breaking news
-
‘చంద్రబాబుది దుర్మార్గమైన పాలన’
విజయవాడ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో హత్యలు, అఘాయిత్యాల, అమానుషాలు, దాడులు, వివక్ష, వెలివేతలు కోకొల్లలుగా సాగుతున్నాయని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. సామాజిక అసమానతలు రెచ్చగొట్టేలా ఏపీలో పాలన సాగుతోందని మండిపడ్డారు. కూటమి పాలనలో శాంతి భద్రతలపై ఈరోజు(మంగళవారం, జూన్ 30వ తేదీ) విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మేరుగ మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. సామాజిక అసమానతలు రెచ్చగొట్టేలా ఏపీలో పాలన సాగుతోంది. పరిపాలనలో తన., మన బేధాలు పాటిస్తున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు పాలన దుర్మార్గమైన పాలన. ముద్దాయిలుగా ఉన్న నేతలతో కలిసి పాలన చేస్తున్నారు. దళిత ప్రిన్సిపాల్ ను వేధించిన కూన రవికుమార్ పై ఇప్పటి వరకూ నో కేస్. విజయనగరం జిల్లాలో ఎస్సీలు, బీసీల పై దాడులు చేస్తే నో కేస్. విశాఖ జిల్లాలో మహిళను వివస్త్రగా మార్చితే ఎమ్మెల్యే పై నో కేస్. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలో దళితులను వెలివేస్తే నో కేస్. కాకినాడలో ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రిన్సిపల్ ను చెంపదెబ్బ కొడితే నో కేస్. రాజమండ్రిలో సాగర్ అనే దళిత యువకుడిని బట్టలిప్పి నిలబెడితే నో కేస్. సాయికృష్ణ , క్రాంతికుమార్ కుటుంబాలకు న్యాయం చేయాలి. దళిత మహిళ హోంమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తోంది’ అని పేర్కొన్నారు. -
ప్రపంచాన్ని మార్చిన ఆలోచన.. ఆలా పుట్టింది ATM పిన్!
ప్రస్తుతం జేబులో పర్సు లేకపోయినా, చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కార్డు.. దానికి తోడు నాలుగు అంకెల రహస్య కోడ్ (PIN) ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా నిమిషాల్లో నగదును చేతిలోకి తెచ్చుకోవచ్చు. బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా, మన డబ్బుకు కొండంత భద్రతను ఇచ్చే ఈ 'ఏటీఎం పిన్' వెనుక ఓ ఆసక్తికరమైన, మరెంతో ఆశ్చర్యకరమైన చరిత్ర దాగుంది. కోట్లాది రూపాయల లావాదేవీలను కాపలా కాసే ఈ అద్భుత సాంకేతికతను కనిపెట్టిన మేధావికి అప్పట్లో దక్కిన పారితోషికం ఎంతో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసు కోవాల్సిందే!1960ల కాలంలో బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా ప్రక్రియను సులభతరం చేసేందుకు అంతర్జాతీయంగా పరిశోధనలు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్కు చెందిన ఒక ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్న జేమ్స్ గుడ్ఫెలో అనే స్కాటిష్ ఇంజనీర్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. వినియోగదారుడి గుర్తింపును మానవ ప్రమేయం లేకుండా, యంత్రమే స్వయంగా ధృవీకరించేలా ఒక ప్లాస్టిక్ కార్డును, దానికి అనుసంధానంగా ఒక రహస్య సంఖ్యను (Personal Identification Number - PIN) కలిపి పనిచేసే సాంకేతికతను ఆయన 1966లో అభివృద్ధి చేశారు.కేవలం 10 పౌండ్ల బహుమతి!జేమ్స్ గుడ్ఫెలో కనిపెట్టిన ఈ పిన్ వ్యవస్థ బ్యాంకింగ్ రంగాన్నే మార్చేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఏటీఎం కేంద్రాలు ఈ భద్రతా సూత్రం ఆధారంగానే నడుస్తున్నాయి. కానీ, ఇంతటి విప్లవాత్మక ఆవిష్కరణ చేసినందుకు గాను, ఆ రోజుల్లో ఆయన పనిచేస్తున్న సంస్థ ఆయనకు అందించిన బోనస్ ఎంతో తెలుసా? కేవలం 10 పౌండ్లు మాత్రమే!ప్రస్తుత భారతీయ కరెన్సీ విలువ ప్రకారం చూస్తే ఇది సుమారు వెయ్యి రూపాయల లోపే ఉంటుంది."ఆవిష్కరణ నాదే అయినా, కంపెనీ నిబంధనల ప్రకారం నాకు దక్కిన బోనస్ కేవలం పది పౌండ్లు మాత్రమే" అని జేమ్స్ గుడ్ఫెలో తర్వాతి కాలంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం. లండన్లో మొదలైన ప్రస్థానం..జేమ్స్ గుడ్ఫెలో ఈ సాంకేతికతను రూపొందించిన మరుసటి సంవత్సరమే, అంటే 1967లో లండన్ నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు పంపిణీ యంత్రాన్ని (Cash Machine) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ సాంకేతికత ఖండంతరాలు దాటి విస్తరించింది. 1973 జూన్ 4న ఈ వ్యవస్థకు అమెరికాలో అధికారికంగా పేటెంట్ లభించడంతో, ఆధునిక ఏటీఎంల యుగం ఊపందుకుంది. భద్రతకు కేరాఫ్ అడ్రస్!.నేడు మనం ఏటీఎం సెంటర్కు వెళ్లినప్పుడు తప్పుడు పిన్ నంబర్ను వరుసగా మూడు సార్లు నమోదు చేస్తే కార్డు బ్లాక్ అయిపోతుంది. మన ఖాతాలోని సొమ్ము సైబర్ నేరగాళ్ల పాలు కాకుండా అడ్డుకునే ఈ పటిష్టమైన భద్రతా వలయానికి పునాది వేసింది ఆ 10 పౌండ్ల ఆవిష్కరణే కావడం విశేషం. ఆర్థిక రంగాన్ని డిజిటల్ వైపు నడిపించిన ఈ స్కాటిష్ మేధావి సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం, 2006లో ఆయనకు ప్రతిష్టాత్మక 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' (OBE) గౌరవాన్ని అందించింది. పారితోషికం చిన్నదైనా, ఆయన అందించిన సాంకేతికత మాత్రం ప్రపంచ మానవాళికి అందించి సేవ అమూల్యమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు!.- పసుపులేటి వెంకటేశ్వరరావు. -
'నిజమేంటో తెలుసుకోండి.. డెలివరీ బాయ్ వివాదంపై అఖిల్ రాజ్'
డెలివరీ బాయ్ వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ స్పందించారు. అతన్ని కావాలని తాను కొట్టలేదన్నారు. అమ్మతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతోనే నేను అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. తప్పుడు అడ్రస్లో ఇచ్చిన అతను.. మా అమ్మతో అసభ్యంగా మాట్లాడారని అఖిల్ రాజ్ తెలిపారు. మా అమ్మను నీచంగా మాట్లాడడంతోనే నాకు కోపం వచ్చిందని అఖిల్ రాజ్ వెల్లడించారు. అంతే కానీ ఆ అబ్బాయిని కొట్టాల్సిన అవసరం నాకు ఏముందని అన్నారు. అతన్ని కొడితే నా కెరీర్కు ఏమైనా ఉపయోగపడుతుందా? అని ప్రశ్నించారు. ఇలా అడ్రస్ పొరపాటుగా ఇప్పటికీ దాదాపు పదిసార్లు జరిగిందని అఖిల్ రాజ్ తెలిపారు. నేను కూడా ఒకప్పుడు డెలివరీగా బాయ్గా పనిచేసి ఈ స్థాయికి వచ్చానని వెల్లడించారు. అడ్రస్ పొరపాటు వల్ల ఒకసారి కండోమ్స్, సిగరెట్స్ కూడా మా ఇంటికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొడవతో మా అమ్మ, నాన్న కూడా పానిక్ అయ్యారని పేర్కొన్నారు. నెేనైతే అతనిపై కావాలని కొప్పడలేదని అమ్మతో అసభ్యంగా మాట్లాడడం వల్లే తనకు కోపం వచ్చిందన్నారు. మాకు సంబంధం లేని ఆర్డర్ తీసుకొచ్చి నానా హంగామా చేసిన డెలివరీ బాయ్ను మీరు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఈ వివాదంపై అఖిల్ రాజ్ స్పందిస్తూ..' మా ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. అయినా ఫుడ్ పార్శిల్ వచ్చింది. మా అమ్మ ఆ పార్శిల్ తీసుకుని ఎవరు ఆర్డర్ పెట్టారని అడిగింది. ఎవరూ ఆర్డర్ చేయలేదు అని తెలుసుకుని పక్కనే పెట్టేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఫ్రీగా వస్తే తీసుకుంటారా అంటూ మా అమ్మను దుర్భాషలాడాడు. తాగిన మత్తులో ఉన్న ఆ డెలివరీ బాయ్ మా అమ్మను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒక కొడుకుగా నా బాధ్యతగా డెలివరీ బాయ్ను మర్యాదగా మాట్లాడమని మందలించా. ఆ డెలివరీ బాయ్ ఆ వీడియో తీసి ఇదంతా సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అసలు జరిగింది తెలుసుకోకుండా కొందరు నాపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఊరుకుంటారా. నేను ఒక హీరోగా ఇంకాస్త సంయమనం పాటించాల్సి ఉండాల్సింది. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సింది. అయితే మా అమ్మను తిట్టినందుకు కోపం ఆపుకోలేకపోయా. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినే. ఇలా డెలివరీ బాయ్ పనులు చేసిన వాడినే. నా సినిమాలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చెప్పాం. అలాంటి నేను అకారణంగా డెలివరీ బాయ్తో ఎందుకు గొడవపెట్టుకుంటా. అతనితో గొడవ పెట్టుకుంటే నాకు వచ్చేదేంటి. నన్ను సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్న మిత్రుల కోసమే ఈ వివరణ ఇస్తున్నా' అని అన్నారు. -
ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు : సియా సోదరుడిపై అనుమానాలు
పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ పాత్రపై కూడా ఇప్పుడు పోలీసుల నిఘా పెట్టారు. సియా-చేతన్ల ప్రేమ వ్యవహారం సాహిల్కు ముందే తెలుసా? అతను ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే కుటుంబ సభ్యుల నుండి దాచాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై ఇప్పటివరకు నోరు విప్పని సాహిల్, ఒకమీడియాతో తొలిసారి స్పందించాడు. అయితే అతని వ్యాఖ్యలకు, పోలీసుల దర్యాప్తుకు మధ్య అనేక వ్యత్యాసాలు కనిపిస్తుండటంతో మరింత గందరగోళం నెలకొంది.సియాకు పెళ్లి ఇష్టమే..కానీతాను కేతన్ అగర్వాల్ను మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, చేతన్తో సంబంధాన్ని కొనసాగించే ఉద్దేశం తనకు లేదని సియా తనతో చెప్పిందని సాహిల్ తెలిపాడు. తమ మధ్య ఏమీ లేదని, ఇకపై చేతన్తో ఎలాంటి సంబంధం పెట్టుకోనని తనపై ఒట్టు వేసిందని కూడా చెప్పాడు అందుకే, సియా, చేతన్ గురించి తాను ఎవరికీ చెప్పలేదన్నాడు. వాళ్లు స్నేహితులుగా ఉంటారని భావించి, దీనిపై తల్లిదండ్రులకు చెప్పలేదని అతను చెప్పుకొచ్చాడు.కన్ఫ్యూజన్లో ఉంది : సియా తన బంధం విషయంలో కొంత గందరగోళంలో ఉందని, వయసు రీత్యా స్నేహాన్ని ప్రేమగా అనుకోవడం సహజమేనని, అందుకే తాను ఆమెకు నచ్చజెప్పానని సాహిల్ అన్నాడు. ఆమె కేతన్తో పెళ్లికి, ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఎంతో సంతోషంగా ప్లాన్ చేసుకుందని చెప్పుకొచ్చాడు.డ్రైవర్ సాక్ష్యంతో అనుమానాలుసాహిల్ చెబుతున్న మాటలకు, పోలీసుల దర్యాప్తులో తేలుతున్న విషయాలకు అస్సలు పొంతన కుదరడం లేదు. సియాకు కేతన్తో పెళ్లి ఇష్టం లేదనే నిజాన్ని ఆమె సాహిల్కు ముందే చెప్పిందని, అయినా అతను సైలెంట్గా ఉన్నాడని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. డ్రైవర్ ఇచ్చిన కీలక సాక్ష్యం పోలీసులు సాహిల్ను అనుమానాలను మరింత బలోపేతం చేస్తోంది.ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం బాలికి వెళ్లేందుకుగాను ఎయిర్పోర్ట్కు వెళ్లడానికి సియా నిరాకరించినప్పుడు, సాహిల్ బలవంతంగా ఆమెను కారెక్కించాడని కారు డ్రైవర్ పోలీసులకు సాక్ష్యం ఇచ్చాడు.పాస్పోర్ట్ చింపేసినాబాలి ట్రిప్కు వెళ్లడానికి ముందే కేతన్ పాస్పోర్ట్ను సియా చింపేసిన విషయం సాహిల్కు తెలిసినప్పటికీ, అతను ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఎవరికీ చెప్పకపోవడం పోలీసులలో అనుమానాలను మరింత పెంచింది. ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్సాహిల్ ఎందుకు మౌనంగా ఉన్నాడు?ప్రస్తుతానికి సాహిల్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చకపోయినప్పటికీ, సోమవారం నాడు పోలీసులు అతన్ని దాదాపు 10 గంటల పాటు విచారించి, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసు కేవలం ఒక 'హత్య' మాత్రమే కాకుండా, దీని వెనుక పెద్ద 'ముందస్తు ప్లాన్ (కుట్ర)' ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కుట్రలో సాహిల్ కూడా సియా, చేతన్లకు ఏమైనా సహాయం చేశాడా? లేక అంతా తెలిసి కూడా మౌనంగా ఉన్నాడా? అని పోలీసులు తేల్చనున్నారు.ముందే హెచ్చరించిన కుటుంబ జ్యోతిష్యుడుసియా గోయల్, చేతన్ చౌదరిల జాతకాలను నలుగురు వేర్వేరు జ్యోతిష్యులు ద్వారా పరీక్షించినపుడు, వారిలో ముగ్గురు వారిద్దరూ అనుకూల ఫలితాలను అందించారట. కేతన్ అగర్వాల్ తల్లిదండ్రుల వివాహానికి పురోహితుడిగా వ్యవహరించిన అగర్వాల్ కుటుంబ పురోహితుడు, వీరి పెళ్లికి సుముఖంగా లేరని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.కుటుంబ పురోహితుడు ఈ సంబంధంపై ఆందోళన వ్యక్తం చేశారని, సియా కేతన్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అతనికి శారీరకంగా హాని కలిగే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. ఇన్ని అభ్యంతరాలున్నప్పటికీ, తన తండ్రి మద్దతుతో కేతన్ సియాను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడని తెలుస్తోంది.(హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు)కాగా జూన్ 18న లోహగడ్ కోటపై కేతన్ అగర్వాల్ను సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కిందకు తోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
స్కూల్ బస్సుపై పడ్డ చెట్టు.. ఓ విద్యార్థి మృతి, 10 మందికి గాయాలు
ముంబైలోని ఓ పాఠశాల బస్సుపై చెట్టు విరిగిపడింది. దీంతో బస్సులోని ఓ విద్యార్థి మృతి చెందగా, మరో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు వస్తున్నాయి. అందుకే చెట్టు కూలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం చెంబూర్లోని రోడ్ నం.11లో జరిగింది. ఆ సమయంలో ఆ స్కూల్ వ్యాన్లో మొత్తం 13 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన విద్యార్థుల్లో కొందరిని జైన్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో చిక్కుకుపోయిన ఒక చిన్నారిని బయటకు తీసేందుకు అత్యవసర సహాయ బృందాలు కూలిపోయిన చెట్టును కోస్తున్నాయి.ఆ ప్రాంత ప్రజలు, చెట్ల కొమ్మలను కత్తిరించాలని లేదా తొలగించాలని కోరుతూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు పలుసార్లు లేఖలు రాశామని చెప్పారు. ఇంతకుముందు కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగిందని తెలిపారు. పలుసార్లు హెచ్చరించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు.ఇదిలా ఉండగా, ముంబై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. -
‘వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మొహన్ రెడ్డి పాదయాత్ర మొదలైతే..కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లేనని మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ స్పష్టం చేశారు. మేకప్ మంత్రి అంటూ తాను చేసిన కామెంట్స్కు మహిళా కమిషన్కు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారం మహిళా కమిషన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.నేను మహిళలను అవమానించానని టీడీపీ నాపై తప్పుడు ప్రచారం చేసింది. నేను చేసిన కామెంట్ పొలిటికల్ సెటైర్ మాత్రమే. హోంమంత్రి అనిత మా పార్టీ నేతలపై అనేకసార్లు ఇష్టానుసారం మాట్లాడారు. వ్యవస్థలపై గౌరవంతోనే విచారణకు హాజరయ్యాను. నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని మహిళా కమిషన్కు చెప్పాను.టీడీపీ, కూటమి నేతలు ఊహించున్నవాటికి సమధానం చెప్పాల్సిన అవసరం లేదు.రాజకీయంగా మీరు వంద అంటున్నారు.. మేం ఒక్కటంటే బాధ వచ్చిందా..?. రాష్ట్రంలో మహిళలు,చిన్నారులపై హత్యలు, అత్యాచారాలపై హోంశాఖ ఎందుకు మాట్లాడటం లేదు.సాయికృష్ణ తల్లి బూడిద కోసం బాధపడుతుంటే ఎందుకు స్పందించరు. ఉప్పాల హారికపై దాడి జరిగితే ఎందుకు స్పందించరు?. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దారుణాలపై ఎందుకు మాట్లాడరు..?.డిప్యూటీ స్పీకర్ మాటలు చూస్తుంటే ఇప్పుడున్న హోంమంత్రి పనికి రారా అనిపిస్తోంది. మహిళలపై దాడులు జరుగుతుంటే స్పందించని హోంమంత్రి పదవి ఉంటే ఎంత?.. ఊడితే ఎంత..? అని మండిపడ్డారు.మహిళలపై నాకు అపారమైన గౌరవం ఉంది. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే.కూటమి నేతలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. -
గృహస్థుడిగా మెకానికల్ ఇంజనీర్ ..!
గృహిణి అన్న మాట విన్నంతగా గృహస్థుడు అన్న మాట చాలా తక్కువ, అరుదు. పైగా పిల్లలు పుడితే చాలామటుకు భార్యలే తమ కెరీర్ని వదులకుంటారు. కొందరు మహిళలు పిల్లలు కాస్త పెద్దయ్యాక మళ్లీ తమ కెరీర్ని మొదలుపెడతారు. కానీ ఈ భర్త స్త్రీ పురుషులు సమానం అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ప్రతీ మగాడి విజయం వెనకాలే కాదు ఓ మహిళ విజయం వెనకాల కూడా ఓ మగాడు ఉంటాడు. అది సాధ్యమే అని నిరూపించాడు ఈ వ్యక్తి. బిహార్లోని మోతిహారి జిల్లా చంపారన్కు చెందిన అమిత్ కుమార్ దూబే వైవాహిక జీవితంలో భర్త పాత్రకు కొత్త నిర్వచనం చెప్పాడు. అతడు గృహిణి మాదిరిగా ఇంటి బాధ్యతలన్నీ నిర్వహిస్తాడు. అమిత్ డిప్లోమా మెకానిక్ ఇంజనీర్. అతడు ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహం 2015 డిసెంబర్లో అయ్యింది. తన భార్య ప్రీతి ఉద్యోగం కోసం తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. నిజానికి అమిత్ హిమాచల్ ప్రదేశ్లోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసేవాడు. అతడి భార్య మరొక చోట బ్యాంకులో క్లర్క్గా ఉద్యోగం చేస్తుండేది. ఇలా ఇరువుకి మధ్య ఉద్యోగ రీత్యా ఉన్న ఎడబాటుని భరించలేక ఆమె పనిచేసే చోటే ఉద్యోగం చూసుకున్నాడు కూడా. అయితే ఆమెకు గర్భస్రావం అవ్వడంతో ఆమె బాగోగులు కోసం కొన్నేళ్లు సెలవు పెట్టాడు. ఆ తర్వాత కూడా ఆమె పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో లాంగ్ లీవ్ పెట్టడానికి ప్రైవేట్ కంపెనీ అనుమతించకపోవడంతో జాబ్ వదులుకోక తప్పలేదన్నారు. ఆ తర్వాత ఆమె మరోసారి ప్రెగ్నెంట్ అవ్వడంతో తానే దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకోండం కోసం మళ్లీ తిరిగి జాబ్లో జాయిన్ అవ్వలేకపోయానన్నారు. తమకు ఒక పాప అని అన్నారు. అయితే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం తోపాటు బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడం కష్టంగా మారడంతో ఇక తానే ఉద్యోగం మానేసి ఇంటి బాధ్యతలను తీసుకోవాలని నిశ్చయించుకున్నానని చెప్పుకొచ్చారు. రోజంతా ఇంటి పనులు చూసుకోవడం, కూతురికి హోం వర్క్లో సహయం చేయడం వంటివి చేస్తుంటానని అన్నారు. అప్పుడప్పుడూ ఒంటరిగా ఉంటే..మాత్రం తానేమి చేయలేకపోతున్నాననే బాధ అయితే వస్తుంటుందని అన్నాడు. తనే ఇంటికి పెద్ద వాడినని, చెల్లెళ్లు లేరని అన్నారు. అయితే పెద్దవాడిగా తన కుటుంబానికి ఏం చేయలేకపోతున్నాననే బాధ వెంటాడుతుంటుందని చెప్పుకొచ్చాడు. అయితే ఖాళీ సమయంలో ఫుడ్ బిజినెస్ చేద్దామనే ఆలోచన ఉందని, అందుకోసం దాదాపు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఉద్యోగక కెరీర్ కోల్పోయానన్న బాధ ఉన్నా..తను చేస్తున్న పనిని చాలామంది అభినందిస్తున్నారని, అందుకు చాలా సంతోషం ఉంటుందని అంటున్నాడు. నిజంగా అమిత్ చాలా గ్రేట్ కదూ..మెకానికల్ ఇంజనీర్ అయినప్పటికీ..తన గురించి అభద్రతా భావానికి లోనుకాకుండా..తన భార్యకు అండగా నిలుస్తూ..కూతురు బాగోగులు చూసుకోవడం కోసం తన కెరీర్ని వదులుకున్నాడు. అంతేగాదు గృహనిర్వహణ గౌరవప్రదమైనదే అని, మగవాళ్లు కూడా నిర్వర్తించొచ్చు అని నిరూపించాడు. View this post on Instagram A post shared by House husband | Amit Kumar Dubey (@househusbandamit) (చదవండి: Upasana Konidela: స్లిమ్గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..) -
దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు.. అందుకే ఇలా..: పెద్దిరెడ్డి
తిరుపతి: దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో తాము వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి మల్లన్న కొండ మీద మైనింగ్ అనుమతులు రద్దు చేయించామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ అనుమతులన్నీ నిలిపేశామని చెప్పారు. 2015లో చంద్రబాబు స్వయంగా లైసెన్సులు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా దేవాలయాల ఆస్తులపై కన్ను వేస్తారని ఆరోపించారు.తిరుపతిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘మల్లయ్య కొండలో ఇనుప ఖనిజం దోపిడీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో ఆ పాపాన్ని వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 20 కోట్ల రూపాయలు మల్లయ్య కొండ అభివృద్ధికి కృషి చేసింది. టీడీపీ పాలనలో ఒక్క పైసా అభివృద్ధి ఎందుకు చేయలేదు? గతంలో కాలిబాట కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి ఆలయ జీర్ణోద్ధరణ చేసి, రోడ్లు వేసి, విద్యుత్ సరఫరా, మంచినీరు, ఇతర సదుపాయాలు అందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. 2022లో ఎర్రకొండలో మైనింగ్ కు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన మాట వాస్తవమే. అయినా కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎర్రకొండలో మైనింగ్ అనుమతులు ఉన్నా కూడా మేము ఆ ప్రక్రియ కొనసాగించలేదు. అనుమతులు వచ్చినా మైనింగ్ చేయకూడదు అని నిర్ణయించాం, పూర్తి గా నిలిపివేశాం. కానీ మేం ఆపేసిన ఎర్రకొండ అనుమతులు చూపించి, ఏకంగా ఆ శివుడు కొలువై ఉన్న సాధు కొండ, శివపురం లో మైనింగ్ కు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది.సాధు కొండలో మైనింగ్ గురించి 2004 జనవరి 1 నుంచి జియోమైసూర్ సర్వీసెస్ అనే సంస్థ ప్రభుత్వంతో అనేకమార్లు సంప్రదింపులు జరిపింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు మళ్లీ జియో మైసూర్ సంస్థ అనేక లేఖలు ప్రభుత్వానికి రాసింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తంబళ్లపల్లె స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆ ప్రాంతంలో మైనింగ్ జరిగితే ప్రజలతో పాటుగా తాను వ్యతిరేకిస్తాను అని స్వయంగా అప్పటి మైనింగ్ మంత్రి గల్లా అరుణ కుమారి కి చెప్పారు. ఈ విషయం నేను చెప్పట్లేదు….. స్వయంగా గల్లా అరుణ కుమారి ఈ అంశాన్ని ఆమె పుస్తకంలో రాసుకున్నారు. 2015లో ప్రాస్పెక్టింగ్ లైసెన్స్.... అంటే ఖనిజాలు గుర్తించేందుకు లైసెన్స్ ఇచ్చారు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. సాధుకొండకు కూటమి ప్రభుత్వం 2025 నవంబర్ 27న టెండర్ పిలిచింది. ఏపీఎండీసీ దాఖలు చేసిన టెండర్ కు ప్రిఫర్ బిడ్డర్ కింద 900 హెక్టార్లలో ఈ ఏడాది ఏప్రిల్ 23న ఎల్.సి జారీ ఎలా చేశారు? శివపురంలో 626 హెక్టార్లలో మైనింగ్ కోసం 2025 ఫిబ్రవరి 27, సెప్టెంబర్ 4న ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వమే’’ అని చెప్పారు.దొంగే ‘దొంగ దొంగ..’ అన్నట్లు ఉంది.. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మైనింగ్ కు పూనుకుని మాపై విమర్శలు చేస్తుందని పెద్దిరెడ్డి విమర్శించారు . ‘‘తిరుమల 7 కొండలు లానే మల్లయ్య కొండ మూడు కొండలు పవిత్రమైనవి. మల్లయ్య కొండ జోలికి వెళితే భక్తులు ఊరుకోరు. రాష్ట్రంలో మామిడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక్క కేంద్రం మంత్రి ఉన్నా అక్కడ మామిడికి 17 రూపాయల మద్దతు ధర ఉంది. చంద్రబాబుకు రైతులు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. రాష్ట్రంలో పాలన లేదు, కేవలం కేసులు పెట్టడం, టార్చర్ చేయడం, గోర్లు పీకేయడం, చంపేయడమే జరుగుతుంది’’ అని విమర్శించారు. -
చంపేస్తామంటూ బెదిరింపులు.. ‘ఎక్స్’ నుంచి తప్పుకున్న రాహుల్ రవీంద్రన్
సోషల్ మీడియాలో నెగెటివిటీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కొంతమంది నెటిజన్స్ ద్వేషపూరిత కామెంట్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీల విషయంలో నెగెటివ్ ప్రచారం, బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. సంబంధం లేని విషయాలల్లోకి వాళ్లను లాగుతూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ విషయంలో ఇదే జరిగింది. తనను ట్రోల్ చేయడమే కాకుండా తన పిల్లలను చంపుతామంటూ బెదిరింపు కామెంట్స్ చేయడంతో ఆయన ‘ఎక్స్’కి గుడ్బై చెప్పాడు. తన ముబైల్ నుంచి ‘ఎక్స్’ యాప్ని తొలగిస్తున్నానని..ఇక నుంచి దీనికి చూడనంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించాడు.అసలేం జరిగింది?ఇటీవల పూణెలో హత్యకు గురైన కేతన్ అగర్వాల్ కేసుచుట్టూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఓ నెటిజన్ రాహుల్ను ట్యాగ్ చేస్తూ మహిళల సమస్యలపై సినిమా తీసినట్లే పురుషులపై జరుగుతున్న అన్యాయాలపై కూడా తీస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రాహుల్ సమాజంలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం బలంగానే ఉందని అభిప్రాయపడ్డాడు.ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కొందరు అతన్ని దూషించడమే కాకుండా, ఆయన సతీమణి చిన్మయిపై కూడా వ్యక్తిగత దాడులకు దిగడం ప్రారంభించారు.ఆ కామెంట్స్ తీవ్ర ఆవేదన కలిగించాయిఈ వాదనలు కేవలం సినిమా చర్చలకే పరిమితం కాలేదు. ఆయన పిల్లను చంపేస్తామని బెదిరింపులు స్థాయికి వెళ్లాయి. ఓ వ్యక్తి తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తూ చేసిన కామెంట్స్ని రాహుల్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. ఇలాంటి నెగెటివిటీని తన మనసులోకి తీసుకోలేకనే ఎక్స్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.బ్రెజిల్, జపాన్ ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో ఫుట్బాల్ ఆటకు సంబంధించిన ట్విటర్ అకౌంట్ కోసం ఈ యాప్(ఎక్స్) ఓపెన్ చేశా. పొరపాటున నోటిఫికేషన్లు చూశా. అవి చదివిన తర్వాత నా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ కనిపించిన వ్యాఖ్యలు నాలో తీవ్ర కోపం, ఆవేదన కలిగించాయి. ఆ కామెంట్ చేసిన వాడిని ఎలాగైనా వెతికి పట్టుకొని ఏదైనా చేయాలనే నా మైండ్లోకి వచ్చింది. కోపం వచ్చినప్పుడు మామూలుగా నేను నన్ను నేను శాంతించుకోమని చెప్పుకుంటాను. కానీ ఈసారి అలా చేయాలనిపించలేదు. నా తల చాలా వేడిగా ఉంది. చాలా సేపటి వరకు అక్కడే కూర్చొని, టీవీలో ఆటను చూడకుండానే దాని వైపు చూస్తూ ఉండిపోయాను. చాలా నెమ్మదిగా నా హృదయ స్పందన రేటు కొంతవరకు సాధారణ స్థితికి వచ్చింది.నా ఆలోచనలు నాకే నచ్చలేదుబహుశా నేను అతిగా స్పందిస్తున్నానేమో. ఇది నా తప్పేమో.. నా పిల్లలు ఈ ద్వేషానికి అర్హులమేమో. కానీ నాకు ఈ యాప్తో పని అయిపోయింది. కొంతకాలంగా దీని నుంచి బయటపడాలని అనుకుంటున్నాను. నేను అలా చేయలేకపోవడానికి ఏకైక కారణం, క్రీడల వార్తలకు ఇది అత్యుత్తమ మూలం కావడమే. కానీ నాకు ఇక చాలు. ఆ ట్వీట్ చదివిన తర్వాత అరగంట పాటు నేను ప్రవర్తించిన తీరు నాకే నచ్చలేదు. నా ఆలోచనలు నాకే నచ్చలేదు. అంతేకాక, నా ఆత్మగౌరవం చాలా బలమైనది, దేనినీ నాపై ఆధిపత్యం చెలాయించనివ్వను. నా ఫోన్ నుంచి ఈ యాప్ను తొలగిస్తున్నాను’అని రాహుల్ రవీంద్రన్ ఎక్స్లో రాసుకొచ్చాడు. I was sitting and watching the Brazil v Japan game. I wanted to check a football related Twitter account about something and I opened this app. Unfortunately, I made the mistake of checking my notifications too. And I came across this tweet. I wish I hadn’t. I kept staring at… pic.twitter.com/abRnWC58Y2— Rahul Ravindran (@23_rahulr) June 29, 2026 -
ఖరీదైన కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట
బుల్లితెర డాక్టర్బాబుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిరుపమ్. కార్తీకదీపం సీరియల్తో ఫేమ్ తెచ్చకున్న నటుడు నిరుపమ్. తన సహనటి మంజులనే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తున్నారు. టాలీవుడ్లోని ఫేమ్ ఉన్న బుల్లితెర జంటల్లో వీరిద్దరు ముందుంటారు.తాజాగా ఈ జంట ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రముఖ ఎంజీ బ్రాండ్కు చెందిన ఈవీ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. నా కొత్త కారు అంటూ అంటూ తన భర్తతో దిగిన ఫోటోలను నటి మంజుల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు చెబుతున్నారు. ఈ కారు విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.కాగా.. చంద్రముఖి అనే సీరియల్ లో నిరుపమ్, మంజుల కలిసి నటించారు. అలా ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. నిరుపమ్.. కార్తీకదీపం సీరియల్ తో మూగమనసులు, అత్తారింటికి దారేది, రాధకు నీవే రా ప్రాణం సీరియల్స్ చేయగా.. మంజుల కూడా ఆకాశమంత, కృష్ణవేణి, ఇద్దరమ్మాయిలు, జానకి కలగనలేదు తదితర సీరియల్స్ లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Manjula Paritala (@manjula_paritala_official) -
మైక్రోసాఫ్ట్కు భారీ నష్టం.. కారణం ఇదేనా?
మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటి. అయితే.. ఇటీవల ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ నెలలో మాత్రమే మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 17 శాతం పడిపోగా, కంపెనీ మార్కెట్ విలువలో 570 బిలియన్ డాలర్లకు (రూ.53.9 లక్షల కోట్లు) పైగా తగ్గుదల నమోదైంది. డిసెంబర్ 2000 తర్వాత సంస్థకు ఇదే అతిపెద్ద నెలవారీ క్షీణత కావడం గమనార్హం.కంపెనీకి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధస్సు (AI)పై మైక్రోసాఫ్ట్ పెడుతున్న భారీ పెట్టుబడులు. గత కొన్నేళ్లుగా సంస్థ డేటా సెంటర్లు, ఏఐ చిప్స్, క్లౌడ్ సర్వీసులు, అలాగే కోపైలెట్ వంటి ఏఐ ఉత్పత్తుల అభివృద్ధి కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని కంపెనీ నమ్ముతున్నప్పటికీ, పెట్టుబడిదారులు మాత్రం ఆ లాభాలు ఎప్పుడు వస్తాయనే విషయంలో ఆందోళన చెందుతున్నారు.ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో అజూర్ క్లౌడ్ సేవల వృద్ధి మార్కెట్ అంచనాల కంటే కొంత తక్కువగా ఉండడం కూడా పెట్టుబడిదారుల్లో నిరాశను కలిగించింది. అంతేకాకుండా.. రాబోయే నెలల్లో కూడా కంపెనీ భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తామని ప్రకటించింది. దీంతో ఖర్చులు పెరుగుతున్నా, లాభాలు మాత్రం అదే వేగంతో పెరగడం లేదనే భావన మార్కెట్లో ఏర్పడింది.ఏఐ అనేది మైక్రోసాఫ్ట్కు ఒక గొప్ప అవకాశం అయినప్పటికీ, అదే సమయంలో ఒక సవాలుగా కూడా మారింది. భవిష్యత్తులో ఏఐ కారణంగా సంప్రదాయ సాఫ్ట్వేర్లపై డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఏఐ రంగంలో ముందుండాలంటే కంపెనీ నిరంతరం భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు ప్రస్తుతం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.అయితే.. ఈ షేర్ పతనాన్ని అందరూ ప్రతికూలంగా చూడడం లేదు. కొంతమంది ప్రముఖ పెట్టుబడిదారులు, విశ్లేషకులు కొనుగోలుకు ఇది మంచి అవకాశమని భావిస్తున్నారు. గతంలో 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి ప్రసిద్ధి చెందిన పెట్టుబడిదారు మైఖేల్ బరీ కూడా మైక్రోసాఫ్ట్ షేర్లపై దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఆయన నిర్ణయం వల్ల కంపెనీ షేర్లు కొంత మేర కోలుకున్నాయి.మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఆదాయం రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏఐ రంగంలో కంపెనీకి ఉన్న బలమైన స్థానం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయి. అయితే ఇప్పుడు పెట్టుబడిదారులు కేవలం భారీ పెట్టుబడులు పెట్టడాన్ని కాకుండా, వాటి ద్వారా నిజంగా ఎంత లాభం వస్తుందో చూడాలని కోరుకుంటున్నారు.మైక్రోసాఫ్ట్ షేర్లు పడిపోవడం అంటే ఏఐ భవిష్యత్తు బలహీనపడిందని అర్థం కాదు. ఇది పెట్టుబడిదారుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకు సంకేతం మాత్రమే. ఒకప్పుడు ఏఐలో పెట్టుబడి పెడితే చాలు అనుకునే మార్కెట్, ఇప్పుడు ఆ పెట్టుబడుల వల్ల లాభాలు వస్తున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం కోరుతోంది. అందుకే మైక్రోసాఫ్ట్కు ప్రస్తుతం ఎదురవుతున్న సవాలు ఏఐలో ముందుండటం మాత్రమే కాదు, ఆ పెట్టుబడులను స్థిరమైన లాభాలుగా మార్చి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మళ్లీ గెలుచుకోవడం కూడా. ఇదీ చదవండి: నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్! -
కొడాలినానికి హైకోర్టులో ఊరట
సాక్షి, గుడివాడ: వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి కొడాలినానికి హైకోర్టులో ఊరట లభించింది. గుడివాడలో ఆయనపై నమోదైన కేసును విచారించిన హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది. గతంలో చంద్రబాబు,ఈసీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుడివాడ పోలీసులు ఆయనపై కేసు విధించారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన కోర్టు స్టే విధించింది. -
టెక్కీల ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్న సీఈఓ!
సాఫ్ట్వేర్ రంగం అంటేనే విలాసవంతమైన జీవితం, లక్షల్లో జీతాలు అనుకునే వారికి ఐటీ పరిశ్రమలోని మరో చీకటి కోణం షాక్కు గురిచేస్తోంది. ప్రాజెక్ట్ డెడ్లైన్ల పేరిట ఉద్యోగుల మానసిక ప్రశాంతతను హరిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ఒక టాక్సిక్ (విషపూరిత) సీఈఓ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారాంతాలతో (ఆదివారాలు) కలిపి రోజుకు 14 గంటల పాటు గొడ్డుచాకిరీ చేయించుకోవడమే కాకుండా.. ఉద్యోగుల విద్య, సామర్థ్యం, చివరికి వారి కుటుంబాలను లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ఒక సీఈఓ దారుణ ప్రవర్తనను ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు.ఆ ప్రాజెక్ట్ ముగిసేలోపే ఇంకోదానికి..కంపెనీలో చేరినప్పటి నుంచి తనకు ఎదురవుతున్న నరకాన్ని సదరు టెక్కీ సుదీర్ఘ పోస్ట్లో వివరించారు. సంస్థలో జాయిన్ అయినప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ పూర్తికాకముందే మరో దానికి మారుస్తున్నారని, దీనివల్ల దేనిపైనా స్పష్టత లేకుండా పోతోందని పేర్కొన్నారు. ‘గత నెల రోజులుగా నేను ఒక క్లయింట్-ఫేసింగ్ డేటా-మ్యాపింగ్ ప్రాజెక్ట్లో బృందంతో కలిసి పని చేస్తున్నాను. మా కంపెనీ సీఈఓనే మాకు మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. ఆయనే మాకు ఒక నిర్దిష్ట లాజిక్ ఇచ్చారు. అందుబాటులో ఉన్న డేటాను బట్టి మేము ఆ లాజిక్ను వర్తింపజేసి, విశ్లేషణను పూర్తి చేసి అవుట్పుట్ సమర్పించాం. తీరా చూస్తే, ఆ మ్యాపింగ్ తప్పని క్లయింట్ చెప్పారు’ అని టెక్కీ తెలిపారు.ఉద్యోగులపై నింద!కంపెనీకి క్లయింట్ ఇచ్చిన డేటానే అసంపూర్ణంగా ఉన్నప్పటికీ సీఈఓ మాత్రం మొత్తం నిందను బృందంపైనే నెట్టేసినట్లు డెవలపర్ ఆరోపించారు. ‘గత వారం రోజులుగా మీటింగుల్లో ఆయన ప్రవర్తన చాలా వ్యక్తిగతంగా, అవమానకరంగా మారింది. ఇది ఇక పనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కాదు. మా విద్య, సామర్థ్యాలు, కుటుంబాలు, విలువపై ఆయన దాడి చేస్తున్నారు. మేము సాంకేతిక పరిమితులను వివరించడానికి ప్రయత్నించినా లేదా ఇప్పటికే పూర్తి చేసిన పనిని చూపించినా ఆయన అసలు వినడం లేదు’ అన్నారు. బృందంలోని వారందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తానంటూ సదరు సీఈఓ నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు టెక్కీ వాపోయారు.ఆదివారాలూ వదలకుండా 14 గంటల చాకిరీఈ సంస్థలో పని గంటలు ఊహకందని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆదివారాలతో సహా నిరంతరం పని చేయించుకుంటున్నారని తెలిపారు. ‘ఇటీవలే మా టీమ్ మొత్తం ఆదివారం కూడా రాత్రి దాకా పని చేసింది. కానీ సోమవారం ఉదయం మీటింగ్కు వచ్చిన సీఈఓ.. మేము అసలు మాట వినడం లేదని, సరిగా పని చేయడం లేదని మమ్మల్ని నిందించారు. నేను మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోయాను. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి లేదా మరో ఉద్యోగానికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా నాకు సమయం దొరకడం లేదు’ అని సదరు టెక్కీ తెలిపారు. ఈ ప్రతికూల వాతావరణంలో కొనసాగాలా లేక రాజీనామా చేయాలా అని ఆన్లైన్ కమ్యూనిటీని సలహా కోరారు.నెటిజన్ల సలహాఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో ఐటీ నిపుణులు, సోషల్ మీడియా వినియోగదారులు సదరు సీఈఓ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ ఉద్యోగాన్ని వదిలేయాలంటూ టెక్కీకి మద్దతుగా నిలిచారు. ‘ఆ సీఈఓకు వ్యక్తిత్వ సమస్య ఉంది. బహుశా అతనికి థెరపీ అవసరం. ఆర్థికపరమైన కట్టుబాట్లు లేకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం వృథా’ అని ఒక యూజర్ స్పందించారు. ‘మీరు వెంటనే రాజీనామా చేయండి’ అని మరో యూజర్ చెప్పారు.కార్పొరేట్ రంగంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చ జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి నరకప్రాయమైన మేనేజ్మెంట్ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి సాధించే విజయాలు ఏ కంపెనీకైనా శాశ్వతం కాదనే సత్యాన్ని సంస్థలు గ్రహించాలని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్
పుణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. అనూహ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్కు, ప్రముఖ న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ రూ. 10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. సాహిల్ తనపై చేసిన అబద్ధపు, అవమానకర ఆరోపణలతో తన ప్రతిష్ట దెబ్బతిందని శ్రీవాస్తవ ఆ నోటీసులో పేర్కొన్నారు.కేతన్ అగర్వాల్ హత్య విచారణలో సియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆశుతోష్ శ్రీవాస్తవా లేక విపుల్ దుషింగ్నా? అనే ప్రశ్న ఈ కేసులో కొత్త న్యాయపోరాటానికి దారితీసింది. ఈ హైప్రొఫైల్ మర్డర్ కేసులో సియా తరపున అసలు ఏ న్యాయవాది వాదించాలనే విషయంపై వివాదం చెలరేగిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం సియా ఆమె ప్రియుడు (సహ నిందితుడు) చేతన్ చౌదరిలను వడ్గావ్ మావల్ కోర్టులో హాజరు పరిచారు. విచారణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కోర్టు వీరి పోలీసు కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది. అయితే, విచారణ సమయంలో కోర్టులో ఒక గందరగోళం నెలకొంది. లాయర్ అశుతోష్ శ్రీవాస్తవ కోర్టుకు హాజరై, తానే సియా తరపున వాదిస్తున్నానని చెబుతూ ఆమె సంతకం ఉన్న వకాలత్నామాను సమర్పించారు. కానీ, సియా మాత్రం శ్రీవాస్తవ తన లాయర్ కాదని, అడ్వకేట్ విపుల్ దుషింగ్ తన లాయర్ అని కోర్టుకు తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా దుషింగ్నే తాము లాయర్గా నియమించుకున్నామని స్పష్టం చేశారు.రూ. 10 కోట్ల పరువు నష్టం కోర్టు విచారణకు ముందే, నిందితురాలి సోదరుడు సాహిల్ గోయల్ బహిరంగంగా లాయర్ శ్రీవాస్తవపై కొన్ని ఆరోపణలు చేశాడు. శ్రీవాస్తవను తాము లాయర్గా నియమించలేదని, మోసపూరితంగా సియా దగ్గర సంతకం తీసుకుని ఉండవచ్చని ఆరోపించాడు. అంతేకాదు శ్రీవాస్తవ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని కూడా సాహిల్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్ఈ ఆరోపణలపై లాయర్ శ్రీవాస్తవ తీవ్రంగా స్పందించారు. తాము నేరుగా సియాను కలిశామని, ఆమె మేజర్ కాబట్టి తన స్వంత నిర్ణయాల ప్రకారం లీగల్ హెల్ప్ కోసం వకాలత్నామాపై స్వచ్ఛందంగా సంతకం చేసిందని శ్రీవాస్తవ తెలిపారు. తాము సాహిల్తో మాట్లాడలేదని, నేరుగా సియాతోనే డీల్ చేశామని స్పష్టం చేశారు. మరోవైపు సాహిల్ నిరాధారమైన ఆరోపణల కారణగా తన ప్రతిష్టకు భంకం కలిగిందంటూ రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ నోటీసు ఇచ్చారు. సాహిల్ వెంటనే తన ఆరోపణలను ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్కాగా ఈ కేసులో పోలీసుల విచారణలో మరికొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కేతన్ను తోసేయడానికి ముందే సియా, చేతన్లు లోహగడ్ కోటను సందర్శించి, ఎక్కడి నుండి తోసేయాలో స్పాట్ ముందే ఫిక్స్ చేసుకున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. సియాకు, కేతన్ అగర్వాల్తో ఇష్టంలేక, పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని భావించి, ప్రియుడు చేతన్తో కలిసి పుణెలోని లోహగడ్ కోట కొండపై నుండి కేతన్ను కిందకు తోసి హత్య చేసిందనే ఆరోపణలెదుర్కొంటోంది. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు.(హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు) -
కరుగుతోన్న పసిడి కాంతులకు కారణాలు ఇవే..
గడిచిన కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలకు చేరుకుంటూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు, ఇటీవల అనూహ్యంగా కిందికి దిగివస్తున్నాయి. ఈ రోజు (జూన్ 30, 2026) హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ.1,40,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర సుమారు రూ.1,29,000 స్థాయికి దిగివచ్చింది. గత వారంతో పోలిస్తే ఇది భారీ పతనమనే చెప్పాలి. ఈ ఆకస్మిక మార్పునకు గల ఆర్థిక కారణాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో బంగారంపై రాబడులు అందుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణాత్మక కథనం మీకోసం.ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుపసిడి మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తే ప్రస్తుతం మూడు ప్రధానాంశాలు ఈ పతనానికి కారణమవుతున్నట్లు స్పష్టమవుతోంది.1. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరిఅమెరికా కేంద్రీయ బ్యాంక్ (యూఎస్ ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేసినప్పటికీ తాజా పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును 2027కు వాయిదా వేసింది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు, ఇతర స్థిర ఆదాయ వనరులపై రాబడి పెరుగుతుంది. దీంతో వడ్డీ లేదా డివిడెండ్ ఇవ్వని బంగారం వైపు నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.2. బలపడుతున్న అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ఫెడ్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ ఇండెక్స్ ఏడాది కాలంలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. తద్వారా డిమాండ్ తగ్గి ధరలు క్షీణిస్తాయి. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి, ముఖ్యంగా ఆసియా మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లడం దీనికి అద్దం పడుతోంది.3. పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలుగత కొద్ది నెలల్లో బంగారం ధరలు భారీగా పెరగడానికి రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా (ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్) సంక్షోభాలు ప్రధాన కారణం. అయితే ఇటీవల ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చల సరళి, కీలకమైన హార్ముజ్ జలసంధి పాక్షికంగా తెరచుకోవడం వంటి పరిణామాల వల్ల గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు 30% తగ్గాయి. దాంతో అంతర్జాతీయ ఒడిదొడుకులు తగ్గి సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్ ప్రీమియం ఒక్కసారిగా ఆవిరైపోయింది.భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ మార్గాలుప్రస్తుత ధరల తగ్గుదల అనేది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అవకాశంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర బ్యాంకుల వద్ద డీ-డాలరైజేషన్ (డాలర్పై ఆధారపడటం తగ్గించడం) ప్రక్రియలో భాగంగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి ఇంకా కొనసాగుతోంది. అయితే కేవలం భౌతిక బంగారం (నగలు) రూపంలో కాకుండా కొన్ని మార్గాల్లో పెట్టుబడి పెడితే మెరుగైన రాబడులు సాధించవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్లు: స్టాక్ మార్కెట్ ద్వారా డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ మార్గం. ఇందులో ఎలాంటి మేకింగ్ ఛార్జీలు, తరుగు ఉండవు. మనకు నచ్చినప్పుడు కరెంట్ మార్కెట్ ధరకే విక్రయించుకోవచ్చు. లాకర్ ఖర్చులు, దొంగతనం భయాలు ఉండవు.సవరీన్ గోల్డ్ బాండ్లు: ప్రభుత్వం/ఆర్బీఐ జారీ చేసే ఈ బాండ్లు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వరం. దీని ద్వారా బంగారం ధర పెరిగితే వచ్చే లాభంతో పాటు, ఏటా స్థిర వడ్డీ (అదనపు ఆదాయం) లభిస్తుంది. అంతేకాకుండా గడువు ముగిసిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉండదు. అయితే, ప్రస్తుతానికి ఈ బాండ్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది.డిజిటల్ గోల్డ్: మొబైల్ వాలెట్లు, సర్టిఫైడ్ ప్లాట్ఫారమ్ల ద్వారా కేవలం రూ.100తో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ప్రతి నెలా కొద్దికొద్దిగా బంగారం జమ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.భౌతిక బంగారం (కాయిన్స్/బిస్కెట్లు): ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటే నగల రూపంలో కాకుండా 24 క్యారెట్ల హాల్మార్క్ ఉన్న కాయిన్స్ లేదా బిస్కెట్లు కొనడం మేలు. దీనివల్ల రీసేల్ (తిరిగి అమ్మే) సమయంలో పూర్తి విలువ లభిస్తుంది.మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారానికి 10% నుంచి 15% వరకు మాత్రమే పరిమితం చేయడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒకేసారి కాకుండా ప్రస్తుత ధరల పతనాన్ని ఆసరాగా చేసుకుని విడతల వారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో స్థిరమైన, సురక్షితమైన రాబడులను అందుకోవచ్చు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు ఢమాల్! -
రాహుల్ సూపర్ సెంచరీ.. మెదక్ ముందు భారీ టార్గెట్
తెలంగాణ ప్రీమియర్ లీగ్-2026లో మరో సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కరీంనగర్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో రాదేశ్ తన విరోచిత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మెదక్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు. -
'ప్రభాస్ను అడిగితే మూడు కోట్లు ఇస్తాడు.. కానీ'
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్గా మెప్పించిన కృష్ణ మాయ.. దాదాపు 80కి పైగా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్గా రాణించారు. టాలీవుడ్లో దొంగల ముఠా, రైల్వే స్టేషన్, లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రభాస్ అనే వ్యక్తి సొంతంగా ఇమేజ్ తెచ్చుకున్న హీరో అని కృష్ణ మాయ తెలిపారు. ప్రభాస్ యాక్టింగ్లో ప్రత్యేక వెరియేషన్ ఉంటుందన్నారు. ఆయన సొంతంగా చిరుత పులి అనే బ్రాండ్ను సొంతం చేసుకున్నారని కృష్ణ మాయ కొనియాడారు. ఆయనతో చేసిన ఈశ్వర్ సినిమాతోనే మా అందరికీ గుర్తింపు వచ్చిందన్నారు. ఆ మూవీ షూటింగ్ టైమ్లో ఒక డీసీఎంలో ఎక్కి ప్రభాస్ మాతో పాటే చార్మినార్కు వచ్చారని తెలిపారు.అప్పుడున్న ప్రభాస్కు.. ఇప్పుడున్న ప్రభాస్కు చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగారని ప్రశంసించారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లగలమా? అని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం అంతా మా అదృష్టమని కృష్ణ మాయ వెల్లడించారు. ప్రభాస్ సాహో మూవీకి కూడా తాను పనిచేశానని పేర్కొన్నారు.'ఇటీవల ఫౌజీ మూవీ టైమ్లో ప్రభాస్ దగ్గరికి వెళ్లా. ఆయన నా చేయి పట్టుకుని మరి నాతో మాట్లాడారు. ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు అని చేయి పట్టుకుని అడిగారు. ఒకవేళ నేను ప్రభాస్ను అడిగితే రెండు, మూడు కోట్లు ఇచ్చే కెపాసిటీ ఆయన సొంతం. అలా అడిగితే నా ఫ్రెండ్షిప్తో పాటు మర్యాద కూడా పొద్ది.. నాకు డబ్బులు అవసరం లేదు.. నాకు నేను సంపాదించుకుంటున్నా. ఆ టైమ్లో నన్ను చూసిన ప్రభాస్ ఒక పాత స్నేహితుడిని చూసినంతగా ఫీలయ్యాడు' అని కృష్ణ మాయ ఆనందం వ్యక్తం చేశారు. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్పై కృష్ణ మాయ చేసిన కామెంట్స్తో టాలీవుడ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 249.70 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 76,478.67 వద్ద, నిఫ్టీ 80.50 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 23,865.75 వద్ద నిలిచాయి.ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్, దివ్గి టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ లిమిటెడ్, దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్, బిల్కేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహాలక్ష్మి ఫ్యాబ్రిక్ మిల్స్ లిమిటెడ్, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, AION-TECH సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రెస్టారెంట్లో రచ్చ రచ్చ చేసిన ఫ్యామిలీ
వియత్నాంలోని ఓ భారతీయ రెస్టారెంట్లో ఓ భారతీయ కుటుంబం ప్రవర్తించిన తీరు వివాదానికి దారితీసింది. హో చి మిన్ సిటీలో ఉన్న రెస్టారెంట్లో ఓ భారతీయ కుటుంబం పలు వస్తువులను ధ్వంసం చేసింది. రెస్టారెంట్ సిబ్బందిని బెదిరించింది.నగరంలోని డిస్ట్రిక్ట్ 1 పర్యాటక ప్రాంతంలో ఉన్న బాంబే బైట్స్ హెచ్సీఎమ్ అనే ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భోజనం చేయడానికి వచ్చిన ఓ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు వెళ్తున్న సమయంలో టిష్యూ పేపర్లను విసిరారు. ఆ పిల్లలు వాటిని విసరడం ఆపాలని సిబ్బంది కోరారు. దీంతో ఆ పిల్లల తల్లిదండ్రులకు రెస్టారెంట్పై కోపం వచ్చింది.రెస్టారెంట్ సిబ్బందికి సహకరించాల్సింది పోయి ఆ కుటుంబం వారితో ఘర్షణకు దిగింది. రెస్టారెంట్ యజమాని ఐశ్వర్య ఖన్నా సింగ్ మాట్లాడుతూ.. ఆస్తిని ధ్వంసం చేశారని, సిబ్బందిని మాటలతో దూషించారని, ఇన్ఫ్లుయెన్సర్లమని చెప్పి బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, పత్రాలు తమ వద్ద భద్రంగా ఉన్నాయని యాజమాన్యం తెలిపింది."ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాం. రెస్టారెంట్ పిల్లలు ఆడుకునే ప్రదేశం కాదు. ఇన్ఫ్లుయెన్సర్ హోదా ఉన్నంత మాత్రాన ఇటువంటివి తగవు. పౌర బాధ్యత అంటే పిల్లలకు జవాబుదారీతనం నేర్పించడం, ప్రజల ఆస్తిని గౌరవించడం, ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ప్రశాంతంగా ఉండేందుకు నియమాలను పాటించడం. ఈ విలువలను పట్టించుకోకపోతే సిబ్బంది, ఇతర అతిథులు, వ్యాపారం అన్నీ ప్రభావితమవుతాయి" అని ఐశ్వర్య ఖన్నా సింగ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.రెస్టారెంట్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చే అతిథులను స్వాగతిస్తుందని, అయితే ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఆస్తిని ధ్వంసం చేయడం, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం, సిబ్బందిని బెదిరించడం సహించబోమని తెలిపింది. "అతిథి సత్కారం మా పని. కనీస మర్యాద ప్రతి ఒక్కరి బాధ్యత" అని తన ప్రకటనలో పేర్కొంది. View this post on Instagram A post shared by Aishwarya Khanna Singh (@kaishwarya.s.98) -
ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్కు రూ.38.63 లక్షల జరిమానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) రియల్ ఎస్టేట్ సంస్థ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.38.63 లక్షల జరిమానా విధించింది. రెరాలో నమోదు చేయని పలు ప్రాజెక్టులను ప్రకటనలు, ప్రచారం చేయడంతో పాటు, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా నమోదు కాకుండానే ఒక ప్రాజెక్టు విక్రయాలను నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకుంది.ఖమ్మం జిల్లాకు చెందిన రాము ఫిర్యాదు మేరకు టీజీ రెరా సుమోటో విచారణ ప్రారంభించింది. సంస్థ వెబ్సైట్, బ్రోచర్లను పరిశీలించిన అనంతరం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కొన్ని ప్రాజెక్టులకు రెరా నమోదు ఉందని, మరికొన్ని తమవి కావని, సంస్థ వివరణ ఇచ్చింది. రెరా సభ్యులు జన్ను లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం, ప్రాజెక్టు నమోదు లేకుండా విక్రయాలు చేపట్టడం నిషేధమని స్పష్టం చేసింది. చదవండి: జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ‘ఫిరాన్’ తయారీ కేంద్రం -
స్లిమ్గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..
ఈ ఏడాది జనవరిలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కవలలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల హీరో రామ్చరణ్ పెద్ది సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ నేపథ్యంలో జరిగి సక్సెస్ మీట్లో ఉపాసన ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఐదు నెలలే అయినా ఎంత స్మార్ట్గా మారింది అంటూ సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఒక్కరికి జన్మనిచ్చిన తల్లులు బరువు తగ్గడమే కష్టం అలాంటిది ఇద్దర పిల్లలకు జన్మనిచ్చిన తల్లలు బరువు తగ్గడం మరింత సవాలుగా ఉంటుంది. అలాంటిది ఉపాసన ఐదు నెలల్లోనే చాలా నాజుగ్గా ఆకర్షణీయంగా మారారు. అసలు ట్విన్స్ తర్వాత బరువు తగ్గడం ఎలా?, అది సాధ్యమేనా? అంటే..ఒక గర్భంతో పోలిస్తే.. కవలల గర్భం తర్వాత బరువు తగ్గడం చాలా కష్టమనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా మహిళలు గర్భధారణ సమయంలో అధికంగా బరువు పెరుగుతారు. వారి శరీరాలు మరిన్నీ శారీరక, హార్మోనల్ మార్పులకు లోనవ్వుతాయి. శరీరం కోలుకోవడం కోసం కండరాల బలం తిరిగి నిర్మించుకోవడానికి, ఇద్దరు పిల్లల సంరక్షణ ఇదంతా ఒక పెద్ద సవాలుగా పేర్కొన్నారు. కొత్త తల్లులు యథావిధిగా ఇదివరకటిలా నార్మల్ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని కూడా అన్నారు. అయితే ప్రసవానంతరం కోలుకోవడం అనేది పరుగుపందెం లాంటిది కాదని గ్రహించాలన్నారు. ప్రతి మహిళ శరీరం ఒకేలా స్పందించదని అన్నారు అందువల్ల ఆరోగ్యకరంగా స్థిరంగా బరువు తగ్గేందుకే ప్రయత్నించాలని అన్నారామె. బరువు తగ్గాలంటే..ప్రసవానంతరం బరువు తగ్గాలంటే చక్కటి నిద్ర, సమతుల్య భోజనం, తగినంత నీరు, తగిన కదలికలు ఉండాలన్నారు. కొత్త తల్లులు కఠినమైన ఆహార నియమాలు పాటించొద్దని అన్నారు. ముఖ్యంగా పాలిచ్చేవాళ్లకు మరింత ప్రమాదమని అన్నారు. శరీరం ఆ స్థితి నుంచి కోలుకోవడానికి, శక్తి కోసం తగిన పోషకాలు అవసరం. ఈ టైంలో కేలరీలు లెక్కించడం మానేసి, ప్రోటీన్, ఫైబర్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పౌష్టికరమైన భోజనంపై దృష్టి సారించమని సూచిస్తున్నారు. ఆ తప్పులు అస్సలు చెయ్యొద్దు..సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావంతో బరువు తగ్గే ప్రయత్నం చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే వాళ్లు పోషకాహర నిపుణులు, ఫిట్నెస్ ట్రైనర్ల సమక్షంలో ఆయా డైట్ విధానాలు అనుసరిస్తారు కాబట్టి గుడ్డిగా అనుసరించొద్దని అన్నారు. అలాగే తక్షణ ఫలితాలు ఆశించొద్దని చెప్పారు. తొమ్మిది నెలల్లో పెరిగిన బరువు కొన్ని వారాల్లో మాయమవ్వాలంటే తీవ్రమైన డైటింగ్, భోజనం మానేయడం, అతిగా వ్యాయామాలు చేయడం, బరువు తగ్గించే సప్లిమెంట్లపై ఆధారపడటం వంటివి పూర్తి స్థాయిలో కోలుకోవడాన్ని ఆటంక పరుస్తుందని అన్నారు.కొత్త తల్లులూ ఇది మరవద్దు..ప్రసవానంతరం ఫిట్నెస్ అంటే బలాన్ని తిరిగి నిర్మించుకోవడం అంతేతప్ప మాటిమాటికీ బరువు చెక్చేస్తూ..నెంబర్ని వెంబడించడం కాదు. ఆరోగ్యకరమైన శరీరం, స్థిరమైన పురోగతి, బిడ్డను చూసుకోవడానికి తగినంత శక్తిమంతంగా ఉండటం అనేవి ప్రధానం అని గ్రహించండి. ఏ క్రాష్ డైట్ ఈ సమయంలో అస్సలు పనికిరాదు. కేవలం ఓర్పు, నిలకడతో పాటించే మంచి అలవాట్లతోనే సత్ఫలితాలను పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?) -
అమెరికా ఖ్యాతి దిగజారింది.. భారత్తో సంబంధాలు క్షీణించాయి
వాషింగ్టన్ డీసీ: భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారాయని అమెరికా డెమెక్రటిక్ నేత రో ఖన్నా (రోహిత్) కన్నా ఆరోపించారు. సోమవారం వాషింగ్టన్లో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ లీడర్షిప్ సమ్మిట్లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్లనే ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని తెలిపారు.కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ ఖన్నా మాట్లాడుతూ.. ఇరాన్ పట్ల ట్రంప్ వైఖరి, ఇతర విదేశాంగ విధాన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టను దెబ్బతీశాయి. అదే సమయంలో భారత్తో సంబంధాలను దెబ్బతీశాయి. ప్రభుత్వ వలస, విద్యార్థి వీసా విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభను ఆకర్షించే అమెరికా సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. గత 30 ఏళ్లలో అమెరికా-భారత్ సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇరాన్తో యుద్ధానికి దిగాలన్న ట్రంప్ విధానాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అవి భారతదేశంలో గ్యాస్ ధరలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మీరు నా మాట నమ్మకపోతే (విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్) జైశంకర్తో మాట్లాడండి." అని సమ్మిట్లో మాట్లాడుతూ అన్నారు.అదే విధంగా ఇటీవల ట్రంప్ చైనా పర్యటనను ప్రస్తావిస్తూ ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్ విధానాల దీర్ఘకాలిక ప్రభావం గురించి ఒక భారతీయ దౌత్యవేత్త ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. నేను చైనాలో ఉన్నప్పుడు, అధ్యక్షుడు ట్రంప్ వల్ల ఒక తరం నమ్మకం దెబ్బతిందని అక్కడి భారత రాయబారి తనతో చెప్పారన్నారు. ట్రంప్ చేసిన నష్టం గురించి నిజం మాట్లాడకపోతే... మనం వాస్తవంలో జీవించనట్లే అని ఖన్నా పేర్కొన్నారు.. అమెరికా తన సాంప్రదాయ ప్రపంచ నాయకత్వాన్ని విడిచిపెట్టి, విలువలకు బదులుగా బలప్రయోగంతో నడిచే విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నారని ఆయన ట్రంప్పై మండిపడ్డారు.రోఖన్నా నేపథ్యంరోఖన్నా డెమెక్రాటిక్ పార్టీకి చెందిన ప్రముఖ నేత. 2017 నుండి కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్ నియోజకవర్గానికి (సిలికాన్ వ్యాలీ ప్రాంతం) ప్రతినిధుల సభలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈయన తల్లిదండ్రులు 1970లలో భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లారు. గతంలో ఈయన అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగా పనిచేశారు. -
ఒకే కంపెనీ.. రెండుసార్లు భూమిపూజ.. చంద్రబాబు సరికొత్త డ్రామా..
వైఎస్సార్: జమ్మలమడుగు నియోజకవర్గంలో రేపు (బుధవారం) వైఎస్సార్సీపీ ఉన్నత స్థాయి నేతల బృందం పర్యటించనుంది. సున్నపురాళ్లపల్లె పరిధిలోని జిందాల్ (జేఎస్డబ్ల్యూ) స్టీల్ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే భూమి పూజ పూర్తయి, పనులు కూడా ప్రారంభమైన జిందాల్ స్టీల్ ప్లాంట్కు.. చంద్రబాబు మళ్లీ భూమి పూజ చేస్తూ ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడటాన్ని ప్రజల ముందుంచనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ పారిశ్రామిక ప్రగతి కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగానే జిందాల్ స్టీల్స్ పరిశ్రమ స్థాపన కోసం ఏకంగా 3,500 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు, పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి అన్ని రకాల మౌలిక వసతులను, సౌకర్యాలను సమకూర్చారు. అనంతరం 2023 ఫిబ్రవరి 15న వైఎస్ జగన్ అధికారికంగా ఈ మెగా స్టీల్ప్లాంట్కు భూమి పూజ చేశారు.ప్రభుత్వ అండదండలు, మౌలిక వసతులు సకాలంలో అందడంతో జిందాల్ యాజమాన్యం కూడా ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను గతంలోనే వేగంగా ప్రారంభించింది.అయితే, వైఎస్ జగన్ శ్రమించి తెచ్చిన ఈ ప్రతిష్టాత్మక స్టీల్ప్లాంట్ను తమ ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరతీసింది. జులై 3న చంద్రబాబు మళ్లీ ఇదే జిందాల్ స్టీల్కు భూమిపూజ చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో 2018లోనూ ఎలాంటి పారిశ్రామిక భాగస్వామి లేకుండా కేవలం శిలాఫలకానికే చంద్రబాబు పరిమితమయ్యారని, ఇప్పుడు వైఎస్ జగన్ తెచ్చిన కంపెనీకి తామేదో కొత్తగా భూమి పూజ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచార ఆర్భాటాలను, అబద్ధాలను ప్రజలకు వివరించేందుకు రేపు ఉదయం వైఎస్సార్సీపీ బృందం స్టీల్ ప్లాంట్ స్థలానికి చేరుకోనుంది. అక్కడ ఇప్పటికే జరిగిన పనుల పురోగతిని పరిశీలించి, వైఎస్ జగన్ హయాంలో జరిగిన వాస్తవ అభివృద్ధిని మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజల ముందు ఉంచనుంది. -
30 రిజెక్షన్లు, కట్ చేస్తే : కోటిన్నర వేతనంతో ఐటీ జాబ్
తన డ్రీమ్ జాబ్ కోసం ఎదురు చూసి, చూసి విసిగిపోయిన వ్యక్తికి అనుకోని అదృష్టం కలసి వస్తే. ఆ ఆనందానికి హద్దే ఉండదు కదా. సరిగ్గా ఇలాగే ఎన్నో రిజెక్షన్ ఈ మెయల్స్ తరువాత, అదీ ఐటీ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉద్యోగ కొనసాగుతున్న వేళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏకంగా రూ. 1.4 కోట్ల బేస్ శాలరీతో రిమోట్ (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగం సాధించిన వైనం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఎన్ని రిజెక్షన్లు ఎదురైనా పట్టువదలకుండా ప్రయత్నిస్తే చివరికి అనుకున్న విజయం సాధించవచ్చని ఈ ఇంజనీర్ జర్నీ నిరూపించింది.ఒక సంవత్సరం పాటు సాగించిన అవిశ్రాంత ఉద్యోగ వేట, ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. దాదాపు 25 కి పైగా రిజెక్షన్ల (తిరస్కరణల) తర్వాత ఎట్టకేలకు తన డ్రీమ్ జాబ్ కొట్టేశాడు. దీనికి సంబంధించిన వివరాలను అతను నెట్టింట పంచుకోవడంతో ఈ స్టోరీ వైరల్గా మారింది.తనకు ఆరేళ్ల అనుభవం ఉందని, ఒక టైర్ 1 కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారని, ఇటీవలే ఒక సీడ్ స్టేజ్ స్టార్టప్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్కు ఎంపికైనట్టు అతను తెలిపాడు.ఆ ఇంజనీర్ అందుకున్న భారీ ఆఫర్ వివరాలుబేస్ శాలరీ : రూ. 1.4 కోట్లు, బోనస్: పర్ఫార్మెన్స్ ఆధారిత బోనస్ESOPs (షేర్లు): 4 సంవత్సరాల వెస్టింగ్ పీరియడ్తో కూడిన 1,20,000 యూఎస్ డాలర్ల (సుమారు రూ. 1 కోటి) విలువైన స్టాక్స్. (హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు)మొదటి ఏడాది మొత్తం ప్యాకేజీ: దాదాపు రూ. 1.7 కోట్లు.పాత జీతం ఎలా ఉందంటే : బేస్ శాలరీ రూ. 60 లక్షలు, బోనస్ రూ. 4 లక్షలు , 25,000 డాలర్ల విలువైన స్టాక్స్ ఉండేదట.టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్లు కొనసాగుతున్న ప్రస్తుత కష్టసమయంలో తనకు ఇంత మంచి ఆఫర్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆ ఇంజనీర్ తెలిపాడు. గత ఎనిమిదేళ్లుగా అప్పుడప్పుడు ఇంటర్వ్యూ ప్రిపరేషన్, లీట్కోడ్ (LeetCode) ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. కానీ ఎంత కష్టపడినా ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతూనే వచ్చానంటూ ఆ పోస్ట్లో రాసుకొచ్చాడు.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్నిలకడగా (Consistency) ప్రిపేర్ అవ్వడమే తనకు ఎదురైన అతిపెద్ద సవాలని అతను అంగీకరించాడు. ప్రతిసారి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆపి మళ్లీ మొదలుపెట్టినప్పుడు, అంతా మొదటినుంచీ నేర్చుకుంటున్నట్టు అనిపించిందని వివరించాడు. అంతేకాదు తన ఉద్యోగ వేటలో తనను రిజెక్ట్ చేసిన దాదాపు 29 కంపెనీల పేర్లను కూడా ఓపెన్గా పంచుకున్నాడు. వీటిలో అమెజాన్, బ్లూమ్బెర్గ్, క్లౌడ్ఫ్లేర్ (Cloudflare), కోర్సెరా, డి.ఇ. షా , అగోడా, ప్రోటోకాల్ ల్యాబ్స్, బిట్గో, నానోనెట్స్, ఫిన్బాక్స్, యుగాబైట్, డెకాగాన్, , అపోలో ఏఐ కోడింగ్ వంటి సంస్థలు ఉన్నాయి. -
ఆస్ట్రేలియాకు గుడ్ బై.. వేరే దేశానికి ఆడనున్న స్టార్ ఆల్రౌండర్
ఆస్ట్రేలియా వెటరన్ ఆల్-రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 39 ఏళ్ల హెన్రిక్స్ ఇకపై పోర్చుగల్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్లో అతడు తన సొంత దేశమైన పోర్చుగల్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరపున చివరగా 2021లో ఇంటర్ననేషనల్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం రెగ్యూలర్గా ఆడుతూ వచ్చాడు. న్యూసౌత్వేల్స్కు కెప్టెన్గా, ప్లేయర్గా తన సేవలను అందించాడు. అయితే హెన్రిక్స్ అనుహ్యంగా గతేడాది మార్చిలో ఫస్ట్క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. ఇప్పుడు ఆసీస్ జట్టులో అవకాశాలు రాకపోవడంతో తన మకాంను పోర్చుగల్కు మార్చాడు. అయినప్పటికి బిగ్బాష్ లీగ్లో మాత్రం మోయిసెస్ ఆడనున్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫుల్ మెంబర్ నేషన్ నుంచి అసోసియేట్ దేశానికి వెళ్లే ఆటగాళ్లు మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ను పూర్తి చేయాలి. అయితే హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరపున 2021లో ఆడడంతో అతడి కూలింగ్ పీరియడ్ కూడా పూర్తి అయినట్లే. పోర్చుగల్ తరపున ఆడేందుకు అతడికి ఎలాంటి చిక్కులు లేవు.కాగా హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్ ఎక్కువగా ఆడకపోయినప్పటికి, డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. 131 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లతో పాటు 141 లిస్ట్-ఎ, 301 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో కేకేఆర్, ఢిల్లీ, ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్,పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2016 విజేతగా నిలిచిన ఎస్ఆర్హెచ్ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఒక ఆస్ట్రేలియా ఆటగాడు అసోసియేట్ దేశానికి మారడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జో బర్న్స్ తన కుటుంబ నేపథ్యం కారణంగా ఇటలీకి మకాం మార్చాడు. 2025లో ఇటలీ తరపున అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.చదవండి: నేడే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ -
ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ
ఈ వారం ఓటీటీల్లోకి పలు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో మాలీవుడ్ టైమ్స్, అబ్సెషన్ చిత్రాలతో పాటు ఇసకపట్నం, సూపర్ సుబ్బు, మర్మదేశం, ముతస్సీ తదితర సిరీస్లు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మలయాళ హారర్ కామెడీ మూవీ ఒకటి స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత)శ్రీనాథ్ బసి, ఫెమినా జార్జ్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ సినిమా 'కరక్కం'. గత నెల 28న థియేటర్లలోకి వచ్చింది. ఓ మాదిరిగి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు దీన్ని ఈ శుక్రవారం(జూలై 03) నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.'కరక్కం' విషయానికొస్తే.. న్యూఇయర్ వేడుకల్లో భాగంగా ఇద్దరు స్నేహితులు ధనుష్(శ్రీనాథ్ భాసి), ఖాజా ఫుల్లుగా తాగి చర్చి స్మశానవాటికలో ఉన్న ఐదు శిలువలను పెకిలించి పారేస్తారు. ఆ తర్వాత వారిని ఐదు దెయ్యాలు వెంటాడటం మొదలుపెడతాయి. ఆ దెయ్యాల నుంచి వాళ్లు ఎలా తప్పించుకున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్') -
‘ఇది ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు నాంది’
విజయవాడ: ఏపీ రాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు దానిని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోను సందర్శించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బండి పుణ్యశీల, కాలే పుల్లారావు తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విద్యాధరపురం డిపో కూల్చివేత కేవలం ఒక డిపో కూల్చివేత కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు నాంది అని వారు పేర్కొన్నారు. ఈ-బస్సుల పేరుతో విలువైన ఆర్టీసీ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని ఆక్షేపించారు.ఈ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు విజయవాడ నగరంలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపోను పూర్తిగా కూల్చివేసి...శిథిలాలను కూడా తొలగించారు. ఈ స్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకులు సందర్శించి ప్రభుత్వ తీరును ఖండించారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వ విధ్వంసకర పాలనకు ఇదే నిదర్శనం: వెలంపల్లి30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఆర్టీసీ భవిష్యత్తుపై ఉద్యోగులను, ప్రజలను సంప్రదించకుండా విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణం. విద్యాధరపురం డిపో కూల్చివేత కూటమి ప్రభుత్వ విధ్వంసకర పాలనకు నిదర్శనం. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ భూములను బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్నివైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆర్టీసీ ఆస్తులు, భూములు, డిపోలు పూర్తిగా ఆర్టీసీ ఆధీనంలోనే కొనసాగాలి, ఉద్యోగాలు కూడా ఆర్టీసీ పరిధిలోనే ఉండాలి. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనావైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది" అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.ఖరీదైన ఆర్టీసీ స్థలాలపై కూటమి నేతల కన్ను: దేవినేని అవినాష్,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీదైన ప్రభుత్వ, ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. గతంలో లూలు మాల్ కోసం విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులో ఉన్న ఖరీదైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించే ప్రయత్నాన్నివైఎస్సార్సీపీ అడ్డుకుంది. ఇప్పుడు విద్యాధరపురం డిపో స్థలాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోంది. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా బినామీల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది. విద్యాధరపురంతో ఆగకుండా రాష్ట్రంలోని మరో 11 డిపోల భూములను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోంది.ప్రజలు ఈ దోపిడీని గమనిస్తున్నారు. తగిన సమయంలో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపట్టి పోరాడతాం" అనివైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు.ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: మల్లాది విష్ణుఇసుక, మట్టి, కొండల తర్వాత ఇప్పుడు విలువైన ఆర్టీసీ భూములపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. రాష్ట్రంలోని 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియలో భాగంగానే విద్యాధరపురం డిపోను లక్ష్యంగా ఎంచుకున్నారు. వైయస్ జగన్ హయాంలో ఆర్టీసీ బలోపేతానికి రూ.5 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించారు. కానీ నేడు ఆర్టీసీని బలోపేతం చేయాల్సింది పోయి రూ.6 వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను బినామీలకు ధారాదత్తం చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజారవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ చర్యలనువైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యాధరపురం డిపో స్థలంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత. కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం" అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
ఆటో డ్రైవర్ రిప్లై చూసి షాకైన యువతి, వైరల్ వీడియో
ఒక సాధారణ ఆటో ప్రయాణం, పేమెంట్ ఫెయిల్ , ఆ తర్వాత సదరు ఆటో డ్రైవర్తో జరిగిన కార్పొరేట్ లెవల్ సంభాషణ విధంగా ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆఫీస్ ఈమెయిల్స్ను తలపించేలా సాగిన ఈ చాటింగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిష్ఠా శెట్టి అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో ఈ ఆసక్తికర కథనాన్ని షేర్ చేసింది. అసలేం జరిగిందంటే?నిష్ఠా శెట్టి ఒకరోజు ఆఫీస్కు వెళ్లడానికి ఆటో ఎక్కింది. గమ్యస్థానం చేరుకున్నాక డ్రైవర్కు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపింది. అయితే, ఐడీ సమస్య వల్ల ఆ పేమెంట్ ఫెయిల్ అయిందని ఆమె తర్వాత గమనించింది. దీని గురించి డ్రైవర్కు హిందీలో మెసేజ్ చేస్తూ.. "ఆప్కా పేమెంట్ ఫెయిల్ హో గయా హై బికాజ్ యే ఐడీ కా కుచ్ ఇష్యూ హో రహా హై" (ఐడీ సమస్య వల్ల మీ పేమెంట్ ఫెయిల్ అయింది) అని పంపింది. దానికి ఆ ఆటో డ్రైవర్ ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్గా నిలిచింది. View this post on Instagram A post shared by Nishta🌸 (@shettynishta)ఆమె పంపిన సాధారణ మెసేజ్కు ఆ ఆటో డ్రైవర్ ఎంతో ప్రొఫెషనల్గా, ఒక కస్టమర్ సర్వీస్ ఈమెయిల్ తరహాలో ఇంగ్లీష్లో కార్పొరేట్ కంపెనీ మేనేజర్ లెవల్లో సమాధానం పంపాడు."ఒకవేళ మీరు ఆటోలోనే తిరిగి రావాలని ప్లాన్ చేసుకుంటుంటే, నేనే వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, ఈజ్ దట్ ఓకే (సరేనా)? వీలైతే ఆ సమయంలో నాకు క్యాష్ ఇవ్వచ్చు. మీకు ఓకేనా? లేదా నేను మిమ్మల్ని ఎక్కడైతే డ్రాప్ చేశానో అక్కడికే వస్తాను, మీ దగ్గర క్యాష్ ఉంటే అక్కడ కలెక్ట్ చేసుకుంటాను."డ్రైవర్ చాటింగ్ టోన్ చూసి నిష్ఠా ఆశ్చర్యపోయింది. "అతనేంటి ఆఫీస్ ఈమెయిల్కు రిప్లై ఇచ్చినట్లు మాట్లాడుతున్నాడు?" అని వీడియోలో పేర్కొంది. అతని ప్రొఫెషనలిజం చూసి కాస్త కంగారు పడ్డానంటూ సరదాగా చెప్పుకొచ్చింది. వెంటనే ఆమె కూడా తన టోన్ మార్చేసి, ఇంగ్లీష్లోనే.. "ప్లీజ్ కమ్ బై 6 పీఎం. వైల్ రిటర్నింగ్" (తిరిగి వెళ్లేటప్పుడు సాయంత్రం 6 గంటలకల్లా రండి) అని మెసేజ్ పెట్టింది. దానికి ఆ డ్రైవర్ కేవలం ఒకే ఒక్క ముక్కలో "Noted" (నోటెడ్) రిప్లై ఇవ్వడంతో మరింత ఆశ్చర్యపోవడం నిష్ఠా వంతైంది. ఇదీ చదవండి: హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులునెటిజన్ల కామెంట్లు ఈ చాటింగ్పై నిష్ఠా జోక్ చేస్తూ తాను సగం మందితో పోలిస్తే ఈ ఆటో డ్రైవర్కే కార్పొరేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉన్నాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!"ఈ ఆటో డ్రైవర్కు కచ్చితంగా ఒక లింక్డ్ఇన్ (LinkedIn) ప్రొఫైల్ ఉండాలి" అని ఒకరు కామెంట్ చేయగా. చివర్లో 'Noted' అని చెప్పడం పీక్ కార్పొరేట్ బిహేవియర్" అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేశారు.ఒక చిన్న పేమెంట్ సమస్య వల్ల జరిగిన ఈ సంభాషణ, ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. -
హైదరాబాద్లో ‘ఫిరాన్’ తయారీ కేంద్రం
హైదరాబాద్: కాక్పిట్, ఇంటర్ఫేస్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేసే ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్లో తొలి తయారీ కేంద్రాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ఉన్న జీఎంఆర్ ఏవియేషన్ సెజ్లో ప్రారంభించింది.ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో దిగ్గజంగా పేరుగాంచిన ఫిరాన్ టెక్నాలజీ (Firan Technology Group).. భారత్లో తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం దేశీయ ఏరోస్పేస్ రంగంలో మరో మైలురాయి అని జీఎంఆర్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈఓ అమన్కపూర్ అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలన్నీ తమ సెజ్లో ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: తెలుగు రాష్ట్రాల్లోకి గోద్రెజ్ నింజా -
సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ఖరీదైన గిఫ్ట్.. ఏకంగా రూ.15 లక్షలు..!
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద విన్నర్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి మెప్పించింది.ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్ ఇసకపట్నం అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్..ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా ఐశ్వర్య రాజేశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ప్రతి సినిమాకు తనకు తానే ఓ గిఫ్ట్ కొంటానని తెలిపింది. అత్యంత ఖరీదైన గిఫ్ట్ తన చేతికి ఉన్న వాచ్ అని పేర్కొంది. అంతేకాదు ఈ వాచ్ను సంక్రాంతికి వస్తున్నాం మూవీకి గుర్తుగా రూ.15 లక్షల వాచ్ కొన్నానని ఐశ్వర్య రాజేశ్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఈ వాచ్ బుక్ చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. ప్రతి మూవీకి ఒక గిఫ్ట్ కొనడం తనకు అలవాటుగా మారిందని ఐశ్వర్య వెల్లడించింది. -
విజయవాడ వెస్ట్ బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,కృష్ణ: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గొల్లపూడి ఫ్లైఓవర్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఒక లారీ, ముందు వెళ్తున్న కారును అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో విజయవాడ గొల్లపూడి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వెస్ట్ బైపాస్ మీదుగా ప్రయాణిస్తుండగా.. బీబీ గూడెం-గొల్లపూడి సమీపంలో వెనుక నుంచి మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన లారీ, వీరి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కారు శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. -
అందులో బెజవాడ పోలీస్ బిగ్బాస్ పాత్ర ఉంది: వంగవీటి నరేంద్ర
తాడేపల్లి: ఆర్థిక నేరం చేసిన కంపెనీ వ్యవహారంలో బెజవాడ పోలీస్ బిగ్బాస్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐ, ఈడీతో విచారించాల్సిన కేసును సైతం నీరు గార్చారని తెలిపారు. అద్వైక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో భారీగా డీల్ మాట్లాడుకున్నారని వంగవీటి నరేంద్ర ఆరోపించారు. 1,500 మంది బాధితుల ఫిర్యాదును ఒకటే ఫిర్యాదుగా మార్చి కేసును నీరుగార్చారని తెలిపారు. ‘‘సీబీఐ, ఈడీతో విచారించాల్సిన కేసును తేలిగ్గా ముగించేలా చేశారు. చట్టానికి వ్యతిరేకంగా డబ్బు డిపాజిట్లు చేయించుకున్న మార్గదర్శి, అగ్రిగోల్డు కేసులను కూడా సీబీఐ, ఈడీ విచారించాయి. మరి అద్వైక కేసులో ఎలాంటి విచారణలు జరగకుండా చేసిందెవరు? బెజవాడ పోలీస్ బాస్ వైట్ కాలర్ రౌడీలు, గూండాలుగా మారిపోయారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులోనూ ఆయన ఎందుకు నోరు మెదపలేదు? సీసీ కెమెరా ఫుటేజీ ఏమైందో ఎందుకు చెప్పటం లేదు?’’ అని వంగవీటి నరేంద్ర నిలదీశారు. -
తెలంగాణ సీఎస్గా సంజయ్ జాజు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్గా సంజయ్ జాజు ఈ రోజు ( మంగళవారం) బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా 2 గంటల 15 నిమిషాల సమయంలో ముహూర్తం చూసుకొని సచివాలయంలోని ప్రధాన కార్యదర్శి సీటులో కూర్చున్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సంజయ్ జాజు నేపథ్యంప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 1992 బ్యాచ్కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా, ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా రెండు తెలుగురాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యత చెందిన మీ సేవ రూపకర్తలలో ఆయన ఒకరు. ఈ ప్రాజెక్టు రూపకల్పన, అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేంద్ర సర్వీసుల్లో ఆయన డిప్యూటేషన్పై ఉన్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NHIDCL) డైరెక్టర్గా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థన మేరకు రాష్ట్రానికి రప్పించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. -
సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత
ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో వచ్చిన సినిమాల్లో 'రాజాసాబ్' తప్పితే మిగిలిన నాలుగింటిలో చిరంజీవి సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ రాగా.. శర్వానంద్, నవీన్ పొలిశెట్టి, రవితేజ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో వసూళ్లు రాబట్టాయి. మరోవైపు తమిళంలో స్టార్ హీరో శివకార్తికేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల లాంటి స్టార్స్ చేసిన 'పరాశక్తి' ఘోరమైన డిజాస్టర్ అయింది. గతంలో ఓ సందర్భంలో చిత్ర నిర్మాత దీని వల్ల వచ్చిన నష్టాల గురించి చెప్పగా.. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్)'పరాశక్తి' తీసిన దర్శకురాలు సుధా కొంగర.. నిర్మాతకు తనకు రూ.8.39 కోట్ల రెమ్యునరేషన్ బకాయి ఉన్నారని చెప్పి మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ మొత్తం చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. పలు కారణాలతో ఆలస్యమైన ఈ చిత్రం.. అన్ని సమస్యలు దాటుకుని సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు దర్శకురాలి రెమ్యునరేషన్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది.ఇక మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా.. జూలై 8న తదుపరి విచారణ జరిగే వరకు 'పరాశక్తి' శాటిలైట్ హక్కులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే నిర్మాత తీసిన 'ఇదయం మురళి' మూవీ వచ్చే నెల 10న థియేటర్లలో రిలీజ్ కావాలి. ఇది విడుదల కాకుండా ఆపాలని సుధా కొంగన తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయింది.సుధా కొంగర విషయానికొస్తే.. దర్శకుడు మణిరత్నం దగ్గర పనిచేసింది. 'సాలా ఖాదుస్' మూవీతో డైరెక్టర్ అయింది. దీన్ని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేయగా ఈ చిత్రానికి ఈమెనే దర్శకత్వం వహించింది. స్వతహాగా ఈమె తెలుగు ఆమెనే అయినప్పటికీ తమిళంలో సినిమాలు చేస్తోంది.(ఇదీ చదవండి: పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా: సీరియల్ నటి) -
ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి : శ్రీనివాస్
హైదరాబాద్ : ముదిరాజ్ కులస్తులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని ముదిరాజ్ జాగృతి సమితి ఫౌండర్ కలకండ శ్రీనివాస్ అన్నారు. ఖైరతాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముదిరాజ్ జాగృతి సమితిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ జాగృతి సమితి ద్వారా ముదిరాజ్లను జాగృతం చేయడంతో పాటు అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ముదిరాజ్ కులస్తులకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో చైతన్యం నింపడంతో పాటు సాంప్రదాయ జీవనోపాధిని ప్రోత్సహిస్తూనే పేద విద్యార్థులకు సాయం చేస్తామని అన్నారు. తొలి విడతగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు కమిటీలు వేయడంతో పాటు డివిజన్ స్థాయిలో కూడా కమిటీలను వేస్తామని తెలిపారు. -
నెట్ఫ్లిక్స్నే మోసం చేసిన డైరెక్టర్.. చివరికీ ఏమైందంటే?
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రించ్కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఓ సిరీస్ తీసేందుకు నెట్ఫ్లిక్స్ నిధులను తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం రెండున్నరేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అతను దాదాపు 11 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రిన్స్చ్ ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్ తీస్తానని నెట్ఫ్లిక్స్ నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ నిధులను తన వ్యక్తిగత అవసరాల కోసం కార్లు, క్రిప్టోకరెన్సీ, ఇతర విలాస వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించుకున్నాడు. దీంతో అతనిపై నెట్ఫ్లిక్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో దర్శకుడు దోషిగా తేలడంతో న్యాయస్థానం జైలు శిక్షతో పాటు 700 డాలర్ల జరిమానా విధించారు. కాగా.. డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రిన్స్చ్ 2013లో వచ్చిన '47 రోనిన్' చిత్రంతో బాగా ఫేమస్ అయ్యారు. -
ఆమె ఎంట్రీతో ఫ్యాషన్ వేదికగా టెన్నిస్ కోర్టు..!
కొందరు నిర్భయంగా తమ టాలెంట్ని, ఫ్యాషన్ని ఒకేసారి ప్రదర్శిస్తారు. పైగా ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. అచ్చం అలానే చేసింది జపాన్ ప్రఖ్యాత క్రీడాకారిణి నవోమి ఒసాకా. ఒక్కసారిగా అది టెన్నిస్ కోర్టా? లేక ఫ్యాషన్ వేదిక? అని విస్తుపోయేలా చేసింది ఆమె ఎంట్రీ. అసలేం జరిగిందంటే..అందరూ ఆసక్తికగా చూస్తూన్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026లో జపాన్ స్పోర్ట్స్ స్టార్ నవోమి ఒసాకా ఎంట్రీ అదిరిపోయింది. ఆమె ఆ టెన్నిస్ కోర్టుని ష్యాషన్ వేదిగకగా మార్చేసింది. అంత అద్భుతమైన లుక్తో అలరించింది. క్రీడాకారుణులు టెన్నిస్ కోర్టుకి ఎలా వస్తారో తెలిసిందే. కానీ ఒసాకా..పూర్తి తెలుపు రంగు దుస్తులతో వచ్చి..అక్కడున్న ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది. నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన ఆమె జపనీస్ సంప్రదాయ కిమోనో దుస్తులతో అలరించింది. ఈ దుస్తులను టోక్యోకు చెందిన డిజైనర్ హానా యాగి రూపొందించారు. సున్నితమైన వస్త్రం అందులో సీక్వెన్స్డ్ కలర్లోనే ఎంబ్రాయిడరీ చేసిన కొంగలు, చెర్రీ పువ్వులు, ముత్యాలు పొందుపర్చారు. సాంప్రదాయ శైలిలో కుట్టిన మెడ, వదులుగా ఉండేలా చేతుల భాగం, ఇక నడుముకి చిత్రమైన విల్లు ఆకారపు అలంకరణలతో కూడిన సాంప్రదాయ జపనీస్ ఓబీ బెల్ట్ని ధరించింది. ఆమె సాంప్రదాయ కంజాషి కేశాలంకరణ ఆభరణం, మికిమోటో ఆభరణాలతో తన రూపాన్ని పూర్తి చేసింది. ఈమేరకు ఒసాకా తన వేషధారణ గురించి మాట్లాడుతూ.."తనకు జపాన్ వారసత్వం ముఖ్యమని, వింబుల్డన్లో అంతా తెలుపు రంగు దుస్తులనే ధరించాలన్నారు. అందుకే ఇలా కిమోనోలో వస్తే బాగుంటుందని అనుకున్నాను, తనకు ఇష్టమైన సినిమా 'కిల్ బిల్',అందులోని లూసీ లియు పాత్ర ఓ-రెన్ ఇషీ మాదిరిగా ఇలా తెల్ల కిమోనో ధరించాను". అని వెల్లడించింది. అంతేగాదు ఒసాకా ఆ దుస్తులతో టెన్నిస్ కోర్టులోకి అడుగు పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున అరుస్తూ..తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పైగా ఆమె ఫ్యాషన్ శైలిని అభినందిస్తూ.. ఒసాకా నువ్వు క్రీడాశైలిని, సంస్కృతిని ఒకే వేదికపై భలే చూపించావంటూ ప్రశంసించారు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) (చదవండి: ఐఐటీ డ్రాపౌట్ అయినా..మైక్రోసాఫ్ట్, గూగుల్లో ఉద్యోగం!) -
స్టాలిన్ అలా అనకపోయి ఉంటే... ఇదంతా జరిగేదా?
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగబోతోందా? అధికారంలోకి వచ్చిన రెండు నెలలు కూడా పూర్తికాకముందే సీఎం జోసెఫ్ విజయ్ కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశారు. డీఎంకేను పూర్తిగా ఒంటరి చేయడమే లక్ష్యంగా దాని మాజీ మిత్రపక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బుధవారం జరగనున్న కీలక సమావేశం తమిళ రాజకీయాల దిశనే మార్చే అవకాశముందనే చర్చ సాగుతోంది.సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తన మిత్రపక్షాలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్, విడుతలై చిరుతైగళ్ కట్చి (VCK), సీపీఐ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (MDMK) వంటి పార్టీలను ఆహ్వానించారు. వీటిలో చాలా పార్టీలు గతంలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగస్వాములే కావడం గమనార్హం.అధికారికంగా డీఎంకేకు గుడ్బై?ఈ సమావేశానికి ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న విడుతలై చిరుతైగళ్ కట్చి (VCK) అధినేత తిరుమావళవన్ పార్టీ అధికారికంగా డీఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే ప్రభుత్వానికి VCK మద్దతు ప్రకటించినప్పటికీ, ఇప్పుడు అధికారికంగా డీఎంకేతో బంధం తెంచుకోవడం పెద్ద రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు.డీఎంకే మాజీ మిత్రులంతా విజయ్ వైపు?ఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వంలో భాగమయ్యారు. ఇటీవల వైకో నేతృత్వంలోని ఎండీఎంకే కూడా డీఎంకేతో దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలికింది. అయితే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం డీఎంకేతోనే కొనసాగుతున్నారు. ఇక సీపీఐ, సీపీఎం వైఖరి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.సెక్యులర్ ఫ్రంట్కు శ్రీకారంవిజయ్ నేతృత్వంలో కొత్త "సెక్యులర్ కూటమి" ఏర్పాటు దిశగా ఈ సమావేశం తొలి అడుగుగా భావిస్తున్నారు. ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా.. ప్రభుత్వాన్ని మరింత స్థిరంగా ఉంచడం, మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడం, భవిష్యత్ స్థానిక సంస్థలు, ఉపఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే వ్యూహంపై చర్చించే అవకాశముంది.స్టాలిన్ వ్యాఖ్యలే కారణమా?ఇటీవల డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ "తమిళనాడులో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు" అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తర్వాతే విజయ్ మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రక్రియ వేగం పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టడంతో పాటు, డీఎంకే మాజీ మిత్రులంతా తమవైపే ఉన్నారనే సంకేతాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని అత్యంత ప్రాధాన్యంగా నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో "స్టాలిన్ ఆ వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే... విజయ్ ఇంత వేగంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదిపేవారా?" అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్న విజయ్ టీమ్..ఈ కీలక సమావేశానికి హాజరుకావాలని టీవీకే సీనియర్ నేతలు, మంత్రులు ఎన్. ఆనంద్, ఆదవ్ అర్జున్ స్వయంగా వివిధ పార్టీల అగ్రనేతలను కలిసి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా వీసీకే అధినేత తిరుమావళవన్తో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వాన పత్రం అందించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.డీఎంకేకు ఇది పెద్ద రాజకీయ సవాలేనా?2019 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమే తమిళ రాజకీయాలను శాసించింది. కానీ ఇప్పుడు అదే కూటమిలోని భాగస్వాములు ఒక్కొక్కరుగా విజయ్ వైపు చేరడం సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీగానే మిగులుతుందా? లేక కొత్త రాజకీయ ఫ్రంట్కు అధికారిక శ్రీకారం చుడుతుందా? అన్నది ఒక ప్రశ్న అయితే... స్టాలిన్ చేసిన ఒక్క వ్యాఖ్యే ఈ మొత్తం రాజకీయ వేగానికి కారణమైందా? అన్న ప్రశ్న కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అంతే ఆసక్తిగా చర్చనీయాంశమవుతోంది. -
ఇంట్లో మృతదేహం.. స్పందించిన హీరోయిన్
బిగ్బాస్(కన్నడ) ఫేం, నటి కృషి తపండ నివాసంలో ఆమె స్నేహితుడు, వ్యాపారవేత్త వైశాఖ్ ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జూన్ 24న జరగగా.. అప్పటి నుంచి కృషి తపండపై నెట్టింట రకరకాల ప్రచారం జరుగుతోంది. వైశాఖ్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆమే కారణం అన్నట్లుగా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా కృషి తపండ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు అని.. అలాంటి సమయంలో కూడా వ్యక్తిగత గ్యోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.‘ఇలాంటి పోస్ట్ చేయాల్సి వస్తుందని అస్సలు ఊహించేలేదు. నాపై వస్తున్న వదంతులకు సమాధానం ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నా. కొన్ని రోజుల క్రితం నా జీవితం ఊహించని విధంగా మలుపు తిరిగింది. నా మనసుకు ఎంతో దగ్గరైన, నాకు అన్ని వేళలా అండగా ఉండే మిత్రుడిని కోల్పోయా. అతడి మరణం నాకు తీరని లోటు. ఈ బాధలో నేను ఉంటే.. అంతకంటే దారుణమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. ఓ వ్యక్తి మరణిస్తే.. దానిపై వదంతులు, ఊహాగానాలతో కొందరు తమకు నచ్చిన కథలు సృష్టిస్తున్నారు. నేను కన్పిస్తే చాలు.. ‘మీ స్పందన ఏంటీ?’ అంటూ అర్థం లేకుండా అడుగుతున్నారు. అలాంటి వాళ్లని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. ఒకరి నష్టాన్ని మీ హెడ్లైన్గా మార్చుకోకండి. మేమంతా ఓ మంచి స్నేహితుడిని కోల్పోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా ప్రవర్తించొద్దు. మీరు చేసే అసత్య ప్రచారాలు.. బాధలో ఉన్నవారికి మరింత నష్టం కలిగిస్తాయి. మీ వల్ల ఇతరులు సంతోషంగా ఉండకపోయినా ఫర్వాలేదు.. కానీ ఇంకొకరి కన్నీళ్లకు మీరు కారణం కావొద్దు. నా మిత్రుడి ఆత్మకు శాంతి కలిగేలా ప్రవర్తిస్తారని కోరుకుంటున్నా. ఇకనైనా ఇలాంటి ప్రచారాలు ఆపాలని వేడుకుంటున్నా’అని కృషి తపండ తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Krishi Thapanda (@krishithapanda) -
పాలిటిక్స్ ఏమోగానీ.. 'సర్' అయితే ఇక్కడ కూడా నడుస్తుందిగా..!
పాలిటిక్స్ ఏమోగానీ.. 'సర్' అయితే ఇక్కడ కూడా నడుస్తుందిగా..! -
రైలు డోరు దగ్గరున్న యువతికి సైగలు.. దిమ్మతిరిగే ట్విస్ట్!
న్యూఢిల్లీ: వివేక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న రూపాలీ దీక్షిత్ అనే మహిళా ప్రయాణికురాలిని చూసి రైల్వే ట్రాక్పై నిలుచున్న ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జూన్ 29న దంకుని(పశ్చిమ బెంగాల్) జంక్షన్ వైపు రైలు వెళ్తున్న సమయంలో, రైలు గేటు దగ్గర నిలబడిన ఆమెకు సదరు వ్యక్తి అసభ్య సైగలు చేశాడు. దీనిని గమనించిన ఆ మహిళ వీడియో తీసి, సామాజిక మాధ్యమాల ద్వారా రైల్వే శాఖ, ‘రైల్ మదద్’, ‘ఆర్పీఎఫ్’ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై రైల్వే రక్షణ దళం తక్షణమే స్పందించి, తదుపరి చర్యల కోసం కేసును హౌరా డివిజన్కు బదిలీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆర్పీఎఫ్ ఈస్టర్న్ రైల్వే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. తుది నివేదిక రావాల్సి ఉంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి చర్యను పలువురు తీవ్రంగా ఖండించగా, కొందరు నెటిజన్లు బాధితురాలి ప్రయాణ విధానాన్ని ప్రశ్నిస్తూ విమర్శలకు దిగారు. అయితే దుస్తులు లేదా నిలబడే స్థలాన్ని బట్టి మహిళలపై వేధింపులను సమర్థించలేమని మరికొందరు ప్రయాణికులు, నెటిజన్లు అంటున్నారు. Today I was travel in Vivek Express when I Stand at coach door ,this guy behave badly and giving me sign of Sexual .He was Travelling in a 15228- SMVT Express in 2nd General coach from Engine and now he was reaching to Dankuni Jn.@RailMadad @RailMinIndia @RailwaySeva @RPF_INDIA pic.twitter.com/bMp4J61Czg— Rupali Dixit 🇮🇳 (@GhumakkadLaali) June 29, 2026 -
లోహగఢ్ కోటకు అమాంతం పెరిగిన రద్దీ
ఒక విషాద ఘటన.. ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతాన్ని కొత్త కారణంతో వార్తల్లోకి తెచ్చింది. వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అదే ఘటన జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన మహారాష్ట్రలోని లోహగఢ్ కోటకు ఇప్పుడు పర్యాటకుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కేతన్ను తోసేశారని చెబుతున్న ప్రదేశాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతుండటం చర్చనీయాంశంగా మారింది.కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్థానికులు, టూరిజం వర్గాలు చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల రద్దీ దాదాపు 25 శాతం పెరిగినట్లు సమాచారం. ఈ కేసులో నిందితురాలు సియా అనే యువతి పేరు పదేపదే వినిపించడంతో.. కేతన్ను లోయలోకి తోసేశారని ప్రచారంలోకి వచ్చిన ప్రాంతాన్ని సందర్శకులు ‘సియా పాయింట్’ గా పిలవడం ప్రారంభించారు. అధికారికంగా అలాంటి పేరు లేకపోయినా.. సోషల్ మీడియా ప్రభావంతో ఆ పేరు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.కోటకు వెళ్లే పర్యాటకులు అక్కడి గైడ్లను, స్థానికులను సియా పాయింట్ ఎక్కడ ఉంది? కేతన్ను తోసింది ఇదే ప్రదేశమా? అంటూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆ ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ధోరణిపై స్థానికులు, పర్యాటక రంగానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన లోహగఢ్ కోటను ఒక నేర ఘటనతో గుర్తుపెట్టుకోవడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాల ఆధారంగా ప్రచారంలోకి వచ్చిన పేర్లను నిజాలుగా భావించొద్దని కూడా సూచిస్తున్నారు.మరో వైపు, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ లోహగఢ్ కోట కూడా అనూహ్యంగా దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారింది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ కోట.. ఇప్పుడు ఒక సంచలన హత్య కేసు కారణంగా కొత్త గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషం. -
కాందిశీకుల కలలపై ‘ఖర్చు’ల కత్తి!
బ్రిటన్లో అక్రమ వలసల నియంత్రణే లక్ష్యంగా అధికార లేబర్ పార్టీ ప్రభుత్వం కీలకమైన నూతన ఆశ్రయ నిబంధనలను ప్రకటించింది. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ నిర్ణయం ప్రకారం.. భవిష్యత్తులో బ్రిటన్లో ఆశ్రయం పొందే, శాశ్వత నివాసం (పీఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే శరణార్థులు ప్రభుత్వం తమపై చేసే ఖర్చును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?బ్రిటన్ హోం శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, దేశంలో శాశ్వత నివాసం పొందాలంటే అంతకుముందు ప్రభుత్వం తమ వసతి, జీవన భత్యం కోసం ఖర్చు చేసిన 10,000 పౌండ్లు (సుమారు రూ.11 లక్షలు) తిరిగి చెల్లించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనల అమలుపై ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.భవిష్యత్తులో బ్రిటన్కు వచ్చే, ఈ మొత్తాన్ని చెల్లించగల ఆర్థిక స్థోమత ఉన్న వయోజనులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.ఈ నిబంధనలు గతంలో ఆశ్రయం పొందిన వారికి వర్తించవు. అలాగే చిన్నారులకు దీని నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.శరణార్థులు ఈ డబ్బు చెల్లించడం వల్ల పూర్తిగా పేదరికంలోకి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు కూడా చట్టంలో పొందుపరిచారు.బ్రిటన్ హోం శాఖ అంచనాల ప్రకారం ఆశ్రయం కోరుకునేవారికి తాత్కాలిక వసతి కల్పించేందుకు సగటున ఒక్కో వ్యక్తికి రోజుకు 23.25 పౌండ్లు(సుమారు రూ.2,600), హోటళ్లలో ఉంచితే రోజుకు 144 పౌండ్ల(రూ.16,000) వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా వారానికి జీవన భత్యం కూడా చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది ఆశ్రయ వసతి, సంబంధిత సాయం కోసం బ్రిటన్ సుమారు 400 కోట్ల పౌండ్లు(సుమారు 44,000 కోట్ల రూపాయలు) ఖర్చు చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో బ్రిటన్ హోం సెక్రటరీ షబానా మహమూద్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్ పన్ను చెల్లింపుదారులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఆశ్రయ సాయం పొందడం కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత కూడా. శరణార్థులకు ఆర్థిక స్థోమత చేకూరిన తర్వాత బ్రిటన్ ప్రజలకు ప్రతిగా వారు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలి’ అన్నారు.రాజకీయ ఉద్రిక్తతలు - లేబర్ పార్టీ వ్యూహంబ్రిటన్ రాజకీయాల్లో వలసల అంశం అత్యంత సున్నితమైనది. ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే ప్రధానాంశాల్లో ఇది ఒకటిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇది స్థానిక ఉద్రిక్తతలు, నిరసనలకు కూడా కారణమవుతోంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న సెంటర్ లిఫ్ట్-లేబర్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని కొందరు భావిస్తున్నారు. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రైట్ వింగ్-రిఫార్మ్ యూకే పార్టీ దేశంలో రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. దేశంలోని సుమారు ఆరు లక్షల మంది శరణార్థులను వెనక్కి పంపించేస్తామంటూ రిఫార్మ్ యూకే ఇస్తున్న హామీలు స్థానిక ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టేందుకే లేబర్ పార్టీ ఈ చర్యలకు పూనుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
తాకట్టు పెడతాడు.. తస్కరిస్తాడు!
హైదరాబాద్: బంగారం, వస్తువులు, వాహనాలను తస్కరించి తాకట్టు పెట్టిన ఉదంతాలు తరచు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. చాలా మంది చోరుల నైజమే ఇది. అయితే జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గత వారం పట్టుకున్న ముదస్సిర్ హుస్సేన్ వ్యవహారం దీనికి భిన్నం. అతను కార్లను తాకట్టు పెట్టిన తర్వాత తస్కరిస్తుంటాడు. ఆ నిందితుడిని వివిధ కోణాల్లో విచారించిన అధికారులు ఈ విషయం గుర్తించారు. మరోపక్క ఇతడికి బాస్గా వ్యవహరించిన నాందేడ్ గ్యాంగ్స్టర్ సూరజ్ సింగ్కు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు బయటపడింది. దీంతో ముదస్సీర్ వ్యవహారాన్ని నగర పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.కార్ల విక్రయంతోనే మొదలైన కథ...పాతబస్తీలోని ఖిల్వత్ ప్రాంతానికి చెందిన ముదస్సిర్ హుస్సేన్ అలియాస్ షా బాబా 2022లో ముంబై వెళ్లాడు. ఆ తరువాత స్నేహితుడి ద్వారా ముంబైలో కార్లు ఖరీదు చేసి నగరంలో విక్రయించడం ప్రారంభించాడు. తొలిసారిగా అక్కడ ఓ కారును రూ.1.35 లక్షలకు ఖరీదు చేసి నగరానికి తరలించి రూ.1.75 లక్షలకు అమ్మాడు. ఇలా మొదలైన వ్యాపారాన్ని 2024 వరకు చేశాడు. ఈ సందర్భంలో ఇతడి స్నేహితుడైన షోయబ్ ద్వారా నాందేడ్కు చెందిన గ్యాంగ్స్టర్ సూరజ్ సింగ్తో పరిచయం ఏర్పడింది. పేకాటకు బానిసగా మారిపోయిన ముదస్సిర్ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆడటం మొదలెట్టాడు.ఇక్కడి నుంచి అద్దెకు తీసుకెళ్లి... ఈ పేకాట శిబిరాలకు వెళ్లడానికి ముదస్సిర్ నగరం నుంచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకునే వాడు. ఎల్లో రిజిస్ట్రేషన్ ప్లేట్ కాకుండా వైట్ ప్లేట్తో ఉన్న వాటినే తీసుకునే వాడు. దారిలో ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు తనిఖీ చేస్తే అది తన స్నేహితుడిదని చెప్పేవాడు. మహారాష్ట్రకు చేరడానికి ముందే ఆ వాహనానికి ఓ మారు తాళం తయారు చేయించి దగ్గర పెట్టుకునే వాడు. పేకాటలో డబ్బు వస్తే అంతా సజావుగానే ఉండేది. డబ్బు కోల్పోతే మాత్రం ఆ కారు తనదే అంటూ పేకాట శిబిరం నిర్వాహకుల వద్ద తాకట్టు పెట్టేవాడు. అలా వచ్చిన డబ్బుతో మళ్లీ పేకాట ఆడి.. అదును చూసుకుని తన వద్ద ఉన్న మారు తాళంతో ఆ వాహనాన్ని తస్కరించుకు వచ్చేవాడు.ఖలిస్థాన్ లింకులపై ఆరా... గ్యాంగ్స్టర్ సూరజ్ సింగ్తో పాటు అతడి సోదరుడు ఆకాష్ సింగ్కు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. సూరజ్ ముఠాతో ముదస్సిర్ 2024లో తొలినేరం చేశాడు. కర్ణాటకలోని బసవకళ్యాణ ప్రాంతంలో తన బంధువు నుంచి రావాల్సిన డబ్బు వసూలు కోసం దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన తర్వాతే సూరజ్ ఆదేశాల మేరకు మహారాష్ట్రలో గణపతిరావు షిండే కిడ్నాప్కు పాల్పడ్డాడు. సూరజ్తో అత్యంత సన్నిహితంగా మెలిగిన ముదస్సిర్కు కూడా ఖలిస్థాన్ లింకులు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన సందేహాలు నివృతి చేసుకోవడానికి వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ముదస్సిర్ను పోలీసు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతడికి తుపాకులు విక్రయించిన వ్యక్తుల వివరాలు ఆరా తీయనున్నారు. -
E20 పెట్రోల్ సేఫేనా?.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) పెట్రోల్ పై వినియోగదారులు, ఆటోమొబైల్ రంగంలో వ్యక్తమవుతున్న ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. E20 ఇంధన విధానం ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, కాబట్టి సురక్షితమా? కాదా? అని తేలడానికి ఇంకా సమయం పడుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది.కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఓ ఉత్తర్వును సవాల్ చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఈ వ్యాఖ్యలు చేశారు. 20 శాతం ఇథనాల్ మిశ్రమం ప్రభుత్వ విధానంలో భాగమైనప్పటికీ, దాని ప్రభావాన్ని నిరంతరం పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపారు.ఇటీవల E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజిన్లకు నష్టం కలుగుతుందా? మైలేజ్ తగ్గుతుందా?.. కాలుష్యం జరుగుతుందా? అనే సందేహాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. అయితే ఈ ఆందోళనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. E20 ఇంధనం వల్ల వాహనాలకు నష్టం జరుగుతుందనే నిర్ధారిత ఆధారాలు ఇప్పటివరకు లేవని ప్రభుత్వం పేర్కొంది.ఇంకా ఇథనాల్ మిశ్రమం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడం, విదేశీ మారకద్రవ్య ఆదా, రైతులకు అదనపు ఆదాయం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయని కేంద్రం మరోసారి నొక్కి చెప్పింది. ఈ విధానం ద్వారా భారత్ ఇప్పటికే రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని తెలిపింది.దేశవ్యాప్తంగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) అమలు లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించిన గడువు(2030) కంటే ముందుగానే సాధించింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ సరఫరా ప్రారంభమైంది. ఇప్పుడు 2030 నాటికి ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.అయితే E20పై వినియోగదారుల సందేహాలు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి ఈ విధానం ప్రభావంపై స్పష్టమైన అంచనా వస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
టీడీపీ నేత అనుచరుడికి జనసేనలో పదవి?
కొల్లూరు: జనసేన పార్టీ బాపట్ల పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీలో టీడీపీ నాయకుడి ముఖ్య అనుచరుడికి పదవి కేటాయించడంపై జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. టీడీపీ కొల్లూరు మండల కన్వీనర్ ప్రధాన అనుచరుడిగా మెలుగుతున్న వ్యక్తికి జనసేనలో పదవి కేటాయించడం ఇటు జనసేన.. అటు టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చానీయంశంగా మారింది. టీడీపీ సభ్యత్వం ఉండి..ఆ పార్టీ పోలింగ్ బూత్ కన్వీనర్గా ఉన్న వ్యక్తికి జనసేనలో పదవి కేటాయించడం వెనుక టీడీపీ మండల కన్వీనర్ సిఫారసే కారణమన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల జనసేన పార్టీ బాపట్ల పార్లమెంట్ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ పేరుతో ఓ కొత్త కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో కొల్లూరుకు చెందిన ఈమని మణికంఠకు సాదక్ రిప్రజెంటేటివ్గా పదవి దక్కింది. అయితే గతంలో జనసేన కార్యకర్తగా ఉన్న మణికంఠ కొన్నేళ్లుగా టీడీపీ కొల్లూరు మండల కన్వీనర్ మైనేని మురళీకృష్ణ ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఆ పార్టీ సభ్యత్వాన్ని సైతం తీసుకున్నాడు. టీడీపీలో అతనిని కొల్లూరు 144వ పోలింగ్ బూత్కు కన్వీనర్గా సైతం ఆ పార్టీ సంస్థాగత పదవి కేటాయించింది. అయితే జనసేన పార్టీ నూతనంగా నియమించిన పార్లమెంట్ స్థాయి కమిటీలో టీడీపీ సభ్యుడైన మణికంఠకు పదవి ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చానీయంశంగా మారింది. టీడీపీ కొల్లూరు మండల అధ్యక్షుడి అనుచరుడిగా మెలుగుతున్న మణికంఠకు జనసేనలో పదవి దక్కడం మైనేని చక్రం తిప్పాడనే చర్చ నడుస్తుంది. జనసేనకు మద్దతుగా ఉన్న బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలను, నాయకులను మభ్యపెట్టి టీడీపీ నాయకులు తమ వెంట తిప్పుకుంటూ మా పార్టీలో అంతర్గత పోరుకు ప్రోత్సహిస్తున్నారని స్థానిక జనసేన నేతలు వాపోతున్నారు. 2024 నుంచి టీడీపీ సభ్యత్వం పొంది, ఆపార్టీ బూత్ కన్వీనర్గా ఉన్న మణికంఠకు నేడు జనసేనలో పదవి రావడం ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు. జనసేన నాయకత్వంలో ముసలం పుట్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకే టీడీపీ నాయకులు కుటిల రాజకీయాలు చేస్తున్నారని జనసేన నేతలు భగ్గుమంటున్నారు. -
పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా: సీరియల్ నటి
నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం లాంటి వార్తలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాయి. అయితే మనస్పర్థల కారణంగా విడిపోయాం అనే కారణాన్ని దాదాపు సినీ జంటలన్నీ చెబుతుంటాయి. కానీ ఓ సీరియల్ నటి మాత్రం షాకింగ్ రీజన్ చెప్పింది. తన భర్త.. పిల్లలు కావాలని అడగడంతోనే విడాకులు ఇచ్చేశానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)హిందీ సీరియల్ నటి ఆకాంక్ష చమోలా.. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న 'లాక్ అప్' అనే రియాలిటీ షో రెండో సీజన్లో పాల్గొంది. రెండో ఎపిసోడ్లో మాట్లాడుతూ తన భర్త గౌరవ్ ఖన్నా నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మూడో ఎపిసోడ్లో ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితుల గురించి బయటపెట్టింది. సహ కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకుంది.'మా పెళ్లి టైంలోనే నాకు తల్లికావడంపై ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. కాలక్రమణా అది మారుతుందేమో అనుకున్నా. కానీ తర్వాత నేను పిల్లల్ని కనడానికి, తల్లి అయ్యేందుకు సరైన వ్యక్తి కాదని తెలుసుకున్నాను. అదే సంగతి గౌరవ్కి కూడా చాన్నాళ్ల క్రితమే చెప్పాను. అంగీకరించాడు కూడా. కానీ కాలం గడిచేకొద్ది ఆయన అభిప్రాయం మారింది. ప్రస్తుతం పిల్లలు కావాలని అంటున్నాడు. కానీ నేను ఆయన కోరిక నెరవేర్చలేను. ఇది నాకు తెలిసిన వెంటనే.. ఒకవేళ ఈ కారణంగా నన్ను విడిచిపెట్టాలనుకుంటే ఆ నిర్ణయం కూడా నాకు సమ్మతమే అని గౌరవ్తో కూడా చెప్పాను' అని ఆకాంక్ష పేర్కొంది.(ఇదీ చదవండి: రాజకీయ ఎంట్రీపై యూటర్న్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం)'చాలామంది కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడం, పిల్లల్ని కనడం లాంటి వాటి కోసం పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ కోణంలో చూస్తే గౌరవ్ తప్పు చేయట్లేదు. కానీ నాకే పిల్లల్ని కనాలనే ఆసక్తి లేదు. ఆయన కావాల్సిన జీవితాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను. అందుకే ఆయనని ఆ పరిస్థితిలో ఉంచాలని నేను కోరుకోవడం లేదు' అని ఆకాంక్ష చెప్పుకొచ్చింది.ఇకపోతే ఆకాంక్ష.. సంతోషి మా, యే హై ఆషికీ, క్రైమ్ పట్రోల్ తదితర సీరియల్స్ చేసింది. 2016 నవంబరులో నటుడు గౌరవ్ ఖన్నాని ఈమె పెళ్లి చేసుకుంది. అయితే గతేడాది బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొన్నప్పుడు కూడా గౌరవ్ ఖన్నా ఆకాంక్ష ఇప్పుడు చెప్పిన విషయాన్నే చెప్పాడు. తన భార్య, పిల్లలను కనకూడదనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని, తనకు మాత్రం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పిల్లలు కావాలనే కోరిక ఉందని వెల్లడించాడు. అయితే ఇదంతా చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నం చేయట్లేదని స్పష్టం చేశాడు.(ఇదీ చదవండి: సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్) -
HYD: సరూర్నగర్లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం!
హైదరాబాద్: సరూర్నగర్లోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఆ ధాటికి ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. స్థానికుల వివరాల ప్రకారం.. సరూర్నగర్ పరిధిలోని బాబూనగర్లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీగా పేలిన శబ్ధం వినిపించింది. ఆ శబ్ధానికి అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో ఆరా తీస్తున్నారు.అయితే, ఆ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్టుగా పోలీసులు చెప్పారు. అలాగే, అదే సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు సంభవించిన సమయంలో ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నా వాటినుంచి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో పేలుడుకు అసలు కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది. భారీ పేలుడు.. ధ్వంసమైన ఇల్లుహైదరాబాద్ - సరూర్నగర్ పరిధిలోని బాబూనగర్లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీ పేలుడుపేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసంకుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు ఇంట్లో ఉన్న… pic.twitter.com/sQ356wGrXi— Telugu Scribe (@TeluguScribe) June 30, 2026 -
కొత్త క్యాబినెట్లో అమిత్ షాకు కీలక బాధ్యతలు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరగబోయే విస్తరణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్ర మరింత కీలకం కానున్నదనే చర్చ జోరందుకుంది. 2019 మే 30న తొలిసారి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, 2025 ఆగస్టులో లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉన్న 2,256 రోజుల రికార్డును అధిగమించి, భారత చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు సృష్టించారు.2029 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా చేపడుతున్న ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కొత్త తరాన్ని ప్రోత్సహించే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉండగా.. అమిత్ షా సాధించిన పరిపాలనా విజయాల కారణంగా ఆయన రాజకీయ ప్రాధాన్యత మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అమిత్ షా తన ఏడేళ్ల హోంమంత్రిత్వ కాలంలో దేశ భద్రత, రాజకీయ వ్యూహాల్లో ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించారు. 2019లో జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆమోదం, 2023లో కొత్త నేర చట్టాలను తీసుకురావడం వంటివి ఆయన కెరీర్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఈశాన్య రాష్ట్రాలలో శాంతి స్థాపన కోసం 12కు పైగా చారిత్రాత్మక ఒప్పందాల ద్వారా దాదాపు 11,000 మంది తీవ్రవాదులను ప్రధాన స్రవంతిలోకి అమిత్ షా తీసుకువచ్చారు. అలాగే, 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుండి విముక్తి చేశారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన అమిత్ షా, ఎంపీగా తన సొంత నియోజకవర్గమైన గాంధీనగర్లో నిరంతరం పర్యటిస్తూనే, పార్టీ మేనేజ్మెంట్లో సునీల్ బన్సల్, వినోద్ తావ్డే వంటి నేతలను తీర్చిదిద్దారు. 2026 మే నెలలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత, బంగ్లాదేశ్ నుండి వచ్చే చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దులో ఫెన్సింగ్ పనులను వేగవంతం చేశారు. అలాగే, 2026 జూన్లో హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య చారిత్రాత్మక ‘యమునా జలాల ఒప్పందం కుదర్చడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ బయోడేటా ఆధారంగానే మోదీ క్యాబినెట్లో ఆయనకు మరింత పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. -
ఇక అమెరికాతో చర్చల్లేవు.. ఇరాన్ విదేశాంగ శాఖ
అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించి ఇరాన్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరుదేశాల మధ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఖండించారు. మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతాయని ట్రంప్ చెప్పగా, తాము అమెరికా అధికారులతో చర్చలు జరపడానికి వెళ్లడం లేదని ఇరాన్ సోమవారం సాయంత్రం స్పష్టం చేసింది.ఈ చర్చల కోసం అధ్యక్షుడు ట్రంప్కు అత్యంత సన్నిహితులైన సలహాదారులు స్టీవ్ విట్కాఫ్ , ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సాంకేతిక చర్చలతో పాటు జరిగే ఉన్నత స్థాయి సమావేశాలకోసం దోహాకు వెళ్లనున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది.ఇరాన్ స్పష్టీకరణఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రతినిధి బృందం రాబోయే రెండు రోజులు దోహాలోనే ఉంటుందని, అయితే వారు అమెరికా అధికారులను కలవడానికి కాకుండా, ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికా తన కాల్పుల విరమణ ఒప్పంద బాధ్యతలను నెరవేర్చేలా చేయడానికి మాత్రమే వెళ్తున్నారని తెలిపారు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.ఇదీ చదవండి: హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులురూట్ ఫీజులపై ఒమన్తో చర్చలుహార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే ఓడల మార్గాల్లో మార్పులు, ఫీజుల వసూలు వంటి కొత్త నిబంధనలపై ఒమన్తో చర్చలు జరుపుతున్నట్లు ఘరీబాబాదీ పేర్కొన్నారు. ఒకవేళ ఒమన్ కలిసి రాకపోయినా, ఇరాన్ ఒంటరిగానే ముందుకు వెళ్తుందని హెచ్చరించారు. గత రెండు వారాలుగా ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి, గత గురువారం నుండి ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడులు పెద్ద ముప్పుగా మారాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇరు దేశాలు దాడులు కొనసాగిస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ సైన్యం కూడా ఆదివారం దక్షిణ లెబనాన్లోని మూడు హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసింది. అమెరికా మద్దతుతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ నుండి వెనక్కి తగ్గాల్సి ఉన్నప్పటికీ, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూప్ ఈ ఒప్పందాన్ని తిరస్కరించడంతో అక్కడ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్ -
మోదీ సరిగా నిద్రపోరు.. ఆయన నా టైపే!
భారత్–అమెరికా సంబంధాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత అనుబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఆ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF) లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ స్నేహంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం మియామిలో జరిగిన యూఎఫ్సీ ఈవెంట్ సందర్భంగా ట్రంప్తో కలిసి బ్యాక్స్టేజ్లో ఉన్నప్పుడు.. ఒక్కసారిగా "ప్రధాని మోదీకి ఫోన్ చేద్దాం" అని ట్రంప్ చెప్పారన్నారు. అయితే.. అప్పటికే భారత్లో ఉదయం 6 గంటలు అవుతుందని.. బాగా వేకువజామున అని తాను చెప్పగా, ట్రంప్ వెంటనే..‘‘ఆయన(మోదీ) ఈపాటికే లేచి ఉంటారు. ఆయన నాలాగే. నిద్ర తక్కువే (He's like me). సరిగా నిద్రపోరు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చినట్లు గోర్ వివరించారు. అయితే ఆ రోజు కాల్ చేయకపోయినా.. మరుసటి రోజు ఇద్దరూ మాట్లాడుకున్నారని తెలిపారు. అయితే ఈ సంఘటనలో ప్రధాన విషయం ఫోన్ కాల్ కాదని.. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహబంధమేనని గోర్ వ్యాఖ్యానించారు."ఎవరైనా నిజమైన స్నేహితులైతే ప్రతి విషయం ముందుగానే షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ నిజంగానే ప్రధాని మోదీని తన స్నేహితుడిగా భావిస్తారు" అని ఆయన అన్నారు.భారత్తో బంధానికి ట్రంప్ ప్రాధాన్యంభారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ట్రంప్ ఉన్నారని సెర్గియో గోర్ స్పష్టం చేశారు. ఇటీవల వాషింగ్టన్లో ట్రంప్తో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన సందర్భంగా కూడా ఆయన భారత్ గురించి ఎంతో అభిమానంతో మాట్లాడారని చెప్పారు. ట్రంప్కు తన గత భారత పర్యటన ఇప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని, భారత్పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని గోర్ తెలిపారు. రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా ట్రంప్ భారత్ను సందర్శిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ట్రంప్ భారత్లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే.మొదటి టర్మ్లోనే బలపడిన స్నేహంట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలోనే మోదీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమం, భారత్లో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' సభలు ఆ ఇద్దరి స్నేహానికి ప్రతీకగా నిలిచాయి. అప్పటి నుంచి రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి కీలక రంగాల్లో రెండు దేశాల సహకారం మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు.భవిష్యత్తుపై ఆశలువచ్చే రెండేళ్లు భారత్-అమెరికా సంబంధాలకు అత్యంత కీలకమని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో మరింత స్పష్టమైన ఫలితాలు సాధించడంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు. -
విజయవాడ: రైతులపై పోలీసుల దాష్టీకం
సాక్షి, విజయవాడ: ధర్నాచౌక్లో తీవ్ర ఉధ్రిక్తత చోటుచేసుకుంది. రైతులపై పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ధర్నా చౌక్లో రైతులపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. సీఎం ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు యత్నించగా.. బారికేడ్లు పెట్టి రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ధర్నాచౌక్, స్వర్ణపాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామని రైతులు అంటున్నారు.అన్నదాతల కష్టాలపై ఏపీ రైతు సంఘం నిరసనలు చేపట్టింది. పొగాకు, మామిడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, కౌలు రైతుల బకాయిలు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
‘ముస్లిం అయివుంటే..’.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో జరిగిన ఓ ర్యాలీలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవేళ మందిర్ ట్రస్ట్లో గనుక ముస్లిం ఉండి ఉంటే, ఈపాటికే ప్రభుత్వం అతనిని ఎన్కౌంటర్లో కాల్చిచంపి, బుల్డోజర్లతో ఇల్లు కూల్చివేసేదని ఒవైసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హైప్రొఫైల్ నిందితులను రక్షించేందుకే పోలీసులు కస్టడీ కోరడం లేదని, నిందితులు ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నారని ఆయన ఆరోపించారు.ఈ భారీ విరాళాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయగా, మరో ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా వైదొలిగారు. ఆలయ పుస్తకాల రికార్డుల ప్రకారం సుమారు రూ. 7 నుండి 7.5 కోట్ల నగదు మాయమైనట్లు అంచనా వేస్తుండగా, పోలీసులు ఇప్పటివరకు నిందితుల నుండి దాదాపు రూ. 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే వారిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తామని, ఎవరినీ విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ అంశాన్ని బహిరంగంగా లేవనెత్తిన తర్వాత, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు ఆదేశించింది. జూన్ 25న ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన తొలి ఎఫ్ఐఆర్ (ఎఫ్ఐఆర్) ఆధారంగా విరాళాల లెక్కింపు సిబ్బందికి చెందిన అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రాతో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం ఆలయ నిర్వహణ వ్యవస్థల సమూల మార్పునకు, రాజకీయ విమర్శలకు దారితీసింది.ఇది కూడా చదవండి: ఉద్ధవ్కు మరో షాక్: షిండే గూటికి ఎమ్మెల్సీ సచిన్ అహిర్ -
నెదర్లాండ్స్కు షాకిచ్చిన మొరాకో
ఫిఫా వరల్డ్కప్ 2026 రౌండ్ ఆఫ్ 32 చేరేసరికి మరింత రసవత్తరంగా మారింది. ఈ దశలో భాగంగా ఇవాళ జరిగిన నాలుగు మ్యాచ్లు చివరి నిమిషాల వరకు తీవ్ర ఉత్కంఠ రేపాయి. సౌతాఫ్రికాపై కెనడా 92వ నిమిషంలో గోల్ చేసి విజయం సాధించగా.. జపాన్పై బ్రెజిల్ 96వ నిమిషంలో మ్యాచ్ విన్నింగ్ గోల్ సాధించి రౌండ్ ఆఫ్ 16కి చేరింది.మరో మ్యాచ్లో జర్మనీపై పరాగ్వే పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించగా.. ఇంకో మ్యాచ్లో మొరాకో సైతం నెదర్లాండ్స్కు అదే తరహాలో షాకిచ్చింది. నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు తలో గోల్ చేసి సమంగా నిలువగా.. పెనాల్టీ షూటౌట్లో మొరాకో పటిష్టమైన నెదర్లాండ్స్ను 3-2తో ఓడించి ప్రీక్వార్టర్ ఫైనల్ (రౌండ్ ఆఫ్-16)కు అర్హత సాధించింది.పెనాల్టీ షూటౌట్లోనూ నాలుగు రౌండ్లు ముగిసే సరికి స్కోరు 2-2తో సమంగా ఉన్నప్పటికీ.. కీలక సమయంలో మొరాకో గోల్కీపర్ యాస్సిన్ బౌనో నెదర్లాండ్స్ ఆటగాడు క్రిసెన్సియో సమ్మర్విల్లే పెనాల్టీని అద్భుతంగా అడ్డుకున్నాడు. అనంతరం ఇస్మాయిల్ సైబారి తన కిక్ను గోల్గా మలిచి మొరాకోకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గోల్ సాధించిన వెంటనే సైబారి ఆనందంతో జెర్సీ విప్పి సంబరాలు చేసుకోగా, సహచర ఆటగాళ్లు అతడిని చుట్టుముట్టి సంబరాల్లో మునిగిపోయారు.ఈ మ్యాచ్లో తొలుత ఆధిక్యం నెదర్లాండ్స్కే లభించింది. 72వ నిమిషంలో కోడి గాక్పో గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్కు సమ్మర్విల్లే అసిస్ట్ చేశాడు. అయితే చివరి క్షణాల్లో మొరాకో పోరాటం ఫలించింది. ఇంజరీ టైమ్ (91వ నిమిషం)లో ఇస్సా డియోప్ హెడ్డర్తో గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. అదనపు 30 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు చేరుకుంది.ఈ పరాజయంతో నెదర్లాండ్స్కు మరో అపవాదు కూడా ఎదురైంది. గత 11 ప్రపంచకప్లలో కనీసం రౌండ్ ఆఫ్-16కు చేరిన డచ్ జట్టు, ఊహించని విధంగా ఈసారి రౌండ్ ఆఫ్-32లోనే నిష్క్రమించింది.మరోవైపు, గత ప్రపంచకప్లో సెమీఫైనల్ వరకు చేరి చరిత్ర సృష్టించిన మొరాకో, ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. రౌండ్ ఆఫ్-16లో ఆ జట్టు కెనడాతో తలపడనుంది. -
హై-టెక్ వ్యభిచారం : ఇద్దరు హీరోయిన్లను రక్షించిన పోలీసులు
ముంబయిలో మరోసారి హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. గిర్గావ్ ప్రాంతంలోని ఒక హోటల్లో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసి, ఇద్దరు నటీమణులను రక్షించారు. ఈ వ్యవహారంలో పింప్ (మధ్యవర్తి)గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం, రక్షించిన వారిలో ఒకరు మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రధాన నటి కాగా, మరొకరు బెంగాలీ చిత్రాల్లో నటించడంతో పాటు బాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్రలు (కామియో రోల్స్) పోషించారు. బాధితుల ప్రైవసీచ భద్రత దృష్ట్యా వారి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. వారిని నిందితులుగా కాకుండా బాధితులుగానే పరిగణించి రక్షించినట్టు తెలిపారు.మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నట్లు చెబుతున్న నిందితుడిని పోలీసులు రెడ్-హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇతనికి సినీ పరిశ్రమలోని పలువురితో ఉన్న సంబంధాలు, పరిచయాలతోనే ఈ గలీజు దందాకు తెరతీశాడు. అయితే ఈ ముఠా ద్వారా మరికొంతమంది మహిళలను వేధించారు అనే కోణంలో పోలీసులు అతని కాంటాక్ట్లను పరిశీలిస్తున్నారు. అలాగే ఆ నటీమణులు ఆ హోటల్కు ఎలా వచ్చారు? వారిని ఎవరైనా బెదిరించారా లేదా ఆర్థికంగా వాడుకున్నారా? అనే విషయాలపై విచారణ జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!దీనికి కొద్ది రోజుల ముందే థానేలోని కల్యాణ్ ప్రాంతంలో కూడా ఒక హోటల్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. అక్కడ ఒక మహిళా అడ్వకేట్ (న్యాయవాది) ఈ ముఠాను నడుపుతున్నట్లు తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆమె ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు సాధారణ దుస్తుల్లో కస్టమర్లలా వెళ్లి నిఘా పెట్టి, ఇద్దరు మహిళలను రక్షించారు. ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ రెండు కేసులకు సంబంధించిన ఫోన్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తూ, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.ఇదీ చదవండి: అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్ -
తానా ప్రపంచ సాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. “అచ్చ తెలుగు తిట్లు” అనే అంశం మీద ఆదివారం జరిగిన 93 వ అంతర్జాల సమావేశం చాలా ఉల్లాసంగా జరిగింది. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అనాదినుంచి తిట్లు తెలుగు భాషలో ఒక భాగంగానే ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలలో, స్నేహితుల మధ్య వాడే కొన్ని పదాలు బయటివారికి కఠినంగా అనిపించినా, అవి అక్కడ వారి ఆప్యాయత లేదా సంబంధాలకు సంకేతాలుగా ఉంటాయన్నారు. కన్యాశుల్కం నాటకంలాంటి నాటకాలలోను, పాత సినిమాలలోను వాడిన సరదా తిట్లు సునిశితమైన హాస్యాన్ని పంచాయి. వీధి భాష, గ్రామీణ సంభాషణలలో తిట్లు అలవోకగా చాలా సహజంగా జాలువారతాయి. అయితే అవి మోతాదు మించితే బూతులుగా పరిణమిస్తాయి, ప్రస్తుతం రాజకీయాలలో కొంతమంది రాజకీయనాయకులు “న బూతో న భవిష్యత్” గా మార్చుకుని, ఒకరిని మించి ఒకరు బూతులతో తిట్టుకోవడంతో సమాజంలో జుగుప్సాకర వాతావరణాన్ని సృష్టిస్తున్నది. కనుక వాడే భాష పట్ల జాగ్రత్త అవసరం” అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు వేదకవి, సినీ గీతరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ళ భరణి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు డి. విజయలక్ష్మి, రచయిత ముత్తేవి రవీంద్రనాథ్, ప్రముఖ రచయిత జి.యస్ మోహన్ తదితరులు హాజరయ్యారు. చివరగా తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ”తిట్ల మీద ఇంత సుదీర్ఘంగా ఒక సమావేశం జరగడం బహుశా ఇదే మొదటిసారి అయిఉంటుందని, పాల్గొన్న వక్తలందరూ ఎన్నో అరుదైన, విలువైన అంశాలను స్పృశించి ఈ తెలుగు తిట్ల సమావేశానికి శోభను చేకూర్చారని అందరికీ కృతజ్ఞతలు అన్నారు.(చదవండి: కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక! 94 ఏళ్ల బామ్మ విజ్ఞప్తి..) -
‘ఐ విల్ ఫైండ్ యూ’ రివ్యూ : సూపర్ థ్రిల్లింగ్ సిరీస్
ప్రేమానుబంధమనేది మమతానురాగాలతో పెనువేసుకున్న ఓ చిక్కుబంధం. అందులోనూ రక్తసంబంధం అనేది మరింత జటిలమైనది. తామ రక్తసంబంధం ఏ సమయంలోనైనా సరే దూరమైతే ఆ బాధ వర్ణణాతీతం. మళ్ళీ దూరమైన వారితో కలిస్తేనే తమ జీవితానికి అర్ధం అని అనుకునేవారెందరో. ఆ నేపధ్యంతోనే హాలివుడ్ రచయిత హర్లాన్ కోబన్ రాసిన కథే ఐ విల్ ఫైండ్ యూ. ఇప్పుడీ కథను నెట్ ఫ్లిక్స్ 8 ఎపిసోడ్ల్ సిరీస్ రూపంలో తీసుకువచ్చింది. కొడుకు హత్యారోపణను ఎదుర్కుంటున్న ఓ తండ్రి చనిపోయిన తన కొడుకును వెతుకుతూ సాగించిన పోరాటమే ఈ ఐ విల్ ఫైండ్ యూ సిరీస్. డేవిడ్ బరోస్ తన కొడుకు మాథ్యూ బరోస్ ను చంపిన కేసులో కౌంటీ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. మాధ్యూ బరోస్ తల్లి ఛెరిల్ చెల్లెలైన రేచెల్ మిల్స్ తన బావ డేవిడ్ బరోస్ ను చూడడానికి జైలుకు వస్తుంది. ఆ సమయంలోనే రేచేల్ మాథ్యూ చనిపోలేదని ఓ ఫోటో డేవిడ్ కు చూపుతుంది. తన కొడుకు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న డేవిడ్, రేచెల్ సహాయంతో జైలు నుండి తప్పించుకుని మాథ్యూని వెతుకుతూ ఉంటాడు. ఈ ప్రయత్నంలోనే రేచెల్ బాయ్ ఫ్రెండ్ అయిన ఆడమ్ ఇంట్లో డేవిడ్, రేచెల్ తలదాచుకుంటారు. ఇక అక్కడి నుండి కథ అనూహ్యమైన మలుపులతో ఊహ కందని ట్విస్టులతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. చనిపోయిన కొడుకు మాథ్యూ కేసులో నిందితుడైన డేవిడ్ మాథ్యూని రేచెల్ తో కనుక్కోగలడా లేదా అన్నది ఈ థ్రిల్లింగ్ సిరీస్ లోనే చూడాలి. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం చూస్తున్న ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తూ థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఎవరూ ఊహించని సస్పెన్స్ తో సాగే ఈ సిరీస్ థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి సరైన ఛాయిస్. – హరికృష్ణ ఇంటూరు -
సమాచారం ఎవరు లీక్ చేశారు..!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సమాచారం ఎవరు లీక్ చేశారు.. మీ మెయిల్ నుంచే అందరికీ ఫార్వాడ్ అయ్యింది.. ఏలూరు గ్రూపుల్లో వైరల్ అయింది.. మీరు చేశారంటే.. మీరు చేశారంటూ.. అధికార పార్టీ కార్పొరేటర్లను స్టేషన్కు పిలిచి మరీ విచారించడంతో అసలు ఏం లెటర్.. ఏం లీక్ అనే చర్చ ఏలూరులో హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఆ లేఖ ఏమిటంటే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ నేత కంప్యూటర్ ప్రసాద్, అతని టీమ్ గడిచిన రెండేళ్లల్లో చేసిన అవినీతి అరాచకాల చిట్టా అంటూ ఒక లేఖ వైరల్గా మారడం, టీడీపీ కార్పొరేటర్లే వైరల్ చేశారనే అనుమానంతో ఇద్దరిని పోలీస్స్టేషన్కు పిలిచి విచారించడంతో వ్యవహారం వైరల్గా మారింది.రెండేళ్ల అవినీతి, అక్రమాలు అంటూ..ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ నేత కంప్యూటర్ ప్రసాద్ బారి నుంచి ఏలూరు ప్రజానీకాన్ని కాపాడండి అంటూ తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టానానికి వినయపూర్వకంగా చేసుకున్న విన్నపమంటూ 21 పేజీల లేఖ నగరంలో కలకలం రేపింది. దాదాపు నెలన్నర క్రితమే లేఖ వ్యవహారం వెలుగులోకి వచ్చినా అప్పుడు వైరల్ కాకుండా కార్పొరేటర్లకు పోలీస్ కౌన్సెలింగ్తో వెలుగులోకి రావడం విశేషం. గత రెండేళ్లలో ఏలూరు నగరంలో ఎవరెవరి వద్ద సెటిల్మెంట్ పేరుతో ఎంత వసూలు చేశారనేది, అలాగే లేఅవుట్ల నుంచి భవనాల వరకు, స్వీట్ షాపుల నుంచి ఆస్పత్రుల వరకూ ఎవరి దగ్గర ఎంత కలెక్ట్ చేశారనేది ఫోన్ నంబర్లతో సహా 21 పేజీల్లో 53 పాయింట్లతో పీడీఎఫ్ లేఖ వైరల్గా మారింది. ఈ పరిణామాల క్రమంలో గత వారం బడేటి క్యాంపు కార్యాలయంలో గతంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్నికల ముందు నుంచి దూరంగా ఉంటున్న ఓ మాజీ నేతను ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్కు గత వారం పిలిపించి మూడు గంటల పాటు విచా రించారు. తనకేమీ లేఖతో సంబంధం లేదని, నన్ను ఎలా మీరు ప్రశ్నిస్తారని.. సదరు నేత పోలీసులను గట్టిగా అడగ్గా సరేలే అని పంపించివేశారు. ఆ తరువాత వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి వెళ్లిన ఓ కార్పొరేటర్కు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టి వెంటనే ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. సదరు కార్పొరేటర్పై అనుమానంతో మూడు, నాలుగు గంటల పాటు విచారించి వదిలేశారు. చివరిగా 36వ డివిజన్ మహిళా కార్పొరేటర్ భీమవరపు హేమసుందరిని ఈనెల 23న పోలీస్స్టేషన్కు పిలిచి విచారించారు. 21 పేజీల డాక్యుమెంట్ను మీరు షేర్ చేశారా అని ప్రశ్నించడం, మీపై మరో కార్పొరేటర్ నాయుడు సోము ఫిర్యాదు చేశారంటూ విచారించారు. తాను డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదని.. ఎవరో చేసింది తనకేమీ సంబంధమని పోలీసులకు బదులిచ్చినట్టు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ప్రకటించడంతో 21 పేజీల లేఖ వ్యవహారం వైరల్ అయింది. సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని, ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో పూర్తి ఆధారాలతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. -
పెట్రోల్, డీజిల్పై ఆంక్షలు ఎత్తివేత
దేశంలోని ఇంధన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వెలువడిన ఈ ఆదేశాల ప్రకారం.. జులై 1 (బుధవారం) నుంచి రిటైల్, కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారులు ఎలాంటి పరిమితులు లేకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు.దేశీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడంతో గతంలో విధించిన ‘మోటార్ స్పిరిట్ అండ్ హై-స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరా తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్, 2026’ నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ప్రధాన మార్పులు ఇవే..కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో క్షేత్రస్థాయిలో కింది మార్పులు అమలులోకి రానున్నాయి.రిటైల్ ఫ్యూయల్ స్టేషన్లలో (పెట్రోల్ బంకుల్లో) ఒకే వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలనే నిబంధన ఇకపై ఉండదు. జులై 1, 2026 నుంచి వాహనదారులు తమ అవసరానికి తగినంత డీజిల్ను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు.వాణిజ్య, పారిశ్రామిక రంగానికి చెందిన కొనుగోలుదారులు రిటైల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీనివల్ల వారు కేవలం తమ సొంత కన్జ్యూమర్ పంపుల నుంచే కాకుండా సాధారణ రిటైల్ బంకుల నుంచి కూడా ఇంధనాన్ని సేకరించుకోవచ్చు.ఆంక్షలు విధించడానికి కారణం..పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభంతో దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 12న అత్యవసరంగా ఈ తాత్కాలిక నియంత్రణలను ప్రవేశపెట్టింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సరసమైన ధరలకు ఇంధనాన్ని సమానంగా పంపిణీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.ధరల వ్యత్యాసంతో పెరిగిన డిమాండ్అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ సాధారణ వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ ధరలను నియంత్రించాయి. ఉదాహరణకు ఢిల్లీలో రిటైల్ బంకుల వద్ద డీజిల్ ధర లీటరుకు రూ.95.20 ఉండగా బల్క్ (భారీ) కొనుగోలుదారులకు లీటరుకు రూ.134.50గా ఉంది.ఈ భారీ ధరల వ్యత్యాసం (లీటరుకు దాదాపు రూ.39) కారణంగా భారీ పారిశ్రామిక వినియోగదారులు నేరుగా రిటైల్ బంకులను ఆశ్రయించారు. ఫలితంగా జూన్ ప్రారంభంలో చమురు సంస్థలకు డీజిల్పై లీటరుకు రూ.36.5, పెట్రోల్పై రూ.9 చొప్పున ఆదాయ నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా డిమాండ్ పెరిగి కృత్రిమ కొరత ఏర్పడింది.టెలికాం టవర్లు, ట్రక్కింగ్ కంపెనీలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులు, విద్యుత్ ఉత్పాదక పరిశ్రమలు రిటైల్ బంకుల వైపు మళ్లడంతో.. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ (నిల్వ ఉంచడం) అరికట్టేందుకు ప్రభుత్వం ఈ పరిమితిని విధించాల్సి వచ్చింది.ఇప్పుడు ఎందుకు ఎత్తివేశారు?పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమీక్ష ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సంతృప్తికరంగా ఉంది. దేశీయ సరఫరా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడటంతో పాటు సాధారణ పంపిణీ ఏర్పాట్లు పునరుద్ధరించారు. అందువల్ల జూన్ 12 నాటి ఆర్డర్ను కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన ప్రభుత్వం ఆంక్షలను ఉపసంహరించుకుంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
రాజకీయ ఎంట్రీపై యూటర్న్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎట్టకేలకు మౌనం వీడాడు. కొన్నిరోజుల క్రితం నుంచి ఇతడు రాజకీయాల్లోకి రానున్నాడని.. సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానంలో జరిగే ఉపఎన్నికల్లో నిలబడతాడనే రూమర్స్ చాలా వినిపించాయి. మూడు వారాల క్రితం దీని గురించి ప్రెస్ మీట్ పెట్టిన లారెన్స్.. చెప్పి చెప్పకుండానే మాట్లాడాడు. ఇప్పుడు ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)రెండు వారాల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. నేను రాజకీయాల్లోకి రావడం పట్ల మీ సలహాలను కామెంట్స్లో పంచుకోండి. మీరు నో అని చెబితే నేను రాజకీయాల్లోకి రాను. సమాజానికి నా నిస్వార్థ సేవ కొనసాగిస్తా. మీరు ఎస్ అంటే మాత్రం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో ప్రారంభించాలనుకుంటున్నానో వెల్లడిస్తా అని అన్నారు.తాజాగా మంగళవారం మధ్యాహ్నం దాదాపు 16 నిమిషాల వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. చాలా విషయాలు మాట్లాడాడు. నేను తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయను. కానీ రాజకీయాల్లోకి రానని మాత్రం అనుకోవద్దు అని చెప్పాడు. దీంతో విజయ్ ఖాళీ చేసిన స్థానంలో పోటీ చేస్తాడని ఆశపడ్డ అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే లారెన్స్ ఊపు చూసి పక్కాగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని భావించారు. మరి ఏమైందో ఏమో గానీ సడన్ యూటర్న్ తీసుకుని అందరికీ షాకిచ్చాడు.(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
ఉద్ధవ్కు మరో షాక్: షిండే గూటికి ఎమ్మెల్సీ సచిన్ అహిర్
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి మహారాష్ట్రలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ సచిన్ అహిర్ ఉద్ధవ్ వర్గాన్ని వీడి, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. షిండే గూటికి చేరిన వెంటనే, అహిర్ మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి శివసేన అభ్యర్థిగా తన నామినేషన్ను దాఖలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నుండి, ముఖ్యంగా ఉద్ధవ్ క్యాంప్ నుండి నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి ఎకనాథ్ షిండే వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ టైగర్’ లో భాగంగానే ఈ తాజా చేరిక చోటుచేసుకుంది.ఈ పరిణామానికి కొన్ని రోజుల ముందే శివసేన (యూబీటీ) కి చెందిన ఆరుగురు లోక్సభ ఎంపీలు షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ప్రకటించి ఉద్ధవ్కు కోలుకోలేని దెబ్బ తీశారు. ఢిల్లీలో జరిగిన కీలక పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్హాజరైన ఈ ఎంపీలు సంజయ్ దేశ్ముఖ్ (యావత్మాల్), సంజయ్ జాదవ్ (పర్భని), సంజయ్ దినా పాటిల్ (ముంబై నార్త్ ఈస్ట్), నాగేష్ పాటిల్-అష్టికర్ (హింగోలి), ఓంప్రకాష్ రాజేనింబాల్కర్ (ధారాశివ్), భౌసాహెబ్ వాక్చౌరే (శిరిడీ)—దక్షిణ ముంబైలోని యశ్వంతరావు చవాన్ ప్రతిష్ఠాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఉద్ధవ్ వర్గంలో ముగ్గురు లోక్సభ ఎంపీలు మాత్రమే మిగిలారు.ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఏకనాథ్ షిండే మాట్లాడుతూ, తమ వ్యూహాలు పక్కాగా సాగాయని, ‘ఆపరేషన్ టైగర్’ ఇప్పుడు పూర్తిస్థాయిలో విజయవంతమైందని ప్రకటించారు. చేరిన ఎంపీలను క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న దిగ్గజాలుగా ఆయన అభివర్ణించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన అభ్యర్థులపై గెలిచిన ఈ ఎంపీల మార్పుతో మహారాష్ట్ర రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది స్థానాల్లో ఆరు స్థానాలను షిండే లాక్కోవడంతో, అధికార మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ)లో షిండే బేరసారాల శక్తి మరింత బలపడింది. మరోవైపు, దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రధానమంత్రి రేసు నుండి తప్పించడానికి అమిత్ షాయే ఈ ‘ఆపరేషన్ టైగర్’ ను నడిపించారని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
పాత స్నేహితుడు ఎదురైతే.. ఫీలింగ్స్ ఇంతలా ఉంటాయా?
ఏళ్ల తరబడి దూరమైన ఇద్దరు స్కూల్ స్నేహితులు మళ్లీ కలుసుకున్న క్షణం... ఒకరినొకరు చూసుకుని భావోద్వేగానికి లోనైన దృశ్యం. సాధారణంగా హృదయాలను తాకాల్సిన ఆ 42 సెకన్ల వీడియో.. సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన చర్చకు తెరలేపింది. కొందరు దాన్ని స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంగా కొనియాడితే.. మరికొందరు అనుమానాల కోణంలో చూడడంతో రచ్చ రచ్చగా మారింది..సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేస్తోంది. వీడియోలో ఓ మహిళ 14 ఏళ్ల తర్వాత తన పాత స్కూల్ స్నేహితుడిని కలుస్తుంది. అతను విదేశాల్లో సెటిల్ అయ్యాడట. తన వివాహానికి కూడా రాలేదట. తనకంటే తన కూతురు ఆ అంకుల్ను కలవడానికి ఎగ్జయిటింగ్గా ఉందని వీడియో షేర్ చేసింది. పైగా తనను ఇంకా చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ.. తన కూతురితో పాటు తనకూ లాలీపాప్ ఇచ్చాడని సంబురంగా చెప్పింది. ఒకరినొకరు చూసుకున్న వెంటనే ఇద్దరూ ఆనందంతో ఆప్యాయంగా పలకరించుకోవడం కనిపిస్తుంది. చివర్లో.. ఆనాడు.. ఈనాడు అంటూ ఓ ఫొటోను ఉంచిందామె. ఆ వీడియో ఎక్కడిది? అందులో ఉంది ఎవరు? అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, ఈ దృశ్యాన్ని చూసిన కొందరు నెటిజన్లు, ఆమె ఉత్సాహాన్ని ప్రశ్నిస్తూ వివాహిత మహిళ ఇలా ఒంటరిగా కలవడం సరైందేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు.ఇంజినీర్ ఆదిత్య అనే ఎక్స్ (X) యూజర్ ఈ 42 సెకన్ల వీడియోను.. మీ ఆయన్ని తల్చుకుంటే బాధగా ఉంది "Feeling sad for her husband" అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్గా మారింది. మిలియన్ పైగా వ్యూస్.. వేలాది లైక్లను సొంతం చేసుకోవడమే కాకుండా, కామెంట్ల రూపంలో పెద్ద చర్చకు దారితీసింది.అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "ప్రతి పురుషుడు–మహిళ మధ్య ఉండే బంధాన్ని ప్రేమగా చూడాల్సిన అవసరం లేదు", "14 ఏళ్ల తర్వాత స్నేహితుడిని కలిస్తే అలాంటి ఆనందం సహజమే", "ఇది ఎంతో స్వచ్ఛమైన స్నేహం" అంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. పైగా కూడా బిడ్డను తీసుకెళ్లడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు.Feeling sad for her husband pic.twitter.com/rCsgNH95Og— Aditya (@adityacasm_) June 29, 2026కొందరు నేరుగా వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తినే విమర్శించారు. "నీ తల్లిని తల్చుకుంటే బాధగా ఉంది.. ఎలాంటి కొడుకును కన్నదో ఆమె", "నీ భార్యను తల్చుకుంటేనే బాధగా ఉంది", "అరేయ్.. అసలు నీ ఆలోచనా విధానమే బాగోలేదురా", "స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా తప్పుగా చూడొద్దు" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.మరికొందరు "ద్వేషపూరిత క్యాప్షన్ను పక్కన పెడితే వీడియో మాత్రం ఎంతో హృద్యంగా ఉంది" అంటూ స్పందించారు.ఈ ఘటనతో మరోసారి పెళ్లైన ఓ మహిళ, ఓ పురుషుడి మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉండగలదా? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఒక వర్గం ప్రతి బంధాన్ని అనుమానంతో చూడకూడదని వాదిస్తుంటే, మరొక వర్గం సామాజిక పరిమితుల గురించి మాట్లాడుతోంది. మొత్తానికి, ఇద్దరు పాత స్నేహితుల భావోద్వేగ కలయికగా మొదలైన ఈ వీడియో... ఇప్పుడు స్నేహం, నమ్మకం, సామాజిక దృక్పథం గురించి దేశవ్యాప్తంగా ఆన్లైన్ చర్చకు కేంద్రబిందువుగా మారింది. -
ఈ బడిలో సీట్లు లేవు
హైదరాబాద్: సాధారణంగా సర్కార్ బడిలో ‘‘నో అడ్మిషన్ బోర్డు’’ చాలా అరుదు. అందులోనూ నగరంలో ఇంకా అరుదు. కానీ, ఫిలింనగర్లోని ఎంఆర్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల చాలినంతమంది విద్యార్థులు చేరడంతో సోమవారం నో అడ్మిషన్ బోర్డు వేలాడదీశారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 4, 5 తరగతుల్లో అడ్మిషన్లు తీసుకోవడం లేదని హెచ్ఎం ప్రభాకర్ తెలిపారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు నాయకుల సిఫారసు లేఖలు కూడా తేవడం గమనార్హం.విమానాన్ని తాకిన లేజర్ కాంతులు..శంషాబాద్: ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానానికి లేజర్ కాంతులు తాకడంతో పైలట్ ఇబ్బంది పడ్డ సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి వచ్చిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానం ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో రషీద్గూడ వైపు నుంచి లేజర్ కాంతులు పడ్డాయి. దీంతో పైలట్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రషీద్గూడ వైపు ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న వివాహ వేడుకలోంచి లేజర్ కాంతులు వచ్చినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. -
అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?
కొన్ని వెయిట్లాస్ స్టోరీలు స్ఫూర్తిదాయకంగా ఉన్నా..అందరికీ సరిపడవు. ఆయా వ్యక్తిగత సమస్యలు, వైద్య నిపుణుల పర్యవేక్షణ ఆధారంగా ప్రయత్నించాలే తప్ప..లేదంటే అసలుకే ప్రమాదం. ఇక్కడ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ అలాంటిదే. ఆయన గుండెపోటుకి గురై కోలుకున్న తర్వాతా దాదాపు 27 కేజీల బరువు తగ్గారు. ఈ అద్భుతమైన మార్పు అందరికీ స్ఫూర్తినిచ్చినప్పటికీ..ఆయన ఫాలో అయిన డైట్ మంచిదేనా అనే సందేహాలు వెల్లువెత్తాయి. మరి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. ఒక్కోసారి ఆరోగ్య సమస్యల రీత్యా క్రాష్డైట్లు ఫాలో అవ్వొచ్చా అంటే..అనురాగ్ కశ్యప్ గుండెపోటు తర్వాత చాలా తక్కువ టైంలోనే అనూహ్యంగా బరువు తగ్గారు. అది కూడా ఇంత వేగంగా అందులోనూ గుండె సంబంధిత సమస్య నుంచి కోలుకున్నాక..ఇది సరైనదేనా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. అయితే వైద్యులు అది ఆయన ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక డైట్ అని అంటున్నారు. అలాంటి క్రాష్ డైట్లు అందరికీ సరిపడవని హెచ్చరిస్తున్నారు. ఆయనకి ఉన్న రుగ్మతల దృష్ట్యా నిపుణుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలతో అనుసరించిని డైట్ అని చెప్పారు. ఇలా గుండెపోటు వచ్చిన వాళ్లందరికి ఇలాంటి క్రాష్ డైట్లు సరిపడవని హెచ్చరించారు. పైగా అది మేలు కంటే కీడే చేసే అవకాశం ఎక్కువ ఉందన్నారు. అలాగే ఇక్కడ ప్రతి రోగి కోలుకోవడం అనేది అప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మందులు, పోషకాహార స్థితి, మొత్తం గుండె పనితీరు వంటి అంశాల ఆధారపడి ఉంటుందన్నారు. ఇక్కడ కశ్యప్కు ఆస్తమా చరిత్ర, స్టెరాయిడ్ల వాడకం ఉంటం వల్ల వైద్య బృందం ఆయనకు లిక్విడ్ క్రాష్ డైట్ని సూచించిందని చెప్పారు. గుండెపోటు తర్వాత క్రాష్డైట్ ఎందుకు మంచిదికాదంటే..గుండెపోటు తర్వాత, గుండె కండరం ఇంకా కోలుకుంటూ ఉంటుంది. ఇక్కడ క్రాష్ డైట్లో కేలరీలను తీవ్రంగా పరిమితం చేస్తారు. ఫలితంగా శరీరంపై అదనపు ఒత్తిడిని తగ్గించి, సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన కేలరీల పరిమితి కండరాల క్షీణత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, అలసట, తలతిరగడం వంటి సమస్యలు కోలుకోవడంలో ఆలస్యానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని అంటుఉన్నారు.గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఎలా బరువు తగ్గాలంటే..గుండెపోటు తర్వాత వేగంగా బరువు తగ్గడానికి నిశితమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్న చాలా మంది రోగులకు వారానికి సుమారు 0.5 నుంచి 1 కిలోల చొప్పున క్రమంగా బరువు తగ్గడం సురక్షితమని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక గుండె ఆరోగ్యాన్ని కాపాడే నిలకడైన ఆహారపు అలవాట్లతో బరువు తగ్గడం మంచిదంటున్నారు. గుండెకు మేలు చేసే ఆహారంపీచుపదార్థం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలుచేపలు, పప్పుధాన్యాలు, స్కిన్లెస్ కోడి మాంసం వంటి కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులురక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి తక్కువ ఉప్పు ఉన్న భోజనంఅలాగే ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా సలహా ఇస్తే తప్ప, తీవ్రమైన ఉపవాసాలు, డిటాక్స్ ప్రణాళికలు, జీరో-కార్బ్ డైట్లను సాధారణంగా నివారించాలి.ఈ లక్షణాలు కనిపిస్తే..అకస్మాత్తుగా నీరసించడంగుండె దడనిరంతర నిర్జలీకరణంతల తిరగడం లేదా స్పృహ కోల్పోవడంమానసిక గందరగోళం లేదా అయోమయంఈ లక్షణాలను మనం అనుసరిస్తున్న ఆహార నియమం శరీరంపై అధిక ఒత్తిడిని కలిగిస్తోందనేందుకు సూచనగా గుర్తెరగాలి.అందువల్ల గుండెపోటు నుంచి కోలుకుంటున్న ఎవరైనా క్రాష్ డైట్లకు దూరంగా ఉండాలని, బదులుగా సమతుల్య పోషణ, నిలకడ అనుసరించి చక్కటి జీవనశైలిని పాటించాలని చెబుతున్నారు నిపుణులు. సాధ్యమైనంత వరకు నిలకడగా బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఇక్కడ గుండెను కాపాడుకోవడం అంటే త్వరగా బరువు తగ్గడం కాదు, సురక్షితంగా బరువు తగ్గడం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: ఐఐటీ డ్రాపౌట్ అయినా..మైక్రోసాఫ్ట్, గూగుల్లో ఉద్యోగం!) -
ఏపీవ్యాప్తంగా ఆక్వా రైతుల బంద్
సాక్షి, ఏలూరు జిల్లా: ఏపీవ్యాప్తంగా ఆక్వా రైతుల బంద్ కొనసాగుతోంది. ఆక్వా కార్యకలాపాలను రైతులు నిలిపివేశారు. ఆక్వా ఫీడ్ డీలర్లు, షాపుల యాజమానులు రైతులకు మద్దతు ఇచ్చారు. రైతులతో పాటు బంద్లో ఆక్వా డీలర్లు పాల్గొన్నారు. ఆక్వా ఫీడ్ ధరలు భారీగా పెంచడంపై రైతులు నిరసనలు. ఆచంట, ఉండి, పాలకొల్లు, నరసాపురంలో ఆక్వాఫీడ్ షాపులను మూసివేశారు.కూటమి సర్కార్.. ఆక్వా రైతుల సమస్యలను పట్టించుకోకపోవడ, ఆక్వా సిండికెట్ ఫీడ్ ధరలు భారీగా పెంచడంపై నిరసిస్తూ ఏపీ ఆక్వా రైతు సంఘం బంద్కు పిలుపునిచ్చింది. టన్ను మేతకు అదనంగా రూ.10 వేల నుండి రూ.12 వేలు పెంచడంపై ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్య ధర కూడా తగ్గించేయడంతో ధరల స్థిరీకరణ చేయాలంటూ రైతుల డిమాండ్ చేస్తున్నారు. -
రూ.9.3 కోట్లు ప్యాకేజీని వదులుకుని.. ఏఐ వైపు అడుగులు
సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం.. కేవలం సరికొత్త ఆవిష్కరణలకే కాదు, ఐటీ నిపుణుల ఆలోచనా ధోరణిలో వస్తోన్న మార్పులకు కూడా వేదికవుతోంది. నెలకు లక్షల జీతం, చేతినిండా స్టాక్ ఆప్షన్లు, గూగుల్ లాంటి గ్లోబల్ టెక్ కంపెనీలో సురక్షితమైన ఉద్యోగం... సగటు ఉద్యోగి కల ఇది. కానీ, ఏటా దాదాపు రూ.9.3 కోట్ల భారీ ప్యాకేజీని సైతం కాదనుకుని ఏఐ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్గా మారింది.గూగుల్లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన 41 ఏళ్ల యూసఫ్ ఇమ్రాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఏఐ స్టార్టప్ను ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీ సామాన్యులకు కూడా అద్భుతమైన అవకాశాలను అందిస్తోందంటూ ఆయన పంచుకున్న అనుభవాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.రూ.9.3 కోట్ల ప్యాకేజీ.. ఎలా సాధ్యమైంది?సేల్స్ రంగంలో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఇమ్రాన్ 2020లో గూగుల్ సంస్థలో చేరారు. క్లయింట్లకు గూగుల్ ‘ఏఐ మెషిన్ లెర్నింగ్’ సొల్యూషన్స్ను చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన బేసిక్ శాలరీ దాదాపు 1,70,000 డాలర్లు (సుమారు రూ.1.6 కోట్లు) కాగా, కస్టమర్ డీల్స్ ద్వారా వచ్చిన కమీషన్లే ఆయన ఆదాయాన్ని పెంచాయి. డబ్ల్యూ2 ఎర్నింగ్స్(అలవెన్స్లు) ద్వారా గతేడాది ఆయన వార్షిక సంపాదన దాదాపు 9,86,000 డాలర్లు (సుమారు రూ. 9.3 కోట్లు)గా ఉంది.‘నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు మా కుటుంబం బంగ్లాదేశ్ నుంచి న్యూయార్క్కు వలస వచ్చింది. ఆ వలసదారుల కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మార్కెట్ అవసరాలు, ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించడం వల్లే నేను అంతటి కమీషన్లు సాధించగలిగాను’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.భారీ జీతాన్ని వదులుకోవడానికి కారణంమార్కెట్లో ఓపెన్ ఏఐ (ChatGPT), ఆంత్రోపిక్ (Claude) వంటి సంస్థలు సృష్టిస్తున్న సంచలనాలు ఇమ్రాన్లో ఫోమో (ఎక్కడ తాను వెనుకబడిపోతానో అనే ఆందోళన)ను రేకెత్తించాయి. గూగుల్ సురక్షితమైనదే అయినప్పటికీ భవిష్యత్తు అంతా ఏఐ స్టార్టప్లదేనని, వాటిలో ఈక్విటీ (భాగస్వామ్యం) కలిగి ఉండటం లాభదాయకమని ఆయన భావించారు. మరోవైపు, గూగుల్లో ఇటీవలి కాలంలో జరిగిన ఉద్యోగుల తొలగింపులు కూడా ఆయన ఆలోచనా విధానాన్ని మార్చాయి. ఎంత ప్రతిభావంతులైనా కార్పొరేట్ కొలువుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో సొంతంగా రిస్క్ తీసుకోవడమే ఉత్తమమని ఇమ్రాన్ నిర్ణయించుకున్నారు.రాత్రిపూట ఏఐ సాధన..సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఇమ్రాన్ వెనకడుగు వేయలేదు. పగలు ఉద్యోగం చేస్తూనే.. రాత్రులు, వారాంతాల్లో చాట్జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ఏఐ టూల్స్ సాయంతో కోడింగ్ నేర్చుకుంటూ ప్రాజెక్ట్లు డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే గత ఏప్రిల్లో గూగుల్కు గుడ్ బై చెప్పి ‘మాంగోస్టీన్ స్టూడియో’ అనే స్టార్టప్ను ప్రారంభించారు. ఇది సేల్స్ నిపుణుల కోసం ప్రత్యేక ఏఐ ఆధారిత టూల్స్ను రూపొందిస్తుంది. ఆవేశంతో కాకుండా పూర్తి ఆర్థిక ప్రణాళికతోనే ఇమ్రాన్ ఉద్యోగాన్ని వదిలేసినట్లు ఇమ్రాన్ చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
రూ.కోట్లకు కత్తెర!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయంలో గుండు పిన్ను కొనాలన్నా టెండర్ పిలుస్తుంటారు. తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్/సప్లయర్స్కు ఆ పరికరాల సరఫరా బాధ్యతను అప్పగిస్తుంటారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో మాత్రం అత్యవసరం పేరుతో టెండర్ నోటిఫికేషన్ లేకుండానే రూ.2.61 కోట్ల విలువ చేసే 59 చైన్సా, 168 పోల్ ప్రూనర్ విత్ అడిíÙనల్ బ్యాటరీ, 530 హ్యాండిల్ ట్రి ఫ్రూనర్ విత్ అడిíÙనల్ యంత్రాలను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది.నిబంధనలు తుంగలోకి..గ్రేటర్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల కింద పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నాయి. ఈదురు గాలుల వర్షాలతో చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోంది. చెట్లు, కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటంతో వాటిని తొలగించేందుకు పెద్ద సంఖ్యలో కూలీలను వినియోగించాల్సి వస్తోంది. కూలీలు గొడ్డళ్లతో కొమ్మలను నరకడం ఆలస్యమై గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు లైన్లపై పడిన చెట్ల కొమ్మల సత్వర తొలగింపు పేరుతో యాజమాన్యం ఏకంగా నిబంధనలను తుంగలో తొక్కింది. చిన్న చిన్న సివిల్ పనులు, విద్యుత్ మెటిరీయల్ కొనుగోలుకు టెండర్లు పిలిచే అధికారులు.. ముఖ్యమైన ఈ యంత్రాల కొనుగోలు విషయంలో ఈ అంశాన్ని విస్మ రించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కు నామినేషన్ పద్ధతిలో రూ.10 లక్షల లోపు విద్యుత్ పరికరాలు కొనుగోలు చేసే అధికారం ఉంది. రూ.కోటి విలువైన పరికరాలు కొనుగోలు చేయాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి. కానీ.. డిస్కం సీఎండీ ఏకంగా రూ.2.61 కోట్ల విలువ చేసే కీలకమైన యంత్రాలను నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో ఒక్కో ‘చైన్ సా ఖరీదు రూ.20 వేల లోపు ఉండగా.. డిస్కం తన బినామీ ఏజెన్సీకి ఏకంగా రూ.51 వేలు చెల్లించింది. ఇక పోల్ ప్రూనర్ విత్ అడిíÙనల్ బ్యాటరీ పరికరం రూ.45 వేలలోపు ఉండగా, డిస్కం ఏకంగా రూ.78,940 చెల్లించింది. రూ.16 వేలలోపు దొరికే ఒక్కో హ్యాండిల్ ట్రీ ప్రూనర్ విత్ అడిíÙనల్ బ్యాటరీకి రూ.18,549 చెల్లించడం గమనార్హం.ఏకపక్షంగా కొనుగోలు.. ఏకంగా రూ.2.61 కోట్లకుపైగా విలువ చేసే యంత్ర పరికరాలను టెండర్లు లేకుండా, మార్కెట్లో కంపెనీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను, నాణ్యత, పనితీరును పరిశీలించకుండా ఏకపక్షంగా నామినేషన్ పద్ధతిలో యంత్రాలను కొనుగోలు చేయడంతో సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరినట్లు సమాచారం. -
ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్సెట్ (AP EAPCET) 2026 ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ మధ్యాహ్నాం ఫలితాలను విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. కారణాలు చెప్పకుండా అది వాయిదా వేశారు. దీంతో విద్యార్థుల్లో నిరాశ నెలకొంది.ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ కీలక పరీక్షలు ఈ ఏడాది మే 12 నుంచి మే 20 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.29 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ర్యాంకుల కోసం నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు ఫలితాలు ఎప్పుడు వస్తాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ సాంకేతిక, నిర్వహణ కారణాలను చూపుతూ అధికారులు పలుమార్లు వాయిదా వేశారు. తాజాగా ఇవాళ విడుదలవుతాయని ప్రచారం జరిగినా.. ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మరింత పెరిగింది.ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్పైనా ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొత్త తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జులై 2న విడుదల చేయొచ్చని అధికారులు చెబుతున్నా.. విడుదలయ్యే దాకా గ్యారెంటీ కనిపించడం లేదు. -
అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్
ఉత్తర ప్రదేశ్లోని షామ్లీకి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దేవరాజ్ మాలిక్ కుమారుడు 30 ఏళ్ల ఆయుష్ మాలిక్ గుర్తున్నాడా? ముస్లిం యువతిని వివాహం చేసుకొనేందుకు ముస్లింగా మారి ఈద్ పండుగ రోజున నమాజ్ చేస్తూ సోషల్మీడియాలో వైరల్గా మారాడు. మత మార్పిడి నిరోధక చట్టం కింద ఆయుష్పైనా, వధువు తల్లిదండ్రులపైనా కేసు నమోదు కావడం అప్పట్లో చర్చకు దారి తీసింది. ఇపుడీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్ మాలిక్, ఇప్పుడు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు. చట్టవిరుద్ధ మత మార్పిడుల నిషేధ చట్టం కింద దేవరాజ్ మాలిక్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, ఫిజియోథెరపిస్ట్ చాందిని ఖురేషి ,ఆమె తండ్రి ఇస్లాం ఖురేషిలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని వారాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.Ayush Malik, who had earlier claimed to adopt Islam in Shamli, Western Uttar Pradesh, has returned to Sanatan Hindu Dharma. Ayush Malik reconverted to Hinduism at his home in the presence of his family. Yashvir Maharaj stated that Ayush Malik embraced Hindu religion once… pic.twitter.com/jYtLN4QHF2— VARAHA WARRIOR (@VarahaWarrior) June 30, 2026తన తల్లిదండ్రులు పడుతున్న బాధను గమనించిన తర్వాత, స్వచ్ఛందంగానే తిరిగి హిందూ మతాన్వి స్వీకరించాడని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయుష్ హిందూ సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ, ప్రార్థనలు చేయడం విశేషం. తాను గతంలో ఇస్లాం మతంలోకి మారినప్పటికీ, ఇప్పుడు స్వచ్ఛందంగా సనాతన ధర్మానికి తిరిగి వచ్చి తన కుటుంబంతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నానని ఆ వీడియోలో చెప్పాడు. తన కుమారుడు అధికారికంగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించాడని అతని తండ్రి దేవరాజ్ మాలిక్ తెలిపారు. ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!గతంలో ఏం జరిగింది?బి-ఫార్మా పట్టభద్రుడైన ఆయుష్ తన కుటుంబానికి చెందిన మెడికల్ స్టోర్ నిర్వహణలో సహాయపడేవాడు. 2018లో కాలి గాయానికి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అతనికి చాందినీ పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇస్లాంను స్వీకరించిన తర్వాత మహమ్మద్ అలీగా పేరు మార్చుకున్న ఆయుష్ మాలిక్ , చాందినిని వివాహమాడాడు. ఈ విషయంలో ఎవరి బలవంతం లేదని, స్వచ్ఛందగానే ఇస్లాంను స్వీకరించానని, తన భార్య కోసం న్యాయ పోరాటం చేస్తానని చెప్పిన ఆయుష్ ప్రకటించాడు. అయితే చాందినీ,ఆమె కుటుంబ సభ్యులు అతన్ని ఇస్లాం మతాన్ని స్వీకరించేలా క్రమంగా ప్రభావితం చేశారని పోలీసులు తెలిపారు. 2023లో ఆయుష్ను ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడ ఇస్లాం మతంలోకి మార్చి 'మహ్మద్ అలీ'గా పేరు మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలో నికాహ్ (వివాహ) వేడుక కూడా జరిగిందని అందులో పేర్కొన్నప్పటికీ, విచారణలో ఎటువంటి వివాహ ధృవీకరణ పత్రం లభించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు కోట్ల రూపాయల విలువైన కుటుంబ ఆస్తిని చేజిక్కించుకునే కుట్రలో భాగంగా, చాందినీ ఖురేషీ ,ఆమె తండ్రి ఇస్లాం ఖురేషీ కలిసి ఆయుష్ను మభ్యపెట్టి (బ్రెయిన్ వాష్ చేసి), 'మహ్మద్ అలీ' పేరుతో ఇస్లాం మతంలోకి మార్చారని దేవరాజ్ మాలిక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయుష్ హిందూ మతంలోకి మారడం ట్విస్ట్. మరి అతని భార్య పరిస్థితి ఏంటి? భార్యతో విడిపోయాడా? కలిసే ఉంటాడా అన్నే ప్రశ్నలకు సమాధానం లేదు. -
Gachibowli: ఈ దారుల్లో 90 రోజులు వాహనాలు బంద్
హైదరాబాద్: ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి డీఎల్ఎఫ్కు, రాడిసన్ హోటల్ నుంచి ట్రిపుల్ ఐటీ వైపు 90 రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్సిటీ పనుల్లో భాగంగా ట్రిపుల్టీ జంక్షన్, డీఎల్ఎఫ్ రోడ్డులో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పనులకు ఆటంకం తలెత్తకుండా వాహనాల రాకపోకలను నిషేధించామని చెప్పారు. లింగంపల్లి వైపు నుంచి డీఎల్ఎఫ్, విప్రో రోడ్డు నుంచి డీఎల్ఎఫ్ వైపు వాహనదారులు నేరుగా ఇందిరానగర్, గచ్చిబౌలి జంక్షన్లో ఎడమ వైపు తీసుకోని రాడిసన్ హోటల్ మీదుగా డీఎల్ఎఫ్కు చేరుకోచ్చన్నారు. రాడిసన్ హోటల్ వైపు నుంచి వచ్చే వాహనదారులు డీఎల్ఎఫ్ గేట్ నెంబర్–1 వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నారు. -
గనిలో ఘోరం: ఐదుగురు మృతి.. 15 మంది గల్లంతు
హ్పాకాంత్: ఉత్తర మయన్మార్లోని కచిన్ రాష్ట్రం, హ్పాకాంత్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక పాత జేడ్ (పచ్చల) గని వ్యర్థాల కుప్ప ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 15 మంది గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో పలువురు కార్మికులు గని వ్యర్థాలలో విలువైన రత్నాల ముక్కలను వెతుకుతుండగా, ఈ విపత్తు సంభవించింది. భారీ వర్షాల కారణంగా ఈ మట్టి దిబ్బలు అస్తవ్యస్తంగా మారాయని స్థానిక అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో సుమారు 20 మంది కూలీలు మట్టి కింద కూరుకుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ టీమ్లు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేసి, తవ్వకాలు జరుపుతున్నాయి. మయన్మార్ మైనింగ్ రంగంలో ఇటువంటి భారీ ప్రమాదాలు రుతుపవనాల కాలంలో సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ప్రమాదకరమైన రీతిలో గనులు తవ్వడం, వ్యర్థాలను పెద్ద ఎత్తున పేరుకుపోయేలా చేయడం వల్ల వర్షాలకు ఇవి కుప్పకూలి ఇక్కడి పేద కూలీల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.ప్రపంచంలోనే అత్యధికంగా జేడ్ లభించే ప్రాంతం ఉత్తర కచిన్ రాష్ట్రం. కాగా 2021లో ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం పగ్గాలు చేపట్టినప్పటి నుండి మయన్మార్ అంతర్యుద్ధంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ జేడ్ గనుల ద్వారా వచ్చే ఆదాయం కోసం ఇటు దేశ సైన్యం, అటు ప్రతిపక్ష తిరుగుబాటు దళాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కొందరు కూలీలు ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. -
చిక్కుల్లో పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్
పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి శైలేష్ సింగ్పై భోపాల్ నగరంలో క్రిమినల్ కేసు నమోదైంది. ఇంట్లో వంటమనిషే వారిపై కేసు పెట్టాడు. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాకు చెందిన విపేంద్ర సింగ్ తోమర్ను శైలేష్ ఇంట్లో వంటమనిషిగా కుదిర్చారు.నెలకు రూ.15 వేల జీతంతో పాటు వసతి, భోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన శైలేష్ తన పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే పని ప్రారంభించిన కొద్ది రోజులకే శశాంక్, శైలేష్ తన వంటపై ఫిర్యాదు చేస్తూ, తరచూ దుర్భాషలాడేవారని విపేంద్ర ఆరోపించాడు. దీంతో పని మానేసి స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.ఆ సమయంలో శశాంక్, అతడి తండ్రి తనపై దాడి చేశారని, ఇంట్లోనే బంధించి బలవంతంగా పని చేయించారని విపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో శైలేష్ డ్రైవర్ కూడా పాల్గొన్నట్లు ఆరోపించాడు. తన మొబైల్ ఫోన్ను కూడా లాక్కున్నారని పేర్కొన్నాడు.ఫిర్యాదు అనంతరం పోలీసులు బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ముఖం మరియు శరీరంపై గాయాల ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ప్రాథమిక ఆధారాల ఆధారంగా శశాంక్ సింగ్, శైలేష్ సింగ్లపై కేసు నమోదు చేశారు.పోలీసులు బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్య ప్రవర్తన, దుర్భాషలాడడం, ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం, ఒకే ఉద్దేశంతో పలువురు కలిసి నేరానికి పాల్పడడం వంటి ఆరోపణలను నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఇక క్రికెట్ పరంగా చూస్తే, శశాంక్ సింగ్కు 2026 ఐపీఎల్ సీజన్ నిరాశాజనకంగా సాగింది. తొమ్మిది ఇన్నింగ్స్ల్లో అతడు కేవలం 132 పరుగులు మాత్రమే చేయడంతో పాటు ఫీల్డింగ్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదవడం అతని ఐపీఎల్ భవిష్యత్పై అనిశ్చితిని పెంచింది. -
సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్
కన్నడ సీరియల్ నటి, బిగ్బాస్ ఫేమ్ దివ్య సురేశ్.. బెంగళూరులో ఆదివారం రాత్రి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. తన కజిన్తో కలిసి కారువైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి తమని వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఈమె ఆరోపించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అలానే ఈమె తీసిన వీడియో కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన యంగ్ హీరోయిన్)దివ్య సురేశ్ చెప్పిన దాని ప్రకారం.. రాత్రి 11:30 గంటల టైంలో ఓ వ్యక్తి తమని అనుసరిస్తూ బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించాడని, అతడిని వెంటనే ప్రశ్నించినప్పటికీ ప్రవర్తన మార్చుకోలేదని, కారులోకి ఎక్కేవరకు వెంటాడుతూనే ఉన్నాడని ఇన్ స్టాలో స్టోరీలో రాసుకొచ్చింది. రాత్రిపూట రోడ్డుపై నడిచిందనే కారణంతో ఏ మహిళా ఇలాంటి వేధింపులని ఎదుర్కొవాల్సిన అవసరం లేదు. ఇక బెంగళూరు పోలీసులని ట్యాగ్ చేస్తూ.. మహిళలకు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. ఆ భద్రత ఎక్కడ? అని ప్రశ్నించింది.33 ఏళ్ల దివ్య.. 2017లో మిస్ ఇండియా సౌత్ టైటిల్ గెలుచుకుంది. తర్వాత #9, హిల్టర్ క్రాస్, రౌడీ బేబీ, కెంపు హలడి హసిరు, హిరణ్య తదితర మూవీస్ చేసింది. 2021లో ప్రసారమైన బిగ్బాస్ కన్నడ 8వ సీజన్లో పాల్గొంది. జోడీ హక్కి, నన్ను హెండ్తి ఎమ్బీబీఎస్ సీరియల్స్లో కూడా చేసింది. కాగా గతేడాది అక్టోబరులో బెంగళూరులో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఈ నటి పేరు వినిపించింది.(ఇదీ చదవండి: కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)'ಬಿಗ್ ಬಾಸ್' ದಿವ್ಯಾ ಸುರೇಶ್ಗೆ ಎದುರಾಯ್ತು ವಿಕೃತ ಯುವಕನ ಕಾಟ! | Youth Misbehaves In Front of Divya Suresh.....#DivyaSuresh #BiggBossKannada #NammaBengaluru #WomenSafety #KanakapuraRoad #BengaluruNews #ಮಹಿಳಾಸುರಕ್ಷತೆ #ದಿವ್ಯಾಸುರೇಶ್ #ಬೆಂಗಳೂರು pic.twitter.com/2yUTl9wAYo— Sanjevani News (@sanjevaniNews) June 30, 2026 -
నా భర్త అర్ధరాత్రి మేనమరదలు ఇంటికి వెళ్తాడు..!
హనుమకొండ జిల్లా: తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టింది ఓ మహిళ. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో సోమవారం చోటుచేసుకుంది.బాధితురాలి కథనం మేరకు.. ఐనవోలు మండలం వెంకటాపూర్కు చెందిన శ్రీజకు గుండేడుకు చెందిన డెంగు రాజుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కట్నంగా రూ.12 లక్షల నగదు, 16 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. పెళ్లైన మూడు నెలల నుంచే భర్త, అత్త తీవ్ర వేధింపులకు గురి చేస్తూ శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపింది.పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరగగా, తనదే తప్పు అని ఒప్పుకుని హైదరాబాద్కు తీసుకెళ్లాడని తెలిపింది. అక్కడ మద్యం సేవించి వచ్చి తనను కొట్టేవాడని ఆరోపించింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లి వచ్చేవాడని, ఆన్లైన్లో పేకాట ఆడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని వచ్చి అదనపు కట్నం కోసం వేధిస్తూ పుస్తెల తాడుతో ఉరి బిగించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.ప్రస్తుతం తన మేనమరదలుతో ఉంటున్నాడని, “నువ్వేం చేసుకుంటావో చేసుకో” అంటూ ఇంట్లోంచి తరిమేశాడని కంటతడి పెట్టుకుంది. సుమారు 20 నెలలుగా తాను పుట్టింట్లోనే ఉంటున్నానని, పోలీసుల వద్దకు పిలిపించినా తనకేమీ ఇవ్వనన్నాడని ఆరోపించింది.ఇచ్చిన కట్నం మొత్తం తమకు తిరిగి ఇచ్చి న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది. -
వరంగల్: పంట పొలంలో ‘బంగారం’ కలకలం
సాక్షి, వరంగల్: పంట పొలంలో బంగారం కలకలం రేపింది. పంపకాల పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. చెన్నరావుపేట మండలం కోపాకులపాడులో ఈ ఘటన జరిగింది. ప్రతాప్ రెడ్డి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల పంట భూమిని బాలు అనే రైతు కౌలుకు సాగు చేసుకుంటున్నారు. పొలం దున్నుతున్న క్రమంలో బంగారం లభ్యమైంది. దీంతో కూలీలు - కౌలు రైతు మధ్య వాటాల పంచాయితీ మొదలైంది. గతంలో కూడా ఈ పొలంలో బంగారం దొరికిందని ప్రచారం జరుగుతోంది.బయటకు పొక్కడంతో పోలీసుల దృష్టికి బంగారం పంచాయతీ వచ్చింది. తనకు వాటా ఇవ్వాలని ఆరేళ్ల క్రితం భూమి అమ్మిన జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పొలంలో మరిన్ని బంగారు నిధులు ఉన్నాయంటూ కౌలు కోసం రైతులు పోటీ పడుతున్నారు. -
తెర వెనుక అసలు కథ ఇదన్నమాట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసే వ్యూహాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిపై ఎవరైనా పీహెచ్డీ చేస్తే కచ్చితంగా డాక్టరేట్ వస్తుందేమో! కొందరు విశ్లేషకులు చంద్రబాబువి వ్యూహాలు అంటారు.. మరికొందరు కుట్రలు అంటారు. ఆ వ్యూహాలలో ఎటు తిరిగి తనకే రాజకీయ ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతుంటారు. ఆయనకు బాండ్ బాజా వాయించే ఎల్లో మీడియా ఎటూ ఉంటుంది. సాయికృష్ణ కుటుంబాన్ని మేనేజ్ చేయడానికి చంద్రబాబు ఆడిన గేమ్ కాని, తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆయన చేసిన కామెంట్లు కాని గమనిస్తే ఈ విషయం అర్దం అవుతుంది.అలాగే ఈ ఉదంతంలో చర్చ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నడిచేలా కథ ఎలా సాగించారో విశ్లేషించడం కూడా ఆసక్తికరమే. సాయికృష్ణ కేసులో సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టును కొన్ని రోజుల పాటు జాప్యం చేయడం, దర్యాప్తులో కీలకమైన అంశాలు రాకుండా జాగ్రత్తపడడం కనిపిస్తుంది. అన్నిటిని మించి నాగరాజుతో ప్రభుత్వ పెద్దలు ఒక డీల్ కుదుర్చుకుని కూటమి పెద్దల పేర్లు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటకు రాకుండా చూడడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది. న్యాయం అన్నది అధికారం, పలుకుబడిని పట్టి ఉంటుందని కూటమి ప్రభుత్వం పలుమార్లు రుజువు చేస్తున్నట్లు అనిపిస్తుంది.కాపు యువకుడు సాయికృష్ణ పోలీసుల హింస కారణంగా మరణించిన ఘటనలో చంద్రబాబు తెలివిగా చర్చను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తిప్పారనిపిస్తుంది. అదేదో జనసేనకు, వైఎస్సార్సీపీకి మధ్య వివాదం అన్నట్లుగా ప్రచారం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది. ఆ సంగతి అర్థం అవుతున్నా, పవన్ కళ్యాణ్ నిస్సహాయంగా ఆ ట్రాప్లో నుంచి బయటపడలేకపోతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. సాయికృష్ణ కేసు అన్నది నిజానికి కులానికి సంబంధించిన సమస్య కాదు. ఏపీలో జరుగుతున్న పోలీసుల రాక్షస కృత్యాలకు, చట్టాలు, రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా సాగుతున్న రెడ్బుక్ అరాచకాలకు సంబంధించిన అంశం. మానవహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై ప్రజలలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత. వీటన్నిటిని కప్పిపుచ్చి రాజకీయ కోణంలో కేసును మలుపు తిప్పి పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకుని కథ నడపాలని చంద్రబాబు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఈ ప్రక్రియలో రాజకీయ లబ్ది జరిగితే తనకు, అప్రతిష్ట వస్తే అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లేలా వ్యూహాం పన్నారా అన్న అభిప్రాయాన్ని కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలాగే సాగితే పవన్ కళ్యాణ్ ఒక బకరా అయ్యే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, వారు కొందరు కాపు నేతలను ఆశ్రయించడం తదితర అంశాల వల్ల, కులం కోణం కూడా సహజంగానే వస్తుంది. అది ఎవరూ కాదనలేని సత్యం.విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కుల రాజకీయాలే కాదు.. మత రాజకీయాలు కూడా చేసి ప్రజలను ఎంత రెచ్చగొట్టాలో అంతా చేశారన్నది నిర్వివాదాంశం. సాయికృష్ణ కేసులో తప్పని స్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేయవలసివచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఈ కేసులో సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని వచ్చి హింసకు శ్రీకారం చుట్టారు. దానిని నాగరాజు కొనసాగించారన్నది అభియోగం.ఆ టాస్క్ ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధీనంలో ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర పెద్దలకు సన్నిహితుడన్న పేరు ఉంది. ఆయనను కాపాడుకోకపోతే, ఆ కేసు ఆ పై అధికారులు, తదుపరి ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. దాంతో సీఐ నాగరాజును పూర్తిగా మేనేజ్ చేసిన తర్వాతే, సిసిటీవీ ఫుటేజి మాయం అయ్యాకే కేసును ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసి ఉంటారన్నది జై భీమ్ అధ్యక్షులు జడ శ్రవణ్ తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల అభిప్రాయంగా ఉంది. అందులో వాస్తవం ఉండే అవకాశం కనిపిస్తుంది.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన లేకుండా, మానవ హక్కుల కోణంలో సాయి కుటుంబాన్ని పరామర్శించినా తొలుత విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. అయినా పరిస్థితి చేయి జారిపోతోందని భయపడి స్వయంగా చంద్రబాబే కుటుంబాన్ని తనవద్దకు పిలిపించుకుని రాయబారం చేశారు. అక్కడ ఏమి జరిగిందో కాని ఆ కుటుంబం స్వరం మార్చేసింది. ఇది ఒక కోణం అయితే క్యాబినెట్ సమావేశంలో యధాప్రకారం క్రిమినల్స్కు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా రాసింది. అది నిజమే అయితే, ఆ క్రిమినల్ కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పరామర్శించారు? విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆ కుటుంబంతో ఎందుకు మాట్లాడి ఓదార్పు మాటలు చెప్పారు. జనసేన నేత ఒకరు డబ్బు ఆఫర్ ఎందుకు ఇచ్చారు? ఇవేవి ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు మాట్లాడతారు. ఇది ఇలా ఉంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ తలాతోక లేకుండా వైఎస్సార్సీపీవారిని దూషించి రెచ్చగొట్టడం చంద్రబాబు ప్లాన్లో భాగమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం.రౌడీ షీటర్ చనిపోతే ఏమిటన్నట్లు పవన్ మాట్లాడడం ఎంత దారుణంగా ఉంది. అతను కాపు కులం వాడైతే మాత్రం అని ఆయన భావిస్తున్న తీరు పద్ధతిగా ఉందా? సీఐ నాగరాజు లేదా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక వ్యక్తి చచ్చేలా హింసించడం నేరం కాదని చట్టబద్దమైన పదవులలో ఉన్న చంద్రబాబు, పవన్లు చెప్పదలిచారా? లేక సాయికృష్ణ పేదవాడు కనుక, అతనికి అండ లేదు కనుక, కేవలం జనసేనలో ఒక సామాన్య కార్యకర్త కనుక పట్టించుకోనవసరం లేదనుకున్నారా! అదే సీఐ కూడా కాపు వ్యక్తి అయినా, బాగా డబ్బు ఉన్న వ్యక్తి అవడం, అతని మేనమామ ఒక మాజీ డీజీపీ కావడం వల్ల అతనికి పవన్ అండగా నిలబడుతున్నారా అన్న విమర్శ రాదా? సాయిపై కేసులు ఉంటే, మరి పోలీసులకు హత్యలు చేసే అధికారం ఉండదు కదా! అంటే వారు కూడా నేరం చేసినట్లే అవుతుంది కదా! ఆ ప్రస్తావన ఎందుకు క్యాబినెట్లో రాలేదు. తాను ఎందుకు సాయి కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడింది చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు?బాధిత సాయి కుటుంబంతో రాజీచేసుకుని, కేసులో నిందితుడుగా ఉన్న నాగరాజుతో కూడా డీల్ కుదుర్చుకోవడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందేమో! పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే స్పందించరేమిటని, కుల రాజకీయాలను తిప్పి కొట్టాలి కదా అని ఆయన అన్నారట. వైఎస్సార్సీపీ పవన్ కళ్యాణ్పై తొలుత ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు పైన, పోలీసు అధికారులపైన ఆరోపణలు చేసింది. దానికి జవాబుగా రౌడీలకు మద్దతు ఇస్తారా అని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా రౌడీ కుటుంబంతో భేటీ అయ్యారు. దానిని ప్రస్తావంచకుండా పవన్ కళ్యాణ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.కాకినాడలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీవారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ అనుచితంగా మాట్లాడారు. దానికి జవాబుగా టీడీపీ, జనసేనలలో ఉన్న రౌడీలు, గూండాల గురించి వివరాలను వైఎస్సార్సీపీ బయటపెట్టింది. టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో క్రిమినల్ కేసులు ఉన్నవారు 115 మంది అట. అందులో తీవ్రమైన అభియోగాలు ఉన్నవారి సంఖ్య 82. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే పది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఏడుగురిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను దాచేసి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది చంద్రబాబు లక్ష్యం. కాని సోషల్ మీడియాలో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాలపై మాత్రం టీడీపీ, జనసేనలు నోరు పెగల్చవు.ఈ కేసులో పవన్ను ఇరికించాలని జగన్ తన పార్టీ నేతలతో అన్నారని ఒక ఊహాగానాన్ని సృష్టించి దుష్ప్రచారం చేసిది. నిజానికి పవన్ పద్దతిగా వ్యవహరించకుండా చేసింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఒకప్పుడు పోలీసులు ఎలా నిందితులను కొడతారంటూ ప్రశ్నలు వేసిన పవన్తోనే, లాకప్ డెత్లకు బాధ్యులైన పోలీసులకు మద్దతుగా మాట్లాడించి ఆయన పరువు తీశారు. ఇక నాగరాజుపై అన్ని ఆరోపణలు వస్తే కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారంటూ 'నాగరాజుకు జేజేలు' అన్న హెడింగ్ పెట్టి ఇలాంటి హత్యలను కూడా సమర్థించే దుస్థితిలోకి ఎల్లో మీడియా వెళ్లిందంటే వారికి ఉన్న ప్రయోజనం ఏమిటో జనం ఊహించుకోలేరా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బయటపడిన అత్యంత పురాతన డైనోసార్ తోక!
న్యూయార్క్: భూమిపై జీవించిన అత్యంత భారీ డైనోసార్ రకానికి చెందిన ‘టైటానోసార్’ శిలాజాన్ని శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో కనుగొన్నారు. ఈ శిలాజాన్ని 1985లోనే బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వే సభ్యులు, భూగర్భ శాస్త్రవేత్త మైక్ థామ్సన్ జేమ్స్ రాస్ ఐలాండ్లో సేకరించారు. అయితే అప్పట్లో ఇది ఏదో సముద్ర జీవికి చెందినదని భావించి, యూకేలోని ఒక సేకరణలో భాగంగా అల్మారాలో పడేసారు.‘ఆక్టా పలేయోంటోలాజికా పొలోనికా’ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఇది డైనోసార్దేనని తేల్చింది. శిలాజ శాస్త్రవేత్త పలేయోంటోలాజిస్ట్ మార్క్ ఎవాన్స్ దీనిపై అనుమానంతో లండన్ సహచరుడు పాల్ బారెట్ను సంప్రదించగా, అది 82 మిలియన్ల సంవత్సరాల నాటి టైటానోసార్ తోక ఎముక (వర్టెబ్రా) అని స్పష్టమైంది. పది సెంటీమీటర్ల పొడవున్న ఈ ఎముకకు ఒక వైపు గుంత, మరోవైపు గుండ్రటి ఉబ్బెత్తు భాగం ఉన్నాయి. ఇది బాల్-అండ్-జాయింట్ సాకెట్ అమరికను సూచిస్తుందని, ఈ లక్షణం కేవలం ఈ రకమైన డైనోసార్లలోనే ప్రత్యేకంగా ఉంటుందని బారెట్ పేర్కొన్నారు. ఈ శిలాజం అసంపూర్తిగా ఉండటం వల్ల ఖచ్చితమైన జాతిని గుర్తించలేకపోయారు. కానీ ఇది కేవలం 23 అడుగుల పొడవు కలిగి, చిన్న వయసులోనే చనిపోయి సముద్రంలో మునిగి ఉంటుందని ప్రాథమిక విశ్లేషణలో తేలింది.మిలియన్ల సంవత్సరాల క్రితం అంటార్కిటికా ఖండం ప్రస్తుతం ఉన్నట్లు మంచుతో కాకుండా, అధిక కార్బన్ డయాక్సైడ్, తీవ్రమైన అగ్నిపర్వత చర్యల వల్ల డైనోసార్ల మనుగడకు అనుకూలమైన పచ్చని ప్రాంతంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఇది గడ్డకట్టే మంచు ఖండంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 98 శాతం మేర మైళ్ల కొద్దీ మంచు పేరుకుపోవడంతో, ఇలాంటి పురాతన శిలాజాలను వెలికితీయడం పరిశోధకులకు అత్యంత కష్టతరంగా మారింది. -
అయోధ్య కుంభకోణం.. వీహెచ్పీ కీలక వ్యాఖ్యలు
అయోధ్య రామ మందిరంలో వెలుగుచూసిన విరాళాల కుంభకోణం.. మరిన్ని చీకటి విషయాలను వెలుగులోకి తెస్తోంది. భక్తులు సమర్పించే కానుకలు సైతం మాయం చేశారని.. అలాగే గోల్మాల్ జరిగిందన్న విషయం ట్రస్ట్ పెద్దలకు ముందే తెలుసని సిట్ దర్యాప్తు తేల్చింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) స్పందించింది.అయోధ్య రామ్ మందిరానికి సంబంధించిన డొనేషన్ల దుర్వినియోగం ఆరోపణలతో.. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరు మసకబారిపోయింది. భక్తులు సమర్పించిన విరాళాలు ఒక ప్లాన్ ప్రకారం దారి మళ్లించబడ్డాయని వచ్చిన ఆరోపణలతో విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో ట్రస్ట్లో కీలక పాత్ర పోషించిన చంపత్ రాయ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలక్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.రామ్ జన్మభూమి ఉద్యమ లక్ష్యం పూర్తయిన తర్వాత ఆలయ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ పరిధిలోకి వెళ్లాయి. అక్కడితోనే మా పాత్ర ముగిసింది. మందిర నిర్మాణం వరకే మా పాత్ర పరిమితమైంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు ట్రస్ట్ బాధ్యతేనని ఆయన తేల్చి చెప్పారు. అలాగే.. చంపత్ రాయ్ వ్యవహారాన్ని వీహెచ్పీతో అంటగట్టవద్దని ఆలక్ పరోక్షంగా సూచించారు. ట్రస్ట్లో జరిగే నిర్ణయాలకు సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేస్తూ, వ్యక్తిగతంగా ఎవరు చేసిన చర్యలకైనా ట్రస్ట్ మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.చంపత్ రాయ్ గతంలో విశ్వ హిందూ పరిషత్లో సుదీర్ఘంగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. రామ్ జన్మభూమి ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదే అనుభవంతో తరువాత శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. చంపత్తో పాటు మరికొందరు వీహెచ్పీ అనుబంధ నేతలు కూడా ట్రస్ట్ సభ్యులుగా పని చేశారు. అయితే విరాళాల గోల్మాల్ వ్యహారం బయటకు రావడం.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన వైఖరి, సిట్ ప్రాథమిక నివేదిక నేపథ్యంలో చంపత్రాయ్ జూన్ 27న ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆలయ సిబ్బంది సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఆధారాల ప్రకారం సుమారు రూ.7 నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల దుర్వినియోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుంభకోణంలో మరెవరెవరికి ప్రమేయం ఉందనే కోణంలో కూడా సిట్ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.అయితే ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత అది స్వతంత్ర సంస్థగా పనిచేస్తుందని వీహెచ్పీ ఇలా ప్రకటించడం కొత్తేం కాదు. తాజాగా వచ్చిన వివాదాల నేపథ్యంలో అదే స్టాండ్ను మరోసారి బలంగా పునరుద్ఘాటించింది.రామ్ మందిర ఉద్యమం, జనజాగరణ, భూమి పోరాటం వంటి దశల్లో వీహెచ్పీ సంస్థ కీలక పాత్ర పోషించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ చేతుల్లోకి వెళ్లాయి. అందుకే ప్రస్తుతం ఆలయ ఆర్థిక వ్యవహారాలు, విరాళాలు, నిర్వహణలో తమకేం ప్రత్యక్ష పాత్ర లేదని సంస్థ స్పష్టం చేస్తోంది.ఇక ఈ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగిస్తోంది. డొనేషన్ నిధుల వినియోగం, బ్యాంక్ లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్, నగదు ప్రవాహం అన్నీ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా, మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భక్తుల నమ్మకంతో నిర్మితమైన రామ్ మందిరం చుట్టూ వచ్చిన ఈ వివాదం ఇప్పుడు వీహెచ్పీ స్టేట్మెంట్ తర్వాత.. సంస్థాగత బాధ్యతలపైనా పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. చంపత్రాయ్పై ప్రశ్నల వర్షం.. రామ్ మందిరం డొనేషన్ కుంభకోణం దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా మాజీ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ను రెండు గంటలకు పైగా విచారించింది. భక్తుల విరాళాల సేకరణ, నగదు లెక్కింపు, విలువైన కానుకల భద్రపరిచడం, వాటిని బ్యాంకుల్లో జమ చేసే విధానం వరకు ప్రతి అంశంపై అధికారులు ఆయన నుంచి వివరాలు సేకరించారు. అయితే డొనేషన్ దుర్వినియోగంలో తనకు ఎలాంటి పాత్ర లేదని చంపత్రాయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. అక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే తానే ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారని, విరాళాల సేకరణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడడం తన బాధ్యతేనని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. -
మా బడిలో ఏం జరిగిందంటే..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిత్యం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం విద్యార్థిగా మారిపోయారు. మాస్టార్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్ఎస్)ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ఫస్టియర్ ఎకనామిక్స్ పాఠ్యాంశం టీచర్ బోధిస్తుండగా.. కలెక్టర్ తరగతిగదిలోకి వెళ్లి విద్యార్థినులతో కలిసి పాఠ్యాంశ బోధనను పరిశీలించారు. బోధన పూర్తయ్యాక పాఠ్యాంశంపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం డైనింగ్హాల్కు వెళ్లి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. మాస్టారూ.. మాలాగే..గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు శివారు పాటిమీదిగూడెం యూపీఎస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు డాక్టర్ గోపీనాథ్ తనదైన శైలిలో గ్రామ విద్యార్థులు ఆ ఊరి పాఠశాలలోనే చదువుకునేలా చేపట్టిన ప్రయత్నాలు అభినందనలు అందుకుంటున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందు ఇంటింటి ప్రచారం, ఆ తరువాత డప్పు కొడుతూ బడిబాటలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ పాఠశాలలో చదివే పిల్లలతో తానూ సమానమంటూ స్కూల్ యూనిఫాం ధరించి గ్రామంలో నడుచుకుంటూ పాఠశాలకు చేరుకున్నారు. స్కూల్ యూనిఫాం వేసుకొని పిల్లలతో సమానంగా కూర్చున్నారు. వారి మధ్యలో కూర్చుని పాఠాలు చెబితే పిల్లలకు సులభంగా అర్థమవుతుందని, అందుకే తాను ఈ ఆలోచన చేసినట్లు తెలిపారు. ఈయన పనితీరును గుర్తించిన హెచ్ఎం సుమలతతో పాటు గ్రామస్తులు ప్రశంసించారు. -
వరంగల్ కమిషనరేట్కు తొలి మహిళా సీపీగా శ్వేత
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనర్గా ఎన్.శ్వేత నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ (లాఅండ్ఆర్డర్)గా ఉన్న ఆమెను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వరంగల్ సీపీగా పనిచేసిన సన్ప్రీత్ సింగ్ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్గా బదిలీ చేశారు. శ్వేత తెలంగాణ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఎస్పీ, డీసీపీగా çపలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. వరంగల్ సీపీ బాధ్యతలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జోన్–4 డీఐజీగా కూడా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.తొలి మహిళ కమిషనర్..వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటివరకు అంతా పురుషులే సీపీగా నియమితులయ్యారు. శ్వేత వరంగల్ కమిషనరేట్కు నియమితులైన తొలి మహిళా పోలీస్ కమిషనర్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (బీఈ) పూర్తి చేసిన ఆమె ఆ తరువాత సివిల్స్ రాశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆమె.. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత, నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మహిళల భద్రత కోసం ప్రతి డివిజన్లో ప్రత్యేకంగా ’షీ టీమ్స్’ ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్నారు. మహిళలకు డ్రైవింగ్, ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇప్పించారు, హైదరాబాద్ ఉత్తర మండల డీసీపీగా పనిచేశారు. 2021లో సిద్దిపేట పోలీస్ కమిషనర్గా నియమితులై కమిషనరేట్కు తొలి మహిళా కమిషనర్గా సరికొత్త రికార్డు సృష్టించారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో, ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించే వినూత్న సర్వే విధానాలను ప్రవేశపెట్టడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 16 మాసాలకే సన్ప్రీత్ సింగ్ బదిలీఇప్పటివరకు పనిచేసిన సీపీ సన్ప్రీత్ సింగ్ సుమారు 16 మాసాల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. ఆయన 2025, మార్చి 8న ఆయన వరంగల్ కమిషనరేట్కు సీపీగా వచ్చారు. ఆయనకు శాంతిభద్రతల విషయంలో ఎక్కడా తగ్గలేదన్న పేరుంది. బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ఒక్కరిద్దరు ప్రజాప్రతినిధుల లేఖల సిఫార్సులు పట్టించుకోలేదని, వారడిగిన ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. శాంతిభద్రతలు, నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యల విషయంలో ఎక్కడా రాజీపడలేదని ఆశాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఫోన్లో పరస్పరం గొడవ పడ్డారన్న ప్రచారం ఉంది.క్రైమ్స్ డీసీపీగా కిషన్ సింగ్... ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న వరంగల్ పోలీసు కమిషనరేట్ క్రైం డీసీపీగా డి.కిషన్ సింగ్ను నియమించారు. ప్రస్తుతం ఆయన టీజీ–ఐసీసీసీ టెక్నికల్ విభాగంలో నాన్ కేడర్ ఎస్పీగా ఉన్నారు. -
ఓట్ల లూటీపై సీజేఐకి విపక్షాల ఉమ్మడి ఫిర్యాదు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (సర్) ప్రక్రియ, ఇతర ఎన్నికల అవకతవకలపై ఇండియా కూటమి నేతలు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్కు ఒక ఉమ్మడి లేఖను పంపారు. జూన్ 8న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ద్వారా వెల్లడించారు. 21 political parties plus one Independent attended the INDIA janbandhan meeting on June 8, 2026 where a decision was taken to address a joint letter to the Hon’ble Chief Justice of India on the SIR process of the Election Commission of India and other election-related issues.…— Jairam Ramesh (@Jairam_Ramesh) June 30, 2026ఈ ఉమ్మడి లేఖపై మొత్తం 23 ప్రతిపక్ష పార్టీలతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి సంతకాలు చేశారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగం కానప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలు కూడా ఈ లేఖకు మద్దతు తెలిపి, సంతకాలు చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల లూటీ, అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ లేఖను చీఫ్ జస్టిస్కు అందజేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.Good going from INDIA. And yes, @AamAadmiParty @arivalayam DMK also signed the joint letter to CJI https://t.co/MtIpS7GdC4— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) June 30, 2026మరోవైపు దేశంలో లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ‘నీట్’, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరీక్షల వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. తామంతా కలిసికట్టుగా ఈ సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగుతామని ఖర్గే స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: విరాళాల వివాదం: కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ గృహ నిర్బంధం -
భారత జట్టు ప్రకటన.. యువ సంచలనానికి చోటు
జపాన్ వేదికగా సెప్టెంబర్లో జరిగే ఆసియా క్రీడలు 2026 కోసం 15 మంది సభ్యుల భారత మహిళల క్రికెట్ జట్టును ఇవాళ (జూన్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధాన కొనసాగనున్నారు.స్టార్ ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి ఎంపికైంది. ఈ జట్టులో 17 ఏళ్ల వికెట్కీపర్ బ్యాటర్ జి కమిలిని ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. యస్తికా భాటియా స్థానంలో కమిలిని జట్టులోకి వచ్చింది. తాజాగా టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన భారత జట్టులో ఇదొక్కటే మార్పు.కమిలిని ఇటీవల సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఆమెకు ఆసియా క్రీడల బెర్త్ దక్కేలా చేసింది. దీనికి ముందు అండర్-19 ప్రపంచకప్లోనూ కమిలిని రాణించింది. ఈ ప్రదర్శనల కారణంగా డబ్ల్యూపీఎల్ బెర్త్ కూడా దక్కించుకుంది. 2025 వేలంలో కమిలినిని ముంబై ఇండియన్స్ రూ. 1.6 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్ వేలానికి ముందు మరోసారి కొనసాగించింది.కాగా, ఆసియా క్రీడల్లో భారత్ మరోసారి టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. హాంగ్ఝౌ వేదికగా జరిగిన గత క్రీడల్లో టీమిండియా స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పురుషుల విభాగంలోనూ టీమిండియానే గోల్డ్ గెలుచుకుంది.ఆసియా క్రీడలు 2026 కోసం భారత జట్టు..హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్కీపర్), జి కమలిని (వికెట్కీపర్), భారతీ ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ (ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి), రాధా యాదవ్, నందిని శర్మ -
తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!
కన్నబిడ్డ సామర్థ్యం మీద ఒక తల్లి నమ్మకం ఆ కూతురు భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. కన్నతల్లి కష్టాన్ని , తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని కూతురు ఆమెకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. కష్టపడి చదివి, ఈ-కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్కార్ట్' సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాన్ని సాధించిన ఒక బెంగళూరు యువతి కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింంది. View this post on Instagram A post shared by Anusmita (@anusmitaaa)అసలు ఏమైంది?కాలేజీ అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు, తన కూతురి చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో తల్లి ఏమాత్రం సంకోచించకుండా తన నగలను తాకట్టు పెట్టింది. తన తల్లి త్యాగాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఆ కుమార్తె అహర్నిశలూ కష్ట పడింది. తన సక్సెస్ స్టోరీని అనుస్మిత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ఫీజు చెల్లించడానికి తల్లి తన చేతికున్న బంగారు గాజులను తాకట్టు పెట్టారు. ఆ రోజు తల్లి చూపిన చొరవ, చేసిన త్యాగమే తన జీవితాన్ని మలుపు తిప్పిందని ఆమె పేర్కొన్నారు.ఏమాత్రం వెనుకా ముందూ ఏమీ ఆలోచించకుండా చేసిన ఆమె త్యాగమే తన సక్సెస్కు మూలమని సంతోషాన్ని ప్రకటించింది.తల్లి తనపై ఉంచిన నమ్మకాన్ని వృథా చేయకుండా, ఆ యువతి, చదువులో నిరంతరం శ్రమిస్తూ అద్భుతమైన ప్రతిభతో రాణించింది. కాలేజీ రోజుల్లోనే కోడింగ్, సాంకేతిక నైపుణ్యాలపై పట్టు సాధించింది. చివరకు దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్కార్ట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్-1 గా ఉద్యోగాన్ని అమ్మకు గిఫ్ట్గా అందించింది."నా కాలేజీ అడ్మిషన్ ఫీజు కట్టడానికి అమ్మ తన బంగారు గాజులను తాకట్టు పెట్టడానికి ఏమాత్రం ఆలోచించలేదు, అమ్మ ఎప్పుడూ అలాగే చేస్తుంది," అని ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఫ్లిప్కార్ట్' (Flipkart)లో ఉద్యోగం రావడం అనేది కేవలం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదు; తన తల్లి చేసిన త్యాగానికి నిదర్శనమి పేర్కొంది. ప్రతిరోజూ ఫ్లిప్కార్ట్కు వెళ్తున్నప్పుడు, అమ్మ కోసమే వెళ్తున్నానని భావిస్తాననని ఈ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, అమ్మ చేసిన త్యాగానికి రుజువు అని చెప్పింది.తన జీవితంలోని ఈఅద్భుతమైన విషయాన్ని అందరికీ చెప్పడానికి ఈ రోజు సరైనదనిపించిందంటూ ‘‘అమ్మా... ఇది నీ కోసమే. అన్నీ నీ కోసమే. ఎప్పటికీ. అన్నింటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను." అంటూ అనుస్మిత ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. -
కుమారస్వామి ఎక్కడివాడు? సోషల్ మీడియాలో వింత చర్చ!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎందుకు ఎవరిని ట్రోల్ చేసుకుంటారో అస్సలు అర్థం కాదు. రీసెంట్గా 'ఇడుపు కాయితం' అనే పదం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని నెటిజన్లు ఒకరిపై ఒకరు ఎలా విమర్శలు చేసుకున్నారో చూస్తూనే ఉన్నాం. ఎవడో ఓ ఆకతాయి పెట్టిన కామెంట్ కారణంగా ఒకరి భాష, యాసపై మరొకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఇందులోకి రాజకీయాలు కూడా ఎంటరయ్యాయి. సరే ఈ గోల ఎప్పుడు ఆగుతుంది అనుకుంటే కొత్తది మొదలైంది.(ఇదీ చదవండి: జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది)నిన్నటివరకు ఆంధ్రా vs తెలంగాణ నెటిజన్ల మధ్య రచ్చ నడవగా.. ఇప్పుడు తెలుగు vs తమిళ నెటిజన్ల మధ్య ట్రోల్స్ హంగామా నడుస్తోంది. దీనంతటికీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కొత్త పోస్టరే కారణం. చాన్నాళ్లుగా కుమారస్వామి కథతో తీసే సినిమాలో తారక్ నటిస్తాడనే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించారు. త్రిశూలం, డీఎన్ఏ, యుద్ధాలు తదితర అంశాలు ఈ పోస్టర్లో చూపించారు.అయితే ఈ చిత్ర నిర్మాతలు నాగవంశీ, కల్యాణ్ రామ్.. పోస్టర్ షేర్ చేస్తూ 'ఉత్తరంలో జననం.. మధ్య భారతంలో తీర్చిదిద్దిన జీవితం.. దక్షిణాదిలో ఆరాధ్యుడిగా ఎదిగిన వ్యక్తిత్వం!' అని కుమారస్వామి గురించి పరోక్షంగా రాసుకొచ్చారు. దీంతో కుమారస్వామి తమ రాష్ట్రానికి చెందిన వాడని తమిళ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో అసలు కుమారస్వామి ఎక్కడివాడు? అనే వింత చర్చ మొదలైంది. మరి ఇదెప్పుడు ఆగుతుందో ఏంటో?(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)Original name of Murugan is Ceyon ( சேயோன் ) , he was red in colour , he was the warrior god and he is the origin of all of us tamils , and his mother’s name is Kottravai - the original form of Tirupathi Venkateswara swamy .Do not ready made up history and convince yourself… https://t.co/to9yfeMLSm— Prashanth Rangaswamy (@itisprashanth) June 29, 2026 -
ఐఐటీ డ్రాపౌట్ అయినా..మైక్రోసాఫ్ట్, గూగుల్లో ఉద్యోగం!
స్టూడెంట్స్ ఐఐటీలో సీటు రావడాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో మనకు తెలిసిందే. అందుకోసం అహర్నిశలు కష్టపడతారు. అలాంటిది ఈ యువకుడికి జాక్పాట్ కొట్టినట్లుగా ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీలోనే చోటు దక్కించుకున్నాడు. కానీ ఆ చదువుని మధ్యలోనే వదిలేశాడు. అయినప్పటికీ ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీల్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాలు సంపాదించాడు. పైగా ఇలాంటి ఘనతను సృష్టించిన పిన్నవయస్కుడిగా నిలిచాడు. అతడెవరంటే..ఆ యువకుడే ఆశిష్ కుమార్ వర్మ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో సీటు సంపాదించడాన్ని అత్యున్నత విద్యా అవకాశంగా పరిగణిస్తుంది మన దేశం. అలాంటిది ఈ 19 ఏళ్ల వయకుడు, ఐఐటీ ఢిల్లీ విద్యార్థి అయిన ఆశిష్ కుమార్ వర్మ ఓటు వేసే వయసు రాకమునుపే ఆ ప్రముఖ విద్యాసంస్థలో చదువుని మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడం విశేషం. ఈ మేరకు వర్మ తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆయన టెక్ పరిశ్రమలో విజయానికి అధికారిక డిగ్రీ ఒకటే ఏకైక మార్గమనే ఆలోచనను తిరగరాశాడు. అంత అసాధ్యం అనుకునేదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. పైగా 18 ఏళ్లకే గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ గుర్తింపు తెచ్చుకుని అతి పిన్న వయస్కుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పేరుతెచ్చుకున్నాడు. ఆ యువకుడి చేతిలో పోర్ట్ఫోలియోలో సకురా సైన్స్ ప్రోగ్రామ్ కింద జపాన్లో చేపట్టిన సహకార పరిశోధన ప్రాజెక్టులు, అలాగే ఆయన స్వయంగా భారత ప్రధానికి ప్రదర్శించిన ఒక మొబైల్ అప్లికేషన్ ఉన్నాయి. తనకు ఐఐటీలోని కఠినమైన విద్యా ప్రయాణం అత్యంత పరిమితంగా అనిపించిందని అంటున్నాడు. మనకు వ్యవస్థ ఎప్పటికీ అసాధారణ మార్గం ఇవ్వదు అనేది అబద్ధం అంటున్నారు. యువత ఎప్పుడు ఈ వ్యవస్థను నిందించడం మాని..అపారమైన జ్ఞానాన్ని సంపాదించడానికి బ్యాచిలర్, మాస్టర్ లేదా పీహెచ్డీతో పనిలేదని, మీరు చేయలదలుచుకుంది చేయండి అని చెబుతున్నాడు ఆశిష్. తాను C#, టైప్స్క్రిప్ట్ వంటి భాషలను నిర్మించడమే గాక మార్గదర్శకుల సాయంతో నేరుగా నేర్చుకునే అవకాశం దక్కించుకున్నానని అంటున్నారు. తాను ఒక ఉద్యోగానికి పరిమితం కాకూడదనే గుగూల్ డెవలప్పర్ ఉద్యోగాన్ని వదిలి మైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్లోకి అడుగుపెట్టానని అంటున్నాడు. ప్రస్తుతం ఏఐ, ఓపెన్ ఇంటర్నెట్లతే హవా..కాబట్టి ఈ కాలంలో సాంప్రదాయ డిగ్రీల కంటే ఆకట్టుకునే టాలెంట్, స్కిల్, కష్టపడే తత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. ఇక్కడ వర్మ కథ భారతదేశంలోని జెన్-జెడ్ టెక్ ప్రతిభావంతులలో పెరుగుతున్న మార్పును హైలైట్ చేస్తోంది..!.(చదవండి: ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు..) -
మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడీ నెల్లూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మామిడి రైతులకు మద్దతుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలను బలవంతంగా తరలించారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు, జీడీ నెల్లూరు, పూతల పట్టు నుంచి భారీగా రైతులు తరలివచ్చారు. మామిడి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. మామిడి రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? అంటూ ప్రశ్నించారు. మామిడి రైతులకు కిలో మద్దతు ధర 17 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.‘‘పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్రం లక్ష 30 వేల టన్నులు తోతపూరి మామిడి కిలో 17.50 రూపాయలు చొప్పున కొనుగోలుకు అంగీకరించింది. చంద్రబాబుకు రైతులు పట్ల చిత్తశుద్ధి లేదు. వైఎస్ జగన్ పాలనలో తోతపురి మామిడి పంట 25 రూపాయలు ఏ రోజు తగ్గింది లేదు. గత ఏడాది మామిడి రైతులు పక్షాన వైఎస్ జగన్ పోరాటం చేశారు. చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి రైతులకు కిలో 17.50 రూపాయలు తీసుకురావాలి. మామిడి రైతులకు మేలు జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ భూమన పేర్కొన్నారు. -
బంగారం ధరలు ఢమాల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
వెనెజువెలా: పాపం వాళ్లు… శిథిలాల్లో ప్రాణాల కోసం పోరాటం!
ఒక దేశం నుంచి బలవంతంగా పంపించారు. పోనీలే.. స్వస్థలానికి చేరామన్న ఊపిరి కూడా తీసుకోకముందే ప్రకృతి రూపంలో వచ్చిన విధ్వంసం వారిని మింగేసింది. డిపోర్ట్ చేసిన కొద్ది గంటల్లోనే భారీ భూకంపం వారిని శిథిలాల కిందకి లాక్కెళ్లింది. కొందరు ప్రాణాలతో బయటపడగా.. వంద మందికి పైగా ఇప్పటికీ కనిపించకుండా పోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది.వెనెజువెలాను కుదిపేసిన జంట భూకంపాలు ఇప్పటివరకు కనీసం 1,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగెస్ ప్రకారం 5,034 మంది గాయపడ్డారు, ఇంకా వేలాది మంది ఆచూకీ లేని పరిస్థితి నెలకొంది. వారం గడిచినా.. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత బుధవారం సాయంత్రం 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాలు.. దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక విపత్తులుగా మారాయి. లా గ్వైరా సహా పలు ప్రాంతాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. భవనాలు కూలిపోవడంతో రోడ్లు, హోటళ్లు, నివాసాలు శిథిలాలుగా మారాయి. అయితే అప్పటి నుంచి ప్రకంపనలు ఆగకపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిదాకా 500కు పైగా ప్రకంపనలు(ఆఫర్ట్ షాక్స్) సంభవించినట్లు తెలుస్తోంది. ఈ విపత్తు సమయంలోనే అమెరికా నుంచి డిపోర్ట్ చేయబడిన 146 మంది వెనిజులా వలసదారులు దేశానికి చేరుకున్నారు. వారిని లా గ్వైరాలోని హోటల్లో తాత్కాలికంగా ఉంచగా, కొన్ని గంటల్లోనే అదే ప్రాంతాన్ని భూకంపం తీవ్రంగా దెబ్బతీసింది.డిపోర్టేషన్ తర్వాతే విధి పరీక్షడొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక.. వలస నియంత్రణ చర్యల్లో భాగంగా కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అక్రమ చొరబాటు దారులంటూ బేడీలు వేయించి మరీ యుద్ధ విమానాల్లో.. అత్యంత దయనీయమైన పరిస్థితుల నడుమ స్వస్థలాలకు పంపించి వేస్తున్నారు. అలా డిపోర్టేషన్ ఫ్లైట్లలో భాగంగా వచ్చిన ఈ వెనెజువెలా వలసదారులు, స్వదేశానికి తిరిగొచ్చిన వెంటనే ఈ విపత్తులో చిక్కుకున్నారు. ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా మానవతా చర్చకు దారితీస్తోంది.ఆ 100 మంది ఎక్కడ?హోటల్ శిథిలాల నుంచి కొందరు బయటపడగా, మరికొందరు ఐదు కిలోమీటర్ల దూరం నడిచి సహాయం కోరారు. కానీ 100 మందికి పైగా వలసదారుల ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన పెంచుతోంది. వాళ్లంతా ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని చెబుతున్న అధికారులు.. వాటిని తొలగించే పనిని కొనసాగిస్తున్నారు. లిస్బెత్ పోర్టిల్లో అనే శరణార్థి సహా కొందరు వలసదారులు శిథిలాల నుంచి బయటపడి ప్రాణాలతో తప్పించుకున్నారు. “చుట్టూ అరుపులు, పరుగులు, దుమ్ము… ఎవరూ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి. కొందరు దుస్తులు, మరికొందరు చెప్పుల్లేకుండా ప్రాణభయంతో పరుగులు తీశారు” అని ఆమె వివరించింది. రెండో అంతస్తులో ఉన్న గదిలోనే ఆమె శిథిలాల కింద ఇరుక్కున్నప్పటికీ అదృష్టవశాత్తు బయటపడింది. “నేను మళ్లీ పుట్టాను… దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చాడు” అంటూ ఆమె కన్నీళ్లతో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.మృతుల సంఖ్య పెరుగుతున్న భయంప్రభుత్వ లెక్కల ప్రకారం 1,719 మంది మరణించగా, 15,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇంకా వేలాది మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మరింత విషమించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి (UN) 10,000 బాడీ బ్యాగ్స్ పంపించాలని నిర్ణయించింది. 24 దేశాలు కలిసి 521 టన్నుల సహాయాన్ని పంపించాయి. 2,700కు పైగా రెస్క్యూ సిబ్బంది, 86 డాగ్ యూనిట్లు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అమెరికా కూడా తన సహాయాన్ని 300 మిలియన్ల డాలర్లకు పెంచింది. -
చరిత్ర సృష్టించిన టామ్ లాథమ్
తాజాగా ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపై టెస్ట్ సిరీస్లో ఓడించిన (2-1) న్యూజిలాండ్ జట్టు చరిత్రలో నిలిచిపోయే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సిరీస్ గెలుపు ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్కు కూడా ప్రత్యేక కీర్తి తెచ్చి పెట్టింది.ఈ సిరీస్లో న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఓడిపోయిన తర్వాత అనూహ్యంగా పుంజుకొని ఆతర్వాత రెండు టెస్ట్లు గెలిచింది. తొలి టెస్ట్ కోల్పోయి, ఆతర్వాత సిరీస్ గెలవడం న్యూజిలాండ్కు ఇదే మొదటిసారి.ఈ గెలుపు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్కు మరో ఘనత కూడా తెచ్చిపెట్టింది. ఈ శతాబ్దంలోనే (21వ) ఇంగ్లండ్ సహా భారత్ను వారి సొంత ఇలాకాల్లో ఓడించిన మొదటి విదేశీ కెప్టెన్గా టామ్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఆరో కెప్టెన్గా నిలిచాడు.టామ్ 2024లో భారత్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి చరిత్రపుటల్లో నిలిచాడు. టీమిండియాను వారి సొంతగడ్డపై 3 మ్యాచ్ల సిరీస్లో వైట్ వాష్ చేయడం ఏ విదేశీ కెప్టెన్కైనా ఇదే తొలిసారి.అలాగే 1999 తర్వాత ఇంగ్లండ్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఉన్న టెస్ట్ సిరీస్ను గెలవడం కూడా న్యూజిలాండ్కు ఇదే మొదటిసారి.వాస్తవానికి ఈ సిరీస్ విజయం న్యూజిలాండ్కు అంత సులభంగా ఏమీ దక్కలేదు. తొలి టెస్ట్ ఓటమి తర్వాత స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ రిటైర్డ్ కాగా.. సిరీస్ డిసైడర్ అయిన మూడో టెస్ట్కు కీలక బౌలర్లు మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్ అందుబాటులో లేరు.ఇంగ్లండ్పై సిరీస్ గెలుపుతో న్యూజిలాండ్కు మరో సానుకూల అంశం కూడా తెలిసొచ్చింది. ఈ గెలుపుతో ఆ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టినలో మూడో స్థానానికి దూసుకొచ్చింది.ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో న్యూజిలాండ్ 373 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇంగ్లండ్ తడబడి 212 పరుగులకే ఆలౌటై, 160 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
ప్రియుడిని పరిచయం చేసిన యంగ్ హీరోయిన్
పవి టీచర్గా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటి బ్రిగిడా సాగా.. సొంత భాషతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు తన ప్రేమ సంగతి బయటపెట్టింది. నటుడు ఆనంద్ రామ్తో రిలేషన్లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్గా తెగ వైరల అయిపోయిన బ్రిగిడా సాగా.. 2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్స్పాట్ టూ మచ్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి. తర్వాత అంతా మర్చిపోయారు.అలాంటిది ఇప్పుడు బ్రిగిడా సాగా తన ప్రేమ విషయం రివీల్ చేసి ప్రియుడి గురించి చెప్పడంతో తోటీ నటీనటులు విషెస్ చెబుతున్నారు. ఆనంద్ రామ్.. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు.బ్రిగిడా సాగా తన ఇన్ స్టాలో ఆనంద్ గురించి చెబుతూ.. చిన్నప్పటి నుంచి అందమైన ప్రేమకథలు సినిమాల్లో ఉంటాయని అనుకునే దాన్ని, కానీ జీవితం నాకోసం మరో అందమైన కథ రాసింది. సినిమా ప్రయాణంలో నా లాంటి డ్రీమ్స్, ఇష్టాలు కలిగిన ఆనంద్ రామ్ని కలుసుకున్నాను. స్నేహంతో మొదలైన బంధం ఇప్పుడు ప్రేమవరకు వచ్చింది. అలానే మేం 'ఐ లవ్ యూ' చెప్పుకొనే జోడీ కాదు' అని బ్రిగిడా సాగా రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది) View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
జూలై 1 నుంచి బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో రూ.5,632 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. బైబ్యాక్లో భాగంగా దాదాపు 46.94 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. ప్రతి షేరు ధరను రూ.12,000 గా నిర్ణయించారు. ఈ ఆఫర్ జూలై 7న ముగుస్తుందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు బజాజ్ ఆటో బోర్డు మే 6న ఆమోదం తెలపగా... మే 14న పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేర్హోల్డర్లు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 84 పాయింట్లు నష్టపోయి 23,865 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 239 పాయింట్లు తగ్గి 76,498 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 2.07 శాతం పుంజుకుంది.Today Nifty position 30-06-2026(time: 09:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
విరాళాల వివాదం: కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ గృహ నిర్బంధం
అయోధ్య: అయోధ్య రామ మందిర విరాళాల వ్యవహారంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ను పోలీసులు ఆయన బస చేసిన హోటల్లో గృహ నిర్బంధం చేశారు. రామాలయంలో పూజలు చేసేందుకు ఎంపీలు, ఇతర సీనియర్ నేతలతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అయోధ్య సందర్శనకు సిద్ధమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ పర్యటన గురించి స్థానిక యంత్రాంగానికి ముందే సమాచారం ఇచ్చినప్పటికీ, విరాళాల వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతున్నందున ఆయనను అడ్డుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. VIDEO | UP Congress chief Ajay Rai has been placed under house arrest at a hotel in Ayodhya, the UP Congress said in a statement.(Source: Third Party)#AjayRai pic.twitter.com/smhIEObYUK— Press Trust of India (@PTI_News) June 29, 2026విరాళాల లెక్కింపు సమయంలో నగదును పక్కదారి పట్టించారనే ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల తరపున వాదించకూడదని అయోధ్యలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా న్యాయవాది ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ. 5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తూ, ఆలయ నిర్వహణతో సంబంధం ఉన్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావులను వెంటనే అయోధ్య నుంచి పంపించేయాలని, లేకపోతే నగరంలోకి ఎవరినీ రాకుండా దిగ్బంధిస్తామని బార్ అసోసియేషన్ తీర్మానించింది.మరోవైపు, ఈ విరాళాల అవకతవకలపై సీబీఐ ఆధ్వర్యంలోని ‘సిట్’తో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, దీనిపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేస్తూ, వేసవి సెలవుల అనంతరం విచారిస్తామని వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, విరాళాల లెక్కింపు సిబ్బందిపై అనుమానంతో మూడు నెలల క్రితమే వారిని మార్చాలని ఎస్బీఐ సూచించినా, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లోకి గోద్రెజ్ నింజా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ పెట్ కేర్ (జీపీసీ) సంస్థ పెంపుడు శునకాల కోసం ఉద్దేశించిన ఆహారోత్పత్తి గోద్రెజ్ నింజాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. శునకాల జీర్ణకోశం ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీవోవో నితిన్ జైన్ తెలిపారు. దీని ధర రూ. 20 నుంచి ప్రారంభమవుతుంది.ఇప్పటికే తమిళనాడులో దీన్ని ప్రవేశపెట్టినట్లు, తెలుగు రాష్ట్రాల తదుపరి ఇతర మార్కెట్లలోకి కూడా విస్తరించనున్నట్లు జైన్ చెప్పారు. త్వరలో ఇతరత్రా పెంపుడు జంతువుల ఆహారోత్పత్తులను కూడా ప్రవేశపెడతామన్నారు. నాసిక్లో 35,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో తయారీ ప్లాంటు సిద్ధమవుతోందని ఆయన వివరించారు. పెట్ కేర్ ఉత్పత్తుల పోర్ట్ఫోలియో విస్తరణపై దాదాపు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు జైన్ చెప్పారు. దేశీయంగా పెట్ ఫుడ్ విభాగం దాదాపు రూ. 5,000 కోట్లు కాగా, దక్షిణాది వాటా రూ. 2,000 కోట్లుగా ఉంటుందన్నారు. కర్ణాటక వాటా 15%గా, తెలుగు రాష్ట్రాల వాటా 8 శాతంగా ఉందని జైన్ వివరించారు. -
నెలకు రూ.71 వేల ఖర్చు.. వైరల్గా టెకీ అంజలి వీడియో
దేశంలోని ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో జీవన వ్యయం (Cost of Living) మరోసారి చర్చనీయాంశమైంది. ఓ ఐటీ ఉద్యోగిని తన నెలవారీ ఖర్చులను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఆ వీడియో వైరల్గా మారింది. తాను మే నెలలో మొత్తం రూ.71 వేల వరకు ఖర్చు చేశానని, అయితే బెంగళూరు వంటి నగరంలో ఇది పెద్ద మొత్తం కాదని చెప్పడంతో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ మొదలైంది.వీడియోలో టెకీ అంజలి తన ఖర్చులను వివరించింది. తాను ఉంటున్న 1BHK ఫ్లాట్కు నెలకు రూ.28 వేల అద్దె చెల్లిస్తున్నట్లు తెలిపింది. రోజువారీ ఆహారం కోసం సుమారు రూ.7 వేలు ఖర్చవుతాయని పేర్కొంది. వారాంతాల్లో షాపింగ్, బయట తిరగడం వంటి ఖర్చులకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది.Bengaluru Techie Monthly Expenses Go Viral!A Bengaluru software engineer is spending ₹71,000 per month with rent alone at ₹28,000 for a 1BHK apartment!Anjali, who works as a Software Engineer at Atlassian, shared her detailed May expense breakdown on Instagram, sparking… pic.twitter.com/lswYRiwBBw— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) June 29, 2026 అంతేకాకుండా, ప్రయాణాలను ఇష్టపడే తాను టూర్ల కోసం నెలకు మరో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నానని చెప్పింది. ఈ ఖర్చులన్నీ కలిపి మే నెలలో తన మొత్తం వ్యయం రూ.71 వేలకు చేరిందని వివరించింది. అయితే, బెంగళూరులో ఉద్యోగం చేసే వారికి ఇలాంటి ఖర్చులు అసాధారణం కాదని, నగర జీవనశైలికి అనుగుణంగా ఇవి సహజమేనని అంజలి అభిప్రాయపడింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు "బెంగళూరులో అద్దెలు, జీవన వ్యయం నిజంగానే ఎక్కువ" అంటూ ఆమె మాటలకు మద్దతు పలికారు. మరికొందరు మాత్రం "ఈమె కేవలం ఖర్చు పెట్టడానికే పుట్టింది", "ఇంత డబ్బు సేవ్ చేస్తే ఏడాదికి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది", "ఇది అవసరమైన ఖర్చా.. లేక లైఫ్స్టైల్ ఖర్చా?" అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.ఈ వీడియోతో మరోసారి బెంగళూరులో పెరుగుతున్న అద్దెలు, జీవన వ్యయం, యువ ఉద్యోగుల లైఫ్స్టైల్ ఖర్చులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. -
దక్షిణాదిలో స్మిటెన్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌందర్య సాధనాలు, లైఫ్ స్టయిల్ ఉత్పత్తులు మొదలైన వాటిని కొనుగోలుకు ముందే ట్రయల్ చేసేందుకు వీలు కల్పించే స్మిటెన్ తాజాగా దక్షిణాదిలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్లో స్టోర్ ప్రారంభించింది. కంపెనీకి ఇది ఎనిమిదో స్టోర్. 2027 నాటికి రూ. 100 కోట్ల ఆదాయం, 50 పైచిలుకు స్టోర్స్ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. విశాఖపట్నం, చెన్నై, హుబ్లి, బెంగళూరు తదితర కీలక దక్షిణాది మార్కెట్లలోను రిటైల్ నెట్వర్క్ మరింత పటిష్టం చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. -
పోస్కోతో ఈబీజీ గ్రూప్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్లో డేవూ బ్రాండ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దక్షిణ కొరియన్ సంస్థ పోస్కో ఇంటర్నేషనల్తో బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఈబీజీ గ్రూప్ వెల్లడించింది. దీని ప్రకారం భారత్లో డేవూ బ్రాండ్ ఉపకరణాల అభివృద్ధి, తయారీ, పంపిణీ, మార్కెట్ విస్తరణను ఈబీజీ గ్రూప్ నిర్వహిస్తుంది.ఇందుకోసం రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. తొలి దశలో ఫ్రిజ్లు, వాషింగ్ మెషిన్లు మొదలైనవాటిపై దృష్టి పెడుతుంది. ఢిల్లీలో మొదిట ఫ్లాగ్íÙప్ ఎక్స్పీరియన్స్ స్టోర్ త్వరలో ప్రారంభం కానుండగా, మరో మూడు ఔట్లెట్స్ సిద్ధమవుతున్నాయి. 2027 నాటికి 100 స్టోర్ల నెట్వర్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే డేవూ వన్ పేరిట సమగ్ర స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్ని కూడా ప్రవేశపెట్టాలనే యోచన ఉన్నట్లు వివరించింది. -
దూసుకొచ్చిన న్యూజిలాండ్
ట్రెంట్ బ్రిడ్జ్లో ఇంగ్లండ్పై న్యూజిలాండ్ అద్భుత విజయం తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ గెలుపుతో సిరీస్ను సైతం చేజిక్కించుకున్న న్యూజిలాండ్ (2-1తో), టేబుల్లో టాప్-3లోకి ప్రవేశించింది.యాషెస్ ఆధిపత్యం, వెస్టిండీస్పై క్లీన్ స్వీప్ తర్వాత ఆస్ట్రేలియా 87.50 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో డిఫెండింగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికా (75) నిలిచింది. తాజా విజయం తర్వాత న్యూజిలాండ్ 72.22 పాయింట్ల శాతంతో మూడో స్థానానికి దూసుకొచ్చింది.పాకిస్తాన్పై సంచలన విజయాల తర్వాత బంగ్లాదేశ్ నాలుగో స్థానాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 58.33 పాయింట్ల శాతం కలిగి ఉంది. భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక ఆరులో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత కూడా ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలబడింది.తాజాగా శ్రీలంకపై భారీ విజయం సాధించిన తర్వాత కూడా వెస్టిండీస్ ర్యాంకింగ్లో మార్పు లేదు. ఆ జట్టు ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది. చివరిగా పాక్ తొమ్మిదో స్థానంలో తిష్ట వేసి కూర్చుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే.. ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోటీ ఉండే అవకాశం ఉంది. -
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో కీలక సాక్షుల నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీ డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణకు పోలీస్స్టేషన్లోనే ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. సాయికృష్ణ లాకప్డెత్ ఎపిసోడ్ బయటకు రాగానే ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీని సిట్ బృందం ప్రశ్నిస్తోంది.సాయికృష్ణ లాకప్డెత్, శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని విజయవాడ సౌత్జోన్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం లొంగిపోయారు. అనంతరం పోలీసులు వీరిని సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే సిట్ వీరి ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు కోర్టులో మెమో జారీ చేసింది. వీరిద్దరు గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు.వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని విచారణకు హాజరుకావాలని కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు అందజేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో క్రైం కానిస్టేబుల్ బాబూరావును ఇప్పటికే సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇక మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ను కూడా అదుపులోకి తీసుకొని, ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను విచారిస్తే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రావడంతోపాటు ఈ దారుణంలో ఉన్న అనుమానాల చిక్కుముడులు వీడతాయనే భావన వ్యక్తమవుతోంది. కాగా, కృష్ణలంక పోలీసు స్టేషన్లో మరో 10 మంది కానిస్టేబుళ్లను ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించే దిశలోనే దర్యాప్తు! మొత్తం మీద ఈ దారుణంలో ప్రభుత్వ, పోలీసు పెద్దల పాత్రను రక్షించే విధంగానే సిట్ దర్యాప్తు పక్కా ప్లాన్తో జరుగుతోందన్న భావన పోలీసు వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీ మొత్తం మాయం చేశారు. నాలుగు హార్డ్ డిస్క్లను ఫార్మెట్ చేశారని తెలుస్తోంది. దీనిని రికవరీ చేయడం సాధ్యమే అయినా, ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. సిట్ కూడా ఫోరెన్సిక్ ద్వారా సీసీ ఫుటేజీ రికవరీ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. సీసీ ఫుటేజిని రికవరీ చేయడం కష్టమనే భావన వ్యక్తం అవుతుంది. కేసులో కీలక ఆధారమైన సీసీ ఫుటేజీ లేకపోతే,, కేసులో పురోగతి కష్టమనే భావన పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు కేవలం స్టేట్మెంట్ల పరిశీలన, అనుమానాస్పందంగా ఉన్నవారిని విచారించడం మినహా, కేసులో కీలక ఆధారాలు మాత్రం సేకరించలేదని సమాచారం. క్రాంతి ఆత్మహత్యపై ‘సాగు’తున్న దర్యాప్తు మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్ ఉదంతంపైన చేస్తున్న దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ఏసీపీ సత్యానందం రెండు రోజుల క్రితమే క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి అతని తండ్రి, కుటుంబ సభ్యులనుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్టేషన్కు సోమవారం తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావును పిలిచి పలు అంశాలపై ఏసీపీ విచారించారు.సస్పెండ్ అయిన కానిస్టేబుల్ సురేశ్ గురించి కూడ వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజు ఎలా వేధించింది క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోనే చెబుతోంది కదా అని విచారణాధికారికి తండ్రి నివేదించినట్లు సమాచారం. ప్రధానంగా మాదిగ పుట్టుక పుట్టడం, బూటు పాలిష్ చేయడం వంటి అంశాలతో తీవ్ర వేదన చెందినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. కాగా నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న డిమాండ్లపై అధికారులు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
భరోసా రెండెకరాలు దాటేనా?
నిర్మల్చైన్గేట్: రైతు భరోసా పథకం కింద ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజుల పాటు పంటల సాగు పెట్టు బడికి ఆర్థిక సహాయం విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. యాసంగి సీజన్లో ఈ పథకం కింద సాయం కోసం ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలో ని రైతులకు ఎంత భూమి ఉన్నా ఎకరాకు రూ. 6 వేల చొప్పున రెండు ఎకరాల వరకు మాత్రమే రెండు విడుతల్లో ఆర్థికసాయం అందించారు. రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు సంతోషించినా అంతకంటే ఎ క్కువ భూమి ఉన్న వారు నిరాశకు లోనయ్యారు. 2018లో పథకం ప్రారంభం..రాష్ట్రంలో 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో పథకాన్ని ప్రారంభించి పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.5వేల చొప్పున అందించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంవత్సరం యాసంగి సీజన్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. 2024 వానాకాలం సీజన్లో పెట్టుబడి సహాయం చేయలేదు. అనంతరం రైతు భరోసా పథకంగా పేరు మార్చి 2024–25లో యాసంగిలో ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి శ్రీకారం చుట్టింది. 2025లో వానాకాలం సీజన్లో 1,88,597 మంది రైతులకు రూ.268.85.కోట్ల ఆర్థిక సహాయం కింద రైతుల ఖాతాలో డబ్బులను జమ చేసింది.రూ.7,500 సాయం ఎప్పుడో..రైతులకు పెట్టబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పేరు రైతు భరోసాగా మార్పు చేసి ఎకరాకు రూ.6 వేల చొప్పున ఆందిస్తోంది. రూ.7,500 హామీ మాత్రం అమలు కావడం లేదు. వడ్డీ వ్యాపారులే దిక్కు!గతంలో పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. రైతుబంధు పథకం వచ్చాక చాలావరకు అప్పులు చేయడం తగ్గింది. కానీ పథకాన్ని అమలు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా మళ్లీ రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం..రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్ని ఎకరాలకు ఎన్ని విడతలలో అందిస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెట్టుబడి సాయం అందుతుంది. – అంజిప్రసాద్, డీఏవో రెండెకరాలకు మాత్రమే..2025–26 యాసంగి సీజన్లో జిల్లాలో 1.88 లక్షల మంది రైతులకు రూ.168 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. రెండు ఎకరాల పైబడిన వారికి అందలేదు. ఈసారి వానాకాలం సీజన్లో అందరికీ మొత్తం విస్తీర్ణణానికి ఆర్థిక సహాయం అందిస్తారా లేక మళ్లీ రెండు ఎకరాల మేరకే అందిస్తారా అనే సందేహం రైతుల్లో కలుగుతోంది. -
పశ్చిమ బెంగాల్: రిఫైనరీలో లీకేజీ.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని హల్దియా ఆయిల్ రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిఫైనరీ ప్రాంగణంలోని నాఫ్తా రవాణా చేసే ప్రధాన పైప్లైన్లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. VIDEO | West Bengal: A massive fire broke out suddenly in naphtha-carrying pipeline at the Haldia Refinery between 4.00-4.30 AM on Tuesday. Several workers were reportedly injured in the incident. More details are awaited.#Haldia #Fire(Full video available on PTI Videos -… pic.twitter.com/Nz7uHdlIgS— Press Trust of India (@PTI_News) June 30, 2026తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైప్లైన్ నుంచి మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే.. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. దీంతో పలువురు కార్మికులు అగ్నికీలల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఫ్యాక్టరీ యాజమాన్యం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. రిఫైనరీ అధికారులు ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ప్రమాదంతో హల్దియా పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.ఇది కూడా చదవండి: ‘డ్రాగన్ మార్క్’ప్రతీకారం: జపనీస్ కంపెనీలపై చైనా ఉక్కుపాదం -
యువతకు స్ఫూర్తిప్రదాత
డాక్టర్ బి.సి.రాయ్గా సుపరిచితులైన బిధాన్ చంద్రరాయ్ 1882 జూలై 1న నేటి బిహార్లోని బాంకీపూర్లో జన్మించారు. వైద్యవిద్య అభ్యసించారు. 1925లో రాజకీయాలలో ప్రవేశించారు. బెంగాల్లోని బారక్పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ‘గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బెంగాల్’గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ.) ఏర్పాటులోనూ, 1939లో దేశంలో వైద్య విద్య నియంత్రణకు, అభివృద్ధికి పాటుపడే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ.) ఏర్పాటు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు.మహత్మాగాంధీకి అనుంగు మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు. 1942లో పుణేలో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమంలో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయ్ మందులు ఇచ్చారు. ఆ మందులు ఇండియాలో తయారైనవి కావని గాంధీజీ వాటిని నిరాకరించారు. అంతేకాక... ‘నేను, నువ్వు ఇచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి? ఈ దేశంలోని 40 కోట్ల ప్రజలకు నువ్వు ఉచితంగా వైద్యం చేస్తావా?’ అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ రాయ్ ‘లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను. కానీ నేను వచ్చింది... మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 40 కోట్ల మంది ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తి’కి అన్నారు. గాంధీజీ మాట్లాడకుండా మందులు తీసుకున్నారు.స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల ఒత్తిడి మేర 1948 జనవరి 23న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రాయ్. ఆ రోజుల్లో దేశవిభజన కారణంగా బెంగాల్ అతలాకుతలమవుతోంది. రాయ్ ప్రణాళికబద్ధంగా పశ్చిమ బెంగాల్ను అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టించారు. తన 80వ ఏట 1962 జూలై 1న తన పుట్టినరోజే తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడటం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం బి.సి. రాయ్ సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది. రాయ్ అవివా హితులు. తన ఇంటిని తల్లి అఘొర్ కామినీదేవి పేరుతో హాస్పిటల్కు విరాళంగా ఇచ్చారు. తన ఆస్తులతో ప్రజాప్రయోజనార్థం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆయన నేటి వైద్యులకు, రాజకీయ నాయకులకే కాదు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. – డా. టి. సేవకుమార్, ఐ.ఎం.ఎ. నేషనల్ కౌన్సిల్ సభ్యులు (రేపు డా. బి.సి. రాయ్ జయంతి, వర్ధంతి – జాతీయ వైద్యుల దినోత్సవం) -
వాట్సాప్ భారీ అప్డేట్.. కొత్త ఫీచర్ వచ్చిందా చెక్ చేస్కోండి!
ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక ఫీచర్ను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్లో ఎవరితోనైనా మాట్లాడాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్ను షేర్ చేయాల్సి వచ్చేది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు ఇది చాలా మందికి ప్రైవసీ పరంగా అసౌకర్యంగా అనిపించేది. ఇకపై ఆ సమస్యకు చెక్ పడనుంది. ఫోన్ నంబర్ కాకుండా యూజర్ Username ద్వారానే ఇతరులతో చాట్ చేసే అవకాశం వాట్సాప్ కల్పించనుంది. ఈ విషయాన్ని సీఈవో కునాల్ షా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. "మీకు నచ్చిన పేరును ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి" అంటూ వినియోగదారులకు సూచించారు. ఈ ఫీచర్ను జూన్ 29 నుంచి దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తుండగా.. ఈ ఏడాది చివరినాటికి అందరికీ అందుబాటులోకి రానుంది.నంబర్ అవసరం లేదు.. కొత్త ఫీచర్తో ఇకపై కొత్త వ్యక్తులకు మీ ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు ఎంచుకున్న ప్రత్యేకమైన పేరును మాత్రమే షేర్ చేస్తే సరిపోతుంది. ఆ Username ద్వారా అవతలి వ్యక్తి మీతో చాట్ ప్రారంభించగలుగుతారు. కాలేజీ స్నేహితులు, ఆఫీస్ పరిచయాలు, వ్యాపార సంబంధాలు, ఈవెంట్లలో కలిసిన వ్యక్తులు లేదా గ్రూప్ల్లోని కొత్త సభ్యులతో నంబర్ పంచుకోకుండా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ తెలిపింది.ప్రైవసీకే పెద్దపీటఈ ఫీచర్ను సోషల్ మీడియా తరహాలో రూపొందించలేదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్ లేదంటే ఎక్స్ యూజర్నేమ్ల కోసం పబ్లిక్ సెర్చ్ లేదంటే డైరెక్టరీ ఉండదు. ఎవరైనా మీకు మెసేజ్ పంపాలంటే మీ ఖచ్చితమైన Username వారికి తెలిసి ఉండాలి. దీంతో అనవసర మెసేజ్లు, స్పామ్లను తగ్గించే అవకాశం ఉంటుంది.అదనపు భద్రత ఏంటంటే.. యూజర్నేమ్తో పాటు వాట్సాప్ మరో కొత్త భద్రతా ఫీచర్ను కూడా తీసుకొస్తోంది. యూజర్నేమ్ కీ(Username Key) పేరుతో వచ్చే ఈ ఆప్షన్ను యూజర్లు ఐచ్ఛికంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ను ఆన్ చేస్తే.. తొలిసారి మీకు మెసేజ్ పంపాలనుకునే వ్యక్తి యూజర్నేమ్తో పాటు మీరు సెట్ చేసిన ప్రత్యేక కీను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ కీని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. దీంతో అవాంఛిత వ్యక్తుల నుంచి మరింత రక్షణ లభిస్తుంది.ఎలా రిజర్వ్ చేసుకోవాలి?యూజర్నేమ్ రిజర్వ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ను అనుసరించండి.వాట్సాప్ను తాజా వెర్షన్కు అప్డేట్ చేయండి.సెట్టింగ్స్ను Settings ఓపెన్ చేయండి.అకౌంట్ Accountపై ట్యాప్ చేయండి.యూజర్నేమ్ Username ఆప్షన్ను ఎంచుకోండి.మీకు అందుబాటులో ఉన్న పేరును ఎంపిక చేసి కన్ఫర్మ్ చేయండి.అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం దశలవారీగా విడుదల అవుతోంది. కాబట్టి అందరికీ ఒకేసారి కనిపించకపోవచ్చు.నిబంధనలుగరిష్ఠంగా 35 అక్షరాలు ఉండవచ్చు.అవసరమైతే ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదంటే తొలగించుకోవచ్చు.ప్రముఖులు, సెలబ్రిటీలు, సంస్థలకు సంబంధించిన కొన్ని యూజర్నేమ్లను వాట్సాప్ ముందుగానే రిజర్వ్ చేస్తుంది. దీంతో నకిలీ ఖాతాలు (Impersonation) సృష్టించే అవకాశాలు తగ్గుతాయి.వ్యాపార సంస్థలు, క్రియేటర్లు తమ ఇన్స్టాగ్రామ్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్కు అనుగుణంగా Username పొందే అవకాశం కూడా ఉంటుంది.పాత చాట్లపై ప్రభావం?ఈ కొత్త ఫీచర్ వచ్చినా ప్రస్తుతం ఉన్న చాట్లు, కాంటాక్ట్లు, బ్లాక్, రిపోర్ట్, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వంటి సదుపాయాల్లో ఎలాంటి మార్పు ఉండదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలా ఉపయోగిస్తున్నారో అలాగే కొనసాగించవచ్చు.ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?యూజర్నేమ్ రిజర్వేషన్ ఫీచర్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. రాబోయే నెలల్లో దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది. మీ ప్రాంతంలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వాట్సాప్ యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఏడాది చివరినాటికి అన్ని యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఒకే కుటుంబానికి రెండోసారి వజ్రం అదృష్టం
పన్నా(మధ్యప్రదేశ్): జీవితకాలంలో అత్యంత ఖరీదైన ఒక్క వజ్రం దొరకడమే ఎంతో అరుదైన విషయం. మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాకు చెందిన ఒక గిరిజన రైతు కుటుంబాన్ని మాత్రం ఇలాంటి అదృష్టం ఏకంగా రెండుసార్లు వరించింది. రెండేళ్ల క్రితం 2024లో ఈ కుటుంబానికి 19.22 క్యారెట్ల వజ్రం దొరికింది. అప్పట్లో ప్రభుత్వ వేలంలో అది ఏకంగా రూ. 93 లక్షలు పలికింది. అదే కుటుంబం ఇప్పుడు మళ్లీ 11.19 క్యారెట్ల వజ్రాన్ని వెలికితీసింది. విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. రాకేశ్ ఆదివాసీ, అతడి ముగ్గురు సోదరులు, కొందరు బంధువులు కలిసి ఏప్రిల్ అహిర్గావ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో వజ్రాల వేట మొదలుపెట్టారు. రెండు నెలల పాటు రేయింబవళ్లు శ్రమించారు. సోమవారం వారికి అనుకోకుండా 11.19 క్యారెట్ల నాణ్యత కలిగిన వజ్రం లభించింది. వారు వెంటనే ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో దాన్ని డిపాజిట్ చేశారు. ఈ వజ్రం ఎంతో నాణ్యమైందని పన్నా జిల్లా డైమండ్ ఇన్స్పెక్టర్ నూతన్ జైన్ నిర్ధారించారు. Madhya Pradesh Tribal Family Finds Another Diamond Worth Lakhs in PannaMadhya Pradesh Tribal Family Finds Another Diamond Worth Lakhs in PannaMadhya Pradesh Tribal Family Finds Another Diamond Worth Lakhs in PannaMadhya Pradesh Tribal Family Finds Another Diamond Worth Lakhs in PannaMadhya Pradesh Tribal Family Finds Another Diamond Worth Lakhs in Panna -
24,000 కిందికి నిఫ్టీ..
ముంబై: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ అరశాతం నష్టంతో ముగిసింది. ఐటీ, ఆటో, చమురు రంగాల షేర్లలో అమ్మకాలతో పాటు కీలక షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 372 పాయింట్లు నష్టపోయి 76,728 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 24,000 స్థాయి దిగువన 23,946 వద్ద నిలిచింది. ఫ్లాటుగా ప్రారంభమైన సూచీలు రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ 50 రీబ్యాలెన్సింగ్, బీఎస్ఈ సెన్సెక్స్ నెలవారీ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపాయి. నేడు నిఫ్టీ వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీలతో పాటు బ్యాంక్ నిఫ్టీ నెలవారీ ఎక్స్పైరీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 478 పాయింట్లు పతనమై 76,622 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు కోల్పోయి 23,925 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియాలో చైనా 1.14%, జపాన్ 0.15%, హాంకాంగ్ 1.5%, తైవాన్ 0.9% పెరిగాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశా యి. అమెరికా సూచీ లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి.ఇండెక్సుల వారీగా: బీఎస్ఈలో ఆటో (–2.11%), ఆయిల్ అండ్ గ్యాస్ (–1.40%), సర్వీసెస్ (–1.21%), ఐటీ (–1.04%) రంగాలు పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.65%, 0.60 శాతం నష్టపోయాయి.పర్సిస్టెంట్ సిస్టమ్స్: జర్మనీకి చెందిన డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ నగారో ఎస్ఈని కొనుగోలు చేసుకుంటామని ప్రకటించడంతో పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 11% నష్టపోయి రూ.4,298 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 11.63% కోల్పోయి రూ.4,277 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది.కోటక్ మహీంద్రా బ్యాంక్: ఎండీ, సీఈవోగా అశోక్ వాస్వానీ తమ పునర్నియామకాన్ని కోరడం లేదని స్పష్టం చేయడంతో కోటక్ బ్యాంకు షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3.2% నష్టపోయి రూ.396 వద్ద ముగిసింది. ఒక దశలో 3.6% పతనమై రూ.394 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. దీంతో బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.13,177 కోట్లు హరించుకుపోయి రూ. 3.93 లక్షల కోట్లకు దిగివచి్చంది.టర్టిల్మింట్ లిస్టింగ్.. ప్చ్ఇన్సూరెన్స్ కంపెనీ టర్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్ షేరు లిస్టింగ్లో నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.152)తో పోలిస్తే 10.39% డిస్కౌంటుతో రూ.136 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 13% క్షీణించి రూ.132 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% నష్టంతో రూ.135 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,987 కోట్లుగా నమోదైంది. -
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోకి జీరోధా
న్యూఢిల్లీ: ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ జీరోధా క్రమంగా ఇతర ఆర్థిక సేవల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్సు కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు సమర్పించింది. డేటా ప్రకారం జీరోధా కార్పొరేట్ అడ్వైజర్స్ ఏప్రిల్ 27న ఫైల్ చేసింది.ప్రస్తుతం ఇది సెబీ పరిశీలనలో ఉంది. ఒకవేళ లైసెన్సు లభిస్తే ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) నిర్వహణ, నిధుల సమీకరణలో కంపెనీలకు సలహాలివ్వడం, ఇతరత్రా మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసులు మొదలైనవి కంపెనీ అందించవచ్చు. ప్రస్తుతం జీరోధాకి 1.6 కోట్ల మంది పైగా కస్టమర్లు ఉండగా, కంపెనీ ప్లాట్ఫాంపై ఏటా వందల కోట్ల ఆర్డర్లు నమోదవుతుంటాయి.జీరోధా ఏఎంసీ పేరిట సంస్థకి సొంతంగా మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్సు కోసం ఇన్క్రెడ్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నియో వెల్త్ మేనేజ్మెంట్, సొసైటీ జనరాలీ సెక్యూరిటీస్ ఇండియా తదితర 12 సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. -
జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది
కృషి, శ్రమ, పట్టుదల విజయానికి మూలాలు. ఆ తర్వాత అదృష్టం తోడవ్వాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రష్మిక పేరు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా పదేళ్ల క్రితం 'కిరిక్ పార్టీ' అనే కన్నడ మూవీతో నటిగా పరిచయమైంది. అలాంటి ఈమె.. పాన్ ఇండియా హీరోయిన్ అవుతానని కలలో కూడా ఊహించి ఉండదు. కానీ అవ్వడంతో పాటు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్')హీరోయిన్గా తొలి సినిమాతో గుర్తింపు వచ్చిన కొన్నాళ్లకు 'ఛలో' అంటూ రష్మిక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి పేరుతో పాటు అద్భుతమైన అవకాశాల్ని తెచ్చిపెట్టింది. అనంతరం తెలుగులోనే 'గీతగోవిందం' మూవీ ఈమె లైఫ్, కెరీర్ రెండింటిని మార్చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈమె భర్త అయ్యాడు. ఇది బ్లాక్బస్టర్ సక్సెస్ కావడంతో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి.తెలుగులో మంచి సక్సెస్ కారణంగా బాలీవుడ్లోనూ రష్మికకు వరస ఛాన్సుల వచ్చాయి. యానిమల్, ఛావా చిత్రాలు ఈమెని పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజికి తీసుకెళ్లిపోయాయి.ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక.. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఫిట్నెస్ కాపాడుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ టైంలో ఈమె చేసిన 'కాక్టెయిల్ 2' థియేటర్లలోకి వచ్చింది. ఈ ఏడాదిలోనే భర్తతో చేసిన రణబాలి, లీడ్ రోల్ చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' రిలీజ్ కానున్నాయి. ఇదంతా చూస్తుంటే పదేళ్లలో రష్మిక జీవితం ఎంతలా మారిపోయిందో కదా!(ఇదీ చదవండి: సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ) -
‘డ్రాగన్ మార్క్’ప్రతీకారం: జపనీస్ కంపెనీలపై చైనా ఉక్కుపాదం
బీజింగ్: జపాన్ను ఆర్థికంగా దెబ్బతీసే లక్ష్యంతో చైనా మరోమారు కఠిన చర్యలకు దిగింది. ఇరుదేశాల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం మరింత ముదిరింది. జపాన్కు చెందిన మరో 20 ప్రైవేట్ సంస్థలతో పాటు పలు పరిశోధనా కేంద్రాలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా నిఘా, ఎగుమతి ఆంక్షలను ప్రకటించింది. చైనా తయారీ వస్తువులు, సాంకేతికత జపాన్ సైనిక బలాన్ని పెంచడానికి ఉపయోగపడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజింగ్ స్పష్టం చేసింది.ఈ తాజా ఆంక్షల జాబితాలో జపాన్ రక్షణ రంగానికి యుద్ధనౌకలను సరఫరా చేసే మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలు, జపాన్ స్వయంరక్షణ దళాలు, తీరరక్షక దళాలకు సేవలందించే నిక్కో టోక్కి వంటి కీలక సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు నిర్మాణ రంగ పరికరాల తయారీ సంస్థ కొమాట్సు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ వంటి పరిశోధనా కేంద్రాలపైనా చైనా నిషేధం విధించింది. దుర్వినియోగమయ్యే (డ్యూయల్-యూజ్) ముడిసరుకులు, రేర్ ఎర్త్స్, బ్యాటరీలు, చిప్ తయారీ పరికరాలు ఈ సంస్థలకు అందకుండా చైనా అడ్డుకోనుంది. వీటితో పాటు డ్రోన్లు, అణు ఇంధన రంగాలకు చెందిన మరో 20 జపనీస్ సంస్థలను చైనా ప్రత్యేక నిఘా జాబితాలో చేర్చింది.తైవాన్ సంక్షోభంలో జపాన్ కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని జపాన్ ప్రధాని సనాయే తకైచీ చేసిన వ్యాఖ్యలు బీజింగ్కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీనికి ప్రతీకారంగానే చైనా విమాన సర్వీసులను తగ్గించడమే కాకుండా, రేర్ ఎర్త్స్ ఎగుమతులను నిలిపివేస్తూ జపాన్పై ఒత్తిడి పెంచుతోంది. తాజాగా చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: కశ్మీర్లో కలకలం: పోలియో ప్రకటనపై పాక్ నినాదం -
విధి లోయలోకి లాగితే... అదృష్టం వెనక్కి తీసుకొచ్చింది!
ఒక్క క్షణం ముందు వరకు అదొక సాధారణ ప్రయాణం.. మరుసటి క్షణమే మృత్యువుతో పోరాటం. కళ్లముందే కొండచరియలు విరిగిపడి బైక్తో సహా అతడిని లోయవైపు ఈడ్చుకెళ్లాయి. ‘అరే పాపం..’ అని అంతా అనుకునేలోపే.. ఏదో అద్భుతం జరిగినట్లు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. చావును కళ్లారా చూసి తిరిగి వచ్చిన ఈ ఉత్కంఠభరిత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈశాన్య భారతదేశాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారడమే కాకుండా.. తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. జూన్ 28న ఓ బైకర్ అత్యంత ఇరుకైన కొండ మార్గంలో జాగ్రత్తగా ప్రయాణిస్తున్నాడు. అప్పటికే రహదారిపై బురద పేరుకుపోయి, ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అయినా నెమ్మదిగా ముందుకు సాగుతుండగా.. ఒక్కసారిగా కొండచరియ విరిగిపడింది.ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే.. భారీ మట్టి, రాళ్లతో పాటు బైక్, బైకర్ కూడా లోయవైపు జారిపోయారు. కొన్ని క్షణాల పాటు అతడు మట్టిపెళ్లల మధ్య కనిపించకుండా పోవడంతో అక్కడున్నవారంతా ప్రాణాలు దక్కడం అసాధ్యమేనని భావించారు. కొండచరియలు కిందకు దూసుకెళ్లి అక్కడే ఓ నదిలో చేరడంతో భారీగా దుమ్ము, మట్టి మేఘాలు ఎగిసిపడ్డాయి.అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ బైకర్ సురక్షితంగా బయటపడ్డాడు. అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియోగా చిత్రీకరించగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అరుణాచల్ప్రదేశ్లోని లోయర్ సియాంగ్ జిల్లాలోని సీజీ లోయలో ఈ ఘటన చోటుచేసుకుంది.🇮🇳 Absolutely terrifying footage from India shows a biker being swept away as a massive landslide tears down a mountainside after relentless rain in Arunachal Pradesh.The landslide also blocked the Siji River.Against all odds, the biker survived without injuries. A miracle…— Mario Nawfal (@MarioNawfal) June 29, 2026వీడియో చూసిన నెటిజన్లు "ఇది రెండో జన్మ", "అతడి అదృష్టం అసాధారణం", "లాటరీ టికెట్ కొనాలి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో ప్రయాణించే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విధి తన పని చేయాలనుకుంది... అదృష్టం అడ్డొచ్చింది. క్షణాల్లో లోయలోకి జారిపోయిన ఆ బైకర్.. చివరి క్షణంలో చావునే మోసం చేసి సురక్షితంగా బయటపడ్డాడు అని ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు.ఈ ఘటన మరోసారి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాకాల ప్రమాదాల తీవ్రతను గుర్తు చేసింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు ఎప్పుడు విరిగిపడతాయో చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో.. అధికారులు అత్యవసరమైతే తప్ప కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. -
అన్నదాతలకు అభయహస్తం
సమాజానికి వెన్నెముక అయిన రైతులకు అధిక ప్రాధాన్యతిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. ‘రైతు భరోసా’తో రైతుల్లో పూర్తి విశ్వాసం కలిగిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నదాతలకు అభయం హస్తం అందిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ‘రైతు భరోసా’ అందించిన ప్రభుత్వం మరోసారి 2026 జూన్ 30న ఖరీఫ్ సీజన్కుగానూ ఇచ్చేందుకు సిద్ధమైంది.రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు వరంగల్ వేదికగా ‘రైతు డిక్లరేషన్’లో ప్రకటించిన విధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నా లకు బోనస్, రైతు బీమా, రైతు కూలీలకు ‘ఇందిరమ్మ భరోసా’ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుంది.ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ. 12 వేలు రైతు భరోసాగా అందిస్తోంది. 2025 జూ¯Œ లోనూ, 2026 మార్చిలోనూ 70 లక్షల మందికి అందించింది. మూడోసారి జూన్లో ఒకే విడతలో ఈ సాయం అందించనున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది. దీంతో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల మేలు చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సన్న వరికి బోనస్ అందించడంతో రాష్ట్రంలో సన్నాల సాగు 60 శాతం పెరిగింది. దేశంలోనే తొలిసారిగా రైతు కూలీలను గుర్తించి వారిలో విశ్వాసం కలిగించేలా ‘ఇందిరమ్మ రైతు భరోసా’ అందిస్తోంది. రైతు కుటుంబాలందరికీ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తూ వేల కోట్ల రూపాయలతో రైతు బీమా కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకా రాలు లభించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పంటలను కొనుగోలు చేస్తోంది.నిధులు దుర్వినియోగం కాకుండా...అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటే భరించలేని బీఆర్ఎస్ పార్టీ అక్కసుతో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. గతంలో వారి ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట ఎకరాకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తే... కాంగ్రెస్ సర్కార్ మరో రెండువేలు అధికంగా ఇస్తోంది. గత ప్రభుత్వ అవకతవకలు పునరావృతం కాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుత సర్కారు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. అందుకే ప్రజా నిధులు దుర్వినియోగం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడని భూములకు రైతుబంధు పథకం కింద రూ. 22 వేల కోట్లకుపైగా చెల్లించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసింది.రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా సమన్యాయం జరి గేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమిలేని రైతు కూలీలకు ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారకూడదని, వారిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘వరంగల్ డిక్లరేషన్’లో ప్రకటించినట్టు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏటా రూ. 12 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ యజ్ఞంలో పాల్గొనేవారందరికీ న్యాయం చేసినట్టయ్యింది.శుభప్రదమైన ఏరువాక పౌర్ణమి మరుసటి రోజు జూన్ 30న ప్రభుత్వం నిర్వహించనున్న రైతు భరోసా పంపిణీ మరోసారి అన్న దాతల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా నిలవనుంది. రైతు సంతోషమే రాష్ట్ర సుభిక్షతకు పునాది అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.- బి. మహేశ్ కుమార్ గౌడ్, వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
250 మందికి ఒకటే బాత్రూమ్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఇందులో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకే మరుగుదొడ్డి ఉంది. ఇంటర్వెల్ సమయంలో బాలికలు ఇలా క్యూ కడుతున్నారు. బాలురు కాంపౌండ్ వాల్ దాటి ఆరుబయటకు వెళ్తున్నారు. ‘మన ఊరు – మన బడి’కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. కానీ బిల్లులు రాకపోవడం కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే వదిలేశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
సీఎం విజయ్లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ
నటుడు సూర్య స్టార్ హీరోగా రాణిస్తూ తన అగరం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈయన కూడా హీరో విజయ్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రిలా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలాన్నిచ్చేలా ఆదివారం చెన్నైలో జరిగిన సూర్య అఖిల ఇండియా అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహించిన రాష్ట్ర జిల్లా స్థాయి చర్చా సమావేశంలో ఆర్.వీరమణి.. నటుడు సూర్య రాజకీయ ప్రవేశం తథ్యం అని అన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్')సూర్య పొలిటికల్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీంతో అఖిల భారత సూర్య అభిమానుల పరిరక్షణ సంఘం నిర్వహకులు స్పందించారు. ఆర్.వీరమణి చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని, నటుడు సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.సూర్య కెరీర్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ లేదు. గత నెలలో విడుదలైన 'వీరభద్రుడు' మూవీ తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ తమిళంలో మాత్రం అద్భుతమైన హిట్ అయింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆగస్టులో 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో రాబోతున్న సూర్య.. మరోవైపు దర్శకుడు జీతూ మాధవన్ తీస్తున్న ఓ మూవీలో పోలీస్గా చేస్తున్నారు. నిన్ననే 'సలార్' నిర్మాతలతో కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్నప్పుడు ప్రాక్టికల్గా చూసుకున్న సూర్య.. రాజకీయాల్లోకి రావడం అనేది అసాధ్యం.(ఇదీ చదవండి: అంత్యక్రియల ప్రదేశాన్ని సర్కస్లా చేసేశారు.. రాధిక అసహనం) -
నేడే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్కప్ 2026లో నేడు (జూన్ 30) తొలి సెమీఫైనల్ జరుగనుంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓ సారి ఛాంపియన్ అయిన వెస్టిండీస్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్లో వెస్టిండీస్ అండర్ డాగ్ హోదాలో బరిలోకి దిగి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ దశలో అజేయ జట్టుగా ఫైనల్-4కు చేరింది. వెస్టిండీస్ తమ చివరి రెండు గ్రూప్ మ్యాచ్ల్లో (ఇంగ్లండ్, ఐర్లాండ్) చేతుల్లో ఓడినా సెమీస్కు చేరడం ఆసక్తికర పరిణామం.ఆస్ట్రేలియా విషయానికొస్తే.. ఈ జట్టు టీమిండియా సెమీస్ ఆశలను ఆవిరి చేసి ఫైనల్-4కు చేరింది. తమ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్పై విజయం సాధించడంతో సౌతాఫ్రికాకు సెమీస్ బెర్త్ దక్కింది. జులై 2న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-బి టాపర్ ఇంగ్లండ్తో సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటుంది. విండీస్-ఆసీస్ తొలి సెమీఫైనల్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు ముందు విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ టోర్నీలో తాము అండర్ డాగ్స్ అని చెప్పుకుంటూ, అదే తమ బలమని పేర్కొంది."మా నుంచి ఎవరూ విజయం ఆశించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. నేటి సెమీఫైనల్లో ఒత్తిడి అంతా ఆస్ట్రేలియాపైనే ఉంటుంది. వాళ్లు గెలవాల్సిందేనని అందరూ భావిస్తున్నారు. కానీ మేం గెలిస్తే మాత్రం అది సంచలనం అవుతుంది. అందుకే మేం నిర్భయంగా ఆడగలం.వెస్టిండీస్ గతంలో ఎన్నోసార్లు అంచనాలను తలకిందులు చేసింది. ముఖ్యంగా ప్రపంచకప్లలో తమ జట్టు ప్రత్యేకంగా రాణిస్తుంది. తమను తక్కువ అంచనా వేయడం ఆటగాళ్లలో మరింత పోరాటస్ఫూర్తిని పెంచుతుంది" అని చెప్పింది.ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "ఆ మ్యాచ్లో మేం ఒత్తిడికి లోనయ్యాం. కానీ ఎవరైనా మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే, మాలో మరో రకమైన జోష్ కనిపిస్తుందని వివరించింది. -
ఏసీబీ అన్నా.. ఏం భయం లేదన్నాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అనగనగా ఒక రైతు. ఆయన పొలానికి మట్టి తరలింపు అనుమతికి ఓ ఉద్యోగి లంచం అడిగాడు. ఇలాగే లంచం అడిగిన ఓ అధికారిని ఏసీబీకి పట్టించానని రైతు హెచ్చరించాడు.. కానీ అవినీతి అధికారి తేలిగ్గా తీసుకున్నాడు.. లంచం ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పాడు.. రైతు నుంచి రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాలివి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈఈగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్.శ్రీనివాస్ను ఓ రైతు తన పొలానికి చెరువు మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. కొద్ది రోజులుగా తిరుగుతుండగా, మట్టి తరలింపునకు రూ.4 లక్షలు ఇవ్వాలని ఏఈఈ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చివరకు రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. ఈ మేరకు సోమవారం రాత్రి కార్యాలయంలో బాధిత రైతు నుంచి ఏఈఈ రూ.2 లక్షలు తీసుకుని తన డెస్క్లో పెట్టుకోగా.. ఏసీబీ అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకోవడంతో ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ పేరు చెప్పినా..:ఏఈఈ శ్రీనివాస్ను ఇంకొందరు రైతులు కూడా చెరువుల నుంచి మట్టి తరలింపునకు అనుమతి ఇవ్వాలని కోరితే లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే, ఇదే రైతు తాను గతంలో ఓ ఉద్యోగిని ఏసీబీకి పట్టించానని చెప్పినా.. లంచం ముట్టచెబితే తప్ప అనుమతి ఇచ్చేది లేదని శ్రీనివాస్ తెగేసి చెప్పినట్లు సమాచారం -
విశ్రాంత స్వాంతుడు..
దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై ఉంటుంది. రత్నము తన నైజగుణంగా ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచంలో ప్రకృతి సిద్ధములు, మానవ నిర్మితములు అయినట్టి వివిధ వస్తు సముదాయములు అన్నీ ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా దృష్టి గోచరములు అవుతాయో, ఆ విధముగానే కేవలం అణుమాత్రమైన పరమాత్మునిలో జగములన్నియు నిండి ఉండి సంచరిస్తూ ఉంటాయి.మనిషి అనుభవించే సుఖానికైనా, దుఃఖానికైనా ఆ మనిషి మనసులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను తగిన విధంగా కట్టడి చేసి అదుపులో పెట్టుకోకుంటే కొండంతగా ధనమున్నా, కోట్లకు పడగలెత్తిన మిత్రులు ఎంత మంది ఉన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టుకున్నా, మనశ్శాంతి మాత్రం కరవైనదిగానే మిగులుతుంది.కం. సంతోషము సుఖతరమగు, /సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్, సంతుష్టుండెందును వి / శ్రాంతస్వాంతుండు, రామ సౌజన్యనిధీ!మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాలకు మూలం. ప్రయత్నం చేసి మనసుని దుఃఖం వైపునకు మరలకుండా చేయడాన్ని సాధించాలి. అనవసరమైన దిగులుని దరిచేరనీయకుండా చూసుకుంటూ, మనసును ఆనందంగా ఉంచుకోవడం వలన సుఖశాంతులు దక్కుతాయి. విశ్రాంత స్వాంతుడు మోక్షప్రాప్తికి దగ్గరివాడౌ తాడు– అని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠ రామాయణము’, ప్రథమాశ్వాసములోని పై పద్యంలో చెప్పబడిన మాటలు వెలలేనివి. మానసిక ప్రశాంతతను కోరుకునే మనుషులకు అవి బహుదా ఆచరణీయములైనట్టివి. – భట్టు వెంకటరావు -
వివాహేతర సంబంధం.. భర్తను లేపేసిన భార్య..!
దేవరకద్ర రూరల్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు భర్తను బలితీసుకున్నాయి. భర్తపై కత్తితో దాడిచేసి భార్య హతమార్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాయపల్లికి చెందిన కుర్వ నాగేశ్ (38)కు కోయిల్కొండ మండలం మల్కాపూర్కు చెందిన కవితతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. నాగేశ్ గొర్రెల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అతడికి అనుమానం కలగడంతో దంపతులిద్దరి మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాగేశ్ పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ, మద్యానికి బానిస కావడంతో కుటుంబ కలహాలు మరింత తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న నాగేశ్కు కవితకు మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నాగేశ్పై కవిత కత్తితో దాడికి పాల్పడింది. ఈ సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్న చిన్న కుమారుడు రాము తండ్రి ఆర్తనాదాలు విని మేల్కొన్నాడు. తండ్రిపై తల్లి దాడి చేస్తుండటాన్ని చూసి భయంతో బయటకు వచ్చి కేకలు వేశాడు. బయట నిద్రిస్తున్న ఇతర కుటుంబసభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకోగా అప్పటికే నాగేశ్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తన వదినకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతోనే గొడవలు జరుగుతున్నాయని, అదే కక్షతో తన అన్నపై కత్తితో దాడిచేసి హతమార్చిందని మృతుడి సోదరుడు రాజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం
సాక్షి, నల్గొండ జిల్లా: కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. భీమవరం నుండి హైదరాబాద్ వెళుతున్న ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు.. టైర్ పంక్చర్తో అదుపుతప్పి.. డివైడర్ను దాటి విజయవాడ వెళ్తున్న లారీని ఢీకొట్టింది.బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరికిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్ను బయటకుతీశారు. ట్రావెల్స్ బస్సు, లారీ డ్రైవర్లకు గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు ముప్పు తప్పింది.విశాఖలో కంటైనర్ బోల్తావిశాఖలోని షీలా నగర్ జంక్షన్లో కంటైనర్ లారీ బోల్తా పడింది. గాజువాక నుంచి పోర్టుకు వెళ్తున్న లారీ అదుపు తప్పింది. ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.నెల్లూరు జిల్లాలో..నెల్లూరు జిల్లాలో సంగం మండలం తరుణవాయు దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి నెల్లూరు రొట్టెల పండగకు వస్తుండగా ఘటన జరిగింది. యాత్రికుల టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
టీమిండియా మాజీ ఓపెనర్కు భారీ కాంట్రాక్ట్
భారత మాజీ ఓపెనర్, దేశీయ క్రికెట్ దిగ్గజం వసీం జాఫర్కు భారీ కాంట్రాక్ట్ లభించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమ అన్ని విభాగాల జట్లకు అతన్ని మెంటార్గా నియమించింది. ఈ పదవిలో జాఫర్ రెండేళ్ల పాటు కొనసాగుతారు. జాఫర్ నియామకాన్ని హెచ్సీఏ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు.జాఫర్ నియామకంలో ఇటీవల హెచ్సీఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా బాధ్యతలు చేపట్టిన మరో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. క్రికెట్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని రాయుడుకే అప్పగించడంతో ఆయన సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్సీఏ వర్గాలు తెలిపాయి.48 ఏళ్ల జాఫర్ భారత తరఫున 31 టెస్టులు, 2 వన్డేలు ఆడారు. భారత దేశీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోచింగ్లోనూ మంచి అనుభవం ఉన్న జాఫర్ గతంలో ఉత్తరాఖండ్ జట్టుకు హెడ్ కోచ్గా, గత సీజన్లో విదర్భ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా పనిచేశారు. అలాగే బంగ్లాదేశ్ జాతీయ జట్టు, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో కూడా కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.రెండుసార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన హైదరాబాద్ (1937-38, 1986-87) ఇటీవలి కాలంలో దేశీయ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. 2025-26 రంజీ ట్రోఫీలో ఎలైట్ గ్రూప్-బిలో నాలుగో స్థానంలో నిలిచిన ఆ జట్టు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూపర్ లీగ్ దశలో నెట్ రన్రేట్ కారణంగా ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. విజయ్ హజారే ట్రోఫీలోనూ క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో జాఫర్ అనుభవం హైదరాబాద్ జట్టును మళ్లీ విజయాల బాట పట్టించగలదని హెచ్సీఏ ఆశిస్తోంది. -
Hyderabad: కార్ ఆపి ఉంటే ఫ్యామిలీ రిస్క్లో ఉంటుండే..
హైదరాబాద్: కార్లలో వెళ్తున్న మహిళలను పోకిరీలు వెంబండించి భయాందోళనకు గురిచేశారు. కార్ డ్యాష్ క్యామ్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. బోడుప్పల్కు చెందిన ఓ కుటుంబం ఓ ఫంక్షన్కు వెళ్లి ఘట్కేసర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి మీదుగా కారులో తిరిగి వస్తోంది.ఆ సమయంలో కొందరు వ్యక్తులు కత్తులు, ఆయుధాలతో వెంబడించారు. దీంతో కారులో ఉన్న మహిళలు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఘట్కేసర్ వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా చోటు చేసుకుంది. ఈ దృశ్యాలన్నీ కారు డ్యాష్ క్యామ్లో రికార్డయ్యాయి. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నడి రోడ్డుపై కారును వెంబడిస్తూ పోకిరీల హల్చల్హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ నుండి బోడుప్పల్ హైవే మీద అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్లి కారులో వస్తున్న కుటుంబాన్ని బైక్లపై వెంబడిస్తూ, భయబ్రాంతులకు గురిచేసిన పోకిరీలుకారు డ్యాష్ క్యామ్లో రికార్డైన దృశ్యాలు కారులో మహిళలు,… pic.twitter.com/vmuyB3yIN5— Telugu Scribe (@TeluguScribe) June 29, 2026 -
కశ్మీర్లో కలకలం: పోలియో ప్రకటనపై పాక్ నినాదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖలో ఊహించని పరిణామం తీవ్ర కలకలం రేపింది. అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ఒక కరపత్రంలో పొరుగు దేశానికి సంబంధించిన నినాదం కనిపించడం అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక అనధికారిక పోలియో నినాద పత్రంపై జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘పోలియో ఫ్రీ పాకిస్తాన్’ అనే నినాదంతో కూడిన ఈ వివాదాస్పద కరపత్రం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడంతో, ఉన్నతాధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి అత్యవసర విచారణకు ఆదేశించారు.రాజౌరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్-2026కు సంబంధించిన ఒక ప్రకటన సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవ్వడాన్ని గుర్తించారు. ఈ కరపత్రం బ్లాక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ) కార్యాలయం ద్వారా అధికారికంగా ప్రచురించినట్లు ఉంది. దీనిపై తీవ్రంగా స్పందించిన రాజౌరి సీఎమ్ఓ, సదరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్కు తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.ఈ కరపత్రాన్ని పరిశీలించిన అధికారులకు అందులో నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ లోగోతో పాటు ‘పోలియో ఫ్రీ పాకిస్తాన్’ అనే టెక్స్ట్ కనిపించింది. ఈ లోగో లేదా నినాదానికి జమ్ముకశ్మీర్ ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యా విభాగంతో కానీ, లేదా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కానీ ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ పత్రంలో సదరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ పేరు, అధికారిక హోదా స్పష్టంగా ముద్రించి ఉండటం గమనార్హం.ఇది కూడా చదవండి: ముంబై ఘటన: జింక్ ఫాస్ఫైడ్ అంత ప్రమాదకరమా? -
తమిళనాడు సీఎం విజయ్ సంచలన ఆదేశం
సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన పాలనా శైలితో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన.. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ జోక్యానికి తావులేకుండా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, నేరస్తులు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించవద్దని అధికార యంత్రాంగానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, కమిషనర్లు, ఐజీలు, డీఐజీలు సహా రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం విజయ్ రెండు రోజుల ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. నామక్కల్ కవింజర్ మాళిగైలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొన్నారు. మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, వ్యవస్థీకృత నేరాల అణచివేతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు.సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం అధికారులను ఉద్దేశించి విజయ్ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి శక్తిమంతులైనా, ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నవారైనా నిష్పాక్షికంగా చట్టప్రకారం శిక్షించాలి. అమాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదు అని అధికారులను ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించాలని సూచించారు.మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం విజయ్ స్పష్టం చేశారు. మహిళలపై నేరాలు, పోక్సో కేసుల విచారణలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, విద్యార్థులు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో నిఘా పెంచి డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు.రాష్ట్రాన్ని 'డ్రగ్స్-ఫ్రీ తమిళనాడు'గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని విజయ్ ప్రకటించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, అక్రమ మద్యం తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు, ఖనిజాల స్మగ్లింగ్, వ్యవస్థీకృత నేరాలపై రాజీపడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, వాటి మూలాలను గుర్తించి ముందస్తుగా అడ్డుకోవడంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.రౌడీషీటర్లు, బెయిల్పై బయట ఉన్న నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజయ్ ఆదేశించారు. సైబర్ నేరాలు, కుల ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించేలా యంత్రాంగం పనిచేయాలని పేర్కొన్నారు. భూ వివాదాలు హింసాత్మక ఘటనలకు దారితీయకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక పరిష్కార కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు. తాగునీరు, వైద్యం, విద్య, విద్యుత్, ప్రజా రవాణా వంటి మౌలిక సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.మూడు విడతల్లో జరుగుతున్న ఈ ఉన్నతస్థాయి సదస్సులో తొలి రోజు కలెక్టర్లు, పోలీసు అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. రెండో రోజు జిల్లాల అభివృద్ధి పనులపై కలెక్టర్లతో, అనంతరం పోలీసు అధికారులతో సీఎం విజయ్ విడివిడిగా సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశాల ముగింపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కలెక్టర్లు, పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులను సీఎం విజయ్ స్వయంగా సత్కరించి పురస్కారాలు అందజేయనున్నారు.అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలన, శాంతిభద్రతలు, మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై సీఎం విజయ్ తీసుకుంటున్న కఠిన వైఖరి తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన పాలనా శైలి ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. -
అందమైన జుట్టు కోసం.. తలకట్టు.. దీర్ఘమూ..!
చిన్నప్పుడు అక్షరాలు దిద్దే టైమ్లో తలకట్టూ, దీర్ఘం చదువుకుంటాం. స్టైల్గా అక్షరంపైన స్టైల్గా, ఠీవిగా ఉండే దాన్ని తలకట్టు అంటాం కదా. అలా తలపైనా అందంగా, స్టైల్గా ఉండేజుట్టునీ తలకట్టు అంటాం. అమ్మాయిల అందం ఇనుమడించాలంటే ఆ తలకట్టు పొడవుగా, సు‘దీర్ఘం’గా ఉండాలి. చదువుకుంటూ అక్షరాలు దిద్దినప్పుడు ఉండే ఆ తలకట్టూ, దీర్ఘాలే యుక్తవయసు దాటాక కూడా కొనసాగాలనేది టీనేజ్ నుంచీ యువతీయువకులందరి కోరిక.ఇక అమ్మాయిలూ మహిళలూ కోరుకునేది మంచి పొడవాటి జడ. ఒకవేళ ఈ రోజుల్లో జడ ఎవరూ వేసుకోవడం లేదనుకున్నా... జలపాతంలా జారిపోయే మృదువైన పొడవైన జుట్టు. మంచి అందమైన, పొడవైన జుట్టుకోసం అమ్మాయిలూ, హీరో లాంటి లూక్ కోసం అబ్బాయిలూ... ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతుంటారో లేక్కేలేదు. మాటల్లో ‘ఆఫ్టరాల్ వెంట్రుక...’ అంటూ వ్యవహరించే ఈ జుట్టు కోసం కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుందంటే అతిశయోక్తే కాదు. ఆ జుట్టు ఎందుకు, ఎలా పెరుగుతుంటుంది, ఎందుకు రాలుతుంది అలా రాలకూడదంటే ఏం చేయాలి లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల సమాహారమే ఈ కథనం.జుట్టు, రోమాలు, తలకట్టు, వెంట్రుకలు, అందమైన భాషలో కురులు అంటూ పిలిచే ఆ నల్లటి, సన్నటి, పొడవైన తీగలాంటి జుట్టు నిర్మాణం నిజానికి చాలా సంక్లిష్టం. చూడ్డానికి సింపుల్గా కనిపించే ఆ జుట్టు కథ ఏమిటో, ఎలా పుడుతుందో, దానికి వచ్చే రకరకాల సమస్యలేమిటన్న అనేక అంశాలను విపులంగా తెలుసుకుందాం.జుట్టు ఎలా పెరుగుతుందంటే... ప్రతిరోజూ వెంట్రుక 0.3 మి.మీ. నుంచి 0.4 మి.మీ. వరకు పెరుగుతుంది. అంటే ఏడాదికి దాదాపు ఆరు అంగుళాలు పెరుగుతుంది. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి.కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలోనే ఉంటుంది. నిజానికి వెంట్రుక పెరుగుదలలో ఇదో సంధి దశ. ఈ దశలో వెంట్రుక 2 – 3 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండటం వల్ల దానిలో పెరుగుదల ఏమాత్రం ఉండదు.టిలోజెన్ : మన మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. ఈ దశ మాడుపై ఉన్న వెంట్రుకలలో సాధారణంగా 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక కనుబొమలు, కనురెప్పలు, బాహుమూలాల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ మరింత దీర్ఘకాలం ఉంటుంది. ఈ దశలోనే వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ దశలో ఉన్నప్పుడు పీకితే వెంట్రుక కింద దాని గసగసాల్లా ఉండే గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది.అనాజెన్ : వెంట్రుక పెరుగుదల తాలూకు దశలన్నింటిలోనూ అనాజెన్ చురుకైన దశ. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. ఈ పెరుగుదల ఇలా రెండు నుంచి ఆరేళ్లు కొనసాగుతుంది. కొందరిలో ఆ వ్యవధి తర్వాత వెంట్రుక అదే వేగంతో పెరగదు. కొంత పొడవు పెరిగి ఆగిపోతుంది. అయితే తల మీద ఉన్న వెంట్రుకలు రెండు నుంచి ఆరేళ్లు పెరుగుతాయి. బాహుమూలాల్లో, కాళ్లపైనా, కనుబొమలు, కనురెప్పపై ఉండే వెంట్రుకల్లో ఈ వ్యవధి 30–45 రోజులు మాత్రమే ఉంటి, ఆ తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. ఈ కారణం వల్లనే ఈ ప్రాంతాల్లోని వెంట్రుకలు మాడుపై ఉండే వెంట్రుకలంతగా పెరగవు.వెంట్రుకల తీరుతెన్నులు : కొందరిలో వెంట్రుకలు స్ట్రెయిట్గా పెరుగుతాయి. ఇలా పెరిగే వారి జుట్టు సాఫీ (స్ట్రెయిట్)గా ఉంటుంది. అదే కొందరిలో జుట్టు పెరుగుతున్న కొద్దీ వెంట్రుక ఒంపు తిరుగుతుంటుంది. ఇలా జరిగేవారికి రింగులు రింగులుగా ఉండే ఉంగరాల జుట్టు వస్తుంది. వెంట్రుకను అడ్డుగా కోసినప్పుడు ఆ అడ్డుకోత గుండ్రంగా ఉంటే అది సాఫీగా (స్ట్రెయిట్)గా పెరుగుతుంది. అదే ఒకవేళ ఆ అడ్డుకోత దీర్ఘవృత్తంలా ఉంటే అది రింగులుగా పెరుగుతుంది. సాఫీగా (స్ట్రెయిట్గా) ఉండే జుట్టుకు... అడుగున ఉండే సబేషియస్ గ్రంథి నుంచి పోషకాలు సాఫీగా అందుతాయి. దాంతో ఇవి మరింత జీవంతో ఉంటాయి. ఇలా కనిపించడం కోసమే చాలామంది జుట్టును తిన్నగా ఉండేలా (హెయిర్ స్రెయిటెనింగ్) చేయించుకుంటుంటారు. అదే ఉంగరాల్లా తిరిగే జుట్టు వారిలో పోషకాలు చివరివరకూ చేరడానికి కాస్త అడ్డంకులు ఉండటంతో పొడవు జుట్టు ఉన్నవారి కంటే ఉంగరాల జుట్టు కాస్తంత మెరుపు తక్కువగా ఉంటుంది.జుట్టు రాలడానికి కారణాలు శారీరక ఒత్తిడి : రోజూ తీవ్రమైన శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటి అంశాలు జుట్టులో భౌతికంగా మార్పులు తెచ్చి వాటిని రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్ వైపునకు ప్రయాణం కొనసాగి, టిలోజెన్ దశ దీర్ఘకాలం కొనసాగుతుంది. దాంతో తలపై జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చిగా కాకుండా ఎండిపోయినట్లుగా ఉండటాన్ని గమనించవచ్చు.పరిష్కారం ఇలా : ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.గర్భధారణ తర్వాత : చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలిపోయి మాడుపై జుట్టు బాగా పలచబారిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. ఈ దశలో మహిళల శారీరక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. ఆ సమయంలో జుట్టుకు అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లు కడుపులోని బిడ్డకు అందడంతో ఇలా పోషకాలు జట్టుకు అందకుండాపోతాయి. పరిష్కారం ఇలా : తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్లు జుట్టుకు అందే విధంగా చూడటం వల్ల దీన్ని అరికట్టవచ్చు.ప్రోటీన్ లోపాలతో : ప్రోటీన్లోపం కారణంగా జుట్టు రాలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఇలాంటివారు తమ ఆహారంలో తగినంతగా ప్రోటీన్ తీసుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రోటీన్లే అమైనో ఆసిడ్స్గా మారి జుట్టు పెరుగుదలకూ, రిపేర్లకూ ఉపయోగపడతాయి.పరిష్కారం ఇలా : ఈ కారణంతో జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారమైన చేపలు, గుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శాకాహారులైతే ప్రోటీన్ మోతాదులు ఎక్కువగా ఉండే... గ్రీన్పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి.విటమిన్–ఏ మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల : ఆహారంలో విటమిన్–ఏ మోతాదులు మరీ ఎక్కువైతే కూడా జుట్టు రాలుతుంది. విటమిన్–ఏ మనకు ప్రతిరోజూ 5000 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) అవసరం. ప్రతిరోజూ విటమిన్–ఏ ను 10,000 ఐయూ కంటే ఎక్కువగా తీసుకునేవారు దాన్ని అదేపనిగా చాలాకాలం పాటు తీసుకుంటూ ఉంటే జుట్టు రాలే అవకాశాలు ఎక్కువ.పరిష్కారం ఇలా : విటమిన్–ఏ టాబ్లెట్లు తీసుకునేవారు కేవలం డాక్టర్ల సలహా మేరకు మాత్రమే, వారు నిర్ణయించిన మోతాదులోనే తీసుకోవాలి. హార్మోన్ లోపాల (హార్మోనల్ ఇంబ్యాలెన్స్) వల్ల : సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిళల్లో ఎక్కువ. స్త్రీలలో కూడా పురుష హార్మోన్ అయిన టెస్టో స్టెరాన్ కొద్ది మోతాదులో స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా స్రవిస్తుంది. ఇది జుట్టు రాలిపోడానికి ఒక కారణమవుతుంది. హైపోథైరాయిడిజమ్ కండిషన్ కూడా జుట్టు రాలడానికి మరో కారణం.పరిష్కారం ఇలా : పీసీఓఎస్తో బాధపడే మహిళలు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా... అలాగే హైపోథైరాయిడిజమ్తో బాధపడేవారు థైరాక్సిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం జుట్టు రాలడం తగ్గవచ్చు.కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ల వల్ల : తమ సొంత వ్యాధి నిరోధకశక్తే తమకు దేహంపై ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్గా చెబుతారు. ఉదాహరణకు...పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల... మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్లుగా కనిపిస్తుంటాయి.లైకెన్ ΄్లానస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది. ∙లూపస్ అనే మరో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం ఇలా : ఆటోఇమ్యూన్ కారణాల వల్ల జుట్టు రాలిపోవడాన్ని నివారించడానికి డ్యాప్సోన్ అనే మందులు కొంతవరకు పనిచేస్తాయి.ఏయే మందులతో జుట్టు రాలవచ్చు...మొటిమలకు వాడే మందులు (ఆక్నే మెడిసిన్స్),కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు,యాంటీ డిప్రెసెంట్స్నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు,రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్ (బ్లడ్ థిన్నర్స్),యాంటీకొలెస్ట్రాల్ మందులు ∙ఇమ్యునోసప్రెసెంట్స్,కీమోథెరపీ మందులు.మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు,హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్,ఇంటర్ఫెరాన్స్,వేగంగా మారిపోయే మూడ్స్ను నియంత్రించడానికి వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు,నొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ మందులు,స్టెరాయిడ్స్, ∙థైరాయిడ్ మందులు.పరిష్కారం ఇలా...మందులు వాడటం మానేయగానే సాధారణంగా జుట్టు మళ్లీ రావచ్చు.జుట్టు రాలడం మరీ ఎక్కువగా ఉంటే కొన్ని మందులు వాడటం ద్వారా.జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ద్వారాకీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్లోకి అంతగా ప్రవేశించదు. ఇలా చల్లబరిచే ప్రక్రియ హెయిర్ ఫాలికిల్ను కాస్త నెమ్మదించేలా చేసి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.స్కారింగ్ అలొపేషియా : ఈ సమస్య కారణంగా దాదాపు మూడు శాతం మందిలో జుట్టు రాలిపోతుంటుంది. ఇలా రాలిపోయే జుట్టు మళ్లీ రాదు. ఎందుకంటే ఇందులో ఫాలికిల్ శాశ్వతంగా దెబ్బతింటుంది. ఆ స్థానంలో స్కార్ కణజాలం భర్తీ అవుతుంది. అందుకే ఈ కారణంగా జుట్టు రాలిపోతే అది మళ్లీ మొలవదు. ఇలా జుట్టు రానప్పుడు అది ప్యాచ్లు ప్యాచ్లుగా ఉండి, ఆ ప్యాచులు క్రమంగా పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిన చోట కనిపించే ప్యాచ్లలో దురద, మంట, నొప్పి కూడా ఉండవచ్చు. డిసెక్టింగ్ సెల్యులైటిస్, ఇసినోఫిలిక్ పస్ట్యూల్ ఫాలిక్యులైటిస్, ఫాలిక్యులార్ డీజనరేషన్ సిండ్రోమ్, లైకెన్ ΄్లానో పైలారిస్, సూడోపెలేడ్ ఆఫ్ బ్రాక్ అనే కండిషన్లు... స్కారింగ్ అలొపేషియాకు కారణమవుతాయి.జుట్టును రాల్చే ఇన్ఫెక్షన్లు...రింగ్వార్మ్ : ఇది ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ కండిషన్ను టీనియా కాపిటిస్ అంటారు. ఇది ఫంగస్ కారణంగా మాడుపై వస్తుంది. మొదట చిన్న మొటిమలా వచ్చి క్రమంగా పరిమాణం పెరుగుతూ పోతుంది. విస్తరించిన చోట పొలుసుల్లా వచ్చి... ఆ ప్రదేశంలో తాత్కాలికంగా జుట్టు మొలవదు.చికిత్స: టెర్బినఫిన్, ఫ్లుకోనజోల్, గ్రీషియోఫల్విన్, ఇట్రాకొనజోల్ వంటి యాంటీఫంగల్ మందులతో చికిత్స చేయవచ్చు.ఫాలిక్యులైటిస్ : ఇది జుట్టు ఫాలికిల్ (అంకురాల్లో) ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి) వచ్చే కండిషన్. ఇది వచ్చినవారిలో వెంట్రుక మొదల్లో ఎర్రటి పొక్కులు వచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఇది స్టెఫలోకాకస్, సూడోమొనాస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది.చికిత్స : యాంటీబయాటిక్ మందులతో దీన్ని తగ్గించవచ్చు.పీడ్రా : ఇది వెంట్రుకకు వచ్చే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్.డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ : ఇది కనురెప్పల వెంట్రుకలను ప్రభావితం చేసే కండిషన్. ఈ జబ్బుకు దారితీసే సూక్ష్మజీవి కనురెప్పలను మెరిసేలా చేసే నూనెను ఎక్కువగా స్రవించేలా చేయడం వల్ల ఈ రుగ్మత వస్తుంది.సెబోరిక్ డర్మటైటిస్ : వాస్తవానికి ఇది ఇన్ఫెక్షన్ కాని కండిషన్. ఈ కండిషన్లో చర్మం పగుళ్లు ఫంగల్ ఇన్ఫెక్షన్తో పాటు కలిసి వస్తాయి. ఈ పరిస్థితిని సల్ఫర్, సెలీనియమ్ సల్ఫైడ్, జింక్ పైరోథియాన్ (జడ్పీటీఓ), తార్, శాల్సిలిక్ ఆసిడ్ లేదా ఆయిల్ ఆఫ్ లేడ్, కార్టికోస్టెరాయిడ్ లోషన్లతో చికిత్స చేసి, నియంత్రణలోకి తెస్తారు.వెంట్రుక తీగ (షాఫ్ట్)కు వచ్చే లోపాలు...వెంట్రుకలో మనకు పైకి కనిపించే తీగ వంటి భాగాన్ని షాఫ్ట్ అంటారు. ఈ లోపాలకు ప్రధాన కారణం జన్యుపరమైనవి. వాటిలో కొన్ని...లూజ్ అనాజెన్ సిండ్రోమ్ : దీన్నే లూజ్ హెయిర్ సిండ్రోమ్ అంటారు. దీని పేరే దీని వల్ల కలిగే లోపాన్ని సూచిస్తుంది. అంటే అనాజెన్ దశలో వెంట్రుక వదులుగా అయి చిన్నగా లాగినా ఊడి వచ్చేస్తుంది. ముఖ్యంగా యుక్తవయస్కులైన బాలికల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఇలా ఊడిన జుట్టు ఒకపట్టాన తేలిగ్గా మొలవదు. అందుకే మాడుపై జుట్టు పలచబారే అవకాశం ఉంది.పరిష్కారం : సాధారణంగా ఇలా ఊడిన జుట్టు దానంతట అదే రావాల్సిందే. చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదు.ట్రాక్షన్ అలొపేషియా: చాలామంది తల్లులు జడవేసే సమయంలో తమ పిల్లలకు జుట్టును బాగా లాగి టైట్గా జడవేస్తుంటారు. ఇలా చాలాకాలం పాటు జుట్టును చాలా బలంగా లాగుతుండటం వల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుంది.ట్రైకో టిల్లోమేనియా : ట్రైకో టిల్లోమేనియా అనే కండిషన్లో కొందరు తమ జుట్టును తామే బలంగా పీకేసుకుంటుంటారు. బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్నట్టుగానే ఈ సమస్య ఉన్నవారు తమ జుట్టు తామే పీకేసుకుంటుంటారు. వీళ్లు తమ కనురెప్పల వెంట్రుకలు, కనుబొమల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు.ట్రైకోఫేజియా : ఇది కూడా తమ జుట్టు తాము లాక్కోవడం లాంటిదే. అయితే ఈ రుగ్మత ఉన్నవారు అలా లాగిన జుట్టును తినేస్తుంటారు. ఇది చాలా తీవ్రమైన జబ్బు. ఇలాంటి వారికి తక్షణమే చికిత్స (ఎమర్జెన్సీ ట్రీట్మెంట్) ఇవ్వడం అవసరం. చివరగా... జుట్టు రాలుతున్నప్పుడు వెంట్రుకలకు ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని... ఆ మేరకు చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల వైద్యపరంగా తగిన విద్యార్హతలు లేనివారు జుట్టుకు చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతినడం లేదా రాలిపోవడం జరగవచ్చు. అందుకే తమ జుట్టు సమస్యలకు తగిన విద్యార్హతలు ఉన్న నిపుణలను సంప్రదించడం అన్న జాగ్రత్త తీసుకోవడం మంచిది.తొలి రోమం పుట్టేదిలా... బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం తాలూకు 22వ వారంలోనే వెంట్రుక మూలాలు చిన్నారి తాలూకు దేహమ్మీద ఆవిర్భవిస్తాయి. వాటిని ఫాలికిల్స్ అంటారు. అంటే పుట్టుకకు ముందే బిడ్డ శరీరంపై 50 లక్షల ఫాలికిల్స్ ఉంటాయి. వీటిల్లో పదిలక్షలు తల (మాడు) మీద ఉంటాయి. పుట్టుకకు ముందు ఈ ఫాలికిల్స్ (వెంట్రుక మూలాలు) ఎన్ని ఉంటాయో జీవితాంతం అన్నే ఉంటాయి. అంతేతప్ప వీటి సంఖ్య జీవితకాలంలో ఎప్పుడూ పెరగదు. పైగా వ్యక్తులు పెరుగుతున్నకొద్దీ వీటి సంఖ్య తగ్గుతూ పోతుంది.వెంట్రుక నిర్మాణం ఇలా... వెంట్రుకను ప్రధానంగా రెండు భాగాలుగా చెప్పవచ్చు. అదే మాడు మీది చర్మం లోపల ఉండే ‘అంకురం’ (బల్బ్) భాగం. ఇక మనకు బయటకు కనిపించే భాగాన్ని ‘వెంట్రుక’ (షాఫ్ట్) అంటారు. ఇలా వెంట్రుకలో బల్బ్ అలాగే షాఫ్ట్ అని రెండు భాగాలుంటాయి.బల్బ్ అని పిలిచే ఈఅంకురంలో అనేక పొరలు ఉంటాయి. అంకురం లోపల ఒక మోలక(్రపొజెక్షన్)లా ఉండే భాగాన్ని పాపిల్లా అంటారు. దీనికి రక్తసరఫరా ఉంటుంది. వెంట్రుకలో జీవంతో ఉండే భాగం ఇదే. ఈ బల్బ్లో ఎప్పుడూ కణవిభజన జరుగుతూ ఉంటుంది. ఇంత వేగంగా శరీరంలోని మరేప్రాంతంలోనూ కణవిభజన జరగదు. ప్రతి 23 నుంచి 72 గంటలకొకసారి కణాల విభజన జరుగుతూ ఉండటం వల్ల వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి అంకురం పక్కనే ఒక గ్రంథి ఉంటుంది. దాన్ని ‘సబేషియస్ గ్రంథి’ అంటారు. ఇది నూనెలాంటి ద్రవాన్ని స్రవిస్తుంటుంది. ఇది జుట్టుకు స్వాభావికమైన (నేచురల్) కండిషనర్లా పనిచేస్తుంటుంది. చిన్నపిల్లలు తమ టీనేజీలోకి రాగానే ఈ గ్రంథి నుంచి స్రావం ఎక్కువై జుట్టులో మెరుపును పెంచి, ఆ వయసులో కౌమార బాలబాలికలు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.మందుల వల్ల...రకరకాల ఆరోగ్య సమస్యలకు కొన్ని రకాల మందులు వాడుతున్న కొందరిలో వాటి దుష్ప్రభావం వల్ల జుట్టు రాలడం సాధారణంగా జరుగుతుంటుంది. కొందరిలోనైతే ఇది అవాంఛిత రోమాల పెరుగుదలకూ దారితీస్తుంది. ఈ మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశల్లో జోక్యం చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల/జీవిత చక్రాల (సైకిల్)లో మార్పు వస్తుంది. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి అవి జుట్టు రాలేలా చేస్తాయి.టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా రుగ్మతకు మందులు వాడటం మొదలుపెట్టాక 2 నుంచి 4 నెలల్లో మందు ప్రభావంతో వెంట్రుక ఫాలికిల్ విశ్రాంతి దశలోకి వెళ్తుంది. ఫలితంగా జుట్టు రాలాక మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది.అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో జుట్టు రాలడం విషయంలో... వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. ఈ ఫలితం మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలడం సంభవిస్తుంది. ఈ మందుల వల్ల కేవలం తలపైన ఉండే జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి.జుట్టు... దానిపై రసాయనాల ప్రభావం... జుట్టుకు రంగువేయడం, స్ట్రెయిటెన్ చేసుకోవడం, బ్లీచింగ్ వంటి ప్రక్రియల్లో వెంట్రుకలు... రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంటాయి. ఫలితంగా వాటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఒక్కోసారి వెంట్రుకలు మళ్లీ రిపేర్ చేయలేని విధంగా దెబ్బతినవచ్చు. మనకు కనిపించే వెంట్రుక పై పొర అయిన క్యూటికిల్ పూర్తిగా దెబ్బతినవచ్చు. ఇలా వెంట్రుక పైపొర అయిన క్యూటికిల్ దెబ్బతింటే లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటకు కనిపిస్తుంది. ఇది పైపొరలా నునుపుగా కాకుండా కాస్త గరుకుగా ఉంటుంది. ఈ కార్టెక్స్ భాగం బయటపడిన జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇక నీళ్లలో, వాతావరణంలో, షాంపూల్లో, హెయిర్స్ప్రేలలో ఉండే రసాయనాలు క్యూటికిల్నే కాకుండా కార్టెక్స్నూ దెబ్బతీయవచ్చు. అప్పుడు వెంట్రుక తేలిగ్గా విరిగిపోతూ ఉంటుంది.వెంట్రుకను దెబ్బతీసే భౌతిక పద్ధతులు : విపరీతంగా దువ్వడం, చాలా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం, వెనక్కు దువ్వడం, బలమైన వేడిగాలి తగిలేలా డ్రైయర్ను ఉపయోగించడం వంటి ప్రక్రియలు సైతం వెంట్రుకలను దెబ్బతీస్తాయి. ఇలా భౌతికపద్ధతుల ద్వారా దెబ్బతిన్న వెంట్రుక సాఫీగా లేకుండా ఒకచోట ఉబ్బు మరోచోట పలచబారినట్లుగా ఉంటుంది. ఇలా కనిపించే వెంట్రుకలను ‘బబుల్డ్ హెయిర్’ అంటారు. ఇలాంటి వెంట్రుకలు బలహీనంగా, తేలిగ్గా విరిగిపోయేలా ఉంటాయి.పుట్టుకతోనే జుట్టు రాలిపోయే కండిషన్లు... హైపోట్రైకోసిస్ : జుట్టు సమస్యల్లో ఇదో రకం. అలొపేషియాలో మొదట జుట్టు ఉన్న చోట రాలిపోయి, మళ్లీ మొలవడంలో ఇబ్బందులు ఏర్పడితే... ఈ ‘హైపోట్రైకోసిస్’ అనే సమస్యలో అసలు జుట్టు పెరగాల్సిన చోట... మొదట్నుంచి కూడా వెంట్రుకలే మొలవవు. దాంతో పుట్టుకతోనే జుట్టు మొలవకపోవడంతో పాటు... జీవితకాలంలో అసలెప్పుడూ వారిలో జుట్టు మొలవదు. ఇందుకు కారణాలు ప్రధానంగా జన్యుపరమైనవి. ఇక పిండదశలో వచ్చే లోపాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఈ సమస్యతో పాటు కనిపించే గ్రాహమ్ లిటిల్ సిండ్రోమ్, ఒఫ్యూజీ సిండ్రోమ్, మేవిక్ క్లేవ్ సిండ్రోమ్ వంటివి కూడా ఇందుకు కారణమవుతాయి.కంజెనిటల్ అలొపేషియా : ఈ కండిషన్ కారణంగా పుట్టుకతోనే బట్టతల వస్తుంది.ట్రైయాంగ్యులార్ అలొపేషియా : ఈ కండిషన్లో కణతల వద్ద జుట్టు రాలిపోతుంది. కంజెనిటల్ ఏట్రికియా : పిల్లల్లో కనిపించే ఈ కండిషన్లో మొదట వారికి ఒత్తైన జుట్టు ఉండి, అది రాలిపోయి మళ్లీ మొలవదు.- డా. విజయ గౌరి బండారు, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్.నిర్వహణ : యాసీన్ -
కైయా సెంచరీ.. పట్టు బిగించిన జింబాబ్వే
హరారే వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో జింబాబ్వే పట్టు బిగించింది. ఓపెనర్ ఇన్నోసెంట్ కైయా కెరీర్లో మొదటి శతకంతో (140) కదంతొక్కడంతో 270 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను 140 పరుగులకే ఆలౌట్ చేసి.. తమ తొలి ఇన్నింగ్స్లో 410 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. షద్మాన్ ఇస్లాం 9 పరుగులకు ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ 21, మొమినుల్ హక్ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్కు బంగ్లాదేశ్ ఇంకా 230 పరుగులు వెనుకపడి ఉంది.జింబాబ్వే ఇన్నింగ్స్లో కైయాతో పాటు బ్రియాన్ బెన్నెట్ (59), క్రెయిగ్ ఎర్విన్ (60), వెస్లీ మదెవెరె (77 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. బెన్ కర్రన్ 42 పరుగులతో పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 7 వికెట్లతో సత్తా చాటగా.. ఖలీద్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.అంతకుముందు జింబాబ్వే బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్కే ఆలౌటైంది. న్యూమ్యాన్ న్యామ్హురి 4, కెప్టెన్ రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (60) మాత్రమే అర్ద సెంచరీతో రాణించగా.. షద్మాన్ (20), కెప్టెన్ షాంటో (19) మాత్రమే అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.తైజుల్ ట్రిపుల్ సెంచరీతొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసి జింబాబ్వేను ఇబ్బంది పెట్టిన బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం తన అంతర్జాతీయ కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఒక్క టెస్ట్ల్లోనే 270 వికెట్లు తీసిన అతడు.. వన్డేల్లో 31, టీ20ల్లో ఓ వికెట్ తీశాడు. -
మా చావుకు కారణం.. ఈ మెసేజ్ చదివితే తెలుస్తుంది!
రంగారెడ్డి: దంపతులు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో మిస్టరీ వీడింది. మోకిల పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయట పడ్డాయి. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. జన్వాడకి చెందిన వడ్ల బాలసాయి (32) సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ గ్రామానికి చెందిన పద్మ(26) కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోగా.. వారికి ఐదునెలల బాబు ఉన్నాడు. బాలసాయి ఫొటోగ్రాఫర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగునెలల క్రితం జుల్కల్లో నివసించే అత్తామామలు శాంతమ్మ, చంద్రయ్య ఇంటికి గుర్తు తెలియని సాధువు వచ్చాడు. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, తవ్వితే ధనవంతులు అవుతారని ఆశ పెట్టాడు. దీనికి ధనం కావాలని చెప్పడంతో వారు పెద్దల్లుడు వెంకటేశ్తో కలిసి బాలసాయిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పలు దఫాలుగా రూ.10 లక్షలు వారికి ఇచ్చాడు. తీరా అడిగే సరికి ఇష్టం వచ్చినట్లు దూషించడంతో భార్యాభర్తలు మనస్తాపానికి గురయ్యారు. చేసిన అప్పులు తీర్చే అవకాశం లేకపోవడంతో బలవన్మరణానికి సిద్ధపడ్డారు. ఆదివారం కుటుంబసభ్యులకు తెలిసేలా భార్య ఫోన్కి మెసేజ్ పెట్టి, ఇంట్లోని ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మెసేజ్ ఆధారంగా పోలీసులు శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేశ్ని అదుపులోకి విచారించగా నేరం అంగీకరించారు. వారిని సోమవారం చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జిల్లా జైలుకి తరలించారు. అమ్మ, తమ్ముళ్లకు సారీ.. బాబుని బాగా చూసుకోండి చనిపోయే ముందు బాలసాయి చేసిన మెసేజ్లో పెళ్లి జరిగిన తర్వాత అత్తమామతో పడిన బాధలను క్లుప్తంగా వివరించాడు. ‘అమ్మ, తమ్ముళ్లు సారీ.. నాతో కావడం లేదు. నేను నా భార్య చనిపోతున్నాం.. మీరు బాబుని బాగా చూసుకోండి.. పెళ్లి తర్వాత అందరం మంచిగా ఉందామని అత్త, మామ ఇంటికి పిలిచారు.. భార్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నరకం చూపించారు.. ధనవంతులు అవుతాం, అప్పు కావాలని అడిగితే మొత్తంగా రూ. 10 లక్షలు ఇచ్చా.. అడిగితే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు.. ఫొటోగ్రాఫర్గా ఈవెంట్స్ చేసిన డబ్బులు, కెమెరా తాకట్టు పెట్టి మరీ ఇచ్చా.. మా చావుకి కారణం అత్తామామలు శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేశ్లే’ అని మెసేజ్ చేశాడు. -
ముంబై ఘటన: జింక్ ఫాస్ఫైడ్ అంత ప్రమాదకరమా?
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలోగల బైకుల్లా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ కుట్ర వెలుగుచూసింది. ఒళ్లు నొప్పుల నివారణా మాత్రలంటూ (పెయిన్ కిల్లర్స్) అత్యంత ప్రమాదకరమైన ఎలుకల మందు కెమికల్ ‘జింక్ ఫాస్ఫైడ్’ కలిపిన క్యాప్సూల్స్ను పంపిణీ చేయడం కలకలంరేపింది. అప్రమత్తమైన ముంబై పోలీసులు ఈ పెను ప్రమాదాన్ని అడ్డుకోగలిగారు. అసలు ఇంతకీ జింక్ ఫాస్ఫైడ్ అంటే ఏమిటి? ఇది శరీరంలోకి వెళ్తే ప్రాణాలు ఎలా పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.చుంచులను చంపే మందు.. మనుషులకు మృత్యుపాశంజింక్ ఫాస్ఫైడ్ అనేది ముదురు బూడిద రంగులో ఉండే ఒక అకర్బన రసాయన సమ్మేళనం (Inorganic Chemical Compound). దీనిని సాధారణంగా పొలాలు, గోదాములు, ఇళ్లలో ఎలుకలు, ఇతర హానికరమైన జంతువులను (Rodents) నిర్మూలించడానికి 'రోడెంటిసైడ్' (ఎలుకల మందు) విరివిగా ఉపయోగిస్తారు. ఇది మానవుల ప్రాణాలకు క్షణాల్లో ముప్పు తెచ్చే గుణం కలిగి ఉన్నందున, దీని నిల్వ, బహిరంగ విక్రయాలపై చట్టపరంగా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ముంబైలో స్వాధీనం చేసుకున్న ప్రతి క్యాప్సూల్లోనూ దాదాపు ఒక గ్రాము చొప్పున ఈ ప్రాణాంతక జింక్ ఫాస్ఫైడ్ను నింపినట్లు నిర్ధారణ అయింది.పొట్టలోకి వెళ్తే పొగబెట్టే ‘ఫాస్ఫైన్ గ్యాస్’జింక్ ఫాస్ఫైడ్ ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే అది అత్యంత విషపూరితంగా మారుతుంది. ఈ రసాయనం మానవ జీర్ణాశయానికి చేరుకోగానే, అక్కడి జఠర రసం లేదా పొట్టలోని యాసిడ్లతో (Stomach Acid) రసాయన చర్య జరుపుతుంది. ఈ ప్రక్రియ వల్ల ‘ఫాస్ఫైన్ గ్యాస్’ (Phosphine Gas) విడుదలవుతుంది. ఈ గ్యాస్ మానవ శరీరానికి తీవ్రంగా హాని కలిగిస్తుంది. ఇది నేరుగా రక్తంలో కలిసి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు), మెదడుపై తీవ్రమైన దాడి చేస్తుంది.ఆక్సిజన్ను ఆపేసి.. అవయవాలను నిర్జీవం చేసి.. ఈ విషవాయువు ప్రభావం వల్ల శరీరంలోని కణాలు ఆక్సిజన్ను గ్రహించే, ఉపయోగించుకునే ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (irregular heartbeat) ఏర్పడతాయి. రక్తపోటు (Blood Pressure) ఒక్కసారిగా పడిపోతుంది. ఊపిరి తీసుకోవడం అత్యంత కష్టంగా మారుతుంది. విషం తీవ్రత పెరిగేకొద్దీ, శరీరంలోని కీలక అవయవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విఫలమయ్యే ‘మల్టీ-ఆర్గన్ ఫెయిల్యూర్’ (Multi-organ failure) పరిస్థితి ఏర్పడి మనిషి మరణిస్తాడు. ఇందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు.ప్రాథమిక లక్షణాలు ఇవే..ఈ విషపూరిత కెమికల్ శరీరంలోకి వెళ్లిన వెంటనే కొన్ని హెచ్చరిక లక్షణాలు కనిపిస్తాయి. బాధితుడికి తీవ్రమైన వికారం, వాంతులు అవుతాయి. పొట్టలో భరించలేనంత నొప్పి మొదలవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, బాధితుడి నోటి నుంచి లేదా వాంతుల నుంచి ‘వెల్లుల్లి’ వంటి ఘాటైన వాసన వస్తుంది. దీంతో పాటు తల తిరగడం, విపరీతమైన నీరసం, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.అత్యవసర పరీక్షలుజింక్ ఫాస్ఫైడ్ పాయిజనింగ్ జరిగినట్లు అనుమానం వస్తే, వైద్యులు తక్షణమే రోగి ప్రాణాలను రక్షించేందుకు పలు రకాల అత్యవసర పరీక్షలు చేస్తారు. ఇందులో భాగంగా రోగి బ్లడ్ ప్రెజర్ (బిపి), గుండె పనితీరును గమనిస్తారు. గుండె కొట్టుకునే తీరును గమనించేందుకు ఈసీజీ తీస్తారు. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తనిఖీ చేస్తారు. వీటితో పాటు రసాయనం ఏ మేరకు ప్రభావం చూపిందో అంచనా వేయడానికి లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లతో పాటు ఊపిరితిత్తుల శ్వాస సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తారు.విరుగుడు లేని విషంఈ విషానికి సంబంధించి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. జింక్ ఫాస్ఫైడ్ పాయిజనింగ్కు ఎలాంటి నిర్దిష్ట ‘యాంటీడోట్’ (విరుగుడు మందు) అందుబాటులో లేదని నిపుణులు చెబుతున్నారు. దీనిని సేవించిన వ్యక్తిని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తరలించడం ఒక్కటే మార్గం. రోగికి కృత్రిమ శ్వాస కోసం ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. గుండె, రక్తపోటును అదుపులో ఉంచడానికి వైద్యులు లక్షణాత్మక చికిత్స (Symptomatic Treatment) అందిస్తారు. శరీరంలో విషం మరింతగా వ్యాపించకుండా ప్రాథమిక చికిత్సలు అందించి, ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. ఇది కూడా చదవండి: సువేందు దూకుడు.. బెంగాల్లో ‘యోగీ’ స్టయిల్ గుండా బిల్లు! -
రిసార్టులో ప్రియురాలి మృతి.. రక్తపు మడుగులో ప్రియుడు..!
రిసార్టులో ప్రియురాలు మరణించగా, ప్రియుడు చావుబతుకుల్లో పడి ఉండడం మిస్టరీగా మారింది. చిక్కబళ్లాపురం నగర శివార్లలో ప్రసిద్ధి చెందిన నంది హిల్స్ సమీపంలో ఉన్న ఓ హోమ్ స్టేలో యువతి అనుమానాస్పదంగా శవమై తేలింది. ఆమెను కేరళకు చెందిన సాయి సురభి (23)గా పోలీసులు గుర్తించారు. ఈమె ప్రియుడు, కేరళ కోజికోడ్కు చెందిన సంజిత్ అలీ (24) రక్త గాయాలతో పడి ఉన్నాడు. సురభిని హత్యచేసి తరువాత సంజీత్ ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రూం ఖాళీ చేయకపోవడంతో వివరాలు.. సంజీత్ బెంగళూరులో క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడని సమాచారం. గత శనివారం ముద్దేనహళ్లి సమీపంలోని హోం స్టేకు వీరిద్దరూ వచ్చారు. సోమవారం రూమ్ ఖాళీ చేస్తామని తెలిపారు. టైం దాటినా ఖాళీ చేయలేదు. దీంతో సిబ్బంది లోపలికి తొంగి చూడగా ఆమె చనిపోయి ఉంది. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ కుశాల్ చౌక్సీ, నందిగిరి ధామ పోలీసులు చేరుకుని పరిశీలించారు. యువతి ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అలాగే కొన్ని మాత్రలు కూడా కనిపించాయి. ఒక డైరీ లభించింది. అపస్మారక స్థితిలో ఉన్న సంజీత్ని ఆస్పత్రికి తరలించారు. నా కూతుర్ని వేధించేవాడు.. సురభి తల్లి గీతా బోరున విలపిస్తూ ఘటనా స్థలికి చేరుకుంది. ఇదొక లవ్ జిహాద్ హత్య అని ఆమె ఆరోపించింది. బెంగళూరు దయానంద సాగర్ కాలేజీలో చదువుతున్న సమయంలో సంజీత్ అలి పరిచయం అయ్యాడని, ప్రేమ పేరిట వేధించేవాడని గీతా తెలిపింది. అతనినుంచి కాపాడుకునేందుకు కూతురును వేరే చోట ఉంచి చదివిస్తున్నట్లు తెలిపింది. తన కుమార్తెను అతడు పూర్తిగా నాశనం చేశాడని, డ్రగ్స్కు అలవాటు చేశాడని తెలిపింది. తాను కష్టపడి రెండు , మూడుచోట్ల ఆమెకు చికిత్స చేయించి బాగు చేసుకున్నానని చెప్పింది. ఇటీవలే ముద్దేనహళ్లిలో ఓ సెంటర్లో ఫిజియోథెరపిస్టుగా సురభి చేరిందని, శనివారం సత్సంగం ఉందని చెప్పి వెళ్లిందని వివరించింది. అయితే ఈ సంజీత్ ఆమెను నమ్మించి హోంస్టేకు తీసుకెళ్లి హత్య చేశాడని ఆరోపించింది. యువతి మామ శంకరనారాయణ పోలీసులపై మండిపడ్డారు. సంజీత్ అలీ వేధింపులపై గతంలో తాము ఫిర్యాదు చేశామని, పోలీసులు పట్టించుకోలేదని, అప్పుడే అతనిపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు సురభి బతికి ఉండేదని రోదించారు. మరోవైపు గతేడాది సురభి మిస్సింగ్పై బనశంకరి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. అప్పుడు స్నేహితురాలి ఇంటిలో సురభిని గుర్తించి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కర్ణాటక: -
నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాను మహిళలపై ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదని.. తనను రెచ్చగొట్టిన వ్యక్తిపై మాత్రమే విమర్శలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్ఘాటించారు. తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్కు వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో మహిళా కమిషన్కు పూర్తిగా వివరిస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తినే విమర్శించానని చెప్పారు."ప్రతి మనిషికి ఒక సహనం ఉంటుంది. ఆ సహనం కోల్పోయేలా ఎదుటి వ్యక్తులు మాట్లాడకూడదు. నా వ్యాఖ్యలను మహిళలకు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారే నవ్వులపాలయ్యారు" అని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా అమర్నాథ్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, అలాంటి ఘటనలపై మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సాయి కృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్కు కనిపించలేదా? అని ప్రశ్నించిన ఆయన.. నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపై కూడా మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.తనపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి మహిళా కమిషన్కు పూర్తి వివరణ ఇస్తానని, తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ వివాదంగా మార్చారని అమర్నాథ్ అన్నారు. మహిళా కమిషన్ ఎదుట ఆయన ఇవ్వబోయే వివరణ, అనంతరం కమిషన్ స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మెలోని స్ట్రాంగ్ రిప్లై
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. తాను అమెరికాకు వ్యతిరేకిని కాదని.. అలాగని ఎవరి ముందూ మోకరిల్లే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఆమెను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో మెలోని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇటాలియన్ మీడియాలో ఓ కార్యక్రమంలో మెలోని ఇటలీ-అమెరికా సంబంధాలపై మాట్లాడారు. పాశ్చాత్య దేశాలన్నీ ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటాయని నమ్మే వ్యక్తినని.. పాశ్చాత్య కూటమిలో ఇటలీ మరింత బలంగా ఉంటుందని నమ్ముతానన్న మెలోని... దాని కోసమే నిరంతరం శ్రమిస్తాను. అయితే, బలమైన సంబంధాలు నిజాయితీగా మాట్లాడుకోవడంపైనే ఆధారపడి ఉంటాయని.. తాను చాలా స్పష్టంగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తినంటూ మెలోని పేర్కొన్నారు.మెలోనిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. జూన్ 21, 22 తేదీల్లో మయామిలో జరగాల్సిన బిజినెస్ ఫోరమ్కు ఆయన హాజరుకావాల్సి ఉంది. తజాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "ప్రధాని జార్జియా మెలోనిపై ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన తీవ్రమైన, అవమానకరమైన వ్యాఖ్యలు ఇటలీ మొత్తాన్ని కించపరిచేలా ఉన్నాయి. అందుకే నా అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నానంటూ ప్రకటించారు.ఇటలీకి చెందిన 'లా7' ఛానల్ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం. ఎవియాన్ సదస్సు సందర్భంగా మెలోనితో జరిగిన సంభాషణపై ఆ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ విచిత్ర సమాధానం ఇచ్చారు. ‘‘మీ ప్రధాని ఎలా ఉన్నారు? ఆమె నాతో ఒక ఫోటో దిగడానికి ఎంతగానో ప్రాధేయపడ్డారు. ఆమెకు నాతో ఫోటో కావాలని చాలా ఆశపడ్డారు. నిజానికి నేను ఫోటో దిగకపోవచ్చు. కానీ ఆమెను చూసి జాలిపడి ఒప్పుకున్నాను’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేను ఆమెతో మాట్లాడినందుకు బహుశా ఆమె సంతోషంగా ఉండవచ్చు. కానీ ఆమెతో మాట్లాడాల్సిన అవసరమైతే నాకు లేదు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. -
స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : ‘‘రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కేవలం ఒక్క నెలలోనే తమిళనాడు పాతాళంలోకి పడిపోయే పరిస్థితి వచ్చింది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. తమిళనాడులో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చు. దీనికి మనం వంద శాతం సిద్ధంగా ఉండాలి’’ అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్మరో వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని వానగరంలో స్టాలిన్ సమక్షంలో, అన్నాడీఎంకే మాజీ మంత్రి బెంజమిన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు డీఎంకె పారీ్టలో చేరారు. బెంజమిన్ అన్నాడీఎంకేలో చేరి ఎన్నో ఏళ్లుగా నిజాయితీగా పనిచేశారని గుర్తు చేస్తూ, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు,తాను ప్రతిపక్ష వరుసలో కూర్చునేవాడినని, తాము ప్రశ్నలు అడిగే సమయంలో ఎంతో మంది మంత్రులు సమాధానాలు చెప్పేవారని, అయితే, బెంజమిన్ సమాధానం చెబుతున్నారంటే మాత్రం తాము కాస్త అప్రమత్తంగా ఉండేవాళ్లమన్నారు. డీఎంకేలో చేరుతున్నవారంతా పదవుల కోసమో, హోదా కోసమో రాలేదని, సిద్ధాంతమే ముఖ్యం అనే భావనతో వస్తున్నారన్నారు. డీఎంకే బలంగా ఉంటేనే తమిళనాడును కాపాడుకోగలమని నమ్మి ఈ ఉద్యమంలో చేరుతున్నారన్నారు. పాతాళంలోకి తమిళనాడు గతంలో తాము చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ, తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తమిళనాడు పాతాళానికి నెట్టబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కొత్త ప్రభుత్వాన్ని నమ్మి తమిళనాడుకు రావడానికి పెట్టుబడి దారులు భయపడుతున్నారన్నారు.నేరాలు మరింతగా పెట్రేగి ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలో అద్వన్నపు పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు. మూడు నెలల తర్వాత లేదా ఆరు నెలల తర్వాత తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు రావచ్చు అని వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ, పార్టీ విజయానికి ఈ నిమిషం నుంచే కష్టపడటం ప్రారంభిద్దాం, శ్రమిద్దాం, పనిచేద్దాం అని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపు నిచ్చారు. -
ఐఐఎంఆర్లో చిరుధాన్య విత్తనాలు
ఎల్నినో నేపథ్యంలో తక్కువ నీటితో, అధిక ఉష్ణోగ్రతల్లోనూ మంచి దిగుబడిని ఇవ్వగలిగే సీ4 పంటలే చిరుధాన్య పంటలు. ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యల నివారణకు చిరుధాన్యాల ఆహారమే ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారిన విషయం తెలిసిందే. దేశంలో చిరుధాన్యాల సాగును మరింత విస్తరింపజేసేందుకు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఐసీఏఆర్ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐఐఎంఆర్) కృషి చేస్తోంది. రైతులు మంచి దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు వాడటం ఎంతో ముఖ్యం.ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో విత్తుకోవటానికి అనువైన నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలను హైదరాబాద్ రాజేంద్రనగర్లోని తమ ప్రధాన కార్యాలయం నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయొచ్చని ఐసీఏఆర్–ఐఐఎంఆర్ సంచాలకులు డాక్టర్ తార సత్యవతి ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.జొన్న, సజ్జ, రాగు, కొర్ర, అరికె, సామ, ఒరిగ వంటి అన్ని రకాల చిరుధాన్యాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఐఐఎంఆర్ విత్తన శాస్త్రవేత్త డాక్టర్ సూగన్న తెలిపారు. అన్ని రకాల చిరుధాన్య విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. సూటి రకం పచ్చజొన్న, కొర్ర (సూర్యనంది) విత్తనాలు అధిక మొత్తంలో ఉన్నాయన్నారు. తెల్లజొన్న హైబ్రిడ్ రకాల విత్తనాలు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.జొన్న వంటి పెద్ద గింజ చిరుధాన్యాలు ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. కొర్ర వంటి చిన్న గింజ చిరుధాన్యాలు ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుందని డా. సూగన్న ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థకు స్వయంగా వచ్చి రైతులు విత్తనాలు కొనుక్కోవాల్సి ఉంటుంది. అదనపు సమాచారం కోసం 040–24599305 నంబరులో పని దినాల్లో ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. మధ్య సంప్రదించవచ్చు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం నంద్యాల, విజయనగరం, పాలెం, రాజేంద్రనగర్లోని పీజేటీఏయూలలో కూడా చిరుధాన్యాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
'ఆ చేతులు నరికేస్తాం'.. భారత్పై పాక్ ప్రేలాపనలు
భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరింత ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒప్పందాన్ని అమలులో నిలిపివేసిన భారత్పై పాకిస్థాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘పాక్కు రావాల్సిన నీటిని అడ్డుకునే చేతులను నరికేస్తాం’’ అంటూ ఆ దేశ మంత్రి ఒకరు హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. సింధు జలాల ఒప్పందం(Indus Water Treaty)పై పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి భారత్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇస్లామాబాద్లో ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్, పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ సోమవారం సంయుక్త పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో.. భారత్ తమ దేశానికి రావాల్సిన నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు."పొరుగు దేశ ప్రధాని తన చేతిలో ఉన్న కుళాయిని మూసేస్తానంటున్నారు. పాకిస్థాన్కు ఒక్క చుక్క నీళ్లు కూడా రానివ్వనని చెబుతున్నారు. మా వాటా నీటిపై ఎవరైనా చేయి వేస్తే.. ఆ చేతులను నరికేస్తాం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే సింధు జలాల ఒప్పందం ప్రకారం తమకు దక్కాల్సిన నీటి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని స్పష్టం చేశారు.ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే: పాక్సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్ మాట్లాడుతూ.. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే అమల్లో ఉందన్నారు. ఒక దేశం ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం, సవరించడం లేదా నిలిపివేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం పాకిస్థాన్కు నీటిపై ఉన్న హక్కులు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా న్యాయ నిపుణులు, జలవనరుల నిపుణులతో ఇస్లామాబాద్లో అంతర్జాతీయ సదస్సు కూడా నిర్వహిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. భారత్ నిర్ణయానికి అంతర్జాతీయ మద్దతు లభించలేదని కూడా పాక్ అంటోంది.🚨 Water Gone. Threats On."Touch Our Water, We'll Cut Off Your Hand": Pakistan Minister Musadik Malik.Arre bhai, koi inko batao... pichhle 1.5 saal se paani hi band haiVideo: ARY news pic.twitter.com/Kc1d2JxCN4— OsintTV 📺 (@OsintTV) June 29, 2026పహల్గామ్ తర్వాత.. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా ముగింపు పలికే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే భారత్వ వాదనను పాకిస్థాన్ ఖండించింది.యుద్ధ హెచ్చరికలు కూడా..సింధు జలాల వివాదంపై ఇప్పటికే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. నీటి భద్రత తమ జాతీయ భద్రతలో భాగమని, దానికి ముప్పు ఏర్పడితే భారత్పై యుద్ధానికి కూడా వెనుకాడబోమని వ్యాఖ్యానించారు. తాజా ప్రకటనలతో పాకిస్థాన్ మరోసారి అదే వైఖరిని కొనసాగించింది.భారత్ ఏమంటోంది?అయితే భారత్ మాత్రం పాక్ ప్రేలాపనలు పట్టించుకోవడం లేదు. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత ప్రతినిధి అనుపమా సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా ఉపయోగించే దేశం సహకార ఒప్పందాల ప్రయోజనాలు కోరడం తార్కికం కాదన్నారు. 1960లో కుదిరిన ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అతీతంగా శాశ్వత హక్కుగా పరిగణించలేమని ఆమె స్పష్టం చేశారు. గత ఆరు దశాబ్దాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అందుకే సింధు జలాల ఒప్పందాన్ని కూడా ప్రస్తుత వాస్తవాలకు అనుగుణంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అలాగే జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించిన భారత్, అంతర్జాతీయ వేదికలను ఉపయోగించి పాకిస్థాన్ ఉగ్రవాదం, అంతర్గత సమస్యల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.మరోసారి మాటల యుద్ధంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక ఉద్రిక్తతలు పెరిగిన వేళ.. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం కూడా మరో ప్రధాన వివాదంగా మారింది. ఒకవైపు పాకిస్థాన్ యుద్ధ హెచ్చరికలు, మరోవైపు ఉగ్రవాదం కొనసాగినంత కాలం సహకారం ఉండదన్న భారత్ వైఖరితో.. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది. పరిస్థితి ఎలా మారుతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. -
అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ట్రంప్కు భారీ బూస్ట్
అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వతంత్ర ఫెడరల్ ఏజెన్సీల అధిపతులను ఎలాంటి కారణం చెప్పుకుండానే తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. 91 ఏళ్ల నాటి కీలక న్యాయసూత్రాన్ని పక్కనబెట్టింది. తద్వారా అమెరికా అధ్యక్షుడి అధికారాలను గణనీయంగా విస్తరించేందుకు మార్గం సుగమం చేసింది. అదే సమయంలో.. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతకు మాత్రం రక్షణ కల్పించింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు వేసింది. ఈ రెండు తీర్పులు కలిసి అమెరికాలో అధ్యక్షుడి అధికారాలు, కేంద్ర బ్యాంకు స్వతంత్రతపై కొత్త చర్చకు తెరలేపాయి.స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం ఈ తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష అధికారాలకు సంబంధించిన అత్యంత కీలక తీర్పుల్లో ఇదొకటని పేర్కొన్నారు. అయితే లీసా కుక్ కేసులో సాంకేతిక కారణాలతో మాత్రమే తీర్పు వచ్చిందని, ఆమెపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని సోషల్ మీడియాలో వెల్లడించారు.దశాబ్దాల.. న్యాయసూత్రానికి ముగింపుఫెడరల్ ఏజెన్సీల అధిపతుల్ని తొలగించే కేసులో.. 6-3 మెజారిటీతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 1935లో వచ్చిన హంపేరీస్ ఎగ్జిక్యూటర్ Humphrey's Executor తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పు ప్రకారం ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) వంటి స్వతంత్ర సంస్థల సభ్యులను అధ్యక్షుడు విధానపరమైన విభేదాల కారణంగా తొలగించలేడు. ఇప్పుడు ఆ పరిమితిని తొలగిస్తూ.. అలాంటి రక్షణలు రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షుడికి స్వతంత్ర ఫెడరల్ సంస్థలపై మరింత నియంత్రణ లభించినట్టైంది. ఏయే సంస్థలపై ప్రభావం?ఈ తీర్పు ప్రభావం కేవలం ఫెడరల్ ట్రేడ్ కమిషన్కే పరిమితం కాదు. నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ (NLRB), మెరిట్ సిస్టమ్స్ ప్రొటెక్షన్ బోర్డ్, కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ వంటి అనేక స్వతంత్ర సంస్థల బోర్డు సభ్యులను కూడా అధ్యక్షుడు అవసరమైతే పదవి నుంచి తొలగించే అవకాశం ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో వైట్హౌస్ ప్రభావం ఈ సంస్థలపై మరింత పెరిగే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఫెడరల్ రిజర్వ్కు మాత్రం.. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా భావించే ఫెడరల్ రిజర్వ్ విషయంలో సుప్రీంకోర్టు భిన్నమైన వైఖరి తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించాలన్న అభ్యర్థనను 5-4 మెజారిటీతో తిరస్కరించింది. చట్టం కల్పించిన విధివిధానాలు పాటించకుండా ఆమెను తొలగించలేరని స్పష్టం చేసింది. కేసు పూర్తయ్యే వరకు లీసా కుక్ పదవిలో కొనసాగవచ్చని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ తన తీర్పులో ఫెడరల్ రిజర్వ్ చరిత్రను ప్రస్తావిస్తూ.. ఈ సంస్థ రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రత్యేక రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. అధ్యక్షుడి ఇష్టానుసారంగా గవర్నర్లను తొలగించే అవకాశం ఉంటే, వడ్డీ రేట్లపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. లీసా కుక్పై ఆరోపణలు ఏమిటి?2025 ఆగస్టులో ట్రంప్, లీసా కుక్పై మార్ట్గేజ్ మోసం ఆరోపణలు చేస్తూ ఆమెను తొలగించే ఉత్తర్వులు జారీ చేశారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లోని రెండు ఇళ్లను ఒకేసారి ప్రధాన నివాసంగా చూపించి గృహ రుణాల్లో అక్రమ ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. అయితే ఇవి నిరూపితం కాని ఆరోపణలేనని, అసలు ఉద్దేశం తనను వడ్డీ విధానంపై రాజకీయ ఒత్తిడికి లోను చేయడమేనని లీసా కుక్ ఆరోపించారు. తనపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని కూడా స్పష్టం చేశారు.ట్రంప్ లక్ష్యం వేరే.. తన రెండో అధ్యక్ష పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ వడ్డీ రేట్లు వేగంగా తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లతో ప్రభుత్వ రుణభారం తగ్గడమే కాకుండా, గృహ, వాహన రుణాలు కూడా చౌకవుతాయని ఆయన వాదిస్తున్నారు. కానీ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ విభేదాల నేపథ్యంలోనే కుక్, అలాగే మాజీ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి పెంచిందని విమర్శలు వచ్చాయి. పావెల్పై దర్యాప్తు కూడా..ఫెడరల్ రిజర్వ్ మాజీ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై కూడా ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఫెడ్ ప్రధాన కార్యాలయ భవనాల పునరుద్ధరణ వ్యయాల పేరుతో విచారణ చేపట్టినా, అది వడ్డీ రేట్లపై ప్రభావం చూపేందుకు చేసిన ప్రయత్నమేనని పావెల్ ఆరోపించారు. అనంతరం కోర్టు జోక్యంతో ఆ విచారణ నిలిచిపోయి, చివరకు అమెరికా న్యాయశాఖ దానిని ఉపసంహరించుకుంది.ఒకవైపు అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలను మరింత బలోపేతం చేస్తూనే, మరోవైపు ఫెడరల్ రిజర్వ్ వంటి అత్యంత కీలక ఆర్థిక సంస్థ రాజకీయ జోక్యానికి గురికాకుండా రక్షణ కల్పించింది. అమెరికా సుప్రీం కోర్టు వెల్లడించిన ఈ రెండు తీర్పులు.. అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. అధ్యక్ష అధికారాలు ఎంతవరకు ఉండాలి? స్వతంత్ర సంస్థల స్వేచ్ఛ ఎంతవరకు కాపాడాలి? అనే చర్చలకు ఈ తీర్పు కొత్త దిశ చూపిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
బెగ్గర్ రోబో!
చైనాలోని ఒక హ్యూమనాయిడ్ రోబో తన కరెంట్ ఖర్చుల కోసం వీధిలో యాచిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో...ఒక రోబో ఫుట్పాత్పై మోకాళ్లపై కూర్చొని అటుగా వెళ్తున్న వారికి వంగి నమస్కరిస్తూ యాచిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. రోబో పక్కన విరాళాల కోసం ఒక ట్రేతో పాటు, క్యూఆర్ కోడ్ ఉంటుంది.దీనికి తోడు ఎల్ఈడీ డిస్ప్లే, లౌడ్స్పీకర్ కనిపిస్తాయి.‘రీచార్జ్ చేయడానికి డబ్బులు లేవు. దయచేసి సహాయం చేయండి’ అంటూ లౌడ్స్పీకర్ నుంచి పదేపదే వినిపిస్తూ ఉంటుంది. ఇది మార్కెటింగ్ స్టంటా? విరాళాలను ఆకర్షించే సృజనాత్మక మార్గమా? అని చాలామంది నెటిజనులు ప్రశ్నించారు. ‘మంచి ఆలోచన. మీరే స్వయంగా అడుక్కోవడానికి బదులుగా ఆ పనిని రోబోతో చేయించండి. ఇది సమయాన్ని, శక్తిని రెండిటినీ ఆదా చేస్తుంది’ అని ఒక నెటిజనుడు రాయడమే కాదు ‘నేను కూడా ఇదే మార్గం అనుసరించాలనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించాడు! -
వాన నీరు ఇంకిస్తే చాలు!
ఎల్ నినోతో రుతుపవనాలు అస్తవ్యస్థంగా మారుతున్న పరిస్థితుల్లో బోర్వెల్స్ కింద వ్యవసాయం చేసే రైతులు వాన నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకునే పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే దానికంటే ఎక్కువ నీటిని తోడటం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు అడుగంటాయి. అనేక ప్రాంతాల్లో 200 నుంచి 400 మీటర్ల (650–1300 అడుగుల) లోతు వరకు కూడా బోర్వెల్లు, ట్యూబ్వెల్లు తవ్వడం సర్వసాధారణమైంది. భూగర్భ జలాల లభ్యత రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. భూమిలోకి తగినంత వాన నీటిని ఇంకింపజేసే (రీఛార్జ్) ప్రయత్నాలు చెయ్యకుండా భూగర్భ జలాలను నిరంతరం ఎక్కువగా తోడుతుండటమే సమస్య. బోరుబావులు నిత్యం జలకళతో కళకళలాడాలంటే వాటి దగ్గర రీఛార్జ్ గుంతలు లేదా నీటి కుంటలు నిర్మించుకోవటం మేలు అంటున్నారు నిపుణులు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని భూగర్భంలో గట్టి రాతి జల పొరలు విస్తరించి ఉన్నాయి. మట్టి కింద 5 నుంచి 15 మీటర్ల లోతు వరకు రాతి పొరలు ఉంటాయి. నీటిని ఎక్కువగా నిల్వ చేయగల సామర్థ్యం ఈ పొరలకే ఉంటుంది. రాతి సమూహాల మధ్య ఉండే పగుళ్లు భూగర్భ జలాల నిల్వకు, కదలికలకు దోహదపడతాయి. ఒక బోర్వెల్ ద్వారా రీఛార్జ్ అయ్యే వర్షపు నీటి పరిమాణం, అక్కడి భూగర్భంలోని జల పొరల లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. రాళ్లలో పగుళ్లు, చీలికలు బాగా ఉంటే బోర్వెల్స్ ద్వారా ఎక్కువ వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకుతాయి. కొన్నిసార్లు, ఈ పగుళ్ల అనుసంధానం చాలా పరిమితంగా ఉంటే వాన నీరు ఇంకే సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు. సాధారణ వాన నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా సుమారు 15% మాత్రమే భూగర్భంలోని పైపైన ఉండే నీటి పొరల్లోకి ఇంకుతోంది. సుమారు 20–40% ఆవిరైపోవచ్చు. లోతైన భూగర్భ జల పొరలు తిరిగి నిండటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. తక్కువ కాలం పాటు కురిసే భారీ వర్షాలను ఈ నిర్మాణాలు సమర్థవంతంగా సంగ్రహించలేకపోవచ్చు. ఇటీవలి కాలంలో లోతైన బోర్వెల్లను రీఛార్జ్ చేయడానికి, వాటి దిగుబడిని పెంచడానికి, సహేతుకంగా తక్కువ ఖర్చుతో ‘బోర్వెల్ రీఛార్జ్’ అనే పద్ధతి ఒక సమర్థవంతమైన విధానంగా ఆవిర్భవించింది.ఎండిన బోర్లకు తిరిగి జలకళఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దమగట్ల గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి తనకున్న రెండు ఎండిపోయిన బోరుబావులకు చుట్టూ వాన నీరు ఇంకేలా రీఛార్జ్ గుంతను నిర్మించారు. దీంతో ఆ బోరుబావులు వర్షపు నీటిని 70% వరకు భూమి లోపలికి ఇంకింపజేశాయి. ఆ బోర్లు తిరిగి జలకళను సంతరించుకున్నాయి. రోజంతా అపరిమితంగా నీటిని అందించడం ప్రారంభించాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి ఇప్పటికే ప్రచారం చేస్తున్న ఈ ప్రగతిశీల రైతు, బోర్ రీచార్జ్ గుంత ద్వారా నీటి భద్రత పొందటంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నందికొట్కూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా ఈ పద్ధతి ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి అనువైన ప్రాంతమని తమ పరిశీలనలో తేలిందని వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్ (డబ్ల్యూఎల్ఎఫ్) వ్యవస్థాపకులు డా. రామ్మోహన్ అన్నారు. నీటి కుంటలతో బోర్ల రీఛార్జ్నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, దాని పరిసర ప్రాంతాల్లో వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటల సాగు పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. బోరుబావులు విఫలమైనప్పుడు, వారు అధిక ఖర్చుతో రైతులు కొత్త బోరుబావులను వేయిస్తుంటారు. ప్రత్యక్ష రీఛార్జ్ ప్రయోజనం కోసం బోరుబావులకు దగ్గరగా వర్షపు నీటి నిల్వ కుంటలను నిర్మించుకుంటే భూమిలోకి నీరు బాగా ఇంకుతుందని డబ్ల్యూఎల్ఎఫ్ చెబుతూ రైతుల ఆలోచనా విధానంలో మార్పు తెస్తోంది. ఉన్న బోరుబావులను కాపాడుకోవడానికి బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించుకోవటానికి గత 2–3 సంవత్సరాలుగా చిన్న రైతులకు తోడ్పాటునందిస్తోంది. రైతులు తమ వంతుగా కొంత మొత్తం చెల్లిస్తే పొలంలో బోరుకు దగ్గరగా నీటి కుంటను ఏర్పాటు చేయిస్తోంది. తమ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, ఇప్పటివరకు 74 మంది రైతులు వర్షపు నీటి కుంటల నిర్మాణంతో లబ్ది పొందారని డా. రామ్మోహన్ తెలిపారు. బోరుకు 5 అడుగుల దూరంలో నీటి కుంట తవ్వుకుంటే బోరు నిండుగా నీరు పోస్తోందని నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అ΄్పాయిపల్లి గ్రామానికి చెందిన రైతు మార్కం రాములు యాదవ్ తెలిపారు. ఈ కుంటలో భవిష్యత్తులో చేపలు కూడా పెంచుతానన్నారు. 70% వాననీటి సంరక్షణబోర్వెల్ చుట్టూ వాన నీటి రీఛార్జ్ గుంతల నిర్మాణం, బోర్లకు దగ్గర్లో వ్యవసాయ చెరువుల నిర్మాణం వంటి పద్ధతులు కొద్దిపాటి వర్షం కురిసినా భూగర్భ జలాల పెంపుదలకు ఉపయోగపడతాయి. ఎల్నినో గడ్డు కాలాన్ని తట్టుకోవటానికి ఇవి ప్రభావశీలంగా పనిచేస్తాయి. పొలంలో కురిసిన వర్షపు నీటిలో 30 నుంచి 70% వరకు రీఛార్జ్ చేయడానికి వీలుంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, బోరుబావిలో నీటి మట్టం తక్షణమే పెరుగుతుంది. స్థానికంగా లభించే వస్తువులతో బోర్ రీఛార్జ్ గుంతలను, బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించవచ్చు. ఇవి సాపేక్షంగా చౌకైనవి. రైతులు సులభంగానే వీటిని నిర్వహించుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో రైతుల అనుభవాలు ఈ విషయాన్ని నిర్థారిస్తున్నాయి.– డా. ఆర్. రామ్మోహన్ (94401 94866), భూగర్భ జల నిపుణులు, వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్, సికింద్రాబాద్నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
తెలంగాణపై కాషాయ జెండా
సాక్షి ప్రతినిధి, వరంగల్: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై కాషాయ జెండా ఎగురుతుందని.. బీజేపీ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా జోస్యం చెప్పారు. ఆ లక్ష్య సాధన కోసం ప్రతి బూత్లో పార్టీని బలోపేతం చేయాలని.. కార్యకర్తలంతా ప్రజల్లో నిరంతరం ఉండాలని పిలుపునిచ్చారు.సోమవారం మధ్యాహ్నం హనుమకొండలో వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం గిరిజన నేతలతో సమావేశమైన ఆయన.. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన పార్టీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో మాట్లాడారు. బీజేపీ విజయానికి బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీలను వెన్నముకగా అభివర్ణించారు. వారి కృషి వల్లే దేశవ్యాప్తంగా కమలం వికసిస్తోందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమన్నారు.తెలంగాణతో బీజేపీది పోరాటాల బంధంతెలంగాణతో బీజేపీకి కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదని.. అది పోరాటాల ద్వారా ఏర్పడిన బంధమని నితిన్ నబీన్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీజేపీ రాజకీయ లాభనష్టాలు చూడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మద్దతిచ్చిందని చెప్పారు. దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చారని గుర్తుచేశారు.బీజేపీ తెలంగాణకు కొత్త పార్టీ కాదన్న ఆయన.. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గెలిచిన రెండు స్థానాల్లో ఒకటి తెలంగాణ నుంచే రావడం చారిత్రక విషయమన్నారు. అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం బీజేపీ పనిచేస్తోందని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గొంతుకగా, అధికారంలో ఉన్నప్పుడు మరింత సమర్థంగా ప్రజలకు సేవ చేయాలన్నదే పార్టీ సిద్ధాంతమని చెప్పారు.బీజేపీ కార్యకర్తలంతా పూర్తిస్థాయి ప్రజాసేవకులుగత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని నితిన్ నబీన్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం వినియోగించిందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనలో ప్రజల ఆశలు నెరవేరలేదని, తెలంగాణకు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లో కనిపించే పార్ట్టైమ్ రాజకీయ నాయకుడు అని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు మాత్రం 24 గంటలూ ప్రజల కోసం పనిచేసే ఫుల్టైమ్ ప్రజాసేవకులని కొనియాడారు.వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం: జి. కిషన్రెడ్డితెలంగాణలో బీజేపీ అధికారంలో లేకపోయినా వరంగల్ అభివద్ధికి కేంద్రం గణనీయమైన నిధులు కేటాయించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీకి వరంగల్పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధిపై నివేదికతో సహా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వరంగల్కు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందని విమర్శించే వారికి పూర్తి వివరాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని... కేసీఆర్, రాహుల్ గాంధీ విమర్శలు వాస్తవాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అత్యధికంగా కేంద్ర నిధులు వరంగల్కే వచ్చాయని.. కానీ వాటిని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ నిధులతో కరీంనగర్ అభివృద్ధి చెందగా వరంగల్లో అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురుతుందని.. బీజేపీ గెలిస్తేనే వరంగల్ సుందర నగరంగా మారుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, జాతీయ, రాష్ట్ర నాయకులు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, టి.రాజేశ్వర్రావు, దొంతి దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఆ మూడు వర్గాల సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధియువత, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని నితిన్ నబీన్ చెప్పారు. ఆ మూడు వర్గాల సాధికారత ద్వారానే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సిద్ధాంతంతో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రతి కుటుంబానికీ తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. -
సముద్ర గర్భంలో సాహసతార
స్కూటీ డ్రైవింగ్కు, స్కూబా డైవింగ్కు తేడా తెలియని చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది అతుల్య. స్కూబా డైవింగ్ గురించి తెలుసుకోవడానికి ఆమెకు చాలాకాలమే పట్టింది. అయితే... భవిష్యత్ కాలాలు కూడా గుర్తు పెట్టుకునే విజయాలను స్కూబా డైవింగ్లో సాధించింది. స్కూబా డైవింగ్ శిక్షణ పూర్తి చేసిన కేరళకు చెందిన మొదటి మహిళగా, కమర్షియల్ స్కూబా డైవింగ్లో ఐఎన్సీఏ సర్టిఫికేషన్ పొందిన మొదటి భాతీయురాలిగా రికార్డ్ సృష్టించింది...సముద్రం ఇప్పటికీ ఒక అంతచిక్కని రహస్యమే. పాలక్కాడ్కు చెందిన 29 ఏళ్ల అతుల్య బెల్గాడ్కు ఆ రహస్య ప్రపంచంలోకి తొంగిచూడాలనే ఆసక్తి ఒక శక్తిగా మారింది. ఆ శక్తితోనే మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉన్న స్కూబాడైవింగ్లో తనదైన గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. నీటి అడుగున చేసే కమర్షియల్ డైవింగ్ అనేది పైప్లైన్లు, ఇంటర్నెట్ కేబుళ్ల నిర్వహణ, వెల్డింగ్...మొదలైన వాటికి సంబంధించిన సాంకేతిక వృత్తి. దీనికి శారీరక బలం, సముద్రంపై అవగాహన, క్రమశిక్షణ అవసరం.మహిళలు ఒక్కరూ లేరు!త్రిస్సూర్లోని సెయింట్ మేరీస్ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లో స్కూబాడైవింగ్ గురించి తొలిసారిగా విన్నది అతుల్య. స్కూబాడైవింగ్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనే విషయం కూడా తెలుసుకుంది. ఆ సమయంలోనే ‘నేను ఎందుకు ప్రయత్నించ కూడదు!’ అని ఆలోచించి స్కూబాడైవింగ్పై ఆసక్తి పెంచుకుంది.‘నీటి అడుగున ఉన్న ప్రపంచాన్ని అన్వేషించాలనే ఆలోచన నన్ను ఎంతగానో ఆకర్షించింది. సముద్రగర్భంలో ఏముందో చూడాలనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయింది’ అంటున్న అతుల్యకు ఈత కొట్టడంలో మంచి ప్రావీణ్యం ఉంది. స్కూబా డైవింగ్ను కెరీర్గా ఎంచుకోవడానికి సంబంధించి తల్లిదండ్రులను ఒప్పించింది. వారు ఓకే అనడంతో మరింత ధైర్యం వచ్చింది. స్కూబా డైవింగ్ కోసం కోవలం వెళ్లింది. మహిళలు ఒక్కరూ కనిపించలేదు! ఏవేవో భయాలే ఉండేవి. అయితే శిక్షణ సజావుగా సాగింది. ఆ తరువాత కమర్షియల్ స్కూబాడైవింగ్లో శిక్షణ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అక్కడే కమర్షియల్ స్కూబాడైవింగ్లో సర్టిఫికేషన్ పొందింది. కేరళకు తిరిగి వచ్చిన తరువాత మూడు సంవత్సరాల పాటు కోస్టల్ పోలీసులకు ట్రైనర్గా పనిచేసింది.ఆ తరువాత అండమాన్లో సంవత్సరం పాటు పనిచేసింది. ఆ సమయంలో అతుల్య పనితీరును గమనించిన దక్షిణాఫ్రికాలోని ఒక డైవింగ్ కంపెనీ ఆమెను సంప్రదించింది. అలా ఆమె దక్షిణాఫ్రికా ప్రయాణం మొదలైంది.ఆహ్లాదమే కాదు... ప్రమాదం కూడా!సముద్రగర్భ ప్రయాణాలు ఎంత ఆహ్లాదకరమైనవో అంతే ప్రమాదకరమైనవి కూడా. ‘ప్రమాదాలకు దూరంగా ఉండడానికి ప్రతి డైవ్కు ముందు ఆ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తాను’ అంటున్న అతుల్య ‘నీటి అడుగున దేనినీ తాకరాదు’ అనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తుంది. స్టోన్ఫిష్ అచ్చం రాయిలాగే కనిపిస్తుంది. మనం దానిని తాకితే, దాని విషపూరితమైన ముళ్లతో తీవ్రమైన గాయమై ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని కాటుకు సరిౖయెన చికిత్స చేయకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ‘సముద్రపు అడుగున ఉన్న ఏదీ మనకు చెందినది కాదు. మనలాగే అక్కడ నివసించే జీవులకు కూడా వాటి సొంత జీవితాలు ఉంటాయి. మనం వాటికి ఆటంకం కలిగించకూడదు. వాటి స్థలాన్ని మనం గౌరవించాలి’ అంటుంది అతుల్య.తన సాహసాలను సముద్రం దగ్గరే ఆపాలనుకోవడం లేదు అతుల్య. ‘జీవితంలో మరిన్ని సాహసాలు చేయాలనుకుంటున్నాను. దీనికోసం కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాను. కేరళలో ఒక స్కూబా డైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉంది’ అంటుంది అతుల్య. అది నిజం కాదు!‘సాధారణంగా మేము సుమారు 50 మీటర్ల లోతు వరకు డ్రైవ్ చేస్తాము. నీటి అడుగున స్వచ్ఛమైన ఆక్సిజన్ను తీసుకువెళ్తామని చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదు’ అంటుంది అతుల్య. వారు ఉపయోగించే గాలిలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్ ఉంటాయి. నిర్దిష్ట లోతుకు మించి స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఉపయోగిస్తే అది విషపూరితంగా, ప్రమాదకరంగా మారుతుంది. లోతైన డైవ్ల కోసం హీలియం మిశ్రమాలను ఉపయోగిస్తారు. కొన్ని డైవ్ల తరువాత గొంతు మారే అవకాశం ఉంటుంది.చరిత్ర గర్భంలోకి!కోజికోడ్ సమీపంలో కుంజలి మారక్కర్ చరిత్రతో సంబంధం ఉందని నమ్మే ప్రాంతంలో డైవ్ చేస్తున్నప్పుడు రాళ్లతో మూసివేయబడిన అనేక పురాతన కట్టడాలను అతుల్య చూసింది. తిరువనంతపురంలో డైవ్ చేస్తున్నప్పుడు గుహల ప్రవేశద్వారాల్లా కనిపించే ఒక కట్టడాన్ని చూసింది. ‘సముద్ర గర్భం ఒక రహస్య భాండాగారం లాంటిది. ఈ ప్రదేశాలను మనం లోతుగా అధ్యయనం చేస్తే తెలియని విషయాలెన్నో కనుగొనవచ్చు’ అంటుంది అతుల్య.మరో ప్రపంచంలోకి...ఆసక్తి, ధైర్యం, శారీరక బలం ఉంటే ఎవరైనా కమర్షియల్ స్కూబా డైవింగ్ చేయవచ్చు. నీటి అడుగులోకి వెళ్లినప్పుడు అత్యంత సుందర దృశ్యాలు కనిపిస్తాయి. బయట మనం ఎప్పుడూ, ఎక్కడా చూడని రంగులు, అద్భుతాలు కనువిందు చేస్తాయి. చేపలు గుంపులుగా కలిసి తిరగడం, ఆక్టోపస్ రంగు మార్చుకోవడం చూడటం వంటివి అద్భుతమైన అనుభవాలు. నీటి అడుగున ఉన్న ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన అందం ఉంది. దీనితోపాటు ప్రమాదాలు కూడా ఉంటాయి. బలమైన ప్రవాహాలు, సుడిగుండాలు, నీటి అడుగున విద్యుత్తీగలు, స్టోన్ఫిష్, స్ట్రింగే, లయన్ఫిష్ వంటి ప్రమాదకరమైన సముద్ర జీవులు, వీటితో పాటు కఠినమైన వాతావరణ పరిస్థితులు స్కూబా డైవింగ్ను సవాలు చేస్తాయి. లోతుకు వెళ్లే కొద్దీ చుట్టూ చీకటి ఆవహిస్తుంది. దారి తెలుసుకోవడానికి టార్చ్లైట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. పదునైన రాయిలాంటి చిన్న వస్తువు కూడా ప్రమాదకరంగా మారవచ్చు. డైవింగ్ చేస్తున్నప్పుడు భద్రతకు సంబంధించిన ఆలోచనలు వస్తూ పోతుంటాయి.– అతుల్య -
ఫీజు బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
సాక్షి, హైదరాబాద్/ఘట్కేసర్: ‘తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను గాలికొదిలేసిందని విమర్శించారు. సోమవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఘట్కేసర్ వీబీఐటీ క్యాంపస్లో ‘వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్క్లేవ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్–భవిష్యత్ సవాళ్లు, 2047 వికసిత్ భారత్ లక్ష్యం, 12 ఏళ్ల మోదీ పాలన తదితర అంశాలపై పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానమిచ్చారు. మన యువతది తుక్డే తుక్డే మైండ్సెట్ కాదు‘ఇతర దేశాల్లో సాగుతున్న జెన్–జీ ఉద్యమాలను అందిపుచ్చుకోవాలంటూ కొన్ని రాజకీయశక్తులు మన దేశంలోని యువతను రెచ్చగొడుతున్నాయి. కానీ భారత్లోని జెన్–జీ ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కాదు. మన యువత అరాచకాలను విశ్వసించదు. ఇది రాళ్లు విసిరే తరం కాదు... జాతిని నిర్మించే తరం.. వారిది తుక్డే తుక్డే మైండ్సెట్ కాదు. యువ భారతీయులు దేశాభివృద్ధికి, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్ భారతానికి వారి వంతు కృషి చేస్తున్నారు’ అని నితిన్ నబీన్ పేర్కొన్నారు. ‘జీవితానికి అడ్డదారులు ఉండవు...యువత, విద్యార్థులు ఏ విషయంలోనూ సత్వర మార్గాలు ఎంచుకోవద్దని.. జీవితానికి అడ్డదారులు ఉండవని నితిన్ నబీన్ సూచించారు. ‘జీవితం అనేది ఒక సుదీర్ఘ పరుగు. ఇది 100 మీటర్ల పరుగుపందెం కాదు. ఇది ఓపికకు పరీక్ష’ అని వివరించారు. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినంత సమయం తీసుకోవాలని.. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి ఆ నిర్ణయం సరైనదా కాదా అనే చర్చ జోలికి వెళ్లరాదని సూచించారు. విద్యార్థులు వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అప్పుడే వారిలోని అసలైన సామర్థ్యం బయటపడుతుందన్నారు.తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని.. అలా తొలినాళ్లలో తన భవిష్యత్తు ఏమవుతుందోనని గందరగోళానికి గురైనట్లు చెప్పారు. ఈ క్రమంలో తనకు లభించిన ఎలాంటి పనినైనా నిబద్ధతతో పూర్తి చేస్తూ అందులో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశానన్నారు. ఈ కాన్క్లేవ్లో నల్సార్, ఐఎస్బీ, హెచ్సీయూ, కేయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీ, హార్వార్డ్, ఎన్ఐటీ, ఇఫ్లూ, బిట్స్ తదితర విద్యాసంస్థల నుంచి దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్, మహారాష్ట్ర మంత్రి ఆశిష్ సెల్లార్, ఎంపీ రేఖా శర్మ, బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేవైఎం అధ్యక్షుడు గణేశ్ కుండె, మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి, టెన్నిస్ క్రీడాకారిణి రష్మిక శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. -
జూన్.. అసాధారణం
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అసాధారణ వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది జూన్ నెల ప్రజలను అల్లాడించింది. ఈ నెలలో వాతావరణం సాధారణానికి భిన్నంగా, ఆందోళనకరంగానే కనిపించింది. దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 28 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 మి.మీ. కాగా, కేవలం 85.2 మి.మీ. మాత్రమే నమోదైంది. సుమారు 43 శాతం లోటు ఏర్పడింది.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడటం గత 125 ఏళ్లలో ఇది ఐదోసారి. జూన్లో 100 మి.మీ. కంటే తక్కువగా వర్షపాతం నమోదుకావడమనేది గతంలో 1905, 1926, 2009, 2014 సంవత్సరాలలో మాత్రమే జరిగింది. నైరుతి రుతుపవనాలు కేరళను కొంచెం ఆలస్యంగా జూన్ 4న తాకినప్పటికీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వాటి విస్తరణ పూర్తిగా మందగించింది. భారీ లోటు వర్షపాతం...ప్రాంతాల వారీగా చూస్తే, మధ్య భారతదేశంలో అత్యధికంగా 56 శాతం లోటు ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో 43 శాతం, దక్షిణాదిలో 31 శాతం, వాయవ్య రాష్ట్రాల్లో 29 శాతం లోటు నమోదైంది. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం, 1901 సంవత్సరం తర్వాత ఈ జూన్ మూడవ అత్యంత పొడి నెలగా నిలిచింది. ఇంతటి తీవ్ర వర్షపాత లోటు ఏర్పడటం 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే నమోదైంది.ఎల్నినో ప్రభావం కొంతమేర ఉన్నప్పటికీ... హిందూ మహాసముద్ర డైపోల్ తటస్థంగా ఉండటం, భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ఇచ్చే మేఘాల వ్యవస్థ భారత్కు అనుకూలమైన దిశలో లేకపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం, వాయవ్య భారతం నుంచి వీచిన వేడిగాలులు క్లౌడ్ ఫార్మేషన్ను అడ్డుకోవడం తదితర వాతావరణ పరిస్థితులు ఏకమవడంతో రుతుపవనాలు స్తంభించిపోయాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 315 జిల్లాలు ప్రభావితందేశంలో మొత్తం 724 జిల్లాల్లో ఏకంగా 315 జిల్లాలు తక్కువ వర్షపాతం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిలో 25 శాతం కంటే తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న 111 జిల్లాలను ‘అత్యంత అప్రమత్తత’ జిల్లాలుగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఆ జిల్లాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాలకు చెందిన జిల్లాలు ఉన్నాయి. వాటి కోసం ‘డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కాంటింజెన్సీ ప్లాన్స్’ సిద్ధం చేశారు. అక్కడ తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు వేయడం, విత్తనాల మార్పిడి వంటి వ్యూహాలను అమలుచేయనున్నారు. -
తమిళనాట మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి, చెన్నై: కరూర్ నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎం.ఆర్.విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. చెన్నైలోని సచివాలయంలో శాసనసభ స్పీకర్ జె.సి.డి.ప్రభాకర్ను కలిసి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన రాజీనామాను తక్షణమే ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శాసనసభ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేసిన 25 మంది ఎమ్మెల్యేల్లో ఎం.ఆర్. విజయభాస్కర్ ఒకరు. ఆ సమయంలో వీరి పార్టీ పదవులను పళనిస్వామి రద్దుచేశారు.ఆ తర్వాత వారు మళ్లీ పళనిస్వామితో రాజీ పడినా, వారికి తిరిగి పార్టీ పదవులు దక్కలేదు. గత వారం ఎం.ఆర్.విజయభాస్కర్ను అన్నాడీఎంకే ప్రచార సంయుక్త కార్యదర్శిగా పళనిస్వామి నియమించారు. అయినప్పటికీ, కరూర్ జిల్లా కార్యదర్శి పదవిని మాత్రం ఆయనకు ఇవ్వలేదు. ఈ కారణంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయభాస్కర్ సోమవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన మధురాంతకం ఎమ్మెల్యే మరగద కుమారవేల్, ధారాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్, అంబాసముద్రం ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య, విరాలిమలై ఎమ్మెల్యే సి.విజయభాస్కర్ తమ పదవులకు రాజీనామా చేశారు. సి.విజయభాస్కర్ సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరబోతున్నట్టు సమాచారం. తాజాగా ఎం.ఆర్.విజయభాస్కర్ రాజీనామా చేయడంతో అన్నాడీఎంకే నుంచి బయటకు వచి్చన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది.స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు ఎంఆర్ విజయ భాస్కర్ రాజీనామా లేఖ సమర్పణ -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్గా రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త పార్ట్టైమ్ చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ని బ్యాంక్ బోర్డు ఎంపిక చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆమోదించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆయన పదవీకాలం ఉంటుంది. ఈ ఏడాది మార్చి నెలలో అకస్మాత్తుగా వైదొలిగిన అతాను చక్రవర్తి స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే జూన్ 30 నుంచి నాలుగేళ్ల పాటు ఆయన స్వతంత్ర డైరెక్టరుగా ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్రకు లోబడి రాజీవ్ కుమార్ నియామకం ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు, ఆర్థిక రంగానికి పునరుజ్జీవం కల్పించిన వ్యక్తిగా ఆయన పేరొందారు. 2017లో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్.. నిర్ణయాత్మక విధానాలతో బ్యాంకింగ్ను గాడిలో పెట్టారు. ఆయన 25వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కూడా సేవలు అందించారు. -
గ్రేడ్–4, 5 సచివాలయ కార్యదర్శులకు వేధింపులు
సాక్షి, అనకాపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లాలో పంచాయతీ సెక్రటరీల స్థానిక కేడర్ కేటాయింపుల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. గ్రేడింగ్ విధానంలో దొర్లిన తీవ్ర అసమతుల్యతలు, జోనల్ విభజన లోపాల కారణంగా ఏజెన్సీలో ఉన్న సచివాలయ గ్రేడ్–5 కార్యదర్శులకు, మైదాన ప్రాంతంలో ఉన్న గ్రేడ్–4 కార్యదర్శులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సీనియారిటీ ఉన్నప్పటికీ అల్లూరి, అనకాపల్లి జిల్లాలో దాదాపు 400 మంది పంచాయతీ సెక్రటరీలు తమ సొంత జిల్లాలకు శాశ్వతంగా దూరమై... స్థానికతను కోల్పోయి.. తమ కుటుంబాలకు వందల కిలోమీటర్ల దూరంలో నివసించాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్రేడ్–4, గ్రేడ్–5లో సచివాలయ కార్యదర్శులు మాత్రమే ఉండడడంతో, తాజా వ్యవహారం వీరిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే పరిగణించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు విమర్శిస్తున్నాయి.అసలు సమస్య ఏమిటి?కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకారం స్థానిక కేడర్ కేటాయింపులు జరపాల్సిఉంది. అంటే ఉద్యోగి భవిష్యత్తులో ఏ జిల్లాలో, ఏ జోన్లో సేవ చేయాలో ఇప్పుడే నిర్ణయించడం జరుగుతుంది . ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఐదు గ్రేడ్లు (1,2,3,4,5) ఉన్నాయి. ఈ గ్రేడ్లకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం కొత్తగా 4 కేటగిరీలను ప్రతిపాదించింది. ఇందులో ఒకటి స్పెషల్ గ్రేడ్ (10,000 కంటే ఎక్కువ జనాభా లేదా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న పంచాయతీలు)కాగా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నాయి. మొదటి 4, 5 గ్రేడ్లను కొత్తగా తీసుకువచ్చి గ్రేడ్–3లో విలీనం చేయాలి. అయితే ఈ ప్రక్రియలో ముందుగా చేయాల్సిన.. గ్రామ పంచాయతీల రీ–కేటగిరైజేషన్ (నాలుగుగా) చేయకుండా, పాత గ్రేడింగ్ ఆధారంగానే (ఐదు గ్రేడింగ్ల ప్రాతిపదికనే) కేటాయింపులు జరుగుతున్నాయని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. దీనివల్ల లోకల్ క్యాడర్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ విషయంలో భారీ అసమానతలు వస్తున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లికి సంబంధించి 180 మంది, అల్లూరికి సంబంధించి 228 మంది.. మొత్తం 400 మంది పంచాయతీ సెక్రటరీలు దీనివల్ల తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురవుతారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంత జరుగుతున్నా.. డిప్యూటీ సీఎం, ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదంటూ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. జోన్ల విధానంతో పరస్పర బదిలీలకూ సమస్యఉమ్మడి విశాఖ జిల్లా విడిపోయి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా మారాయి. కానీ గ్రేడింగ్ తగిన విధంగా జరగలేదు. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లాకు చెందిన ఉద్యోగులు అనకాపల్లిలో పనిచేస్తున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఉద్యోగులు అల్లూరిలో పనిచేస్తున్నారు. రీ–కేటగిరైజేషన్ లేకుండా లోకల్ కేడర్ ఫిక్స్ చేస్తే ఈ పోస్టింగులే శాశ్వతం అవుతాయన్నది సంబంధిత 400 మంది పంచాయతీ కార్యదర్శుల ఆవేదన. ఇక రెండు ప్రాంతాలూ వేర్వేరు జోనల్ పరిధిలోకి చేరడం వల్ల పరస్పర బదిలీలూ కష్టతరమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జోన్–1లో విశాఖ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం ఉండగా, జోన్–2లోకి అల్లూరి, తూర్పుగోదావరి, పోలవరం ప్రాంతం ఉండడం గమనార్హం. పైగా గతంలో గిరిజన ప్రాంతంలో 2 సంవత్సరాలు పనిచేస్తే తిరిగి మైదాన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు లోకల్ కేడర్ ఫిక్స్ అయితే.. చాలామంది ఉద్యోగ జీవితమంతా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండాల్సి రావచ్చని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.జూలై 5 వరకూ గడువిచ్చినా.. ప్రయోజనమేది?ప్రభుత్వ జీవో ప్రకారం ముందుగా గ్రామ పంచాయతీలను కొత్త గ్రేడ్లలోనికి మార్చాలి. తర్వాత పోస్టులను తిరిగి వర్గీకరించాలి. అనంతరం స్థానిక కేడర్కి కేటాయించాలి. అయితే ఈ మూడు దశల్లో మొదటి దశ పూర్తి కాకుండానే మూడో దశకు ప్రభుత్వం వెళ్లిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. నిజానికి ఉద్యోగ సంఘాల ఒత్తిడితో ఆప్షన్లు నమోదు చేసే గడువును జూలై 5 వరకు పెంచడం జరిగింది. అయితే అసలు సమస్య.. రీ–కేటగిరైజేషన్, జోన్లకు సంబంధించిన లోపాలు, గ్రేడింగ్ అసమానతలు సరిచేయకుండా.. ఆప్షన్ల ఎంపికకు గడువు పొడిగించినా ప్రయోజనం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు– ముందుగా గ్రామ పంచాయతీల రీ–కేటగిరైజేషన్ పూర్తి చేయాలి. – పాత గ్రేడింగ్ ఆధారంగా లోకల్ కేడర్ను ఖరారు చేయకూడదు.– జోనల్ విభజనలోని లోపాలను తొలుత సవరించాలి.– ఉద్యోగులు తమ సొంత జిల్లాల్లో పనిచేసేలా అవకాశం కల్పించాలి.– తుది స్థానిక కేడర్ కేటాయింపులను.. రీ–కేటగిరైజేషన్ తర్వాత మాత్రమే చేపట్టాలి.– ముందుగా రీ–కేటగిరైజేషన్ చేస్తే పాత గ్రేడ్–4, గ్రేడ్–5 మధ్య ఉన్న అసమానత తొలగిపోతుంది. వీటిలోని అందరూ కొత్తగా గ్రేడ్–3 లోకి వస్తారు. – దీంతో పోస్టుల పంపిణీ సమానంగా జరిగి లోకల్ కేడర్ కేటాయింపులు మరింత న్యాయంగా జరిగే అవకాశం ఉంటుంది.– జిల్లాల మధ్య సమతుల్యత ఏర్పడి ఆయా ఉద్యోగులు సొంత జిల్లాలకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి. -
నేడు విశాఖకు రాష్ట్రపతి
సాక్షి, విశాఖపట్నం/అనంతపురం/న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళ, బుధవారాల్లో ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా ప్రత్యేక విమానంలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ చేరుకోనున్న రాష్ట్రపతి, మధ్యాహ్నం 3.10 గంటలకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూ) తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం వాయుమార్గంలో సాయంత్రం 5 గంటలకు బెంగళూరు బయలుదేరి వెళతారు. జూలై 1న ఉదయం 9.30 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురం శివారులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. అనంతరం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళతారు. -
ఐఐపీకి తయారీ బూస్ట్
న్యూఢిల్లీ: తయారీ రంగం పనితీరు మెరుగ్గా ఉండటంతో మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం నెల ఇది 4.9 శాతంగా ఉంది. 2022–23ని బేస్ ఇయర్గా మార్చాకా, కొత్త సిరీస్ ప్రాతిపదికన ఐఐపీ గణాంకాలను ప్రకటించడం ఇది వరుసగా రెండో నెల. ఐఐపీ సూచీలో 463 ఐటమ్ గ్రూప్లు ఉంటాయి. 234 గ్రూప్లకు మొత్తం సూచీ వెయిటేజీలో 36.02 శాతం వాటా ఉంది. తాజాగా మైనింగ్, క్వారీయింగ్ రంగం వృద్ధి మైనస్ 1.6 శాతంగా ఉండగా, తయారీ రంగం 5.5 శాతం, విద్యుత్–గ్యాస్ సరఫరా విభాగం 9.9 శాతం వృద్ధి చెందినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తయారీ రంగంలో అంతర్గతంగా 23 గ్రూప్లలో 16 గ్రూప్లు సానుకూల పనితీరు కనపర్చాయి. మోటర్ వాహనాలు (14.5%), ఎలక్ట్రికల్ పరికరాలు (20.8 %), బేసిక్ మెటల్స్ (4.6%) టాప్ 3 విభాగాలుగా నిల్చాయి. బేస్ ఎఫెక్ట్ కారణంగా జూన్లో ఐఐపీ వృద్ధి 5.7%కి మెరుగుపడొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ మేఘా ఆరోరా తెలిపారు. -
టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి!
సాక్షి, చెన్నై : తమిళనాడులో టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మిత్ర పక్ష పార్టీల నేతలతో బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం విజయ్ సమావేశం నిర్వహించనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలు గెలుచుకున్న అనంతరం.. కాంగ్రెస్, విడుతలై చిరుతైగళ్ కట్చి, సీపీఐ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీల మద్దతుతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వంలో వీసీకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్లకు చెందిన ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ఉన్నారు.ఈ క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకేలు ఇరకాటంలో పెట్టే విధంగా దూకుడు పెంచడంతో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పార్టీలను ఏకం చేసి, కొత్త కూటమి దిశగా విజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా నేడు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ఆ విషయమై చర్చించడంతోపాటు ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను ఎలా చిత్తు చేయాలనే అంశంపై కూడా చర్చించబోతున్నారు. రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంతో పాటు ప్రభుత్వం చేపట్టబోయే వివిధ ప్రజా శ్రేయస్సు ప్రాజెక్టుల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. స్టాలిన్ వ్యాఖ్యలతో ప్రాధాన్యత అసెంబ్లీకి ఎప్పుడైనాఎన్నికలు రావచ్చు అంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు విజయ్లో దూకుడు పెంచినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నేడు సంకీర్ణ పార్టీల అగ్ర నేతల సమావేశమే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు. ఈ కీలక సమావేశంలో పాల్గొనాల్సిందిగా సంకీర్ణ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నాయకులను ప్రభుత్వ మంత్రులు ఎన్.ఆనంద్, ఆదవ్ అర్జున స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో విడుతలై చిరుతైగళ్ కట్చినేత తిరుమావళవ¯Œను నేరుగా కలిసి చర్చించారు. ఆహ్వాన పత్రం అందజేశారు. కూటమిని పటిష్టం చేసుకునే దిశగా సాగుతున్న ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.జూలైలో కరూర్కు సీఎం విజయ్గత సంవత్సరం సెపె్టంబర్ 27న కరూర్లో నిర్వహించిన టీవీకే ప్రచార ర్యాలీలో ఊహించని విధంగా జరిగిన భారీ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసందే. ఆ తర్వాత భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధిత కుటుంబాలన్నింటినీ మహాబలిపురంకు పిలిపించి విజయ్ పరామర్శించారు. వారిని ఓదార్చడమే కాకుండా, ప్రతి బాధిత కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఆర్థి క సహాయం అప్పట్లోనే అందజేశారు. అదే సమయంలో ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ 41 కుటుంబాల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం విజయ్ జూలై మొదటి లేక రెండో వారంలో కరూర్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ పర్యటన ఏర్పాట్లపై పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఆనంద్ కరూర్ జిల్లా నేతలతో చర్చించారు. -
గంటకో బ్రేక్.. హెల్త్కి బూస్ట్!
వాషింగ్టన్: రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యమంటారు. రోజంతా ఆఫీసు పనితోనే సరిపోతూంటే వ్యాయామానికి తీరుబడి ఎక్కడ అంటారు చాలామంది. అచ్చంగా ఇలాంటి వారి కోసమే ఈ కథనం. స్పెషల్ టైమ్ అని కాకుండా... ఆఫీసు లేదా ఇంట్లోనే గంటకోసారి ఐదు నిమిషాలపాటు అటు ఇటు నడిచినా చాలు.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేంత వ్యాయామం చేసినట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా.. ఈ ఐదు నిమిషాల బ్రేక్ మీ మూడ్ను సరిచేయడంతోపాటు నిస్సత్తువను తగ్గిస్తుందని.. అదే సమయంలో మీ పని సామర్థ్యం మాత్రం తగ్గదని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురితమైన తాజా అధ్యయనం తెలిపింది. అమెరికాలోని నేషనల్ పబ్లిక్ రేడియో ‘బాడీ ఎలక్ట్రిక్ చాలెంజ్’పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో సుమారు 19,300 మంది పాల్గొన్నారు. వీరిలో సుమారు 11,484 మంది వారికి ఇష్టం వచ్చిన సమయంలో ఐదు నిమిషాలపాటు వాకింగ్ చేసేవారు. కొందరు అరగంటకు ఒకసారి చేస్తే మరికొందరు 60, 120 నిమిషాల విరామంతో చేసేవాళ్లు. ఇలా 21 రోజులు గడిచిన తరువాత వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ బ్రేక్లు వారి శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిలోనూ సానుకూల మార్పు తెచ్చినట్లు తెలిసింది. కాకపోతే అరగంటకు ఒకసారి కాకుండా.. రెండు గంటలకు ఒక బ్రేక్ ఇవ్వడం ఆచరణసాధ్యమైన విషయంగా గుర్తించారు. -
ఆ నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో భవ్య రామమందిరంలో లక్షలాది మంది భక్తులు భక్తితో విరాళమిచ్చిన కోట్ల రూపాయల నగదు, స్వర్ణాభరణాలను ఆలయ సిబ్బంది కొంతమేర దోచేశారన్న వార్తలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయోధ్యలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులైన న్యాయవాదులు సైతం తమదైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన విరాళాలను సిబ్బంది తమ స్వార్థం కోసం కాజేసిన వైనంపై బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మహాపరాధం చేసిన నిందితుల తరఫున ఒక్క లాయర్ కూడా వాదించడానికి వీల్లేదని అసోసియేషన్ తీర్మానం చేసింది. అవసరమైతే సీబీఐ విచారణను కోరతామని సంఘం అధ్యక్షుడు కాళికా ప్రసాద్ చెప్పారు. మరోవైపు అత్యంత కీలకమైన అంశం కావడంతో కూలంకషంగా చర్చించాలని, హడావుడిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని సర్వోన్నత న్యాయస్థానం సైతం భావించింది. వెంటనే కేసును విచారించాలంటూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టబోమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టంచేసింది. అయోధ్యను విడిచి వెళ్లండి ఆలయ ట్రస్టీలుగా వ్యవహరించిన చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావులు మూడు రోజుల్లోగా అయోధ్య నగరాన్ని విడిచి వెళ్లాలని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అల్టిమేటమ్ జారీ చేసింది. సోమవారం జరిగిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. ‘‘మూడ్రోజుల్లోగా ఈ ముగ్గురూ అయోధ్యను విడిచి వెళ్లాలి. మూడ్రోజులు దాటితే అయోధ్యను దిగ్బంధిస్తాం. అప్పుడు ఎవరూ బయటకు వెళ్లలేరు’’అని సంఘం హెచ్చరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో నిందితుల తరఫున కోర్టులో వాదించే ప్రసక్తే లేదని సంఘం స్పష్టంచేసింది. తమ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారికి రూ.5 లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ 2005లోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. అప్పట్లో తాత్కాలిక రామమందిరంపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనలో నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాదులంతా నిరాకరించారు. దీంతో లక్నో లాయర్ ఒకరు వాదించడం తెల్సిందే. ఆకాశమేమీ ఊడిపడదుగా రామ మందిర విరాళాల చోరీ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘‘అంత అవసరం ఏముంది? ఆకాశమేమీ ఊడిపడటం లేదు’’అని కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసవి సెలవుల తర్వాతే విచారణకు స్వీకరిస్తామని జస్టిస్ సుందరేశ్, జస్టిస్ షీల్ నాగుల వెకేషన్ బెంచ్ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల మళ్లింపు, నిధుల దురి్వనియోగం ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ న్యాయవాదులు అజయ్ రాయ్, దినేశ్ యాదవ్ ఈ పిటిషన్ వేసినట్లు న్యాయవాది గోస్వామి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ఆలయ నిధుల మళ్లింపు ఆరోపణలు చాలా తీవ్రమైనవి. విరాళాల రిజిస్టర్లు, బ్యాంకు రికార్డులు, సాఫ్ట్వేర్ డేటాబేస్, సీసీటీవీ ఫుటేజీ తదితర ఎల్రక్టానిక్ సాక్ష్యాధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. వాస్తవాలను వెలికితీసేలా తక్షణమే విచారణ చేపట్టి, సాక్ష్యాలను భద్రపరిచేలా ట్రస్ట్కు, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి’’అని కోర్టును లాయర్ కోరారు. నగదు లెక్కింపు సిబ్బందిని తొలగించాలనుకున్న ఎస్బీఐ నగదు లెక్కింపుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానించిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) మూడు నెలల క్రితమే ఆలయంలోని తమ ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలని భావించినట్లు తెలుస్తోంది. ‘‘నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 జీతంతో కొందరిని ఎస్బీఐ ఆలయంలో విరాళాల నగదు లెక్కింపు కోసం నియమించుకుంది. అయితే ఈ లెక్కింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఎస్బీఐకి అనుమానం వచ్చింది. వెంటనే వాళ్లను ఉద్యోగాల నుంచి తీసేయాలని భావించింది. తొలగింపు యోచనను పసిగట్టిన ఆలయ ట్రస్ట్ సభ్యులు ఈ ప్రక్రియను ఆదిలోనే అడ్డుకున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కొలువుల్లో కొనసాగాల్సిందేనని పట్టుబట్టారు’’అని ఎస్బీఐలోని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఎస్బీఐ తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు అంశంపై ట్రస్ట్ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. ‘‘అయోధ్యలో లూఠీ సంగతి ఇప్పటికే బహిర్గతమైంది. ఇక కాశీ, మథుర సంగతే తేలాల్సి ఉంది. తాత్కాలిక సిబ్బందిని కాపాడుతున్నది ఎవరు? నాగపూర్(ఆర్ఎస్ఎస్), ఢిల్లీ(ఎన్డీఏ సర్కార్).. ఇందులో ఏది?’’అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ప్రశ్నించారు. -
పేదల పొట్ట కొట్టి.. కార్పొరేట్లకు కట్టబెట్టి!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు భూముల సంతర్పణ చేసే కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తోంది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో సంస్థ ఏర్పాటు చేస్తోన్న మెగా ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 2,467.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని నమ్ముకుని దశాబ్దాలుగా సాగు చేసుకుంటోన్న 195 మంది పేద శివాయి జమేదార్లకు 233.91 ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే ఎకరాకు రూ.5 లక్షల చొప్పున అరకొర ఎక్స్గ్రేíÙయా ప్రకటించింది. అది కూడా నష్టపోతున్న మొత్తం భూమికి కాకుండా కేవలం కొంత భాగానికే పరిహారాన్ని పరిమితం చేసింది. టీడీపీ ఆఫీసుకు 2 ఎకరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో 2.002 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన ఈ భూమిని, కేవలం ఏడాదికి ఎకరాకు రూ.1,000 నామమాత్రపు లీజు ధరతో 66 ఏళ్ల పాటు (99 ఏళ్లకు పొడిగించేలా) టీడీపీ జిల్లా అధ్యక్షుడి పేరుతో కేటాయించింది. అలాగే, చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని కంగుంది రెవెన్యూ గ్రామంలో ఉన్న 529.34 ఎకరాల అడవి పోరంబోకు భూమి స్వభావాన్ని ఏడబ్ల్యూడీ (అసెస్డ్ వేస్ట్ డ్రై ల్యాండ్)గా మారుస్తూ మరో జీవో జారీ చేసింది -
తడవని మడి.. కంటతడి
తొలకరి పలకరించడంతో పత్తి విత్తనాలు నాటుకున్న ఈ రైతు పేరు సుధాకర్. మెదక్ జిల్లా బద్యతండాకు చెందిన ఈయన పది వేల రూపాయలు ఖర్చు చేసి ఎకరంలో పత్తి విత్తనాలు విత్తాడు. వర్షాలు లేకపోవడంతో మొలకలు రావడం లేదు. దీంతో సుధాకర్, అతని కుటుంబ సభ్యులు బకెట్లతో ఇలా నీళ్లు పోసుకుంటున్నారు. కనీసం ఈ నీళ్లతోనైనా మొలకలు వస్తాయనే ఆశతో ఉన్నారు. జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన రైతు మందరాజు మూడున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో సబ్సిడీ కింద వచ్చిన డ్రిప్ పైపులను గట్టు వెంట నేల కింద నుంచి 25 పైపులను ఏర్పాటు చేసి, 500 మీటర్ల దూరంలోని బోరునుంచి ఏర్పాటు చేసి పత్తి విత్తులకు సాగునీరు అందిస్తున్నారు. ఈయన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన మేకల నరేశ్. తనకున్న పది ఎకరాల భూమిలో ఏటా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తాడు. ఈ సీజన్లో వర్షాలు లేక పోవడంతో 8 ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. భూమిలో నీరు అడుగంటి పోగా గత ఏడాది వరకు రూ.5 లక్షల ఖర్చుతో 18 బోర్లు వేశాడు. అందులో ఒక్కటీ సక్సెస్ కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆయకట్టు రైతులు ముమ్మరంగా బోర్ల తవ్వకాలు చేపట్టారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నేటి వరకు నీటి వరద రాకపోవడంతో సాగునీటిపై రైతులకు ఆశలు సన్నగిల్లాయి. 20 ఏళ్ల నాటి కరువు ఛాయలు మళ్లీ అలుముకుంటుండటంతో రైతాంగం బోర్లు వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. చిలుకూరు, నారాయణపురం, రామాపురం, ఆర్లెగూడెం, పోలేనిగూడెం, బేతవోలు చుట్టుపక్కల గ్రామాలు రైతులు బావులవైపు మొగ్గుచూపుతున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఖరీఫ్ సీజన్కు అత్యంత కీలకమైన జూన్ మాసం నేటితో ముగుస్తుండటంతో రైతుల కళ్లన్నీ ఆకాశంపైనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు దాదాపు 15 రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించడం, వచ్చిన తర్వాత కూడా వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. మొత్తం 621 మండలాలకుగాను 485 మండలాల్లో సాధారణం నుంచి లోటు, భారీ లోటు ఉండగా, 86 మండలాల్లో భారీ, 216 మండలాల్లో లోటు, 183 మండలాల్లో సాధారణంగా నమోదైంది. ఉమ్మడి వరంగల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. హనుమకొండ జిల్లాలో 72 శాతంతో భారీ లోటు కాగా, వరంగల్ జిల్లాలో 57 శాతం, సిద్దిపేటలో 50శాతం లోటు ఉంది. ఇప్పటికే తొల కరి వానలను నమ్ముకుని పత్తి, మొక్క జొన్న, కంది తదితర పంటలు వేసిన రైతులు ఇప్పు డు మొలకలను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీరు పోయించడం, బిందెలతో మొక్క మొక్కకు నీళ్లు అందించడం వంటి అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. భూగర్భజలాలపై చివరి ఆశ.. వానలు లేకపోవడంతో రైతులు భూగర్భజలాలపై ఆధారపడుతున్నారు. పాత బోర్లు ఎండిపోవడంతో కొత్త బోర్లు వేయిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మే నెలలో సగటు భూగర్భజలమట్టం 6.27 మీటర్లు, హనుమకొండలో 6.17 మీటర్లు, జనగాంలో 7.78 మీటర్ల లోతులో నమోదైంది. మరింత వర్షం లేకపోతే భూగర్భజలాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలపై నమ్మకం తగ్గడంతో కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నుంచైనా సాగునీరు అందుతుందేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో సీజన్ సాధారణంతో పోలిస్తే 25 శాతం లోపే సాగు జరిగింది. గోదావరి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఆశలు... ఇరిగేషన్ అధికారుల నివేదిక ప్రకారం వానాకాలం ప్రారంభమైనప్పటికీ ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు మిశ్రమంగా ఉన్నాయి. కృష్ణా బేసిన్లోని కీలక ప్రాజెక్టుల్లో చాలావరకు నిల్వలు తక్కువగా ఉండగా, గోదావరి బేసిన్లో కూడా పూర్తిస్థాయి నిల్వలు లేవు. అయితే గత ఏడాదితో పోలిస్తే మొత్తం ప్రధాన జలాశయాల్లో నిల్వలు మెరుగ్గా నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో 402.40 టీఎంసీలు ఉన్నాయి. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రధాన ప్రాజెక్టులు అల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల తదితర ప్రాజెక్టుల కింద 90–95 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు ఉంది. గోదావరి బేసిన్ సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మిడ్మానేరు, కడెం, శ్రీపాద ఎల్లంపల్లిల పరి«ధిలో 15.–18 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. అయితే కృష్ణా బేసిన్లో శ్రీశైలం, జూరాల, తుంగభద్రలో నిల్వలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. నాగార్జునసాగర్లో మాత్రం గత ఏడాదికంటే నిల్వలు మెరుగ్గా నమోదయ్యాయి. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మానేరు ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నిల్వలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు చేసే రైతులు వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. జూలై 15 డెడ్లైన్.. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం జూన్ 20 నుంచి జూలై 15 వరకు ప్రధాన ఖరీఫ్ విత్తనాల కాలం. ఆ తర్వాత విత్తితే... చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం. పంట ఎదుగుదల దెబ్బతినడం, దిగుబడులు తగ్గిపోవడం, కోత ఆలస్యమై మార్కెట్పై ప్రభావం పడే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. దీంతో రైతులు కూడా తక్కువ కాలంలో పండే, తక్కువ నీటితో వచ్చే పంటలు, కరువును తట్టుకునే వంగడాలపై దృష్టి పెడుతున్నారు.ఇప్పటికే కలుపు తీయాల్సింది.. నా ఐదు ఎకరాలతోపాటు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా.. ఇప్పటికే భారీ వర్షాలు కురిసి విత్తనాలు వేసుకుంటే కలుపునకు దౌరలు కొట్టి, ఎరువులు వేయాల్సింది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో విత్తనం వేసుకుంటున్నా. ఈ ఏడాది వానలు ఉండవని అంటున్నారు. కౌలు ముందే చెల్లించినా వానలు పడకుంటే నష్టపోవుడే. – పుప్పాల నాగేశ్, రైతు, నెన్నెల, మంచిర్యాల జిల్లానారు పోసి చూస్తున్న.. వానలు లేవు వానాకాలం ప్రారంభమై నెల రోజులైనా సరైన వర్షాలు లేక పంటలు వేయలేని పరిస్థితి. వరి నాట్లు వేద్దామని నారుపోసి నెలరోజులు గడుస్తున్నా వర్షం జాడలేదు. ఇప్పటివరకు ఖరీఫ్ సీజన్కు తగినంత వర్షాలు లేకపోవడంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్నాం. పత్తి విత్తనాలు పెట్టే సమయం కూడా దగ్గర పడుతుంది. బావులు, బోర్లు ఉన్న రైతులు పత్తి పంట వేసిన వాటికి సరిపడా నీటి తడి అందక మొలకెత్తే పరిస్థితి లేకుండాపోయింది.– ఈడబోయిన సారయ్య, రైతు, పీచర, హనుమకొండ జిల్లా -
అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంపు
న్యూఢిల్లీ: జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంటే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆగ్రహావేశాలు ఎక్కువవుతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో జనాభా సిద్ధాంతాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్ని రాష్ట్రాలకు సమన్యాయం దక్కేలా ఏక రీతిగా 50 శాతం సీట్లను పెంచాలని మోదీ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు కోసం తాజాగా ముసాయిదా బిల్లును తయారుచేసే పనిలో పడ్డ ఎన్డీఏ సర్కార్ అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు మీద సైతం కసరత్తు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అయితే గతంలో తీసుకొచ్చిన ముసాయిదా బిల్లు ఏప్రిల్ 17వ తేదీన మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో వీగిపోవడం తెల్సిందే. మునుపటి బిల్లును ఆధారంగా చేసుకుని కొత్తగా మోదీ ప్రభుత్వం తయారుచేసిన ముసాయిదా బిల్లులో 1971 నాటి జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య లోక్సభ సీట్ల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా జనాభా లెక్కలు పూర్తయ్యాక 2011 జనాభాలెక్కలను పక్కనపెట్టి లోక్సభ, అసెంబ్లీలో సీట్ల కేటాయింపులు జరగనున్నాయని గతంలో ప్రకటించడం తెల్సిందే. ఏప్రిల్లో పార్లమెంట్లో పరాభవం ఎదురైన నేపథ్యంలో ఈసారి మెజారిటీ సంఖ్యాబలం ఉన్న తర్వాతనే బిల్లుకు తుది రూపునిచ్చి సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 300 మంది ఎంపీల బలముంది. మూడు ఖాళీలున్నాయి. ప్రస్తుతమున్న మొత్తం సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే కొత్త బిల్లు నెగ్గాలంటే ప్రభుత్వానికి మూడింట రెండొంతులు అంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు ఉండాల్సిందే. ప్రస్తుత మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనేది 2034 ఏడాదికి ముందు అమలుచేయడం కుదరదు. 2027 జనాభా లెక్కలు పూర్తయ్యాకే ఈ రిజర్వేషన్ అమలుచేయాలని గతంలో మెలిక పెట్టారు. 2029 లోక్సభ ఎన్నికల నుంచి చట్టంలోని నిబంధనలు అమల్లోకి వస్తాయి. -
మైనింగ్ ఉత్తర్వులిచ్చింది చంద్రబాబు సర్కారే
సాక్షి, మదనపల్లె: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్య కొండల్లో మైనింగ్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ చేయబోమని మాటల్లో కాకుండా, ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి చేతల్లో చిత్తశుద్ధి చూపించాలని డిమాండ్ చేశారు. మైనింగ్ లైసెన్సులను ఎప్పుడు రద్దు చేస్తారో ప్రకటించాలని సోమవారం ఆయన డిమాండ్ చేశారు. మల్లయ్య కొండల సముదాయంలోని సాధుకొండ, శివపురం, ఎర్రకొండల్లో మైనింగ్ కోసం ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? అని సూటిగా ప్రశ్నించారు.మైనింగ్ లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబేమల్లయ్య కొండకు సంబంధించి 2025 నవంబర్ 27న చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి మైనింగ్ లైసెన్సులు జారీ చేసిందని మిథున్రెడ్డి వెల్లడించారు. ఎర్రకొండకు ‘సీఎల్’ ఇచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాదని చెప్పారు. తాజాగా బాబు ప్రభుత్వం సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వు జారీ చేసిందని చెప్పారు. ‘ఇది నిజం కాదా? టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు దాచిపెట్టి ఆ తప్పిదాన్ని గత ప్రభుత్వంపై నెట్టడం ఏమిటి?’ అని నిలదీశారు. మల్లయ్య కొండల్లో మైనింగ్పై ఇప్పటికే జారీ చేసిన మూడు ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రతి తప్పిదాన్ని గత ప్రభుత్వంపై మోపేందుకు యత్నిస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా, ఖనిజ సంపదను దోచుకోవాలని చంద్రబాబు సర్కార్ యత్నిస్తోందని ధ్వజమెత్తారు. మల్లయ్యకొండ అభివృద్ధి కోసం పైసా ఇవ్వని బాబు సర్కారు మైనింగ్ పేరుతో దోపిడీకి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ అభివృద్ధి కోసం రూ.కోట్లాది నిధులను మంజూరు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేని స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదనే విషయం అందరికీ తెలుసన్నారు. -
మృత్యుంజయులు వీరు
కారకస్: జంట భూకంపాల తాకిడికి అల్లాడిపోయిన వెనెజువెలా తేరుకుంటోంది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు జరుపుతున్న సహాయక చర్యలూ ఊపందుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం 7.2, 7.5 తీవ్రతలతో సంభవించిన భూకంపాల కారణంగా ఇప్పటివరకూ 1,700 మంది మరణించగా సుమారు 3,150 మంది గాయపడ్డారు. ఇంకో 50,000 మందికిపైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. భూకంపాల తాకిడికి సుమారు 189 భవనాలు ధ్వంసమయ్యాయి. భవన శిథిలాల కింది నుంచి ఇప్పటివరకూ 33 మంది ప్రాణాలతో కాపాడటం విశేషం. తాజాగా ఆదివారం రాజధాని కారకస్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని కారాబెల్లెడా వద్ద ప్రాంతంలో ఫ్రాన్స్, వర్జీనియాలకు చెందిన సహాయక బృందాలు తండ్రీ కొడుకులు ఇద్దరిని శిథిలాల నుంచి వెలికితీశాయి. నాలుగు రోజులుగా శిథిలాల కిందే చిక్కుకుపోయిన ఆ తండ్రి కాళ్లను చూసిన సహాయకులు నెమ్మదిగా అతడిని బయటకు తీశారు. తిండితిప్పల్లేకపోవడంతో చాలా బలహీనంగా ఉన్న ఆయన చేతిలోని స్మార్ట్ఫోన్ను గట్టిగా పట్టుకుని కనిపించారు. రక్షించిన వెంటనే అతడికి అత్యవసర వైద్యం అందించారు. కొంత సమయానికే ఆ ప్రాంతంలోనే ఒక యువకుడిని సైతం గుర్తించి రక్షించారు. వీరిద్దరూ తండ్రీకొడుకులని తెలిసింది. సహాయక బృందాల హర్షాతిరేకాల మధ్య తండ్రీకొడుకులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. బుధవారంనాటి జంట భూకంపాల తర్వాత వేలాది మంది గల్లంతైన నేపథ్యంలో సామాన్య పౌరులు శిథిలాల కింద క్షతగాత్రుల కోసం అన్వేíÙంచడం మొదలుపెట్టారు. ఒకట్రెండు రోజుల తరువాత పలు దేశాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో శనివారం లా గుయేరా నగరంలో కూలిపోయిన అపార్ట్మెంట్ శిథిలాల నుంచి పలువురు పసికందులు, 12 ఏళ్ల బాలుడిని రక్షించినట్లు సమాచారం. వీరితోపాటే ఓ పెంపుడు కుక్క సురక్షితంగా బయటపడింది. లా గువైరాలో మళ్లీ ప్రకంపనలు భూకంపం తీవ్ర ప్రభావం చూపిన లా గువైరా రాష్ట్రంలో సోమవారం మరోసారి భూమి కంపించింది. ఈ ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం దీని తీవ్రత 5.1దాకా ఉందని తెలిపింది. వెనెజువెలా కరీబియన్ తీరంలోని కారాబల్లెడాకు 27 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనం సంభవించినట్లు అధికారులు తెలిపారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కారకస్లో భారత్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ ఆపరేషన్ అమిస్తాడ్లో భాగంగా భారత ఆర్మీ వెనెజువెలా రాజధాని కారకస్లో 24 గంటలూ సేవలందించే ఫీల్డ్ హాస్పిటల్ను ప్రారంభించింది. ఇంటర్నేషనల్ లా రింకోనాడా రేస్ ట్రాక్ వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని భారత దౌత్యకార్యాలయం తెలిపింది. అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు భూకంప బాధితులకు అన్ని సేవలను ఉచితంగా అందజేస్తారంది. -
ఫిఫాలో సంచలనం.. పెనాల్టీ షూటౌట్లో జర్మనీ ఓటమి
ఫిఫా ప్రపంచకప్ 2026లో మాజీ చాంపియన్ జర్మనీ ఆట ముగిసింది. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వేతో జరిగిన పోరులో పెనాల్టీ షూటౌట్లో 4-3తో జర్మనీ ఓటమి చవిచూసింది. ఐదోసారి ఫిఫా చాంపియన్గా నిలవాలని భావించిన జర్మనీకి పరాగ్వే చెక్ పెట్టింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. జర్మనీ తరఫున ఆట 54వ నిమిషంలో కాయ్ హావెర్ట్జ్ గోల్ చేయగా, పరాగ్వే తరఫున ఆట 42వ నిమిషంలో జులియో ఎన్సియో గోల్ సాధించాడు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఇంజ్యూరీ టైమ్తో పాటు ఎక్స్ట్రా టైమ్ (మరో 30 నిమిషాలు) అదనంగా కేటాయించినప్పటికీ జర్మనీ, పరాగ్వే గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. దీంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. 2018, 2022 ఫిఫా ప్రపంచకప్పుల్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జర్మనీ ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటినప్పటికీ రౌండ్ ఆఫ్ 16ను దాటడంలో విఫలమయ్యింది. ఇక నాకౌట్ దశను దాటి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టిన పరాగ్వే జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2010 ఫిఫాలో వచ్చింది. ఆ ఏడాది ప్రపంచకప్లో పరాగ్వే క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. THE FOUR-TIME WORLD CUP WINNERS, GERMANY, ARE ELIMINATED IN THE ROUND OF 32 BY PARAGUAY ON PENALTIES.The first upset of the knockout stage 🤯 pic.twitter.com/axPr7fNdEN— ESPN (@espn) June 29, 2026🚨🚨💣 QUEL ÉNORME COUP DE TONNERRE : LE PARAGUAY 🇵🇾 ÉLIMINE L'ALLEMAGNE 🇩🇪 DÈS LES SEIZIÈMES DE FINALE DU MONDIAL !!! 🤯⚡️CONTRE TOUTE ATTENTE, LES PARAGUAYENS S'IMPOSENT AUX TIRS AU BUT CONTRE LES QUADRUPLES CHAMPIONS DU MONDE !!!C'EST UNE FOLIE, LES ALLEMANDS N'ONT PLUS… pic.twitter.com/pOz2lRnZi9— Actu Foot (@ActuFoot_) June 29, 2026 -
నేడు దోహాలో చర్చలు
దుబాయ్: ఇరాన్పై ఓవైపు దాడులు చేస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘దాడులకు తట్టుకోలేక మాతో సమావేశానికి ఇరాన్ సిద్ధపడింది. అందుకే మంగళవారం ఇరాన్ ప్రతినిధి బృందంతో సమావేశంకాబోతున్నాం. ఖతర్ రాజధాని నగరం దోహాలో ఈ సమావేశం జరగనుంది’’అని ట్రంప్ ప్రకటించారు. హార్మూజ్లో విదేశీ చమురునౌకపై ఇరాన్ దాడిచేసిందని ప్రతిగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణి స్థావరాలపై అమెరికా దాడిచేయడం, ఇందుకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడటంతో మళ్లీ పరస్పర దాడులు మొదలయ్యాయని పశి్చమాసియాలో ప్రబలిన భయాందోళనల మధ్య తదుపరి దశ చర్చలున్నాయంటూ ట్రంప్ సోమవారం ప్రకటన చేయడం గమనార్హం. అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. మంగళవారం చర్చల కోసం ఎలాంటి షెడ్యూల్ లేదు అని ఇరాన్ సీనియర్ మధ్యవర్తి కాజెమ్ ఘరిబాబాడీ స్పష్టంచేశారు. మరోవైపు చర్చల ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రకారం ఖతర్ తమకు చెందిన గతంలో స్తంభింపజేసిన 6 బిలియన్ కోట్ల డాలర్ల ఆస్తులను త్వరలో విడిపించనుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోమవారంప్రకటించారు. హార్మూజ్ జలసంధిపై తమకు ఇంకా పట్టు ఉందని, ఒప్పందానికి ఇరాన్ ప్రజల మద్దతు ఉందని తెలియజేసేందుకే పెజెష్కియాన్ ఈ ప్రకటన చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మంగళవారం చర్చలు ఉంటాయని ఈ అంశంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. సాంకేతిక అంశాలపై మరి కొద్ది రోజుల్లో చర్చలు ప్రారంభమవుతాయని అమెరికా సైతం మరో ప్రకటనలో పేర్కొంది. -
‘మైనింగ్’పై మహోగ్రం!
సాక్షి, మదనపల్లె: నిత్యం శివ నామస్మరణతో మార్మోగే మల్లయ్య కొండలు.. మైనింగ్ విధ్వంసం వద్దంటూ ‘మహా గిరి ప్రదక్షిణ’తో హోరెత్తాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతిస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మల్లయ్య కొండలు చుట్టూ 70 కి.మీ మేర ఏడున్నర గంటల పాటు భక్తులు, స్థానికులు భారీ ‘మహా గిరి ప్రదక్షిణ’ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకే మల్లయ్య కొండపైకి పెద్ద ఎత్తున చేరుకుని ముక్కంటికి పూజలు, అభిషేకాలు చేశారు. కొండ కింద అన్నదాన సత్రం వద్ద శివ భజనలు, కీర్తనలు ఆలపించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి, కలిచర్ల సింగిల్ విండో మాజీ చైర్మన్ సుధాహరరెడ్డి భక్తులతో కలసి మహాగిరి ప్రదక్షిణను ప్రారంభించారు. శివపార్వతులు కొలువుదీరిన రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తంబళ్లపల్లె, రావిమాను మీదుగా కాలి నడకన వైఎస్సార్ సర్కిల్ మీదుగా పెద్దమండ్యం రోడ్డుకు చేరుకున్నారు. అక్కడినుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన వాహనాల్లో భక్తులు మహాగిరి ప్రదక్షిణగా సాగారు. గోపిదిన్నె, కొటాల, బండ్రేవు, ముసలికుంట, పెద్దమండ్యం, కలిచర్ల, శివపురం, తురకపల్లె, వెలిగల్లు, కోటకొండ, మఠం మీదుగా తంబళ్లపల్లె చేరుకున్నారు. రథం కొండపైకి వెళ్లి ఆలయంలో పూజలు నిర్వహించాక గిరి ప్రదక్షిణ ముగించారు. దారి పొడవునా రథానికి పూజలు..మహాగిరి ప్రదక్షిణ ప్రారంభం నుంచి ముగింపు వరకు రహదారి పొడవున ప్రజలు బారులు తీరి రథానికి పూజలు నిర్వహించారు. తంబళ్లపల్లె, పెద్దమండ్యం నుంచే కాకుండా నియోజకవర్గంలోని ఇతర మండలాలకు చెందిన భక్తులు, సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లా నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మల్లయ్య కొండల్లో మైనింగ్ వద్దని నినదించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మైనింగ్ను తొలి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. భక్తుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 కి.మీ. దూరం.. ఏడున్నర గంటలు తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల మధ్యలో ఉన్న మల్లయ్య కొండల చుట్టూ నిర్వహించిన మహా గిరి ప్రదక్షిణ 70 కిలోమీటర్ల దూరం సాగింది. ఉదయం 9 గంటలకు కొండ కింద నుంచి ప్రదక్షిణ మొదలై 10 గంటలకు తంబళ్లపల్లి చేరుకుంది. అక్కడినుంచి తిరిగి తంబళ్లపల్లికి చేరేందుకు ఏడున్నర గంటల సమయం పట్టింది. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ప్రదక్షిణ మెల్లగా సాగింది. ప్రదక్షిణ విజయవంతమైందని, మైనింగ్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.శాశ్వతంగా నిషేధించాలి..భవిష్యత్తులో మల్లయ్య కొండల్లో మైనింగ్ అనే మాటే వినపడకుండా శాశ్వతంగా నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు. మైనింగ్ వల్ల ఖనిజ సంపద దోపిడీకి గురి కావడమే కాకుండా జనజీవనం అస్తవ్యస్తమవుతుందని, తీవ్ర అనారోగ్య సమస్యలు, వలసలతో కుటుంబాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ జన్మ స్థలాన్ని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోతుందని, మైనింగ్ విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉత్తర్వులు ఎలా ఇస్తుందని కన్నెమడుగుకు చెందిన దేవరింటి రామకృష్ణారెడ్డి, దేవరింటి రవిశేఖర్రెడ్డి ప్రశ్నించారు. మైనింగ్పై శాశ్వత నిషేధం విధించాలని, మల్లయ్య కొండల భవిష్యత్తుకు అదే శాశ్వత పరిష్కారం అని పేర్కొన్నారు. -
మల్లన్నకూ మోసం!
సాక్షి, అమరావతి: ఏరు దాటేదాకా.. ఓడ మల్లన్న! ఏరు దాటాక.. బోడి మల్లన్న! ఇదీ సీఎం చంద్రబాబు తీరు! సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా.. గతంలో ఉన్న పథకాలను సైతం ఎగరగొట్టి రాష్ట్ర ప్రజలను నిత్యం మోసగిస్తున్న సీఎం చంద్రబాబు ఆ శివయ్యను సైతం వదలకుండా నిర్భీతిగా వంచనకు పాల్పడుతున్నారు! తిరుమలకు ఏడుకొండలు ఎంత పవిత్రమో రాయలసీమలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండను సైతం అంతే పవిత్రంగా భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి మల్లయ్యకొండపై మైనింగ్ జరగనివ్వబోనని గతంలో నమ్మబలికిన చంద్రబాబు తాజాగా అక్కడ ఐరన్ ఓర్ మైనింగ్కు పచ్చజెండా ఊపారు. మల్లయ్యకొండను, రిజర్వు ఫారెస్టును తవ్వేసి యథేచ్ఛగా మైనింగ్కు చంద్రబాబు సర్కారు అనుమతించడంపై భక్తులు, పర్యావరణవేత్తలు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండ సముదాయంలో భాగమైన సాధుకొండ, శివపురం కొండల్లో ఐరన్ ఓర్ మైనింగ్కు కాంపోజిట్ లైసెన్స్ కోసం చంద్రబాబు సర్కారు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) జారీ చేసింది. మరోవైపు సమీపంలోని శివపురం ఐరన్ ఓర్ బ్లాక్ను ప్రైవేట్ సంస్థకు కేటాయించడం ద్వారా ఆ ప్రాంతం మొత్తాన్ని మైనింగ్ జోన్గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.రెండు బ్లాకులుగా విభజించి కాంపోజిట్ లైసెన్సులు సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్గా విభజించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు కేటాయించారు. ఈ బ్లాక్కు నిర్వహించిన ఈ–వేలంలో ఏపీఎండీసీ ఖనిజ విలువపై 130.30 శాతం అత్యధికంగా బిడ్ దాఖలు చేసి ప్రిఫర్డ్ బిడ్డర్గా నిలిచింది. ప్రభుత్వం ఆ సంస్థ నుంచి రూ.1.50 కోట్ల పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కట్టించుకుని ఖనిజ అన్వేషణకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. అదే కొండల సముదాయంలోని 626 హెక్టార్లలో శివపురం ఐరన్ ఓర్ బ్లాక్ కాంపోజిట్ లైసెన్స్ను సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్కు కేటాయించింది. ఈ సంస్థ 11.80 శాతం ఫైనల్ బిడ్ వేసి ఎల్ 1గా నిలవడంతో రూ.1.50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ కట్టించుకుని ఎల్ఐఓ జారీ చేసింది. దీంతో మల్లయ్యకొండపై అధికారికంగా మైనింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.ఆధ్యాత్మిక, జీవ వైవిధ్యానికి ప్రతీక మల్లయ్య కొండ ప్రభుత్వం రెండు బ్లాకులుగా విభజించి టెండర్లు ఖరారు చేసినా నిజానికి అది మూడు కొండల సముదాయం. సాధుకొండ, మల్లయ్యకొండ, ఇనుముకొండ కలిసి ఒకే పవిత్ర శైవక్షేత్రం. ఇక్కడ పురాతన మల్లికార్జునస్వామి ఆలయం ఉంది. రాయలసీమలో శ్రీశైలం, శ్రీకాళహస్తి తర్వాత అత్యంత విశిష్టమైన శైవక్షేత్రంగా మల్లయ్యకొండ ప్రసిద్ధి చెందింది. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. మల్లయ్యకొండ సముదాయం సుమారు 6,700 హెక్టార్ల రిజర్వు ఫారెస్టులో విస్తరించి ఉంది. ఇందులో 1,550 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలకు చంద్రబాబు సర్కారు అనుమతించింది. ఈ కొండలు జీవవైవిధ్యానికి ప్రతీక. మైనింగ్ జరిగితే ఇక్కడ కొండల స్వరూపం, అటవీ సంపద, వన్యప్రాణులు, జలవనరులు దెబ్బ తింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోచుకునే యత్నాలను ఏళ్లుగా అడ్డుకున్న స్థానికులుఈ కొండను తొలిచి ఖనిజాన్ని దోచుకోవాలని జరిగిన యత్నాలను స్థానికులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చారు. ఈ కొండల్లో వందల టన్నుల ఇనుప ఖనిజం ఉందని గతంలో కేంద్రం ప్రకటించింది. కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఇక్కడ మైనింగ్ చేయడానికి ప్రయత్నించింది. అప్పట్లో జియో మైసూర్ సంస్థకు ఖనిజ అన్వేషణ కోసం లైసెన్స్ మంజూరు చేసింది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడం, ఆందోళనలు వెల్లువెత్తడంతో ఆ సంస్థ పూర్తిస్థాయిలో అన్వేషణ చేయకుండా వెనుతిరిగింది. కొండలను రక్షిస్తానని నమ్మబలికిన బాబు మల్లయ్యకొండలో మైనింగ్ జరగనివ్వబోనని చంద్రబాబు గతంలో ప్రకటించారు. భక్తుల విశ్వాస్వాలకు అనుగుణంగా ఈ కొండను రక్షిస్తానని నమ్మబలికారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు అత్యంత రహస్యంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఇటీవలే కాంపోజిట్ లైసెన్సులు మంజూరు చేశారు. స్థానికులు ఆందోళనకు దిగుతారని పసిగట్టి గుట్టుగా టెండర్లు పిలిచి ఖనిజాన్వేషణకు అనుమతివ్వడం గమనార్హం. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకే కాకుండా మల్లికార్జునస్వామికి సైతం శఠగోపం పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మైనింగ్ను వ్యతిరేకిస్తూ స్థానికులు, శివభక్తులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మల్లయ్యకొండపై మైనింగ్కు అనుమతి ఇవ్వడం అంటే పవిత్ర శైవక్షేత్రం, రిజర్వ్ ఫారెస్ట్పై, భక్తుల విశ్వాసాలపై దాడి చేయడమేనని మండిపడుతున్నారు.ప్రకృతి ఒడిలో పరమ శివుడుతంబళ్లపల్లె: రాయలసీమలోని పవిత్ర శైవక్షేత్రం మల్లయ్యకొండకు, విజయనగర సామ్రాజ్య వైభవానికి అవినాభావ సంబంధం ఉంది. మల్లయ్యకొండ ఆలయ అభివృద్ధి అంతా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో జరిగిందని చరిత్రకారులు, శాసనాల ద్వారా తెలుస్తోంది. రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో శైవ, వైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేసిన రాయలవారు తంబళ్లపల్లె కొండల మధ్య కొలువైన ఈ ఆలయాన్ని ప్రత్యేక నిధులతో జీర్ణోద్ధరణ చేసినట్లు ప్రతీతి. చుట్టూ పచ్చని లోయలు, దట్టమైన అడవులు, మేఘాల అందాల మధ్య ఈ ఆలయ శిల్పకళా చాతుర్యం విజయనగర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. విజయనగర రాజుల కాలంలో ఈ స్వామివారి నిత్య నైవేద్యాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూములను దేవాలయ మాన్యాలుగా కేటాయించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే శతాబ్దాలుగా ఆలయ ధూపదీప నైవేద్యాలు సాగుతున్నాయి.స్వయంభువు..ఈ పవిత్ర క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జునస్వామిగా, అమ్మవారు భ్రమరాంబికా దేవిగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. ఇక్కడి ప్రధాన శివలింగం కొండల మధ్య స్వయంభువుగా వెలిసింది. ఆలయ జీర్ణోద్ధ్ధరణ సమయంలో క్షేత్ర సంప్రదాయాల ప్రకారం కొన్ని మార్పులు జరిగాయి. కాలభైరవస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా కొలువై ఆలయాన్ని రక్షిస్తున్నట్లు భక్తుల నమ్మకం. భక్తులు కొండ అడుగున వెలిసిన వినాయకుడు, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకుని కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. పైకి వెళ్లే మార్గంలో నెలమల్లేశ్వరస్వామి, ఏనుగు మల్లమ్మ, యేలక తీర్థం లాంటి పవిత్ర కోనేరులు, స్థలాలను దర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. కొండపై ప్రధాన ఆలయం వద్ద గౌరీ అమ్మవారి ఉపాలయం కూడా ఉంది. ప్రతి సోమవారం, కార్తీక మాసం, పౌర్ణమి రోజులతో పాటు మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. -
మంచుకొండల్లో విద్యుత్తు కాంతులు!
లద్దాఖ్: ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ బేస్ క్యాంప్ ఇక విద్యుత్తు ధగధగలతో మెరిసిపోనుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి డీజిల్ జనరేటర్ల ద్వారా జరుగుతున్న విద్యుదుత్పత్తికి ఇంకో రెండు నెలల్లో ముగింపు పలకనున్నారు. సియాచిన్తోపాటు నుబ్రా, జన్స్కార్ ప్రాంతాలకూ ఈ ఏడాది సెపె్టంబర్ నుంచి గ్రిడ్ ఆధారిత విద్యుత్తు అందుతూండటం దీనికి కారణం. ఫలితంగా మంచు కొండల మధ్యన దేశ సరిహద్దులను కాపాడుతున్న భారతీయ సైనికులకు కొంతమేరౖMðనా ఉపశమనం కలుగుతుందని అంచనా. భారత్, పాకిస్తాన్ల మధ్య దశాబ్దాలుగా రగులుతున్న యుద్ధానికి సియాచిన్ ప్రత్యక్ష సాక్షి. సముద్రమట్టానికి సుమారు 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ నిర్మానుష్య ప్రాంతాన్ని కాపాడుకునేందుకు భారత్ ఏటా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో జవాన్లకు విద్యుత్తు, కమ్యూనికేషన్ల అవసరం చాలా ఉంది. అయితే వీటన్నింటినీ ఇప్పటివరకూ డీజిల్ జనరేటర్ల సాయంతోనే తీర్చుకునే వారు. సోలార్ ఎనర్జీ, స్టోరేజ్ వ్యవస్థల ఏర్పాటుకూ కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ వాటితో పూర్తిస్థాయి ఫలితాలైతే దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని అభివృద్ధి ప్యాకేజీ కింద సియాచిన్ బేస్ క్యాంప్ను జాతీయ విద్యుత్తు గ్రిడ్తో అనుసంధానించాలని నిర్ణయించారు. మొత్తం రూ. 1,925 కోట్ల వ్యయంతో ద్రాస్ నుంచి పదుమ్ వరకు 189 కిలోమీటర్ల 220 కేవీ లైన్, ఫ్యాంగ్ నుంచి డిస్కిట్ వరకు 79 కిలోమీటర్ల 220 కేవీ లైన్ నిర్మిస్తున్నారు. ఈ పనులన్నింటినీ సెపె్టంబర్ నాటికి పూర్తి చేసి బేస్క్యాంపును గ్రిడ్ విద్యుత్తు వెలుగుల్లో నింపాలని లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఇటీవలే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెపె్టంబర్ 15వ తేదీలోగా ముఖ్యమైన పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తీవ్రమైన మంచు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, కష్టతరమైన రవాణా పరిస్థితులు ఉన్న సియాచిన్ వంటి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పెద్ద సవాలే. ఇప్పటివరకు ఇంధనాన్ని రవాణా, జనరేటర్ల నిర్వహణ, వాతావరణ ప్రభావాల కారణంగా వ్యయం ఎక్కువగా ఉండేది. గ్రిడ్ విద్యుత్ రాకతో ఇది గణనీయంగా తగ్గనుంది. సైనికుల వసతి, వేడినీరు, వైద్య సహాయం, కమ్యూనికేషన్ వ్యవస్థలు బలోపేతం కానున్నాయి. జవాన్ల జీవన పరిస్థితులు మెరుగు కానున్నాయి. వ్యూహాత్మకంగానూ ఈ పరిణామం చాలా కీలకం. నిరంతర విద్యుత్తు మన రక్షణ వ్యవస్థలు అన్నివేళల్లోనూ సిద్ధంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. -
ప్రకృతి ఒడిలో పరమ శివుడు
తంబళ్లపల్లె: రాయలసీమలోని పవిత్ర శైవక్షేత్రం మల్లయ్యకొండకు, విజయనగర సామ్రాజ్య వైభవానికి అవినాభావ సంబంధం ఉంది. మల్లయ్యకొండ ఆలయ అభివృద్ధి అంతా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో జరిగిందని చరిత్రకారులు, శాసనాల ద్వారా తెలుస్తోంది. రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో శైవ, వైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేసిన రాయలవారు తంబళ్లపల్లె కొండల మధ్య కొలువైన ఈ ఆలయాన్ని ప్రత్యేక నిధులతో జీర్ణోద్ధరణ చేసినట్లు ప్రతీతి.చుట్టూ పచ్చని లోయలు, దట్టమైన అడవులు, మేఘాల అందాల మధ్య ఈ ఆలయ శిల్పకళా చాతుర్యం విజయనగర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. విజయనగర రాజుల కాలంలో ఈ స్వామివారి నిత్య నైవేద్యాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూములను దేవాలయ మాన్యాలుగా కేటాయించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే శతాబ్దాలుగా ఆలయ ధూపదీప నైవేద్యాలు సాగుతున్నాయి.స్వయంభువు..ఈ పవిత్ర క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జునస్వామిగా, అమ్మవారు భ్రమరాంబికా దేవిగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. ఇక్కడి ప్రధాన శివలింగం కొండల మధ్య స్వయంభువుగా వెలిసింది. ఆలయ జీర్ణోద్ధ్ధరణ సమయంలో క్షేత్ర సంప్రదాయాల ప్రకారం కొన్ని మార్పులు జరిగాయి. కాలభైరవస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా కొలువై ఆలయాన్ని రక్షిస్తున్నట్లు భక్తుల నమ్మకం. భక్తులు కొండ అడుగున వెలిసిన వినాయకుడు, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకుని కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. పైకి వెళ్లే మార్గంలో నెలమల్లేశ్వరస్వామి, ఏనుగు మల్లమ్మ, యేలక తీర్థం లాంటి పవిత్ర కోనేరులు, స్థలాలను దర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. కొండపై ప్రధాన ఆలయం వద్ద గౌరీ అమ్మవారి ఉపాలయం కూడా ఉంది. ప్రతి సోమవారం, కార్తీక మాసం, పౌర్ణమి రోజులతో పాటు మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. -
విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ షురూ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీకి విద్యుత్ సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ట్రాన్స్కోకు 200 పోస్టులు, జెన్కోకు 100, ఈపీడీసీఎల్కు 134, సీపీడీసీఎల్కు 60, ఎస్పీడీసీఎల్కు 135 పోస్టులు కేటాయించారు. ట్రాన్స్కోలో 167 ఎలక్ట్రికల్, 23 సివిల్, 10 టెలికాం ఏఈఈ పోస్టులు ఉండగా, మిగతా పోస్టులు కూడా ఇదే తరహాలో భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు ఈ నెల 30 నుంచి ఆన్లైన్ అందుబాటులో ఉంటాయి. ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ల నుంచి రూ.1,000 రుసుం చెల్లించి దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై 20వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించడానికి గడువు ఇచ్చారు. కాగా ఆగస్టు 22 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా 47, తెలంగాణలో రెండు సెంటర్లలో, బెంగళూరు, చెన్నై, బెరంపూర్లలో ఒక్కో సెంటర్ చొప్పున మొత్తం 52 సెంటర్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. విద్యుత్ సంస్థల వారీగా పోస్టులు ఏపీ ట్రాన్స్కో: 200 (167 ఎలక్ట్రికల్, 23 సివిల్, 10 టెలికాం) ఏపీ జెన్కో: 100 (80 ఎలక్ట్రికల్, 20 సివిల్) ఏపీఎస్పీడీసీఎల్: 134 (125 ఎలక్ట్రికల్, 6 సివిల్, 3 టెలికాం) ఏపీసీపీడీసీఎల్: 60 (56 ఎలక్ట్రికల్, 3 సివిల్, 1 టెలికాం) ఏపీఈపీడీసీఎల్: 135 (128 ఎలక్ట్రికల్, 4 సివిల్, 3 టెలికాం) ఇవీ నిబంధనలు.. » నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగంలో చేరిన ప్రతి అభ్యర్థి రూ.110 నాన్ జ్యుడీషియల్ స్టాంప్పై సర్వీస్ బాండ్ సమర్పించాలి. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తయిన తర్వాత మరో 5 ఏళ్లు తప్పనిసరిగా పనిచేయాలి. అంటే మొత్తం 7 సంవత్సరాల బాండ్ కాలం అమల్లో ఉంటుంది. » ప్రొబేషన్ పూర్తికాకముందే ఉద్యోగం వదిలేస్తే అప్పటివరకు పొందిన వేతనం మొత్తం తిరిగి చెల్లించడంతోపాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. » ప్రొబేషన్ అనంతరం ఐదేళ్ల సర్వీస్ పూర్తికాకముందే రాజీనామా చేస్తే రూ.10 లక్షల లిక్విడేటెడ్ డ్యామేజెస్ చెల్లించాల్సి ఉంటుంది. » అభ్యర్థుల డిగ్రీ, జనన ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ వంటి ఒరిజినల్ సర్టిఫికెట్లను బాండ్ కాలం మొత్తం సంస్థ వద్దే జమ చేయాలి. అత్యవసరంగా సర్టిఫికెట్లు కావాలంటే ముందుగా రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాతే తాత్కాలికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. » నోటిఫై చేసిన పోస్టులకు 1:1 నిష్పత్తిలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వెయిటింగ్ లిస్ట్ ఉండదు. ఎంపికైన అభ్యర్థి చేరకపోయినా ఆ పోస్టును మరొకరితో భర్తీ చేయరు.» 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1 మధ్య తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చి స్థిరపడిన వారు స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. -
న్యాయమూర్తులున్నది ప్రజల హక్కుల పరిరక్షణకే
సాక్షి, అమరావతి: న్యాయమూర్తులున్నది ప్రజల హక్కుల పరిరక్షణకేనని, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికో, ప్రభుత్వానికి సహకారం అందించడానికో కాదని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు తెలిపారు. తమకు చట్టం ఎనలేని అధికారాలను ఇచ్చింది న్యాయ పాలనను నిలబెట్టడానికి, ప్రజల హక్కులను ప్రభుత్వాలు హరించకుండా చూడటానికే అని పేర్కొన్నారు. తాను ఎల్లప్పుడూ ఇదే సూత్రంపై పని చేశానని, దీనికి ఎప్పుడూ చింతించలేదన్నారు.మన చుట్టూ ఉన్న ఆడంబరాలు లేదా మనకు లభించే గౌరవ మర్యాదలను బట్టి మన గుర్తింపు, విశ్వసనీయత ఆధారపడి ఉండవని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉండి మన తలుపు తట్టిన ప్రతిసారీ వారికి ఏ విధంగా న్యాయం చేశామనే దానిపైనే మన అసలు గుర్తింపు ఆధారపడి ఉంటుందని చెప్పారు. న్యాయమూర్తిగా జస్టిస్ రఘునందన్రావు సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు సాయం చేయడానికి నాకు లభించిన గొప్ప అవకాశం‘నేను అడ్వొకేట్గా ఉన్నప్పుడు నా ప్రాక్టీస్ స్వభావం వల్ల, ఎక్కువ వనరులు ఉన్న కక్షిదారుల పక్షాన వాదించేవాడిని. వారికి కోర్టులు వారి హక్కులను కాపాడుకోవడానికి ఉన్న అనేక మార్గాలలో ఒకటి మాత్రమే. కానీ, నేను న్యాయమూర్తి అయిన తర్వాతే.. కోర్టు మాత్రమే తమ మొదటి, చివరి ఆశ్రయం అని నమ్మే సాధారణ ప్రజల కేసులను చూసే అవకాశం దక్కింది. అటువంటి నిరుపేదలకు, హక్కులు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి నాకు లభించిన ఈ అవకాశాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సమాజంలో వెనుకబడిన వర్గాల వారు మనుగడ కోసం ఎంతగా పోరాడుతున్నారో, వారు ఎంత బలహీనంగా ఉన్నారో నేను న్యాయమూర్తి అయిన తరువాతే గ్రహించాను.’ అని ఆయన చెప్పారు.భవిష్యత్ తరాలు గర్వపడేలా తీర్చిదిద్దాలి‘ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మౌలిక సదుపాయాల పరంగా ఎంతో పురోగతి సాధించింది. త్వరలోనే కొత్త హైకోర్టు భవనం కూడా రాబోతోంది. గత రెండేళ్లుగా హైకోర్టు వంద శాతానికి పైగా కేసుల పరిష్కార రేటును సాధించింది. అంటే కొత్తగా దాఖలైన కేసుల కంటే ఎక్కువ కేసులను పరిష్కరించాం. గత ఏడాది ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన స్వతంత్ర సర్వేలో కోర్టులు, జైళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని 25 హైకోర్టులలో మన ఏపీ హైకోర్టు ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే అత్యుత్తమ హైకోర్టుగా ఎదగడానికి ఇంకా శ్రమించాలి.రాబోయే తరాలు గర్వపడేలా మన న్యాయవ్యవస్థను తీర్చిదిద్దాలి. ఈ దేశ ప్రజల కోసం, చట్టాన్ని నిలబెట్టడం కోసం ఈ కోర్టు ఎల్లప్పుడూ తన బాధ్యతను నిర్వర్తిస్తుందనే నమ్మకం నాకు ఉంది.’ అని జస్టిస్ రఘునందన్రావు తెలిపారు. న్యాయమూర్తిగా ఇక్కడ కూర్చోవడానికి, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుండి విజయవాడకు మారడానికి అంగీకరించి, తన సంరక్షణ కోసం కెరీర్ను సైతం వదులుకున్న తన సతీమణి రాజిత, పిల్లలు అనన్య, ఆదిత్య అందించిన మద్దతు వల్లే ఇక్కడ ప్రశాంతంగా పని చేయగలిగానని తెలిపారు.సత్వర న్యాయం ఎంత ముఖ్యమో నిరూపించారు: సీజే జస్టిస్ లీసా గిల్జస్టిస్ రఘునందన్రావు సేవలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ లీసా గిల్ కొనియాడారు. న్యాయవ్యవస్థపై ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పారు. 25 వేల కేసులను పరిష్కరించి సత్వర న్యాయం ఎంత ముఖ్యమో నిరూపించారన్నారు. సాంకేతికతను, న్యాయవ్యవస్థను అనుసంధానం చేసి న్యాయాన్ని ప్రజలకు చేరువ చేశారని తెలిపారు. ఆయన శేష జీవితం ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో సాగిపోవాలని సీజే ఆకాక్షించారు. పౌర హక్కుల పరిరక్షణలో ముందున్నారుఈ కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ మాట్లాడారు. పౌరుల హక్కులను కాపాడటంలో జస్టిస్ రఘునందన్రావు ముందున్నారని తెలిపారు. జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించి వారు వృత్తి మెళకువలు నేర్చుకునేలా చేశారన్నారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడం న్యాయ వ్యవస్థకు లోటన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ మఠం వెంకటరమణ, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ రఘునందన్రావు కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, అదనపు అడ్వొకేట్ జనరల్ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘన సన్మానంపదవీ విరమణ చేసిన జస్టిస్ రఘునందన్రావును హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. జస్టిస్ రఘునందన్రావు, ఆయన సతీమణి రాజితకు అమ్మవారి చిత్రపటాన్ని సంఘం కార్యవర్గం బహూకరించింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
బెజవాడ బాస్ భారీ డీల్!
సాక్షి, అమరావతి: విజయవాడ పోలీస్ బాస్ రూటే సెప‘రేటు’. కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ లాకప్లోనే మాయం చేసిన దారుణం రాష్ట్రాన్నే నివ్వెరపరచగా.. మరోవైపు పోలీసు బాస్ అక్రమాలు మరింతగా బట్టబయలవుతున్నాయి. రూ.300 కోట్ల అక్రమ డిపాజిట్లతో ఖాతాదారులను బురిడీ కొట్టించిన ఓ ప్రైవేటు ఆర్థిక సంస్థకు అనుకూలంగా ఆయన కథ నడిపించిన తీరు అధికారిక వైట్ కాలర్ నేరాన్ని తలపిస్తోంది. సీఐడీ, ఈడీల కళ్లు గప్పేందుకు ఆ కేసును నీరుగార్చిన తీరు.., ఆ సంస్థ మేనేజ్మెంట్తో భారీ డీల్ కుదుర్చుకున్న వైనం విస్మయపరుస్తోంది. ప్రభుత్వ పెద్దలు రెడ్బుక్ కుట్రల కేసులను దర్యాప్తు చేస్తున్న సమయంలోనే విజయవాడ కేంద్రంగా భారీ దందాలకు పాల్పడాలన్నది ఆయన ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ డీల్ కథా కమామిషు ఇదిగో ఇదీ..రూ.300 కోట్ల అక్రమ డిపాజిట్ల దందాఅద్వైక ట్రేడింగ్ కంపెనీ విజయవాడ కేంద్రంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. రిజర్వ్ బ్యాంకు నిబంధనలను ఉల్లంఘిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసింది. అధిక వడ్డీ ఆశ చూపించి దాదాపు 1,500 మంది ఖాతాదారుల నుంచి రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసి, వారిని బురిడీ కొట్టించింది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 70 మందికి పైగా ఏజంట్లను నియమించుకుని డిపాజిట్లు సేకరించింది. అనంతరం వడ్డీలు చెల్లించడం నిలిపివేసింది. దీనిపై ఖాతాదారులు ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేసింది. ఓ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో కంపెనీపై గత ఏడాది జూన్లో కేసు నమోదు చేశారు. మోసపోయిన ఖాతాదారులు దాదాపు 1,500 మంది విజయవాడ పోలీసులకు గోడు వెళ్లబోసుకున్నారు. డిపాజిట్ పత్రాలు, ఇతర ఆధారాలు సమర్పించారు. దాంతో ఈ కేసుపై విజయవాడ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి డిపాజిటర్లకు న్యాయం చేస్తారని అంతా భావించారు. అదే సమయంలో పోలీస్ బాస్ రంగంలోకి దిగారు. అద్వైక ట్రేడింగ్ కంపెనీ యాజమాన్య ప్రతినిధులను పిలిపించారు. కేసు సమగ్రంగా విచారిస్తే అక్రమ డిపాజిట్లు మొత్తం వెనక్కి ఇవ్వాల్సి రావడంతోపాటు.. తీవ్ర శిక్ష పడుతుందని తనదైన శైలిలో బెదిరించారు. తన డీల్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అందుకు యాజమాన్య ప్రతినిధులు సమ్మతించినట్టు సమాచారం. దాంతో పోలీస్ బాస్ చకచకా పావులు కదిపారు.రూ.300 కోట్ల మోసం.. రూ.53 లక్షల కేసు1,500 మంది నుంచి రూ.300 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన ఈ ఆర్థిక మోసం కేసును నిబంధనల ప్రకారం సీఐడీ దర్యాప్తు చేయాలి. మార్గదర్శి చిట్ఫండ్స్, అగ్రిగోల్డ్ కేసులను సీఐడీనే విచారించింది. కేసు వివరాలను, ఎఫ్ఐఆర్ కాపీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించాలి. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలి. కానీ ఈ కేసును సీఐడీ పరిధిలోకి, ఈడీ దృష్టికి వెళ్లకుండా పోలీస్ బాస్ కనికట్టు చేశారు. అందుకే ఒక్క ఖాతాదారుడు ఇచ్చిన ఫిర్యాదుకే పరిమితమై.. ఈ కేసును కేవలం రూ.53 లక్షల మోసానికే పరిమితం చేశారు. మిగిలిన 1,500 మంది ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇలా ఈ కేసు విజయవాడ పోలీసుల పరిధి దాటిపోకుండా అడ్డుకట్ట వేశారు. బాసే కేసును గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇందుకోసం ఆ కంపెనీ మేనేజ్మెంట్తో భారీ డీల్ కుదుర్చుకుని కేసును మసిపూసి మారేడు కాయ చేసేశారు. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు మళ్లింపుటాస్క్ఫోర్స్ విభాగంలోని తనకు అనుకూలమైన అధికారులతో కలిసి పోలీస్ బాస్ ఈ దందాలో రెండో అంకానికి తెరతీశారు. అద్వైక ట్రేడింగ్ కంపెనీ 70 మంది ఏజంట్ల ద్వారా డిపాజిట్లు సేకరించగా, కేసును 9 మందికే పరిమితం చేశారు. కేవలం ఒక్క మేనేజర్ను నిందితుడిగా చేర్చారు. అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన కంపెనీ యాజమాన్యాన్ని కేసు నుంచి తప్పించేశారు. ఈ వ్యవహారంలో పెద్ద భాగాన్నే డీల్ మొత్తంగా ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఆ మొత్తాన్ని కూడా చట్టం కళ్లుగప్పి తమ ఖాతాలో పడేట్టు చేసుకున్నారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఖాతా తెరిచి, అందులోకి డీల్ మొత్తాన్ని దశలవారీగా డిపాజిట్ చేయించినట్టు తెలుస్తోంది. దీనిని టాస్క్ఫోర్స్ విభాగంలో ఇద్దరు అధికారులు పర్యవేక్షించినట్ల సమాచారం. మోసపోయిన డిపాజిట్దారుల ఆవేదనను ఏమాత్రం పట్టించుకోకుండా అద్వైక ట్రేడింగ్ కంపెనీతో డీల్ కుదుర్చుకుని కేసును నీరుగార్చిన తీరు విస్మయపరుస్తోందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
పర్యాటక హోటళ్లకు భూ కేటాయింపు, రాయితీలు
సాక్షి, అమరావతి: పర్యాటక ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్రైవేటు హోటళ్లకు భూములు, భారీ రాయితీల వర్షం కురిపించింది. ప్రైవేటు సంస్థలకు దీర్ఘకాల లీజులు, పన్ను మినహాయింపులు, మూలధన సబ్సిడీలతో ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల పారదర్శకతపై ఇప్పటికే పలు ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో సోమవారం పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ వేర్వేరుగా జారీ చేసిన ఉత్తర్వుల వివరాలు..» విశాఖపట్నంలోని ఎండాడలో ఆస్కల్ హోటల్స్ బ్రాండ్ పేరుతో 3 స్టార్ అంతర్జాతీయ బ్రాండెడ్ హోటల్తో కూడిన కన్వెన్షన్ సెంటర్కు 0.29 ఎకరాలు కేటాయింపు. భూమిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడంతో పాటు 10 ఏళ్ల పాటు వంద శాతం ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇవ్వనుంది. దీనితో పాటు రూ.10 కోట్ల మూలధన రాయితీలను 5 వాయిదాల్లో చెల్లించనుంది. స్టాంపు డ్యూటీ మినహాయింపు, పరిశ్రమ ధరలకే విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను, నీటి సరఫరా చార్జీలు, మురుగునీటి పన్నులో మినహాయింపులు ఇచ్చింది. » విశాఖపట్నంలో త్రిఫల ఆయుర్వేద బ్రాండ్ పేరుతో విజయనగర ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే ఎకో వెల్నెస్ రిసార్ట్స్కు పర్యాటక రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పర్యాటక పాలసీ 2024–29 ప్రకారం 11ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్తో పాటు రూ.10కోట్ల మూలధన రాయితీలను ఇస్తోంది. ఐదేళ్ల పాటు పరిశ్రమల రేటుకే విద్యుత్, రూపాయి చొప్పున ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీయింబర్స్మెంట్, వందశాతం స్టాంప్డ్యూటీ రీయింబర్స్మెంట్, ఆస్తిపన్ను, నీటి చార్జీలు, మురుగు నీటి చార్జీలను పరిశ్రమల రేట్లకే ఇస్తోంది.» గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో అకార్ బ్రాండ్పై వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్ 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి రాయితీలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి సీఆర్డీఏ ఇచ్చిన 6.5 ఎకరాల్లో 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు జరగనుంది. ఇక్కడ 12 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, రూ.25 కోట్లు మూలధన పెట్టుబడి రాయితీ చెల్లింపు, పరిశ్రమ రేట్లకే విద్యుత్, విద్యుత్ సుంకం, నీటి, ఆస్తి పన్ను చార్జీలు విధించనుంది. వందశాతం స్టాంప్డ్యూటీ రీయింబర్స్మెంట్ కల్పిస్తుంది. » గతంలో విశాఖపట్నంలో మైరా బేవ్వూ్య రిసార్ట్స్ ప్రాజెక్టుకు 15 ఎకరాల భూమితో పాటు భారీగా రాయితీలు ప్రకటించింది. అయితే వాటికి అదనంగా రోడ్ల సౌకర్యం, నీరు, విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.16.36 కోట్లకు ప్రభుత్వ సాయాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతించింది. -
టీడీపీ బీఎల్ఏల పర్యవేక్షణలోనే ‘సర్’
నెల్లూరు (బారకాసు) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (సర్) ప్రక్రియ పూర్తిగా టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతోంది. మంత్రి నారాయణ ఏకంగా బీఎల్ఓలతో సమీక్షించాక ఈ ప్రక్రియను పూర్తిగా టీడీపీ పర్యవేక్షణలోనే చేపడుతున్నారు. మంత్రి అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ నందన్, కమిషనర్ అండ చూసుకుని బీఎల్వోలు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించి బరితెగించి టీడీపీ బీఎల్ఏలు చెప్పినట్లు వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారంటూ స్థానిక ఓటర్లు మండిపడుతున్నారు. వాస్తవానికి.. బీఎల్వోలే ఓటర్ల చిరునామాను గుర్తించి స్వయంగా వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాన్ని సదరు ఓటరుకు అందజేసి పూరించి తిరిగి తీసుకుని ఆన్లైన్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఓటరు చిరునామా తెలియకపోతే ఆ ప్రాంత అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఎల్ఏల సహకారంతో సదరు ఓటరు వద్దకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేయాల్సి ఉంది. అయితే, ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. నెల్లూరు నగరం, 5వ డివిజన్లోని సత్యనారాయణపురంలో ఉన్న ఎస్వీఆర్ స్కూల్ సమీపంలో ఓ వాటర్ ప్లాంట్ వద్ద సోమవారం టీడీపీ బీఎల్ఏలు సమావేశమయ్యారు. 5వ డివిజన్ పరిధిలో 128 నుంచి 135వ నంబరు వరకు ఎనిమిది బూత్లు ఉన్నాయి. ఆయా బూత్ల పరిధిలో ఉన్న ఓటర్లలో తమ పార్టీకి అనుకూలమైన ఓటర్లను గుర్తించి వారిని మాత్రమే వాటర్ప్లాంట్ వద్దకు పిలిపించుకుని బీఎల్ఓలతో కలిసి అక్కడే ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఇది తెలిసి తమకు ఫారాలు ఇవ్వకుండా కొందరికే ఇవ్వడంపై ఆ ప్రాంత స్థానికులు అగ్గివీుద గుగ్గిలమవుతున్నారు. -
నెలలోగా సవరణలు చేయాలి
అమృత్సర్: పవిత్ర మత గ్రంథాల అవమాన నిరోధక చట్టం(యాంటీ శాక్రిలేజ్ లా)లో అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను నెల రోజుల్లోగా తొలగించాలని సిక్కుల మత పెద్ద అకల్ తఖ్త్ జతేదార్ జ్ఞానీ కుల్దీప్ సింగ్ గర్గాజ్ పంజాబ్ ప్రభుత్వానికి గడువు విధించారు. అప్పటి వరకు చట్టం అమలును నిలిపివేయాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రంలోని సిక్కు ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం 87 మంది ఆయన అమృత్సర్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంటీ శాక్రిలేజ్ లాలోని పలు నిబంధనలపై ఆయన అభ్యంతరం తెలిపారు. వీటిపై తగు సవరణలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆప్ ప్రభుత్వం మత విషయాల్లో జోక్యం చేసుకుంటోందని, అకల్తఖ్త్కు అతీతంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంలోని నిబంధనలపై అభ్యంతరాలతో కూడిన జాబితాను ఎమ్మెల్యేలకు అందజేశారు. గురుగ్రంథ్ సాహిబ్ ప్రతిని ‘బిర్’కు బదులుగా సరూప్ అని ప్రస్తావించాలని పేర్కొన్నారు. ఇలాంటివి చేసేముందు అకల్ తఖ్త్ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. చట్టంలో మార్పులు తీసుకురావడం సమ్మతమేనంటూ ఎమ్మెల్యేలంతా చేతులు పైకెత్తి సమ్మతం తెలిపారని అనంతరం గర్గాజ్ మీడియాకు తెలిపారు. తగు మార్పులు తీసుకువచ్చే వరకు చట్టం అమలును నిలిపివేయాలన్నారు. గురుగ్రంథ్ సాహిబ్ను అవమానించే డేరా చీఫ్లపై వెంటనే కేసు నమోదు చేసేలా నిబంధన తీసుకురావాలని స్పష్టం చేశారు. మతపరమైన పవిత్ర గ్రంథాలను, వస్తువులను అపవిత్రం చేయడం, దెబ్బతీయడం, అవమానించడం (పంజాబీలో బెఅద్బీ) వంటి చర్యలను నిరోధించడానికి ఉద్దేశించిన చట్టం జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్(సవరణ)–2026ను పంజాబ్ అసెంబ్లీ ఏప్రిల్ 13న ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం గురుగ్రంథ్సాహిబ్ను అవమానించిన వారికి జీవిత కారాగారం వంటి కఠిన శిక్షలుంటాయి. దీనిపై జతేదార్ గర్గాజ్ సింగ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమతో సంప్రదించకుండానే, ప్రభుత్వం మత విషయాల్లో జోక్యం చేసుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుగ్రంథ్ సాహిబ్, సిఖ్ సంగత్, సేవాదార్లపైనే చట్టాలను అమలు చేయాలని చూస్తోందన్నారు. ఈ మేరకు మే 11వ తేదీన పంజాబ్ ప్రభుత్వానికి అకల్ తఖ్త్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని, అకల్ తఖ్త్ను, సిక్కుల సెంటిమెంట్ను నిర్లక్ష్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఎదుట హాజరు కావాలంటూ సిక్కు ఎమ్మెల్యేలు, మంత్రులకు జూన్ 15వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు సోమవారం ఆయన ఎదుట వీరంతా హాజరయ్యారు. -
మనకు ఆ ప్రాబ్లం ఉండదులే! మన ప్రభుత్వం అప్పులు అడుక్కుంటుంది.. మనమూ అడుక్కుంటున్నాం!!
మనకు ఆ ప్రాబ్లం ఉండదులే! మన ప్రభుత్వం అప్పులు అడుక్కుంటుంది.. మనమూ అడుక్కుంటున్నాం!! -
ఆర్టీసీ ఆస్తుల అప్పగింతలు
సాక్షి, అమరావతి: విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపో భూమి ఇది..! దశాబ్దాలపాటు ఆర్టీసీ వైభవానికి ప్రతీకగా నిలిచిన విద్యాధరపురం డిపో ప్రస్తుతం ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రకు పదును పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం వేసిన తొలి వేటు ఇది! అత్యంత విలువైన ఈ భూమిని ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ఇలా మార్చేసింది. ప్రగతి రథ చక్రం ఆర్టీసీని చావుదెబ్బ తీస్తూ అత్యంత విలువైన సంస్థ ఆస్తులను అస్మదీయ సంస్థలకు అప్పగించే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఆర్టీసీని పరిరక్షించాలన్న 50 వేలమంది ఉద్యోగుల డిమాండ్ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. తొలిదశలో రూ.6 వేల కోట్ల విలువైన 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది.విద్యాధరపురం డిపో నేలమట్టంతో కుట్రకు శ్రీకారంఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న కుట్రను విజయవాడ విద్యాధరపురం డిపో నుంచి కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం మొదటి దశలో 12 డిపోలను ఎంపిక చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ 12 డిపోలను కూల్చివేసి భూమిని చదును చేసే పనులు ముమ్మరం చేసింది.విద్యాధరపురం ఆర్డీసీ డిపోను పూర్తిగా కూల్చివేసి...శిథిలాలను కూడా తొలగించింది. స్థలాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు వీలుగా సిద్ధం చేసింది. ఇక మిగిలిన 11 డిపోల కూల్చివేత పనులను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. ఆగస్టు నాటికి 12 డిపోలను పూర్తిగా కూల్చివేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు వీలుగా సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.రూ.6 వేల కోట్ల భూములు అన్యాక్రాంతంరాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నుముక. ఆ వెన్నుముకను చంద్రబాబు ప్రభుత్వం విరిచేస్తోంది. రాష్ట్రంలో వేలకోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు పక్కా పన్నాగంతో పావులు కదుపుతోంది. విద్యుత్ బస్సు (ఈ–బస్సు)లను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్ను అందుకే తిరస్కరించింది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారానే వాటిని ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. అంతేకాదు ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఈ – బస్సులకు చార్జింగ్ కేంద్రాలు, గ్యారేజీలు, బస్సులు నిలుపుదల చేసే ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ఆస్తులను కట్టబెట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఆర్టీసీ డిపోలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు గతేడాది డిసెంబరు 29న నిర్వహించిన సమావేశంలో ఆమోదముద్ర వేసింది. మొదటి దశలో రాష్ట్రంలోని 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు వీలుగా ఆ 12 డిపోలను ఫిబ్రవరి నెలాఖరుకే ఖాళీ చేయించింది. ఆ డిపోలను కూల్చివేసి పనులు మొదలు పెట్టింది. ఒక్కో డిపో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే 12 డిపోల విస్తీర్ణం దాదాపు 120 ఎకరాలు. ఆ ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంది. సగటున ఎకరా భూమి విలువ రూ.50 కోట్లు చొప్పున లెక్క వేసుకున్నా.. ఆ 12 డిపోల మార్కెట్ విలువ ఏకంగా రూ.6,000 కోట్లు...! అంత విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. రెండో దశలో మరిన్ని డిపోలతోపాటు ఆర్టీసీ బస్ స్టేషన్లను కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేస్తోంది. -
ఇలాంటి చాన్స్ అరుదుగా వస్తుంది: నభా నటేష్
‘‘నాగబంధం, స్వయంభు’ వంటి పాన్ ఇండియా చిత్రాల్లో ఒకే సమయంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి. ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడదగ్గవే. ఇలాంటి బిగ్ మూవీస్లో నటించడం నాకు చాలా సంతృప్తిగా ఉంది’’ అని నభా నటేష్ చెప్పారు. విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నాగబంధం–ది సీక్రెట్ ట్రెజర్’. కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్ మాట్లాడుతూ– ‘‘నాగబంధం’లో నేను పార్వతి అనే వేద విద్యార్థిని పాత్రలో కనిపిస్తాను.కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం ఆమెది. పార్వతి తీసుకునే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. నా పాత్ర కోసం రెడీ అవడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. ఇలాంటి సినిమాల్లో నటించే చాన్స్ చాలా అరుదుగా వస్తుంది. ఈ సినిమా కోసం వేసిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మేం చాలా నియమ నిష్టలతో పని చేశాం. పూర్తిగా శాకాహారులుగా ఉన్నాం. ‘నమోరే..’ పాటను దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో గణేష్ ఆచార్య మాస్టర్ తెరకెక్కించారు. ఈ పాట స్క్రీన్పై చాలా బాగుంటుంది. అభిషేక్ నామాగారు ‘నాగబంధం’ని అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
ఈ ఏడాదీ అదే కూలి!
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ ఏడాదీ పాత కూలినే చెల్లించనున్నారు. ఏటా పెరిగే రోజువారీ వేతనం ఈ ఏడాది పెరగలేదు. ప్రతిఏటా ఆర్థిక ఏడాది మొదలయ్యే ఏప్రిల్ ఒకటో తేదీకల్లా ఉపాధి కూలీల రోజువారీ వేతనాన్ని పెంచుతారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో వీబీ జీ రామ్ జీ పథకం ప్రవేశపెట్టడంతో కొత్త పథకం అమల్లోకి వచ్చే తేదీకల్లా వేతనాలు పెరుగుతాయని అధికారులు చెబుతూ వచ్చారు. ఈ కారణంతో ఈ ఏడాది ఏప్రిల్ 1న వేతనాలు పెంచలేదు. బుధవారం (జూలై 1) నుంచే వీబీ జీ రామ్ జీ పథకం అమల్లోకి వస్తోంది. కొత్త పథకం అమలు గడువుకు ఒక్క రోజు వ్యవధి కూడా లేదు. అయినా సోమవారం సాయంత్రం వరకు ఉపాధి కూలీల వేతనం పెంపుపై నిర్ణయం వెలువడలేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.89 పెరిగిన వేతనం 2006లో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పని చేసే ఒక్కో పని దినానికి చెల్లించే గరిష్ట కూలి రేటు రూ. 80గా ఉండేది. ఇది ఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.307కు పెరిగింది. 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఐదేళ్లలో ఈ మొత్తం రూ. 89 మేర పెరగడం గమనార్హం. 2019 ఏప్రిల్ ఒకటి నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఒక్కో పని దినానికి చెల్లించే గరిష్ట వేతనం రూ. 211 కాగా.. 2024 ఏప్రిల్ నాటికి రూ. 300 వరకు పెరిగింది. ఆ తర్వాత గత రెండేళ్లలో రాష్ట్రంలో ఉపాధి కూలీలకు రోజు వారీ చెల్లించే గరిష్ట కూలి రూ.7 మాత్రమే పెరగడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్ 1న రూ. 307కు పెరగ్గా, ఈ ఏడాది రూపాయి కూడా పెంచలేదు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే దాదాపు 47 లక్షల కుటుంబాలు ఈ పథకంలో పనులు చేసుకొని జీవనం సాగిస్తుంటారు. వేతనం పెంచకపోవడం తమను ఆర్థికంగా దెబ్బ తీస్తుందని ఉపాధి హామీ కూలీల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
అఫ్గాన్ సరిహద్దుల వెంట దాడులు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ సరిహద్దుల వెంబడి జరిపిన దాడుల్లో కనీసం 29 మంది మిలిటెంట్లు హతమయ్యారని పాకిస్తాన్ ప్రకటించింది. శనివారం కరాచీలోని పారామిలటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై మిలిటెంట్లు జరిపిన దాడికి ఇది ప్రతిస్పందన అని సమాచార శాఖ మంత్రి అత్తా తరార్ చెప్పారు. నిఘా వర్గాలందించిన పక్కా సమాచారం మేరకు ఖైబర్ ప్రావిన్స్లోని బజౌర్ జిల్లా పరిధిలోని జమాత్ ఉల్ అహ్రార్, ఫిత్నా అల్ ఖ్వారిజ్లకు చెందిన మూడు స్థావరాలపై ఈ వైమానిక దాడులు జరిగాయన్నారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. కరాచీలోని పాక్ రేంజర్స్ హెడ్డాఫీసుపై దాడికి తమదే బాధ్యతంటూ నిషేధిత జమాతుల్ అహ్రార్ ప్రకటించుకుంది. 2,600 కిలోమీటర్ల పొడవైన అఫ్గాన్ సరిహద్దుల్లోని తాలిబన్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ఫిబ్రవరిలో ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్ పేరుతో కనీసం 53 ప్రాంతాల్లో భారీగా దాడులు చేపట్టింది. సరిహద్దులకు సమీపంలోని తమ ఖైబర్, బలూచిస్తాన్ ప్రావిన్స్లలో అఫ్గాన్లోని తాలిబన్లు ఉగ్రదాడులను ప్రేరేపిస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది. తాజాగా పాకిస్తాన్ చేపట్టిన దాడులను అఫ్గానిస్తాన్ ఖండించింది. తమ కునార్, పక్టియా, పక్టికా ప్రావిన్స్లపై దాడులకు దిగడాన్ని గగనతల అతిక్రమణ, సార్వభౌమత్వానికి భంగకరమంటూ పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ కూడా కరాచీలోని రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై దాడికి అఫ్గాన్ మిలిటెంట్లే కారణమంటూ ఆ దేశ దౌత్యాధికారికి సమన్లు పంపించింది. -
పవన్ వస్తే ఏదో జరుగుతుందనుకున్నాం
పిఠాపురం రూరల్: పవన్ కళ్యాణ్ వస్తే ఏదో జరుగుతుందనుకున్నామని, మురికి కూపంలో జీవిస్తున్నామని పిఠాపురం మండలం భోగాపురం దళిత కాలనీవాసులు మండిపడ్డారు. తమ కాలనీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురంలో సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు. నిరసన అనంతరం సచివాలయ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. సచివాలయంలో కింద కూర్చుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ రోడ్లు, డ్రెయినేజీలు లేక మురికి కూపంలో జీవిస్తున్నామని, దళిత కాలనీ అని చిన్నచూపు చూస్తున్నారని, కనీసం తాగునీరూ ఇవ్వడం లేదని విమర్శించారు. డ్రెయినేజీ వ్యవస్థ లేని కారణంగా మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోందని, మురుగు నీటి నిల్వ కారణంగా విపరీతమైన దోమలు పెరిగి రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, నిధులు లేవంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి కరెంట్ పోతోందని, చిన్న పిల్లలు, వృద్ధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాలనీకి శ్మశానం కూడా లేదని, ఎవరైనా చనిపోతే రోడ్డు పక్కన, కాలువ గట్టుపై పూడ్చాల్సిన పరిస్థితులు ఉన్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
ఎన్నో పోరాటాలు చేశాం: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... సోమవారం (జూన్ 29) రాహుల్ సంకృత్యాన్ పుట్టినరోజు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ– ‘‘మనం (రాహుల్ని ఉద్దేశించి) ‘టాక్సీవాలా’ సినిమా చేసి తొమ్మిదేళ్లవుతోంది. ఇన్నేళ్లలో మనం జీవితంలో ఎంతో మారిపోయాం. అర్థవంతమైన కథలు రాయాలనే తపన, వాటిని అందంగా తెరకెక్కించాలనే ఇష్టం నీలో ఏమాత్రం తగ్గలేదు. మనం కలిసి చేసింది రెండు చిత్రాలే అయినా ఎన్నో పోరాటాలు చేశాం. మొదటి చిత్రానికి ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ అందుకున్నాం. ‘రణబాలి’తో మరో విజయం సాధించాలి’’ అని రాసుకొచ్చారు. -
డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి.. ఓట్లు వేయించుకుని.. ఆ హామీని అమలు చేయకుండా రాష్ట్రంలోని మహిళలను మోసం చేశారన్నది నిజం కాదా? అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. ఇదే అంశంపై వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాల్లో ఏ ఒక్కదానిపైనైనా చర్చించడానికి, వైఎస్ జగన్ చెప్పిన లెక్కలు తప్పు అని చెప్పడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ సోమవారం ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. ఆ ప్రకటనలో బుగ్గన ఏమన్నారంటే.. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అబద్ధాలయినా చెబుతుంది, ఎలాంటి మోసాలైనా చేస్తుందనడానికి మరో ఉదాహరణ ఇది. స్వయం సహాయక సంఘాల్లోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ రాయితీ గురించి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా గట్టిగా నిలబడాలంటే వాటికి ఇచ్చే వడ్డీ రాయితీ అత్యంత కీలకమని అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే దిశగా వడ్డీ రాయితీ కోసం రూ.4,969 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆ పోస్టులో తెలిపారు. అలాగే ఆసరా కార్యక్రమం కింద భారీగా రూ.25,571 కోట్లు, చేయూత కింద రూ.19,189 కోట్లు లబ్దిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారని, మహిళలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చిన మరెన్నో కార్యక్రమాలను అమలు చేసి, స్వయం సహాయక సంఘాలతో పాటు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశామని ఆయన అందులో పేర్కొన్నా రు. ఇవన్నీ వాస్తవ విషయాలు. ఇందులో ప్రజలను తప్పుదారి పట్టించడం ఎక్కడుంది? వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాల్లో ఏ ఒక్కదానిపైనైనా చర్చించడానికి, ఆ లెక్కలు తప్పు అని చెప్పడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. » టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో ‘స్వయం సహాయక సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ పథకం వర్తించే రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి, ఆ హామీ ఆధారంగా ఓట్లు పొందారన్నది వాస్తవం కాదా? ఆ హామీ ఎందుకు అమలు చేయలేదు?» 2024–25, 2025–26 సంవత్సరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా, మహిళలను మోసం చేశారన్నది నిజం కాదా?» 2024–25, 2025–26 సంవత్సరాల్లో స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి తగ్గుకుంటూ వచ్చిందన్నది నిజం కాదా? » 2025–26లో రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయాలు ప్రతికూల వృద్ధిని.. అంటే –3.22% వృద్ధిని నమోదు చేశాయన్నది నిజం కాదా? వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలు ఇవే. కనీసం వీటికి అయినా ప్రభుత్వం సమాధానం ఇచ్చిందా? వీటికి సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడం ద్వారా, ఈ ఆరోపణలు నిజమేనని మీ ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టు కాదా? ఇవి వాస్తవాలని అంగీకరిస్తున్న పక్షంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉందంటూ గణాంకాలు చెప్తున్న నేపథ్యంలో మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటారా?’ -
రెండేళ్లయినా డీఏ, ఐఆర్ ఊసేలేదు
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించలేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగులంతా ఆశించారని.. కానీ, ప్రభుత్వం ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఇవ్వాలో చెప్పాలని కోరినా కనీస స్పందనలేదని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ఆయన, ఆ జిల్లా ఏపీ జేఏసీ అమరావతి యూనిట్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా యూనియన్ నాయకులు సోమవారం కలెక్టరేట్లో ఆమెను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం అక్కడ మీడియాతో బొప్పరాజు మాట్లాడారు. ఆరు నెలలకోసారి పెరగాల్సిన డీఏను రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. అలాగే, పీఆర్సీ కమిషన్ను కూడా ఇప్పటివరకు నియమించలేదన్నారు. అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ ఆ ఊసేలేదన్నారు. ఏడు వేల కోట్ల రూపాయల సరెండర్ లీవుల బకాయిలను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందని బొప్పరాజు చెప్పారు. ఇవి ఇవ్వకపోవడంవల్ల పోలీసులు సహా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలు రావడంలేదని, దీంతో వారి పరిస్థితి దుర్భరంగా ఉందని తెలిపారు. సమాన పనిచేస్తున్నా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన వేతనంలేదని, వారిని క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకూ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకంతో ఉద్యోగులు రెండేళ్లుగా ఎంతో సహనంతో ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడం సరికాదన్నారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యలపట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. ఇదీ మా ఉద్యమ కార్యాచరణ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాల, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. జూలై 12న శ్రీకాకుళంలో, జూలై 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధత సభలు నిర్వహించాక అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ సభలను ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కలిసివచ్చే ఇతర సంఘాలతో కలిసి ప్రత్యక్ష ఐక్య ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఏ సమస్య వచ్చినా అసోసియేషన్ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, డీవీ ఫణి పేర్రాజు మాట్లాడుతూ.. తమకు రావలసిన ఆరి్థక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
గత 146 ఏళ్లలో భారత్లో అత్యంత దయనీయ స్థితి!
భారతదేశ వ్యాప్తంగా జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 42 శాతం తక్కువగా నమోదైంది. గత 146 ఏళ్లలో అత్యంత పొడి వాతావరణాన్ని జూన్ నెల ఎదుర్కోవడం గమనార్హం. గత దశాబ్దన్నర కాలంలో వేసవి రుతు పవనాలకు ఇది అత్యంత బలహీనమైన ఆరంభం. దీని ఫలితంగా దేశంలోని 76 శాతం ప్రాంతాల్లో వర్షపాతం ‘లోటు’, లేదా ‘తీవ్ర లోటు’గా ఉంది. జూలై కూడా సాధారణం కంటే పొడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాగునీరు, తాగునీటి కోసం పర్యవేక్షించే దేశంలోని 166 ప్రధాన జలాశయాలు జూన్ 25 నాటికి మొత్తం నిల్వ సామర్థ్యంలో 26 శాతాన్ని కలిగి ఉన్నాయి. నీటి మట్టాలు ఇందిరా సాగర్లో 14 శాతానికి, నాగార్జున సాగర్లో 5 శాతానికి, తెహ్రీలో 2 శాతానికి పడిపోయాయి. పసిఫిక్లో పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల(ఎల్నినో అనే పరిస్థితి) కారణంగా ఆ నెలలో రుతుపవన వర్షపాతం మళ్లీ పుంజుకున్నప్పటికీ జూలై నెలలో చాలావరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఉత్తర ఆఫ్రికా నుండి వేడి గాలిని రప్పించే స్థిరమైన అధిక పీడన వ్యవస్థ కారణంగా ఏర్పడిన వడగాడ్పులు మానవ ప్రేరిత వాతావరణ మార్పుల వల్ల మరింత తీవ్రమయ్యాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అనే బహుళ దేశాల పరిశోధక బృందం శుక్రవారం తెలిపింది. ఐరోపా వేసవి వాతావరణంపై ఎల్ నినో ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఇది ప్రధాన ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
తొలిమాసం.. లోటు వర్షపాతం..
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్ మొదటి నెల నిరాశే మిగిల్చింది. ఎలినినో ప్రభావంతో రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. జూన్ 1 నుంచి సెపె్టంబర్ 30 వరకున్న కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్గా పరిగణిస్తారు. సీజన్లో తొలి మాసమైన జూన్లో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 14 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తొలివారం కొంత చురుకుగా ముందుకు సాగినప్పటికీ... ఆ తర్వాత మందగించడంతో రుతుపవనాల వ్యాప్తి జూన్ మూడో వారం నాటికి రాష్ట్రమంతటికీ విస్తరించగా... ఆ తర్వాత వర్షాలు నమోదయ్యాయి. జూన్లో రాష్ట్రంలో 13.03 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఇ ప్పటివరకు 11.3 సెం.మీ. వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 14 శాతం తక్కువగా వానలు కురిశాయి. గతేడాది జూన్లో 9.37 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా... 21 శాతం లోటు నమోదైంది. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. ఇక్కడ 75 శాతం లోటు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ వెల్లడించింది. మరో 15 జిల్లాల్లో లోటు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదు కాగా... మరో 5 జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. గతేడాదితో పోలిస్తే సగటు వర్షపాతం మెరుగ్గా కనిపిస్తున్నా... వర్షాలు ఆలస్యం కావడం... కీలకమైన జిల్లాల్లో తేలికపాటి వానలే కురవడంతో సాగు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జూన్లో అరకొర వర్షాలు నమోదుకాగా.. వచ్చే నెల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఆశించినస్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఏ జిల్లాలో ఎలా ఉందంటే... తీవ్ర లోటు: హనుమకొండ లోటు: ఆదిలాబాద్, మంచిర్యాల, ని జామాబాద్, జగిత్యాల, వరంగల్, క రీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి సాధారణం: కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్నగర్, ములుగు, నారాయణపేట్ అధికం: రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మంజూన్.. అసాధారణందేశంలో వర్షపాతం కేవలం 85.2 మి.మీ. గత 125 ఏళ్లలో ఇలా జరగడం ఐదోసారి దక్షిణాది రాష్ట్రాల్లో 31 శాతం లోటు న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అసాధారణ వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది జూన్ నెల ప్రజలను అల్లాడించింది. ఈ నెలలో వాతావరణం సాధారణానికి భిన్నంగా, ఆందోళనకరంగానే కనిపించింది. దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 28 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 మి.మీ. కాగా, కేవలం 85.2 మి.మీ. మాత్రమే నమోదైంది. సుమారు 43 శాతం లోటు ఏర్పడింది. భార త వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఇలాంటి వాతావరణ పరిస్థితు లు ఏర్పడటం గత 125 ఏళ్లలో ఇది ఐదోసారి. జూన్లో 100 మి.మీ. కంటే తక్కువగా వర్షపాతం నమోదుకావడమనేది గతంలో 1905, 1926, 2009, 2014 సంవత్సరాలలో మాత్రమే జరిగింది. నైరుతి రు తుపవనాలు కేరళను కొంచెం ఆలస్యంగా జూన్ 4న తాకినప్పటికీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వాటి విస్తరణ పూర్తిగా మందగించింది. భారీ లోటు వర్షపాతం... ప్రాంతాల వారీగా చూస్తే, మధ్య భారతదేశంలో అత్యధికంగా 56 శాతం లోటు ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో 43 శాతం, దక్షిణాదిలో 31 శాతం, వాయవ్య రాష్ట్రాల్లో 29 శాతం లోటు నమోదైంది. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం, 1901 సంవత్సరం తర్వాత ఈ జూన్ మూడవ అత్యంత పొడి నెలగా నిలిచింది. ఇంతటి తీవ్ర వర్షపాత లోటు ఏర్పడటం 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే నమోదైంది. ఎల్నినో ప్రభావం కొంతమేర ఉన్నప్పటికీ... హిందూ మహాసముద్ర డైపోల్ తటస్థంగా ఉండటం, భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ఇచ్చే మేఘాల వ్యవస్థ భారత్కు అనుకూలమైన దిశలో లేకపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం, వాయవ్య భారతం నుంచి వీచిన వేడిగాలులు క్లౌడ్ ఫార్మేషన్ను అడ్డుకోవడం వంటి పరిస్థితుల వల్ల రుతుపవనాలు స్తంభించిపోయాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 315 జిల్లాలు ప్రభావితం దేశంలో 724 జిల్లాలకుగాను 315 జిల్లాలు తక్కువ వర్షపాతం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని కేంద్రం గుర్తించింది. వాటిలో 25 శాతం కంటే తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న 111 జిల్లాలను ‘అత్యంత అప్రమత్తత’జిల్లాలుగా ప్రకటించింది. ఆ జిల్లాల జాబితాలో తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు చెందిన జిల్లాలు ఉన్నాయి. వాటి కోసం ‘డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కాంటింజెన్సీ ప్లాన్స్’సిద్ధం చేశారు. -
సిగాచీ.. బాధితులకు దిక్కేది?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ అగ్నిప్రమాద ఘటనకు నేటితో ఏడాది పూర్తవుతోంది. ఈ ఘెర అగ్నిప్రమాదంలో 54 మంది ప్రాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి కూడా ప్రకటన చేశారు. అయితే ఈ ఘటన జరిగిన ఏడాది పూర్తవుతున్నా ఈ హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ పరిశ్రమలో 2025 జూన్ 30న జరిగిన ఘెర అగ్నిప్రమాదంలో 54 మంది కాలి బూడిదైన విషయం విదితమే. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మరణించిన వారిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నిరుపేద కార్మికులే కావడం గమనార్హం. నెలల తరబడి జాప్యం 54 మంది బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు కేవలం రూ.24.51 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి సగటున రూ.45 లక్షల మేరకే పరిహారం అందింది. మిగిలిన రూ. 55 లక్షల పరిహారాన్ని చెల్లించడంలో నెలల తరబడి జాప్యం జరుగుతోంది. పరిహారం కోసం బాధిత కుటుంబాల తరపున రాష్ట్ర ఉన్నత న్యాయస్థాయంలో పిల్ కూడా దాఖలైంది. బాధిత కుటుంబాలు పలుమార్లు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేయడంతోపాటు కలెక్టరేట్ ఎదుట నిరసన కూడా తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో క్షతగాత్రుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏడాది కాలంగా ఇంటివద్దనే చికిత్సలు తీసుకుంటున్నారు. అయినా వారు పూర్తి స్థాయిలో కోలుకోలేకపోతున్నారు. కాలిన గాయాలు కొంత మేరకు మానినా.. తమ సొంత పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారిందని, పనులు చేసుకునేందుకు శరీరం సహకరించడం లేదని బాధితులు వాపోతున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను పరిహారం కింద చూపుతున్నారు సిగాచీ ప్రమాదంలో నా భర్త బాలకృష్ణ మృతి చెందారు. ఇస్తామన్న పరిహారం కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నాం. రూ.25 లక్షలతోనే సరిపెట్టారు. నా భర్త పొదుపు చేసుకున్న ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులను కూడా నష్ట పరిహారం కింద చూపుతున్నారు. ఇద్దరు పిల్లల చదువులకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. వెంటనే ఇస్తామన్న రూ.కోటి పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – మల్లేశ్వరి, ముత్తంగి.వెంటనే చెల్లించాలి సిగాచీ ప్రమాదం మా కుటుంబాన్ని కష్టాల పాలు జేసింది. ఈ ప్రమాదంలో నా భర్త వీ.ఆర్.జీ. నాగేశ్వర్రావు మరణించారు. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను. ప్రైవేటు టీచర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పరిహారం రూ.25 లక్షలతోనే సరిపెట్టారు. మిగిలిన పరిహారం మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. –హేమలత, పటాన్చెరుఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నాను అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నాను. కాళ్లు, చేతులకు అయిన గాయాలతో పనిచేయలేకపోతున్నాను. సొంత పనులు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇస్తామన్న హామీ మేరకు పరిహారం చెల్లించడంతోపాటు పూర్తి స్థాయి లో చికిత్స చేయించి ఆదుకోవాలి. – రాజేశ్కుమార్ చౌదరి, క్షతగాత్రుడు. -
నేడు ఖరీఫ్ రైతుభరోసా
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతుభరోసా’పథకం కింద ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన నిధులను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రైతుఖాతాల్లో జమ చేయనుంది. తొలుత ఖమ్మం జిల్లా మధిరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినా, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో సీఎం రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా రైతులంతా రైతువేదికల వద్ద వీక్షించే ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో రెండు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,482.02 కోట్లు నేరుగా జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఇందులో ఒక ఎకరా ఉన్న రైతులు 14.65 లక్షల మందికాగా వారికి రూ. 878.94 కోట్లు, ఒకటి నుంచి రెండు ఎకరాలున్న భూమి ఉన్నవారు 26.72 లక్షల మంది. వారికి రూ. 1,603.08 కోట్లు చెల్లించనున్నారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ, ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. గత ఏడాది మాదిరిగానే..గత ఏడాది ఖరీఫ్–2025 సీజన్లో ప్రభుత్వం ఐదెకరాల వరకు భూములున్న రైతులకు రైతుభరోసాను నాలుగు విడతల వారీగా పంపిణీ చేసింది. మొదట రెండు ఎకరాల వరకు, అనంతరం ఒక్కో ఎకరం పెంచుతూ ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు దశలవారీగా సాయం అందించింది. మొత్తం దాదాపు 62.47 లక్షల మంది రైతులకు ఒక కోటీ ఏడు లక్షల ఎకరాలకు రూ. 6,404. 69 కోట్లు జమ చేసింది. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. మొదటి విడతలో రెండెకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించనుండగా, తర్వాతి విడతల్లో ఒక్కో ఎకరం విస్తీర్ణం పెంచుతూ ఐదెకరాల వరకుగల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు తెలిసింది. కాగా, గత యాసంగి సీజన్లో ఎకరాల విస్తీర్ణంలో కాకుండా రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి ఉన్న ప్రతి రైతులకు పెట్టుబడి సాయం అందేలా రైతుభరోసా పథకాన్ని మార్చింది. రెండు విడతల్లో ఎకరం చొప్పున సుమారు 71.05 లక్షల మంది రైతులకు రెండు ఎకరాల విస్తీర్ణానికి రైతుభరోసా సాయం అందించింది. అయితే ఈ ఖరీఫ్లో కూడా కొత్త విధానానికి బదులుగా గతంలో అమలు చేసిన పద్ధతినే కొనసాగిస్తూ, చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తూ రెండెకరాల వరకు ఉన్న రైతులతోనే పంపిణీ ప్రారంభిస్తోంది. దీంతో మొదటి విడతలో చిన్న రైతుల ఖాతాల్లోనే ముందుగా పెట్టుబడి సాయం జమ కానుంది. ఆ తరువాత ఐదెకరాల వరకు విడతల వారీగా జమ కానున్నట్లు సమాచారం. కాగా, రబీ 2025– 26లో రైతు భరోసా అందరికీ రెండు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు, అప్పుడు మొత్తం రైతులు 71,05,572మందికాగా, విడుదలైన నిధులు సుమారు రూ. 5,653కోట్లు.వర్షాల కారణంగా వేదిక మార్పుప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను సీఎం రేవంత్రెడ్డి రద్దు చేశారు. ఆ సభను హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నిర్వహించాలని సీఎం మంత్రులకు సూచించడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఈ వేదిక నుంచే రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమం ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.సీఎం రేవంత్రెడ్డి రైతుభరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజాప్రతి నిధులు, వ్యవసాయ అధికారులు సమీప రైతు వేదిక లకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 73.32 లక్షల మంది రైతులకు రైతుభరోసా నిధులను దశలవారీగా జమ చేస్తామని మంత్రి తెలిపా రు. కొత్తగా పాస్పుస్తకాలు పొందిన రైతులు జూలై 5లోపు సమీప వ్యవసాయ విస్తరణ అధికారికి బ్యాంకు ఖాతా వివరాలు అందిస్తే, వారికి కూడా రైతుభరోసా వర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
సైకలాజికల్ థ్రిల్ స్టార్ట్
హీరో రామ్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘హ్యాష్టాగ్ఆర్ఏపీఓ23 (వర్కింగ్ టైటిల్)’. రామ్ సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీమోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రవికిషోర్ క్లాప్ ఇచ్చారు. ఈ షాట్కు రామ్ స్వయంగా దర్శకత్వం వహించారు.‘‘ఈ సినిమా రెగ్యులర్ షూట్ని సోమవారం హైదరాబాద్ శివార్లలో ప్రారంభించాం. హీరో రామ్ పోతినేనితో పాటు ప్రధాన తారాగణం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు కథ అందించి, హీరోగా, దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించారు రామ్. ఆయన కెరీర్లోనే అత్యంత సవాల్తో కూడిన పాత్రను చేస్తున్నారు. అలాగే రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూ పొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు కెమెరా: తిరునావుకరసు. -
వచ్చేనెలలో రైతు ఆశీర్వాద ముగింపు సభ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద మంగళవారం తలపెట్టిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని, ఇదే సభను వచ్చే నెలలో రైతుభరోసా నిధుల పంపిణీ అనంతరం ముగింపు సభగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సభా ప్రాంగణం బురదమయంగా మారడంతో, రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద తలపెట్టిన రైతు ఆశీర్వాద సభ ప్రాంతాన్ని సోమవారం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించాలని భావించినా వాతావరణ పరిస్థితులతో వాయిదా వేశామని తెలిపారు. తొలిరోజు ప్రారంభ సభగా అనుకున్నా, రైతు భరోసా పంపిణీ పూర్తయ్యాక ఈ సభను మరింత ఉత్సాహంతో ముగింపు వేడుకగా నిర్వహిస్తామని భట్టి స్పష్టం చేశారు. వాతావరణ శాఖ నివేదికలను అనుసరించి జూలై 6, 7 లేదా 8వ తేదీల్లో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీసు కమిషనర్ సునీల్దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిని హత్య చేసిన కొడుకు
భూదాన్పోచంపల్లి: మద్యం మత్తులో తల్లిని హత్య చేసిన కుమారుడు.. ఆతర్వాత భయంతో తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన సంగెం గంగయ్య, పోశమ్మ(69) దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. గంగయ్య ఇరవై ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారులంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడగా, పోశమ్మ ఒక్కతే గ్రామంలో నివాసముంటోంది. హైదరాబాద్లోని చింతల్లో ఉంటున్న పోశమ్మ చిన్న కుమారుడు శ్రీనివాస్(42) కూకట్పల్లి బస్సు డిపోలో డ్రైవర్గా పనిచేసి అనారోగ్యం కారణంగా మూడేళ్ల నుంచి ఖాళీగా ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య చాలాకాలంగా నెలకొన్న భూవివాదం మాట్లాడుకొనే విషయమై మూడు రోజుల క్రితమే కుటుంబంతో కలిసి పెద్దరావులపల్లికి వచ్చాడు. ఆదివారం పోలీస్ స్టేషన్కు వెళ్లి అన్న వెంకటేశ్పై ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల్లో పిలిపించి మాట్లాడుదామని పోలీసులు నచ్చజెప్పి పంపించారు. సాయంత్రం మద్యం సేవించిన శ్రీనివాస్ తన భార్య పద్మను తీవ్రంగా కొట్టడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్ కుమారులు తండ్రిని కొట్టి, తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. భార్యాపిల్లలు హైదరాబాద్కు వెళ్లిపోగానే శ్రీనివాస్ తల్లి పోశమ్మను పింఛన్ డబ్బులు రూ.1000 అడుక్కొని మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ సైకోగా మారి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి పోశమ్మ తలపై బండరాయితో మోది హత్య చేశాడు. సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తు దిగడంతో తాను చేసిన నేరానికి భయపడిపోయాడు. ఉదయం బీబీనగర్ మండలం భట్టుగూడెంకు వెళ్లి మద్యం తెచ్చుకొని ఇంట్లో తలుపులు పెట్టుకొని సేవించాడు. అనంతరం గదిలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోశమ్మ ఉదయం నుంచి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు తలుపుల సందులోంచి చూడగా తల్లీ కొడుకులు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్రెడ్డి, రూరల్ సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ భాస్కర్రెడ్డి, క్లూస్ టీమ్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.భర్తను చంపిన భార్యకుటుంబ కలహాలతో మహబూబ్నగర్ జిల్లాలో ఘటనదేవరకద్ర రూరల్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు భర్తను బలితీసుకున్నాయి. భర్తపై కత్తితో దాడిచేసి భార్య హతమార్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాయపల్లికి చెందిన కుర్వ నాగేశ్ (38)కు కోయిల్కొండ మండలం మల్కాపూర్కు చెందిన కవితతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. నాగేశ్ గొర్రెల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అతడికి అనుమానం కలగడంతో దంపతులిద్దరి మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాగేశ్ పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ, మద్యానికి బానిస కావడంతో కుటుంబ కలహాలు మరింత తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న నాగేశ్కు కవితకు మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నాగేశ్పై కవిత కత్తితో దాడికి పాల్పడింది. ఈ సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్న చిన్న కుమారుడు రాము తండ్రి ఆర్తనాదాలు విని మేల్కొన్నాడు. తండ్రిపై తల్లి దాడి చేస్తుండటాన్ని చూసి భయంతో బయటకు వచ్చి కేకలు వేశాడు. బయట నిద్రిస్తున్న ఇతర కుటుంబసభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకోగా అప్పటికే నాగేశ్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తన వదినకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతోనే గొడవలు జరుగుతున్నాయని, అదే కక్షతో తన అన్నపై కత్తితో దాడిచేసి హతమార్చిందని మృతుడి సోదరుడు రాజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. -
నా చేయి పట్టుకో...
విశాల్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘మకుటం’. దివంగత నిర్మాత ఆర్బీ చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలోని 99వ చిత్రం ఇది. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటించారు. ‘మకుటం’ సినిమా జూలైలో విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలోని ‘నచ్చాకే వచ్చారా..’ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది.‘నచ్చాకే వచ్చారా... వెచ్చంగా హత్తుకో గుండెల్లో పెట్టుకో..., నా చేయి పట్టుకో...’ అంటూ ‘నచ్చారే...’ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్కుమార్ స్వరకల్పనలో భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ పాటను ప్రభ పాడారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘శివ’ సినిమా చూసిన తర్వాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. ‘మకుటం’ చిత్రంతో నా ఆకాంక్ష నెరవేరింది. ఆర్బీ చౌదరిగారిని మిస్ అవుతున్నాను.ఆ నిర్మాణ సంస్థ నుంచి దర్శకుడిగా నేను 45వ వ్యక్తిని. సుబ్రహ్మణ్యంగారు నాపై పెట్టుకున్న నమ్మకంతోనే ‘మకుటం’ సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది. మా నాన్న జీకే రెడ్డి గారి వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను. ‘పందెం కోడి’ మూవీని ఆయనే పట్టుబట్టి తెలుగులో రిలీజ్ చేశారు. ‘మకుటం’ చిత్రంతో ప్రేక్షకులు మంచి అనుభూతి పొందుతారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేశాను’’ అన్నారు అంజలి. ‘‘వందో ప్రాజెక్ట్ అనేది మా నాన్నకి (ఆర్బీ చౌదరి) ఎంతో స్పెషల్. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ, సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు జిత్తన్ రమేష్. -
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన విధంగా ఎవరికీ అన్యాయం జరగకుండా ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవితాలు దెబ్బతీయకుండా ప్రతీ నిర్ణయాన్ని మానవీయ కోణంలోనే తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను కూడా ప్రజల కోణంలో ఆలోచించి, మానవీయ దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసం అంశాలపై సోమవారం సచివాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను తక్షణమే రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అలాగే భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారంతో పాటు అవసరమైన పునరావాసం కల్పించడంలో ఎక్కడా రాజీపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్కుమార్, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీ రాజీవ్గాంధీ హన్మంతు, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’పై మధ్యంతర ఉత్తర్వులివ్వలేం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)–2026 కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) హైదరాబాద్ మినహా ఫారాలను తెలుగులోనే ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. అయితే, ఉర్దూ మాట్లాడే జనాభా 20 శాతానికి పైగా ఉన్న ప్రాంతాల్లో ఆ భాషలో ఫారాలు అందించే విషయాన్ని పరిశీలించా లని ఈసీని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో సర్ ఫారాలు ఏఏ భాషల్లో ముద్రించారో వివరాలివ్వాలన్నారు. అలాగే పిటిషనర్ అభ్యంతరాలపై ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వారంపాటు వాయిదా వేశారు. ఎస్ఐఆర్ ఫారాలను కేవలం తెలుగు భాషలో మాత్రమే ముద్రించి పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ కరీంనగర్కు చెందిన ఎంఏ ముజీబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఓటర్ల నమోదు నియమావళి రూల్ 4కు ఈసీ తీరు వ్యతిరేకం.. వివక్షపూరితమని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ విజయ్సేన్రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీలన్నీ సమ్మతించాయి.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్వోలకు ఏ భాష వచ్చో.. ఏ భాష రాదో.. తెలియదు. మైనారిటీలను తొలగించాలనే ఉద్దేశంతోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో మాత్రమే దరఖాస్తు ముద్రించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆంగ్లంలో ఉన్న ఫారాలను కూడా హైదరాబాద్ వరకే ఇచ్చారు. తెలిసిన భాషలో పత్రం కోరడం రాజ్యాంగ హక్కు. హైదరాబాద్లో ఉర్దూ వచ్చిన వారెక్కువ. తెలుగు రాని వారి కోసం ఉర్దూలో ముద్రించాల్సిన అవసరం ఉంది’అని చెప్పారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్వోల వద్ద తెలుగు ఫారాలతోపాటు ఆంగ్లం, ఉర్దూ డమ్మీ ఫారాలుంటాయి. ఎవరికైనా తెలుగు తెలియకుంటే ఇతర భాషలోనివి చూపించి.. తెలుగు ఫారమ్లో నింపుతారు. ఈ నెల 17న జరిగిన భేటీలో రాజకీయ పార్టీలన్నీ దీనికి ఏకగ్రీవంగా సమ్మతించాయి. తెలంగాణలో అన్ని రాష్ట్రాల వారున్నారు.. దేశంలోని అన్ని భాషల్లో సర్ ఫారాలు ప్రింట్ చేయాలనడం సరికాదు. ఇప్పటికే ప్రింటింగ్ ముగిసింది. బీఎల్వోలు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఒకే ఫారమ్లో రెండు, మూడు భాషలిస్తే ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఫారమ్ ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంది’అని చెప్పారు. -
సోషల్ టెక్ నిపుణుల కోసం ఫెలోషిప్ ప్రోగ్రాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలను రూపొందించే సాంకేతిక సంస్థ ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖకు చెందిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్తో (టాస్క్) కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేసే సరికొత్త సోషల్ టెక్ ప్రొఫెషనల్స్ను (సామాజిక సాంకేతిక నిపుణులు) తయారు చేయడం కోసం ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఎక్విప్ ఫెలోస్ ప్రోగ్రామ్ ప్రారంభించాయి. అకడమిక్ విద్యకు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎక్విప్ రూపొందించిన ప్రత్యేక పాఠ్యప్రణాళిక ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి అవసరమైన నైపుణ్యాలపై టాస్క్ శిక్షణ ఇస్తుంది. ఈ ఫెలోషిప్ 6–12 నెలల పాటు ఉంటుంది. ఇందులో క్లాస్రూమ్ బోధన, టెక్నాలజీ శిక్షణతో పాటు లైవ్ ప్రాజెక్టులలో క్షేత్రస్థాయి పని అనుభవం కల్పిస్తారు.ఫెలోషిప్ కాలంలో అభ్యర్థులకు ఉపకార వేతనం లభిస్తుంది. ఈ శిక్షణ పొందిన నిపుణులు ప్రభుత్వాలు, సీఎస్ఆర్ ఫౌండేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు చేపట్టే పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్, డిజిటల్ సామాజిక ప్రాజెక్టుల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తారు. -
ప్రవేశాల్లో వెనుక‘బడి’
మంచిర్యాల అర్బన్: బడీడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. వందశాతం నమోదు లక్ష్యం నీరుగారిపోతోంది. 2026–27 విద్యాసంవత్సరానికి మే 14నుంచి జూన్ 19వరకు బడిబాట నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉచితంగా యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ, మధ్యాహ్న భోజనంపై విస్తృత ప్రచారం చేపట్టినా అడ్మిషన్ల లక్ష్యాన్ని చేరుకోలేదు. ఈ ఏడాది లక్ష్యం ప్రకారం 17.08 శాతం వెనుకబడిపో వడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలతో విద్యార్థుల సంఖ్య 21,39,006కు చేరడం లక్ష్యం కాగా 17,73,643 మాత్రమే అడ్మిషన్లు అయ్యాయి. గత ఏడాది కంటే ఈసారి 2,28,990 మంది చేరగా 3,65,364మంది విద్యార్థుల నమోదు చేయాల్సి ఉంది. కాగా, మంచిర్యాల జిల్లా ప్రవేశాల లక్ష్య సాధనలో 86.19శాతం నమోదు చేసి అగ్రస్థానంలో నిలువగా పెద్దపల్లి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. -
భారత మహిళల జట్టుకు బెర్త్
న్యూఢిల్లీ: లాస్ ఏంజెలిస్లో జరిగే 2028 ఒలింపిక్స్కు భారత మహిళల క్రికెట్ జట్టు అర్హత సాధించింది. ఆసియా ఖండంలో అత్యుత్తమ ర్యాంక్ ఉన్న జట్టుగా టీమిండియాకు అవకాశం దక్కింది. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనం చేయనుండగా... టి20 ఫార్మాట్లో జరిగే క్రికెట్ ఈవెంట్లో పురుషుల, మహిళల విభాగాల్లో చెరో 6 జట్లు పాల్గొనబోతున్నాయి. మహిళల విభాగంలో భారత్తో పాటు వేర్వేరు ఖండాల నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆ్రస్టేలియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా అర్హత సాధించాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఆతిథ్య జట్టు హోదాలో అమెరికాకు కూడా అవకాశం లభించింది. అయితే వెస్టిండీస్ జట్టుకు అర్హత కల్పించే విషయంలో మాత్రం ఐసీసీ ఆచితూచి అడుగు వేస్తోంది. వెస్టిండీస్ను ఒకే టీమ్గా ఐసీసీ గుర్తించగా... ఒలింపిక్స్ విషయంలో మాత్రం ఆ జట్టుకు అవకాశం లభించడం కష్టంగా మారింది. ఆంటిగ్వా, బార్బడోస్, గయానా, జమైకా తదితర వేర్వేరు దేశాలతో కూడిన ఆటగాళ్లను ఒకే జట్టుగా ఎంచుకొని విండీస్ టీమ్ క్రికెట్ ఆడుతుంది.అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) దృష్టిలో ఇవన్నీ వేర్వేరుగా గుర్తింపు పొందిన దేశాలు. కాబట్టి నేరుగా వెస్టిండీస్కు పాల్గొనే అవకాశం లేదు. అవసరమైతే ఈ అన్ని జట్ల మధ్య పోటీ నిర్వహించి కరీబియన్ నుంచి ఒకే టీమ్ను ఎంపిక చేస్తామని ఐసీసీ ప్రకటించింది. -
న్యూజిలాండ్ సిరీస్ విజయం
నాటింగ్హామ్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన న్యూజిలాండ్ తమ టెస్టు క్రికెట్లో మరో అరుదైన ఘనతను సాధించింది. సోమవారం మగిసిన మూడో టెస్టులో టామ్ లాథమ్ సారథ్యంలోని కివీస్ 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 టెస్టుల సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 103/4తో చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 51.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. సోమవారం 36.2 ఓవర్లు ఆడిన జట్టు మరో 109 పరుగులే జత చేసి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. జేమీ స్మిత్ (60) అర్ధసెంచరీ సాధించగా...ఇతర ప్రధాన బ్యాటర్లు రూట్ (18), ఎమీలియో గే (10) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో ఫోక్స్ 3 వికెట్లు పడగొట్టగా ...సాంట్నర్, స్మిత్ చెరో 2 వికెట్లు తీశారు. ఇంగ్లండ్ గడ్డపై న్యూజి లాండ్ టెస్టు సిరీస్ గెలవడం ఇది నాలుగోసారి. గతంలో ఆ జట్టు 1986, 1999, 2021లలో ఇక్కడ సిరీస్ విజేతగా నిలిచింది. బెన్ స్టోక్స్ రిటైర్... దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ తర్వాత ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఆటకు గుడ్బై చెప్పాడు. ఇంతకుముందే టి20లు, వన్డేల నుంచి తప్పుకున్న 35 ఏళ్ల స్టోక్స్ ఇప్పుడు టెస్టు క్రికెట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. గత ఏడాది కాలంలో జట్టుకు వరుస పరాజయాలు, తన పేలవ ప్రదర్శనతో పాటు క్రమశిక్షణాచర్యలు ఎదుర్కోవడంతో అతను ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. 122 టెస్టుల్లో 7273 పరుగులు చేయడంతో పాటు 252 వికెట్లు కూడా తీసిన స్టోక్స్ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని సారథ్యంలో 44 టెస్టులు ఆడిన ఇంగ్లండ్... 24 గెలిచి, 18 మ్యాచ్ల్లో ఓడింది. దక్షిణాఫ్రికాపై ఆడిన 258 పరుగుల ఇన్నింగ్స్, ఆ్రస్టేలియాపై హెడింగ్లీ మైదానంలో అసాధారణంగా ఆడి గెలిపించిన 135 నాటౌట్ ఇన్నింగ్స్ అతని బ్యాటింగ్ కెరీర్లో హైలైట్గా నిలిచాయి. -
కెనడా కిక్... దక్షిణాఫ్రికా అవుట్
లాస్ ఏంజెలిస్: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కెనడా జట్టు ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో మరో అడుగు ముందుకు వేసింది. మూడోసారి ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్న కెనడా జట్టు తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రౌండ్–32 తొలి నాకౌట్ మ్యాచ్లో కెనడా 1–0 గోల్ తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 90+2వ నిమిషంలో ‘డి’ ఏరియా పైభాగం నుంచి స్టీఫెన్ యుస్టాకియో సంధించిన కిక్ను దక్షిణాఫ్రికా గోల్కీపర్ నిలువరించలేకపోయాడు. దాంతో కెనడా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం స్టాపేజ్ సమయంలోని మిగతా ఐదు నిమిషాలపాటు దక్షిణాఫ్రికాను కట్టడి చేసి కెనడా విజయాన్ని అందుకుంది. -
రన్నరప్ శ్రీకాంత్
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు. ప్రపంచ 46వ ర్యాంకర్ సు లి యాంగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–16, 9–21తో ఓడిపోయాడు. శ్రీకాంత్కు 9,500 డాలర్ల (రూ. 8 లక్షల 98 వేలు) ప్రైజ్మనీతోపాటు 5,950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శ్రీకాంత్ చివరిసారి 2017 అక్టోబర్లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. -
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తి లాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.పాడ్యమి పూర్తి (24 గంటలు), నక్షత్రం: పూర్వాషాఢ పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.2.30 నుండి 4.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 9.00 వరకు తదుపరి రా.10.57 నుండి 11.41 వరకు, అమృత ఘడియలు: రా1.05 నుండి 2.54 వరకు.సూర్యోదయం : 5.32సూర్యాస్తమయం : 6.34రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం... కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తి వివాదాలు.వృషభం.... వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఇంటాబయటా సమస్యలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు.మిథునం.... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.కర్కాటకం.... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.సింహం.... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు.కన్య... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.తుల... శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవచింతన.వృశ్చికం.. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.ధనుస్సు... అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కీలక నిర్ణయాలు.మకరం... ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు.కుంభం... కొత్త పనులు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.మీనం..... పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆస్తి లాభం. దైవదర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. -
తృటిలో ఓటమి తప్పించుకున్న నంబర్వన్ ప్లేయర్
వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో పురుషుల ప్రపంచ నంబర్వన్ జానిక్ సిన్నర్ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నాడు. సింగిల్స్ తొలి రౌండ్లో సిన్నర్ 4-6, 6-3, 6-7(6/8), 6-2, 6-3తో సెర్బియాకు చెందిన మియోమిర్ కెమనోవిక్పై కష్టపడి గెలిచాడు. మూడున్నర గంటల పాటు జరిగిన ఐదుసెట్ల మ్యాచ్లో సిన్నర్ ఒక దశలో వెనుకబడి ఓటమి వైపు సాగాడు. దీనికి తోడు మూడో సెట్ టై బ్రేక్కు దారి తీయడం, టై బ్రేక్లో కెమనోవిక్ సెట్ను గెలుచుకోవడంతో మ్యాచ్ హోరాహోరిగా సాగింది. అయితే నాలుగో సెట్లో వెనుకబడ్డ కెమనోవిక్ ఐదో సెట్లో తొలి గేమ్ గెలిచినప్పటికీ ఆ తర్వాత ఫుంజుకోలేకపోయాడు. అయితే ఐదు సెట్ల దాకా పోరాడిన కెమనోవిక్ మాత్రం సిన్నర్కు ముచ్చెమటలు పట్టించాడు. ఇక రెండో రౌండ్లో సిన్నర్ పోర్చుగల్కు చెందిన నూనో బోర్జెస్తో తలపడనున్నాడు. మిగిలిన మ్యాచ్ల్లో నొవాక్ జకోవిచ్, డానిల్ మెద్వెదెవ్, సిట్సిపాస్ ముందంజ వేశారు. -
సెషెల్స్తో మరింత బంధం
కేవలం 115 చిన్న చిన్న దీవుల సమాహారం. అందులో నివసించటానికి పనికొచ్చేవి నాలుగంటే నాలుగే. జనాభా చూస్తే లక్షా 30 వేలు. దేశ భూభాగం కేవలం 455 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇంత చిన్న దేశం సెషెల్స్లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులు పర్యటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో అత్యంత కీలకస్థానంలో ఉన్న ఈ ద్వీపకల్పం ఆఫ్రికా తూర్పు తీరానికి సమీపంలో, హిందూమహా సముద్రంలోని అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలకు సమీపంలో ఉంది. ఇది ఆసియా–ఆఫ్రికా సముద్ర మార్గాల కూడలి కనుక ఆఫ్రికా, యూరప్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే నౌక లన్నీ ఈ ప్రాంతంనుంచే పోవాలి. ఆ నౌకలు నిత్యం ముడిచమురు, సహజవాయు నిక్షేపాలు, ఆహారపదార్థాలు, ముడి సరుకులు మోసుకుపోతుంటాయి. ఆ దేశాధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఈ ఏడాది మొదట్లో మన దేశం వచ్చారు. అటు తర్వాత మన దేశం అక్కడికి 250 టన్నుల ఆహార పదార్థాలు, భవన నిర్మాణాలకు అవసరమయ్యే సిమెంట్, ఇతరమైనవి పంపింది. దానికి కొనసాగింపుగా మోదీ జరిపిన ప్రస్తుత పర్యటనలో ఇరు దేశాలమధ్యా 19 అంశాల్లో అంగీకారం కుదిరింది. తమవంటి ద్వీపకల్ప దేశాల ఆకాంక్షలను ప్రపంచ వేదికలపై ఎలుగెత్తిచాటుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న భారత్పై ఆ దేశంలో ఆదరాభిమానాలున్నాయి. 1986లో అప్పటి దేశాధ్యక్షుడైన ఫ్రాన్స్ ఆల్బర్ట్ రెనే సోవియెట్ యూనియన్ పర్యటనకెళ్లినప్పుడు సెషెల్స్లో తిరుగుబాటుకు కుట్ర పన్నిన వైనంపై ముందస్తు సమా చారం అందుకున్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హుటాహుటీన నావికా దళాన్ని పంపి దాన్ని అణిచేశారు. సెషెల్స్ నిడివి చిన్నదైనా సాగరజలాల్లో దాని ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఎస్జెడ్) ఏకంగా 13.7 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భూభాగంకన్నా దాని సముద్ర వ్యాప్తి దాదాపు 3,000 రెట్లు అధికం. హిందూ మహాసముద్రంలో చైనా క్రమేపీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవటానికి ముత్యాల తీగ (స్ట్రింగ్ ఆఫ్ పెరెల్స్) పేరిట పాగా వేయాలని చూస్తోంది. ఆఫ్రికా తీరమైన జిబూటిలో ఇప్పటికే సైనిక స్థావరం ఏర్పాటులో బిజీగా ఉంది. కనుక ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకొనాలంటే సెషెల్స్తో భారత్కు బలమైన బంధం ఉండితీరాలి. కోస్తా రాడార్ నెట్ వర్క్ పేరిట మన దేశం ఏర్పాటుచేసిన వ్యవస్థ ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రతి నౌక కదలికనూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అక్కడ సముద్ర దొంగల బెడద కూడా ఎక్కువే. దాంతోపాటు మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చేపలవేట ఉంటాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనటానికి రాడార్ నెట్ వర్క్ ఎంతగానో తోడ్పడుతున్నది. దీంతోపాటు మన దేశం డోర్నియర్ నిఘా విమానాలనూ, గస్తీ నౌకలనూ బహుమతిగా ఇచ్చింది. వాటిపై సెషెల్స్ రక్షణ సిబ్బందికి శిక్షణనిచ్చింది. 2020లో ఆ దేశ సుప్రీంకోర్టు భవనాన్ని ఉచితంగా నిర్మించి ఇచ్చింది.ప్రసిద్ధ నావికుడు వాస్కోడిగామా 1502లో తొలిసారి ఈ ద్వీపకల్పాన్ని సందర్శించి నప్పుడు ఇక్కడ మానవ సంచారం లేదని చెబుతారు. అటుతర్వాత 1756లో ఫ్రాన్స్ దీన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థికమంత్రి జీన్ మోరో సెషెల్స్ పేరిట ఈ ద్వీపకల్పానికి సెషెల్స్గా నామకరణం చేశారు. 1770లో ఇక్కడ వ్యవసాయ పనులకు ఫ్రాన్స్ ఆఫ్రికానుంచి భారీయెత్తున కార్మికులను తరలించింది. అప్పుడు మన దేశం నుంచి కూడా వెళ్లారు. నెపోలియన్ యుద్ధాల్లో ఒకదానిలో ఫ్రాన్స్ ఓడిపోవటంతో 1814లో ఇది బ్రిటన్ అధీనంలోకి వచ్చింది. చివరకు 1976లో దీనికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రస్తుత సెషెల్స్ జనాభాలో 12 శాతంమంది మన దేశంనుంచి వలసవెళ్లిన గుజరాత్, తమిళనాడులకు చెందినవారే. హిందూ మహాసముద్ర ప్రాంత ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. అవకాశం దొరికితే కాలూనడానికి చైనాతోపాటు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రాంతం శాంతియుత మండలంగా ఉండాలని మన దేశం మొదటినుంచీ కోరుకుంటోంది. ఇరు దేశాల సంబంధాలూ భద్రతకే పరిమితం కాకుండా పర్యావరణ పునరు ద్ధరణ, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన వనరులు, డిజిటల్ రంగ సదుపాయాలు వగైరాలకు సైతం విస్తరించాయి. ఇరు దేశాల బాంధవ్యం మున్ముందు మరింతగా ఎదుగు తుందని మోదీ పర్యటన నిరూపించింది. -
నిధులిస్తారా లేక నీళ్లు నములుతారా?
దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు గత రెండు దశాబ్దాలుగా కనీస జీవన భద్రతగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీనరేగా)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, జూలై 1 నుండి ‘వీబీ జీ రామ్ జీ’ని అమల్లోకి తేవడానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది. 55కు పైగా ప్రధాన క్లాజులు, రూల్స్, వందలాది ఉప నిబంధనలు, కొత్త పరిపాలనా నిర్మాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థ ఉపాధి హామీని బలోపేతం చేయడానికి కాదు; దాని హక్కు ఆధారిత స్వభావాన్ని పూర్తిగా బలహీనపరచడానికే ఉద్దేశించబడింది. ఉపాధి హామీ కాదు, నిరుద్యోగ హామీ ఇది. చెట్టును నరికి నీడ ఇస్తామని చెప్పడం ఎంత మోసమో, ‘ఎంజీనరేగా’ను నిర్వీర్యం చేసి 125 రోజుల ఉపాధి హామీ ఇస్తామని చెప్పడం అంతే మోసం. లెక్కలు చెప్పే నిజాలుకేంద్ర ప్రభుత్వం 100 రోజుల బదులు 125 రోజుల ఉపాధి హామీ ఇస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ ఏ ఉపాధి పథకం అయినా హామీలపై కాదు, నిధులపై నిలబడుతుంది. ఇక్కడే మొదటి వైరుధ్యం కనిపిస్తుంది. 125 రోజుల ఉపాధి కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో కొత్త పథకానికి కేవలం రూ. 95,000 కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ కేటాయింపు 125 రోజుల ఉపాధికి ఏమాత్రం సరిపోదని రాష్ట్రాలవారీ పని దినాల గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత సంవత్సరం కేరళలో సగటు పనిదినాలు 57.81, తెలంగాణలో 50.24, తమిళనాడులో 48.54, పశ్చిమ బెంగాల్లో 44.12, ఆంధ్రప్రదేశ్లో 42.35 మాత్రమే ఉన్నాయి. బిహార్లో 30.94, ఉత్తరప్రదేశ్లో 27.50, మధ్యప్రదేశ్లో 25.66, మహారాష్ట్రలో 14.40, హరియాణాలో 13.78 రోజులకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం 15 నుంచి 50 రోజుల పని కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం 95 వేల కోట్లతో ఒక్కసారిగా 125 రోజుల ఉపాధి ఎలా కల్పిస్తుంది?ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయించి 17 ప్రధాన రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే 7 కోట్ల 69 లక్షల 65 వేల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కార్మికులకు 125 రోజుల ఉపాధి హామీని అమలు చేయడానికి మొత్తం రూ. 3.61 లక్షల కోట్ల వ్యయం అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కేటాయింపు ఈ రాష్ట్రాలకు 85,605 కోట్లు మాత్రమే. రాష్ట్రాల 40 శాతం వాటా 57,071 కోట్లు కలిపినా మొత్తం అందుబాటులో ఉండే నిధులు 1.43 లక్షల కోట్లే. ఈ నిధులతో సంవత్సరంలో సగటున 48.5 పని దినాలే ఇవ్వగలరు. కేంద్రం కేటాయించిన నిధులు తప్ప అదనంగా పైసా నిధులు ఇవ్వబోమని రూల్స్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే, ఈ లోటును భర్తీ చేయడానికి రాష్ట్రాలే అదనంగా 2.18 లక్షల కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. అంటే 30 శాతం వాటా కేంద్రం, 70 శాతం వాటా రాష్ట్రాలు ఖర్చు చేయాలి. తెలుగు రాష్ట్రాల తీరుఆంధ్రప్రదేశ్లో 54.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదిందిన 7,707 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 71 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధి కల్పించాలంటే 22,746 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 15,039 కోట్ల అదనపు భారం పడుతుంది. తెలంగాణలో 30.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం కేటాయించిన 3,825 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 62 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధికి 12,819 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 8,993 కోట్ల అదనపు భారం పడు తుంది. ఈ లెక్కలు ఒక స్పష్టమైన రాజకీయ సత్యాన్ని బయటపెడు తున్నాయి. హామీ కేంద్రానిది, ప్రచారం కేంద్రానిది, ఖర్చు రాష్ట్రా లది. నియంత్రణ మోదీ గారిది, విఫలమైతే నింద రాష్ట్రాలది. ‘పెళ్లి పెద్దలు చేసుకున్నారు – కట్నం మాత్రం రాష్ట్రాలు పెట్టాలి’ అన్న ట్టుగా ఈ వ్యవస్థ రూపొందుతోంది. ఇక్కడ ఒక పాత సామెత గుర్తుకు వస్తుంది: ‘ఎద్దు ఇస్తానని చెప్పి తాడు చేతిలో పెట్టినట్టు’. రాష్ట్ర ప్రభుత్వలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సాధ్యమా? అంతిమంగా నష్టపోయేది ఉపాధి కార్మికులే. పేరు కాదు, తత్వమే మారింది!డ్రాఫ్ట్ రూల్స్లోని రూల్ 3 చెల్లింపులు, బ్యాంకు మరియు పోస్టాఫీస్ ఖాతాల ద్వారా వేతనాల చెల్లింపును ప్రస్తావిస్తుంది. కానీ కార్మికుడి హక్కుల రక్షణపై స్పష్టత కనిపించదు. వేతనాలు ఆలస్య మైతే బాధ్యత ఎవరిది? నిరుద్యోగభృతి చెల్లించకపోతే బాధ్యులపై చర్య ఏమిటి? వంటి ప్రశ్నలకు రూల్స్లో స్పష్టమైన సమాధానం లేదు. కార్మికుడి హక్కు కేంద్ర బిందువుగా ఉండాల్సిన చోట పరిపా లనా ప్రక్రియ కేంద్ర బిందువుగా మారుతోంది. అత్యంత ప్రమాదకరమైన మార్పు రూల్ 4లో కనిపిస్తుంది. రూల్ 4(2)లోని నార్మటివ్ అలోకేషన్ విధానం ఎంజీ నరేగా అసలు తత్వాన్నే మార్చేస్తోంది. ఎంజీనరేగా ప్రాథమిక సూత్రం ‘పని అడిగితే పని ఇవ్వాలి.’ పని డిమాండ్ ఉంటే ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. కానీ కొత్త విధానం పని హక్కును బడ్జెట్ పరిమితికి కట్టిపడేస్తోంది. అంటే ఇప్పుడు నిధులు ఉంటేనే పని. హక్కు నుండి కోటాకు మార్పు. చట్టబద్ధ హామీ నుండి బడ్జెట్ పరిమితికి మార్పు. పౌరుని హక్కు నుండి అధికారుల విచక్షణకు మార్పు. ‘బావి ఎండి పోయాక మోటారు పెంచినట్టు’ 125 రోజుల హామీ ఉంది.ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించా రన్న ప్రశ్నకూ సమాధానం దొరుకుతుంది. గాంధీ పేరు గ్రామ స్వరాజ్యం, వికేంద్రీకరణ, గ్రామసభల పాత్ర వంటి భావనలకు ప్రతీక. కానీ కొత్త వ్యవస్థలో గ్రామ సభలు బలహీనపడుతున్నాయి. అందుకే ‘ముందు బోర్డు మార్చారు – ఇప్పుడు భవనం కూల్చేస్తున్నారు.’ ఇది పేరు మార్పు కాదు. తత్వ మార్పు. డ్రాఫ్ట్ రూల్స్లోని డిజిటల్ నిబంధనలు కూడా ఇదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ–కేవైసీ, ఫేస్ అథెంటికేషన్, ఎన్ఎంఎన్ఎస్, ఆధార్ అథెంటికేషన్ వంటి విధానాలను ఆధునికీకరణ పేరుతో ప్రవేశపెడుతున్నారు. కానీ గ్రామీణ పేద కార్మికుల అను భవం వేరే కథ చెబుతోంది. నెట్వర్క్ లేకపోతే పని లేదు. వేలి ముద్ర పడకపోతే వేతనం లేదు. అంటే పని హక్కు కార్మికుడి చేతిలో లేదు. సాంకేతిక వ్యవస్థల చేతిలో ఉంది.ఎంజీనరేగా గ్రామీణ కార్మికుడికి కనీస భద్రతను ఇస్తుంది. వేతనాలపై ఒక కనీస ప్రమాణాన్ని సృష్టిస్తుంది. ఆకలి, నిరుద్యో గాన్ని కొంతమేర నియంత్రిస్తుంది. అందుకే దేశంలోని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, వ్యవసాయ, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు విశాల ఐక్య వేదికలను నిర్మించి ఈ దాడిని తిప్పికొట్టాలి. వీబీ జీ రామ్ జీని ఉపసంహరించాలి. 200 రోజుల చట్టబద్ధ ఉపాధి హామీ కల్పించాలి. పూర్తి కేంద్ర నిధులు విడుదల చేయాలి. గ్రామ సభలు, పంచాయతీల అధికారాలను బలోపేతం చేయాలి.బి. వెంకట్వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి -
టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 10 రోజులుగా నిరసన సాగిస్తున్న తమకు పోలీసులు కనీస సౌకర్యాలను కూడా అందనివ్వడం లేదని ఆరోపించారు. తమకు టీ అందజేస్తున్న అనికేత్ పటేల్ అనే వ్యక్తిని సైతం ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారన్నారు. నిరసనకారులకు ఆహారం, దుస్తులు తీసుకువచ్చే వారినీ వదిలిపెట్టడం లేదని దీప్కే చెప్పారు. అనికేత్ పటేల్ ఆహ్వానం మేరకు అతడి టీ దుకాణం వద్దకు, అతడి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా అంటూ పోలీసులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిరసన వేదిక వద్ద బందోబస్తు విధుల్లో ఉండే పోలీసులకు తాను గులాబీలు, టీ అందజేస్తానన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతలను నిర్వర్తించాలని వారిని కోరుతానని చెప్పారు. ఇదే వేదికపై నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్చుక్ కోసం పోర్టబుల్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆదివారం రాత్రి నిరసన చేపట్టినట్లు వెల్లడించారు. జంతర్ మంతర్లోని పబ్లిక్ టాయిలెట్లకు నీటి సౌకర్యం లేదని చెప్పారు. పరీక్షపత్రాల లీకేజీలకు కేంద్రమే బాధ్యత వహించాలనే డిమాండ్తో ఆదివారం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించడం తెల్సిందే. సీజేపీ నేతృత్వంలో ఇదే డిమాండ్తో జూన్ 20వ తేదీన దీప్కే సారథ్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రజాస్వామ్య ఉద్యమానికి మచ్చు తునక ఈ సందర్భంగా సోనమ్ వాంగ్చుక్ మాట్లాడుతూ..జంతర్మంతర్లో విద్యార్థులు, వలంటీర్లు శాంతియుతంగా కొనసాగిస్తున్న నిరసన ప్రజాస్వామ్య తరహా ఉద్యమానికి ఓ ఉదాహరణ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో తమ వంతుగా భాగస్వాములయ్యారని చెప్పారు. పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్న వలంటీర్లు, సహకరిస్తున్న పోలీసులకు వాంగ్చుక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో దేశ వ్యతిరేక అంశమేదీ లేదని చెప్పారు. వీరంతా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మాత్రమే కోరుతున్నారని వివరించారు. ‘మీరు ఇలాగే మొండిగా వ్యవహరిస్తూ పోతే నష్టపోయేదీ మీరే. ప్రజలకు మీపై నమ్మకం పోతుంది. ఆ తర్వాత వారు మిమ్మల్ని తిరస్కరిస్తారు. ప్రజల బాధను మీరు అర్థం చేసుకున్నప్పుడే మిమ్మల్ని అంగీకరిస్తారు’అంటూ వాంగ్చుక్ వ్యాఖ్యానించారు. నీక్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కి చెందిన ఆరుగురు విద్యార్థి నేతలు ఇక్కడే మరో వేదికపై ఆదివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా నిరసన చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. -
అంబులెన్స్ సేవలకు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అంబులెన్స్ సేవల (ఎన్ఏఎస్)–2026 మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలను ఒకే ప్రమాణాలతో నిర్వహించేందుకు తొలిసారిగా సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన 16వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ సమావేశంలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన ఆవిష్కరించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో, సురక్షితమైన, నాణ్యమైన వైద్య రవాణా సేవలు అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి నడ్డా పేర్కొన్నారు. సమన్వయం కోసం ఐసీడీసీలు మార్గదర్శకాల ప్రకారం అన్ని అంబులెన్స్లు తప్పనిసరిగా ‘ఏఐఎస్–125’ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అంబులెన్స్ల వర్గీకరణ, జనాభా ఆధారంగా వాహనాల కేటాయింపు, సిబ్బంది నియామకాలు, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులకు శిక్షణ, అవసరమైన పరికరాలు, మందులు, వాహనాల నిర్వహణ, నాణ్యత నియంత్రణ, పనితీరు పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి అంశాలకు స్పష్టమైన ప్రమాణాలను ఇందులో నిర్దేశించారు. అత్యవసర సేవల సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ డిస్పాచ్ సెంటర్లు (ఐసీడీసీలు) ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి సూచించారు. జీపీఎస్ ఆధారిత అంబులెన్స్ ట్రాకింగ్, డిజిటల్ కాల్ మేనేజ్మెంట్, రియల్టైమ్ పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయడంతో పాటు, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అంబులెన్స్ సేవలను ఏకీకృత అత్యవసర హెల్ప్లైన్ 112తో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే జీఐఎస్ సాంకేతికత ఆధారంగా ఆసుపత్రులు, రెఫరల్ కేంద్రాలు, ప్రమాద ప్రాంతాలు, అంబులెన్స్ స్టేషన్ల మ్యాపింగ్ చేపట్టి సమీపంలోని తగిన ఆసుపత్రికి రోగులను వేగంగా తరలించే విధంగా సేవలను బలోపేతం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా అత్యవసర వైద్య సేవలు సమానంగా అందేలా శాస్త్రీయ ప్రణాళికతో అంబులెన్స్లను మోహరించాలని సూచించారు. -
బెంగాల్లో 7 శాతానికి తగ్గనున్న ఓబీసీ కోటా
కోల్కతా: ఓబీసీ కేటగిరీ రిజర్వేషన్లను 17 శాతం నుంచి 7 శాతానికి తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. గత టీఎంసీ ప్రభుత్వం 2012లో చేసిన చట్టానికి పలు సవరణలతో సువేందు సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం రెండు బిల్లులను సోమవారం ప్రవేశపెట్టింది. బెంగాల్ వెనుకబడిన తరగతుల సవరణ బిల్లు–2026, బెంగాల్ వెనుకబడిన తరగతుల కమిషన్ బిల్లు–2026లతో 66 కులాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోటా 17 శాతం నుంచి 7 శాతానికి తగ్గిపోతుంది. కలకత్తా హైకోర్టు ఆదేశాలను అనుసరించి, ఈ మార్పులను చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ‘గత ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎటువంటి సర్వే చేపట్టకుండా అడ్డగోలుగా చేర్చిన 113 కులాలను జాబితా నుంచి తొలగించాం. వివిధ సర్వేలతో తేలిన అంశాల ఆధారంగా 66 ఉపకులాలను మాత్రం అలాగే ఉంచాం’అని మంత్రి గౌరీశంకర్ ఘోష్ ఈ సందర్భంగా అసెంబ్లీలో తెలిపారు. చేర్చాల్సిన కులాలేవైనా ఇంకా ఉంటే వెనుకబడిన కులాల కమిషన్ చేసే సిఫారసులను పరిశీలిస్తామన్నారు. బీసీ కమిషన్ను పట్టించుకోకుండా గత ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్ విధానాన్ని హైకోర్టు కొట్టివేసిందని మంత్రి గుర్తు చేశారు. అదనంగా 77 కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను కలకత్తా హైకోర్టు 2024లో కొట్టివేసింది. అంతేకాదు, 2010 తర్వాత జారీ అయిన, వీటి ఆధారంగా ఉద్యోగాలు పొందిన 12 లక్షల మంది ఓబీసీ సర్టీఫికెట్లను సైతం రద్దు చేసింది. సువేందు ప్రభుత్వం మే 19వ తేదీన మతం ఆధారంగా వర్గీకరించిన పథకాల అమలును నిలిపివేసింది. అలాగే, 2010కు ముందు ఓబీసీ రిజర్వేషన్ల జాబితాలో ఉన్న 66 సామాజిక వర్గాలను క్రమబద్ధీకరించి, వారికి దక్కాల్సిన 7 శాతం కోటా అర్హతను పునరుద్ధరించింది. అసెంబ్లీలో ఈ బిల్లులకు అనుకూలంగా 186 మంది ఎమ్మెల్యేలు, 17 మంది వ్యతిరేకంగా ఓటేయగా, ఆరుగురు ఓటింగ్లో పాల్గొనలేదు. మమత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనగా బిల్లులను వ్యతిరేకిస్తూ రితబ్రత బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ రెబెల్ వర్గం వాకౌట్ చేసింది. 2న కేబినెట్ ముందుకు యూసీసీ ముసాయిదా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) ముసాయిదాను జూలై 2వ తేదీన కేబినెట్ పరిశీలిస్తుందని సీఎం సువేందు అధికారి సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. యూసీసీ బిల్లును రూపొందించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి రంజన ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాల్లో మతంతో సంబంధం లేకుండా రాష్ట్ర పౌరులందరికీ ఒకే విధమైన నిబంధనలు అమల్లోకి తేవడమే యూసీసీ లక్ష్యం. -
ఆఖరి నిమిషంలో గోల్.. ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లిన బ్రెజిల్
ఫిఫా ప్రపంచకప్లో మాజీ చాంపియన్ బ్రెజిల్ ప్రిక్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16)లో అడుగుపెట్టింది. సోమవారం రాత్రి రౌండ్ ఆఫ్ 32లో భాగంగా జపాన్తో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ 2-1 తేడాతో విజయం సాధించింది. బ్రెజిల్ తరఫున కేస్మిరో (56వ నిమిషం), గాబ్రియెల్ మార్టినెల్లి (90+6వ నిమిషం) గోల్స్ కొట్టారు. ఇక జపాన్ తరఫున కైషూ సానో 29వ నిమిషంలో గోల్ సాధించాడు. ఆట తొలి అర్ధభాగంలో జపాన్ పూర్తి ఆధిప్యతం కనబరిచింది. గాయంతో బ్రెజిల్ స్టార్ నెయ్మర్ జూనియర్ జపాన్తో మ్యాచ్కు కూడా దూరంగానే ఉన్నాడు. దీంతో ఆరంభం నుంచి బ్రెజిల్ కాస్త తడబడింది. అయితే జపాన్ మాత్రం బ్రెజిల్పై పదే పదే దాడులు చేసింది. ఈ నేపథ్యంలో 29వ నిమిషంలో కైషూ సానో జపాన్కు గోల్ అందించాడు. దీంతో హాఫ్ టైమ్ ముగిసేసరికి జపాన్ 1-0తో బ్రెజిల్పై ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో బ్రెజిల్ డిఫెన్స్ మోడ్ నుంచి బయటకు వచ్చి దూకుడును ప్రదర్శించింది. దీంతో ఆట మొదలైన కాసేపటికే 56వ నిమిషంలో కేస్మిరో బ్యాక్ హెడర్ షాట్తో బంతిని గోల్పోస్ట్లోకి పంపించి 1-1తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత బ్రెజిల్ పలుమార్లు జపాన్ గోల్ పోస్టుపై దాడులు చేసినప్పటికీ సమర్థంగా అడ్డుకుంది. దీంతో నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో స్టాపేజీ టైమ్ (ఇంజ్యూరీ టైమ్) ఇచ్చారు. స్టాపేజీ టైమ్ బ్రెజిల్కు కలిసి వచ్చింది. సబ్స్టిట్యూట్గా వచ్చిన గాబ్రియెల్ మార్టినెల్లి గుమెరాస్ నుంచి పాస్ అందుకొని డీప్ నుంచి బంతిని గోల్పోస్ట్కు తరలించి బ్రెజిల్కు రెండో గోల్ అందించడంతో పాటు విజయాన్ని సాధించి పెట్టాడు. ఇప్పటి వరకు జరిగిన 23 ప్రపంచకప్లలో ఆడిన బ్రెజిల్ జట్టు 20వసారి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకోవడం విశేషం. ఇక రౌండ్ ఆఫ్ 16లో బ్రెజిల్.. ఐవరీ కోస్ట్, నార్వే మధ్య విజేతతో తలపడనుంది.🚨🌎 GABRIEL MARTINELLI HAS WON IT IN THE 95TH MINUTE FOR BRAZIL! 🤯🤯Brazil 2-1 Japan.pic.twitter.com/JUQ8WZsa2v— Tekkers Foot (@tekkersfoot) June 29, 2026 -
ఉక్రెయిన్పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో కనీసం ఎనిమిది మంది మరణించగా, మరో 34 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ ఖండించారు. యుద్ధరంగం నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ పారిశ్రామిక కేంద్రమైన ద్నీప్రో నగరంపై రష్యా దళాలు తరచూ దాడులు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే చనిపోయిన బాధితుల్లో ఒకరు 13 ఏళ్ల బాలిక అని ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ హంజా టెలిగ్రామ్ సందేశంలో తెలిపారు. పగిలిన కిటికీలతో ఉన్న ఒక భవనం చిత్రాలను, మెట్ల దగ్గర పడి ఉన్న మృతదేహం అస్పష్టమైన ఫోటోను ఆయన పంచుకున్నారు.ఇక జపోరిజ్జియాపై జరిగిన డ్రోన్ దాడిలో కనీసం ముగ్గురు మరణించగా, ఒక చిన్నారితో సహా మరో ఆరుగురు గాయపడ్డారని జెలెనెస్కీ తెలిపారు. సుమీ, ఒడెసా, చెర్నిహివ్, ఖేర్సన్, ఖార్కివ్ ప్రాంతాలలో కూడా రష్యా దాడులు నిర్వహించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు. 2024లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మాస్కో తమవని చెప్పుకుంటున్న నాలుగు ప్రాంతాల నుంచి కీవ్ బలగాలు వైదొలగాలని, అలాగే నాటోలో చేరాలన్న తమ ప్రణాళికలను బహిరంగంగా విరమించుకోవాలని చెప్పినప్పటి నుంచి శాంతి ఒప్పందంపై రష్యా వైఖరి మారలేదని క్రెమ్లిన్ సోమవారం తెలిపింది. పోరాటాన్ని తగ్గించాలన్న ఉక్రెయిన్ కొత్త ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ఆ ప్రాంతాలపై పూర్తి నియంత్రణ సాధించాలన్న లక్ష్యంతో రష్యా ముందుకు సాగుతుందని వారాంతంలో ఒక టెలివిజన్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ పేర్కొన్నారు. సుదూర దాడులను పరస్పరం నిలిపివేయాలని, పోరాటాన్ని డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, పోరిజ్జియా అనే నాలుగు ప్రాంతాలకే పరిమితం చేయాలని కీవ్ ప్రతిపాదించిందని పుతిన్ చెప్పారు. -
అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి ఫిక్స్?.. కన్ఫార్మ్ చేసిన అనిరుధ్ బాబాయ్!
సంగీత ప్రపంచంలో రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్, క్రికెట్ రంగంలో సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ మధ్య సంబంధం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రచారంపై స్పందించిన అనిరుధ్ “ఇవి కేవలం రూమర్స్ మాత్రమే” అంటూ కొట్టిపారేశారు. అయితే తాజాగా ఆయన బాబాయ్, సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వార్తలకు కొత్త ఊపు వచ్చింది. “అనిరుధ్ మృదు స్వభావి. కావ్య సాధారణ వ్యక్తి కాదు. ఇద్దరూ మంచి జంట. కలిసి మ్యూజిక్ బిజినెస్లో కూడా వీరు రాణించగలరు” అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కావ్య–అనిరుధ్ పెళ్లి టాపిక్ మరింతగా ట్రెండ్ అవుతోంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్’, ‘బీస్ట్’ చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించిన సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారిందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. వీరి పెళ్లిని విదేశాల్లో లండన్ లేదా ఇటలీలో సీక్రెట్గా ప్లాన్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.అయితే కావ్య మారన్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. అవన్నీ బేస్లెస్ రూమర్స్ మాత్రమే అని స్పష్టం చేశాయి. అనిరుధ్ కూడా ఇటీవల ఒక ప్రెస్ మీట్లో పెళ్లి ప్రస్తావన రాగానే నవ్వుతూ దాటవేశారు. ప్రస్తుతం ఈ క్రేజీ జంటపై ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, అధికారికంగా మాత్రం ఎలాంటి ధృవీకరణ రాలేదు. అయితే అభిమానులు మాత్రం అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వార్తలపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. -
ఖమ్మంపై హైదరాబాద్ ఇ-చాంపియన్స్ విజయం
టీజీ20 లీగ్లో భాగంగా సోమవారం ఉప్పల్ వేదికగా అన్వితా ఖమ్మం ఏసెస్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఇ-చాంప్స్ 56 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ ఇ-చాంప్స్ పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 212 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన అన్వితా ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితమైంది. కొడిదెల హిమతేజ (64) అర్ధసెంచరీ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో శ్రీనికేత్ మూడు వికెట్లు తీయగా, అజయ్ దేవ్గౌడ్, షణ్ముక అశ్విన్, అన్విత్ రెడ్డి తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఇ-చాంప్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కెప్టెన్ అభిరత్ రెడ్డి (59) హఫ్ సెంచరీతో చెలరేగగా, గుడుగు గణేశ్ (21 బంతుల్లో 44) రాణించాడు. అన్వితా ఖమ్మం బౌలర్లలో వేద్ రెడ్డి, సహేంద్ర మలు, సాకేత్ దాత్రక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
రాజు వెడ్స్ రాంబాయి హీరో ఓవరాక్షన్.. డెలివరీ బాయ్పై దాడి
రాజు వెడ్స్ రాంబాయి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరో అఖిల్ రాజ్ దురుసుగా ప్రవర్తించారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో అఖిల్ రాజ్ తీరుపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హీరో అఖిల్ రాజ్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్పై దాడి చేశాడు. అతని పేరేంట్స్ వద్దంటున్నా వినకుండా అఖిల్ రాజ్ భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కాగా.. అఖిల్ రాజ్ హీరోగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీతోనే అఖిల్ రాజ్ టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కేవలం ఒక్క సినిమాకే ఇంత ఓవరాక్షన్ ఏంటని పలువురు నెటిజన్స్ అఖిల్ రాజ్ను విమర్శిస్తున్నారు. పొరపాటు జరిగిందని డెలివరీ బాయ్ చెప్పినా కూడా వినకుండా అతనిపై దాడి చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. #RajuWedsRambai Hero Akhil Raj Attacks A Delivery Boy#AkhilRaj pic.twitter.com/KJg5S0j38d— Indian Clicks (@IndianClicks) June 29, 2026
