breaking news
-
జెన్ జడ్ గురించి మీకు తెలుసా?
జెన్ జడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన... ఈ సాంకేతికను అలవర్చుకున్న... చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్నే జెన్జడ్ అని... అంటే జనరేషన్ జడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా... కొత్త ఆలోచనలు... దానికి మించి... ఆన్లైన్ సాంకేతికత... అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్ జడ్. ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్ జడ్ తీరు గురించి మనో వైజ్ఞానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్ చేద్దాం.జన్ జడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్..., "ఐ జనరేషన్"...., "డిజిటల్ స్థానికులు".... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్జడ్లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు. దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.... పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్ జడ్ లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్ వెదకటం, చాట్ జీపీటీని అడగం.... లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే... దీంతో వారి మనస్సులు... వారి సామాజిక స్పృహ... ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు. జన్జడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం... కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా... ఎక్కువగా ఆలోచిస్తారు... చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం... దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Z లో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం... సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం... ఇ-కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్లు, స్టార్టప్లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు. జెన్ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.... భయం లేకుండా ప్రవర్తించడం... కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని... లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తారు. జెన్ జడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు... భావోద్వేగాలకు తావు లేకుండా... బాధను వ్యక్తీకరించడం... ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.... సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా... వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.ఆన్ లైన్లో చర్చల ద్వరా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు... ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన... చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు... వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్పోజర్... అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం... ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు... కలిగి ఉంటారు. కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ... బలహీనత కాదు... అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.... గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి... కానీ జెన్జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.... తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్ 30వ తేదీ) ఐఏఎస్ల బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ కలెక్టరగా చంద్రశేఖర్, నిజామాబాద్ కలెక్టర్గా త్రిపాఠి, జీహెచ్ఎంసీ కమిషనర్లుగా శ్రీజన, వినయ్ కృష్ణారెడ్డిలను బదిలీ చేశారు. పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్గా శ్రుతి ఓజా, నారాయణపేట అదనపు కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్లను బదిలీ చేశారు. -
ఒమన్ కీలక నిర్ణయం.. నకిలీ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలే
ఒమన్లో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి వర్క్ సర్టిఫికెట్స్, లైసెన్స్, తదితర పత్రాలు సరైనవి లేకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అక్కడి కార్మిక శాఖ ప్రకటన విడుదల చేసింది.ఒమన్లో వీసా పునరుద్ధరణకు, కొత్త ఉద్యోగులలో ప్రవేశానికి సంబంధింత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికేట్లు, లైసెన్స్లు అందుకు సంబంధించిన శాఖలకు చెందిన అధికారులనుంచి పొందవలసి ఉంటుంది. అయితే అలా పొందాల్సిన సమయంలో సంబంధిత అధికారులు అన్ని రకాలుగా సరైన సమాచారం ధృవీకరించుకున్నాకే ఆ పత్రాలు జారీ చేయాలని తెలిపింది. ఒకవేళ నకిలీ పత్రాలు జారీదేస్తే ఉద్యోగులతో పాటు సంబంధింత కంపెనీలు ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అక్కడి కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.కాగా ఒమన్లో ఉన్న మెుత్తం విదేశీ కార్మికుల సంఖ్య దాదాపు 18 లక్షలు కాగా భారత్ నుంచి దాదాపు 5 లక్షలకు పైగా అక్కడ పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా ఒమన్లో పని చేస్తున్న భారతీయుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు అక్కడి నివేదికలు పేర్కొంటున్నాయి. -
ఓటీటీలో ఈ ఏడాది టాప్ పెర్ఫార్మెన్స్ ఈ బ్యూటీలదే
వెండితెరకు పోటీగా మారింది ఓటీటీ. ఈ క్రమంలోనే తారలు అక్కడ కూడా తమ సత్తా చాటుతున్నారు. సిల్వర్ స్క్రీన్కు భిన్నంగా ఓటీటీ వేదికలపై ప్రదర్శితమవుతున్న చిత్రాల్లో మహిళల అభినయ సామర్ధ్యం మరింతగా కనిపిస్తోంది. అదే క్రమంలో ఈ ఏడాది ఓటీటీ చిత్రాల్లో పలువురు తారల నటన వీక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తారలు ఎవరెవరంటే?సాన్యా మల్హోత్రాపితృస్వామ్యాన్ని తీవ్రంగా విమర్శించిన మిస్ట్రెస్ చిత్రంలో సాన్యా మల్హోత్రా నటన ఆకట్టుకుంటుంది. సంతోషాల వధువు నుంచి ఒక ఇంటికి బానిసగా మారే క్రమంలో సాన్యా నటన ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 నిర్మించిన చిత్రం ఇది.యామీ గౌతమ్...ఉత్కంఠభరితమైన రొమాంటిక్ కామెడీ ధూమ్ ధామ్. ఇందులో నటి యామి గౌతమ్ నవ వధువుగా నటించింది. ఆమె వివాహం జరిగిన రాత్రిని అంచనాను తలక్రిందులుగా చేసి, నెర్వస్గా ఉండే తప భర్తతో నగరం అంతటా పిచ్చిగా తిరిగే థూమ్ థామ్ను నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు.మియా మేల్జర్...స్టోలెన్ చిత్రంలో తన బిడ్డ కిడ్నాప్కు గురైన పరిస్థితిలో ఒక నిస్సహాయ స్త్రీ పాత్రను మియా మేల్జర్ పోషించింది. తాను ఎదుర్కొంటున్న పరిస్థితి హింసాత్మకంగా మారినప్పుడు అదే నిస్సహాయ మహిళ తెగువను చూపుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.నీనా గుప్తా..ఆచారీ బా చిత్రంలో గుజరాతీ వితంతువుగా సీనియర్ నటీమణి నీనా గుప్తా నటన మన్ననలు అందుకుంది. జియో హాట్స్టార్లో ఈ సినిమా చూడవచ్చు.షీబా చద్దాసుగంధ ద్రవ్యాల పట్ల మక్కువ, వివాహ జీవితంలో అసంతృప్తి ఉన్న గృహిణిగా షీబా చద్దా... ఫ్యామిలీ డ్రామా కౌశల్జీ వర్సెస్ కౌశల్ చిత్రంలో అద్భుతమైన నటనను కనబరుస్తుంది. ఈ చిత్రం జియో హాట్స్టార్లో ఉంది.సబా ఆజాద్పీరియాడిక్ డ్రామా.. సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్లో సబా సంప్రదాయవాద సమాజంలో తన గొంతును వినిపించడానికి పోరాడిన స్త్రీ స్ఫూర్తిగా కనిపిస్తుంది. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో అందిస్తోంది.ఫరీదా జలాల్పదునైన, నిర్ణయాత్మక పాత్రలో ఫరీదా ఆకట్టుకుంటుంది. మాతృమూర్తిగా ఆమె కుటుంబం ఆమెను ఆరాధిస్తుంది భయపడుతుంది కూడా. ది గ్రేట్ షంసుద్దీన్ ఫ్యామిలీ సినిమాను జియో హాట్స్టార్లో చూడొచ్చు.రాధికా ఆప్టేసాలీ మొహబ్బత్ అనే డార్క్ క్రైమ్ థ్రిల్లర్లో రాధికా ఆప్టే నటన ప్రశంసలు అందుకుంది. ఆమె ఒక విధేయురాలైన భార్యగా మాత్రమే కాదు అడ్డంకులు ఎదురైనప్పుడు అంతే కఠినంగా, అన్ని సందర్భాల్లోనూ పూర్తిగా అమాయకంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.దీప్తి నావల్రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్లలో నటి దీప్తి నావల్ తనకున్న మంచి మహిళ అనే ఇమేజ్కు భిన్నంగా కనిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్లో ఈ రెండు చిత్రాలు చూడవచ్చు.హుమా ఖురేషిప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ అందిస్తున్న ఢిల్లీ క్రై మ్ సీజన్ 3లో క్రూరమైన మానవ అక్రమ రవాణాదారు మీనా (బడీ దీదీ) పాత్రలో హుమా ఖురేషి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. షెఫాలీ షా, రసికా దుగల్ తదితరులు కూడా నటనకు మార్కులు పడినప్పటికీ, ఖురేషి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించి, ప్రశంసలు పొందింది. -
కొత్త హైకోర్టు పనులు.. ఇక సైట్లోనే సమీక్షలు!
హైదరాబాద్: రాజేంద్రనగర్లో నిర్మాణంలో ఉన్న కొత్త హైకోర్టు సముదాయాన్ని గడువులో పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనుల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని రవాణా, రోడ్లు–భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ప్రాజెక్టులో జాప్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఇకపై ప్రతి శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సైట్లోనే వారాంత సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశాలకు కన్సల్టెంట్తో పాటు నిర్మాణ, ఎంఈపీ ఉపకన్సల్టెంట్లు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు.పనుల వేగం పెరగాలంటే సాంకేతిక సిబ్బంది, ఉపకన్సల్టెంట్ల సంఖ్యను వెంటనే పెంచాలని ఆదేశించిన వికాస్రాజ్, ఒప్పంద పరిధిలోనే స్వతంత్ర ఇంజినీరింగ్ సంస్థను నియమించి సాంకేతిక సలహాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఈ (బిల్డింగ్స్)కు ఆదేశించారు.డ్రాయింగ్లను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కనీసం రెండు నెలలు ముందుగానే సమర్పించాలని, అలా చేయడం వల్ల సామగ్రి కొనుగోలు, కార్మికుల సమీకరణ సకాలంలో జరిగే అవకాశం ఉంటుందని వివరించారు. డ్రాయింగ్ల జారీలో జాప్యం జరిగితే, ప్రాజెక్టు పురోగతికి భంగం కలగకుండా ప్రత్యామ్నాయ కన్సల్టెంట్ను నియమించే అధికారం ఇంజినీరింగ్ విభాగానికి ఉంటుందని హెచ్చరించారు.ప్రాజెక్టు గడువు తప్పకుండా నిలబెట్టేలా శాఖ, కాంట్రాక్టర్, కన్సల్టెంట్ ముగ్గురూ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఆర్కిటెక్చరల్ రూపకల్పన, ఎంఈపీ షాఫ్టులు తదితర అంశాలను సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు కలిసే సమీక్షించి, జాతీయ భవన నియమావళి (ఎన్బీసీ) ప్రమాణాలకు అనుగుణంగా తుది డ్రాయింగ్లను ధృవీకరించాలని స్పష్టం చేశారు. -
నిజంగానే భూమి మీదకు వస్తే వారితో సావాసం ఎలా?
2026లో మనం ఏలియన్లను కలవ బోతున్నామా? లేక ఏలియన్లు మన వద్దకు రానున్నాయా? ఏలియన్లకు సంబంధించి బాబా వంగా చేసిన భవిష్యవాణి నిజమవుతుందా? నిజంగా ఏలియన్లు భూమి మీదకు రానున్నాయా? అసలు ఏలియన్లు ఉన్నారా? ఇవన్నీ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. ఇప్పటికీ... బాబా వంగా భవిష్య వాణిని నమ్మేవారు ఏలియన్ల ఉనికి సాధ్యమే అంటున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ... సువిశాల విశ్వంలో పరిశోధనల ఇంకా మిగిలే ఉంది. ఒక వేళ బాబా వంగా వ్యాఖ్యలు వాస్తవమేనని అనుకున్నా.. 2026లో నిజంగా ఏలియన్లు భూమి మీదకు వస్తే మరి వారిని ఎలా కలవాలి...? వారు మనకన్నా బలవంతులా? లేక బలహీనులా?... వాళ్లు శక్తి వంతులై... దాడి చేయడానికి ప్రయత్నిస్తే... వారి ఆయుధాల గురించి కనీస జ్ఞానం లేని మానవులు ఎదుర్కొనగలరా.. ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానాలు వెదుకుదాం. ఏలియన్ల ఉనికి ఉందని... అవి త్వరలోనే భూమి మీదకు వస్తాయని బల్గేరియాకు చెందిన బాబా వంగా చెప్పారు. ఆమె జీవించి ఉన్నప్పుడు... భవిష్యత్తులో జరిగే కొన్ని కార్యాల గురించి చెప్పారు. అందులో ఏలియన్ల ప్రస్తావన కూడా ఉంది. అయితే ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరిగాయి. కొన్ని జరగలేదు. దాంతో జనం ఆమె భవిష్యత్తును చూడగలరని నమ్మారు. అందులోనే 2026లో ఏలియన్ల గురించి ఆమె భవిష్యవాణి ప్రస్తావన ఉంది. ఏలియన్లు భూమ్మీదకు వస్తారు... అప్పడు భూమిమీద పెద్ద సంక్షోభం ఏర్పడుతుందని చెప్పారు. జనం నమ్మి ఏలియన్ల మీద ఆసక్తి పెంచుకోవడంతో పాటు సంక్షభాన్ని ఎదుర్కొనే తీరుపై చర్చలు కూడా సాగుతున్నాయ. శాస్రవేత్తలు మాత్రం... మానవులు.... గ్రహంతర వాసులను కలుస్తారనే ఆధారాలు లేవని... అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఏదేమైనా.. 2026 మాత్రం ఇంటరెస్టింగా మారనుంది. ఇప్పటికే హాట్ టాపిక్గా మారిన ఏలియన్ల ప్రస్తావన... రాను రాను పెద్ద చర్చకే దారి తీసేట్టు ఉంది. ఇప్పటికే భారీ సంఖ్యలో జనం నమ్మడంతో... శాస్త్రవేత్తలు సైతం మరింత లోతుగా వాస్తవాలను గుర్తించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఏలియన్ల చర్చకు భిన్నంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చేసిన విస్తృత పరిశోధనల ద్వారా ఏలియన్ల ఉనికి ఉండొచ్చని... ఉండక పోవచ్చని మాత్రం చెప్పగలిగారు. ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఖగోళ శాస్త్రవేత్తలకు లభించలేదు. అయినా నిరంతర అన్వేషణ సాగుతోనే ఉంది. సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రోగ్రామ్లో ఆకాశాన్ని.. గ్రహాలను స్కాన్ చేస్తూనే ఉన్నప్పటికీ... ఏలియన్ల గురించి స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు.ఏలియన్ల గురించి శాస్త్రవేత్తల ఆలోచన ఏంటనే అంశాలపై ఓ సర్వే జరిగింది. అంతో 1055 మంది శాస్త్రవేత్తలు, వారిలో దాదాపు సగం అంటే 521 మంది ఖగోళ జీవ శాస్త్రవేత్తలతో జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తల్లో 87 శాతం మంది గ్రహంతర వాసులున్నారని నమ్ముతున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల్లో సగం మంది మాత్రమే నమ్ముతున్నారు. మిగతా సగం నమ్మడం లేదు. విశ్వంలో... భూమి తప్ప నివాస యోగ్యంగా ఉండే వాతావరణం, నీటి ఉత్పన్నం, ఇతర అవసరాలకు అనుగుణంగా ఇతర గ్రహాలు లేవని... అందుకే వాటిపై జీవం లేకపోవచ్చని కొందరు ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచన. ఇతర శాస్త్రవేత్తలు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. మన సౌర వ్యవస్థలో చంద్రునిపై జీవం ఉండే ఆస్కారం ఉందని... మన గెలాక్సీలో 100 బిలియన్ గ్రహాలు ఉన్నాయి. అన్నింటిపై పరిశోధనలు జరపకుండా ఈ నిర్ణయానికి రావడం తొందరపాటేనని... ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలతో పాటు... భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో ఏలియన్లు, ఇతర జీవాల ఉనికి ఉండొచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.శాస్త్రవేత్తలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఏలియన్లు, లేదా ఏలియన్లను పోలే ఆకారాలు, ఇతర జీవాలు గెలాక్సీలో ఉన్నాయనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... శాస్త్రవేత్తలు ఏలియన్ల ఉనికి ఉందని నమ్ముతున్నారు. కానీ ఖగోళ శాస్త్రవేత్తలు ఆ వార్తను ఖండిస్తున్నారు. మరి కొందరు శాస్ర్తవేత్తలు మాత్రం మరో విధంగా కూడా చెబుతున్నారు. ఏలియన్స్ ఉన్నాయా లేదా అని ఓ చర్చ సాగుతుండగానే... వారి స్వభావం... వారి తీరుతెన్నుల గురించి కూడా కొందర శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వాటి ఉనికి స్పష్టంగా ఉన్న సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు అస్పష్టమైన హ్యూమనాయిడ్లు సుడిగుండంగా మారి... పొగమంచుతో కూడిన నిల్చున్నాయని... అవి వాటి వెనుక నుండి ప్రకాశవంతమైన కాంతితో చలనంలోకి వస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇక విశ్వంలో ఉన్న ఏలియన్స్ ఆకారం ఎలా ఉంటుంది... వారి భాష, వారి జీవన శైలి ఎలా ఉంటుందనే అంశాలపై కూడా కొందరు శాస్త్రవేత్తలు చర్చలు ప్రారంభించారు. వారి తెలివి తేటలు ఎలా ఉంటాయి...? వారు వాడే టెక్నాలజీ మనకన్నా అడ్వాన్సుగా ఉంటుందా... లేక సాంకేతికతకు దూరం మన రాతియుగం లాంటి జీవాలుంటాయా అనే క్యూరియాసిటీ కూడా సృష్టిస్తున్నారు. అయితే ఇవన్నీ ఊహగానాలే తప్ప.... విశ్వ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏలియన్ల ఉనికి మాత్రం దొరకలేదు. ఏలియన్లపై వచ్చిన సినిమాల ఆధారంగా ఏలియన్ల ఆకారం, తెలివితేటలు, సాంకేతికత, స్పేష్ షటిల్ సఫవగురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. విస్తృత విశ్వం అంతటా నిజంగా భారీ సంఖ్యలో జీవాలు ఉంటే... నివాసయోగ్యమైన వాతావరణాలు ఎందుకు లేవు. అలాంటి ప్రాంతాలుంటే అక్కడి జీవాలపై పరిశోధనలెందుకు జరగడం లేదు.ఏలియన్లు ఉండి... ఒకవేళ ఏలియన్లు భూమ్మీదకు వచ్చేస్తే పరిస్థతి ఏంటీ? ఇప్పటికే సినిమాల ప్రభావం కారణంగా ఏలియన్ల ఆకారం, వాటి ఉనికి... వారి నడక, వారి భాష గురించి అవగాహన పొందినట్లు జనం భావిస్తున్నప్పటికీ... నిజంగా వాళ్లు వస్తేనే అసలు ఆకారాలు బయటపడతాయి. ఏలియన్లు వచ్చినప్పుడు జనంతో భయపడతారా...? లేక మనకన్నా వాళ్లే అడ్వాన్డ్గా ఉంటారా? వాళ్లతో మనం భయపడాల్సి వస్తుందా... ఇలాంటి ప్రశ్నలెన్నో సాధారణ మనుషులను మెదళ్లను తొలచి వేస్తున్నాయి. ఒకవేళ బలహీనులుంటే ... మనుషులు వాటికి హాని కలిగించే ఆలోచనలో మాత్రం ఉండరు. కానీ అవి దాడి చేస్తే మాత్రం ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన సమస్య. వారి భాషను డీకోట్cయడానికి ఎలాంటి టెక్నాలజీ వాడాలన్నదీ శాస్త్రవేత్తల ముందున్న సవాళ్లే. -
'స్ట్రేంజర్ థింగ్స్ 5' ఫినాలే ఎపిసోడ్ ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2016 నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్స్ వచ్చాయి. అవన్నీ కూడా బ్లాక్బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. గత నెలలో ఐదో సీజన్ తొలి వాల్యూమ్లో నాలుగు ఎపిసోడ్స్, క్రిస్మస్ సందర్భంగా రెండో వాల్యూమ్లో మూడు ఎపిసోడ్స్ రిలీజయ్యాయి. సిరీస్ చిట్టచివరి ఎపిసోడ్.. జనవరి 1న రానుంది. దీని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)ఐదో సీజన్లో ఇప్పటివరకు వచ్చిన 7 ఎపిసోడ్స్ గమనిస్తే.. విలన్ వెక్నాతో ఎలెవన్ అండ్ టీమ్ పోరాడటానికి కావాల్సినదంతా సిద్ధం చేశారు. ఇప్పుడు రాబోయే ఫినాలే ఎపిసోడ్లో ఎమోషన్తో పాటు అదిరిపోయే యాక్షన్ ఉండనుందని ట్రైలర్తో హింట్ ఇచ్చారు.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు ఉంటారు. వీళ్లకు ఓ సూపర్ పవర్స్ ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. వీళ్లంతా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఎలెవన్.. తనలాంటి అతీత శక్తులుండే కొందరితో పోరాడాల్సి వస్తుంది. ఇంతకీ వాళ్లెవరు? ఎలెవన్ గతమేంటి అనేదే సిరీస్ ప్లాట్ లైన్. ఫాంటసీ టచ్ ఉండే యాక్షన్, అడ్వెంచర్ స్టోరీలు ఇష్టముంటే ఈ సిరీస్ చూడండి. అస్సలు విడిచిపెట్టరు. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: పెళ్లయిన నెలకు సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్) -
హర్మన్ప్రీత్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్) చెలరేగగా.. ఆఖర్లో అమన్జోత్ కౌర్ (18 బంతుల్లో 21; ఫోర్, సిక్స్), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్ కమలిని 12, హర్లీన్ డియోల్ 13, రిచా ఘోష్ 5, దీప్తి శర్మ 7, స్నేహ్ రాణా (8 నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్ పడగొట్టింది.కాగా, స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకొని, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది. -
'బంగారం'లాంటి ఛాన్స్.. పసిడి ధరల్లో భారీ మార్పు!
బంగారం ధరలు వరుస పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. రెండు రోజుల్లో ఏకంగా రూ. 6000తగ్గింది. దీంతో పసిడి ధరల్లో ఊహించని మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.6220 తగ్గి, రూ. 1,36,200 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 5700 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ.1,24,850 వద్దకు చేరింది.ఢిల్లీ నగరంలో ధరలు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా పెరిగినప్పటికీ.. రేట్లలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,36,350 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ. 1,25,000 వద్ద ఉంది.చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రెండు రోజుల్లో 5450 రూపాయలు తగ్గడం వల్ల.. 10గ్రాముల ధర రూ. 137460 వద్ద ఉంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 5000 తగ్గింది. కాబట్టి రేటు రూ. 1,26,000 వద్ద నిలిచింది. -
సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!
హీరోయిన్ సమంత.. ఈ నెల ప్రారంభంలో రెండో పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో సామ్ కనిపించలేదు. ఇప్పుడు భర్తతో కలిసి ఫారిన్ ట్రిప్లో ఉన్నట్లు ఫొటోలు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: అడ్రస్ చెప్పిన మారుతి.. కడుపు నింపేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్)డిసెంబరు 1న సమంత పెళ్లి జరగ్గా.. నాలుగు రోజులకే సినిమా షూటింగ్లో బిజీ అయిపోయింది. 'మా ఇంటి బంగారం' పేరుతో తీస్తున్న ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తోంది. నిర్మాత కూడా ఈమెనే. ఇప్పుడు చిత్రీకరణలో కాస్త గ్యాప్ దొరకడంతో భర్త రాజ్తో కలిసి పోర్చుగల్లోని లిస్బన్ సిటీకి వెళ్లిపోయింది. అక్కడే షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చెప్పాలంటే సమంతకు ఇది హనీమూన్ ట్రిప్ అనొచ్చు!సమంత గతంలో నాగచైతన్యని పెళ్లిచేసుకుంది. కానీ నాలుగేళ్లకే విడిపోయారు. గత కొన్నాళ్ల నుంచి ఒంటరిగానే ఉంటున్న సామ్.. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్కి కనెక్ట్ అయింది. ఇతడికి గతంలో శ్యామోలి అనే రచయితతో పెళ్లయింది. కానీ ఆమెకు విడాకులు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అలా పెళ్లి బంధంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్న వీళ్లిద్దరూ.. రీసెంట్గా కలిసి కొత్త జీవితం ప్రారంభించారు. సమంత నిర్మిస్తున్న సినిమాలకు రాజ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఆపరేషన్ సిందూర్.. మరోసారి గెలికిన ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరాటం అంతా ఇంతా కాదు అందుకోసం ఏదైనా దేశాల మధ్య పంచాయితీ ఉంటే హడావుడిగా వెళ్లి అందులో వేలు పెట్టడం తర్వాత వారి మధ్య పంచాయితీ తానే తెగ్గొట్టానని క్రెడిట్ కొట్టేయడం ట్రంప్కు చాలా కామన్గా మారింది. ఇప్పటి వరకూ తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని అయినా తనను ఎవరూ గుర్తించరని తనకు శాంతి బహుమతి ఇవ్వరని ఆ మధ్య కస్సుబుస్సులాడారు.ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సిందూర్ వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఇండియా-పాక్ల మధ్య తానే ఆపానని వార్ ఆపకుంటే అధిక పన్నులు విధిస్తానని హెచ్చరించడంతో ఇరు దేశాలు శాంతించాయని తెలిపారు. ఇలా యుద్ధం ఆపాననే ప్రకటనను ట్రంప్ ఇదివరకూ దాదాపు 70 సార్లు పలికాడంటే ఈ విషయంలో ఆయన భారత్ను ఎంతగా రెచ్చగొట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా మరోసారి ఆపరేషన్ సిందూర్ అంశం తెరమీదకొచ్చింది.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రస్థావన తెరమీదకు తెచ్చారు. "ఇదివరకూ నేను ఎనిమిది యుద్ధాలను నియంత్రించాను. ఇండియా, పాకిస్థాన్ విషయంలోనూ అంతే కానీ ఆ క్రెడిట్ నాకు ఇవ్వరూ. . నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. తాను గత పదేళ్లుగా ప్రయత్నిస్తూన్నా ఇది చేయలేకపోయానన్నారు. నేను మాత్రం ఒక్కరోజులో ఈ యుద్ధాలను ఆపా" అని ట్రంప్ బింకాలు పలికారు.ట్రంప్ మధ్యవర్తిత్వం అంశంపై భారత్ సైతం ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ అంశంలో ఏవరూ మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ పలుమార్లు ప్రకటించింది. భారత ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటులో ఈ అంశంపై ప్రకటన చేశారు. ఏ ప్రపంచ నాయకుడు ఆపరేషన్ సిందూర్ను ఆపమని భారత్ను అడగలేదని ఈ నిర్ణయం భారత్ స్వతంత్ర్యంగా తీసుకుందని స్పష్టం చేశారు. పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలను వారి దేశంలోనే ధ్వంసం చేసింది. -
న్యూ ఇయర్ కోసం దుబాయ్ బంపర్ ఆఫర్
దుబాయ్ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెలబ్రేషన్స్కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి 43గంటల పాటు నిరంతరంగా పబ్లిక్ ట్రాన్స్ఫోర్ట్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా వాహనాల పార్కింగ్లకు జనవరి 1న ఎటువంటి రుసుము తీసుకోనున్నట్లు తెలిపింది.సాధారణ సమయాల్లోనే దుబాయ్కి టూరిస్టుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇక న్యుఇయర్ వేడుకల సమయంలో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రేటీలు, టూరిస్టులు, కార్పోరేట్ సంస్థలకు చెందిన వారు ఇయర్ ఎండ్ ఈవెంట్ను సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వస్తుంటారు. ఈ రద్దీ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం టూరిస్టుల కోసం మంచి ఆఫర్ ప్రకటించింది.డిసెంబర్ 31 వేడుకల దృష్యా బుధవారం ఉదయం 5గంటలకు ప్రారంభమయ్యే అక్కడి మెట్రో సర్వీస్ జనవరి 1 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకూ నిరంతరాయంగా నడవనున్నట్లు తెలిపింది. అదే విధంగా దుబాయ్ ట్రామ్ ఉదయం 6గంటల నుండి జనవరి 1 ఉదయం ఒంటిగంట వరకూ నడపనున్నట్లు తెలిపింది. వీటితో పాటు జనవరి1న బహుళ అంతస్థుల భవనాలు, ఆల్ఖైల్ గేట్ పార్కింగ్ మినహా మిగతా అన్ని ప్రాంతాలలో పార్కింగ్ సేవలు పూర్తిగా ఉచితం అని ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకలకు టూరిస్టుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. -
లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్షలతో కిమ్ జాంగ్ బిజీబిజీ..!
ఉత్తర కొరియా యుద్ధానికి సిద్ధమవుతుందా? అంటే అవుననే సంకేతాలను ఆ దేశం పంపిస్తోంది. ఇప్పటికే 2 లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్షలు జరపడంతో నార్త్ కొరియాలోనే కాదు.. దక్షిణ కొరియాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతను పెంచుతోంది. డిసెంబర్ 28న పసుపు సముద్రంలో జరిగిన క్రూయిజ్ క్షిపణుల ప్రయోగాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ స్వయంగా పరిశీలించడం అనుమానాలను బల పరుస్తోంది. నార్త్ కొరియా చుట్టూ అమెరికా బలగాలతో పాటు సౌత్ కొరియాకు చెందిన బలగాలు ఇప్పటికే మోహరించి ఉండటంతో కిమ్ ఈ పరీక్షలు నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.2 గంటల పాటు సాగిన క్షిపణుల ప్రయోగాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పరిశీలించడమే కాకుండా వాటి లక్ష్యాన్ని అవి ఛేదించగలుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను అధికారులు వెల్లడించారు. క్షిపణుల ప్రయోగానికి సంబంధించిన వీడియోలు బయటకు రాగానే దక్షిణ కొరియా అప్రమత్తమైంది. తమ జోలికి వస్తే అమెరికాతో కలిసి ఎదురొడ్డుతామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ విషయంలో జాగ్రత్త పడిన కిమ్ మాత్రం... యుద్ధానికోసం కాదని... క్షిపణుల పనితీరును పరిశీలించడం, దేశ ఆత్మరక్షణ నిమిత్తమే ఈ పరీక్షలు జరిగాయని వెల్లడించడం గమనార్హం.అయినా అప్రమత్తమైన దక్షిణ కొరియా... కొరియా చుట్టూ మోహరించి ఉండటాన్ని గమనిస్తే ఏ క్షణమైన యుద్ధానికి సై అనే ప్రమాదం లేకపోలేదు. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం... లక్ష్యాన్ని ఛేదించడానికి ముందు క్షిపణులు 2 గంటల పాటు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయని... ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో క్షిపణి ప్రయోగం నుండి హిట్ టార్గెట్ వరకు వీడియోలను ఈ క్షిపణి పరీక్షపై కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా క్షిపణి పరీక్షను ధృవీకరించారు.నార్త్ కొరియా చర్యలతో మరో వైపు దక్షిణ కొరియా కూడా తన సన్నాహాలను మరింత వేగవంతం చేసింది. గత ఆదివారం ఉదయం 8 గంటలకు ప్యోంగ్యాంగ్ సమీపంలోని సునాన్ ప్రాంతంలో అనేక క్రూయిజ్ క్షిపణులను నార్త్ కొరియా ప్రయోగించినట్లు సౌత్ కొరియా అధికారులు గమనించినట్లు చెప్పారు. ఒకవేళ నార్త్ కొరియా తోకాడిస్తై అమెరికాతో కలిసి తాము కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని సైనిక సన్నాహాలు చేశామని తెలిపింది. ఉత్తర కొరియా చేసే ఎలాంటి చర్యనైనా తిప్పి కొడతామని కూడా సౌత్ కొరియా హెచ్చరింది. ఉత్తర కొరియా అణ్వాయుధంతో నడిచే జలాంతర్గామిని నిర్మించే దిశగా ముందుకు కదులుతున్నట్లు కూడా అంతకుముందు వెల్లడించింది. -
అడ్రస్ చెప్పిన మారుతి.. కడుపు నింపేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి నిన్న మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన దానికంటే ఇందులో కథని మరింత రివీల్ చేశారు. విజువల్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. దీని దెబ్బకు మూవీపై హైప్ కూడా కాస్త పెరిగింది. ట్రైలర్కి హిట్ టాక్ రావడం ఏమో గానీ దర్శకుడు మారుతిని ప్రభాస్ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. మారుతి ఇంటికి ఓ సర్ప్రైజ్ పంపించారు. ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.మూడు రోజుల క్రితం హైదరాబాద్లో 'రాజాసాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమా ఏ మాత్రం డిసప్పాయింట్ చేసిన తనని విమర్శించొచ్చని చెబుతూ కొండాపూర్లోని తన ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడు.(ఇదీ చదవండి: చిరు-వెంకటేశ్.. మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్)లేటెస్ట్ ట్రైలర్ చూసి తెగ సంబరపడిపోతున్న ప్రభాస్ అభిమానులు.. మారుతి ఇంటికి బిర్యానీ పార్సిల్స్ పంపిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు తన ట్విటర్లో బయటపెట్టాడు. ఓ ఫొటో కూడా పోస్ట్ చేశాడు. ట్రైలర్కే ఈ రేంజ్ అభిమానం చూపిస్తున్నారంటే.. మూవీ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇంకెన్ని పార్సిల్స్ పంపిస్తారో ఏంటో?'రాజాసాబ్' మూవీ జనవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ముందురోజు రాత్రి అంటే 8వ తేదీన రాత్రి ప్రీమియర్ల వేయనున్నారు. ఈ సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)Meerentraaa intha violent ga unnaru… Address ichindi vere danikiMeeru ila kooda vaadeskuntunnaru 🤣🤣 https://t.co/8EJ1KZhH9y— The RajaSaab (@rajasaabmovie) December 30, 2025 -
ఖలీదా జియా అంత్యక్రియలకు హాజరు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరుకానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31న ఢాకాలో జరిగే ఖలీదా అంత్యక్రియలలో పాల్గొనడానికి జయశంకర్ బంగ్లాదేశ్ వెళ్లనున్నట్లు తెలిపింది.బంగ్లాదేశ్ తొలిమహిళా ప్రధానిగా సేవలందించిన ఖలీదా జియా ఈరోజు ఉదయం ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. 80 ఏళ్ల వయసున్న ఖలీదా జియా నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫ్క్షన్తో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ అభివృద్ధితో పాటు భారత్తో సంబంధాలు మెరుగుపడడం కోసం ఆమె చేసిన కృషి ఎల్లకాలం గుర్తుండిపోతుందని మోదీ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగ్గా లేవు. బంగ్లాలో రాజకీయ అస్థితరతతో ఈ ఏడాది ప్రారంభం నుంచే హిందువులపై దాడులు తీవ్రతరమయ్యాయి. వారం రోజుల వ్యవధిలో దాదాపు ముగ్గురు హిందూ యువకులను అక్కడి మతఛాందస వాదులు కొట్టిచంపారు. ఈ నేపథ్యంలో భారత్ సైతం ఈ ఘటనలపై సీరియస్ అయ్యింది. అయితే ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి బంగ్లాదేశ్ వెళ్లడం చర్చనీయాంశమయ్యింది.ఖలీదా జియా ప్రస్థానం1945లో అవిభక్త భారత్లోని పశ్చిమ బెంగాల్లో ఖలీదా జియా జన్మించింది. ఆమె వివాహం జియావుర్ రహమాన్తో (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు) జరిగింది. రహమాన్ మరణానంతరం సుధీర్ఘ కాలం పాటు బీఎన్పీ అధ్యక్షురాలిగా సేవలంధించింది. 1991లో బంగ్లాదేశ్ ప్రధానిగా తొలిసారి ఖలీదా జియా బాధ్యతలు చేపట్టింది. ఆ దేశంలో మహిళ ప్రధాని పదవి చేపట్టడం అదే మెుదలు. కాగా బీఎన్పీ పార్టీ భారత్కు వ్యతిరేకమని వాదనలుండగా ఖలీదా జియా వాటిని పలుమార్లు ఖండించింది. -
ప్రశ్నార్థకంగా మేడ్చల్ నేతల రాజకీయ భవిష్యత్
మేడ్చల్: ఐదేళ్ల క్రితం వరకు తెలంగాణలో ఉన్న అన్ని రకాల స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాలనతో రాష్ట్రంలో ఏకైక నియోజకవర్గంగా ఉన్న మేడ్చల్ ప్రజాప్రతినిధుల పదవుల సంఖ్య తగ్గిపోవడంతో రాజకీయంగా వెలవెలబోతుంది. మేడ్చల్ నియోజకవర్గంలో గతంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులు, గ్రామాలకు సర్పంచ్లు, పట్టణాలకు కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు ఇలా అన్ని రకాల పాలన ఉండేది. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు మినహాయించి ఏడింటినీ, మూడు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో నాడు 900 మంది ప్రజా ప్రతినిధులు ఉన్న సంఖ్య నేడు కేవలం 84కు పడిపోయింది.మేడ్చల్లో 60 మంది గ్రామ సర్పంచ్లు, 37మంది ఎంపీటీసీ సభ్యులు, 202 మంది కౌన్సిలర్లు, ఐదు మంది ఎంపీపీలు, ఐదుగురు జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్, 7 మంది చైర్మన్లు, ముగ్గురు మేయర్లు, 600 మంది వరకు వార్డు సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం మేడ్చల్లో ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అలియాబాద్ (Aliabad) మున్సిపాలిటీలు మాత్రమే మిగిలాయి. ఎల్లంపేట్లో 24, మూడు చింతలపల్లిలో 24 వార్డులు, అలియాబాద్లో 20 వార్డులు ఉన్నాయి. ఈ లెక్కన 68 మంది కౌన్సిలర్లు ఉండనున్నారు. మొత్తంగా చూస్తే వార్డు సభ్యులు, కో– ఆప్షన్ సభ్యులతో కలిపి చూస్తే 900 వరకు ఉన్న సంఖ్య నేడు 100కు పరిమితమవుతోంది.భారీగా తగ్గిన ప్రాబల్యం.. జీహెచ్ఎంసీలో విలీనం కాకముందు 20 నుంచి 30 వరకు ఒక్కో మున్సిపాలిటీలో ప్రజా ప్రతినిధులు ఉండగా.. విలీనంతో ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కొక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉండనున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా.. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విలీనంతో రెండు డివిజన్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇద్దరు నేతలు మాత్రమే ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఏర్పడింది.గుండ్లపోచంపల్లిలో 15 వార్డులకు ఒక డివిజన్, నాగారంలో 18కి 1 , దమ్మాయిగూడలో 20కి 2 , ఘట్కేసర్లో 18 మందికి 2, పోచారంలో 18కి ఒక డివిజన్ మాత్రమే వచ్చాయి. తూంకుంటలో 16 స్థానంలో ఒక డివిజన్ వచ్చాయి. జవహర్నగర్లో 28 మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు, బోడుప్పల్లో కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు, పీర్జాదిగూడలో 26కు ఇద్దరు కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. 299 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లుండగా.. తాజాగా కేవలం 16 సీట్లు మాత్రమే ఉన్నాయి. నేతల ఆశలు ఆవిరి..సీట్లు ఎన్ని ఉన్నా.. గెలిచేది ఒకరే అయినప్పటికీ పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు అన్ని పార్టీల్లో ఉంటారు. కనీసం పోటీ చేసేందుకు స్థానాలు కూడా కరువయ్యాయి. ఒక్క పార్టీ నుంచి ఒక్కరు పోటీ చేసినా ఒక్క స్థానం ముగ్గురు పోటీ చేయడం పక్కా.. కొన్ని స్థానాల్లో 5 వరకు ఉంటాయి. ఏ లెక్కన చూసినా మేడ్చల్ రాజకీయ నాయకులకు కనీసం ఎన్నికల్లో పోటీ చేశామనే సంతృప్తి సైతం లేకుండా పోయింది. మూడు ఉంటాయా పోతాయా..?మేడ్చల్ నియోజకవర్గంలోని మెజారిటీ ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో విలీనం కావడంతో మిగిలిన 3 మున్సిపాలిటీలు ఉంటాయా.. పోతాయా.. అనే చర్చ మొదలైంది. తర్వాత లక్ష్యం ఆ మూడే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే మిగిలిన మూడింటితో వార్డుల విభజన పూర్తైంది. జీహెచ్ఎంసీ పాలకవర్గం సమయం ముగిసిన వెంటనే మిగిలిన ఎల్లంపేట్, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమవుతాయని నేతలు చెబుతున్నారు.ఆశలు.. నిరాశేజీహెచ్ఎంసీలో (GHMC) విలీనంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎప్పటికైనా ఓ ప్రజా ప్రతినిధి కావాలని సమయం, డబ్బు వృథా చేసుకుని రాజకీయం చేస్తున్న అన్ని పార్టీల నేతల ఆశలు అడియాశలయ్యాయి.చదవండి: ఐబొమ్మ రవి కేసులో కొత్త మలుపులుపాలన భారం..గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు ఉన్న సమయంలో 2 నుంచి 3 వేల మందికి ముగ్గురు ప్రజా ప్రతినిధులు, మండల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఉండే వారు. వారిపైన డీపీఓ, సీఈఓ, కలెక్టర్లు మండల అధికారులు ఎంతో పాలన వ్యవస్థ ఉండేది. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో 4 సర్కిళ్లను ఏర్పాటు చేసి వాటిలో 3–4 డివిజన్లు ఏర్పాటు చేయడంతో సర్కిల్కు 1 డిప్యూటీ కమిషనర్, డివిజన్కు 1 కార్పొరేటర్, జోన్కు 1 జోనల్ కమిషనర్, జోనల్ కమిషనర్పైన 1 మేయర్, కమిషనర్ మాత్రమే ఉండటంతో గతంతో పోలిస్తే ప్రజలకు పాలన మాత్రం దూరం కావడం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయికి ఎదుగుతున్న మేడ్చల్ను ఏకంగా నగరంలో విలీనం చేసి నగర పాలన చేస్తుంటే పాలనకు ప్రజలు ఆమడ దూరంలో కనిపిస్తున్నారు. -
రష్యా నియంత్రణలో 334 గ్రామాలు : పుతిన్ కీలక ప్రకటన
ఉక్రెయిన్తో కొనసాగుతున్నయుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా రష్యా ముందుకు సాగుతోందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.డోనెట్స్స్కీ, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో కలుపుకుంటామని పుతిన్ వెల్లడించారు. ఈ ప్రాంతాలన్నింటినీ దశలవారీగా స్వాధీనం చేసుకుంటున్నామని పుతిన్ పేర్కొన్నారు.తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్కీ ప్రాంతంలోని డిబ్రోవా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. డొనెట్స్క్లోని స్లోవియన్స్కీలో రష్యా జరిపిన షెల్లింగ్లో ఒకరు మరణించగా, మరో 5 మంది గాయపడ్డారు. జపోరిజియాలో కూడా రష్యా జరిపిన దాడిలో ఒకరు మరణించారు . ఈ ఏడాది ఉక్రెయిన్లో 6,460 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ వాలెరీ గెరాసిమోవ్ తెలిపారు. ఇందులో 334 గ్రామాలు కూడా ఉన్నాయన్నారు. ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు విఫలమైన కొద్దిసేపటికే పుతిన్ సైనిక యూనిఫాంలో కమాండర్ల సమావేశానికి హాజరయ్యారు. ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతిజెలెన్స్కీతో చర్చల తర్వాత, ట్రంప్ మాట్లాడుతూ శాంతి ఒప్పందం కుదిరిందని, అయితే ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు, డోనెట్స్కి, మరియు లుహాన్స్కీలను కలిగి ఉన్న డాన్బాస్ ప్రాంతాన్ని అప్పగించడం అనేవి పరిష్కారం కాని రెండు సమస్యలు అని జెలెన్స్కీ అన్నారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. దానికోసం కనీసం 60 రోజుల కాల్పుల విరమణ అవసరం. ప్రస్తుతం డాన్బాస్లో కొంత భాగం మాత్రమే ఉక్రెయిన్ చేతిలో ఉంది. ఉక్రెయిన్ దళాలు అక్కడి నుండి వెనక్కి తగ్గాలని లేదా మరిన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి మరోవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కానీ ఉక్రెయిన్ మాత్రం ఖండించింది.ఇదీ చదవండి : ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం -
శ్రీలంక క్రికెటర్ కన్నుమూత
శ్రీలంక మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో కన్నుమూశాడు. 2018 డిసెంబర్లో జరిగిన రైల్వే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఏడేళ్లు అపస్మారక స్థితిలో ఉండి ఇవాళ (డిసెంబర్ 30) ఉదయం తుదిశ్వాస విడిచాడు. కొలొంబోకు సమీపంలో గల మౌంట్ లవినియా బీచ్ వద్ద రక్షణలేని ట్రాక్ దాటుతుండగా ఆక్షుని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలో చాలా చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో లైఫ్ సపోర్ట్పై ఉంచారు. ప్రమాదం జరిగిన నాటికి అక్షు వయసు 27 ఏళ్లు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందు అక్షు ఓ స్థానిక టోర్నీ ఆడాడు. అందులో రగామా క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించాడు. అక్షు మరణం శ్రీలంక క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బంగారు భవిష్యత్తు కలిగిన అక్షు దురదృష్టకర రీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్నే బాధిస్తుంది.అక్షు న్యూజిలాండ్లో జరిగిన 2010 అండర్-19 వరల్డ్కప్లో శ్రీలంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలో కెనడాతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో కీలక పరుగులు చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికాపై క్వార్టర్ ఫైనల్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో 52 పరుగులు (88 బంతుల్లో) చేశాడు. ఆ టోర్నీలో అక్షు వ్యక్తిగతంగా రాణించినా, శ్రీలంక నాలుగో స్థానంలో ముగించింది. -
డ్రైవర్ రాయుడు హత్య కేసు వేగవంతం.. ఎమ్మెల్యే బొజ్జలను విచారించే అవకాశం!
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోటా వినుత (Vinutha Kota) డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డికి నోటీసులిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే బొజ్జల అనుచరుడు సుజిత్ను పోలీసులు విచారించగా, బొజ్జలను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్య బొజ్జల సుధీర్రెడ్డి స్కెచ్ వేసినట్లు కోట వినుత డ్రైవర్ రాయుడు హత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ద్వారా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బొజ్జలను విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ వీడియోలో ఏం చెప్పాడంటే..ఆ వీడియోలో బొజ్జల సుధీర్రెడ్డి.. కోట వినూత దంపతులను హత్య చేసేందుకు రెండు సార్లు ఏ విధంగా కుట్ర చేశారు. ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కోట వినూత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం, కోట వినుత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు. ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల సుధీర్రెడ్డి తనని బెదిరించి, భయపెట్టినట్లు హత్య కావడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటపెట్టాడు రాయుడు. జులై 10వ తేదీన కూవం నది కాలువులో తేలిన డ్రైవర్ రాయుడు శవంజులై 10వ తేదీ చెన్నై కూవం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నివేదికలో హత్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినుత, జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో.. లోతుగా దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం డ్రైవర్ రాయుడిదని నిర్ధారించారు. ఆ దిశగా పోలీసులు చేపట్టిన విచారణలో అప్పటి శ్రీకాళహస్తి(తిరుపతి) జనసేన ఇన్చార్జ్ వినుత దంపతులు జులై 8వ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు తేల్చారు. అనంతరం కోట వినుత దంపతులతో పాటు మరో ముగ్గురు వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు.జనసేన తరఫున చాలా యాక్టీవ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినుత దంపతులు హత్య కేసులో అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. అయితే.. అరెస్ట్ తర్వాత మీడియా ముందు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినుత అనడం, ఆ తర్వాత కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి పేరు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో అలజడి రేపింది. -
ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలు వచ్చిన తర్వాత మూవీ లవర్స్ కూడా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. ఇలా థ్రిల్లర్, హారర్ జానర్ చిత్రాలకు ఎక్కువగా ఆదరణ ఉంటోంది. ఇప్పుడు అలా ఓ తమిళ హిట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. డబ్బుల దోపిడీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ప్రేమలో మోసపోయే అమ్మాయి కథ.. ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా)తమిళ యువ హీరో కవిన్ లేటెస్ట్ మూవీ 'మాస్క్'. రుహానీ శర్మ హీరోయిన్ కాగా ఆండ్రియా విలన్గా చేసింది. సహ నిర్మాతగానూ వ్యవహరించింది. నవంబరు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించింది. మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ5లో జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి తమిళ వెర్షన్ గురించి మాత్రమే క్లారిటీ ఇచ్చారు. త్వరలో తెలుగులోనూ తీసుకొస్తారేమో చూడాలి?'మాస్క్' విషయానికొస్తే.. వేలు (కవిన్) అనే డిటెక్టివ్కి భూమి(ఆండ్రియా) అనే లేడీ బ్రోకర్ దగ్గర నుంచి రూ.440 కోట్లు దొంగిలించిన సొమ్ము రికవరీ చేయమని ఓ డీల్ వస్తుంది. అసలు ఇంత డబ్బు భూమి దగ్గరకు ఎలా వచ్చింది? రాజకీయ నాయకుడు మణివన్నన్కి, రాబోయే ఎన్నికలకు, రూ.440 కోట్లకు ఏంటి సంబంధమనేదే ఈ సినిమా స్టోరీ. కవిన్ హీరోగా అదరగొట్టేయగా, ఆండ్రియా కూడా బాగానే చేసింది. డబ్బుల దోపిడీ తరహా థ్రిల్లర్ మూవీస్ ఇష్టముంటే ఇది ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: చిరు-వెంకటేశ్.. మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్)2025 Massive Heist Thriller #Mask Premieres On Jan 9th On ZEE5💰@Kavin_m_0431 @andrea_jeremiah @tsmgo_official @Vikyashok16 @gvprakash @BlackMadras1 @iRuhaniSharma @thilak_ramesh @KalloriVino #Charle #ArchanaChandhoke @RDRajasekar #RamarEditor @jacki_art @cine_santhosh… pic.twitter.com/qR5YgE7F0z— ZEE5 Tamil (@ZEE5Tamil) December 30, 2025 -
2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలు
2026 జనవరిలో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో కియా, మారుతి సుజుకి, మహీంద్రా, రెనాల్ట్, స్కోడా కంపెనీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కియా సెల్టోస్సెకండ్ జనరేషన్ సెల్టోస్ కారును.. కియా కంపెనీ జనవరి 2న లాంచ్ చేయనుంది. అంటే.. ఇప్పటికే ఆవిష్కరించబడిన ఈ కారు ధరలను ఆరోజు అధికారికంగా వెల్లడిస్తారన్నమాట. ఈ కారు 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభించనుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.మారుతి సుజుకి ఈ విటారామారుతి సుజుకి ఈ విటారాతో.. మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇది 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్స్ పొందే అవకాశం ఉంది. రేంజ్ విషయం లాంచ్ తరువాత తెలుస్తుంది. కానీ ఇది 428 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ EV, మహీంద్రా BE 6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధరలు లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి.మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ జనవరి 5న లాంచ్ అవుతుంది. ఇది XUV700కు రీబ్రాండెడ్ వెర్షన్. ఇది రిఫ్రెష్డ్ స్టైలింగ్ & ఇంటీరియర్ అప్డేట్లతో ప్రీమియం లుక్ పొందుతుంది. అయితే యాంత్రికంగా, పెద్దగా మార్పులు ఏమీ ఉండవని సమాచారం. మూడు వరుసల SUV కోసం చూస్తున్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేయనుంది.ఇదీ చదవండి: కేంద్రమంత్రి చెంతకు.. మేడ్ ఇన్ ఇండియా కారురెనాల్ట్ డస్టర్న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్.. జనవరిలో లాంచ్ అయ్యే కార్ల జాబితాలో ఒకటి. CMF-B ప్లాట్ఫామ్ ఆధారంగా, కొత్త డిజైన్ పొందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ వీడియోలను కూడా కంపెనీ వెల్లడించింది. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుందని సమాచారం.స్కోడా కుషాక్ ఫేస్లిఫ్ట్అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా కుషాక్.. జనవరి ప్రారంభంలో ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మెకానికల్ మార్పుల కంటే కాస్మెటిక్ ట్వీక్లు, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. -
భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్ వీడియో
కర్నాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో వింత సంఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే ఒక మహిళ మాజీ భర్తను కొడుతున్న వీడియో వైరల్గా మారింది. అయితే ఆమె పదే పదే కొడుతున్నా జుట్టు పట్టిలాగినా, దుర్భాషలాడినా ఎగిరి తన్నినా, నవ్వుతూనే ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. అసలేం జరిగిందంటే.ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆమె భర్తకు ఉద్యోగం లేదు. ఏమైందో ఏమో తెలియదు కానీ విడాకుల కోసం ఇద్దరూ కోర్టుకెక్కారు. విడాకులు మంజూరయ్యాయి. భరణం కోసం కూడా కేసు వేసింది. ఇక్కడే భర్త కపట తెలివితేటల్ని ప్రదర్శించాడు. అయితే విడాకులు మంజూరు అయితే భరణం చెల్లించాల్సి వస్తుందన్న కుట్రతో తన పేరిట ఉన్న ఆస్తులన్నింటిని తన తల్లి పేరు మీదు ముందుగానే బదలాయించేశాడు. ముందు అనుకున్న ప్లాన్ప్రకారమే తనకు ఎలాంటి ఆస్తులు, ఆదాయం లేదు కాబట్టి, భరణం ఇవ్వలేనని వాదించాడు. అతడి వాదనలను విశ్వసించిన కోర్టు భార్యకు షాకిచ్చింది. తనకు భరణం రాకుండా చేశాడనే ఆగ్రహంతో భార్య చేశాడని, కోర్టు బయటే భర్తను కొట్టింది. చెంపలు వాయించేసింది. జుట్టు పట్టుకొని కొట్టింది. దుర్భాషలాండింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే తాను అనుకున్నది సాధించిన అతగాడు మాత్రం ఏదో గొప్ప విజయం సాధించిన వాడిలాగా నవ్వుతూ ఉండటం ఈ వీడియోలో రికార్డైంది.ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యంఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. భర్తనుంచి విడి పోయిన మహిళల దీన పరిస్థితికి ఇది నిదర్శమని నెటిజన్లు కొందరు వ్యాఖ్యానించారు. ఇది అన్యాయం అని మరికొందరు భర్తపై మండిపడ్డారు. మరోవైపు మహిళలకు భరణంపై ఉండే ప్రేమకు ఇది నిదర్శమన కొందరు, దాడి చేసిన దోషిని శిక్షించాలని ఒకరు, ప్లాన్ ఏ ఎదురు దెబ్బ తగిలితే, ప్లాన్ బీ ఏమీ లేనప్పుడు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణంShe took a divorce chasing alimony.The husband had already transferred all his property to his mother’s name — the wife got nothing. 😁After the divorce, the guy is smiling even while getting beaten.On behalf of all men — salute to you! 😂😜pic.twitter.com/YEGociB8Hr— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 29, 2025 -
శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్.. స్టార్ ప్లేయర్కు రెస్ట్
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకొని, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 30) నామమాత్రపు ఐదో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున స్టార్ ప్లేయర్ స్మృతి మంధన, రేణుక సింగ్కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహ్ రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్తోనే కమిలిని అరంగేట్రం చేస్తుంది.శ్రీలంక విషయానికొస్తే.. మల్షా శేషని, కావ్యా కవిండి స్థానాల్లో ఇనోకా రణవీరా, మల్కి మదారా తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), ఇనోకా రణవీరా, మల్కి మదారా, రష్మిక సెవ్వంది, నిమేషా మదుషానిభారత్: షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, కమిలిని, శ్రీ చరణి -
బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ల నియామకం చేపట్టింది. శాసనసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లుగా హరీష్రావు,. సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లన నియమించగా, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రమణ, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిలను బీఆర్ఎస్ నియమించింది. ఇక మండలిలో బీఆర్ఎస్ విప్గా దేశపతి శ్రీనివాస్ను నియమించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం మేరకే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే..? సుస్మితా, రాణి ముఖర్జీలు సైతం..
భారత ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP)ని ప్రారంభించింది. ఈ విధానంతో విమానం మిస్సవుతుందనే భయం లేకుండా నిశ్చింతగా విదేశాలు చుట్టొచ్చేయొచ్చు. అంతేగాదు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడకుండా ఈజీగా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇది ప్రముఖుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది కూడా. అందుకు నిదర్శనం బాలీవుడ్ తారలు సుస్మితా సేన్, రాణి ముఖర్జీలు ఈ చొరవకు సైన్అప్ చేయడమే. ఆ విషయాన్ని స్వయంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ ప్రక్రియలో తమ పేర్లను నమోదు చేసుకున్న వీడియోలను షేర్ చేసింది కూడా. ఒక వీడియో క్లిప్లో రాణి ముఖర్జీ తన బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తుంది. దానికి క్యాప్షన్గా "మర్దానీ శివానీ శివాజీ రాయ్ ఫాస్ట్ట్రాక్ ఇమ్మిగ్రేషన్లో నమోదు చేసుకున్నప్పుడూ దేశం కూడా అనుసరిస్తుంది" అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఇక మరో వీడియో క్లిప్లో సుస్మితా సేన్ బయోమెట్రిక్లో వేలిముద్ర వేస్తున్నట్లుగా షేర్ చేస్తూ.."సుష్మితా సేన్ క్యూను స్కిప్ చేయాలనుకుంటోంది.. మరి మీరు" అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. వీళ్లంతా ఎందుకు ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ కోసం నమోదు చేసుకుంటున్నారు? దీనికి ఎవరు అర్హులు? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!FTI-TTP అంటే ఏమిటి?ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్స్ ప్రోగ్రామ్ (FTI-TTP) అంతర్జాతీయ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సులభతరం చేయడమే దీని ప్రధానోద్దేశ్యం. క్యూలైన్లలో పడిగాపులు పడకుండా తక్కువ సమయంలో ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రకియను పూర్తి చేసేలా ఈ ప్రక్రియ అనుమతిస్తుంది. ఇది 2024లో ప్రారంభమైంది. జస్ట్ 30 సెకన్లలోపు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్కు అనుమతిస్తుంది. విమానాశ్రయంలో నిరీక్షించాల్సిన పని ఉండదు, అలగే తరచుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. View this post on Instagram A post shared by Bureau of Immigration, India (@bureauofimmigrationindia) ఎలా అంటే..FTI-TTP కింద నమోదు చేసుకున్న ప్రయాణీకులు సాధారణ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద లైన్లో నుంచోవాల్సిన పని ఉండదు. సంబంధిత విమానాశ్రయాల్లో వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల వద్దకు వెళ్లాలి. మొదటి గేట్ వద్ద పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్కు అనుమతి లభిస్తుంది.రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది View this post on Instagram A post shared by Bureau of Immigration, India (@bureauofimmigrationindia) ఎవరు అర్హులు?భారతీయ పౌరులుభారతదేశ విదేశీ పౌరసత్వం (OCI) కార్డులు కలిగి ఉన్న విదేశీ పౌరులుపాస్పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి.ఒక్కసారి రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి అయితే ఐదేళ్లు లేదా పాస్పోర్ట్ గడువు ముగిసే వరకు ఇది చెల్లుబాటవ్వుతుంది. అలాగే ఇది ప్రయాణికులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తుంది.ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..దరఖాస్తు ప్రక్రియ ఎక్కువగా ఆన్లైన్లో ఉంటుంది. అనుసరించడం సులభం.ఆన్లైన్ దరఖాస్తు: ftittp.mha.gov.in వెబ్సైట్ని సందర్శించి ఇటీవలి పాస్పోర్ట్-సైజ్ ఫోటో, స్కాన్ చేసిన పాస్పోర్ట్ పేజీలు, నిర్థారిత అడ్రస్, OCI కార్డ్ (వర్తిస్తే) అప్లోడ్ చేయాలి.ఆ తర్వాత అధికారులు సమర్పించిన వివరాలను ధృవీకరిస్తారు. క్లియర్ అయిన తర్వాత దరఖాస్తుదారులకు ఇమెయిల్ లేదా SMS ద్వారా సమాచారం అందిస్తారు.బయోమెట్రిక్ అపాయింట్మెంట్: FRRO కార్యాలయంలో లేదా నియమించబడిన అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.అపాయింట్మెంట్ సమయంలోనే వేలిముద్రలు, ముఖ డేటాని నమోదు చేసుకోవాలి. అయితే తుది ఆమోదం ఒక నెల వరకు పట్టవచ్చు.ఎందుకు తిరస్కరింపబడతాయంటే..తప్పుగా లేదా తప్పుడు సమాచారంముఖ్యమైన వివరాలను దాచడంఅస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉన్న పత్రాలు లేదా ఫోటోలుతప్పుగా లేదా తప్పుడు అడ్రస్ చివరగా దరఖాస్తుదారులు దరఖాస్తును సమర్పించిన తర్వాత ఈమెయిల్ లేదా SMS ద్వారా రసీదును అందుకుంటారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించబడితే, సమస్యలను సరిదిద్దిన తర్వాత వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.(చదవండి: -
న్యూ ఇయర్కి ముందు టీమిండియాకు ఊహించని షాక్..!
మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా.. భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్లో ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్.. న్యూజిలాండ్ వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే శ్రేయస్ కూడా ఫిట్నెస్ సాధించి, ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 30) శ్రేయస్కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్నెస్ క్లియెరెన్స్ లభించాల్సి ఉండింది. అయితే శ్రేయస్ అనూహ్యంగా 6 కిలోలు బరువు తగ్గినట్లు CoE వైద్య బృందం గుర్తించింది. దీని వల్ల శ్రేయస్కు బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి సమస్య లేకపోయినా, మసిల్ మాస్ బాగా క్షీణించి, శక్తి స్థాయిలు తగ్గాయని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్కు రిటర్న్ టు ప్లే (RTP) సర్టిఫికేట్ ఇవ్వలేమని పరోక్షంగా చెప్పారు. దీంతో శ్రేయస్ రీఎంట్రీ మరో వారం వాయిదా పడనుంది.ఒకవేళ శ్రేయస్కు ఇవాళ RTP సర్టిఫికేట్ లభించి ఉంటే జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడేవాడు. తాజా పరిస్థితి ప్రకారం.. శ్రేయస్ న్యూజిలాండ్ సిరీస్కు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. జట్టును 2 లేదా 3 తేదీల్లోగా ప్రకటించే అవకాశం ఉంది.ఆ సమయానికి శ్రేయస్కు ఫిట్నెస్ క్లియరెన్స్ లభించడం అసాధ్యంగా కనిపిస్తుంది. వన్డే జట్టులో కీలకమైన శ్రేయస్ విషయంలో CoE అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకునే సాహసం చేయలేరు. ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ను మిస్ అయితే, విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. -
బ్యాంక్లకు ఆర్థిక శాఖ ఆదేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు హోల్టైమ్ డైరెక్టర్లకు (డబ్ల్యూటీడీ) సంబంధించి విజిలెన్స్ వ్యవహరాలను వెంటనే నివేదించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. బోర్డు స్థాయిలో నియామకాలకు సంబంధించి ప్రతికూల సమాచారాన్ని సకాలంలో నివేదించని పలు సంఘటనల నేపథ్యంలో ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్ఎస్) ఈ ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వరంగ సంస్థల చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ల నుంచి విజిలెన్స్ క్లియరెన్స్ కోరినప్పుడే.. ప్రైవేటు ఫిర్యాదులు, కోర్టుల పరిశీలనలు, సీబీఐ లేదా ఇతర చట్టపరమైన దర్యాప్తు సంస్థల సూచనలు వెలుగు చూస్తున్నట్టు పేర్కొంది. ఇందులో హోల్టైమ్ డైరెక్టర్లకు సంబంధించి కీలక సమాచారాన్ని విజిలెన్స్ క్లియరెన్స్ ఫార్మాట్ల నుంచి తొలగించడాన్ని ప్రస్తావించింది. దీంతో బోర్డు స్థాయిలో అధికారులకు సంబంధించి ప్రతికూల సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలంటూ ప్రభుత్వరంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలను ఆర్థిక శాఖ ఆదేశించింది. -
కారిడార్ పనులు వేగంగా పూర్తి చేయాలి: ఆర్వీ కర్ణన్
సాక్షి హైదరాబాద్: నల్గొండ ఎక్స్ రోడ్–ఓవైసీ జంక్షన్ కారిడార్ను వచ్చేఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా ప్రారంభించేలా పనులు త్వరతగతిన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. నల్గొండ ఎక్స్ రోడ్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ కారిడార్ పనుల పురోగతిని మంగళవారం ఆర్వీ కర్ణన్ అధికారులతో కలిసి పరిశీలించారు.దక్షిణ హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించేందుకు ఈ కారిడార్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,530 మీటర్ల పొడవు గల ప్రధాన ఫ్లైఓవర్ను రూ.620 కోట్ల అంచనా వ్యయంతో EPC (Engineering, Procurement, Construction) విధానంలో నిర్మిస్తున్నారు. దీని పనుసు ఇప్పటివరకు సుమారు 80 శాతం పూర్తయ్యాయని ఈ సందర్భంగా కమిషనర్కు వివరించారు. వీటి వివరాలు తెలుసుకున్న కమిషనర్ కర్ణన్ మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని తెలిపారు.సైదాబాద్ నుంచి దోబీఘాట్ జంక్షన్ వరకు ఉన్న కీలక ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్కు అవసరమైన అనుమతులు తీసుకుని పనులు వేగంగా కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా కారిడార్ ప్రారంభించిన అనంతరం ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ బి. గోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రోజుకు 25 గంటలు..ఎందుకో తెలుసా?
రోజుకు ఎన్ని గంటలు అనగానే ఠక్కున వచ్చే సమాధానం 24 గంటలు. అయితే ఈ రోజుకు 24 గంటల రోజు నెమ్మదిగా మారుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మార్పు నిజం. కచ్చితంగా.. ఇప్పటికే జరుగుతోంది. ఈ మార్పు చాలా క్రమంగా జరుగుతుందని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. భూమి భ్రమణం నెమ్మదిగా నెమ్మదిస్తోందని శాస్త్రవేత్తల మాట. అంటే రోజు ఎక్కువుతోంది. కాలం, జీవితం , గ్రహం నిశ్శబ్దంగా ఎలా పరిణామం చెందుతాయనే దానిపై ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఆగండి ఆగండి..అయితే ఇప్పటికిప్పుడు దైనందిన జీవితానికి తక్షణ అంతరాయం లేదంటున్నారు. ఈ మార్పుకు మిలియన్ల సంవత్సరాలు పడుతుంది, అసలు ఏం జరుగుతోంది. దేని ఆధారంగా సైంటిస్టులు ఈ విషయాన్ని అంచనా వేస్తున్నారు.భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు సమయం పడుతుంది. సాధారణంగా భూమి తన అక్షంపై తిరిగే వేగాన్ని ఆధారంగా చేసుకుని ఒక రోజు ఎంత సమయం అనేది నిర్ణయిస్తారు. ఇపుడు ఈ వేగం క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా రోజులకు 24 గంటలకు బదులు 25 గంటలు పడుతుందంటున్నారు. ఇది ఆ రోజు రావడానికి ఇంకా చాలా సమయం ఉందని చెబుతున్నారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందట.భూమి భ్రమణం నెమ్మదిస్తోందిభూమి భ్రమణం క్రమంగా వేగాన్ని తగ్గిస్తోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ మందగమనంతో మానవులపై చాలా నెమ్మదిగా ఉంటుందనీ, ప్రస్తుత గడియారాలు , క్యాలెండర్లు పూర్తిగా ప్రభావితం కావు. ఈ ధోరణి వందల మిలియన్ల వరకు విస్తరించి ఉందని పరిశోధకులు అంటున్నారు.ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగితే, భవిష్యత్తులో ఒక రోజు వ్యవధి 25 గంటలకు చేరుకునే అవకాశం ఉందని జర్మనీలోని మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీతో పాటు అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్శిటీ పరిశోధకులువెల్లడించారు. ఈ మార్పుకు ప్రధాన కారణం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు ప్రతి ఏడాది సుమారు 3.8 సెంటీమీటర్ల మేర భూమి నుంచి క్రమంగా దూరమవుతున్నాడు భూ భ్రమణం దాదాపు 1.7 మిల్లీసెకన్ల పాటు ఉంటుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈ మార్పు దాదాపు ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చంద్రుడి వల్ల కలిగే టైడల్ ఘర్షణ. చంద్రుని గురుత్వాకర్షణ భూమి, మహాసముద్రాలను నిరంతరం ఆకర్షిస్తుంది. దీంతో చంద్రుడిని దూరంగా నెట్టివేస్తూ భూమి నెమ్మదిస్తుంది. కాలక్రమేణా, ఈ శక్తులు కొలవగల ప్రభావాలను కూడగట్టుకుంటాయి. అణు గడియారాలను ఉపయోగించి ఈ మార్పులను శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తారు. భూమి భ్రమణ స్థిరమైన వేగంతో నెమ్మదించదు. స్వల్పకాలిక మార్పులు భ్రమణాన్ని కొద్దిగా వేగవంతం చేస్తాయి లేదా నెమ్మదిస్తాయి. వాతావరణ పీడన మార్పులు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యరాశి పంపిణీని ప్రభావితం చేస్తాయి. కరిగే హిమానీనదాలు భూమి, మహాసముద్రాల మధ్య బరువును కదిలిస్తాయి. ఈ పునఃపంపిణీలు తాత్కాలికంగా భ్రమణ వేగాన్ని సూక్ష్మంగా ప్రభావితం చేస్తాయి.శాస్త్రవేత్తలు 25 గంటల రోజు సుదూరమని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులను దాదాపు 200 మిలియన్ (20 కోట్ల )సంవత్సరాలు పట్టవచ్చు. అంతేకాదు సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్న సమయంలో భూ భ్రమణ వేగంఎక్కువగా ఉండేదని, అప్పట్లో ఒక రోజు పూర్తవడానికి కేవలం 18 గంటలే పట్టేదట. డైనోసార్ కాలంలో, రోజులు దాదాపు 23 గంటలు ఉండేవి. భూమిపై జీవితం క్రమంగా ఆ మార్పులకు అనుగుణంగా మారింది. పరిణామం తరతరాలుగా జీవ లయలను నెమ్మదిగా సర్దుబాటు చేసుకుంటుంది.ప్రస్తుతానికి, భూమి మునుపటిలాగే తిరుగుతోంది. అయితే నెమ్మదించే భ్రమణం శాస్త్రీయంగా మనోహరంగా ఉంది. ఈ పరివర్తన నెమ్మదిగా ఉంటుంది, విపత్తు కాదు,ఎలాంటి ఆందోళన అవసరం శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు.త ప్పుదారి పట్టించే వైరల్ వాదనలకు వ్యతిరేకంగా నిపుణులు జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. సహస్రాబ్దాలలో కొలిచిన మార్పును శాస్త్రం సూచిస్తుంది. -
శబరిమల బంగారం మాయం కేసు: మాజీ మంత్రి పాత్రపై విచారణ
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆరేళ్ల క్రితం వెలుగుచూసిన బంగారం అపహరణ కేసులో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించింది. ఈ కేసులో దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు పలువురు అరెస్ట్ కాగా, తాజాగా ఇది దేవస్థానం శాఖ మంత్రిగా పని చేసిన కడకంపల్లి సురేంద్రన్ వద్దకు చేరింది. గత శనివారం కడకంపల్లి సురేంద్రన్ను సిట్ బృందం విచారించింది. శబరిమల ఆలయానికి సంబంధించి తలుపులకు పూసి ఉన్న బంగారం మాయం కావడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. ఈ కేసులో ఆయన నేరుగా పాలు పంచుకున్నారనేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా, సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సిట విచారణ చేపట్టింది. అయితే దేవస్థానం(దేవస్వం శాఖ) పాలసీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుందని, బంగారం పూత తొలగించడం, చెన్నైలోని ప్రైవేట సంస్థకు పంపడం వంటి నిర్ణయాలు టీడీబీ(ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు) స్వతంత్రంగా తీసుకుంటుందన్నారు. కేసు వివరాలుశబరిమల ఆలయంలోని విగ్రహాలు, తలుపులపై ఉన్న బంగారు పూతలో కొంత భాగం కనిపించకుండా పోయింది.మాజీ దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్, మాజీ టీడీబీ అధ్యక్షులు ప్రశాంత్, పద్మకుమార్ తదితరులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు SIT 10 మందిని అరెస్టు చేసింది, వీరిలో ఇద్దరు మాజీ టీడీబీ అధ్యక్షులు కూడా ఉన్నారు.ఈ కేసును విచారించేందుకు సిట్కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కొత్త సాక్ష్యాలు, సంబంధాలు వెలుగులోకి వస్తే మరిన్ని అరెస్టులు జరగవచ్చు.బంగారం కనిపించకుండా పోయిన ఈ ఘటన 2019లో జరిగింది. -
మృణాల్ క్యూట్ ఫేస్.. 'ధురంధర్' బ్యూటీ లావిస్ లుక్
'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ లావిస్ లుక్క్యూట్ ఫేస్ పెట్టి మాయ చేస్తున్న మృణాల్ ఠాకుర్రోమ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మికలంగా ఓణీలో మెరిసిపోతున్న హీరోయిన్ ఈషారెబ్బామంచులో తిరిగేస్తున్న 'ఫౌజీ' బ్యూటీ ఇమాన్విబ్లాక్ డ్రస్లో ఎగిరిపోతున్న పూజా హెగ్డే View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) -
ఆ ప్రాంతాల్లో గాలిపటం ఎగరేయొద్దు..!
సంక్రాంతి పండుగ సీజన్ సంధర్భంగా ప్రజలకు దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. రైల్వే విద్యుత్ తీగలపై చిక్కి వేలాడుతున్న గాలిపటం దారాలను ఎట్టిపరిస్థితుల్లో తాకకూడదని ప్రజలను హెచ్చరించింది. రైల్వే ప్రాంగణాల పరిసరాల్లో, యార్డులు, ట్రాక్లు మరియు సమీపంలోని జనసంచార ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేయడం వల్ల విద్యుదాఘాతానికి గురైన సంఘటనలు ఇదివరకూ అనేకం జరిగాయని తెలిపింది. పతంగీలు ఎగరవేయడంపై జాగ్రత్తలను సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది.గత సంక్రాంతి పండుగ సీజన్లో విద్యుధాఘాత ఘటనలు రైల్వేలోని అనేక జోన్లలో నమోదయ్యాయని తెలిపింది. కొంతమంది వ్యక్తులు 25 కె.వి ట్రాక్షన్ ఓవర్హెడ్ కండక్టర్లలో చిక్కుకున్న గాలిపటం దారాలను ముట్టుకోవడం ద్వారా విద్యుత్ షాక్లు తగిలి తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొంది. ప్రస్తుతం గాలి పఠాలు ఎగరవేయడంలో ప్రజలంతా ప్రధానంగా చైనా మాంజా వాడుతున్నారని అది చాలా ప్రమాదకరమని తెలిపింది. ఆదారాలు విద్యుత్ వాహకం ( విద్యుత్ను సులభంగా గ్రహించేవి) అవడం వలన మానవ ప్రాణాలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయని రైల్వేశాఖ తెలిపింది. అంతే కాకుండా రైల్వే విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర ముప్పును కలిగిస్తాయని పేర్కొంది.దీనివలన ప్రయాణీకులతో పాటు రైల్వే సిబ్బందికి, సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఇతర ప్రమాదాలకు దారి తీసే అవకాశాలున్నాయని తెలిపింది. కనుక ఈ విషయంలో ప్రజలు రైల్వేశాఖకు పూర్తి సహకారం అందించాలని రైల్వే ట్రాక్లు, స్టేషన్లు, యార్డులు మరియు ఇతర రైల్వే సంస్థాపనల దగ్గర గాలిపటాలు ఎగురవేయకూడదని రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ పండుగలను సంతోషంగా బాధ్యతాయుతంగా జరుపుకోవాలని రైలు కార్యకలాపాలను సజావుగా కొనసాగించడంలో సహాయపడాలని కోరింది. -
యెమెన్లోని ముకల్లాపై సౌదీ వైమానిక దాడులు
సనా: యెమెన్లోని ఓడరేవు నగరం ముకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు జరిపింది. మంగళవారం జరిపిన ఈ దాడులపై గల్ఫ్ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి వ్యతిరేకంగా వేర్పాటువాద సమూహానికి ఆయుధాలు, సైనిక వాహనాలను అందజేస్తున్నారనే ఆరోపణలపై ఈ దాడులు జరిపినట్లు సౌదీ అరేబియా అధికారిక వార్తాసంస్థ స్పష్టం చేసింది. వేర్పాటు వాదుల చేతికి ఆయుధాలు చిక్కడం ఈ ప్రాంతంలో శాంతికి ముప్పుగా పేర్కొంది. అందుకే వైమానిక దళం నిర్ణీత లక్ష్యాలపై దాడులు జరిపిందని, పౌరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుందని వెల్లడించింది.ఈ దాడులపై అటు యెమెన్ సీరియస్గా స్పందించింది. యూఏఈతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసింది. తమ సార్వభౌమాధికారం, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యెమెన్ కౌన్సిల్ అధిపతి రషాద్ అల్-అలీమి ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి టీవీలో మాట్లాడారు. యెమెన్లో ఉన్న యూఏఈ దళాలు(అల్-అలీమీ) తమ భూభాగాన్ని 24 గంటల్లో విడిచి వెళ్లాలని ఆదేశించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మూడ్రోజులపాటు నోఫ్లై జోన్గా ప్రకటించారు. 90 రోజుల అత్యయిక స్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నిజాన్ని మీరే బయటపెట్టాలి: రోహిత్, కోహ్లికి మాజీ క్రికెటర్ విజ్ఞప్తి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో తొలుత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వీరిద్దరు పరుగులు రాబట్టలేక ఇబ్బందిపడ్డారు.రోహిత్ మధ్యలో విరామం తీసుకుంటూ మ్యాచ్లు ఆడగా.. కోహ్లి పదే పదే ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో దాదాపుగా ఎనిమిది సార్లు వికెట్లు పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రో- కో ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రోహిత్ టెస్టులకు స్వస్తి పలికితే బాగుంటుందనే డిమాండ్లు పెరగగా.. మేటి టెస్టు బ్యాటర్ అయిన కోహ్లి తప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అనూహ్య రీతిలోఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా తొలుత ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియాలో రో- కో ఆడతారని ముందుగా సంకేతాలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో వీరిద్దరు టెస్టులకు గుడ్బై చెప్పేశారు. రోహిత్ శర్మ స్థానంలో టెస్టు పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్.. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన కోహ్లి నాలుగో స్థానాన్నీ భర్తీ చేశాడు.ఒత్తిడి చేశారుఅయితే, రోహిత్- కోహ్లి ఆకస్మిక రిటైర్మెంట్లపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇదైతే సహజమైన రిటైర్మెంట్లా అనిపించలేదు. ఈ విషయంలో వాళ్లు మాత్రమే నిజమేంటో చెప్పగలరు. నాకైతే ఇదేదో బలవంతంగా చేయించినట్లు అనిపిస్తోంది.నిజాన్ని మీరే బయటపెట్టాలిరోహిత్ శర్మ ఆరు నెలల పాటు విరామం తీసుకుని.. ఫిట్నెస్ సాధించి తిరిగి వస్తే బాగుండేది. అదే జరిగితే తిరిగి అతడు ఫామ్ను అందుకునేవాడు. అతడిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది. రోహిత్తో పాటు కోహ్లి కూడా కొన్నాళ్ల విరామం తర్వాత తిరిగి వస్తే బాగుండేది. ఏదేమైనా టెస్టు రిటైర్మెంట్ విషయమై వాళ్లు నోరు విప్పితేనే నిజం తెలుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.ఇద్దరూ సిద్ధంఅదే విధంగా.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుత ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సౌతాఫ్రికాతో వన్డేల్లో ఇద్దరూ అదరగొట్టారు. రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధిస్తే.. కోహ్లి వరుసగా రెండు శతకాలు బాదాడు. ఇద్దరూ ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నారు.ఇటీవలే రోహిత్ను కలిశాను. అతడు ప్రస్తుతం రిలాక్సింగ్ మోడ్లో ఉన్నాడు. ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాడు. రోహిత్- విరాట్ పరుగుల దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికే ఇద్దరూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. అయినా సరే ఇంకా ఇంకా ఆడాలనే పట్టుదల వారిని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి..రోమ్ టూర్లో రష్మిక ఫ్యాషన్ వైబ్..!
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ వారు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. తాజాగా ఇప్పుడు వారి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ జంట ఫిబ్రవరి 26, 2026న విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్. ఇదెంత వరకు వాస్తవం అన్నది తెలియదు కానీ రష్మిక, హీరో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఆమె స్నేహితులతో కలిసి రోమ్ టూర్లో ఉంది. ఆ యూరోపియన్ విహారయాత్రలో తన అభిమానులను ఫ్యాషన్ లుక్స్తో అలరిస్తోంది. లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్లో ఫ్యాషన్ ఐకానిక్గా..గోధుమ రంగు లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్లో వింటర్ ఫ్యాషన్ ఐకాన్గా మెరిసింది రష్మిక. ఆ కోట్ సరికొత్త ఫ్యాషన్ వైబ్స్ని సృష్టించింది. నిట్టెడ్ టాప్లో రష్మిక మందన్నరష్మిక మందన్న ధకించిన బూడిద రంగు అల్లిన టాప్లో సరికొత్తగా కనిపించింది. ముఖ్యంగా చేతిలో పువ్వుల గుత్తితో స్టన్నింగ్ లుక్తో ఆకట్టుకుంది. అందుకు తగ్గట్టు డార్క్ ఫ్రేమ్డ్ గ్లాసెస్, మెటల్ బ్యాండ్తో స్టైలిష్ రిస్ట్ వాచ్తో లుక్ను అలంకరించింది. బ్రౌన్ స్వెటర్లో వ్యాపారవేత్తలా..అల్లిన గోధుమ రంగు స్వెటర్, చంకీ బ్లాక్ గ్లాసెస్లో అదరహో అనిపించేలా ఉంది ఆమె ఆహార్యం.రష్మిక మందన్న రోమ్ వార్డ్రోబ్తో ఫ్యాషన్ ప్రియులను అలరించింది. నటి క్రీమ్ స్వెటర్, డెనిమ్ జీన్స్పై పొరలుగా ఉన్న మరొక నల్ల ట్రెంచ్ కోటును స్టైలిష్ ఐకాన్గా కనిపించింది. ఎక్కడ మేకప్ లేకుండా..చాలా సింపుల్గా సాదాసీదాగా నేచురల్ లుక్లో కనిపించి నేచరల్ స్టార్ అంటే సహజసిద్ధమైన అందం అని ఎలుగెత్తి చాటింది.(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..) -
మరో భారీ అప్పు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
విజయవాడ: చంద్రబాబు నాయడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంం మరో భారీ అప్పు తెచ్చింది. తాజాగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది చంద్రబాబు సర్కారు. మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పును తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ వేలం ద్వారా అప్పు సమీకరించింది. గడిచిన 18 నెలల్లో రూ. 2.77 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ఫలితంగా అప్పుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది చంద్రబాబు సర్కారు.చంద్రబాబు ప్రభుత్వం ఈనెల ఆరంభంలో బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,000 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చిందిఇలా బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది.కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారురూ. 2.77 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించట్లేదా అని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కానీ గత వైఎస్సార్సీపీ పాలనలో లేని అప్పులు కూడా ఉన్నట్లుగా ఎల్లో మీడియా ఇష్టారీతిన దుష్ప్రచారం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ బాబు అండ్ కో గగ్గోలు పెట్టిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు మెదపకపోవడం గమనార్హమని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్సీబీకి భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్
వచ్చే ఏడాది (2026) జనవరి 9 నుంచి ప్రారంభం కాబోయే మహిళల ఐపీఎల్ 2026కు ముందు 2024 ఎడిషన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికి దూరం కానుంది. పెర్రీ స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం దేశీయ ఆల్రౌండర్ సయాలీ సత్ఘరేతో భర్తీ చేసింది.సత్ఘరే గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. ఈ సీజన్ వేలంలో సత్ఘరేను (30 లక్షలు) ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. తాజాగా ఎల్లిస్ లీగ్ నుంచి తప్పుకోవడంతో సత్ఘరేను అదృష్టం వరించింది. ఎల్లిస్ వైదొలిగిన తర్వాత ఆర్సీబీలో నడినే డి క్లెర్క్ మాత్రమే నాణ్యమైన విదేశీ ఆల్రౌండర్గా ఉంది.ఎల్లిస్ ఆర్సీబీ 2024లో టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఎల్లిస్కు డబ్ల్యూపీఎల్ మొత్తంలోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్ ఎల్లిసే. ఈ లీగ్లో ఇప్పటివరకు 25 మ్యాచ్లు ఆడిన ఈ వెటరన్ ఆల్రౌండర్.. 8 హాఫ్ సెంచరీల సాయంతో 972 పరుగులు చేసి, 8.25 ఎకానమీతో 14 వికెట్లు తీసింది.ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా..!డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్, ఆసీస్ ప్లేయరే అయిన అన్నాబెల్ సదర్ల్యాండ్ కూడా వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికే దూరం కానుంది. సదర్ల్యాండ్ స్థానాన్ని డీసీ యాజమాన్యం అలానా కింగ్తో భర్తీ చేసింది. -
బంగ్లాదేశ్లో మరో మైనారిటీ హిందువు హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల హత్యలు తీవ్ర ఆందోళన పుట్టిస్తున్నాయి. ఇటీవల ఐదు హిందూ కుటుంబాల ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడం ఆలయాలపై దాడులు, ఇళ్ల ధ్వంసం, మతపరమైన వేధింపులు కలవరపెడుతోంది. తాజాగా బంగ్లాదేశ్లో మరో మైనారిటీ హిందువు హత్యకు గురయ్యాడు.మైమెన్సింగ్లోని భలుకాలో బజేంద్ర బిశ్వాస్ (40) అనే అన్సార్ (రక్షణ కమిటీ) సభ్యుడిని సహోద్యోగి కాల్చి చంపాడు.ఈ సంఘటనలో హంతకుడు అన్సార్ సభ్యుడు నోమన్ మియాను అరెస్టు చేశారు. మరోవైపు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆ సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 20 మంది అన్సార్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. బజేంద్ర బిస్వాస్ ,నోమన్ మియా ఆవరణలో కలిసి కూర్చున్నప్పుడు నోమన్ వద్ద ఉన్న తుపాకీ పేలిందనే కథనాలు వినిపిస్తున్నాయి. బుల్లెట్ బిస్వాస్ ఎడమ తొడలో దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఫ్యాక్టరీ సిబ్బంది బజేంద్ర బిస్వాస్ను భాలుకా ఉపజిల్లా హెల్త్ కాంప్లెక్స్కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. భాలుకా మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్చార్జ్ జాహిదుల్ ఇస్లాం ఈ సంఘటనను ధృవీకరించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మైమెన్సింగ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మార్చురీకి పంపారు.కాగా బంగ్లాదేశ్ ఒక తీవ్రవాద రాజ్యంగా మారుతోంది. ఈ హత్యాకాండపై సర్వత్రా ఆందోళన వ్యకమవుతోంది. బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న అభద్రతకు ఇది నిదర్శమంటూ ఆగ్రహం వెల్లువెత్తుతోంది.ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి -
మీకు మ్యాపల్స్ యాప్ గురించి తెలుసా?
లేటెస్ట్ టెక్నాలజీతో భారతీయ రోడ్లపై ప్రయాణాన్ని సులభతరం చేస్తున్న స్వదేశీ మ్యాపింగ్ దిగ్గజం మ్యాప్మైఇండియా తన 'మ్యాపల్స్'(Mappls) యాప్లో మార్పులు చేపట్టింది. నగర ప్రయాణాన్ని లక్ష్యంగా చేసుకుని మెట్రో, రైలు, బస్సు రూట్లను ఏకీకృతం చేస్తూ ‘మల్టీమోడల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్’ ఫీచర్ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.సమగ్ర మొబిలిటీ ప్లాట్ఫామ్గా..ప్రస్తుతం 40 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారులను కలిగి ఉన్న మ్యాప్ల్స్ యాప్.. ఇప్పుడు కేవలం ప్రైవేట్ వాహనాలకే పరిమితం కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సమాచారాన్ని కూడా ఒకే చోట అందిస్తుంది. వినియోగదారులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి అందుబాటులో ఉన్న మెట్రో రైళ్లు, లోకల్ ట్రైన్లు, బస్సు సర్వీసుల రూట్లు, స్టాపులు, ఇంటర్చేంజ్ (మారే ప్రదేశాలు) ఆప్షన్లను సులభంగా చూడవచ్చు.అందుబాటులో ఉన్న నగరాలు..ఈ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతాతో పాటు.. పుణె, అహ్మదాబాద్, జైపూర్, కొచ్చి, భోపాల్, లక్నో, కాన్పూర్, ఆగ్రా, నాగ్పూర్, ఇండోర్, పట్నా, చండీగఢ్ల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్, వెబ్ వెర్షన్లలో లైవ్లో ఉందని పేర్కొంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని స్పష్టం చేసింది.ఆత్మనిర్భర్ భారత్ దిశగా..ఈ సందర్భంగా మ్యాప్మైఇండియా సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ వర్మా మాట్లాడుతూ..‘వినియోగదారుల అవసరాలను గుర్తించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను రోజువారీ నావిగేషన్లో చేర్చాం దీని ద్వారా నగరాల్లో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. ఈ కొత్త ఫీచర్ కేవలం ప్రయాణ సౌలభ్యం కోసమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వెల్లడించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొంది. దీని ద్వారా రోడ్లపై వ్యక్తిగత వాహనాల రద్దీ తగ్గుతుంది. రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్, సేఫ్టీ అలర్ట్స్తో ప్రయాణ సమయం ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. -
Metro: రేపు రాత్రి ఒంటిగంట వరకూ సేవలు
సాక్షి హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా డిసెంబర్ 31 బుధవారం రోజు మెట్రో సేవలను రాత్రి ఒంటి గంట వరకూ పొడిగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని ఆకతాయిలతో ప్రమాదం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు అన్ని మెట్రో స్టేషన్లలో మెట్రో సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసు సిబ్బందితో నిఘా ఉంచనున్నట్లు మెట్రో ప్రకటించింది. సాధారణంగా ఇతర రోజుల్లో హైదరాబాద్ మెట్రో సేవలు రాత్రి 11 గంటల వరకే ఉంటాయి. -
హైదరాబాద్లో న్యూ ఇయర్ పార్టీలు ఇవిగో..
పాత అనుభవాలకు వీడ్కోలు పలుకుతూ కొత్త ఆకాంక్షలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న నగరవాసుల కోసం హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలు రిసార్ట్స్, క్లబ్స్, కేఫ్స్, ఆడిటోరియమ్స్.. మేము సైతం సిద్ధం అంటున్నాయి. ఈ కార్యక్రమంలో సిటిజనులతో కలిసి ఆడి పాడేందుకు సినీ సెలబ్రిటీలు కొందరు నగరానికి వస్తున్నారు. ఇక టాప్ డీజేలు, బ్యాండ్స్, స్టాండప్ కమెడియన్స్.. పెద్ద సంఖ్యలో నగర బాట పట్టనున్నారు.ఇప్పటికే పలు వేదికల ఈవెంట్స్కు సంబంధించి పాస్లు అమ్ముడుపోగా.. అనేక వేదికలు హౌజ్ ఫుల్ అంటున్నాయి. నగర శివారులోని అనంతగిరి కొండలు సైతం ఈవెంట్కి ఆహ్వాన వేదికలుగా ముస్తాబయ్యాయి. ఇక రిసార్టులు, క్లబ్స్ పరిస్థితీ అంతే అన్నట్లు చెబుతున్నాయి. మొత్తానికి న్యూ ఇయర్ వేడుకలకు (New Year Celebrations) కౌంట్ డౌన్ స్టార్ట్స్ అన్నట్లు ఉంది పరిస్థితి.కొత్త సంవత్సరానికి కొంగొత్త ఆశలతో భాగ్యనగరం ముస్తాబవుతోంది. వేడుకలకు సంబంధించిన పలువేదికలు ముస్తాబయ్యాయి. ఆయా వేదికలు, నిర్వహణా సంస్థలు వేడుకలకు సంబంధించి సెలబ్రిటీల ఆహ్వానాల పోస్టర్లు ఈ పాటికే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఔత్సాహికులు ఎగబడి మరీ ఆయా వేదికల పాసులు కొనుగోలు చేయడంతో హౌజ్ ఫుల్ అన్న పరిస్థితి కనిపిస్తుంది.సినీ సెలబ్రిటీలు.. సాగర్ రోడ్డులోని జిఎస్ఆర్ కన్వెన్షన్స్లో ప్రిజ్మ్ ఔట్ డోర్స్, మాయా బజార్ రెస్టారెంట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగీత ఉత్సవంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా సినీ నేపథ్య గాయని సునీత, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ హాజరుకానున్నారు.⇒ ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఈవెంట్స్లో ముందున్న వేడుక మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ సన్నీ లియోన్ (Sunny Leone). అలాగే తాజా సంగీత సంచలనం, గాయకుడు రామ్ మిరియాల కూడా పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్లో భాగంగా మ్యాజిక్ షో, ఫ్యాషన్ షో, బెస్ట్ కపుల్ అవార్డ్స్ వంటివి కూడా ఉంటాయి.⇒ మాదాపూర్లోని క్వేక్ ఎరీనాలో నిర్వహిస్తున్న న్యూ ఇయర్ పార్టీ.. బాలీవుడ్ సెలబ్రిటీని సిటీకి తీసుకొస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ కార్యక్రమంలో హోస్ట్గా పాల్గోనున్నారు.డీజే ఆజా.. బ్యాండ్ బాజా.. ⇒ గచ్చిబౌలిలోని ప్రిజ్మ్ క్లబ్ అండ్ కిచెన్లో నగరానికి చెందిన అగ్రగామి బ్యాండ్ క్యాప్రిసియో ప్రదర్శన ఉంటుంది. ముంబయి నుంచి టాప్ లేడీ డీజే పరోమా హాజరవుతున్నారు.⇒ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న కింగ్ డమ్ క్లబ్లో జరిగే ఈవెంట్లో ముంబయి డీజే అలీ మర్చంట్ పాల్గొంటున్నారు. ఆయనకు తోడుగా కయీ సంగీతాన్ని జత చేయనున్నారు. ⇒ జూబ్లీహిల్స్లోని గ్రీస్ మంకీ రెస్టారెంట్లో నిర్వహిస్తున్న నైట్ పార్టీకి డీజే అగ్ని హాజరవుతున్నారు. మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి చెందిన ఈ లేడీ డీజే నగరంలోని పార్టీ ప్రియులకు చిరపరిచితం.నార్త్ టు సౌత్.. ⇒ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న బిగ్ బుల్ క్లబ్ ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకకు ముంబయికి చెందిన తాజా మ్యూజికల్ సెన్సేషన్ డీజే ఆ్రఫ్టాల్ హాజరవుతున్నారు.. ⇒ అర్జున్ రామ్పాల్ (Arjun Rampal) పాల్గొంటున్న కార్యక్రమంలోనే ఆయనతో పాటు ఢిల్లీకి చెందిన సిమర్ అరోరా అలియాస్ ప్రముఖ లేడీ డీజె సిమ్జ్ జోడీ కట్టనుంది.చదవండి: ప్రపంచంలోనే టాప్ 10 న్యూ ఇయర్ పార్టీస్ ఇవే..⇒ సిటీలో అతిపెద్ద బహిరంగ ప్రదేశంలో ఏర్పాటైన పార్టీగా.. మాదాపూర్లోని హైటెక్స్ ఎరీనాలో వేడుక నిలవనుంది. ఇందులో దేశపు తొలి ఆల్ ఫిమేల్ లైవ్ బ్యాండ్ సందడి సృష్టించనుంది. డీజే జాస్మిన్ ఈ బ్యాండ్ను సమర్పిస్తున్నారు. సాగర్ రోడ్డులోని జిఎస్ఆర్ కన్వెన్షన్స్లో నగరానికి చెందిన వనమ్ బ్యాండ్ పాల్గొంటోంది.హిప్ హాప్.. హిట్ స్టార్స్.. ⇒ బోడుప్పల్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇటలీ డీజే థామస్ డెల్, అమెరికా నుంచి మరిజా కొరియాలు హాజరవుతున్నారు. ⇒ కొండాపూర్లోని మాయా లగ్జరీ కన్వెన్షన్స్లో టాలీవుడ్ నేపథ్య గాయనీ గాయకులు రమ్య బెహ్రా, సాయి చరణ్ పాల్గొంటున్నారు.⇒ దుర్గంచెరువు సమీపంలోని అకాన్లో నిర్వహిస్తున్న పార్టీలో లేడీ డీజే స్పింజ్ మౌరా సందడి చేయనున్నారు.⇒ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్లో ర్యాప్సింగర్ క్రిస్నా, టాలీవుడ్ గాయకుడు కాశ్యప్, నగరానికి చెందిన హిప్ హాప్ స్టార్ థర్కారీలు పాల్గొంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో -
త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన యశ్వంత్ కుమార్ గోషిక (33) శనివారం డల్లాస్లో గుండెపోటుతో మరణించారు. యశ్వంత్ ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. స్నేహితులను, తెలుగు ఎన్నారై సమాజాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.యశ్వంత్ కుమార్ తెలంగాణలోని చౌటప్పల్ గ్రామంలోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. అమెరికాలోనే మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తరువాత టాప్ MNCలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. స్లీప్ అప్నియాకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, ఆకస్మిక గుండెపోటు కారణంగా నిద్రలోనే మరణించాడని సన్నిహితులు వెల్లడించారు. తోటి తెలుగువారితో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు యశ్వంత్ మృతదేహాన్నిఅంతిమ సంస్కారాల కోసం భారతదేశానికి తిరిగి పంపడానికి NRI సంఘం ప్రయత్నాలు చేస్తోంది.విషాదం ఏమిటంటేయశ్వంత్కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పెళ్లికోసం స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న తరుణంలో, పెళ్లికొడుకుగా చూడాలనుకున్న యశ్వంత్ అకాలమరణం వారిని తీరని విషాదంలోకి నెట్టేసింది. -
ఒమన్ వరల్డ్కప్ జట్టు కెప్టెన్గా భారత సంతతి ఆటగాడు
వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల ఒమన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ కూడా భారత సంతతి ఆటగాడే (వినాయక్ శుక్లా) కావడం మరో విశేషం. ఈ జట్టులో వీరే కాక మరో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు. కరణ్ సోనావాలే, జయ్ ఒడేడ్రా, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రామనంది భారత్లో జన్మించిన వారే.ఈ జట్టుకు డిప్యూటీ కోచ్ కూడా భారతీయుడే. ముంబై మాజీ హెడ్ కోచ్గా పని చేసిన సులక్షన్ కులకర్ణి ప్రపంచకప్లో ఒమన్ డిప్యూటీ కోచ్గా వ్యవహరిస్తాడు. మొత్తంగా చూస్తే ప్రపంచకప్ బరిలోకి దిగబోయే ఒమన్ బృందం భారతీయులతో నిండుకొని ఉంది.2026 టీ20 వరల్డ్కప్ కోసం ఒమన్ జట్టు..జతిందర్ సింగ్ (c), వినాయక్ శుక్లా (vc), మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మిర్జా, వసీమ్ అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహ్మూద్, జయ్ ఓడేడ్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రమనంది, హస్నైన్ అలీ షా కాగా, ఒమన్ జట్టు ఆసియా క్వాలిఫయర్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్కు అర్హత సాధించింది. కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా జరిగిన 2024 వరల్డ్కప్కు కూడా ఒమన్ క్వాలిఫై అయ్యింది. ఈసారి ప్రపంచకప్లో ఒమన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఒమన్ ఫిబ్రవరి 9న తమ తొలి మ్యాచ్లో ఆడనుంది. కొలొంబో వేదికగా జరిగే ఆ మ్యాచ్లో జింబాబ్వేను ఢీకొట్టనుంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
చిరు-వెంకటేశ్.. మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్నిరోజుల ముందే ఈ మూవీలోని రెండు పాటల్ని రిలీజ్ చేయగా.. వాటిలో మీసాల పిల్ల బాగా వైరల్ అయింది. మరో సాంగ్ మాత్రం అంతంత మాత్రంగానే బాగుందనిపించింది. ఇప్పుడు మరో గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో చిరు, వెంకీ కలిసి స్టెప్పులేయడం విశేషం.(ఇదీ చదవండి: ప్రేమలో మోసపోయే అమ్మాయి కథ.. ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా)చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా చెప్పాడు. అలానే చిరు-వెంకీ కలిసి ఓ పాటలో డ్యాన్స్ కూడా చేస్తారని అన్నాడు. ఇప్పుడు దాన్ని 'మెగా విక్టరీ సాంగ్' పేరిట విడుదల చేశారు. పాట విషయానికొస్తే బీట్ బాగుంది కానీ ట్యూన్ మాత్రం ఎక్కడో విన్నామో అనిపించేలా ఉందనిపించింది.ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న.. 'మన శంకర వరప్రసాద్ గారు' థియేటర్లలోకి వస్తోంది. దీని కంటే ముందు 9వ తేదీన 'రాజాసాబ్'.. తర్వాత 13వ తేదీన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15వ తేదీన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతున్నాయి. మరి వీటిలో ఈసారి ఏయే చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయనేది చూడాలి?(ఇదీ చదవండి: మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య) -
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు మరోసారి దేశీ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు.సొంతజట్టు బరోడా తరఫున దేశీ టీ20లు ఆడాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). తాజాగా దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అతడు భాగం కానున్నాడు. జనవరి 3, 8వ తేదీల్లో బరోడా.. విదర్భ, చండీగఢ్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లలో హార్దిక్ పాండ్యా ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు అతడి సన్నిహిత వర్గాలు IANSకు తెలిపాయి.అయితే, ఈ రెండు మ్యాచ్లకు మధ్య బరోడా.. జమ్మూ కశ్మీర్తో జనవరి 6న తలపడనుంది. ఈ మ్యాచ్కు మాత్రం హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల దృష్ట్యా ఈ మేరకు విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి మ్యాచ్లలో ఆడనున్నాడు.విశ్రాంతి తీసుకోమన్నా వినడే!టీమిండియా తదుపరి న్యూజిలాండ్తో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ సిరీస్ నుంచి హార్దిక్కు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. కివీస్తో ఐదు టీ20లు సహా వరల్డ్కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, పాండ్యా మ్యాచ్ ఫిట్నెస్ కోసం బరోడా తరఫున బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.రో-కో ఆడేశారుకాగా బీసీసీఐ ఆదేశాల మేరకు ఇప్పటికే భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తమ సొంత జట్లు ముంబై, ఢిల్లీ తరఫున రెండేసి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడారు. టీమిండియా యంగ్ స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర సారథిగా ఈ టోర్నీలో భాగం కాగా.. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్ తదుపరి మ్యాచ్లలో పంజాబ్కు ఆడతారు. సంజూ శాంసన్ కేరళ తరఫున, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్నారు.చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
"సీఎం రేవంత్ తీరని ద్రోహం చేస్తున్నారు"
సాక్షి హైదరాబాద్: రాష్ట్రానికి సీఎం రేవంత్ తీరని జలద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి-బనకచర్ల విషయంలో నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తామే లేపామన్నారు. బీఆర్ఎస్ చెప్పినాకే ఆ అంశంపై ప్రభుత్వం స్పందించింది అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని హరీశ్రావు విమర్శించారు.అయితే అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హరీశ్ రావు విరుచుకపడ్డారు. జలమంత్రిగా పనిచేస్తూ రెండేళ్లయినా ఇంకా ఆ శాఖపై అవగాహన రావడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఇచ్చిన జీఓలో 90TMCల నీటి కేటాయింపు అంశం అస్పష్టంగా ఉందని ప్రస్తుత ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే అంగీకరిస్తూ లేఖ రాసిందని హరీశ్ రావు విమర్శించారు. -
దేశం వీడుతున్న సంపన్నులు.. కారణాలు ఇవే!
చాలామంది సంపన్నులు భారతదేశం నుంచి విదేశాలకు తరలి వెళ్లిపోతున్నారు. దీనికి కారణం ఏమిటనే విషయాన్ని.. ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ (Sanjeev Sanyal) వెల్లడించారు.సంజీవ్ సన్యాల్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ధనవంతులు కాలుష్యం, విలాసం లేదా ఉన్నత జీవన ప్రమాణాల కోసం మాత్రమే మనదేశాన్ని విడిచిపెట్టడం లేదని అన్నారు. అయితే దేశం వీడి వెళ్లడానికి కారణం.. ''వ్యాపార వర్గాలలో మార్పు, పోటీ లేకపోవడం" అని అన్నారు. నూతన ఆవిష్కరణలు లేనప్పుడు.. కొత్త ఆలోచనలు అమలులోకి రావు. దీంతో సంపన్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని & పెట్టుబడులను విదేశాలకు తరలించడం సురక్షితమని భావిస్తారని వివరించారు.అనేక పెద్ద భారతీయ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు దశాబ్దాలుగా ఒకే కుటుంబాలు లేదా వ్యక్తుల ఆధిపత్యంలో ఉన్నాయి. స్థిరపడిన వ్యాపారవేత్తలు తరచుగా కొత్త వెంచర్లతో ప్రయోగాలు చేయడం కంటే.. తమ సంపదను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారని సన్యాల్ పేర్కొన్నారు. దీనివల్ల కొత్తవారికి అవకాశాలు తక్కువ. నూతన ఆవిష్కరణలు, ఆలోచనలు జాడలేకుండా పోతుందని పేర్కొన్నారు.ప్రస్తుతం చాలామంది దుబాయ్ వంటి ప్రదేశాలలో పెట్టుబడి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో కేవలం భారతీయులు మాత్రమే కాకుండా.. ఇతర దేశీయులు కూడా ఉన్నారని సన్యాల్ అన్నారు.సంపన్నుల వలస తగ్గాలంటే..భారతీయ కంపెనీలు పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణలలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. చాలామంది కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం ఉదారంగా ఖర్చు చేస్తున్నప్పటికీ, ఉత్పత్తి & అధునాతన సాంకేతికతలో వాస్తవ పెట్టుబడి తక్కువగానే ఉందని సన్యాల్ పేర్కొన్నారు. ఆవిష్కరణలపై దృష్టి పెట్టకపోతే, దేశ దీర్ఘకాలిక ఆర్థిక బలం దెబ్బతింటుందని అన్నారు. యువ వ్యవస్థాపకులు రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు.ఇదీ చదవండి: భూగర్భంలో విలువైన సంపద.. భారత్లో ఎక్కడుందంటే?భారతదేశం తన సంపదను నిలుపుకోవడానికి.. కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి, నిరంతర నిర్మాణాత్మక మార్పు, నూతన ఆలోచన & వ్యాపార రంగంలో పోటీ అవసరమని సన్యాల్ అన్నారు. అప్పుడే దేశం నుంచి ధనవంతుల వలస తగ్గుతుందని అన్నారు. -
11 మంది ఉగ్రవాదుల అరెస్ట్
అసోంలో ఉగ్రవాదుల భారీ కుట్రను అధికారులు భగ్నం చేశారు. అసోం, త్రిపురలో దాడులకు స్కెచ్ వేసిన 11 మంది ఉగ్రవాదులను సోమవారం అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కేంద్రంగా ఈ టెర్రరిస్ట్ క్యాంపు నడుస్తోందని భారీదాడులకు వీరు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన సందర్భంలో ఉగ్రవాదుల వద్ద జిహదీ సాహిత్యంలో పాటు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు..కాగా ఇటీవల ఢిల్లీ ఎర్రకోట బాంబు దాడుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. అనుమానిత ప్రాంతాలలో ప్రత్యేక సోదాలు నిర్వహించింది. ఈ దాడులలో ఉగ్రవాద దాడులకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించడంతో పలువురిని అరెస్ట్ చేసింది. కాగా గత నెల 10వ తేదీన ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో దాదాపు 13 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. -
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్కు కొత్త కార్యవర్గం ఎన్నిక
కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల ప్రత్యేక సంస్థ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF - CANADA) రానున్న రెండేళ్ల కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. జితేందర్ రెడ్డి గార్లపాటి అధ్యక్షుడిగా, వెంకట్ రెడ్డి పోలు ప్రధాన కార్యదర్శిగా పనిచేయనున్నారు. 2026-27 రెండేళ్ల పాటు ఈ కొత్త కార్యవర్గం పనిచేయనుంది.కొత్త కార్యవర్గంలో ఫౌండేషన్ కమిటీ చైర్ పర్సన్గా అమిత పినికేశి, ఉపాధ్యక్షుడిగా మహేందర్ కీస్రా, సంయుక్త కార్యదర్శిగా అనికేత్ రెడ్డి శామీర్ పేట, ట్రెజరర్గా కృష్ణా రెడ్డి చాడ, జాయింట్ ట్రెజరర్గా రవీందర్ రెడ్డి కొండం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్గా అర్షద్ ఘోరి, కమిటీ చైర్మన్లుగా బిజినెస్ కౌన్సిల్ చైర్ పర్సన్గా ఇందు రెడ్డి, స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్గా కె. మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల కోసం 2005లో టీడీఎఫ్ కెనడా సంస్థ ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు రాష్ట్రం ఏర్పటయ్యాక కూడా ఈ సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రతీ ఏటా తెలంగాణ నైట్ను నిర్వహిస్తూ అక్కడి తెలుగువారిని ఏకం చేసే ప్రయత్నం చేస్తోంది. తంగేడు అనే అనుబంధ సాంస్కృతిక సంస్థ ద్వారా బతుకమ్మ పండగతో పాటు వివిధ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కెనడాలో స్థిరపడిన వందలాది మంది తెలుగువారు తమ కుటుంబాలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా తమ పిల్లలకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన అన్ని సమయాల్లో సమాజ సేవ కార్యక్రమాలను కూడా విసృతంగా ఈ సంస్థ నిర్వహిస్తోంది. టీడీఎఫ్ కెనడా ఆధ్వర్యంలో ఏర్పాటైన క్రికెట్ క్లబ్లో వందలాది మంది తెలుగు విద్యార్థులు భాగస్వామ్యులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విద్య కోసం వెళ్లిన విద్యార్థులకు కూడా ఈ సంస్థ తగిన సహాయం అందిస్తోంది.(చదవండి: విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు) -
వివాదాస్పదంగా చంద్రబాబు విదేశీ పర్యటన!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. అటు ప్రభుత్వ, ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్లినట్లు సమాచారం. అయితే.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసమే ఆయన వెళ్లి ఉంటారని అటు టీడీపీ వర్గాలు జోరుగా కూడా చర్చించుకోవడం కొసమెరుపు. ఉండవల్లి నుంచి హైదరాబాద్కు.. అక్కడి నుంచి అటే లండన్కు అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన. అయితే.. పదేపదే విదేశీ పర్యటల వెనుక మతలబు ఏంటనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చంద్రబాబు ఆరుసార్లు విదేశాలకు వెళ్లారు. సీఎం హోదాలో పెట్టుబడుల సాధన పేరు చెప్పి.. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా పర్యటించిన సందర్భాలే ఉన్నాయి. అయితే.. సీఎం హోదాలో ఉండి కూడా అంత రహస్యంగా పర్యటనలు చేయడం ఎందుకు? అనే చర్చ మొదలైంది ఇప్పుడు. అటు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తరచూ రహస్య పర్యటనలు చేస్తుండడం.. కనీస సమాచారం లేకపోవడం తెలుగు దేశం పార్టీలోనూ తీవ్రచర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం లోకేష్ విదేశీ పర్యటనలోనే ఉన్నాడు. అందుకే నిన్నటి ఏపీ కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి నేతలు చంద్రబాబు, పవన్, నారా లోకేష్లు మాత్రం విలాసాల విషయంలో ‘తగ్గేదే లే’ అంటున్నారు. ఒకవైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూనే.. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖాజనాకు చిల్లు పెడుతుండడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి(90) కన్నుమూశారు. గతకొంత కాలంగా పక్షవాతం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. మంగళవారం మధ్యాహ్నం కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.శాంతి కుమారి భర్త, మాజీ ప్రభుత్వ ఉద్యోగి విశ్వనాథన్ నాయర్ 2005లో మరణించారు. వారి పెద్ద కుమారుడు ప్యారేలాల్ కూడా 2000లో మృతిచెందారు. మోహన్లాల్ తన తల్లితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత కూడా ముందుగా తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తల్లి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నట్లు మోహన్లాల్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. తన విజయాలను చూసి ఆమె ఎంతో గర్వపడేవారని తెలిపారు. శాంతకుమారి మరణవార్త విని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. మమ్ముట్టి దంపతులు మోహన్లాల్ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. -
మండల పూజ సీజన్లో శబరిమల కొత్త ఆదాయ రికార్డు
శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయం ఈ ఏడాది మండల-మకరవిళక్కు సీజన్ కోసం నవంబర్ 16 సాయంత్రం తలుపులు తెరిచింది. 41 రోజుల మండల పూజ కాలం పూర్తయినందున నవంబర్ 16 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. డిసెంబర్ 27 సాయంత్రం ఆలయం మూసివేయబడింది. తిరిగి డిసెంబర్ 30న మకర ఉత్సవాల కోసం తెరిచింది దేవస్వం బోర్డు. రికార్డ్ బ్రేకింగ్ రెవెన్యూదేవస్వం బోర్డు గత రికార్డులన్నింటినీ అధిగమించి ఆలయ ఆదాయంలో చారిత్రాత్మక పెరుగుదలను ప్రకటించింది. తాజా గణాంక నివేదిక ప్రకారం:మొత్తం ఆదాయం: గత 41 రోజుల్లోనే, ఆలయం రూ. 332.77 కోట్లు వసూలు చేసింది.అరవణ పాయసం అమ్మకాలు రూ. 142 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ. 12 కోట్లు వచ్చాయి.హుండీ (ఉడియల్) మొత్తం రూ. 83.17 కోట్లు.గతేడాది మండల పూజ ఆదాయం రూ. 297.06 కోట్లతో పోలిస్తే, ఈ సీజన్లో ఆలయం రూ. 35.70 కోట్ల ఆకట్టుకునే పెరుగుదలను చూసింది.రికార్డు స్థాయి దర్శనాలు..ఆన్లైన్ బుకింగ్ ద్వారా 30,91,183 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.స్పాట్ బుకింగ్ ద్వారా 4,12,075 మంది వచ్చారు.పుల్మేడు అటవీ మార్గం ద్వారా 1,29,933 మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు.గతేడాది మండల సీజన్లో 32,49,756 మంది భక్తులు సందర్శించగా, ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 3,83,435 మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం విశేషం.(చదవండి: శబరిమల యోగా దండం, జప మాల మరమ్మత్తు పనుల కేసుపై సిట్ దర్యాప్తు ముమ్మరం) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం.. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ 103.16 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 84,798.70 వద్ద, నిఫ్టీ 27.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,969.85 వద్ద నిలిచాయి.ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, ఓరియంట్ టెక్నాలజీస్, ఓరియంట్ సెరాటెక్, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పావ్నా ఇండస్ట్రీస్, మోదీ రబ్బర్ లిమిటెడ్, ప్రకాష్ స్టీలేజ్, నందని క్రియేషన్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
Virat Kohli: చరిత్రకు పాతిక పరుగుల దూరంలో..
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో వరుస శతకాలు బాది.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుడి (53)గా తన రికార్డును తానే సవరించుకున్నాడు.ఈ సిరీస్ తర్వాత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగాడు కోహ్లి. సొంతజట్టు ఢిల్లీ తరఫున వన్డౌన్ బ్యాటర్గా వచ్చి ఆంధ్రతో మ్యాచ్లో శతక్కొట్టాడు. కేవలం 101 బంతుల్లోనే 131 పరుగులతో అలరించాడు.29 బంతుల్లోనే హాఫ్ సెంచరీఆ తర్వాత గుజరాత్తో మ్యాచ్లోనూ కోహ్లి అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 61 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో మ్యాచ్ ఆడేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సన్నాహకంగా జనవరి 6న రైల్వేస్తో జరిగే మ్యాచ్లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. కాగా జనవరి 11 నుంచి భారత్- కివీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కొటాంబి, ఖంధేరి, ఇండోర్ వేదికగా ఇరుజట్లు మూడు మ్యాచ్లు ఆడతాయి.సచిన్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిఈ సిరీస్ నేపథ్యంలో కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. టీమిండియా తరఫున కోహ్లి ఇప్పటికి 123 టెస్టుల్లో 9230, 308 వన్డేల్లో 14557 పరుగులు, 125 టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 632 ఇన్నింగ్స్లో.. 27,975 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కివీస్తో తొలి వన్డే సందర్భంగా కోహ్లి గనుక పాతిక పరుగులు చేస్తే.. 28 వేల పరుగుల క్లబ్లో చేరతాడు.సచిన్ టెండుల్కర్ 644 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని తాకగా.. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 666 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి ఒకవేళ కివీస్తో తొలి వన్డేలోనే ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్గా.. సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బద్దలుకొడతాడు. తొలి వన్డేలో మిస్ అయినా.. మిగిలిన రెండు వన్డేల్లో రాణించినా సరే.. కోహ్లి ఈ రికార్డును కొల్లగొట్టడం ఖాయం. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోహ్లి తొలి వన్డేలోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
ప్రేమలో మోసపోయే అమ్మాయి కథ.. ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా
ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. రెగ్యులర్ స్టోరీలానే అనిపించినప్పటికీ సమాజంలో జరిగే విషయాల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'బ్యూటీ'. ప్రేమలో మోసపోయే అమ్మాయి కథతో తీసిన ఈ మూవీలో తండ్రి ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండాయి. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన వచ్చేసింది.అంకిత్, నీలఖి, నరేశ్, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బ్యూటీ'. టీనేజీ ప్రేమకథకు తోడు తండ్రి ఎమోషన్స్తో తీశారు. సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 02 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు.(ఇదీ చదవండి: మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య)'బ్యూటీ' విషయానికొస్తే.. నారాయణ (నరేశ్) మధ్య తరగతి వ్యక్తి. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. కూతురు అలేఖ్య(నీలఖి) అంటే నారాయణకు ప్రాణం. ఆమె అడిగింది కొనిస్తూ, అందులో తన ఆనందాన్ని వెతుక్కుంటుంటాడు. ఇంటర్ చదివే అలేఖ్య.. అనుకోకుండా పెట్ ట్రైనర్ అర్జున్ (అంకిత్)తో ప్రేమలో పడుతుంది. ఇంట్లో ప్రేమ విషయం తెలిసిపోవడంతో అర్జున్తో పాటు అలేఖ్య లేచిపోతుంది. అలా కూతురుని వెతుక్కుంటూ నారాణయ.. హైదరాబాద్ వెళ్తాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఈ మూవీ స్టోరీ అంతా మనం రోజూ చూసినట్లే ఉంటుంది గానీ.. చూపించిన విధానం, పాత్రల తీరుతెన్నులు కట్టిపడేస్తాయి. బ్యూటీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కాలేజ్కి పంపిన 18 ఏళ్ల కూతురు ప్రేమలో పడుతుంది. దాని వల్ల కన్న తల్లితండ్రులు ఎంత బాధపడ్డారు? లేచిపోయిన కూతురు ఎలాంటి ఇబ్బందుల్లో పడిందీ అని కళ్లకు కట్టినట్లు చూపించారు. తండ్రిగా నరేశ్ ఆకట్టుకునే ఫెర్ఫార్మాన్స్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ అందుకే చీర బహుమతిగా ఇచ్చాడు.. రాజాసాబ్ హీరోయిన్)A love story that turns into a mystery… 💔Beauty Trailer is here!Get ready for #BeautyPremieres 2nd January @AnkithKoyyaLive #NilakhiPatra @ItsActorNaresh @JSSVARDHAN @VijaypalreddyA @iamraj20 @shriesaidaara @__SaNaRe @VijaiBulganin @AdithyarkM @LakshmiMeghanaK pic.twitter.com/aZgbCRV6nw— ZEE5 Telugu (@ZEE5Telugu) December 30, 2025 -
సూర్యకుమార్ యాదవ్పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో సూర్యకుమార్ యాదవ్ తనకు తరచూ మెసేజ్లు చేసేవాడని బాంబు పేల్చింది. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి సంభాషణ జరగడం లేదని తెలిపింది.ఓ ఈవెంట్ సందర్భంగా ఎవరైనా క్రికెటర్తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా అని రిపోర్టర్ అడగగా ఖుషి ఇలా బదులిచ్చింది. "నేను ఎలాంటి క్రికెటర్తో డేట్ చేయాలనుకోవడం లేదు. చాలా మంది క్రికెటర్లు నన్ను ఫాలో అవుతున్నారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ తురుచూ మెసేజ్లు చేసేవాడు. ఇప్పుడు మేము మాట్లాడుకోవడం లేదు. నాకు లింక్ అప్స్ అస్సలు నచ్చవు" అని స్పషం చేసింది. సూర్యకుమార్ యాదవ్ గురించి ఖుషి బయటపెట్టిన ఈ సంచలన విషయాలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారాయి. తరుచూ భార్యతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లే సూర్యకుమార్ యాదవ్లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.ఇవాళే సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవీషా శెట్టితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి పూజలు చేశాడు. స్కై సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న ఫోటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, ఖుషి వ్యాఖ్యలు బయటికి రావడం ఆసక్తికరంగా మారింది.కోల్కతాలో జన్మించిన ఖుషి ఎంటీవీలో ప్రసారమయ్యే Splitsvilla రియాలిటీ షో ద్వారా బాగా పాపులరైంది. మోడల్ కూడా అయిన ఖుషి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. నితిన్తో కలిసి హార్ట్ అటాక్.. ఆకాశ్తో కలిసి దొంగ ప్రేమ తదితర సినిమాల్లో లీడ్ రోల్లో యాక్ట్ చేసింది.సూర్యకుమార్ యాదవ్ విషయానికొస్తే.. అతని సారథ్యంలో భారత టీ20 జట్టు ఇటీవలే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 5 మ్యాచ్ల సిరీస్లో 3-1 తేడాతో విజయం సాధించింది. త్వరలో స్కై నేతృత్వంలోని టీమిండియా స్వదేశంలోనే న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు సూర్యకుమారే సారథ్యం వహించనున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్, టీ20 వరల్డ్కప్ల కోసం టీమిండియాను ప్రకటించారు. పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని జట్టుగా నడిపిస్తున్న సూర్యకుమార్.. వ్యక్తిగతంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. -
అమిత్ షా ఆరోపణలకు దీదీ ఘాటు కౌంటర్
ఉగ్రవాద నెట్వర్క్లకు పశ్చిమ బెంగాల్ అడ్డాగా మారిందన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అలాంటప్పుడు పహల్గాం దాడిని కేంద్రమే జరిపించిందా? అని నిలదీశారామె. మంగళవారం బంకురా బిర్సింగ్పూర్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని, ఉగ్రవాదులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ఆ లెక్కన జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు లేరంటే.. పహల్గాం దాడి ఎలా జరిగింది? దాన్ని మీరే చేయించారా?.. దేశ రాజధానిలో జరిగిన దాడికి కారణం ఎవరు?(ఎర్రకోట దాడిని ఉద్దేశించి..) అని ప్రశ్నించారామె. ప్రధాని మోదీని మహాభారతంలో దుర్యోధనుడిగా.. అమిత్ షాను దుశ్శాసనుడితో ఆమె పోల్చారు. శకుని శిష్యుడైన దుశ్శాసనుడు.. ఇక్కడి నుంచి సమాచారం సేకరించేందుకు వచ్చారు. ఎన్నికల సమయంలోనే ఆ దుర్యోధన దుశ్వాసనలకు బెంగాల్ గుర్తుకు వస్తుంది. ఓట్ల కోసం ఎగబడి వచ్చేస్తుంటారు అని మండిపడ్డారామె. ఇక తీవ్ర చర్చనీయాంశమైన ఎన్నికల జాబితా వివాదం (SIR) ప్రస్తావిస్తూ కేంద్రంపై టీఎంసీ అధినేత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ ప్రజలను కేంద్రం ఎస్ఐఆర్ పేరుతో వేధిస్తోంది. కోటిన్నర ఓట్లను తొలగించే యత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో.. రాజ్బన్షీలు, మటువాలు, ఆదివాసీలు లక్ష్యంగా మారతున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఎస్ఐఆర్ నిర్వహించడం పెద్ద మోసం. ఇది ఇలాగే కొనసాగితే చివరికి మీరు (అమిత్ షా) మరియు మీ కుమారుడు మాత్రమే మిగిలిపోతారు అని మమతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆ రాష్ట్రంపై దృష్టిసారించింది. ఈ నెల 20న బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించారు. తాజాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం మరో అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందని ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతోందని ఆరోపించారు. అలాగే.. మమత పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలాయని.. ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు అందకుండా టీఎంసీ సర్కార్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని బెంగాల్ ప్రజలను కోరారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామని.. అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమికొడతామని హామీ ఇచ్చారు. -
అస్థిపంజరంలా ఆమె, ఆకలితో కన్నుమూసిన తండ్రి
మనుషులుగా మానవత్వాన్నిమంట గలిపారు. కనీస వృత్తి ధర్మాన్ని పాటించ లేదు. మానవ విలువల్ని మరిచిపోయిన ఘటన పలువురి హృదయాలను కలిచి వేసింది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారని జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, అతని కూతురి పట్ల ఒక జంట అమానుషంగా ప్రవర్తించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది ఈ అమానుషం. బాధితుడు 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్ రాథోడ్, రైల్వేస్లో సీనియర్ క్లర్క్గా పనిచేసి రిటైరయ్యారు. ఆ చుట్టుపక్కల ఆయనకు మంచి వ్యక్తిగా పేరుంది. 2016లో భార్య మరణించడంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. 27 ఏళ్ల కుమార్తె రష్మి మానసిక వికలాంగురాలు. దీంతో తనకు, తన బిడ్డకు సాయంగా ఉంటారనే ఆలోచనతో ఒక జంటను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. అన్నివిధాలా తోడు నీడగా ఉంటారనే ఉద్దేశంతో రాంప్రకాష్ కుష్వాహా, అతని భార్య రాందేవి అనే భార్యాభర్తల్ని కేర్టేకర్లుగా నియమించుకుని, ఇంట్లోనే చోటిచ్చారు ఓం ప్రకాష్. అయితే వారి బలహీనతను ఆసరాగా తీసుకున్న ఈ జంట క్రూరత్వాన్ని బయట పెట్టుకుంది. యజమానులకు ఆహారం, వైద్య సంరక్షణలాంటివేవీ పట్టించుకోలేదు. రాను రాను వారికి తిండీ, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. క్రమంగా ఇంటిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అలా ఐదేళ్లపాటు వీరి ఆగడాలు సాగాయి. దీంతో ఆహారం లేక ఓం ప్రకాష్ చిక్కిశల్యమై పోయి ప్రాణాలు విడిచారు.ఓంప్రకాష్ మరణం గురించి కుటుంబానికి సమాచారం అందించడంతో ఈ జంట దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఇంటికి చేరిన బంధువులు అక్కడి దృశ్యాలను షాక్ అయ్యారు. ఇక కుమార్తె రష్మి చీకటి గదిలో నగ్నంగా, స్పృహ లేకుండా కనిపించింది. దాదాపు చావు అంచులకు చేరిపోయింది. తన అన్న, కుమార్తె రష్మిని గ్రౌండ్ ఫ్లోర్కు పరిమితం చేసి, పైభాగంలో వారు హాయిగా జీవిస్తున్నారని ఓంప్రకాష్ సోదరుడు అమర్ సింగ్ ఆరోపించారు. బంధువులు ఎవరొచ్చినా, కలవడానికి ఇష్టం పడటం లేదంటూ తిప్పి పంపించేవారని తెలిపారు. ఓం ప్రకాష్ మర్యాదస్తుడనీ, చాలా గౌరవప్రద వ్యక్తి అంటూ ఆయన మరణంపై పొరుగువారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆకలితో రష్మి దేహం శుష్కించిపోయిందనీ, ఒంటిమీద కొంచెం కూడా కండలేక ఎముకల గూడులా ఉందని బంధువు పుష్ప సింగ్ రాథోడ్ తెలిపారు. రష్మి ఇప్పుడు కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంది, బాధ్యులకు కఠినమైన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యంఓంప్రకాష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలు పెట్టారు. పోస్ట్మార్టం, ఇతర వైద్య, ఫోరెన్సిక్ ఫలితాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం -
"గుంటూరును నాశనం చేశారు"
సాక్షి గుంటూరు: కేంద్రమంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అనుమతి లేకుండానే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేశారని, అద్భుతమైన కోర్ సెంటర్ను సేదు బంధు కింద తొక్కేశారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా భూసేకరణ చేశారని ఫ్లైఓవర్ కూల్చివేసిన తర్వాత అనుమతులడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ కూల్చివేతతో రాకపోకలకు ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గంటూరు సిటికీ జరుగుతున్న అన్యాయాలపై తాను గళం విప్పితే మహిళల చేత తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెమ్మసాని చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తానే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
సల్మాన్ ఖాన్ సినిమాపై చైనా అక్కసు.. కారణం ఇదేనా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్'పై చైనా తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది. ఈ మేరకు తమ సంపాదకీయంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇండియన్ సినిమాపై చైనాకు ఎందుకంత అక్కసు? బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ కథేంటి?తెలంగాణ వీర సైనికుడిగా సల్మాన్సల్మాన్ఖాన్(salman Khan) హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’(Battle of Galwan Movie). సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు.అయితే ఈ సినిమా కథపైనే ఇప్పుడు చైనా అభ్యంతరం చెబుతోంది. ఈ చిత్రం చరిత్రను వక్రీకరిస్తోందని చైనా మీడియా ఆరోపిస్తోంది. చైనా ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో తమ సైన్యం సంకల్పాన్ని ఇలాంటి సినిమాలు దెబ్బతీయబోదంటూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనంలో చైనా సైనిక నిపుణులు మాట్లాడుతూ..భారత్-చైనా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని ఆరోపించారు. మూవీ కథాంశం భారత్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని చైనా మీడియా ప్రచారం చేస్తోంది.అదే చైనా భయమా?2020 జూన్ 15న గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలోనే 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' సినిమా రాబోతుంది. ఈ సినిమా విడుదలైతే..అసలు నిజం చైనీయులకు కూడా తెలిసే అవకాశం ఉంది. భారత్ చేతిలో చైనా సైన్యం ఘోరంగా దెబ్బతిందనే విషయం కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. అందుకే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై చైనా దుష్ప్రచారం చేస్తోంది. ఈ సినిమా చైనా సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత విశ్లేషకులు చెబుతున్నారు. -
Viral Video: మరోసారి సహనం కోల్పోయిన మాగ్నస్ కార్ల్సన్
ప్రపంచ నంబర్ 1, ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సన్ మరోసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు. వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక, అన్ ప్రొఫెషనల్గా ప్రవర్తించాడు. నిరాశతో టేబుల్ను బలంగా కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. Arjun Erigaisi wins and Magnus Carlsen slams the table 💥!https://t.co/9kA44nR1gV pic.twitter.com/fPeZmggftd— chess24 (@chess24com) December 29, 2025కార్ల్సన్కు ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. ఇదే ఏడాది నార్వేలో జరిగిన ఓ టోర్నీలో కూడా భారత యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్ చేతిలో ఓటమి తర్వాత ఇలానే టేబుల్ను బలంగా కొట్టాడు.ప్రస్తుత టోర్నీలోనే రష్యా గ్రాండ్మాస్టర్ ఆర్టెమియేవ్ చేతిలో ఓటమి తర్వాత కూడా కోపంతో ఊగిపోయి, కెమెరాను తోసేశాడు.కార్ల్సన్ తరుచూ ఇలా ప్రవర్తించడం ప్రస్తుతం చెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్ల్సన్పై చర్యలు తీసుకోవాలని అభిమానులు ప్రపంచ చెస్ ఫెడరేషన్ను డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే, కార్ల్సన్పై విజయంతో వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో ఎరిగైసి పాయింట్ల సంఖ్య 7.5కు చేరింది. తద్వారా ఎరిగైసి ఉజ్బెకిస్తాన్కి చెందిన నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. -
మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య
అభిమానుల పెళ్లికి సినిమా హీరో లేదా హీరోయిన్లు వెళ్లడం టాలీవుడ్లో ఎప్పుడైనా చూశారా? అస్సలు చూసుండరు. మహా అయితే వ్యక్తిగత సిబ్బంది పెళ్లి జరిగితే కొన్నిసార్లు కనిపిస్తారంతే. కానీ కోలీవుడ్లో మాత్రం ఫ్యాన్స్ పెళ్లిలో హీరోలు కనబడటం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. హీరో సూర్య ఇప్పుడు అలానే ఓ లేడీ ఫ్యాన్కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో షాక్ అవడం ఆమె వంతైంది.(ఇదీ చదవండి: ప్రభాస్ అందుకే చీర బహుమతిగా ఇచ్చాడు.. రాజాసాబ్ హీరోయిన్)అరవింద్ అనే కుర్రాడు కాజల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు కాబోయే భార్యకు హీరో సూర్య అంటే చాలా ఇష్టం. దీంతో రిక్వెస్ట్ చేసి సూర్య తన వివాహానికి వచ్చేలా ఒప్పించాడు. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకు కాజల్కు చెప్పలేదు. సడన్గా కల్యాణ మండపంలో సూర్యని చూసి ఆమె షాకైంది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి కొత్త పెళ్లి జంట.. దాన్ని తమ ఇన్ స్టా పేజీ 'కాదల్స్'లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదే కాదు గతంలోనూ సూర్య.. పలువురు అభిమానుల పెళ్లికి హాజరై సర్ప్రైజ్ చేశాడు. తమిళ హీరో విశాల్, ఆర్య, కార్తీ, ధనుష్ తదితర హీరోలు కూడా ఫ్యాన్స్ వివాహాలకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో హీరోలు ఇలా చేస్తున్నారు. మరి తెలుగులో ఇలా అభిమానుల పెళ్లికి గానీ శుభకార్యాలకు గానీ అటెండ్ అయిన హీరోలు ఎంతమంది ఉన్నారు?(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?) View this post on Instagram A post shared by Aravind & Kajal (@kaadhals_) -
కేంద్రమంత్రి చెంతకు.. మేడ్ ఇన్ ఇండియా కారు
సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. జూలై 2025లో తన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ 'కారెన్స్ క్లావిస్' ఆవిష్కరించింది. దీనిని కియా సీనియర్ అధికారులు.. ఇటీవల కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో చూపించారు. అంతకుముందు ఈ కారును కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామికి పరిచయం చేశారు.కారెన్స్ క్లావిస్ EV భారతదేశంలో తయారైన.. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.17.99 లక్షల నుంచి రూ.24.49 లక్షల మధ్య ఉంటుంది. డిజైన్ పరంగా, ఇది కారెన్స్ క్లావిస్ మాదిరిగా కనిపిస్తుంది. క్లావిస్ EVలో బ్లాంక్ ఆఫ్ గ్రిల్ కనిపిస్తుంది. త్రిభుజాకార LED హెడ్లైట్లు, కోణీయ LED DRLలు ఉన్నాయి. మౌంటెడ్ ఫాగ్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్, ముందు భాగంలో యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్లతో కూడా వస్తుంది. సైడ్ ప్రొఫైల్లో.. కియా కారెన్స్ క్లావిస్ ఈవీ 17 అంగుళాల డ్యూయల్-టోన్ ఏరో-ఎఫిషియన్సీ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక కనెక్టింగ్ లైట్ బార్తో LED టెయిల్లైట్లను పొందుతుంది.ఇదీ చదవండి: పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు గ్రీన్ సెస్?: ధరలు పెరిగే ఛాన్స్కియా కారెన్స్ క్లావిస్ ఈవీ.. రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను పొందుతుంది. అవి 42 kWh బ్యాటరీ (404 కి.మీ రేంజ్) & 51.4 kWh బ్యాటరీ (490 కిమీ రేంజ్) ఉన్నాయి. ఇందులోని మోటారు 255 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది HTK+, HTX, HTX ER, HTX + ER అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. -
మంచంపై పులిరాజా.. ఓ చేదు నిజం!
గ్రామంలోకి చొరబడిన ఓ పెద్దపులి.. జనాలను బెంబేలెత్తించింది. ఓ వ్యక్తిపై దాడి చేశాక.. ఆరుబయట ఉన్న మంచంపై తీరికగా సేద తీరింది. ఆ దృశ్యాన్ని కొందరు ఫోన్లలో బంధించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటన వెనుక ఉన్న చేదు నిజం గురించి చర్చ మాత్రం జరగడం లేదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్(Bandhavgarh Tiger Reserve) ప్రాంతంలో గ్రామంలోకి చొరబడింది. అక్కడ ఆరుబయట సంచరిస్తుండగా దానిపై రాళ్లతో దాడి చేశారు. భయంభయంగానే అది దాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అది అక్కడే కట్టేసిన ఉన్న పశువుల జోలికి పోలేదు(గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు). అయితే రాళ్లు తగిలిన కోపంతో.. ఓ గ్రామస్తుడ్ని నేలకేసి కొట్టింది. ఆపై మరో ఇంట్లోకి వెళ్లి కొన్ని గంటలపాటు మంచంపై కూర్చుని సేదదీరింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సుమారు 8 గంటలపాటు శ్రమించి పులిని బంధించారు. పులి బోనులోకి చేరడంతో పాటు గాయపడిన వ్యక్తికి కూడా ప్రాణాపాయం తప్పడంతో.. ఆ ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. आज मैं गाँव में पंचायत लगाकर सभी की सुनवाई करूँगा, क्यूँ मेरा जीना हराम कर रहे हो, मेरे जंगल में कब्ज़ा कर, मेरा इलाका ख़त्म करके ..??#MadhyaPradesh #bandhavgarh #umaria #tiger #viral #highlight pic.twitter.com/0rG8TAvwnk— DEEPAK YADAV (@YadavDeepakya22) December 29, 2025అయితే.. వేటగాళ్లకు భయపడే పులులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఆ ఊరి ప్రజలు చెబుతుండడం ఇక్కడ చర్చించాల్సిన విషయం. టైగర్ స్టేట్గా పేరొందిన మధ్యప్రదేశ్లో పెద్దపులుల మరణాల లెక్కలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా.. సగర్ జిల్లాలోని ధానా ఫారెస్ట్ రేంజ్లో 10 ఏళ్ల ఆడ పులి మృతదేహం దొరికింది. గత వారం రోజుల్లో రాష్ట్రంలో ఆరు పులులు మృత్యువాత పడగా.. ఈ ఒక్క ఏడాదిలోనే 55 పులులు మరణించడం గమనార్హం. बांधवगढ़ टाइगर रिजर्व में बाघ पर पत्थर बरसाएHuman-wildlife conflict management in Madhya Pradesh collapses 😔🐯 #tiger @CMMadhyaPradesh @PMOIndia @ntca_india @moefcc pic.twitter.com/OfWAFDo5zg— Ajay Dubey (@Ajaydubey9) December 29, 20251973లో మధ్యప్రదేశ్లో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పులులు అత్యధికంగా చనిపోయింది ఈ ఏడాదిలోనే. అందునా అసహజ మరణాలే 11 నమోదు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే.. అటవీ శాఖ వీటిని ఎక్కువగా పులుల మధ్య గొడవలుగా పేర్కొంటున్నాయి. కానీ, క్షేత్ర పరిస్థితులు అవి కావనే చెబుతున్నాయి. వేట, కరెంట్ ఉచ్చులు.. పర్యవేక్షణ లోపాలు, నిర్లక్ష్యం ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా సంస్థ బయటపెట్టిన అటవీ శాఖ నివేదికలో.. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం, సరైన ఫోరెన్సిక్ పరిశీలన లేకపోవడం బయటపడ్డాయి. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఉన్న వన్యప్రాణి అక్రమ రవాణా నెట్వర్క్ ప్రధాన సూత్రధారి యాంగ్చెన్ లఖుంపా ఇటీవలె సిక్కిం బార్డర్లో అరెస్టు అయ్యాడు. మధ్యప్రదేశ్లో పులులను చంపి.. వాటి చర్మం, గోళ్లు పళ్లు.. అక్రమ రవాణా చేసిన అభియోగాలు అతనిపై ఉన్నాయి. సంరక్షణవాదులు(Conservationists) వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని, సంస్కరణలు లేకపోతే మరణాలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు. మద్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. ప్రతి పులి మరణాన్ని సీరియస్గా తీసుకుంటామని, నిపుణుల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని ఒక్క మాటతో తేల్చేస్తోంది. -
పసిడి, వెండి ధరల తగ్గుదల.. కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గాలైన బంగారం, వెండి ధరల్లో గత రెండు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డిసెంబర్ 29, 30 తేదీల్లో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధర తన జీవితకాల గరిష్ట స్థాయి నుంచి సుమారు 3 శాతానికిపైగా క్షీణించింది. అదే సమయంలో బంగారం ధర కూడా 1.7 శాతం తగ్గింది. అయితే ఇందుకు అంతర్జాతీయంగా కొన్ని సంఘటనలు కారణమవుతున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలుఈ ధరల పతనానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందన్న సంకేతాలు రావడం ప్రధాన కారణమని అంచనాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ఫ్లోరిడాలో జరిగిన చర్చలు కొత్త ఆశలను చిగురింపజేశాయి. ‘శాంతి ఒప్పందానికి మేము చాలా దగ్గరగా ఉన్నాం’ అని వారు ప్రకటించడం పెట్టుబడిదారుల ఆలోచనా ధోరణిని మార్చేసింది.యుద్ధాలు లేదా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో పెట్టుబడిదారులు తమ డబ్బు కోల్పోకుండా ఉండటానికి బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెడతారు. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి అందుకే ధరలు పెరిగాయి. ఇప్పుడు ట్రంప్-జెలెన్స్కీ శాంతి చర్చల వల్ల యుద్ధం ముగిసిపోతుందనే నమ్మకం పెరిగింది. దీనివల్ల భయం తగ్గి, పెట్టుబడిదారులు బంగారం నుంచి డబ్బు తీసి ఇతర రంగాల్లో (స్టాక్స్ వంటివి) పెట్టడం మొదలుపెట్టే అవకాశం ఉంది.ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.. శాంతిగా ఉన్నప్పుడు డిమాండ్ తగ్గుతుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య 90% శాంతి ఒప్పందం కుదిరిందనే వార్త రాగానే మార్కెట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోయింది. రిస్క్ తగ్గితే సహజంగానే బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు వెళ్లే వారు తగ్గుతారు. తద్వారా ధరలు పడిపోతాయి.సరఫరా గొలుసు మెరుగుపడుతుందనే ఆశరష్యా ప్రపంచంలో బంగారం, వెండిని ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఒకటి. యుద్ధం వల్ల రష్యాపై ఉన్న ఆంక్షలు సరఫరాను తగ్గించాయి. శాంతి చర్చలు సఫలమైతే, రష్యా నుంచి మెటల్స్ సరఫరా మళ్ళీ పుంజుకుంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది. సరఫరా పెరిగితే ధరలు తగ్గుతాయి.ధరల పతనానికి దోహదం చేసిన ఇతర అంశాలు2025లో వెండి అసాధారణ లాభాలను అందించింది. గరిష్ట ధరల వద్ద పెట్టుబడిదారులు తమ లాభాలను నగదు రూపంలోకి మార్చుకోవడానికి విక్రయాలకు మొగ్గు చూపారు.నూతన సంవత్సర వేడుకల ముందు మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నాయి.డిసెంబర్ 31న విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మినిట్స్ కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడ్ ఇచ్చే సంకేతాలు భవిష్యత్ ధరలను నిర్ణయిస్తాయి.ప్రస్తుత ఉద్రిక్తతలుశాంతి చర్చలు ఒకవైపు సాగుతుండగానే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. డిసెంబర్ 29 రాత్రి పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని రష్యా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీన్ని ఉక్రెయిన్ ఖండించినప్పటికీ రష్యా తన వైఖరిని కఠినతరం చేస్తామని హెచ్చరించడం మార్కెట్లలో మళ్లీ అనిశ్చితిని నింపింది. ఈ పరిణామం శాంతి ప్రక్రియకు స్పీడ్ బ్రేకర్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.భవిష్యత్తు అంచనాలుముగింపు దిశగా సాగుతున్న ఈ చర్చలు విజయవంతమైతే బంగారం, వెండి ధరలు మరింత స్థిరీకరణకు లేదా స్వల్ప పతనానికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే, వెండికి ఉన్న పారిశ్రామిక డిమాండ్ (ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహన రంగం) ధరలను పూర్తిగా పడిపోకుండా కాపాడుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు శుభసూచకం. అయితే, ఇన్వెస్టర్లు మాత్రం ప్రస్తుత ఉద్రిక్తతలను, శాంతి చర్చల ఫలితాలను క్షుణ్ణంగా గమనిస్తూ తమ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం -
తమిళనాడు ప్రభుత్వానికి షాక్
తమిళనాడు ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్టాలిన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మద్రాస్ యూనివర్సిటీ సవరణ బిల్లును రాష్ట్రపతి భవన్ మంగళవారం వెనక్కి పంపించేసింది. మూడేళ్లుగా రాష్ట్రపతి వద్ద ఈ బిల్లు పెండింగ్లోనే ఉన్న సంగతి తెలిసిందే.మద్రాస్ యూనివర్సిటీ చట్టం 1923 ప్రకారం.. తమిళనాడు గవర్నర్ యూనివర్సిటీకి ఎక్స్-ఆఫీషియో చాన్సలర్. వైస్ చాన్సలర్ నియామకం, తొలగింపు తదితర హక్కులు గవర్నర్ వద్దే ఉన్నాయి. అయితే.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో స్టాలిన్ సర్కార్కు పొసగడం లేదు. గవర్నర్ వల్లే తమిళనాడులో వర్సిటీల వీసీ నియామకాలు నిలిచిపోయాయని ప్రభుత్వం తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మద్రాస్ వర్సిటీ బిల్లు ద్వారా గవర్నర్ అధికారాలకు చెక్ పెట్టాలని స్టాలిన్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వైస్ చాన్సలర్ను నియమించుకునే అధికారం పొందడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలకు అనుగుణంగా యూనివర్సిటీ పాలనను మార్చడం, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీని యూనివర్సిటీ సిండికేట్లో సభ్యుడిగా చేర్చడం తదితర అంశాలను బిల్లులో తమిళనాడు ప్రభుత్వం పొందుపరిచింది. అయితే ఈ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపగా.. మూడేళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి ముర్ము ఈ బిల్లును ఆమోదించకుండానే తిరిగి పంపించారు. -
శుభ్మన్ గిల్ వరల్డ్ రికార్డుకు చేరువలో మంధాన
భారత మహిళ క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆఖరి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మంగళవారం తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో ఐదో టీ20లో భారత్ తలపడనుంది. చివరి పోరులో కూడా గెలిచి సిరీస్ను 5-0 క్లీన్ స్వీప్ చేయాలని మన అమ్మాయిల జట్టు పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ఆల్ రౌండర్ దీప్తి శర్మలను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.గిల్ రికార్డుపై కన్ను..స్మృతి మంధాన మంధాన ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ ఏడాదిలో మంధాన అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 1703 పరుగులు చేసింది. మహిళల క్రికెట్లో ఒక క్యాలెండర్ ఈయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా స్మృతి కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఐదో టీ20లో ఆమె మరో 62 పరుగులు చేస్తే.. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్(మెన్స్ అండ్ ఉమెన్స్)లో ఒక ఏడాదిలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా వరల్డ్ రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరిట ఉంది. గిల్ 2025 ఏడాదిలో మూడు ఫార్మాట్లు కలిపి 1764 పరుగులు చేశాడు. మరి ఈ మ్యాచ్లో గిల్ రికార్డు బ్రేక్ అవుతుందో లేదో వేచి చూడాలి. నాలుగో టీ20లో మాత్రం మంధాన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. 48 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్స్లతో 80 పరుగులు చేసింది.ఒకే ఒక వికెట్..మరోవైపు భారత స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్లో దీప్తీ ఒక్క వికెట్ సాధిస్తే టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలుస్తోంది. దీప్తి ప్రస్తుతం 151 వికెట్లతో ఆస్ట్రేలియా ప్లేయర్ మేగాన్ షుట్తో కలిసి జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్గా ఉంది.మహిళల టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు1 - మేగాన్ షుట్: 122 ఇన్నింగ్స్లలో 151 వికెట్లు2 - దీప్తి శర్మ: 129 ఇన్నింగ్స్లలో 151 వికెట్లు3 - హెన్రియెట్ ఇషిమ్వే: 111 ఇన్నింగ్స్లలో 144 వికెట్లు4 - నిదా దార్: 152 ఇన్నింగ్స్లలో 144 వికెట్లు5 - సోఫీ ఎక్లెస్టోన్: 100 ఇన్నింగ్స్లలో 142 వికెట్లు -
కల్యాణ్, శ్రీజలకు 'ఇమ్ము' డైరెక్ట్ పంచ్.. వీడియో వైరల్
బిగ్బాస్ తెలుగు 9 ముగిసింది. విజేతగా కల్యాణ్ పడాల ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. అయితే, తొలిసారి ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ కలిశారు. 'ఆదివారం స్టార్ మా పరివారం' ప్రోగ్రామ్ కోసం వారందరూ సందడి చేశారు. ఈ వేడుకలో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి, పవన్, రీతూ, శ్రీజ, సంజన, సుమన్ శెట్టి, రాము, దివ్య మాత్రమే కనిపించారు. ఈ సీజన్లో విన్నర్ రేసులో ఉన్న తనూజ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో శ్రీజకు ఇమ్ము అదిరిపోయే పంచ్ వేశాడు. అదే సమయంలో రీతూ, పవన్లు మరోసారి ఈ షో కోసం తమ మ్యాజిక్ చూపించారు. వేదికపైనే పవన్కు రీతూ ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. -
‘నా భర్తపై వేరొకరి కన్ను.. అందుకే నాకు విడాకులు’
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం విడాకులు తీసుకున్నాడు. భార్య సానియా అష్ఫక్తో వైవాహిక బంధం నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇమాద్ వసీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సానియా అష్ఫక్ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చింది.నా ముగ్గురు పిల్లలకు తల్లి మాత్రమే ఉందితన భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. అందుకే తమకు విడాకులు అయ్యాయని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘తీవ్ర దుఃఖంలో మునిగిపోయి నేను ఈ నోట్ రాస్తున్నాను. నా కాపురం కూలిపోయింది. నా పిల్లలు తండ్రి లేనివాళ్లు అయ్యారు. వాళ్ల నాన్న వారిని విడిచిపెట్టాడు. నా ముగ్గురు పిల్లలకు ఇప్పుడు తల్లి మాత్రమే ఉంది.ఐదు నెలల పసిబిడ్డ.. ఇంత వరకు తండ్రి ఆ పసికందును ఎత్తుకోనేలేదు. ఈ విషయాలన్నీ పంచుకోకూడదు అనే అనుకున్నాను. అయితే, నేను నిశ్శబ్దంగా ఉంటే.. దానిని నా బలహీనత అనుకుంటున్నారు.ప్రతీ ఇంట్లో మాదిరే భార్యాభర్తలుగా మా మధ్య కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయినప్పటికీ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను భావించాను. భార్యగా, తల్లిగా నా వంతు పాత్రను చక్కగా పోషించాను. నా కాపురాన్ని నిలబెట్టుకునేందుకు వంద శాతం ప్రయత్నించాను.నా భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారుకానీ మూడో వ్యక్తి రాకతో నా ఇల్లు ముక్కలైంది. ఆమె నా భర్తను పెళ్లి చేసుకోవాలని భావించింది. అందుకే.. అంతంత మాత్రంగా ఉన్న మా బంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసింది’’ అని సానియా అష్ఫక్ సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది.చట్టపరంగా చర్యలు తీసుకుంటాఇందుకు బదులుగా.. ‘‘ప్రతీసారి ఘర్షణ పడేకంటే కూడా విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించి.. డివోర్స్ కోసం అప్లై చేశాను. ఇక నా పిల్లలు.. నేను ఎప్పటికీ తండ్రినే. వారి బాధ్యత మొత్తం నాదే. ఇలాంటి సమయంలో నా గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సహకరిస్తారని ఆశిస్తున్నా.కొంతమంది తప్పుడు ప్రచారం చేసే పనిలో ఉన్నారు. దయచేసి వారిని నమ్మకండి. నా పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని ఇమాద్ వసీం పేర్కొన్నాడు. కాగా 37 ఏళ్ల ఇమాద్ వసీం బౌలింగ్ ఆల్రౌండర్.పాకిస్తాన్ తరఫున 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్లు ఆడిన ఇమాద్ వసీం.. వన్డేల్లో 986, టీ20లలో 554 పరుగులు చేశాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో వన్డేల్లో 44, టీ20లలో 73 వికెట్లు ఉన్నాయి. ఇక 2023లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఇమాద్ వసీం.. ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.చదవండి: అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!.. అయితేనేం.. -
ఈ సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే!
సాక్షి, హైదరాబాద్: గత అనుభవాల దృష్ట్యా ఈసారి పండుగ ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు, ఆర్ అండ్ బీ అధికారులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ అంశంపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్గా ఉన్నారు. హైదరాబాద్ - విజయవాడ హైవే పై జనవరి 8వ తేదీ నుంచి వాహన రద్దీ ఎక్కువ ఉండొచ్చు. ప్రధానంగా ఎల్బీనగర్ నుండి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ఈ ప్రాంతాల్లో వేలాది వాహనాలు రద్దీ ఏర్పడుతుంది..ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు. సంక్రాంతికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పోయినసారి ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలి. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుంది. కాబట్టి దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు చేయొద్దు. అత్యవసరంగా చేయాల్సిన పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలి. పండుగ మొదలుకానున్న తేదీకి ముందే రోడ్లపై ఉన్న మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలు పూర్తిగా తొలగించాలి. అన్ని రహదారి లేన్లు వాహనాల రాకపోకలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలి. పగలు, రాత్రి రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. హై-విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, ట్రాఫిక్ వెళ్లే దారి స్పష్టంగా చూపాలి.ఎక్కడా ట్రాఫిక్కు అయోమయం కలిగించే ఏర్పాట్లు ఉండకూడదు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలి. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో నిరంతరం సమన్వయం పాటించాలి. అన్ని సంబంధిత శాఖలు పోలీసుల సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలి. రోడ్డు పనుల్లో ఉన్న సిబ్బంది అందరూ ప్రతిబింబించే జాకెట్లు (పసుపు / నారింజ రంగు) తప్పనిసరిగా ధరించాలి.రాత్రి సమయంలో జంక్షన్లు, వర్క్ జోన్ల వద్ద తగినంత వెలుతురు ఏర్పాటు చేయాలి. బారికేడ్లు, ట్రాఫిక్ ఐలాండ్లపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి. రూట్ పేట్రోల్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంచాలి. అన్ని రహదారి ఘటనలను ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలి. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా సజావుగా వెళ్లేలా అదనపు బృందాలను మోహరించాలి. రేపు నేను తూప్రాన్ పేట్,అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తా అని తెలిపారాయన. కేంద్రానికి ఫ్రీ వే రిక్వెస్ట్సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ‘‘పండుగ పూట లక్షలాది మంది ప్రయాణం చేస్తారు.. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ప్రభుత్వ ఆలోచన. ఈ అంశంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఇవాళ లేఖ రాస్తా. అవసరమైతే ఒకటి,రెండు రోజుల్లో నేను స్వయంగా వెళ్ళి కలుస్తా. జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతా. టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా ఉంటే వాహనాలు ఆగవు..ఎలాంటి అసౌకర్యం ఉండదు’’ అని తెలిపారాయన. ఈ సమీక్ష సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు,నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి,సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,NHAI రీజినల్ అధికారి శివ శంకర్, MoRTH రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్,డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీ,పలువురు పోలీస్ ఉన్నతాధికారులు,ఆర్ అండ్ బీ ఈఎన్సిలు జయభారతి, మోహన్ నాయక్, ఎస్.ఈ ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మైగ్రేన్ తలనొప్పి ఎందుకొస్తుందంటే..!
మైగ్రేన్తో బాధపడేవారికి పనిదినాన్ని కోల్పోవడం లేదా అనారోగ్య సెలవు తీసుకోవడం సాధారణ అనుభవమే. అయితే, ఇది ఉత్పాదకత తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసు గల వారిలో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. క్రమరహిత పనివేళలు లేదా సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు సరైన భంగిమలో కూర్చోవడంలో పొరపాట్లు, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్కు కారణాలు. ఈ సవాళ్లను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం అని అంటున్నారు యశోదా హాస్పిటల్స్ డాక్టర్ జయదీప్ రే చౌదరి.మైగ్రేన్ సమయంలో ఏం జరుగుతుందంటే..ప్రపంచవ్యాప్తంగా, మైగ్రేన్ను కేవలం తలనొప్పిగా కాకుండా, ఒక నర సంబంధ వ్యాధిగా గుర్తిస్తున్నారు. గణాంకాల ప్రకారం, ప్రతి నలుగురిలో ఒకరు మైగ్రేన్తో బాధపడుతుండగా, భారతదేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారని అంచనా. ది లాన్సెట్ (2019) నివేదిక ప్రకారం, మైగ్రేన్లు ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధికంగా అంగవైకల్యాన్ని కలిగించే నర సంబంధ వ్యాధిగా పేర్కొంది.చాలా మంది రోగులు మైగ్రేన్తో జీవితాంతం పోరాడాల్సి వస్తుంది. దీనివల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన ప్రభావాలు ఎదురవుతాయి. మైగ్రేన్ సమయంలో, మెదడు తన చుట్టూ ఉన్న రక్షణ పొరలైన మెనింజెస్కు సంకేతాలను పంపుతుంది. దీనికి ప్రతిస్పందనగా, CGRP (కాల్సిటోనిన్ జన్యు-సంబంధిత పెప్టైడ్) వంటి రసాయనాలు విడుదలవుతాయి. ఈ CGRP నిర్దిష్ట గ్రాహకాలతో బంధించబడినప్పుడు, మెనింజెస్లోని రక్తనాళాలు విస్తరించి వాపుకు గురవుతాయి.ఈ నాళాల విస్తరణ, క్రిమిరహిత వాపు కలయిక మైగ్రేన్ లక్షణ నొప్పిని ఉత్పత్తి చేస్తుంది. నొప్పి సంకేతం అప్పుడు మెదడులోకి తిరిగి ప్రయాణిస్తుంది, అక్కడ అది ప్రాసెస్ చేయబడుతుంది, ఫలితంగా వికారం, కాంతికి సున్నితత్వం (ఫోటోఫోబియా), ధ్వనికి సున్నితత్వం (ఫోనోఫోబియా) వంటి లక్షణాలు ఏర్పడతాయి. పరిష్కారం ఎలాగంటే..యశోదా హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జయదీప్ రే చౌదరి, ఈ సమస్యను ఇలా పరిష్కారిస్తామని చెప్పుకొచ్చారు. లక్ష్యం కేవలం నొప్పిని లేదా ఒక్కో ఎపిసోడ్ను నియంత్రించడం మాత్రమే కాదు, మైగ్రేన్ నుంచి నిజమైన విముక్తిని సాధించడం. ఇందుకు మైగ్రేన్ వచ్చే పౌనఃపున్యాన్ని తగ్గించడం, దాని వ్యవధిని కుదించడం మరియు రోజువారీ జీవితంపై పడే ప్రభావాన్ని తగ్గించడం అవసరం. అలా చేయడం ద్వారా ప్రజలు తమ జీవన నాణ్యతను తిరిగి పొందగలుగుతారు, పనికి పూర్తి స్థాయిలో తిరిగి చేరగలుగుతారు. మైగ్రేన్ నుంచి స్వేచ్ఛను పొందడమే మా తుది ఆశయం.”పని రోజుల్లో మైగ్రేన్ ప్రభావంభారతదేశంలో మైగ్రేన్లు ఉత్పాదకతపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. మైగ్రేన్తో బాధపడే వ్యక్తులు నెలకు సగటున 5.9 పనిదినాలను కోల్పోతున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా ఇబ్బందులు పెరగడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారమైన ప్రభావం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆదాయ నష్టం, జీవన నాణ్యతతో బాధపడుతున్నారు. మైగ్రేన్ కారణంగా వారు ముఖ్యమైన పని, వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నారు, చివరి నిమిషంలో ప్లాన్లను రద్దు చేయాల్సి వస్తోంది లేదా శరీరం సహకరించకపోయినా పని చేయాల్సి వస్తోంది. దీని కారణంగా భారతదేశంలో ఒక్క వ్యక్తికి సంవత్సరానికి సగటు ఆర్థిక నష్టం రూ. 8,731గా అంచనా. అంటే దేశానికి మొత్తం ఆర్థిక నష్టం సుమారు రూ. 18,674 కోట్లకు పైగా నష్టంగా అంచనా.ఇది శారీరక నొప్పిని మించి, మైగ్రేన్లు తరచుగా ఏకాగ్రత లోపానికి, పని వేగం తగ్గడానికి, పనితీరు మందగించడానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇవి వ్యక్తులను తమ వృత్తి ఎంపికలు, కెరీర్ మార్గాలను మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితికి కూడా నెట్టేస్తాయి.ఈ సమస్య నుంచి బయటపడాలంటే..మైగ్రేన్ సంరక్షణకు సమగ్ర దృక్పథం అవసరం. రోగులు సూచించిన మందులు, వైద్య సలహాలను క్రమబద్ధంగా అనుసరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈ జోక్యాలు దీర్ఘకాలిక వ్యాధి భారాన్ని గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చికిత్స ప్రారంభ సమయం, సాధ్యమైన దుష్ప్రభావాలు, చికిత్సకు కట్టుబడి ఉండటం వంటి అంశాలపై వైద్యులు, న్యూరాలజిస్టులతో జరిగే స్పష్టమైన, నిరంతర కమ్యూనికేషన్ నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది.తలనొప్పి ప్రారంభమైన వెంటనే మైగ్రేన్ మందులు తీసుకుంటే అవి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే, నిర్మాణాత్మక పని విరామాలు తీసుకోవడం, సరిపడా నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన నిద్రా సమయాలను పాటించడం, స్క్రీన్ సమయం-తో పాటు స్క్రీన్ కాంతిని సమర్థంగా నిర్వహించడం వంటి జీవనశైలి చర్యలు మైగ్రేన్ దాడుల తరచుదనాన్ని గణనీయంగా తగ్గించగలవు. తలనొప్పి డైరీలో లక్షణాలు, ట్రిగ్గర్లను నమోదు చేయడం ప్రారంభ దశలోనే జోక్యం చేసుకోవడానికి, అలాగే వ్యక్తిగత ట్రిగ్గర్లను గుర్తించి నివారించడానికి ఒక ఉపయోగకరమైన అభ్యాసంగా పనిచేస్తుంది.ఇంటర్నేషనల్ హెడకే సొసైటీ తన క్లినికల్ థెరపీ దృక్కోణంలో ‘మైగ్రేన్ ఫ్రీడమ్’ అనే కొత్త లక్ష్యాన్ని ప్రతిపాదించింది. ఇకపై చికిత్స లక్ష్యం కేవలం నొప్పిని తగ్గించడం లేదా ఒక్కో ఎపిసోడ్ను నివారించడం మాత్రమే కాదు, మైగ్రేన్ నుంచి సంపూర్ణ విముక్తిని సాధించడమే. ఈ దృక్కోణం వ్యక్తులు తమ సాధారణ పనితీరును తిరిగి పొందేందుకు, వేగంగా పనికి పునరాగమనం చేసేందుకు, మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుచుకునేందుకు సహాయపడటంపై దృష్టి సారిస్తుంది. సరైన ఔషధ చికిత్స, వ్యక్తిగత ట్రిగ్గర్లను గుర్తించడం, లక్ష్యిత జీవనశైలి సర్దుబాట్ల సమన్వయంతో, ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది. మనస్సు స్పష్టంగా, పనిదినాలు ఉత్పాదకంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది.--డాక్టర్ జయదీప్ రే చౌదరి, న్యూరాలజిస్ట్, యశోదా హాస్పిటల్స్(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..) -
ఆయుధంగా నదీ జలాలు!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు నదీ జలాలను ఆయుధంగా మార్చుకోవడం వల్ల మరింతగా పెచ్చరిల్లు తాయని పాకిస్తాన్ సెనేటర్ షెర్రీ రెహ్మాన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ అయిన షెర్రీ రెహ్మాన్.. చీనాబ్ నదిపై జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం పయ్రత్నాలు ప్రారంభించిన వేళ పైవిధంగా వ్యాఖ్యానించారు. భారత్ నిర్ణయం సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.వాతావరణ మార్పుల కారణంగా అత్యంత ప్రభావితమవుతున్న ఈ ప్రాంతంలో, నీటిని ఒక ఆయుధంగా (water weaponisation) మార్చుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు, ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికే శత్రుత్వం, అపనమ్మకంతో నిండిపోయి ఉన్న రెండు దేశాల సంబంధాల్లో ఇది ఉద్రిక్తతలను మరింతగా పెంచుతుంది’ అని షెర్రీ రెహ్మాన్ (Sherry Rehman) సోమవారం ఎక్స్లో పేర్కొన్నారు.కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక దాడి నేపథ్యంలో సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) నుంచి వైదొలగుతున్నట్లు భారత ప్రభుత్వం ఏప్రిల్ 22న ప్రకటించడం తెల్సిందే. కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తి స్టేజీ–2 జల విద్యుత్ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. చదవండి: లాహోర్ లేడీ సింగానికి తప్పని ట్రోలింగ్ -
ఆరోగ్య బీమాలో సరికొత్త ట్రెండ్స్
భారతదేశంలో ఆరోగ్య బీమా రంగం మునుపెన్నడూ లేని విధంగా వేగవంతమైన మార్పులకు లోనవుతోంది. పెరుగుతున్న వైద్య ఖర్చులు, జీవనశైలి వ్యాధుల ముప్పు, డిజిటలైజేషన్ వెరసి భారతీయులు తమ ఆరోగ్య రక్షణపై చూపే దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ మార్పులను విశ్లేషిస్తూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తాజాగా ‘ట్రెండ్స్ రిపోర్ట్ 2025’ను విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం, ప్రజలు కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ముందస్తు జాగ్రత్తలు, సమగ్ర రక్షణ కోసం బీమాను ఒక ముఖ్యమైన ఆర్థిక సాధనంగా భావిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే (2023-24 నుంచి 2024-25 వరకు) బీమా చేయించుకున్న సభ్యుల సంఖ్య 27 శాతానికిపైగా పెరగడం విశేషం. వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్య బీమాను తమ ప్రాథమిక అవసరంగా గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణం.యువత, సీనియర్ సిటిజన్ల ఆసక్తికొత్త పాలసీదారుల్లో యువత (18-35 ఏళ్లు వయసు) వాటా 30 శాతం పైగా ఉంది. సీనియర్ సిటిజన్ల (60+ ఏళ్లు) నిష్పత్తి 14 శాతానికి చేరుకుంది. పిల్లల (0-17 ఏళ్లు) కోసం సగటు బీమా మొత్తాన్ని (Sum Insured) తల్లిదండ్రులు 7 శాతం మేర పెంచుకుంటున్నారు. ఇది భవిష్యత్ ఆరోగ్యం పట్ల వారి నిబద్ధతను చూపుతోంది.క్లెయిమ్లకు కారణమవుతున్న వ్యాధులుఆసుపత్రిలో చేరడానికి ఇన్ఫెక్షన్లతో పాటు జీవనశైలి వ్యాధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్లున్నాయి. వీటిలో గుండె, క్యాన్సర్ చికిత్సల కోసం క్లెయిమ్ చేసే మొత్తం విలువ నిరంతరం పెరుగుతోంది.యాప్ల ద్వారానే అంతా..సాంకేతికత వాడకంలో భారతీయులు ముందంజలో ఉన్నారు. ఆరోగ్య బీమా సేవలకు స్మార్ట్ఫోన్లు కీలకంగా మారాయి. ఆన్లైన్ రెన్యూవల్స్ గతంతో పోలిస్తే 10% పెరిగాయి. కేర్ హెల్త్ యాప్ ద్వారా 30% క్లెయిమ్లు, 15% రెన్యూవల్స్ జరుగుతున్నాయి. గడిచిన మూడేళ్లలో ఆన్లైన్ ద్వారా పాలసీ కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయి. ప్రీమియం డిస్కౌంట్ల కోసం ‘స్టెప్ ట్రాకింగ్’ వాడే వారి సంఖ్య 2.5 రెట్లు పెరగడం గమనార్హం.సమగ్ర కవరేజీకే మొగ్గుపాలసీదారులు కేవలం హాస్పిటలైజేషన్ మాత్రమే కాకుండా మరిన్ని సౌకర్యాలను కోరుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని చిన్నపాటి చికిత్సలకు ఓపీడీ బెనిఫిట్స్ కావాలనుకుంటున్నారు. టెలికన్సల్టేషన్ ద్వారా ఆన్లైన్లో డాక్టర్ సలహాలు, బీమా పరిమితిని పెంచుకోవడం, నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా పైసా ఖర్చు లేకుండా చికిత్స పొందడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ సందర్భంగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, మనీష్ దొడేజా మాట్లాడుతూ.. ‘భారతీయ ఆరోగ్య బీమా పాలసీదారులు ఇప్పుడు ముందస్తు రక్షణ పట్ల చురుకుగా వ్యవహరిస్తున్నారు. వారు కేవలం పాలసీని కొనుగోలు చేయడమే కాకుండా, సాంకేతికతను వాడుకుంటూ సమగ్ర కవరేజీని కోరుకుంటున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్బీఎఫ్సీల నుంచి సవాళ్లు -
డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: అక్రిడేషన్ల విషయంలో జీవో 252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో.. వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలంటూ టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎఫ్టీ నేతలు మంగళవారం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్లు ఇవ్వాలని, జీవో 252ను సవరించాలని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే.. స్పోర్ట్స్, కల్చరల్, ఫీచర్ ప్రతినిధులకు అక్రిడేషన్ కార్లు ఇవ్వాలని ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రిపోర్టర్లతో పాటు డెస్క్ జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తా. ఆ అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తా. జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా జీవో 252ను వివరిస్తామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ఫెడరేషన్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అక్రిడిటేషన్ల జీవో నెంబర్ 252పై పలువురు జర్నలిస్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం.. ఫీల్డ్ రిపోర్టర్లకు ‘అక్రిడిటేషన్ కార్డు’, డెస్క్ జర్నలిస్టులకు కేవలం ‘మీడియా కార్డు’ జారీ చేయాలని నిర్ణయించింది. ఒకే వృత్తిలో ఉన్న వారిని రిపోర్టర్లు, డెస్క్ అని రెండు వర్గాలుగా విభజించడం జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడమేనని ఇటు జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక.. మీడియా కార్డు వల్ల రైల్వే, బస్సు పాస్ రాయితీలు, టోల్ గేట్ మినహాయింపులు వంటి కనీస ప్రయోజనాలు కూడా అందే అవకాశం లేదని డెస్క్ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్నట్లుగానే డెస్క్ జర్నలిస్టులకు కూడా పూర్తిస్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్త జీవో వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని యూనియన్లు అంటున్నాయి. ఈ క్రమంలో.. జీవో విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులో పోరాటానికి సిద్ధమయ్యాయి. -
‘శ్రీకాంత్రెడ్డి జిల్లాను తెస్తే.. నువ్వు ముక్కలు చేస్తావా?’
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటా అంటూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో తొడగొట్టి మరీ చెప్పిన మాటలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాయచోటిలో ఆయన తీరుపై అసంతృప్తి.. క్రమక్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారుతోంది. తాజాగా రాయచోటిని మదనపల్లిలో కలపడంపై కేబినెట్లో సంతకం చేసిన మంత్రి రాంప్రసాద్రెడ్డి.. బయటకు వచ్చి కంటతడి పెట్టారు. అయితే ఆయనది డ్రామా అంటూ రాయచోటి ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నాడు గడికోట శ్రీకాంత్రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని రాయచోటికి జిల్లాను తెచ్చారు. దానిని నిలబెడతానని.. లేకుంటే మీసం తీసేస్తానంటూ రాంప్రసాద్రెడ్డి శపథం చేశారు. ఈ క్రమంలో.. ఇప్పుడు మీసం తీసేస్తారంటూ అంటూ రాజకీయ ప్రత్యర్థులు సెటైరలు సంధిస్తున్నారు. శ్రీకాంత్రెడ్డి పదవీ త్యాగంతో జిల్లాను తీసుకొస్తే..రాంప్రసాద్రెడ్డి మంత్రి పదవి కోసం జిల్లాను ముక్కలు చేశాడంటున్న రాయచోటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జిల్లా కేంద్రంలో రాయచోటిని తొలగించి మదనపల్లికి మార్చడంపై ఇటు ముస్లిం మత పెద్దల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. శుక్రవారం జిల్లా కేంద్రం మార్పునకు నిరసగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి. ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేయాలని.. అన్నమయ్య జిల్లాలోనే యధావిధిగా కొనసాగించాలని మత పెద్ద సర్కాజి షర్ఫుద్దీన్ హుస్సేని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించలేని పక్షంలో రాయచోటిని కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారాయన. ‘‘జిల్లా కేంద్రం లేనప్పుడు పన్నుల భారం కూడ తోలగించి రాయచోటిను వైఎస్ఆర్ జిల్లాలో విలీనం చేయండి అని కోరుతున్నారాయన. -
గిఫ్ట్గా చీర ఇచ్చిన 'ప్రభాస్'.. ఎందుకో చెప్పిన హీరోయిన్
'ది రాజాసాబ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరాఠీ బ్యూటీ రిద్ది కుమార్ మాట్లాడుతూ.. తనకు ప్రభాస్ గిఫ్ట్గా ఒక చీరను ఇచ్చారని చెప్పిన విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత అదే చీరను ఈ కార్యక్రమం కోసం కట్టుకొని వచ్చానని ఆమె చెప్పింది. అయితే, రిద్ది కుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆమెకు చీర గిఫ్ట్గా ప్రభాస్ ఎందుకు ఇచ్చాడు అంటూ పలు రకాలుగా కామెంట్లు వచ్చాయి. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసలు కారణం చెప్పింది.ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆయనకు ఒక గిఫ్ట్ను ఇచ్చానని అందుకు రిటర్న్గా ఒక చీరను ఇచ్చారని రిద్ది కుమార్ ఇలా చెప్పారు. 'మూడేళ్ల క్రితం నేను రాజా సాబ్ సెట్లో ఎంట్రీ ఇచ్చిన నాడే ప్రభాస్ పుట్టినరోజు.. ఆయనకు ఏదైనా ఒక కానుక ఇవ్వాలనుకున్నాను. ఆ సమయంలో కుదరలేదు. తర్వాత దీపావళి ఈవెంట్ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కర్ణుడి స్టోరీకి సంబంధించిన ఒక పుస్తకాన్ని ప్రభాస్కు ఇచ్చాను. నిజజీవితంలో కూడా ప్రభాస్ స్వభావం కర్ణుడికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయనకు ఆ బుక్ ఇచ్చాను. దానికి రిటర్న్ గిఫ్ట్గా నాకు హనుమాన్ చాలీసా పుస్తకంతో పాటు కొన్ని చాక్లెట్స్, వైట్ శారీ ఇచ్చారు. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాను. నాటి నుంచి ఆ హనుమాన్ చాలీసా బుక్ నా బ్యాగ్లోనే ఉంది. అయితే, కొద్దిరోజుల తర్వాత కల్కి సినిమాలో కర్ణుడిగా ప్రభాస్ నటించారని తెలిసి ఆశ్చర్యపోయాను.' అని రిద్ది కూమార్ చెప్పారు.ది రాజా సాబ్ సినిమా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతం అందించాడు. -
చొరబాట్లకు మమత మద్దతు: అమిత్ షా
కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన విమర్శలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. కోల్కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని గత 15 ఏళ్ల పాలనలో రాష్ట్రం అవినీతి, భయం, చొరబాట్లతో నిండిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర భద్రతకు ఈ అంశాలు తీవ్ర ముప్పుగా పరిణమించాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని అమిత్షా అన్నారు.బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరుగుతున్న చొరబాట్లపై షా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. మమతా బెనర్జీ తన రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని, సరిహద్దుల వద్ద కంచె వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అమిత్ షా పేర్కొన్నారు. కేవలం దేశభక్తి గల బీజేపీ ప్రభుత్వం మాత్రమే సరిహద్దులను కాపాడి, చొరబాటుదారులను బయటకు తరిమికొడుతుందని ఆయన అన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇక్కడి ‘టోల్ సిండికేట్’,అవినీతి కారణంగా ప్రజలకు చేరడం లేదని అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, భయం, దుర్పరిపాలన నుండి విముక్తి పొంది అభివృద్ధి దిశగా సాగాలని నిశ్చయించుకున్నారని అమిత్ షా అన్నారు. 2026, ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు తృణమూల్ ప్రభుత్వానికి చరమగీతం పాడనున్నారని ఆయన జోస్యం చెప్పారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 15 నాటికి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ తర్వాత బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ తదితర మహనీయులు కలలుగన్న బెంగాల్ను నిర్మిస్తామని, రాష్ట్ర సంస్కృతిని, పునరుజ్జీవనాన్ని కాపాడటానికి కృషి చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: డిజిటల్ హోరులో 'ప్రింట్' జోరు.. యూపీ ముందడుగు -
హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం
బెంగళూరు : బెంగళూరులోని కుండలహళ్లిలో సోమవారం సాయంత్రం పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 23 ఏళ్ల ఐటీ ఉద్యోగం దుర్మరణం పాలయ్యాడు. ఏడు అంతస్తులు, 43 గదులున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.చనిపోయిన వ్యక్తిని బళ్లారికి చెందిన అరవింద్గా గుర్తించారు. ఇతను ఐటీ సేవల సంస్థ క్యాప్జెమినీలో సీనియర్ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు సెవెన్ హిల్స్ సాయి కో-లివింగ్ పేయింగ్ గెస్ట్ హాస్ట్లో ఉంటున్న అరవింద్. టెర్రస్పై ఉండగా గ్రౌండ్ ఫ్లోర్లో పొగను గమనించాడు. ఏం జరిగిందో చూద్దాం అని కిందికి వచ్చిన సమయంలో గ్యాస్ పేలుడు సంబంధించిందని దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వైట్ఫీల్డ్) కె పరశురామ్ వెల్లడించారు. పోలీసుల ప్రకారం కమర్షియల్-గ్రేడ్ గ్యాస్ సిలిండర్ పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు.సమాచారం అందించిన సంఘటనా స్థలానికి చేరుకున్నస్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మంటలను అదుపు చేశాయి. గాయపడిన వారిలో ఒకరు హాస్టల్ పని చేస్తున్నవారు, ఇద్దరు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు. కర్నూలుకు చెందిన 28 ఏళ్ల వెంకటేష్, ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల విశాల్ వర్మ, ఉత్తరాఖండ్కు చెందిన 25 ఏళ్ల సివి గోయెల్ ప్రస్తుతం బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పీజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం -
టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్గా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో యువ పేసర్ జోష్ టంగ్కు చోటు దక్కింది. టంగ్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున ఒక్క వైట్బాల్ మ్యాచ్ కూడా ఆడలేదు.యాషెస్ సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో టంగ్ను వైట్బాల్ జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా గాయం కారణంగా యాషెస్ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ను కూడా వరల్డ్కప్ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఈ మెగా టోర్నీకి ఆర్చర్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.ఈ జట్టులో జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే విధ్వంసకర ఆల్రౌండర్ లియమ్ లివింగ్స్టోన్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఆల్రౌండర్లగా కుర్రాన్, డాసన్, విల్ జాక్స్కు అవకాశం దక్కింది. ఇక ఈ పొట్టి ప్రపంచకప్నకు ముందు ఇంగ్లండ్.. శ్రీలంకతో మూడు మ్యాచ్లు టీ20, వన్డే సిరీస్లలో తలపడనుంది.ఈ వైట్బాల్ సిరీస్లకు కూడా ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వరల్డ్కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టునే దాదాపుగా లంకతో టీ20లకూ కొనసాగించారు. ఆర్చర్ ఒక్కడే అందుబాటులో లేడు. అయితే వన్డే జట్టులో మాత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలీ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. జనవరి 22 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్కప్ షూరూ కానుంది.ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.శ్రీలంకతో టీ20లకు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రిడన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.శ్రీలంకతో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రిడన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జాక్ క్రాలీ, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, ల్యూక్ వుడ్. -
పంత్ కాదు!.. వన్డే వరల్డ్కప్ జట్టులోనూ అతడే!
వన్డేల్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. తాత్కాలిక సారథిగానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో భారత జట్టు కెప్టెన్ హోదాలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ను 2-1తో కేఎల్ రాహుల్ గెలిచాడు.పంత్ స్థానానికి ఎసరు!ఈ సిరీస్లో రాహుల్కు బ్యాకప్ వికెట్ కీపర్గా రిషభ్ పంత్ (Rishabh Pant)ను ఎంపిక చేసిన యాజమాన్యం.. అతడిని ఒక్క మ్యాచ్లోనూ ఆడించలేదు. ఈ నేపథ్యంలో.. గత కొన్నిరోజులుగా భారత దేశీ క్రికెట్లోని అద్భుత ప్రదర్శనల కారణంగా బ్యాకప్గానూ వన్డేల్లో పంత్ స్థానం గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది.ప్రపంచకప్-2026 టోర్నీ ఆడే జట్టులో చోటుదేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో సత్తా చాటిన జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) రేసులోకి దూసుకువచ్చాడు. ఈ సీజన్లో 500కు పైగా పరుగులతో సత్తా చాటి.. కెప్టెన్గా జార్ఖండ్కు తొలి టైటిల్ అందించి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. విధ్వంసకర ఆట తీరుతో ఇటు ఓపెనర్గా, అటు వికెట్ కీపర్గా రాణించగల ఇషాన్ను ఏకంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు.సంజూ శాంసన్ (Sanju Samson)కు బ్యాకప్గా ఇషాన్కు వరల్డ్కప్ జట్టులో చోటిచ్చారు. ఇదిలా ఉంటే.. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఇషాన్ కిషన్ సత్తా చాటుతున్నాడు. కర్ణాటకతో మ్యాచ్లో 39 బంతుల్లోనే 125 పరుగులు చేసిన ఈ ఎడమచేతివాటం బ్యాటర్.. ఆరో స్థానంలో వచ్చి ఈ మేరకు చెలరేగడం విశేషం.వన్డే వరల్డ్కప్ జట్టులోనూ అతడే ఉండే ఛాన్స్!ఇప్పటికి టీమిండియా తరఫున 27 వన్డేలు ఆడిన ఇషాన్ కిషన్.. 42.40 సగటుతో ఏకంగా 933 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో ఓ వన్డే డబుల్ సెంచరీ కూడా ఉంది. చివరగా 2023 వరల్డ్కప్ టోర్నీలో భాగంగా ఈ జార్ఖండ్ ప్లేయర్ వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డ కారణంగా 2023లో ఆఖరిగా టీమిండియాకు ఆడిన ఇషాన్ కిషన్.. దాదాపు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. టీ20లలో ఆడే అవకాశం వచ్చి తనను తాను నిరూపించుకోవడం సహా.. వన్డేల్లోనూ ఫామ్ను కొనసాగిస్తే ప్రపంచకప్-2027 జట్టులోనూ అతడికి స్థానం దక్కే అవకాశం ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం వల్ల లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఓపెనింగ్ జోడీ కోసం బ్యాకప్గా ఇషాన్ ఉపయోగపడతాడు. అంతేకాదు మిడిలార్డర్లోనూ రాణించగల సత్తా అతడికి ఉంది. ఇక వికెట్ కీపర్గానూ సేవలు అందించగలడు. కాబట్టి ప్రస్తుత ఫామ్ దృష్ట్యా టీమిండియా వన్డే బ్యాకప్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.రేసులోకి ధ్రువ్ జురెల్మరోవైపు.. ధ్రువ్ జురెల్ సైతం రేసులోకి వచ్చాడు. దేశీ క్రికెట్లో అతడు రెడ్హాట్ ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో ఈ ఉత్తరప్రదేశ్ స్టార్ ఇప్పటికి మూడు మ్యాచ్లలో కలిపి ఏకంగా 307 పరుగులు సాధించాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ వచ్చి చితక్కొట్టగలనని నిరూపించాడు.ఇప్పటికే భారత టెస్టు జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకుంటున్న ధ్రువ్ జురెల్.. లిస్ట్-ఎ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. తద్వారా వన్డే జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నాడు. భారత్- ఎ టూర్లలో వన్డే బ్యాకప్ వికెట్ కీపర్గా అతడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ తర్వాత ధ్రువ్ జురెల్ అత్యుత్తమ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.పంత్ ఇలాగే ఉంటే కష్టమే!వీరిద్దరు ఇలా సత్తా చాటుతుండగా.. మరోవైపు రిషభ్ పంత్ మాత్రం స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోతున్నాడు. వన్డేల్లో అతడి రికార్డు కూడా అంతంత మాత్రమే. ఇప్పటికి 31 మ్యాచ్లలో కలిపి సగటు 33తో 871 పరుగులు చేశాడు. అయితే, గత కొంతకాలంగా వన్డే తుదిజట్టులో అతడికి చోటే కష్టమైంది.ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్పై 70 పరుగులు సాధించడం మినహా.. మిగతా రెండు మ్యాచ్లలో అతడు విఫలమయ్యాడు. మేనేజ్మెంట్ నుంచి మద్దతు ఉంది కాబట్టి.. కేఎల్ రాహుల్ స్థానాన్ని పంత్ భర్తీ చేయవచ్చు. అయితే, వన్డేల్లో అతడి గణాంకాలు మాత్రం ఇందుకు దోహదం చేస్తాయని చెప్పలేము. ఈ రేసులో పంత్, జురెల్లను దాటి ఇషాన్ కిషన్ ముందుకు దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా తదుపరి న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో టీమిండియా బిజీ కానుంది. చదవండి: ‘టీ20లలో బెస్ట్.. అతడిని వన్డేల్లోనూ ఆడించాలి’ -
వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..
ఏఐ సాంకేతికతను ఎన్ని రకాలుగా వాడేస్తున్నారంటే..ఇలా కూడా ఉపయోగించొచ్చా అనేలా అబ్బురపరుస్తున్నాయి ఆ ఆలోచనలు. టెక్నాలజీతో మంచి సందేశాన్నిస్తూ ప్రభావితం చేయడం గురించి విన్నారా. అదే నేర్పిస్తుంది చైనా. టెక్నాలజీని విపరీతంగా వాడే డ్రాగన్ దేశం ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. అందర్నీ తనవైపుకి తిప్పుకుంది. ప్రస్తుతం యువత కెరీర్ ఫస్ట్ పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత అంటోంది. దాంతో పరిస్థితి ఏ విధంగా తయారైందో అందరికి తెలిసిందే. ఇది కరెక్ట్ కాదని ఎంతోమంది మేధావులు, మానసిక నిపుణులు చెబుతున్నా.. యువత అందుకు ససేమరి నో అనే చెబుతోంది. అలాంటి యువతను చాకచక్యంగా మార్గంలో పెట్టేందుకు డ్రాగన్ కంట్రీ ఏఐ టెక్నాలజీతో భావోద్వేగ సందేశంతో పిలుపునిస్తూ..యువతరాన్ని ప్రభావితం చేసే పనిలో పడింది. ఏం చేస్తోందంటే..ఏం లేదండి..ఏఐ కృత్రిమ మేధస్సుతో రూపొందించిన ఆన్లైన్ వీడియోలతో బలమైన భావోద్వేగ సందేశాలతో యువత దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఏఐ జనరేటెడ్ మహిళలు యువతను సరైన వయసుకి వివాహం చేసుకోవాలని పిలుపునిస్తూ రకరకాల వీడియోలను వైరల్ చేస్తోంది. వివాహం, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాల్లో యువతకు స్పష్టమైన అవగాహన ఉండాలనే బలమైన సందేశాన్ని అందిస్తోంది. ఈ వీడియోల్లో మధ్య వయస్కురాలైన ఒంటిరి మహిళ తాను పెళ్లి చేసుకోకపోవడం, పిల్లలను కనకపోవడం పట్ల విచారం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూ..యూత్ని ఆ అంశాలపై ఆలోచనత్మాక దృష్టిని అందిస్తోంది. అంతేగాదు ఆ వీడియోల్లో ఆస్పత్రి లాంటి వాతావరణంలో మహిళలు ఏడుస్తున్నట్లు చిత్రీకరించాయి. తాము ఒంటరితనంతో విలపిస్తున్నామని, యంగ్గా ఉన్నప్పుడూ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తమ జీవితాలు దుఃఖమయంగా మారాయంటూ రికార్డు చేసిన వీడియోలు యువతకు సరైన దృక్పథం తోపాటు సరైన దిశలో నడిపించేలా ప్రభావితం చేస్తున్నాయి. సరైన వయసులో పెళ్లి చేసుకోకపోతే.. వృద్ధాప్య జీవితం ఎంత భారంగా దయనీయంగా ఉంటుందో కళ్లకుకట్టినట్లు చూపిస్తూ..యువతను మేల్కొపేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంతేగాదు ఆ ఆ వీడియోలో వివేకవంతమైన మార్పు వైపుకి మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నాయి. డబుల్ ఇన్కమ్, పిల్లలు లేని జీవితం అవసనా దశనను ఎంత దుర్భరంగా మారుస్తోంది కనువిప్పు కలిగేలా చేసి.. యువతకు కుటుంబం, పెళ్లి వంటి వాటికి ప్రాముఖ్యతనిచ్చి, మంచి నిర్ణయం తీసుకునేలా ఆ సాంకేతిక వీడియోలు బలమైన సందేశాన్నిస్తుండటం విశేషం. ఒకరకంగా చైనా సరికొత్త సందేశాత్మక ధోరణి.. సాంకేతికతను మంచి దృక్పథానికి ఎలా వాడాలనేది హైలెట్ చేసింది కదూ..!.(చదవండి: ఎకో ఫ్రెండ్లీ వాటర్ ఏటీఎం..! బాధ్యతయుతమైన పర్యాటకానికి కేరాఫ్గా..) -
డ్రైవర్ వీరంగం.. టోల్ ప్లాజా గేటు ధ్వంసం
బెంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ సమీపంలోని బ్రహ్మరకూట్లు టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టోల్ ఫీజు చెల్లించే విషయంలో మొదలైన వివాదం టోల్ సిబ్బందిపై దాడికి దారితీసింది. లారీ డ్రైవర్, క్లీనర్ కలిసి టోల్ గేటును ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి సిబ్బందిపై దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిక్కమగళూరుకు చెందిన భరత్ (23) అనే లారీ డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్లో టోల్ ప్లాజా వద్దకు తీసుకువచ్చాడు. డ్యూటీలో ఉన్న టోల్ సిబ్బంది టోల్ రుసుము చెల్లించాలని కోరగా, డ్రైవర్ నిరాకరిస్తూ, గొడవకు దిగాడు. ఆవేశంతో వాహనాన్ని ముందుకు పోనిచ్చి టోల్ గేటును ఢీకొట్టి, దానిని ధ్వంసం చేశాడు. అనంతరం డ్రైవర్ భరత్, క్లీనర్ తేజస్ (26) కలిసి అక్కడి సిబ్బంది అంకిత్, రోహిత్లను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిపై దాడికి దిగారు.నిందితులు అంతటితో ఆగకుండా, తమకు తోడుగా మరికొందరిని పిలిపించి, మరోమారు టోల్ ప్లాజాపై దాడి చేశారు. ఈ ఘటనతో టోల్ ప్లాజా వద్ద కొంతసేపు పనులు నిలిచిపోయాయి. టోల్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ ఫిర్యాదు మేరకు బంట్వాల్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై కేసు నమోదు చేశారు. వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టోల్ ప్లాజాల వద్ద సిబ్బంది రక్షణ కోసం భద్రతను పెంచాలని, ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై నిఘా పెట్టేందుకు సీసీటీవీ దృశ్యాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఏడాది చివరిలో ఘోరం.. ఏడుగురు మృతి -
'మిత్రమండలి' మూవీతో ఎన్ని కోట్లు పోయాంటే..: నిర్మాత
నటుడు ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిత్రమండలి’.. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్పై కల్యాన్ మంతిన, భాను ప్రతాప,డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. అయితే, ఈ మూవీకి సమర్పకులుగా నిర్మాత బన్నీ వాస్ ఉన్నారు. దీంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిన ఈ మూవీ నష్టాలను మిగిల్చిందని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాస్ పేర్కొన్నారు.‘మిత్రమండలి’ సినిమా తమకు నష్టాలను తెచ్చిందని బన్నీ వాస్ ఇలా అన్నారు. 'సినిమా పూర్తి అయ్యాక ఎడిటింగ్ రూమ్లో అందరం చూశాం. చాలా బాగుందని మాకు అనిపించింది. దీంతో థియేటర్స్లలో ప్రేక్షకులు కూడా నవ్యూతూ బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాం. కానీ, ఎక్కడో పొరపాటు జరిగింది. ప్రేక్షకులతో పాటు నేను కూడా సినిమా చూశాను. వారిలో నవ్వు అనేది కనిపించలేదు. నేను అంచనా పెట్టుకున్న సీన్లు కూడా మెప్పించలేదు. తొలిసారి మా అంచనా తప్పు అయింది. అయితే, ఎడిటింగ్లో పొరపాటు చేశామని తర్వాత అర్థమైంది. ఫైనల్ కాపీని విడుదలకు ముందు మరోసారి చూసుకొని ఉండింటే బాగుండేది. కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దీంతో మిత్రమండలి మూవీ వల్ల రూ. 6 కోట్లు నష్టపోయాం.' అని బన్నీ వాస్ పేర్కొన్నారు.మిత్రమండలిలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్,సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 16న విడుదలైన ఈ చిత్రం 20రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ రైట్స్తో కలుపుకొని రూ. 9 కోట్ల వరకు మాత్రమే రికవరీ చేసినట్లు సమాచారం.#Mitramandali 6 కోట్లు పోయింది. ఆ తప్పు కరెక్ట్ చేయలేకపోయాం.- @TheBunnyVas Watch Full Interview https://t.co/wzUYcruF7Z pic.twitter.com/1Xe6Jkfmwe— Rajesh Manne (@rajeshmanne1) December 30, 2025 -
ఆ పాత్ర కోసం సందీప్ రెడ్డి, నాగ్ అశ్విన్ని అడిగితే నో చెప్పారు: పతంగ్ డైరెక్టర్
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల లీడ్ రోల్స్లో ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘పతంగ్’. డి. సురేష్బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రణీత్ పత్తిపాటి మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం హైదరాబాద్. ఓ సంక్రాంతి పండగ రోజున పతంగుల పోటీ నేపథ్యంతో ఓ సినిమా తీయాలనే ఆలోచనతో ‘పతంగ్’ ఆరంభించాం. గాల్లో పతంగ్ ఎగరడం, దానికున్న మాంజాని మేము గ్రాఫిక్స్లోనే చూపించాం. క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు. మా మూవీకి థియేటర్స్లో మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు చేసిన పాత్రకు ‘దిల్ ’రాజు, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ , ఎస్జే సూర్య వంటి వారిని అనుకున్నాం. కానీ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఒప్పుకోలేదు. ఇక సినిమాలో గౌతమ్ మీనన్ పాత్రనున గౌతమ్మీనన్ చేస్తే బాగుంటుందని అయన్ని ఆప్రోచ్ అయ్యాం. ఆయనపాత్ర కథ,విని ఒప్పుకున్నారు. ఆయన మీద పంచ్లు వేయడం కూడా బాగా నచ్చింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కాస్త కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తుంది. చెప్పాలంటే అదీ నా క్యారెక్టరే. నేను కూడా చాలా కన్ఫ్యూజన్ తో ఉంటుంటాను. కానీ, పనిలో మాత్రం క్లారిటీతో ఉంటాను. డి.సురేష్ బాబుగారితో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. జనవరి 1న మా చిత్రం ఓవర్సీస్లో కూడా విడుదలవుతోంది’’ అన్నారు. -
ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇంట త్వరలో శుభకార్యం జరగనుంది. ప్రియాంక, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా (25) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన స్నేహితురాలు అవీవా బేగ్ (Aviva Baig)తో రేహాన్ నిశ్చితార్ధం చేసుకున్నారన్న వార్త కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.రేహాన్ వాద్రా (Raihan Vadra) ఇటీవల తన ఏడేళ్ల నాటి స్నేహితురాలు అవివా బేగ్కు ప్రపోజ్ చేశాడు. దానికి ఆమె ఓకే చెప్పారట. వీరి ప్రేమ ప్రయాణానికి రెండు కుటుంబాలు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ నిశ్చితార్థంపై ప్రియాంక గాంధీ కుటుంబం నుంచి గానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రేహాన్ వాద్రా గురించి..రేహాన్ వాద్రా డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నాడు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా చదువుకున్నది కూడా ఇక్కడే కావడం గమనార్హం. ఆ తర్వాత పొలిటిక్స్లో ఉన్నత విద్య కోసం లండన్లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)కి వెళ్లాడు. రేహాన్ ఒక విజువల్ ఆర్టిస్ట్ గత పదేళ్లుగా ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టాడు. ముంబైలోని కొలాబాలో ఉన్న సమకాలీన ఆర్ట్ గ్యాలరీ APRE ఆర్ట్ హౌస్లో అందుబాటులో ఉన్న బయో ప్రకారం, అతని పోర్ట్ఫోలియో వన్యప్రాణులు స్ట్రీట్, వ్యాపార ఫోటోగ్రఫీపై ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. తన తల్లి ప్రియాంక గాంధీ వాద్రా ప్రోత్సాహంతో, ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్నాడు. అలాగే తాత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఫోటోగ్రఫీపై అభిరుచిని కలిగి ఉండేవారు.అవివా బేగ్ ఎవరు?ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మోడరన్ స్కూల్లో తన ప్రారంభ విద్యను, OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుండి మీడియా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీని పొందారు. అంతేకాదు ఆమె జాతీయ స్థాయి మాజీ ఫుట్బాల్ క్రీడాకారిణి. అలాగే ఫోటోగ్రాఫర్ కూడా. 'యు కాంట్ మిస్ దిస్' (ఇండియా ఆర్ట్ ఫెయిర్, 2023), 'ది ఇల్యూసరీ వరల్డ్' (2019) వంటి అనేక విజయవంతమైన ప్రదర్శనలలో తన కళను ప్రదర్శించారు.ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం -
ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో మాకు తెలుసు: డీజీపీ శివధర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులు ఎంతో సేవాభావంతో పని చేస్తున్నారని.. ప్రాణాలకు తెగించి శాంతిభద్రతలను రక్షిస్తున్నారని రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. 2025 ఏడాదికిగానూ పోలీసుల పనితీరుపై నివేదికను మంగళవారం వార్షిక పాత్రికేయ సమావేశంలో ఆయన వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో శాంతి భధ్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. తెలంగాణ పోలీసులు ఎంతో సేవాభావంతో పని చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి శాంతి భద్రతలను రక్షిస్తున్నారు. 2025లో తెలంగాణలో 782 హత్యలు జరిగాయి. క్రైమ్ రేట్ 2.33 శాతం తగ్గింది. ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వర్షాలు.. వరదల సమయంలో సహాయక బృందాలతో సమన్వయంగా పోలీసులు పని చేశారు.తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జాతీయ, అంతర్జాతీయ సభలను అడ్డంకులు లేకుండా జరుపుకున్నాం. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ పర్యటన కూడా విజయవంతమైంది. తెలంగాణ స్టేట్ టాప్ పోలీసింగ్గా ఉంది. తెలంగాణ టూరిస్ట్ పోలీస్ పెట్టాం. అందులో 80 మంది సిబ్బంది ఉన్నారు. ఫీడ్ బ్యాక్ కోసం ప్రతీ పీఎస్లో క్యూఆర్ కోడ్ పెట్టాం’’ అని వివరించారాయన. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు ఐబొమ్మ రవి కేసుపైనా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో మాకు తెలుసు’’ అని అన్నారాయన.క్రైమ్ ట్రెండ్.. గత 5 సంవత్సరాల (జనవరి నుండి నవంబర్ వరకు) నేరాల తులనాత్మక నివేదిక👇 -
బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్బీఎఫ్సీల నుంచి సవాళ్లు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం అత్యంత బలంగా, స్థిరంగా ఉంది. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకులు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎప్సీ) నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన ‘ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2024-25’ నివేదిక ఆధారంగా, బ్యాంకులు మెరుగైన లాభాలను సాధిస్తున్నప్పటికీ డిజిటలైజేషన్, కొత్త రకపు రిస్కుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.ఆర్థిక వనరుల సమీకరణలో సమతుల్యత2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వాణిజ్య రంగానికి అందిన మొత్తం నిధులు రూ.35.1 లక్షల కోట్లు. ఇందులో బ్యాంకుల వాటా (రూ.18 లక్షల కోట్లు), బ్యాంకింగేతర వనరుల వాటా (రూ. 17.1 లక్షల కోట్లు) దాదాపు సమానంగా ఉన్నాయి. అందుకు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడం, అధికంగా జరుగుతున్న ఈక్విటీ ఇష్యూలు, కార్పొరేట్ బాండ్లు, విదేశీ రుణాల లభ్యత.. వంటి అంశాలు కలిసొచ్చాయి.గత కొన్ని ఏళ్లుగా చేపట్టిన సంస్కరణల వల్ల షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. బ్యాంకుల గ్రాస్ ఎన్పీఏ (స్థూల నిరర్థక ఆస్తులు) నిష్పత్తి గత దశాబ్ద కాలంలోనే కనిష్ఠ స్థాయికి, అంటే 2.2 శాతానికి పడిపోయింది. సెప్టెంబర్ 2025 నాటికి ఇది ఇంకా తగ్గి 2.1 శాతానికి చేరుకోవడం విశేషం. బ్యాంకుల వద్ద తగినంత మూలధనం ఉంది. సెప్టెంబర్ 2025 నాటికి బ్యాంకుల CRAR(ఒక బ్యాంక్ తన వద్ద ఉన్న రిస్కులకు తగినంత మూలధనాన్ని కలిగి ఉందో లేదో కొలిచే కొలమానం ఇది) 17.2 శాతంగా ఉంది. ఇది నియంత్రణ సంస్థలు సూచించిన 11.5 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2024-25లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు 11.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.ఎన్బీఎఫ్సీల హవాదేశంలోని మొత్తం బ్యాంక్ క్రెడిట్లో ఎన్బీఎఫ్సీల వాటా 25 శాతానికి చేరింది. బ్యాంకింగ్ సర్వీసులు అందించలేని మారుమూల ప్రాంతాలకు, చిన్న తరహా పరిశ్రమలకు నిధులు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి స్థూల నిర్ధరక ఆస్తులు మార్చి 2025 నాటికి 2.9 శాతానికి చేరింది. ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐలు (Microfinance) కూడా 24.9 శాతం క్యాపిటల్ బఫర్తో బలంగా ఉన్నాయి.కొత్త సవాళ్లుబ్యాంకింగ్ రంగం ఎంత వేగంగా డిజిటలైజ్ అవుతుందో అంతే వేగంగా కొత్త రిస్కులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఆన్లైన్ మోసాలు, డేటా ఉల్లంఘనలు బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. సాంకేతిక మార్పులను త్వరగా అందిపుచ్చుకోకపోతే బ్యాంకులు తమ వినియోగదారులను కోల్పోయే ప్రమాదం ఉంది.ఆర్బీఐ సూచనలుభారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఆర్బీఐ కొన్ని కీలక సూచనలు చేసింది. ‘బ్యాంకులు తమ రిస్క్ అసెస్మెంట్ను మరింత పటిష్టం చేసుకోవాలి. పారదర్శకమైన పాలన, బాధ్యతాయుతమైన సాంకేతికతను వాడాలి. పెరిగిపోతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. ఎన్బీఎఫ్సీలు కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా తమ నిధుల మూలాలను వైవిధ్య పరచాలి’ అని ఆర్బీఐ తెలిపింది.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం -
'బవుమా' ది గ్రేట్.. తిరుగులేని శక్తిగా సౌతాఫ్రికా
2025..టెస్టు క్రికెట్లో మరుపురాని ఏడాదిగా మిగిలిపోనుంది. సౌతాఫ్రికా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ గెలవడం నుంచి.. ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ విజయం వరకు ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడంతో పాటు టీమిండియాను వారి సొంత గడ్డపైనే 2-0తో వైట్వాష్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. టెంబా బావుమా నాయకత్వంలో సౌతాఫ్రికా జట్టు తిరుగులేని జట్టుగా అవతరించింది.27 ఏళ్ల నిరీక్షణకు తెర..వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్ 2023-25లో సౌతాఫ్రికా వరుస సిరీస్ విజయాలతో ఫైనల్కు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టు ఉండడంతో సఫారీలకు ఓటమి తప్పదని భావించారు. కానీ టెంబా బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా అందరి అంచనాలను తారుమారు చేసింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుదిపోరులో కంగారులను చిత్తు చేసిన సౌతాఫ్రికా జట్టు.. తాము చోకర్స్ కాదు టైగర్స్ అని నిరూపించుకుంది. ఈ విజయంతో తమ 27 ఏళ్ల నిరీక్షణకు సఫారీలు తెరదించారు. 1996 తర్వాత సౌతాఫ్రికా ఐసీసీ టైటిల్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఐడెన్ మార్క్రామ్ (136) వీరోచిత శతకంతో జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.టీమిండియాకు ఘోర పరాభవం..అనంతరం ఈ ఏడాది నవంబర్లో భారత పర్యటనకు వచ్చిన సఫారీలు సరికొత్త చరిత్ర సృష్టించారు. టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఉపఖండంలో తిరుగులేని జట్టుగా ఉన్న భారత్కు ప్రోటీస్ ఊహించని షాకిచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పోరాడి 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్.. గౌహతి టెస్టులో అయితే ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో ఘోర పరాభావన్ని మూట కట్టకుంది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. సౌతాఫ్రికా జట్టులో కెప్టెన్ బవుమాతో పాటు మార్కో జాన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.బవుమా ది గ్రేట్..సౌతాఫ్రికా జైత్ర యాత్ర వెనక కెప్టెన్ బవుమాది కీలక పాత్ర. బవుమా తన అద్భుత కెప్టెన్సీతో దశాబ్దాలుగా వెంటాడుతున్న 'చోకర్స్' ముద్రను చెరిపేస్తూ.. ప్రపంచ క్రికెట్కు సౌతాఫ్రికా సత్తా చూపించాడు. 2022లో సౌతాఫ్రికా టెస్టు జట్టు బాధ్యతలు చేపట్టిన బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. టెంబా బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా 12 టెస్టు మ్యాచ్లు ఆడింది. అందులో 11విజయాలు, ఒక్క డ్రా ఉంది. అదేవిధంగా ఈ ఏడాదిలో 8 టెస్టులు ఆడిన సౌతాఫ్రికా ఆరింట విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రా కాగా.. మరో మ్యాచ్లో ప్రోటీస్ ఓటమి పాలైంది. అయితే ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్గా మార్క్రమ్ వ్యవహరించాడు.బెస్ట్ టీమ్ కెప్టెన్గా..అందుకే బవుమాకి క్రికెట్ ఆస్ట్రేలియా అరుదైన గౌరవమిచ్చింది. ఈ ఏడాది ముగింపు సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ 'బెస్ట్ టెస్ట్ ప్లెయింగ్ ఎలెవన్' ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా బవుమాను సీఎ ఎంపిక చేసింది. తమ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ను కాకుండా బవుమాను ఎంపిక చేయడం గమనార్హం. అదేవిధంగా ఈ జట్టులో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్, బెన్ స్టోక్స్.. సౌతాఫ్రికా నుంచి బవుమాతో పాటు సైమన్ హర్మర్కు చోటు దక్కింది. ఆసీస్ నుంచి అలెక్స్ కారీ, స్కాట్ బోలాండ్ను ఎంపిక చేశారు.క్రికెట్ ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: కెఎల్ రాహుల్, ట్రావిస్ హెడ్, జో రూట్, శుభ్మాన్ గిల్, టెంబా బావుమా (కెప్టెన్), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, జస్ప్రీత్ బుమ్రా, స్కాట్ బోలాండ్, సైమన్ హార్మర్, రవీంద్ర జడేజా (12వ ఆటగాడు) -
జెన్-జీ ట్రెండ్.. అప్పు చేసి దేశాటన!
అప్పు చేయడమంటే పరువు పోగొట్టుకోవడం అని ఒకప్పుడు అనుకునేవారు. అప్పు చేసి పప్పు కూడు తినకూడదన్న సామెతలు కూడా ఇలాగే పుట్టుకొచ్చాయి. కానీ కాలం మారింది. తరాలు మారిపోయాయి. అందుకు తగ్గట్టే విలువలూ వేరయ్యాయి. 2025నే ఉదాహరణగా తీసుకుందాం. ఈతరం వాళ్లు... అదేనండి జెన్-జీకి అప్పు చేయడంలో ఆరితేరిపోయారు. చిన్న వయసులోనే మంచి ఆదాయం వస్తూండటం కారణం కావచ్చు... లేదా అప్పు చేయడం చాలా సులువై ఉండవచ్చునేమో కానీ.. జెన్-జీ బోలెడన్ని అప్పులు చేస్తోందన్నది వాస్తవం. అత్యవసరాల కోసమా? ఊహూ కానే కాదు... ఈ ఏడాది జెన్-జీ చేసిన అప్పుల్లో అత్యధికం విహారయాత్రలకట!అవునండి.. నిజం. దేశ ఆర్థిక వ్యవహారాల చరిత్రల్లో మొట్టమొదటి సారి విహార యాత్రల కోసం అప్పులు చేయడం ఇదే మొదటిసారి. అది కూడా పర్సనల్ లోన్స్! రెండో అతిపెద్ద కారణం స్టేటస్ను మెయిన్టెయిన్ చేయడం గమనార్హం. వైద్యపరీక్షలు నిర్వహించే సంస్థ హెల్తియన్స్ నిర్వహించిన సర్వే ప్రకారం... పాత తరం మాదిరిగా ఆస్తులు కొనుక్కునేందుకో లేక అత్యవసరాల కోసమో జెన్-జీ అప్పులు చేయడం లేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లేదంటే పోస్టులు పెట్టేందుకు అనువైన ప్రదేశాలకు వెళ్లేందుకు చేస్తున్నాయి. అవి విదేశాలైనా సరే అస్సలు తగ్గడం లేదు. ఇవి కాదంటే సంగీత కచేరీలకు ఖర్చు పెడుతున్నారు. ఈ ఏడాది పర్సనల్ లోన్స్ తీసుకున్న జెన్-జీ వారిలో 27 శాతం మంది ఈ కారణాలు చెప్పినట్లు హెల్తియన్స్ సర్వే ద్వారా తెలిసింది. అప్పు చేసేందుకు రెండో కారణం. లైఫ్స్టైల్. బ్రాండెడ్ దుస్తులు, స్నీకర్స్ కొనడం, కాస్ట్లీ రెస్టారెంట్లలో విందులు ఉంటున్నాయి. మోడర్న్ లైఫ్స్టయిల్ పేరుతో జెన్-జీ పర్సనల్ లోన్స్ తీసుకునేందుకు చూపుతున్న మూడో కారణం ‘టెక్-గాడ్జెట్స్’. ల్యాప్టాప్లు వేరబుల్స్, గాగుల్స్, పర్ఫ్యూమ్స్ వంటివి ఈ కోవకు చెందుతాయి. డిజిటల్ లోన్స్ క్షణాల్లో మంజూరవుతూండటం వీరికి కలిసివస్తోంది. ఆదాయంలో ఎంతో కొంత దాచుకుని అవసరాల కోసం లేదంటే బంధుమిత్రుల పెళ్లిల్లు, శుభకార్యాలకు వినియోగించడం మునుపటి తరం పద్ధతైతే... జెన్-జీ వీటి కోసం పొదుపు కంటే పర్సనల్ లోన్స్కే ప్రాధాన్యమిస్తోంది.అప్పు కోసం రుణం..ఈ తరం యువకుల్లో కనిపిస్తున్న ఇంకో పెద్ద ధోరణి అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయడం. అదేనండి.. క్రెడిట్కార్డు బ్యాలెన్స్ను చెల్లించేందుకు పర్సనల్ లోన్స్ చేస్తున్నట్టు ఈ సర్వే ద్వారా తెలిసింది. దురదృష్టవశాత్తూ ఇన్స్టంట్ లోన్స్ వంటివి యువతను శాశ్వతంగా రుణబంధంలో ఉండిపోయేందుకు కారణాలవుతున్నాయి. బ్యాంకుల ద్వారా పొందే రుణాల కంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అప్పులపై వడ్డీలు చాలా ఎక్కువ కావడం గమనార్హం. జెన్-జీలో చాలా తక్కువమందికి ఆర్థిక వ్యవహారాల విషయంలో అవగాహన ఉండటం కూడా వారు పర్సనల్ లోన్స్ తీసుకునేందుకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఏతావాతా.. వినియోగమే ప్రధానంగా అప్పులు చేయడమన్న ట్రెండ్ మొదలైందన్నమాట. పొదుపునకు ఎగనామం పెట్టేస్తున్నారని అనుకోవాలి. -
తమన్నా చిందులు గోవాలో...సన్నీలియోన్ సయ్యాట హైదరాబాద్లో...
గుడ్బై 2025 అంటూ వీడ్కోలు పలకడం, వెల్క్మ్ 2026 అంటూ స్వాగతం చెప్పడం.. కోసం ప్రపంచం సకల సన్నాహాలతో సిద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకలలో టాక్ ఆఫ్ ద ఈవెంట్స్గా నిలిచే ముఖ్యమైన అంశం సెలబ్రిటీల ప్రదర్శన. అదే క్రమంలో భారతీయ సినీ సెలబ్రిటీలు పలువురు రానున్న నూతన సంవత్సర వేడుకలలో ప్రదర్శన ఇస్తున్నారు. అందులో ఇప్పటివరకూ నిర్ణయమైన వాటిలో చెప్పుకోదగ్గ ఈవెంట్ గోవాలో జరుగుతోంది. మన మిల్క్ బ్యూటీ, తాజా ఐటమ్ నంబర్ల క్వీన్గా పేరొందిన తమన్నా అందులో పాల్గొంటోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం తమన్నా గోవాలోని బీచ్ ఫ్రంట్ హోటల్కు చేరుకుంది. అదే విధంగా బాలీవుడ్ నటి, రొమాంటిక్ చిత్రాల బ్యూటీ సన్నీ లియోన్ తెలంగాణ రాజధాని నగరంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటోంది. ఈ నూతన సంవత్సర వేడుకల్లో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల సైతం ఆమెకు జత కలవనున్నాడు. అదే విధంగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ గోవా, లక్నో... ఇతర ప్రధాన నగరాల్లో జరిగే కార్యక్రమాలలో సినిమా ప్రముఖులు పాల్గొంటున్నారు.–గోవాలో బాలీవుడ్ నైట్ క్లబ్గా పేర్కొనే లాస్ ఒలాస్లో నటి తమన్నా, మరో నటి సోనమ్ బజ్వాలతో పాటు మ్యుజిషియన్ మిళింద్ గాబాలు పాల్గొంటున్నారు.–ప్రముఖ నేపధ్యగాయని సునీత కూడా హైదరాబాద్లో నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకల్లో గళం కలుపుతున్నారు.–ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్... విజయవాడలో జరుగుతున్న ఈవెంట్లో సందడి చేయనున్నాడు.–ఢిల్లీలో ది లీలా యాంబియెన్స్ కన్వెన్షన్ హోటల్ జరిగే ‘డాజిల్ ఫ్రమ్ ది –ఈస్ట్‘ కార్యక్రమంలో పంజాబీ గాయకుడు, నటుడు జాస్సీ గిల్ – బబ్బల్ రాయ్ జంట ప్రత్యక్ష ప్రదర్శనలను అందిస్తుంది.–హిందీ గాయని సప్నా చౌదరి – రేణుకా పన్వర్ లు ఢిల్లీలోని షాహ్దారాలో జరిగే ‘ఎపిక్ నైట్ అవుట్‘ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తోంది.–ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ హైదరబాద్కి వస్తున్నాడు. నగరంలో జరుగుతున్న ఓ నూతన సంవత్సర వేడుకకు హాజరవుతున్నాడు.–బాలీవుడ్ గాయని, నటి సునంద శర్మ: ఢిల్లీలోని లే మెరిడియన్ గుర్గావ్లో నిర్వహిస్తున్న విలాసవంతమైన నూతన సంవత్సర వేడుకలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనుంది.––న్యూజిలాండ్కు చెందిన బాలీవుడ్ గాయని షిర్లీ సెటియా ‘బిగ్ బ్యాంగ్ బెంగళూరు‘ కార్యక్రమంలో ఆటపాటలతో అలరించనుంది.–మాజీ బాలీవుడ్ నటి ర్యాప్ గాయని ఉదితా గోస్వామి బెంగళూరులోని స్టార్ హోటల్ హై అల్ట్రా లాంజ్లో జరిగే న్యూ ఇయర్ పార్టీలో పాల్గొంటోంది. -
స్టార్ దర్శకుడితో 'కమల్ హాసన్' సినిమా.. జరిగేపనేనా..?
సినిమా రంగంలో ఏదైనా జరగవచ్చు. ఎవరు ఎవరినైనా దర్శకత్వం వహించవచ్చు. అయితే కథే ఇక్కడ ప్రధానాంశం. అది సరిగా సెట్ కాకపోవడంతోనే రజనీకాంత్ హీరోగా సుందర్.సి దర్శకత్వం వహించాల్సిన చిత్రం తెర రూపం దాల్చలేదు. తాజాగా ఒక రేర్ కాంబో గురించి వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే కమలహాసన్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో చిత్రం రూపొందే విషయమై చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. కమలహాసన్ ఏ తరహా చిత్రాన్నైనా చేయగలరు. అయితే వెట్రిమారన్కు ఒక ముద్ర ఉంది. ఆయన చిత్రాల కథలు వెనుకబడ్డ వర్గాల ఇతి వృత్తం, నేరారోపణలకు బలైన యువత ఇతి వృత్తంతో ఉంటాయి. తాజాగా ఈయన శింబు హీరోగా అరసన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉత్తర చెన్నైకి చెందిన గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను తన వి.క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు. అదే విధంగా నటుడు కమలహాసన్ తాజాగా స్టంట్మాస్టర్ల ద్వయం అన్బరివ్ల దర్శతకత్వంలో నటిస్తూ, తన రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషన్ పతాకంపై నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతోగానీ, ఇదే గనుక జరిగితే కచ్చితంగా వైవిద్యభరిత కథా చిత్రం అవుతుంది. -
ఏడాది చివరిలో ఘోరం.. ఏడుగురు మృతి
అల్మోరా: ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భికియాసైన్ నుండి రామ్నగర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి, వినాయక్ ప్రాంతంలోని ఒక లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 17 నుండి 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు తెల్లవారుజామున సుమారు 6 గంటలకు ద్వారహత్ నుండి బయలుదేరింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో శైలాపాని సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వందల అడుగుల లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ప్రమాద వార్త తెలియగానే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలో పడిపోయిన క్షతగాత్రులను వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గాయపడిన వారిని వెంటనే భికియాసైన్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా యంత్రాంగం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కూడా చదవండి: Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి -
ఐబొమ్మ రవి కేసులో కొత్త మలుపులు
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక విషయాలు గుర్తిస్తున్నారు. ప్రహ్లాద్తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురూ గతంలో ఇతడికి స్నేహితులే కావడం గమనార్హం. వెల్లెల ప్రహ్లాద్ కుమార్తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు, వివరాలు వాడి తన ఫొటోతో వీటిని పొందాడు. వీటిని ఉపయోగించి తన ఫొటోతో కొన్ని గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేసి తీసుకోగా.. మరికొన్ని తయారు చేశారు.గతంలో రవి అమీర్పేట్లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ 2017లో అమీర్పేటలోని హాస్టల్ రూమ్లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. కరీంనగర్కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్.ఇన్, సప్లయర్స్.ఇన్ తదితర వెబ్సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు. పోలీసు కస్టడీ ముగియడంతో రవిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. చదవండి: ఐబొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఉన్నాయా? -
ఉన్నావ్ కేసు.. సెంగార్ కూతురి ఎమోషనల్ పోస్టు
ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారం తిరగకుండానే అతని బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. సెంగార్ కుమార్తె ఇషితా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిందిఇంతకాలం తమను శక్తివంతులమని విమర్శిస్తున్నవాళ్లు.. ఇప్పుడేం అంటారు అని ఓ ప్రశ్న సంధించారామె. ‘‘అధికారంలో ఉన్నవాళ్లమని.. పవర్ఫుల్ వ్యక్తులమంటూ ఇంతకాలం మమ్మల్ని నిందిస్తూ వచ్చారు. కానీ ఆ అధికారమే ఉంటే.. ఈ ఎనిమిదేళ్లుగా మాకు మాట్లాడే అవకాశం ఎందుకు దొరకలేదు?. పైగా అవమానాలు.. బెదిరింపులు.. ఆన్లైన్లో దాడులు ఎందుకు ఎదుర్కొంటున్నాం’’ అంటూ డాక్టర్ ఇషితా సెంగార్ భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారు. నేను నోరు విప్పకుండానే.. నాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనే లేబుల్ పడిపోయింది. నాకు, నా కుటుంబానికి మానవత్వమే లేదని తిట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొందరు పోస్టులు చేశారు. నన్ను, నా సోదరిని అత్యాచారం చేయాలి.. చంపాలి అంటూ కామెంట్లు చేశారు. మా గౌరవాన్ని ఒక్కొక్కటిగా లాక్కొన్నారు. మమ్మల్ని అవమానించారు.. ఎగతాళి చేశారు. ఇది అన్యాయం అని నేను అనను. ఎందుకంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ భయాన్ని సృష్టించారు కాబట్టి. ఎనిమిదేళ్లుగా.. ఇది ప్రతీరోజూ జరుగుతోంది.కోర్టులో మా వాదనలకు అవకాశం లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థతో పాటు జర్నలిజం.. ఆఖరికి మా గురించి తెలిసిన జనాలు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతలా ఒత్తిళ్లు నెలకొంటున్నాయి. నాకు ఇంకెక్కడా చోటు కనిపించలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా. ఇంతకాలం భయంతో పరుగులు తీశాం. ఒక కార్యాలయం నుండి మరొకదానికి లేఖలు రాస్తూ, కాల్స్ చేస్తూ.. అలసిపోయి ఉన్నాం. అయినా ఆశను వదులుకోవడం లేదు.నా ఈ ప్రయత్నం.. ఎవరినో బెదిరించడానికో, సానుభూతి పొందడానికో కాదు. నేనూ ఈ దేశపు బిడ్డనే. మేం మనుషులమే. మేమూ న్యాయ్యాన్ని కోరుకుంటున్నాం. ఆ న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఓ కుమార్తె.. అంటూ పోస్ట్ చేశారామె. ToThe Hon’ble Authorities of the Republic of India,I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.For eight years, my family and I have waited. Quietly.…— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025సెంగార్ మరో కూతురు ఐశ్వర్య కూడా గతంలో ఇదే తరహా ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ బాధితురాలి క్యారెక్టర్ మంచిది కాదని.. తమ తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జరిగిన కుట్రలో ఆమె భాగమైందని.. అందుకే అత్యాచార ఆరోపణలు చేసిందని.. తమ తండ్రి అమాయకుడని.. మీడియాగోల తప్ప అసలు విచారణ జరగడం లేదని ఇద్దరు కూతుళ్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 2017లో యూపీ ఉన్నావ్కు చెందిన 17 ఏళ్ల బాధితురాలిపై అప్పటి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశారని.. ఆపై తన అనుచరులతో గ్యాంగ్ రేప్ చేయించారని.. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల విచారణ సమయంలో తన మనుషులతో సెంగార్ తన తండ్రిని చంపించాడని.. తనపైనా హత్యాయత్నం జరిగిందని.. ఆ దాడి నుంచి తాను తప్పించుకుంటే బంధువులిద్దరు మృతి చెందారని బాధితురాలు ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు.. విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ చివర్లో.. సెంగార్ను ఈ కేసుల్లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ సమయంలో సెంగార్ కుటుంబం కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. అదే ఏడాది ఆయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది కూడా. అయితే ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే సెంగార్ మరో కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తుండడంతో వెంటనే రిలీజ్ కాలేదు. ఈలోపు.. బాధితురాలు, సీబీఐలు సుప్రీం కోర్టులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సోమవారం(డిసెంబర్ 29) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేసింది. -
‘టీ20లలో బెస్ట్.. అతడిని వన్డేల్లోనూ ఆడించాలి’
టీమిండియా టీ20 స్టార్ అభిషేక్ శర్మ 2025లో అదరగొట్టాడు. ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత్ తరఫున ఈ సంవత్సరంలో 21 టీ20 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ.. 193కు పైగా స్ట్రైక్రేటుతో 859 పరుగులు స్కోరు చేశాడు.అశూ ప్రశంసలుతద్వారా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న అభిషేక్ శర్మ (Abhishek Sharma).. టీమిండియా టాప్ రన్స్కోరర్గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ విధ్వంసకర ఓపెనర్పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అభిషేక్ను.. ‘మెన్స్ టీమ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా అభివర్ణించాడు.వన్డేలలోనూ ఆడించాలిఅదే విధంగా.. వన్డేల్లోనూ అభిషేక్ శర్మను ఆడిస్తే బాగుంటుందని అశూ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ‘అశ్ కీ బాత్’లో మాట్లాడుతూ.. ‘‘ఇది అభిషేక్ శర్మ ఆగమనం మాత్రమే కాదు. టీమిండియా నవతరంలోని ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఆగమనం ఇది. 2025లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడు అతడే.ముఖ్యంగా పవర్ ప్లేలో అతడి బ్యాటింగ్ అద్భుతం. వన్డేల్లోనూ అతడి ఆటను చూడాలని ఉంది. ఈ ఏడాది పురుషుల క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్ అతడే’’ అని అభిషేక్ శర్మను అశూ కొనియాడాడు. కాగా ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున సత్తా చాటిన అభిషేక్ శర్మ.. 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 1115 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. తదుపరి టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సత్తా చాటేందుకు అభిషేక్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
డిజిటల్ హోరులో 'ప్రింట్' జోరు.. యూపీ ముందడుగు
వార్తాపత్రిక అనేది అక్షర రూపంలో ఉన్న ఒక విజ్ఞాన గని. ఇది మనకు ప్రపంచంతో అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా, మన ఆలోచనలకు పదును పెడుతుంది. నిత్యం వార్తాపత్రికలు చదవడం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. పదకోశం పెరుగుతుంది. సమకాలీన అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న ఉత్తరప్రదేశ్ సర్కారు పాఠశాల విద్యలో పత్రికా పఠనాన్ని తప్పనిసరి చేసింది. ఇది దేశవ్యాప్తంగా విద్యావేత్తల మధ్య చర్చకు దారితీసింది. ఇదే సమయంలో ప్రస్తుతం దేశంలో వార్తా పత్రికల పరిస్థితి ఏమిటనే దానిని తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటికి సమాధానమివ్వడమే ఈ ‘కథనం’లోని ప్రయత్నం.యూపీ సర్కారు ముందడుగువిద్యార్థులలో సమకాలీన అంశాలపై అవగాహన పెంచడానికి, వారి భాషా నైపుణ్యాలను మెరుగుపరచడానికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘వార్తాపత్రిక పఠనాన్ని’ తప్పనిసరి చేస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రపంచం నలుమూలల జరుగుతున్న పరిణామాలను విద్యార్థులందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత కొంతకాలంగా డిజిటల్ విప్లవం కారణంగా విద్యార్థులు సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్లకు అధికంగా అలవాటు పడుతున్నారు. దీనివల్ల అవసరమైన సమాచారంపై అవగాహన తగ్గడమే కాకుండా, పఠనాశక్తి కూడా క్షీణిస్తోంది. ఈ ధోరణిని గమనించిన ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ, విద్యార్థులను తిరిగి పుస్తకాలు, వార్తాపత్రికల వైపు మళ్లించాలని నిర్ణయించింది.నోటీసు బోర్డులపై ‘ప్రధానాంశాలు’యూపీ అంతటా అమలుకానున్న ఈ నూతన విధానంలో రాష్ట్రంలోని ప్రతి పాఠశాల కనీసం రెండు హిందీ, ఒక ఆంగ్ల దినపత్రికను అందుబాటులో ఉంచాలి. ప్రతిరోజూ ఉదయం ప్రార్థన సమయం తర్వాత లేదా లైబ్రరీ పీరియడ్లో కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు విద్యార్థులచే ఉపాధ్యాయులు వార్తలు చదివించాలి. ముఖ్యంగా ఎడిటోరియల్ కాలమ్స్, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం, జాతీయ అంశాల పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాఠశాలల్లోని నోటీసు బోర్డులపై రోజువారీ ముఖ్య వార్తలను ప్రదర్శించడం కూడా ఈ ప్రణాళికలో ఒక భాగం. కాగా యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యావేత్తల నుండి సానుకూల స్పందన వస్తోంది. విద్యార్థుల్లో జనరల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో ఇది పునాదిగా మారుతుందని వారు అంటున్నారు.భారత్లో అద్భుతమైన వృద్ధిప్రపంచవ్యాప్తంగా ప్రింట్ మీడియా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత వార్తాపత్రికా పరిశ్రమ 2025లో అద్భుతమైన వృద్ధిని చవిచూసింది. పాశ్చాత్య దేశాలలో వార్తాపత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నా, భారత్ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రింట్ మార్కెట్గా అవతరించింది. 1.4 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ప్రచురణలు, రోజువారీ 39 కోట్ల సర్క్యులేషన్తో ఈ రంగం వెలుగొందుతోంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) నివేదికల ప్రకారం, 2025 ప్రథమార్ధంలో వార్తాపత్రికల అమ్మకాలు 2.77% వృద్ధిని సాధించి, ప్రతిరోజూ 30 మిలియన్ల కాపీల మార్కును చేరుకోవడం గమనార్హం.న్యూస్ప్రింట్ ధరలలో అస్థిరత ఈ వృద్ధికి ప్రధానంగా ప్రాంతీయ భాషా పత్రికలు, ముఖ్యంగా హిందీ దినపత్రికలు వెన్నెముకగా నిలుస్తున్నాయి. మొత్తం సర్క్యులేషన్లో 51శాతం వాటాను హిందీ పత్రికలే దక్కించుకోగా, ప్రాంతీయ భాషలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక కోణంలో చూస్తే భారతీయ పత్రికలు నేటికీ ప్రకటనల ఆదాయంపైనే (60-70%) ఎక్కువగా ఆధారపడుతున్నాయి. పాఠకులకు వార్తాపత్రికను అందుబాటులో ఉంచేందుకు ధరను తక్కువగా ఉంచడం వల్ల, ఆయా సంస్థలకు ప్రకటనలే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. 2024లో ఎన్నికలు, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాల వృద్ధి కారణంగా వార్తా పత్రికలకు ప్రకటన గణనీయంగా పెరిగాయి. అయితే రష్యా, కెనడా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకునే న్యూస్ప్రింట్ ధరలలో అస్థిరత నిర్వహణ వ్యయాన్ని పెంచుతూ ప్రచురణకర్తలకు సవాలుగా మారుతున్నది.విశ్వసనీయత కోసం ముద్రిత పత్రికలుసాంకేతికత పరంగా చూస్తే 2025లో ‘డిజిటల్-ఫస్ట్’ హైబ్రిడ్ మోడల్ వైపు పరిశ్రమ వేగంగా అడుగులు వేస్తోంది. కాగా ఆన్లైన్ తప్పుడు సమాచారంపై విసిగిపోయిన పాఠకులు, విశ్వసనీయత కోసం తిరిగి ముద్రిత పత్రికలను ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో యువతను ఆకట్టుకోవడానికి పలు పత్రికా సంస్థలు తమ ఈ-పేపర్లు, మొబైల్ యాప్లను బలోపేతం చేస్తున్నాయి. 68 శాతం మంది ఇంటర్నెట్ యూజర్స్ ఆన్లైన్ వార్తలను యాక్సెస్ చేస్తున్నందున.. ప్రీమియం కంటెంట్ ద్వారా డిజిటల్ ఆదాయాన్ని పెంచుకోవడంపై అన్ని వార్తా పత్రికలు దృష్టి సారించాయి.ఇది కూడా చదవండి: Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత -
సౌత్ సినిమాలను వణికిస్తున్న 'ధురంధర్'.. ఎడమ కాలితో తన్నేశాడు: ఆర్జీవీ
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ధురంధర్.. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1100 కోట్ల మార్క్ను దాటేసింది. ఆపై 2025లో భారత్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా చాలాచోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ మూవీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్పై సౌత్ సినిమాల ఆధిపత్యానికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చిందని వర్మ అన్నారు. 2026 మార్చిలో రాబోయే 'ధురంధర్ 2' దక్షిణాదిని వణికించేలా ఉందని వర్మ అన్నాడు.దర్శకుడు ఆర్జీవీ తాజాగా ధురంధర్ సినిమా క్రేజ్ గురించి మరోసారి కామెంట్ చేశారు. వచ్చే ఏడాది రానున్న ధురంధర్ 2 దక్షిణాది సినిమాను భయపెడుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు బాలీవుడ్లో పుష్ప, కల్కి, కేజీఎఫ్, కాంతార వంటి దక్షిణాది చిత్రాల ప్రభావాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.దక్షిణాదిలో ధురంధర్ ప్రభావం ఎలా ఉందో వర్మ ఇలా అన్నారు. 'బాలీవుడ్ మీదకు సడెన్గా దూసుకొచ్చిన సౌత్ సినిమాల ఫైర్ను ధురంధర్ మూవీతో దర్శకుడు ఆదిత్య ధర్ తన ఎడమ కాలితో వెనక్కి తన్నాడు. ఇప్పుడు తన కుడి కాలుతో 'ధురంధర్ 2' ని రెడీ చేస్తున్నాడు. పార్ట్-2 గురించి నాకు తెలిసినంతవరకు మరింత పవర్ఫుల్గా ఉండనుంది. పార్ట్-1 మిమ్మల్ని భయపెట్టి ఉంటే.., పార్ట్-2 మిమ్మల్ని వణికించేస్తుంది.' అని వర్మ ట్వీట్ చేశాడు.‘ధురంధర్ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2026 మార్చి 19న సీక్వెల్ విడుదల కానుంది. హిందీతో పాటు, దక్షిణాది అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల కానుంది. ప్రస్తుతం సీక్వెల్కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. -
ఎకో ఫ్రెండ్లీ వాటర్ ఏటీఎం..! బాధ్యతయుతమైన పర్యాటకానికి కేరాఫ్గా..
తమిళనాడులోని నీలగిరి కొండలలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఊటీ. దీనిని "భారతదేశపు స్విట్జర్లాండ్" అని కూడా పిలుస్తారు, ఇది వేసవికాలంలో గొప్ప విడిది స్థలం. ఊటీ ఎల్లప్పుడూ హృదయానికి హాయిగా అనిపించే హిల్స్టేషన్లలో ఒకటి. ఈ ముగ్ధ మనోహరమైన పట్టణాన్ని చూసేందుకు పలు కుటుంబాలు, జంటలు, ఒంటరి పర్యాటకులు, ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవారు ఇక్కడి ఎత్తైన కొండలను అన్వేషించేందకు వాలిపోతుంటారు. ఓ పక్క అందమైన మేఘాల కదలికలు..మరోవైపు వేడి టీ ఆస్వాదిస్తూ..పైన్ అడువుల గుండా నిశబ్దంగా వెళ్తుంటే..మిమ్మల్ని వేగాన్ని తగ్గించి ప్రతి క్షణం ఆస్వాదించేలా అనుభూతి చెందేలా చేస్తుంది అక్కడి ప్రకృతి కమనీయ దృశ్యాలు. ప్రస్తుతం ఇది అందానికే కాదు, బాధ్యతాయుతమైన పర్యాటకాలో మేటి అనిపించికుంటోంది ఊటీ. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొన్ని రోజుల క్రితం ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ బార్గవి సిలాపర్శెట్టి ఊటీ ట్రిప్కి సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించడంతో చాలామంది ప్రయణికులు ఆ మిషన్ల వద్ద వాటర్ని నింపుకుని తెచ్చుకోవడం ఆసక్తిని రేకెత్తించడంతో ఆ విషయాన్ని బార్గవి ఇలా వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా సందర్శకులు హైడ్రేటెడ్గా ఉండటానికి సహాయపడే నీటి ATMలను పట్టణంలో ఏర్పాటు చేశారు. అక్కడ భార్గవి నీటి ఏటీఎం కియోస్క్కు చేరుకుని అక్కడ లోపల ఉన్న ఒక మహిళకు ఆ బాటిల్ని అందజేయగానే ఆమె వేడి నీటిని నింపి తిరిగి భార్గవికి అందజేస్తుంది. ధర ఎంత అనడగగానే కేవలం రూ. 10 అని చెబుతుండటం కనిపిస్తుంది వీడియోలో. ఈ వీడియోని చూసిన నెటిజన్లంతా ప్రతి పర్యాటక ప్రదేశంలోనూ దీన్ని అమలు చేయాలని కొందరూ, దేశవ్యాప్తంగా ఒకే ప్రామాణిక పద్ధతి ఉండాలని మరికొందరూ ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. కాగా ఈ ఊటీలో చూడదగ్గ కమనీయ ప్రదేశాలేంటంటే..1. ఊటీ సరస్సుపట్టణంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడ బోటింగ్కు వెళ్లవచ్చు, సరస్సు చుట్టూ విశ్రాంతిగా నడవవచ్చు లేదా కూర్చుని దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇది ఉల్లాసంగా ఉంటుంది కానీ ప్రశాంతంగా ఉంటుంది.2. నీలగిరి పర్వత రైల్వేఇక్కడ టాయ్ ట్రైన్ ప్రయాణం తప్పనిసరిగా చేయాలి. ఇది సొరంగాలు, అడవులు, టీ తోటల గుండా నెమ్మదిగా కదులుతుంది. అక్కడ ప్రకృతి దృశ్యాలను ఫోటోలు తీస్తూ మునగిపోతాం. 3. టీ తోటలు, టీ ఫ్యాక్టరీఊటీలోని టీ ఎస్టేట్లు అందంగా, ప్రశాంతంగా ఉంటాయి. పచ్చని పొలాల గుండా నడిచి టీ ఎలా తయారు చేస్తారో చూడటానికి టీ ఫ్యాక్టరీని సందర్శించొచ్చు. అక్కడ తప్పనిసరిగా తాజా టీ కొనడం మర్చిపోవద్దు.4. బొటానికల్ గార్డెన్ఇక్కడ రంగురంగుల పూలతో నిండిన ఈ తోట గుండా ప్రశాంతంగా నడవడం అద్భుతంగా ఉంటుంది. ఇది ఉదయం లేదా మధ్యాహ్నం చాలా అందంగా ఉంటుంది.5. దొడ్డబెట్ట శిఖరంఊటీలోని ఎత్తైన ప్రదేశం నీలగిరి విస్తృత దృశ్యాలను అందిస్తుంది. పర్యావరణ అనుకూలలమైన రోజున ఈ కొండను ఎక్కేందుకు అద్భుత క్షణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఊటీ ప్రయాణం అందంతోపాటు బాధ్యతయుతమైన పర్యాటకంగా అందరి మనసులను దోచుకుంటోంది. View this post on Instagram A post shared by Bhargavi Silaparsetty (@bhargavi_silparsetty) (చదవండి: 'అరటికాండంతో పప్పు' రెసిపీ ..ఆరోగ్యానికి ఎంతో మేలు..!) -
తెలంగాణలో మద్యం అమ్మకాలు.. స్పెషల్ జీవో రిలీజ్
సాక్షి, హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల సందర్భంగా.. మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక జీవో జారీ చేసింది. డిసెంబర్ 31 సందర్భంగా.. రేపు అర్ధరాత్రి 12 దాకా మద్యం అమ్మకాల నిర్వహణకు వైన్స్ దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. అలాగే.. బార్లు, క్లబ్లతో పాటుగా ఈవెంట్లు నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నవారికి అర్ధరాత్రి 1.గం. దాకా మద్యం అమ్మకానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలకు ఇదివరకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడంతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నేతృత్వంలో ఇవాళ, రేపు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఇప్పటికే చాలా చోట్ల పాత ఏడాదికి వీడ్కోలు.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఈవెంట్లు సిద్దమైయాయి.ఈ క్రమంలో రాజధాని శివారు ప్రాంతంలో పెద్దమొత్తంలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు అబ్కారీ శాఖ చెబుతోంది. ఈఏడాది కూడా కోట్ల రూపాయల దందా సాగుతుందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తుంది. అయితే.. ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేయకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తగిన ఏర్పాటు చేస్తోంది. మరోవైపు.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల శాఖ అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. రోడ్లపై ద్విచక్ర వాహనాలతో హంగామా చేస్తే కేసు నమోదు తప్పదని పేర్కొంది. -
'అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి'
2025 ఏడాది.. టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా టెస్టుల్లో అయితే భారత్ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను సమం చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసినప్పటికి.. సౌతాఫ్రికాపై ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది.రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో గిల్ సేన వైట్ వాష్కు గురైంది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే మిగిలిన మ్యాచ్లన్నింటిలోనూ తప్పనిసారిగా గెలవాలి. ఈ నేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉతప్ప అభిఫ్రాయపడ్డాడు. పాండ్యా ప్రస్తుతం కేవలం వైట్ బాల్ క్రికెట్లో మాత్రమే ఆడుతున్నాడు. 2017లో శ్రీలంకపై టెస్టు అరంగేట్రం చేసిన పాండ్యా.. ఇప్పటివరకు కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడాడు. చివరసారిగా పాండ్యా టెస్టుల్లో 2018లో ఇంగ్లండ్పై ఆడాడు. వెన్ను గాయం కారణంగా అతడు టెస్టు క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. 11 టెస్టుల్లో 532 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు."హార్దిక్ పాండ్యాను తిరిగి వైట్ బాల్ జెర్సీలో చూడాలనుకుంటున్నాను. పాండ్యా టెస్టు క్రికెట్లోకి తిరిగి వస్తే.. అతడికి ఏడో స్ధానం సరిగ్గా సరిపోతుంది. భారత్ లోయార్డర్ బ్యాటింగ్ కష్టాలు తీరిపోతాడు. అతడొక అద్భుతమైన ఆటగాడు. ఒకవేళ పాండ్యా టెస్టుల్లో తిరిగి ఆడేందుకు సముఖత చూపిస్తే.. సెలక్టర్లు గానీ, బోర్డు పెద్దలు గానీ నో చెప్పరు. ఎందుకంటే అతడు సూపర్ ఫామ్తో పాటు పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్లో 12 నుండి 15 ఓవర్ల వరకు సులభంగా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుతం జట్టులోని మిగితా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఎవరూ కూడా 20 ఓవర్లకు మించి బౌల్ చేయడం లేదు కాదు. నితీశ్ కుమార్ రెడ్డి కేవలం 12 ఓవర్ల లోపే బౌలింగ్ చేస్తున్నాడు. హార్దిక్ అంతకుమించి ఒకట్రెండు ఓవర్లు ఎక్కువగా బౌలింగ్ చేయగలడు. అతడు రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. కానీ ఇది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని" తన యూట్యూబ్ ఛానల్లో ఉతప్ప పేర్కొన్నాడు.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
ఒక్క మ్యాచ్లో ‘హిట్’.. రెండింటిలో ఫ్లాప్ షో!
విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘డి’లో భాగంగా సోమవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో ఒడిశా జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఆలూర్ వేదికగా తొలుత బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర జట్టు 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. కోన శ్రీకర్ భరత్ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు), షేక్ రషీద్ (35 బంతుల్లో 20; 1 ఫోర్) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు. కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (11 బంతుల్లో 6; 1 ఫోర్) నిరాశపరిచాడు. 43.4 ఓవర్లలోనేఎస్డీఎన్వీ ప్రసాద్ (64 బంతుల్లో 66; 6 ఫోర్లు, 2 సిక్స్లు), చివర్లో సౌరభ్ కుమార్ (26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించడంతో ఆంధ్ర స్కోరు 200 దాటింది. ఒడిశా బౌలర్లలో బిప్లాబ్ సామంత్రే, గోవింద పొద్దార్ 3 వికెట్ల చొప్పున తీశారు. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒడిశా జట్టు 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ స్వస్తిక్ సామల్ (0) ఆడిన తొలి బంతికే అవుటైనా... ఓం ముండే (111 బంతుల్లో 91; 7 ఫోర్లు), గోవింద పొద్దార్ (105 బంతుల్లో 89; 9 ఫోర్లు) ఒడిశా విజయాన్ని ఖాయం చేశారు. వీరిద్దరు మూడో వికెట్కు 166 పరుగులు జోడించారు. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక దాంట్లో నెగ్గిన ఆంధ్ర జట్టు గ్రూప్ ‘డి’లో నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈనెల 31న జరిగే నాలుగో లీగ్ మ్యాచ్లో సౌరాష్ట్ర జట్టుతో తలపడుతుంది. ఒక్క మ్యాచ్లో ‘హిట్’.. రెండింటిలో ఫ్లాప్ షో!ఆంధ్ర కెప్టెన్, టీమిండియా స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. తొలుత ఢిల్లీతో మ్యాచ్లో 23 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి.. ఒకే ఒక్క వికెట్ తీశాడు.ఈ మ్యాచ్లో ఆంధ్ర ఢిల్లీ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక రైల్వేస్తో మ్యాచ్లో మాత్రం నితీశ్ రెడ్డి బ్యాట్తో అదరగొట్టాడు. ఐదో నంబర్ బ్యాటర్గా వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఓ వికెట్ కూడా పడగొట్టాడు.ఇక తాజాగా సోమవారం ఒడిషాతో మ్యాచ్లో మాత్రం నితీశ్ రెడ్డి నిరాశపరిచాడు. కేవలం ఆరు పరుగులే చేసి నిష్క్రమించాడు. అదే విధంగా ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. ఇప్పటి వరకు ఇలా అతడి ప్రదర్శన మిశ్రమంగా ఉంది.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
కేసుల మాఫీపై నయా రోల్మోడల్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకో అక్రమ ట్రెండ్కు తెరతీశారు. తమపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునే విషయంలో ఇతర అవినీతి నేతలందరికీ రోల్ మోడల్ అవుతున్నారు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన స్కామ్లపై పెట్టిన కేసులను తానే ఎత్తేసుకుంటున్నారు మరి! రాష్ట్ర నేర విచారణ సంస్థ సీఐడీ అన్ని కోణాల్లో విచారించిన తరువాత పెట్టిన కేసులివి. ప్రభుత్వ ఉన్నతాధికారుల మేరకు నమోదైనవి. చంద్రబాబు వీటిల్లో కొన్నింటిపై ముందస్తు బెయిల్ సంపాదించుకుంటే ఒక కేసులో మాత్రం జైలుకెళ్లారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిందే తడవు చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ నెట్, మద్యం స్కామ్ కేసులను ఎత్తేయించుకున్నారు. తాజాగా స్కిల్ స్కామ్ కేసునూ లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన పథకంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్నది ఈ స్కిల్స్కామ్. అంతర్జాతీయ సంస్థ సీమెన్స్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం అంటే రూ.300 కోట్లు పెడితే.. సీమెన్స్ రూ.3000 కోట్లు పెడుతుందని ఊరించారు. పైగా సీమెన్స్ కంపెనీ పైసా చెల్లించకుండానే ప్రభుత్వం రూ.330 కోట్లు కట్టేసింది. పుణేలోని జీఎస్టీ అధికారులు ఈ తేడాను గుర్తించారు. సీమెన్స్ అసలు, జీఎస్టీ రెండూ కట్టలేదని సమాచారమిచ్చినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈలోపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో అసలు విషయం బట్టబయలైంది. అసలు సీమెన్స్ కంపెనీ ఈ ఒప్పందంలో భాగమే కాదన్న బోగస్ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లావాదేవీలతో తమకు సంబంధం లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. సీమెన్స్ మాజీ అధికారి ఒకరు మొత్తం కథ నడిపినట్లు విచారణలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలియకుండా ఇందులో చిక్కుకుందా? లేక కుట్రపూరితంగానే జరిగిందా అన్న అంశం పరిశీలనకు వచ్చింది. ఆ సందర్భంలోనే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా రూ.330 కోట్లు డిజిటెక్ అనే కంపెనీకి విడుదల చేసిందని వెల్లడైంది. సీఎం కోరినట్లుగా నిధులు విడుదల చేస్తున్నామని అధికారులు ఫైళ్లలోనే రాశారు. కేబినెట్తో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం దుర్వినియోగమైందని సీఐడీ గుర్తించింది. ఈ స్కామ్లో భాగస్వాములన్న అభియోగంపై అధికారులు కొందరిని అరెస్టు చేసింది. సీఎం హోదాలో చంద్రబాబు పాత్ర సాంతం నిర్ధారణ అయ్యాక ఆయనను కూడా అరెస్టు చేసింది. దీంతో రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కేసులో పలు షెల్ కంపెనీలకు ఈ స్కామ్ డబ్బు వెళ్లిందని, అక్కడి నుంచి సుమారు రూ.70 కోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి చేరాయని సీఐడీ అధికారులు కనిపెట్టారు. సీఐడీ ఇంత పక్కాగా దర్యాప్తు చేసినా టీడీపీ, జనసేనలు ఇదో అక్రమ కేసు అనే ప్రచారం చేశాయి. ఎల్లో మీడియా కూడా చంద్రబాబును అరెస్టు చేస్తారా? అంటూ చిందులు తొక్కింది. చివరికి న్యాయమూర్తిపై కూడా అభ్యంతకరమైన కథనాలు ప్రచురించింది. చివరకు చంద్రబాబు కేసుతో నిమిత్తం లేకుండా..ఆనారోగ్య కారణాలు చూపి హైకోర్టులో బెయిల్ పొందాల్సి వచ్చింది. హైకోర్టు కూడా కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేయడం.. విడుదలైన మరుక్షణమే చంద్రబాబు వాటిని బేఖాతరు చేయడం జరిగిపోయాయి. అది వేరే సంగతి.ఈ నేపథ్యంలో 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత తన కేసులను ఎలా తొలగించుకునే బాధ్యతను ఒక లీగల్ ప్రముఖుడికి అప్పగించారని గతంలో వార్తలు వచ్చాయి. అంతకంటే ముందు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో ఈ స్కామ్లపై విచారణ జరిపిన అధికారులపై, వైసీపీ నేతలపై రకరకాల కేసులు సృష్టించారు. పలువురిని అరెస్టు చేసి, ప్రజల దృష్టి మళ్లించారు. ఇంకో వైపు తన కేసుల మాఫీకి చర్యలు తీసుకున్నారు. అంతేకానీ... తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి సిద్దపడలేదు. వెనుకటి రోజుల్లో తాను టెక్నికల్గా, లీగల్గా దొరకనని సభలలో అంటుండే వారు. కాని గత ప్రభుత్వం సాక్ష్యాలతో సహా కేసులు పెట్టడంతో వాటి నుంచి బయట పడడానికి చంద్రబాబు కోర్టు విచారణ బదులు కొత్తమార్గం కనిపెట్టారు. మద్యం, ఫైబర్నెట్ స్కామ్లలో తనపై ఫిర్యాదు చేసిన అధికారులను భయపెట్టి ఉపసంహరణ పిటిషన్లు వేయించారు. ఇది బెయిల్ కండిషన్లు ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. స్కిల్ స్కామ్లో ‘మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్స్’ అని ఇంకో వ్యూహం ప్రయోగించారు. అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి ఒక నోటీసు పంపి, ఈ కేసు ఉపసంహరణలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ చేయాలని కోరారట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టైమ్లో ఎవరు అభ్యంతరం చెబుతారు? నిజానికి అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి స్కామ్పై ఫిర్యాదు చేశారట. కాని ఆయన అభిప్రాయం తీసుకోవడం లేదట. ఇలా అధికారంలో ఉన్నవారు తమపై వచ్చిన అవినీతి కేసులను తొలగించుకునే రీతిని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా అన్నది చర్చనీయాంశం. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం కింది కోర్టులు ఇలాంటి వాటిపై నిర్ణయాలు చేయరాదు. హైకోర్టులో జరగాలి. చిత్రమేమిటంటే ఇంతవరకు చంద్రబాబుకు చెందిన రెండు కేసుల ఉపసంహరణకు సంబంధించిన ఆదేశాల సర్టిఫైడ్ కాపీలు న్యాయ స్థానం కూడా ఇవ్వడం లేదట. ఎందుకు కోర్టు ఇలా గోప్యత పాటిస్తుంది అనేదానిపై సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వచ్చాయి. ఇప్పటికే స్కిల్ కేసును ఈడీ అధికారులు విచారించారు. కాని కేంద్రంలో, రాష్ట్రంలో మారిన రాజకీయాలు, రెండు చోట్ల కూటమి ప్రభుత్వాలే ఉన్న రీత్యా వారికి వ్యతిరేకంగా కేసును ముందుకు సాగనివ్వదని భావిస్తున్నారు. ఈడీతో నిమిత్తం లేకుండా సీఐడీ ఈ కేసును ఎలా నీరుకార్చుతుందన్న ప్రశ్న వస్తుంది. సీఐడీ అప్పట్లో ఎలా కేసు పెట్టి అరెస్టు చేసింది? ఇప్పుడు అదే సీఐడీలో అధికారులు మారిపోతే కేసే ఉండకుండా పోతుందా? చట్టప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా అన్న చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ కేసులన్నీ మళ్లీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా? అనే మీమాంస కూడా ఉంది. దీనికి న్యాయ నిపుణులు అవుననే చెబుతున్నారు. ఇలా అధికారంలో ఉన్న వారు కేసు తీసివేసుకునే పద్ధతి ఉంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నేత అయినా అధికారం సాధించుకుంటే అన్నీ మాఫ్ అవుతాయన్న భావన కలగదా?. గతంలో బీహారు ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను గడ్డి స్కామ్లో సీబీఐ అరెస్టు చేసి జైలులో పెట్టింది. ఆయన పదవికి రాజీనామా చేయగా, సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు. కేసు విచారణ తర్వాత ఆయనకు శిక్ష పడింది. అలాగే హర్యానా ముఖ్యమంత్రిగా ఓం ప్రకాష్ చౌతాల కూడా టీచర్ల నియామక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై శిక్షకు గురై జైలు జీవితం గడపాల్సి వచ్చింది. మరికొందరు నేతలు కూడా విచారణను ఎదుర్కున్నారు. వారికి కూడా ఇలాంటి కేసు ఉపసంహరణ మార్గాలకు సంబందించిన ఐడియాలు వచ్చి ఉంటే జైలుకు వెళ్లవలసిన అవసరం ఉండేది కాదేమో!. బహుశా ఇలాంటి వాటినన్నటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు లీగల్ టీమ్ వ్యూహాత్మకంగా అసలు కేసులు విచారణకే రాకుండా చేయడం ద్వారా వీటి నుంచి బయటపడవచ్చని భావించినట్లు ఉంది. అందుకు తగ్గట్లు ఆయా కేసులలో గతంలో ఫిర్యాదు చేసిన అధికారులతోనే కేసును విరమింప చేయిస్తున్నారు. లేదంటే ఇలా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో కొత్త వ్యూహం అమలు చేయాలని అనుకుని ఉండవచ్చు. ఇప్పటికే రెండు కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు స్కిల్ స్కామ్ కు కూడా అదే ప్లాన్ చేసినట్లు అనుకోవాలి. ఏది ఏమైనా చంద్రబాబు టీమ్ వేసిన ఈ ప్లాన్ దేశంలోని ఇతర నేతలకు ఒక మార్గం చూపినట్లవుతుందా, న్యాయ వ్యవస్థ ఇలాంటి పెడపోకడలకు చెక్ పెడుతుందా? పెట్టదా?అనేవి ఆసక్తికరమైన అంశాలుగా ఉన్నాయి. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రంగా 'వృషభ'.. నష్టం ఎన్నికోట్లు అంటే..
మలయాళ ప్రముఖ నటుడు మోహన్లాల్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనుకుంటే.. తాజాగా విడుదలైన 'వృషభ' మూవీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. 2025 మోహన్లాల్ నటించిన లూసిఫర్ (ఎంపురాన్) రూ. 268 కోట్లు, తుడరమ్ రూ. 235 కోట్లు, హృదయపూర్వం రూ. 100 కోట్ల క్లబ్లో చేరాయి. కానీ, ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వృషభ' భారీ నష్టాలను మిగిల్చింది.క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన 'వృషభ' మూవీ బాక్సాఫీస్ వద్ద 5రోజుల్లో రూ. 1.94 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సుమారు రూ. 70 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఈ సినిమా ఉంది. ప్రాంతాల వారిగా 5రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఓవర్సీస్లో ఈ చిత్రం దాదాపు రూ. 25 లక్షలు, మలయాళంలో రూ. 1.01 కోట్లు, హిందీలో రూ. 8 లక్షలు, తెలుగు వెర్షన్ రూ. 32 లక్షలు, కన్నడ వెర్షన్ దాదాపు రూ. 4 లక్షలు మాత్రమే సాధించింది. ఫైనల్గా ఈ మూవీ రూ. 65 కోట్లకు పైగానే నష్టాన్ని మిగల్చడం ఖాయంగానే కనిపిస్తుంది.మోహన్లాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు నందకిషోర్ 'వృషభ' చిత్రాన్ని తెరకెక్కించారు. తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే జన్మజన్మల కథగా ఈ మూవీ ఉంది. కొత్తదనం లేని కథతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారని విమర్శలు ఉన్నాయి. ఇందులో కేవలం మోహన్లాల్ నటన మాత్రమే బాగుందని ప్రశంసలు వచ్చాయి. అజయ్, అలీ, అయ్యప్ప పి.శర్మ వంటి తెలుగునటులు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. -
భారతీయులు సహ వలసదారుల్లో సరికొత్త భయం!
H-1B వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులు గుబులు.. గుబులుగా కనిపిస్తారు. ఇప్పటికే కఠినమైన నియమాలు అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇంకా ఏం మెలికలు పెడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారతీయులే కాదు.. విదేశీ వలసదారులు సైతం ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడటానికి ఇష్టపడడం లేదు. ఎందుకైనా మంచిదని టోటల్గా ప్రయాణాలు రద్దు చేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వలస నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తుండటంతో.. వలసదారులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలకు భయపడుతున్నారట. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF)-న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా నిర్వహించిన 2025 సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం అమెరికాలోని వలసదారులలో 27% మంది జర్నీలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారన్నది ఈ సర్వే సారాంశం. ఈ క్రమంలో.. చట్టబద్ధంగా ఉన్నవారు కూడా భయాందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సరైన H-1B వీసాలు కలిగినవారు (32 శాతం), పౌరసత్వం పొందినవారు (15 శాతం) కూడా ప్రయాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక.. అక్రమ వలసదారులలో ఈ సంఖ్య 63% గా ఉంది. ఇటు దేశీయంగానూ ప్రయాణాలపై వలసదారుల్లో భయం నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు.. ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (TSA) దేశీయ విమాన ప్రయాణికుల వివరాలను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE)కు షేర్ చేస్తోంది. దీంతో వలస దారులు తమపై దృష్టి పడకుండా ఉండేందుకు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది. టెక్సాస్లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణురాలు శిఖా ఎస్.. తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్కి రావాలనుకుంటోంది. అయితే.. H-1B వీసా దారులపై పెరుగుతున్న పరిశీలన, ఆలస్యమవుతున్న ఇంటర్వ్యూల కారణంగా తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసుకుంది.ఈ ఏడాది జూలైలో H-1B వీసా రీన్యువల్స్ను స్వదేశంలోనే చేయాలని నిబంధన విధించగా.. సెప్టెంబర్లో కొత్త H-1B దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు విధించారు. అటుపై ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్లో సోషల్ మీడియా స్క్రీనింగ్ను కూడా కఠినతరం చేసింది.ఇక.. వీసా ఇంటర్వ్యూలు 2026–2027 వరకు వాయిదా పడటంతో.. వందలాది మంది ఉద్యోగాలు, కుటుంబాల నుండి దూరమయ్యారు. దీనితో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు వలసదారులు అత్యవసర పరిస్థితులు తప్ప విదేశీ ప్రయాణం చేయవద్దని సూచిస్తోంది. ఈ మొత్తం పరిణామాలన్నీ అమెరికాలో వలసదారులలో భయాన్ని పెంచి.. వారి రోజువారీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగాలు, కుటుంబాలు, చట్టబద్ధ స్థితి కాపాడుకోవడానికి, వలసదారులు ప్రయాణం పూర్తిగా నివారించడం సురక్షిత మార్గంగా భావిస్తున్నారని సర్వేలతో స్పష్టమవుతోంది. -
హైదరాబాద్ క్రికెటర్ రామ్చరణ్పై బీసీసీఐ వేటు.. కారణమిదే?
వయస్సును తక్కువగా చూపించి దేశవాళీ క్రికెట్ మ్యాచ్లో ఆడిన హైదరాబాద్ క్రికెటర్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండేళ్ల నిషేధం విధించింది. బోర్డు అధికారిక అండర్–16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో మర్కట్ట రామ్చరణ్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగాడు.లీగ్ దశలో హైదరాబాద్ నాలుగు మ్యాచ్లు ఆడగా ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలపై రామ్చరణ్ మూడు సెంచరీలు నమోదు చేశాడు. అయితే రామ్చరణ్ వయసుకు సంబంధించిన సందేహం కారణంగా వచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) విచారణ జరిపింది. విచారణలో రామ్చరణ్కు రెండు వేర్వేరు తేదీలతో ‘బర్త్ సర్టిఫికెట్ ’లు ఉన్నట్లు, అతను తన వయసును తక్కువగా చూపించి అండర్–16 టోర్నీలో ఆడినట్లు తేలింది. దాంతో బీసీసీఐ అతడిని రెండేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ నుంచి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల తర్వాత రామ్చరణ్ మళ్లీ ఆడవచ్చని...అయితే ఎలాంటి వయో విభాగంతో సంబంధం లేకుండా కేవలం సీనియర్ స్థాయిలోనే బరిలోకి దిగాల్సి ఉంటుందని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. -
ఢిల్లీ హైకోర్టుకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం తారక్ తన వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ధన్యవాదాలు తెలిపారు.సోషల్ మీడియా వేదికగా.. పలు ఈ–కామర్స్ వెబ్సైట్లలో తన పేరుతో పాటు ఫొటోలు, వీడియోలను ఎలాంటి అనుమతి లేకుండా తమ వ్యాపారా లాభాల కోసం వినియోగించడం వల్ల తన వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని ఢిల్లీ కోర్టును తారక్ ఆశ్రయించారు. తమ వ్యాపార అవసరాల కోసం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ.. తమ పేరును దుర్వినియోగం చేస్తున్న వారికి అడ్డుకట్టవేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తారక్ వ్యక్తిగత హక్కులను రక్షించేలా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన కృతజ్ఞతలు తెలిపారు.వారికి ధన్యవాదాలు: ఎన్టీఆర్'నేటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడే రక్షణాత్మక ఉత్తర్వును మంజూరు చేసినందుకు గౌరవనీయులైన ఢిల్లీ హైకోర్టుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా డాకర్, శ్రీ రాజేందర్తో పాటు వారి టీమ్ అందించిన లిగల్ సపోర్ట్కు ధన్యవాదాలు.' అని తెలిపారు.I thank the Hon’ble Delhi High Court for granting a protective order that safeguards my personality rights in today’s digital age.My sincere appreciation to Supreme Court Advocates Dr. Balajanaki Srinivasan and Dr. Alka Dakar, along with Mr. Rajender and team of Rights & Marks,…— Jr NTR (@tarak9999) December 29, 2025 -
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు! ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ప్రజలకు వైఎస్ జగన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: వైకుంఠ ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని తెలుగు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అంటూ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షల సందేశాన్ని పంచుకున్నారు.ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 30, 2025శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.క్లిక్ చేయండి👉: ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి చిత్రాలు -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 48 పాయింట్లు నష్టంతో 25,895 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 పాయింట్లు తగ్గి 84,549 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.04బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 61.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.11 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.35 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.5 శాతం తగ్గింది.Today Nifty position 30-12-2025(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘స్వయంగా పుతినే చెప్పారు’.. డ్రోన్ ఎటాక్పై ట్రంప్ ఆగ్రహం
అమెరికా దౌత్యంతో ఉక్రెయిన్ సంక్షోభం ఓ కొలిక్కి వస్తుందని భావించేలోపు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగిందని రష్యా ప్రకటించింది. పైగా ఇది ఉక్రెయిన్ పనేనంటూ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలను కీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. మరోవైపు ఈ దాడిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో రిసార్ట్లో ట్రంప్ సమావేశం అయ్యారు. ఆ భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం గురించి నాకు ఎవరు సమాచారం ఇచ్చారో తెలుసా?. స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆయన నాకు ఫోన్ చేసి దాడి జరిగిందని అన్నారు. ఆయనపై దాడి జరిగిందని. ఇది ఏమాత్రం మంచిది కాదు. నేను చాలా కోపంగా ఉన్నాను అని ట్రంప్ అన్నారు. అయితే దాడిపై కూడా ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. డ్రోన్ దాడి జరగకపోయి ఉండొచ్చని.. అందుకు ఆస్కారం ఉందని కూడా వ్యాఖ్యానించారు. ‘‘ఎవరైనా అవమానకరంగా ప్రవర్తించడం ఒక విషయం. కానీ ఆయన ఇంటిపై దాడి చేయడం మరో విషయం. ఇప్పుడే అలాంటి పనులు చేయడానికి సరైన సమయం కాదు’’ అంటూ వ్యాఖ్యానించారాయన. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా సోమవారం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కల్పిత కథనాలేనని, రష్యా మరిన్ని దాడులకు కారణాలు చూపించుకోవడానికి, శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. ఉత్తర రష్యాలోని నోవ్గొరోడ్ ప్రాంతంలో ఉన్న అధ్యక్ష నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ రాత్రిపూట డ్రోన్ దాడి చేసిందని అన్నారు. అయితే రష్యా వాయుసేన రక్షణ వ్యవస్థలు 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని, ఎలాంటి ప్రాణ నష్టం/ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. రష్యా దీనికి తప్పకుండా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ప్రతీకార దాడుల కోసం ఇప్పటికే లక్ష్యాలను గుర్తించామని చెప్పారు. అలాగే..ఈ పరిణామంతో శాంతి చర్చలపై రష్యా తన వైఖరిని పునఃపరిశీలించాల్సి వస్తుందని తెలిపారు. అంతమాత్రాన ఉక్రెయిన్తో జరుగుతున్న శాంతి చర్చల నుంచి మాత్రం తప్పుకోబోమని స్పష్టం చేశారు. ఆ సమయంలో పుతిన్ ఆ నివాసంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని రష్యా స్పష్టంగా చెప్పలేదు. డోల్గియే బొరోడీ అనే ఆ నివాసాన్ని గతంలో జోసెఫ్ స్టాలిన్, నికితా ఖ్రుష్చెవ్, బోరిస్ యెల్త్సిన్, పుతిన్ వంటి సోవియట్, రష్యా నేతలు ఉపయోగించారు.రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పూర్తిగా తిరస్కరించారు. ఇది “మరో అబద్ధాల పరంపర” అని వ్యాఖ్యానించారు. దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికి, కీవ్పై కొత్త దాడులు చేయడానికే రష్యా ఈ కథలు సృష్టిస్తోందని అన్నారు. సున్నితమైన దౌత్య చర్చల సమయంలో రష్యా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తత పెంచుతోందని ఆరోపించారు. ఉక్రెయిన్–అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని జెలెన్స్కీ చెప్పారు. రష్యా బెదిరింపులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాలని కోరారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా స్పందించారు. -
డికాక్ మెరుపులు.. సన్రైజర్స్ వరుసగా రెండో విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్లో భాగంగా సోమవారం ప్రిటోరియా క్యాపిటల్స్లో జరిగిన మ్యాచ్లో 48 పరుగుల తేడాతో సన్రైజర్స్ గెలుపొందింది. ఈ విజయంతో సన్రైజర్స్ జట్టుకు అదనంగా ఒక బోనస్ పాయింట్ కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి చెలరేగాడు. 47 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 5 ఫోర్లు, 6 సిక్సకర్లతో 77 పరుగులు చేశాడు. అతడితో పాటు మాథ్యూ బ్రీట్జ్కే(33 బంతుల్లో 52 పరుగులు), జోర్డాన్ హెర్మాన్(20 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. లుంగి ఎంగిడీ, లుబ్బే తలా వికెట్ సాధించారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ 18 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. సన్రైజర్స్ స్పీడ్ స్టార్ ఆడమ్ మిల్నే 4 వికెట్లు పడగొట్టగా.. రత్నాయకే రెండు, మార్కో జాన్సెన్, ముత్తుసామి తలా వికెట్ సాధించారు.ప్రిటోరియా ఇన్నింగ్స్లో షాయ్ హోప్(36) టాప్ స్కోరర్గా నిలవగా.. స్మిడ్(35), రుథర్ ఫర్డ్(25) ఫర్వాలేదన్పించారు. కాగా ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యవహరిస్తున్నాడు. ప్రధాన కోచ్గా అతడికి వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమి ఎదురైంది.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ వారు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ, సరైన సమయంలో ఆ విషయం గురించి చెబుతానని ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే, ఇప్పుడు పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.సోషల్మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరి 26న విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్ జరుగుతుంది. ఘనంగా పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారని టాక్. అయితే, ఇందులో నిజమెంతో తెలియాలంటే విజయ్-రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. -
ఇళ్ల విక్రయాలు.. నేలచూపులు
హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఈ ఏడాది నీరసించింది. విక్రయాలు క్రితం ఏడాదితో పోల్చి చూసినప్పుడు 23 శాతం తగ్గి 44,885 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది అమ్మకాలు 58,540 యూనిట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. ఒక్క చైన్నై నగరంలో మాత్రం డిమాండ్ పుంజుకుంది. ఇళ్ల యూనిట్ల అమ్మకాలు తగ్గినప్పటికీ, విలువలో మాత్రం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసింది. ప్రాపర్టీ ధరలు పెరగడం, ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు, భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు విక్రయాలు తగ్గడానికి కారణాలుగా అనరాక్ పేర్కొంది. ఏడు నగరాల్లో ఇళ్ల ధరలు ఈ ఏడాది సగటున 8 శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది. విక్రయాలు ఇలా..మొత్తం ఏడు నగరాల్లో 2025లో ఇళ్ల అమ్మకాలు ఇప్పటి వరకు 3,95,625 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది విక్రయాలు 4,59,645 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది అమ్ముడుపోయిన ఇళ్ల విలువ రూ.6 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది అమ్మకాల విలువ రూ.5.68 లక్షల కోట్లతో పోలిస్తే 6 శాతం పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 1,27,875 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది కంటే 18 శాతం తగ్గాయి.పుణెలోనూ క్రితం ఏడాదితో పోల్చితే 20 శాతం తక్కువగా 65,135 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.బెంగళూరులో 5 శాతం తక్కువగా 65,135 యూనిట్లు అమ్ముడయ్యాయి.ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో విక్రయాలు 57,220 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది విక్రయాలు 61,900 కంటే 8 శాతం తగ్గాయి.కోల్కతాలో 16,125 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాదితో పోలి్చతే 12 శాతం పడిపోయాయి. చెన్నైలో మాత్రం అమ్మకాలు క్రితం ఏడాదితో పోల్చితే 15 శాతం పెరిగాయి. 22,180 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2024లో ఇళ్ల ధర చదరపు అడుగునకు రూ.8,590గా ఉంటే, ఈ ఏడాది 8 శాతం పెరిగి రూ.9,260కు చేరుకుంది. 2026 అమ్మకాలు ఎలా ఉండొచ్చు?క్రితం ఏడాది డబుల్ డిజిట్ స్థాయిలో ఇళ్ల ధరలు పెరగ్గా.. ఈ ఏడాది సింగిల్ డిజిట్ పెరుగుదలతో ఆగినట్టు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. 2026లో ఇళ్ల మార్కెట్ పనితీరు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, ఇళ్ల ధరల తీరు అమ్మకాలను ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం -
‘అమ్మా’ అని పిలిచి, అదను చూసి..
సాక్షి, హైదరాబాద్: నాచారం మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒంటరి మహిళ అని సుజాతను గుర్తించి.. ఆమెతో మంచిగా ప్రవర్తించి.. నగల కోసం దారుణానికి ఒడిగట్టాడు ప్రధాన నిందితుడు అంజిబాబు. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత భర్త, పిల్లలు కొన్నేళ్ల కిందట యాక్సిడెంట్లో మరణించారు. దీంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. రెండు నెలల కిందట డ్రైవర్గా పని చేసే అంజిబాబు ఆమె ఇంట్లో అద్దెకు దిగాడు. అయితే సుజాత ప్రతీరోజూ ఒంటి నిండా బంగారం ధరించేది. ఇది గమనించిన అంజిబాబు.. ఆ నగల కోసం సుజాతను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో.. అమ్మా అని సుజాతను పిలుస్తూ దగ్గరయ్యాడు. ఆ పిలుపు విని ఆమె కూడా మోసపోయింది. ఈ నెల 18వ తేదీన కిచెన్లో ఉన్న సుజాతను వెనుక నుండి ముసుగు వేసి అంజి బాబు ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీశాడు. ఆపై ఆమె ఒంటిపై నగలు తీసేసి.. ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. అయితే.. పారిపోతే తన మీదకే నేరం వస్తుందని ఆలోచించి స్నేహితులతో కలిసి ఓ పన్నాగం పన్నాడు. మృతదేహాన్ని మాయం చేయాలనీ తన స్నేహితులు దుర్గారావు, యువరాజులతో కలిసి ప్లాన్ వేశాడు. ఓ పెద్ద ట్రాలీ సూట్కేసు తెచ్చి.. అందులో సుజాత మృతదేహం కుక్కి రాజమండ్రి(ఆంధ్రప్రదేశ్) తీసుకెళ్లారు. ఆ బ్యాగును కోనసీమ రాజోలు దగ్గర గోదావరిలో పడేసి వచ్చారు.సుజాత కనిపించకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే తనకు ఏం తెలియనట్లు.. ఆ బంధువులతో కలిసి అంజిబాబు ఆమె కోసం గాలించడం మొదలుపెట్టాడు. ఈలోపు.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు ఈ కేసును చేధించారు. అంజిబాబు, అతనికి సహకరించిన యువకుల్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో గోదావరి నది నుంచి ట్రాలీ బ్యాగ్ను వెలికి తీశారు. అందులోంచి సుజాత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పంపారు. నిందితుల నుంచి నాలుగు బంగారు గాజులు, చెవి దిద్దులు స్వాధీనం చేసుకున్నారు. -
బీమాకు జీఎస్టీ సంస్కరణల జోష్
జీవిత బీమాపై జీఎస్టీని తొలగించిన నేపథ్యంలో పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుమీత్ మదన్ తెలిపారు. సెప్టెంబర్ 22 (మార్పులు అమల్లోకి వచ్చిన రోజు) తర్వాత నుంచి, దీపావళి రెండు మూడు రోజులు మినహాయిస్తే, వారం వారీగా 30–35 శాతం విక్రయాల వృద్ధి కనిపించిందని ఆయన పేర్కొన్నారు.కోవిడ్ అనంతరం బీమాపై అవగాహన, పాలసీల కొనుగోళ్లు పెరిగాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి సుమిత్ చెప్పారు. క్లెయిమ్ సెటిల్మెంట్లు మెరుగ్గా ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని తెలిపారు. మరోవైపు, జెనరేషన్ జెడ్ కూడా బీమాపై ఆసక్తి చూపుతోందని వివరించారు. సౌకర్యవంతంగా డిజిటల్ మాధ్యమంతో పాటు సంప్రదాయ బ్యాంకెష్యూరెన్స్ మాధ్యమం ద్వారా కూడా కొనుగోళ్లు చేస్తోందని పేర్కొన్నారు. అయితే, పరిశ్రమ నిర్వహిస్తున్న ప్రచార కార్కక్రమాలు, ఇతరత్రా కారణాలతో కూడా బీమాపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, అది ఆచరణలో (పూర్తి స్థాయిలో పాలసీల కొనుగోళ్ల రూపంలో) కనిపించేందుకు మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉందన్నారు. తగినంత కవరేజీ కూడా ముఖ్యం..బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, తగినంత కవరేజీ తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని సుమిత్ చెప్పారు. చాలా మంది దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని వివరించారు. పరిస్థితులను బట్టి వార్షికాదాయానికి పది నుంచి పదిహేను రెట్లు కవరేజీ ఉండటం శ్రేయస్కరమని పేర్కొన్నారు. పాలసీదారులకు మరింత చేరువయ్యే క్రమంలో తమ ప్రక్రియల్లో కృత్రిమ మేథ (ఏఐ)ని కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థకు సంబంధించి దాదాపు 64 శాతం అండర్రైటింగ్ ఏఐతోనే జరుగుతోందని సుమిత్ వివరించారు. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించడమనేది బీమా రంగానికి ప్రయోజనకరమేనని ఆయన చెప్పారు. దీనితో పోటీ పెరిగి, అంతిమంగా కస్టమర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం -
10 ఓవర్లలో 123 పరుగులు.. సీఎస్కే బౌలర్ అత్యంత చెత్త రికార్డు
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి కెప్టెన్, ఆల్రౌండర్ అమాన్ ఖాన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే ఇది దురదృష్టవశాత్తూ చెప్పుకోవడానికి ఇష్టపడని అవమానకరమైన రికార్డు కావడం గమనార్హం. జార్ఖండ్తో సోమవారం జరిగిన మ్యాచ్లో అమాన్ 10 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు కలిపి (లిస్ట్–ఎ క్రికెట్)లో ఒక మ్యాచ్లో బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఇదే టోర్నీలో ఈ నెల 24న బిహార్తో జరిగిన మ్యాచ్లో అరుణాచల్ప్రదేశ్ బౌలర్ మిబోమ్ మోసూ 9 ఓవర్లల ఇచ్చిన 116 పరుగుల రికార్డు ఇప్పుడు తెరమరుగైంది.ఐపీఎల్లో రెండు సీజన్ల పాటు కోల్కతా, ఢిల్లీ జట్లకు కలిపి 12 మ్యాచ్లలో ఆడినా ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం వచ్చిన అమాన్ ఖాన్ ఇటీవల జరిగిన 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.40 లక్షలకు సొంతం చేసుకుంది. పుదుచ్చేరితో మ్యాచ్లో 50 ఓవర్లలో 7 వికెట్లకు 368 పరుగులు చేసిన జార్ఖండ్...ఆ తర్వాత పుదుచ్చేరిని 235 పరుగులకే ఆలౌట్ చేసి 133 పరుగులతో విజయాన్నందుకుంది.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
విజిలెన్స్ వ్యవహారాలను వెంటనే వెల్లడించాలి
ప్రభుత్వరంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు హోల్టైమ్ డైరెక్టర్లకు (డబ్ల్యూటీడీ) సంబంధించి విజిలెన్స్ వ్యవహరాలను వెంటనే నివేదించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. బోర్డు స్థాయిలో నియామకాలకు సంబంధించి ప్రతికూల సమాచారాన్ని సకాలంలో నివేదించని పలు సంఘటనల నేపథ్యంలో ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్ఎస్) ఈ ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వరంగ సంస్థల చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ల నుంచి విజిలెన్స్ క్లియరెన్స్ కోరినప్పుడే.. ప్రైవేటు ఫిర్యాదులు, కోర్టుల పరిశీలనలు, సీబీఐ లేదా ఇతర చట్టపరమైన దర్యాప్తు సంస్థల సూచనలు వెలుగు చూస్తున్నట్టు పేర్కొంది. ఇందులో హోల్టైమ్ డైరెక్టర్లకు సంబంధించి కీలక సమాచారాన్ని విజిలెన్స్ క్లియరెన్స్ ఫార్మాట్ల నుంచి తొలగించడాన్ని ప్రస్తావించింది. దీంతో బోర్డు స్థాయిలో అధికారులకు సంబంధించి ప్రతికూల సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలంటూ ప్రభుత్వరంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలను ఆర్థిక శాఖ ఆదేశించింది.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం -
ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్కప్ సెమీస్ చేరే జట్లు ఇవే!
టీ20 ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 40 రోజుల్లో భారత్, శ్రీలంక వేదికలగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. తిరిగి టైటిల్ను రిటైన్ చేసుకోవాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఛాంపియన్స్గా నిలస్తుందని భజ్జీ జోస్యం చెప్పాడు."టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలు టీమిండియాకు ఎక్కువగా ఉన్నాయి. మన ఆటగాళ్లకు ఉపఖండ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఇది భారత జట్టుకు బాగా కలిసొస్తోంది. అయితే టోర్నీలో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి కూడా భారత్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఏ ఐసీసీ టోర్నమెంట్లోనైనా ఆస్ట్రేలియా కచ్చితంగా టైటిల్ రేసులో ఉంటుంది. కాబట్టి కంగారూలను తక్కువగా అంచనా వేయకూడదు. సౌతాఫ్రికా కూడా గత కొంత కాలంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అఫ్గానిస్తాన్ జట్టు కూడా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. అఫ్గాన్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు.భారత్ వంటి ఉపఖండ పిచ్లలో వారు ఎవరినైనా ఓడించగలరు. నా వరకు అయితే .. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గాన్ జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయని అనుకుంటున్నాను"అని లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) సీజన్ 4 ప్రారంభోత్సవంలో భజ్జీ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2026కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ సింగ్ పటేల్, వాషింగ్టన్ పటేల్, వాషింగ్టన్ సందర్.చదవండి: రెండు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. మెల్బోర్న్ పిచ్పై ఐసీసీ ఆగ్రహం -
ఢిల్లీ అతలాకుతలం: భారీ పొగమంచు.. వణికించే చలి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఒకవైపు భారీ పొగమంచు కమ్మేయగా, మరోవైపు వణికించే చలి అందరినీ విలవిలలాడేలా చేస్తోంది. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున నగరం మొత్తం దట్టమైన పొగమంచు ఆవరించింది. ఫలితంగా జనజీవనం తీవ్రంగా అతలాకుతలమవుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు శీతల గాలుల హెచ్చరికను జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. #WATCH | Delhi | Visibility in the national capital is affected as a layer of dense fog engulfs the city. (Visuals from Dwarka Expressway) pic.twitter.com/EzuKlWW0wK— ANI (@ANI) December 30, 2025ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత (Visibility) భారీగా పడిపోయింది. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో సుమారు 130కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే శాఖ కూడా సుమారు 100కి పైగా రైళ్లు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాలం, సఫ్దర్జంగ్ తదితర ప్రాంతాల్లో దృశ్యమానత కేవలం 50 మీటర్లకు పడిపోయింది.ఒకవైపు ప్రమాదకర స్థాయికి చేరుకున్న కాలుష్యం, మరోవైపు విపరీతమైన చలి, ఇంకోవైపు దట్టమైన పొగమంచుతో ఢిల్లీలో వాయు నాణ్యత (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరింది. పొగమంచు కారణంగా వాహనదారులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నవారు బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రయాణికులు విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్కు బయలుదేరే ముందు తమ ప్రయాణ సమయాల అప్డేట్లను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఐఎమ్డి అంచనా ప్రకారం రానున్న రెండు మూడు రోజుల పాటు ఈ పొగమంచు ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. వాహనదారులు ఫాగ్ లైట్లను ఉపయోగించాలని, అతివేగాన్ని తగ్గించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత -
'విశ్వంభర' విడుదల ఎప్పుడంటే..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'విశ్వంభర'.. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఆ సమయంలో గేమ్ ఛేంజర్ కోసం చిరు వాయిదా వేసుకున్నారు. అపై టీజర్ విషయంలో ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ చెందడంతో వాయిదానే బెటర్ అనుకున్నారు. అందులో గ్రాఫిక్స్ వర్క్ చాలా పేలవంగా ఉందని విమర్శలు రావడంతో మార్పులు చేయాలనుకున్నారు. అయితే, ఎప్పుడు రిలీజ్ అనేది ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఇంతలో 'మన శంకర వరప్రసాద్ గారు' లైన్లోకి వచ్చేశాడు. మరో పదిరోజుల్లో విడుదల కూడా కానుంది. కానీ, విశ్వంభర గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.'విశ్వంభర' టీజర్ విషయంలో విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠ పక్కా ప్లాన్తో ఈ ఏడాది మొత్తం విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ కోసం కేటాయించి బలమైన ఔట్పుట్ను ఇచ్చారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్పై విస్తృతంగా పరిశీలించి అనేక మార్పులు చేశారట. అయితే, తాజా నివేదికల ప్రకారం 'విశ్వంభర' జూన్ 2026 విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 2026లో వస్తున్నందున, రెండు విడుదలల మధ్య ఆరోగ్యకరమైన అంతరాన్ని కొనసాగించాలని మేకర్స్ ఉన్నారట. విశ్వంభర తుది అవుట్పుట్ను మెగాస్టార్ ఆమోదించిన తర్వాత మాత్రమే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ప్రపంచంలోనే టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు విశ్వంభర కోసం పనిచేస్తున్నాయి. ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించాలని వశిష్ఠ తన ప్లాన్ మార్చుకున్నారు. పాన్ ఇండియా రేంజ్లో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
రెండు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. ఐసీసీ ఆగ్రహం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మెల్బోర్న్ పిచ్పై అసంతృప్తి వెలిబుచ్చింది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్లో నాలుగో టెస్టుకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికైంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ పిచ్ పేలవమని ప్రకటించింది. మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ‘ఏకపక్షంగా బౌలర్లకు మాత్రమే సహకరించిన వికెట్’ అని ఐసీసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఐసీసీ ఎంసీజీ అసంతృప్తిపరిచిన వేదిక అని... ఒక డిమెరిట్ పాయింట్ విధించింది.ఏదైనా వేదికకు 6 డిమెరిట్ పాయింట్లు జమ అయితే ఆ స్టేడియాన్ని 12 నెలల పాటు నిషేధిస్తారు. 26న మొదలైన ఈ ‘బాక్సింగ్ డే’ టెస్టు అత్యంత నిరుత్సాహకరంగా మరునాడే ముగిసింది. ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్లో మొదటి రోజే ఇరు జట్లు ఆలౌటయ్యాయి. 20 వికెట్లు నేలకూలాయి. తర్వాతి రోజు 16 వికెట్లు పడ్డాయి. ఆ్రస్టేలియాలో ‘బాక్సింగ్ డే’ టెస్టుకున్న ప్రత్యేకతే వేరు.ఏకంగా 90 వేలకు పైగానే ప్రేక్షకులు పోటెత్తిన ఈ మ్యాచ్ అనూహ్యంగా రెండే రోజుల్లో ముగియడం క్రికెట్ అభిమానుల్ని సైతం నిరాశపరిచింది. ఈ టెస్టుకు ముందే యాషెస్ను గెలుచుకున్న ఆతిథ్య ఆ్రస్టేలియా... ప్రస్తుతం 3–1తో ఇంగ్లండ్పై పైచేయిని కొనసాగిస్తోంది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు వచ్చే నెల 4 నుంచి సిడ్నీలో జరుగుతుంది.చదవండి: క్లీన్స్వీప్పై భారత్ గురి... నేడు శ్రీలంకతో ఐదో టి20 మ్యాచ్ -
Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షురాలు ఖలీదా జియా కన్నుమూశారు. 80 ఏళ్ల వయసున్న ఆమె ఢాకాలోని ఎవర్కేర్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తనువు చాలించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆమె నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరారు.Reuters reports, Bangladesh's first female Prime Minister, Khaleda Zia, dies at 80.— ANI (@ANI) December 30, 2025గత కొంతకాలంగా ఖలీదా జియా గుండె, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆమె దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె దీర్ఘకాలంగా మధుమేహం, ఆర్థరైటిస్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా సోకిన ఛాతీ ఇన్ఫెక్షన్ ఆమె శ్వాసక్రియపై తీవ్ర ప్రభావం చూపింది. వైద్యుల నివేదిక ప్రకారం ఆమె గుండె పనితీరు కూడా మందగించింది. దీంతో ఆమెను అత్యవసరంగా కోరోనరీ కేర్ యూనిట్ (ససీయూ) నుండి వెంటిలేటర్కు తరలించారు. ఆమె వ్యక్తిగత వైద్య బృందం, అంతర్జాతీయ నిపుణులు కలిసి ఆమెకు మెరుగైన వైద్యం అందించారు.ఖలీదా జియా మృతిపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆమె మంగళవారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచినట్లు తెలిపింది. ‘బీఎన్పీ చైర్పర్సన్, మాజీ ప్రధాని, జాతీయ నాయకురాలు బేగం ఖలీదా జియా ఈరోజు ఉదయం 6:00 గంటలకు ప్రార్థనల తర్వాత మరణించారు’ అని పార్టీ ఆ ప్రకటనలో తెలిపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని పేర్కొంది. బీఎన్పీ మీడియా సెల్ కూడా ఫేస్బుక్లో ‘మా ప్రియమైన జాతీయ నాయకురాలు బేగం ఖలీదా జియా ఇప్పుడు మాతో లేరు. ఆమె ఈరోజు ఉదయం 6 గంటలకు మరణించారు’ అని పోస్ట్ చేసింది.ఖలీదా జియా ప్రస్థానం.. భారత్తో బంధంబంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధ్యక్షురాలిగా సుదీర్ఘ కాలం సేవలందించారు. 1945లో అవిభక్త భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో జన్మించిన ఖలీదా జియాకు భారత్తో సంబంధం ఉంది. ఆమె భర్త, దివంగత అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పలు పోరాటాలు చేశారు.ఖలీదా జియా పదవీకాలంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఆమె పార్టీ బీఎన్పీని భారత్ వ్యతిరేకిగా కొందరు పరిగణించినప్పటికీ, ఆమె ఎప్పుడూ ఆ వాదనలను ఖండించారు. ఇటీవల ఆమె భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో, తమ పార్టీ భారత్కు వ్యతిరేకం కాదని, కేవలం వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. జల్పైగురిలో జన్మించిన ఆమెకు భారతీయ సంస్కృతి, ప్రాంతీయ సంబంధాలపై ప్రత్యేక గౌరవం ఉంది. 1991లో మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ తర్వాత 2001లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా ఆమె పలు అవినీతి ఆరోపణలు, జైలు శిక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవి భారత్తో దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపాయి.ఇది కూడా చదవండి: Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి -
విశాల్కు జతగా కయాదు లోహర్?
హిట్ కాంబోకు శ్రీకారం పడనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది కోలీవుడ్ వర్గాల నుంచి. నటుడు విశాల్, దర్శకుడు సుందర్.సిలది హింట్ కాంబో అనే చెప్పాలి. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు ఆంబళ అనే చిత్రం తెరకెక్కించి మంచి కమర్షియల్ హిట్ సాధించింది. అదే విధంగా అంతకు ముందు రూపొందిన మదగజరాజా చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 12 ఏళ్ల తరువాత తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ హిట్ కాంబో హ్యాట్రిక్కు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మకుటం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విశాల్ తదుపరి సుందర్.సి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవతున్నట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న సుందర్.సీ తదిపరి రజనీకాంత్ హీరోగా కమలహాసన్ నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది.అలాంటిది అనూహ్యంగా ఆ చిత్రం నుంచి సుందర్.సీ వైదొలిగారు. దీంతో తదిపరి ఆయన విశాల్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని సుందర్.సీ సొంత నిర్మాణ సంస్థ అవనీ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి సుందర్.సీ ఆస్థాన సంగీతదర్శకుడు హిప్హాప్ ఆది సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. ఇకపోతే సుందర్.సీ చిత్రాల్లో కథానాయికలకు ప్రాముఖ్యత ఉంటుంది. అదే సమయంలో గ్లామర్ సన్నివేశాలకు కొదవ ఉండదు. ఇంతకు ముందు ఆంబళ చిత్రంలో విశాల్కు జంటగా హన్సిక నటించారు. మదగజరాజా చిత్రంలో అంజలి, వరలక్ష్మీ శరత్కుమార్ నటించారు. ఈ సారి నటి కయాదు లోహర్ను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. డ్రాగన్ చిత్రంతో ఒక్క సారిగా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులోనూ నటిస్తున్నారు. అదే సమయంలో తమిళంలోనూ అవకాశాలను అందుకుంటున్నారు. జీవీ ప్రకాశ్కుమార్కు జంటగా ఇమ్మోర్టల్ చిత్రం చేస్తున్న కయాదు లోహర్ ఇప్పుడు విశాల్తో జత కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. -
Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి
ముంబై: ముంబై మహానగరంలోని భండూప్ ప్రాంతంలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ముంబై నగర రవాణా సంస్థ (బెస్ట్)కు చెందిన ఒక ఎలక్ట్రికల్ బస్సు అదుపు తప్పి, పాదచారులపైకి దూసుకెళ్లడంతో నలుగురు పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.నిత్యం రద్దీగా ఉండే భండూప్ స్టేషన్ రోడ్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విఖ్రోలి డిపోకు చెందిన ఈ బస్సు (రూట్ నంబర్ A-606) తన ప్రయాణాన్ని ముగించుకుని స్టేషన్ సమీపంలో రివర్స్ తీస్తుండగా, ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అజాగ్రత్త, సాంకేతిక లోపం కారణంగా బస్సు ఒక్కసారిగా వెనుక ఉన్న పాదచారులను బలంగా ఢీకొంది. ఆ సమయంలో రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న ప్రయాణికులు, పాదచారులు అప్రమత్తమయ్యేలోపే బస్సు వారిపైకి దూసుకువచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన తొమ్మిది మందిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా వెట్ లీజు (Wet Lease) ప్రాతిపదికన నడిచే బస్సుల నిర్వహణ, డ్రైవర్ల శిక్షణ, బస్సుల కండిషన్పై కఠినమైన తనిఖీలు ఉండాలని ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ కోరారు. రద్దీ ప్రాంతాల్లో బస్సులను వెనుకకు తీసే సమయంలో సహాయకులు (Helpers) ఉండాలని, డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఛేంజ్ మేకర్స్ 2025
→ డయానా పుండోల్32 ఏళ్ల ఈ ఇద్దరు పిల్లల తల్లి మోటార్ రేసింగ్లో మొదటి మహిళా జాతీయ ఛాంపియన్. ఆమె 2024లో ఎంఆర్ఎఫ్ ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ను గెలుచుకున్నారు. పురుషులు–ఆధిపత్యం వహించే ఈ క్రీడలో స్త్రీల నుంచి ఇదో పెద్ద ముందడుగు. ఇప్పుడు 2025–2026 ఫెరారీ క్లబ్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్ సిరీస్లో ΄ోటీ పడుతున్న మొదటి భారతీయ మహిళగా నిలిచారు, ఫెరారీ 296 ఛాలెంజ్ కారును నడుపుతున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా పనిచేసి, ఇప్పుడు రేసింగ్లో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.→ అంజ్లీ అగర్వాల్డాక్టర్ అంజ్లీ అగర్వాల్కు జీవితంలో ఎదురైన లోతైన బాధలెన్నో తెలుసు. కండరాల బలహీనతతో చక్రాల కుర్చీలో జీవిస్తున్నారామె. బహిరంగ స్థలాల్లో ర్యాంప్ లేక΄ోవడం వల్ల అవస్థ పడుతున్న తనలాంటి వేలమంది దివ్యాంగుల కోసం ఆమె ΄ోరాటం సాగిస్తున్నారు. ఆమె, ఆమె బృందం కలిసి వందలాది ప్రజా స్థలాలకు పునః రూపకల్పన చేశారు. ర్యాంప్ ఉండటం వల్ల దివ్యాంగులు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని అధికారులకు అవగాహన కల్పించారు.→ బీబీ జాన్ కర్నాటకకు చెందిన బీబీ జాన్ చిన్నపాటి లోన్ కోసం బ్యాంక్ వెళితే తనలాంటి వాళ్లకు లోన్ రావడం ఎంత కష్టమో తెలియడమే కాకుండా తనలాంటి వాళ్లు చాలామంది లోన్ల కోసం బాధలు పడుతున్నారని అర్థమైంది. దాంతో ఆమె స్థానిక స్వయం సహాయక సంఘానికి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చి 14 మంది సభ్యుల బృందంతో మొదలుపెట్టి నేడు 1,000 మందికి పైగా మహిళల సమష్టి ఎదుగుదలకు కారణమయ్యారు. వారంతా స్వంత మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ను నడుపుతూ సేంద్రీయ, వాతావరణ–స్థిరమైన పద్ధతులను ఉపయోగించి 30 గ్రామాలలో వ్యవసాయం చేస్తున్నారు. -
తగ్గుతున్న ఏటీఎంలు
ముంబై: డిజిటల్ చెల్లింపుల నేపథ్యంలో ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్లు (ఏటీఎంలు) తగ్గుముఖం పడుతున్నాయి. 2024 మార్చి నాటికి 2,53,417 ఏటీఎంలు దేశవ్యాప్తంగా ఉంటే, 2025 మార్చి చివరికి 2,51,057కు తగ్గినట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో 2,360 ఏటీఎం మెషిన్లు తగ్గినట్టు తెలుస్తోంది. ఇదే కాలంలో బ్యాంక్ శాఖల సంఖ్య 2.8 శాతం పెరిగి 2025 మార్చి చివరికి 1.64 లక్షలకు చేరినట్టు తెలిపింది. ప్రైవేటు బ్యాంక్ల ఏటీఎంలు 79,884 నుంచి 77,117కు తగ్గాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ల ఏటీఎంలు 1,34,694 నుంచి 1,33,544కు తగ్గాయి. డిజిటల్ చెల్లింపులు పెరగడంతో ఏటీఎంల్లో కస్టమర్ల లావాదేవీలు తగ్గినట్టు ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఇక వైట్ లేబుల్ ఏటీఎంలు (స్వతంత్ర సంస్థలు నిర్వహించే) మాత్రం 34,602 నుంచి 36,216కు పెరిగాయి.ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఏటీఎంలు ప్రధానంగా పట్టణాల్లో ఎక్కువగా ఉంటే, ప్రభుత్వరంగ బ్యాంక్ల ఏటీఎంలు మాత్రం పట్టణాలతో పాటు గ్రామీణ పట్టణాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్లు గత ఆర్థిక సంవత్సరంలో కొత్త శాఖల్లో మూడింట రెండొంతులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశాయి. కానీ, ప్రైవేటు బ్యాంకులు కొత్త శాఖల్లో మూడింట ఒక వంతు గ్రామీణ ప్రాంతాలకు కేటాయించాయి. బేసిక్ సేవింగ్స్ ఖాతాల సంఖ్య 2.6 శాతం పెరిగి 72.4 కోట్లకు చేరింది. ఖాతాల్లోని బ్యాలన్స్ 9.5 శాతం పెరిగి రూ.3.3 లక్ష లక్షల కోట్లకు చేరుకున్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. -
వాళ్లను తరిమేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
బోర్డోవా/గువాహటి: అస్సాం అభివృద్ధి, సంస్కృతికి ప్రతిబంధకంగా మారిన బంగ్లాదేశ్ చొరబాటుదారులను తరిమికొట్టే ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని అస్సాం ఓటర్లకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సోమవారం అస్సాంలో సుడిగాలి పర్యటన చేసిన అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గువాహటిలో నూతన పోలీస్ కమీషనరేట్, నిఘా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. చొరబాటుదారులతో పోరాటంతో ప్రాణత్యాగంచేసిన వీరులకు ‘స్వాహిద్ స్మారక్ క్షేత్ర’లో నివాళులరి్పంచారు. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సాధువు, సంఘ సంస్కర్త శ్రీమంత శంకర్దేవ్ ‘బతద్రవ థాన్’పుణ్యక్షేత్రంలో రూ.227 కోట్లతో పునరుద్ధరణ పనులను షా ప్రారంభించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గోపినాధ్ బోర్దోలాయ్, సంగీత సామ్రాట్ భూపెన్ హజారికా, యువ సంగీత తరంగం, దివంగత జుబెన్ గార్గ్, దిగ్గజ అహోం జనరల్ లాచిత్ బోర్ఫుకన్లకు షా నివాళులరి్పంచారు. తర్వాత బోర్డోవా పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో మీ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రం నుంచి విదేశీ చొరబాటుదారులందరినీ మూకుమ్మడిగా తరిమికొట్టే సత్తా ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకోండి. చొరబాటుదారులను అనుమతించని సర్కార్ను ఎన్నుకోండి. అస్సాం అభివృద్ధికి పాటుపడే నేతలకే పట్టంకట్టండి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి కాంగ్రెస్ రాష్ట్రంలోకి విదేశీయుల చొరబాట్లను ప్రోత్సహించింది. ఇప్పుడది అస్సాం అస్థిత్వం, గుర్తింపునకు ముప్పుగా పరిణమించింది’’అని షా అన్నారు. మరో ఛాన్స్ ఇవ్వండి ‘‘అస్సాంలో బీజేపీ ప్రభుత్వాల హయంలో గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధ్యమైంది. ఆ అభివృద్ధి సరిపోదు. శ్రీమంత సాధువు జని్మంచిన పుణ్యస్థలి నుంచి మీకు వాగ్దానం చేస్తున్నా. మరో ఐదేళ్లు పరిపాలించే అవకాశం ఇవ్వండి. అస్సాం నుంచి చొరబాటుదారులందరినీ వెనక్కి పంపేస్తాం. ఈ రాష్ట్రమేకాదు ప్రతి రాష్ట్రం నుంచి చొరబాటుదారులను తరిమేస్తాం. ప్రధాని మోదీ మీ సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించమేకాదు మీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారు’’అని షా అన్నారు. -
తైవాన్ జలసంధిలో భారీగా విన్యాసాలు
బీజింగ్: తైవాన్ ఎప్పటికీ తమదేనంటున్న డ్రాగన్ దేశం చైనా తైవాన్ జలసంధిలో తాజాగా సైనిక విన్యాసాలకు తెరతీసింది. తైవాన్కు మద్దతుగా జపాన్ ప్రధానమంత్రి తకాయిచీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు, తైవాన్కు అమెరికా ఇటీవల భారీగా ఆయుధాలను విక్రయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నడుమ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్ఏ) ఈస్టర్న్ థియేటర్ కమాండ్ సోమవారం యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లతోపాటు లాంగ్ రేంజ్ క్షిపణులతో తైవాన్ జలసంధి మధ్యప్రాంతంలో సముద్రజలాలతోపాటు గగనతలంలోనూ విన్యాసాలు చేపట్టింది. ఈ విషయాన్ని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. కీలకమైన లక్ష్యాలను కచి్చతంగా ఛేదించేలా బలగాల సామర్థ్యాలకు పదును పెట్టడమే వీటి ఉద్దేశమని పేర్కొంది. చైనా చర్యలపై తైవాన్ వెంటనే స్పందించింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ విన్యాసాలను చేపట్టామని తైవాన్ రక్షణ మంత్రి తెలిపారు. చైనా మిలటరీ చర్యలను శాంతికి తీవ్ర విఘాతం కలిగించే దుందుడుకు వైఖరిగా ఆయన అభివరి్ణంచారు. తైవాన్ వైమానిక స్థావరంలో ల్యాండవుతున్న పలు మిరేజ్ 2000 యుద్ధ విమానాల వీడియోను విడుదల చేశారు. దీంతో, సోమవారం పీఎల్ఏ చేపట్టిన విన్యాసాలు ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచినట్లయిందని పరిశీలకులు అంటున్నారు. ఓ వైపు జపాన్.. మరో వైపు అమెరికా నవంబర్ 7న జపాన్ పార్లమెంటులో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తైవాన్లో తలెత్తే ఏదైనా అత్యవసర పరిస్థితి జపాన్ మనుగడకే ముప్పు కలిగించే పరిస్థితిగా మారవచ్చని, అటువంటప్పుడు అమెరికాకు మద్దతుగా జపాన్ సైన్యం రంగంలోకి దిగాల్సిన అవసరం రావచ్చని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తకాయిచీ తకైచి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. చైనా విమా న వాహక నౌకలు, విమానాల సంచారంపై ఓ కన్నేసి ఉంచేందుకు ఒకినావాలోని సుదూర తూర్పు ద్వీపంలో మొబైల్ సర్వైలెన్స్ రాడార్ యూనిట్ను మోహరించాలనే జపాన్ నిర్ణయాన్ని కూడా చైనా విమర్శించింది. తైవాన్కు సమీపంలో జపాన్ లకి‡్ష్యత సైనిక మోహరింపులను బలోపేతం చేయడా న్ని, మధ్యశ్రేణి క్షిపణులను మోహరించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చైనా తీవ్రంగా తప్పుబట్టింది. సైనిక శక్తిని బలోపేతం చేసుకునేందుకు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడు తోందని ఆరోపించింది. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే ఈ నెల 18వ తేదీన తైవాన్కు రూ.లక్ష కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఆమోదం తెలిపిన పక్షంలో తైవాన్కు ఇచ్చే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీ అవుతుంది. అమెరికా చర్య తైవాన్ స్వాతంత్య్రం కోరే, వేర్పాటువాద శక్తులకు ఊతమిచి్చనట్లేనని చైనా కన్నెర్ర చేసింది. తైవాన్ స్వాతంత్య్ర శక్తులు ఆ దీవిని పేలేందుకు సిద్ధంగా ఉన్న బాంబులాగా మారుస్తారంటూ వ్యాఖ్యానించింది. చైనా స్వాతంత్య్రాన్ని, సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడు కునేందుకు అవసరమైన అన్ని చర్యలను తప్పక తీసుకుంటుందని స్పష్టం చేసింది. 2022లో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్కు మద్దతు తెలిపేందుకు వచి్చనప్పటి నుంచి డ్రాగన్ దేశం విన్యాసాల పేరుతో తైవాన్ను పలుమార్లు దిగ్బంధనం చేసింది. -
ఎమ్మెల్యే విరూపాక్షికి వైఎస్ జగన్ పరామర్శ
ఆలూరు రూరల్: హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆర్యోగంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. -
యువ సాహిత్యోత్సవం.. బుక్ ఫెయిర్.
హైదరాబాద్ నగరం మరోసారి తన సాహిత్య ప్రేమను చాటుకుంది. నగరం వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 38వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ నేటితో ముగియనుంది. అయితే ఈ పుస్తకాల పండుగ ముగిసినా, పాఠకుల మనసుల్లో మాత్రం దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతీ ఏడాది తన ప్రశస్తిని, ప్రాధాన్యతను మరింత పెంచుకుంటూ వస్తున్న ఈ బుక్ ఫెయిర్… ఈ సారి మాత్రం ఈ తరం రచయితలు, యువ పాఠకుల ఉత్సాహంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిజిటల్ రీల్స్, షార్ట్ వీడియోలు, ఏఐ కంటెంట్తో నిండిపోయిన ఈ కాలంలోనూ భౌతికంగా పుస్తకాన్ని చేతిలో పట్టుకుని చదవాలనే ఆసక్తి తగ్గలేదని ఈ బుక్ ఫెయిర్ మరోసారి నిరూపించింది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, యంగ్ ప్రొఫెషనల్స్, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న యువత పెద్ద సంఖ్యలో బుక్ ఫెయిర్ను సందర్శించారు. పుస్తకాలను కొనడమే కాకుండా, రచయితలతో నేరుగా మాట్లాడటం, ఆటోగ్రాఫ్లు తీసుకోవడం, కొత్త రచనలపై చర్చించడం వంటి అంశాలు బుక్ ఫెయిర్ను ఒక లైఫ్స్టైల్ ఎక్స్పీరియన్స్గా మార్చాయి.ఈ తరం రచయితలు కూడా పాఠకుల అభిరుచులను బాగా అర్థం చేసుకుంటున్నారు. సమకాలీన జీవితానికి దగ్గరగా ఉండే కథలు, నిజ జీవిత అనుభవాల నుంచి పుట్టిన రచనలు, భావోద్వేగాలను స్పృశించే నరేటివ్స్ ఈ సారి ఎక్కువగా కనిపించాయి. ప్రేమ, ఎమోషన్స్, రిలేషన్షిప్స్, సామాజిక స్థితిగతులు, యువత ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, కెరీర్ డైలమాస్ వంటి అంశాలు రచనలకు కేంద్రబిందువుగా మారాయి. పాఠకులు కూడా ఇలాంటి ఆర్గానిక్, రియల్ లైఫ్ టచ్ ఉన్న పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో ట్రావెల్, సినిమా, కల్చర్, ఫుడ్, వ్యక్తిత్వ వికాసం వంటి లైఫ్స్టైల్ అంశాలకు చెందిన పుస్తకాలు కూడా మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా ట్రావెల్ బుక్స్ విషయంలో యువత ప్రత్యేక ఆసక్తి చూపించింది. కొత్త ప్రదేశాలు, అనుభవాలు, లోకల్ కల్చర్ను పరిచయం చేసే రచనలు ఈ తరం ఆలోచనలకు అద్దం పట్టాయి. సినిమా రంగానికి సంబంధించిన కథనాలు, స్క్రీన్రైటింగ్, సినిమా అనాలిసిస్ వంటి పుస్తకాలు కూడా సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాయి.ఈ బుక్ ఫెయిర్లో మరో ముఖ్యమైన విశేషం… మహిళా రచనల సంఖ్య గణనీయంగా పెరగడం. మహిళల జీవితానుభవాలు, వారి భావోద్వేగాలు, సామాజిక పోరాటాలు, స్వతంత్ర ఆలోచనలు ప్రతిబింబించే పుస్తకాలు పాఠకుల దృష్టిని ఆకర్షించాయి. ఇది తెలుగు సాహిత్యంలో మారుతున్న దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది. మహిళా రచయితలు కేవలం ఒక జానర్కే పరిమితం కాకుండా, కథలు, నవలలు, కవిత్వం, లైఫ్స్టైల్ రైటింగ్స్లోనూ తమ ప్రత్యేక ముద్ర వేశారు.పబ్లిషింగ్ హౌసెస్ కూడా అధునాతన మార్పును గమనించాయి. యువతకు నచ్చే కవర్ డిజైన్స్, ఈజీ లాంగ్వేజ్, రీడర్ ఫ్రెండ్లీ ప్రెజెంటేషన్తో పుస్తకాలను అచ్చు వేస్తూ, కొత్త రచయితలకు అవకాశాలు కల్పించడం ఈ సారి స్పష్టంగా కనిపించింది. స్వయంగా పబ్లిషర్స్గా మారిన యువ రచయితలు కూడా తమ రచనలను పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. మొత్తానికి, 38వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ఈ తరం ఆలోచనలకు, అభిరుచులకు, లైఫ్స్టైల్కు అద్దం పట్టిన వేదికగా నిలిచింది. పుస్తకం అంటే కేవలం చదవడమే కాదు… అది ఒక అనుభవం, ఒక జీవనశైలి అన్న భావనను ఈ బుక్ ఫెయిర్ మరోసారి బలంగా చెప్పింది.పుస్తకాలు., మనుషులు., సమాజం.బుక్ ఫెయిర్ అంటే మాలాంటి రచయితలు, పాఠకులకు పండుగ. పుస్తకాలను ప్రేమించేవారు మనుషులను ప్రేమిస్తారు.., మనుషులను ప్రేమించే వారు సామజాన్ని ప్రేమిస్తారు. ఇలా సాహిత్యం వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా పరిపూర్ణత్వాన్ని, విఙ్ఞానాన్ని, వికాసాన్ని అందిస్తుంది. ఈ సారి బుక్ ఫెయిర్లో నా కొత్త పుస్తకం ‘యుద్ద కాలపు శోక గీతం’ కూడా అందుబాటులో ఉంది. నా ఈ ధీర్ఘ కవితకు ఈ తరం పాఠకుల నుంచి మంచి స్పందన రావడం నా బాధ్యతను మరింత పెంచింది అనిపించింది. సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యేవారు బుక్ ఫెయిర్లో గుర్తు పట్టి మరీ నా బుక్ కొనడం నా సాహిత్య ప్రయాణం ప్రాధాన్యతను మరొక్కసారి గుర్తు చేసింది. మనిషిని మనిషిలా చూడలేని సమాజాన్ని ప్రశ్నించడం నాకు ఇష్టం.. ఇలాంటి రచనలను సైతం ఈ తరం యువత ఆసక్తిగా చదవడం ధృఢమైన భవిష్యత్కు నాందిలా భావిస్తున్నాను. -మెర్సీ మార్గరేట్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత.రచయితల ఆలోచనలు తెలసుకోవచ్చు.,మాలాంటి యువతకు సమాజ దృక్కోణాన్ని మరింత పాజిటీవ్గా, భాధ్యతాయుతంగా చూపించడం కోసమే బుక్ ఫెయిర్ ఇంకా కొనసాగుతోందని అనిపిస్తుంది. నాకు రచనలు చేయడం ఇష్టం, అంతకు మించి చదవడం ఇష్టం. వీటి పైన ఉన్న ఆసక్తితో బుక్ ఫెయిర్కు సంబంధించిన పనుల్లో ఒక వాలంటీర్గా, నిర్వహణకు నా వంతు సహాయాన్ని అందించే యువకుడిగా ఉన్నాను. బుక్స్ లైబ్రరీల్లో, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి.. కానీ అవి రాసే రచయితలను వ్యక్తిగతంగా కలుసుకుని వారి ఆలోచనా విధానాన్ని మరింత తెలసుకోవడానికి ఈ బుక్ ఫెయిర్ మంచి వేదిక. - పేర్ల రాము, యువ సాహితీ ప్రేమికుడు. క్లాసిక్స్కూ మంచి ఆదరణ..,ప్రతీ ఏడాది బుక్ ఫెయిర్ ఇస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని కొత్త పుస్తకాలను తీసుకొస్తున్నాం. యువ రచయితల కొత్త పుస్తకాలతో పాటు ఆ నాటి తరం క్లాసిక్ రచనలను అమృతం కురిసిన రాత్రి, మహాప్రస్తానం, అమరావతి కథలు, బారీష్టర్ పార్వతీశం వంటి పుస్తకాల అమ్మకాలు ప్రస్తుత బుక్ ఫెయిర్లో పెరుగుతున్నాయి. మా పబ్లిసింగ్ హౌస్ నుంచి దేశీయంగానే కాకుండా ఇతర దేశాల్లోని వివిధ భాషల్లోని అత్యుత్తమ నవలలు, కథలు ఇతర రచనలను ప్రచురిస్తున్నాం. అయితే ఈ బుక్ ఫెయిర్ మాత్రమే కాకుండా తమిళనాడు తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో లైబ్రరీల సంరక్షణ, పెంపుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుంటున్నారు. -అరునాంక్ లత, ఛాయ పబ్లిషర్స్ సీఈఓ.ప్రతీ ఏడాది బుక్ ఫెయిర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను. నాలాంటి ఎంతో మంది బుక్ రీడర్స్కు అంతలా మమేకం అయిపోయింది ఈ బుక్ ఫెయిర్. పుస్తకాలు కొనడమే కాదు బుక్ లవర్స్ కమ్యూనిటీ అంతా ఒకే వేదికగా కలుసుకునే అద్భుత అవకాశాన్ని ఈ బుక్ ఫెయిర్ అందిస్తుంది. గత రెండు మూడేళ్లుగా అధునిక రచనలతో యువత రాస్తున్న సమకాలీన రచనలు పుస్తకాలను మరింత కాలం ముందుకు తీసుకెళుతున్నాయి. -కావలి చంద్రకాంత్, యువ పాఠకుడు. -
క్లీన్స్వీప్పై భారత్ గురి... నేడు శ్రీలంకతో ఐదో టి20 మ్యాచ్
తిరువనంతపురం: ఈ ఏడాదిని క్లీన్స్వీప్తో ముగించేందుకు భారత మహిళల టి20 క్రికెట్ జట్టు విజయం దూరంలో ఉంది. శ్రీలంక జట్టుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి టి20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్న హర్మన్ప్రీత్ కౌర్ బృందం వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి జోరు మీదుంది. మరోవైపు క్లీన్స్వీప్ తప్పించుకోవాలని, ఒక్క విజయంతోనైనా పరువు దక్కించుకోవాలని శ్రీలంక భావిస్తోంది. అయితే అన్ని రంగాల్లో విఫలమవుతున్న చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక ఆఖరి మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో వేచి చూడాలి. వచ్చే ఏడాది జూన్–జూలైలో ఇంగ్లండ్ వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ టోరీ్నకి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టిన టీమిండియా త్వరలో మరో రెండు టి20 సిరీస్లు (ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లతో) ఆడనుంది. -
కొంచెం మోదం... కొంచెం ఖేదం
పురుషుల హాకీ, బ్యాడ్మింటన్, షూటింగ్ ప్రతీ సంవత్సరం తరహాలోనే ‘సమ్’తృప్తిని పంచాయి. చెస్లో మహిళల వరల్డ్ కప్ టైటిల్తో కాస్త అదనపు ఆనందం దక్కితే, ఆర్చరీ, బాక్సింగ్లలో ఫర్వాలేదనిపించే ఫలితాలు వచ్చాయి. ఫుట్బాల్, టెన్నిస్ ఎప్పటిలాగే నిరాశను పంచితే... వెయిట్లిఫ్టింగ్లో కొత్త తరం విజయాలు అందించలేకపోయింది. నీరజ్ చోప్రా తన స్థాయికి తగినట్లు పతకం తేలేక ప్రపంచ వేదికపై నిరాశ పర్చడం అనూహ్య ప్రదర్శనగా మిగిలిపోయింది. 2025లో క్రికెటేతర క్రీడల్లో భారత ఆటగాళ్లు అటు టీమ్ ఈవెంట్లలో, ఇటు వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ మిశ్రమ ప్రదర్శన కనబర్చారు. ప్రపంచ వేదికపై ఓ ఆటగాడిని శిఖరాన నిలిపే అసాధారణ ప్రదర్శన లేదా అద్భుత క్షణాలు మాత్రం చెప్పుకోదగ్గవి ఏవీ రాలేదు. ఈ ఏడాది భిన్న క్రీడాంశాల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను సమీక్షిస్తే... ఆర్చరీ: భారత్కు సంబంధించి ఆర్చరీలో ఈ ఏడాది గుర్తుంచుకోదగ్గ విధంగా సాగింది. నాలుగు ప్రపంచకప్లలో కలిపి భారత ఆర్చర్లు మొత్తం 15 పతకాలు గెలుచుకున్నారు. 2025 ప్రపంచ కప్ పతకాల పట్టికను భారత్ నాలుగో స్థానంతో ముగించింది. వరల్డ్ చాంపియన్షిప్లో భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం గెలుచుకుంది. ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో 10 పతకాలతో అగ్రస్థానం సాధించడం విశేషం. వరల్డ్ పారా ఆర్చరీ చాంపియన్షిప్లో శీతల్ దేవి స్వర్ణంతో మెరిసింది. ఫుట్బాల్: భారత ఫుట్బాల్ చరిత్రలో మరో చెత్త సంవత్సరంగా ఇది మిగిలిపోనుంది. అతి చిన్న జట్ల చేతుల్లో ఓడిపోవడంతోపాటు ప్రపంచ ర్యాంకింగ్స్లో మరింత దిగువకు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్లో 127వ ర్యాంక్లో ఉన్న టీమ్ చివరకు వచ్చేసరికి 142వ ర్యాంక్తో ముగించింది. మహిళల జట్టు కొంత మెరుగ్గా ఆడటం విశేషం. క్వాలిఫికేషన్ టోర్నమెంట్ గెలవడం ద్వారా 2026 ఆసియా కప్కు భారత మహిళలు అర్హత సాధించారు.రెజ్లింగ్: 2025 వరల్డ్ చాంపియన్షిప్లో భారత్ ఏకైక పతకాన్ని గెలుచుకుంది. మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ ఆ ఘనతను సాధించింది. ఆసియా చాంపియన్షిప్లో మన దేశం 10 పతకాలు గెలుచుకుంది. తాను రిటైర్మెంట్ను వీడి మళ్లీ రెజ్లింగ్ బరిలోకి దిగుతున్నట్లు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఏడాది చివర్లో ప్రకటించింది. సీనియర్లతో పోలిస్తే ప్రపంచ అండర్–20, అండర్–23 ఈవెంట్లలో మన రెజ్లర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చి భవిష్యత్తుపై ఆశలు రేపారు.టెన్నిస్: పురుషుల టెన్నిస్లో భారత్కు సంబంధించి చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ఏ ఒక్కరు కూడా టాప్–200 ర్యాంకింగ్స్లోకి వెళ్లలేకపోగా, చాలెంజర్ టూర్లో సింగిల్స్ విభాగంలో ఒక్కరూ కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయారు. ఏటీపీ టూర్ డబుల్స్లో యూకీ బాంబ్రీ దుబాయ్ ఓపెన్ గెలవగా, రితి్వక్ బొల్లిపల్లి చిలీ ఓపెన్ సాధించాడు. డేవిస్ కప్లో స్విట్జర్లాండ్ను ఓడించి భారత్ 2026 డేవిస్ కప్ క్వాలిఫయర్ దశకు అర్హత సాధించగా... బిల్లీ జీన్కింగ్ కప్లో భారత్ ప్లే ఆఫ్స్ దశ వరకు వెళ్లగలిగింది. వర్ధమాన క్రీడాకారిణుల్లో శ్రీవల్లి రషి్మక, మాయ చక్కటి ఆటతో అందరి దృష్టిలో పడినా... ఫలితాలపరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ డబుల్స్ స్టార్, రెండు గ్రాండ్స్లామ్ల విజేత రోహన్ బోపన్న ఈ ఏడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్యాడ్మింటన్: భారత షట్లర్లు అంతర్జాతీయ వేదికపై మెరుగైన ప్రదర్శన కనబర్చారు. వరల్డ్ చాంపియన్షిప్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడి కాంస్యం గెలుచుకోవడం ఈ ఏడాది హైలైట్ కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్లో మరో మూడు టైటిల్స్ మన ఆటగాళ్ల ఖాతాలో చేరాయి. ఆ్రస్టేలియన్ ఓపెన్ను లక్ష్య సేన్, యూఎస్ ఓపెన్ను ఆయుశ్ శెట్టి గెలుచుకోగా... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడి సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్ను సొంతం చేసుకుంది. టేబుల్ టెన్నిస్: వరల్డ్ టీటీ టూర్లో భారత ఆటగాళ్లు రెండు టైటిల్స్ సాధించగలిగారు. మిక్స్డ్ డబుల్స్లో దియా–మనుష్ జోడీ ట్యూనిస్ కంటెండర్ టోర్నీని, పురుషుల డబుల్స్లో సత్యన్–ఆకాశ్ ద్వయం లాగోస్ కంటెండర్ టోర్నీని సొంతం చేసుకున్నారు. ఆసియా టీటీ చాంపియన్షిప్లో కనీసం ఒక్క పతకమైనా గెలుచుకోవడంలో భారత ప్యాడ్లర్లు సఫలం కాలేకపోయారు. పురుషుల టీమ్ 11వ, మహిళల టీమ్ 12వ ర్యాంక్తో ఈ ఏడాదిని ముగించింది. షూటింగ్: ఈ ఏడాది షూటింగ్లో భారత్ ప్రదర్శన సంతృప్తికరంగా సాగింది. అన్ని ప్రపంచకప్లలో కలిపి 11 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు గెలుచుకున్న భారత్... ఓవరాల్గా రెండో స్థానంతో ముగించింది. వరల్డ్ షూటింగ్ చాంపియన్షిప్లో కూడా మన షూటర్లు మొత్తం 13 పతకాలు అందించారు. ఈ ఏడాది కొత్తగా వెలుగులోకి వచ్చి వేర్వేరు టోర్నీల్లో సత్తా చాటిన షూటర్గా సురుచి సింగ్ (మహిళల పిస్టల్)కు గుర్తింపు లభించింది.వెయిట్లిఫ్టింగ్: వరల్డ్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. ఇవి మినహా ఈ క్రీడాంశంలో భారత్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు.హాకీ: భారత పురుషుల జట్టు ఆసియా కప్లో విజేతగా నిలిచి వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్కు అర్హత సాధించడం చెప్పుకోదగ్గ విశేషం. అయితే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టోర్నీలో పేలవ ప్రదర్శనతో జట్టు ఎనిమిదో స్థానంతో ముగించింది. మహిళల హాకీ జట్టు ప్రదర్శన అయితే మరీ పేలవంగా ఉంది. చెప్పుకోదగ్గ విజయం ఒక్కటీ దక్కకపోగా...ప్రొ హాకీ లీగ్లో దిగువ స్థానానికి పడిపోయింది. చెస్: మహిళల చెస్ వరల్డ్ కప్లో భారత్కు చెందిన దివ్య దేశ్ముఖ్ చాంపియన్గా, కోనేరు హంపి రన్నరప్గా నిలవడం ఈ ఏడాది చదరంగంలో చెప్పుకోదగ్గ విశేషం. వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాతి ఏడాది గుకేశ్ కెరీర్ పడుతూ, లేస్తూ సాగింది. ‘ఫిడే’ వరల్డ్ కప్లో, ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్స్లామ్లో అతను విఫలమయ్యాడు. అయితే నార్వే ఓపెన్లో దిగ్గజం కార్ల్సన్పై సాధించిన గెలుపు చిరస్మరణీయంగా నిలిచింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్లో ప్రజ్ఞానంద, అర్జున్, నిహాల్, విదిత్, హరికృష్ణ విఫలం కాగా...‘ఫిడే’ సర్క్యూట్లో గెలిచి ఎట్టకేలకు ప్రజ్ఞానంద క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించగలిగాడు. ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో కోనేరు హంపి, ఇరిగేశి అర్జున్ కాంస్య పతకాలతో మెరిశారు. ఈ ఒక్క ఏడాదే భారత్ నుంచి ఆరుగురు కొత్త ‘గ్రాండ్మాస్టర్లు’ రావడం విశేషం.అథ్లెటిక్స్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో ఏడాదిని తన పేరిట లిఖించుకున్నాడు. పారిస్ డైమండ్ లీగ్, పోష్్రసూ్టమ్ ఇని్వటేషనల్, కుసోసిన్కీ మెమోరియల్, గోల్డెన్ స్పయిక్ ఒస్ట్రావా, నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లలో (మొత్తం ఐదు) నీరజ్ విజేతగా నిలిచాడు. పైగా కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మార్క్ను కూడా (దోహా డైమండ్ లీగ్లో) అతను దాటడం మరో విశేషం. అయితే దురదృష్టవశాత్తూ 2025 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో చోప్రా పతకం గెలవకుండా వెనుదిరగడం మాత్రం నిరాశ కలిగించిన అంశం. మరోవైపు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు 8 స్వర్ణాలు సహా మొత్తం 24 పతకాలు గెలుచుకున్నారు.బాక్సింగ్: వరల్డ్ చాంపియన్షిప్లో భారత్ 4 పతకాలు గెలుచుకుంది. వరల్డ్ బాక్సింగ్ కప్ సిరీస్లో భారత్ 3 ప్రపంచ కప్లలో కలిపి 13 స్వర్ణాలు సహా మొత్తం 40 పతకాలు సాధించడం విశేషం. తెలంగాణ బాక్సర్ నిఖత్ కూడా పసిడి పతకం నెగ్గింది. –సాక్షి క్రీడా విభాగం -
అల్లోపతి.. ఆయుర్వేదం.. చేయవద్దు మిక్సోపతి
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు (సర్జరీలు) చేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని అల్లోపతి వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సైతం ప్రకటించింది. ఆయుర్వేద పీజీ వైద్యులు 58 రకాల శస్త్ర చికిత్సలు స్వతంత్రంగా చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఈ నెల 23న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు.వాటిలో 39 శల్యతంత్ర(సాధారణ శస్త్ర చికిత్సలు), 19 శలాక్య తంత్ర(ఈఎన్టీ, నేత్ర, దంత వంటి ఇతర) శస్త్రచికిత్సలు ఉన్నాయి. పురాతన వైద్య విధాన ప్రక్రియలను ఆధునిక చికిత్సలతో అనుసంధానం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై రాష్ట్రంలోనే కాకుండా, జాతీయ స్థాయిలో అల్లోపతి వైద్యులు మండిపడుతున్నారు. స్వచ్ఛమైన రూపంలోనే ప్రోత్సహించాలిఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ పి.భన్సాలీ ఇప్పటికే ప్రకటించారు. తమకు ఆయుర్వేద, హోమియోపతి వైద్య ప్రక్రియలపై గౌరవం ఉందన్నారు. ఆయుర్వేదం దాని అసలైన, స్వచ్ఛమైన రూపంలోనే ప్రోత్సహించాలని, ఆధునిక వైద్యంతో ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు. సరైన శిక్షణ లేని వారు సర్జరీలు చేస్తే రోగుల ప్రాణాల మీదకు వస్తుందని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది.అల్లోపతి, ఆయుర్వేద, వివిధ వైద్య విధానాలను కలిపి మిక్సోపతి చేస్తే వైద్య ప్రమాణాలు దెబ్బతింటాయని తెలిపింది. ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ 2020లోనే మార్గదర్శకాలు ఇచ్చింది. అప్పట్లోనే దీన్ని అల్లోపతి వైద్యులు దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు సైతం చేశారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. వచ్చే నెల ఎనిమిదో తేదీన విచారణకు రానుందని ఐఎంఏ చెబుతోంది. అనుసంధానం చేయవద్దుఅల్లోపతి, ఆయుర్వేదం హోమియోపతి వైద్య విధానాలను ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో తప్పులేదు. అలా కాకుండా ఒకదానితో మరొకటి అనుసంధానం చేసి మిక్సోపతి చేయవద్దు. ఇలా చేస్తే వైద్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మోడ్రన్ మెడిసిన్ వైద్యులకు అనాటమీ, పథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీలో నైపుణ్యం ఉంటుంది. వీటిపై ప్రాచీన వైద్య విద్య అభ్యసించిన వారికి అవగాహన తక్కువ ఉంటుంది. ఆధునిక వైద్యంతో ఆయుర్వేదాన్ని అనుసంధానం చేయడం సరికాదు. – డాక్టర్ ఎస్.బాలరాజు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు -
ఎన్నికల రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇటీవల నియమితులైన నితిన్ నబిన్ అప్పుడే కార్యరంగంలోకి దూకారు. వచ్చే ఏడాదిలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రా పార్టీ ఇన్ఛార్జీలు, కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని తిరిగి నిలబెట్టడం, బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఓటు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘జాతీయ పార్టీ అయినా, స్థానికంగానే ఆలోచించాలి’అన్న విధానంతో రాష్ట్రానికో ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో పట్టుకోసం.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నబిన్ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఇందులో ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంగా అధికారం అందుకోలేకపోతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయడం అంత సులభమయ్యేది కాదు. దీనికి తోడు ఇప్పటికే రెండుమార్లు అధికారంలో ఉన్న అస్సాంలో పార్టీని తిరిగి నిలబెట్టడం కత్తిమీద సాములాంటిదే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను నబిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయన ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్, వినోద్ తావ్డే, అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్ తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగానే ప్రతి బూత్కు ఒక ఇన్ఛార్జి, ఒక డేటా వలంటీర్, ఒక సోషల్ మీడియా వలంటీర్లను సిధ్దం చేయాలనే సూచనలు వచ్చాయి. ‘ఎన్నికలను స్టేజ్ మీద కాదు..బూత్ వద్ద గెలుస్తాం’అన్న విధానాన్ని అవలంబిస్తూనే..యువత, మహిళలను క్రియాశీలకం చేయాలని నిర్ణయించారు. స్థానిక సామాజిక సమీకరణలపై సర్వేలు, ప్రాంతాల వారీగా అధికంగా ఉండే వర్గాల మ్యాపింగ్, చిన్నచిన్న సమావేశాలు, స్థానిక భాషల్లో పార్టీ కంటెంట్ ప్రచారం వంటి దృష్టి సారించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని నబిన్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న బన్సల్ నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. కాయస్థ కులస్థుడైన నబిన్ సామాజిక వర్గానికి చెందిన జనాభా పశి్చమ బెంగాల్లో గణనీయమైన రాజకీయ, సామాజిక ప్రభావాన్ని కలిగి ఉంది. కోల్కతా, అసన్సోల్, సిలిగురి వంటి నగరాల్లోని బిహారీ వలసదారుల జనాభా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచే తన తొలి రాష్ట్ర పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు వంటి అంశాలతో రాష్ట్రంలోకి చొచ్చుకెళ్లేలా, టీఎంసీకి బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచేలా, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లతో పార్టీకి అనుబంధం పెంచేలా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే రోడ్మ్యాప్ ఖరారైనట్లు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత నబిన్ బెంగాల్ పర్యటన ఉంటుందని అంటున్నారు. ఇక తమిళనాడులో బలమైన ప్రాంతీయ పార్టీలతో కూటమి..స్థానిక భాష, సంస్కృతి మీద గౌరం చూపేలా ప్రచారం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలతో బూత్ స్థాయి వరకు పార్టీని చేర్చాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. జనవరి తొలి వారంలో నబిన్ ఇక్కడ పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. ఇక కేరళలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పాగా వేయడాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నబిన్ భావిస్తున్నారు. తిరువనంతపురం మున్సిపల్ మేయర్ పీఠాన్ని కైవసం అంశాన్ని భవిష్యత్ ఎన్నికలకు పునాదిగా మలుచుకోవాలని నిర్ణయించారు. తొలిసారి ఓటువేసే యువతకు తమ వైపు తిప్పుకోవడంతో పాటు..ఉద్యోగాలు, విద్య అంశాలపై ప్రచారం చేస్తూ ఓటు శాతాన్ని గణనీయంగా పెంచితే గెలుపు సాధ్యమన్నది నబిన్ ఆలోచనగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అస్సాంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పనితీరును హైలెట్ చేయడం, స్థానిక నాయకులను అప్రమత్తం చేయడం, కాంగ్రెస్పై మరింత పదునుగా విమర్శలకు దిగేలా ఇప్పటికే రాష్ట్ర పర్యటన సందర్భంగా నేతలకు నబిన్ మార్గదర్శనం చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలోనూ పర్యటించిన నబిన్, పారీ్టకి ఉన్న బలాన్ని నిలుపుకునే అంశాలపై నేతలకు కీలక సూచనలు చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని నిలబెడుతూనే, కొరగరానికొయ్యగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే బలమైన పట్టుదలతో నబిన్ ముందుకెళ్తున్నారు. -
నేరం రుజువు కాకముందే ఖాకీల శిక్ష
సాక్షి, అమరావతి: ఇప్పటికే బరితెగించి వ్యవహరిస్తున్న ఏపీ పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం నిర్భీతిగా బేఖాతరు చేసే స్థాయికి చేరారు. రెడ్బుక్ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా రాజ్యాంగ ధర్మాన్ని నిస్సిగ్గుగా పోలీసు శాఖ విస్మరిస్తోంది. నిందితుల అరెస్టు, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్వయంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం విస్మయపరుస్తోంది. ఆయా అంశాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఏమిటీ?.. ఏపీ పోలీసుల బరితెగింపు ఏ స్థాయికి చేరిందన్న అంశాలు పరిశీలిస్తే...నిందితులను పరేడ్ చేయించకూడదుడీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం ఏదైనా కేసుల్లో నిందితులను అరెస్టు విషయంలో పోలీసులు కచ్చితంగా నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. నిందితులను అరెస్టు చేయడం, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం.. ⇒ ఒక కేసులో నిందితులుగా ఉన్నంత మాత్రాన వారు నేరస్తులుగా భావించలేం. నేరం నిరూపితం కానంతవరకు నేరస్తులు కారు.⇒ ఇక నిందితుల సామాజిక గౌరవానికి పోలీసులు భంగం కలిగించ కూడదు. వారి గౌరవాన్ని పోలీసులు కచ్చితంగా పరిరక్షించాలి. అరెస్టు చేసిన నిందితులను బహిరంగంగా నడిపిస్తూ పరేడ్ చేయించకూడదు. వారిని ప్రజలకు కనిపించేలా ప్రదర్శించకూడదు. ⇒ నిందితులను సోదా చేసే ప్రక్రియ గౌరవప్రదంగా ఉండాలి. వారి వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించకూడదు. ⇒ అరెస్టు సమయంలో పోలీసులు బల ప్రయోగం చేయడం సరికాదు. ⇒ నిందితులు తప్పించుకునేందుకు యత్నిస్తే, గాయాలు కాకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించాలి. అంతేగానీ అరెస్టు కోసమని చెప్పి గాయపరచ కూడదు.సుప్రీం కోర్టు చెప్పినా లెక్క చేయం: ఏపీ పోలీసుల నిర్భీతి నిందితుల గౌరవానికి భంగం కలిగించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తాము లెక్కచేయబోమంటూ బాబు సర్కార్ హయాంలో ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కక్ష పూరితంగా అరెస్టు చేసిన పలువురు నిందితులను రోడ్డుపై నడిపించి పరేడ్ చేయించడం పోలీసుల దాషీ్టకానికి నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను సంప్రదాయ జాతర తరహాలో నిర్వహించిన అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. నరికిన పొట్టేళ్ల తలలను దండగా చేసి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీకి వేసి వేడుకలు చేసిన టీడీపీ అభిమానులను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.కానీ సాధారణ జాతర శైలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన వైఎస్సార్సీపీ అభిమానులపై మాత్రం కక్ష గట్టారు. శ్రీసత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి తదితర జిల్లాల్లో ఏకంగా 13 కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న యువకులను అరెస్టు చేశారు. అంతేకాదు...వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించారు. తద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. నిందితుల సామాజిక గౌరవానికి భంగం కలిగించారు. వారి వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్క లేదని తేల్చి చెప్పారు. వాహనాలు లేవు.. అందుకే నడిపించాం: డీజీపీ గుప్తా బాధ్యతా రహిత స్పందన నిందితుల గౌరవానికి భంగం కలిగించ కూడని.. వారిని రోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ‘సుప్రీంకోర్టు చెబితే మాత్రం మేమేందుకు చేస్తాం’ అన్నట్టుగా సాక్షాత్తూ ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా స్పందించడం విభ్రాంతి కలిగిస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నిందితులను రోడ్డుపై పరేడ్ చేయించడంపై మీడియా ప్రతినిధులు ఆయనను సోమవారం ప్రశ్నించారు. దీనిపై డీజీపీ పూర్తి బాధ్యతారహితంగా స్పందించారు. ‘నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు పోలీసుల వద్ద వాహనాలు లేవు. అందుకే నడిపించి తీసుకువెళ్లాం’ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.తద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పోలీసు శాఖకు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పోలీసు శాఖ చీఫ్ స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక ఇతర పోలీసు అధికారుల ఎలా వ్యవహరిస్తారన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సామాన్యుల గురించి ఎందుకు పట్టించుకుంటారని, పౌర హక్కుల మాటేమిటని మేధావులు, ప్రజాస్వామ్య హితైషులు ప్రశి్నస్తున్నారు. డీజీపీ గుప్తా ఒక దుస్సంప్రదాయానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఐఎన్ఎస్వీ కౌండిన్య చరిత్రాత్మక యాత్ర షురూ
పోరుబందర్: ఐదో శతాబ్దం నాటి ప్రాచీన కుడ్యచిత్రంలోని అసంపూర్ణ అంశాలను గుదిగుచ్చి, ఎలాంటి యంత్రాలు, మేకులు, స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవనిర్మిత అద్భుతం ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ నౌక తొలి సముద్రయానాన్ని విజయవంతంగా ఆరంభించింది. సోమవారం గుజరాత్లోని పోరుబందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీరనగరానికి పయనమైంది. వెస్టర్న్ నావల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ జెండా ఊపి నౌకాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్లో ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ హాజరయ్యారు. ప్రాచీన భారతీయ నావికానిర్మాణ కౌశలాన్ని కళ్లకు కట్టేలా ‘కుట్టుడు పద్ధతి’లో నౌక నిర్మించామని భారత రక్షణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 15 రోజులపాటు 1,400 కిలోమీటర్ల సముద్రయానం చేశాక ఒమన్ తీరానికి నౌక చేరుకోనుంది. పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక అంటూ ప్రధాని ప్రశంస నౌక ప్రయాణంపై ప్రధాని మోదీ అమితానందం వ్యక్తంచేశారు. ‘‘ పోరుబందర్ నుంచి మస్కట్ను మన ప్రాచీనమూలాలున్న ఐఎన్ఎస్ కౌండిన్య బయల్దేరడం ఎంతో సంతోషదాయకం. నౌకలోని 18 మంది నావికుల ప్రయాణం క్షేమంగా జరగాలని కోరుకుంటున్నా. గల్ఫ్, ఆవలి ప్రాంతాలతోనూ భారత్ ప్రాచీనకాలంలో అద్బుతంగా సముద్రమార్గంలో వాణిజ్యం జరిపేదని ఈ నౌక ద్వారా చాటిచెప్పండి. మేకులకు బదులు తాళ్లతో విడిభాగాలను జతచేసే స్టిచ్చింగ్ పద్దతిలో నిర్మాణం పూర్తిచేసుకుని ఈ నౌక భారత ఉజ్జ్వలమైన సముద్రసంప్రదాయాలను స్మరణకు తెచ్చింది. నౌకను నిర్మించిన కళాకారులు, సిబ్బందికి నా అభినందనలు. ఈ నౌక పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక’’ అని మోదీ అన్నారు. సహజసిద్ధంగా.. సమున్నతంగా.. → నౌక తయారీలో మేకులు ఉపయోగించలేదు. → స్టిచ్చింగ్ పద్ధతిలో విడిభాగాలను అత్యంత ధృడమైన తాళ్లతో ముడివేశారు. → కొబ్బరినారతో తయారుచేసిన తాళ్లను ఉపయోగించారు. ఈ నౌకలో ఇంజిన్ ఉండదు. కేవలం తెరచాపలతో గాలివాటానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. → సహజసిద్ద జిగురులతో విడిభాగాలను అతికించారు. చేప నూనెను పూత పూశారు. → ఐదో శతాబ్దంనాటి అజంతా గుహల్లో వెలుగుచూసిన ప్రాచీన నౌక చిత్రాల నుంచి డిజైన్ను సంగ్రహించారు. → ఆధునిక తరం నౌకలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైంది. నీటిలో మునిగే ప్రధాన భాగం, చదరపు తెరలు, తెడ్డులను ప్రాచీన తరహా డిజైన్లో రూపొందించారు. → పురాతన నౌకా నిర్మాణాలు, నౌకా నిర్మాణశాస్త్రం, సాంప్రదాయ విధానాలను మేళవించి నౌకకు తుదిరూపునిచ్చారు. → కర్ణాటకలోని వ్యూహాత్మకమైన కర్వార్ నౌకాస్థావరంలో దీనిని తయారుచేశారు. దీని పొడవు 65 అడుగులు. → ఒకటో శతాబ్దంలో హిందూమహాసముద్రంలో సముద్రయానం చేసిన భారత నావికుడు కౌండిన్య పేరుతో ఈ నౌకకు ‘ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసెల్(ఐఎన్ఎస్వీ) కౌండిన్య అని నామకరణం చేశారు. → ఒక తెరచాపపై కదంబ పాలకుల రాజలాంఛనమైన గండభేరుండ పక్షి చిత్రం, మరో తెరచాపపై సూర్యుని ఆకృతిని చిత్రించారు. -
అంతటా దాడులూ... దౌర్జన్యాలే..
సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్బుక్ పాలనలో రాష్ట్రం దాడులు, దౌర్జన్యాలతో అట్టుడుకుతోంది. ప్రధానంగా భౌతికదాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 2025 సంవత్సరంలో శాంతిభద్రతల పరిస్థితిని వివరిస్తూ పోలీసు శాఖ వార్షిక నివేదికను సోమవారం డీజీపీ హరీశ్కుమార్గుప్తా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పరిస్థితి అంతా బాగుందని చెప్పేందుకు గణాంకాలతో కనికట్టు చేసేందుకు ఆ నివేదికలో యత్నించారు. కానీ ఎంతగా దాచాలన్నా పోలీసు శాఖ వైఫల్యం మాత్రం బట్టబయలైంది. 2024తో పోలిస్తే 2025లో రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలతోపాటు ఆర్థిక నేరాలు పెరిగాయని ఆ నివేదికే స్పష్టం చేసింది.పూర్తిగా అదుపుతప్పిన శాంతిభద్రతలుటీడీపీ రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో భయోత్పాతం సృష్టిస్తోంది. అధికార టీడీపీ కూటమి నాయకుల అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, సామాజిక ఉద్యమకారులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చాలావరకు కేసులు నమోదు చేయడం లేదు. అయినా సరే 2025లో దాడులు, దౌర్జన్యాల కేసుల సంఖ్య పెరగడం గమనార్హం.బాధితుల ఫిర్యాదులు అన్నింటిపైనా విచారణ చేసి కేసులు నమోదు చేసి ఉంటే రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితి మరింతగా వెల్లడయ్యేది. రాష్ట్రవ్యాప్తంగా 2024లో దాడులు, దౌర్జన్యాల కేసులు 137 నమోదు కాగా... 2025లో ఆ సంఖ్య 146కు పెరిగింది. భౌతిక దాడుల కేసులు 6.6శాతం పెరిగినట్టు పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వారిని అంతం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. 2024లో 1,403 హత్యాయత్నం కేసులు నమోదు కాగా... 2025లో హత్యాయత్నం కేసులు 1,566కు పెరగడం గమనార్హం. హత్యాయత్నం కేసులు 11.6 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. భారీగా పెరిగిన ఆర్థిక నేరాలుచంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆర్థిక నేరాలు అమాంతంగా పెరిగాయి. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు కొమ్ముకాయడమే పనిగా పెట్టుకున్న పోలీసు పెద్దలు.. రాష్ట్రంలో ఆర్థిక నేరాల అదుపుపై ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. 2024లో 7,667 ఆర్థిక నేరాల కేసులు నమోదు కాగా... 2025లో ఆ కేసుల సంఖ్య 8,034కు పెరిగింది. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు 4.78 శాతం పెరిగాయని పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక పగటిపూట దొంగతనాలు కూడా పెరిగాయి. 2024లో 824 కేసులు నమోదు కాగా, 2025లో ఆ కేసుల సంఖ్య 836కు చేరింది.లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టం⇒ మహిళల భద్రతపై జనరలైజ్ చేసి మాట్లాడటం సరికాదు⇒ పవన్కళ్యాణ్ వ్యాఖ్యలకు డీజీపీ కౌంటర్‘తిరుపతికి లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం సాధ్యమయ్యేపనా... వైఫల్యానికి చాలా కారణాలు ఉంటాయి’ అని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల–తిరుపతిలలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాటపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... లక్షల్లో భక్తులు వస్తుంటే భద్రత కల్పించడం, తగిన ఏర్పాట్లు చేయడం పూర్తిగా సాధ్యం కాదని డీజీపీ బదులిచ్చారు. అందుకు చాలా కారణాలు ఉంటాయని, పోలీసుల వైఫల్యంగానే చూడకూడదన్నారు. ఇక భద్రత కోసం మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను డీజీపీ గుప్తా వ్యంగ్యంగా తిప్పికొట్టారు.‘మహిళా భద్రతలో పోలీసు వైఫల్యం గురించి జనరలైజ్ చేసి చెప్పడం సరి కాదు. నిర్దిష్టంగా చెప్పాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. నేరాలను కట్టడి చేస్తున్నామని చెప్పారు. 2024లో రాష్ట్రంలో 1,10,193 కేసులు నమోదు కాగా, 2025లో 1,03,397 కేసులకు తగ్గాయని తెలిపారు. నేరాలు 6 శాతం తగ్గాయన్నారు. నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2025లో 153 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. త్వరలో ఐపీఎస్ అధికారుల జాతీయ సదస్సు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఐజీలు శ్రీకాంత్, రవికృష్ణ, పాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరితీసే దాకా విశ్రమించం: బాధితురాలు
ఉన్నావ్: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఉన్నావ్ కేసు బాధితురాలు సోమవారం సంతృప్తి వ్యక్తంచేశారు. సెంగార్ను ఉరితీసే దాకా విశ్రమించే ప్రసక్తే లేదని బాధితురాలు తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం జరిగినట్లు భావిస్తున్నానని చెప్పారు. తనపై అత్యాచారం జరిగినప్పటి నుంచి న్యాయం కోసం గొంతు వినిపిస్తున్నానని పేర్కొన్నారు. ఏ కోర్టుపైనా తాను ఆరోపణలు చేయడం లేదని, అన్ని కోర్టులపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటానని స్పష్టంచేశారు. సెంగార్ను ఉరి తీస్తేనే పూర్తిగా న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు. తమకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడిందని బాధితురాలి సోదరి చెప్పారు. సెంగార్ ఒక క్రూర జంతువు అని మండిపడ్డారు. తొలుత తన సోదరిని, తర్వాత తమ కుటుంబాన్ని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. అతడికి ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు నిలిపివేయడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ కేసులో పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. మరోవైపు బాధితురాలి తల్లి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన బిడ్డపై అత్యాచారం చేసి, తన భర్తను చంపిన నేరగాడికి మరణ శిక్ష పడాల్సిందేనని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సామాజిక కార్యకర్త యోగితా స్పందించారు. ఇది కేవలం ఉన్నావ్ బాధితురాలి పోరాటం కాదని.. మహిళలందరి పోరాటమని ఉద్ఘాటించారు. ఇది చాలా భిన్నమైన కేసు కాబట్టి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. -
79వేల కోట్ల సైనిక హార్డ్వేర్ కొనుగోలుకు ఆమోదం
న్యూఢిల్లీ: సైన్యం సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూ.79,000 కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాలు, హార్డ్వేర్ కొనుగోళ్లకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ స్థాయి తేలికైన రాడార్లు, పినాకా రాకెట్ వ్యవస్థ కోసం లాంగ్–రేంజ్ గైడెడ్ రాకెట్ మందుగుండు సామగ్రి, ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్, ఇంటర్డిక్షన్ సిçస్టమ్, ఆర్మీ ఫిరంగి రెజిమెంట్ల కోసం లోయిటర్ మునిషన్ వ్యవస్థల కొనుగోలుకు కూడా ఆమోదం తెలిపింది. వ్యూహాత్మక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడికి లోయిటర్ మునిషన్ ఉపయోగిస్తారు. చిన్న పరిమాణంలో, తక్కువ ఎగిరే మానవరహిత వైమానిక వ్యవస్థలను తక్కువ స్థాయి తేలికైన రాడార్లు గుర్తించి, ట్రాక్ చేస్తాయి. సుదీర్ఘ లక్ష్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పినాకా రాకెట్, వ్యవస్థల పరిధి, ఖచ్చితత్వాన్ని పెంచడానికి లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్లను కొనుగోలు చేయనున్నారు. వ్యూహాత్మక యుద్ధ ప్రాంతం, లోతట్టు ప్రాంతాల్లో భారత సైన్య కీలకమైన ఆస్తులను ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్, ఇంటర్డిక్షన్ సిస్టమ్ రక్షిస్తుంది. ఇక హిందూ మహాసముద్ర ప్రాంతంపై నిరంతర నిఘా కోసం పెద్ద సంఖ్యలో రిమోట్ పైలట్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ (ఆర్పీఏఎస్)లను లీజుకు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆటోమేటిక్ టేకాఫ్ ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్ ఏరోస్పేస్ వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తుందని, ఆస్ట్రా ఎమ్– ఐఐ క్షిపణులు ప్రత్యర్థి విమానాలను తటస్థీకరించే యుద్ధవిమానాల సామర్థ్యాన్ని పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. -
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు.రాత్రి 12:05 గంటలకు అర్చకులు, జీయర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలను తెరిచారు. అనంతరం నిత్య కైంకర్యాలు పూర్తి చేసి వేకువజాము 1:25 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సజావుగా సాగుతున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమవారం ఒక్కరోజే సుమారు 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా కేవలం 2–3 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీవీఐపీల దర్శనాలు కేవలం మూడు గంటల పాటు మాత్రమే నేరుగా వచ్చిన వీవీఐపీలకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు రోజుల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా సుమారు 1.89 లక్షల టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు.ఉదయం 4:30 గంటల నుంచి టోకెన్లు ఉన్న భక్తులకు వారి కేటాయించిన టైమ్ స్లాట్ల ప్రకారం సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు ఈవో వివరించారు. టోకెన్లు లేని భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా, రేడియో అనౌన్స్మెంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి 8వ తేదీ మధ్య తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శనానికి పట్టే సమయం, రద్దీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు తాజా అప్డేట్స్ అందిస్తున్నామని తెలిపారు. భద్రత పరంగా సుమారు 3,500 మంది పోలీస్, విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.వైకుంఠ ద్వార దర్శనంలో ప్రముఖులువైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డివివి దానయ్య దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా దర్శనం చేసుకున్నారు.నిర్మాత బండ్ల గణేష్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, క్రికెటర్ తిలక్ వర్మ, చాముండేశ్వరినాథ్, ఎమ్మెల్సీ భరత్, దేవినేని అవినాష్ తదితరులు వైకుంఠ ద్వార దర్శనంలో తరించారు. భక్తులు తమకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
దేశానికే అవమానం
డెహ్రాడూన్: ఈశాన్య రాష్ట్రం త్రిపురకు చెందిన ఓ విద్యారి్థని విద్వేష పూరిత వ్యాఖ్యలతో వేధించి, దారుణంగా చంపిన ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రిపురకు చెందిన ఏంజెల్ చక్మా(24) ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ నెల 9వ తేదీన కొందరు యువకులు కత్తులు, పదునైన ఆయుధాలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 26వ తేదీన కన్నుమూశాడు. అంజెల్ చక్మా తండ్రి బీఎస్ఎఫ్ జవాను. ఈయన ప్రస్తుతం మణిపూర్లోని టంగ్జెంగ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. డెహ్రాడూన్లో ఉంటున్న తన కుమారులు ఏంజెల్ చక్మా, మైకేల్ చక్మాలను కొందరు యువకులు ‘చైనీస్ మోమో’ అంటూ కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారని తరుణ్ ప్రసాద్ చక్మా ఆరోపించారు. మేం చైనీయులం కాము, భారతీయులమంటూ అడ్డు చెప్పినందుకు ఏంజెల్ను విద్వేషపూరితంగా వెక్కిరిస్తూ కత్తి, ఇతర పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టారన్నారు. ఈ విషయమై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సోమవారం తరుణ్ ప్రసాద్ చక్మాతో ఫోన్లో మాట్లాడారు. ఈ దారుణానికి పాల్పడిన ఆరుగురిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని, నేపాల్కు పారిపోయిన మరొకరిని తీసుకువస్తామని చెప్పారు. నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఏంజెల్ చక్మా కుటుంబానికి పరిహారంగా మొదటి విడతలో రూ.4.12 లక్షల చెక్కును పంపిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఘటనను తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ విభజనవాదాన్ని ఎగదోస్తోందని ఆరోపించారు. డెహ్రాడూన్లో త్రిపుర విద్యార్థి దారుణ హత్య దేశానికే అవమానమని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈ గడ్డపై పుట్టిన వారంతా భారతీయులే అనే మెలకువ సమాజంలో ప్రతి ఒక్కరికీ అవసరమని పేర్కొన్నారు. ఘటనను రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. హోం మంత్రి అమిత్ షా విద్వేష నేరాలపై స్పందించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమానం అందిస్తామని త్రిపురలోని తిప్రా మోథా సుప్రీం ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేబ్వర్మ ప్రకటించారు. ఏంజెల్ చక్మాకు న్యాయం జరగాలంటూ సోమవారం డెహ్రాడూన్, అగర్తలాలో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. -
2026 ప్రారంభంలోనే పీఎస్ఎల్వీ సీ62 ప్రయోగం!
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ62 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ ప్రయోగాన్ని 2026 జనవరి 5న గాని లేదా 10న నిర్వహించేందుకు సిద్ధం చేస్తోంది. ఈ నెల 26న ఈవోఎస్–ఎన్1 (అన్వేష్) ఉపగ్రహం షార్ కేంద్రానికి చేరుకుంది. క్లీన్ రూమ్లో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించి రాకెట్కు అనుసంధానం చేయనున్నారు.షార్లోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ బిల్డింగ్ (ఫిఫ్)లో నాలుగు దశల పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాకెట్ అనుసంధానం తరువాత ఫిఫ్ నుంచి ఎంఎస్టీకి తరలించి అక్కడ ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో ఈవోఎస్–ఎన్1 (అన్వేష్) అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపబోతున్నారు.రాకెట్ ఆఖరి దశ అయిన పీఎస్–4 దశతో స్పెయిన్కి చెందిన స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ ఫారాడైమ్తో ప్రయోగాత్మకంగా ఓ పరీక్షను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. 25 కిలోల బరువైన కెస్ట్రెల్ ఇనీషియల్ డిమాన్్రస్టేటర్ (కేఐడీ) అనే క్యాప్సూల్స్ను పీఎస్–4 ద్వారా తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించడం కోసం దక్షిణ ఫసిఫిక్ మహా సముద్రంలో ఒక స్పాష్ డౌన్ జోన్ను గుర్తించారు. దీంతో పాటు ఇందులో 18 పేలోడ్స్ను కూడా పంపిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. -
ఆరావళి ‘ఎత్తు’ వివాదంలో కీలక మలుపు
న్యూఢిల్లీ/జైపూర్: ఆరావళి శ్రేణిలో వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న కొండలనే పర్వతాలుగా పరిగణిస్తూ కొత్త నిర్వచనం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తడంతో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 20వ తేదీన తాము ఇచ్చిన తీర్పును పక్కనబెడు తున్నట్లు సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. వంద మీటర్ల కంటే ఎత్తున్న ఆరావళి పర్వతాలకే పర్యావరణ పరిరక్షణ లభిస్తుండటంతో ఎత్తు తక్కువ ఉన్నవి గనుల తవ్వకంతో కనుమరుగయ్యే ప్రమాదముందని పర్యావ రణవేత్తలు మొదలు నేతలు, సామాన్య ప్రజానీకం నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయ స్థానం సూమోటోగా స్వీకరించింది. సోమవారం ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల వెకేషన్ బెంచ్ విచారించి పలు వ్యాఖ్యలుచేసింది. ‘‘ఫలానా ఎత్తు ఉన్న కొండలనే ఆరావళి పర్వతాలుగా పరిగణించాలనే నిర్వచనం ఇవ్వడంలో సహేతుకత లోపించినట్లు స్పష్టమవుతోంది. సంబంధిత కమిటీ నివేదికలో, తీర్పులో ఇలాంటి పలు సంక్లిష్టమైన, కీలక అంశాలపై దృష్టిపెట్టలేదు. అందుకే ఈ అంశంలో మరింత లోతైన అధ్యయనం, దర్యాప్తు, విచారణ అవసరం. అప్పటిదాకా మేం గతంలో ఇచ్చిన తీర్పును పక్కనబెడుతున్నాం. 2010 ఆగస్ట్ 25వ తేదీన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ) ఇచ్చిన నిర్వచనం మేరకు 2024 మే 9న మేం ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరావళి పర్వతాల్లో ఇకపై ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదు. నవంబర్ 20న మేం ఇచ్చిన తీర్పు, అందులో పర్వతం నిర్వచనాన్ని తప్పుగా ఆపాదించే పెను ప్రమాదముందని అర్థమవుతోంది. కొత్త నిర్వచనాన్ని మైనింగ్ సంస్థలు తప్పుగా అన్వయించి తమను అనువుగా అమలుచేసే ప్రమాదం పొంచి ఉంది. గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, నియమ నిబంధనల్లో స్పష్టత కరువవడంతో ఇదంతా జరిగింది. ఆరావళి పర్వతాల పర్యావరణ పరిరక్షణ, సమగ్రత కాపాడేలా నిబంధనల్లో లోటుపాట్లను సమగ్ర స్థాయిలో పూడ్చాల్సి ఉంది. 100 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తున్న కొండలను మాత్రమే ఆరావళి పర్వత శ్రేణిగా పేర్కొనడంలో తర్కం లోపించింది. 500 మీటర్ల దూరం ఎడంగా ఉన్న కొండలనే ఆరావళి పర్వత శ్రేణిలో భాగంగా పరిగణించాలన్న నిబంధనలోనూ లోపాలున్నాయి. ఇలాంటి పలు నిబంధనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలులేవని అర్థమవుతోంది. పలు కీలక అంశాల్లో సంక్లిష్టత నెలకొంది. రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో 12,081కిగాను కేవలం 1,048 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాయి. దీంతో మిగతా కొండలకు మైనింగ్ ముప్పు పొంచి ఉంది. ఇలా చిన్న కొండలు పర్యావరణ పరిరక్షణ ఛత్రం ఆవల ఉండిపోవడం మేం ఏమాత్రం ఒప్పుకోం. మళ్లీ సమగ్ర స్థాయిలో శాస్త్రీయ, భౌగోళిక దర్యాప్తు జరగాల్సిందే. ఈ మేరకు స్థానిక నిపుణులతో అత్యున్నత కమిటీ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నాం. ఈ విషయంలో మీ స్పందన తెలియజేయండి’’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. ఆరావళి పర్వతాల పరిధిలోకి వచ్చే ఢిల్లీ, రాజస్థాన్, హరియాణా, గుజరాత్లకూ నోటీసులు పంపించింది. జనవరి 21వ తేదీలోగా స్పందన తెలపాలని సుప్రీంకోర్టు గడువు విధించింది.ఆరావళి పర్వతాల ప్రత్యేకత ఏంటి?ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలుగా ఆరావళి పర్వతాలకు పేరుంది. ఢిల్లీ నుంచి మొదలై హరియాణా, రాజస్థాన్, గుజరాత్లదాకా ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా 37 జిల్లాల్లో ఈ పర్వతాలున్నాయి. రాజస్థాన్లోని థార్ ఎడారి నుంచి ఇసుక మేఘాలు ఢిల్లీసహా ఉత్తరభారతాన్ని కమ్మేయకుండా ఈ ఆరావళి పర్వతాలే అడ్డుకుంటున్నాయి. ఆరావళి కారణంగానే థార్ ఎడారి ఉత్తరదిశగా విస్తరించకుండా ఆగిపోయింది. అలా ఉత్తరభారతంలో జీవవైవిధ్యానికి, భూగర్భ జలాలకు ఆరావళి పర్వతాలు రక్షాకవచాలుగా నిలుస్తున్నాయి. ఆరావళి కొండల్లోని వర్షపు నీరు నేలలోకి ఇంకి ఆయా ప్రాంతాల భూగర్భజలాలను ఎప్పటికప్పుడు రీచార్జ్ చేస్తున్నాయి. దీంతో భూసారం పరిరక్షించబడుతోంది. పరోక్షంగా జీవజాతుల మనుగడ సాధ్యమవుతోంది. ఆరావళిలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే పులుల అభయారణ్యాలుగా, జాతీయ వనాలుగా, పక్షుల సంరక్షణ కేంద్రాలుగా, పర్యావరణంపరంగా అత్యంత సున్నిత ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి.స్వాగతించిన పర్యావరణ నిపుణులుగత తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వెలు వర్చిన తాజా నిర్ణయంపై పర్యావరణవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు. అత్యున్నత కమిటీ అనేది కేవలం ప్రభుత్వ ఉన్నతాధికారుల కూటమిగా మిగిలిపోకుండా జీవావరణ, పర్యావరణవేత్తలకూ స్థానం కల్పించాలని పర్యావరణవేత్త భావరీన్ కంధారీ డిమాండ్చేశారు. ‘‘ఇది తాత్కాలిక గెలుపు. ఇప్పటి దాకా జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని వెల్లడి స్తూనే ఇకమీదట మైనింగ్ను పూర్తిగా ఆపేలా తుది తీర్పు రావాలి’’ అని ‘పీపుల్స్ ఫర్ ఆరావళి’ వ్యవస్థాపక సభ్యురాలు నీలం అహ్లూవాలియా ఆశాభావం వ్యక్తంచేశారు. పర్యావరణవేత్త విమలేందు ఝా, జీవావర ణవేత్త విజయ్ ధాస్మాన తదితరులూ తాజా ఉత్తర్వును స్వాగతించారు. ‘‘ ఉత్తర్వును మేం కూడా స్వాగతిస్తున్నాం. ఆరావళి పరిరక్షణకు, పునరుద్ధరణకు మోదీ సర్కార్ కట్టుబడి ఉంది’’ అని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ‘‘ కొత్త నిర్వచనం సరిగా లేదని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీ, కోర్టు అమికస్ క్యూరీ సైతం గతంలోనే చెప్పారు. అయినాసరే కొత్త నిర్వచనం సరైందేనంటూ మంత్రి యాదవ్ గతంలో చేసిన వాదనలన్నీ తప్పు అని నేడు తేలింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’’ అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. -
ప్రయోగాలు తగ్గించిన ఇస్రో
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఈ ఏడాది కేవలం ఐదు ప్రయోగాలకే పరిమితమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి రెండు జీఎస్ఎల్వీ రాకెట్లు, రెండు ఎల్వీఎం–3 రాకెట్లు, ఒక్క పీఎస్ఎల్వీ రాకెట్ను మాత్రమే ప్రయోగించారు. గతంలో ఏడాదికి నాలుగుకుపైనే పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు ఉండేవి. జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 రాకెట్ ప్రయోగాలు ఏడాదికి ఒకటో రెండో ఉండేవి. ఈ ఏడాది ఒకే ఒక్క పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగించినప్పటికీ విఫలమైంది. పీఎస్ఎల్వీ ప్రయోగాలను తగ్గించి జీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 రాకెట్ల ప్రయోగాలు పెంచుతున్నారు. ఈ ప్రయోగాలకు సంబంధించిన క్రయోజనిక్ దశను వివిధ రూపాల్లో తయారు చేసి విజయాలు నమోదు చేస్తున్నారు. జనవరి నుంచే ప్రయోగాలు ఈ ఏడాది ప్రారంభంలోనే అంటే జనవరి 29న జీఎస్ఎల్వీ ఎఫ్ 15 రాకెట్ ద్వారా నావిగేషన్ శాటిలైట్ (ఎన్వీఎస్–02)ను ప్రయోగించారు. మే 18న పీఎస్ఎల్వీ సీ 61 ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను ప్రయోగించగా విఫలమైంది. జూలై 30న జీఎస్ఎల్వీ ఎఫ్ 16 ద్వారా ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని, నవంబర్ 2న ఎల్వీఎం3 – ఎం5 రాకెట్ ద్వారా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎస్–03) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. డిసెంబర్ 24న ఎల్వీఎం – 3 – ఎం6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 6,400 కిలోల అత్యంత బరువైన బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి ప్రపంచంలో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేశారు.ఇస్రో చరిత్రలో ఈ ఏడాది సువర్ణాక్షరాలతో లిఖించదగిన ప్రయోగాలు చేసింది. ఇస్రో బాహుబలిగా పేరుగాంచిన ఎల్వీఎం–3 రాకెట్ను ఎప్పుడో రెండు మూడేళ్లకు ఒకటి, రెండుసార్లు ప్రయోగించేవారు. అలాంటిది ఈ ఏడాది 52 రోజుల వ్యవధిలో రెండు ప్రయోగాలు చేసి విజయాలను సొంతం చేసుకోవడం ఒక మైలురాయిగా నిలిచింది. ఇస్రో చరిత్రలో ఇప్పటిదాకా రెండువేల కిలోల నుంచి మూడువేల కిలోల బరువైన ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించారు. ఈ ఏడాది ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు చెందిన 6,400 కిలోల అత్యంత బరువైన ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా ప్రయోగించి చరిత్ర సృష్టించారు. లాంచింగ్ సౌకర్యాలు పెరిగినా.. ఆ స్థాయి ప్రయోగాలు లేవుశ్రీహరికోటలో లాంచింగ్ సౌకర్యాలు విపరీతంగా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో రాకెట్ ప్రయోగాలు నిర్వహించడంలో ఇస్రో వెనుకంజలోనే ఉంది. 2022, 2023 సంవత్సరాల్లో ఎనిమిదేసి ప్రయోగాలు చేసిన ఇస్రో 2024, 2025ల్లో అయిదేసి ప్రయోగాలకే పరిమితమైంది. 2020, 2021ల్లో కరోనా మహమ్మారి కారణంగా రెండేసి ప్రయోగాలతో సరిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్టాయి. మొదటి ప్రయోగవేదిక మీద ఒకేసారి రెండు రాకెట్లను అనుసంధానం చేసే సౌకర్యాలున్నాయి. రెండో ప్రయోగవేదికకు సంబంధించి రెండు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లతోపాటు ఎస్ఎస్ఏబీ భవనం కూడా ఉంది. అంటే ఇక్కడ కూడా ఒకేసారి అయిదు రాకెట్లు అనుసంధానం చేసే వీలుంది. ఇక్కడ ఘన ఇంధన మోటార్ల తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచారు.ఇన్ని వసతులు మెరుగుపడినా ఆ స్థాయిలో రాకెట్లను ప్రయోగించడంలేదు. ఈ నెల 24న చేసిన ఎల్వీఎం3 – ఎం6 ప్రయోగంతో షార్ నుంచి 104 ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇందులో నాలుగు.. ఉపగ్రహాలు లేకుండా ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ నెల 24న చేసింది.. ఉపగ్రహాలతో కూడిన వందో ప్రయోగం. వచ్చే మార్చి నాటికి తమిళనాడు తూత్తుకుడి సమీపంలోని కులశేఖరపట్నంలో నిర్మీస్తున్న రాకెట్ ప్రయోగకేంద్రం అందుబాటులోకి రానుంది. పీఎస్ఎల్వీ, ఎస్ఎస్ల్వీ రాకెట్ ప్రయోగాలను అక్కడి నుంచే నిర్వహించే అవకాశాలున్నాయి. భారీ ప్రయోగాల కోసం శ్రీహరికోట షార్ కేంద్రాన్ని బలీయమైన శక్తిగా తయారు చేస్తున్నారు. ఇక భవిష్యత్లో ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ అన్మ్యాన్ మిషన్, గగన్యాన్ మ్యాన్ మిషన్, చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించే ప్రయోగాలతోపాటు సుమారు 10 వేలకిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
బాబు.. బాదుడే బాదుడు
విద్యుత్ చార్జీల వీర బాదుడు...భూముల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్ చార్జీల అదనపు మోత... తాగునీటిపై ఎప్పుడంటే అప్పుడు యూజర్ చార్జీల భారం! ఇవన్నీ చాలదన్నట్లు వాహనాల కొనుగోలుపై భారీగా సెస్ విధింపుతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై మళ్లీ పన్ను బాదుడుకు సిద్ధమయ్యారు. వివిధ పేర్లతో అన్ని వర్గాల వారిపై పన్నుల మోత మోగిస్తున్న ఆయన ఈసారి వాహనదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలపై ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా సాగుతోంది బాబు ప్రభుత్వ పాలన. అదనపు పన్నుల మోతతో వీలున్న ప్రతి రంగంలోనూ జనం జేబులకు చిల్లులు పెడుతూ వస్తున్నప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. తాజాగా మంత్రివర్గ సమావేశం వేదికగా మరో రుసుముల కొరడా ఝళిపించారు. తన మార్కు బాదుడుకు ఇదే నిదర్శనం అని చాటారు. సాక్షి, అమరావతి: అంతుపొంతు లేకుండా సాగుతున్న చంద్రబాబు సర్కారు పన్నుల మోత రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా కుంగదీసే మరో బాదుడుకు సిద్ధమైంది. వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరటను రాష్ట్ర ప్రజలకు లేకుండా చేస్తోంది. ‘‘రహదారి భద్రత సెస్’’ పేరిట ఏటా ఏకంగా రూ.270 కోట్లు బాదేయనుంది. యథాప్రకారం ఇందులో సరికొత్త దోపిడీకి తెరవెనుక పావులు కదుపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే వాహనాలపై 10 శాతం రహదారి భద్రత సెస్ వేయాలని బాబు సర్కారు నిర్ణయించింది. వాహనాల లైఫ్ ట్యాక్స్లో ఈ సెస్ విధించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. అందుకోసం ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించింది. దాదాపు పదేళ్లుగా వాహనాల లైఫ్ ట్యాక్స్లో 28 శాతం జీఎస్టీ విధించేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను సరళం చేసింది. వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో కాస్త ఊరట లభించిందని రాష్ట ప్రజలు భావించారు. కానీ, ఈలోపే వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్తో చంద్రబాబు పన్నుల కొరడా ఝళిపించారు.⇒ ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలు ప్రజలపై పడనున్న భారీ ఆర్థిక భారాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 73 వేల వాహనాలను విక్రయిస్తారు. వాటిపై లైఫ్ ట్యాక్స్లో 10 శాతం సెస్ వేస్తే నెలకు రూ.22.50 కోట్లు కానుంది. ఆ ప్రకారం వాహన కొనుగోలుదారులపై ఏటా రూ.270 కోట్లు పన్ను మోత మోగనుంది. స్కూటర్ల నుంచి లారీల వరకు మున్ముందు వాహన విక్రయాలు పెరిగితే అందుకు తగినట్లే పన్ను భారం పెరుగుతుంది.రహదారి భద్రత ముసుగే... దోపిడీయే అసలు కథచంద్రబాబు ప్రభుత్వం వేసిన రహదారి భద్రత సెస్ అనేది దోపిడీ ఓ ముసుగు మాత్రమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగంటే... సెస్ బాదుడు ద్వారా వచ్చిన నిధులను ఎలా వెచ్చిస్తామన్నది మంత్రులు వెల్లడించలేదు. అంటే, సెస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని దారిమళ్లిస్తారని పేర్కొంటున్నారు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను అందుకోసం ఖర్చు చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హోం, వైద్యఆరోగ్య, ఆర్అండ్బీ శాఖల సంయుక్త కమిటీల ద్వారా నిధులను వెచ్చించాల్సి ఉండగా, ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడమే లేదు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం సెస్ పేరిట ఏటా వసూలు చేసే రూ.270 కోట్లను సద్వినియోగం చేస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకు అడ్డదారిలో కాంట్రాక్టు పనుల పేరిట దోచిపెడతారని ఆరోపిస్తున్నారు.రిజిస్ట్రేషన్ల చార్జీలు 50 శాతం పెంపుచంద్రబాబు ప్రభుత్వం గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ప్రజలపై సుమారు రూ.వెయ్యి కోట్ల భారంపడింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలను 50 నుంచి 60 శాతం పెంచారు. అర్బన్ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువను అమాంతం పెంచి రిజిస్ట్రేషన్ చార్జీలు దండుకుంటున్నారు. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలకుండా విలువను పెంచారు. ఫలితంగా అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, ఇళ్లు కొన్నవారిపై భారంపడింది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం భూముల క్లాసిఫికేషన్లను మార్చేశారు. దీంతో ఏరియాను బట్టి కాక స్థలాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిపోయాయి. గతంలో చార్జీలు రూ.2 లక్షలు ఉండగా, రూ.50 వేల వరకు పెరిగాయి.బాబు వస్తూనే బాదుడు మొదలు‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదు. అవసరమైతే తగ్గిస్తాం. వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం’’ అంటూ ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. ఇంతలా నమ్మబలికిన ఆయన అధికారం చేతికి రాగానే అసలు స్వభావం బయటపెట్టుకున్నారు. బాబు వస్తూనే రూ.15,485.36 కోట్ల భారీ భారాన్ని ప్రజలపై వేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్లను వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో రూ.1,863.64 కోట్లకు ఏపీఈఆర్సీ అనుమతి లభించింది. అంటే, బాబు ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.17,349 కోట్ల భారం ప్రజలపై మోపినట్లైంది. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు మండిపడుతున్నా, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా బాబు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు, సరికదా ఇంకా చార్జీల భారం వేస్తూనే ఉంది. దీంతో వాడిన విద్యుత్కు సమానంగా అదనపు చార్జీలు పడుతున్నాయి. ఇంతలేసి బిల్లులు కట్టలేం బాబూ అంటూ జనం గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.తాగునీటిపై యూజర్ చార్జీలు అనుకున్నప్పుడు అమలు!గ్రామాల్లో ప్రజలు తాగేందుకు రక్షిత పథకాల ద్వారా సరఫరా చేసే నీటిపైనా యూజర్ చార్జీలు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏడాదికి రూ.1680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి, అందులో రూ.1,036.97 కోట్లను ప్రజల నుంచి యూజర్ చార్జీలుగా పిండుకోవాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపి, ‘ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’ పాలసీ రూపొందించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిప్రకారం రెండు కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగేచోట ఒక్కో వ్యక్తిపై నెలకు రూ.26.66 చొప్పున ఏడాదికి రూ.320 భారం మోపనున్నారు. గ్రామ పరిధిలో అంతర్గతంగా చిన్న రక్షిత తాగునీటి పథకం ఉన్నచోట ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.20 వంతున ఏడాదికి రూ.240 యూజర్ చార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. కాగా, ‘‘ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’’ పాలసీకి యూజర్ చార్జీల వసూలు ఎప్పటినుంచి అన్నది ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, నోటిఫికేషన్ ప్రభుత్వ జీవో రూపంలో జారీ అయినందున ఎప్పుడనుకుంటే అప్పటినుంచి యూజర్ చార్జీల వసూలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
శాంతి ఒప్పందానికి చేరువలో...
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోతుందన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. శాంతి ఒప్పందం విషయంలో ఆ రెండు దేశాలు ఎన్నడూ లేనంత సమీపంలోకి వచ్చాయని తెలిపారు. ఆదివారం ఫ్లోరిడాలోని ఓ రిసార్ట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఈ భేటీ జరగడం విశేషం. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందంతోపాటు యుద్ధం ముగించడంపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో అద్భుతమైన సంభాషణ జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. భేటీ అనంతరం జెలెన్స్కీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా అధినేత పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జెలెన్స్కీ నిజంగా ధైర్యవంతుడైన నాయకుడు అంటూ కొనియాడారు. మరోవైపు జెలెన్స్కీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగడం గమనార్హం. ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. ఏం చర్చించారు? ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. కొన్ని అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉక్రెయిన్కు సంబంధించిన కొన్ని భూభాగాలను రష్యా ఆక్రమించింది. వాటిని తిరిగి అప్పగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా రష్యా అంగీకరించడం లేదు. వాటిపై హక్కులు వదులుకోవడంతోపాటు రష్యాలో అంతర్భాగంగా అధికారికంగా గుర్తిస్తేనే యుద్ధాన్ని ఆపేస్తామని తేలి్చ చెబుతోంది. ఇందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా భద్రతాపరమైన గ్యారెంటీలు ఇవ్వాలని కోరుతోంది. ఈ రెండు ముఖ్యమైన అంశాలపైనే ట్రంప్, జెలెన్స్కీ చర్చించినట్లు తెలుస్తోంది. యూరోపియన్ నాయకులతో సమావేశం కావాలని వారిద్దరూ నిర్ణయించారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్తోపాటు ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, పోలాండ్ తదితర దేశాల అధినేతలతో సమావేశం ఏర్పాటుచేస్తానని ట్రంప్ చెప్పారు. వచ్చే నెలలో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. శాంతి కోసం ట్రంప్ ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ఆయనకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతికి తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, రష్యా అధినేత పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. శాంతి ఒప్పందంపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు. -
బాబు సర్కారు దోపిడి ‘పర్వం’
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసి ఉత్సవాలు, ఈవెంట్ల పేరుతో దోపిడీ పర్వానికి తెరలేపింది. అధికారం చేపట్టినప్పటి నుంచి భారీగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తూ తన అనుయాయ సంస్థలకు భారీగా దోచిపెడుతోంది. ఇప్పటికే శక్తి విజయోత్సవ్, వరల్డ్ టూరిజం డే పేరిట భారీ అవినీతికి పాల్పడిన సర్కారు తాజాగా అమరావతిృఆవకాయ అంటూ మరో లూటీ ఈవెంట్కు సిద్ధమవు తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా కుంటుపడింది. ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎకో, తీర ప్రాంతాలు వంటి పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతుల లేమి వెంటాడుతోంది. వీటిని అభివృద్ధి చేయకుండా ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా భూ పందేరాలు, ఉత్సవాల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడంతోనే పబ్బం గడిపేసింది. తమ బినామీ సంస్థలు, అనుయాయులకు ప్రాజెక్టులు, ప్రోగ్రామ్స్ను వంతులు వేసి మరీ కేటాయించి అప్పనంగా దోచిపెడుతోంది. తాజాగా ‘అమరావతి–ఆవకాయ’ అంటూ హడావుడి చేస్తోంది.ఈ వేడుకల నిర్వహణ కోసం నిధులు ఖర్చు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ.. పర్యాటక ఆస్తులను అభివృద్ధి చేయడంలో చూపించట్లేదు. ఇప్పటివరకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడం కోసమంటూ భారీ స్థాయిలో పర్యాటక రోడ్షోలు, పండుగలు, ఫెయిర్స్ నిర్వహణకు ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేస్తుండడం విస్తుగొలుపుతోంది. వాస్తవానికి ప్రభుత్వం కేవలం ప్రచారాల కోసం పెట్టిన ఈ బడ్జెట్.. ఒక వార్షిక ఏడాదిలో ఏపీటీడీసీ నికర రాబడులతో సమానంగా ఉండటం గమనార్హం. అప్పుడు శక్తి విజయోత్సవ్.. ఇప్పుడు ఆవకాయ్! చంద్రబాబు సర్కారు జనవరిలో విజయవాడలో ‘అమరావతి–ఆవకాయ్’ పేరుతో ఉత్సవం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మూడు రోజుల ప్రోగ్రామ్కి ఏకంగా రూ.5 కోట్లు బడ్జెట్ కేటాయించింది. తెలుగు సాహిత్యం, సినిమా వైభవాన్ని చాటేందుకు ఉత్తరాదికి చెందిన ‘టీమ్ వర్క్ ఆర్ట్స్’కు బాధ్యతలిచ్చింది. అయితే, టెండర్లు లేకుండా ఎంప్యానల్ చేసిన సంస్థల్లో ఒక సంస్థకు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది.గతంలోనూ ఇదే రీతిలో 2024 దసరా పండుగ సమయంలో శక్తి విజయోత్సవ్ పేరుతో తూతూ మంత్రంగా చేపట్టి ఏకంగా రూ.7 కోట్లు తమ అనుయాయులకు దోచిపెట్టింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగం చేయడంతో ఈ ప్రోగ్రామ్కు బడ్జెట్ అంచనాలకు మించి బిల్లులు చెల్లించింది. తొలుత శక్తి విజయోత్సవానికి రూ.2 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయగా.. ఆ తర్వాత మరో రూ.5 కోట్లు అదనంగా కేటాయిస్తూ మొత్తం రూ.7 కోట్లకు ఉత్తర్వులు ఇచ్చింది. అంతా ప్లాన్ ప్రకారమే.. గతంలో శక్తి విజయోత్సవ్ను హైదరాబాద్కు చెందిన ఓ ఈవెంట్ కంపెనీకి డమ్మీ టెండర్ల ద్వారా కాంట్రాక్టు అప్పగించింది. సదరు కంపెనీ 2014–19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఇలాంటి ఈవెంట్లు ఎన్నో చేసింది. సదరు కంపెనీ ఇటీవల ఎన్నికల్లో అధికార పార్టీకి ఫండింగ్ చేయడంతో.. అందుకు లబ్ధి చేకూర్చేందుకు పర్యాటక శాఖలో శక్తి విజయోత్సవ్ షోల నిర్వహణ అప్పగించింది. వాస్తవానికి మొదటి రోజు సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమం ప్రారంభం అయితే సీఎం సతీమణి భువనేశ్వరి నారీ శక్తిపై ప్రసంగించారు. ప్రభుత్వంలోని కొంత మంది మంత్రులు హాజరయ్యారు. రాత్రి 10 గంటల్లోపే కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత రెండు రోజులు సాయంత్రం పూటే తూతూ మంత్రంగా చిన్నారుల కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేసినా రూ.కోటి, రూ.కోటిన్నర కూడా బడ్జెట్ దాటని కార్యక్రమానికి కళ్లు చెదిరేలా రూ.7 కోట్లు విడుదల చేయడం నిధుల దుర్వినియోగానికి అద్దం పట్టింది. పైగా ప్రైవేటు స్థలం వినియోగించుకున్నందుకు యజమానికి ఒక్కపైసా కూడా చెల్లించకుండా వేధించింది. అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి పాస్లు పూర్తిగా దుర్వినియోగం అవ్వగా, కనీసం డ్యూటీలో ఉన్న పర్యాటక శాఖ ఉద్యోగులకూ పాస్లు అందని పరిస్థితి. ఇందులో ఏపీ టూరిజం అథారిటీలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తూ ఎనిమిదేళ్లుగా ఒకే చోట పాతుకు పోయిన ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.ఆయనకు సంబంధం లేని ఈవెంట్ విభాగాన్ని రాజకీయ నాయకుల ఒత్తిడితో చేజిక్కించుకుని కథను నడిపించారని సమాచారం. ఫైల్ నిర్వహించడం దగ్గర నుంచి బిల్లుల అప్లోడ్ వరకు అన్నీ తానై వ్యవహరించారని, ఇందుకు ప్రతిగా బిల్లుల్లో ఒకశాతం కమీషన్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేమాదిరిగా సెప్టెంబర్లో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే కార్యక్రమంలోనూ భారీగా నిధులు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అమరావతి–ఆవకాయ్లో కూడా ఇదే తంతు నడుస్తోందని వినికిడి. మౌలిక వసతులు మృగ్యం.. గత ప్రభుత్వ హయాంలో పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు హరిత హోటళ్ల అప్గ్రేడేషన్ను చేపట్టింది. 12 హోటళ్లలో సుమారు రూ.78 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల చిన్న మొత్తంలో పనులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని గాలికొదిలేసింది. ఫలితంగా హోటళ్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది.రూ.కోట్లు ఖర్చు చేసి రూపురేఖలు మార్చిన ఆ హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఏకంగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను సైతం కూటమి సర్కారు ఆహ్వానించింది. ఈ క్రమంలో సగానికిపైగా హోటళ్ల ఆదాయం క్షీణించింది. పైగా అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ప్రైవేటు హోటళ్లకు వెళ్లి జేబులు గుళ్ల చేసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి దుస్థితిలో పర్యాటకుల ఆకర్షణ కోసం పండుగలు నిర్వహిస్తామంటూ సర్కారు రూ.కోట్లు వృథా చేయడం గమనార్హం. -
జైల్లోనే సెంగార్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడికి బెయిల్ మంజూరు చేయడంతోపాటు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దని అధికారులకు తేలి్చచెప్పింది. ఐపీసీ ప్రకారం ఎమ్మెల్యేను ‘ప్రజాసేవకుడి’గా పరిగణించలేమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పు బట్టింది. ఇది చట్టసభ సభ్యులకు మినహాయింపు ఇచ్చినట్లు అవుతుందన్నది.ఎమ్మెల్యే ప్రజాసేవకుడు కాదా? ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తోపాటు బాధితురాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సిందే. హైకోర్టు న్యాయమూర్తులు ఎంతో అనుభవజు్ఞలు, కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) నిర్వచనం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. చట్టం ప్రకారం ఒక కానిస్టేబుల్ ‘పబ్లిక్ సర్వెంట్’ అవుతారు. అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడు మాత్రం ప్రజా సేవకుడు కాదా? ఎమ్మెల్యేను మినహాయించడం సరైందేనా? చట్టసభ సభ్యులను దీని నుంచి మినహాయించడం సరైన ది కాకపోవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా ఒక దోషి లేదా అండర్ ట్రయల్ ఖైదీకి బెయిల్ ఇస్తూ కింది కోర్టు లేదా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పుడు అతడి వాదన వినకుండా ఆ ఉత్తర్వుపై స్టే విధించలేమని తెలియజేసింది. మరో కేసులో సెంగార్ దోషిగా తేలి, ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నాడని పేర్కొంది. ఈ నెల 23న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఉన్నావ్ కేసుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులను, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని నిలిపివేస్తున్నామని స్పష్టంచేసింది. బాధితురాలికి ప్రాణహాని ఉంది: తుషార్ సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘ఇది అత్యంత పాశవికమైన నేరం. ఘటన జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్ల కంటే తక్కువ (15 ఏళ్ల 10 నెలలు). కేవలం ఏడేళ్ల జైలుశిక్ష పూర్తయిందన్న కారణంతో దోషికి బెయిల్ ఇవ్వడం సరికాదు. సవరించిన చట్టం ప్రకారం ఇలాంటి నేరాలకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘నేరం జరిగిన సమయానికి ఈ చట్ట సవరణ రాలేదు కదా! ఆ తర్వాత వచ్చిన సవరణలను పాత కేసులకు ఎలా వర్తింపజేస్తాం?’ అని ప్రశ్నించింది. దీనికి తుషార్ బదులిస్తూ.. ‘మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంతో పనిలేదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజల దృష్టిలో బలమైన స్థానంలో ఉంటారు. ఎవరైనా సాయం కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తారు. అలాంటి నమ్మకమైన స్థానంలో ఉండి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే నేరం కచ్చితంగా తీవ్రమైన లైంగిక దాడి కిందకే వస్తుంది. ఆర్మీ ఆఫీసర్ విధుల్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎలా శిక్షార్హుడో, ఎమ్మెల్యే కూడా అంతే’ అని వాదించారు. సెంగార్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ‘సెంగార్ ఇప్పటికే బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులోనూ దోషిగా తేలారు. ఈ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తి సెంగార్ బయటకొస్తే బాధితురాలికి, ఆమె కుటుంబానికి తీరని అన్యాయం జరు గుతుంది. ఆ బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెయిల్ రద్దు చేయాలి’ అని కోర్టును కోరారు. ఎల్.కె. అద్వానీ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఎంపీలు లేదా ఎమ్మె ల్యేలుగా పదవిలో ఉన్న వాళ్లను ప్రజా ప్రతినిధులుగానే పరిగణిస్తూ అప్పట్లో న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు. సెంగార్ తరఫు న్యాయవాదుల వాదన సెంగార్ తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, ఎన్.హరిహరన్ వాదనలు వినిపించారు. ‘ట్రయల్ కోర్టు సెంగార్ను పబ్లిక్ సర్వెంట్గా పరిగణించడం వల్లనే జీవిత ఖైదు విధించింది. ఐపీసీలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనాన్ని తీసుకొచ్చి పోక్సో చట్టానికి ఆపాదించడం న్యాయం కాదు. ఒక చట్టంలోని నిర్వచనాన్ని మరో చట్టానికి వర్తింపజేయకూడదు’ అని సాంకేతిక అంశాన్ని లేవనెత్తారు. అలాగే సెంగార్కు బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తున్నాయని, టీవీల్లో కొందరు చర్చలు సాగిస్తున్నారని సెంగార్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి ఇరుపక్షాల వాదనలు తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎమ్మెల్యేను పబ్లిక్ సర్వెంట్ కాదనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ను నిలిపివేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని వెల్లడించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్కు నోటీసులు జారీ చేసింది.అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ ఓ మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో 2019 డిసెంబర్లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు(మరణించేదాకా జైలులోనే) విధించింది. మరోవైపు బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించాడు. ఈ కేసులోనూ సెంగాల్ దోషిగా తేలడంతో పదేళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నావ్ అత్యాచారం కేసుతోపాటు సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్ ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఉన్నావ్ రేప్ కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల విచారించింది. సెంగార్ చేసిన నేరం పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) కింద ‘తీవ్రమైన లైంగిక దాడి’ పరిధిలోనికి రాదని అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్ 21 ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధి ‘పబ్లిక్ సర్వెంట్’ నిర్వచనం పరిధిలోకి రారని పేర్కొంది. సెంగార్ ఇప్పటికే ఏడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు, జీవిత ఖైదును కూడా రద్దు చేస్తున్నట్లు ఈ నెల 23వ తేదీన తీర్పునిచ్చింది. -
ఈసారి ఎదురుదాడే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, రెండేళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల హయాంలో ఏం జరిగిందనే వాస్తవాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ విప్లకు సూచించారు. వాస్తవాలు తమకే అనుకూలంగా ఉన్నందున, ప్రజలకు ఆ వాస్తవాలను వివరించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకపడొద్దని చెప్పారు. ఈసారి జరిగే సమావేశాల్లో అధికార పక్షంగా అటాక్ (దాడి) మోడ్లోకి రావాలంటూ దిశానిర్దేశం చేశారు. సోమవారం తొలిరోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తన చాంబర్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ విప్లతో ఆయన దాదాపు 35 నిమిషాల పాటు సమావేశమయ్యారు. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలకు దీటుగా ఇవ్వాల్సిన సమాధానాలపై మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..‘పాలమూరు–రంగారెడ్డి, కృష్ణా నదీజలాల పంపిణీ విషయంలో మనమే కేసీఆర్ను సవాల్ చేశాం. అసెంబ్లీకి వస్తే అన్నీ చర్చిద్దామంటూ ఆహ్వానించాం. ఇప్పుడు ఆయన వస్తాడో రాడో తెలియదు. ఒకవేళ వస్తే కథలు చెప్తారు. ఆ కథలే వాస్తవాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలా జరగడానికి వీల్లేదు. ప్రజలకు ఆ భావన కలగకూడదు. బీఆర్ఎస్ అబద్ధాలను మనం సమర్థంగా తిప్పికొట్టాలి. ఇందుకు అందరూ సిద్ధం కావాలి..’ అని సీఎం చెప్పారు. అబద్ధాలు, అన్యాయం వారి విధానం బీఆర్ఎస్ చేసే రాజకీయం అందరికీ తెలుసునని, అబద్ధాలు ఆడి ప్రజలను నమ్మించడమే కాకుండా అన్యాయంగా వ్యవహరించడం వారి విధానమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. అందుకే గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా, ఇప్పుడు వాళ్లకు అవకాశం కావాలని అడుగుతోంది. బీఆర్ఎస్ చెప్పాలనుకున్నది చెప్పనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ డిమాండ్ మొదలుపెట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమేకాకుండా, అసెంబ్లీలోనూ తీవ్రస్థాయిలో ఎండగట్టాలి. సుప్రీంకోర్టుకు ఇచ్చిన డాక్యుమెంట్లలో 7.1 టీఎంసీలు మాత్రమే చాలని ఏ విధంగా పేర్కొన్నారో నిలదీయాలి. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, బీమా ప్రాజెక్టులు గత కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమై దాదాపు పూర్తి కావొచ్చినా.. వాటిని కూడా మొత్తం పూర్తి చేయకుండా పాలమూరు జిల్లాపై బీఆర్ఎస్ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరించిన అంశాన్ని ఎండగట్టాలి. పూర్తి అథారిటీ, లెక్కలతో జవాబులివ్వాలి పూర్తి అథారిటీ (సాధికారికంగా), లెక్కలతో సహా బీఆర్ఎస్కు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలి. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలి. బీఆర్ఎస్తో సహా ఏ పార్టీ సభ్యుడు అడిగిన ఎలాంటి సందేహానికైనా జవాబిచ్చేలా ఉండాలి. సబ్జెక్టుల వారీగా సిద్ధం కావాలి. ప్రతి అంశంపై నోట్స్ తయారు చేసుకోవాలి. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలి. సమగ్రంగా చర్చలో పాల్గొనాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలి. 2వ తేదీ నుంచి జరిగే సమావేశాలకు ఎమ్మెల్యేలు ఎవరూ గైర్హాజరు కాకూడదు. ఈ మేరకు మంత్రులు, విప్లు సమన్వయం చేయాలి. కృష్ణా జలాలపై చర్చ జరగనున్నందున నది పరీవాహక ప్రాంతం పరిధిలోనికి వచ్చే ఎమ్మెల్యేలు ధీటుగా సమాధానమిచ్చేందుకు సిద్ధం కావాలి..’ అని సీఎం సూచించినట్టు సమాచారం. -
మెటల్స్.. క్రాష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటం, ఎగుమతులపై చైనా ఆంక్షలు తదితర అంశాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి, రాగి తదితర కమోడిటీల ధరలు సోమవారం కుదేలయ్యాయి. వరుసగా నాలుగు సెషన్ల పాటు కొనసాగిన వెండి ర్యాలీకి బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, గరిష్ట స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్) ఫ్యూచర్స్ మార్కెట్లో మార్చి కాంట్రాక్టు ఒక దశలో సుమారు 6 శాతం క్షీణించి రూ. 2,26,275 (కిలోకి) వద్ద ట్రేడయ్యింది. సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సిల్వర్, ఇంట్రాడేలో జీవితకాల గరిష్టం రూ. 2,54,174ని తాకినప్పటికీ రూ. 2,25,500కి కూడా క్షీణించింది. ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు రూ. 28,674 మేర పతనమైంది. గత వారంలో సిల్వర్ ఏకంగా రూ. 31,348 (15.04 శాతం) ఎగిసిన సంగతి తెలిసిందే. పసిడి 3%, రాగి 13 శాతం డౌన్ .. అటు పసిడిలో కూడా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫిబ్రవరి కాంట్రాక్టు పది గ్రాముల బంగారం ధర ఒక దశలో రూ. 4,946 మేర (3.54 శాతం) క్షీణించి రూ. 1,34,927కి తగ్గింది. ఇంట్రాడేలో రూ. 1,40,444 గరిష్ట స్థాయిని చూసింది. అంతక్రితం సెషన్లోనే (శుక్రవారం) పుత్తడి ఆల్టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,40,465ని తాకిన సంగతి తెలిసిందే. ఇక, రాగి విషయానికొస్తే, జనవరి కాంట్రాక్టు 13 శాతం క్షీణించి రూ. 1,211.05 (కిలోకి) పడిపోయింది. ఇంట్రాడేలో ఆల్టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,392.95ని తాకింది. రికార్డ్ స్థాయి ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి, పసిడి రేట్లు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. భారీగా కొనుగోళ్ల వల్ల ఈ రెండూ ప్రస్తుతం ఓవర్బాట్ స్థితిలో ఉండటమనేది అప్రమత్తత వహించాల్సిన అవసరాన్ని సూచిస్తోందన్నారు. తదుపరి ర్యాలీకి ముందు కొంత కరెక్షన్ మంచిదని చెప్పారు. అటు అంతర్జాతీయంగా కామెక్స్లో 2026 మార్చి నెల వెండి కాంట్రాక్టు ఔన్సుకి (31.1 గ్రాములు) 8 శాతం పైగా నష్టపోయి ఒక దశలో 70.56 డాలర్లకు తగ్గింది. ఇంట్రాడేలో 82.61 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు అయిదు శాతం పైగా క్షీణించి ఒక దశలో 4,323.20 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇంట్రాడేలో నమోదైన 4,580.70 డాలర్ల స్థాయితో పోలిస్తే 257.5 డాలర్ల మేర పతనమైంది. తర్వాత కొంత కోలుకుని 4,344.50 వద్ద ట్రేడయ్యింది. ఫ్యూచర్స్ రేట్ల ప్రభావం మంగళవారం దేశీయంగా స్పాట్ మార్కెట్లో కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కారణాలు ఇవి.. వడ్డీ రేట్ల కోతలు, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కమోడిటీల్లో ర్యాలీ మొదలైందని, ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడుతున్న దాఖలాలు కనిపిస్తుండటంతో లాభాల స్వీకరణ జరుగుతోందని భావించవచ్చని జేఎం ఫైనాన్షియల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఉద్దేశించిన శాంతి చర్చలు తుది దశకు చేరాయన్న సంకేతాలు కూడా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశాభావం కలిగిస్తున్నాయని యూబీఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, సీఎంఈ, కామెక్స్లాంటి ప్రధాన డెరివేటివ్స్ ఎక్సే్చంజీలను నిర్వహించే సీఎంఈ గ్రూప్.. వెండి డెరివేటివ్స్ కాంట్రాక్టులపై మార్జిన్లను 20,000 డాలర్ల నుంచి 25,000 డాలర్లకు పెంచేయడం వల్ల ట్రేడర్లు అమ్మకాలకు దిగి ఉంటారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. స్పాట్లో వెండి అప్.. ఫ్యూచర్స్ మార్కెట్లో పతనమైనప్పటికీ.. సోమవారం స్పాట్ మార్కెట్లో వెండి రేటు మరో కొత్త రికార్డును తాకింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ట్రేడర్లు కొనుగోళ్లు కొనసాగించడంతో, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలోకి రూ.3,650 పెరిగి రూ. 2,40,000 స్థాయిని తాకింది. మరో వైపు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి రేటు పది గ్రాములకు రూ.500 క్షీణించి రూ. 1,41,800 వద్ద క్లోజయ్యింది. -
ఆయువిచ్చిన అమ్మ వెంటే...
హిందూపురం టౌన్/ పెనుకొండ : తీవ్ర రక్తస్రావంతో మృతిచెందిన తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా... ఆ వాహనానికి ప్రమాదం జరగడంతో అందులో ఉన్న నవజాత శిశువు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది. హృదయాలను కలిచివేసే ఈ దుర్ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. హిందూపురం ఆస్పత్రి నుంచి వైద్యులు అనంతపురం రిఫర్ చేయడం వల్లే తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం బసవనపల్లికి చెందిన నజ్మాకు బత్తలపల్లికి చెందిన కలీంతో రెండేళ్ల క్రితం వివాహమైంది.నజ్మాకు పురిటి నొప్పులు రావడంతో రెండో కాన్పు కోసం ఆదివారం హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం జరిగిన కొద్ది సేపటికే నజ్మాకు తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు బీపీ పెరగడంతో వైద్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ నజ్మా మృతి చెందింది. సోమవారం ఉదయం ప్రభుత్వ అంబులెన్స్లో నజ్మా మృతదేహంతోపాటు నవజాత శిశువును తీసుకుని కుటుంబ సభ్యులు బసవనపల్లికి బయలుదేరారు.మార్గంమధ్యలో పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవజాత శిశువు అక్కడికక్కడే చనిపోయింది. వాహనంలోని ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే మెరుగైన చికిత్స అందించి ఉంటే తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచేవని... అనంతపురం రిఫర్ చేయడం వల్లే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్ కాలేరు
సాక్షి, హైదరాబాద్: ‘గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్ కాలేరు. మీసాలు పెంచడం చాలా సులభం.. కానీ పాలన చేయడమే కష్టం. గడ్డం, మీసం లేదని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నన్ను ఉద్దేశించి కాదు. బహుశా వాళ్ల పార్టీ నేతలు రాహుల్ గాందీ, రాజీవ్ గాంధీని ఉద్దేశించి చేశాడనుకుంటా. నేను ఆంధ్రాలో చదవడాన్ని తప్పు పడుతున్న ముఖ్యమంత్రి అల్లుడిని మాత్రం అక్కడ నుంచే తెచ్చుకున్నారు..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎద్దేవా చేశారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శాసనసభలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ అభివాదం చేయడంపై స్పందించారు. ‘తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుంది. సభలో కేసీఆర్ను కలిసేంత సంస్కారం ఉంటే చాలు. ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్ధులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదే..’అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కోపం వస్తుందనే ‘పాలమూరు’ను పడుకోబెట్టారు ‘ఏ ప్రభుత్వం అయినా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులు ప్రారంభించి అనుమతులు తెచ్చుకోవడం పరిపాటి. ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా బయట పెట్టరు. పాలమూరు ప్రాజెక్టులో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే తప్ప రాజకీయంగా మాకు ఎలాంటి నష్టం జరగదు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్కు పేరు వస్తుందని, తన పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందనే ఉద్దేశంతోనే పనులు చేయకుండా పడుకోబెట్టారు. కేసీఆర్ ప్రెస్మీట్ పెడితే అల్లాడుతున్న వారు ఆయన అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. నదులు, బేసిన్ల గురించి అవగాహన లేని సీఎం, మంత్రులు నీటిపారుదల శాఖపై జరిగే చర్చకు కేసీఆర్ రావాలని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి చర్చకు ప్రిపేర్ అవుతున్నారు. మేడిగడ్డ బరాజ్ పేల్చివేతలపై ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు చేపట్టలేదు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లేదని చెప్పగలరా? ‘శాంతి భద్రతల పరిరక్షణ కోసం నెహ్రూ కాలం నుంచే గూఢచారి వ్యవస్థ ఉంది. ప్రస్తుతం నిఘా వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా?. గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రస్తుత డీజీపీకి కూడా నిఘా వ్యవస్థపై పూర్తి అవగాహన ఉంది. సీఎంకు నిఘా వ్యవస్థ సమాచారం మాత్రమే ఇస్తుంది, సమాచారణ సేకరణ ఎలా చేసిందో చెప్పదు. ‘సిట్’లు, విచారణలతో ఇప్పటివరకు ఒక్క ఆరోపణ అయినా నిజమని తేల్చిందా? ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నాలను అర్ధం చేసుకున్న ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులకు ఓటు వేసి కాంగ్రెస్కు పాలన చేతకాదని తేల్చి చెప్పారు..’అని కేటీఆర్ అన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారికి డోర్లు క్లోజ్ ‘పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదు. పార్టీ నుంచి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సైదిరెడ్డి వారి నియోజకవర్గాల్లో కనీసం ఒకటి రెండు సర్పంచ్ స్థానాలు కూడా గెలిపించుకోలేక పోయారు. పాలకుర్తి, బోథ్, జహీరాబాద్ లాంటి నియోజకవర్గాల్లో పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో సత్తా చాటారు. అందువల్లే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు పెట్టేందుకు భయ పడుతోంది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
బాబు పాలనలో ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కట్లేదు
సాక్షి,అమరావతి: అన్నదాతలను ఆదుకోవడంతోపాటు, కనీస మద్దతు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, (వ్యవసాయం, రైతు సంక్షేమం), ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తాడేపల్లిలో సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాగును పూరి్తగా విస్మరించిన కూటమి పాలనలో 2025 రైతుల పాలిట చీకటి సంవత్సరమని అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడంతోపాటు రైతులు పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర లేక కంది రైతులు విలవిలలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘2025 – 26లో రాష్ట్రంలో దాదాపు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది కనీస మద్దతు ధర క్వింటా రూ.8 వేలు. కానీ ఆ ధర దక్కడం లేదు. రైతులు క్వింటా రూ.6,500 నుంచి రూ.6,600 వరకు అయినకాడికి తెగనమ్ముకుని నష్టపోతున్నారు. అయినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. పొరుగున కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం స్వయంగా కంది కొనుగోలు కేంద్రాలు తెరిచి, క్వింటా కంది రూ.8 వేలకు కొంటున్నట్లు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గత ఏడాది కంది పంట ఉత్పత్తి 1.71 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది అంచనా 1.17 లక్షల టన్నులు. అలాగే గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 473 కిలోలు కాగా, ఈ ఏడాది అది కూడా 401 కిలోలకు తగ్గింది.’ అని నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్నదీ అదే దుస్థితి ‘మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 కాగా, రైతులు క్వింటా మొక్కజొన్న రూ.1,500 నుంచి రూ.1,900 వరకు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఈ పంటను రాష్ట్రంలో ఈ సీజన్లో 4.6 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, అదీ సగటు దిగుబడి తగ్గింది. తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచినా, మన ప్రభుత్వానికి మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. మొక్కజొన్న గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 4,710 కిలోలు కాగా, ఈ ఏడాది 4,254 కిలోలు మాత్రమే అని అంచనా వేస్తున్నారు’ రైతు కంట కన్నీరు మంచిది కాదు.. అది అరిష్టం ‘రాష్ట్రంలో ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రకృతివైపరీత్యాలకు దిగుబడి తగ్గి, ధరలు పడిపోవడంతో దిక్కుతోచక విలపిస్తున్నారు. అయినా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు. ‘రైతు కన్నీరు మంచిది కాదు. రాష్ట్రానికి అరిష్టం’ అని ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు. -
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నికీలలు
సాక్షి, అనకాపల్లి/సామర్లకోట: ఎర్నాకుళం వీక్లీ ఎక్స్ప్రెస్లో ఆదివారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జార్ఖండ్లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ (రైలు నంబర్–18189)లో అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో బీ–1, ఎం–2 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. పొగ విపరీతంగా కమ్ముకోవడంతో బీ–1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ (70) అనే వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయి.. అగ్నికీలల్లో సజీవ దహనమయ్యాడు.ఈ ఘటనతో యలమంచిలి రైల్వేస్టేషన్లో రెండు గంటలపాటు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి నుంచి అగి్నమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈలోపు లోకో పైలట్లు కాలిపోతున్న రెండు బోగీలను వేరుచేసి మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. పరుగులు తీసిన ప్రయాణికులు మంటలు చెలరేగిన రెండు ఏసీ బోగీల్లోని ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి యలమంచిలి రైల్వే స్టేషన్లోకి పరుగులు తీశారు. లగేజీలను కూడా వదిలేసి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సజీవ దహనమైన ఒక్కరు మినహా అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు బోగీలతోపాటు ఎం–2 బోగీని కూడా తప్పించి ఉదయం 7 గంటలకు రైలు బయల్దేరింది. ఆ బోగీల నుంచి దింపేసిన సుమారు 125 మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్కు తరలించారు. అక్కడ మూడు కొత్త బోగీలు అటాచ్ చేసి ప్రయాణికులను అదే రైలులో వారి గమ్యస్థానాలకు పంపించారు. రైలు కదలికలో తేడా రావడంతో.. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో నర్సింగిబిల్లి–యలమంచిలి స్టేషన్ల మధ్య బ్రేకుల్లో తలెత్తిన లోపాల కారణంగా.. ఏసీ బోగీలో అర్ధరాత్రి సమయంలో పొగ రావడం మొదలైంది. ఆ తరువాత కొద్దిసేపట్లోనే యలమంచిలి స్టేషన్కు రైలు చేరుకుంది. వాస్తవానికి ఇక్కడ ఆ ట్రైన్కు హాల్టు లేదు. ఈ రైల్వేస్టేషన్లో లోకో పైలట్ల విశ్రాంతి గది ఉండటంతో ఒక పైలట్ను దించేందుకు రైలును ఆపినట్టు రైల్వే సిబ్బంది చెప్పారు. ముందుగా రైలు వేగాన్ని తగ్గించి.. స్టేషన్కు రాగానే బ్రేక్ వేశారు. ఆ సమయంలో బ్రేకుల్లో లోపాలున్నట్టు అర్థమైంది. బ్రేక్లు పట్టేయడం, రైలు కదలికలో తేడాను పైలట్లు గమనించారు.దిగి చెక్ చేయాలని భావిస్తున్న సమయంలోనే.. ప్రయాణికులు చైన్ లాగిన సంకేతాలు వచ్చాయి. దీంతో లోకో పైలట్లు వేగంగా చైన్ లాగిన బోగీలవైపు పరుగులు తీశారు. బోగీల్లో మంటలు మొదలవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ.. ప్లాట్ఫామ్ పైకి దిగి పరుగులు తీశారు. యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలపడంతో ప్రయాణికులు తొందరగా సులువుగా ప్లాట్ఫామ్పైకి దిగగలిగారు. ఫైర్ ఇంజిన్లు త్వరితగతిన చేరుకోగలిగాయి. అక్కడ రైల్వే పోలీసు సిబ్బంది కూడా ఉండటం వల్ల వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టగలిగారు. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు.మృతుడి బ్యాగ్లో నగదు, బంగారం గుర్తింపు ప్రమాదంలో మృతి చెందిన చంద్రశేఖర్ సుందర్ బ్యాగులో నగదు, బంగారం ఉన్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగును తెరిచి చూడగా.. అందులో రూ.6.50 లక్షల నగదు, బంగారం ఉంది. చాలావరకు నోట్ల కట్టలు కాలిపోయి ఉన్నాయి. మృతుడు విజయవాడలో హోల్సేల్ వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. విజయనగరంలో ఒక వస్త్ర దుకాణం నుంచి డబ్బు వసూలు చేసుకుని విజయవాడ వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. మృతుడి బ్యాగ్లో దొరికిన రూ.6.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలను అతడి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. బ్రేకులు పట్టేయడమే కారణమా? ప్రమాదానికి కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. బ్రేకుల ఫెయిల్యూరే కారణమా లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. ప్రమాద స్థలాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ, విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు, రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు.డీఆర్ఎం మోహిత్ మాట్లాడుతూ.. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని.. బోగీల్లో ఉన్న దుప్పట్లు అంటుకుని మంటలు శరవేగంగా వ్యాపించాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబానికి రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవిని విచారణాధికారిగా నియమించారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి రెండు బోగీలు పూర్తిగా దగ్ధమై ఒక ప్రయాణికుడు మృతిచెందడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. సీట్ల కింద నుంచి మంటలొచ్చాయిఎర్నాకుళం ఎక్స్ప్రెస్ బీ–1 బోగీలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు అనకాపల్లిలో ఎక్కాను. రైలు యలమంచిలి చేరుకుంటున్న సమయంలో పైబెర్తులోని ప్రయాణికుడు టాయిలెట్కు వెళ్లూ బోగీలోని సీట్ల కింద నుంచి మంటలు వస్తున్న విషయాన్ని గమనించి నాకు చెప్పాడు. ఆయన, నేను కేకలు వేస్తూ బోగీలోని ప్రయాణికులను నిద్రలేపి చైన్ లాగాం. అప్పటికే రైలు యలమంచిలి స్టేషన్కు వచ్చి ఆగింది.వెంటనే ప్రయాణికులు రైలులోంచి ప్రాణభయంతో దిగేశారు. అదే సమయంలో సమీపంలోని ఎం–2 బోగీకి కూడా మంటలు వ్యాపించాయి. యలమంచిలి రైల్వేస్టేషన్ ఆవరణ అంతా పొగతో నిండిపోయిది. ప్రమాదం జరిగిన బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట తీసుకు వచ్చారు. చాలామంది తమ లగేజీలను అక్కడే వదిలేసి ఇక్కడకు వచ్చారు. –నాగేంద్ర, ప్రత్యక్ష సాక్షి -
నోబెల్ వచ్చేదాకా ముగింపు ఉండదా సార్!
నోబెల్ వచ్చేదాకా ముగింపు ఉండదా సార్! -
కేబినెట్ భేటీలో హైడ్రామా
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజనలో రాయచోటి ప్రాంతాన్ని చావుదెబ్బ కొట్టిన తర్వాత కూడా అక్కడి ప్రజలను మాయచేసేందుకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెరలేపారు. ఇందుకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. రాయచోటి ఎమ్మెల్యేగా మంత్రివర్గంలో ఉన్న మండిపల్లి రాంప్రసాద్రెడ్డి కన్నీరు పెట్టుకున్నట్లు, చంద్రబాబు ఆయన్ను ఓదార్చినట్లు అనుకూల మీడియాకు లీకులిచ్చి ప్రచారం చేసుకున్నారు. నిజానికి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి తరలిస్తున్నా రాంప్రసాద్రెడ్డి కళ్లప్పగించి చూడడం తప్ప ఏమీచేయలేకపోయారు.పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైనప్పుడు రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలిస్తే తన పదవులకు రాజీనామా చేస్తానని బీరాలు పలికిన ఆయన ఇప్పుడు కేబినెట్ భేటీలో అందుకు సమ్మతి తెలుపుతూ సంతకం పెట్టారు. తన సొంత ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా చంద్రబాబు చెప్పిందల్లా చేసి ఇప్పుడు సానుభూతి కోసం కన్నీరు పెట్టుకున్నట్లు డ్రామాలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాంప్రసాద్రెడ్డి రాయచోటి కోసం పోరాడారని.. అయినా జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చిందని చంద్రబాబు చిలక పలుకులు పలికినట్లు లీకులు వచ్చాయి.ఆ ప్రాంతం గొంతు పిసికి తీరిగ్గా సంతాపం వ్యక్తంచేసినట్లుగా చంద్రబాబు తీరు ఉందని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజా నిర్ణయంతో మంత్రి స్థానికంగా తిరగలేని పరిస్థితి ఉంటుందని గ్రహించిన చంద్రబాబు ఈ డ్రామా ఆడించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆయన మంత్రివర్గ సమావేశం నుంచి కళ్లు తుడుచుకుంటూ వచ్చి కారెక్కి వెళ్లిపోయారు. ఇక భావోద్వేగంతో ఆయన మాట్లాడలేకపోతున్నారని ఆయన సిబ్బంది సెలవిచ్చారు.మంత్రి రాజీనామా శపథం ఏమైంది?నిజంగా రాయచోటి ప్రాంతానికి మేలు చేయాలని ఉంటే మంత్రి రాంప్రసాద్రెడ్డి తాను శపథం చేసినట్లు ఈ పాటికే రాజీనామా చేయాలి. కానీ, ఆ పని చేయకపోగా చంద్రబాబు ఎదుట తన ప్రాంతం గోడును కూడా వినిపించకుండా ఆయన చెప్పినచోట సంతకం పెట్టారు. తన నియోజకవర్గానికి అన్యాయం జరిగేలా చేసిన ప్రతిపాదనకు తానే సంతకం పెట్టి ఆమోదముద్ర వేసిన ఘనకీర్తి రాంప్రసాద్రెడ్డికే దక్కుతుందని విమర్శకులు మండిపడుతున్నారు. మంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో ఉన్న జిల్లా కేంద్రాన్ని ఆయన కాపాడుకోలేకపోవడం అసమర్థతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కూడా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చేసి ప్రజాభిప్రాయం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. జనాగ్రహం నుంచి గట్టెక్కేందుకే ఓదార్పు నాటకం..ఇక జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు మంత్రి మండిపల్లిని ఓదార్చినట్లు.. జిల్లా కేంద్రాన్ని మార్చడంపట్ల తాను కూడా బాధపడినట్లు చంద్రబాబు లీకులిచ్చి నాటకాన్ని మరింత రంజింపచేశారు. అంత బాధపడేటప్పుడు జిల్లా కేంద్రాన్ని ఎందుకు మార్చారు? ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు? దురాలోచన లేకపోతే ప్రాథమిక నోటిఫికేషన్లో ఒకలా తర్వాత మరోలా ఎందుకు ప్రతిపాదన మార్చాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ఇదంతా కేవలం ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే జిమ్మిక్కులేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల పేరును చంద్రబాబు సర్కారు మార్చేయనుంది. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పేర్లకు బదులు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులుగా నామకరణం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. అలాగే, రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు పలు మండలాలను అటూ ఇటూ మార్చనున్నారు.బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చనున్నారు. మోటారు వాహనాల లైఫ్టాక్స్పై 10 శాతం చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు మోటార్ వాహనాల పన్నుల చట్టం–1963లో పలు వసరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు.. జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రంపచోడవరం నియోజకర్గంతో పోలవరం జిల్లా.. నాలుగు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు. ⇒ రాయచోటికి బదులుగా మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను మార్పుచేస్తున్నారు. రాయచోటి మదనపల్లిలో భాగంగా ఉంటుంది. తొమ్మిది జిల్లాల్లో ఎటువంటి మార్పులు చేయలేదని.. 17 జిల్లాల్లో 25 మార్పులు చేసినట్లు మంత్రి అనగాని తెలిపారు. పలు మండలాలను అటు ఇటూ మార్పులు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మార్పులు చేర్పులతో ఈనెల 31న గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుందని, వచ్చేనెల 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. ⇒ సామర్లకోటను పెద్దాపురం మండలంలోకి.. మండపేట మండలాన్ని రాజమండ్రిలో కలపనున్నారు. పెనుగొండ మండలం పేరు వాసవి పెనుగొండగా.. రైల్వేకోడూరు తిరుపతి జిల్లాకు.. రాజంపేట కడపలోకి.. సిద్దవటం ఒంటిమిట్ట కడపలోకి మారుస్తున్నారు. మడకసిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకానుంది. బాపట్ల నుంచి అద్దంకి నియోజకవర్గం తిరిగి ప్రకాశం జిల్లాకు మార్పు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాకు.. మరో రెండు మండలాలను తిరుపతి జిల్లాకు మార్పు. ఆదోని మండలాన్ని ఆదోని–1 మండలం, ఆదోని–2 మండలంగా మార్పు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలున్నాయి. ⇒ మోటారు వాహనాల లైఫ్టాక్స్పై 10 శాతం చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ విధింపు. ఈ సెస్ మొత్తాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీచేసి రోడ్ల మెరుగుదల, రోడ్డు భద్రతా చర్యలను చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రోడ్ సేఫ్టీ సెస్ ద్వారా ఏటా రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో వాహన కొనుగోలుదారులకు కొంత ఆదా అవుతోంది. ఈ చిన్న సెస్ విధించడంవల్ల వాహన యజమానులపై ఆరి్థక భారం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ⇒ దుగ్గరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్థాపనకు గ్రీన్సిగ్నల్. ⇒ నెల్లూరు జిల్లా దామవరం గ్రామంలో 418.14 ఎకరాల భూమిని దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అభివృద్ధి కోసం సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు అనుమతి. అలాగే, జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన దాని ప్రకారం శాశ్వత లీజ్ హోల్డర్లకు ఎకరాకు రూ.13 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకారం. ⇒ బాపట్ల మండలంలోని వెస్ట్ బాపట్ల గ్రామంలో ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని బాపట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడికి లీజ్ పద్ధతిలో కేటాయించి, టీడీపీ జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి అనుమతి. ఎకరాకు సంవత్సరానికి రూ.1,000 చొప్పున లీజ్ రుసుము చెల్లిస్తూ, 33 ఏళ్లపాటు లీజుకు ఆమోదం. ⇒ ఎన్ఎస్సీఎఫ్డీసీ (జాతీయ షెడ్యూలు కులాల ఆరి్థక అభివృద్ధి సంస్థ) ద్వారా ఎస్సీలు తీసుకున్న రుణాలపై వడ్డీ రూ.41 కోట్లు మాఫీ. ⇒ అమరావతిలో యోగా నేచురోపతి ఇనిస్టిట్యూషన్కు భూమి కేటాయింపు. అలాగే, విశాఖలో ఆసుపత్రి ఏర్పాటుకు కూడా.. ⇒ తొలుత ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం. అలాగే, విద్యుత్ రంగంలో మరిన్ని అప్పులకు అనుమతి. ⇒ సీఆర్డీఏలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుకు నాబార్డు నుండి రూ.7,387.70 కోట్ల రుణం పొందేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి. ⇒ సీఆర్డీఏలో ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్–2 కమిషనింగ్ (కెపాసిటీ 8,400 క్యూసెక్) 15 ఏళ్ల ఆపరేషన్–మెయింటెనెన్స్తో లంప్సమ్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఎల్–1 బిడ్ ఆమోదించేందుకు అనుమతి. ⇒ మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో రూ.1,673.51 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదనకు ఆమోదం. ⇒ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 9.88 ఎకరాల లీజును మూడేళ్ల కాలానికి పునరుద్ధరించాలన్న రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు గ్రీన్సిగ్నల్. ఈ భూమిని వేదాంత లిమిటెడ్కు ఆన్షోర్ డ్రిల్లింగ్ కార్యకలాపాల కోసం కేటాయించనున్నారు. ⇒ సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపునకు సంబంధించిన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులకు ఓకే. ⇒ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు–ఫేజ్– ఐ–స్టేజ్– ఐలోని పంపింగ్ స్టేషన్లకు ఆమోదించిన డిజైన్లు/డ్రాయింగ్ల ప్రకారం ఇండక్షన్ మోటార్లలో పెరిగిన మెగావాట్ కెపాసిటీ కోసం అదనపు ఖర్చు రూ.76,80,000ల మొత్తానికి పరిపాలనా అంగీకారం. ⇒ రాజముద్రతో త్వరలోనే 21.87 లక్షల మంది రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు..ఇక వైద్య కళాశాలల నిర్మాణానికి పీపీపీ విధానంలోనే ముందుకెళ్తామని, వెనక్కు వెళ్లేదిలేదని మంత్రి సత్యకుమార్ స్పష్టంచేశారు. ఆదోని వైద్య కళాశాలకు రాజ్కుమార్ ప్రేమ్చంద్ షా బిడ్ దాఖలు చేశారని, మరికొన్ని సమరి్పంచడానికి గడువు కోరారని, అయితే.. గడువు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక్క బిడ్ వచి్చనాసరే ముందుకెళ్తామని మంత్రి తేల్చిచెప్పారు. -
2025..1.22 లక్షలు ఉద్యోగాలు ఔట్..
సాక్షి, స్పెషల్ డెస్క్: సాంకేతికరంగ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ చిచ్చు ప్రధానంగా ఐటీ రంగంపైనే ప్రభావం చూపుతోంది. కంపె నీలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పునర్ వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తుండటంతో ఉద్యోగుల తీసివేతలు తప్పడం లేదన్నది పరిశ్రమ వర్గాల మాట. కోవిడ్–19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొంత కాలంపాటు టెక్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా నియామ కాలు చేపట్టాయి. అయితే స్థూల ఆర్థిక ఒత్తిళ్లతోకొన్నాళ్లుగా మార్కెట్ దిద్దుబాటుకు గురవుతోంది. ఇటీవలి కాలంలో ఏఐ, ఆటోమేషన్ వైపు పరిశ్రమ మళ్లుతోంది. దీని ఫలితంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా 257 టెక్ సంస్థలు 1.22 లక్షల మందికి ఉద్వాసన పలికాయని ఉద్యోగుల తొలగింపులను ట్రాక్ చేస్తున్న లేఆఫ్స్. ఎఫ్వైఐ వెబ్సైట్ వెల్లడించింది. సిబ్బందిని ఇంటికి సాగనంపిన సంస్థల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజాలూ ఉన్నాయి. కానీ 2023తో పోలిస్తే ఈ తీసివేతలు సగానికంటే తక్కువే కావ డం గమనార్హం. మరో సాంకేతిక దిగ్గజం యాపిల్ సైతం డజన్లకొద్దీ సేల్స్ సిబ్బందిని కుదించింది. ద్రవ్యోల్బణం, సుంకాల కారణంగా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వే షిస్తున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలా పాలను నిర్వహించడం, ఏఐపై ఆధారపడటం కంపెనీలకు ఆకర్షణీయమైన స్వల్పకాలిక పరిష్కారంగా కనిపిస్తోంది.లేఆఫ్స్కు ప్రధాన కారణాలు ఇవీ..1. ఓవర్ హైరింగ్–మార్కెట్ కరెక్షన్ కోవిడ్–19 సమయంలో ఈ–కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రిమోట్ వర్క్ టూల్స్కు డిమాండ్ పెరిగింది. దీంతో టెక్ పరిశ్రమలో భారీ నియామకాలకు దారితీసింది. ప్రస్తుతం మార్కెట్ యథాతథ స్థితికి చేరుకోవడం, డిమాండ్ వృద్ధి సాధారణం కావడంతో కంపెనీలు తాము అధిక సిబ్బందితో ఉన్నట్లు గుర్తించాయి. ప్రస్తుత డిమాండ్కు అనుగుణంగా శ్రామిక శక్తిని సరైన పరిమాణంలో ఉపయోగిస్తున్నాయి.2. పెట్టుబడిదారుల డిమాండ్స్ అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం భయాలు వంటి ప్రపంచ ఆర్థిక ఎదురుగాలులు నిర్వహణ ఖర్చులను పెంచడంతోపాటు లాభాలను తగ్గించాయి. పెట్టుబడి దారులు ఇప్పుడు లాభదాయకత, ఆర్థిక క్రమశిక్ష ణను కోరుతున్నారు. ఖర్చులను తగ్గించడానికి, లాభాలను మెరుగుపరచడానికి తొలగింపులను కంపెనీలు తక్షణ మార్గంగా భావిస్తున్నాయి.3. ఏఐ, ఆటోమేషన్ వైపు పయనం ఏఐ, ఆటోమేషన్ విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి, స్వీకరణ ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణం. కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాలు, పరిశోధనలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. నిధులు సమకూర్చ డానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి రంగాల్లో రోజువారీ పనులను ఏఐ ఆటోమేట్ చేస్తోంది. కార్మికుల అవసరాన్ని తగ్గిస్తోంది. ఐటీ పరిశ్రమలో నైపుణ్యాల పునఃసమీక్షకు దారితీస్తోంది.4. సమర్థతకు పెద్దపీట అనేక టెక్ దిగ్గజాలు నిర్వహణ సామర్థ్యం, వేగంపై దృష్టిసారించాయి. భవిష్యత్ వృద్ధి విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా అప్రాధాన్య ప్రాజెక్టులు, పేలవమైన పనితీరుగల యూనిట్లను తగ్గించుకుంటున్నాయి.5. నిర్దిష్ట రంగాల్లో తగ్గుతున్న డిమాండ్ వ్యక్తిగత కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, సంప్రదాయ నెట్వర్కింగ్ హార్డ్వేర్ వంటి కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా వాటితో ముడిపడి ఉన్న నిర్దిష్ట వ్యాపార యూనిట్లలో ఉద్యోగాల కోతలు ఏర్పడుతున్నాయి. -
ఈఏపీ సెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ విజయకుమార్రెడ్డి
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ/ కేయూ క్యాంపస్/: వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. ఈ వివరాలను మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి సోమవారం మీడి యాకు వెల్లడించారు. అత్యంత కీల కమైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఈఏపీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈఏపీసెట్కు రాష్ట్రంలో దరఖాస్తులు పెరగడం, నిర్వహణ విషయంలో మరింత పారదర్శకత ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.విజయకుమార్రెడ్డి జే ఎన్టీయూ మెకానికల్ విభాగంలో సీని యర్ ప్రొఫెసర్గా, జేఎన్టీయూ రెక్టార్ బాధ్యతల్లో ఉన్నారు. ఎప్సెట్తో పాటు మొత్తం ఏడు ప్రవేశ పరీ క్షల కన్వీనర్లను, ప్రవేశ పరీక్షలను నిర్వహించే వర్సి టీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఖరారు చేశారు. గత సంప్రదా యాలను పక్కనబెట్టి.. పాత వారితో పాటు కొత్త వారికి కన్వీనర్ బాధ్యతలప్పగించారు. ఎప్సెట్, పీఈసెట్, పీజీఈసెట్ కన్వీనర్లుగా కొత్త వారికి అవకాశమిచ్చారు. ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ కన్వీనర్లుగా పాత వారికే అవకాశమిచ్చారు. -
వర్సిటీలకు ఊపిరి పోయండి
సాక్షి, హైదరాబాద్: విశ్వ విద్యాలయాల్లో సమస్యలు పరిష్కరించి వాటికి ఊపిరి పోయాలని ఉప కులపతులు ప్రభుత్వాన్ని కోరారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టకపోతే ఉనికికే ప్రమాదమని స్పష్టం చేశారు. ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయకపోతే బోధన ఎలా చేస్తామని ప్రశ్నించారు. బోధనే అరకొరగా ఉంటే ర్యాంకులు ఎలా సాధ్యమంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో సోమవారం వీసీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు పలు అంశాలను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. బోధన కష్టంగా ఉందిఅన్ని విశ్వవిద్యాలయాల్లోనూ బోధన కష్టంగా ఉంది. 70 శాతానికి పైగా శాశ్వత పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలిక బోధకులతో నెట్టుకొస్తున్నాం. దీనివల్ల నాణ్యత దెబ్బతింటోంది. ప్రాజెక్టులు రావడం కూడా కష్టంగా ఉంది. జాతీయ ర్యాంకుల సాధనలోనూ ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది. ఫ్యాకల్టీ కొరత ఉండటం వల్ల ర్యాంకులకు అనుగుణంగా సమాచారం ఇవ్వడం సాధ్యం కావడం లేదు. హేతుబద్ధీకరణకు కమిటీని ఏర్పాటు చేయాలి..’ అని వీసీలు కోరారు. బోధనేతర సిబ్బంది పోస్టుల ఖాళీలను కూడా ప్రస్తావించారు. నిధులు పెంచాలి‘రాష్ట్ర బడ్జెట్ మొత్తంలో విద్యా రంగానికి కనీసం 10 శాతం నిధులు కేటాయించాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్య స్థాయి నుంచే ఏఐ ఆధారిత విద్యా బోధన ఉండాలి. యూనివర్సిటీ స్థాయిలో దీన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. అయితే దీనికి నిధుల కొరతే అడ్డంకిగా ఉంది..’ అని వీసీలు తెలిపారు. కాగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా తాను కృషి చేస్తానని బాలకిష్టారెడ్డి హామీ ఇచ్చారు.యూజీ, పీజీలో మార్పులుఅన్ని యూనివర్సిటీల పరిధిలో ఉమ్మడి సిలబస్ తీసుకొచ్చే ప్రక్రియ వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా రూపకల్పన చేసిన సిలబస్ను కూడా అందుబాటులోకి తేవాలని, సిలబస్ను కాలేజీలు మొదలవ్వడానికి ముందే విద్యార్థులకు అందించాలని వీసీలను బాలకిష్టారెడ్డి కోరారు. ఆధునిక పోకడలకు అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లో మార్పులు చేసినట్టు తెలిపారు.కాగా ఉమ్మడి బోధన ప్రణాళిక అమలుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూనివర్సిటీల పరిధిలో ఉన్న కాలేజీల్లో అకడమిక్ ఆడిట్ చేపట్టాలని సమావేశం అభిప్రాయపడింది. ముఖ్యంగా 25 శాతం అడ్మిషన్లు పూర్తవ్వని కాలేజీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలకు అనుమతులను సమీక్షించాలని తీర్మానించింది. సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కె మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు. -
ఈ రాశి వారికి కాంట్రాక్టులు లభిస్తాయి.. సంఘంలో గౌరవం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.ఏకాదశి రా.1.29 వరకు, తదుపరి ద్వాదశి,నక్షత్రం: భరణి రా.1.11 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ప.11.45 నుండి 1.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు, తదుపరి రా.10.37 నుండి 11.29 వరకు, అమృత ఘడియలు: రా.8.40 నుండి 10.10 వరకు, ముక్కోటì (వైకుంఠ) ఏకాదశి.సూర్యోదయం : 6.34సూర్యాస్తమయం : 5.32రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం... నూతనోత్సాహం. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.వృషభం... బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.మిథునం.. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు పురోగతిలో సాగుతాయి. వస్తులాభాలు.కర్కాటకం.... కాంట్రాక్టులు లభిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.సింహం.... వ్యయప్రయాసలు. పనుల్లో నిదానంగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.కన్య.... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.తుల.... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. బాకీలు అందుతాయి. కుటుంబసమస్యల పరిష్కారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సొగుతాయి.వృశ్చికం... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. లక్ష్యాల సాధనలో ముందడుగు.ధనుస్సు... వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు.మకరం.... సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపార లావాదేవీలు నత్తనడనకన సాగుతాయి. ఉద్యోగయత్నాలలో స్వల్ప ఆటంకాలు.కుంభం... మిత్రుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.మీనం... పనుల్లో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువుల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. -
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన పలువురు మాజీ సర్పంచ్లు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ప లువురు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. సో మవారం శాసనసభ ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రయ త్నించిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, ఇతర సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పోలీసులకు, సర్పంచులకు మధ్య తోపులాట జరిగింది. సర్పంచులను కట్టడి చేసే క్రమంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపకుడు సుర్వి యాదయ్య గౌడ్కు స్వల్ప గాయాలు కాగా నల్లగొండ జిల్లా పాకర్లపాడు గ్రామ మాజీ సర్పంచు కేశబోయిన మల్లయ్య యాదవ్ సృహతప్ప పడిపో యారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు చేరుకునేందుకు ప్రయత్నించిన పలువురు మాజీ సర్పంచ్లను ముందుగానే అరెస్ట్చేశారు.శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న తమను అరెస్ట్ చేయడం సరికాదని జేఏసీ చైర్మన్ సుర్వి యాదయ్య గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోక పోగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం హేయమైన చర్య అని సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి అన్నారు. -
పాలమూరుపై తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకంపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా వినిపించాల్సిన వాదనపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త అంశాన్ని ప్రభుత్వం తెరమీదకు తెస్తుండటంతో దానిని సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. సోమవారం సాయంత్రం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డితో పాటు మరికొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం..పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి వాదన వినిపిస్తుందనే అంశంపై చర్చ జరిగింది. ‘పాలమూరు–రంగారెడ్డి పథకం కింద తాగునీటి కోసం 7.15 టీఎంసీలతో పనులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోరిందని చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాబట్టి తాగునీటి ప్రాజెక్టుగా పేర్కొనడం వెనుక ఉన్న వాస్తవ ఉద్దేశాలను విడమరిచి చెప్పాలి..’ అని కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం ‘పాలమూరు’ను తాగునీటి ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే..దాని నేపథ్యాన్ని కూడా బలంగా వినిపించాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.అలాగే పాలమూరు ఎత్తిపోతలు పథకం డీపీఆర్, బీఆర్ఎస్ హయాంలో సాధించిన అనుమతులు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని సూచించినట్లు సమాచారం. కాగా అనుమతుల ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ప్రాజెక్టు పేరిట పనులు చేపట్టడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అనే వాదన వినిపించేందుకు అవసరమైన సమాచారాన్ని బీఆర్ఎస్ నేతలు సేకరిస్తున్నారు. కేంద్రం వైఖరిని కూడా ప్రశ్నించాలిరాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్.. ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించనుంది. పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిందనే వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపాలని కేసీఆర్ ఆదేశించారు. కాగా నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలు పథకానికి డీపీఆర్ ఇవ్వకుండానే ప్రస్తుత ప్రభుత్వం టెండర్లు పిలవడం, పనులు మొదలు పెట్టడాన్ని ప్రస్తావించి అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టాలనే యోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. సర్కారు ప్రకటనను బట్టి కార్యాచరణపాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం చేసే ప్రకటన ఆధారంగా తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాలు మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ పరిధిలో బహిరంగ సభల నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు అసెంబ్లీలో ప్రభుత్వం చేసే ప్రకటనను బట్టి అవసరమైతే సుప్రీంకోర్టులోనూ పార్టీ పరంగా కేసు దాఖలు చేయాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. కృష్ణా నదిపై ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, అనుమతులు, నదీ జలాల్లో తెలంగాణ వాటా, ట్రిబ్యునళ్ల తీర్పులు తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాలని బీఆర్ఎస్ అధినేత ఆదేశించినట్లు తెలిసింది. -
నైపుణ్యం కొద్దీ పురుషుడు
‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు కవి. ‘పుణ్యం’ మాత్రమే కాదు ‘నైపుణ్యం’తోనూ ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన పురుషోత్తములు వీరు. బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చినప్రొఫెసర్ శంకర్లాల్, తమ ప్రతిభాపాటవాలతో దిగ్గజసంస్థలు యాపిల్లో సీవోవోగా, టెస్లాలో సీఎఫ్ఓగా సత్తా చాటుతున్న సబీఖాన్, వైభవ్ తనేజా వరకు...అంకితభావానికి, నైపుణ్యం జోడించిన స్ఫూర్తిదాయక పురుషోత్తముల గురించి...అతడు అడవిని సృష్టించాడు!‘అయ్యో!’ అని బాధకే పరిమితమై ఉంటే అతడు అడవిని సృష్టించి ఉండేవాడు కాదు. ఇండోర్కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్లాల్ గార్గ్ స్థలంలో 2019లో జరిగిన అగ్నిప్రమాదంలో వెయ్యి వరకు చెట్లు బూడిదయ్యాయి. ఆ కన్నీళ్ల నుంచే శంకర్లాల్ ‘నేను అడవిని సృష్టించాలి’ అనే కల కన్నారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి లేటు వయసులోనూ రాత్రనక పగలనక కష్టపడ్డారు. సంవత్సరాల అతడి శ్రమ ఫలించింది. ఆ బంజరు భూమిలో ఇప్పుడు 40,000 చెట్లు కనిపిస్తున్నాయి. ‘‘ఆప్రాంతంలోని తీవ్రమైన ఉష్ణోగ్రతలు, నీటికొరత వల్ల మొదటి దఫా దాదాపు వందమొక్కలు మాత్రమే నాటాను. రోజూ నేనే వాటికి నీరు పోసేవాడిని. కొన్నిరోజుల్లో ఆ మొక్కలు పెరగడం నాకు సంతోషాన్నిచ్చింది. క్రమంగా, మొక్కలు రాళ్లలో తమదైన స్థలాన్ని ఏర్పర్చుకున్నాయి. ఇది ప్రాథమిక ప్రకృతి ధర్మం’ అంటున్నారు 75 ఏళ్ల గార్గ్.‘హోప్’ మొదలైంది...‘శాస్త్రసాంకేతిక విషయాలు శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితం కాదు. సామాన్యులు కూడా వాటి గురించి లోతుగా తెలుసుకోవాలి, అంతరిక్ష పరిశోధనలు తమ జీవితాలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో తెలుసుకోవాలి’ అంటున్న నాసా మాజీ హార్డ్వేర్ ఇంజినీర్ సిద్దార్థ్ పాండే ప్రోటోప్లానెట్’ స్టేషన్కు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు.తాజా విషయానికి వస్తే...పాండే బృందం లద్దాఖ్లోని పోకార్ లోయలో ప్రారంభ వెంచర్ హోప్ (హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్΄్లోరేషన్)కు శ్రీకారం చుట్టింది. దీనిని ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ఎస్ఎఫ్సీ)తో సంయుక్తంగా అభివృద్ధి చేశారు. వాతావరణ మార్పులు మానవ శరీరంపై కలిగించే ప్రభావం గురించి అధ్యయనం చేయడం ఈ మిషన్ ప్రాథమిక లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వ్యోమగాములకు, విద్యార్థులకు కీలకమైన డేటాను అందించే పరిశోధన ఇది. ‘లద్దాఖ్లో స్టేషన్ నిర్వహించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఏది నిర్మించినా అది స్థిరంగా ఉండేలా చూడాలనుకున్నాం. ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ముంబై. ఐఎస్టీ–తిరువేండ్రం, యూనివర్శిటీ ఆఫ్ మల్టా, హోప్ నుంచి డేటా సేకరించడానికి ఆసక్తి చూపుతున్నాయి’ అంటున్నారు పాండే.కరెంట్ బిల్లు తగ్గించేలా...విద్యుత్ వృథాను అరికడితే ‘కరెంట్ బిల్లు’ తేలిక అవుతుంది కదా! అని ఆలోచించారు బెంగళూరుకు చెందిన భరత్ రంక్వాత్. విద్యుత్ వృథాను అరికట్టే స్మార్ట్ ఎనర్జీ సిస్టమ్ను వృద్ధి చేశారు. ‘ఎనలాగ్’ అనే ఈ స్మార్ట్ అప్లికేషన్ విద్యుత్ వృథాను అరికట్టి బిల్లు భారాన్ని తగ్గించడం లో వినియోగదారులకు ఉపయోగపడుతోంది.టెస్లా వైభవం... తనేజ‘ఎవరీ వైభవ్ తనేజా?’ అనుకునేలా చేశారు వైభవ్ తనేజా. అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ‘టెస్లా’ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో)గా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. చార్టర్డ్ ఎకౌంటెంట్ (సీఏ) అయిన వైభవ్ 2017లో టెస్లా ‘సోలార్సిటీ’లో చేరి ఫైనాన్స్కు సంబంధించి వివిధ హోదాల్లో పనిచేశారు. దిల్లీ యూనివర్శిటీలో బీ.కామ్, ఆ తరువాత సీఏ చేసిన వైభవ్ ‘సోలార్సిటీ’కి ముందు మల్టీనేషనల్ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ ‘పీడబ్ల్యూసీ’లో పనిచేశారు. సీఎఫ్వోకి ముందు కార్పొరేట్ కంట్రోలర్, చీఫ్ ఎకౌంటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. ఏడాదికి రూ.1200 కోట్ల జీతం తీసుకుంటున్న వ్యక్తిగా సంచలనం సృష్టించారు. ఈ సంవత్సరం ఎలాన్ మస్క్కు చెందిన ‘అమెరికన్ పార్టీ’లో ట్రెజరర్గా నియామకం అయ్యారు.‘వైభవ్ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకు పోతారు. ప్రతిభ ఉంటే త్వరగా పై స్థాయికి వెళ్లవచ్చు అని చెప్పడానికి వైభవ్ నిలువెత్తు నిదర్శనం’ అంటారు ఆయనతో పనిచేసేన వారు.సత్తా చాటే సైనికుడు...దిగ్గజ సంస్థ ‘యాపిల్’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా ఈ సంవత్సరం ప్రపంచ దృష్టిని ఆకర్షించారు సబీఖాన్. ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్లో అయిదవ తరగతి వరకు చదువుకున్నాడు ఖాన్. ఆ తర్వాత వారి కుటుంబం సింగపుర్కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లింది. మెకానికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేసిన ఖాన్ 1995లో యాపిల్లో చేరారు. 2019లో సీనియర్ వైస్ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) అయ్యారు.‘మాన్యుఫాక్చరింగ్కు సంబంధించి యాపిల్ విస్తరణలో ఖాన్ కృషి ఉంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొనేలా సంస్థను తీర్చిదిద్దారు’ అంటారు యాపిల్ సీఈవో టిక్ కుక్. యాపిల్లో ఎంతోమంది సాంకేతిక నిపుణులు, ప్రతిభావంతులతో కలిసి పనిచేసిన ఖాన్కు ‘నమ్మకమైన సైనికుడి’గా పేరు. -
కాంగ్రెస్సే పాలమూరును అడ్డుకుంది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ సహవాస దోషంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్పై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అర్థరహిత విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీఓలో 90 టీఎంసీల నీటి కేటాయింపుల అంశం స్పష్టంగా ఉందని, ప్రస్తుత ప్రభుత్వం 45 టీఎంసీలకు అంగీకరిస్తూ లేఖ రాసిందన్నారు. అసెంబ్లీ లాబీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చి ఏడాదైనా పట్టించుకోలేదు.ప్రాజెక్టుకు సంబంధించి మేము ఏడు అనుమతులు తెస్తే కాంగ్రెస్ రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా తేలేదు. కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్న ద్రోహులు. ప్రాజెక్టు పనులు ఆగకూడదనే ఉద్దేశంతో తాగునీటి ప్రాజెక్టు పేరిట పనులు కొనసాగించి 90 టీఎంసీల ప్రతిపాదనలతో డీపీఆర్ తయారు చేసి ఏడు అనుమతులు సాధించాం. రెండు టీఎంసీల సామర్థ్యంతో సొరంగాలు తవ్వి పనులు కొనసాగించాం.కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రేవంత్ శంకుస్థాపన చేసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ డీపీఆర్ పంపలేదు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు కోసం రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 27 వేల ఎకరాల భూమి సేకరించాం. 1985లో శంకుస్థాపన చేసినా 2014 వరకు కేవలం 14వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో కల్వకుర్తిపై రూ.2,300 కోట్లు ఖర్చు చేసి మూడున్నర లక్షల ఎకరాలకు నీరు అందించాం’ అని హరీశ్ పేర్కొన్నారు. ఉత్తమ్కు అవగాహన రావడం లేదు‘నీటిపారుదల శాఖ మంత్రిగా రెండేళ్లుగా పనిచేస్తున్నా ఉత్తమ్కుమార్రెడ్డికి ఆయన శాఖపై అవగాహన రావడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగంలో మేము 11 కిలోమీటర్లు తవ్వితే రెండేళ్లలో 200 మీటర్ల పని జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఏడు డీపీఆర్లకు అనుమతులు తెస్తే, కాంగ్రెస్ హయాంలో మూడు డీపీఆర్లు వెనక్కు వచ్చాయి. రెండేళ్లలో కాంగ్రెస్ కొత్తగా ఒక్క డీపీఆర్ కూడా పంపలేదు, ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదు. ఉత్తమ్కుమార్రెడ్డి ఉత్త మాటలు మాట్లాడవద్దు. పాలమూరులో రెండేళ్లలో కిలోమీటర్ పొడవు ఉండే లింక్ కెనాల్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు’ అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. -
ఈ యేటి మేటి మాట... ట్రంపిజం
ఈ ఏడాది ఎక్కువసార్లు పతాక శీర్షికలకు ఎక్కిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేననడంలో సందేహం లేదు. ఐదు భిన్నమైన కారణాల రీత్యా ఆయన వార్తల్లో అగ్రభాగాన నిలిచారు. ఒకటి– అమెరికా ఫస్ట్ విధానం. రెండు– ఆయన సుంకాల యుద్ధం. మూడు– దక్షిణం, పశ్చిమం, ఆగ్నేయాసియా నుంచి యూరప్ వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ద్వైపాక్షిక ఘర్షణల్లో తల దూర్చా లని కోరుకోవడం. నాలుగు– అమెరికా, చైనా, రష్యాల మధ్య సమీక రణలను మార్చడం. చివరగా, వ్యక్తిగత లైంగిక జీవితానికి సంబంధించి వార్తల కెక్కడమే కాకుండా, దర్యాప్తునకు లోనవడం!భద్రతా వ్యూహంతో మరోసారి...తాజాగా ట్రంప్ పాలనా యంత్రాంగం రూపొందించిన జాతీయ భద్రతా వ్యూహంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది అమెరికా భద్రతా వ్యూహంలో పశ్చిమ అర్ధ గోళానికున్న ప్రాధాన్యాన్ని చాటడమే కాకుండా, ఆ ప్రయోజనాలను కాపాడు కునేందుకు సైనిక చర్యను ప్రతిపాదించింది. దౌత్య, సైనికపరంగా అమెరికా వాస్తవిక ప్రవర్తనను ప్రభా వితం చేయడంలో ఈ వ్యూహం ఎంత ముఖ్యమైనదిగా పరిణ మిస్తుందనేది వేచి చూడవలసి ఉంది. మన దేశంలో చాలావరకు, మనతో సంబంధాలు నెరపడంలో వ్యూహ పత్రం దృక్కోణం ఏమిటి? ట్రంప్ ప్రపంచ వీక్షణం, ‘పెద్ద వ్యూహం’లో భారత్ స్థానం ఎక్కడ? అమెరికా–భారత్ సంబంధాలు మున్నెన్నడూ ఎరుగనంతగా క్షీణించిపోయాయనే అందరూ అంటున్నమాట. ముఖ్యంగా, నాయకత్వ స్థాయి సాంగత్య స్వరూప స్వభావాలలో, ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి అపనమ్మకం తిరిగి చోటు చేసుకుంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆమె గురించి నీచంగా మాట్లా డారు. భారత్ కూడా దానికి తగ్గట్లుగానే తలుపులు బిడాయించుకుని కూర్చుంది. భారత్, దాని నాయకత్వం గురించి వాషింగ్టన్ చర్చలలో ఎంత హీనంగా ప్రస్తావనకు వచ్చిందీ, ఆ తర్వాత బహిరంగపరచిన రహస్య పత్రాలు, కొందరు రాసుకున్న జ్ఞాపకాల పుస్తకాల ద్వారా వెల్లడైంది. ఇపుడు టెలివిజన్, సోషల్ మీడియాలో క్షణాల్లో అవి వెలికి వస్తున్నాయి. కనుక, ఇది స్నేహ సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపి తీరుతుంది. మూడు ముఖ్య సంగతులువ్యూహ పత్రం విషయానికొస్తే, ఇంతవరకు మూడు సంగతులు స్పష్టమయ్యాయి. ఒకటి–దాడులు, ప్రమాదాల నుంచి సామూహిక స్వీయ రక్షణకు ‘ఒక గ్రూపు’గా ఏర్పడే ధోరణిని కొనసాగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికాలను ‘బయటి’ శక్తులకు ‘అందని దుర్గాలు’గా ప్రకటించి, పశ్చిమ అర్ధ గోళంపై పట్టు సంపాదించాలనుకుంటున్నారు. కొన్ని విధాలుగా ఇది ఆసియాలోని అభిప్రాయాలనే ప్రతిబింబిస్తోంది. ప్రపంచంలోని ఈ భాగంవారు కూడా అమెరికాను ‘బయటి’ శక్తిగానే భావిస్తారు. అయితే, ఆసియా నుంచి అమెరికా సేనలను ట్రంప్ ఉపసంహరించుకుంటారనీ, ఈ ప్రాంత భద్రతను ప్రాంతీయ శక్తుల చేతులకే విడిచిపెడతారనీ అనడానికి ఆధారాలు కనిపించడం లేదు. రెండు– మిగిలిన వాటన్నింటి కన్నా చైనాతో సంబంధాలకు ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనా అటు సవాల్గానూ, ఇటు సమ వుజ్జీగా పరిగణించి వ్యవహరించవలసిన శక్తిగానూ కూడా ఉంది. ‘జి–2’ ఆలోచనతో ఆయన చేసిన ట్వీట్ ఆసియాలో కలకలం సృష్టించింది. ఇంచుమించు రష్యా కోరుకుంటున్న విధంగానే, యూరప్లో యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రపంచంలోని మూడు పెద్ద (అమెరికా, రష్యా, చైనా) శక్తులు తమ భద్రత, పరపతి ఉన్న ప్రాంతాలకు పరిమితమయ్యే హక్కు ఉందనే లోపాయకారీ అవగాహనను బలపరుస్తున్నారు. కానీ, భారత్పై దీని పర్యవసానాలుంటాయి. చివరగా, వ్యూహ పత్రాన్ని అమెరికా విరమణ ప్రకటనగా, దేశ, విదేశాలలో ముఖ్యంగా యూరప్లో చాలా మంది భాష్యం చెబుతున్నారు. కానీ, ఆ రకమైన నిర్ధారణకు రావడం ట్రంప్ ప్రపంచ వీక్షణాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించి దాని వ్యూహ పత్రంలో ఎక్కడా ఒక్క మాట లేదు. అమెరికా శైలి మాఫియాప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలలో 750 సైనిక స్థావరాలలో 1,60,000కు పైగా అమెరికా సైనిక దళాలు న్నాయి. అమెరికా సాయుధ దళాలున్న అత్యంత ముఖ్యమైన కేంద్రాలు జర్మనీ, జపాన్, ఇటలీ, కొరియాలలో ఉన్నాయి. అవి రెండవ ప్రపంచ యుద్ధకాలం నుంచి అమెరికా ‘అధీనం’లో ఉన్నాయి. ‘నాటో’ కూటమి దేశాల్లోనూ, పశ్చిమాసియా ‘క్లయింట్’ దేశాల్లో ముఖ్యంగా బహరైన్, కువైట్లలోనూ అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఈ స్థావరాల నిర్వహణకు ఏటా 5,000 నుంచి 6,000 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనాలున్నాయి. సేనలు లేదా స్థావరాల సంఖ్యను తగ్గించుకోవడం గురించి వ్యూహ పత్రం ఎక్కడా మాట్లాడలేదు. మరింతగా ‘భారాన్ని పంచుకోవలసిన’ అవసరం గురించి మాత్రం అది ప్రస్తావించింది. ‘నాటో’ కూటమి దేశాలు, జపాన్, కొరియా, గల్ఫ్ దేశాలు వాటి రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని అమెరికా కోరుతోంది. ఇతర దేశాల్లో అమెరికా సేనల ఉనికి అవసరం ఏమిటో, అది ఎంతకాలమో, ట్రంప్ గానీ, రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికా అధ్యక్షులైన ఇత రులు గానీ వివరించిన పాపాన పోలేదు. భారతదేశంతో సహా ఇంకా అనేక దేశాల్లోనూ ద్వైపాక్షిక ఒప్పందాల రీత్యా మాత్రమే అమెరికా సేనలు పరిమిత సంఖ్యలో కనిపి స్తాయి. రెండవ ప్రపంచ యుద్ధ ఫలితంగానే, కొన్ని దేశాల్లో అవి పెద్ద సంఖ్యలో ఉన్నాయన్నది వాస్తవం. ఆ యుద్ధం ముగిసేనాటికి అమెరికా ‘విముక్తి’ కల్పించిన ‘ఆక్రమించిన’ దేశాల్లో అమెరికా సేనలు కొనసాగుతున్నాయి. ట్రంప్ వ్యూహ పత్రం, ఆ యా భూభాగాల నుంచి సేనల ఉపసంహరణ లేదా తగ్గింపునకు పిలుపు ఇవ్వలేదు. అవి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా సేనల నిర్వహణకు ఆయా దేశాలు కొంత పైకాన్ని చెల్లించాలని మాత్రమే అది అడుగుతోంది. ఇది కళాత్మక మాఫియా శైలి అవుతుంది. ఇతర పెద్ద శక్తుల నుంచి ఎదురు కాగల బెడద నుంచి ‘రక్షణ’ కల్పిస్తున్నందుకు ‘మామూలు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నమాట!ఇది చూడండి: యూరప్, ఆసియాలలో శక్తిమంతమైన సైనిక యంత్రాలుగా చైనా, రష్యా నడుచుకునేందుకు అమెరికా అనుమతి స్తుంది. చైనా, రష్యా పొరుగునున్న దేశాలు ప్రపంచ శక్తి అయిన అమెరికా పెత్తనం నుంచి తమను కాపాడుకునేందుకు ఈ ప్రాంతీయ శక్తుల పంచన చేరవచ్చు. ఇక సేనల తగ్గింపు ప్రసక్తి ఎక్కడ? ట్రంపి జంగా అభివర్ణించదగిన ఈ విధానంపై ఇతర దేశాల స్పందన ఎలా ఉండబోతోందన్నది 2020లలో కాలగతిని నిర్వచించనుంది.సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మీ చేతకానితనంతోనే రాష్ట్రానికి నష్టం
సాక్షి, హైదరాబాద్: అబద్ధాల పునాదులపైనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చేతకానితనంతో తెలంగాణకు తీరని నష్టం కలిగిందని, ఇప్పుడు ఆ చేతకానితనాన్ని దాచిపెట్టి కాంగ్రెస్ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలు కేటాయించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కోరిందని మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.ఉత్తమ్ ఈ ప్రాజెక్టు గురించి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా హరీశ్రావు చెపుతున్న వాటిలో 100 శాతం అబద్ధాలేనని అన్నారు. వారి మాటలు వింటుంటే గోబెల్స్ ఆత్మ క్షోభిస్తుందని, తాను నేర్పిన విద్యను తన కంటే ఎక్కువగా వాడుకుంటున్నారని పైన ఉన్న ఆయన అనుకుంటున్నాడేమోనని ఎద్దేవా చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కేటాయింపులతో 12 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఎంత ఖర్చయినా సరే ఈ దఫాలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గందరగోళ పరుస్తున్నారన్నారు..వాస్తవానికి పాలమూరు ప్రాజెక్టుకు చేయాల్సిన 90 టీఎంసీల కేటాయింపుల్లో 45 టీఎంసీలు కృష్ణా నుంచి, 45 టీఎంసీలు గోదావరి నుంచి మళ్లించడం ద్వారా తీసుకుంటామని 2022, ఆగస్టు 18న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఉత్తమ్ చెప్పారు. అయితే, 45 టీఎంసీల గోదావరి నీటి విషయం ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్నందున అది కోర్టు పరిధిలోకి వస్తుందని, ఈ కారణంతోనే తాము 90 టీఎంసీల తుది కేటాయింపులు చేయలేమని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసిందని వివరించారు.ఈ పరిస్థితుల్లో తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే 45 టీఎంసీల కృష్ణా జలాలను మొదటి దశలో కేటాయించాలని, తర్వాతి దశలో మిగిలిన 45 టీఎంసీలను కేటాయించాలని కోరుతూ సీడబ్ల్యూసీకి లేఖ రాశామే తప్ప ఎక్కడా కేటాయింపులను 45 టీఎంసీలకు తగ్గించాలని కోరలేదని స్పష్టంచేశారు. అసలు తెలంగాణ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు తగ్గించాలన్న కాగితంపై మంత్రిగా తానెందుకు సంతకం చేస్తానని ప్రశ్నించారు. కానీ, హరీశ్రావు మాత్రం తమ లేఖను చూపిస్తూ తనకు అనుకూలంగా ఉన్న వాక్యాలను మాత్రమే చదివి ప్రజలను గందరగోళ పరుస్తున్నారన్నారు. హరీశ్రావు తానే ఇరిగేషన్ మాస్టర్ అనుకుంటున్నాడని, అంత అహంకారం ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. వేగం వద్దని చెప్పిందెవరు?‘ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న 45 టీఎంసీల కేటాయింపు కోరుతూ ఈ విషయాన్ని వివాదం చేసింది ఎవరు? పాలమూరు ప్రాజెక్టును తాగునీటి అవసరాల కోసమే కడుతున్నామని, 7.15 టీఎంసీలు సరిపోతాయని సుప్రీంకోర్టుకు చెప్పిందెవరు? 2015లో ప్రాజెక్టు నిర్మించే జీవోను విడుదల చేసి 2022 సెప్టెంబర్ వరకు డీపీఆర్ సమర్పించనిదెవరు? ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చి ఈ ప్రాజెక్టును అంతర్రాష్ట్ర జలవివాదాల్లోకి నెట్టిందెవరు? కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని రోజుకు 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచి, పాలమూరు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి తగ్గించిందెవరు? అసలు పాలమూరు ప్రాజెక్టు పనుల్లో వేగం అవసరం లేదని, నిదానంగా చేయాలని ఇంజనీర్లకు బహిరంగంగానే చెప్పిందెవరు?’ అని ఉత్తమ్ ప్రశ్నించారు. 67 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేశాంపాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తాము 90 శాతం పనులు చేస్తే గత రెండేళ్లలో తట్టెడు మట్టి ఎత్తిపోయలేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఉత్తమ్ తప్పుబట్టారు. రూ.70 వేల కోట్ల అంచనాలకు పెంచి ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి 90 శాతం పనులెలా పూర్తవుతాయని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టామని, 67 లక్షల క్యూబిక్మీటర్ల మట్టి పని, 7 లక్షల క్యూబిక్మీటర్ల కాంక్రీట్ పని చేశామని, 9 కిలోమీటర్ల పొడవైన కాల్వలు తవ్వామని చెప్పారు. తాము వచ్చిన తర్వాతే నార్లాపూర్–ఏదులకు సోర్సు గుర్తించామని చెప్పారు. -
ఆరావళికి ఊపిరి
చరిత్రకు పూర్వమే కొన్ని నదులకు చిరునామాగా, వైవిధ్యభరిత ప్రకృతికి ఆలవాలంగా, రకరకాల జీవరాశులకు ఆలంబనగా నిలిచిన ఆరావళి ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నట్టే. ఆ పర్వత శ్రేణిపై గత నెల 20న తామిచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సుప్రీకోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయం పర్యావరణ ఉద్యమకారులకూ, ఆ ప్రాంత ప్రజానీకానికీ ఉపశమనం కలిగించింది. 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి వాయవ్య భారత్ను 670 కిలోమీటర్ల పొడవునా కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆరావళికి కష్టం వచ్చిందంటే జనం తల్లడిల్లారు. టేపు తీసుకుని కొలతలు కొలిచి, ఎన్ని డిగ్రీల కోణంలో వాలాయో గమనించి ఆ కొండల్ని కత్తిరించాలని చూసినవారి ఎత్తు గడలకు విస్తుపోయారు. అందుకే పర్యావరణ ఉద్యమకారుల నాయకత్వంలో పార్టీల కతీతంగా గొంతెత్తారు. చివరకు జనానిదే పైచేయి అయింది. ఈ అంశంలో మరిన్ని వివరణలు, భిన్న కోణాల్లో పరిశీలనలూ అవసరమవుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ మరింత సమగ్రంగా,మరింత సంపూర్ణంగా దీన్ని పరిశీలించాల్సి ఉంటుందని భావించింది. ఎన్నో పురుటినొప్పులు పడి, ఎన్నెన్నో ఉత్పాతాలు చవిచూసి, ఎన్నో విధాల భౌగోళిక మార్పులు జరిగి ప్రకృతి సంపద ఈ రూపంలో మన కళ్లముందుంది. అధికారం ఉండొచ్చు, కుబేరుణ్ణి తలదన్నేంత ఐశ్వర్యం ఉండొచ్చు – కానీ ఈ సంపదను అవసరా లకు పొదుపుగా వినియోగించుకుంటూ సురక్షితంగా భవిష్యత్తరాలకు అప్పగించటం మనిషి జన్మెత్తినవారి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా పాలకులుగా ఉన్నవారూ, పారిశ్రామిక వేత్తలూ దీన్నెక్కడా గమనించుకుంటున్నట్టు లేరు. అందుకే అడవులు మటుమాయమవు తున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. నదులు ఇంకిపోతున్నాయి. జీవ వైవిధ్యం గతి తప్పుతోంది. కొన్ని రకాల జంతువులు, పక్షులు ఇప్పటికే అంతరించిపోయాయి. నదుల గమనాలు మారాయి. రుతువులు తీరు మార్చుకుంటున్నాయి. రకరకాల కాలుష్యం కాటేస్తోంది.ఆరావళి మాత్రమే కాదు... దేశంలో చిన్నా పెద్దా కొండలు, గుట్టలు దీనంగా వేడుకుంటున్నాయి. మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న తమ ఉసురు తీయ డానికి సిద్ధపడుతున్న వైనం చూసి దుఃఖిస్తున్నాయి. అయినా ఆగిందేమీ లేదు. బంగారం మొదలుకొని డోలమైట్, గ్రాఫైట్, మాంగనీస్, బొగ్గు, రాగి, బాక్సైట్ వంటి రకరకాల ఖనిజాలు వాటిల్లో నిక్షిప్తమై ఉండటమే అందుకు కారణం. అభివృద్ధికి అవసరమనుకుంటే పరిమిత స్థాయిలో వాటిని వినియోగించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రకృతి విపత్తులకు దారితీసే స్థాయికి అది చేరుకోవటం వల్ల అసలు అభివృద్ధి పరమార్థమే దెబ్బతింటోంది. ఆ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల జీవిక ధ్వంసమవుతోంది.ఇన్ని దశాబ్దాలుగా మౌనంగా వీక్షించిన వాయవ్య భారతం ఇప్పుడైనా గొంతెత్తగలిగింది గనుకే ప్రస్తుతానికిది ఆగింది. ఆరావళి పర్వత పంక్తులు చంబల్, సబర్మతి, లూని వంటి నదులకు జీవం పోస్తున్నాయి. అక్కడ అడవులున్నాయి, గడ్డిభూములు న్నాయి. సారవంతమైన నేలలు సరేసరి. అపురూపమైన జంతు, వృక్షజాలాలున్నాయి. దేశ రాజధాని నగరం ఈ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతున్నదంటే అది ఆరావళి చలవే. అంతేకాదు... భూగర్భ జలాలు సమృద్ధిగా లభించేలా చేస్తున్నాయి. ఇప్పటికే కొన సాగుతున్న మైనింగ్ను నిలిపేయటంతోపాటు కొత్తగా మైనింగ్ లైసెన్సులు జారీ చేయకుండా చర్యలు తీసుకుంటేనే ఈ మాత్రమైనా మిగులుతాయి. ఆ దిశగా తీసుకోవా ల్సిన చర్యల్లో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు తొలి అడుగు కావాలి. ఆరావళిలో కోల్పో యింది కోల్పోగా ప్రస్తుతం మిగిలినదాన్నయినా ఎలా రక్షించుకోవాలన్న ఆర్తి ఉంటే తప్ప ఇదంతా సాధ్యపడదు. వాయవ్య భారతమే కాదు... దేశంలోని అన్ని ప్రాంతాలూ తమ గొంతు బలంగా వినిపించినప్పుడే కొనసాగుతున్న విధ్వంసానికి తెరపడుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. భూ ఆకృతి సంబంధిత అంశంగా చూసి కొలతలతో, కోణాలతో యాంత్రికంగా చూడక, మనిషి ఇరుసుగా ప్రకృతిని వీక్షించగలిగితే తరతరాల పాటు ఈ అపురూప సంపద మానవాళికి ఆసరా అందిస్తుంది. -
ఐదు డీఏలు పెండింగ్లో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా పీఆర్సీ విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా జీరో అవర్లో ప్రభుత్వంపై హరీశ్రావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాల్లాంటి వారని, వారు సంతృప్తిగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సజావుగా చేరుతాయని చెప్పారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని ఉద్యోగులంతా తీవ్ర మనోవేదనలో ఉన్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఆలస్యమవడంతో 39 మంది మనోవేదనతో మరణించారని ఆరోపించారు.తమ ప్రభుత్వంలో 17 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు అందరికీ సమయానికి నిధులు విడుదల చేశామని తెలిపారు. అక్టోబర్ 2024లో రిటైరైన సిద్దిపేటకు చెందిన జేడీ వెటర్నరీ డాక్టర్ జగత్కుమార్రెడ్డికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని, హైకోర్టులో కేసు వేసినా ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా పురోగతి లేకపోయిందని, సీపీఎస్ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్లను దారి మళ్లించడం వల్ల రెండు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.పోలీసు శాఖలో ఐదు సరెండర్ లీవులు పెండింగ్లో ఉన్నాయని, టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు రావడం లేదన్నారు. జీరో అవర్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచి్చన హామీలు వెంటనే అమలు చేసి ఉద్యోగులు, పింఛన్దారులకు న్యాయం చేయాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను హరీశ్రావు కోరారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు..: శ్రీధర్బాబు హరీశ్రావు ఉద్యోగుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉండేదన్నారు. జీపీఎఫ్, ఉద్యోగుల రిటైర్డ్ ప్రయోజనాలకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించి అందరికీ మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. -
అసెంబ్లీ 7 రోజులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని సోమవారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అవసరమయ్యే పక్షంలో మళ్లీ బీఏసీ సమావేశం నిర్వహించి మరో వారం పాటు పొడిగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన సోమవారం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. స్పీకర్ చాంబర్లో ఆయన అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టి.హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు అసెంబ్లీ కార్యదర్శులు రెండ్ల తిరుపతి, నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఎన్ని రోజులు నిర్వహిద్దాం..? శాసనసభ నిర్వహణ తీరుతెన్నులతో పాటు సభను ఎన్ని రోజుల పాటు జరపాలనే అంశంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. బీజేపీ, ఎంఐఎం నేతలు కూడా సభను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని కోరారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాటించిన సభా సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని ప్రభుత్వం వాదించగా, బీజేపీ, ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.కాగా సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించి, అవసరమైన పక్షంలో మరో వారం పొడిగిస్తామని స్పీకర్ ప్రకటించారు. అయితే జనవరి 2, 3, 5 తేదీల్లో మరో 3 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశాలకు సంబంధించిన షెడ్యూలు ఖరారు చేసి సభ్యులకు అందజేయనున్నారు. ఎజెండాపైనా సుదీర్ఘ చర్చ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ఎజెండాపై కూడా బీఏసీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై చర్చను అధికార పక్షం ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే 15 అంశాలపై చర్చించాలని బీఆర్ఎస్, 23 అంశాలపై చర్చించాలని బీజేపీ ప్రతిపాదించాయి.అయితే ప్రస్తుత సమావేశాల్లో బీఆర్ఎస్ ఇచ్చిన జాబితాలోని ఒకటి, రెండు అంశాలపై మాత్రమే చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. నదీ జలాలపై చర్చ సందర్భంగా అధికార పక్షానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇస్తే తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు స్పీకర్కు పార్టీ నేతలు లిఖిత పూర్వకంగా లేఖను సమర్పించారు. ప్రతిరోజూ క్వశ్చన్ అవర్ ఉండాలి: హరీశ్రావు బీఏసీ భేటీ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘నదీ జలాలపై పీపీటీ కోసం స్పీకర్ను కోరాం. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సభ నిర్వహణపై మా అభిప్రాయాలను చెప్పాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రశ్నోత్తరాలు నడిచాయి. సమావేశాలు జరిగినన్ని రోజులు క్వశ్చన్ అవర్ నిర్వహించాలని కోరాం. అలాగే 2025లో కేవలం 15 రోజులు మాత్రమే సభ నడిచిందనే విషయాన్ని దృష్టికి తీసుకెళ్లాం. శాసనసభ కమిటీల ఏర్పాటు, ప్రోటోకాల్ ఉల్లంఘనల గురించి ప్రస్తావించాం. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డికి సమాచారం లేకుండా బాల్కొండలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం..’అని హరీశ్రావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన అంశాలు ఇవే..! యూరియా కొరత, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, రైతు ఆత్మహత్యలు.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమల్లో వైఫల్యం, ఫ్యూచర్ సిటీ పేరిట భూములు ధారాదత్తం, కొత్త థర్మల్ ప్రాజెక్టుల్లో అవినీతి, బీసీలకు 42% రిజర్వేషన్లలో ప్రభుత్వ తప్పిదాలు, జాబ్ కేలండర్..ఉద్యోగ నోటిఫికేషన్లలో ఆలస్యం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, హిల్ట్ పాలసీ, గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలు, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, హైడ్రా, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు, శాంతిభద్రతలు, ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చించాలని బీఆర్ఎస్ కోరింది. -
మెన్ ఇన్ 2025: వచ్చే ఏడాదైనా...మేల్ ఎంచుదాం!
‘వాడికేం మగాడు’ అనేవారు గతంలో. ‘అయ్యో... మగాడు’ అనేలా ఉన్నాయి రోజులు అనుకుంటున్నారు పురుషులు. 2025 సంవత్సరం పురుషుడిని మరింత ఒంటరిని చేసిందని పరిణామాలు చెబుతున్నాయి. ‘అవతార పురుషుడు’, ‘ఆపద్బాంధవుడి’గా గతంలో చెప్పబడిన పురుషుడు నేడు సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడని నిపుణులు అంటున్నారు. 2025లో పురుషుడి స్థితిగతులపై ఓ నజర్.మగాడి కోసం రెండు ప్రయివేటు బిల్లులు2025 ముగిసి, 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ 365 రోజుల జీవితాన్ని మొత్తం తరచి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అని పురుషులని అడిగితే ‘అసలు తరచి చూసే అవకాశం, తీరిక మాకెక్కడిదీ’ అనేది పురుషుల మాట. హడావిడి, పని ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు, సామాజిక వ్యవహారాలు, ఆర్థిక కష్టనష్టాలు... అన్నీ కలిపి నిమిషం తీరిక లేకుండా చేస్తే ఇక జీవితం ఎలా సాగుతోందో చూసి, అంచనా వేసే అవకాశం ఎలా ఉంటుంది? 2025లో పురుషుల సమస్యల మీద అనేకమంది వైద్య నిపుణులు, సామాజికవేత్తలు గొంతెత్తారు. ఆధునిక జీవనంలో అబ్బాయిల పరిస్థితి అధ్వానంగా మారిందని, సమస్యలు బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక వారు అవస్థ పడుతున్నారని పేర్కొన్నారు. అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. రీల్స్లో ఒక జోక్... నలుగురు మగవారు ‘గోవాకు వెళదాం’ అని ΄్లాన్ చేస్తూ ఉంటారు. కలిసినప్పుడల్లా గోవా ΄్లానే. కాని సంవత్సరాలు గడిచిపోతాయిగానీ గోవాకు మాత్రం వాళ్లు వెళ్లరు. నిజానికి గోవాకు వెళ్లడం పెద్ద విషయం కాదు. తగినన్ని డబ్బులు అందరి దగ్గరా ఉంటున్నాయి. కాని కదల్లేని మెదల్లేని పరిస్థితులు నేడు పురుషుడి కనీస సరదాలను కూడా తీర్చడం లేదు.‘మగాళ్లు పైలాపచ్చీసు’గా తిరుగుతుంటారు అనేది పాతమాట. కనీసం రెండురోజుల లీవ్ దొరకని ఉద్యోగాల్లో వాళ్లు ఒళ్లు హూనం చేసుకుంటున్నారని ఎవరికి తెలుసు?రైట్ టు డిస్ కనెక్ట్ బిల్మగవారు ఆఫీసులో ఉన్నంత సేపే డ్యూటీ చేసినట్టు కాదు.. ఇంటికొచ్చాక కూడా కాల్స్ అటెండ్ చేస్తూ ఆఫీస్ పని చేస్తూ అదనపు డ్యూటీ చేస్తూనే ఉంటారు. దీనివల్ల కుటుంబంలో కలతలు సర్వసాధారణం. మగవారికే కాదు పురుష/మహిళా ఉద్యోగులందరికీ పని గంటల తర్వాత ఆఫీసుతో డిస్కనెక్ట్ అయ్యే హక్కును ప్రతిపాదిస్తూ ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్’ను ప్రయివేటు బిల్లుగా 2025లో పార్లమెంట్ మెంబర్ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. అత్యవసర సేవల్లో ఉంటే తప్ప ప్రతి ఉద్యోగంలో ఇలా డిస్కనెక్ట్ అయ్యే సౌలభ్యం మగవారికి ఉంటే వారు మరింత క్వాలిటీ లైఫ్ను అనుభవించగలరు.జాతీయ పురుషుల కమిషన్ పురుషుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించే చట్టబద్ధమైన సంస్థను రూ΄÷ందించడానికి ఈ ఏడాది తొలి ప్రయత్నం జరిగింది. డిసెంబర్ 6న రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ‘జాతీయ పురుషుల కమిషన్ బిల్లు’ను ప్రైవేట్ బిల్లుగా ప్రవేశపెట్టారు. పురుషులపై చట్టపరమైన వివక్ష, మానసిక ఆరోగ్య సమస్యలు, కుటుంబ చట్టాలలో పక్షపాతాలు, కొన్ని నేర నిబంధనల దుర్వినియోగాన్ని పరిశీలించడానికి సంస్థాగత యంత్రాంగం కావాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇలాంటి కమిషన్ ఉండాలని ‘భార్యా బాధితులు’ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. 2025లో కొన్ని భరణం కేసులు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయే విధంగా కోర్టు ముందుకు వచ్చాయి.ఆయుష్షు తక్కువ‘నూరేళ్లు వర్థిల్లు’ అనుకోవడమే గాని పురుషుడి ఆయుష్షును తగ్గించే విషయాల గురించి చింత ఉండటం లేదు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మహిళలతో పోలిస్తే పురుషుల ఆయుష్షు నాలుగు సంవత్సరాలు తక్కువ. ఈ గణాంకాల ప్రకారం దేశంలో సగటు ఆయుర్దాయం ఇప్పుడు 70.3 సంవత్సరాలు. యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. కేరళలో 75.1 సంవత్సరాలతో అత్యధికంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే, పురుషుల ఆయుర్దాయం జమ్మూ కాశ్మీర్లో 73.4 సంవత్సరాలు కాగా, మహిళలకు కేరళలో 78.4గా ఉంది. అత్యంత తక్కువ ఆయుర్దాయం ఛత్తీస్గఢ్లో ఉంది. అక్కడ పురుషులకు 62.4 సంవత్సరాలు కాగా, మహిళలకు 67.1 సంవత్సరాలు. పురుషుల మరణాలకు ప్రధాన కారణంగా హృదయ సంబంధ వ్యాధులే కావడం గమనార్హం.పాపం ఒక్కడుఅవును! ఇంటికి అతను ఒకే ఒక్కడు. ఉమ్మడి కుటుంబాలు పోయి దేశంలో చిన్న కుటుంబాల వ్యవస్థ మొదలైన తర్వాత భార్య, భర్త, ఇద్దరు పిల్లలు అనే సంస్కృతి పెరిగింది. ఈ నేపథ్యంలో మగవాడు భర్త బాధ్యతనంతా భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్య అతనికి సహకరిస్తున్నా పని ఒత్తిడి, బాధ్యతలు నిమిషం ఖాళీగా ఉంచడం లేదని నిపుణులు అంటున్నారు. పనులు పంచుకునేవారు లేక, కాసింత విశ్రాంతి దొరకక చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని అంటున్నారు. 2025లో పురుషుల మానసిక సమస్యల గురించి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి హెల్త్ ఎక్స్పర్ట్లు హెచ్చరికలు జారీ చేశారు. కాలుష్యం అతడికే... జరిమానాలు అతడికే...పురుషుడు పని చేయాలంటే కాలు బయట పెట్టాలి. బయట అడుగుపెడితే కాలుష్యం, దుమ్ము, ధూళీ, ట్రాఫిక్.... ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండే మన దేశంలో అత్యధిక పురుషులు టూ వీలర్ల మీద తిరుగుతూ కాలుష్యం బారిన పడుతున్నారు. ఫలితంగా జుట్టు రాలిపోవడం వీరి సమస్య. చూపు మందగించడం, చర్మం ముడతలు పడిపోవడం వంటి సమస్యలకు లెక్కలేదు. వేళ కాని వేళల్లో ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో చాలామంది పురుషులు చిన్నవయసులోనే బీపీ, డయాబెటిస్ బారిన పడుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలు పురుషుల్లో సర్వ సాధారణం. ఇక వీరు ట్రాఫిక్ జరిమానాల బారిన పడుతూ అవి కట్టలేక చేసే ఆర్తనాదాలకు అంతు లేదు.బెట్టింగ్ బర్బాదీబెట్టింగ్ యాప్స్ ఎరకు చిక్కుకున్న పురుషుల పెను విషాదాలు 2025లో అత్యధికం చోటు చేసుకున్నాయి. మద్యం, డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకున్నవారు కూడా సులభదారుల్లో డబ్బు వస్తుందని బెట్టింగ్ యాప్స్కు చిక్కుకుని ్రపాణాలు కోల్పోతున్నారు. వీరిలో యువకులు ఎక్కువ ఉంటే సైబర్ మోసగాళ్ల చేత చిక్కి వారు పెట్టమన్న చోట పెట్టుబడులు పెట్టి కోట్లు నష్టపోయిన వారిలో అనుభజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఉన్నారు. జీవన తాత్త్వికత, జీవన సౌలభ్యాలు తెలుసుకోకుండా అసలు ఎటువంటి వివేచనాపూరిత ఆలోచనలు లేకుండా ఎక్కువ సంఖ్యలో పురుషులు ఉంటూ మూక స్వభావంతో జీవితాలను కష్టాల్లోకి నెట్టుకుంటున్నారు. గడ్డం పురుష లక్షణంఎన్ని చెప్పుకున్నా ఇప్పటికీ ఇది పురుష ప్రపంచమే. పురుషులే ఆకర్షక శక్తులుగా నిలిచే ఆనవాయితీ పోలేదు. ఒకప్పుడు పురుషులు శుభ్రంగా గడ్డం గీసుకుని కనిపించేవారు. ఇప్పుడు గడ్డం కలిగి ఉండటం పురుష లక్షణంగా మారింది. 2025లో బారు గడ్డాల సౌందర్యంతో రణబీర్ కపూర్, రణధీర్ కపూర్తో మొదలు రామ్చరణ్, జూ.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో సహా విరాట్ కోహ్లీతోపాటుగా హల్చల్ సృష్టించారు. ప్రస్తుతం ‘వారణాసి’ కోసం మహేష్ బాబు కూడా గడ్డం పెంచారు. ప్రపంచవ్యాప్తంగా నెట్లో అత్యధికులు సెర్చ్ చేసిన వ్యక్తి స్త్రీ కాదు. అమెరికన్ గాయకుడు–గేయరచయిత డేవిడ్ ఆంటోనీ బర్క్ (ఈ4ఠిఛీ). మనదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో మొదటి ఐదుగురిలో నలుగురు మగవారే కావడం విశేషం. వారిలో తొలిస్థానం యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో క్రికెటర్లు ప్రియాంశ్ ఆర్య, అభిషేక్ శర్మ, షేక్ రషీద్ ఉన్నారు.ఎవరికీ చెప్పుకోలేక‘మగవాడివి.. నువ్వు ఏడవకూడదు’ అని చిన్ననాటి నుంచి వినే మాటలు, ఇంటా బయటా నూరిపోసే పురుష అహం ఆ సమయానికి బాగున్నా వయసు పెరిగే కొద్ది పురుషులను సతమతం చేస్తున్నాయి. దీంతో ఎంత కష్టం వచ్చినా బయటకి చెప్పుకోలేక, ఇతరులతో పంచుకోలేక నలిగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జరిగిన అధ్యయనాల్లో అనేకమంది పురుషులు తమ తమ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, చిన్న చిన్నవి బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనో, ఎగతాళి చేస్తారనో లోలోపలే దాచుకొని కుమిలిపోతున్నారని తేలింది. ఉదాహరణకు ఇంట్లో అవమానకరమైన, సూటిపోటి మాటలు ఎదురవుతుంటే ఆ పురుషుల బాధ వర్ణనాతీతంగా ఉంది.ఒక ఉద్యోగం చాలదుఒక ఉద్యోగానికే సమయం సరిపోకపోతే ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, ఇంటి స్థలాలు– ఇళ్ల ధరలు, ఇళ్ల అద్దెలు మగవాణ్ణి మరో ఉపాధిని కూడా వెతుక్కునే అగత్యానికి నెడుతున్నాయి. ఏ.ఐ ప్రవేశం తర్వాత ఉద్యోగాలు పోతాయన్న హెచ్చరికలు వారిని అభధ్రతలో నెడుతున్నాయి. అప్పులు చేసి, వడ్డీలు కట్టక తప్పని పరిస్థితో ఈఎంఐలకు చిక్కుకోత తప్పని పరిస్థితో నెలకొంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల్లోని పురుషులు ఈ ఇబ్బందిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కొందరు ఉద్యోగంతోపాటు పార్ట్టైం ఉద్యోగాలూ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఊబర్, ఓలా సర్వీసుల్లో ఇలాంటి మగవారు ఎందరో కనిపిస్తున్నారు. రాత్రిళ్లు నిద్ర కాచి పని చేస్తున్నారు.అనూహ్యమైన ఆమెభార్యాభర్తల అనుబంధం భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైనది. దాని కోసం స్త్రీ, పురుషులిద్దరూ ఎన్నో త్యాగాలకు, సర్దుబాట్లకు సిద్ధమవుతూనే ఉంటారు. అయితే గతంలో గృహహింసలో మగవారి పాత్ర వార్తల్లోకి ఎక్కేది. ఇప్పుడు స్త్రీ హింస వార్తలుగా కనిపించడం మగవారికి బెంబేలు పుట్టిస్తోంది. భర్తల ్రపాణాలకు భార్య వల్ల ముప్పు ఏర్పడే పరిస్థితి రావడం 2025లో ఎక్కువ సంఘటనల వల్ల కనిపించిన సామాజిక విషాదం. ఇంత ప్రమాదం అరుదే అయినా భార్య నుంచి వేధింపులు, ఆమె కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు ఇటీవల పెరిగాయని పురుషులు చేస్తున్న ఆరోపణ. నకిలీ వేధింపులు కేసులు, వరకట్న కేసులు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విడాకుల కోసమో, మరే కారణం చేతనో సూటిపోటి మాటలు అనడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడే పురుషుల సంఖ్య పెరిగింది. -
క్రేజీ ప్రాజెక్ట్
ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. హాస్య మూవీస్ అధినేత, రైజింగ్ ప్రోడ్యూసర్ రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆది హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం ఈ నెల 25న విడుదలైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆదిని కలిసి, శుభాకాంక్షలు తెలిపారు రాజేష్ దండా.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ–‘‘మా హాస్య మూవీస్పై ‘ఊరిపేరు భైరవకోన, సామజవరగమన, మజాకా, కె–ర్యాంప్’ వంటి పలు హిట్ సినిమాలు నిర్మించాను. అలాగే మా బ్యానర్లో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్ మూవీ ఆదితో ఉంటుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నాం’’ అని తెలిపారు. -
పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి.. రష్యా సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంబంధించి జరుగుతున్న దౌత్య ప్రయత్నాల మధ్య రష్యా–ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని మాస్కో సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంది. యుద్ధ విరమణ చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది.రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకారం... ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మధ్యలో మాస్కో–సెంట్ పీటర్స్బర్గ్ మధ్య ఉన్న నోవ్గొరడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు ప్రతీకారంగా ఉక్రెయిన్లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు లావ్రోవ్ తెలిపారు. యుద్ధం ముగింపుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న రష్యా చర్చల వైఖరిని పునఃసమీక్షిస్తాం అని హెచ్చరించారు.ఇదే సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికే రష్యా ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న కథనం పూర్తిగా కల్పితం. ఉక్రెయిన్పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా కీవ్పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఈ కథనాన్ని ప్రచారం చేస్తోంది. అలాగే, యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికీ ఇదే కారణం అని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ఈ పరిణామాలతో రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
చలో కేరళ
కేరళ కాలింగ్ అంటున్నారట హీరో నాగార్జున. ఆయన కెరీర్లోని వందో సినిమా ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది.కాగా ఈ సినిమా కోసం ఓ షెడ్యూల్ని కేరళలో ప్లాన్ చేశారట మేకర్స్. ఇందుకోసం నాగార్జున త్వరలోనే కేరళ వెళ్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. జనవరి మొదటివారంలో కేరళ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా 2026లో విడుదల అవుతుందని తెలిసింది. -
హైదరాబాద్లో కొత్త పోలీస్ కమిషనరేట్లు.. నలుగురు ఐపీఎస్ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరించి నాలుగు కమిషనరేట్లుగా విస్తరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి (రాచకొండ కమిషనరేట్ స్థానంలో) , ఫ్యూచర్ సిటీ ఇలా నాలుగు ప్రాంతాల్లో నాలుగు కమిషనరేట్లను ప్రభుత్వం విస్తరించనుంది. ఈ మేరకు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి-భువనగిరి ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ యూనిట్గా ఏర్పాటు చేసి జిల్లాకు ప్రత్యేకంగా ఎస్పీని నియమించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కమిషనరేట్ల పరిధులు-హైదరాబాద్ కమిషనరేట్: అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్టు, బుద్వేల్ హైకోర్టు వంటి కీలక ప్రాంతాలు. - సైబరాబాద్ కమిషనరేట్: గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పఠాన్చెరు, జీనోమ్ వ్యాలీ, RC పురం, అమీన్పూర్ వంటి ఐటీ , పారిశ్రామిక ప్రాంతాలు. - మల్కాజిగిరి కమిషనరేట్: కీసర, శామీర్పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు. - ఫ్యూచర్ సిటీ కమిషనరేట్: చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు. కొత్త నియామకాలు 1. సుధీర్ బాబు, ఐపీఎస్: రాచకొండ పోలీస్ కమిషనర్గా ఉన్న వీరిని, కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ (Future City) పోలీస్ కమిషనర్గా నియమించారు.2. అవినాష్ మొహంతి, ఐపీఎస్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అవినాష్ మొహంతిను రాచకొండ కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేసిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బదిలీ చేశారు.3. డా. ఎం. రమేష్, ఐపీఎస్: ఐజీపీ (ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్) గా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ రమేష్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించారు.4. అక్షంష్ యాదవ్, ఐపీఎస్: యాదాద్రి భువనగిరి డీసీపీగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అక్షంష్ను నూతనంగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా (SP) నియమించారు. నాలుగు కమిషనరేట్లకు పోలీస్ కమిషనర్లను, యాదాద్రి-భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు. -
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) డిసెంబర్ 29 (సోమవారం) 2025న ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ప్రక్రియ వర్తించనుంది. ఎన్నికల సంఘం అధికారులు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా (01.10.2025 నాటి డేటా) ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా షెడ్యూల్ - ఈసీఐ పోలింగ్ స్టేషన్ల డేటా మున్సిపాలిటీల వారీగా క్రమబద్ధీకరణ – 30.12.2025 - వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల డేటా విభజన – 31.12.2025 - మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన – 31.12.2025 - ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ – 01.01.2026 - రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం (జిల్లా స్థాయి) – 05.01.2026 నుండి 06.01.2026 వరకు- తుది ఓటర్ల జాబితా విడుదల – 10.01.2026 జనవరి 1న విడుదలకానున్న ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే సంబంధిత నోటీసు బోర్డుల ద్వారా తెలియజేయవచ్చు. అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం జనవరి 10, 2026న తుది ఓటర్ల జాబితా ప్రకటించబడుతుంది. ఈ తుది జాబితా ఆధారంగానే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఉంటుంది. -
‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి’
తాడేపల్లి : ఏపీలొ రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 29వ తేదీ) పార్టీ లీగల్ సెల్ నేతలతో ఆయన జూమ్ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై చర్చించారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడాన్ని తట్టుకోలేక పార్టీ క్యాడర్పై అక్రమ కేసులు పెడుతున్నారు. నిరంకుశ పాలన, నియంత పాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా?, చంద్రబాబు, లోకేష్లు బరితెగించి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వంతపాడుతున్న పోలీసుల చర్యలను ధీటుగా ఎదుర్కుందాం.చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. క్యాడర్కు అండగా నిలుద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగంపై గట్టిగా పోరాడుతున్న పార్టీ లీగల్ సెల్కు అభినందనలు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీకి పొట్టేళ్ళ తలలతో హారం వేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఈ మధ్య ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?, కమ్యూనిస్ట్ నాయకుడు హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెట్టారు. జగన్ మరింత పట్టుదలతో పార్టీని నడిపిస్తున్నారు. ప్రతి ప్రజాసమస్యపై ముందుండి పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కూటమి ప్రభుత్వ దమనకాండను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్సార్సీపీ సైన్యం పోరాట పటిమతో దూసుకెళుతుంది’ అని స్పష్టం చేశారు. -
ఒక ఊపు ఊపిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది?
అస్సాం గణ పరిషత్..! ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలన విజయంతో రాజకీయాల్లో ఓ ఊపు ఊపిన ఏజీపీ ఇప్పుడు చతికిలపడిపోయిందా? విద్యార్థి నేతలు నడిపిన ఉద్యమంతో.. అధికారంవైపు అడుగులు వేసి.. రికార్డులు సృష్టించిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది? నాలుగు దశాబ్దాల క్రితం క్రిస్మస్కు ముందు అస్సాంలో అధికారాన్ని చేపట్టిన ఈ పార్టీ.. ఇప్పుడు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎందుకు తంటాలు పడుతోంది? ఒకప్పుడు అస్సాం రాజకీయాలను పూర్తిగా మార్చేసిన ఏజీపీ ఇప్పుడు పతనం అంచుల్లో ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.నాలుగు దశాబ్దాల క్రితం.. అంటే.. 1985 అక్టోబరు 14న భారత రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అస్సాం గణ పరిషత్ పేరుతో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చరిత్రలో విద్యార్థులు, విద్యార్థి ఉద్యమ నాయకులు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, అదే సంవత్సరం సరిగ్గా క్రిస్మస్ ఈవ్ రోజున.. అంటే.. 1985 డిసెంబరు 24న అధికారాన్ని చేపట్టిన అరుదైన ఘట్టం చోటుచేసుకుంది అప్పుడే..! ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అడ్డుకుని, స్వదేశీయుల అస్తిత్వాన్ని కాపాడేందుకు అప్పట్లో విద్యార్థులు చేసిన ఉద్యమమే.. వారిని అస్సాంలో అధికారం వైపు నడిపించింది. నిజానికి ఇప్పుడు ఎన్నో దేశాల్లో జెన్-జీ ఉద్యమాలు జరుగుతున్నా.. చైనాలోని తియానన్మనెన్ స్క్వేర్ విద్యార్థి ఉద్యమం చరిత్ర పుటల్లో నిలిచినా.. అస్సాం విద్యార్థుల ఉద్యమం ప్రజాస్వామ్య చరిత్రలో ఓ విప్లవమేనని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా ఆరేళ్ల పాటు జరిగిన అస్సాం విద్యార్థి ఉద్యమంలో రెండు విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత.. 1985 ఆగస్టు 15న ఈ రెండు విద్యార్థి సంఘాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారమే అదే ఏడాది అక్టోబరు 14న అస్సాం గణ పరిషత్ పార్టీని ఏర్పాటు చేశాయి. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘన విజయం సాధించింది. క్రిస్మస్ ఈవ్ రోజున అధికార పగ్గాలను చేపట్టింది. అదేరోజున దేశంలోనే అత్యంత యువ ముఖ్యమంత్రిగా ప్రపుల్లకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అలా ఏజీపీ ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది. కాలేజీ నుంచి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నేత కూడా ప్రపుల్ల కావడం గమనార్హం..! ఆ సమయంలో ఆయన వయసు 33 సంవత్సరాలే..!ఏజీపీ ప్రస్తానం తెలుసుకోవాలంటే.. 70లలో జరిగిన పరిణామాలను పరిశీలించాల్సిందే..! 1971లో బంగ్లాదేశ్ అవతరణ జరిగాక.. లక్షల మంది భారత్కు అక్రమంగా వలస వచ్చారు. ఇప్పటికీ అస్సాంలో అక్రమ వలసల సమస్య తీవ్రస్థాయిలో ఉంది. అక్రమ వలసలు ఓ ముగింపు లేని సమస్యగా మారిపోయాయి. 1971లో భారత్లోకి చొరబడ్డ అక్రమ వలసదారులకు స్థానికులుగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తుండడంతో.. విద్యార్థి సంఘాలు అప్రమత్తమయ్యాయి. ఈ వలసల కారణంగా వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగడం మొదలైంది. 1979 మార్చిలో లోక్సభ సభ్యుడు హీరాలాల్ పట్వారీ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో.. వేల మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు ఓటర్ల జాబితాలో చోటు లభించిన విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో.. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. అదే ఏడాది జూన్లో ఏఏఎస్యూ పిలుపునిచ్చిన బంద్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దాంతో.. మరో కీలక విద్యార్థి సంఘం అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ కూడా ఉద్యమంలో భాగమైంది. అలా.. 1979 నుంచి 1985 ఆగస్టు వరకు విద్యార్థులు నిరంతరాయంగా తమ పోరాటాన్ని సాగించారు. ఈ సుదీర్ఘ ఉద్యమంతో దిగివచ్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం.. విద్యార్థి నాయకుల డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. 1985 ఆగస్టు 15న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 1971 తరువాత అస్సాంలోకి ప్రవేశించిన వారిని బేషరతుగా బంగ్లాదేశ్కు తిప్పిపంపాలి. 1966–71 మధ్యకాలంలో వలస వచ్చిన వారికి మాత్రం షరతులతో కూడిన పౌరసత్వం ఇవ్వాలి. ఈ విజయంతో రెండు విద్యార్థి సంఘాలు కలిసి అస్సాం గణ పరిషత్గా రాజకీయ పార్టీని నెలకొల్పాయి. అస్సాం సాహిత్య సభ, అస్సాం జాతీయవాద దళ్, పూర్వాంచల్య లోక్ పరిషత్తోపాటు పలు ఉద్యోగ సంఘాలు కూడా ఏజీపీతో జతకట్టాయి. పార్టీ అధ్యక్షుడిగా ప్రపుల్ల కుమార్ మహంతా ఎన్నికయ్యారు.పార్టీగా ఆవిర్భవించిన వెంటనే జరిగిన ఎన్నికల్లో అస్సాం గణ పరిషత్ అఖండ విజయాన్ని సాధించింది. నిజానికి ఏజీపీ నేతలు ఆ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేశారు. ఘన విజయం తర్వాత ఏజీపీ గొడుగు కిందకు వచ్చారు. అంటే.. ఏజీపీ ఓ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందక ముందే.. 126 స్థానాలకు గాను 92 చోట్ల స్వతంత్రులుగా విద్యార్థి సంఘాల నేతలు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకు పరిమితమైంది. ఫలితంగా అస్సాం రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. ప్రపుల్లకుమార్ మహంత సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్యమం ముగిసిన వెంటనే.. ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడం భారతదేశ చరిత్రలోనే అది మొదటిసారి. ఆ తర్వాతి కాలంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా, తెలంగాణలో బీఆర్ఎస్ ఆ ఘనతను సాధించాయి.అధికార పగ్గాలను చేపట్టినకప్పటికీ.. అనుభవ లోపం కారణంగా పరిపాలనలో ఏజీపీ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ప్రపుల్ల కుమార్ నేతృత్వంలోని సర్కారులో భృగు కుమార్ భూయాన్, కేశబ్ మహంత, అతుల్ బోరా లాంటి యువ నేతలు మంత్రులుగా కొనసాగారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అనుభవం లేకపోవడంతో చోటుచేసుకున్న పరిణామాలు.. ఏజీపీ సర్కారును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు దారితీసింది. ఉల్ఫా ఉగ్రవాదం, ప్రభుత్వ పెద్దల అవినీతి కారణంగా.. 1980లో కేంద్రం అస్సాం సర్కారును రద్దు చేసింది. 1991లో ఏజీపీ చీలిపోయింది. నూతన్ ఏజీపీ ఏర్పాటైంది. దాంతో.. ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ పతనం దిశలో అడుగులు వేసింది. 1991లో జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 19 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారపగ్గాలను చేపట్టింది.విడిపోయి ఓటమిపాలైన ఏజీపీ నేతలు తమ తప్పును తెలుసుకుని, మళ్లీ కలిశారు. 1996 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. 59 స్థానాల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చారు. అత్తెసరు మెజారిటీ కావడంతో.. పరిపాలన సవ్యంగా సాగలేదనే చెప్పలి. 2001లో ఏజీపీ మరోమారు పరాజయం పాలవ్వగా.. కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అస్సాంలో బలమైన పునాదులను వేసుకుంది. అయితే.. బీజేపీ వైపు మళ్లే ప్రతీ ఓటు.. ఏజీపీ ఖాతా నుంచి మైనస్ కావడం మొదలైంది. అలా బీజేపీ బలపడుతున్న కొద్దీ.. ఏజీపీ పునాదులు దెబ్బతినడం మొదలైంది. అనుభవరాహిత్యంతో పరిపాలనలో లోపాలు.. అవినీతి.. మహంతపై పెరిగిన వ్యతిరేకత వెరసి ఏజీపీ పతనం వేగవంతమైంది. నిజానికి ఏజీపీ ఆలోచనల నుంచే.. అస్సాంలో బీజేపీ ఎదిగిందనే అభిప్రాయాలు లేకపోలేదు. కాలక్రమంలో ఏజీపీకి చెందిన కీలక నేతలు బీజేపీలోకి వెళ్లారు. ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర మాజీ మంత్రి బిజోయ్ చక్రవర్తి కూడా అలాంటి నేతల్లో కొందరు. అస్తిత్వం కోసం ఏజీపీ అనేక పొత్తులను పరీక్షించింది. బీజేపీ ప్రధాన శక్తిగా మారడంతో.. ఆ పార్టీతో కలిసి నడుస్తోంది. 2016లో బీజేపీతో పొత్తుతో.. 14 స్థానాలను సాధించింది. పౌరసత్వ సవరణ చట్టం-2019తో మళ్లీ ఈ పొత్తు విఫలమైంది. ఆ తర్వాతి కాలంలో కుదిరిన రాజీతో తిరిగి బీజేపీతో జతకట్టింది. ప్రస్తుతం 9 మంది ఎమ్మెల్యేలున్న ఏజీపీ.. హిమంత బిశ్వ శర్మ సర్కారులో భాగంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ప్రపుల్ల పోటీ చేయలేదు. పార్టీ అధ్యక్షుడిగా అతుల్ బోరా ఉన్నారు. 2024లో బార్పేట లోక్సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. దీంతో.. రెండు దశాబ్దాల తర్వాత ఆ పార్టీకి ఓ ఎంపీ సీటు దక్కినట్లైంది. పార్టీ తొలినాళ్లలో ప్రభుత్వంలో ఉన్న దినేశ్ గోస్వామి, భృగు భూయాన్ వంటి కీలక నేతల అకాల మరణం పార్టీకి తీరని నష్టమేనని చెప్పవచ్చు. క్రమంగా గ్రాఫ్ పడిపోతున్న ఏజీపీ భవిష్యత్లో నిలదొక్కుకుంటుందా? లేదా.. పలు ప్రాంతీయ పార్టీల్లాగా కనుమరుగైపోతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -హెచ్.కమలాపతిరావు -
రూ.3170 తగ్గిన గోల్డ్ రేటు!: గంటల్లో మారిపోయిన ధరలు
భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 29న గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 3170 తగ్గి.. పసిడి ప్రియుల మదిలో ఆశలు చిగురించేలా చేసింది. దీంతో గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 650 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2900 తగ్గింది. అంటే గంటల వ్యవధిలోనే 650 రూపాయలు కాకుండా.. అదనంగా మరో 2,250 రూపాయలు (మొత్తం 2,900 రూపాయలు తగ్గింది) తగ్గింది.24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా మరింత తగ్గింది. దీంతో తులం ధర రూ. 1,39,250 వద్దకు చేరింది. అంతకు ముందు రోజు రేటు రూ. 1,42,420 వద్ద ఉండేది. దీనిబట్టి చూస్తే ఈ రోజు రూ. 3,170 తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గడంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3170 రూపాయలు తగ్గి.. రూ. 1,39,400 వద్దకు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 2950 తగ్గి, రూ. 1,27,800 వద్ద నిలిచింది.వెండి ధరలువెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది. -
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రానుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, సైకో పాత్రలో నటించిన ఈ మూవీ.. థియేటర్లలో అదరగొట్టేసింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. లేటు వయసులో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఈయన.. గతేడాది ఓ మూవీలో స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించారు. ఇప్పుడు 'కలం కవల్' చిత్రంలో సైకో తరహా పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చారు. డిసెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం సోనీ లివ్ ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. జనవరి అని చెప్పారు గానీ ప్రస్తుతానికి తేదీ ఏం వెల్లడించలేదు.(ఇదీ చదవండి: ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్)ఈ వీకెండ్ అంటే జనవరి 2న లేదంటే జనవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ 'కలం కవల్' చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు పోస్టర్, ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో మమ్ముట్టితో పాటు 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు.'కలం కవల్' విషయానికొస్తే.. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీ లోలుడు.. సైకో కిల్లర్గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు ఏంటనేది మెయిన్ స్టోరీ. సైకోగా మమ్ముట్టి కనిపించగా.. పోలీస్గా వినాయకన్ చేశాడు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్ స్టోరీని ఈ సినిమా కోసం కొంచెం స్ఫూర్తిగా తీసుకున్నారు.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)The legend returns, darker and deadlier. Mammootty in a performance that will leave you breathless. Biggest blockbuster of the season, #Kalamkaval streaming this January only on Sony LIV!#Mammootty @mammukka #Vinayakan #MammoottyKampany #JithinKJose @rajisha_vijayan pic.twitter.com/3ggagRwcAe— Sony LIV (@SonyLIV) December 29, 2025 -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. ఈ ఐదుగురు ఔట్..?
వచ్చే ఏడాదిని భారత క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో మొదలు పెడుతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను జనవరి 3 లేదా 4 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఈ జట్టుకు ఎంపికవుతారు.. ఎవరిపై వేటు పడే అవకాశం ఉందనే దానిపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సిరీస్ కోసం వేర్వేరు కారణాల వల్ల ఐదుగురు ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తుంది. ఆ ఐదుగురు ఎవరంటే..హార్దిక్ పాండ్యాక్వాడ్రిసెప్స్ గాయం కారణంగా తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ సిరీస్కు కూడా ఎంపికయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టీ20 వరల్డ్కప్ దృష్ట్యా మేనేజ్మెంట్ ఇతనికి విశ్రాంతినివ్వవచ్చు. హార్దిక్ స్థానంలో ఈ సిరీస్కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే అవకాశం ఉంది.జస్ప్రీత్ బుమ్రాఇటీవలే బ్యాక్ ఇంజ్యూరీ నుంచి కోలుకున్న బుమ్రాను కూడా టీ20 వరల్డ్కప్ దృష్ట్యా న్యూజిలాండ్ వన్డే సిరీస్కు ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తుంది. వరల్డ్కప్ నేపథ్యంలో బుమ్రాపై వర్క్ లోడ్ పడటం మేనేజ్మెంట్కు అస్సలు ఇష్టం లేదని సమాచారం. దీంతో బుమ్రాకు విశ్రాంతి అనివార్యం కావచ్చు. అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేయవచ్చు.వాషింగ్టన్ సుందర్సౌతాఫ్రికా సిరీస్లో 2 మ్యాచ్ల్లో 14 పరుగులు మాత్రమే చేసి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన సుందర్పై వేటు పడే అవకాశం ఉంది. అతడి స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావచ్చు.తిలక్ వర్మతిలక్ సౌతాఫ్రికా సిరీస్లో జట్టులో ఉన్నా, ఫస్ట్ ఛాయిస్ XIలో చోటు దక్కలేదు. ఇదే సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో కదంతొక్కి తిలక్ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉండటంతో తిలక్ వన్డే జట్టులో చోటుపై ఆశలు వదులుకున్నాడు.రిషబ్ పంత్గత కొంతకాలంగా ఒక్క వన్డే కూడా ఆడని రిషబ్ పంత్ను న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు కూడా పరిగణలోకి తీసుకోకపోవచ్చు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా అద్భుతంగా రాణిస్తుండటంతో పంత్ కూడా వన్డే బెర్త్పై ఆశలు వదులుకున్నాడు. ఒకవేళ ఏదైనా అవకాశం ఉన్నా, ఇషాన్ కిషన్ రూపంలో పంత్కు మరో ప్రమాదం పొంచి ఉంది.న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు అవకాశాలు లేని ఆటగాళ్లు వీళ్లైతే.. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రుతురాజ్, రవీంద్ర జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది.జనవరి 11న వడోదర వేదికగా తొలి వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్లో.. మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం జట్టును ఇదివరకే ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టే ఈ సిరీస్లో యధాతథంగా కొనసాగుతుంది.కివీస్తో వన్డేలకు భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా -
ఐ బొమ్మ నాదే అనడానికి ప్రూఫ్స్ ఏవి?.. ఇమంది రవి
సినిమాలని పైరసీ చేసి ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దాదాపు 12 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పలు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్స్ దొంగిలించి వాడుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా కస్టడీ పూర్తవడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, అనంతరం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రవి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'బెట్టింగ్ యాప్స్తో నాకు సంబంధాలు ఉన్నాయని, వాటిని ప్రమోట్ చేస్తున్నానని అంటున్నారు. కానీ ఆ ఆరోపణల్లో నిజం లేదు. నా పేరు ఐ బొమ్మ రవి కాదు ఇమంది రవి. ఐబొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఏవి? నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని మీకు ఎవరు చెప్పారు? పోలీసులు చెబితే నేను నేరం చేసినట్లేనా? నేను ఎక్కడికీ పారిపోలేదు. వేరే దేశంలో పౌరసత్వం మాత్రమే తీసుకున్నాను. నేను కూకట్పల్లిలో ఉంటున్నాను. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను. నాపై ఆరోపణలన్నీ నిరాధారమైనవి. సరైన టైంలో నిజాలు బయటపెడతా' అని మీడియాతో రవి అన్నాడు.మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ.. ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో ఫేక్ ఐడీల సమాచారం సేకరించాం. ముగ్గురు స్నేహితుల ఐడీల ద్వారానే రవి ఫేక్ ఐడీలు సృష్టించాడు. ఇతడికి చెందిన రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశాం. బెట్టింగ్ యాప్స్తో రవికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర పైరసీ వెబ్సైట్స్తో ఉన్న సంబంధాల గురించి కూడా ఆరా తీస్తున్నాం. కరేబియన్ దేశంలో ఉన్న రవి డేటాపై ఆరా తీస్తున్నాం. విచారణలో రవితో సంబంధాలు లేవని ప్రహ్లాద్ చెప్పాడు. త్వరలోనే మిగతా ఇద్దరి స్నేహితులను విచారిస్తాం. ఇకపై పైరసీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పారు. -
మహిళ హత్య.. నిందితునికి మరణశిక్ష
సాక్షి హైదరాబాద్: ఇటీవల భరత్నగర్ ప్రాంతంలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా III స్పెషల్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడు కరణ్ సింగ్ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దానితో పాటు రూ. పదివేలు జరిమానా చెల్లించాలని తెలిపారు. ఈ నెల 18 వతేదీ భరత్గర్లోని ఫ్లై ఓవర్ సమీపంలోని ఏసీసీ గోదాం పక్కన ఉన్న పొదల్లో ఒక మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు వివరాలు అందించగా వారు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కర్ణాటక బీదర్కు చెందిన కరణ్ సింగ్ను నిందితునిగా అనుమానిస్తూ అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు కరణ్ సింగ్ను దోషిగా తేలుస్తూ మరణశిక్ష విధించింది. -
జనవరి నెల శ్రీవారి ఆలయ విశేష పర్వదినాల తేదీల ప్రకటన
తిరుమల: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల తేదీలన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. ఈ మేరకు జనవరి మాసం విశేష తేదీలను వెల్లడించింది. జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవంజనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొరజనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.జనవరి 14న భోగి.జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.జనవరి 23న వసంత పంచమి.జనవరి 25న రథ సప్తమి -
వావ్.. మహిళల కోసం డ్రైవింగ్ శిక్షణ
సాక్షి హైదరాబాద్: మహిళా సాధికారదతతో స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం కీలక చర్యలు చేపడుతుంది. హైదరాబాద్ పోలీసుల సహకారంతో హైదరాబాద్లోని మహిళలకు డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్లో వారికి శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం 21-45 సంవత్సరాల మద్య వయసున్న మహిళలు (కేవలం హైదరాబాద్ వాసులే) అర్హులని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు లైసెన్స్ జారీలో సహాయం కల్పించనున్నట్లు తెలిపారు. వాటితో పాటు వాహనానికి లోన్ లేదా లీజ్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. వీటికి డ్రైవింగ్లో ఎటువంటి అనుభవం లేకున్నా అప్లై చేసుకోవచ్చన్నారు. జనవరి 3 శుక్రవారం అంబర్పేట్ పోలీస్ గ్రౌండ్ వేదికగా ఈ కార్యక్రమం జరపనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 89788 62299 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు.స్టీరింగ్ పట్టండి.. స్వశక్తితో ఎదగండి!హైదరాబాద్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు.… pic.twitter.com/NMIdrEmJZX— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 29, 2025 -
ప్రపంచంలోనే టాప్ 10 న్యూ ఇయర్ పార్టీస్ ఇవే..
కొత్త సంవత్సర సంబరాలకు ప్రపంచం సిద్ధమవుతోంది. 2026 నూతన ఏడాదిని స్వాగతిస్తూ ఘనంగా వేడుకలు చేసుకునేందుకు జనమంతా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే టాప్ 10 న్యూ ఇయర్ పార్టీస్ గురించి తెలుసుకుందాం. 1. నెంబర్ వన్ రియో...ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్–ఎయిర్ నూతన సంవత్సర వేడుకగా కోపకబానా బీచ్ వేడుకలతో రియో బీచ్ నంబర్ 1 స్థానాన్ని పొందింది. బ్రెజిల్ దేశపు ఈ ప్రపంచ ప్రసిద్ధ బీచ్కు ఈ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు పోటెత్తుతారు. అద్భుతమైన రీతిలో 12–15 నిమిషాల బాణసంచా ప్రదర్శన, ప్రత్యక్ష కచేరీలు, సాంబా ప్రదర్శనలు రియోలో అర్ధరాత్రిని కూడా కాంతులీనేలా చేస్తాయి. ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి సముద్ర తీర ఆచారాలు ఇక్కడి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంప్రదాయాలలో ఒకటి ఏడు అలలపై దూకే ఆధ్యాత్మిక చర్య, ప్రతి ఒక్కటి రాబోయే సంవత్సరం కోసం ఒక కోరికను సూచిస్తుంది. ఆధ్యాత్మికత, ఆధునికతలను మిళితం చేస్తూ, రియో వేడుక ప్రపంచ ప్రసిద్ధి పొందింది.2. ట‘పాస్’లతో... సిడ్నీ..ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరమైన సిడ్నీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాణసంచా ప్రదర్శనను వీక్షించడానికి 1.6 మిలియన్లకు పైగా సందర్శకులు హార్బర్ వద్ద బారులు తీరుతారు. నగరంలోని డబుల్ బాణసంచా ప్రదర్శనలు – కుటుంబాల కోసం రాత్రి 9 గంటల ప్రారంభ ప్రదర్శన గ్రాండ్ మిడ్నైట్ బాణసంచా ప్రపంచ ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి. హార్బర్ క్రూయిజ్ల నుంచి లూనా పార్క్లోని థీమ్–పార్క్ పార్టీల వరకు, సిడ్నీ ప్రపంచ స్థాయి నూతన సంవత్సర వేడుకను అందిస్తుంది.3. వెల్డన్.. లండన్..లండన్ నూతన సంవత్సర వేడుక సమయానికి లండన్ (London) నుంచి బాణసంచా మెరుపుల్ని చూడటానికి థేమ్స్ నది వెంబడి 100,000 మందికి పైగా పోగవుతారు. అర్ధరాత్రి దాటి, వేడుక నది క్రూయిజ్లు, రూఫ్టాప్ పార్టీలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనకారులను కలిగి ఉన్న ఐకానిక్ లండన్ న్యూ ఇయర్ డే పరేడ్తో కొనసాగుతుంది.4. హాయ్.. దుబాయ్..ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక నూతన సంవత్సర వేడుకలలో ఒకటిగా దుబాయ్ (Dubai) నాల్గవ స్థానంలో నిలిచింది. సింక్రొనైజ్ చేయబడిన పైరోటెక్నిక్లు, లేజర్ ప్రొజెక్షన్లు డ్రోన్ ప్రదర్శనలకు బుర్జ్ ఖలీఫా ఒక పెద్ద వేదికగా మారుతుంది. ఆకర్షణీయమైన రూఫ్టాప్ పార్టీల నుంచి లగ్జరీ హోటళ్లలో గ్రాండ్ డైనింగ్ అనుభవాల వరకు, దుబాయ్ అత్యాధునిక వినోదాన్ని సాంస్కృతిక సౌరభాలతో మిళితం చేస్తుంది నూతన సంవత్సరానికి విలాసవంతమైన ప్రారంభాన్ని కోరుకునే పర్యాటకులకు ఇది మొదటి ఎంపికగా మారింది.5. ప్యార్ హుషార్.. పారిస్యూరప్లోని అత్యంత సొగసైన నూతన సంవత్సర గమ్యస్థానాలలో ఒకటిగా ఫ్రాన్స్లోని పారిస్ (Paris) ప్రకాశిస్తూనే ఉంది. లైటింగ్ డిస్ప్లేలు, అద్భుతమైన విందులు నదీతీర ఉత్సవాల్లో పాల్గొనడానికి దాదాపు పది లక్షల మంది సందర్శకులు చాంప్స్–ఎలిసీస్, ఐఫిల్ టవర్ సీన్ చుట్టూ గుమిగూడతారు. ఫ్రెంచ్ సంప్రదాయమైన రెవిల్లాన్ విందులు – షాంపైన్ పొంగులు, క్లాసిక్ ఫ్రెంచ్ విందులు ఇక్కడి వేడుకకు గొప్ప వైభవాన్ని జోడిస్తాయి.6. న్యూయార్క్.. ఓ బెంచ్ మార్క్..ఈ జాబితాలో అమెరికా నగరం న్యూయార్క్ (New York) ఆరవ స్థానంలో ఉన్నప్పటికీ టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా టీవీక్షణ పొందిన నూతన సంవత్సర కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. కచేరీలు, ఐకానిక్ వాటర్ఫోర్డ్ క్రిస్టల్ బాల్ అవరోహణ కోసం పది లక్షలకు పైగా సందర్శకులు స్క్వేర్ను చుట్టుముడతారు. సెంట్రల్ పార్క్ న్యూయార్క్ హార్బర్ అంతటా బాణసంచా వేడుకలు సందడి చేస్తాయి, రూఫ్టాప్ పార్టీల నుండి జాజ్ క్లబ్ల వరకు ప్రతీ ఒక్కరి అభిరుచినీ సంతృప్తి పరిచే ఈవెంట్స్ ఉంటాయి.7. ‘బాత్’ బెస్ట్.. బుడాపెస్ట్..హంగేరీ దేశంలోని ప్రధాన నగరమైన బుడాపెస్ట్లో తనకే ప్రత్యేకమైన థర్మల్ బాత్ పార్టీలు ఓ హైలెట్. అలాగే ప్రకాశవంతమైన డానుబే నది క్రూయిజ్లు వీధి ఉత్సవాలతో నూతన సంవత్సరపు రోజున ఈ నగరం చరిత్ర, నైట్ లైఫ్, వెల్నెస్ను మిళితం చేస్తుంది. బార్ల నుంచి స్పా రేవ్ల వరకు, బుడాపెస్ట్ ఒక ప్రత్యేకమైన ఉత్సాహభరితమైన వేడుకను అందిస్తుంది, ఇది పర్యాటకులు తన దగ్గరకు ప్రతి సంవత్సరం తిరిగి వచ్చేలా చేస్తుంది.8. కల్చరల్ మార్గ్.. ఎడిన్ బర్గ్..ఎడిన్బర్గ్లోని హాగ్మనే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నూతన సంవత్సర వేడుకలలో ఒకటి, మండే టార్చ్లైట్ ఊరేగింపు, సీలిడ్ నృత్యం, సాంప్రదాయ స్కాటిష్ సంగీతం ఎడిన్బర్గ్ కోటపై అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. సంస్కృతి, శతాబ్దాల నాటి సంప్రదాయాలతో జరిగే ఈ మూడు రోజుల పండుగ మొత్తం నగరాన్ని సందడిగా మారుస్తుంది. ఇక్కడ వారసత్వం, సమాజం పండుగ స్ఫూర్తి ప్రధానంగా కలబోసి ఉంటాయి.9. భళా.. బాలిఇండోనేసియాలోని బాలి ఉష్ణమండల సౌందర్యం విద్యుదీకరణ శక్తిని మేళవిస్తూ నూతన సంవత్సర వేడుకను (New Year Celebration) అందిస్తుంది. బీచ్ పార్టీలు, నియాన్–లైట్ క్లబ్లు, ఆధ్యాత్మిక ఆలయ ఆచారాలు తాటి చెట్ల నీడన బాణసంచా కాల్చడం వంటివి ఆకట్టుకుంటాయి. ఉలువాటులోని కొండ అంచున ఉన్న క్లబ్లో నృత్యం చేస్తున్నా లేదా ప్రశాంతమైన వేడుకలో పాల్గొంటున్నా, బాలి మరపురాని రాత్రి జీవితం ప్రపంచవ్యాప్త ఎంపికగా నిలిచింది.10. రొమాంటిక్గా ఉన్నా.. వియన్నా..ఆస్ట్రియా దేశంలోని వియన్నా(Vienna) రొమాంటిక్ పర్యాటకులకు చిరునామాగా నిలుస్తుంది. అక్కడ ప్రసిద్ధ నూతన సంవత్సర వేడుకలో నగరాన్ని శాస్త్రీయ కచేరీలు, పండుగ మార్కెట్లు, ఉల్లాసమైన డ్యాన్స్ ఫ్లోర్స్, గ్రాండ్ బాల్రూమ్ పార్టీలతో ఈ నగరం జోష్ నింపుతుంది. యూరోపియన్ సంస్కృతి, రొమాన్స్, గ్లామర్ కోరుకునే పర్యాటకుల ఎంపిక ఇది.చదవండి: 2025లో ఎక్కువ మంది ఫాలో అయిన ఫిట్నెస్ సూత్రాలివే -
నాజూగ్గా కల్యాణి ప్రియదర్శన్.. లంగా ఓణీలో శ్రీదేవి!
లంగా ఓణీలో మరింత అందంగా 'కోర్ట్' శ్రీదేవినాజూగ్గా మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్మోడ్రన్ డ్రస్లో నభా నటేశ్ హొయలుకొంటె చూపులతో మాయ చేస్తున్న అనసూయఏడాది జ్ఞాపకాల్ని వీడియోగా పోస్ట్ చేసిన కాయదు View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
భూగర్భంలో విలువైన సంపద.. భారత్లో ఎక్కడుందంటే?
ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఒకటి. ఇక్కడ ఇనుము, బొగ్గు, మాంగనీస్ వంటి వాటితో పాటు బంగారం కూడా ముఖ్యమైన ఖనిజ వనరు. ఇతర ఖనిజాల విషయాన్ని పక్కనపెడితే.. బంగారం భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, సంప్రదాయాలలో విశిష్ట స్థానం పొందింది. వివాహాలు, పండుగలు, ఆభరణాలు, పెట్టుబడులు వంటి అనేక రంగాల్లో పసిడిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల భారతదేశంలోని బంగారు గనులు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం బంగారు గనులకు కేంద్రంగా నిలిచింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇండియాలో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో విస్తృతంగా తవ్వకాలు జరిపారు. అయితే ప్రస్తుతం కొన్ని ఆర్ధిక సాంకేతిక కారణాల వల్ల క్లోజ్ చేశారు.హట్టి గోల్డ్ మైన్స్కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్.. ప్రస్తుతం భారతదేశంలో క్రియాశీలంగా పనిచేస్తున్న అత్యంత ముఖ్యమైన బంగారు గని. రాయచూర్ జిల్లాలో ఉన్న ఈ గనులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. బంగారు ఉత్పత్తిలో హట్టి గనులు ప్రస్తుతం ప్రధాన వనరుగా నిలుస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఇక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి.రామగిరికర్ణాటక మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రామగిరి (అనంతపురం జిల్లా) ప్రాంతం పూర్వకాలంలో బంగారు తవ్వకాలకు ప్రసిద్ధి. కడప, చిత్తూరు జిల్లాల కొన్ని ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు గుర్తించారు. అదే విధంగా తెలంగాణలోని రామగిరి (పెద్దపల్లి జిల్లా) ప్రాంతం కూడా చారిత్రకంగా బంగారు గనులకు ప్రసిద్ధి చెందింది.ఇవి కాకుండా.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భూమ్ జిల్లా, రాజస్థాన్లోని బనాస్వారా, ఉదయ్పూర్ ప్రాంతాలు, కేరళలోని వయనాడు జిల్లా మొదలైన ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ప్రాంతాల్లో జరిగే తవ్వకాలకు పరిమితులు విధించారు. కాబట్టి ఇక్కడ విరివిగా తవ్వకాలు జరపడం నిషిద్ధం.బంగారు గనులు - ఎదుర్కొంటున్న సవాళ్లుబంగారు గనుల తవ్వకాలు అనుకున్నంత సులభమేమీ కాదు. ఈ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. లోతైన గనులు, అధిక వ్యయం, పర్యావరణ సమస్యలు, ఆధునిక సాంకేతిక అవసరాలు వంటి అంశాలు తవ్వకాలను ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ, దేశీయంగా బంగారు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కొత్త అన్వేషణలు, ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తోంది. -
పాక్ ఆర్మీపై దాడి: 15మంది మృతి
బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్పై విరుచుకపడుతోంది. గత కొద్ది రోజులుగా పాక్లోని కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడులలో 15మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది.ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. సరిహాద్దు వెలుపల భారత్, ఆప్గాన్లతో ఆ దేశానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇవి చాలవన్నట్లు పాకిస్థాన్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ఆ దేశ ఆర్మీ ఊక్కిరిబిక్కిరవుతోంది.ఇటీవల పాక్పై జరిపిన దాడులలో 15 మంది ఆదేశ సైనికులు మృతి చెందినట్లు బిఎల్ఎఫ్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. డిసెంబర్ 23న కేచ్ జిల్లా తేజ్బాన్ ఆర్మీ పోస్టుపై జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం డిసెంబర్ 25వ తేదీన పంజూర్ జిల్లాలో చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్ వద్ద మిలటరీ వాహనంపై రిమోట్ కంట్రోల్ ఎక్స్ప్లోసివ్స్తో దాడులు జరిపామని ఆ ఘటనలో ఆరుగురు పాకిస్థాన్ సైనికులు మృతిచెందగా నలుగురు గాయపడ్డారని వెల్లడించారు.అదే విధంగా పాకిస్థాన్ సెక్యూరిటీ వెహికిల్స్ పై చేసిన దాడిలో ఐదుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఈ ఆదివారం మరో దాడి చేసి ఆ దేశ కమ్యూనికేషన్ టవర్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం సాధించేవరకూ ఈ పోరాటాన్ని ఆపేది లేదని బీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.1948లో పాక్లో బలూచిస్థాన్ విలీనం చేసే సందర్భంలో ఆ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ బలంవంతంగా ఆప్రాంతాన్ని పాకిస్థాన్లో కలిపారు. అప్పటి నుంచి పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బలూచ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పై బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను తీవ్రతర చేసింది. -
ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్
ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా తమిళ, కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్కి చెందిన నందిని.. సొంత భాషలో కాకుండా కన్నడ, తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన 'గౌరి' సీరియల్ ఈమెకు బోలెడంత పేరు తీసుకొచ్చింది. దీని షూటింగ్ కొన్నాళ్ల ముందు వరకు బెంగళూరులోనే జరిగింది. రీసెంట్గానే చెన్నైకి షిఫ్ట్ చేశారు. మొన్నటివరకు చిత్రీకరణలో పాల్గొన్న నందిని.. కాస్త బ్రేక్ తీసుకునేందుకు బెంగళూరులోని ఇంటికి వచ్చింది.అలాంటిది సడన్గా ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో తోటీనటీనటులు షాక్కి గురయ్యారు. 'గౌరి' సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ టీవీ ఛానెల్.. నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి సంతాపం తెలియజేసింది. తోటినటుడు సతీష్ మాట్లాడుతూ.. నందినికి ఇంకా పెళ్లి కాలేదు. అసలు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సీరియల్ నటి చనిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.🕊️ Rest in Peace, Actress Nandini🙏😢Your performance as Durga in Gauri serial will always be remembered Gone too soon. 💔#KalaignarTV #Nandini #Gauri #Durga #RestInPeace pic.twitter.com/UZR3P9Rf6x— Kalaignar TV (@kalaignartv_off) December 29, 2025 -
లకురవాను తుడిచిపెట్టనున్న ట్రంప్..!
లకురవా..! ఒకప్పుడు నైజీరియాలో దోపిడీ దొంగల నుంచి గ్రామీణులను కాపాడతారనే పేరున్న ఈ ముఠా సభ్యులు.. క్రమంగా కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్తో జతకట్టారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలో పాగా వేశారు. ఇప్పుడు పెద్దన్న...... అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్గా మారారు. అందుకే ట్రంప్ క్రిస్మస్ రోజున ‘హ్యపీ క్రిస్మస్’ సందేశమిస్తూ.. నైజీరియా వాయవ్య సరిహద్దుల్లోని సోకోటో రాష్ట్రంలో ఐఎస్ ఉగ్రవాదులను టార్గెట్గా చేసి, దాడులు జరిపిన విషయాన్ని బహిర్గతం చేశారు. ఏమిటా లకురవా ముఠా? ట్రంప్ వారిపై ఎందుకు కక్షకట్టాడు?? లకురవా అంటే రిక్రూటింగ్ అని అర్థం. 2016-17 మధ్యకాలంలో లకురవా ముఠా టంకాసాలోని గోంగానో అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాలపై దాడులు జరిపి, దోపిడీలకు పాల్పడే మూకల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేది. తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడే ఈ గ్రామాలను దోచుకునే బందిపోట్ల పీచమణిచేది. వ్యవసాయాధారితమైన ఈ గ్రామాల్లో రాజకీయ అస్థిరతకు తోడు.. నైజీరియా సైన్యం రక్షణ లేకపోవడంతో.. దోపిడీదారులు విజృంభించేవారు. ఈ పరిస్థితుల్లో నైజర్, మాలి నుంచి వచ్చిన కొంతమంది యువకులు దోపిడీదారులపై ఎదురుదాడి చేశారు. గ్రామస్థులు కూడా వీరికి మద్దతిచ్చారు. 2018 నాటికి ఈ ముఠా శక్తిమంతమైంది. తమ ముఠాకు లకురవా అని నామకరణం చేసింది. స్థానికులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకుని స్థిరపడింది. ఆ తర్వాత.. తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించింది. ఇస్లామిక్ నిబంధనలను అమలు చేయడం మొదలు పెట్టింది. మ్యూజిక్ వినేవారికి కొరడాలతో శిక్షలు విధించింది. 2023 నాటికి లకురవా ముఠా.. సోకోటోలోని అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకుంది. గతంలో ఈ ప్రాంతాలను బెంబేలెత్తించిన దోపిడీదారులను మించి.. ప్రజలను హింసించడం మొదలు పెట్టింది. క్రమంగా క్రూరత్వానికి మారుపేరుగా లకురవా మారిపోయింది. గ్రామాలపై పన్నులు విధించి.. దారుణంగా వసూలు చేసేది. దాదాపు 500 గ్రామాల్లో లకురవా పాగా వేసింది. అదే సమయంలో ఈ ప్రాంతానికి వచ్చే నైజీరియా సైన్యంపై అత్యంత క్రూరంగా దాడులు జరిపేది.క్రమంగా లకురవా ముఠాలు రిక్రూట్మెంట్లను తీవ్రతరం చేశాయి. 18-35 ఏళ్ల యువకులను ఆకట్టుకున్నాయి. తమతో జతకట్టే యువకుల కుటుంబాలకు డబ్బులివ్వడమే కాకుండా.. వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు, విత్తనాలను అందజేసేది. అలా.. దారుల్ ఇస్లాం అనే పేరుతో శిక్షణ శిబిరాలను ప్రారంభించింది. దీంతో.. నైగర్, నైజీరియా సైన్యాలు చర్యలకు ఉపక్రమించాయి. 2024 నవంబరులో ఈ రెండు దేశాలు లకురవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీంతో లకురవా ఉగ్రదాడులను మరింతగా పెంచింది. అదే నెలలో కేబ్బీలోని మెరా అనే గ్రామంపై దాడి చేసి, 25 మంది గ్రామస్థులను హతమార్చింది.లకురవాను ఉగ్రసంస్థగా ప్రకటించడానికి సరిగ్గా రెండు నెలల ముందు.. అంటే.. 2024 సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి ఓ కీలక సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది. లకురవా నేతలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారనేది ఆ సమాచారంలో ప్రధానాంశం. ఐఎస్లో చేరి ఐఎస్జీఎస్.. అంటే.. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ద గ్రేటర్ సహారాను ఏర్పాటు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా.. ఐఎస్ నుంచి అధునాతన ఆయుధాలు, డ్రోన్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలను సేకరించింది. ఐఎస్జీఎస్ ఇప్పుడు బోకోహరామ్తో కూడా చేతులు కలిపే ప్రమాదాలున్నట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అదే సమయంలో.. లకురవా మాత్రం అరాచకాలను మరింత పెంచింది. క్రైస్తవులు అధికంగా ఉండే గ్రామాలను టార్గెట్గా చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను టార్గెట్గా చేసుకుంది. లకురవా చర్యలపై ఉప్పందుకున్న అమెరికా రంగంలోకి దిగింది. ఈ ఏడాది నవంబరు నుంచే అమెరికా గూఢచర్య సంస్థలు వాయవ్య నైజీరియాలో నిఘాను పెంచినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ కూడా ఈ నెల 22న ఓ కథనాన్ని ప్రచురించింది. అందుకు తగిన ఆధారాలుగా అమెరికా సైన్యం ఫైటర్ జెట్ల రాకపోకలకు సంబంధించిన ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను పాఠకుల ముందుంచింది. అంతేకాదు.. క్రైస్తవులపై హింస పెరుగుతుండడంతో మత అసహన దేశాల జాబితాలో నైజీరియాను ట్రంప్ ప్రభుత్వం చేర్చింది. అయితే.. క్రిస్మస్ సందర్భంగా ట్రంప్ ప్రపంచానికి షాకిచ్చారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలోని బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని, దాడులు జరిపినట్లు ప్రకటించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఈ దాడులు జరిపానంటూ తననుతాను సమర్థించుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అంతంచేస్తానని ప్రతినబూనారు.లకురవా అరాచకాలు ఒక్కటని చెప్పలేం. నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో కూడా క్రిస్మస్ రోజున దాడులు జరిపింది. కొన్ని వారాల క్రితం ఉత్తర నైజీరియాలో ఓ క్యాథలిక్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, 300 మంది పిల్లలను అపహరించింది. నైజీరియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక అపహరణ ఉదంతం. చాలా మంది పిల్లలను ఆ తర్వాత విడుదల చేసినా.. మిగతావారెక్కడ? అనేదానిపై స్పష్టత లేదు. ఓ క్రైస్తవ మిషనరీ సంస్థ కోసం పనిచేసే ఓ పైలట్ కూడా ఇటీవల అపహరణకు గురయ్యారు. నైజీరియాలో ముస్లిం-క్రిస్టియన్ల జనాభా దాదాపుగా చెరిసగం ఉంటుంది. ఈ నేపథ్యంలో నైజీరియాలో క్రైస్తవులపై దాడులు కొనసాగితే.. అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఆ మేరకే క్రిస్మస్కు ముందు సోకోటోలోని అనేక ఉగ్రవాద స్థావరాలను అమెరికా, నైజీరియా సైన్యాలు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. ఈ ఉదంతాన్ని బహిర్గతం చేస్తూనే ట్రంప్ ‘హ్యాపీ క్రిస్మస్’ అంటూ పోస్టు చేశారు. ట్రంప్ పట్టుదలను చూస్తుంటే.. నైజీరియాలో అమెరికా సైన్యాన్ని మరింతగా మోహరించి, మున్ముందు మరిన్ని దాడులు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -హెచ్.కమలాపతిరావు -
చరిత్ర సృష్టించిన జేసన్ హోల్డర్
విండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ (Jason Holder) చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో (2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హోల్డర్ ఈ ఏడాది 69 మ్యాచ్ల్లో 97 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా గల్ఫ్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో హోల్డర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో హోల్డర్ (అబుదాబీ నైట్రైడర్స్) 2 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.హోల్డర్కు ముందు ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ 2018లో 61 మ్యాచ్ల్లో 96 వికెట్లు తీశాడు. ఈ విభాగంలో హోల్డర్, రషీద్ ఖాన్ తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రావో, నూర్ అహ్మద్ ఉన్నారు.బ్రావో 2016లో 72 మ్యాచ్ల్లో 87 వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఇదే ఏడాది 64 మ్యాచ్ల్లో 85 వికెట్లు తీశాడు.డెత్ ఓవర్ల స్పెషలిస్ట్హోల్డర్ ఇటీవలికాలంలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా రాటుదేలాడు. ఈ ఏడాది అతను తీసిన 97 వికెట్లలో 45 వికెట్లు డెత్ ఓవర్లలో తీసినవే. 2022లో 59 వికెట్లు తీసిన హోల్డర్.. ఈ ఏడాది తన వికెట్ల శాతాన్ని భారీగా మెరుగుపర్చుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన హోల్డర్ను ఐపీఎల్ 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 7 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.హోల్డర్ ఈ ఏడాది తన జాతీయ జట్టుతో (విండీస్) పాటు ఐదు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడాడు. ఈ ఏడాది అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హోల్డర్ తర్వాతి స్థానాల్లో నూర్ అహ్మద్ (85), హసన్ అలీ (71), హారిస్ రౌఫ్ (66) ఉన్నారు. రషీద్ ఖాన్ ఈ ఏడాది గాయాల కారణంగా కేవలం 63 వికెట్లకే పరిమితమయ్యాడు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెటర్ బ్రేస్వెల్ -
మెడికల్ కాలేజీల పీపీపీలో బట్టబయలైన ప్రభుత్వ బండారం!
విజయవాడ: మెడికల్ కాలేజీల పీపీపీలో ప్రభుత్వ బండారం మరోసారి బట్టబయలైంది. సింగిల్ బిడ్కే మెడికల్ కాలేజీ అప్పగించాలనే నిర్ణయంతో ప్రభుత్వం బండారం బయటపడింది. ఆదోని మెడికల్ కాలేజి రాజేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ షా కి అప్పగించాలని తీసుకున్న నిర్ణయంతో అసలు ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళుతుందనేది వెల్లడైంది. సింగిల్ బిడ్ అయినా అగ్రిమెంట్ చేసుకుంటామని మంత్రి సత్య కుమార్ ప్రకటించారు. అయితే సింగిల్ బిడ్కి ఇవ్వడం నిబంధనలకు విరుద్దవం కాదా అని మీడియా ప్రశ్నించగా, అన్ని పట్టించుకుంటే ఎలా ? అని తిరిగి ప్రశ్నించారు. సింగిల్ బిడ్కే అప్పగిస్తామని మంత్రి ప్రకటించారు. దీనిపై వైఎస్సారసీపీ మండిపడుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. ‘ఆదోని కాలేజ్ కోసం కిమ్స్ ఆస్పత్రికి చెందిన ఒక డాక్టర్తో టెండర్ వేయించారని,. ఒకే ఒక్క టెండర్ పెడితే దాన్ని కూడా ఆమోదించడం చూస్తే ప్రభుత్వం ఎటు పోతుంది?, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తి చేతిలో ఎలా పెడతారు?, కోటి సంతకాలతో ప్రజల ఆకాంక్షలు తెలిసినా ప్రభుత్వం బరితెగించింది. రాష్ట్రంలో విద్య వ్యాపారం చేశారు. జగన్ తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారు. ఇక వైద్య విద్యలాంటిది పేదలకు అసలు అందే అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించరు’ అని హెచ్చరించారు. -
సిరీస్కు ఒకరు.. నామమాత్రంగా మారిన టీమిండియా "వైస్ కెప్టెన్"
క్రీడ ఏదైనా అందులో కెప్టెన్ పాత్ర ఎంత ఉంటుందో, వైస్ కెప్టెన్ పాత్ర కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే ఏ నిర్ణయంలో అయినా ఈ ఇద్దరి పాత్ర చాలా కీలకం. తుది నిర్ణయం కెప్టెన్దే అయినా, వైస్ కెప్టెన్ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.అయితే ఇటీవలికాలంలో క్రికెట్ లాంటి క్రీడల్లో వైస్ కెప్టెన్ల పాత్ర నామమాత్రంగా మారింది. పేరుకే వైస్ కెప్టెన్ను ప్రకటిస్తున్నారు కానీ, మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో పెత్తనం మొత్తం కెప్టెన్దే. మేనేజ్మెంట్ కెప్టెన్లకు అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వైస్ కెప్టెన్లు కూడా పట్టీపట్టనట్లు ఉంటున్నారు.భారత క్రికెట్లో ఈ పోకడ మరీ విపరీతంగా ఉంది. వైస్ కెప్టెన్లు పేరుకే పరిమితమవుతున్నారు. మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో వీరి పాత్ర సున్నా. వైస్ కెప్టెన్లు ఇలా పవర్ లేకుండా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది జట్టులో వీరి స్థానానికి భరోసా ఉండకపోవడం.ఓ సిరీస్కు వైస్ కెప్టెన్గా ఎంపిక చేసి, ఆ సిరీస్లో విఫలమైతే మరుసటి సిరీస్ అతను జట్టులో ఉండడు. తమ స్థానానికే గ్యారెంటీ లేనప్పుడు ఏ ఆటగాడు కూడా జట్టు వ్యూహాల్లో తలదూర్చడానికి ఇష్టడడు.వైస్ కెప్టెన్లు పవర్లెస్గా మారిపోవడానికి సిరీస్కు ఒకరిని మార్చడం మరో కారణం. భారత క్రికెట్లో ఇటీవలికాలంలో ఇలా తరుచూ జరుగుతుంది. వ్యక్తిగతంగా రాణిస్తున్నా, సిరీస్కు ఓ వైస్ కెప్టెన్ను ఎంపిక చేస్తున్నారు. మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు, కెప్టెన్ల సంప్రదాయం ఎప్పుడు మొదలైందో, అప్పటి నుంచి వైస్ కెప్టెన్లను తరుచూ మారుస్తున్నారు.భారత టీ20 జట్టును తీసుకుంటే, ఇటీవలికాలంలో చాలామంది వైస్ కెప్టెన్లు మారారు. తాజాగా ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుకు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా ఎంపిక చేయబడగా.. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్కు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు.దీనికి ముందు కొన్నాళ్లు హార్దిక్ పాండ్యా.. కొన్నాళ్లు శ్రేయస్ అయ్యర్, ఓ సిరీస్కు (సౌతాఫ్రికా) రవీంద్ర జడేజా, ఓ సిరీస్కు (జింబాబ్వే) సంజూ శాంసన్ ఉప సారథులుగా వ్యవహరించారు.టీ20ల పరిస్థితి ఇలా ఉంటే.. టెస్ట్ల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సిరీస్కు ఒకరు.. కొన్ని సందర్భాల్లో సిరీస్ ఇద్దరు, ముగ్గురు కూడా వైస్ కెప్టెన్లుగా వ్యవహరించారు. 2022 నుంచి చూసుకుంటే.. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, బుమ్రా, పంత్, జడేజా, పుజారా, రహానే వైస్ కెప్టెన్లుగా వ్యవహరించారు.టెస్ట్లు, టీ20లతో పోల్చుకుంటే, వన్డేల్లో పరిస్థితి కాస్త బెటర్గా ఉంది. మొన్నటి వరకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండగా.. అతనికి డిప్యూటీగా శుభ్మన్ గిల్, పంత్, కేఎల్ రాహుల్ లాంటి వారు వ్యవహరించారు. ప్రస్తుతం గిల్ వన్డే జట్టు కెప్టెన్గా ఉండగా.. డిప్యూటీ పోస్ట్ శ్రేయస్ అయ్యర్ కోసం కేటాయించబడింది. టెస్ట్ జట్టుకు కూడా గిల్ కెప్టెన్గా ఉండగా.. అతనికి డిప్యూటీగా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ గైర్హాజరీలో రవీంద్ర జడేజా ఓ మ్యాచ్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు.సాధారణంగా ఏ క్రీడలో అయినా భవిష్యత్త్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైస్ కెప్టెన్లను ఎంపిక చేస్తుంటారు. కెప్టెన్ అండలో వైస్ కెప్టెన్ పాఠాలు నేర్చుకొని కెప్టెన్ స్థాయికి ఎదుగుతాడని అలా చేస్తారు. ఆనవాయితీగా ఇలాగే జరుగుతూ వచ్చింది. భారత క్రికెట్లో ఇటీవలికాలంలో చూసుకుంటే.. గంగూలీ తర్వాత ధోని.. ధోని తర్వాత విరాట్ కోహ్లి వైస్ కెప్టెన్లుగా ఉండి కెప్టెన్లుగా అవతరించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆటగాళ్లకు వైస్ కెప్టెన్గా అనుభవం లేకుండానే కెప్టెన్లుగా ఎంపిక చేస్తున్నారు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎంపిక ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఈ పరిస్థితి భారత క్రికెట్కు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని జట్లలో పరిస్థితి ఇలాగే ఉంది. వైస్ కెప్టెన్ల పాత్ర నామమాత్రంగా మారింది. కెప్టెన్ల పెత్తనం మాత్రమే నడుస్తుంది. -
‘క్యాబినెట్లో వ్యతిరేకించకుండా ఇలా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి?’
రాయచోటి: రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి. చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటు పొడవడమేని, అది మరోసారి రుజువైందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు అంశం కూటమి కక్షలో భాగమేనన్నారు. క్యాబినెట్లో వ్యతిరేకించకుండా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి? అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై మండిపడ్డారు శ్రీకాంత్రెడ్డి. జిల్లా కేంద్రం కోసం,జిల్లా కోసం పోరాటాలు కొనసాగిస్తామని, రేపు(మంగళవారం) రాయచోటిలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు శ్రీకాంత్రెడ్డి. కాగా, రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు సీఎం చంద్రబాబు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.రాయచోటి జిల్లా కేంద్రం రద్దు అంశానికి సంబంధించి ఏపీ కేబినెట్లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు. -
దళపతి విజయ్ 'వీడ్కోలు'.. ఆ హీరోల్లా చేయడుగా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. నటనకు వీడ్కోలు పలికేశాడు. ఇతడి చివరి సినిమా 'జన నాయగణ్'.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా మలేసియాలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే విజయ్ మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మరి మాటపై కచ్చితంగా నిలబడతాడా? అసలు విజయ్ ప్లాన్ ఏంటి?నటీనటులకు రాజకీయాలు కొత్తేం కాదు. టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఇలా చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. చిరంజీవి పూర్తిగా రాజకీయాలు అని అన్నారు గానీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి మేకప్ వేసుకున్నారు. పవన్ కూడా మధ్యలో పాలిటిక్స్ అని కొన్నాళ్లు నటనకు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన అయితే ఈయనకు లేదు. పలు సందర్భాల్లో ఆయన మాటలతోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.తమిళంలోనూ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు రాజకీయాలు అన్నారు గానీ తర్వాత వచ్చి మళ్లీ సినిమాలు చేసుకున్నారు. అయితే తమిళంలో ఎమ్జీఆర్, జయలలిత మాత్రం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి మరీ రాజకీయాల్లోకి వెళ్లారు. సక్సెస్ అయ్యారు కూడా. మరి దళపతి విజయ్ తన మాట మీద నిలబడి పూర్తిగా సినిమాలకు దూరమైపోతాడా లేదా అనేది చూడాలి?ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ 'టీవీకే' పార్టీ కూడా బరిలో ఉంది. ఇందులో గెలిచేసి విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఈ హీరోకి కూడా అంత పెద్ద కోరికలేం లేవు. ఒకవేళ సీఎం అయితే సినిమాల్ని పూర్తిగా పక్కనబెట్టేయొచ్చు. కొన్ని స్థానాలు గెలుచుకుంటే మాత్రం అప్పటి పరిస్థితులు బట్టి విజయ్ ఆలోచన మారే అవకాశముంటుంది.విజయ్ ఫ్యాన్స్ అయితే తమ హీరో కచ్చితంగా మాటమీద నిలబడతానని బల్లగుద్ది చెబుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా తిరిగి సినిమాలు చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి రెండేళ్లు ఆగితే ఈ విషయంపై కచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోల్లో విజయ్ టాప్లో ఉంటాడు. రజనీ, కమల్ దాదాపు రిటైర్మెంట్ దశకు వచ్చేశారు. అజిత్ కూడా చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తున్నాడు. సూర్య, విక్రమ్ లాంటి హీరోలున్నా వాళ్లు హిట్స్ అందుకోలేకపోతున్నారు. శివకార్తికేయన్, కార్తీ లాంటి హీరోలు స్టార్ రేంజ్కి చేరుకోవడానికి ఇంకా టైముంది. మరి విజయ్ స్థానాన్ని భర్తీ చేసే ఆ తమిళ హీరో ఎవరో? -
ఇషా అంబానీ సారథ్యం.. రిలయన్స్ రిటైల్ సరికొత్త రికార్డ్!
ఇషా అంబానీ నాయకత్వంలో.. రిలయన్స్ రిటైల్ 2025లో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఏడాది ముగిసే సమయానికి దేశంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య 7000 కంటే ఎక్కువ నగరాల్లో.. 20వేలకు చేరుకుంది. ఇందులో ఒక బిలియన్ కంటే ఎక్కువ కస్టమర్ లావాదేవీలను నెరవేర్చడమే కాకుండా.. లక్షలాది మంది భారతీయులకు ప్రాథమిక షాపింగ్ గమ్యస్థానంగా దాని స్థానాన్ని బలోపేతం చేసింది.రిలయన్స్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో.. ఫిజికల్ స్టోర్లే మొత్తం వ్యవస్థకు వెన్నెముక అని ఇషా అంబానీ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది వస్తువులను ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లో డెలివరీ చేసేలా లాజిస్టిక్స్ను మార్చారు. 600 కొత్త డార్క్ స్టోర్లు ఏర్పాటు చేశారు. జియోమార్ట్ 1,000కి పైగా నగరాల్లో విస్తరించింది. Ajio Rush ద్వారా ఫ్యాషన్ ఉత్పత్తులు కూడా డెలివరీ చేయడం ప్రారంభమైంది. ఇవన్నీ కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడ్డాయి.గ్లోబల్ బ్రాండ్ ఉత్పత్తులను.. భారతీయులకు చేరువ చేయడంలో ఇషా అంబానీ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'షీన్' బ్రాండ్ను ఇండియాకు తీసుకురావడం ద్వారా లక్షలాది మంది యువతను ఆకట్టుకున్నారు. ఫ్రెంచ్ బ్రాండ్ Maje, యువత కోసం Yousta, Azorte వంటివాటిని పరిచయం చేశారు. వీటికి పట్టణాల్లో మంచి ఆదరణ లభించింది.ప్రజలను ఆకట్టుకునే ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో.. రిలయన్స్ రిటైల్ ఆర్థికంగా 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ FMCG విభాగం, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), దాని రెండవ సంవత్సరంలోనే రూ.11,500 కోట్ల మైలురాయి టర్నోవర్ను సాధించింది. రాబోయే రోజుల్లో కంపెనీ ఏటా 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. -
‘ఇప్పటివరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం’
విజయవాడ: నగరంలోని భవానీపురం పున్నమి ఘాట్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఎగ్జిబిషన్ను ఉన్నపళంగా కూల్చివేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు సిద్ధమైన తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ కూల్చివేత కార్యక్రమానికి నిర్వాహకులు అడ్డుకున్న నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ పున్నమి ఘాట్లో ఆవకాయ అమరావతి పెస్టివల్ నిర్వహించడానికి అంతా సిద్ధం చేసుకున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. అయితే దాన్ని తీసువేయాలని చెప్పి.. ఇవాళ కూల్చివేత కార్యక్రమం చేపట్టడంతో ఎగ్జిబిషన్ నిర్వహాకులు ఆందోళనకు దిగారు. నోటీసుల్లో వారం రోజులు గడువు అని ఉండగా, ఉన్నపళంగా కూల్చివేయడంపై మండిపడుతున్నారు. ఎగ్జిబిషన్ను ఇప్పటికిప్పుడు తొలగించాలంటే కోట్ల రూపాయిలు నష్టం వస్తుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల్లో వారం రోజులు గడువు ఇచ్చారని, ఇవాళ కూల్చివేతలకు దిగారని మండిపడుతున్నారు. ఇప్పటివరకూ ఐదు కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టామని, ఉన్నపళంగా తీసేసేమంటే రోడ్డున పడే పరిస్ధితి వస్తుందని అంటున్నారు. -
"తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మించాలి"
సాక్షి హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు(సోమవారం) ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈసందర్భంగా రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావించారు. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో రాష్ట్ర భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో మాదిరి తిరుపతిలోనూ తెలంగాణ భవన్ నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రానికి చెందిన భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాల అంశంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరారు. అదే విధంగా రాష్ట్రం నుంచి ఏటా అయ్యప్పస్వామి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు శబరిమలకు వెళుతుంటారని, సూదూర ప్రాంతం కావడంతో అక్కడ కూడా తెలంగాణ భవన్ నిర్మించే అంశం ప్రభుత్వం ఆలోచించాలని గంగుల కమలాకర్ ప్రభుత్వానికి సూచించారు. ఇదివరకే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తిరుపతిలో ఆ రాష్ట్రాలకు చెందిన భవన్లు నిర్మించుకున్నాయని దీంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజాపతినిధులు అక్కడికి వెళ్లినప్పుడు వారికి ఇబ్బందులు కలగడం లేదన్నారు. కానీ తెలంగాణ ప్రజా ప్రతినిధులకు మాత్రం అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకే తిరుపతిలో తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే ప్రజాప్రతినిధులకు సౌకర్యంగా ఉండడంతో పాటు ప్రాధాన్యత కూడా ఉంటుందని గంగుల కమలాకర్ ప్రభుత్వానికి నివేదించారు. -
ప్రేమలేఖలన్నీ చిత్తు కాగితాలు! 38 ఏళ్లుగా అతడే ఊపిరిగా..
కేరళ నటి అభిరామి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక సినిమాలు చేసింది. తెలుగులో థాంక్యూ సుబ్బారావు, చార్మినార్, చెప్పవే చిరుగాలి, లెవన్, 12ఎ రైల్వే కాలనీ, సరిపోదా శనివారం వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇటీవలే ఈ నటి పెళ్లిరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేసింది.ఇప్పటికీ.. ఎప్పటికీ..'హ్యాపీ యానివర్సరీ మై లవ్.. 14వ ఏట నుంచి ఇప్పటి (42వ ఏట) వరకు నా సుఖదుఃఖాల్ని, జయాపజయాలను, భయాలను, ఆశనిరాశలను అన్నింటినీ నీతోనే పంచుకున్నాను, ఇకమీదట కూడా పంచుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఆప్తమిత్రుడిగా నిలబడ్డందుకు థాంక్యూ.. నీ ఊహకందనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను' అని నటి రాసుకొచ్చింది.ప్రేమ ఎలా మొదలైందంటే?కేరళ తిరువనంతపురానికి చెందిన అభిరామి తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు. వారికి అభిరామి ఒక్కరే సంతానం. స్కూల్ పక్కనే వీరి ఇల్లు ఉండేది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే చాలామంది అభిరామికి ప్రేమలేఖలు రాసి పంపేవారు. కొందరైతే నేరుగా ఇంటికొచ్చేవారు. కానీ ఎవరి ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు నటి. అయితే తనకు స్కూల్లో ఓ స్నేహితుడు ఉండేవాడు. అతడే రాహుల్. ప్రముఖ రచయిత పవన్ మనవడే రాహుల్.అలా మళ్లీ కలిశారువీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే మంచి మిత్రులు. తర్వాత పై చదువుల కోసం అభిరామి అమెరికా వెళ్లిపోయింది. కొంతకాలానికి రాహుల్ కూడా యూఎస్ వెళ్లాడు. అలా మళ్లీ ఇద్దరూ కలిశారు. ఈసారి స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. ఆ ప్రేమను జీవితాంతం పదిలంగా కాపాడుకునేందుకు పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. 2023లో ఈ జంట ఓ పాపను దత్తత తీసుకుంది. తనకు కల్కి అని నామకరణం చేసి పెంచుకుంటున్నారు.చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. సరిగ్గా ఆ హీరోకి ప్రత్యేకమైన రోజే..
