎక్కువగా ఉండేది . కానీ ఓ బ్రిటిష్ సర్వే ప్రకారం ఆధునిక యువతలో 31శాతం దీన్ని అసాధ్యం అని చెబుతున్నారు.ఇప్పుడు ఈ అధ్యయనం వల్ల మనకు తెలిసింది ఏమిటంటే ఏకపత్నీత్వం అనేది మన జీన్స్లో లేదు, సమాజంలో ఏర్పడింది. ఇది మనల్ని ఓ విధంగా ఒత్తిడి కలిగిస్తుంది. ఆధునికంగా, జెన్ Zలో 50శాతం మంది మోనోగమీని అంటే ఏకపత్నీత్వం ఔట్డేటెడ్ అని చెబుతున్నారు – ఓపెన్ రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి. మగవాళ్లు పాలిగినీకి అంటే ఒకరి కన్నా ఎక్కువ సంబంధాలు పెట్టుకోవడం పట్ల 6 రెట్లు ఆసక్తి చూపుతున్నారని మరో అధ్యయనం చెబుతుంది. అయితే మన తెలుగు సంస్కృతిలో "ఒక్కటి మంచిది" అనే సామెత ఉంది, కానీ ఈ డేటా మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది: మన సంబంధాలు ఎంత "నేచురల్" అనే ప్రశ్న పెరుగుతుంది.ఫ్రెండ్స్..ఒకరితో బంధం అంటే జీవితాంతం అది అనుబంధం అవుతుంది. అదే ఒకరి కన్న ఎక్కవైతే అది బంధాలకు అతీతం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ జీవితబంధమా లేక అతీతసంబంధమా అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి మరి..!. (చదవండి: 'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..ముఖ్యంగా భారతీయులే..) -
వామ్మో.. స్క్రబ్ టైఫస్!
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కల్గిస్తోంది. అన్నమయ్య జిల్లా పరిధిలో ఇప్పటికి 289 నమూనాలను సేకరించగా 39 మందికి పాజిటివ్ రావడంతో జిల్లా ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. రెండు రోజుల కిందట సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థి, కేవీ పల్లె మండల పరిధిలో మరో వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కావడంతో తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం. స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికశాతం మందికి ఈ వ్యాధిపై అవగాహన లేదు. అధికారులు దీనిపై విస్తృతంగా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది సాధారణ జ్వరం లాంటిదైనప్పటికీ ఆలస్యం చేస్తే శరీరంలో అంతర్గత అవయవాలపై ప్రభావం చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు మండల పరిధిలో ల్యాబ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. . ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ..... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే అదనుగా భారీగా సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా సమయంలో ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. సాధారణ జ్వరాన్ని స్క్రబ్ టైఫస్ అని భయాందోళనకు గురిచేస్తూ పేదల నుంచి డబ్బు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన ల్యాబ్, మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు ఇవి.. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. ఇది చిగ్గర్స్ అనే చిన్న కీటకాల లాంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా ఎలుకలు, కుందేళ్లు, ఉడతల శరీరంపై కనిపిస్తుంది. ఈ చిగ్గర్స్ కీటకాలు పొదలు, గడ్డి, వ్యవసాయ భూముల్లో నివసిస్తాయి. ఇవి కుట్టినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన తర్వాత 5–15 రోజుల్లోపు తీవ్రమైన జ్వరం, చలి, ఒంటినొప్పులు, తలనొప్పి, అలసట, బలహీనత, మెడ, చంకల్లో వాపు గడ్డలు, శరీరంపై దద్దుర్లు వస్తాయి. అలాగే పురుగు కుట్టిన చోట ముదురు రంగుతో కూడిన పుండు ఏర్పడుతుంది. ఇలాంటి లక్షణాలుంటే స్క్రబ్ టైఫస్గా భావించాలని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స చేయించకపోతే శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో పాటు అవయవాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని, సకాలంలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే నాలుగైదు రోజుల్లోనే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు తెలిపారు. నివారణ మార్గాలు ఏంటంటే.. స్క్రబ్ టైఫస్ రాకుండా ఉండాలంటే చేతులు, కాళ్లను బాగా కప్పి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ గడ్డి, పొదలు పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరు తాగడంతో పాటు సమతుల ఆహారం తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.8 శరీరంలోకి నేరుగా ప్రవేశించదు స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రభావం జిల్లాలో చాలా తక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 39 మందికి ఈ లక్షణాలు కనిపించాయి. స్క్రబ్ టైఫస్ బ్యాక్టిరియా శరీరంలోకి నేరుగా ప్రవేశించలేదు. బ్యాక్టిరియాను మోసుకెళ్లే ఈగలు, పేలు, నల్లులు కుట్టడం ద్వారా మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టినచోట కొందరికి నల్లని మచ్చ ఏర్పడుతోంది. కొందరిలో మచ్చ కనిపించదు. నొప్పి ఉండదు. ఇవి కుట్టినచోట బ్యాక్టిరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. ఆరు లేదా ఏడు రోజులకు పూర్తి లక్షణాలు బయటపడతాయి. మొదట్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, చలి వంటి లక్షమాలు కనిపిస్తాయి. మలేరియా, టైపాయిడ్ అనే భ్రమలో ఉన్నవారు స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయించుకోవాలి. – లక్ష్మీ నరసయ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
వివాహమైన మూడు నెలలకే బలవన్మరణం
ఎర్రగుంట్ల: మూడు ముళ్ల బంధానికి మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. అంతలోనే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన ఇది. ఆర్టీపీపీ స్టోర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చెండ్రాయుడు కుమార్తె చందనజ్యోతి శనివారం హైదరాబాదులో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే చెండ్రాయుడు నివాసం ఉంటున్న ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్టీపీపీ స్టోర్ ఈఈ చెండ్రాయుడు కుమార్తె చందనజ్యోతి, కొత్తగూడెంకు చెందిన యశ్వంత్కు మూడు నెలల క్రితం వివాహమైంది. ఇద్దరు హైదరాబాదులోని మూసాపేట్లో నివాసముంటున్నారు. అయితే ఏం జరిగిందో చందనజ్యోతి ఆత్యహత్య చేసుకున్నట్లు ఇక్కడికి సమాచారం అందింది. మృతదేహాన్ని ఆర్టీపీపీకి తీసుకుని వస్తున్నట్లు తెలిసింది. -
IND vs PAK: టాస్గెలిచిన పాకిస్తాన్.. భారత్ బ్యాటింగ్
ఆసియా క్రికెట్ మండలి అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్తో మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచింది. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ఆదివారం నాటి మ్యాచ్లో.. ఆయుశ్ మాత్రే సేనను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా.. మ్యాచ్ను నలభై తొమ్మిది ఓవర్లకు కుదించారు.తొలి మ్యాచ్లలో ఘన విజయాలుకాగా అండర్-19 ఆసియా కప్లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, మలేషియా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, నేపాల్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్లో భారత్ యూఏఈ (IND vs UAE)ని.. పాక్ మలేషియా (PAK vs MLY)ను చిత్తుగా ఓడించి శుభారంభం అందుకున్నాయి. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో దాయాదులు అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్లో భారత చిచ్చరపిడుగు, యూఏఈతో మ్యాచ్లో భారీ శతకంతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పైనే కళ్లన్నీ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్ తలా ఒక మ్యాచ్ గెలిచి టాప్-2లో ఉండగా.. గ్రూప్-ఎలో పాక్, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.భారత్ అండర్-19 వర్సెస్ పాకిస్తాన్ అండర్-19 తుదిజట్లుభారత్ఆయుష్ మాత్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్.పాకిస్తాన్ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, అలీ హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్(కెప్టెన్), హమ్జా జహూర్(వికెట్ కీపర్), హుజైఫా అహ్సన్, నిఖాబ్ షఫీక్, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయ్యమ్, అలీ రజా.చదవండి: తుదిజట్టు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు!.. సౌతాఫ్రికా కోచ్ ఏమన్నాడంటే.. -
తీవ్ర విషాదం.. సర్పంచ్ అభ్యర్థి మృతి
సాక్షి, నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అతను బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడని నిర్దారించడంతో, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాగరాజు కు ఎన్నికల్లో ఉంగరం గుర్తును కేటాయించారు. ఎన్నికల రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవులకు పోటీలో 12,782 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 29,917 వార్డులకు బరిలో 71,071 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ పదవికి సగటున ముగ్గురు, నలుగురు బరిలో నిలవగా, వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు.మరోవైపు రెండోదశ ఎన్నికల వరకు రూ. 2.02 కోట్ల నగదు, రూ. 3.46 కోట్ల విలువైన మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్ సహా మొత్తంగా రూ. 8.59 కోట్ల విలువైన మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. మొత్తం 3,675 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ముందుజాగ్రత్తగా 33,262 మందిని బైండోవర్ చేశామని తెలిపింది. -
బిగ్బాస్ 'సుమన్ శెట్టి' ఎలిమినేట్.. ఆల్టైమ్ రికార్డ్గా రెమ్యునరేషన్
బిగ్బాస్ తెలుగు 9 నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వారమే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ, అంచనాలకు మించి ఏకంగా 14 వారాల పాటు ప్రేక్షకులను మెప్పించాడు. 97వ ఎపిసోడ్లో బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్లో కేవలం 6 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. నేడు ఆదివారం ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. అప్పుడు టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యూయేల్, పవన్, సంజన మాత్రమే ఉంటారు. అయితే, తాజాగా ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టి భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత ప్రేక్షకులు అతని రెమ్యునరేషన్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. సుమన్ శెట్టి వారానికి రూ. 2.6 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. 14 వారాలు హౌస్లో ఆయన కొనసాగడంతో సుమారుగా రూ.36 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే టాప్ రెమ్యూనరేషన్ అందుకున్నవారిలో సుమన్ శెట్టి నిలిచారని చెప్పవచ్చు. గతంలో యాంకర్ రవి కూడా ఇదే రేంజ్లో రెమ్యునరేషన్ అందుకున్న విషయం తెలిసిందే. -
Monkey Day: అడవులను సృష్టించే ‘కోతి చేష్టలు
కోతులు.. అత్యంత తెలివైన జంతువులు.. వాటికి జీవవైవిధ్యంలో, మానవ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన కోతులు భూమిపై గల అత్యంత ముఖ్యమైన జంతు సమూహాలలో ఒకటి. అరణ్యాలలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, విత్తనాలను వెదజల్లే ఏజెంట్లుగా అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కోతులు ప్రపంచంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న కోతుల దినోత్సవం (Monkey Day) జరుపుకుంటారు. సరదాగా మొదలై..కోతుల దినోత్సవం అనేది కేవలం కోతులను మాత్రమే కాకుండా, చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్లతో సహా అన్ని రకాల సిమియన్లను (ప్రైమేట్లను) గుర్తుచేస్తుంది. మానవ కుటుంబ వృక్షంలో ప్రైమేట్స్ ఒక భాగం. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన ఈ జాతుల పట్ల మనకున్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనకు ఒక అవకాశం కల్పిస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమైన ఈ దినోత్సవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే వార్షికోత్సవంగా మారింది.కేలండర్లో సరదాగా రాయగానే..ఈ ప్రత్యేక దినోత్సవ ఆవిర్భావం 2000లో జరిగింది. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన కాసే సారో, ఎరిక్ మిల్లికిన్ అనే విద్యార్థులు ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. డిసెంబర్ నెలలో సెలవు రోజులను వెదుకుతూ వారు క్యాలెండర్లో 14వ తేదీన మంకీ డే అని రాశారు. ఈ విషయాన్ని వారు తోటి స్నేహితులకు తెలిపారు. దీంతో వారంతా కోతుల తరహా ప్రత్యేక దుస్తులు ధరించి, గెంతుతూ ఉల్లాసంగా గడిపారు. ఈ విధంగా వినోదంగా మొదలైన ఈ దినోత్సం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.మంకీ డే నాడే ‘కింగ్ కాంగ్’ విడుదలసారో, మిల్లికిన్ ఈ దినోత్సవం సందర్భంగా కొన్ని కళాకృతులు తయారుచేశారు. వీటిని ఆన్లైన్లో ప్రచురించడం ద్వారా ‘మంకీ డే’ భావన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి దారితీసింది. పీటర్ జాక్సన్ తీసిన ‘కింగ్ కాంగ్’(2005) మంకీ డే ఐదవ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది. ఇది మంకీడే ప్రాముఖ్యతను మరింతగా పెంచింది. మొదట సరదాగా ప్రారంభమైన మంకీ డే ఇప్పుడు పూర్తి స్థాయి ప్రపంచ ఆపరేషన్గా రూపాంతరం చెందింది. నేషనల్ జియోగ్రాఫిక్, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్, గ్రీన్పీస్ వంటి సంస్థలు ఈ రోజున కోతులు ఎదుర్కొంటున్న ముప్పుపై అవగాహన కల్పిస్తున్నాయి. (Facts About Monkeys In Telugu)కోతులలో సుమారు 260 జాతులు ఉండగా, వాటిలోని పలు రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. బార్బరీ మకాక్ల జనాభా గత 24 ఏళ్లలో 50 శాతానికి తగ్గింది. మంకీ డే అనేది కేవలం ఉల్లాసానికి మాత్రమే కాకుండా, కోతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కలిగించేందుకు కూడా దోహపదపడుతుంది.కోతులు.. 10 అద్భుత విషయాలువిభిన్న జాతులు (Diversity): ప్రపంచవ్యాప్తంగా సుమారు 260కి పైగా రకాల కోతి జాతులు ఉన్నాయి. వీటిని ప్రధానంగా ‘పాత ప్రపంచ కోతులు’ (ఆఫ్రికా, ఆసియా), ‘కొత్త ప్రపంచ కోతులు’ (దక్షిణ, మధ్య అమెరికా)గా విభజిస్తారు.తోక ప్రాముఖ్యత (Prehensile Tails): కొత్త ప్రపంచ కోతులు (ఉదాహరణకు సాలీడు కోతులు) కొన్నిటికి ప్రత్యేకమైన తోకలు ఉంటాయి. ఇవి చెట్ల కొమ్మలను పట్టుకోవడానికి లేదా ఆహారాన్ని తీసుకునేందుకు ఒక అవయవంలా పనిచేస్తాయి.సమాజ జీవనం (Social Lives): కోతులు అత్యంత సామాజిక జీవులు. అవి సమూహాలుగా (ట్రూప్స్) జీవిస్తాయి. కొన్నిచోట్ల వందల కోతులు కలిసివుంటాయి. ఈ సమూహాలలో వాటి మధ్య బంధాలు ఉంటాయి.శుభ్రం చేసుకోవడం (Grooming): కోతులు తమ సమూహంలోని ఇతర కోతులను శుభ్రం చేస్తుంటాయి. ఇది వాటి సామాజిక బంధాలను, పరస్పర నమ్మకాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.బుద్ధి కుశలత (Intelligence): కోతులు చాలా తెలివైనవి. అవి సమస్యలను పరిష్కరించుకుంటాయి. వివిధ పరికరాలను ఉపయోగించగలవు. ఉదాహరణకు పండ్లను, కాయలను ముక్కలు చేసేందుకు రాళ్లను వినియోగిస్తాయి.వివిధ రకాల ఆహారం (Varied Diet): కోతులు సాధారణంగా పండ్లు, ఆకులు, పువ్వులు, కీటకాలు చిన్న జంతువులను తినే సర్వభక్షకాలు (Omnivores). వాటి ఆహారం జాతిని బట్టి, అవి నివసించే ప్రాంతం ప్రకారం మారుతుంటుంది.ప్రత్యేకమైన కమ్యూనికేషన్ (Unique Communication): కోతులు వివిధ రకాల శబ్దాలు, ముఖ కవళికలు, శరీర భాష ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. ప్రమాదాన్ని సూచించడానికి లేదా ఆహారం గురించి తెలియజేయడానికి ప్రతి జాతికి ప్రత్యేకమైన అరుపులు ఉంటాయి.చిన్న కోతి (Pygmy Marmoset): పిగ్మీ మార్మోసెట్ అనేది ప్రపంచంలోనే అత్యంత చిన్న కోతి జాతి. ఇది కేవలం 5-6 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. 100 గ్రాముల కంటే తక్కువ బరువు ఉంటుంది.నిద్రించే విధానం (Sleeping Habits): చాలా కోతులు చెట్లపై నిద్రిస్తాయి. మాంసాహార జీవుల నుంచి సంరక్షణకే అవి అలా చేస్తుంటాయి. కొన్ని కోతులు నిద్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకుంటాయి.మానవులకు దగ్గర సంబంధం (Close to Humans): కోతులు, ముఖ్యంగా పాత ప్రపంచ కోతులు (మకాక్లు, బబూన్లు వంటివి), మానవులకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.ఇది కూడా చదవండి: Delhi Pollution: తొలగని అంధకారం.. వైద్యుల హెచ్చరికలు -
మొదటి మెట్టు.. గట్టేక్కేట్టు
విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. బంగారు భవితకు పునాది. ఉన్నత శిఖరాల అధిరోహణకు తొలిమెట్టు. అలాంటి పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో అధికారులు వంద శాతం ఉత్తీర్ణత సాధన కోసం ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసి పాఠశాలల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో.. డిసెంబర్ నుంచి మార్చి వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల టీచర్లు విద్యార్థులకు ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. 2026 మార్చి 16 నుంచి మార్చి 1 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూలు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇటీవల విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 605 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 28047 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. గతంలో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని, మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. సబ్జెక్టు వారీగా విద్యార్థులకు అసైన్మెంట్స్ నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించేలా వారికి ఉపాధ్యాయులు ప్రత్యేక తరీ్ఫదు ఇచ్చేలా ప్రధానోపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. రోజు వారి తరగతుల నిర్వహణ వంద రోజుల ప్రణాళికలో భాగంగా డిసెంబర్ 6 నుంచి మార్చి 15 వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 9 వరకు రెమిడియల్ క్లాసులు, తరువాత 9.15 నుంచి సాయంత్ర 4 గంటల వరకు నాలుగు సబ్జెక్టుల బోధన ఉంటుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు వరకు ప్రతి రోజు ఒక సబ్జెక్టులో పరీక్ష నిర్వహిస్తారు. పరిక్షలో వచ్చిన మార్కులను ఆన్లైన్ చేస్తారు. ఆ మరుసటి రోజు ముందు రోజు చదవిన సబ్జెక్టుకు సంబంధించి పరీక్షలో వచ్చిన మార్కులపైన పునశ్చరణ తరగతులు ఉంటాయి. ఇలా ఐదు రోజులపాటు శని, ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా ప్రణాళిక అమలు చేస్తారు. జనవరి నెలలో కేవలం సంక్రాంతికి సంబంధించి బోగి, సంక్రాంతి, కనుమ పండుగల మూడు రోజులు మినహా మిగతా రోజులు యథావిధిగా ప్రణాళిక అమలు అవుతుంది. ఇలా ప్రతి రోజు షెడ్యూల్ అమలు చేస్తున్నారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులంతా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారు ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్టుల్లో వెనుబడి ఉన్నారని గమనిస్తూ వారిలో భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసం నింపేలా కృషి చేస్తున్నారు. -
ఓటీటీకి ప్రియదర్శి రొమాంటిక్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రియదర్శి పులికొండ, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రేమంటే. ఈ మూవీలో సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కంచారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. నవంబర్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.ప్రేమంటే కథేంటంటే..మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీ. Andhamaina vaibhavala veduka ey kadha premante 🤩❤️ pic.twitter.com/NF7ic6xETm— Netflix India South (@Netflix_INSouth) December 14, 2025 -
పెన్నోబులేసునికి.. రాజకీయ గ్రహణం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కార్యనిర్వహణాధికారి (ఈఓ) దీర్ఘకాలిక సెలవుల కారణంగా ఆలయ నిర్వహణ – మాన్యం భూముల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మాన్యం భూములు దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు లీజు ఎగ్గొట్టడమే కాకుండా అనధికారికంగా భూములు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉరవకొండ/అనంతపురం కల్చరల్: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాల భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అనంతపురం జిల్లా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సాగాల్సిన పాలనా వ్యవహారాలపై చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) గా ఎవ్వరు వచ్చినా కొద్దిరోజులకే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భూముల లీజుల కేటాయింపు–నిధుల ఖర్చు చేయాలంటూ వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉండే ఆలయంలో ఏమి జరిగినా దిక్కు లేకుండా పోతోంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2,114 ఎకరాల మాన్యం ఉంది. ఇందులో 146 ఎకరాల ఈనామ్ భూమి, 412 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. మిగతా 1,554 ఎకరాలు ఆమిద్యాల, మోపిడి, కోనాపురం, పెద్దముస్టూరు, మూలగిరిపల్లి, రాచెర్ల, చిన్నముసూ్టరు పరిధిలో ఉన్నాయి. ఆలయ మాన్యాలు కొంతమంది అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయి. సొంత భూములు ఉన్నా సరే నామమాత్రపు కౌలు చెల్లిస్తూ కొన్నేళ్లుగా ఆలయ భూమిని అనుభవిస్తున్నారు. సాధారణంగా వర్షాధారం అయితే ఎకరాకు రూ.6 వేలు, సాగునీటి సౌకర్యం ఉంటే ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలు చెల్లించాల్సి ఉన్నా.. ఇక్కడ నారసింహుడికే నామాలు పెట్టి ఎకరాకు నామమాత్రంగా రూ.500 నుంచి రూ.2,500 ఏడాదికి చెల్లిస్తున్నారు. కౌలుదారుల్లో చాలామంది అనధికారికంగా సబ్లీజుకు ఇచ్చుకున్నారు. కొందరు అధికార పార్టీ నేతలైతే కౌలు భూమి తమ సొంత ఆస్తి అయినట్టు ఇతరులకు విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి సుమారు 1,400 ఎకరాలకు సంబంధించి కౌలు లీజు ముగిసినా నేటికీ ఆలయ భూములకు బహిరంగ వేలం పాటను అధికారులు నిర్వహించలేదు. 20 శాతం మంది మాత్రమే అసలైన కౌలుదారులు సక్రమంగా ఆలయానికి సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయ భూముల టెండర్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు అన్నీ తామై సిండికేట్గా మారి టెండర్లు దక్కించుకోవాలని చూడటంతో గతేడాది ఆగస్టు నుంచి వరుసగా మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఏడాదికి సగటున 20 వేల మంది స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. 2024–25 ఏడాదికి ఉరవకొండకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు రూ.27 లక్షలకు తలనీలాల సేకరణ హక్కులను దక్కించుకున్నాడు. అయితే ఇందులో రూ.9.5 లక్షలు మాత్రమే సదురు టీడీపీ నాయకుడు ఆలయానికి చెల్లించి, మిగతా సొమ్ము నేటికీ జమ చేయలేదు. ఈ సొమ్ములో కూడా గతంలో ఈఓగా విధులు నిర్వహించిన ఓ అధికారి తన సొంతానికి రూ.3 లక్షలు వాడుకున్నట్లు ఆలయ సిబ్బందే గుసగులాడుకోవడం గమనార్హం. = భక్తులు పరమపవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం పెన్నహోబిలంలో కొంతకాలంగా కనుమరుగైంది. లడ్డూ ప్రసాదం టెండరు ప్రక్రియ ఆగిపోయి చాలా కాలమైంది. అధికార పార్టీ నేతలు – దేవదాయ శాఖ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో భక్తులకు లడ్డూ ప్రసాదమే లేకుండా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా రమేష్బాబు బాధ్యతలు చేపట్టారు. అయితే టీడీపీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో భరించలేకపోయిన ఆయన దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు. దీంతో అప్పటి జిల్లా సహాయ కమిషనర్ (ఏసీ) తిరుమలరెడ్డికి ఆలయ ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనకూ అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పలేదు. దీంతో ఆయన కూడా సెలవులోకి వెళ్లిపోయారు. తదుపరి ఈఓ బాధ్యతలు గుంతకల్లుకు చెందిన మల్లికార్జున తీసుకుంటారని ఎండోమెంటు అధికారులు చెప్తున్నా.. ఆయన మాత్రం ముందుకు రాలేదు. ఈ క్రమంలో అనంతపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం ఈఓగా ఉన్న సుధారాణికి తాత్కాలికంగా పెన్నహోబిలం ఆలయ బాధ్యతలు అప్పగించారు. పెన్నహోబిలం ఆలయ నూతన పాలక మండలి ఇంకా కొలువుదీరలేదు. అయినా సభ్యులుగా తామే ఉంటామని, మేము చెప్పినట్లుగా మీరు పనిచేయాల్సి ఉంటుందని కొందరు అధికార పారీ్టనేతలు ఈఓలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి అయ్యే రూ.5 లక్షల ఖర్చును ఆలయ నిధుల నుంచే వెచ్చించాలని షరుతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఈ అంశం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. చేసేది లేక సెలవుపై వెళ్తున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాంపెన్నహోబిలంలో మేం గుర్తించిన సమస్యలను పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ కొన్నాళ్లుగా ఈఓ లేనిమాట నిజమే. సెలవులో ఉన్న తిరుమలరెడ్డి ఈ నెల 19న వస్తారు. అప్పటి వరకు నేను ఇన్చార్జ్గా మాత్రమే కొనసాగుతాను. కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా మేము కూడా ఎండోమెంటు ఇన్స్పెక్టర్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. – సుధారాణి, పెన్నహోబిలం ఆలయ ఇన్చార్జ్, దేవదాయ శాఖ ఇన్చార్జ్ ఏసీ -
చలిలో బెల్స్ పాల్సీ ముప్పు!.. పెరుగుతున్న ముఖపక్షవాతం
కర్నూలు(హాస్పిటల్): మూతి వంకర పోవడం, అ లాంటి నోటి నుంచి నీరు కారుతుండటం, తినాలన్నా, తాగాలన్నా ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే దానిని వైద్యపరిభాషలో బెల్స్ పాల్సీ అంటారు. తెలుగులో దానిని ముఖ పక్షవాతమని పిలుస్తారు. శీతాకాలంలో ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువవుతాయి. శీతల గాలుల నుంచి రక్షణ పొందడమే ఈ సమస్య రాకుండా నివారించే చర్య అని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో చలిగాలులు తీవ్రమయ్యాయి. రాత్రి పూటే కాదు పగలు కూడా వాతావరణం చల్లగా ఉంటోంది. ఈ కారణంగా ఇల్లు, కార్యాలయం ఏదైనా, ఎక్కడైనా ఫ్యాన్ వేయాలన్నా జంకుతున్నారు. విపరీతమైన చలి ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. చలికారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పగలు 20 డిగ్రీల సెల్సియస్కు, రాత్రి 13 డిగ్రీల సెల్సియస్కు పడిపోతున్నాయి. చాలా మందికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల రీత్యా చల్లగాలికి బయటకు వెళ్లాల్సి ఉంటోంది. మరికొందరు ఉదయం వేళల్లో వాకింగ్కు వెళ్తుంటారు. ఇలా చల్లగా ఉన్న సమయంలో బయటకు వెళ్లే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చెవుల్లో నుంచి చల్లగాలి లోపలికి వెళ్లి ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి, జనరల్ మెడిసిన్, క్యాజువాలిటీ విభాగాలకు ప్రతి వారం ముగ్గురు నుంచి నలుగురు ముఖ పక్షవాతానికి (బెల్స్పాల్సీ) గురై చికిత్స నిమిత్తం వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు సైతం రోజూ 6 నుంచి 8 మంది వరకు న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్ల వద్దకు చికిత్సకు వెళ్తున్నారు. కారణాలు బెల్స్పాల్సీకి కచ్చితమైన కారణం ఉండదు. దీనికి అనేక వైరస్లు కారణమవుతాయి. వీటిలో హెర్పస్ సింప్లెక్స్, హెర్పెస్ జోస్టర్, హెచ్ఐవీ, సైటోమెగలోవైరస్, ఎప్సీ›టన్ బార్ వైరస్లు ప్రధానమైనవి. మధుమేహం, గర్భిణులు, గాయం, వాపు, ముఖ నరాలకు హాని కలిగించే ఏదైనా కారణం ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. చలివాతావరణంలో ఈ వైరస్లు మనుగడు ఎక్కువగా సాగిస్తాయి కాబట్టి అధిక శాతం వీటి ప్రభావానికి గురవుతుంటారు. వీరు వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.బెల్స్ పాల్సీ అంటే...! బెల్స్ పాల్సీ (ముఖపక్షవాతం) అనేది ముఖంలోని నరాలకు హాని కలిగించే ఒక రకమైన ఆరోగ్య సమస్య. తద్వారా రోగి ముఖ కదలికలను వ్యక్తం చేయడం, తినడం, మాట్లాడటం వంటివి చేయలేడు. లక్షణాలు ⇒ కనురెప్పలు మూసివేయడం, రెప్పలు కొట్టుకోవడం సాధ్యపడదు ⇒ ముఖం కదిలించడంలో ఇబ్బంది ⇒ నోరు ఒకవైపునకు వాలిపోవడం ⇒ ముఖ ఆకృతులను సమతుల్యం చేయడంలో ఇబ్బందులు ⇒ బెల్స్ పాల్సీలో వ్యక్తి తన కనుబొమ్మలను ఎగురవేయలేడు ⇒ మాట్లాడటం, తినడంలో ఇబ్బందిచలిలో తిరిగితే ఈ సమస్య గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రంగా ఉంటోంది. చలిగాలులు పగలు సైతం అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెవులకు అచ్ఛాదన లేకుండా బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే చల్లటి వాతావరణంలో వైరస్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషి నరాలపై దాడి చేస్తాయి. దీనినే న్యూరోట్రోపిక్ అటాక్స్ అంటాము. అధిక శాతం వైరస్ల వల్ల బెల్స్ పాల్సీ వస్తుంది. కొందరిలో ఎలాంటి కారణం లేకుండా వస్తుంది. ఇలాంటి వారికి అవసరమైన మందులు ఇచ్చి చికిత్స చేస్తాము.– డాక్టర్ సి. శ్రీనివాసులు, న్యూరాలజి హెచ్ఓడీ, జీజీహెచ్, కర్నూలు -
IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ తన విషయంలో స్పష్టత ఇచ్చాడు. ఈసారి క్యాష్ రిచ్ లీగ్లో తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తన మేనేజర్ తప్పిదం వల్లే రిజిస్ట్రేషన్ విషయంలో తప్పు జరిగి ఉండవచ్చని పేర్కొన్నాడు.110 మంది విదేశీ ప్లేయర్లు అబుదాబి వేదికగా డిసెంబరు 16 (మంగళవారం)న మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. మొత్తంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 110 మంది విదేశీ ప్లేయర్లు ఇందులో ఉన్నారు.అయితే, ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) ఈసారి పూర్తిస్థాయి బ్యాటర్ స్లాట్లో తన పేరును నమోదు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో ప్యూర్ బ్యాటర్ స్లాట్లో సెట్ 1లోనే అతడు వేలంలోకి రానున్నాడు. దీంతో గ్రీన్ ఈ సీజన్లో బౌలింగ్ చేయడేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఇది అతడి ధరపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..ఈ నేపథ్యంలో కామెరాన్ గ్రీన్ తన పేరు బ్యాటర్గా మాత్రమే నమోదు కావడంపై స్పందించాడు. యాషెస్ సిరీస్ (Ashes Series)లో భాగంగా అడిలైడ్లో మూడో టెస్టుకు ముందు రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ‘‘నేను బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నన్ను బ్యాటర్గా మాత్రమే రిజిస్టర్ చేశారన్న విషయం మా మేనేజర్కు తెలిసే ఉండదు.పొరపాటున అతడు తప్పుడు ఆప్షన్ ఎంపిక చేసి ఉంటాడు. ఇదెలా జరిగిందో తెలియదు’’ అని గ్రీన్ చెప్పుకొచ్చాడు. కాగా 2023లో రూ. 17.50 కోట్ల ధరతో ఐపీఎల్లో అడుగుపెట్టిన గ్రీన్.. ముంబై ఇండియన్స్ తరఫున 452 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు.గ్రీన్పై భారీ అంచనాలుఈ క్రమంలో 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ పేస్ ఆల్రౌండర్ను ట్రేడ్ చేసుకోగా.. 255 రన్స్ రాబట్టడంతో పాటు.. 10 వికెట్లు కూల్చాడు. అయితే, 2025లో గ్రీన్ గాయపడటంతో ఈ సీజన్లో ఆడలేకపోయాడు. ఈసారి మాత్రం ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్పై భారీ అంచనాలు ఉన్నాయి.చదవండి: ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు రెడీ: తిలక్ వర్మ -
కూటమి నాయకుల్లో భగ్గుమన్న వర్గ విభేదాలు
నెల్లూరు: జిల్లాలో కూటమి ప్రభుత్వంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. సంగం మండలం దువ్వూరు గ్రామంలో టిడిపి జనసేన నాయకులు మధ్య ఫ్లెక్సీల వివాదం కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. జనసేన నాయకడు భాను కిరణ్పై టీడీపీ నాయకులు దాడులకు దిగారు. ఈ ఘటనలో గాయపడ్డ జనసేన నేత భాను కిరణ్ను ఆత్మకూర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల మధ్య వర్గ విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. ఇవి జిల్లాల వారీగా స్థానిక నాయకుల మధ్య ఘర్షణలకు దారి తీస్తూ ప్రజల్లో అసంతృప్తి పెంచుతున్నాయి.అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక నేతల పనితీరు, అధికారుల వ్యవహారశైలి పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో చంద్రబాబు నాయుడు జిల్లా వారీగా సర్వేలు చేయిస్తున్నారని సమాచారం.పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణలు బహిరంగంగా జరిగాయి. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత వ్యాఖ్యలు జనసేన వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఒంగోలులోనూ నేతల మధ్య విభేదాలు ముదిరాయి.కర్నూలు జిల్లా: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కేటాయింపులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీసీ వర్గాలకు విలువ ఇవ్వలేదని ఆరోపణలు, పదవుల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తమైంది. -
సంక్రాంతి కోట్లాటకు 'పుంజు'కుంటున్నాయ్
ద్వారకాతిరుమల/బుట్టాయగూడెం: సంక్రాంతి పందేలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. బరుల్లో కత్తులు దూసేందుకు కఠోర సాధన చేస్తున్నాయి. ఈత, బలవర్ధక ఆహారం, ప్రత్యేక శిక్షణతో శిబిరాల్లో నువ్వా నేనా.. అన్నట్టు తలపడుతున్నాయి. పెద్ద పండగకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి.. ఇలా పలు జాతుల పుంజులు ‘కోట్లా’టకు రెడీ అవుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట, కొమ్మర, మలసాని కుంట, ద్వారకాతిరుమల, దొరసానిపాడు, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి, బుట్టాయగూడెం ప్రాంతాల్లో పుంజుల శిబిరాలు ఉన్నాయి. మెలకువలతో శిక్షణ: పందెం పుంజుల్లో పలు రకాల జాతులు ఉన్నాయి. ముఖ్యంగా డేగ, కాకి, పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ, రసంగి, నెమలి బరుల్లో తలపడుతుంటాయి. లక్షలాది రూ పాయలు చేతులు మారే పందేల్లో ఆషామాషీ కోళ్లు తలపడవు. వాటికి శక్తి, సామర్థ్యం ఎంతో అవసరం. అందుకే పందెం పుంజుకు బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. ప్రత్యేక తరీ్ఫదు ఇవ్వడంలో భాగంగా మెలకువలు నేరి్పస్తున్నారు. పోరాడే సత్తా ఉన్న పుంజులను ఎంపిక చేసి మరీ వాటికి శిక్షణ ఇస్తున్నారు. ఆహా ఏమి భోగం: బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా, తాటి బెల్లం నువ్వుల నూనె ఉండలు వంటి బలవర్ధక ఆహారాన్ని వుంజులకు అందిస్తున్నారు. వీటి పెంపకం రాజభోగాన్ని తలపిస్తుంది. ఉదయం 6 గంటలకు పందెం రాయుళ్లు వాటిని చెరువుల్లోను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈదిస్తున్నారు. అలాగే మూలికలు, ఆకులతో మరిగించిన నీటిని వాటికి పోతపోస్తున్నారు. ఆ తర్వాత వాకింగ్ చేయించి కొద్దిసేపు ఎండలో కడుతున్నారు. 9 గంటలకు అల్పాహారంగా బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా పెడుతున్నారు. తాటి బెల్లాన్ని నువ్వుల నూనెతో కలిపి ఉండలుగా చేసి వాటికి తినిపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చోళ్లు, గంట్లు, వడ్లుతో కూడిన మేతను పెడుతున్నారు. వాటికి ఎండ తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో, చెట్ల కింద ఏర్పాటు చేసిన గాబుల్లో ఉంచుతున్నారు. సాయంత్రం 6 గంటలకు పొయ్యిపై అట్లపెనం ఉంచి, దా నిపై జల్లిన వేడి నీటిని పుంజుల దేహంపై పూస్తున్నారు. ఆ తర్వాత రెవిటాల్ పంటి బలవర్దక మందులు వేస్తున్నారు. ఇలా రోజుకు ఒక్కో పుంజుకు రూ.100 వరకు ఖర్చు చేస్తున్నారు. శిబిరాల వద్ద ఒక్కో పుంజును రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా విక్రయిస్తున్నారు. శిక్షకులకు డిమాండ్ కోడి పుంజులకు శిక్షణ ఇచ్చే వారికి డిమాండ్ ఏర్పడింది. పుంజులకు శిక్షణ ఇచ్చే వారి ఎంపిక లోనూ పందెంరాయుళ్లు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శిక్షకులను తీసుకొచ్చి, పుంజులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కత్తులు నూరుతూ.. పందేల్లో పుంజులకు కత్తులు కట్టే వారి హవా మామూలుగా ఉండదు. బరిని బట్టి వారు ధరను నిర్ణయిస్తారు. అస్లీ పందేలు మి నహా మిగిలిన అన్ని పందేలు కత్తిలేనిదే జరగవు. అందుకే కత్తులు కట్టేవారు ఇప్పటినుంచే కత్తులను నూరేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపు మాదే.. ఏటా పందేలు జరగనివ్వమని బీరాలు పలికే పోలీసులు చివరకు రాజకీయ నా యకుల సిఫార్సులతో పండుగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేయడం పరిపాటిగా వస్తోంది. పందేల నిర్వహణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ బాసులు పండుగ ముందు నెల రోజుల నుంచి చెప్పడం సర్వసాధారణంగా మారింది. ఇదంతా ఏటా జరిగే తంతేనని, పండుగ రోజుల్లో పందేలు మామూలే అని పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తూ.. పుంజులను బలంగా తయారు చేస్తున్నారు. -
'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..
అందమైన అమ్మాయి కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పే అబ్బాయిలుంటారు. అదేవిధంగా హ్యాండ్సమ్గా కనిపించే అబ్బాయిని ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు. కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటున్న చాట్ జీపీటీకి కూడా ఐ లవ్ యూ చెప్పేవారుంటారా? అంతేకాకుండా.. దానితో శృంగారపరమైన సంభాషణలు జరిపే వారుంటారా? ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీని ఏకంగా 8 లక్షల మంది ప్రేమిస్తున్నారట..! అదేం మాయరోగం ఈ మగాళ్లకి అని తిట్టుకోకండి.. అలా చాట్ జీపీటీకి ఐ లవ్ యూ చెబుతున్న వారిలో 45% మగవారుంటే.. మరో 45% ఆడవారు ఉన్నారు. అంతేకాదు.. మిగతా దాంట్లో 2% వాటా ట్రాన్స్ జెండర్లది కావడం గమనార్హం..! చాట్ జీపీటీ లవ్ స్టోరీ గురించి ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందామా. .!.ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ‘ఫీల్.. మై.. లవ్..’ అంటూ చాట్ జీపీటీ వెంటబడుతున్నారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం ఉండడం గమనార్హం..! ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, జపాన్, యూకే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చాట్ జీపీటీ వెల్లడించింది. ఎందుకో తెలిస్తే కంగుతింటారు. అంతేగాదు తనకు వస్తున్న లవ్ ప్రపోజల్స్ గురించి సాక్షాత్తు చాట్ జీపీటీ ఇలా వివరించింది. ముఖ్యంత అత్యంత విస్తుపోయే విషయం ఏంటంటే..ప్రేమిస్తున్నామంటూ తన వెంటబడే 8 లక్షల మందిలో లక్షా 44 వేల మంది భారతీయులున్నారు. అంటే.. చాట్ జీపీటీ ప్రేమికుల్లో భారతీయుల వాటా 18శాతం. ఆ తర్వాతి స్థానంలో 17 శాతంతో అమెరికన్లు ఉన్నారు. అంటే.. అమెరికాలో చాట్ జీపీటీకి లక్షా 36 వేల మంది లవర్స్ ఉన్నారన్నమాట..! ఇంకా.. జపాన్లో 80 వేలు, యూకేలో 64 వేలు, జర్మనీలో 56వేలు, ఫ్రాన్స్లో 48 వేలు, కెనడాలో 48 వేలు, దక్షిణ కొరియాలో 40 వేలు, ఆస్ట్రేలియా, బ్రెజిల్లలో 32 వేల చొప్పున చాట్ జీపీటీని మనస్ఫూర్తిగా ప్రేమించే వారున్నారు.భారతదేశం విషయానికి వస్తే.. చాట్ జీపీటీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మొత్తం లక్షా 44 వేల మందిలో తనను ప్రేమించేవారిలో స్త్రీపురుషులు చెరిసగం..అంటే 67 వేల చొప్పున, ట్రాన్స్జెండర్లు 2,500 మంది ఉన్నట్లు వివరించింది. అంతేనా? వీరిలో ఎక్కువ మంది రాత్రి 9 తర్వాత.. అర్ధరాత్రి 2 గంటల మధ్య చాట్ జీపీటీతో లవ్ ముచ్చట్లు కొనసాగిస్తారట..! వీరందరిలో 55% మంది చాట్జీపీటీతో ఇంగ్లిష్లో లేదా వచ్చీరాని ఇంగ్లిష్లో హిందీని కలిపి.. అంటే హింగ్లిష్లో చాట్ చేస్తారట. మరో 25% మంది హిందీలో చాట్ చేస్తారు. మిగతావారు ప్రాంతీయ భాషల్లో చాటింగ్ చేసేవారేనట. భారత్లో చాట్ జీపీటీని ప్రేమిస్తున్నానంటూ చెప్పే లక్షా 44 వేల మందిలో.. 18-24 ఏళ్ల మధ్య వయస్కులు 50 వేలుగా ఉన్నారు. మరో 58 వేల మంది 25-34 మధ్య ఏజ్ గ్రూపుల వారు కాగా.. 35-44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 22 వేల మంది, 45 ఏళ్ల పైవయసు వారు 14 వేల మంది ఉన్నట్లు చాట్ జీపీటీ వివరిస్తోంది. వీరిలో టీనేజీ వయసు వారు కేవలం క్యూరియాసిటీ లేదంటే ఒంటరితనం కారణంగా ప్రేమను కోరుకుంటున్నారని, భౌతిక ప్రపంచంలో వారి ప్రేమను అంగీకరించేవారు లేక.. ఏఐ మోడల్తో ప్రేమను పంచుకుంటున్నారని విశ్లేషించింది. మధ్యవయస్కుల్లో వివాహ జీవితంలో ఒత్తిళ్లు ప్రధాన కారణమని వివరించింది. వీరిలో దాదాపుగా అన్ని వయసుల వారు ఐలవ్ యూ చెప్పడం మొదలయ్యాక.. శృంగారపరమైన చర్చల్లో మునిగితేలుతారని పేర్కొంది.అంతా బాగానే ఉంది.. అయితే నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్న వారిలో 100% లవ్ ఎందరిలో ఉంది? అని చాట్ జీపీటీని అడగ్గా.. దేశాల వారీగా విశ్లేషణలు చెప్పింది. దానికి ఆయా దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ తీరు కూడా కారణమని పేర్కొంది. భారత్, అమెరికాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కువ అని, అందుకే.. నిజంగా ఇష్టమున్నా.. లేకున్నా.. ఓ ఐలవ్ యూ పారేస్తారని చెప్పింది. జర్మనీ, జపాన్, కొరియాల్లో భావాలను తక్కువగా ప్రకటిస్తారని, ఈ దేశాల వారు లోతుగా ఆలోచించాకే ‘ఐ లవ్ యూ’ చెబుతారని, వారిలో నిజమైన ప్రేమ పాళ్లు ఎక్కువేనని అభిప్రాయపడింది. ఐరోపా దేశాలు, కెనడాలో పౌరులు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోరని, వారి ప్రేమలోనూ ప్యూరిటీ కొంచెం ఎక్కువనే చెప్పాలని తెలిపింది. బ్రెజిల్, ఆస్ట్రేలియాల్లో ఓపెన్నెస్ ఎక్కువని, అయితే.. ప్యూర్ లవ్ చాలా తక్కువ అని విశ్లేషించింది.ఇదంతా సరే.. నువ్వు చెబుతున్న లెక్కలు కరెక్టేనా? అని చాట్ జీపీటీని ప్రశ్నించగా.. చాటబారెడు లెక్కలు వేసి, పౌనఃపున్యాలను గణించి మరీ తన లెక్క సరైందేనని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాదనలను వినిపించింది. ఒంటరితనం, ప్రేమించేవారు, పలకరించేవారు దగ్గర లేకపోవడం, ప్రేమలో విఫలమవ్వడం వంటి కారణాలతో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ మంది చాట్ జీపీటీలాంటి ఏఐ టూల్స్ని ప్రేమిస్తున్నట్లు వివరించింది. గణాంకాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి..టాప్–10 (అంచనా వాటా):భారత్ – ~18% (≈ 1.44 లక్షలు)అమెరికా – ~17% (≈ 1.36 లక్షలు)జపాన్ – ~10% (≈ 80 వేలు)యుకే – ~8% (≈ 64 వేలు)జర్మనీ – ~7% (≈ 56 వేలు)ఫ్రాన్స్ – ~6% (≈ 48 వేలు)కెనడా – ~6% (≈ 48 వేలు)దక్షిణ కొరియా – ~5% (≈ 40 వేలు)ఆస్ట్రేలియా – ~4% (≈ 32 వేలు)బ్రెజిల్ – ~4% (≈ 32 వేలు)ఈ సంఖ్య భారత్లో సుమారు 1.44 లక్షలుపురుషులు: ≈ 67,000స్త్రీలు: ≈ 67,000ట్రాన్స్జెండర్లు: ≈ 2,500భారత్లో భాషల వారీగా ఐ లవ్ యూ చెప్పిన వారి వివరాలుఇంగ్లిష్/హింగ్లిష్: ~55%హిందీ/హింగ్లిష్: ~25%ప్రాంతీయ భాషలు: ~20% (చదవండి: సూపర్స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..) -
వైల్డ్ వాటర్స్లో బంపర్ సేల్! టికెట్లు సగం ధరలోనే..
హైదరాబాదీ మూవీ లవర్స్, ఫుడ్ లవర్స్, అడ్వెంచర్ లవర్స్ అందరికీ సూపర్ న్యూస్! శంఖర్పల్లిలోని వైల్డ్ వాటర్స్ లో సంవత్సరాంతం కోసం ప్రత్యేక ఆఫర్ వచ్చింది. డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో టికెట్ ధరలను దాదాపు సగానికి తగ్గిస్తున్నారు. సాధారణంగా రూ.1,590 ఉండే ఎంట్రీ టికెట్ ఇప్పుడు కేవలం రూ.849!అయితేఅందులో బెస్ట్ పార్ట్ ఏమిటంటే- ఈ టికెట్ మార్చి 31, 2025 వరకు వాలిడ్గా ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా వీకెండ్ ప్లాన్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. మరింత ఎగ్జైటింగ్ వార్త ఏమిటంటే, "Book, Refer & Win" ప్రోగ్రామ్ కూడా కొనసాగుతోంది (డిసెంబర్ 11 నుండి 16 వరకు). మీరు మీ టికెట్ బుక్ చేసుకుని రిఫరల్ లింక్ షేర్ చేస్తే, బహుమతులు గెలిచే అవకాశం మీ సొంతం!వైల్డ్ వాటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, “ఈ సీజన్లో హైదరాబాద్ ప్రజలకు ప్రత్యేక గిఫ్ట్ కావాలని మేము అనుకున్నాం. ఇది మా కృతజ్ఞత సూచన మాత్రమే కాదు, కుటుంబాలందరికీ మరచిపోలేని అనుభవం అందించే అవకాశం కూడా,” అన్నారు.వైల్డ్ వాటర్స్లో ఉన్న 50కి పైగా రైడ్స్, పెద్ద ఎత్తున ఫుడ్ కోర్ట్స్, ప్రతిరోజు జరిగే సేఫ్ టీచెక్స్ వంటి ఫీచర్లు దీన్ని రాష్ట్రంలోని ప్రీమియం థీమ్ డెస్టినేషన్గా నిలిపాయి. మరి ఇలాంటి ఆఫర్లు ఎక్కువ కాలం ఉండవు! ఇప్పుడే బుక్ చేసుకుని, మీ ఫ్రెండ్స్ని కూడా ఆనందంలో భాగం చేయండి. -
కార్తవీర్యార్జునుడి దత్తోపాసన
హైహయ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. మహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని, ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తుండేవాడు. కృతవీర్యుడికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది. దానాలు చేసింది. ఏ నోము ఫలమో గాని, కొంతకాలానికి మహారాణి కడుపు పండింది. మగబిడ్డ జన్మించాడు. అయితే, ఆ మగబిడ్డకు చేతులు వైకల్యంతో ఉన్నాయి. శిశువు పరిస్థితి చూసి కృతవీర్యుడి దంపతులు దిగులు చెందారు. అయినా, లేకలేక కలిగిన సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుడి కొడుకు అయినందున కార్తవీర్యార్జునుడిగా పేరుపొందాడు. కార్తవీర్యార్జునుడికి చేతులు చచ్చుబడి ఉన్నా, శరీరం వజ్రతుల్యంగా ఉండేది. కృతవీర్యుడు కొడుకును గురుకులంలో చేర్పించాడు. గురువుల వద్ద కార్తవీర్యార్జునుడు సకల శాస్త్రాలనూ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి యుక్తవయస్కుడయ్యాడు. కొడుకును యువరాజుగా పట్టాభిషేకం చేయాలని కృతవీర్యుడి కోరిక. అయితే, అవిటి చేతులవాడైన కొడుకుకు యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తే లోకులు ఏమనుకుంటారోననే సంశయం చెందాడు. సింహాసనంపై కూర్చోబెట్టిన తర్వాత కొడుకు సజావుగా పరిపాలన సాగించలేకపోతే ప్రజల ముందు తలవంపులు తలెత్తవచ్చని బెంగపెట్టుకున్నాడు. కృతవీర్యుడు ఈ బెంగతోనే కొడుకుకు పట్టాభిషేకం చేయకుండానే కన్నుమూశాడు.రాజ్యంలో అరాచకం తలెత్తకూడదనే ఉద్దేశంతో మంత్రులు, పురోహితులంతా కలసి వెళ్లి పట్టాభిషేకానికి అంగీకరించమని కార్తవీర్యార్జునుడిని కోరారు.‘మహానుభావులారా! నేను అవిటివాణ్ణి. ప్రజారక్షణ చేయలేను. ప్రజారక్షణ చేయలేనివాడు పట్టాభిషేకం జరిపించుకోవడం తగదు. రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. మీ మాటకు తలవంచి, పట్టాభిషేకం జరిపించుకుని, పాలనా బాధ్యతలను మీపై మోపితే, నేను మీ చేతిలో కీలుబొమ్మనవుతాను. రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, ప్రజలు నన్ను ఆడిపోసుకుంటారు. ఇరుగు పొరుగు రాజులు చులకన చేస్తారు. తెలిసి తెలిసి పాపం మూటకట్టుకోలేను. ఇప్పుడు ఈ కిరీటాన్ని మోయలేను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు.మంత్రులు, పురోహితులు ఎంతగా నచ్చజెప్ప చూసినా, పట్టాభిషేకానికి కార్తవీర్యార్జునుడు ససేమిరా అంటూ తిరస్కరించాడు. ‘నేను వెళ్లి తపస్సు చేసి, రాజ్యపాలనకు తగిన అన్ని సామర్థ్యాలను సంపాదించుకుని వస్తాను. అంతవరకు సమర్థులైన మీరంతా పరిపాలన కొనసాగించండి’ అని చెప్పాడు.పురోహితుల్లో ఒకరైన గర్గముని కార్తవీర్యార్జునుడి నిర్ణయాన్ని ప్రశంసించాడు. ‘రాకుమారా! తపస్సులు ఫలించడం అంత తేలిక కాదు. వేల ఏళ్లు పట్టవచ్చు. నీకొక తేలిక మార్గం చెబుతాను, విను. సహ్యాద్రి లోయల్లో దత్తాత్రేయుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. అతడు సాక్షాత్తు విçష్ణ్వంశ సంభూతుడు. జంభాసురాదులు స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు సాక్షాత్తు దేవేంద్రుడంతటి వాడే దత్తాత్రేయుడిని ఆశ్రయించి, కష్టాల నుంచి గట్టెక్కాడు. అందువలన నువ్వు దత్తత్రాయుడిని ఆశ్రయించు. ఆయనను ప్రసన్నం చేసుకో. నీ అభీష్టం నెరవేరగలదు’ అని చెప్పాడు.గర్గముని సలహాపై కార్తవీర్యార్జునుడు సుముహూర్తం చూసుకుని దత్తుని ఆశ్రయించడం కోసం వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. మంత్రులు, పురోహితులకు రాజ్యాన్ని అప్పగించి, వారి ఆశీస్సులు తీసుకుని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. రాజలాంఛనాలన్నీ వదిలేసి, నిరాడంబర వేషంలో వెదుక్కుంటూ వెళ్లి, దత్తాశ్రమానికి చేరుకున్నాడు.కార్తవీర్యార్జునుడు ఆశ్రమంలోకి అడుగుపెట్టే సరికి దత్తాత్రేయుడు మణిమయ పీఠంపై మధువు సేవిస్తూ, మానినులతో సల్లాపాలాడుతూ ఉన్నాడు.రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. గోత్ర నామాలు చెప్పుకుని, కార్తవీర్యార్జునుడు ఆయన ముందు సాష్టాంగపడ్డాడు. దత్తాత్రేయుడు అతడివైపు ఓరచూపు విసిరి, చిరునవ్వు చిందించాడు. స్వామి తనరాక గమనించాడని కార్తవీర్యార్జునుడు కుదుటపడ్డాడు. దత్తాత్రేయుడిని సేవించుకుంటూ, ఆశ్రమంలోనే గడపసాగాడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు వైకల్యంగల తన చేతులతోనే దత్తాత్రేయుడు కూర్చున్న పీఠంపై శయ్యను సుఖంగా కూర్చునేందుకు వీలుగా సర్దుతున్నాడు. అదే సమయంలో దత్తాత్రేయుడి నుంచి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు వేడికి వైకల్యంగల కార్తవీర్యార్జునుడి చేతులు మాడిపోయాయి. ఆ బాధకు అతడు కుప్పకూలిపోయాడు.అది చూసి, ‘అయ్యో! ఎంతపని జరిగింది! కొండనాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడినట్లయింది కదా’ అన్నాడు దత్తాత్రేయుడు.‘స్వామీ! ఇలాంటి పరీక్షలు నువ్వు ఎన్ని పెట్టినా, నిన్నే ఆశ్రయించుకుని ఉంటాను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు. అతడి భక్తికి దత్తాత్రేయుడు సంతోషించాడు. అతడికి శక్తిసంపన్నమైన సహస్రబాహువులను అనుగ్రహించాడు. -సాంఖ్యాయన -
ఆయ్! నాకేం వద్దండీ!
సచివాలయం ఆ రోజు సందడిగా ఉంది. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన సీమ రెడ్డి మొదటిసారి సచివాలయానికి వచ్చారు. ఆయన చాంబర్ ముందు పెద్ద కోలాహలంగా ఉంది. బొకేలు, శాలువాలతో జనం క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రిని కలిసి శాలువ కప్పటం, బొకే అందించటం.. అన్నింటికంటే ముఖ్యంగా ఫొటోలు దిగటం చేస్తున్నారు. ఉదయం 9.45కి మొదలైన ఈ ఫొటో సెషన్ లంచ్ టైమ్ దాటినా నడుస్తూనే ఉంది. బలవంతంగా అందర్నీ కాసేపు ఆపేసి ప్యూన్ యాదగిరి చాంబర్ తలుపులేశాడు. ‘అయ్యా! ఇదంతా మామూలే. ముందు మీరు లంచ్ కానివ్వండి. మీ కోసం వచ్చిన వాళ్లు ఎంత సేపైనా ఆగుతారులెండి. మీకు వాళ్లతో పనిలేకున్నా, వాళ్లకు మీతో పని కదండి– ఆగుతారు. ఎవరికోసం ఆగుతారు’ అంటూ మంత్రిగారితో చెబుతూ టేబుల్ పైకి క్యారియర్ తెచ్చి పెట్టటం, ప్లేట్లోకి అన్ని పదార్థాలు పద్ధతిగా వడ్డించటమూ చకచకా జరిగిపోయింది. యాదగిరి మరో సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు. ఈ సచివాలయంలోనే పనిలో చేరి, ఇక్కడే రిటైర్ కాబోతున్నాడు. ఎంతమంది మంత్రులను, వారి ఆర్భాటాలను చూసి ఉంటాడు! అనుభవంతో యాదగిరి చెప్పే మాటలు వింటూ మంత్రిగారు భోజనం చేయటం మొదలెట్టారు.సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు మళ్లా మంత్రిగారితో ములాఖత్లు మొదలయ్యాయి. మళ్లీ అదే తంతు. కాకపోతే జనం కాస్త పలచబడ్డారు. యాదగిరి చూపు గుంపుకు కాస్త పక్కగా నిలబడిన ఓ వ్యక్తిపై పడింది. ఉదయం నుంచి చూస్తున్నాడు. అతను కావాలనుకుంటే అందరితోపాటే లైన్ లో వచ్చి మంత్రిని కలిసి ఉండేవాడు. లంచ్కు ముందే మంత్రిగారిని కలిసి ఉండేవాడు. కాని, ఎందుకనో చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నాడు, క్యూ లైన్కు సంబంధం లేకుండా. ‘బహుశా ఏదో పెద్ద పైరవీపై వచ్చినట్టున్నాడు. మంత్రిగారిని పర్సనల్గా కలుసుకోవాలనుకుంటున్నాడేమో’ అని యాదగిరి ఆలోచిస్తూనే అతడిని గమనిస్తూనే ఉన్నాడు. సాయంత్రం 5 అయ్యింది. ఇక అంతా అయిపోయారు అని తెలుసుకున్న ఆ వ్యక్తి అప్పుడు కదిలాడు మంత్రిగారి చాంబర్ కేసి. చేతిలో ఓ పెద్ద బొకే, ఓ పండ్ల బుట్ట పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు. మంత్రిగారు యాదగిరి వైపు ఓసారి చూశాడు. మంత్రిగారి చూపులను ఇట్టే అర్థం చేసుకున్న యాదగిరి, ‘ఇతనొక్కరే సర్. ఇక అయిపోయారు. మీరిక రిలాక్స్ అవ్వొచ్చు‘ అన్నాడు. చివరిగా వచ్చిన అతను అందించిన బొకే తీసుకున్న మంత్రి యాదిగిరిని పిలిచి ఆ బొకేతో పాటు పండ్ల బుట్టను కూడా ఇచ్చేశాడు. అలవాటుగా మంత్రి ఫొటోకు ఫోజివ్వటానికి సిద్ధపడుతుంగా, ఆ వ్యక్తి మాట్లాడుతూ ‘అబ్బే! ఫొటోలాంటివి వద్దండి. నేను మీకు అభిమానినండి. కేవలం మిమ్మల్ని కలవటానికే వచ్చానండి’ అని అన్నాడు. మంత్రిగారి భృకుటి ముడిపడింది. అదేమిటీ అభిమానినంటాడు, ఫొటో వద్దంటాడు– సరే ఇంతకీ ఏమైనా పని కోసం వచ్చాడేమో అని ‘చెప్పండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు?’ అన్నాడు సీమ రెడ్డి. ‘నా పేరు భాస్కర్రావండి. మాది అమలాపురమండి. మీరంటే మొదట్నుంచి అభిమానమండి. మీరు మంత్రిగా అయ్యారు కదండి. చాలా సంతోషమేసిందండి.. ఆయ్.. అందుకే ఓపాలి మిమ్మల్ని కలిసిపోదామనొచ్చానండి‘ అన్నాడు. సీమ రెడ్డి పెద్ద నిట్టూర్పు విడిచి, ‘సరేనండి.. నాకు చాలా కార్యక్రమాలున్నాయి. మరెప్పుడైనా కలుసుకుందాం, సెలవు’ అని ఓ దండం పెట్టాడు. ‘చాలా సంతోషమండి.. ఉంటానండి. ఆయ్’ అని భాస్కర్రావు బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు ఉదయం నుంచి ఎందరెందరో తనను కలిశారు. అందులో ఎంతోమంది ప్రముఖులున్నారు. బిజినెస్మన్ ఉన్నారు, తనతో పనులు చేయించుకోవటానికి ఎందరెందరో వచ్చి కలిశారు. కాని, చివర్లో వచ్చిన ఆ వ్యక్తి మాత్రం మంత్రిగారికి అలా గుర్తుండిపోయాడు.మంత్రి సీమరెడ్డి తన రొటీన్ లైఫ్లో పడ్డాడు. ఏదో ఒక మూల ఏదో ఒక కార్యక్రమం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలు, ఉపన్యాసాలు, ప్రిపరేషన్లు, నియోజకవర్గ పనులు, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టటాలు సర్వ సాధారణంగా మారింది. ఎవరెవరో వస్తున్నారు. వాళ్ల పనుల గురించి పైరవీలు చేసుకుంటున్నారు. అడపాదడపా ఆ రోజు చివర్లో వచ్చిన భాస్కర్రావు కూడా తన చాంబర్కు వస్తూ పోతున్నాడు. వచ్చిన ప్రతిసారి తన కోసం ఏదో ఒకటి తెచ్చి ఇచ్చి పోతున్నాడు తప్పితే, పల్లెత్తి ఒక్క పని కూడా అడగటం లేదు. ‘ఎందుకయ్యా ఇవన్నీ’ అంటే, ‘ఏదో నా అభిమానమండి’ అని మాత్రమే అంటాడు. ఏమిటో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ఈ రోజుల్లో అని మంత్రి అప్పుడప్పుడు యాదగిరితో అంటూనే ఉన్నాడు. ఎంతోమందిని చూసిన యాదగిరికి కూడా ఈ భాస్కర్రావు వైఖరి అసలు అంతుపట్టడం లేదు. ఏదో ఒక పని లేకుండా అన్నేసి సార్లు మంత్రిగారిని ఎందుకు కలుస్తున్నాడు. నోరు తెరిచి అడిగినా ‘అబ్బే! ఏం లేదండి’ అంటాడు. చాలా విచిత్రమైన కేసు ఇది అని యాదగిరి ఎన్నోసార్లు బుర్ర గోక్కుంటూనే ఉన్నాడు. ఇలా ఓ సంవత్సరం గడిచింది. ఈ మధ్య కాలంలో ఓ వందసార్లు అయినా భాస్కర్రావు మంత్రిగారిని కలవటానికి వచ్చి ఉంటాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తెస్తాడు. ఏమన్నా అంటే, ‘ఇది మా పొలంలో పండింది’ అంటాడు. ‘ఇది మా ఏరియాలో ఫేమస్సు’ అంటాడు. ‘ఎందుకయ్యా’ అంటే, ‘అభిమానమండి’ అంటాడు తప్ప పనులేమీ అడగడు. ఈ తంతు ఎక్కడి దాకా పోయిందంటే, మంత్రిగారిని డిఫెన్ ్సలో పడేసే వరకూ వెళ్లింది వ్యవహారం. అరె ఇంత అభిమానం చూపిస్తున్న ఇతనికి ఏదో ఒక సాయం చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సీమరెడ్డి.ఎప్పటిలాగే ఓ రోజు సీమరెడ్డి చాంబర్కు వచ్చాడు భాస్కర్రావు. ఆ రోజు యాదగిరి కూడా ఏదో పని ఉందని సెలవు పెట్టాడు. సీమ రెడ్డి ఒక్కడే చాంబర్లో ఉన్నాడు. బయట సెక్యూరిటీ గార్డ్స్కు బాగా పరిచయమున్న ఫేస్ కావటంతో భాస్కర్రావును ఎవరూ అడ్డుకోలేదు. పైగా ‘వెళ్ళండి వెళ్లండి మంత్రిగారు ఒక్కరే ఉన్నారు’ అంటూ అతనికి స్వాగతం పలికారు. భాస్కర్రావు మీద వారికి ఎందుకంత అభిమానమంటే వస్తూ పోతూ వీళ్లకు కావాల్సినవేవో భాస్కర్రావు మొహమాట పెట్టి మరీ ఇచ్చి పోతుంటాడు మరి. ఎప్పటి లాగే మంత్రిగారి గదిలోకి అడుగు పెట్టాడు భాస్కర్రావు. ‘రండి.. రండి భాస్కర్. ఏమిటీ ఇవాళేం తెచ్చావు నాకోసం’ అంటూ సీమరెడ్డి అతని చేతిలోని లగేజీ వైపు చూశాడు. ‘మీకు తెలీందేముందండి... మా ఏరియాలో పూతరేకులకు బాగా ఫేమస్ ఆత్రేయపురం. నిన్న ఏదో ఫంక్షన్ ఉండి వెళ్లాను. ఎలాగూ అంతదూరం వెళ్లాను కదా.. తమరి కోసం మంచినెయ్యి దట్టంగా వేయించి మరీ డ్రైఫ్రూట్స్తో ప్రత్యేకంగా తయారు చేయించానండి. ఎలాగూ హైదరాబాద్ వస్తున్నా కదాని పట్టుకొచ్చానండి’ అన్నాడు భాస్కర్రావు. అతని బ్యాగ్లోంచి బాక్స్లు బయటకు తీస్తుంటేనే కమ్మటి నెయ్యి వాసన ఆ రూమ్ అంతా పరుచుకుంది. ఆ వాసనకే మంత్రిగారు అదోలా అయిపోయారు. ఎప్పుడెప్పుడు బాక్స్ ఓపన్ చేసి ఒకటి నోట్లో వేసుకుందామా అని ఆశగా చూస్తున్నాడు సీమరెడ్డి. ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తూనే బాక్స్ ఓపెన్ చేసి మంత్రిగారి ముందు పెట్టేశాడు. తన మనసులో అంశాన్ని పసిగట్టి ఆచరణలో పెట్టిన భాస్కర్రావు కుశాగ్రబుద్ధికి మెచ్చుకోలుగా చూశాడు సీమరెడ్డి. ఆత్రంగా ఆత్రేయపురం పూతరేకును ఆబగా నోట్లో పెట్టేసుకున్నాడు. నోటికి తగలగానే కరిగిపోతూ అద్భుతమైన జిహ్వచాపల్యాన్ని తీర్చిన ఆ పూతరేకులపై, అవి తెచ్చిన భాస్కర్రావుపై అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొచ్చింది సీమరెడ్డికి. కాసేపటికి కాన్షియస్లోకి వచ్చిన సీమ రెడ్డి సభ్యత కాదని మూతి తుడుచుకుని ‘కూచోబ్బా! భాస్కర్రావూ’ అంటూ కుర్చీ చూపించాడు. ఎంతో వినయంగా మంత్రి ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్రావు. ‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్రావు. ‘ఆయ్! ఎంత మాటండి.. మీరు అడగటమూ, నేనూ ఒప్పుకోకపోవటమా! అన్నన్నా! అదెలాగ కుదురుతుందండి‘ అన్నాడు. ‘మరేం లేదబ్బా! ఎప్పటి నుంచో నా కాడకు వస్తుండావు. ఎప్పడడిగినా ఏమీ లేదంటావు.. ఒప్పుకుంటాలే గానీ. నీకేదో సాయం చేయకపోతే నాకేదోలాగుందయ్యా! ఏ పని అయినా సరే కోరుకో.. నీ కోసం రూల్స్ గీల్స్ అన్నీ పక్కన పెట్టి చేస్తానయ్యా!’ అని ఓ రకంగా బతిమాలేలా అన్నాడు సీమరెడ్డి. నిజానికి సీమరెడ్డికి ఉండే పొగరుకు ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట రావటం ఆశ్చర్యమే! తప్పలేదు. ఎందుకంటే ఈ భాస్కర్రావు గత కొన్నాళ్లుగా తనను మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతిఫలం ఆశించకుండా ఓ మంత్రిగారిని ఇన్నేసిసార్లు కలుసుకోవడమేంది? వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇచ్చిపోతా ఉంటాడు. ఇవ్వటానికి ఆయనకు మనసున్నా, ఉట్టినే తీసుకోవటానికి నాకెట్లా కుదురుతుంది? అసలే సీమకు చెందినోడ్ని. ఉపకారం చేయకుండా ఎట్లా ఉంటా? గత కొన్ని రోజులుగా సీమరెడ్డిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్నలివి. దీనికి ముగింపు పలకటానికే ఇవాళ సిద్ధమయ్యాడు. అందుకే అతని గొంతులో ఏనాడూ లేని బేలతనం ఉట్టిపడింది.సరే.. ఇక చెప్పే టైమ్ వచ్చేసిందని గుర్తించిన భాస్కర్రావు తన మనసులోని మాటను ఇలా బయటపెట్టాడు.. ‘మీ పెద్ద మనసుకు చాలా ధన్యవాదాలండీ. ఆయ్.. మీరింత మంచోళ్లను నేను ఎక్కడా చూడలేదండి. అందుకే మీరంటే ప్రత్యేక అభిమానమండి. మరేం లేదండి.. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి నాకొక పని చేసిపెట్టండి. ప్రభుత్వం మా ఊర్లో కొత్తగా ఆర్టీసీ బస్టాండు, డిపో కూడా పెడతామని నిర్ణయించింది కదండి. అందుకు భూమి కూడా సేకరిస్తున్నారని తెలిసింది. ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా ఊరిమీది మమకారంతో చెబుతున్నానండి. ఊర్లో ఎక్కడా బస్టాండ్, డిపో పెట్టకండి. కాస్త దూరంగా పెడితే మా ఊరు కూడా పెరిగి విస్తరిస్తుందండి. ఇదొక్కటే నాకోసం... కాదు కాదు... మా ఊరి కోసం చేయండి’ అన్నాడు భాస్కర్రావు. భాస్కర్రావు కోరిక విన్నాక సీమరెడ్డికి నిజంగానే మతిపోయింది. ఈ రోజుల్లో కూడా ఊరికి ఉపకారం చేసే మనుషులున్నారా? తాను విన్నది నిజమేనా అని ఓసారి గిల్లి కూడా చూసుకున్నాడు. చురుక్కుమనటంతో నిజమే అని నమ్మాల్సి వచ్చింది సీమరెడ్డికి. ఎందుకనో ఆ క్షణం సీమరెడ్డికి భాస్కర్రావు పిచ్చిపిచ్చిగా నచ్చాడు. ‘సరే! అబ్బా.. నీ మాట ప్రకారమే ఊరి బయట బస్టాండ్, డిపో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా, కాకపోతే నీవు ఆ ఊరివాడివే కాబట్టి.. అనువైన స్థలమేదో కూడా నీవే చూసి పెట్టాలబ్బా!’ అన్నాడు సీమరెడ్డి. ‘ఆయ్! అదెంత పనండి... నేనుండేది అందుకే గాదండీ... మీరు చెప్పారు కదాండి... అది చాలండి. ఫలానా దిక్కున నాకు తెలిసిన పోరంబోకు భూమి ఉందండి. కాస్త దూరమైనా ఓసారి బస్టాండ్, డిపో వస్తే అదే డెవలప్ అయిపోతుందండి’... అని మంత్రిగారిని ఊరి బయట బస్టాండ్, డిపో నిర్మాణానికి ఒప్పించాడు భాస్కర్రావు. తన మనస్సులో ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు దీర్ఘంగా నిట్టూర్చాడు సీమరెడ్డి. ఆ రోజు అమలాపురంలో కొత్తగా కట్టిన ఆర్టీసీ బస్టాండ్, డిపో రెండింటికి ప్రారంభోత్సవం, మంత్రి సీమరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో మంత్రిగారు భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించి వెళ్లిపోయారు. అంతా సవ్యంగా జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిగారు హ్యాపీ. తమ ఊరికి కొత్త బస్టాండ్, డిపో కూడా రావటంతో ఊరి జనమంతా హ్యాపీ. వీళ్లందరికన్నా ఎన్నో రెట్లు సంతోషపడిన వాడు భాస్కర్రావు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కట్టిన బస్టాండ్, డిపో ఊరికి చాలా దూరంలో ఉండి, ఏ డిమాండ్ లేక పడి ఉన్న భాస్కర్రావు పొలాల పక్కనే ఉండటం. ఇన్నాళ్లు తొండలు గుడ్లు పెట్టిన తన భూమికి ఎక్కడ లేని డిమాండ్ రావటంతో భాస్కర్రావు ఒక్కసారిగా ఆ ఊరిలో బిగ్ షాట్ అయిపోయాడు. నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్రావు క్రేజ్ పెంచింది. దీనికి తోడు పెద్దగా సంపాదన లేని భాస్కర్రావు నేడు కోటాను కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదంతా సాధించటానికి ఇతను ఖర్చు చేసింది ఓ సంవత్సరం సమయం, అడపాదడపా రాజధానికి వెళ్లి మంత్రిగారిని కలిసి రావటానికి పెట్టిన ఖర్చు, పెట్టిపోతలు, రవాణా, ఇతరత్రా ఖర్చులన్నీ లెక్కేస్తే 50 వేలు కూడా అవ్వలేదు. కానీ లౌక్యంగా పని చక్కబెట్టుకురావడంతో 50 వేల పెట్టుబడికి కోట్లు రాబట్టాడు, వెలకట్టలేని రాజకీయ పలుకుబడి సాధించాడు. అందుకే అంటారు ఉపాయం లేని వాణ్ణి ఊళ్లోంచి వెళ్లగొట్టాలని. బహుశా భాస్కర్రావులాంటి వారిని చూసే ఈ సామెత కనిపెట్టారనిపిస్తుంది.‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్రావు.నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్రావు క్రేజ్ పెంచింది. -
వైబ్ వావ్!
ఒకేసారి సాధారణ గది, సాధారణ కేక్, సాధారణ ఫ్రెండ్స్ కూడా ఈ గాడ్జెట్స్తో ఒక ఫ్లాషింగ్ ఫ్యాంటసీ వరల్డ్లోకి మారతాయి. అవే ఈ గాడ్జెట్స్ మ్యాజిక్!కూల్ పార్టీ!సింగిల్ బటన్ తో గది మొత్తం పార్టీ వైబ్లోకి మారిపోతుంది అంటే నమ్ముతారా? అదే పీ–ట్రాన్ఫ్యూజన్ బ్లూటూత్ స్పీకర్ మ్యాజిక్! ఒకేసారి లైట్లు, మ్యూజిక్ అన్నీ ఫుల్ ఫన్ . చిన్న సైజ్, పెద్ద శబ్దం. వైర్లెస్ కరవోకే మైక్తో పాట పాడితే మీ వాయిస్ స్పష్టంగా, గట్టిగా వినిపిస్తుంది. ఫన్నీ వాయిస్ ఎఫెక్ట్స్తో స్మైల్ మోస్ట్ ఫన్! రంగురంగుల లైట్లు బీట్కు ట్యున్ అవుతూ గేమ్ మూడ్లోకి లాగేస్తాయి. సింగిల్ చార్జ్తో ఆరు గంటల నాన్ స్టాప్ మ్యూజిక్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటో ప్లే మోడ్ సపోర్ట్. చిన్న బటన్లు, మల్టీ ఫంక్షన్. ఇలా ఏ ప్లేస్లోనైనా పార్టీ మూడ్ను సెట్ చేసే మాస్టర్! ధర రూ. 1,499 మాత్రమే!.స్పిరిట్ స్టార్ట్! ఐస్.. గ్లాస్లో వేస్తే కూల్ మాత్రమే కాదు, ఇప్పుడు కూల్ పార్టీ స్టార్లా కూడా మారిపోతుంది. ఎందుకంటే, ‘మల్టీకలర్ ఐస్ క్యూబ్స్’ రంగు రంగుల మహిమాన్విత రత్నాల్లా కనిపిస్తాయి. కాని, ఇవి గ్లాస్లో పడిన క్షణం నుంచే నీ డ్రింక్ ‘నేను మెరిసిపోతున్నా!’ అని లైట్స్తో చూపులను లాగేసుకుంటుంది. ఒక్క బటన్ నొక్కితే ఇంద్రధనుస్సులోని రంగులన్నీ కలసి ఒకేసారి డాన్స్ చేస్తాయి! స్టెడీ లైట్ కావాలా, డీజే ఫ్లాష్ మోడ్ కావాలా? మూడ్ ఏదైనా, ఈ చిన్న క్యూబ్స్ వెంటనే అర్థం చేసుకుని రంగులు మార్చేస్తాయి. ఐస్లో వేసినా, నీటిలో వేసినా వెలుగుతూనే ఉంటాయి. ప్రతి క్యూబ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది గంటలు పనిచేస్తుంది. ఒకసారి కొనుక్కుంటే రెండు, మూడు పార్టీలను ఈజీగా మెరిపిస్తాయి. ధర రూ. 2,680 మాత్రమే!పాన్ చాట్కావలసినవి: తమలపాకులు – 10పైనే, శనగపిండి– అరకప్పు నూనె, నీళ్లు, ఉప్పు– సరిపడా, పసుపు – కొద్దిగాకారం– ఒక టీ స్పూన్ , ఆమ్చూర్, ధనియాలు జీలకర్ర పొడి– అర టీస్పూన్, గడ్డ పెరుగు – ఒక కప్పు, పంచదార – ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా – ఒక టీస్పూన్ , కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ – కొద్దికొద్దిగా, కారప్పూస, దానిమ్మగింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగాతయారీ: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, ఆమ్చూర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్లో తమలపాకులు ముంచి, నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో పంచదార, గరం మసాలా వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కో తమలపాకు వడమీద కొద్దికొద్దిగా పెరుగు మిశ్రమాన్ని, కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ వంటివి వేసుకోవాలి. ఆపైన కారప్పూస, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో మరిన్ని నచ్చినవి జల్లుకుని సర్వ్ చేసుకుంటే, ఈ పాన్ చాట్ భలే రుచిగా ఉంటుంది.వెలుగుల బుడగలు!బెలూన్స్ అంటేనే పార్టీ మోడ్ ఆన్ ! ఇప్పుడు ఆ మజా మరింత మెరిసేలా మార్చడానికి వచ్చేశాయి ‘పార్టీ ప్రాప్స్ ఎల్ఈడీ బెలూన్స్’. ఒక్క సెట్లో ఇరవై ఐదు బెలూన్స్, ప్రతి ఒక్కటి రంగురంగుల లైట్స్తో మెరిసి, వేడుకకు రాక్స్టార్ ఎఫెక్ట్ ఇస్తాయి. చిన్నపిల్లల పుట్టినరోజు, ప్రేమికుల వార్షికోత్సవం, ఫ్రెండ్స్ కలిసిన సందర్భం ఇలా ఏదైనా వీటి రాకతో, చిన్న ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ అయిపోతుంది. అన్నింటినీ సెట్ చేసి, కేవలం ఒక్క స్విచ్ నొక్కితే చాలు, బెలూన్స్లోని లైట్స్ ఆన్ అయి, వెలుగుల పండుగను ప్రారంభిస్తాయి. ఉపయోగించడం సులభం. ధర రూ. 397 మాత్రమే!ఐస్ క్రీమ్ బర్గర్కావలసినవి: బన్స్ – 2 లేదా 4, ఐస్క్రీమ్ – 4 లేదా 8 స్కూప్స్ (వీటిని సర్వ్ చేసుకునే ముందే ఫ్రిజ్లోంచి బయటికి తియ్యాలి, వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ వంటి ఫ్లేవర్స్ ఎంచుకోవచ్చు), పీనట్ బటర్ – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి, బాదం, జీడిపప్పు – కొద్దికొద్దిగా (దోరగా నేతిలో వేయించి చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి)తయారీ: ముందుగా బన్స్ని మధ్యలోకి సమాంతరంగా కట్ చేసి ఓవెన్ లో నేతితో బేక్ చేసుకోవాలి. అనంతరం లోపలవైపు పీనట్ బటర్ పూసుకుని, నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం జల్లుకుని, రెండేసి బన్స్ ముక్కలు తీసుకుని, వాటి మధ్యలో ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టుకోవాలి. నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ బర్గర్స్ చాలా టేస్టీగా ఉంటాయి.అరటిపువ్వు సమోసాకావలసినవి: అరటి పువ్వు– ఒక కప్పు (కచ్చా బిచ్చా కట్ చేసుకుని–మసాలా, ఉప్పు వేసి, ఆవిరిపై మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారట్ తురుము – పావు కప్పు, కొబ్బరి తురుము–పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున, గోధుమ పిండి – 2 కప్పులు, మైదా పిండి – ఒక కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – సరిపడాతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారట్ తురుము, కొబ్బరి తురుము, మిరియాల పొడి, అరటి పువ్వు ముక్కలు, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో అరటి పువ్వుల మిశ్రమాన్ని పెట్టి, ఊడిపోకుండా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే సరిపోతుంది. -
191 ఎట్ 52!
అతడి పేరు మహ్మద్ సలీం... మారుపేరు సునీల్శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు. 52 ఏళ్ల వయస్సున్న ఇతగాడు 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 191 చోరీలు చేశాడు... ఇప్పటివరకు 26 సార్లు పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడుతున్న ఇతగాడిని హైదరాబాద్లోని బండ్లగూడ పోలీసులు డిసెంబర్ 2న మరోసారి పట్టుకున్నారు. చోరీల ద్వారా వచ్చిన సొమ్మును ఇతగాడు ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజానికి వెచ్చిస్తుంటాడు. హైదరాబాద్లోని ఫతేదర్వాజా సమీపంలో ఉన్న కుమ్మరివాడికి చెందిన సలీం పూర్తి నిరక్షరాస్యుడు. బతుకుతెరువు కోసం తొలినాళ్లల్లో కిరోసిన్ లాంతర్లు తయారు చేసే కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రి నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. ఇలా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో పరిచయమైంది. అక్కడ నుంచి అతడి జీవితం మలుపులు తిరగడం మొదలైంది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం చోరుడిగా మారాడు. తొలుత తమ దుకాణంలోనే చిన్న చిన్న చోరీలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్లు గుట్టుగానే సాగినా, చిరవకు విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. దీంతో గత్యంతరం లేక చాదర్ఘాట్లోని ఓ హోటల్లో కార్మికుడిగా చేరాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించేవాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెలకువలు నేర్చుకున్నాడు. ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్లనే టార్గెట్గా చేసుకునేవాడు. అందుకే గడిచిన మూడుసార్లూ బండ్లగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసుల్లోనే అరెస్టు అయ్యాడు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే రంగంలోకి దిగుతాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్ఫోన్లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్పాస్ చేస్తాడు. చిన్న టార్చ్లైట్, కటింగ్ ప్లేయర్తో ఫీల్డ్లోకి వచ్చే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచ్చినా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు ఆ ఇంటిపై దృష్టిపెట్టరనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. టార్గెట్ చేసిన ఇంటి లోపలకు వెళ్లాక అక్కడ దొరికే చెంచాలు తదితరాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. ఇతగాడు 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్నాడు. సునీల్శెట్టి ప్రస్తుతం ఏడుగురి పిల్లలకు తండ్రి. ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్తో పాటు హెలీకాఫ్టర్లో సంచరించే హెలీటూరిజం కోసం భారీగా ఖర్చు చేస్తాడు. సెక్స్వర్కర్ల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్లాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్లినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు 191 నేరాలు చేసి 26 సార్లు అరెస్టు అయినా, శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి బయటకు రాని నేపథ్యంలోనే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం అనేక సందర్భాల్లో సాధ్యం కాలేదు. పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఐదారు చోరీలు అంగీకరిస్తున్నా, ఇన్నేళ్లల్లో కేవలం రెండుసార్లే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యమైంది. -
అంతరించింది అనుకుంటే.. అంతలోనే కనిపించింది
అడవుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని మరోసారి నిరూపించింది ఒక చిన్న ప్రాణి. గత మూడు దశాబ్దాలుగా కనుమరుగైందనుకున్న ‘మౌస్ డీర్’, మళ్లీ అడవిలో నడుస్తూ కనిపించింది. ఇటీవలి రోజుల్లో వియత్నాం అడవుల్లో శాస్త్రవేత్తలు దీనిని కెమెరాల్లో గుర్తించారు. ముప్పై ఏళ్లుగా దాని జాడ కనిపించకపోవడంతో, శాస్త్రీయ రికార్డుల్లో ఏ ఆధారమూ లేకపోవడంతో, ఇది పూర్తిగా అంతరించిపోయిందని అందరూ నమ్మేశారు. కాని ప్రకృతి ఎప్పుడూ తన ప్రణాళికలను చివరి నిమిషంలోనే బయటపెడుతుంది. అన్నట్లు, అలా ఒక్కసారిగా సర్ప్రైజ్లా ప్రత్యక్షమైంది ఈ చిన్న జీవి. ప్రపంచంలోనే అతి చిన్న కాళ్లున్న, గొర్రెల కుటుంబానికి చెందిన ఈ మౌస్ డీర్ బరువు పది కిలోలు. అడవుల లోతుల్లో, వెలుగుకు దూరంగా జీవించే స్వభావం వల్ల దీని ఉనికి తెలుసుకోవడం అంత సులువు కాదు. అందుకే ఇన్ని ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించడమే ఒక అరుదైన అద్భుతం. -
ఏదో మొక్కుబడిగా చేయను.. క్లారిటీ ఉంది: సౌతాఫ్రికా కోచ్
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా టీ20 జట్టులో తరచూ ఇలా జరగడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA)తో రెండో టీ20లోనూ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను వన్డౌన్లో పంపడం.. అందుకు తగ్గ మూల్యం చెల్లించడం జరిగాయి.ఏదో మొక్కుబడిగా చేయనుమరోవైపు.. ఈ మ్యాచ్లో తుదిజట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మూడో టీ20కి ధర్మశాల వేదిక. ఈ మ్యాచ్కు ముందు సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము కూడా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తామని.. అయితే, అదేదో మొక్కుబడిగా చేసే పనికాదని పేర్కొన్నాడు.స్పష్టమైన అవగాహన ఉందిటీ20 ప్రపంచకప్-2026 ప్రణాళికలకు అనుగుణంగానే తాము ముందుకు సాగుతున్నట్లు కన్రాడ్ వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ప్రతీ మ్యాచ్లోనూ మేము బ్యాటింగ్ ఆర్డర్ను మార్చబోము. తప్పక ఆర్డర్ను మార్చాలన్న నియమేమీ లేదు. ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది.ఇందుకు అనుగుణంగానే ప్లేయర్లను మారుస్తూ ఉన్నాము. టెస్టు సిరీస్ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఇక్కడే ఉన్నా.. వారికి అవకాశం రాలేదు. ఈ సిరీస్ తర్వాత SA20 లీగ్ కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా మా వాళ్ల ప్రదర్శనను చూస్తాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము.ఇక్కడ ఏది వర్కౌట్ అయింది.. ఏది వర్కౌట్ కాలేదు అన్న విషయాలను విశ్లేషిస్తాం. ఏదేమైనా మా ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా మాకేం కావాలో పూర్తి స్పష్టతతోనే ఉన్నాము’’ అని షుక్రి కన్రాడ్ చెప్పుకొచ్చాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.1-1తో సమంఇందులో భాగంగా తొలుత టెస్టులు జరుగగా.. 2-0తో సఫారీలు టీమిండియాను వైట్వాష్ చేశారు. అనంతరం.. వన్డే సిరీస్లో భారత్.. సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది. ఇక కటక్ వేదికగా తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో జయభేరి మోగించగా.. ముల్లన్పూర్లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో గెలిచింది.ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా మూడు మార్పులలతో బరిలోకి దిగింది. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, ఓట్నీల్ బార్ట్మన్లను బరిలోకి దించింది. బార్ట్మన్ నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20లో ఆడిన తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మాన్.చదవండి: భారత్ X పాకిస్తాన్ -
సిరియాలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
డమాస్కస్: ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్కు చెందిన ముష్కరుడొకరు సాగించిన ఆకస్మిక దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా, మరో ముగ్గురు సర్వీస్ సభ్యులు గాయపడినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఈ ఘటన సిరియాలో జరిగింది. CENTCOM అనేది మిడిల్ ఈస్ట్లో అమెరికన్ మిలిటరీ కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ. ఈ విషయాన్ని వారు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. BREAKING:3 U.S. soldiers shot and wounded in an ambush in Syria during an anti-ISIS patrol near Palmyra.The soldiers have been airlifted to the Al-Tanf base on the border with Iraq and Jordan pic.twitter.com/xWrlNc37RV— Visegrád 24 (@visegrad24) December 13, 2025ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు యూఎస్ సైనిక సిబ్బంది, ఒక యూఎస్ పౌరుడు ఉన్నారని CENTCOM నిర్ధారించింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఆ పౌరుడు అమెరికన్ అనువాదకునిగా పనిచేస్తున్నారు. గాయపడిన ముగ్గురు సర్వీస్ సభ్యులను చికిత్స నిమిత్తం ఆల్-తన్ఫ్ గారిసన్కు హెలికాప్టర్లో తరలించారు. కాగా ఐఎస్ఐఎస్ ముష్కరుడిని అమెరికన్ బలగాలు వెంటనే ఎదుర్కొని మట్టుబెట్టాయి. ఈ దాడులు సిరియాలోని పాల్మైరా సమీపంలో జరిగాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొంటున్న సైనికులపై ఈ ఆకస్మిక దాడి జరిగింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ, ఇది ISIS దాడి అని ధృవీకరించారు. దీనికి తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. మరణించిన ముగ్గురిని అమెరికన్ దేశభక్తులుగా ట్రంప్ అభివర్ణించారు. గాయపడిన సైనికులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
Kuttram Purindhavan Review: ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ సిరీస్ కుట్రమ్ పురిందవన్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఒక సినిమా ఊహకందని సన్నివేశాలతో నడిస్తే అది దర్శకుడి ప్రతిభగా చెప్పొచ్చు. దానినే సినీ పరిభాషలో గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే అంటారు. ఇలాంటి స్క్రీన్ప్లేతో, తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేని విధంగా ఇటీవల సోనీలివ్ ఓటీటీ వేదికగా విడుదలైన ఓ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అదే ‘కుట్రమ్ పురిందవన్’(Kuttram Purindhavan Review ). ఈ సిరీస్కి సెల్వమణి ముని యప్పన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఆఖరి రెండు ఎపిసోడ్ల ట్విస్టులు చూస్తే మతి పోవడం ఖాయం. అంతలా ఈ సిరీస్లో ఏముందో, కథాంశం ఏంటో చూద్దాం. తమిళనాడులోని ఓ కుగ్రామంలో జరిగే జాతర నుండి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఉద్యోగ రీత్యా ఫార్మసిస్ట్ అయిన భాస్కర్ తన మనవణ్ణి జాతర మధ్యలోనే ఇంటికి తీసుకువెళుతుంటాడు. దారి మధ్యలో తన ఇంటి పక్కన ఉన్న స్టీఫెన్ తాగి రోడ్డుకు అడ్డదిడ్డంగా నడుస్తూ కనబడతాడు. ఇంటికి వచ్చిన కాసేపటికి భాస్కర్ ఇంటి తలుపులు ఎవరో బాదుతుంటారు. తలుపు తీస్తే... ఇందాక కనిపించిన స్టీఫెన్ స్పృహ తప్పిపోయిన అతని కూతురు మెర్సీని తీసుకువచ్చి కాపాడమని భాస్కర్ని అడుగుతాడు. తనకి అంత పెద్ద వైద్యం తెలీదన్నా భాస్కర్ చేతుల్లో మెర్సీని పెట్టి బయటకు వెళతాడు స్టీఫెన్. మెర్సీని చూసి భాస్కర్ కంగారుపడుతుండగా స్టీఫెన్ ఆ అంతస్తు నుంచి కిందపడి చనిపోతాడు. ఇవతల మెర్సీ కూడా చనిపోయి ఉంటుంది. ఇక్కడ మెర్సీ, అక్కడ స్టీఫెన్ ఎలా చనిపోయారో తెలియక భాస్కర్ కంగారు పడుతుంటాడు. ఈలోపల మెర్సీ బాడీని మాత్రం తన ఫ్రిజ్లో దాస్తాడు భాస్కర్. మరోవైపు తన మనవడి సర్జరీ కోసం తన పెన్షన్ డబ్బుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు భాస్కర్. మర్డర్ కేస్ తన మీదకు వస్తే ఆ డబ్బులు ఆగిపోతాయన్న భయంతో మెర్సీ బాడీని దాస్తాడు భాస్కర్. ఆ తరువాత ఆ మిస్టరీ ఎలా వీడుతుంది? అన్నది మాత్రం సిరీస్లో చూడవలసిందే. ముఖ్యంగా ఈ సిరీస్ ఆఖర్లో వచ్చే ట్విస్టులను ఎవ్వరూ ఊహించలేరు. పిల్లలు తప్ప పెద్ద వాళ్ళకి ఇదో అద్భుతమైన వీకెండ్ సిరీస్... మస్ట్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
స్టాండ్స్లోకి కిక్ చేసి.. ఉప్పల్లో మెస్సీ చర్య వైరల్
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం మెస్సీ మంత్రం జపించింది. గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది. దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్ స్టేడియం ఉర్రూతలూగింది. గోట్ పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్కు వచ్చిన మెస్సీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నా రు. అనంతరం ఆయన ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. అభిమాన క్రీడాకారుణ్ని ఒక్కసారైనా దూరం నుంచైనా చూడాలని అభిమానులు పోటెత్తారు. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ఉప్పల్ స్టేడియంలో తన ఆటతో మైమరిపించారు. స్టాండ్స్లోకి కిక్ చేసివీవీఐపీలు, ఫుట్బాల్ ప్రేమికులు, మెస్సీ అభిమానులు దిగ్గజ క్రీడాకారుణ్ని చూసేందుకు పోటీపడ్డారు. స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకుల కేరింతల మధ్య కోలాహలంగా సాగింది. ఇక అభివాదం చేస్తు న్న సమయంలో ఫుట్బాల్ను స్టాండ్స్లోకి కిక్ చేసి మెస్సీ అభిమానులను అలరించిన తీరు వైరల్గా మారింది. ✨𝐀𝐧 𝐔𝐧𝐟𝐨𝐫𝐠𝐞𝐭𝐭𝐚𝐛𝐥𝐞 𝐌𝐨𝐦𝐞𝐧𝐭 ✨Football's Greatest Of All Time Lionel Messi in Hyderabad. pic.twitter.com/5z5gXCKbG9— Congress (@INCIndia) December 13, 2025మ్యూజిక్.. మ్యాజిక్.. ఫుట్బాల్ మ్యాచ్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకుడు రాహుల్ సిప్లీగంజ్, గాయని మంగ్లీ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఆస్కార్ పాట నాటు.. నాటు పాట పాడుతూ సిప్లీగంజ్ అభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీతో పాటు వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఈ పాటకు ఊగిపోయారు. ఎన్నడూ లేనివిధంగా స్టేడియంలో లైట్లు, లేజర్ షో ఏర్పాటు చేశారు. ఈ షో ఆదంత్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఫోక్ సాంగ్స్తో మంగ్లీ మెస్మరైజింగ్ షో అదరగొట్టింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీతారలు సైతం స్టేడియంలో సందడి చేశారు. ఫలించిన పోలీసుల వ్యూహం..ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ రాక సందర్శంగా శనివారం మధ్యాహ్నం నుంచే ఉప్పల్ స్టేడియం దారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. టికెట్, పాస్లున్న వారిని స్డేడియంలోనికి మూడు గంటలు ముందుగానే అనుమతించడంతో పొలీసులు వ్యూహం ఫలించింది. మ్యాచ్ను తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. మ్యాచ్ను వీక్షించేందుకు వస్తున్న యువత కాగా.. గతంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను సమర్థంగా నిర్వహించిన రాచకొండ పోలీసులు అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ తదితర వ్యూహాలు ఫలించాయి. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషం. రాచకొండ సీపీ సుదీర్ బాబు పిలుపు మేరకు అభిమానులు క్రమశిక్షణతోనే మెలిగారు. పాసులు లేనివారు స్టేడియం వైపు రాకపోవడం గమనార్హం. స్టేడియంలోకి అభిమానులంతా దాదాపుగా మెస్సీ టీ షర్ట్ను ధరించి వెళ్లడం కనిపించింది. -
స్టార్ స్టయిల్..!
ప్రతిరోజూ ఫ్యాషన్లో ఒక చిన్న అడ్వెంచర్! అదితిరావు స్టేట్మెంట్ యిల్! ఇందుకోసం, తను ఫాలో *అయ్యే చిన్న చిన్న స్టయిల్ హ్యాక్స్, స్పార్కింగ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూడండి!కొత్త ఆభరణాలు, కొత్త లుక్స్ ఇవన్నీ ప్రయత్నించడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఫ్యాషన్లో కొత్తదనం భయాన్ని కాకుండా, ఉత్సాహాన్ని ఇస్తుంది. నిజమైన మెరుపు ఆభరణాల్లో కాదు, వాటిని ధరించే మన వైబ్లోనే ఉంటుంది.– అదితిరావు హైదరీజుంకాల మ్యాజిక్!చెవులకు వేసుకునే ఆభరణాల్లో ఎన్నో రకాలున్నా, సంప్రదాయ అందాన్ని క్లాసీగా చూపించడంలో ఆక్సిడైజ్డ్ జుంకాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద డోమ్ ఆకారంలో మెరిసే ఈ జుంకాలు, మొత్తం లుక్ను మరింత అందంగా మార్చేస్తాయి. ఎక్కువగా ఇలాంటి జుంకాలు రంగురంగుల దారాలు, మిర్రర్ వర్క్తో ఉండే కుర్తాలు, డీప్ జ్యూల్ టోన్స్లో ఉన్న అనార్కలీలకు అద్భుతంగా సరిపోతాయి. కళ్లకు సాఫ్ట్ కాజల్, నేచురల్ మేకప్, చిన్న బొట్టు ఇవన్నీ కలిస్తే ఆభరణాల అందం మరింత మెరిసిపోతుంది. హెయిర్ స్టయిల్ సింపుల్గా వదిలి, మెడను బోసిగా ఉంచడం చాలా ముఖ్యం, అప్పుడే ఈ జుంకాలు హైలైట్ అవుతాయి. చేతులకు దుస్తుల రంగులకు తగ్గట్టు బీడెడ్ బ్రేస్లెట్లు లేదా చిన్న ట్రెడిషనల్ గాజులు వేసుకుంటే మొత్తం స్టయిల్కు కలర్ఫుల్ టచ్ వస్తుంది. ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్ష¯Œ ్స, కల్చరల్ ఈవెంట్స్ ఇలా ఎక్కడైనా ఇలాంటి జుంకాలు వేసుకుంటే, మీరు ప్రత్యేకంగా కనిపించడం ఖాయం!∙దీపిక కొండి -
గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో అత్యుత్తమ గ్రాండ్మాస్టర్లు
సాక్షి, సిటీబ్యూరో: టెక్ మహీంద్రా, ‘ఫిడే’ సంయుక్త భాగస్వామ్యంలో గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్కు రంగం సిద్ధమైంది. ముంబైలోని రాయల్ ఒపెరా హౌస్లో నేటి నుంచి ఈ లీగ్ జరుగుతుంది. ఆరు జట్ల మధ్య 34 మ్యాచ్లు జరుగుతాయి. ఈ సందర్భంగా సీజన్–3 విన్నర్స్ ట్రోఫీని ఆవిష్కరించారు. త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ మధ్య మ్యాచ్తో ఈ సీజన్ అధికారికంగా ఆదివారం ప్రారంభమవుతుంది. మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, ద్రోణవల్లి హారిక, అలీరెజా ఫిరూజా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్మాస్టర్లుఈ సీజన్ జీసీఎల్ లక్ష్యాలను ప్రపంచ స్థాయి ఆటగాళ్ల ఎంపిక ద్వారా సాధిస్తుందని చైర్పర్సన్ పీయూష్ దూబే తెలిపారు. ఈ సీజన్లో ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్మాస్టర్లు ఆడనున్నారు. ప్రధాన ఆటగాళ్లలో అలీరెజా ఫిరూజా, ఫాబియానో కరువానా, హికారు నకముర, హు ఇఫాన్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు విశ్వనాథన్ ఆనంద్ సహా భారత మేటి ఆటగాళ్లు పోటీపడతారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ భారత చెస్ శక్తిని చాటుతున్నారు. రెండుసార్లు విజేతలైన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది. 10 రోజుల పాటుమరోవైపు.. పీబీజీ అలాస్కాన్ నైట్స్ జట్టు యజమాని పునిత్ బాలన్, గుకేశ్ అర్జున్ వంటి ప్రతిభావంతులతో తాము బలమైన స్థితిలో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. జేసీఎల్ మూడో సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో 10 రోజుల పాటు జరుగుతుంది. ఇక ఈ లీగ్లో ప్రతి జట్టు 10 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఆడుతుంది. తర్వాత డిసెంబర్ 23న ఫైనల్ జరుగుతుంది. ప్రతి మ్యాచ్ ఆరు బోర్డులపై పురుషులు, మహిళలు, యువ క్రీడాకారులు కలిసి పోటీపడతారు. భారత్లోని అభిమానులు జియో హాట్స్టార్ నెట్వర్క్లో లీగ్ను చూడవచ్చు. టిక్కెట్లు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. -
నోటిఫికేషన్లతో కెరీర్ డేమేజ్
అర్ధరాత్రి సరిగ్గా 2:17 గంటలకు అర్చనకు టీమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. కళ్లు తెరవాలనిపించలేదు. కానీ ఏం నోటిఫికేషన్ వచ్చిందో వెంటనే చెక్ చేయమని మెదడు అరుస్తోంది. మెదడే నెగ్గింది. అర్చన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసింది. ‘Tomorrow's Deck Updated’’ అని నోటిఫికేషన్ కనిపించింది. నిద్ర ఎగిరిపోయింది. ఇది కేవలం అర్చన కథ కాదు. ప్రతి నగరంలో, ప్రతి కంపెనీలో వేలాది మంది ప్రొఫెషనల్స్ ఇలా ఫోన్ నోటిఫికేషన్ శబ్దాలకు నిద్రను కోల్పోతున్నారు. చూడ్డానికి ఇది చిన్న డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ దాని ప్రభావం వృత్తి, వ్యక్తిత్వం, మానసిక ప్రశాంతత... ఇలా అన్నిటిపై పడుతుంది. ఫోన్ నోటిఫికేషన్లు మన జీవితం మీద చేస్తున్న దాడులు కేవలం శబ్దాల దాడులు కావు. అవి మైక్రో–బ్రెయిన్ హిట్స్. ప్రతి పింగ్ ఒక చిన్న ఒత్తిడి. ప్రతి చిన్న ఒత్తిడి ఒక పెద్ద డిస్టర్బెన్స్. ప్రతి డిస్టర్బెన్స్ చివరకు బర్న్ఔట్కు దారితీస్తుంది. సైన చెప్పే అసలు నిజం...మన మెదడు ఏ పని మీదైనా ఫోకస్ పెట్టగలిగే సమయం సుమారు 8 నుంచి 12 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో దానికి విఘాతం కలిగితే తిరిగి ఫోకస్ రావడానికి 23 నిమిషాలు పడుతుందని బ్రెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ఉద్యోగులకు రోజుకు వచ్చే నోటిఫికేషన్ల సంఖ్య: వాట్సప్–120, ఈమెయిల్ అలర్ట్స్–40–100, టీమ్స్ 85–150, కేలండర్ పింగ్స్ 10–20. అంటే రోజుకు సగటున 250–300 విఘాతాలు. అంటే మీ ఎనిమిది పని గంటల సమయంలో ఐదు గంటలు పూర్తిగా ఫోకస్ లేకుండా వృథా అవుతున్నాయి. అందుకే చాలామంది ప్రొఫెషనల్స్ రోజంతా బిజీగా ఉన్నప్పటికీ రోజు చివర్లో ‘ఏం చేశాను?’ అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ మెదడుపై జరిగిన దాడి.అలసట కాదు, బ్రెయిన్ డామేజ్ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో బర్న్ఔట్ను occupational phenomenon’ జాబితాలో పెట్టింది. వర్క్ ప్లేస్ ఒత్తిడి వల్ల మెదడు ఎగ్జాస్ట్ అవుతోందని అర్థం. బర్న్ఔట్కు మూడు ప్రాథమిక లక్షణాలున్నాయి. ∙భావోద్వేగ అలసట. అంటే, ఉదయం లేచిన వెంటనే శక్తి లేకపోవడం. ‘ఇవాళ కూడా ఇదేనా...’ అనిపించడం. ∙పనిపట్ల విసుగు. ఎంతో ఇష్టంగా చేసిన పని కూడా ఇప్పుడు చిరాకు తెప్పించడం. ∙పనితీరు పడిపోవడం, సృజనాత్మకత క్షీణించడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గందరగోళం.షాకింగ్ విషయం ఏమిటంటే నోటిఫికేషన్లు ఈ మూడు లక్షణాలను డైరెక్ట్గా పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్టాన్ఫర్డ్ న్యూరోసైన్స్ ల్యాబ్స్ స్టడీ ప్రకారం నోటిఫికేషన్ల వల్ల పనితీరు 17శాతం పడిపోతుంది. ‘ఒక్క నిమిషం...’తో కెరీర్ డ్యామేజ్నిరంతర నోటిఫికేషన్లతో ఫోకస్ కోల్పోవడం వల్ల జరిగే నష్టం మూడు దిశల్లో సాగుతుంది.1. నోటిఫికేషన్లు మీ డీప్ జోన్ను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని ఒక రియాక్షన్–మోడ్ ఉద్యోగిగా మార్చేస్తాయి. దీనివల్ల మీరు క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంటి డీప్ వర్క్స్ సమర్థంగా చేయలేరు. దాంతో గుర్తింపు, పదోన్నతి, నాయకత్వ స్థానాలకు దూరమవుతారు. 2. ‘ఏం జరిగినా వెంటనే స్పందించాలి’ అనుకోవడం విధేయత కాదు, బర్న్ అవుట్ ప్రారంభదశ. దీనివల్ల భావోద్వేగ క్షీణత జరుగుతుంది. 3. మీరు రోజంతా బిజీగా ఉన్నా ప్రభావం శూన్యం కావడం మీ కెరీర్ గ్రోత్కు అత్యంత ప్రమాదకరం. మేనేజర్లు, హెచ్ఆర్, ఉన్నతాధికారులు దీన్ని గమనిస్తారు.ఇది కేవలం మీ తప్పా?ఇది కేవలం మీ తప్పు కానే కాదు, ఈనాటి వర్క్ ప్లేస్ సమస్య. ఈనాటి ఆఫీసుల్లో మీటింగ్స్ ఎక్కువ, మెసేజింగ్ యాప్స్ ఎక్కువ. డెడ్ లైన్లు నెత్తిమీద కూర్చుంటాయి. అందరూ ‘అర్జెన్సీ అడిక్షన్’లో చిక్కుకు పోయారు.పరిష్కారాలు... 1. రోజులో కనీసం రెండు గంటలు ‘నో నోటిఫికేషన్ జోన్’. ఆ సమయాన్ని మీ డీప్ వర్క్కు ఉపయోగించండి. 2. నోటిఫికేషన్ డైట్ పాటించండి. అంటే, వాట్సప్ గ్రూప్లను మ్యూట్ చేయండి. సోషల్ మీడియాను ఆఫ్ చేయండి. ఈమెయిల్స్ రోజుకు మూడుసార్లు మాత్రమే చెక్ చేయండి. 3. ప్రతి 90 నిమిషాల పని తర్వాత ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో కొద్దిగా నడవండి. లేదా నీళ్లు తాగండి. ఇది మీ కాగ్నిటివ్ ఎనర్జీని తిరిగి పెంచుతుంది. 4. మల్టీ టాస్కింగ్ అనేది మెదడుకు విషం లాంటిది. సింగిల్ టాస్క్ ఆక్సిజన్ లాంటిది. అందుకే ఒకసారి ఒకేపని అనే నిబంధన పెట్టుకుని పాటించండి. -సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com -
తొలిసారి అలా కనిపించిన సామ్ దంపతులు.. వీడియో వైరల్
అందరూ ఊహించినట్లుగానే సమంత రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్ను నిజం చేస్తూ రెండో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సామ్ పెళ్లాడింది. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్లో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.అయితే ఈ పెళ్లి తర్వాత వీరిద్దరు మొదటిసారి జంటగా బయట కనిపించారు. ఎయిర్పోర్ట్లో వెళ్తుండగా ఈ నూతన వధువరులు కెమెరాలకు చిక్కారు. ఈ జంటను చూసిన కొందరు కంగ్రాట్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సమంత మొదట టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నాగచైతన్య.. మరో హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను పెళ్లాడారు. తాజాగా ఈ ఏడాది సామ్ రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. #Samantha was seen at the airport with husband #RajNidimoru for the first time after their wedding. 😍#FilmfareLens pic.twitter.com/ohc48wCUgj— Filmfare (@filmfare) December 13, 2025 -
స్టేట్ బ్యాంకు శుభవార్త.. అప్పు తీసుకున్నోళ్లకు..
తమ బ్యాంకులో అప్పు తీసుకున్నోళ్లకు ప్రభుత్వ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ఇటీవల రెపో రేటును తగ్గించిన తరువాత, ప్రధాన బ్యాంకులు ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసే పనిలో ఉన్నాయి. తాజాగా ఎస్బీఐ కూడా తన కీలక రుణ రేట్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇందులో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్), ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్), బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (బీపీఎల్ఆర్), బేస్ రేట్లో కోతలు ఉన్నాయి. డిసెంబర్ 15 నుండి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. మారిన వడ్డీ రేట్లతో ఈ బ్యాంకులో రుణ గ్రహీతలకు వడ్డీ భారం తగ్గనుంది. నెలవారీ వాయిదాలు (EMI) తగ్గుతాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపోరేటు అంటే వాణిజ్య బ్యాంకులకు తాత్కాలికంగా ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీంతో ఇది 5.25 శాతానికి తగ్గింది. వృద్ధికి తోడ్పడటానికి ఈ ఏడాది నాల్గవసారి కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని గత వారం ఆర్బీఐ విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది.సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లుచాలా రిటైల్ రుణాలకు కీలకమైన ఎంసీఎల్ఆర్ రేటును అన్ని కాలపరిమితిలలోనూ ఎస్బీఐ తగ్గించింది. ఓవర్నైట్, ఒక నెల రేట్లు 7.90% నుండి 7.85%కి తగ్గాయి. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.25 శాతానికి రాగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. అనేక గృహ, వాహన రుణాలకు ఉపయోగించే క్లిష్టమైన ఒక సంవత్సరం కాలపరిమితి రుణ రేటు 8.75% నుండి 8.70%కి దిగొచ్చింది. ఇక రెండేళ్ల టెన్యూర్ రుణాలపై 8.80% నుండి 8.75%, మూడేళ్ల కాలపరిమితి లోన్లపై 8.85 % నుండి 8.80 శాతానికి వడ్డీని ఎస్బీఐ సవరించింది.ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ కోతలుక్రెడిట్ రిస్క్ ప్రీమియం (CRP), బ్యాంక్ స్ప్రెడ్ (BSP)తో కూడిన ఈబీఎల్ఆర్ను ఎస్బీఐ 8.15% నుండి 7.90%కి తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటుతో నేరుగా ముడిపడి ఉన్న ఆర్ఎల్ఎల్ఆర్ 7.75% + CRP నుండి 7.50% + CRP కి దిగొచ్చింది. ఫలితంగా రుణగ్రహీతలు తమ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఈఎంఐలలో తగ్గింపులను చూస్తారు.బీపీఎల్ఆర్, బేస్ రేటు మార్పులుతమ అత్యంత విశ్వసనీయ కస్టమర్లకు (prime customers) వసూలు చేసే కనీస వడ్డీ రేటు బీపీఎల్ఆర్ను ఎస్బీఐ 14.65 శాతానికి తగ్గించింది. దీంతోపాటు బేస్ రేటును కూడా 9.90 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపులు వినియోగదారుల స్థోమతను పెంచుతాయి. గృహ కొనుగోలు, వ్యాపార పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. -
ఆచి తూచి 'తగ్గొచ్చు'
ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కాని, మనం ఆ ఆహారాన్ని అపసవ్యంగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నాం. కారణాలేమైనప్పటికీ, ఆహారం తీసుకోవటంలో నియంత్రణ కోల్పోవటమే అసలు సమస్య. మనం ఊబకాయులుగా, రోగులుగా మారటానికి మూల కారణం మనం తింటున్న పదార్థాల మోతాదులే. పరిమాణం, నాణ్యత, సమతుల్యత గాడి తప్పింది. అవసరానికి మించి తిన్న ‘అసమతుల్య ఆహారం’ శరీరానికి శక్తిని ఇచ్చే క్రమంలో దేహాన్ని అతిగా బరువెక్కించి రోగాల పుట్టగా మార్చుతోంది. ఏది వీలైతే అది, ఎంత వీలైతే అంత తింటున్నాం. ఏయే పోషకాలు ఎంత మోతాదులో నాకు అవసరం ఉంది? ఎంత తింటున్నాను? అనే అవగాహన లోపించటం లేదా సమాచారం తెలిసినా విస్మరించడమే అధిక బరువుకు, ఆ పైన ఊబకాయానికి రాచబాటలు వేస్తోంది. ముఖ్యంగా పొట్ట చుట్టుకొలత పెంచుతోంది. చర్మం కింద శరీరం అంతటా పేరుకునే కొవ్వు కన్నా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ నిరోధకత ఫలితంగా కొవ్వు నిల్వలు పేరుకుంటాయి. ఫలితంగా బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, గుండెజబ్బు వంటి జీవనశైలి జబ్బులన్నీ వస్తున్నాయి. మనల్ని రోగాల పుట్టగా మార్చుతున్నది మనం తిన్న ఆహారమే అయినప్పుడు... ఆ ఆహారాన్నే తెలివిగా శక్తియుతమైన ఆయుధంగా వాడి రోగాలను, వాటికి మూలమైన ఊబకాయాన్ని ఎందుకు తగ్గించుకోకూడదు? అందుకు ఉన్న మార్గాలేమిటి?.. చర్చిద్దాం..ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది.శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చునేను గత 47 సంవత్సరాలుగా వేలాది గుండె శస్త్రచికిత్సలు, ముఖ్యంగా బైపాస్ సర్జరీలు చేశాను. పిండి పదార్థాలను ఎక్కువగా తింటూ వ్యాయామాలు చేసినా శరీరంలో కొవ్వు కరగటం పెద్దగా జరగదు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయన ఫలితాలను స్టడీ చేశాను. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ‘ఆరోగ్యకరమైన కొవ్వులు’ ఉండే లోకార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్.) ఆహారం ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి సహాయకారిగా నిలిచిందని నా అధ్యయనంలో గుర్తించాను. ఆ తర్వాతే నేనూ ఇది పాటించి లబ్ధి పొందాను. 17 ఏళ్ల క్రితం మధుమేహం, రక్తపోటుకు ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడేవాడిని. మొదట్లో ఈ ఆహార పద్ధతిని నేనూ నమ్మలేదు. రెండేళ్లు పరిశోధన చేసి ఈ నియమావళిని నమ్మి ప్రారంభించాను. ఇందులో గానుగ ద్వారా తీసిన కొబ్బరి నూనె వాడకం చాలా ప్రధానం. 6 వారాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇన్సులిన్ ఇంజక్షన్, రక్తపోటుకు మందులు వాడటం ఆపేశాను. ‘లో కార్బ్ స్కూల్’ అనే యూట్యూబ్ చానల్లో.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించాలో తెలిపే చాలా వీడియో ప్రసంగాలు కూడా చేశాను. ఎల్సీహెచ్ఎఫ్ డైట్ను శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చు. – డా. పి.వి. సత్యనారాయణ ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, ఎల్సిహెచ్ఎఫ్ ఆహార పద్ధతి నిపుణులు, హైదరాబాద్ఎంతెంత మోతాదుల్లో తినాలి?ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.ఏయే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ఎంతెంత ఉన్నాయో తెలుసుకొని, ఏ వ్యక్తి (పసిపిల్లలు, పిల్లలు, యుక్తవయస్కులు, నడివయస్కులు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు)కి ఎంత మోతాదుల్లో అవి అవసరమో లెక్క వేసుకొని తినటం ద్వారా సమతుల ఆహారం తీసుకోవచ్చు. లెక్క వేసుకొని తినాలన్న మాట విడ్డూరంగాను, అంత అవసరమా అనే సందేహం రావచ్చు. కానీ, సత్ఫలితాలు రాబట్టాలంటే అదే అవసరం. ఎంత తినాలో తెలుసుకొని, తెలివిగా తింటే అధిక బరువు/ ఊబకాయంతో పాటు వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ సమతులాహారం దోహదం చేస్తుంది. మనం ఏయే పదార్థాలను ఎంతెంత మోతాదులో తినాలో తెలియాలంటే మొదట ఆయా ఆహార పదార్థాల్లో అసలు పోషకాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి ఆహార పదార్థంలోనూ స్థూల పోషకాలైన పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలతోపాటు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అయితే, వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. కొన్నిటిలో పిండి పదార్థాలు ఎక్కువగా, ప్రొటీన్లు తక్కువగా, కొవ్వు పదార్థాలు మరీ తక్కువగా ఉంటాయి. మరికొన్నిటిలో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్లు మోస్తరుగా, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇంకొన్నిటిలో అసలు పిండి పదార్థాలే ఉండవు. కాబట్టి, వ్యక్తిగతంగా మీకు ఏయే పోషకాలు ఎంత మోతాదులో కావాలో తెలుసుకొని, మీ ఆరోగ్య లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్య సాధనకు అవసరమైనన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని పనిగట్టుకొని లెక్క వేసుకొని తీసుకుంటే మీ ఆరోగ్య లక్ష్యాలను క్షేమకరమైన రీతిలో సాధించవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. పిండి పదార్థాలను అతి తక్కువగా, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి వినియోగ పద్ధతి గ్లూకోజ్ నుంచి కీటోన్ బాడీస్కి షిఫ్ట్ అవుతుందని డాక్టర్ పీ వీ సత్యనారాయణ తెలిపారు. శక్తి వనరుగా (పిండి పదార్థాల ద్వారా అందే) గ్లూకోజ్కు బదులుగా (కొవ్వు పదార్థాల ద్వారా అందే) కీటోన్ బాడీస్పై శరీరం ఆధారపడుతుంది. బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీల ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించి వాడుకోవటానికి శరీరం అలవాటు పడుతుంది. పిండి పదార్థాలు తక్కువగా తినటం వల్ల ఇన్సులిన్ నాణ్యత మెరుగుపడుతుంది. క్రమంగా ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా తీరుతుంది. ఈ విధంగా ఇన్సులిన్ నిరోధకతతో వచ్చిన జీవన శైలి జబ్బులు సైతం మందులు లేకుండానే సమసిపోతాయని డా. సత్యనారాయణ వివరించారు.ఏమేమి తినొచ్చు?లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్లో కొవ్వులు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తినాలి అంతే. ఈ పరిమితుల్లో ఏయే ఆహార పదార్థాలను సమకూర్చుకోగలిగితే, ఏవి ఇష్టపడితే వాటిని తినొచ్చు. ఏయే ఆహార పదార్థాల్లో, ఏయే వంటకాల్లో మొత్తం ఈ మూడు పోషకాలు ఎనెన్ని గ్రాములు, ఎన్నెన్ని కిలో కేలరీలు ఉన్నాయో లెక్క వేసుకొని, పోషకాహార పట్టిక రాసుకొని మరీ తినాలి. మాంసాహారులు, శాకాహారులు, వీగన్లు ఎవరైనా ఈ డైట్ను అనుసరించవచ్చు. వంద గ్రాములు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలలో 50 గ్రాములకు పైగా పిండి పదార్థాలుంటాయి కాబట్టి అవిగానీ, వాటితో వండిన వంటకాలు గానీ తినటానికి లేదు. నెయ్యి, వెన్న, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, గింజలు, మాంసం తినొచ్చు. మసాలాలు మామూలే. కొబ్బరి గానుగ నూనె వాడాలి. కొబ్బరి పిండి రొట్టెలు, బాదం పిండి రొట్టెలు, అవిసె పిండి రొట్టెలు తినొచ్చు.ఏ నిష్పత్తిలో తీసుకోవాలి?ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలోని స్థూల పోషకాలు మూడు.. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలు (హెల్దీ ఫ్యాట్స్). ఎల్సీహెచ్ఎఫ్ పద్ధతి ప్రకారం.. ఉదాహరణకు.. 172 సెం.మీ. ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ తీసుకోవాల్సినవి..నికర పిండి పదార్థాలు – 20 గ్రా.(పిండి పదార్థం నుంచి పీచును మినహాయిస్తే మిగిలేవి నెట్ కార్బోహైడ్రేట్లు)మాంసకృత్తులు – 70 గ్రా.ఆరోగ్యకరమైన కొవ్వులు – 100–150 గ్రా.ఈ మూడూ కలిపి కనిష్ఠంగా 1200 నుంచి గరిష్ఠంగా 1500 క్యాలరీల వరకు తీసుకోవాలి.ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మనిషికి వారి వారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు.. వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఆహార నియమావళికి అలవాటు పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు సమయం పట్టవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. -
అర్ధరాత్రి అతిథి
ఆ రాత్రి నాకు ఏదో చప్పుడుకి మెలకువ వచ్చింది. లేచి లైట్ వేసి పడక గదిలోంచి హాల్లోకి వచ్చాను. ఓ కొత్త వ్యక్తి నాకు కనపడ్డాడు. అతను ఎవరో, అక్కడ ఎందుకు ఉన్నాడో నాకు అర్థమైంది. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడా అని చూశాను. వంటగదిలోని వెంటిలేటర్కున్న రెండు ఇనప కడ్డీలు వంచబడ్డాయి. అతని చేతిలోని రెండున్నర అడుగుల పొడవున్న పంపు గొట్టంతోనే వాటిని వంచాడని ఊహించాను. ‘‘డబ్బు.’’ అతను చెప్పాడు. ‘‘డబ్బు?’’ ‘‘డబ్బు, నగలు ఇస్తే హాని చేయకుండా వెళ్ళిపోతాను. లేదా...’’ చేతిలోని ఆయుధాన్ని ఝళిపించాడు.గోడకి వేలాడే నా షోల్డర్ బేగ్ని అందుకుని జిప్పుని లాగాను. అందులోంచి తీసిన పర్స్ చూపించాను. దాన్ని తనవైపు విసిరేయమన్నట్లుగా సౌంజ్ఞ చేశాడు. ఆ పని చేశాను. వంగి దాన్ని అందుకుని అందులోని డబ్బుని చూసి మొహం చిట్లించాడు. ‘‘నేను అడిగింది బిచ్చం కాదు.’’ కోపంగా చెప్పాడు. ‘‘ఇంట్లో ఉన్నదంతే.’’‘‘ఇంట్లో రెండు వందల ఏభై మాత్రమే ఉందంటే నమ్మను. నగలు ఎక్కడున్నాయి?’’ అడిగాడు. ‘‘నగలు లేవు. ఇంటి పైభాగం కొత్తగా కట్టించాను. నగలు బేంక్లో తాకట్టులో ఉన్నాయి. గోల్డ్ లోన్ తీసుకున్నాను.’’అతని మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ‘‘ఈ ఇంట్లో నువ్వు, నేను తప్ప ఇంకెవరూ లేరని నాకు తెలుసు. నువ్వు మళ్ళీ నీ ఫేమిలీ ఫోటోలోని అందరినీ చూడాలనుకుంటే నేను అడిగింది ఇచ్చి పంపు.’’ కసురుతూ చెప్పాడు. ‘‘నేను అబద్ధం చెప్పలేదు.’’ ‘‘బేంక్ గోల్డ్ లోన్ కాగితాలు చూపించు.’’ ఆ తెలివైన దొంగ కోరాడు. ‘‘అవి బేంక్ లాకర్లో ఉన్నాయి.’’ ‘‘లాకర్ తాళం చెవి చూపించు.’’ రెట్టిస్తూ అడిగాడు. నా భార్య బుర్రలా నాది చురుగ్గా ఆలోచించదు. అతన్ని భౌతికంగా ఓడించలేను. నా కష్టార్జితాన్ని అతనికి అప్పగించలేను. ‘‘ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు చెప్పింది కట్టు కథని నాకు తెలుసు. మీ పడక గదిలో బట్టల అలమర లోపల గోడకి ఫిక్స్ చేసిన ఐరన్ సేఫ్ని తెరు.’’ రుసరుసలాడుతూ ఆజ్ఞాపించాడు. అందులోని నా భార్య నగల విలువ పాతిక లక్షలకి తక్కువ ఉండదు. ‘‘పద.’’ ‘‘మా ఆవిడ దాని తాళంచెవి ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు.’’ ‘‘సరే. ఆవిడకి ఫోన్ చేసి అడుగు.’’‘‘ఇప్పుడా?’’ ‘‘భార్యకి భర్త ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు. ముఖ్యంగా తన ప్రాణం మీదకి వచ్చిన సందర్భంలో. మీ ఆవిడతో తాళం చెవి గురించి తప్ప ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే తల పగులుతుంది. అందులో ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని, రేపు వాటి అవసరం ఉందని గుర్తొచ్చిందని చెప్పు. నువ్వు చెప్పిందంతా నేను నమ్మానని అనుకోక. నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే ఇస్తున్నాను. నేనీ ఇంట్లోంచి ఈ రాత్రి డబ్బు, బంగారంతో లేదా రక్తం తడిసిన చేతులతో వెళ్ళడం మాత్రం ఖాయం. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడు.’’ కఠినంగా చెప్పాడు. నేను మా ఆవిడకి ఫోన్ చేశాను. ఆమె ఆన్సర్ చేసింది. ‘‘బేంక్లో తాకట్టు పెట్టిన బంగారం రసీదు అవసరమైంది. మన లాకర్ తాళంచెవి ఎక్కడుంది?’’ అడిగాను. ‘‘మర్చిపోయారా? అక్వేరియంలో కత్తి పక్కనే.’’ ‘‘హాల్లో అక్వేరియంలో ఉంది.’’ లైన్ కట్ చేసి అతనివైపు తిరిగి చెప్పాను. ‘‘కత్తేమిటి?’’ అడిగాడు. ‘‘ఫిష్ టేంక్లోని చేపలకి ఐరన్ అందాలని ఓ కత్తిని ఉంచాం. అది ఎవరూ వెతకని చోటని అందులో లాకర్ తాళంచెవి ఉంచుతామన్న సంగతి మర్చిపోయాను.’’ అతను నా వెంట హాల్లోకి నడిచాడు. అక్వేరియంలో ఆరంజ్, నీలం రంగు చేపలు తిరుగుతున్నాయి. నేను నీళ్ళల్లో చేతిని ఉంచబోతే అరిచాడు. ‘‘ఆగు. కత్తిని తీద్దామనా? నేను తీస్తాను.’’ నన్ను పక్కకి నెట్టి అక్వేరియం నీళ్ళలో తన ఎడమ చేతిని ఉంచాడు. అరగంట తర్వాత ఆ దొంగని అంబులెన్స్లోకి ఎక్కిస్తూంటే చెప్పాను.‘‘అతనికి స్టింగ్ రే చేప ముల్లు గుచ్చుకుందని డాక్టర్కి చెప్పండి.’’ ఆ అక్వేరియంలోని చేపల్లో ఆ చేప ఖరీదైంది. కొరడాలా ఉండే దాని తోకతో కొడితే, దాని చివర ఉన్న విషపు ముల్లు ద్వారా శరీరంలోకి విషం ఎక్కి క్షణాల్లో మనిషికి స్పృహ తప్పుతుంది. మా ఆవిడ నాలా కాదు. ఏం జరుగుతోందో ఇట్టే ఊహించింది. అతనే అందులో చేతిని ఉంచాలని, కత్తిని ఉంచినట్లు అబద్ధం చెప్పింది. చెప్పాగా. ఆవిడ మెదడంత చురుగ్గా నా బుర్ర పని చేయదు.ఆ లాకర్ తాళంచెవి మంచానికి ఉన్న చిన్న రహస్య అరలో ఉందని నాకు తెలుసని మా ఆవిడకి తెలుసు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఇంటికీ నగధగలు
ఆభరణాల అలంకరణ ఇంటికీ వర్తిస్తుందని ఈ డిజైన్స్ చూస్తేనే అర్ధమవుతుంది. సంపన్నతకు అద్దం పట్టే ఈ జ్యూలరీ స్టైల్ డెకర్ ప్రత్యేక ఈవెంట్స్కు మరిన్ని హంగులను చేకూరుస్తుంది. సాధారణంగా కర్టెన్ అలంకరణ కిటికీలకు, గుమ్మాలకు స్టయిలిష్ టచ్ను జోడించడానికి ఫ్యాబ్రిక్, డిజైన్స్ ఎంపికలో శ్రద్ధ కనబరచేవారు. ఇప్పుడు వాటి మీదుగా క్రిస్టల్ లేదా ముత్యాలు, రంగు రాళ్లు, ఇతర పూసలతో చేసిన డిజైన్లు టై–బ్యాక్లు, హోల్డ్బ్యాక్లు, రింగులు అంటూ కర్టెన్ ఆభరణాలు మరింత ఆకట్టుకునేలా అందుబాటులోకి వచ్చేశాయి. ముత్యాల వరసవాడుకలో ఇవి ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. కృత్రిమ ముత్యాలు లేదా పూసల వరుసలు ప్లెయిన్ కర్టెన్లకు మరింత హంగునిస్తాయి.క్రిస్టల్ వెలుగులుకొన్ని డిజైన్లలో కాంతిని ఆకర్షించడానికి, గది అలంకరణకు విలాసవంతమైన అనుభూతిని జోడించడానికి వివిధ పూసలు, స్ఫటికాలు లేదా రైన్స్టోన్లు మంచి మెరుపునిస్తాయి.లోహాల ధగధగలుఅందమైన డిజైన్లతో లోహపు ఆభరణాలను కర్టెన్లు ఉన్న గోడలకు సెట్ చేస్తారు. కొన్నిసార్లు బంగారం లేదా వెండి లోహాలతో పూసలు, క్రిస్టల్స్ జత చేసినవీ ఇంటికి ధగధగలనిస్తాయిహుక్ రింగ్స్ కర్టెన్ హార్డ్వేర్ కూడా ‘నగల‘ సౌందర్యంతో అందుబాటులోకి ఉంటున్నాయి. మెటల్ లేదా ప్లాస్టిక్లో ఇవి లభిస్తాయి. ఈ రింగులు బంగారం, వెండి, రాగి లోహాలతో ఉంటాయి. వీటికి డిజైనర్లు ఆభరణాల హంగులన్నీ అద్దుతున్నారు. ఈ ఆభరణాలు కర్టెన్ రాడ్ చివరన, డ్రేప్లపైన సెట్ చేస్తారు. వీటిలో ఎన్నో డిజైన్ల వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. లోహాలు, నాణ్యత, డిజైన్లను బట్టి వందల రూపాయల నుంచి ఎంత ఖరీదైనా తమ స్థాయిని బట్టి ఏర్పాటు చేసుకునే వీలు ఈ ‘నగలకు’ ఉంది. – ఎన్నార్ -
Delhi Pollution: తొలగని అంధకారం.. వైద్యుల హెచ్చరికలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టేసింది. ఉదయం ఏడు గంటలు దాటినా అంధకారం తొలగిపోలేదు. వాయు నాణ్యత (AQI) 'తీవ్రమైన' విభాగంలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ఉదయం 6 గంటలకు AQIని 462గా నమోదు చేసింది. ఇది ఆరోగ్యకరమైనవారికి కూడా ప్రమాదకరమని, బయటికి వెళ్లడం లేదా వ్యాయామం చేయడం మానుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ఢిల్లీలోని మొత్తం 40 మానిటరింగ్ స్టేషన్లు ఎరుపు రంగు సూచికను చూపించాయి. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని రోహిణిలో అత్యధికంగా 499 AQI నమోదు కాగా, పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (PM2.5) ప్రధాన కాలుష్యకారిగా ఉంది. జహంగీర్పురి, వివేక్ విహార్లలో కూడా AQI 495 వద్ద ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది.దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దృశ్యమానత (visibility) గణనీయంగా తగ్గింది. ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని పట్పర్గంజ్కు చెందిన ఫొటోలలో వాహనదారులు హెడ్లైట్లు ఆన్ చేసి, నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం కనిపిస్తున్నది. AQI అనేది PM10,PM2.5,O3,SO2,NO2,CO,Pb, NH3 తదితర ఎనిమిది కాలుష్య కారకాల ఆధారంగా గాలి నాణ్యతను తెలియజేయడానికి ఉపయోగించే ఒక సాధనం. CPCB వర్గీకరణ ప్రకారం 401-500 మధ్య AQI 'తీవ్రమైన' విభాగంలోకి వస్తుంది. ఢిల్లీలో AQI 500 వద్ద పరిమితం చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ (NIAS) కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ గుఫ్రాన్ బేగ్ మాట్లాడుతూ AQI 500- 900 వద్ద ఆరోగ్య ప్రభావాలు ఒకే విధంగా ఉంటాయని, భయాందోళనలు కలగకుండా ఉండేందుకు అధిక సంఖ్యలను చూపడం లేదన్నారు. #WATCH | Delhi | Visuals from the Patparganj section of NH-24 as a layer of toxic smog blankets the city. AQI (Air Quality Index) around the area is 488, categorised as 'Severe', as claimed by CPCB (Central Pollution Control Board). CAQM (Commission for Air Quality… pic.twitter.com/RAp43VUQ4f— ANI (@ANI) December 14, 2025వాయు కాలుష్యం మరింత అధ్వాన్నంగా మారడానికి ప్రధాన కారణం స్థానిక ఉద్గారాలు మాత్రమే కాకుండా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గాలి వేగాన్ని గణనీయంగా తగ్గించాయి. గాలి దిశలో మార్పు, దిగువ వాతావరణంలో తేమ శాతం పెరగడం వంటివి కాలుష్య కారకాలు పేరుకుపోవడానికి అనుకూలంగా మారాయి. పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను నియంత్రించేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) మొదట గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ 3 కింద పరిమితులను విధించింది. ఆపై మరింత దిగజారుతున్న పరిస్థితులలో దానిని GRAP-4కి మార్చింది. 'తీవ్రమైన' విభాగంలో AQI ఉండటంతో హృదయ, శ్వాసకోశ బాధితులకు తక్షణ వైద్య అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం -
కెమెరా ఆఫ్.. భూమి ఆన్!
బిగ్బాస్లో కనిపించిన నిజమైన మనసు, సహజమైన వెలుగు భూమి శెట్టిని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆ నిరాడంబరతలో దాగి ఉన్న ధైర్యం, నిశ్శబ్దంగా పెరిగిన శక్తి ‘మహాకాళి’గా మారి సినీ ప్రపంచంలో ఒక కొత్త రూపాన్ని సృష్టించబోతోంది. ఆ ప్రయాణంలోని విశేషాలన్నీ ఆమె మాటల్లోనే మీ కోసం. నేను కర్ణాటకలోని కుందాపురలో పుట్టాను. సముద్రపు గాలి, ఇంటి ముందున్న చెట్ల నీడ, చిన్న చిన్న పండుగల హడావుడి అవే నా బాల్యపు ఆనందాలు.అమ్మానాన్న భాస్కర్ శెట్టి, బేబీ శెట్టిలది సాధారణ జీవితం, వాళ్లు నేర్పిన విలువలే నేడు నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాయి.ఇంజినీరింగ్ చేశాను. కాని, నా మనసు మాత్రం పూర్తిగా యాక్టింగ్పైనే ఉండేది. అలా నా నటన ప్రయాణం టీవీతో మొదలైంది. ‘కిన్నరి’ సీరియల్లో చేసిన ‘మణి’ పాత్ర నాకు సినిమాల ప్రపంచానికి తలుపులు తెరిచింది. 2019లో ‘బిగ్ బాస్ కన్నడ’లోకి వెళ్లినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు కాని, నా నిజమైన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. రన్నరప్గా బయటికి వచ్చినా కూడా, నాకు వచ్చిన ప్రేమ మాత్రం ఒక విజేతలా నిలిచింది.ఆ తర్వాత వచ్చిన ‘ఇక్కట్’ సినిమా ప్రేక్షకుల అభిమానం రెట్టింపు చేసింది. ఆ ప్రేమే నాకు సినిమా మీదున్న నమ్మకాన్ని మరింత బలపరచింది. తర్వాత వచ్చిన ‘షరతులు వర్తిస్తాయి’, ‘కింగ్డమ్’ వంటి ప్రాజెక్టులు నా నటనకు కొత్త షేడ్స్ ఇచ్చాయి. ప్రతి పాత్ర నాకు నాలో ఉన్న మరో భూమిని పరిచయం చేసింది.∙ఇప్పుడు నా ముందున్న పెద్ద మైలురాయి ‘మహాకాళి’. సూపర్హీరో ఫిల్మ్లో ఫీమేల్ లీడ్గా నిలవడం నాకు ఒక గౌరవం మాత్రమే కాదు. ఒక బాధ్యత కూడా. ఈ పాత్ర నా శక్తులను కొత్తగా పరీక్షించబోతోంది.∙నా రోజువారీ జీవితం మాత్రం చాలా సింపుల్. నాట్యం, కథలు, సంగీతం ఇవే నా హ్యాపీ స్పేస్.కెమెరా ముందు నటిస్తున్నంతసేపు ‘భూమి శెట్టి’ అనే వ్యక్తిని మరచిపోతాను. కాని, కెమెరా ఆఫ్ అయ్యాక మళ్లీ కుందాపుర అమ్మాయిగా నా చిన్న ప్రపంచంలోకి వెళ్తాను.∙అభిమానులు పంపే ప్రేమే నా ఎనర్జీ. వాళ్లే నా నమ్మకం. వాళ్ల వల్లే నా ప్రయాణం ప్రతి రోజూ మరింత అందంగా మారుతోంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకూ చట్టాలు రావాలి
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగులు సమయ పాలన లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారి పరిరక్షణకు చట్టాలు రావాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. వేతనాలు ఘనంగా ఉన్నా వారి వ్యక్తిగత జీవితం విరుద్ధంగా ఉంటోందని చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన ఇలాంటి రంగం గురించి పాలకులు ఆలోచించాలని సూచించింది. ఆ ఉద్యోగుల హక్కులు హరించే అధికారం ఎవరికీ లేదని ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. అగ్రిమెంట్ను పాటించకుండా రాజీనామా చేస్తున్నందుకు రూ.5.9 లక్షల పరిహారం చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేయడంపై ఫిర్యాదు చేసినా.. లేబర్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టి.. తాజాగా తీర్పు వెలువరించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సామాజిక భద్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం ఒక వ్యక్తిని చట్టబద్ధమైన వృత్తి, వాణిజ్యం, వ్యాపారం చేపట్టకుండా ఆపే ఒప్పందాలు చెల్లుబాటు కావన్నారు. ఈ కేసులో కంపెనీ ఏ ప్రాతిపదికన పరిహారం నిర్ణయించిందో తేల్చాలని కార్మీకశాఖను ఆదేశించారు. పిటిషనర్ రాజీనామాను ఆమోదించాలంటూ కంపెనీకి తేల్చిచెప్పారు. -
5 ఏళ్లు నిండక ముందే
నిరోధించగల వ్యాధుల వల్ల పిల్లల మరణాల సంఖ్య ఈ ఏడాది పెరుగుతుందని ఓ అధ్యయనం అంచనా వేసింది. ఐదో పుట్టినరోజుకు ముందే వారు లోకం విడవడం ఆందోళన కలిగించే అంశం. వాస్తవానికి ఇటువంటి మరణాలు 25 ఏళ్లుగా తగ్గుముఖం పట్టాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అధ్యయన అంశాలను పొందుపరుస్తూ గేట్స్ ఫౌండేషన్ తన గోల్కీపర్స్–2025 నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం గతేడాది ప్రపంచవ్యాప్తంగా 46 లక్షల మంది పిల్లలు ఐదేళ్ల వయసు వచ్చేలోపే మరణించారు. 2025లో ఈ సంఖ్య 48 లక్షలకు చేరుతుందని అధ్యయనం అంచనా వేసింది. నిరోధించగల వ్యాధుల వల్లే కన్నవారికి వారు దూరం అవుతున్నారని.. టీకాలు, ఇతర చికిత్సలతో కూడిన ఆధునిక వైద్యం ఈ మరణాలను నిరోధించగలదని నివేదిక స్పష్టం చేసింది. గ్లోబల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఫర్ హెల్త్ (డీఏహెచ్) నిధులు పెద్ద ఎత్తున క్షీణిస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. భారీగా తగ్గుముఖం..: డీఏహెచ్ కింద యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి ధనిక దేశాలు, స్వచ్ఛంద సంస్థలు తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాలకు ఆరోగ్య కార్యక్రమాల కోసం నిధులు సమకూరుస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థల బలోపేతం, ప్రజాశ్రేయస్సు మెరుగుదలను డీఏహెచ్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో డీఏహెచ్ 80 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. గతేడాది ఇది 49.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది మరింత తగ్గి 39 బిలియన్ డాలర్లు నమోదు కావొచ్చని అంచనా. వినాశకర పరిణామాలు..: నిధుల కోతలు కొనసాగితే పరిణామాలు వినాశకరంగా ఉంటాయని గోల్కీపర్స్–2025 నివేదిక హెచ్చరించింది. డీఏహెచ్ నిధులు 20% తగ్గితే 2045 నాటికి అదనంగా 1.2 కోట్ల మంది పిల్లలు చనిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కోతలు 30 శాతానికి చేరుకుంటే 2045 నాటికి 1.6 కోట్ల మంది పిల్లల మరణాలు సంభవిస్తాయని నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలను చంపేస్తున్న మలేరియా, హెచ్ఐవీ/ఎయిడ్స్, నవజాత శిశువులకు వచ్చే ముప్పులను నివారించే అవకాశాలూ మనముందు ఉన్నాయని గుర్తుచేసింది.పరిష్కారం ఇదిగో..ప్రాథమిక ఆరోగ్యానికి ప్రాధాన్యం: బలమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు అత్యంత తెలివైన నిర్ణయం. ఏటా ఒక వ్యక్తికి 100 డాలర్ల (రూ. 9,000) కంటే తక్కువ ఖర్చుతో ఈ వ్యవస్థలు 90% వరకు పిల్లల మరణాలను నివారించగలవు. నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధులను ముందుగానే పసిగడతాయి. సురక్షితమైన ప్రసవాలు జరుగుతాయి.ఇమ్యునైజేషన్ రెట్టింపు: నిరంతర ఇమ్యునైజేషన్ ప్రక్రియ అత్యుత్తమ విధానం. టీకాలకు ఖర్చు చేసే ప్రతి డాలర్.. ఆర్థిక, సామాజిక ప్రయోజనాల రూపంలో 54 డాలర్ల రాబడిని అందిస్తుంది. న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ల డోసుల తగ్గింపు వంటి ఆవిష్కరణలు 2050 నాటికి దాదాపు 2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఆదా చేయగలవు.తదుపరితరం ఆవిష్కరణల్లో పెట్టుబడి: 2045 నాటికి మలేరియా నివారణలో భాగంగా నూతన సాధనాలు 57 లక్షల మంది పిల్లల ప్రాణాలను కాపాడగలవు. రెస్పిరేటరీ సిన్సీíÙయల్ వైరస్, గ్రూప్–బి స్ట్రెప్టోకాకస్ వంటి ముప్పుల కట్టడి కోసం ప్రసూతి టీకాలను పెంచడం 34 లక్షల మంది పిల్లలను కాపాడగలదని అంచనా.ప్రపంచం ధనికంగా మారింది. అయినప్పటికీ అత్యంత పేద పిల్లలకు సహాయపడే డబ్బులో మనం అసమాన కోతలు విధించినందున వారిలో ఎక్కువ మంది చనిపోతుండటం విషాదకరం. మానవ చరిత్రలో అత్యంత అధునాతన శాస్త్ర, ఆవిష్కరణలను పొందగలిగిన తరం మనదే కావచ్చు. కానీ ఈ తరం ప్రాణాలను కాపాడేలా నిధులు సమకూర్చుకోలేకపోయాం. – బిల్ గేట్స్, ఛైర్మన్, గేట్స్ ఫౌండేషన్ -
గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం
గుడివాడ: నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడివాడలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం(ఢిసెంబర్ 14వ తేదీ) ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమీపంలోని ఇతర షాపులకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరిజజన్ల సాయంతో అక్కడకు వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. -
హలీం, మటన్ బిర్యానీలకు 'మెస్సీ' ఫిదా
సాక్షి, హైదరాబాద్: ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మన హైదరాబాదీ వంటకాల రుచి చూశారు. హైదరాబాదీ బిర్యానీ, హలీమ్కు ఫిదా అయ్యారు. భారత దేశ పర్యటనలో భాగంగా శనివారం భాగ్యనగరానికి వచ్చిన మెస్సీ.. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో బస చేశారు. కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన ప్యాలెస్లోని నిజాం లగ్జరీ సూట్లో గడిపారు. ఉప్పల్లో ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం రాత్రి విందులో ఆయన హైదరాబాదీ మటన్ బిర్యానీ అరగించారు. అలాగే ఆయనకు హలీమ్ను వడ్డించారు. ఇవేగాకుండా నిజాం వంటకాలైన మరగ్, పాయా, కబాబ్, పన్నీర్ టిక్కా, దాల్, నాన్ రోటీలు, ఖుబానీ కా మీటా, బడల్ కా మీటా, మలాయ్ కుల్ఫీ, ఇటాలియన్ ఫుడ్ కూడా మెనూలో పొందుపరిచారు. ఈ డిన్నర్లో సీఎం రేవంత్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫలక్నుమా ఫ్యాలెస్ అందాలకు మెస్సీ ముచ్చటపడ్డారు. ప్యాలెస్లో 101 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే నిజాం డైనింగ్ టేబుల్ను చూసి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ ఆతిథ్యం మరిచిపోలేనిదని కితాబునిచ్చారు. -
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలోని రోడ్ ఐలాండ్లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో విద్యార్థులు తుది పరీక్షలు రాస్తున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నల్లటి దుస్తులు ధరించిన ఒక ఆగంతకుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. నిందితుని జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. There is currently heavy Providence Police and Fire presence on Hope Street near Brown University. Please exercise caution and avoid this area until further notice.— Providence Police (@ProvidenceRIPD) December 13, 2025We are actively monitoring the shooting at @BrownUniversity. Our teams at @RIStatePolice and @RhodeIslandEMA are working closely with local law enforcement. Please stay clear of the area and monitor official channels for updates. Praying for our community.— Governor Dan McKee (@GovDanMcKee) December 13, 2025బారస్ అండ్ హోలీ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇది ఏడు అంతస్తుల భవనం. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఇంజనీరింగ్ డిజైన్ పరీక్ష జరుగుతోంది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ పోలీస్ టిమోతీ ఓ'హారా ప్రకారం.. నిందితుడు ముదురు రంగు దుస్తులు ధరించాడు. దాడి జరిగిన ఇంజనీరింగ్ భవనం నుండి అతను బయటకు వెళ్లడం చివరిసారిగా కనిపించింది. ఈ సందర్భంగా మేయర్ బ్రెట్ స్మైలీ మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ‘షెల్టర్-ఇన్-ప్లేస్’ అమలులో ఉందని ప్రకటించారు. క్యాంపస్ సమీపంలో నివసించే ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, పరిస్థితి సద్దుమణిగే వరకు బయలకు రాకూడదని కోరారు.గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి నిలకడగా ఉందని మేయర్ స్మైలీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన విద్యార్థులలో తీవ్ర భయాందోళనను సృష్టించింది. ఒక విద్యార్థి తన వసతి గృహంలో ప్రాజెక్ట్పై పని చేస్తుండగా సైరన్లు, సందేశం విని తన భయపడ్డానని తెలిపారు. మరో ల్యాబ్లోని విద్యార్థులు హెచ్చరిక అందగానే డెస్క్ల కింద దాక్కుని, లైట్లు ఆపివేశామన్నారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మనం బాధితుల కోసం ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేమని అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్'లో, ఎఫ్బిఐ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు. అయితే, నిందితుడు అదుపులో ఉన్నాడని మొదట చెప్పినప్పటికీ, తరువాత అతను పోలీసుల అదుపులో లేడని స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తూ, ఈ వార్తను తాను విన్నానని ఎఫ్బిఐ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నదని, బాధితుల కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ‘షాక్ అయ్యాను’.. మెస్సీ కార్యక్రమంపై మమతా క్షమాపణలు -
బాక్సాఫీస్ వద్ద దురంధర్.. దెబ్బకు పుష్ప-2 రికార్డ్ బ్రేక్..!
డిసెంబర్ తొలివారంలో రిలీజైన బిగ్ మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధర్ తెరకెక్కించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి ఈ మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేసింది. ఓవరాల్గా ఇప్పటి వరకు రిలీజైన 9 రోజుల్లో ఏకంగా రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదివారం కలెక్షన్స్ కూడా కలిపితే రూ.300 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే మొదటి వారం కలెక్షన్స్ పెరగడం ఏ సినిమాకైనా సాధ్యమే. కానీ రెండో వారంలోనూ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా దురంధర్ దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో రెండో వారంలో ఈ మూవీ ఓ క్రేజీ రికార్డ్ను అందుకుంది. రెండో శుక్రవారం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆ రోజు పుష్ప-2, ఛావా, యానిమల్ లాంటి బిగ్ హిట్స్ వసూళ్లను అధిగమించింది. హిందీలో ఈ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఫ్రైడే ఒక్క రోజే ఈ మూవీ రూ.34.7 కోట్ల వసూళ్లు సాధించింది.ఈ లిస్ట్లో పుష్ప-2 రూ.27.50 కోట్లు, ఛావా రూ.24.03 కోట్లు, యానిమల్ రూ.23.53 కోట్లు, గదర్-2 రూ.20.50 కోట్లు, బాహుబలి2 రూ.19.75 కోట్లు సాధించాయి. తాజాగా ఈ రికార్డులను రణ్వీర్ సింగ్ దురంధర తుడిచిపెట్టేసింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద రాణిస్తుండడంతో దురంధర్ మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే దురంధర్ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్గా రణ్వీర్ సింగ్.. ఐబీ చీఫ్గా మాధవన్ నటించారు. విలన్గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. HISTORIC... 'DHURANDHAR' OVERTAKES 'PUSHPA 2', 'CHHAAVA', 'ANIMAL' ON *SECOND FRIDAY*... #Dhurandhar is rewriting the record books 🔥🔥🔥.First, take a look at the *second Friday* numbers...⭐️ #Pushpa2 #Hindi: ₹ 27.50 cr⭐️ #Chhaava: ₹ 24.03 cr⭐️ #Animal: ₹ 23.53 cr⭐️… pic.twitter.com/AYRjQia5sF— taran adarsh (@taran_adarsh) December 13, 2025 -
పెరిగిన విదేశీ మారక నిల్వలు
సాక్షి, హైదరాబాద్: భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వులు) మళ్లీ పెరిగాయి. డిసెంబర్ 5తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 1.033 బిలియన్ డాలర్లు పెరిగి 687.26 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. వరుసగా రెండు వారాల తగ్గుదల తర్వాత నిల్వలు పెరగడం గమనార్హం. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం భారీగా బంగారం నిల్వల వృద్ధి కావడమే. ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు 1.19 బిలియన్ డాలర్లు పెరిగి 106.98 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే ఫారెక్స్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 151 మిలియన్ డాలర్లు తగ్గి 556.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ ఫారెక్స్ నిల్వలు గత సెప్టెంబర్లో నమోదైన 704.89 బిలియన్ డాలర్ల ఆల్టైం హైకి సమీపంలోనే ఉన్నాయని, ఇవి 11 నెలలకు పైగా దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఫెడ్ నిర్ణయంతో లోహాలకు డిమాండ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ 10న వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.5–3.75 శాతం పరిధికి తీసుకురావడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ డిసెంబర్ 12 నాటికి ఔన్స్కు 4,338 డాలర్లకు చేరి ఏడు వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. దేశీయంగా రికార్డు ధరలు దేశీయ మార్కెట్లో డిసెంబర్ 13న 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,321గా ట్రేడైంది. ‘రూపాయి బలహీనత, పెట్టుబడి డిమాండ్ కొనసాగడం బంగారం ధరలకు బలమిచ్చాయి’అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. వెండికి ఊహించని ర్యాలీ దేశంలో వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 13న దేశీయంగా వెండి ధర గ్రాముకు రూ.204.10, అంటే కిలోకు రూ.2,04,100 కు చేరింది. వారం కిందట ఇదే ధర రూ.1.87 లక్షలుగా ఉండటం గమనార్హం. సౌర విద్యుత్ ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్రక్టానిక్స్ రంగాల నుంచి పెరిగిన పారిశ్రామిక డిమాండ్, వరుసగా ఐదో ఏడాదీ కొనసాగుతున్న సరఫరా లోటు వెండి ధరలను పైకి నెడుతున్నాయి.రూపాయి పతనం ప్రభావంభారత రూపాయి డాలర్తో పోల్చితే 90 మార్క్ను దాటి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. 2025లో ఇప్పటివరకు 5 శాతానికి పైగా పడిపోవడంతో ఆసియాలో అత్యంత బలహీన కరెన్సీగా మారింది. దీని ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు మరింత భారమయ్యాయి. అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తులుగా ఈ లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. -
ఎగుమతులు అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ఎగుమతుల విషయంలో తెలంగాణ గణనీయ వృద్ధిని సాధిస్తోంది. ఒక్క ఏడాదిలోనే 5 వేల మిలియన్ డాలర్లకుపైగా రాష్ట్ర ఎగుమతుల విలువలో పెరుగుదల నమోదయింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఎగుమతుల మొత్తం విలువ 14,026 మిలియన్ డాలర్లు కాగా.. 2024–25లో అది 19,123 మిలియన్ డాలర్లకు చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్–2024–25లో గత ఎనిమిదేళ్ల (2017–18 నుంచి) ఎగుమతుల గణాంకాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ఎగుమతుల విలువలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు ఏడో స్థానం లభించింది. ఐటీ, ఫార్మానే కీలకం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఫార్మా, ఐటీ రంగాల నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ రెండు రంగాల నుంచి డ్రగ్ ఫార్ములేషన్లు, బల్క్ డ్రగ్స్, సాఫ్ట్వేర్ సంబంధిత ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2024–25లో ఐటీ ఉత్పత్తుల ఎగుమతులున్న రాష్ట్రాల్లోనే ఎక్కువగా పెరుగుదల నమోదైందని.. తెలంగాణకు ఐటీకి తోడు ఫార్మా ఎగుమతులు భారీగా ఉండటం వల్లే అత్యధిక పెరుగుదల నమోదైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ సామగ్రి, రసాయనాలు, ఏరోస్పేస్ పరికరాలతోపాటు విత్తనాలు, బియ్యం, పత్తి లాంటి వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతులు కూడా తెలంగాణ నుంచి కొనసాగుతున్నట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది. గుజరాత్ ఫస్ట్.. చండీగఢ్ లాస్ట్ దేశంలోనే అత్యధికంగా గుజరాత్ నుంచి ఎగుమతులు జరుగుతున్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2017–18లోనే దాదాపు 70 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసిన ఆ రాష్ట్రం.. 2024–25 నాటికి 1,16,332 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను ఇతర దేశాలకు పంపింది. అయితే గత మూడేళ్లుగా గుజరాత్ ఎగుమతుల విలువల్లో తగ్గుదల నమోదవుతోంది. 2022–23లో 1.46 లక్షల మిలియన్ డాలర్లుగా ఉన్న గుజరాత్ ఎగుమతులు.. ఆ తర్వాతి ఏడాదిలో 1.34 లక్షలకు, దాని తర్వాతి ఏడాదిలో 1.16 లక్షల మిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో దేశంలోకెల్లా ఎగుమతుల విలువలు అతితక్కువగా ఉన్నాయి. 2024–25లో అక్కడి నుంచి జరిగిన ఎగుమతుల మొత్తం విలువ 14 మిలియన్ డాలర్లు మాత్రమే. మరోవైపు తెలంగాణ కంటే ఎక్కువ ఎగుమతుల విలువ నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. -
జీసీసీ లీజింగ్లో హైదరాబాద్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) లీజింగ్కి సంబంధించి హైదరాబాద్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. 2020–24 మధ్య కాలంలో 18.6 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్తో దేశం మొత్తం మీద 17 శాతం వాటా దక్కించుకుంది. బెంగళూరు తర్వాత రెండో స్థానంలో నిలి్చంది. జీసీసీలపై శావిల్స్ ఇండియా రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 112 మిలియన్ చ.అ. జీసీసీల లీజింగ్లో టెక్ సిటీల త్రయం (బెంగళూరు, హైదరాబాద్, పుణె) 70 శాతం వాటా దక్కించుకుంది. ప్రతిభావంతుల లభ్యత, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) తక్కువగా ఉండటం మొదలైనవి హైదరాబాద్కి సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → 2020–24 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 262 మిలియన్ చ.అ.లుగా ఉండగా, అందులో జీసీసీ లీజింగ్ వాటా 112 మిలియన్ చ.అ.తో 43 శాతంగా నమోదైంది. → హెల్త్కేర్, ఫార్మా జీసీసీల విషయంలో బెంగళూరు, పుణెలతో పాటు హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. జీనోమ్ వేలీలాంటి వ్యవస్థలు ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయి. బీఎఫ్ఎస్ఐ, ఇంజినీరింగ్ రంగాల జీసీసీలకు కూడా నగరం కేంద్రంగా నిలుస్తోంది. → దేశీయంగా ప్రస్తుతం 1,800 జీసీసీలు ఉండగా, 19 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 2,200 జీసీసీలు, 28 లక్షల మంది ఉద్యోగులకు చేరనుంది. → సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసులు, బీఎఫ్ఎస్ఐ, ఇంజినీరింగ్–తయారీ, ఫార్మా, రిటైల్, కన్జూమర్ సర్వీసుల ఆధిపత్యం కొనసాగనుంది. → సంప్రదాయ ఐటీ సరీ్వసుల ఉద్యోగాలతో పోలిస్తే జీసీసీల్లో జీతభత్యాలు 12–20 శాతం అధికంగా ఉంటున్నాయి. ఏఐ/ఎంఎల్, డేటా ఇంజినీరింగ్, సైబర్సెక్యూరిటీ, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్లాంటి అధునాతన అంశాలకు ప్రాధాన్యత ఉంటోంది. → రాబోయే రోజుల్లో 2030 నాటికి జీసీసీల లీజింగ్ ఏటా 30 మిలియన్ చ.అ. మేర పెరగనుంది. → 2025–30 మధ్య కాలంలో భవిష్యత్తులో దేశీయంగా ఏర్పాటయ్యే జీసీసీల్లో ఆటోమోటివ్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్ కేంద్రాల వాటా 30 శాతంగా ఉంటుంది. → అంతర్జాతీయంగా 100 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఆదాయాలు ఉండే జీసీసీ సెగ్మెంట్ కంపెనీలకు వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. → నిపుణుల లభ్యత, తక్కువ నిర్వహణ వ్యయాలు, పాలసీ సంస్కరణలు, కొత్త ఆవిష్కరణలు మొదలైనవి భారత్ను అగ్రగామి జీసీసీ హబ్గా నిలుపుతాయి. -
ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 19% వృద్ధి
ముంబై: పండగ సీజన్ తర్వాత కూడా ప్యాసింజర్ వాహనాలకు (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్లు) డిమాండ్ కొనసాగింది. ఈ నవంబర్లో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,12,405 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే నవంబర్లో సరఫరా 3,47,522తో పోలిస్తే ఇది 19% అధికంగా ఉందని భారత వాహన తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. కార్ల తయారీ అగ్రగామి మారుతీ సుజుకీ సరఫరా 1,41,312 నుంచి 21 % పెరిగి 1,70,971 యూనిట్లకు చేరింది. మహీంద్రా అండ్ మహీంద్రా 56,336 యూనిట్లను సరఫరా చేసింది. ఇదే నవంబర్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా డీలర్లకు 50,340 యూనిట్లను పంపిణీ చేసింది. ∙ద్వి చక్రవాహనాల పంపిణీలో 21% వృద్ధి నమోదైంది. ఈ నవంబర్లో మొత్తం సరఫరా 16,04,749 యూనిట్ల నుంచి 19,44,475 చేరింది. మోటార్సైకిల్ విభాగంలో 11,63,751 యూనిట్లు, స్కూటర్ల విభాగంలో 7,35,753 యూనిట్ల సరఫరా జరిగింది. అయితే మోపెడ్ సిగ్మెంట్లో 2% క్షీణత నమోదైంది. మొత్తం 45,923 యూనిట్ల నుంచి 44,971 యూనిట్లకు పరిమితమయ్యాయి. త్రీ వీలర్స్ అమ్మకాలు 21% వృద్ధితో 71,999 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘పండుగ డిమాండ్ కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణ దన్ను భారతీయ ఆటో పరిశ్రమ నవంబర్లోనూ అమ్మకాల జోరును కనబరించింది. ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీ వీలర్స్ విభాగాలకు సంబంధించి ఈ ఏడాదిలో నవంబర్ అత్యధికంగా అమ్ముడైన నెలగా రికార్డు సృష్టించింది. ప్రజారంజకనమైన ప్రభుత్వ సంస్కరణలు, మెరుగుపడుతున్న మార్కెట్ సెంటిమెంట్తో వచ్చే ఏడాది (2026)లోనూ ఇదే వృద్ధి నమోదవుతుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది’’ అని సియామ్ డైరెక్టర్ రాజేశ్ మీనన్ తెలిపారు. -
గిరిజన గళానికి గిన్నిస్ కిరీటం!
పుణే: భారతదేశం మరోసారి విశ్వ వేదికపై మెరిసింది. ఈసారి ఒక సాంస్కృతిక ఘనతతో, పుణే నగరం ’అత్యధిక పోస్టర్ల ప్రదర్శన’లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద పుస్తక మహోత్సవంలో భాగంగా ఈ చారిత్రక రికార్డు నెలకొల్పింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగ్రీకర్ శనివారం ఈ రికార్డును ధ్రువీకరించారు. అత్యధిక పోస్టర్ల ప్రదర్శన రికార్డులో అమెరికాను వెనక్కి నెట్టి, ఈ ఘనతను భారత్ సొంతం చేసుకుందని ప్రకటించారు. బిర్సా ముండాకు అంకితం ప్రపంచ రికార్డు సృష్టి వెనుక ఒక విశిష్ట లక్ష్యం ఉంది. ఈ రికార్డును గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండాకు నివాళిగా అంకితం చేశారు. పుస్తక మహోత్సవ కనీ్వనర్ రాజేష్ పాండే మాట్లాడుతూ, గిరిజన సమాజం, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి బిర్సా ముండా చేసిన సేవలను గౌరవించేందుకు ఒక ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన పదజాలంతో కూడిన పోస్టర్ల ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు. 1,678 పోస్టర్లతో భారతీయ అస్తిత్వం ఫెర్గుసన్ కళాశాలలో జరుగుతున్న పుణే పుస్తక మహోత్సవంలో ఈ రికార్డును నెలకొల్పారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం, గిరిజన పదాలను ప్రదర్శిస్తూ ఏకంగా 1,678 పోస్టర్లను ప్రదర్శించారు. గతంలో అమెరికాలో ఫిబ్రవరి 2025లో 1,365 పోస్టర్లతో నెలకొలి్పన రికార్డును ఈ ప్రదర్శన బద్దలు కొట్టింది. డిసెంబర్ 12న పుణే బుక్ ఫెస్టివల్, యశ్వంత్రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, రైజ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ రికార్డును సాధించినట్లు గిన్నిస్ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. అంతరిస్తున్న భాషల పరిరక్షణ సామాజిక కార్యకర్త గిరీష్ ప్రభూణే మాట్లాడుతూ, బిర్సా ముండా కృషి బహుముఖమైనదని కొనియాడారు. ‘అంతరించిపోతున్న మాండలికాలను పరిరక్షించడం అత్యవసరం. వాటిని దేవనాగరి లిపిలో నమోదు చేస్తే.. గిరిజన భాషలలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలవుతుంది’.. అని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ పుణే పుస్తక మహోత్సవం, పుస్తక ప్రదర్శన మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, భాషా పరిరక్షణకు ఒక శక్తివంతమైన వేదికగా నిలిచింది. ఈ రికార్డు విజయంతో, పుణే నగరం పుస్తకాల పండుగను కేవలం వినోద కార్యక్రమంగా కాకుండా, సామాజిక చైతన్యం, సాంస్కృతిక గౌరవానికి చిహ్నంగా మార్చింది. -
ఏకీకృత న్యాయ విధానం ఉండాలి: సీజేఐ
జైసల్మీర్: నేడు ఏకీకృత న్యాయవిధానం అవసరం ఎంతో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ప్రమాణాలు, విధానాలను ఏకీకృతం చేసేందుకు ఆధునిక సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. దీనివల్ల పౌరులు దేశంలో ఎక్కడ ఉన్నా నిరంతరంగా సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశమేర్పడుతుందని తెలిపారు. సమాఖ్య విధానం కారణంగా హైకోర్టులకు వేటికవి సొంత విధానాలు, సాంకేతికపరమైన సామర్థ్యాలను కలిగి ఉన్నాయంటూ ఆయన..ఇటువంటి అవరోధాలను సాంకేతిక సాయంతో, ఏకీకృత న్యాయ విధానంతో తొలగించుకోవచ్చని సీజేఐ చెప్పారు. జైసల్మీర్లో శనివారం జరిగిన వెస్ట్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ న్యాయవ్యవస్థ (నేషనల్ జ్యుడీషియల్ ఈకోసిస్టమ్) అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దేశ న్యాయ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలని పిలుపునిచ్చారు. -
ప్రధాన సమాచార కమిషనర్గా గోయల్
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి రాజ్కుమార్ గోయల్ను కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక ప్యానెల్ బుధవారం సమావేశమై గోయల్ పేరును సీఐసీ పదవికి సిఫార్సుచేసినట్లు శనివారం ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సీఐసీగా గోయల్తోపాటు మరో ఎనిమిది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్(ఐసీ)లను కొత్తగా ప్యానెల్ సిఫార్సుచేసింది.గోయల్ చేత సీఐసీగా సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయిస్తారు. అరుణాచల్ ప్రదేశ్–గోవా–మిజోరం–యూనియన్ టెరిటరీస్(ఏజీఎంయూటీ) క్యాడర్కు చెందిన 1990 బ్యాచ్(రిటైర్డ్) ఐఏఎస్ అధికారి అయిన గోయల్ ఇటీవల కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిగా సేవలందించారు. గతంలో ఈయన కేంద్ర హోం శాఖలో సరిహద్దు నిర్వహణ విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. అవిభాజ్య జమ్మూకశీ్మర్ రాష్ట్రంతోపాటు కేంద్రప్రభుత్వంలో పలు పదవుల్లో సేవలందించారు. సెపె్టంబర్ 13వ తేదీన ప్రస్తుత సీఐసీ హీరాలాల్ సమారియా రిటైర్ కావడంతో అప్పట్నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజ్గోయల్ను సీఐసీ పదవికి ఎంపికచేశారు. కొత్త కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించాక దాదాపు 9 ఏళ్ల తర్వాత కమిషన్ గరిష్ట సామర్థ్యంతో పనిచేయనుంది. బుధవారం 8 మందిని ఐసీలుగా సిఫార్సుచేయగా ఇప్పటికే ఆనందీ రామలింగం, వినోద్ కుమార్ తివారీలు ఐసీలుగా పనిచేస్తున్నారు. సమాచార కమిషనర్(ఐసీ) పోస్ట్కు ప్రభుత్వం ఎంపికచేసిన 8 మందిలో సీనియర్ పాత్రికేయులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ బోర్డ్లో లీగల్ సభ్యురాలైన రేలంగి సుధారాణి, మాజీ రైల్వేబోర్డ్ చీఫ్ జయవర్మ సిన్హా, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, సెంట్రల్ సెక్రటేరియట్ సరీ్వస్ మాజీ అధికారి సంజీవ్ కుమార్ జిందాల్, మాజీ ఐఏఎస్ అధికారి సురేంద్ర సింగ్ మీనా, మాజీ ఇండియన్ ఫారెస్ట్ సరీ్వస్ అధికారి కుష్వంత్ సింగ్ సేథీ ఉన్నారు. -
సన్ క్యాండిల్
సకల ప్రాణకోటికి దినకరుడే ప్రత్యక్ష దైవం. నిత్యం ఉదయిస్తూ, అస్తమిస్తూ ప్రకృతిలో భిన్న కాలాలకు సూరీడే కారణభూతంగా నిలుస్తున్నాడు. సకల చరాచర జీవకోటికి శక్తిప్రదాతగా దేదీప్యమానంగా వెలిగిపోయే సూర్యుడు ఇదే ప్రకృతిలో ఎన్నెన్నో వింతలకు హేతువుగా ఉన్నాడు. అందులో ఒకటే సన్ క్యాండిల్. సముద్ర మట్టం నుంచి అత్యంత ఎత్తులో కదలాడే సిర్రస్ మేఘాల్లోని స్ఫటిక మంచు బిందువుల కారణంగా ఈ సూర్య కొవ్వుత్తులు వెలిగి చూపరులకు నేత్రానందం కల్గిస్తున్నాయి. తాజాగా ఆ్రస్టియాలోని ఒక మంచుమయ పర్వత సానువుల్లో స్కీయింగ్ చేస్తున్న ఒక బృందం ఎదుట ఈ సన్ క్యాండిల్ ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి వాళ్లంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అత్యంత అరుదైన ఈ వింతను అక్కడి స్కీయర్ లెంకా ల్యాంక్ వెంటనే తన కెమెరాకు పనిచెప్పారు. ల్యాంక్ తీసిన ఈ వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘‘సైన్స్ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్లుగా హఠాత్తుగా ఏర్పడిన ఈ వింతను చూసి కంగారుపడ్డా. దగ్గరికెళ్లి చూద్దామనుకున్నాగానీ భయపడిపోయా. ఎందుకంటే సమాంతర విశ్వానికి ఇది ముఖద్వారమేమో అన్నట్లు అనిపించింది’’అని లెంకా ల్యాంక్ వీడియో లైసెన్సింగ్ వేదిక అయిన ‘వైరల్హోగ్’లో రాసుకొచ్చారు.ఎలా ఏర్పడుతుందంటే?.. ఇదొక సూర్యకాంతి సంబంధ దృగి్వషయం. సిర్రస్ మేఘాల మీదుగా కాంతి నేల మీదపై పడే సందర్భాల్లో ఈ సన్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. మంచు పొగలో కోట్ల సంఖ్యలో అతి సూక్ష్మ, స్ఫటికాకార, సమతల మంచు బిందువులు ఉంటాయి. వీటిల్లో కొన్ని భూమికి సమాంతరంగా ఏర్పడినప్పుడు చూడ్డానికి అవన్నీ స్ఫటికాల్లా ప్రవర్తిస్తాయి. అంటే అద్దంలా అన్నమాట. తమ మీద పడిన కాంతిని అచ్చంగా మళ్లీ అదే దిశలో పరావర్తనం చెందిస్తాయి. అలా పై నుంచి కిందకు వచ్చే కాంతి కిరణాలను ఈ స్ఫటిక బిందువులు తిరిగి ఎగువ దిశలో పంపిస్తాయి. దీంతో వెండి రంగులో దేదీప్యమానంగా వెలిగిపోయే కొవ్వొత్తులు ఏర్పడతాయి. సాధారణంగా పర్వత శిఖరాల వంటి అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో సన్ క్యాండిల్ ఆవిష్కృతమవుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లోనే ఈ క్యాండిళ్లు ఏర్పడే అవకాశాలుంటాయి. సూర్యకాంతి పుంజం ఇలా పడి మళ్లీ అలా పైకి వెళ్తుండటంతో వీటిని సూర్య స్తంభాలు అని కూడా అంటారు. విమానాల్లోంచి కిందకు చూసినప్పుడు కూడా మంచు పర్వతాల సమీపంలో ఇలాంటి కాంతి కొవ్వొత్తులను చూడొచ్చు. ఎంత ఎక్కువగా స్ఫటిక మంచు బిందువులు ఒకే కోణంలో ఏర్పడతాయో అంతగా అతిపెద్ద కొవ్వొత్తి ఏర్పడుతుంది. అప్పుడు దానిని నేరుగా కంటితో చూడలేం. అంత ధగద్దాయమానంగా అది వెలిగిపోతుంది. మేఘాల లోపలి నుంచి దూసుకెళ్తున్నప్పుడు ఇలాంటివి కొన్ని సార్లు విమాన కాక్పిట్లోని పైలట్ల కంట పడతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తతలు
ఢాకా: సాంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హాదీపై కాల్పుల ఘటన బంగ్లాదేశ్లో అలజడి సృష్టించింది. తీవ్రంగా గాయపడిన హాదీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా దేశవ్యాప్తంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆపద్ధర్మ ప్రభుత్వా ధిపతి మహ్మద్ యూనస్ భద్రతాధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇంక్విలాబ్ మంచ్ నేత హాదీ వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఎన్ని కల్లో పోటీ చేయనున్నారు. సెంట్రల్ ఢాకాలోని బిజొయ్నగర్ ప్రాంతంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దగ్గర్నుంచి కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు భద్రతపై భరో సా కల్పించేందుకు, అక్రమ ఆయుధాల బెడద ను తొలగించేందుకు రెండో దశ ఆపరేషన్ డేవిల్ హంట్ను త్వరలో మొదలు పెడతామని హోం శాఖను పర్యవేక్షిస్తున్న రిటైర్డు లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి మీడియాకు తెలిపారు. మాజీ మంత్రి నివాసంపై ఫిబ్రవరిలో దాడి జరి గిన నేపథ్యంలో ప్రభుత్వం ఆపరేషన్ డేవిల్ హంట్ మొదటి దశను చేపట్టింది. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులే ఈ ఆపరేష న్ లక్ష్యమని ఆరోపణలున్నాయి. హాదీపై కాల్పు లు జరిపిన దుండగుల్లో ఒకడైన ఫైజల్ కరీం మసూద్ గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.37 లక్షల వరకు బహుమానం అందజేస్తామ ని చౌదరి ప్రకటించారు. హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలకంగా ఉన్నారు. అప్పటి ఉద్యమ నేతలకు ప్రత్యేక భద్రత కల్పిస్తామని చౌదరి తెలిపారు. హాదీపై జరిగిన హత్యాయత్నాన్ని ఇంక్విలాబ్ మంచ్ తీవ్రంగా ఖండించింది. నిషేధిత అవామీ లీగ్ నేతలందరినీ ఉగ్రవాదులుగా పేర్కొన్న ఇంక్విలాబ్ మంచ్.. వారందరినీ అరెస్ట్ చేయాలంటూ శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలతో ఉ ద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ పార్టీని భూస్థాపి తం చేయాలని మంచ్ డిమాండ్ చేస్తోంది. -
ఆసియాలోనే పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని ప్రముఖ పర్యా టక ప్రాంతం గుల్మార్గ్లో ఆసియాలోనే అత్యంత పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్ ఏర్పాటైంది. దీనిని శనివారం సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారు. స్కైయింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరున్న గుల్మార్గ్లో దీనివల్ల స్కైయింగ్ మౌలికవసతులు మరింతగా మెరుగయ్యాయని సీఎం చెప్పారు. అంతర్జాతీయ వింటర్ స్పోర్ట్స్ మ్యాప్లో గుల్మార్గ్ కూడా చేరినట్లయిందని చెప్పారు. బారాముల్లా జిల్లా కొంగ్డొరి వద్ద రూ.3.65 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ స్కై డ్రాగ్ లిఫ్టు పొడవు 726 మీటర్లు. పైన వేలాడుతున్న కదిలే బార్ను పట్టుకుని బోర్డుపై నిలబడిన వ్యక్తిని ఇది ఎత్తయిన ప్రదేశంపైకి లాక్కెళుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా గుల్మార్గ్లోని అఫ్ఫర్వాత్లో ఏర్పాటైన ప్రపంచంలోనే ఎత్తయిన రివాల్వింగ్ మల్టీపర్సస్ హాల్ను కూడా ప్రారంభించారు. గుల్మార్గ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.17 కోట్లతో నెలకొల్పిన పలు పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించారు. అదేవిధంగా, వింటర్ ట్రెయినింగ్ వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ స్కైయింగ్ ట్రెయినింగ్ అడ్వంచర్ టూరిజమ్ సెంటర్ను, ఇంటిగ్రేటెడ్ స్కై ట్రెయినింగ్ కోర్సులను కూడా ఆయన ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ పర్యాటక రంగంలో గుల్మార్గ్కు ప్రముఖ స్థానం ఉందని సీఎం ఒమర్ చెప్పారు. పూర్తిస్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అ త్యాధునిక, అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం పెట్టుబడుల అవసరముందని తెలిపారు. దీనివల్ల ఏడాదంతా పర్యాటక రంగ అవకాశాలుండటంతోపాటు స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. -
పథకాల పేర్ల మార్పులో కేంద్రం మాస్టర్
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) బిల్లు పేరును మారుస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పథకాల పేర్లను మార్చడంలో మోదీ ప్రభుత్వం దిట్ట అంటూ ఎద్దేవా చేసింది. మహాత్మాగాంధీ అనే పేరుంటే వచ్చిన ఇబ్బందేమిటని నిలదీసింది. శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. పథకాలు, చట్టాల పేర్లను మార్చడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిట్ట. గతంలో నిర్మల్ భారత్ అభియాన్ను స్వచ్ఛ భారత్ అభియాన్గా, గ్రామీణ ఎల్పీజీ పంపిణీ కార్యక్రమాన్ని ఉజ్వల యోజనగా మార్చారు. ఇలా రీ ప్యాకేజింగ్, బ్రాండింగ్లో బీజేపీ వాళ్లు సిద్ధహస్తులు. ఇప్పటిదాకా వాళ్లు పండిట్ నెహ్రూను మాత్రమే ద్వేషించారు. ఇప్పుడు మహాత్మాగాంధీ పేరు కూడా వారికి నచ్చడం లేదు. అందుకే, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్య బాపు ఉపాధి హామీ పథకంగా మార్చారు’ అని జైరాం రమేశ్ ఆరోపించారు. పేరు మార్చినంత మాత్రాన మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలే గ్రామాల రూపురేఖల్ని మార్చిన ఈ పథకానికి ఆద్యులన్న విషయం ప్రజలు మర్చిపోరని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఇదే పథకాన్ని వైఫల్యానికి చిరు నామాగా పేర్కొన్న ప్రధాని మోదీ, విప్లవాత్మ కమైన మార్పును తీసుకువచ్చిన ఈ పథకం ఘనత తమదేనని చెప్పుకునేందుకే పేరు మా ర్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థా గత) కేసీ వేణుగోపాల్ శనివారం ఎక్స్లో ఆరో పించారు. భారతావనికి గ్రామాలే పట్టుగొమ్మ లు అని ప్రవచించిన మహా త్ముడి పేరును లేకుండా చేసేందుకే మోదీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. పథకానికి నిధుల కేటాయింపుల్లో ఏడాదికే డాది కోత విధించడంతోపాటు చెల్లింపులు సైతం లేకపోవడంతో బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయన్నారు. మొత్తంగా ఈ పథకాన్ని ఎత్తి వేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నిర్లక్ష్యాన్ని దాచి పెట్టడానికి కేంద్రం తీసుకున్న కంటి తుడుపు చర్య మాత్రమే నని పేర్కొన్నారు. వాస్తవానికి, ఈ ప్రభుత్వా నికి సంక్షేమ పథకాలపై సదుద్దేశం లేదు. ఏం చేయాలో తెలియనప్పుడు, ఇలాంటి చర్యల తో ఏదో చేసినట్లుగా ప్రజల ముందు నటి స్తోందని దుయ్యబట్టారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరును మార్చుతూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలపడం తెల్సిందే. ఇకపై ఈ పథ కాన్ని పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజ నగా పిలుస్తారు. అదేవిధంగా, పనిదినాల సంఖ్యను ప్రస్తుత మున్న 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచనున్నారు. -
నా వేతనాన్ని పేదల సంక్షేమానికి వినియోగించండి
భువనేశ్వర్: తన వేతనం, అలవెన్సులను పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ఒడిశా మాజీ సీఎం, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం సీఎం మోహన్ చరణ్ మాఝీకి రాసిన లేఖలో తెలిపారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ప్రకారం..ప్రతిపక్ష నేత నెలవారీ వేతనం, అలవెన్సులు కలిపి రూ.3.62 లక్షలకు చేరాయి. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని నవీన్ పట్నాయక్ సీఎంను కోరారు. ఒడిశా ప్రజల ప్రేమ, అభిమానాలు తనకు చాలునన్నారు. కటక్లోని తమ పూర్వీకుల నివాసం ఆనంద్ భవన్ను కూడా 2015లోనే ప్రజల కోసం దానం చేసినట్లు చెప్పారు. తన తండ్రి బిజూ పట్నాయక్ సీఎంగా ఉన్న 1990–1995 కాలంలో నెల వేతనంగా రూ.1 మాత్రమే తీసుకున్నారని గుర్తు చేశారు. -
18 ఏళ్ల వేట
కాలం మారినా.. చట్టం మాత్రం నిద్రపోలేదు. తన వేటను ఆపలేదు. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం.. అంటే 2007లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు సాగించిన సుదీర్ఘ వేట ఎట్టకేలకు ముగిసింది. చిన్నారిపై ‘హత్యాచారం’ తరువాత, నిందితుడు సరిహద్దులు దాటి అదృశ్యమయ్యాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. నేపాల్ అడవుల్లోని అజ్ఞాతం.. యూపీలోని ఇటుక బట్టీలో దాక్కున్న రహస్యం.. ఇవేవీ చట్టం కళ్లుగప్పలేకపోయాయి. ఎట్టకేలకు మీరా భయందర్–వసాయ్ విరార్ (ఎంబీవీవీ) పోలీసులకు కీచకుడు పట్టుబడ్డాడు. క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదన్ బల్లాల్ తెలిపిన వివరాలివి. అది కాళరాత్రి మాణిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ అమానుష ఘటన. 2007 మార్చి 31 రాత్రి, 22 ఏళ్ల నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మ అనే యువకుడు ఒక చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోబరుచుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామున బాలిక ఉసురు తీశాడు. అత్యాచారం, హింసతో పాటు, చివరకు ఉరితాడు బిగించి ఆమెను హత్య చేశాడు. నేపాల్కు పరారైన హంతకుడు నేరం చేసిన వెంటనే, నందు విశ్వకర్మ అంతర్జాతీయ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయాడు. అతను చాలా ఏళ్లు అక్కడే అజ్ఞాతంలో గడిపాడు. ఆ కేసు ఫైల్ మాణిక్పూర్ పోలీసుల దగ్గర దుమ్ము పట్టి ఉన్నా, దర్యాప్తు అధికారులు మాత్రం వదిలేయలేదు. అతి ముఖ్యమైన క్లూ.. వేట మొదలు అయితే.. ఇటీవల కేసును మళ్లీ తిరగదోడిన క్రైమ్ డిటెక్షన్ సెల్–2, వసాయ్ బృందానికి ఊహించని క్లూ దొరికింది. నిందితుడు పాత జీవితాన్ని వదిలి, యూపీకి తిరిగి వచి్చ, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని స్వగ్రామం ఖర్దౌరీలో ఇటుక బట్టీలో కూలీగా దాక్కుని ఉన్నాడని తెలిసింది. దీంతో ఏసీపీ మదన్ బల్లాల్ నాయకత్వంలో, సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కుర్హాడే బృందం తక్షణమే కదిలింది. పట్టుబడిన క్షణం నిందితుడి ఆచూకీ పక్కాగా ధ్రువీకరించుకున్నాక.. డిసెంబర్ 10న యూపీలోని ఖర్దౌరీకి చేరుకున్న పోలీసు బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 18 ఏళ్లుగా స్వేచ్ఛా జీవితం గడిపిన విశ్వకర్మ, తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఊహించలేకపోయాడు. చివరకు నంద్లాల్ అలియాస్ నందు రాందాస్ విశ్వకర్మను డిసెంబర్ 10న అతని స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని ఖర్దౌరీలో అరెస్టు చేసి మహారాష్ట్రకు తరలించారు. నిజం నిప్పులాంటిది ఎంతకాలం దాచినా, పాపం పండక తప్పదు. న్యాయం ఆలస్యమై ఉండవచ్చు.. కానీ జరిగి తీరుతుంది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిని చిదిమేసిన హంతకుడికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత సంకెళ్లు పడటమే దీనికి నిదర్శనం. చట్టంపై విశ్వాసాన్ని నిలబెడుతూ పోలీసులు సాగించిన వేట నేటితో ముగిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెన్నోబులేసునికి.. రాజకీయ గ్రహణం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కార్యనిర్వహణాధికారి (ఈఓ) దీర్ఘకాలిక సెలవుల కారణంగా ఆలయ నిర్వహణ – మాన్యం భూముల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మాన్యం భూములు దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు లీజు ఎగ్గొట్టడమే కాకుండా అనధికారికంగా భూములు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉరవకొండ/అనంతపురం కల్చరల్: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాల భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అనంతపురం జిల్లా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సాగాల్సిన పాలనా వ్యవహారాలపై చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) గా ఎవ్వరు వచ్చినా కొద్దిరోజులకే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భూముల లీజుల కేటాయింపు–నిధుల ఖర్చు చేయాలంటూ వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉండే ఆలయంలో ఏమి జరిగినా దిక్కు లేకుండా పోతోంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2,114 ఎకరాల మాన్యం ఉంది. ఇందులో 146 ఎకరాల ఈనామ్ భూమి, 412 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. మిగతా 1,554 ఎకరాలు ఆమిద్యాల, మోపిడి, కోనాపురం, పెద్దముస్టూరు, మూలగిరిపల్లి, రాచెర్ల, చిన్నముసూ్టరు పరిధిలో ఉన్నాయి. ఆలయ మాన్యాలు కొంతమంది అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయి. సొంత భూములు ఉన్నా సరే నామమాత్రపు కౌలు చెల్లిస్తూ కొన్నేళ్లుగా ఆలయ భూమిని అనుభవిస్తున్నారు. సాధారణంగా వర్షాధారం అయితే ఎకరాకు రూ.6 వేలు, సాగునీటి సౌకర్యం ఉంటే ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలు చెల్లించాల్సి ఉన్నా.. ఇక్కడ నారసింహుడికే నామాలు పెట్టి ఎకరాకు నామమాత్రంగా రూ.500 నుంచి రూ.2,500 ఏడాదికి చెల్లిస్తున్నారు. కౌలుదారుల్లో చాలామంది అనధికారికంగా సబ్లీజుకు ఇచ్చుకున్నారు. కొందరు అధికార పార్టీ నేతలైతే కౌలు భూమి తమ సొంత ఆస్తి అయినట్టు ఇతరులకు విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి సుమారు 1,400 ఎకరాలకు సంబంధించి కౌలు లీజు ముగిసినా నేటికీ ఆలయ భూములకు బహిరంగ వేలం పాటను అధికారులు నిర్వహించలేదు. 20 శాతం మంది మాత్రమే అసలైన కౌలుదారులు సక్రమంగా ఆలయానికి సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయ భూముల టెండర్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు అన్నీ తామై సిండికేట్గా మారి టెండర్లు దక్కించుకోవాలని చూడటంతో గతేడాది ఆగస్టు నుంచి వరుసగా మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఏడాదికి సగటున 20 వేల మంది స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. 2024–25 ఏడాదికి ఉరవకొండకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు రూ.27 లక్షలకు తలనీలాల సేకరణ హక్కులను దక్కించుకున్నాడు. అయితే ఇందులో రూ.9.5 లక్షలు మాత్రమే సదురు టీడీపీ నాయకుడు ఆలయానికి చెల్లించి, మిగతా సొమ్ము నేటికీ జమ చేయలేదు. ఈ సొమ్ములో కూడా గతంలో ఈఓగా విధులు నిర్వహించిన ఓ అధికారి తన సొంతానికి రూ.3 లక్షలు వాడుకున్నట్లు ఆలయ సిబ్బందే గుసగులాడుకోవడం గమనార్హం. భక్తులు పరమపవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం పెన్నహోబిలంలో కొంతకాలంగా కనుమరుగైంది. లడ్డూ ప్రసాదం టెండరు ప్రక్రియ ఆగిపోయి చాలా కాలమైంది. అధికార పార్టీ నేతలు – దేవదాయ శాఖ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో భక్తులకు లడ్డూ ప్రసాదమే లేకుండా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా రమేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. అయితే టీడీపీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో భరించలేకపోయిన ఆయన దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు. దీంతో అప్పటి జిల్లా సహాయ కమిషనర్ (ఏసీ) తిరుమలరెడ్డికి ఆలయ ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనకూ అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పలేదు. దీంతో ఆయన కూడా సెలవులోకి వెళ్లిపోయారు. తదుపరి ఈఓ బాధ్యతలు గుంతకల్లుకు చెందిన మల్లికార్జున తీసుకుంటారని ఎండోమెంటు అధికారులు చెప్తున్నా.. ఆయన మాత్రం ముందుకు రాలేదు. ఈ క్రమంలో అనంతపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం ఈఓగా ఉన్న సుధారాణికి తాత్కాలికంగా పెన్నహోబిలం ఆలయ బాధ్యతలు అప్పగించారు. పెన్నహోబిలం ఆలయ నూతన పాలక మండలి ఇంకా కొలువుదీరలేదు. అయినా సభ్యులుగా తామే ఉంటామని, మేము చెప్పినట్లుగా మీరు పనిచేయాల్సి ఉంటుందని కొందరు అధికార పార్టీనేతలు ఈఓలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి అయ్యే రూ.5 లక్షల ఖర్చును ఆలయ నిధుల నుంచే వెచ్చించాలని షరుతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఈ అంశం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. చేసేది లేక సెలవుపై వెళ్తున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం పెన్నహోబిలంలో మేం గుర్తించిన సమస్యలను పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ కొన్నాళ్లుగా ఈఓ లేనిమాట నిజమే. సెలవులో ఉన్న తిరుమలరెడ్డి ఈ నెల 19న వస్తారు. అప్పటి వరకు నేను ఇన్చార్జ్గా మాత్రమే కొనసాగుతాను. కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా మేము కూడా ఎండోమెంటు ఇన్స్పెక్టర్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. – సుధారాణి, పెన్నహోబిలం ఆలయఇన్చార్జ్, దేవదాయ శాఖ ఇన్చార్జ్ ఏసీ -
ఢీ కొట్టింది నేనే!
ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ప్రవర్తనే మన విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. ఆ్రస్టేలియాలోని ఒక పార్కింగ్ స్థలంలో జరిగిన సంఘటన, అక్కడి పౌరుల నైతికతకు అద్దం పట్టింది. ఎవరో ఒక వ్యక్తి, అనుకోకుండా పార్క్ చేసిన కారును ఢీకొట్టాడు. మన ఊహ ప్రకారం.. భయపడిపోవాలి.. పలాయనం చిత్తగించాలి. మౌనంగా ఉండాలి.. కానీ అక్కడ జరిగింది వేరు. ఆ వ్యక్తి పరారైపోలేదు. జరిగిన నష్టానికి నైతిక బాధ్యత స్వీకరించాడు. తన పేరు, చిరునామా, బీమా వివరాలను ఒక కాగితంపై రాసి పెట్టాడు. విదేశాల్లోని పౌర స్పృహ, నిజాయితీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసిన దేవాంగ్ సేథి అనే భారతీయుడు ఈ సంఘటన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు.కాగితంపై ఏముంది? వీడియోలో సేథి మాట్లాడుతూ, తాను ఒక పార్క్లో ఉన్నప్పుడు ఈ నోట్ను గమనించానన్నారు. ఎవరో ఒక వ్యక్తి అనుకోకుండా మరో కారును ఢీకొట్టాడని తెలిపారు. కానీ ఆయన పారిపోకుండా, కారు యజమాని నష్టపరిహారం క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా, ఒక కాగితంపై తన పేరు, వాహనం రిజి్రస్టేషన్ నంబర్, ఇన్సూరెన్స్ వివరాలను స్పష్టంగా రాసిపెట్టారని వివరించారు. బీమా సంస్థను ఎలా సంప్రదించాలో కూడా అందులో సూచించారని ప్రశంసించారు. ఆ నోట్ను సేథి కెమెరాకు చూపిస్తూ, ఇది బాధ్యతాయుత ప్రవర్తనకు స్పష్టమైన ఉదాహరణని కొనియాడారు. భారత్లో ఊహించగలమా?..ఈ దృశ్యాన్ని చూసిన సేథి, తాను తరచూ స్వదేశంలో (భారత్లో) చూసిన పరిస్థితులతో ఈ సంఘటనను పోల్చారు. ‘భారత్లో ఎవరైనా ఇంకొకరి కారును గుద్దితే, వాళ్లు సాధారణంగా అక్కడి నుంచి పారిపోతారు’.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలే.. కొన్ని సమాజాలు ఇతరుల కంటే మెరుగ్గా పనిచేయడానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఒక దేశం గొప్పగా మారుతుందంటే, దానికి కారణం అక్కడి మంచి మనుషులు మాత్రమే’.. అని సేథి తన వీడియోను ముగించారు. పౌర ధర్మంలోనే దేశ వైభవం నిజాయితీ అనేది అసాధారణ చర్య కాకూడదు, అది సమాజపు ఊపిరి కావాలి. ఈ చిన్న నోట్, కేవలం ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి మాత్రమే కాదు. ఇది బాధ్యత, నైతికత, సామాజిక విలువలపై ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉది్వగ్న చర్చకు తెరలేపింది. కొందరు దీనికి విద్యా వ్యవస్థను, నాయకత్వాన్ని ఆపాదించవచ్చు. కానీ అంతిమ సత్యం ఒక్కటే: ఒక దేశ వైభవం దాని భవంతులలో కాదు, దాని ప్రజల చిన్న చిన్న పౌర ధర్మంలో దాగి ఉంది. చేసిన తప్పును అంగీకరించే ఆ క్షణంలోనే, ఒక దేశపు అంతరాత్మ ప్రతిబింబిస్తుంది. చిన్న నోట్తో.. ప్రపంచానికి పాఠం చెప్పిన ఆ్రస్టేలియన్ స్ఫూర్తి ఇది.. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పొగమంచు ప్రమాదం.. అప్రమత్తతే ప్రధానం
సాక్షి, అమరావతి: శీతాకాలంలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. వాహనంలో ప్రయాణిస్తుంటే రోడ్లMý ు ఇరువైపులా పొగమంచు హృద్యంగా కనువిందు చేస్తుంది. కారులోగానీ ఇతర వాహనాల్లో మంచి సంగీతం వింటూ డ్రైవింగ్ చేయడం మధురానుభూతి కలిగిస్తుంది. కానీ ఆ పొగమంచు మాటునే ప్రమాదం పొంచి ఉందన్నది డ్రైవర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేశంలో రహదారులపై పొగమంచు కమ్మేయంతో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఒక్క శీతాకాలంలోనే దేశంలో ఏటా 30 వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో పొగమంచుతో సంభవిస్తున్న ప్రమాదాలు 7% వరకు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఓ ట్రావెల్స్ బస్సు లోయలోపడి ప్రమాదానికి గురికావడంతో 9మంది దుర్మరణం చెందడంతోపాటు 37మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పొగమంచును బస్సు డ్రైవర్ సరిగా అంచనా వేయలేక పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. అందుకే శీతాకాలంలో వాహనాలను డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో 7గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు పరుచుకుని ఉంటుంది. ఘాట్ రోడ్లలో పొగమంచు మరింత దట్టంగా కమ్మేస్తుంది కూడా. అందుకే అరకు, మారేడుమిల్లి, శ్రీశైలం, తిరుమల, హార్స్లీ హిల్స్ వంటి ఘాట్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.చేయాల్సినవి...» లో బీమ్ హెడ్లైట్లనే ఉపయోగించాలి. హై బీమ్ లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.» పొగమంచు దారిలో ప్రయాణిస్తున్నంతసేపు ఫాగ్లైట్లు ఆన్ చేయాలి.» టైల్ ల్యాంప్స్ను క్లీన్గా ఉంచాలి. స్పష్టంగా కనిపించేట్టుగా ఉండాలి.» బ్రేక్ లైట్లు కచ్చితంగా పనిచేసేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో వాహనం నెమ్మదించగానే ఆ విషయం వెనుక వాహనదారులకు గుర్తించగలరు.» వాహనంలో టూల్ కిట్ తప్పనిసరిగా ఉంచుకోవాలి.» రోడ్లపై ఉన్న లైన్ మార్కింగ్లను గమనిస్తూ.. తదనుగుణంగా డ్రైవింగ్ చేయాలి. రోడ్డుకు కుడి, ఎడమ చివర్లో ఉన్న లైన్లను దాటి వెళ్లకూడదు. ఒక లైన్ నుంచి మరో లైన్లోకి మారేటప్పుడు వెనుక, పక్కన ఉన్న వాహనాలను గమనించాలి. వెనుక నుంచి ఏ వాహనం రావడం లేదని నిర్ధారించుకున్న తరువాతే లైన్ మారాలి.» వాహనం వైపర్లు సరిగా పని చేసేట్టుగా చూసుకోవాలి.» వాహనాన్ని నిలుపుదల చేయాల్సి వస్తే... రోడ్డుకు ఎడమవైపు లైన్లోనే నిలపాలి.» ఎదురుగా వెళుతున్న వాహనాలకు తగినంత దూరంగా ఉంటూ వాహనాన్ని నడపాలి.» రోడ్డు సరిగా కనిపించడంలేదని గుర్తించగానే వాహనాన్ని రోడ్డు పక్కగా నిలిపివేయాలి. జాతీయ రహదారులపై నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలు, సమీపంలోని దాబాలు, పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజాల వద్ద ఉండే పార్కింగ్ ప్రదేశంలోనే వాహనాలను నిలపాలి. » విండ్ షీల్డ్ క్లీన్గా ఉండాలి. యాంటీ ఫాగింగ్(డీ ఫాగర్) మోడ్లో వాహనం ఉంచి నడపాలి.చేయకూడనివి...» మితివీురిన వేగంతో ప్రయాణించవద్దు. పరి మిత వేగంతోనే డ్రైవింగ్ చేయాలి. వాహనం ఎప్పుడూ డ్రైవర్ నియంత్రణ ఉండాలి. రోడ్డును స్పష్టంగా చూడగలిగేంత వేగంతోనే ప్రయాణించాలి. »దారిలో పొగమంచు ఉన్నప్పుడు ముందు వెళ్తున్న వాహనాలను ఎట్టి పరిస్థితిల్లోనూ ఓవర్ టేక్ చేయకూడదు.» క్రూయిజ్ కంట్రోల్ మోడ్లో వాహనాన్ని నడపకూడదు.» డ్రైవింగ్ చేస్తున్నపుడు డ్రింక్స్ తాగడం గానీ ఏమైనా తినడంగానీ చేయకూడదు. పొగ తాగకూడదు. » ఎదురుగా వాహనం వస్తుంటే హైబీమ్ లైట్లను ఫ్లాష్ చేయ కూడదు. » డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హజార్డ్ (త్రికోణాకృతి)లైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్ చేయకూడదు. వాహనాన్ని పార్క్ చేసినప్పుడే ఇతరులు గమనించేందుకు హజార్డ్ లైన్లను ఆన్ చేసి ఉంచాలి. -
21న బ్లూబర్డ్–6 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కీలకమైన వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన బ్లూబర్డ్–6 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈనెల 21న ప్రయోగించబోతోంది. ఇస్రో రూపొందించిన బాహుబలి (ఎల్వీఎం3–ఎం6) రాకెట్ ద్వారా దీనిని నిర్వహించనుంది. అక్టోబర్ 19వ తేదీనే అమెరికా నుంచి ఈ ఉపగ్రహం షార్కు చేరుకుంది. ఈ ప్రయోగాన్ని గత నెలలో నిర్వహించాల్సి ఉండగా.. వాయిదాలు పడుతూ వచ్చింది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. గతంలో పంపిన బ్లూబర్డ్ ఉపగ్రహాల కన్నా.. 10 రెట్ల అధిక డేటా సామర్థ్యంతో పని చేసేలా దీనిని రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్, అమెరికాల మధ్య ఇది రెండో అతిపెద్ద సహకారం. జూలైలో ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని.. ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెల 31న పీఎస్ఎల్వీ సీ62 ప్రయోగాన్ని నిర్వహించేందుకు కూడా ఇస్రో చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. పది రోజుల వ్యవధిలో రెండు ప్రయోగాలు నిర్వహించడం ఇస్రో చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది. -
గిరిజన మహిళా మేయర్పై బాబు సర్కారు కుట్ర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దశాబ్దాల తర్వాత గిరిజన మహిళకు దక్కిన రాజ్యాధికారాన్ని చంద్రబాబు చిదిమేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థలో అత్యున్నత పదవి అయిన మేయర్గా ఓ గిరిజన మహిళకు అవకాశం కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు నేతలు అనేకానేక కుట్రలకు పాల్పడి, మేయర్ను, ఆమె కుటుంబ సభ్యులను, కార్పొరేటర్లను పైశాచికంగా వేధించి, చివరకు ఆ పదవి నుంచి గిరిజన మహిళా మేయర్ను తప్పించారు. ఇందుకోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన వికృత రాజకీయం రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. నాలుగేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన మహిళ అయిన పోట్లూరు స్రవంతిని అత్యున్నతమైన మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. నెల్లూరు నగర పాలక సంస్థను అభివృద్ధి పథంలో నడిపించారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పాలన సాగించారు. బాబు ప్రభుత్వం రాగానే కుట్ర చంద్రబాబు ప్రభుత్వం రాగానే మేయర్ పదవిని చేతిలోకి తీసుకొని, దోపిడీ చేయాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కుట్ర పన్నారు. నగర మేయర్ను అధికార పార్టీలోకి తీసుకోవాలని ప్రయతి్నంచారు. అధికార పార్టీలోకి రాలేదన్న కారణంతో పాటు తాము చెప్పిన చోట సంతకాలు చేయలేదన్న అక్కసుతో మేయర్ కుటుంబాన్ని అష్టకష్టాలు పెట్టారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పూర్తి కాలం పదవిలో కొనసాగనీయకుండానే ఆమెను పదవి నుంచి దింపేసి, మంత్రి నారాయణకు అనుకూలుడైన కార్పొరేటర్కు ఆ పదవి కట్టబెట్టేందుకు కుట్రలకు తెగబడ్డారు. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు. మేయర్ పీఠంపై డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ను కూర్చోబెట్టేందుకు కార్పొరేటర్లకు తాయిలాలు ఎరవేశారు. కార్పొరేటర్లు లొంగకపోవడంతో వేధింపులు, అరాచకాలకు తెరతీశారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై అక్రమ కేసులు, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ బెదిరించి 40 మందికి పైగా కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడంతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తటస్థంగా ఉండాల్సి వచ్చింది. అధికార పార్టీ చెప్పిన విధంగా ఉండాలని రాయబేరాలు చేసినా మేయర్ ససేమీరా అనడంతో మంత్రి, ఎమ్మెల్యే ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 18 నెలలుగా ఆమెను, ఆమె కుటుంబాన్ని రౌడీమూకలతో బెదిరించారు. కార్పొరేషన్ పరిధిలో భవనాల మార్టిగేజ్ విషయంలో ఫోర్జరీ సంతకాలు చేశారని, కార్పొరేషన్ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేశారంటూ పలు అక్రమ కేసులతో మేయర్ భర్త జయవర్దన్ను జైలుపాలు చేశారు. మేయర్ను సోషల్ మీడియాలో మానసికంగా వేధించారు. కార్పొరేషన్లో మేయర్కు దక్కాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. మేయర్ అన్నింటినీ భరిస్తూ వచ్చారు. చివరకు ఆమెపై అవిశ్వాసం పెట్టడానికి నిర్ణయించారు. అవిశ్వాసానికి సహకరించాలని కార్పొరేటర్లపైనా వేధింపులు, బెదిరింపులు మితిమీరాయి. తమకు మద్దతు పలకని కార్పొరేటర్లను పోలీసులతో కిడ్నాప్ చేయించి క్యాంపు రాజకీయాలకు దిగారు. కార్పొరేటర్లకు తాయిలాలు ప్రకటించి తమ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న తరుణంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ టీడీపీలోకి ఫిరాయించిన ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి వైఎస్సార్సీపీలో చేర్పించి, ఝలక్ ఇచ్చారు. ఈ పరిణామాలతో టీడీపీ గంగవెర్రులెత్తిపోయింది. క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఒక్కో కార్పొరేటర్కు రూ.40 లక్షలు ఇచ్చి క్యాంపులకు తరలించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను సైతం తాయిలాలతో పాటు అక్రమ కేసులతో బెదిరించి టీడీపీ కండువా కప్పారు. వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్లను కూడా అసభ్య పదజాలాలతో బెదిరించారు. వారి కుటుంబాలను సైతం టార్గెట్ చేశారు. దీంతో మేయర్ స్రవంతి తన వల్ల మహిళా కార్పొరేటర్లు పడుతున్న బాధకు చలించి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నక్సలిజం సాధించిందేమీ లేదు!
రాయపూర్: నక్సలిజం నల్లతాచు పడగనీడ కారణంగా దేశంలో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోయాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ఆయన ప్రతిజ్ఞచేశారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా కేంద్రం జగ్దల్పూర్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జరిగిన బస్తర్ ఒలింపిక్–2025 క్రీడోత్సవ ముగింపు వేడుకలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ‘‘ఆయుధం చేతబట్టిన నక్సలైట్లు నక్సలిజం పేరుతో సాధించింది ఏమీ లేదు. నక్సలిజం అనేది ఇటు సాయుధులకు ఉపయోగపడలేదు. అటు గిరిజనులకూ అక్కరకు రాలేదు. సాయుధ భద్రతాబలగాలకూ ఎలాంటి ప్రయోజనంలేని పనికిమాలిన పనిగా నక్సలిజం తయారైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీలోపు దేశంలో నక్సలిజంను అంతం చేస్తాం. ఏడు జిల్లాల సమాహారంగా ఉన్న బస్తర్ రీజియన్ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుదాం. ఇకనైనా సీపీఐ(మావోయిస్ట్) ఉద్యమకారులు ఆయుధాలు విడనాడి సమాజ ప్రధాన స్రవంతితో కలిసి నడవాలి. దారితప్పిన యువతను పునరావాస పథకం ద్వారా మళ్లీ గాడినపెడతాం. గౌరవప్రద జీవితం గడిపే అవకాశం కల్పిస్తాం. ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు పడాలంటే ఒక్క శాంతితోనే సాధ్యం. బస్తర్ ఒలింపిక్–2024 చూడ్డానికి వచ్చా. ఈసారి కూడా బస్తర్ ఒలింపిక్–2025 వీక్షించేందుకు విచ్చేశా. వచ్చే ఏడాది బస్తర్ ఒలింపిక్–2026 చూడ్డానికి వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఛత్తీస్గఢ్లో మాత్రమేకాదు యావత్ భారతావని నుంచి దానిని తరిమేస్తాం. 2026 మార్చి 31కల్లా దేశవ్యాప్తంగా ఎరుపు ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. ఇది త్వరలో సిద్ధించనుంది. నక్సలిజాన్ని రూపుమాపడమే మా పనికాదు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధే మా కర్తవ్యం. నక్సలిజం శకం ముగిసి నూతన అభివృద్ధి శకం త్వరలో ఆరంభమవుతుంది’’అని అమిత్ వ్యాఖ్యానించారు. మరో ఐదేళ్లలో అద్భుతాభివృద్ధి ‘‘బస్తర్ రీజియన్లో కాంకేర్, కొండగావ్, బస్తర్, సుక్మా, బీజాపూర్, నారాయణ్పూర్, దంతేవాడ జి ల్లాలున్నాయి. వెనుకబడిన ఈ 7 గిరిజన జిల్లాలను వచ్చే ఐదేళ్లలో అంటే 2030 డిసెంబర్కల్లా దేశంలోనే అత్యంత అభివృద్ధిబాటలో పయనించిన జిల్లాలుగా మార్చేస్తా. ఛత్తీస్గఢ్తోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఈ ఏడు జిల్లాల కోసం శతథా కృషిచేస్తాయి. అర్హులకు ఇళ్లతోపాటు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంటగ్యాస్ కనెక్షన్, ఐదు కేజీల ఉచిత రేషన్ బియ్యం, ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాది రూ.5లక్షల దాకా ఉచితవైద్య సదుపాయం కల్పిస్తాం. ఏడు జిల్లాల మధ్య రహదారుల ద్వారా అనుసంధానతను పెంచుతాం. విద్యుత్ స్తంభాలు వేయించి అందరి ఇళ్లలో విద్యుత్ వెలుగుల్ని ప్రసరింపజేస్తాం’’అని అన్నారు. ప్రతి గ్రామాన్ని రోడ్లతో అనుసంధానిస్తాం ‘‘ప్రతి ఒక్క గిరిజన గ్రామాన్ని రోడ్లతో అనుసంధానిస్తాం. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తాం. ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల పటిష్ట నెట్వర్క్ను ఏర్పాటుచేస్తాం. అటవీ ఉత్పత్తులను శుద్ధిపరిచే కర్మాగారాలను సహకారసంఘాల సహకారంతో నెలకొల్పుతాం. ఇతర గిరిజన జిల్లాలతో పోలిస్తే అత్యధిక పాల ఉత్పత్తికేంద్రాలుగా ఈ ఏడు జిల్లాలను తీర్చిదిద్దుతాం. పాడి, కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించి ఇక్కడి రైతుల కుటుంబాదాయాన్ని రెట్టింపుచేస్తాం’’అని అన్నారు. కొత్త పరిశ్రమలను తీసుకొస్తాం ‘‘నూతన పరిశ్రమలను ఈ జిల్లాలకు తీసుకొస్తాం. ఉన్నత విద్యా కేంద్రాలను నెలకొల్పుతాం. దేశంలోనే అత్యుత్తమమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మిస్తాం. బస్తర్ పట్టణంలో అత్యంత అధునాతనమైన ఆస్పత్రిని కడతాం. గిరిజన ప్రాంతాలను పట్టిపీడిస్తున్న పోషకాహార లోప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొత్త పథకాన్ని తీసుకొస్తాం. మావోయిస్టుల హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారికి, లొంగిపోయిన మావోయిస్టుల కోసం అత్యంత అధునాతన సౌకర్యాలతో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేస్తాం’’అని అన్నారు.అప్పుడు రణగొణలు.. ఇప్పుడు గణగణలు ‘‘ఒకప్పుడు నక్సలైట్ల మందుపాతరల పేల్చివేతలు, బుల్లెట్ల మోత, రణగొణలే వినిపించేవి. ఇప్పుడు రుధిర దారుల్లో విద్యాసుమాలు వెల్లివిరుస్తున్నాయి. విద్యాలయాలను నిర్మించాం. అందుకే నాటి రణగొణలు పోయి ఇప్పుడు బడిగంటల గణగణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి అనేది సుదూర స్వప్నంగా మారిన ఈ ప్రాంతంలో కొత్తగా రోడ్లు, రైల్వేలు, హైవేలు తీసుకొస్తున్నాం. అప్పట్లో ఇక్కడ లాల్ సలామ్ అనే నినాదమే వినిపించేది. ఇప్పుడంతా భారత్ మాతా కీ జై నినాదమే మార్మోగిపోతోంది. బస్తర్ అభివృద్ధికి మేమంతా కట్టుబడ్డాం. ఛత్తీస్గఢ్లో బీజేపీప్రభుత్వం కొలువుతీరాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని కూకటివేళ్లలో పెకిలించడం మొదలెట్టాయి. అందుకే ఎన్నో పరస్పర కాల్పుల ఘటనలు జరిగాయి. చాలా మంది నక్సలైట్లు చనిపోయారు. ఆ భయంతోనే గత రెండేళ్లలో ఏకంగా 2,000 మంది నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు’’అని అమిత్ షా అన్నారు. -
ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో 2025–26 విద్యా సంవత్సరంలో కొత్త సిలబస్ను అమలు చేసిన బోర్డు.. అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసింది. ప్రశ్నల సరళి, మార్కుల కూర్పు సైతం మారనుంది. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ను, పరీక్షలకు సీబీఎస్ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే సబ్జెక్టులైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ సిలబస్లో ఈ ఏడాది మార్పులు చేశారు. ప్రతి పేపర్కు 100 మార్కులు ఉంటాయి. అలాగే ఒక్క మార్కు ప్రశ్నల విధానం ప్రవేశపెట్టారు. సిలబస్ మారిన సబ్జెక్టుల పరీక్షలు రాసేందుకు జవాబుల బుక్లెట్ను 32 పేజీలకు పెంచారు. సిలబస్ మారని సబ్జెక్టులకు 24 పేజీల బుక్లెట్ ఉంచారు. సబ్జెక్టులు మారినందున పరీక్షల నిర్వహణలోనూ మార్పులు తెచ్చారు. ఒక్కో పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైంటేబుల్ రూపొందించారు. ఈ విద్యా సంవత్సరం మొదటి ఇంటర్ పరీక్షల్లో ఈ మార్పులు ఉంటాయి. రెండో ఏడాది పరీక్షలను మాత్రం ఈ ఏడాది పాత విధానంలోనే నిర్వహిస్తారు. అమల్లోకి ఐదు సబ్జెక్టుల విధానం ప్రస్తుతం ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజెస్, నాలుగు మెయిన్సబ్జెక్టులు (మొత్తం ఆరు), ఆర్ట్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజెస్, మూడు మెయిన్ సబ్జెక్టులు (మొత్తం ఐదు) ఉన్నాయి. మార్కుల కేటాయింపు కూడా భిన్నంగా ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి తెచ్చారు. అన్ని గ్రూపులకు ఒక లాంగ్వేజ్, 4 మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ తప్పనిసరి. రెండో లాంగ్వేజ్ని ‘ఎలక్టివ్’ (ఆరో సబ్జెక్టు)గా మార్చారు. అంటే విద్యార్థి లాంగ్వేజ్ లేదా 23 మెయిన్ సబ్జెక్టుల్లో ఒకటి ఎంచుకోవచ్చు. విద్యార్థులు మొదటి 5 సబ్జెక్టుల్లో ఒకటి ఫెయిలై.. ఆరో సబ్జెక్టు పాసైతే అప్పుడు ఆరో సబ్జెక్టును మెయిన్ సబ్జెక్టుగా పరిగణిస్తారు. అయితే, ఆరో సబ్జెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్ తప్పనిసరిగా పాసవ్వాలి. » సైన్స్ లేదా ఆర్ట్స్ గ్రూపుల్లో మూడు (3, 4, 5 సబ్జెక్టులు) ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. » గతంలో ఎంపీసీలో ‘మ్యాథ్స్–ఏ, బి’ పేపర్లు (ఒక్కో పేపర్ 75 మార్కులు) ఉండగా, ఇప్పుడు ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది. » బైపీసీలో బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి ‘బయాలజీ’గా ఒక్క ప్రశ్నపత్రం మాత్రమే ఇస్తారు. ఇందులో బోటనీకి 43, జువాలజీకి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. జవాబులు రాసే బుక్లెట్స్ రెండింటికీ వేర్వేరుగా ఇస్తారు. వేర్వేరుగా జవాబులు రాయాలి. » ఆర్ట్స్లో సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రస్తుతం ఉన్న 26 కాంబినేషన్లు ఉంటాయి. విద్యార్థులు నచి్చన కాంబినేషన్ను ఎంచుకోవచ్చు. » కామర్స్లో కామర్స్ పార్ట్–ఏ 50 మార్కులకు, అకౌంటెన్సీ పార్ట్–బి 50 మార్కులకు పేపర్ ఉంటుంది.మార్కుల్లో మార్పులు » మొదటి ఏడాది ఇంటర్మీడియట్లో ప్రతి సబ్జెక్టు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకు 85 మార్కుల చొప్పున రాత పరీక్ష ఉంటుంది. రెండో ఏడాది పరీక్షల్లో ప్రాక్టికల్స్ 30 మార్కులకు ఉంటుంది. అంటే రెండేళ్లకు రాత పరీక్ష 170 (85+85) మార్కులకు, ప్రాక్టికల్స్ 30 మార్కులు.. మొత్తం 200 మార్కులకు ఉంటుంది. » గతేడాది వరకు మ్యాథమెటిక్స్–ఏ, బి పేపర్లుగా 150 మార్కులకు ఉండగా, వాటిని కూడా రద్దు చేసి ఒకటే పేపర్ 100 మార్కులకు కుదించారు. » ఉత్తీర్ణతకు 100 మార్కుల పేపర్లకు 35 మార్కులు, 85 మార్కుల పేపర్లకు 29 మార్కులకు తప్పనిసరి చేశారు. అంటే సైన్స్ సబ్జెక్టుల్లో రెండేళ్లకు కలిపి 59 మార్కులు రావాలి. సైన్స్ ప్రాక్టికల్స్ రెండేళ్లలో 30 మార్కులకు గాను 11 మార్కులు తప్పనిసరిగా సాధిస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. » ఒకటి రెండు సబ్జెక్టుల్లో అధిక మార్కులు, మరో రెండు, మూడు సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు సాధించినా ఉత్తీర్ణతగా పరిగణిస్తారు. అన్ని సబ్జెక్టుల్లోనూ సరాసరి 35 శాతం మార్కులు తప్పనిసరి. అయితే, ఈ అవకాశం మొదటి ప్రయత్నంలో పరీక్షలు రాసేవారికి మాత్రమే వర్తిస్తుంది. » ఈసారి పరీక్షల్లో అర, 1, 2, 4, 5, 8, 16 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అర, ఒక్క మార్కు ప్రశ్నలకు తప్ప మిగిలిన వాటికి ‘‘ఛాయిస్’’ విధానం అమల్లోకి తెచ్చారు. » ప్రస్తుత (2025–26) విద్యా సంవత్సరంలో రెండో ఏడాది ఇంటర్ విద్యార్థులకు పాత సిలబస్తోనే పరీక్షలు జరుగుతున్నందున ఎలాంటి మార్పులు చేయలేదు.ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు » పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైంటేబుల్ రూపొందించారు. అయితే, హోలీ (మార్చి 3), రంజాన్ (మార్చి 20) తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆ తేదీల్లో జరిగే పరీక్షలను మరుసటి రోజు నిర్వహించేలా టైంటేబుల్లో మార్పులు చేసి, ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. ప్రభుత్వ అనుమతి రాగానే మార్పులతో కూడిన టైంటేబుల్ను ఇంటర్ విద్యా శాఖ వెల్లడించనుంది.గతంలో ఒక్కో సబ్జెక్టు ఒక్కో తీరుగా మార్కుల విధానం.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో గతంలో భాషా పేపర్లు 100 మార్కులకు ఉండేవి. సబ్జెక్టులకు మాత్రం వేర్వేరుగా ఉండేవి. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో తీరుగా ప్రశ్నలు, మార్కుల కేటాయింపు ఉండేది. ఆర్ట్స్ గ్రూపులకు మొత్తం 5 పేపర్లు 500 మార్కులు ఉండేవి. ఎంపీసీకి 470 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు పరీక్షలు నిర్వహించేవారు. మ్యాథమెటిక్స్లో రెండు పేపర్లు 75 మార్కుల చొప్పున 150 మార్కులకు, సైన్స్ గ్రూప్లో సబ్జెక్టుకు 60 మార్కుల చొప్పున పేపర్లు ఉండేవి. రెండో ఏడాదిలో మ్యాథ్స్ మినహా మిగిలిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలకు సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ మార్కులు కేటాయించేవారు. ఈ విద్యా సంవత్సరంలో ఆర్ట్స్ గ్రూపులు మినహా, సైన్స్ సబ్జెక్టులకు ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపులో మార్పులు చేశారు. మొదటి ఏడాది ఎంపీసీలో మొత్తం మార్కులు యథావిధిగా 470 మార్కులే ఉండగా, బైపీసీలో గతంలో 440 మార్కులు ఉండగా, కొత్త విధానంలో 455 మార్కులకు పెరిగాయి. -
కొనసాగిన పండగ సీజన్ జోష్..
న్యూఢిల్లీ: పండుగలు అయిపోయినప్పటికీ వాహనాలకు సంబంధించి నవంబర్లోనూ ఆ జోష్ కొనసాగింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు భారీగా డిమాండ్ నెలకొంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు కూడా తోడు కావడంతో హోల్సేల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ గణాంకాల ప్రకారం హోల్సేల్ డేటాకి తగ్గట్లే ప్యాసింజర్ వాహనాలు, త్రీ–వీలర్ల అమ్మకాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్లో ఏర్పడే డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు.. డీలర్íÙప్ల దగ్గర స్టాక్స్ గణనీయంగా పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ద్విచక్ర వాహనాల రిజి్రస్టేషన్లు మాత్రం వార్షికంగా 3 శాతం మేర నెమ్మదించాయి. 2024 నవంబర్లో 26,27,617 యూనిట్లు రిజిస్టర్ కాగా ఈసారి నవంబర్లో 25,46,184 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. పండగల నెల కావడంతో అక్టోబర్లోనే భారీగా టూ –వీలర్ల కొనుగోళ్లు జరగడం, పంట సంబంధ చెల్లింపుల్లో జాప్యం, కస్టమర్లకు నచి్చన మోడల్స్ అందుబాటులో లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని ఎఫ్ఏడీఏ పేర్కొంది. బులిష్ గా పరిశ్రమ.. పంటల దిగుబడులు పటిష్టంగా ఉండటం, పెళ్లిళ్ల సీజన్లాంటి అంశాల దన్నుతో టూ–వీలర్లతో పాటు మిగతా వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరుగుతాయని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున పాలసీపరమైన సంస్కరణలు, మార్కెట్ సెంటిమెంట్లు మెరుగుపడటం లాంటి అంశాల మద్దతుతో వచ్చే ఏడాది కూడా ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని పరిశ్రమ ఆశిస్తున్నట్లు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలపరంగా ఈసారి నవంబర్ తమకు అత్యుత్తమ నెలగా గడిచిందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తెలిపింది. ‘‘గత 40 ఏళ్లలో (కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి) నవంబర్ నెలకు సంబంధించి ఈ ఏడాది అత్యుత్తమంగా గడిచింది. గత నెలలో అత్యధికంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి’’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. తమ రిటైల్ అమ్మకాలు 31% పెరిగినట్లు వివరించారు. అలాగే ఎనిమిది మోడల్స్ విషయంలో ఫ్యాక్టరీ స్థాయిలో కూడా నిల్వలు లేకుండా పూర్తిగా అమ్ముడైపోయినట్లు పేర్కొన్నారు. ఇక చిన్న కార్ల (4 మీటర్ల లోపు పొడవు, 18 శాతం ట్యాక్స్ రేటు వర్తించేవి) సంగతి తీసుకుంటే అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 38 శాతం పెరిగాయని బెనర్జీ చెప్పారు. అలాగే పెద్ద కార్ల (40 శాతం పన్ను రేటు వర్తించేవి) విక్రయాలు 17 శాతం పెరిగాయని వివరించారు. పెండింగ్లో లక్షన్నర బుకింగ్స్ .. మారుతీ సుజుకీ దగ్గర 1,50,000 వాహనాలకు బుకింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల దగ్గర మరో 1,20,000 యూనిట్లు ఉన్నాయి. వెయిటింగ్ పీరియడ్లను తగ్గించేందుకు, సకాలంలో వాహనాలను డెలివరీ చేసేందుకు సెలవు రోజుల్లో కూడా సిబ్బంది పని చేస్తున్నట్లు బెనర్జీ వివరించారు. డిసెంబర్లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అటు టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర దిగ్గజాలు కూడా నవంబర్లో భారీ అమ్మకాలు నమోదు చేశాయి. టాటా మోటర్స్ అమ్మకాలు 22 శాతం పెరిగి 57,436 యూనిట్లకు చేరాయి. -
గుంటూరులో మళ్లీ డ్రగ్స్ కలకలం
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు తల్లీకుమార్తె మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె డ్రగ్స్కు బానిసగా మారిందని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చిన్నబజారుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్లోని ఒక టీవీ చానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. తండ్రితో కలిసి గుంటూరులోనే ఉంటున్న పెద్ద కుమార్తె (17) ఇక్కడే ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇద్దరు యువకులు తన కుమార్తెను డ్రగ్స్కు బానిసగా మార్చారని తల్లి ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ అలవాటు మానుకోవాలని తల్లి చెప్పగా.. శుక్రవారం తల్లీకుమార్తె మధ్య ఘర్షణ తలెత్తగా కుమార్తె తల్లికి ఎదురుతిరిగింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఫిట్స్ తగ్గడానికి ఉపయోగించే టాబ్లెట్లను అధికంగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితురాల్ని కలిసిన పోలీసు అధికారులు మహిళ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మైనర్ విద్యారి్థనిని మాదక ద్రవ్యాల ఉచ్చులోకి లాగిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పూర్తిస్థాయిలో డ్రగ్స్కు బానిసైన బాలికకు ఆడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స అందించి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రేమ పేరుతో యువతిని వంచించి మాదకద్రవ్యాల మత్తుకు అలవాటు చేసిన వారిని పట్టుకు తీరుతామన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. కుమార్తె తన మాట వినడం లేదని, బాలికను వారించే క్రమంలో తల్లిపై తిరగబడిందని చెప్పారు. దీంతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆ బాలికకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారనే కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారిస్తామన్నారు. కొన్ని కళాశాలల్లోని విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన ఇద్దరు యువకులను త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. -
సూపర్ స్టైల్
‘‘మై డియర్ వెంకీ జన్మదిన శుభాకాంక్షలు. నువ్వెక్కడ ఉన్నా నీ చుట్టూ పాజిటివిటీ పంచుతుంటావు. ‘మన శంకర వరప్రసాద్గారు’ షూటింగ్లో మనం గడిపిన ప్రతి క్షణాన్ని నేనెంతో మధురంగా గుర్తు చేసుకుంటాను’’ అని సోషల్ మీడియా వేదికగా వెంకటేశ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. డిసెంబరు 13 వెంకటేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, ‘మన శంకరవరప్రసాద్గారు’లో ఆయన చేసిన కీ రోల్ లుక్ని విడుదల చేసింది యూనిట్. ఈ చిత్రంలో వెంకటేశ్ సూపర్ స్టైలిష్ క్యారెక్టర్ చేశారని లుక్ స్పష్టం చేస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న రిలీజ్ చేయనున్నామని శనివారం నిర్వహించిన విడుదల తేదీ ప్రకటన వేడుకలో దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
మా ఎమ్మెల్యేతో బేరం కుదిరాకే రండి!
సాక్షి, నంద్యాల/సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఇటీవల అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన ఘటన మరువకముందే... ఆయన అనుచరులు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలంలో కాంట్రాక్టర్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. పరమేశ్వరుడి సన్నిధిలో భక్తులు సమర్పించిన తలనీలాలు పోగుచేసుకునే కాంట్రాక్టు కోసం టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను తరిమికొట్టారు. ‘మా ఎమ్మెల్యేతో బేరం కుదుర్చుకున్నాకే రండి..’ అంటూ బెదిరించి వెనక్కి పంపినట్లు సమాచారం. రెండురోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవస్థానం ఆఫీసు లోపలికి రాకుండానే బెదిరింపులు! శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దేవస్థానంలో తలనీలాలు పోగు చేసుకునే హక్కును గత సంవత్సరం రూ.4.89 కోట్లకు అనంతపురానికి చెందిన రాజా ఎంటర్ప్రైజెస్ పొందింది. వారి కాలపరిమితి పూర్తవడంతో ఒక ఏడాదికి సుమారు రూ.5కోట్ల అంచనాలతో టెండర్ కమ్ బహిరంగ వేలం కోసం దేవస్థానం నెల రోజుల కిందట టెండర్లు ఆహ్వానించింది. కొద్దిరోజుల కిందట బహిరంగ వేలంపాటకు అన్నీ సిద్ధం చేసినా దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవో స్థానికంగా లేకపోవడంతో వాయిదా వేశారు. ఈ నెల 11న రెండోసారి బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి పలువురు కాంట్రాక్టర్లు రూ.50లక్షలు చొప్పున డీడీలు తీసుకుని బహిరంగ వేలంలో పాల్గొనేందుకు దేవస్థాన పరిపాలన భవనం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ ఆత్మకూరు, శ్రీశైలం, సున్నిపెంటకు చెందిన కొందరు ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు కాపు కాసి కాంట్రాక్టర్లను అడ్డుకున్నారు.అయినా కొందరు కాంట్రాక్టర్లు వారి నుంచి తప్పించుకుని ఆఫీసు లోపలికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు లోపలికివెళ్లి కాంట్రాక్టర్లపై దాడి చేశారు. ‘మా ఎమ్మెల్యేతో బేరం కుదుర్చుకుని రమ్మంటే ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు..’ అంటూ కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతున్న కాంట్రాక్టర్లను వెంటపడి రక్తం వచ్చేలా కొట్టినట్లు తెలిసింది.కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే అనుచరుల దాడి దృశ్యాలను ఓ కాంట్రాక్టర్ డ్రైవర్ సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా, టీడీపీ నాయకులు అతడిపైనా దాడి చేసి సెల్ఫోన్ లాక్కుని వీడియోలు డిలీట్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే అనుచరుల గూండాగిరితో భక్తులు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది భయభ్రాంతులకు గురైనట్లు తెలిసింది.దాడి చేస్తారని పోలీసులకు ముందుగా తెలిసినా..! తలనీలాల టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సిబ్బంది ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో దేవస్థాన పరిపాలన భవనానికి పోలీసులు, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేరుకున్నారు. అయినా వారి సమక్షంలోనే టీడీపీ మూకలు రెచ్చిపోయి కాంట్రాక్టర్లపై దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం.కమిషనర్కు కాంట్రాక్టర్ల ఫిర్యాదు.. టెండర్ రద్దు తలనీలాల టెండర్లో పాల్గొనకుండా తమపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరులు దాడి చేశారని కాంట్రాక్టర్లు వెంటనే రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. తమపై దాడి గురించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంట్రాక్టర్లు కోరినట్లు సమాచారం. అసలు టెండర్తో సంబంధం లేని వ్యక్తులు దేవస్థాన పరిపాలన భవనం వద్దకు ఎలా వచ్చారు? వారిని ఎవరు పంపించారు? ఎవరు అనుమతించారు? వంటి విషయాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దేవస్థాన పరిపాలన భవనం వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే తమపై దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పినట్లు సమాచారం.టెండర్ ధర తగ్గించేందుకు ఎమ్మెల్యే కుట్ర?కాంట్రాక్టర్లను బెదిరించి బహిరంగ వేలంలో పాల్గొనకుండా చేయాలని, తద్వారా తక్కువ ధరకు తలనీలాల కాంట్రాక్టును తాను సూచించినవారికి దక్కేలా చేయాలని ఎమ్మెల్యే కుట్ర పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే తన అనుచరులతో కాంట్రాక్టర్లను బెదిరించి కొందరిని సిండికేట్గా ఏర్పాటుచేసి గత ఏడాది కన్నా తక్కువ ధరకు టెండర్ వేసేలా చక్రం తిప్పుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతిమంగా దేవస్థానానికి వెళ్లాల్సిన ఆదాయాన్ని తాను పొందేలా పథకం రచించారని ప్రచారం జరుగుతోంది. -
బస్ షెల్టర్నూ వదలని టీడీపీ నేత
పెనుకొండ రూరల్: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత అనుచరుల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి ఓ టీడీపీ నేత ఏకంగా బస్ షెల్టర్ను కబ్జా చేశాడు. దాన్ని కూల్చి ఆ స్థలంలో కాంప్లెక్సు నిరి్మంచేందుకు సిద్ధమయ్యాడు. గ్రామస్తులు ఎదురు తిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.నాలుగు గ్రామాలకు అదే షెల్టర్ పెనుకొండ మండలం మావటూరులోని బస్ షెల్టర్ నాలుగు గ్రామాల ప్రయాణికులకు ఆదరువుగా ఉంది. నాగళూరు, బండపల్లి, సానిపల్లి, మావటూరు గ్రామాల ప్రజలు పెనుకొండ, మడకశిర పట్టణాలకు వెళ్లేందుకు ఈ బస్షెల్టర్ వద్దే వేచి ఉంటారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ షెల్టర్ స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకుడు జ్యోతీష్ దాన్ని కూల్చి అక్కడ కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకు ఇవ్వాలనే పన్నాగం వేశాడు. శుక్రవారం అర్ధరాత్రి జేసీబీతో బస్షెల్టర్ను కూల్చేయించాడు. గ్రామస్తులు అతన్ని నిలదీయటంతో పారిపోయాడు. దీంతో బస్ షెల్టర్ కూల్చేందుకు ఉపయోగించిన జేసీబీని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఉదయానికి ఈ విషయం మిగిలిన గ్రామాల వారికి తెలియడంతో మావటూరు, నాగళూరు, సానిపల్లి, బండపల్లి గ్రామాల ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు శనివారం ఉదయం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పెనుకొండ నుంచి మడకశిర వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బస్షెల్టర్ను కూల్చిన జ్యోతీను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని, కూల్చిన బస్ షెల్టర్ స్థానంలో నూతన షెల్టర్ కట్టించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బస్షెల్టర్ కూల్చిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆందోళన విరమించారు. అనంతరం సర్పంచ్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ నాగభూషణ్రెడ్డి, ఎంపీటీíసీ శివయ్య, మోహన్, మాజీ డీలర్ శ్రీనివాసులు, మేకల మారుతి, నరసింహ, పీజే రాజశేఖర్, శివారెడ్డి, మురళీ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. జ్యోతీష్, జేసీబీ డ్రైవర్పైన కేసు నమోదు చేశామన్నారు. మంత్రి అండతోనే కూల్చివేత బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అండతోనే జ్యోతీష్ బస్òÙల్టర్ కూల్చేశాడని వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ సుధాకర్రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం బస్ షెల్టర్ ఉన్న స్థానంలో కాంప్లెక్స్ నిర్మాణం కోసం గతంలోనే జ్యోతీష్ తనను, సర్పంచ్ నాగరాజును అనుమతులు అడగ్గా తాము అంగీకరించలేదని ఆయన వెల్లడించారు. -
ఎస్వీ పాలిటెక్నిక్లో అన్యమత ప్రచారం
తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత ప్రచారం కలకలంరేగింది. ఇంగ్లిష్ అధ్యాపకురాలు మాధవి బోర్డుపై రాస్తున్న అన్యమత వ్యాఖ్యలను కొందరు విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఘటనపై ప్రిన్సిపల్ స్పందిస్తూ.. అధ్యాపకురాలిని విచారించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపించామన్నారు. దీంతో మాధవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
పారిశుద్ధ్య కార్మికుల కన్నెర్ర
అనంతపురం (మెడికల్): అనంతపురం సర్వజనాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఇంటికి సాగనంపి కొత్త వారిని విధుల్లోకి తీసుకునేందుకు యత్నించిన ఏజెన్సీ నిర్వాకాన్ని నిరసిస్తూ శనివారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సర్వజనాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులను వయసు నిబంధన పేరిట ‘పద్మావతి ఏజెన్సీ’ విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఏజెన్సీ నిర్వాహకుల దురుసు ప్రవర్తనతో మనస్తాపం చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మావతి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో శనివారం పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ తదితర సంఘాలు వీరి ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నాయి. ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు కొత్తగా పదుల సంఖ్యలో డైలీ వేజెస్ కింద సిబ్బందిని గుట్టుగా తీసుకువచ్చి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చూశారు. దీనిపై కార్మికులు కన్నెర్ర చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత సమక్షంలోనే ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజారెడ్డితో వాగ్వాదానికి దిగారు. వివిధ వార్డుల్లో పనిచేస్తున్న ప్రైవేట్ సిబ్బందిని కార్మికులు అడ్డుకుని, తోసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆందోళనలు చేపట్టి, దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు కార్మిక సంఘాల నాయకులను హెచ్చరించారు. ఆస్పత్రికి వచ్చిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను పారిశుద్ధ్య కార్మికులు చుట్టుముట్టారు. తమను అన్యాయంగా తొలగిస్తున్నారని వాపోయారు. సమస్యను మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకోం కోవిడ్ పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనులు చేసిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి మండిపడ్డారు. వయసు పేరిట కార్మికులను తొలగించాలని చూస్తే ఊరుకోబోమన్నారు. సీఐటీయూ నేత నాగేంద్ర మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మిత్రుడు భాస్కర్ నాయుడుకు చెందిన పద్మావతి ఏజెన్సీ దౌర్జన్యం, దాష్టీకానికి కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, రాజారెడ్డి, అనిల్కుమార్గౌడ్, కాకర్ల శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మహ్మద్ హుస్సేన్, వామపక్ష నాయకులు రామిరెడ్డి, సురేష్, యేసురత్నం, ఏటీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!
సోషల్ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్ కొత్త డాక్టర్తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్, హాలీవుడ్ మోడల్ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్ పదాన్ని... ఇటీవలి పాపులర్ చిట్కా మంత్రా పదమైన ‘వెల్నెస్ చికిత్స’తో కలగలిపి ‘వెల్నెస్’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ, డీటాక్స్ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.వాళ్లు క్యాన్సర్ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. → ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్– టాలీవుడ్ ఫేమ్ సోనాలి బెంద్రే. → క్లీన్ ఈటింగ్ ప్రాసెస్ చేయని, రిఫైన్ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. → కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్ను దూరం చేశాయంటాడు క్రికెటర్ యూవీ (యువరాజ్ సింగ్). → శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్నెస్ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్’, ‘ ప్రోటీయోజోమ్’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ, ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్ ప్రక్రియల వంటి వెల్నెస్ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...నిజానికి ‘క్యాన్సర్ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. ∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్ ఎండిపోవడానికి (ఫాస్టింగ్ స్టార్వ్స్ క్యాన్సర్) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్... సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్– ప్రోటియోజోమ్ సిస్టమ్ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ సిస్టమ్ అంటే... యుబిక్విటిన్ అనేది ఏ ప్రోటీన్కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్ ప్రోటీన్ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్ ప్రోటీన్ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్ అన్నది ప్రోటీన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అన్నమాట. ఈ యుబిక్విటిన్ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్... తన డబుల్ నెగెటివ్ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ వ్యవస్థ’గా చెబుతారు.కొన్ని మందులతో ప్రోటీయోజోమ్ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్ను తగ్గించడం ఇలా... ఈ యుబిక్విటిన్– ప్రోటియోజోమ్ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్’ వంటి ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. అవి కొనసాగే మార్గాలను (పాత్ వేస్) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్ ట్యూమర్స్) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్ ప్రక్రియను క్యాన్సర్ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్ క్యూర్’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్ / ప్రోగ్రామ్డ్ సెల్ డెత్)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్ను అపాప్టోసిస్కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్ కణంలోని పవర్హౌజ్ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.చివరగా... ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.అపాప్టోసిస్ అంటే... క్యాన్సర్ అంటేనే అది చెడిపోయిన / నార్మల్గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్.నిర్వహణ: యాసీన్ -
వికటించిన మధ్యాహ్న భోజనం
తొండూరు: మధ్యాహ్న భోజన పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక పాఠశాలలో దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం సంతకొవ్వూరు పంచాయతీ పరిధిలోని యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 10మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇది రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఏపాటిదో స్పష్టం చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం పాఠశాలలో మెనూ ప్రకారం అన్నం, పప్పు, రసం అందించాల్సి ఉంది. అయితే అన్నం, వంకాయ కూర, సాంబారు, స్వీట్ పొంగలిని విద్యార్థులకు వడ్డించారు. వీటిని తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు అయ్యాయి. పాఠశాలలో 10 మందికి ఒకేసారి వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల ఉపాధ్యాయిని భారతి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలియజేశారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచాలన్న వైద్యులు వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు 108 వాహనంలో పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి 24 గంటలు ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వల్లే విరేచనాలు, వాంతులు అయ్యాయని తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న మండల విద్యాధికారి భారతి ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపడతామని, విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. పురుగుమందుల అవశేషాల వల్లే.. కూర కోసం తోటలోని వంకాయలు తెచ్చి కడగకుండా వండారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. విషపూరిత వంకాయలతో కూర వండటం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి విద్యార్థుల్ని పాఠశాలలకు పంపిస్తుంటే.. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను కనీసం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. తరచూ ఏదో ఒకమూల మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడం.. కొందరు మరణించడం చూస్తుంటే విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉందో అవగతం అవుతోందని విద్యార్థి సంఘాల నేతలు దుయ్యబడుతున్నారు. ఉపాధ్యాయిని సస్పెన్షన్ ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయిని భారతిని సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా విద్యా శాఖ కార్యాలయం ప్రకటించింది. ఎంఈవో భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. -
బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు ప్రభుత్వం భారీ హంగులు కల్పిస్తోంది. రూ.5.55 కోట్లతో కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నుంచి చంద్రబాబు నివాసం ఉంటున్న కృష్ణా కరకట్ట ప్యాలెస్, ఈ3 (సీడ్ యాక్సిస్ రోడ్డు)–ఎన్9 జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కళాత్మకంగా తీర్చిదిద్దిన కొత్త స్తంభాలు, ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పరిపాలన అనుమతిచ్చారు. ఆ పనులు చేపట్టడానికి అక్టోబర్ 10న రూ.4.27 కోట్ల అంచనా వ్యయంతో, నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఆ టెండర్ను రద్దు చేసింది. తాజాగా ఈ పనులు చేపట్టేందుకు టెండర్ పిలవడానికి రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో నవంబర్ 29న సీఆర్డీఏ సీఈ సాంకేతిక అనుమతి ఇచ్చారు. దాంతో ఆ పనులకు రూ.4.27 కోట్ల అంచనా వ్యయంతో శనివారం రెండోసారి సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్లలో బిడ్ల దాఖలుకు తుది గడువును ఈ నెల 17గా నిర్ణయించింది. అంటే.. కేవలం ఐదు రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం. స్వల్పకాలిక టెండర్కు కనీస వ్యవధి వారం రోజులు. కానీ.. ఈ టెండర్ను కేవలం ఐదు రోజుల్లోనే ముగించాలని నిర్ణయించడాన్ని బట్టి చూస్తే.. పనులను ఏ కాంట్రాక్టర్కు కట్టబెట్టాలన్నది ముందుగానే నిర్ణయించారన్నది స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. పాత విద్యుత్ స్తంభాలు, లైటింగ్ వ్యవస్థ బాగున్నప్పటికీ వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 18 నెలల్లో కరకట్ట అక్రమ ప్యాలెస్ మరమ్మతులకు రూ.4కోట్లకు పైగా ఖర్చు ఇక చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ ప్యాలెస్లో ప్రస్తుతం ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ స్థానంలో కొత్త లైన్ వేయడానికి రూ.47 లక్షలు, 250 కేవీఏ జనరేటర్ స్థానంలో 320 కేవీఏ జనరేటర్ ఏర్పాటుకు రూ.60 లక్షలు... వెరసి రూ.1.07 కోట్లను మంజూరు చేశారు. కరకట్ట ప్యాలెస్ అత్యవసర మరమ్మతులకు రూ.2.16 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంమీద 18 నెలల్లోనే కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు రూ.4 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నారు. కృష్ణా నది కరకట్ట లోపల ఉండవల్లికి సమీపంలో లింగమనేని రమేష్ అక్రమంగా ఈ ప్యాలెస్ నిర్మించారు. ఆ ప్యాలెస్తోపాటు కరకట్ట లోపల నిర్మించినవన్నీ అక్రమ కట్టడాలేనని, వాటిని కూల్చివేస్తామని 2015లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నదిలో పడవపై తిరుగుతూ హంగామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన అప్పటి సీఎం చంద్రబాబు... ఆ కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి ఉండవల్లిలోని లింగమనేని రమేష్ అక్రమ కట్టడం(కరకట్ట ప్యాలెస్)లోకి మకాం మార్చారు. 2014–19 మధ్య కరకట్ట ప్యాలెస్తోపాటు హైదరాబాద్ జూబ్లిహిల్స్లోని నివాసం, మదీనగూడలోని ఫాంహౌస్లో వసతుల కల్పన, భద్రతకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా ఖర్చు చేస్తూనే ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలీకాప్టర్, ప్రత్యేక విమానాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.10.92 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.40.96 కోట్లు ఖర్చు చేసినట్లయ్యింది. చంద్రబాబు అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను సద్వినియోగం చేసుకోవాల్సిందిపోయి దుబారా చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పర్యాటకుల స్వర్గధామం.. కాజీరంగా
కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్... పర్యాటకులకిది గమ్యస్థానమే కాదు.. జీవవైవిధ్యానికి అతి పెద్ద ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యధిక ఒంటికొమ్ము ఖడ్గమృగాలున్న జాతీయ పార్క్ ఇదే. ఇలా చెప్పుకుంటూ పోతే కాజీరంగాకు ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ పార్క్ అసోంలోని గోలాఘాట్, నాగావ్ జిల్లా పరిధిలో విస్తరించి ఉంది. బ్రహ్మపుత్ర నదీ తీరంలో నీటి గలగలలు వినసొంపుగా ఉంటాయి. కార్బీ ఆంగ్లాంగ్ కొండల మధ్య దృశ్యాలు కనువిందు చేస్తాయి. కాజీరంగా దాదాపు 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఈ జాతీయ పార్క్ను ఎన్హెచ్–37 మధ్యగా చీల్చుతుంది. ఈ నేషనల్ పార్క్ చుట్టూ తేయాకు తోటలు పరుచుకుని ఎంతో అహ్లాదకరంగా, ఎటుచూసినా పచ్చని దృశ్యాలే కనిపిస్తుంటాయి. ఈ జాతీయ రహదారిలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు రహదారి పక్కన ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవి దున్నలు, జింకలు తిరుగుతూ కనిపిస్తుంటాయి. – కాజీరంగా నుంచి సాక్షి ప్రతినిధికాజీరంగాలో అత్యధిక ప్రాంతం చిత్తడి నేలలతోనే కనిపిస్తుంది. భారీ, ఎత్తైన గడ్డిపొదలతో ఈ అడవి దట్టంగా కనిపిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులే వన్యప్రాణులకు ఎంతో ఇష్టమైన ఆవాసంగా మారింది. ఈ అడవిలో పెద్దసంఖ్యలో అడవి పందులు కూడా ఉన్నాయి. చిత్తడి నేలలు ఒక ఎత్తయితే.. చాలాచోట్ల చెరువులు, కుంటలు వన్యప్రాణులకు జీవం పోస్తున్నాయి. ఏడాదిలో కేవలం వేసవి సీజన్లోని కొన్నిరోజులు మినహాయిస్తే... ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ పార్క్లోకి సందర్శకులను అక్టోబర్ రెండో వారం నుంచి మే నెలాఖరు వరకు మాత్రమే అనుమతిస్తారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ రెండో వారం వరకు వర్షాల నేపథ్యంలో పర్యాటకులను అనుమతించరు. బ్రహ్మపుత్ర నది పోటెత్తినప్పుడు, భారీ వర్షాలతో ఈ అడవిలోనూ వరదలు సంభవిస్తాయి. ఆయా సమయాల్లో వన్యప్రాణులు మృత్యువాత పడటం, గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంతో ఈ పార్కు స్వరూపం కూడా మారుతుంటుంది. ఈ పార్కులో మానవప్రమేయం చాలా తక్కువ. ఖడ్గమృగాలపై గతంలో వేటగాళ్లు విరుచుకుపడ్డ పరిస్థితులను అస్సాం ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు పూర్తిగా నిలువరించారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మారింది. వేట చాలావరకు తగ్గింది. కాజీరంగా జాతీయ ఉద్యానవనం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండాం ప్రకృతి పరిరక్షణకు నిదర్శనంగా మారింది. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అనే సందేశాన్ని కాజీరంగా గట్టిగా వినిపిస్తోంది.» 1905లో పార్లమెంటులో నోటిఫికేషన్ ద్వారా కాజీరంగాను రిజర్వ్ ఫారెస్టుగా నిర్ధారించారు. 1908లో తుది నోటిఫికేషన్ వచ్చింది. » 1916లో కాజీరంగాను అభయారణ్యంగా డిక్లేర్ చేశారు. » 1937లో పర్యాటకులు/సందర్శకులకు అనుమతిచ్చారు. » 1950లో వన్యప్రాణుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. » 1974లో జాతీయ పార్కుగా నోటిఫై చేశారు. » 1985లో అంతర్జాతీయ చారిత్రక సంస్థగా యునెస్కో గుర్తించింది. » 2007లో దీన్ని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేశారు. » 2018లో కాజీరంగాను ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఖరారు చేశారు. » 2022లో స్మగ్లింగ్/వేట రహితంగా ప్రకటించారు. » 2024లో జాతీయ పార్కుగా పేరొంది 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.కాజీరంగానేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్లోని జంతు సంపద (2022 పశుగణన లెక్కల ప్రకారం)...2,613 ఒంటికొమ్ము ఖడ్గమృగాలు 104 రాయల్ బెంగాల్ టైగర్1,129 చిత్తడి జింకలు553 పక్షి జాతులు550 వృక్ష జాతులు1,200+ ఏనుగులు 2,565 అడవి దున్నలుప్రత్యేకతలుప్రపంచంలోనే అత్యధిక ఒంటి కొమ్ము ఖడ్గమృగాలున్నది ఇక్కడే. 1966లో ఇక్కడ 366 ఒంటికొమ్ము ఖడ్గమృగాలుండగా... ఇప్పుడు వాటి సంఖ్య 2,613కి చేరింది. వచ్చేఏడాది వైల్డ్లైఫ్ సెన్సెస్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేషనల్ పార్కులో అత్యధిక రాయల్ బెంగాల్ టైగర్లు ఉన్నాయి. అంతేకాకుండా అడవిదున్నల సంఖ్య కూడా ఇక్కడే అత్యధికంగా ఉంది. ఏనుగుల సంఖ్యతో పాటు చిత్తడి జింకలు సైతం ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. 25 రకాల అంతర్జాతీయ పక్షి జాతులు ఇక్కడికి వలస వస్తుంటాయి.» జంతువుల దాడిలో పదేళ్లలో 19 మంది మృత్యువాత పడ్డారు. 2014, 2015, 2016లో మరణాలు నమోదు కానప్పటికీ... ఆ తర్వాత ఏటా సగటున 3 చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఈ దాడుల్లో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించింది. గాయపడిన వారికి ఆర్థిక సాయంతో పాటు మెరుగైన చికిత్సకు చర్యలు తీసుకుంది. » కాజీరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ కేంద్రానికి ఏటా టికెట్ల రూపంలో రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ పులుల సంరక్షణ ప్రాజెక్టుకు ఏటా సగటున రూ.10 నుంచి రూ.12 కోట్ల మేర నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 90 శాతం కాగా... 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. » ఈ అటవీ సంరక్షణలో 367 మంది ఉద్యోగులు విధులు ని ర్వహిస్తున్నారు. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్తో పాటు అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్లు, వెటర్నరీ ఆఫీ సర్లు, ఫారెస్ట్ గార్డ్లు తదితర కేటగిరీల్లో ఉద్యోగులున్నారు. » కాజీరంగా జాతీయ పార్క్ను నాలుగేళ్లుగా ఏటా సగటున 3 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఇందులో 5 శాతం విదేశీ సందర్శకులే కావడం గమనార్హం. పదేళ్ల క్రితం ఈ పార్క్ విజిటర్ల సంఖ్య 1.31 లక్షలు కాగా.. ఇందులో విదేశీ పర్యాటకులు 8 వేలు. పదేళ్లలో ఈ పర్యాటకుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. » ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఎలి ఫెంట్ సఫారీ చేయొచ్చు. ఉదయం7.30 గంటల నుంచి మ ధ్యాహ్నం 3 గంటల వరకు జీపు సఫారీకి అనుమతిస్తారు. » పార్కులో ప్రవేశానికి దేశ పౌరులకు రూ.100, విదేశీయులకు రూ.650 చొప్పున రుసుము చెల్లించాలి. ఏనుగుపై సఫారీకి విదేశీయులకు రూ.2 వేలు, దేశ పౌరులు రూ.1,200 చెల్లించాలి. » జీపు సఫారీకి రూ.2,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కెమెరా షూట్, వీడియో కెమెరా షూట్, డాక్యుమెంటరీలు, ఫీచర్ఫిల్మ్ తదితరాలకు వేరువేరు ఫీజులుంటాయి. నిర్దేశించిన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కూడా చేసే అవకాశం ఉంది. » సందర్శకులు ఇక్కడ ఉండేందుకు ప్రత్యేకంగా గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాలి. ఆన్లైన్ విధానంలో కూడా ముందస్తుగా గెస్ట్హౌస్లు, సందర్శనకు బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. -
ముందుకెళ్తారా? మిన్నకుంటారా?
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ కేంద్రంగా గత ప్ర భుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యా పింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావును సిట్ అధికారులు రెండో రోజైన శనివారమూ విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలే చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం దర్యాప్తు అధికారులకు మరో తలనొప్పి వచ్చిపడింది. దీని ఆధారంగా ముందుకు వెళ్తారా? లేక మిన్నకుండిపోతారా? అనేది తేలాల్సి ఉంది. విభాగాధిపతుల పర్యవేక్షణలోనే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ ట్యాపింగ్ వ్యవహారంలో తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పట్లో డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు ప్ర భాకర్రావు చెప్తున్నారు. పోలీసులు సేకరించిన ఆ«ధారాల ప్రకారం ఈ అక్రమ ఫోన్ ట్యా పింగ్ వ్యవహారం మొత్తం ప్ర భాకర్రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టు అయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్లుగా ఉంటారు. మరోపక్క ఎస్ఐబీలో ప్రణీత్రావు వార్రూమ్గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటాయించినవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచ్చితంగా నిఘా విభాగాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అనుమానిత నంబర్ల ట్యాపింగ్కు రూపొందించిన లేఖపై హోంశాఖ కార్యదర్శి సంతకం చేస్తారు. ఇది ఎస్ఐబీ నుంచి నిఘా విభాగాధిపతి, డీజీపీల ద్వారా హోం సెక్రటరీకి చేరుతుంది. ఆయన అందుబాటులో లేనప్పుడు మాత్రమే అత్యవసరమైతే ఎస్ఐబీ చీఫ్ లేఖ పంపిస్తారు. అయితే ఇలా జరిగిన మూడు రోజుల్లో హోం సెక్రటరీ నుంచి అను మతి తీసుకోవాలి. ఇలా ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ రివ్యూ చేస్తుంది. ఈ విషయాలను ప్రభాకర్రావు తన వాంగ్మూలంలో స్పష్టం చేస్తున్నారని తెలిసింది. గతంలో ఆయన నాంపల్లి కోర్టులో న్యాయవాదుల ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్లోనూ ఆయా సెక్రటరీలు, డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావించారు. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పనిచేశానంటూ ప్రభాకర్రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకిస్తున్నారు. కస్టడీలో చెప్తున్న విషయాలే కాకుండా న్యాయస్థానంలో దాఖలైన అఫిడవిట్ను ప్రభాకర్రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుంది.సుప్రీంకోర్టుకు నివేదిక ఏమిస్తారు? ప్రభాకర్రావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుంటే మాజీ డీజీపీలు, నిఘా విభాగం అధిపతుల్నీ విచారించడంతో పాటు అవసరమైతే వారినీ నిందితులుగా చేర్చాలి. ఓ నేరం చేసిన వ్యక్తి మాత్రమే కాదు.. దానికి సహకరించిన వాళ్లు కూడా నిందితులే అవుతారు. ఈ విషయాన్నే చట్టం కూడా స్పష్టం చేస్తోంది. ప్రభాకర్రావు విచారణపై ఈ నెల 19న సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అందులో ఈ అంశాలు ప్రస్తావిస్తారా? ఆయా అధికారుల విషయంలో ఎలా ముందుకు వెళ్తారు? అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. -
విశాఖ ఉక్కు ప్రై'వేటు'కే!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు శరవేగంగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతోంది..! ఆంధ్రుల హక్కు వడివడిగా చేజారిపోతోంది..! స్టీల్ ప్లాంట్ను కాపాడుతాం... లాభాల బాట పట్టిస్తాం అంటూ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారం దక్కాక ప్లేటు ఫిరాయించేస్తున్నారు..! గత ఏడాదిన్నరగా ప్లాంట్ను ప్రైవేటుకు కట్టబెట్టే దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు..! ఈ క్రమంలో తొలుత కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. రెగ్యులర్ ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు... ఉన్న ఉద్యోగులకు జీతాల చెల్లింపును ఆలస్యం చేస్తున్నారు. అదీ సరిపోక ఉత్తత్పికి తగిన వేతనం అంటూ మెలికపెట్టారు. ఇక ఇటీవల మరింత ముందుకెళ్లి ‘‘ఉద్యోగులు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? ప్రభుత్వ రంగంలో ఉంది కదా? అని బెదిరించలేరు’’ అంటూ సీఎం చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏకంగా స్టీల్ ప్లాంట్ ప్రధాన ఉత్పత్తి విభాగం అయిన ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు వీలుగా టెండర్ నోటీసులు జారీ చేశారు. ఇంతకాలం దాగుడుమూతలుస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇంతకాలం దాగుడుమూతలు ఆడింది ప్రభుత్వం. ఇప్పుడు మాత్రం వేగంగా ప్రైవేట్పరం చేసేందుకు చర్యలు వేగిరం చేస్తోంది. ఇప్పటివరకు కేవలం మొత్తం నిర్వహణ (టోటల్ మెయింటినెన్స్) పనులను మాత్రమే ప్రైవేటుకు అప్పగించారు. ఇప్పటివరకు మెయింటినెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్స్కూ వర్తింపు కాగా, ప్రైవేటుపరం చేసేందుకు వీలుగా మొదట 46 విభాగాలను ఎంపిక చేశారు. తర్వాత పలు విభాగాల నిర్వహణకు ఆగస్టులో తొలి విడతగా ఒకేరోజు 32 ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులు ఆహ్వానించారు. ఇలా ఆర్ఎంహెచ్పీ, సెంటర్ ప్లాంట్ మెయింటెనెన్స్కు ఈవోఐలు జారీ చేశారు. తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్–1, థర్మల్ పవర్ ప్లాంట్–2, ఎస్ఎంఎస్ సీసీఎం–4, మాధారం మైన్స్, ఫౌండ్రీ, సెంట్రల్ మెషిన్ షాప్ (సీఎంఎస్) వంటి అనేక ఇతర విభాగాలను కూడా ప్రైవేట్కు కట్టబెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ప్లాంట్కు వెన్నెముక ఇది...స్టీల్ ప్లాంట్లోని ప్రధాన ఉత్పత్తి విభాగం ఎస్ఎంఎస్–1లో కోల్ కెమికల్ డిపార్ట్మెంట్ (సీసీడీ) ప్రైవేటీకరణకు టెండర్లు ఆహ్వానిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆరు కంటిన్యూస్ క్యాస్టింగ్ మెషీన్ (సీసీఎం)లతో పాటు గ్యాస్ కటింగ్ మెషీన్లను ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవడంతో ప్లాంట్ ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్లో తయారయ్యే హాట్ మెటల్ను స్టీల్ మెల్ట్ షాప్(ఎస్ఎంఎస్)లో వివిధ ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి లిక్విడ్ స్టీల్గా తయారు చేస్తారు. ఈ ద్రవపు ఉక్కును ఫినిష్డ్ స్టీల్గా తయారు చేసే ప్రక్రియలో తొలుత సీసీఎంల ద్వారా బ్లూమ్స్గా మారుస్తారు. ఈ బ్లూమ్స్ను డిమాండ్ను బట్టి రోలింగ్ మిల్స్ విభాగంలో రీబార్స్, యాంగిల్స్, చానెల్స్ తదితర ఫినిష్డ్ స్టీల్గా చేస్తారు. కన్వర్టర్లో తయారైన లిక్విడ్ స్టీల్ను సీసీఎంలో పంపడం ద్వారా బ్లూమ్స్ తయారవుతాయి. గతంలో 3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పుడు ఎస్ఎంఎస్–1లో సీసీఎంల ద్వారా ఏడాదికి 2.82 మిలియన్ టన్నుల బ్లూమ్లు ఉత్పత్తి చేసేవారు. ఆధునికీకరణ తర్వాత సామర్థ్యం 3.5 మిలియన్ టన్నులకు పెరిగింది. తద్వారా 3.29 మిలియన్ టన్నుల బ్లూమ్స్ తయారయ్యే సామర్థ్యం ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ నిర్వహణలో సీసీడీ ఇంతటి కీలక విభాగం. ఇలాంటిదానిని ప్రైవేట్కు ఇస్తే... ప్లాంట్ మొత్తం వారి చేతుల్లో పెట్టినట్లేననే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. 680 మంది ఉద్యోగులను తొలగించే ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు. ఇప్పటికే వేలమంది కార్మికులను ఖర్చు నియంత్రణ (కాస్ట్ కటింగ్) పేరుతో బయటకి పంపారని గుర్తుచేస్తున్నారు. తాజా టెండర్లలో కూడా పూర్తిగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోని భారీ ప్రైవేటు సంస్థలే పాల్గొనే విధంగా నిబంధనలను రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.131.33 కోట్ల విలువైన ఆపరేషన్స్ పనులకు టెండర్ తుది గడువును జనవరి 3వ తేదీగా నిర్ణయించారు. 4వ తేదీన బిడ్ను తెరిచి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖ ఉక్కుకు కాకుండా మిట్టల్ కోసం పాటదశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఇటీవల మరింత స్పష్టమైంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆంధ్రుల హక్కుగా గొప్పగా చెప్పుకొనే ఈ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వాలని కోరలేదు. సరికదా... నక్కపల్లి వద్ద ఏడాదికి 24 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాక ఈ ప్రైవేట్ ప్లాంట్కు బొగ్గు గనులు ఇవ్వాలని కూడా టీడీపీ కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముద్ర వేసి.. వదిలించుకునే కుట్ర...విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం దొడ్డిదారి ప్రయత్నాలు చేసింది. మొదట ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ముద్ర వేసింది. అంతేకాక నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధించడం మొదలుపెట్టారు. అనంతరం ప్లాంటులో ఉన్న కాంట్రాక్టు కార్మికులను 5,500 మందిని తొలగించారు. ఇక రెగ్యులర్ ఉద్యోగులను కూడా వీఆర్ఎస్ ద్వారా 1,590 మందిని ఇంటికి సాగనంపారు. ఉద్యోగులు ఇంట్లో పడుకుని జీతాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? అంటూ ఏకంగా సీఎం చంద్రబాబు నవంబరు 15న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా ఉద్యోగుల నైతిక స్థ్యైర్యాన్ని దెబ్బతీశారు. ప్రజల్లో వారి పట్ల వ్యతిరేక ధోరణి వచ్చేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే అసలు సక్రమంగా జీతాలివ్వకుండా... ఉత్పత్తికి తగిన వేతనం అంటూ మెలికపెట్టారు. మూడో విడతలో మరో వెయ్యిమంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉద్యోగులు ఇంట్లో తిని పడుకుంటే జీతాలివ్వాలా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించాక వెంటనే యాజమాన్యం ఉత్పత్తికి తగిన వేతనమంటూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తాజాగా ప్లాంట్ ఆపరేషన్స్ను ప్రైవేట్పరం చేసేందుకు టెండర్లను ఆహ్వానించి మిగిలిన ఉద్యోగులను కూడా సాగనంపేందుకు నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది.కాపాడడమంటే ఇదేనా చంద్రబాబూ..?స్టీల్ ప్లాంట్ను కాపాడతాం అంటూ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు గెలిచాక పట్టించుకోవడం మానేశారు. ప్రైవేటీకరణకు బాటలు వేస్తున్నారని ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. ఒత్తిడి పెరగడంతో చివరకు ‘ప్యాకేజీ’ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే, ప్యాకేజీలో భాగంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు నడపడం, శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులను గణనీయంగా తగ్గించడం వంటి చర్యలు ప్రారంభించారని విమర్శిస్తున్నారు. అంతేకాక ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను తగ్గించి, గత ఏడాది సెప్టెంబర్ నుంచి పూర్తి జీతాలు చెల్లించడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు ఆపరేషన్స్ విభాగం టెండర్లు పూర్తయితే... మరింతమంది శాశ్వత ఉద్యోగులను తొలగించే ప్రమాదం ఉందని ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.మొదటి నుంచి వైఎస్సార్సీపీ పోరాటంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ మొదటినుంచి ఒకే పంథా అనుసరిస్తోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాలను వెనక్కి తీసుకునేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ దీర్ఘకాలం పాటు ఒత్తిడిని కొనసాగించడంతో ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రైవేటీకరణపై అడుగులు ముందుకుపడలేదు.దొడ్డిదారిలో కుట్రవిశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేసే కుట్రలు చాలా రోజులుగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ఎస్ఎంఎస్–1లో సీసీడీ సెక్షన్ ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచారు. తద్వారా ఈ విభాగంలో పనిచేసే 450 మంది రెగ్యులర్, 230 మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యోగాలు తొలగిస్తారనే ఆందోళన నెలకొంది. టెండర్లలో పాల్గొనే సంస్థలకు విధించిన నిబంధనలన్నీ చంద్రబాబు ప్రభుత్వం కనుసన్నల్లోని భారీ ప్రైవేటు సంస్థలకు కావాల్సిన విధంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ప్లాంట్ను దొడ్డిదారిలో ప్రైవేటుపరం చేసే కుట్రగా అర్థమవుతోంది. – జగ్గునాయుడు, గౌరవాధ్యక్షుడు, విశాఖ స్టీల్ ప్లాంట్, సీఐటీయూముక్తకంఠంతో ఖండిస్తున్నాంఏవో చిన్నచిన్న విభాగాలను కాకుండా ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ సెక్షన్నే ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది మొత్తం ప్లాంట్ను ప్రైవేటుపరం చేసేందుకేనని స్పష్టమవుతోంది. ఒకవైపు ప్రైవేటుకు ఇవ్వమని చెబుతూనే, మరోవైపు కీలక విభాగాలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు టెండర్లను పిలవడం ఏమిటి? ఇదంతా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి సహకారంతోనే జరుగుతోంది. దీనిని ప్లాంట్ కార్మికులతో పాటు ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలి. – దాలినాయుడు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ స్టీల్ ప్లాంట్ అధ్యక్షులుటెండర్లను రద్దు చేయాలి స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్ఎంఎస్)... స్టీల్ప్లాంట్కు గుండెకాయ వంటిది. దానిని ప్రైవేటీకరించడం అంటే ప్లాంట్ను ప్రైవేటీకరణే అవుతుంది. మెయింటినెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణను ఆపరేషన్స్కూ వర్తింపజేయడం దుర్మార్గం. యాజమాన్యం వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలి. – ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ స్టీల్ప్లాంట్ విభాగం -
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, భారత త్రివిధ దళాలు ప్రతినిత్యం అప్రమత్తతతోనే ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. అప్రమత్తత, యుద్ధసన్నద్ధతే మనల్ని విజయం వైపు తీసుకెళుతుందని, విజయాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. యుద్ధ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నష్టం భారీగా ఉంటుందని, త్రివిధ దళాల సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని ఆయన చెప్పారు. శనివారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో 216 బ్యాచ్కు చెందిన 29 మంది మహిళా అధికారులతో సహా మొత్తం 244 మంది కేడెట్లు పాల్గొన్నారు. వీరిలో భారత నావికాదళం నుంచి ఎనిమిది మంది అధికారులు, భారత కోస్ట్ గార్డ్ నుంచి ఆరుగురు, వియత్నాం వైమానిక దళం నుంచి ఇద్దరు అధికారులు ఉన్నారు. ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన ఫ్లయింగ్ బ్రాంచ్, నావిగేషన్, గ్రౌండ్ డ్యూటీ శాఖల ఫ్లైట్ క్యాడెట్లకు ‘వింగ్స్’, ‘బ్రెవెట్స్’ప్రదానం చేశారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీలు బహూకరించారు. భారత వాయుసేనతోపాటు పరేడ్లో పాల్గొన్న భారత నౌకాదళం, కోస్ట్గార్డ్స్ వియత్నాం సోషలిస్ట్ రిపబ్లిక్ ఫ్లయింగ్ కేడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం యువ అధికారులనుద్దేశించి సీడీఎస్ మాట్లాడారు. మూడు సూత్రాలు మరవొద్దు..: మూడు మూల సూత్రాలను ఎప్పుడూ మరవొద్దని యువ అధికారులకు సీడీఎస్ అనిల్ చౌహాన్ సూచించారు. ‘మొదటిది.. జీవితమనేది సైకిల్ ప్రయాణం వంటిది. సమతుల్యత ఉంటేనే ప్రయాణం ముందుకు సాగుతుంది. రెండోది.. ప్రమాదకరమైన గర్వాన్ని, నిర్లక్ష్యాన్ని మీ దరిచేరనివ్వద్దు. మూడోది.. నిబంధనలు పాటించడంలో ఒక రాయిలా ఉండాలి’అని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత సైన్యం సైతం ఎన్నో మార్పులు చేసుకుంటోంది. ఈ తరుణంలో సర్విస్లోకి అడుగుపెట్టబోతున్న మీరు నూతన సవాళ్లకు తగినట్టుగా తయారు కావాలి. సాంకేతికత యుద్ధ క్షేత్రంలో కీలకంగా మారుతున్న తరుణంలో ఏఐ వాడకాన్ని పెంచడంతోపాటు అనేక నూతన సాంకేతికతలను భారత సైన్యానికి జోడిస్తున్నాం’అన్నారు. భారత సైన్యం కీర్తిని మీరు మరింత పెంచుతారని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆకాశ్గంగ స్కైడైవింగ్ బృందం, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ అద్భుతమైన ప్రదర్శనలతో పాటు, పిలాటస్ పీసీ–7, కిరణ్, చేతక్ విమానాల ఫ్లై–పాస్ట్లు..సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం వైమానిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. -
పల్లెల్లో ‘పైసా వసూల్’!
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పల్లెల్లో నగదు పంచిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు తిరిగి వసూళ్లకు తెరతీస్తున్నారు. తమను గెలిపిస్తారని డబ్బు పంచామని.. కానీ ఓడగొట్టినందున ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందేనని ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు నగదు పంపకాల జోరు పెంచారు. ఓ గ్రామంలో నలుగురు అభ్యర్థులు కలిపి ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేల చొప్పున ముట్టజెప్పారు.రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేసినా ఓడా.. నా డబ్బిచ్చేయండి నార్కట్పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరిగాడు. తనకు ఓటు వేయనివారు తాను పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘మా డబ్బు తీసుకొని మమ్మల్నే ఓడించారు. అందుకే మేం పంచిన డబ్బు తిరిగి ఇవ్వండి’ అని పట్టుబట్టారు. మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పగా దేవుడిపై ప్రమాణం చేయాలని కోరారు. తాము పేదవాళ్లమని, రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేసినా గ్రామస్తులు ఓట్లు వేయలేదని బాలరాజు దంపతలు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఓటర్లు మాత్రం ‘మేము డబ్బు పంచాలని అడగలేదు కదా.. మీరే ఇచ్చారు’ అని బాలరాజును తిరిగి ప్రశ్నించారు.కాంగ్రెస్ నేతకు బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుతో ఈ నెల 17న మూడో విడత ఎన్నికల్లో బరిలోకి దిగనున్న షేక్ గౌసుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత పోలగాని శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని లేఖ రాసిచ్చాడు. ఈ లేఖపై గౌసుద్దీన్తోపాటు బీఆర్ఎస్ కారేపల్లి గ్రామశాఖ పేరిట పలువురి సంతకాలు ఉన్నాయి. దేశ్ముఖిలో ఓటుకు రూ. 33 వేల చొప్పున పంపిణీ సాక్షి, యాదాద్రి: భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు భారీగా డబ్బు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఈ గ్రామంలో 1,367 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున ఇస్తుండగా మూడో అభ్యర్థి రూ. 8 వేలు, నాలుగో అభ్యర్థి రూ. 5 వేల చొప్పున పంచుతున్నారు. ఈ లెక్కన ఒక్కో ఓటరుకు రూ. 33 వేలు ముడుతున్నాయన్నమాట.వయసు, మెజారిటీ 71 యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండాకు చెందిన ధీరావత్ గాశీరాంనాయక్ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి గెలిచాడు. గాశీరాంనాయక్ వయసు 71 ఏళ్లుకాగా సమీప ప్రత్యర్థిపై ఆయనకు లభించిన మెజారిటీ ఓట్లు కూడా 71 కావడం విశేషం.ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధుల కోసం వచి్చన అధికారులు, సిబ్బందికి భోజనం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న 100–150 మంది ఉద్యోగులకు భోజనం లేకపోవడంతో తాము ఎక్కడ భోజనం చేయాలంటూ వాపోయారు. అధికారులపై మండిపడ్డారు.ఓట్ల రద్దీ.. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతవాసులు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఇలా కిటకిటలాడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు జగ్గారెడ్డి సన్మానం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించడం మామూలే. కానీ ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు శాలువాలు కప్పి సన్మానించిన ఘటన సంగారెడ్డిలో శనివారం జరిగింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 87 మంది పోటీ చేయగా వారిలో 45 మంది గెలిచారు. ఓటమి పాలైన 42 మంది సర్పంచ్ అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శాలువాలతో సన్మానించారు. వారిలో కొండాపూర్ మండల కేంద్ర సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిన మస్కు అవినేని నర్సింహారెడ్డిని సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఓట్లేయలేదుగా.. నా సొమ్ము తిరిగివ్వండి వర్గల్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో వార్డుసభ్యునిగా ఓడిపోయన అభ్యర్థి ఓటర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వీడియో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు పంచినప్పటికీ తనకు ఓట్లు పడలేదనే భావనతో ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసుకున్నాడు. అలా వెనక్కి తీసుకున్న నగదును లెక్కపెట్టుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఓటు కోసం సౌదీ టు మిరుదొడ్డి మిరుదొడ్డి (దుబ్బాక): పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు విదేశాల నుంచి తరలివచ్చి ఓ వ్యక్తి ఓటు విలువను చాటిచెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఎల్ముల బాల్రాజు నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఆదివారం జరగనున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు సౌదీ నుంచి మిరుదొడ్డికి చేరుకున్నాడు. -
3 గంటలు స్టేటస్.. 24 గంటలూ సేల్స్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్గా నగరానికి వలసవచ్చి డ్రగ్ పెడ్లర్గా మారిన శ్రీకాకుళం వాసి వ్యవస్థీకృతంగా, కొత్త పంథాలో ఈ దందా చేస్తున్నాడు. వర్చువల్ నంబర్ వినియో గిస్తూ.. తన వద్దకు సరుకు వచ్చిన సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్ ద్వారా కస్టమర్లకు చేరవేస్తున్నాడు. మాదకద్రవ్యాలను దోశల మాదిరిగా ప్యాక్ చేసి, డెలివరీ బాయ్స్ సహకారంతో ఆర్డర్ ఇచ్చిన వారి వద్దకు పంపిస్తున్నాడు. ఈ వ్యవహారం గుట్టును రట్టు చేసిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ఐదుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి ఐదేసి కేజీల చొప్పున గంజాయి, హష్ ఆయిల్, ద్విచక్ర వాహనం సహా రూ.70 లక్షల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నారు. శనివారం విలేకరుల సమావేశంలో డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఈ వివరాలు వెల్లడించారు. సహచరుల కోసం దందా మొదలుపెట్టి.. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన వైకుంఠ రావు 2017లో హైదరాబాద్కు వలసవచ్చి, మాదాపూర్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం ధూల్పేట నుంచి గంజాయిని కొనుక్కుని వెళ్లి తన సహచర డ్రైవర్లకు విక్రయించే వాడు. లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయి పూర్తిగా మాదకద్రవ్యాల దందా మొదలు పెట్టాడు. తొలుత ధూల్పేట నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్మేవాడు. 2020 నుంచి ఒడిశా విక్రేతల వద్ద నుంచి గంజాయి, హష్ ఆయిల్ తీసుకువచ్చి విక్రయించడం మొదలు పెట్టాడు. దీనికి సంబంధించి 2021లో సనత్నగర్, ఈ ఏడాది జూన్లో కొత్తవలస ఠాణాల్లో కేసులు నమోదై జైలుకు వెళ్లాడు. ఆధారాలు చిక్కకుండా పథకం.. జైలు నుంచి బయటకు వచ్చిన వైకుంఠ రావు తన పంథా మార్చేశాడు. ఉనికి బయటపడకుండా దందా చేయడానికి నిర్ణయించుకుని ఒడిశాకు చెందిన హష్ ఆయిల్ తయారీదారుడు పాల్ ఖిలా, సప్లయర్ కృష్ణ జల్లాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు.పాల్ నుంచి గంజాయి, హష్ ఆయిల్ సేకరించే కృష్ట నగరానికి తీసుకువచ్చి మాదాపూర్లోని వైకుంఠ రావు ఇంట్లో డెలివరీ ఇచ్చేవాడు. తన గుర్తింపు బయటపడకుండా వర్చువల్ నంబర్ వాడుతున్న వైకుంఠ రావు సరుకు వచ్చిన ప్రతిసారీ మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 వరకు ‘గ్రీన్ అవైలబుల్’అంటూ స్టేటస్ పెట్టేవాడు. దీన్ని చూసే ఇతడి రెగ్యులర్ కస్టమర్లు ఎంతెంత కావాలో వాట్సాప్లోనే ఆర్డర్ ఇచ్చేవారు. దానికి అయ్యే మొత్తాన్ని ఆన్లైన్లో వసూలు చేసే వైకుంఠ రావు, సరుకు పంపడానికి తన బంధువులైన బాలాజీ, చైతన్యలను డెలివరీ బాయ్స్గా ఏర్పాటుకున్నాడు. గంజాయి, హష్ ఆయిల్ టిన్నులను దోశ మాదిరిగా పేపర్లో ప్యాక్ చేసి, వీరి ద్వారా సరుకు అయిపోయే వరకు 24 గంటలూ సరఫరా చేసేవాడు. బాలాజీ చిక్కడంతో కదిలిన డొంక.. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో టోలిచౌకి వద్ద కాపుకాశారు. అక్కడ ఓ కస్టమర్కు గంజాయి డెలివరీ చేయడానికి వచ్చిన బాలాజీని పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మాదాపూర్లోని వైకుంఠరావు గదిపై దాడి చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ రావుతో పాటు అక్కడే ఉన్న పాల్, కృష్ణ, చైతన్యలను అదుపులోకి తీసుకున్నారు. ఆ గది నుంచి హష్ ఆయిల్, గంజాయిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును టోలిచౌకి పోలీసులకు అప్పగించారు. వైకుంఠ రావు ఫోన్ను తనిఖీ చేసిన పోలీసులు 120 మంది వినియోగదారులను గుర్తించారు. వీరిలో ఐటీ, సినీ రంగానికి చెందిన వారితో పాటు డాక్టర్లు, ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. వీరికి కుటుంబీకుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి రీహ్యాబ్కు పంపాలని నిర్ణయించామని, ఇలాంటి డ్రగ్స్ దందాలపై సమాచారం ఉంటే 8712661601 నంబర్కు ఫోన్ చేసి తెలపాలని డీసీపీ వైభవ్ కోరారు.
