breaking news
-
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. సంఘంలో పేరుప్రతిష్ఠలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.దశమి సా.6.13 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: రోహిణి ఉ.5.40 వరకు, తదుపరి మృగశిర రా.3.51 వరకు, వర్జ్యం: ఉ.10.26 నుండి 11.56 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.19 వరకు, తదుపరి ప.3.00 నుండి 3.50 వరకు,అమృత ఘడియలు: రా.7.31 నుండి 9.02 వరకు.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో అవాంతరాలు. రుణాలు చేయాల్సివస్తుంది. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.వృషభం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల పరిష్కారం.మిథునం.... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. బంధువుల నుంచి ఒత్తిడులు.కర్కాటకం.... చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.సింహం.... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కన్య.... శ్రమ తప్పదు. పనులు కొన్ని మధ్యలో నిలిపివేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.తుల.... కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.వృశ్చికం... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు. ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.ధనుస్సు... నూతన పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు.మకరం..... పనుల్లో కొంత జాప్యం. సోదరులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.కుంభం.. సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.మీనం.... శుభకార్యాల ప్రస్తావన. ఆర్థికాభివృద్ధి. భూవివాదాల పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన సమయం. -
కుక్క కథ
కుక్కల మీద మనిషికి ఎప్పుడూ సదభిప్రాయం ఉన్నట్టు లేదు. ‘కుక్క’ అనే మాటనే తిట్టుగా వాడగలడు. కుక్క బుద్ధి అని నిందించగలడు. కుక్కల కొట్లాట అని దూషించగలడు. కుక్క బతుకు అని బాధపడగలడు. కుక్క మూతి పిందెలు అని తూలనాడగలడు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని దెప్పిపొడవగలడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని వెక్కిరించగలడు. ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి’ అని పాడగలడు. ఆఖరికి కుక్క చావును తనకు ఇష్టంలేని మనిషి జీవితయాత్రకు భరత వాక్యంగా జోడించగలడు.కుక్కలను వాటిమానాన వాటిని అడవిలో మననీయకుండా ఇంటిదాకా తెచ్చుకున్నది మనిషే. సుమారు 15,000 సంవత్సరాల క్రితమే మనిషి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. మానవులు తొట్టతొలిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్కేనంటారు. కాదు, గొర్రె అని మరో వాదన. ఏమైనా మనిషితో తొట్టతొలిగా స్నేహం చేసిన జంతువుల్లో కుక్క అగ్రభాగాన ఉందన్నది సత్యం. అప్పటినుంచీ అది మనిషికి వేటలో సాయపడింది. పంటలను కాపు కాసింది. మంచులో స్లెడ్జ్ బళ్లను లాగింది. దొంగలు, హంతకుల జాడను పసిగట్టింది. బాంబులను గుర్తించింది. ఒంటరి జీవులకు తోడుగా నిలిచింది. ‘దేవదాసు’లకు సాంత్వననిచ్చింది. తెగించి యజమానుల ప్రాణాలను కాపాడింది. మనిషి నాగరికతా ప్రస్థానంలో తనకు తెలియకుండానే విశ్వసనీయమైన పాత్రను పోషించింది. దాని తోక మాత్రమే వంకర కావొచ్చుగానీ దాని పనికి ఏ వంకా లేదు. అంతెందుకు! 1957లో రష్యన్లు ‘స్పుత్నిక్’లో తొట్టతొలిగా ఒక జీవిని అంతరిక్షంలోకి పంపాలనుకున్నప్పుడు వాళ్లు ఎంచుకున్నది కూడా ఒక కుక్కనే. అది మాస్కో వీధుల్లో తిరుగాడిన మూడేళ్ల ఆడ ఊరకుక్క. పేరు లైకా. అది ప్రాణాలతో తిరిగిరాదని దానికి తప్ప శాస్త్రవేత్తలందరికీ తెలుసు!జపాన్ లో హచికో కుక్కది మరో కథ. తన యజమాని టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు. విధులు ముగించుకుని ఆయన సాయంత్రం షిబూయా రైల్వే స్టేషన్ లో రైలు దిగేవాడు. అప్పటికి రెండేళ్ల వయసున్న హచికో అతడి కోసం అక్కడ వేచివుండేది. ఒకరోజు ఉన్నట్టుండి ఆ ప్రొఫెసర్ విధుల్లోనే బ్రెయిన్ స్ట్రోక్తో కుప్పకూలి చనిపోయాడు. ఇదేమీ తెలియని హచికో రోజులాగే యజమాని కోసం స్టేషన్ కు వచ్చింది. తెల్లారీ వచ్చింది. మరునాడూ వచ్చింది. క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికిగానీ స్థానికులు దాన్ని గుర్తించలేదు. తనని ప్రేమించిన యజమాని కోసం, తాను ప్రేమించిన యజమాని కోసం 1925– 1935 కాలంలో అది చనిపోయేదాకా సుమారు పదేళ్లపాటు ఆ స్టేషన్ లో ఎదురుచూసింది. జపాన్ లో ఇప్పుడు హచికో ఒక సాంస్కృతిక చిహ్నం. కుక్క అంటే విశ్వాసం అనే పేరు దానికి ఊరకే రాలేదు. వేల ఏళ్లుగా లక్షలాది కుక్కలు సమష్టిగా సముపార్జించుకున్న ఘనత అది.ప్రపంచంలో సుమారు 360 రకాల కుక్కలున్నాయి. వీటన్నింటినీ తిరిగి ఇంటికుక్క, ఊరకుక్క అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండింటికీ మధ్య ఉన్నది స్వల్ప భేదమే. ఇది జాతిపరమైనది కాదు. పెంచుకుంటే ఇంటి కుక్క. ఎవరికీ పట్టనిది ఊర కుక్క. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త’ అని జర్నలిజంలో ఒక తొలి పాఠం చెబుతుంటారు. కానీ మనుషులను కుక్క కరిచినా వార్త అవుతుండటం కుక్క కాట్ల తీవ్రతను తెలియజేస్తోంది. ఇది అత్యంత ఆందోళనకరంగా పరిణమించడం వల్లే ఊరకుక్కలను ఊళ్లో ఉంచాలా వద్దా అనే చర్చ దేశమంతా నడుస్తోంది; వాటికి అనుగుణంగా, వ్యతిరేకంగా ఎన్నో వాదనలు వినబడుతున్నాయి.జాక్ లండన్ రాసిన ‘కాల్ ఆఫ్ ద వైల్డ్’ నవలలోని బక్ కుక్క ‘దుడ్డుకర్ర చేతగలవాడిది పైచేయి’ అని ఇట్టే అర్థం చేసుకుంటుంది. ఆ పాఠాన్ని జీవితంలో ఎన్నడూ మరవదు. మనిషి సాధారణంగా ద్వంద్వ జీవి. దుడ్డుకర్రతో కుక్కలకు ‘ఆటవిక శాసనాన్ని’ పరిచయం చేయగలడు; లైకా అంతరిక్షంలో విలవిల్లాడి చచ్చిపోయిందంటే జీర్ణం చేసుకోలేక దాన్ని గ్రహాంతరవాసులు కాపాడినట్టు ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృజించుకోగలడు (ఉదా: జూలియన్ మే రాసిన ‘ఇంటర్వెన్షన్ ’). ‘పాతాళ్ లోక్’ వెబ్సిరీస్లో హథోడా త్యాగీకి తన గురువు ఒక మాట చెబుతాడు: ఒక మనిషి మంచివాడా కాదా అన్నది తెలుసుకోవడానికి అతడు కుక్కలతో ఎలా ఉంటున్నాడో చూడమంటాడు. దేశంలో సుమారు ఆరు కోట్ల ఊరకుక్కలున్నాయట. మనం వద్దనగానే అవి మాయం కావు. ఈ భూమ్మీది నుంచి ఎక్కడికీ పోవు. వాటిని మననిస్తూ, మనం ఇబ్బందిపడకుండా ఏ శాస్త్రీయ మార్గాలున్నాయో అన్వేషించడమే ఉత్తమ మార్గం. ప్రతి కుక్కకూ ఒక రోజంటూ ఉండాలిగా! -
మనమంటే మొహం మొత్తిందా?
ఇండియాపై ట్రంప్కు మొహం మొత్తిందా? ఆయన తన చేతల ద్వారా అదే విషయాన్ని తెగేసి చెబుతున్నారా? ఆయన మనపై 50% సుంకాలు విధించారు. సుంకాలపై వివాదం పరిష్కారమ య్యేంత వరకూ వాణిజ్య చర్చలను సుప్తావస్థలో పెడుతున్నట్లు ఆయన తెలి పారు. భారతదేశ మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను లెక్క చేయబోనని కరాఖండీగా చెప్పేశారు. రష్యా చమురును కొంటూ, అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు తెస్తోందని ట్రంప్కు వాణిజ్య సలహాదారైన పీటర్ నవారో ప్రకటించారు. పుతిన్తో ట్రంప్ చర్చలు విఫలమైతే భారత్పై సెకండరీ సుంకాలు పెరగ వచ్చని ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ వెల్లడించారు. యూరప్ కూడా భారత్పై సెకండరీ సుంకాలు విధించాలని ఆయన కోరారు. అమె రికా స్నేహహస్తం నుంచి భారత్ చేజారిందని ఇవన్నీ సూచిస్తున్నాయా? చైనా, రష్యాలను హెచ్చరించేందుకు భారత్ను ట్రంప్ వాడు కుంటున్నారనే అభిప్రాయమూ ఉంది. అది కూడా సంతోషపడదగ్గ అంశం కాదు. మనం ఆనుషంగిక నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మనం ఏమైపోయినా నిజంగానే, ఆయనకు పట్టదు.మరోపక్క, ట్రంప్ పాకిస్తాన్తో ప్రేమలో పడినట్లు కనిపిస్తోంది. అదీ మనల్ని సంకటంలో పడేసే సంగతే. ఆయన పాక్పై 19% సుంకాలే విధించారు. ఆయన ప్రభుత్వం ఇస్లామాబాద్ను ఉగ్రవాదంపై పోరాటంలో ‘అసాధారణ భాగస్వామి’గా పరిగణి స్తోంది. ‘ఉగ్రవాద సంస్థలను అరికట్టడంలో విజయాలను కొనసా గిస్తున్నందుకు’ అది ఇటీవల పాకిస్తాన్ను కొనియాడింది. ట్రంప్... పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ను విందుకు ఆహ్వానించి, చమురును వెలికితీయడంలో పాక్కు సాయపడతామని చెప్పారు. నిజం చెప్పా లంటే, ఏదో ఒక రోజున పాక్ నుంచి భారత్ కూడా చమురును కొనుగోలు చేసే రోజు రావచ్చని, ఆయన మనల్ని కవ్వించారు.అంటే, ఆయనకు పాకిస్తాన్ కొత్త ముద్దుగుమ్మగా మారినట్లా? రష్యన్ చమురు ఢిల్లీని చీకాకుపరచే అంశంగా మారడమేకాదు, అది పరిష్కారమయ్యేంత వరకూ భారత్తో వాణిజ్య చర్చలు జరి పేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు కనుక మొదట దానిపై దృష్టి కేంద్రీకరిద్దాం. పైగా, జరిమానా కింద మరిన్ని సుంకాలు విధిస్తా మని బిసెంట్ హెచ్చరించారు. సత్యం ఏమంటే, రష్యన్ చమురు కొనేటట్లుగా ఇండియాను బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ‘వాస్తవానికి, ధరపై పరిమితి ఉన్న రేటు వద్ద రష్యన్ చమురు కొనుగోలు చేయాల్సిందిగా మేము (అమెరికా) కోరబట్టే వారు (ఇండియా) కొనుగోలు చేశారు...ఎందుకంటే, చమురు ధరలు పెరగడం మాకిష్టం లేదు. వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు’ అని ఢిల్లీలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి 2024 మే నెలలో చెప్పారు. ట్రంప్ ఈరోజు, తనకు ముందున్న ప్రభుత్వ విధానాన్ని కావాలని ఉపేక్షిస్తూ, ఇండియాను నిందిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ ఆత్మవంచన తేటతెల్లమవుతోంది. రష్యా నుంచి అమెరికా పాలాడియం, యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే, గడచిన ఆరు నెలల్లో ఈ దిగుమతుల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది. రష్యా నుంచి అమెరికా స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నప్పుడు లేని అభ్యంతరం, ఇండియా పట్లనే ఎందుకు? ఇక మూడవ అంశం – ట్రంప్ అసలు ఉద్దేశాలను బయట పెడుతోంది. ఆయన ద్వంద్వ ప్రమాణాలకు ఇది మరో నిదర్శనం. రష్యా చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్న, మూడవ పెద్ద దిగుమతిదారులుగా ఉన్న చైనా, తుర్కియేలను ట్రంప్ హెచ్చరించ లేదు. రష్యన్ చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ, స్లొవేకియా – రెండూ యూరప్ దేశాలు, ‘నాటో’లో సభ్యత్వం ఉన్నవీనూ! కానీ ట్రంప్ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి జపాన్ కూడా దిగుమతి చేసుకుంటున్న సంగతిని ఆయన సమయానుకూలంగా విస్మరిస్తున్నారు. చైనాపై సుంకాల విధింపులో ఇచ్చిన విరామాన్ని ఆయన ఇటీవల మరో 90 రోజులు పొడిగించారు. ఆయన ఢిల్లీపైన మాత్రమే మూడవ కన్ను తెరిచారని స్పష్టమవుతోంది. ఈ సమస్యకు సంబంధించి మరో పార్శ్వం కూడా అంతే కలవరపరుస్తోంది. ‘క్వాడ్’ (ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమె రికా)లోని మిగిలిన మూడు దేశాలతో తనకు అవసరం తీరిపోయిందని ట్రంప్ భావిస్తున్నారని... ఆయన వైఖరి, నడతను బట్టి అర్థం చేసుకోవచ్చా? అదే నిజమైతే, ఇండో–పసిఫిక్ వ్యూహం విషయంలో అమెరికా వైఖరి ఏమిటి? చైనాతో మనకున్న సమస్యల దృష్ట్యా ‘క్వాడ్’ కూటమి మనకు ఊరటనిచ్చిన మాట నిజం. ‘క్వాడ్’ పట్ల ట్రంప్ నిబద్ధత చూపకపోతే, అది మనకు మరిన్ని చిక్కులు సృష్టించవచ్చు.చైనాతో ట్రంప్ ఆర్థిక ఒప్పందానికి వస్తారా? ఊహించడం కష్టం. కానీ, షీ జిన్ పింగ్తో శిఖరాగ్ర సమావేశమై ఆయన ఇప్పటికే మాట్లాడుతున్నారు కనుక, అటువంటి దానికి అవకాశం ఉందని పిస్తోంది. చైనాను రాజకీయంగా మరింత మెరుగ్గా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందా అనేది ప్రశ్న. బీజింగ్ ప్రాంతీయ ఆకాంక్షలకు అమెరికా మరింత వెసులుబాటు కల్పిస్తుందా? ఒకవేళ అదే కార్యరూపం ధరిస్తే, చైనాతో సరిహద్దు వివాదంపై అమెరికా మద్దతు మనకు కొనసాగుతుందా? ఈ విషయమై మనం ఎటువంటి వైఖరిని అనుసరించాలన్నది పెద్ద ప్రశ్న? జవాబు కోసం మనం గాభరా పడాల్సిన అవసరం లేదు. మన నుంచి దిగుమతి చేసుకోకపోతే బతకలేమన్నంతగా, అమెరికా మొహం వాచి చూస్తున్నవాటిని మనం ఏమీ అమెరికాకు ఎగుమతి చేయడం లేదు. చైనా వద్ద రేర్ ఎర్త్ ఖనిజాలు, లోహాలు ఉన్నాయి. మనకి లేవు! కనుక, బేరసారాలకి మనకున్న అవకాశం తక్కువ. మనకున్న ఆశ ఒక్కటే! ఉక్రెయిన్పై పుతిన్–ట్రంప్ ఒక ఒప్పందానికి రాగలిగితే, అది మనపై విధించిన సెకండరీ ఆంక్షలను ఎత్తివేయడానికి తోడ్పడవచ్చు. అమెరికా దృష్టిలో భారత్ ఇప్పటికీ ఉందని స్కాట్ బిసెంట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అనుకున్నట్లు జరగకపోతే ట్రంప్ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు మనం గురికావాల్సిందే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై బుగ్గన ధ్వజం
తాడేపల్లి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఎల్లో మీడియా తప్పుడు కధనాలు రాయడంపై మాజీ ఆర్థికశాఖ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాంజేంద్రనాథ్ మండిపడ్డారు. అంచనాలకు మించి జీఎస్టీ వసూళ్లు అంటూ రాసిన ఈనాడు కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాకపోయినా భారీగా వచ్చినట్లు రాయడంపై బుగ్గన ధ్వజమెత్తారు. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో రాష్ట్రానికి వచ్చిన వాస్తవ ఎస్ జీఎస్టీ ఆదాయం కేవలం రూ. 10, 769 కోట్లు మాత్రమేనన్నారు. కాగ్ నివేదికలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. పన్ను, పన్నేతర రూపాల్లో వచ్చే ఆదాయాలు భారీగా తగ్గాయన్నారు. ఆదాయం తగ్గినా భారీగా వచ్చినట్లు ఈనాడులో తప్పుడు కథనాలు రాశారన్నారు. -
విశాఖ, అల్లూరి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
సాక్షి,విశాఖ: ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఫలితంగా వాతావరణ శాఖ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే మూడు రోజులు రాయలసీమలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురవునున్నాయి. ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని ప్రైవేట్,ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు మంజూరు చేస్తూ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. -
ఆ సినిమా కోసం నెలపాటు మణిరత్నం వెంటపడ్డా: నాగార్జున
'కూలీ' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున.. తొలిసారి విలన్గా చేసి ఆకట్టుకున్నాడు. రెండు నెలల క్రితం 'కుబేర'లో వైవిధ్యమైన సహాయ పాత్రలో కనిపించి మెప్పించాడు. అయితే ఇప్పుడంటే నాగ్ వెంటపడి దర్శకులు సినిమాలు తీస్తున్నారు. కానీ స్వయంగా నాగార్జున.. డైరెక్టర్ మణిరత్నం వెంటపడి ఓ సినిమా చేశారని మీలో ఎందరికీ తెలుసు. అవును ఆ సంగతులు నాగ్ ఇప్పుడు బయటపెట్టాడు.జగపతిబాబు హోస్ట్గా ఓ టాక్ షో ప్రారంభమైంది. అందులో నాగార్జున తొలి గెస్ట్గా వచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో సంగతులు పంచుకున్న నాగ్.. తన యాక్టింగ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మణిరత్నం వెంటపడి 'గీతాంజలి' సినిమా చేసిన అనుభవం గురించి బయటపెట్టారు.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)'నేను చేసిన ప్రారంభ సినిమాలని నాగేశ్వరరావు అబ్బాయి అనే ఉద్దేశంతోనే ప్రేక్షకులు చూశారు. కొందరికి నా యాక్టింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదు. తర్వాత కూడా ఆరేడు మూవీస్ చేశా. అలా 'మజ్ను' నాకు బ్రేక్ ఇచ్చింది. కమర్షియల్ చిత్రాల్లో అయితే 'ఆఖరి పోరాటం' హిట్ అయింది. అయితే అందులో నేను బొమ్మలా ఉన్నానంతే. డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరోయిన్ శ్రీదేవి వల్ల మూవీ సక్సెస్ అయింది''మణిరత్నం తీసిన 'మౌనరాగం' సినిమా నాకు బాగా నచ్చింది. దీంతో ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని అనుకున్నాను. ఆయన వాకింగ్కి వెళ్లే పార్క్ వివరాలు తెలుసుకుని, దాదాపు నెలరోజులు ఆయన వెంటపడ్డాను. పది నిమిషాలు కలిసి నడిచిన తర్వాత ఆయన టెన్నిస్ ఆడేందుకు వెళ్లిపోయారు. చివరకు ఎలాగోలా ఒప్పించాను. అలా 'గీతాంజలి' మూవీ వచ్చింది. దాన్ని తమిళంలోనే తీయాలనుకున్నారు. కానీ తెలుగు మార్కెట్ కూడా పెంచుకోండి అని సలహా ఇవ్వడంతో నాతో సినిమాకి ఒప్పుకొన్నారు. అనుకున్నట్లే హిట్ అయింది' అని నాగార్జున చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ) -
కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్
సౌత్ కొరియా బ్రాండ్ అయిన కియా మోటార్స్.. దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. ఎప్పటికప్పుడు కొత్త కార్లను పరిచయం చేసే ఈ కంపెనీ ఇండియాలో కియా కారెన్స్ క్లావిస్ & కారెన్స్ క్లావిస్ ఈవీ లాంచ్ చేసింది.కియా ఇండియా లాంచ్ చేసిన ఈ రెండు కార్లు నాలుగు నెలల్లోనే 21,000 బుకింగ్లను పొందినట్లు కంపెనీ ప్రకటించింది. కారెన్స్ క్లావిస్ 20,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందగా.. క్లావిస్ ఈవీ 1,000 కంటే ఎక్కువ ఆర్డర్లను పొందింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.కియా కారెన్స్ క్లావిస్ మంచి డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇది స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లు, వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్, మూడవ వరుస యాక్సెస్ను సులభతరం చేయడానికి సెగ్మెంట్-ఫస్ట్ బాస్ మోడ్ వంటివి పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ పనోరమిక్ డిస్ప్లేలు, బోస్ 8 స్పీకర్ ఆడియో, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ డాష్క్యామ్ వంటివి మాత్రమే కాకుండా క్లైమేట్ కంట్రోల్/ఇన్ఫోటైన్మెంట్ స్వాప్ స్విచ్ వంటివి కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.1.30 లక్షలు తగ్గిన ధర: ఇప్పుడు ఈ బైక్ రేటు ఎంతంటే?క్లావిస్ ఈవీ విషయానికి వస్తే.. ఇది 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. 42kWh యూనిట్ 404 కి.మీ రేంజ్ అందిస్తే.. 51.4kWh యూనిట్ 490 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఈ కారు 100 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. సేఫ్టీ పరంగా కూడా ఇవి రెండూ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి. -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రత్యర్ధులకు బ్యాడ్ న్యూస్
ఆసియాకప్-2025కు ముందు టీమిండియాకు ఓ అదరిపోయే వార్త అందింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్లో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బుమ్రా తన నిర్ణయాన్ని సెలక్టర్లు తెలియజేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఇంగ్లండ్కు వెళ్లిన బుమ్రా కేవలం మూడు మ్యాచ్ల మాత్రమే ఆడాడు. ఆ తర్వాత ఆఖరి టెస్టుకు ముందు బుమ్రాను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. మూడు మ్యాచ్లలో బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టకున్నప్పటికి ఫిట్నెస్ పరంగా మాత్రం కాస్త ఇబ్బంది పడుతూ కన్పించాడు.దీంతో ఆక్టోబర్లో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆసియాకప్కు ముందు దాదాపు ఏభై రోజులు విశ్రాంతి లభించడంతో బుమ్రా తిరిగి టీ20 ఫార్మాట్లో ఆడేందుకు సిద్దమయ్యాడు."ఆసియా కప్ జట్టు ఎంపికకు తాను అందుబాటులో ఉంటానని బుమ్రా బుమ్రా సెలెక్టర్లకు తెలియజేశాడు. వచ్చే వారం జరిగే సమావేశంలో సెలక్షన్ కమిటీ ఈ విషయంపై చర్చించనున్నారని" ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. బుమ్రా చివరగా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరపున పొట్టి క్రికెట్లో ఆడాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది. ఈ స్పీడ్ స్టార్ కేవలం 18 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మచదవండి: ఆసియాకప్ రేసులో గిల్ కంటే అతడే ముందున్నాడు: అశ్విన్ -
అబార్షన్ చేసి గర్భిణి ప్రాణం తీసిన ఆర్ఎంపీ
సూర్యాపేట జిల్లా: జిల్లాలోని తుంగతుర్తిలో కొందరు ఆర్ఎంపీలు మాఫియాగా మారి యధేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. తాజాగాఆర్ఎంపీ శ్రీనివాస్ అక్రమాలు వెలుగుచూశాయి. ఓ మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడబిడ్డ అని తేలడంతో అబార్షన్ చేశాడు. అయితే అబార్షన్ వికటించి ఐదు నెలల గర్భిణి విజేత మృతి చెందింది. గత కొంతకాలంగా వైద్యం ముసుగులోఆర్ఎంపీ శ్రీనివాస్ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారు. బాలాజీ ఆస్పత్రి పేరుతో ఓ కేంద్రం ఏర్పాటు చేసి, కొందరు ఆర్ఎంపీలు కలిసి ఓ మాఫియాలాగా మారారు శ్రీనివాస్. తుంగతుర్తి పరిసర ప్రాంతాల్లో పేద గర్భిణీలే టార్గెట్గా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ చేస్తూ ఆడబిడ్డ అని తెలిస్తే కడుపులోనే బిడ్డను చిదిమేస్తున్నారు. వైద్యం ముసుగులో శ్రీనివాస్ ముఠా చేస్తున్న భ్రూణ హత్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుకు సమాచారం ఇచ్చినా కనీసం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వైద్య తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లామని అంటున్నారు స్థానికులు. శ్రీనివాస్ ముఠా చేస్తోన్న అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చిన వారిపై రాజకీయ పలుకుబడి ఉపయోగించి బెదిరింపులకు సైతం దిగారని ఆరోపిస్తున్నారు. -
గూగుల్లో పర్సనల్ ఇంటర్వ్యూలు: సుందర్ పిచాయ్
ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటే.. ముఖాముఖి నిర్వహించేవాళ్ళు. టెక్నాలజీ పెరిగిన తరువాత వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు చేయడం మొదలైంది. ఈ విధానం ద్వారా ఇంటర్వ్యూలు జరిపితే.. కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వర్చువల్ విధానంలో జరిగే ఇంటర్యూలపై గూగుల్ సీఈఓ కీలక వ్యాఖ్యలు చేశారు.వర్చువల్ విధానంలో ఇంటర్యూలు నిర్వహిస్తుంటే అభ్యర్థులు కొందరు మోసం చేస్తున్నారు. ఇలాంటి వాటిని నివారించడానికే గూగుల్ కంపెనీలో మళ్ళీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు 'సుందర్ పిచాయ్' పేర్కొన్నారు. ఏఐ వినియోగం పెరుగుతున్నందున వర్చువల్ ఇంటర్వ్యూలు సమంజసం కాదని కంపెనీలోని ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారా.. ఇంటర్యూలను షెడ్యూల్ చేయడం సులభం. అంతే కాకుండా శ్రమ, వ్యయం కూడా తగ్గుతాయి. అయితే కొందరు మోసం చేయడం మొదలు పెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఇంటర్వ్యూ చేయదలచిన అభ్యర్థిని, కనీసం ఒక్కసారైనా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయించుకున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో భారీగా బయటపడ్డ బంగారు నిక్షేపాలుప్రస్తుతం ఈ సమస్య ఎదుర్కొంటున్న కంపెనీల జాబితాలో గూగుల్ మాత్రమే కాకుండా.. అమెజాన్, ఆంత్రోపిక్ , సిస్కో, మెకిన్సే వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. కంపెనీలన్నీ వర్చువల్ ఇంటర్వ్యూ విధానానికి మెల్లగా చరమగీతం పాడేసి, మళ్ళీ వ్యక్తిగత ఇంటర్వ్యూలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, ఓ కార్పొరేటర్
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లిలో కొనసాగుతున్న పేకాట శిబిరాలపై(Poker camps) టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు ఉన్నారు. ఆదివారం (ఆగస్ట్17) బాలానగర్ ఎస్ఓటి పోలీసులు కూకట్పల్లిలోని ఓ గెస్ట్ హౌస్లో పేకాట శిబిరంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న కొండలరావుతో పాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సహా మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు. వీరివద్ద నుంచి మూడు లక్షల నగదుతో పాటు, మొబైల్ ఫోన్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్
ఢిల్లీ: ఎన్టీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగి సీపీ రాధాకృష్ణన్ను ఎంపిక చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్.. స్వస్థలం తమిళనాడు. సీపీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అనంతరం సీపీ రాధాకృష్ణన్ ఎంపికపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాలకు అప్పగించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ సభ్యులు భారత ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సమతుల్యత పాటించింది కేంద్రం. రాష్ట్రపతి ముర్ము ఉత్తరాది వాసి కాగా, ప్రస్తుతం ఎంపిక చేసిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ దక్షిణాది వాసి. ఇదిలా ఉంచితే, ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ తమ అభ్యర్థిని ముందుగా ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 9వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.కాగా, సీపీ రాధాకృష్ణన్.. బీజేపీ నాయకుడు. ఆయన రెండుసార్లు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారాయన. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా బాద్యతలు నిర్వర్తించారు. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్.. 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలును అప్పగించారు. 2024 జులై 31 వరకు తెలంగాణ గవర్నరుగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 ఆగస్టు 06 వరకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. ఆపై మహారాష్ట్ర గవర్నర్గా ఎంపికయ్యారు. -
ఆసియాకప్ రేసులో గిల్ కంటే అతడే ముందున్నాడు: అశ్విన్
ఆసియాకప్-2025 టీ20 టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మార్క్యూ ఈవెంట్ కోసం భారత జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.అయితే ఈ టోర్నీకి భారత జట్టులో యవ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు చోటు ఇవ్వాలని లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ సూచించాడు. కాగా టీమిండియా హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాక టీ20 ఫార్మాట్లో ఓపెనర్లగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కొనసాగుతున్నారు.చాలా టీ20 మ్యాచ్లకు జైశ్వాల్కు విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు ఆసియాకప్నకు జైశ్వాల్తో పాటు మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ కూడా ఉన్నాడు. దీంతో భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది."ఆసియాకప్ జట్టు ఎంపిక గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్లో యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్గా ఉన్నందున, శుబ్మన్ గిల్ను టీ20 ప్రణాళికలకు సరిపోతాడా లేదా అన్నది ఇప్పుడు అందరి మనస్సులను తొలుస్తున్న ప్రశ్న.నావరకు అయితే సెలక్టర్లు గిల్ కంటే జైశ్వాల్కే తొలి ప్రధాన్యత ఇస్తారని అనుకుంటున్నాను. రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్దానంలో జైశ్వాల్ ఆటోమేటిక్గా లభిస్తుంది. అభిషేక్ శర్మ స్దానానికి ఎటువంటి ఢోకా లేదు. ఇప్పుడంతా మరో ఓపెనర్ కోసమే చర్చ. శుబ్మన్ గిల్ అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. అదేవిధంగా సంజూ శాంసన్ కూడా ఓపెనర్గా అద్బుతంగా రాణించాడు. కాబట్టి సెలెక్టర్లకు కష్టమైన పరిస్థితి" అని ఎక్స్ప్రెస్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup 2025: పాక్-భారత్ మ్యాచ్కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు! -
బిగ్బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష.. ప్రోమో రిలీజ్
బిగ్బాస్ 9 తెలుగు సీజన్.. వచ్చే నెల 7న ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందే ఈసారి సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష' పేరుతో ఓ పోటీ పెడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుకాగా.. ఎంపిక ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ గేమ్ షోకు శ్రీముఖి యాంకర్ కాగా.. బిందుమాధవి, అభిజిత్, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే తొలి ప్రోమోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ)అగ్నిపరీక్షలో 45 మంది సామాన్యులు పాల్గొనబోతున్నారు. వీళ్లలో యువతీ యువకులు, సోషల్ మీడియాలో కాస్త ఫేమ్ ఉన్న వాళ్లు, ముసలి వాళ్లు, కాళ్లు లేని దివ్యాంగులు, ముఖానికి మాస్క్ పెట్టుకున్న వ్యక్తులు, హిజ్రా.. ఇలా అన్ని రకాల వ్యక్తులు భాగం కానున్నారు. వీళ్ల నుంచి చివరగా ముగ్గురుని ఎంపిక చేసి, వాళ్లని సీజన్లో ఆడిస్తారు.ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 5 వరకు బిగ్బాస్ అగ్నిపరీక్ష షో జరగనుంది. ప్రతిరోజు గంట పాటు ప్రసారం చేస్తారు. ఇందులో భాగంగా పాల్గొన్న సామాన్యులకు పోటీలు పెట్టి చివరకు విజేతల్ని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రోమోలోనే 'నేను ఆడ నవదీప్ని' అని మహిళా బాడీ బిల్డర్ అనడం.. వయసు తట్టుకుంటా.. ఉపవాసం ఉంటా.. ఏది పెట్టినా తింటా.. ఎలిమినేట్ చేయాలని చూస్తే ఊరుకోను అని ఓ ముసలామె అనడం ఆసక్తికరంగా ఉన్నాయి.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత) -
hit and run: భార్య మృతదేహాన్ని బైక్కు కట్టి.. నిందితుల్ని ఆటకట్టించిన AI
ముంబై: కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో హృదయ విదారక వీడియో వైరల్గా మారింది. హిట్ అండ్ రన్ ఘటనలో భార్యను కోల్పోయిన భర్త, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తన భార్య మృతదేహాన్ని బైక్పై తాళ్లతో కట్టి తరలించాల్సి వచ్చింది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ కేసులో నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషించింది. మహారాష్ట్ర పోలీసులకు 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకునే అవకాశం కల్పించింది.మహారాష్ట్ర నాగపూర్లో మోర్ఫాటా ప్రాంతానికి సమీపంలో నాగ్ పూర్-జబల్ పూర్ జాతీయ రహదారిపై ఓ ట్రక్కు అమిత్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య గ్యార్సితో కలిసి బైక్పై ప్రయాణిస్తున్న సమయంలో,వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీ కొట్టింది. సంఘటన స్థలంలోనే గ్యార్సి మృతి చెందింది.అమిత్ తన భార్య మృతదేహాన్ని తరలించేందుకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నవారిని సాయం కోసం వేడుకున్నాడు. కానీ ఎవరూ స్పందించకపోవడంతో, తన భార్య మృతదేహాన్ని బైక్ వెనక భాగానికి తాళ్లతో కట్టి, మధ్యప్రదేశ్లోని తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ దృశ్యాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అది వైరల్ అయింది. పోలీసులు చివరకు అమిత్ను ఆపి, మృతదేహాన్ని నాగ్పూర్లోని మాయో ఆసుపత్రికి పోస్ట్మార్టం కోసం తరలించారు.ఈ హిట్ అండ్ రన్ ఘటనలో ఏఐ నిందితుల ఆటకట్టించింది. రక్షాబంధన్ రోజున (ఆగస్టు 9) తాను, తన భార్య గ్యార్సితో కలిసి బైక్పై వెళుతుండగా రెడ్ కలర్ ట్రక్.. తన బైక్ను ఢీకొట్టిందని, ట్రక్ తన భార్య గ్యార్సిని తొక్కుకుంటూ వెళ్లిందని అమిత్ యాదవ్ పోలీసులకు చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ఏఐని వినియోగించారు. మూడు టోల్ ప్లాజాల నుంచి ఘటన జరిగిన 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సీసీ టీవీఫుటేజీ సేకరించారు. ఆ సీసీటీవీఫుటేజీని కంప్యూటర్ విజువల్ టెక్నాలజీ ఆధారంగా రెండు ఏఐ అల్గారిథమ్ను ఉపయోగించారు.ఏఐ మొదటిగా ఎరుపు గుర్తులు ఉన్న ట్రక్కులను గుర్తించింది. రెండవది ట్రక్కుల సగటు వేగాన్ని విశ్లేషించి అనుమానాస్పద ట్రక్కును గుర్తించింది. ఈ ఆధారంగా ఒక ట్రక్కును గుర్తించి, నాగ్పూర్ నుంచి 700 కిమీ దూరంలో గ్వాలియర్-కాన్పూర్ హైవే వద్ద దాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఫలితంగా 36 గంటల్లో పోలీసులు.. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కటకటాల్లోకి పంపించారు. A 35-year-old man tied his wife's lifeless body to his bike after she was run over by a speeding truck in #Nagpur and his cry for help went unnoticed by passersby.pic.twitter.com/CmuC3F9l9U— Hate Detector 🔍 (@HateDetectors) August 11, 2025 -
గ్లామరస్ 'ఓజీ' బ్యూటీ.. కిరాక్ కేతిక శర్మ
ఓజీ బ్యూటీ ప్రియాంక మోహన్ గ్లామరస్ పోజులుకిరాక్ పుట్టించేస్తున్న అదిదా కేతిక శర్మవజ్రాలు లాంటి డ్రస్సులో జాన్వీ కపూర్జీన్ షార్ట్తో తెగ హ్యాపీగా యువనటి దీపికా పిల్లిజపాన్లో తిరిగేస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరిఎర్రని చీరలో ఒయ్యరాలు పోతున్న అనసూయజిమ్లో వర్కౌట్ చేస్తున్న బిగ్బాస్ దివి View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) -
‘కూటమి పాలనలో మహిళలపై అడుగడుగునా అఘాయిత్యాలు’
తాడేపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అడుగడుగునా అకృత్యాలు పెచ్చుమీరాయనివైఎస్సార్సీపీ నేత, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... అధికార మదం, అహంకారంతో కూటమి పార్టీల నేతలే ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడ్డం అత్యంత దారుణమని మండిపడ్డారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని తేల్చి చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...మహిళా ఉపాధ్యాయులకే రక్షణ కరువుశ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన దాష్టీకమే రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను మానసికంగా వేధించడం అత్యంత దుర్మార్గం. బాధిత ప్రిన్సిపాల్ ఎంత వేదనకు గురి అయితే బయటకు వచ్చి ఏకంగా ఒక ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు అర్ధరాత్రి వీడియో కాల్స్ తో సహా ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో కన్నీరు పెట్టుకుంటూ బాధిత ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. స్థానిక పోలీసులు చోద్యం చూస్తున్నారు.గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దాష్టీకం, వేధింపులు పై అధికార టీడీపీకు చెందిన బాధిత మహిళే నేరుగా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని రకాలుగా సాక్షాత్తూ ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తుంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఉపేక్షిస్తున్నారు?.ప్రతినెలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార్లతో సమక్షలు చేస్తున్న చంద్రబాబు... మహిళలపై ఈ స్ధాయిలో వేధింపులు, దాడులు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మరి ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ఎందుకు భయం లేదు? కీచకుల్లా వ్యవహరిస్తున్న తన పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు సర్వసాధారణం అయిపోయాయి. స్కూల్లు, కాలేజీలు,ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు వేధింపులు గురువుతున్నారు. అధికార మదం, అహంకారంలో ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ తో ఎమ్మెల్యే అర్ధరాత్రి వీడియో కాల్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? స్కూల్లో సీటు కావాలంటే.. ఎమ్మెల్యేగా రిఫరెన్స్ చేయవచ్చు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ సమయంతో సంబంధం లేకుండా మహిళా టీచర్ ని అర్ధరాత్రి వరకు మీ ఆఫీసులో కూర్చోబెట్టాల్సిన పని ఏమిటి? అర్ధరాత్రి వీడియో కాల్ చేయడమేంటి? ఇది ఏ రకమైన సంస్కృతి? ఎమ్మెల్యే స్ధానంలో ఉన్న వ్యక్తి మాట్లాడిన వీడియో కాల్ వివరాలు బాధితురాలు మీడియాకు చూపిస్తుందంటే ఏ స్ధాయిలో హింసకు గురి చేస్తున్నారో అర్దం అవుతుంది. తోటి ఉపాధ్యాయులు ముందు బాధితురాలు రోదిస్తున్నా... ఆమెను తిట్టడం ఏ రకమైన దాష్టీకం.దిశ యాప్ రద్దుతో రక్షణ లేని ఆడబిడ్డలు:మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో దిశ యాప్ ను ప్రవేశపెట్టాం. ఆపదలో ఉన్న బాధితురాలు దిశ యాప్ కు పోన్ చేసినా, ఫోన్ ను అటూ ఇటూ ఊపినా వెంటనే పోలీసులు వచ్చి ఆదుకునేవారు. తగిన సహాయం చేసేవారు. అలాంటి దిశ యాప్ ను ఈ ప్రభుత్వం మరుగున పెట్టింది. ఇవాళ ఆపదలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడు లేడు. చంద్రబాబు ప్రభుత్వం మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేసింది. దిశ యాప్ ను తుంగలో తొక్కి పనిచేయని యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ పరిపాలన చూసి మహిళలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.ఇవీ అధికార పార్టీ నేతల అరాచకాలుకూటమి ప్రభుత్వం రాగానే అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం చేసిన దాష్టీకాన్ని అందరం చూశాం. అధికార పార్టీకే చెందిన ఓ బాధిత మహిళ ఆయన వేధింపులకు తాళలేక ఈ రాష్ట్రంలో రక్షణ లేదని ఏకంగా హైదారాబాద్ వెళ్లి మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ఈ రాష్ట్రంలో తన కష్టం చెప్పుకుంటే ప్రాణహాని కలుగుతుందన్న భయంతో పక్కరాష్ట్రానికి వెళ్లి మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంది. చంద్రబాబునాయుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి నుంచి పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న దగ్గర నుంచి మహిళలమీద ఈ దాష్టికాలు మొదలయ్యాయి. ఆ రోజు లక్ష్మి పార్వతిని నెపంగా చూపి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. అదే సంస్కృతిని ఆ పార్టీ నాయకులు ఇంకా కొనసాగిస్తున్నారు. అందుకే వాటిని చంద్రబాబు ఆపడం లేదు సరికదా కనీసం ఖండించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత దారుణాలు జరుగుతున్నా పోలీసులు కేసు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్నారు.రాష్ట్రంలో అడుగడుగునా మహిళల గౌరవాన్ని తుంగలో తొక్కుతున్నారు. వారిపై ప్రతిచోట టీడీపీ నాయకులు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులు నుంచి తిరుపతి అరుంధతి కాలనీలో టీడీపీ నాయకుడు ఉదయ్... స్థానిక మహిళమీద లైంగిక వేధింపులుకుపాల్పడ్డారు. అదే విధంగా మరో టీడీపీ నేత పల్లపాటి సుబ్రమణ్యం కుమారుడు అభినవ్ ప్రేమ పేరుతో బాలికను తీసుకెళ్లి మోసగించి... నాలుగు తర్వాత విడిచిపెట్టాడు. బాధిత బాలిక తల్లి వేదనతో ఆత్మహత్యాయత్నం చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదు.రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కూడా స్థానికంగా ఓ బాలికను మోసగించి గర్భవతిని చేశాడు. సదరు బాధిత బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చినా సంబంధం లేదంటూ బుకాయిస్తే.. స్ఠానిక టీడీపీ నేతలు దాన్ని కప్పిపుచ్చాలని చూడ్డం అత్యంత దారుణం.అనంతరపురం జిల్లాలో ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామానికి సమీపంలోని రామగిరిలో ఓ దళిత బాలికపై అధికార పార్టీకి చెందిన 14 మంది పదే,పదే అత్యాచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో షేక్ మీరా అనే వ్యక్తి అర్ధరాత్రి ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలికకు వైద్య పరీక్షలు చేస్తే విషయం బయటకు వచ్చింది. పల్నాడు జిల్లాలో బొడ్డు వెంకేటశ్వరరావు అనే టీడీపీ నాయకుడు .. ఓ అంగన్వాడీ టీచరును కులం పేరుతో దూషించి ఆమెను వేధింపులు గురిచేశాడు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో లక్ష్మీ, వరలక్ష్మీ అనే ఇద్దరు మహిళల దుస్తులు చింపి, వారి జుత్తుపట్టుకుని ఈడ్చుకెళ్లి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ మీడియాలో నీతులు చెబుతాడు. కిరణ్ రాయల్ అరాచకాలపై లక్ష్మీరెడ్డి అనే బాధిత మహిళ అన్ని ఆధారాలతో మీడియాకు వివరాలిచ్చింది. కిరణ్ రాయల్ తనను ఏ రకంగా ఆర్ధికంగా దోచుకున్నాడో ఆధారాలతో చెప్పింది. కానీ అతడిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి నాయకులుగా మీరు ఇన్ ఛార్జ్ బాధ్యత ఇస్తారు?బిల్లులు పాస్ అవ్వాలన్నా, పనులు జరగాలన్నా, అవసరాలు తీరాలంటే మహిళల మీద ఈ రకమైన వేధింపులకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసల టీడీపీ కార్యకర్త.. కోటిపల్లి రాజు..9వ తరగతి బాలికమీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక గర్భవతి కావడంతో విషయం బయటకు వచ్చింది. ఇదే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గులో ఇద్దరు విద్యార్థినులు మీద టీడీపీ చెందిన యువకులు గ్యాంగ్ రేప్ చేస్తే.. ఎలాంటి చర్యలు లేవు. కేవలం సెటిల్మెంట్లు, పంచాయితీలు చేయడం లేదంటే నిందితులను వేరే ఊరుకు తరలించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. ఇది ఇవాళ వచ్చిన సంస్కృతి కాదు. 2014లో కూడా మనం చూశాం...ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి జరిగితే.. చంద్రబాబునాయుడు ఇలాగే సెటిల్మెంట్ చేశారు.సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం- ఆడబిడ్డల కష్టాలుమహిళలకు రేషన్ కార్డు నుంచి ఏం కావాలన్నా, ఏం దరఖాస్తు చేసుకోవాలన్నా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల దగ్గరకి వెళ్లాల్సిన ఖర్మ పట్టించారు. గతంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏం కావాలన్నా గుమ్మం దగ్గరకే అందేవి. అర్హత ఉంటే ఈ సంక్షేమపథకం వస్తుందని నేరుగా ఇంటికే వెళ్లి చెప్పేవారు. వారికి కావాల్సిన పత్రాలు తీసుకుని సచివాలయంలో దరఖాస్తు చేసేవారు. ఎలాంటి సమస్య ఉన్నా తీరేది. ఏ నాయకులను ఆశ్రయించకుండా, ఎవరికీ కప్పం కట్టకుండా అన్ని పనులు అయ్యేవి. ఈ ప్రభుత్వంలో భర్త చనిపోయిన ఒంటరి మహిళా ఆరోతరగతి చదువుతున్న కూతురికి సీటు కావాలని అడిగితే కూడా అత్యంత నీచంగా లైంగికంగా వేధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోని సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో ఇప్పుడు నాయకులను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలోవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా మహిళల అకౌంట్ లో జమ చేస్తే వారికి ఆర్ధిక స్వావలంబన ఉండేది. నేడు అవన్నీ పూర్తిగా అటకెక్కాయి. నేడు మహిళలకు అవేవీ అందకపోగా.. మహిళలపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి.మహిళల తరపున వైఎస్సార్సీపీ ఆందోళన:ఇన్ని అరాచకాలు జరుగుతున్నా మహిళా హోమంత్రిగా అనిత కానీ, ప్రశ్నిస్తానన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మహిళలపై దాడులు చేస్తే తాట తీస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేస్తున్నారు ?. ప్రశ్నిస్తానన్న నాయుకుడికి బాధిత మహిళలు వాట్సప్ లో తమ ఆవేదనను పంపిస్తున్నారు. కానీ ఉపముఖ్యమంత్రికి సినిమాలకే టైం సరిపోవడం లేదు. ఇలాంటి వీడియోలు చూడ్డానికి ఏం టైం సరిపోతుంది. హోంమంత్రి అనిత తన బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయారు. నిరంతరం జగన్మోహన్ రెడ్డిని దూషించడానికే ఆమెకు టైం అంతా వెచ్చిస్తోంది. హోం శాఖ బాధ్యతలు తప్ప అన్ని పనులు చేస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తిపోతల పథకం భ్రమరావతిలో బిజీగా ఉన్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా ఏం జరగనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇలాంటి దాష్టీకాలకు పాల్పడుతున్నా.. చంద్రబాబు కళ్లు మూసుకుని పాలన సాగిస్తున్నారు. ఈ రకమైన అరాచకపాలనపైవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళాన్ని తెలియజేస్తూ ఆందోళన చేస్తామని మేయర్ భాగ్యలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఆ రాష్ట్రంలో భారీగా బయటపడ్డ బంగారు నిక్షేపాలు
భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయలు దాటేసి చాలా రోజులైంది. ఇలాంటి సమయంలో ఒడిశాలో భారీ స్టాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) వెల్లడించింది.దేవ్ఘర్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్థారించారు. అయితే సుందర్గఢ్, నబరంగ్పూర్, కియోంఝర్, అంగుల్, కోరాపుట్లలో మాత్రమే కాకుండా.. మయూర్భంజ్, మల్కన్గిరి, సంబల్పూర్, బౌధ్లలో అన్వేషణ పనులు జరుగుతున్నాయి.ఇప్పటి వరకు.. ఒడిశాలో బంగారు నిక్షేపాల నిల్వలు ఎంత ఉన్నాయనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. అయితే నిల్వలు 10 నుంచి 20 మెట్రిక్ టన్నులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.ఇది భారతదేశం దిగుమతి చేసుకుంటున్న బంగారం పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.ఇదీ చదవండి: 'ఇండియాలో ధరలు ఇలా ఉన్నాయ్': ఎన్ఆర్ఐ షాక్గత సంవత్సరం భారతదేశం 700 - 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. దేశంలో గోల్డ్ ఉత్పత్తి తక్కువగా ఉండటమే ఎక్కువగా దిగుమతి చేసుకోవడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఉత్పత్తి పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. దిగుమతి కొంత తగ్గుతుందని పలువురు భావిస్తున్నారు. -
ముగిసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
సాక్షి,న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎంపికపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ భేటీలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది ఖరారు కానుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఎన్డీయే పక్షాలు ప్రధాని మోదీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి. -
ఆసియాకప్లో టీమిండియాపై విజయం మాదే: పాక్ క్రికెట్ డైరక్టర్
ఆసియాకప్-2025 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలి అడుగు వేసింది. ఈ మెగా టోర్నీకి 17 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా సల్మాన్ అలీ అఘా ఎంపికయ్యాడు. అదేవిధంగా స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లపై సెలక్టర్లు వేటు వేశారు.అయితే జట్టు ప్రకటన అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్లో భారత జట్టును ఓడించే సత్తా పాక్కు ఉందని జావేద్ అభిప్రాయపడ్డాడు. జట్టులోని ప్రతీ ఆటగాడు టీమిండియా విసిరే సవాల్కు సిద్ధంగా ఉన్నారని ఈ పాక్ మాజీ పేసర్ తెలిపాడు. కాగా పాకిస్తాన్పై టీ20ల్లో భారత్కు అద్బుతమైన రికార్డు ఉంది. కానీ పాక్ జట్టు మాత్రం ఆసియా కప్-2022లో విజయాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 13 మ్యాచ్లలో ముఖాముఖి తలపడగా.. భారత్ తొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ మూడు మ్యాచ్ల్లో గెలుపొందింది. పాక్ చివరగా దుబాయ్లో జరిగిన 2022 ఆసియా కప్ సూపర్ ఫోర్లో భారత్పై టీ20 విజయం సాధించింది."పాకిస్తాన్ టీ20 జట్టు టీమిండియాను ఓడించగలదు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ మేము ఎంపిక చేసిన ఈ 17 మంది సభ్యుల జట్టు ఏ టీమ్నైనా ఓడించగలదు. అయితే వారిపై మేము ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదు.ఈ జట్టుపై నాకు చాలా నమ్మకం ఉంది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లను మేము పూర్తిగా పక్కన పెట్టలేదు. ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశాము. సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖార్ జమాన్ వంటి ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు. అందుకే వారిని జట్టులో కొనసాగించాము. సైమ్ తన రీ ఎంట్రీలో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ తర్వాత తన రిథమ్ను అందుకున్నాడు. ప్రతీ ప్లేయర్కు జట్టులోకి తిరిగొచ్చేందు ఎల్లప్పుడూ తలపులు తెరిచే ఉంటాయి. ఎవరు మెరుగైన ప్రదర్శన చేస్తే వారు ఖచ్చితంగా జట్టులో ఉంటారు. వారే పాక్ తరపున ఆడటానికి అర్హులు" జావేద్ పేర్కొన్నాడు.ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్చదవండి: Asia Cup 2025: పాక్-భారత్ మ్యాచ్కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు! -
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్
సాక్షి,విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎన్నికల హామీని చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టు కోలేకపోతుంది. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగకుండా కాపాడుతామని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 32 విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లను పిలిచిన స్టీల్ యాజమాన్యం.. సెప్టెంబర్ 9వ తేదీ టెండర్ల దాఖలకు ఆఖరి తేదీ విధించింది.ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) విధానంలో1)టీపీపీ, 2) ఎస్ ఎం ఎస్-1&2, 3)ఎంఎంఎస్ఎం, 4)ఎస్బిఎం, 5)డబ్ల్యూఆర్ఎం-1&2, 6) మాదారం మైన్స్, 7) రోల్షాప్అండ్ రిపేర్ షాప్ -1&2, 8) సిఎంఎస్, 9) ఫౌండ్రీ, 10)ఎస్టీఎం, 11)ఈఎన్ఎండి, 12) బ్లాస్ట్ ఫర్నిస్-1,2&3లను ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్లను పిలిచింది. -
'ఇండియాలో ధరలు ఇలా ఉన్నాయ్': ఎన్ఆర్ఐ షాక్
కెనడాలో పాలు రూ.396, బ్రెడ్ రూ.230 అని ఇప్పటికే చదువుకున్నాం. ఇప్పుడు తాజాగా భారతదేశంలో కూడా ఒక కప్పు టీ తాగడానికి రూ.1000 ఖర్చు చేశానని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. దుబాయ్కు చెందిన భారతీయ ట్రావెల్ వ్లాగర్ & రేడియో ప్రెజెంటర్ 'పరీక్షిత్ బలోచి'.. ఇండియాలో పెరుగుతున్న జీవన వ్యయం గురించి వెల్లడించడం చూడవచ్చు. ముంబైలోని ఒక హోటల్లో ఒక కప్పు టీ తాగడానికి తనకు రూ. 1,000 ఖర్చైన విషయాన్ని వెల్లడించాడు.వస్తువుల ధరలు కొంత తక్కువ ఉంటాయని.. అప్పుడప్పుడు భారతదేశానికి వస్తూ ఉంటానని బలోచి చెప్పాడు. ఎన్నారైలు బలమైన విదేశీ కరెన్సీల నుంచి ప్రయోజనం పొందుతారు. ఇండియాకు వచ్చి విదేశీ కరెన్సీలతో.. ఖర్చులు చేస్తూ ఉంటారు. అయితే ఇకపై భారతదేశంలో అది సాధ్యం కాదని అన్నారు. తాను దిర్హామ్లలో సంపాదిస్తున్న ఎన్ఆర్ఐ అయినప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యానని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: పిల్లలు కనడానికి సిద్దమవుతున్న రోబోలు!ముంబై వంటి నగరాల్లో జీవన విధానం, జీవన వ్యయం అన్నీ మారాయి. ప్రస్తుతం ముంబై దుబాయ్ మాదిరిగా ఖరీదైనదిగా అనిపిస్తోందని పరీక్షిత్ బలోచి అన్నాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత నేను మాత్రమే 'గరీబ్' అనిపించిందని వ్యాఖ్యానించాడు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Parikshit Balochi | RJ | Emcee | Travel | Lifestyle | Dubai (@parikshitbalochi) -
ఉన్మాదుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి,విశాఖ: మహిళల్ని వేధించేందుకే టీడీపీ నేతలకు చంద్రబాబు ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మంచ నాగ మల్లేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల టీడీపీ ఎమ్మెల్యేల దురాగతాలపై మంచ నాగ మల్లేశ్వరి స్పందించారు.‘ఎమ్మెల్యే కూన రవి కుమార్ మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధించారు. పనులు కావాలంటే తమ కోరికలు తీర్చాలని మహిళలను టీడీపీ ఎమ్మెల్యేలు వేధిస్తున్నారు. దళిత మహిళ ఉద్యోగిని అని చూడకుండా అందరి ముందు అవమానించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వల్ల ఓ మహిళ ఆత్మహత్యకు చేసుకుంది.టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మహిళను లైంగికంగా వేధించారు.ఎమ్మెల్యే అదిమూలం వేదింపులకు భయపడి ఆ మహిళ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది.చోడవరం ఎమ్మెల్యే అడిగిన సీటు ఇవ్వలేదని ఆమెను ఇబ్బంది పెట్టారు. మహిళలను వేధించడానికి టీడీపీ నేతలకు చంద్రబాబు ఎమ్మెల్యేల పదవులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. అనంతపురంలో టీడీపీ నేతలు మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టారు. టీడీపీలో ఉన్న మహిళలకు అన్యాయం జరిగిన హోం మంత్రి స్పందించలేదు.చేతగాని హోం మంత్రి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. -
22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ
సినిమా సెలబ్రిటీలకు ప్రేమ, పెళ్లి, రిలేషన్ లాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదా అనే సందేహం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన మూడేళ్లకే విడిపోయారు లాంటివి వింటూనే ఉంటాం. అలానే లేటు వయసులోనూ కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అని హింట్స్ కూడా ఇస్తుంటారు. ఇప్పుడు 'కెవ్వు కేక' బ్యూటీ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. ఐటమ్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ గబ్బర్ సింగ్ సినిమాలో 'కెవ్వు కేక' పాటలో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతానికి సినిమాలేం చేయట్లేదు గానీ వ్యక్తిగత విషయాల్లో ఏదో ఒకలా వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా తనకు రెండో పెళ్లిపై ఆసక్తి ఉందని కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా, మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. 'నేను చాలా రొమాంటిక్ మనిషిని. ప్రేమపై నాకు ఎంతో నమ్మకముంది. సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే' అని చెప్పుకొచ్చింది. అలానే ప్రస్తుతం వివాహం చేసుకుంటున్న యువత.. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని, అయితే భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనని అందరూ స్వార్థపరురాలిగా చూశారని, కానీ విడాకుల తీసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నానని మలైకా చెప్పుకొచ్చింది.హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని మలైకా అరోరా.. 1998లో పెళ్లి చేసుకుంది. అయితే దాదాపు 19 ఏళ్ల పాటు సంసారం చేసిన తర్వాత వీళ్లిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ చేసింది. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. మరి ఏమైందో ఏమో గానీ అర్జున్-మలైకా విడిపోయారు. ఈమెకు అర్హాన్ ఖాన్ అని 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు రెండో పెళ్లిపై మనసు మళ్లడం చూస్తుంటే.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) -
తిరుమల వెళ్లే భక్తుడి బ్యాగులో తాబేలు..ఆరా తీస్తే..!
తిరుమల: తరుమల కొండపైకి వెళ్లే భక్తులను తనిఖీలు చేయడమనేది సర్వసాధారణం. ఇలా ఒక భక్తుడ్ని తనిఖీ చేస్తే అతని బ్యాగులో తాబేలు కనిపించింది. ఇది అక్కడ తనిఖీ చేసే సిబ్బందికి కూడా కొత్తగానే అనిపించింది. తాబేలు ఏంటి.. బ్యాగులో ఎందుకు తీసుకెళుతున్నావ్ అని సదరు భక్తుడిని అడిగితే దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది. తనకు దారిలో దొరికిందని, బ్యాగులో వేసుకున్నానని బదులిచ్చాడు. ఏమైనా విలువైన వస్తువులు దొరికితే దాన్ని దాచుకుంటారు.మరి మనోడు తాబేలను బ్యాగులో వేసుకున్నానంటూ చెప్పిన సమాధానంతో అక్కడ సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. సర్లే అనుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. ఆ తాబేలును ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. అసలు తాబేలు కనిపిస్తే బ్యాగులో వేసుకున్నానంటూ అతను చెప్పిన సమాధానం చూస్తే నవ్వొస్తుంది కదూ.. ఇది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద చోటు చేసుకున్న ఘటన. తనిఖీలు చేస్తున్న క్రమంలో తాబేలు వ్యవహారం వెలుగుచూసింది. తాబేళును స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు -
పాక్-భారత్ మ్యాచ్కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు!
వరల్డ్ క్రికెట్లో బిగ్గెస్ట్ రైవలరీలలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి. ఈ దాయాదుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయాల ఉద్రిక్తల కారణంగా రెండు జట్లు కేవలం ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లు మాత్రమే తలపడతున్నాయి.దీంతో ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరు రోజున యావత్తు క్రికెట్ ప్రపంచం టీవీలకు అతుక్కుపోతారు. అయితే అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమవుతోంది. ఈ చిరకాల ప్రత్యర్ధిలు మరోసారి అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నారు.ఆసియాకప్-2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా పాక్-భారత్ జట్లు తలపడనున్నాయి. అయితే భారత్-పాక్ మ్యాచ్కు ఉన్న క్రేజును సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) భారీగా క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఆసియాకప్లో భారత్ ఆడే మ్యాచ్ల సమయంలో పది సెకన్ల సెకన్ల ప్రకటనకు రూ. 14 నుంచి 16 లక్షలు సోనీ నెట్వర్క్ నిర్ణయించినట్లు సమాచారం. భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్కు కూడా ఇదే ధర వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా 2031 వరకు ఆసియా కప్ మీడియా హక్కులను 170 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో వెయ్యి కోట్ల పైగా)కు సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మ్యాచ్లు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో పాటు సోనీ లివ్లో యాప్లో కూడా ప్రసారం కానున్నాయి.ఇక 8 మ్యాచ్లు పాల్గోనే ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆసియాకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా.. బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో భారత జట్టును వెల్లడించనుంది.ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ -
AP: ఇలా ఉంటే పింఛన్ వెరిఫికేషన్ అవసరమా..?
కాణిపాకం: పుట్టుకతోనే పక్షవాతం. మంచానికే పరిమితం. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఆ యువకుడిపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. జాలి, దయ లేకుండా పింఛన్ తొలగించేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు.. బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన సమ్మద్, సాహిన్ దంపతులు దినసరి కూలీలు. వీళ్లకు సొంత ఇల్లు లేదు. సెంటు జాగా లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ దంపతులకు ఇంటి స్థలం మంజూరు చేశారు. వీరి పెద్ద కుమారుడు హర్షద్ పుట్టుకతోనే పక్షవాతానికి గురయ్యాడు. పక్షవాతం నుంచి రక్షించేందుకు 19 సవరాల బంగారాన్ని అమ్మేశారు. అయినా కుమారున్ని పక్షవాతం నుంచి కాపాడలేకపోయారు. మందులు, మాత్రలతోనే ప్రాణంతో నిలబెడుతున్నారు. నెలవారీగా రూ.7,500 ఖర్చువుతోంది. 20 ఏళ్లు దాటినా అతని ఆలనాపాలన మొత్తం తల్లిదండ్రులే చూసుకుంటున్నారు. ఇప్పుడు అతనికి చూపు కూడా మందగించింది. ఈ దుస్థితిని గుర్తించి వైద్యులు 2013లో సదరన్ సర్టిఫికెట్ జారీచేశారు. అప్పటినుంచి పింఛన్ మంజూరవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్ల పరిశీలన చేపట్టారు. ఈ పరిశీలనలో భాగంగా ఐదుగురు అధికారులు బృందంగా ఇంటివద్దకు వచ్చి వికలత్వం 40శాతం కంటే తక్కువగా ఉందని నోటీసు ఇచ్చారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు బోరుమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మనిషి ఎముకల గూడు మాదిరి ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది. అతని పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనక మానరు ఎవరైనా.. మరి ఇలా ఉన్న మనిషికి సర్టిఫికేట్.. దానికి వెరిఫికేషన్ అంటూ పింఛన్ పెండింగ్లో పెట్టడం ఎంతవరకూ కరెక్ట్ అనేది సదరు అధికారులకే తెలియాలని విమర్శకులు అంటున్నారు. తనను చూస్తే జాలేయడం లేదా?అనేది మాత్రమే అతని చూపుల్లో కనిపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
రూ.1.30 లక్షలు తగ్గిన ధర: ఇప్పుడు ఈ బైక్ రేటు ఎంతంటే?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కవాసకి 'కేఎల్ఎక్స్230' బైకును రూ. 1.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరకు అందిస్తోంది. గత ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 3.30 లక్షలు. అంటే సంస్థ ధరను లోకలైజేషన్ కారణంగా ఇప్పుడు రూ. 1.30 లక్షలు తగ్గించింది.స్థానీకరణ కారణంగానే కంపెనీ తన కేఎల్ఎక్స్230 ధరను చాలా తగ్గించింది. ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఈ బైక్ హీరో Xpulse 210, కేటీఎం 390 ఎండ్యూరో ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.కంపెనీ తన కేఎల్ఎక్స్230 బైకును స్థానీకరణ చేయడం మాత్రమే కాకుండా.. కొన్ని యాంత్రిక మార్పులను కూడా చేసింది. ముందు భాగంలో 20 మిమీ, వెనుక 27 మిమీ సస్పెన్షన్ తగ్గించింది. అయితే రెండు చివర్లలో ఇప్పుడు పెద్ద డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. 233 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ 19 హార్స్ పవర్, 19 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఈ బైకులో లభిస్తుంది. -
ఈ హీరోయిన్లో ఈ టాలెంట్ కూడా ఉందా? వీడియో వైరల్
కృష్ణాష్టమి అనగానే అందరూ రాధ, గోపికలుగా తయారై తెగ సందడి చేశారు. హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) కూడా అందంగా ముస్తాబైంది. అయితే చేతిలో వేణువు పట్టుకుంది. ఊరికే ఫోటో కోసమే అలా స్టిల్ ఇచ్చిందనుకునేరు. కానే కాదు, ఫ్లూట్తో అద్భుతంగా ఓ పాట ట్యూన్ వినిపించింది. ఇది చూసిన అభిమానులు.. మీరు మల్టీటాలెంటెడ్ అని మెచ్చుకుంటున్నారు. కాగా అదా శర్మ.. లాక్డౌన్లో ఫ్లూట్ నేర్చుకుంది.సినిమాల విషయానికి వస్తే..అదా శర్మ.. 1920 అనే హారర్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి, సీ.డీ: క్రిమినల్ ఆర్ డెవిల్ వంటి చిత్రాల్లో నటించింది. ద కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ అయిన అదా చివరగా తుమ్కో మేరీ కసమ్ మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
చిరంజీవికి మా సమస్యలు తెలుసు: ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్
టాలీవుడ్లో గత కొన్నిరోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే తమకు 30 శాతం వేతనాలు పెంచాలని వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుండగా.. నిర్మాతలు మాత్రం దీనికి అంగీకరించట్లేదు. తమ షరతులకు ఒప్పుకొంటేనే వేతనాల పెంపు ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ సమస్య ఎటు తేలకుండా అలానే ఉంది. మెగాస్టార్ చిరంజీవి.. ఆదివారం పలువురు చిన్న నిర్మాతలు కలిశారు. సోమవారం ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఈ క్రమంలోనే ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ప్రెసిడెంట్ తమ సాధకబాధలు చెప్పుకొచ్చారు.'రోజూ ఉదయం 5 గంటలకు వస్తేనే మా బతుకు. పెద్ద పెద్ద సినిమాలు తీసిన అప్పటి నిర్మాతలు మా కష్టాన్ని పట్టించుకునేవారు. కానీ ఇప్పటి నిర్మాతలకు మా గోడు పట్టడం లేదు. మాకు వచ్చే డబ్బులు.. మాకొస్తున్న జబ్బులకు సరిపోతుంది. కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా మమ్మల్ని దూషిస్తున్నారు. కార్మిక చట్టాల బట్టి అంటున్నారు మరి మీరు 8 గంటల వర్క్ చేయించుకుంటున్నారా ?? 12-14 గంటలు మేము పనిచేస్తున్నాం. 9 నుంచి 9 గంటల వరకు అని కొందరు నిర్మాతలు అంటున్నారు కానీ అది అయ్యే పనికాదు. షూటింగ్స్కి రావాలి అంటే మేము 9 గంటలకు కాకుండా మా వర్కర్స్ని 7 గంటలకే రమ్మనాలి. రాత్రి 9 గంటలకే షూట్ ముగిస్తారా అంటే అది చేయరు. మేము షూటింగ్ ముగించుకుని వచ్చేపాటికి రాత్రి ఒంటి గంట అయిపోతుంది'(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)'12 గంటలు అంటారు కానీ మేము 15-16 గంటలు వర్క్ చేస్తున్నాం. కార్మిక చట్టాలు ప్రకారం వెళ్దామని కొందరు నిర్మాతలు అంటున్నారు మాకు అభ్యంతరం లేదు. చట్ట ప్రకారమే మాకు 8 గంటలు పని గంటలు ఉంటాయి. డొనేషన్ తీసుకుంటున్న డబ్బులతో ఆ కుటుంబానికి అండగా ఉంటున్నాం. యూనియన్ ఎప్పడు కార్మికుడికి అండగా ఉంటుంది నిర్మాతలు ఉండటం లేదు. మా గురువు గారు దాసరి.. అప్పుడు చెప్పిన పద్ధతి లోనే మేము వెళ్తున్నాం. నిర్మాతలు మా పై చేస్తున్న దుష్ప్రచారాలను మానండి. చిరంజీవి గారికి మా సమస్యలు తెలుసు. మా సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం' అని ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకట కృష్ణ చెప్పారు.సినీ కార్మికుల మహిళా యూనియన్ ప్రెసిడెంట్ లలిత మాట్లాడుతూ.. మేము షూటింగ్లో ఎంతో కష్ట పడతాం. మాకు టాయిలెట్స్ కూడా ఉండవు. వాటర్ కేన్స్ కూడా భుజాన మోసుకొని వెళ్ళాలి. మా బాధలు నిర్మాతలు అర్థం చేసుకొవాలి. సండే కట్ చేస్తాం అంటున్నారు అలా చేస్తే మా పొట్ట కొట్టినట్టే. ప్రభుత్వం తరఫున మీటింగ్ పెడితే మా కష్టాలు తెలియ చేస్తాం అని అన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) -
అమెరికాలో కాల్పుల మోత.. ఉలిక్కిపడిన న్యూయార్క్
వాషింగ్టన్:అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక కాలమానం ప్రకారం న్యూయార్క్ నగరంలో ఆదివారం ఉదయం 3.30గంటల సమయంలో జరిగిన కాల్పుల మోతతో న్యూయార్క్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్ ప్రాంతంలోని క్రౌన్ హైట్స్లో ఉన్న ‘టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్’ అనే రెస్టారెంట్లోకి చొరబడ్డ అగంతకుడు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఎనిమిదిమంది గాయపడ్డారు.కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.కాల్పుల ఘటనపై న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ జెస్సికా టిష్ స్పందించారు. కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఘటన స్థలంలో కనీసం 36 బుల్లెట్ కేసింగ్స్ను సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా,ఈ కాల్పులు న్యూయార్క్ నగరంలో జరిగిన తీవ్రమైన కాల్పుల ఘటనల్లో ఒకటిగా భావిస్తున్నారు. -
ఆసియాకప్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్ టీ20 టోర్నీకి మరో 22 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ప్రకటించే అవకాశముంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ అనంతరం భారత జట్టుకు ఒక నెల పాటు విరామం లభించింది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో టీమిండియా తలపడాల్సిండేది.కానీ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ సిరీస్ తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో భారత ఆటగాళ్లకు లాంగ్ బ్రేక్ దొరికింది. ఈ క్రమంలో టీమిండియా మెనెజ్మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆసియాకప్నకు ముందు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు యూఏఈలో ఒక ప్రత్యేక శిబిరాన్ని చేయనుంది. ఇందుకోసం టీమిండియా నాలుగు రోజుల ముందే యూఏఈ గడ్డపై అడుగుపెట్టనుంది. అయితే తొలుత ఆసియాకప్కు సిద్దం కావడానికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం.కానీ టీమ్ మెనెజ్మెంట్ మాత్రం యూఏఈ పరిస్థితులు అలవాటు పడేందుకు అక్కడకి వెళ్లి తమ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఈ స్పెషల్ క్యాంపు చాలా మంది భారత ఆటగాళ్లకు ఉపయోగపడనుంది.ఐపీఎల్-2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లోపించింది. అటువంటి వారు ఈ క్యాంపును సన్నాహాకంగా ఉపయోగించుకోవచ్చు. ఇక దాయాది పాకిస్తాన్ కూడా ఈ మెగా టోర్నీకి తమ సన్నాహాకాలను ప్రారంభించనుంది. అయితే భారత్కు భిన్నంగా పాక్ జట్టు అఫ్గాన్-యూఏఈలతో ట్రై సిరీస్ ఆడనుంది.అంతేకాకుండా మెన్ ఇన్ గ్రీన్ ఐసీసీ ఆకాడమీలో నాలుగు రోజుల పాటు ఒక ప్రత్యేక క్యాంపును నిర్వహించనుంది. ఈ టోర్నీ కోసం పీసీబీ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలకు చోటు దక్కలేదు. ఈ ఆసియా జెయింట్స్ పోరులో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వ్యవహరించనున్నాడు.చదవండి: వాళ్ళేమి తోపు ఆటగాళ్లు కాదు.. సెలక్టర్లు మంచి పనిచేశారు: పాక్ మాజీ కెప్టెన్ -
వైద్య పరీక్షలంటే ఎందుకంత భయం : పీవీ సింధు
హైదరాబాద్: ప్రజలంతా ఫిట్నెస్ శిక్షణను ఎంత సీరియస్గా తీసుకుంటారో, ముందస్తు వైద్య పరీక్షలు కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు పిలుపునిచ్చారు. క్రీడల్లో గానీ, రోజువారీ జీవితంలోగానీ అవి అత్యంత అవసరమైనవని ఆమె చెప్పారు. జూబ్లీహిల్స్లోని జీవీకే డయాగ్నస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ తొలి వార్షికోత్సవంలో ఆమె మాట్లాడారు. మంచి ఆరోగ్య స్వేచ్ఛ అనే స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో తన జీవనయానంలో క్రమశిక్షణ, ఇబ్బందులను అధిగమించేందుకు త్వరగా స్పందించాల్సిన అవసరం లాంటి విషయాలు పంచుకున్నారు.జీవీకే కుటుంబానికి చెందిన కేశవరెడ్డి, వీణారెడ్డిలతో జరిగిన ఒక చర్చ.. సాధారణ విషయాల నుంచి సీరియస్ అంశాలవైపు మళ్లింది. ఒలింపిక్ పతకం సాధించడం కంటే ఐస్ క్రీం తినకుండా ఉండడం కష్టమా అన్నప్పుడు.. సింధు నవ్వేసింది. తర్వాత మాట్లాడుతూ, “పతకాలు సాధించడం కష్టమే. కానీ, ఐస్ క్రీం వద్దనడం ఇంకా కష్టం. కానీ క్రమశిక్షణ, కోలుకోవడం, ముందస్తు సంరక్షణల వల్లే నేను ఇంకా ఆడగలుగుతున్నాను. నిలకడ అనేది చాలా ముఖ్యం. గాయాలు కాకుండా చూసుకోవడండ, అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడడంతోనే మనం ఎక్కువకాలం ఆటలో ఉండగలం” అని చెప్పారు.తన సొంత అనుభవాల గురించి సింధు వివరిస్తూ శిక్షణలాగే త్వరగా కోలుకోవడం, వెంటనే స్పందించడం ఎందుకు ముఖ్యమో ఇలా చెప్పారు. “మనమంతా క్రీడల్లో ఫిట్నెస్ పరీక్షలను గౌరవిస్తాం. మరి జీవితంలో వైద్యపరీక్షలంటే ఎందుకు భయపడతాం? మనం ఎంత కష్టపడి శిక్షణ తీసుకుంటామన్నది కాదు, ఎప్పుడు ముందుకెళ్లాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల సామర్థ్యం పెరుగుతుంది. కానీ మహిళలకు వ్యాధుల నివారణ చాలా కీలకం. మీరు పెద్దస్థాయిలో పోటీ పడుతున్నా, లేదా చురుగ్గా ఉన్నా ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలి. దానివల్ల ఏమైనా సమస్యలున్నా త్వరగా తెలుస్తాయి, మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండగలరు” అని వివరించారు.హైదరాబాద్లోని వేగవంతమైన జీవితంలో సింధు చెప్పే విషయాలు చాలా ముఖ్యం. “ఏదో సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లడం కాకుండా ఏటా వైద్యపరీక్షలు చేయించుకోవడం అవసరం. అనారోగ్యం వచ్చినప్పుడు పరుగెత్తడం కంటే ముందస్తు వైద్య పరీక్షలకు తప్పకుండా వెళ్లాలి. మీరు పతకాల కోసం ప్రయత్నిస్తున్నా, డెడ్లైన్లు వెంటాడుతున్నా, లేదా ఫిట్గా ఉన్నా కూడా ఎర్రజెండా వచ్చేవరకు ఆగద్దు. వైద్యపరీక్షలను ఒక అలవాటుగా చేసుకోండి” అని కోరారు.మహిళలు తమ ఆరోగ్యాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తారని సింధు అన్నారు. “ఆరోగ్యం విషయంలో అలసత్వాన్నుంచి మనం స్వాతంత్య్రం పొందాలి. డాక్టర్ గూగుల్ను నమ్మకండి.. వైద్య పరీక్షలు చేయించుకోండి. ఏదైనా జరిగేవరకు వేచి చూడడం మంచిది కాదు. ఈ లోపే స్పందించాలి. జీవితంలో వెనకబడిపోవడం కాకుండా ఏది అవసరమో దానిపై దృష్టిపెట్టే స్వేచ్ఛ మీకు ముందస్తు వైద్యపరీక్షలతో వస్తుంది” అని సింధు తెలిపారు.ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ, “ఇళ్లలోనైనా, ఆఫీసుల్లోనైనా మహిళలు తమ గురించి తక్కువ ఆలోచిస్తారు. మంచి ఆరోగ్య స్వేచ్ఛ అంటే మీ సొంత అవసరాలు, విశ్రాంతి, సంపూర్ణ ఆరోగ్యం, ఎప్పటికప్పుడు ముందస్తు వైద్య పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడమే. ఇవన్నీ లగ్జరీలు కావు.. అత్యవసరమైనవే. చిన్న చిన్న అలవాట్లే మీ జీవితాన్ని కాపాడతాయి. చిట్టచివరి నిమిషంలో పరుగెత్తాల్సిన పని ఉండదు” అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రముఖ డయాబెటాలజిస్టు డాక్టర్ ఎన్జీకే శాస్త్రి కూడా సమస్యలను ముందుగా గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటే దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు ఎలా కలుగుతాయో సవివరంగా చెప్పారు.జూబ్లీహిల్స్లోని జీవీకే డయాగ్నస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ తొలి సంవత్సరంలోనే రోగుల అవసరాలకు సమగ్ర పరిష్కారాలు అందిస్తూ, 17 విభాగాలకు సంబంధించిన ఓపీడీ కన్సల్టేషన్లు, సమగ్ర వైద్యపరీక్షలు, డేకేర్ శస్త్రచికిత్సలు, నివారణ చికిత్సలు చేస్తూ సమగ్ర ఆస్పత్రిగా ఎదిగింది.ముందస్తు వైద్య పరీక్షలు కేవలం అథ్లెట్లకు మాత్రమే కాదని ఈ చర్చలో చివరగా తేల్చారు. సింధు అయితే ఒకే సూత్రం చెబుతారు.. మీ శరీరం మరమ్మతులు కోరుకోకముందే దానిని చూడండి. అది మీ జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటుంది. -
అంతా రేవంత్ వల్లే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదన్నారు.ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసిన కేటీఆర్.. ఫార్మా సిటీ భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడలేరని అసెంబ్లీలోనే రెండేళ్ల క్రితం హెచ్చరించానన్నారు. విజన్ లేని రేవంత్ వలన ప్రజాధనం వృధా అయ్యిందన్నారు. వేల కోట్ల రూపాయల ఫార్మా సిటీ పెట్టుబడులు వెనక్కి పోయాయి. లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతన్నలు మోసపోయారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 20 వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారుచేసిందన్నారు. -
స్మార్ట్ఫోన్లో ఉండాల్సిన ముఖ్యమైన 12 యాప్స్
టెక్నాలజీ విస్తరిస్తోంది.. ప్రపంచం పరుగెడుతోంది. సమయం చాలా ముఖ్యమైపోయింది. ఇలాంటి సమయంలో స్మార్ట్ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని ప్రభుత్వ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి మీ సమయాన్ని మాత్రమే కాకుండా.. అవసరమైన గవర్నమెంట్ సర్వీసులను ఉపయోగించుకోవడానికి కూడా అనుమతిస్తాయి.ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్)కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి స్థానిక ప్రభుత్వ సంస్థల వరకు దేశవ్యాప్త ఈ-గవర్నమెంట్ సేవలను యాక్సెస్ చేయడానికి 'ఉమాంగ్' యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పీఎఫ్ క్లెయిమ్స్ అప్లై చేసుకోవడం దగ్గర నుంచి.. యుటిలిటీ బిల్లులు చెక్ చేసుకోవడం వరకు ఉన్నాయి. ఇది సుమారు 1500 కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలకు ఒక ప్లాట్ఫామ్.పన్ను చెల్లింపుదారుల కోసం ఏఐఎస్ఏఐఎస్ యాప్ అనేది.. భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ అందించే ఫ్రీ మొబైల్ అప్లికేషన్. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)కు సంబంధించిన సమాచారాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఇందులో పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను అందించవచ్చు.డిజిలాకర్డిజిలాకర్ అనేది.. భారతదేశంలో ప్రభుత్వ మద్దతుతో పనిచేసే అప్లికేషన్. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) దీనిని ప్రారంభించారు. పేపర్లెస్ పాలనను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఈ అప్లికేషన్ ముఖ్యమైన డాక్యుమెంట్స్ (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఉంటే ఫిజికల్ కాపీలను చూపించాల్సిన అవసరం లేదు.డిజియాత్రవిమానాశ్రయాలలో వేగవంతమైన చెక్-ఇన్ల కోసం డిజియాత్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది అనేక ప్రధాన నగరాల్లో పనిచేస్తుంది.ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్బ్రోకర్ అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా సురక్షితమైనది, పారదర్శకమైనది. అంతే కాకుండా పెట్టుబడికి సంబంధించిన మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే ఉంటుంది.పోస్ట్ఇన్ఫోపోస్ట్ఇన్ఫో అనేది ఇండియా పోస్ట్ యాప్. దీని ద్వారా స్పీడ్ పోస్ట్లను ట్రాక్ చేయవచ్చు. పోస్టల్ ధరలను చెక్ చేసుకోవచ్చు. మీకు సమీపంలో ఏ పోస్టాఫీసులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.స్వయం (SWAYAM)స్వయం యాప్ ద్వారా IIT, IIM వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రతిదానిని కవర్ చేయవచ్చు. ఇందులో ఫ్రీ ఆన్లైన్ కోర్సులను పొందవచ్చు. విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం112 ఇండియాపోలీసులు, అగ్నిమాపక & అంబులెన్స్ సేవలను తక్షణమే పొందటానికి 112 ఇండియా యాప్ ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ యాప్, దీనిని పౌరులు అత్యవసర సమయంలో సహాయం కోరడానికి ఉపయోగించవచ్చు.భీమ్ యూపీఐభీమ్ యూపీఐ అనేది నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది. ఇది ప్రభుత్వ యూపీఐ యాప్. ఇది సింపుల్ అండ్ సెక్యూర్ కూడా.నెక్స్ట్జెన్ ఎంపరివాహన్ఆర్సీ, డీఎల్ యొక్క డిజిటల్ వెర్షన్లను యాక్సెస్ చేయడానికి మాత్రమే కాకుండా.. చలాన్లను చెక్ చేయడానికి నెక్స్ట్జెన్ ఎంపరివాహన్ యాప్ ఉపయోగపడుతుంది.దీక్ష (DIKSHA)దీక్ష అనేది పాఠశాల విద్యార్థులు.. ఉపాధ్యాయుల కోసం ఉపయోగపడే ఒక ఇ-లెర్నింగ్ యాప్. ఇది పాఠ్యాంశాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యా కంటెంట్ను అందిస్తుంది.జన్ ఔషధి సుగంసరసమైన ధరలకు జనరిక్ మందులను, సమీపంలోని జన్ ఔషధి కేంద్ర స్థానాలను సులభంగా కనుగొనడానికి 'జన్ ఔషధి సుగం' యాప్ ఉపయోగపడుతుంది. -
59 ఏళ్ల వయసులో జిమ్లో వర్కవుట్స్.. ఎవరో గుర్తుపట్టారా?
పైన కనిపిస్తున్న నటి వయసు 59. ఈ ఏజ్లో కూడా ఆమె జిమ్లో చెమటలు చిందిస్తోంది. చిన్నపాటి వ్యాయామాలే కాకుండా డంబుల్స్ ఎత్తుతూ కష్టమైన వర్కవుట్స్ కూడా అవలీలగా చేస్తోంది. ఇంతకీ ఆ ఫేమస్ నటి ఎవరో గుర్తుపట్టారా? తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. సౌత్ ఇండస్ట్రీకి బాగా పరిచయమున్న పేరు. ఆవిడే నదియా (Nadiya Moidu).. ఇప్పటికీ అందంగా, ఫిట్గా కనిపించే ఆమె వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు మీరు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.సినిమా1984లో వచ్చిన నూకెత్త దూరతు కన్నుం నట్టు అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్లో అమ్మ, అత్త పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. తెలుగులో.. అత్తారింటికి దారేది, దృశ్యం, దృశ్యం 2, నా పేరు సూర్య, అఆ, అంటే సుందరానికి వంటి పలు చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Nadiya Moidu (@simply.nadiya) చదవండి: 11 ఏళ్ల బంధానికి స్వస్తి? భార్యకు కన్నడ హీరో విడాకులు! -
గవర్నర్ Vs స్టాలిన్.. మరోసారి భగ్గుమన్న విభేదాలు
చెన్నై: తమిళనాడు సర్కార్కి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా గవర్నర్పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల కంటే గవర్నర్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.విభేదాలు మరోసారి బహిర్గతం అవ్వడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. ఆదివారం ఆయన ధర్మపురిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గవర్నర్పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.‘ప్రతిపక్షాలు చేసే విమర్శలపై తనకు ఆందోళన లేదన్న స్టాలిన్.. అవన్నీ రాజకీయాల్లో సహజమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్ రవి.. వారి కంటే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రాజ్భవన్లో ఉండి అధికార డీఎంకేకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై స్టాలిన్ మండిపడ్డారు. తమిళ గీతాన్ని కూడా అగౌరవ పరుస్తారంటూ గవర్నర్పై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళ భద్రత, విద్యారంగంపై గవర్నర్ ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడు దేశంలోనే అగ్ర రాష్ట్రమని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.‘‘తమిళనాడు ప్రజల కోసం మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. కానీ కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు’’ అంటూ స్టాలిన్ మండిపడ్డారు. -
వాళ్ళేమి తోపు ఆటగాళ్లు కాదు.. సెలక్టర్లు మంచి పనిచేశారు: పాక్ మాజీ కెప్టెన్
ఆసియాకప్-2025కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లకు చోటు దక్కలేదు. గతంలో కెప్టెన్లగా వ్యవహరించిన ఈ ఇద్దరి సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయారు.పేలవ ఫామ్ కారణంగా వారిద్దరిని సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇటీవల కాలంలో బాబర్, రిజ్వాన్లు పాల్గోని మల్టీ నేషన్ టోర్నమెంట్ ఆసియాకప్ కానుంది. ఫామ్తో సంబంధం లేకుండా ఐసీసీ ఈవెంట్లు, ఆసియాకప్ టోర్నీల్లో ఆడేందుకు వారిద్దరికి పీసీబీ సెలక్టర్లు అవకాశమిచ్చేవారు. కానీ ఈసారి మాత్రం వహాబ్ రియాజ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వేటు వేసింది. ఇక బాబర్, రిజ్వాన్లను సెలక్టర్లు పక్కన పెట్టడానికి గల కారణాలను పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ వెల్లడించాడు. టీ20 క్రికెట్లో 'సంప్రదాయ శైలి' బ్యాటింగ్కు స్వస్తి పలికేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని హాఫీజ్ అన్నాడు. టీ20ల్లో 2022 ఏడాది నుంచి మహ్మద్ రిజ్వాన్ స్ట్రైక్ రేట్ 122.26, బాబర్ స్ట్రైక్ రేట్ 127.34లగా ఉంది. టెస్టు హోదా కలిగి ఉన్న జట్లలో అత్యల్ప స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న ఓపెనర్లు వీరిద్దరే."బాబర్ ఆజం, రిజ్వాన్లను కీలక ఆటగాళ్లు అని పిలవడం ముందు ఆపేయండి. ఇది చాలా తప్పు. వారిద్దరూ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో ముఖ్యమైన ఆటగాళ్లు కాదు. పాకిస్తాన్కు విజయాలు అందించే వాళ్లు కీలక ప్లేయర్లు అవుతారు. సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా సల్మాన్ అలీ అఘా, సైమ్ అయూబ్, హసన్ నవాజ్ వంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో మ్యాచ్ విన్నర్లగా ఉన్నది వారే. కానీ వారి గురించి మనం మాట్లాడుకోవడం లేదు" అని ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా స్టార్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది, నసీం షా గురించి హాఫీజ్ మాట్లాడాడు.షాహీన్ షా అఫ్రిది, నసీం షా ఇద్దరూ మైదానంలో పూర్తిగా నిబద్ధతతో ఉండాలి. అలా లేకపోతే సానుకూల ఫలితాలు సాధించలేరు. వారిద్దరూ గత కొంత కాలంగా పాకిస్తాన్కు విన్నింగ్ ప్రదర్శనలను అందించలేకపోతున్నారు. కాగా ఆసియాకప్ జట్టులో షాహీన్ అఫ్రిదికి చోటు దక్కగా నసీం షాకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు.ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్ -
ఆ సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత
పాన్ ఇండియా స్థాయికి మన ఇండస్ట్రీ ఎదిగిపోయింది అని అనుకుంటున్నాం కానీ నిర్మాతల పరిస్థితి ఘోరంగానే ఉంది. ఒకప్పటితో పోలిస్తే సినిమాల్లో సరైన కంటెంట్ ఉండట్లేదు. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చి చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దానికి తోడు స్టార్ హీరోలు కూడా రీమేక్స్ చేయడం, అవి డిజాస్టర్ కావడం అడపాదడపా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఓ నిర్మాత.. తను తీసిన ఓ రీమేక్ వల్ల ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు.అప్పట్లో దూకుడు, లెజెండ్, వన్ నేనొక్కడినే తదితర సినిమాలు తీసిన అనిల్ సుంకర.. గత కొన్నాళ్లలో మాత్రం ఘోరమైన నష్టాల్ని చవిచూశారు. మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ తదితర చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈయనకు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం నిర్మాణాన్ని పక్కనబెట్టి 'షో టైమ్' పేరుతో ఓ రియాల్టీ షో తీస్తున్నారు. దీని లాంచ్ శనివారం జరగ్గా.. ఇందులోనే మాట్లాడుతూ చిరంజీవితో తీసిన 'భోళా శంకర్' గురించి పరోక్షంగా కామెంట్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) 'ఏదైనా ఫ్లాప్ సినిమా రాగానే అసలు కథ వినే తీశారా? అని నన్ను అడుగుతుంటారు. కథలు వినకుండా మూవీస్ ఎందుకు చేస్తారు అని కూడా అడుగుతారు. ఓసారి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే.. అక్కడ పనిచేస్తున్న ఓ క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు. ఎందుకండీ స్టోరీ లేని సినిమాలు చేస్తున్నారు అని అన్నాడు. నేను తీసింది రీమేక్ అని చెప్పినా అతడికి అర్థం కాలేదు. రీమేక్ ఆడలేదు నేనేం చేస్తాను? అని చెప్పాను. ఈ పాటికే మీకు సినిమా ఏంటనేది అర్థమై ఉంటుంది కదా!' అని తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని బయటపెట్టారు.మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన 'భోళా శంకర్'లో చిరంజీవి హీరోగా నటించారు. అనిల్ సుంకర నిర్మించారు. తమిళంలో హిట్ అయిన 'వేదాళం' అనే మూవీ రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. అయితే రిలీజ్కి ముందే విమర్శలు ఎదుర్కొన్న 'భోళా శంకర్'.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మరిన్ని ట్రోల్స్కి గురైంది. చిరంజీవి ఇలాంటి మూవీ ఎందుకు చేశారా? అని అందరూ మాట్లాడుకున్నారు. అలాంటిది ఇప్పుడు స్వయంగా నిర్మాతనే పరోక్షంగా ఈ సినిమాని మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క.. పిల్లి కోసం స్పెషల్గా..) -
SIR అసలు రంగును బయటపెడతాం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని మరోసారి స్పష్టం చేశారు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీహార్లో SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ద్వారా ఉన్న ఓటర్లను తొలగించి కొత్త వారిని చేర్చి అక్రమంగా గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దేశం ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా అడ్డుకుంటామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. బీజేపీ నేతలు ప్రెస్మీట్ పెడితే ఈసీ అఫిడవిట్ అడగలేదని, తాను ప్రెస్మీట్ పెడితే అఫిడవిట్ ఈసీ అడుగుతోందని విమర్శించారు. ఓటర్ల డేటాను అడిగినా ఈసీ ఇంతవరకూ ఇవ్వలేదని ధ్వజమెత్తారు రాహుల్. మీ ఓట్లను దొంగిలించి.. ఎన్నికల్లో గెలిచి దేశ సంపదను సంపన్నులకు అందిస్తున్నారని మండిపడ్డారు. బీహార్లో చేస్తున్న SIR అసలు రంగు బయటపెడతామని రాహుల్ హెచ్చరించారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం( ఆగస్టు 15వ తేదీ) మరోసారి విచారించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో.. ఆ 65లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. అదే సమయంలో వారిని ఎందుకు తొలగించారో పేర్కొంటూ వివరణతో కూడిన ఆ లిస్టును పబ్లిక్లోకి తీసుకురావాలని పేర్కొంది ధర్మాసనం. ఈ అంశానికి సంబంధించి గురువారం(ఆగస్టు 14వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 22 లక్షల మందిని చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని సైతం ప్రశ్నించింది. బూత్ లెవెల్ స్థాయిలో దీనిని ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసింది. పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘భారత ఎన్నికల కమిషన్ వాదనలను మేము పూర్తిగా విన్నాం. విచారణ సమయంలో, ఈ క్రింది దశలను అంగీకరించారు. 2025 జాబితాలో పేర్లు కనిపించినప్పటికీ, తాజాగా జాబితాలో చేర్చబడని 65 లక్షల మంది ఓటర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్సైట్లలో ప్రదర్శించాలి’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.ఇదీ చదవండి: 'దేశ'మంత మందికి ఓటుండదా? -
బాత్రూమ్ సింగింగ్ పార్ట్నర్.. మాయ అద్దం!
హ్యాపీ బాత్రూమ్ నుంచే హ్యాపీ డే మొదలవుతుంది. బాత్రూమ్లో కలిగే చిన్న చిరాకు మీ రోజంతటినీ చెడగొడుతుంది. అందుకే బాత్రూమ్ ఇబ్బందులన్నీ క్షణాల్లో తీర్చేసే స్మార్ట్ గ్యాడ్జెట్స్ గురించి ఈ కథనంలో చూసేద్దాం.బాత్రూమ్ సింగింగ్ పార్ట్నర్!స్నానం మొదలైందంటే బకెట్లో నీళ్లు మాత్రమే కాదు, కొందరి నోటి నుంచి పాటలు కూడా వెలువడుతూ ఉంటాయి. అలా బాత్రూమ్లో పాడుతూ గాన స్నానాల్లో ఓలలాడే బాత్రూమ్ రాక్స్టార్స్కు ఇప్పుడు ఓ కొత్త సింగింగ్ పార్ట్నర్ వచ్చేసింది. అదే ‘మాక్సీ షవర్హెడ్ ’. ఇది కేవలం షవర్ మాత్రమే కాదు, ఇందులో బ్లూటూత్ స్పీకర్ కూడా ఉంటుంది. మొబైల్తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తే చాలు.నీటి శబ్దం మధ్య కూడా మీ పాటలు స్పష్టంగా వినిపిస్తాయి. స్పీకర్ను తొలగించడమూ, వాడడమూ చాలా సులభం. యూఎస్బీ ద్వారా పూర్తిగా చార్జ్ చేస్తే దాదాపు ఏడుగంటలపాటు పనిచేస్తుంది. ఈ స్పీకర్ శబ్దం నీటి శబ్దాన్ని మించి ఉంటుంది. అందుకే, ఏ అవరోధాలు లేకుండా పాటలు, కథలు, వార్తలు అన్నీ స్పష్టంగా వినవచ్చు. ఫోన్ కాల్ వచ్చినా, స్నానం చేస్తూనే మాట్లాడుకోవచ్చు. ధర సుమారు రూ.10,000. అయితే, కొన్ని చోట్ల తగ్గింపు ధరకూ లభిస్తోంది.బబుల్ బాత్పిల్లలకు స్నానం చేయించడమంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాంటిది. ఒకరు పరుగులు పెడితే, మరొకరు వెనకాలే పరుగెడుతూనే ఉండాలి. ‘నో... నో...’ అంటూ పిల్లలు అరుస్తుంటే, ‘ఐదు నిమిషాలే... ఐదు నిమిషాలే’ అంటూ అమ్మనాన్నలు వారిని పట్టుకోవడానికి తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి హడావిడితో నిండిన బాత్ టైమ్కు గుడ్బై చెప్పే పరిష్కారం వచ్చేసింది! అదే ఈ ‘బాత్ బబుల్ మేకర్’. ఇది నీటి బుడగలను తయారుచేసే పరికరం మాత్రమే కాదు, పిల్లల మొహాల్లో నవ్వులు విరబూయించే సాధనం కూడా!మ్యూజిక్, బబుల్స్, పిల్లల్ని ఆకట్టుకునేలా ఉండే రంగురంగుల డిజైన్లతో ఉండే వీటిని బాత్రూమ్ గోడకు తగిలించేశారంటే చాలు. పిల్లలు స్వయంగా ‘నాకు టబ్ టైమ్ కావాలి!’ అని తెగ కోరుకుంటారు. మార్కెట్లో ఇవి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. సంగీతం, లైట్స్తో ఉన్న ఆటోమేటిక్ బబుల్ మేకర్లు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు లభిస్తాయి. అధిక బబుల్ ఔట్పుట్ ఉన్న హైఎండ్ మోడల్స్కు అయితే ధర రూ.5,000 కంటే ఎక్కువే ఉంటుంది.మాయ అద్దం!ఉదయం కాఫీ చల్లారినా భరించగలమేమో కాని, షవర్ తర్వాత అద్దంలో ముఖం కనిపించకపోతే మాత్రం వేడెక్కిపోతాం! అప్పుడు చేతిలో టవల్ పట్టుకుని అద్దాన్ని తుడవక తప్పదు. ఇలా ప్రతి ఉదయం చిరాకు తెప్పించే ఈ చిన్న వర్కౌట్కి ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికింది. అదే ఫాగ్లెస్ మిర్రర్. దీనిని యాంటీ–ఫాగ్ పూతతో తయారు చేస్తారు.ఇలాంటి అద్దాలు కొన్నింటిలో హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది అద్దాన్ని మెల్లగా వేడి చేసి పొగను తొలగిస్తుంది. మరికొన్నింటిలో ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి, ఇవి క్లియర్ విజ¯Œ కి తగిన వెలుతురును అందిస్తాయి. దీంతో షేవింగ్, మేకప్ ఏదైనా పని సులభంగా, స్పష్టంగా చేయవచ్చు. ఇవి మార్కెట్లో వివిధ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. గోడకూ అమర్చుకోచ్చు, టేబుల్పైన అయినా ఉంచవచ్చు. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. సింపుల్ వెర్షన్లు రూ.799 నుంచి, హీటెడ్ అద్దాలు, లైటింగ్ ఉన్నవి రూ.2,000 వరకు లభిస్తున్నాయి. -
రాహుల్ ‘ఓట్ చోరీ’ కామెంట్స్పై ఈసీ ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ వ్యాఖ్యలపై కేంద్రం ఎన్నికల సంఘం (సీఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ కామెంట్స్ను సీఈసీ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఖండించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ చోరీకి పాల్పడిందంటూ రాహుల్ గాంధీ వరుస ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై మీడియా సమావేశంలో ఈసీ స్పందించింది. ఓట్ చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరి కాదు. ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే. 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుంది. పౌరుల మధ్య ఈసీ వివక్ష చూపదు. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుంది. ‘సర్’లో ఓట్లు తొలగిస్తే అభ్యంతరాలు చెప్పవచ్చు. బీహార్ సర్లో అన్నీ రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేస్తాం. అబద్ధపు ప్రచారాల్ని లెక్క చేయం. ప్రతిపక్షాలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నాయి. మా పని మేం చేసుకుంటూ వెళతాం. ఎన్నిక ప్రక్రియలో లోపాలున్నా ప్రతిపక్షాలు అభ్యంతరం తెలపవచ్చని సూచించింది. -
కూటమి సర్కార్పై కల్లుగీత కార్మికులు సమరశంఖం
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంపై కల్లుగీత కార్మికులు సమరశంఖం పూరించారు. బెల్టుషాపులు తొలగించి.. నీరా కేఫ్లు ఏర్పాటు చేసే వరకూ పోరాడాలని కార్మికులు నిర్ణయించారు. బెజవాడలో కల్లుగీత కార్మికులు రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలపై ఆలోచన చేయలేదన్నారు. కల్లుగీత కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలపై నోరు మెదపడం లేదని ఆయన మండిపడ్డారు.రాష్ట్రంలో 3396 వైన్ షాపులుంటే 75వేల బెల్టు షాపులు పెట్టించారు. స్పిరిట్తో తయారు చేసిన కల్తీ మద్యం అమ్మిస్తున్నారు. గోవా, యానాం అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో మద్యం వరద పారిస్తున్నారు. మద్యంతో గ్రామాలను ముంచెత్తుతున్నారు. కల్లుగీత వృత్తిని ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. ఇంటింటికీ , వీధివీధికి బెల్టుషాపులు పెట్టి కల్లుగీత కార్మికులకు పొమ్మనలేక పొగబెడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మాట తప్పింది.సెప్టెంబర్ 30 వరకూ దశల వారీగా ఆందోళనలు చేపడతాం. ఆగస్ట్ 22వ తేదీన అన్ని జిల్లాల్లో ఒకేసారి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ఆగస్ట్ 30న అన్ని జిల్లాలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపడతాం. సెప్టెంబర్ 8న మంగళగిరిలో ఎక్సైజ్ కమినర్ను కలుద్దాం రండి కార్యక్రమం నిర్వహిస్తాం. సెప్టెంబర్ 10న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తాం. సెప్టెంబర్ 12ప బెల్ట్ షాపులు, కల్లు పాలసీ, ఉపాధిపై జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాం. సెప్టెంబర్ 25న జిల్లాల్లో సమీక్షలు, సభలు నిర్వహిస్తాం’’ అని నరసింహమూర్తి తెలిపారు.‘‘ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 30న కార్యాచరణ ప్రకటిస్తాం. ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గంలో లెక్కలేనన్ని బెల్టు షాపులున్నాయ్. అక్రమ మద్యం వరదలా పారుతోంది. బెల్టు షాపులు పెడితే తోలు ఒలుస్తామని ముఖ్యమంత్రి , ఎక్సైజ్ మంత్రి మాటలు చెప్పారు. ఇంతవరకూ ఎవరి తోలూ ఒలవలేదు. ఇంకా బెల్టు షాపులు పెరుగుతూ ఉన్నాయికల్లుగీత కార్మికులకు బెల్ట్ షాపులు జీవన్మరణ సమస్యగా మారింది. పోరాటం ఆగదు.. సమరశంఖం పూరిస్తాం... ఉవ్వెత్తున ఉద్యమిస్తాం. చెట్టుమీద నుంచి పడిపోయిన కల్లుగీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా చంద్రబాబు రద్దు చేశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. కల్లుగీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. తెలంగాణ మాదిరి నీరా పరిశ్రమలు పెట్టాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. -
మూడురోజుల పాటు భారీ వర్షాలు.. ఏపీకి ‘రెడ్ అలర్ట్’
సాక్షి,విశాఖ: ఏపీకి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఫలితంగా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. కర్నూల్, నెల్లూరు, తిరుపతి,చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బంగాఖాతంలో ఏర్పడిన వాయిగుండం కారణంగా మరో మూడు రోజులపాటు కొనసాగనున్న భారీ వర్షాలు కురియనున్నాయి. ప్రస్తుతం తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో మరో మూడు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. 19న కోస్తాంధ్ర అంతటా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ప్రఖర్ జైన్ సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
పిల్లలు కనడానికి సిద్దమవుతున్న రోబోలు!
స్త్రీ, పురుషుల కలయికతో పిల్లలు పుట్టడం సర్వసాధారణం. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు. సరోగసీ ద్వారా కూడా పిల్లలను కంటున్నారు. అయితే శిశువు పుట్టడానికి మనిషి గర్భమే అవసరం లేదంటూ.. చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 'గర్భధారణ రోబోట్'లను సృష్టిస్తున్నారు. వినడానికి ఇది వింతగా ఉన్నా.. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే, ఈ కథనం చదవాల్సిందే..ప్రపంచంలోనే మొట్టమొదటి 'గర్భధారణ రోబోట్'పై చైనా శాస్త్రవేత్తలు పని చేస్తున్నారని, ఇది సజీవ శిశువుకు జన్మనిస్తుందని ది టెలిగ్రాఫ్ నివేదించింది. ఈ టెక్నాలజీ గర్భధారణ నుంచి ప్రసవం వరకు గర్భధారణకు కావలసిన అన్ని విషయాలను అనుకరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.పిండం అనేది గర్భధారణ రోబో.. కృత్రిమ గర్భంలోనే పెరుగుతుంది. పిండాలకు కావలసిన పోషకాలు అన్నీ కూడా ట్యూబ్స్ ద్వారా అందిస్తారు. అయితే అండం, స్పెర్మ్ ఎలా.. ఎక్కడ ఫలదీకరణం అవుతుందనే విషయాలను ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు వెల్లడించలేదు. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ 'జాంగ్ కిఫెంగ్' నేతృత్వంలోని గ్వాంగ్జౌకు చెందిన కైవా టెక్నాలజీ ఈ రోబోను అభివృద్ధి చేస్తోంది.ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితంఈ టెక్నాలజీ విజయవంతమైతే.. సంతానం లేని జంటలకు లేదా జీవసంబంధమైన గర్భధారణ చేయించుకోవడానికి ఇష్టపడని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ పరిణతి చెందిన దశలో ఉందని డాక్టర్ జాంగ్ పేర్కొన్నారు. పిండం.. రోబోట్ కృత్రిమ గర్భంలో పెరగడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ రోబోట్ నమూనా 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.మనిషి గర్భంతో పనిలేకుండా రాబోయే టెక్నాలజీ బాగానే ఉంది. కానీ ఇది ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. తల్లి, బిడ్డల పేగు బంధం లేకపోతే.. పిల్లల మానసిక ప్రభావం ఎలా ఉండబోతుందో అని ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా ఇది చట్టపరంగా సాధ్యమేనా?, చట్టాలు దీనికి ఒప్పుకుంటాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలంటే అంతంత మాత్రంగానే వర్కౌట్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. అలా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ హాలీవుడ్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించింది. రిలీజై దాదాపు నెలన్నర కావొస్తున్న ఇప్పటికీ ప్రేక్షకుల్ని రప్పిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?హాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు చూసినా సరే నటుడు బ్రాడ్ పిట్ కాస్త పరిచయం ఉండే ఉంటాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్ 1'. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మన ఆడియెన్స్ కూడా చూసి ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'ఎఫ్ 1' విషయానికొస్తే.. ఫార్ములా వన్ రేసులో డ్రైవర్గా అదరగొట్టిన సన్నీ హెయస్ (బ్రాడ్ పిట్).. కెరీర్కి రిటైర్మెంట్ ఇచ్చి, వ్యాన్ డ్రైవర్ పనిచేస్తుంటాడు. అలా వయసు పైబడిన సన్నీకి ఏపీఎక్స్జీపీ (APXGP) అనే టీమ్లో రేసర్గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. అయితే రేసింగ్ నుంచి తప్పుకొని చాలారోజులు అయిపోవడంతో సన్నీకి ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా తన జట్టులోని యువకుడైన జోషువా పియర్స్ (డామ్సన్ ఐడ్రీస్) దూకూడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అవమానాలు భరించడం కష్టంగా ఉంటుంది.అసలు స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ.. ఎందుకు రేసింగ్ నుంచి తప్పుకొన్నాడు? మళ్లీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పైకి వచ్చిన సన్నీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు విజేతగా నిలిచాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
భారత్ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్ ముద్దుగుమ్మ..!
ప్రేమ అంటే ఇదేరా అనేలా ఉండేలా ఎన్నో లవ్ స్టోరీలను చూశాం. వాటన్నింటిలో ప్రేమ ప్రేమే. దాని కోసం ఏం చేయడానికైనా రెడీ అనట్లుగా సిద్ధపడుతున్న ప్రేమికులు గాథల వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎల్లలు, సరిహద్దు దాటి ఎన్నో ప్రయాసలు పడి ఒక్కటైన జంటలెందరినో చూశాం. కానీ ఇక్కడ ఈ జంట అంత కష్టాలు చవి చూడకపోయినా..వీరిద్దరూ ఒక్కటైనా విధం చూస్తే..ఎక్కడైన లవ్వు..లవ్వే కథ అనిపిస్తుంది. మరి ఆ జంట అందమైన కథేంటో చకచక్క చదివేయండి మరి..బ్రెజిలియన్ మహిళ తైనాషా భారతీయ వ్యక్తిని పెళ్లాడింది. ఎలా తమ ప్రేమ చిగురించి పెళ్లిపీటలక్కెందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తామిద్దరం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వాళ్లం. కానీ తాను ఆ గుజరాతి వ్యక్తితో ఆశ్చర్యకరంగా ప్రేమలో పడిపోయానని అంటోంది. 2020 కోవడిడ్ 19 సమంయంలో ఇద్దరు ఆన్లైన్ కలుసుకున్నారు. ఇంకా అప్పటికీ టీకాలు వేయించుకోని క్రిటికల్ టైంలో ఆమెను కలవాలని గుజరాతీ భర్త పడిన ప్రయాసను చూసి..ఫస్ట్ మీట్లోనే అతని ప్రేమకు ఫిదా అయి లవ్లో పడిపోయిందట. ప్రేమలో పడిన ఐదునెలలకే ఇద్దరు పెళ్లిచేసుకున్నాం అని పేర్కొంది. తమ వివాహం బ్రెజిల్లోనే జరిగిందని, తమ పెళ్లిని తన భర్త తరుఫు భారతీయ కుటుంబం కూడా అంగీకరించిందని చెప్పుకొచ్చింది తైనా. తామిద్దరిది వేర్వేరు నేపథ్యమే అయినా..మా మధ్య ఉన్న అభిమానం, ప్రేమ రోజు రోజుకి మరింతగా బలపడుతుందని, ఇంతవరకు తమ దాంపత్య జీవితాన్ని విజయవంతంగా లీడ్ చేయగలిగేలా చేసినా ఈ విశ్వానికి సదా కృతజ్ఞతలు అని చెబుతోంది తైనా. ఆ దంపతుల ప్రేమ కథ నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక, ఎక్కడైన ప్రేమ.. ప్రేమే..దానికున్న శక్తి అనంతం, అజేయం అంటూ ఆ జంటని ప్రశంసిస్తూ ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Tainá Shah (@tainashah) (చదవండి: ‘రాక్స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం) -
కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క.. పిల్లి కోసం స్పెషల్గా..
బెజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తన అసలు పేరు మధు నెక్కంటి (Madhoo Singer Nekkanti). ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అయింది. బెజవాడ బేబక్కగా ఫేమస్ అయింది. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది. గలగలా మాట్లాడే ఈమె తొలివారమే ఎలిమినేట్ అయింది.కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్కతాజాగా బేబక్క కొత్తిల్లు కొనుగోలు చేసింది. హైదరాబాద్లోని కోకాపేట ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. నా ఇంటి గృహప్రవేశానికి అమ్మ ముఖ్య అతిథి అంటూ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు బేబక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ గృహప్రవేశ వేడుకకు హీరో శ్రీకాంత్ సహా తదితరులు అతిథులుగా విచ్చేశారు.పిల్లి కోసం ప్రత్యేకంగా..'నేను ఎప్పటినుంచో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. ఇన్నాళ్లకు సొంతింటి కల సాకారం అయింది' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇకపోతే.. అపార్ట్మెంట్లో 25వ అంతస్థులో ఉన్న ఫ్లాట్నే తన ఇంటిగా ఎంపిక చేసుకుంది బేబక్క. ఇందులో మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో పిల్లి ఆడుకోవడం కోసం ఓ గోడను డిఫరెంట్గా డిజైన్ చేయించింది. పూజగదిని నీట్గా, అందంగా కట్టించుకుంది. View this post on Instagram A post shared by Madhoo Singer Nekkanti (@bezawada_bebakka) చదవండి: -
‘నీకు కూతురు ఉందా? ‘పెద్దమనిషి’ అయిందా?’ అని అడిగేవాళ్లు.. : సౌమ్య రావు
చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. బయటకు మాత్రం అందంగానే కనిపిస్తుంది. కానీ లోపలకు తొంగి చూస్తే.. అక్కడ కూడా కష్టాలు, బాధలు ఉంటాయి. తెర ముందు ముఖానికి రంగు వేసుకొని జనాలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న చాలా మంది నటీనటులు తెర వెనుక చాలా కష్టాలను అనుభవించినవాళ్లే. తినడానికి తిండిలేని పరిస్థితులను ఎదుర్కొని ఉన్నవాళ్లు చాలా మందే ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ నటి, యాంకర్ సౌమ్యరావు(Sowmya Rao) కూడా ఒకరు. ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ కన్నడ బ్యూటీ.. రియల్ లైఫ్లో చాలా కష్టాలను అనుభవించింది. తినేందుకు తిండిలేక పస్తులు ఉన్న రోజులు కూడా చాలానే ఉన్నాయట. తాజాగా ఓ టీవీ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పడిన కష్టాలను చెబుతూ సౌమ్య ఎమోషనల్ అయింది.అప్పుల బాధలు తట్టుకోలేక.. నా చిన్నప్పుడు నాన్న బాగా అప్పులు చేశాడు. ఆ డబ్బుతో ఏం చేశాడో తెలియదు కానీ అప్పు ఇచ్చిన వాళ్లంతా మా ఇంటికి వచ్చి గొడవ చేసేవాళ్లు. నాన్న చేసిన అప్పులకు అమ్మ మాటలు పడాల్సి వచ్చేంది. కొంతమంది అయితే వల్గర్గా మాట్లాడేవాళ్లు. ‘నీకు కూతురు ఉందా? పెద్దమనిషి అయిందా?’ అంటూ అసభ్యకరంగా మాట్లాడేవాళ్లు. వారి బాధలు తప్పుకోలేక ఓ రోజు రాత్రి మా అమ్మ నన్ను, బ్రదర్ని తీసుకొని తిరుపతి వచ్చింది. అప్పుడు అమ్మ చేతిలో కేవలం రూ. 100 మాత్రమే ఉన్నాయి. రాత్రంతా బస్టాండ్లో నిద్రపోయాం. ఉదయం గుడిలో పెట్టే అన్న కోసం చాలా ఎదురు చూశాం. దేవుడి దర్శనం కంటే అక్కడ పెట్టే అన్నంపైనే మా దృష్టి ఉండేది. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే.. చుట్టు పక్కల వాళ్లు తలుపులు వేసుకునేవాళ్లు. ఎందుకంటే చుట్టాలకు టీ లేదా అన్నం పెట్టాలన్నా.. పక్కింటివాళ్లనే అడిగేవాళ్లం. అందుకే బంధువులు వస్తే.. అంతా తలుపులు మూసుకునే వాళ్లు.టైపింగ్ నేర్పిస్తానంటూ మిస్ బిహేవ్ చేశాడునేను కాలేజీలో ఉన్నప్పటి నుంచే పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. అలా ఓ సారి ఓ లాయర్ దగ్గర పని చేశాను. ఆయన ఇంట్లోనే వర్క్ ఉండేది. పని కోసం వెళ్తే..ఆయన నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. టైపింగ్ నేర్పిస్తా అంటూ నాపై చేతులు వేసేవాడు. ఆయన భార్య, తల్లి బయటకు వెళ్లగానే నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. నా పరిస్థితి ఆయనకు తెలుసు. దాన్న ఆయన అలుసుగా తీసుకున్నాడు. అందుకే మన కష్టాలను, బాధలను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. మనకు కష్టం ఉంది, పరిస్థితి బాలేదు అని తెలిస్తే మనతో ఆడుకుంటారు.స్టార్ హీరో ఇంటర్వ్యూకి వెళ్తుండగా ప్రమాదంన్యూస్ రీడర్గా కన్నడలో నా కెరీర్ ప్రారంభం అయింది. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టపడ్డాను. ఒకేసారి మూడు చానళ్లలో పని చేశాను. ఒక రోజు ఒక పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నా కాలికి తీవ్రంగా గాయం అయింది. అందరూ ఆస్పత్రికి వెళ్దాం.. అంటే నేను షూట్కి వెళ్లాను. స్టూడియోలో నన్ను చూసి అందరూ భయపడ్డారు. కాలికి తీవ్రంగా గాయం అయిందని.. ముందు ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. కానీ నాకేమో నొప్పి కంటే ఎక్కువగా ఇంటర్వ్యూ మిస్ అయితే డబ్బులు రావు కదా అనే బాధే ఎక్కువగా ఉంది. నేను జీరో నుంచి వచ్చాను .అందుకే సెలెబ్రిటీ అనే ఫీలింగ్ నాకు ఉండదు. ఇప్పటికే ఏదైనా ఈవెంట్ ఉంటే ఆటోలో కూడా వెళ్తుంటాను’ అని సౌమ్యరావు చెప్పుకొచ్చింది. -
‘రాక్స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం
కళ వద్దకు వచ్చేటప్పటికీ..ఎంత అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి అయినా చిన్నపిల్లవాడిలా మారిపోతారు. బహుశా ఆర్ట్కి ఉన్న శక్తి కాబోలు. ఇక్కడ అలానే ఒక రాష్ట్ర సీఎం పియానో చూడగానే ఆలపించాలనిపించిందో లేదా తన టాలెంట్ని చూపించాలనుకున్నారో గానీ అందరూ ఆశ్చర్యపోయేలా ప్లే చేయడమే గాక మైమరచిపోయేలా చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాజకీయాలకు అతీతంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తన సంగీత ప్రతిభతో మరోసారి ప్రజలను మంత్రముగ్దుల్ని చేశారు. ఆ వీడియోల ఆయన 150 ఏళ్ల నాటి పియానోపై బాలీవుడ్ ప్రసిద్ధ పాట షెహ్లో నషా పాటను ప్లే చేశారు. షిల్లాంగ్లోని రాజ్భవన్లో ముఖ్యమంత్రి అలా ప్లే చేశారో లేదా ఒక్కసారిగా ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించారు. ఈ రాక్స్టార్ సీఎం సగ్మా ఆలసించిన శ్రావ్యమైన సంగీతాన్ని అక్కడున్న చాలామంది తన ఫోన్ రికార్డు చేశారు కూడా. ఇక గవర్నర్ సీహెచ్ విజయ్ శకంర్ అక్కడున్న ప్రేక్షకుల్లో భాగం కావడం విశేషం. సంగ్మా ఇలా సంగీత వాయిద్యాన్ని సీఎం సంగ్మా ప్లే చేయడం కొత్తేం కాదు. గతంలో కూడా ఇలానే పలు సందర్భాల్లో తన సంగీత ప్రతిభను చాటుకున్నారు కూడా. ఇక సంగ్మా ప్రస్తుం పియానోపై ఆలపించిన పాట 1992లో విడుదలైన అమీర్ఖాన్ మూవీ ‘జో జీతా వోహి సికందర్’లోనిది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by rahul gupta (@mr_raulgupta) (చదవండి: కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!) -
ఏపీలో ‘ఉగ్ర’ కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా చెందిన ఓ వంట మనిషికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉండటం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బయటకు సాధారణ జీవితం గడుపుతూ.. లోపల మాత్రం పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేసిన వైనం తీవ్ర సంచలనం గా మారింది.ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ లోనికోట ఏరియాలో నివసిస్తున్నారు. ఓ హోటల్లో వంట మనిషిగా... టీ చేసే వ్యక్తిగా సాధారణ జీవితం గడుపుతున్నారు. చాలీచాలని జీతంతో అప్పులు చేసిన ఇతను... కొంత కాలం క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహామైన నూర్ మహ్మద్కు నలుగురు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నారు నూర్ మహ్మద్. తాడిపత్రికి చెందిన ఓ మహిళతో నూర్ మహ్మద్కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.నూర్ మహ్మద్ అరెస్ట్ తర్వాత తాడిపత్రికి చెందిన మహిళ అదృశ్యం అయ్యింది. ఆమెకు కూడా ఉగ్ర లింకులు ఉన్నాయా? ఆమె ద్వారానే నూర్ మహ్మద్కు ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మవరం ఉగ్రవాది నూర్ మహ్మద్ ఇంట్లో జిహాద్ పుస్తకాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న మీడియాకు వివరాలు వెల్లడించారు.అరెస్ట్ అయిన నూర్ మహ్మద్పై దేశ ద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కదిరి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు. ఎన్ఐఏ, కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో పూర్తి స్థాయిలో ధర్మవరం పోలీసులు విచారణ చేస్తున్నారు. ధర్మవరంలో నూర్ మహమ్మద్తో పాటు మరో వ్యక్తిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రత్న వెల్లడించారు. వీరిద్దరూ నిషేధిత వాట్సప్ గ్రూపుల్లో సమాచారం షేర్ చేసినట్లు గుర్తించినట్లు ఆమె తెలిపారు.నిందితులను అరెస్టు చేసి కడప జైలుకు తరలించామని.. పాక్కు చెందిన వాట్సప్ గ్రూపుల్లో నిందితుడు సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ పేర్కొన్నారు. కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు. నిషేధిత వాట్సప్ గ్రూప్లు 6, పాక్కు చెందిన మరో 30 గ్రూపుల్లో నూర్ మహ్మద్ సభ్యుడిగా ఉన్నాడు’’ అని ఎస్పీ రత్న మీడియాకు వివరించారు. -
బాసే రైటు
మీ బాస్ను ఎలా మేనేజ్ చేయాలో మీకు ఎవరూ నేర్పించరు. వారిని మేనేజ్ చేయడానికి, ముందుగా వారు ఎలాంటి వ్యక్తో మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీకు ఎం.బి.టి.ఐ. (మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్) సహాయపడవచ్చు. బాస్లు ఎలా పని చేస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, అనే అంశాలపై ఆధారపడి ఈ ఇండికేటర్ బాస్లను కమాండర్, విజనరీ, హార్మనైజర్, స్ట్రాటిజిస్ట్, ఎనలిస్ట్, సపోర్టర్, మ్యావరిక్, ఫ్రీ స్పిరిట్ అనే 8 రకాల వ్యక్తులుగా విభజించింది. ఈ ఎనిమిది మందిలో మీ బాస్ ఏ టైపు మనిషో కింద ఇచ్చిన ఇండికేటర్ ‘కీ’ చెబుతుంది. కనుక ఇండికేటర్ను ఫాలో అయిపోండి. ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అంటారు కనుక బాస్ తత్త్వానికి అనుగుణంగా మీరు మారండి. ప్రశాంతంగా ఉండండి. కెరీర్లో విజయం సాధించండి.కమాండర్లు వీళ్లు ఫలితాలనే నమ్ముతారు. పనిలో వేగాన్ని, స్పష్టతను కోరుకుంటారు. సామర్థ్యం, నాయకత్వం, తర్కం వీళ్లలో ముఖ్యమైనవి. వీళ్లకు సమావేశాలు, డెడ్లైన్లు ముఖ్యం. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా వ్యవహరించే ఉద్యోగులను వీరు అభిమానిస్తారు. ఇలాంటి వారితో పేరాల్లో కాకుండా బుల్లెట్ పాయింట్లలో మాట్లాడాలి. కుంటి సాకులు, భావోద్వేగాలు వీళ్లు నచ్చవు. గడుపులోపే చెప్పిన పని అయిపోవాలి. ఇలాంటి వాళ్ల దగ్గర అస్తవ్యస్తంగా, అనిశ్చితంగా ఉంటే మీ కెరీర్ దెబ్బతిన్నట్లే. విజనరీలు వీరు శక్తిమంతులు. ఐడియాల పుట్టలు. వినూత్న ఆవిష్కరణల్ని ఇష్ట పడతారు. వీరు వర్క్ప్లేస్ని శక్తిమంతంగా మార్చేస్తారు. భవిష్యత్తుపై దృష్టి ఉంటుంది. పని ఎలా జరుగుతోందో చూడరు. ఎంత జరిగిందో అడుగుతారు. వీరిని ఆకట్టుకోవడానికి ఫ్రెష్ ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనల్ని అప్పటికప్పుడు ఆచరణలో పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగి ఆఫీస్కి వచ్చేటప్పుడు, ఆఫీస్ నుండి వెళ్లేటప్పుడు ఆ ప్రయాణంలో సైతం ఆఫీస్ పని చేయవలసి వస్తుంది. రూల్స్ మాట్లాడకూడదు. స్ప్రెడ్షీట్లను కుమ్మరించకూడదు. అంతులేని ఫాలో–అప్లతో వారిని ముంచెత్తకూడదు. ఉద్యోగికి సమయస్ఫూర్తి లేకపోవడం వారిని నిరాశపరుస్తుంది.హార్మౖనైజర్లుఉద్యోగులతో వీరు స్నేహపూర్వకంగా ఉంటారు. అందర్నీ కలుపుకుని పోతారు. సామరస్యాన్ని కోరుకుంటారు. టీమ్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తారు. మీ పుట్టినరోజును గుర్తుంచుకుంటారు. లేదా మీ కుటుంబం బాగోగుల గురించి అడుగుతారు. హెల్ప్ చేసేందుకు రెడీగా ఉంటారు. వీరి నాయకత్వం పరస్పర విశ్వాసం, భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. వీరితో పనిచేయడానికి కమ్యూనికేటివ్గా ఉండాలి. టీమ్ కల్చర్ నిర్మాణానికి మీ సహకారాన్ని కోరుకుంటారు. ఘర్షణాత్మక ధోరణిని అస్సలు ఇష్టపడరు. టీమ్ ఒకలా ఆలోచిస్తే మీరు టీమ్కు విరుద్ధంగా ఆలోచించటం వీరిలో అసహనం కలిగిస్తుంది. స్ట్రాటెజిస్టులుఆలోచనాత్మకమైనవారు. లక్ష్యాలే ముఖ్యమైన దార్శనికులు. లోతుగా ఆలోచిస్తారు. జాగ్రత్తగా ప్రణాళిక వేస్తారు. స్వేచ్ఛ, వ్యూహాత్మకత విలువైనవిగా భావిస్తారు. నాటకీయతను ఇష్టపడరు. అన్నీ తెలుకుని ఉంటారు. పైకి వ్యక్తపరచరు. నాణ్యమైన పనిని ఆశిస్తారు. వీరి దగ్గర భావోద్వేగ ప్రకోపాలు, నిస్సారపు ఆలోచనలు, అస్తవ్యస్తమైన ఆలోచనలు ఉద్యోగికి నష్టాన్ని తెస్తాయి. నిర్మాణాత్మక వాదనలు మాత్రమే వీరి దగ్గర చేయాలి.ఎనలిస్టులు కచ్చితమైనవారు, తార్కికంగా ఉంటారు. ప్రతిదీ వివరంగా తెలుసుకుంటారు. స్పష్టత ముఖ్యం. ఆధారాలు అవసరం. మీరు వాగ్దానం చేసిన వాటిని అమలు చేయాలని వీరు ఆశిస్తారు. అరకొర పనులను, నిర్ణయాలలో ఊగిసలాటను ద్వేషిస్తారు. డేటా, నిర్మాణం, దృఢమైన తార్కికతతో వీరికి సహాయకారిగా ఉండండి. నాటకీయత వద్దు. ప్రాక్టికల్గా ఉండండి. భావోద్వేగ విజ్ఞప్తులతో, అస్పష్టమైన నిబద్ధతలతో లేదా ఒక పనిని దాటవేయడం ద్వారా వారిని నిరాశపరచకండి.సపోర్టర్లు నిశ్శబ్దంగా ఉంటారు. నమ్మదగినవారు. సేవా దృక్పథం కలిగినవారు. స్థిరమైన జట్లకు వెన్నెముకగా ఉండాలని కోరుకుంటారు. స్థిరంగా, శ్రద్ధగా, విశ్వాసపాత్రంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాలకు విలువ ఇస్తారు. వీరి దగ్గర మీరు స్థిరంగా, సానుభూతితో, మర్యాదగా ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అదనపు పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు బాగా రాణిస్తారు. మాటలతో కాకుండా చేతలతో మీరు నమ్మకాన్ని సంపాదించాలి. మీలోని దూకుడు ప్రవర్తన, ఆకస్మిక మార్పులు, టీమ్ని విమర్శించటం వంటి పనులతో వీరికి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది.మ్యావరిక్లు చురుగ్గా, వేగంగా, వ్యూహాత్మకంగా ఉంటారు. వీరిది నో–నాన్సెన్ ధోరణి. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. పనులు పూర్తి చేసే వారిని విలువైనవారిగా భావిస్తారు. తన ఉద్యోగులు సమయాన్ని గౌరవించాలని, ఒత్తిళ్లను స్వీకరించాలని కోరుకుంటారు. మితిమీరిన ప్రణాళికల్ని ఇష్టపడరు. అధిక డాక్యుమెంటేషన్ను కూడా లైక్ చెయ్యరు. ప్రతిదానికీ నెమ్మదిగా ప్రతిస్పందిస్తుంటే మిమ్మల్ని నిష్కర్షగా పక్కనపెట్టేస్తారు.ఫ్రీ స్పిరిట్ కలిగినవారు స్వతంత్రమైన, సృజనాత్మకమైన, హృదయపూర్వకమైన గుణాలున్నవారు. వీరికి విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. తన టీమ్కు స్వేచ్ఛను ఇస్తారు. మీలో అభిరుచి, చొరవ ఉంటే మిమ్మల్ని టీమ్ లీడర్గా గుర్తిస్తారు. వీరితో నిజాయితీగా, దాపరికం లేకుండా ఉండాలి.మీ బాస్ సరే, మీరు ఎలాంటి వారు?ఇది తెలుసుకోవాలంటే 41 క్యూ.కామ్ లేదా 16 పర్సనాలిటీస్.కామ్లో ఈ ఎం.బి.టి.ఐ. ఆన్లైన్ పరీక్ష రాయండి. ఎలాంటి బాస్ మీకు సరిపడతారో తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్· సాక్షి, స్పెషల్ డెస్క్ -
వేలానికి సంజూ శాంసన్..?
రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఫ్రాంచైజీ మారే అంశం ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తుంది. సంజూకు రాయల్స్లో కొనసాగే ఉద్దేశం లేదని ప్రచారం జరుగుతున్న వేల.. ఐపీఎల్ ట్రేడింగ్ విండో తెరుచుకుంది. ట్రేడింగ్ ద్వారా సంజూను దక్కించుకునేందుకు సీఎస్కే, కేకేఆర్ పోటీపడుతున్నట్లు సమాచారం.అయితే సంజూ విషయంలో రాయల్స్ డిమాండ్లకు ఆ ఫ్రాంచైజీలు ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. క్యాష్ డీల్ వరకు ఓకే కానీ, తమ ఆటగాళ్లను వదులుకునే ప్రసక్తే లేదని సదరు ఫ్రాంచైజీలు చెప్పినట్లు సమాచారం.సంజూను సీఎస్కే కోరుకున్నట్లైతే ప్రతిగా నగదుతో పాటు ఇద్దరు ఆటగాళ్లను రాయల్స్ డిమాండ్ చేసిందట. రవీంద్ర జడేజా, శివమ్ దూబేలను తమకు ఇవ్వాలని రాయల్స్ కోరినట్లు సమాచారం. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ సంజూను ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే బదులుగా అంగ్క్రిష్ రఘువంశీ, రమన్దీప్ సింగ్లను ఇవ్వాలని రాయల్స్ డిమాండ్ చేసిందట.సంజూ ట్రేడింగ్ విషయంలో రాయల్స్ డిమాండ్లను ఇరు ఫ్రాంచైజీలు తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో రాయల్స్ సంజూను వేలానికి వదిలేస్తుందని మరో ప్రచారం మొదలైంది. ఇదే జరిగితే సంజూ కోసం సీఎస్కే, కేకేఆర్తో పాటు మరిన్ని ఫ్రాంచైజీలు పోటీపడవచ్చు.ఇది ఓ రకంగా సంజూకు లాభదాయకమే అని చెప్పాలి. ప్రస్తుతమున్న ధరతో (రూ. 18 కోట్లు) పోలిస్తే అతనికి మరింత ధర లభించే అవకాశముంటుంది. అయితే సంజూ లాంటి ఆటగాడిని వేలం వరకు పోనివ్వకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎస్కే, కేకేఆర్ లాంటి ఫ్రాంచైజీలకు సంజూ లాంటి ఆటగాడి అవసరం చాలా ఉందని, ఈ ఫ్రాంచైజీలు రాయల్స్తో సయోధ్యకు రావచ్చని అంచనా వేస్తున్నారు.ట్రేడింగ్ ద్వారా సంజూ ఎపిసోడ్కు పుల్స్టాప్ పడితే ఓకే కానీ, వేలం వరకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఏమైనా జరగవచ్చు. సంజూకు పంత్కు మించిన ధర కంటే ఎక్కువ లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగని అంత మొత్తం లభిస్తుందని కూడా చెప్పలేని పరిస్థితి. పర్సుల విషయంలో ఫ్రాంచైజీలకు పరిమితులు ఉన్నాయి.కాగా, జోస్ బట్లర్ విషయంలో సంజూ శాంసన్కు, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తుంది. తాను వద్దని చెప్పినా రాయల్స్ బట్లర్ను వేలానికి వదిలేసిందని సంజూ అలకపూనాడని ప్రచారం జరుగుతుంది. అంతే కాక జట్టులో తన ప్రాధాన్యత కూడా తగ్గిందని సంజూ భావిస్తున్నట్లు సమాచారం. ధృవ్ జురెల్ (వికెట్కీపింగ్), వైభవ్ సూర్యవంశీ (ఓపెనర్) రూపంలో తన స్థానానికి ప్రమాదం పొంచి ఉందని సంజూ భావిస్తుండవచ్చు.ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగినా సంజూ ఐపీఎల్ భవితవ్యంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
దర్శకుడిగా షారుక్ ఖాన్ కుమారుడు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) దర్శకుడిగా తెరకెక్కిస్తున్న 'ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్' ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే, సినిమా కాకుండా వెబ్సిరీస్ కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రాన్ని ‘నెట్ఫ్లిక్స్’ (Netflix), ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ (Red Chillies Entertainment) సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఆగష్టు 20న ప్రివ్యూ ఉంటుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే, ఈ మూవీకి కథ కూడా ఆర్యన్ రాయడం విశేషం. బాలీవుడ్లో ఇప్పటివరకూ చూడని సరికొత్త వెబ్సిరీస్ను అందించబోతున్నామని గతంలోనే ఆర్యన్ యూనిట్ ప్రకటించింది.ఈ వీడియోలో ఆర్యన్ వాయిస్ ఓవర్తో కథనం ప్రారంభమౌతుంది. కానీ, అతని తండ్రి షారుఖ్ ఖాన్ శైలిలో వీడియో ఉంది. తేడా ఏమిటంటే ఖాన్ ప్యార్ (ప్రేమ) గురించి మాట్లాడగా, కుమారుడు వార్ (దాడి) గురించి మాట్లాడుతాడు. ఇందులో బాబీ డియోల్, లక్ష్య (Kill ఫేమ్), మనోజ్ పహ్వా, మోనా సింగ్, మనీష్ చౌదరి, రాఘవ్ జుయల్, అన్య సింగ్ వంటి స్టార్స్ నటించనున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అలియాభట్ వంటి స్టార్స్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. -
'సోలో' డేటింగ్.. సూపర్ క్లిక్...
ఇద్దరు వ్యక్తులు కలిసి డేటింగ్ కి వెళ్తే... ఆ డేట్ అధ్యంతం పరస్పరం మెప్పించుకోవాలనో ఒప్పించుకోవాలనో... ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే తాము పరస్పరం అర్ధం చేసుకోవాలి అని అనుకుంటున్న విషయం ఇద్దరికీ తెలుసు కాబట్టి... డేటింగ్ అలా ఉంచితే జీవితం లో ప్రతీ దశ లోనూ ఎవరో ఒకరిని మెప్పించక తప్పదు.. దాంతో అది తీవ్రమైన ఒత్తిడి కి దారి తీస్తోందిమరో వైపు ప్రస్తుతం అనేకమంది వ్యక్తిగత జీవితం లో ఇతరుల్ని ఇంప్రెస్ చేయడం కన్నా తమని తాము ఎక్స్ ప్రెస్ చేయడానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అయితే అది అంత సులభం గా జరిగేది కాదు.. అందుకే ఒంటరి జీవితాలు కూడా పెరుగుతున్నాయ్ ఈ నేపథ్యంలోనే సోలో డేటింగ్ అనే భావన కూడా పుంజుకుంది.అమెరికా, యూరప్ దేశాల్లో సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్గా మారింది. మి టైమ్, సోలో డేట్, సెల్ఫ్ లవ్ అనే హాష్ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్లో అయితే "ఒంటరి డైనింగ్" (సోలో డైనింగ్) అనేది రెస్టారెంట్లలో ప్రత్యేక కాన్సెప్ట్గా ప్రవేశపెట్టారు. ఒంటరిగా వచ్చిన వారికోసం ప్రత్యేక టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా "సోలో ట్రావెల్ & డేటింగ్" ప్యాకేజీలు అందిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా యువత, ముఖ్యంగా మెట్రో సిటీస్లో, వీకెండ్ సోలో డేట్స్ ని ట్రెండ్గా మార్చుకుంటున్నారు. ఇప్పటి బిజీ జీవితంలో "సెల్ఫ్ కేర్" అనే భావనకు కొత్త దిశ గా దీన్ని పేర్కొoటూన్నారు సోలో డేటింగ్... ఇలాఇది మనం మనకోసమే ప్లాన్ చేసుకునే ఒక ప్రత్యేక సమయం. ఇది కేవలం ఒంటరిగా ఉండటం కాదు, ఒక రొమాంటిక్ పార్ట్నర్ తో వెళ్ళినట్టు మనకోసమే మనం వెళ్లడం.. ఒక డేట్ ప్లాన్ చేసుకోవడం. ఆ రోజు న ఏదైనా కాఫీ షాప్ లోనో కల్చరల్ స్పేస్ లోనో కూర్చోవడం, సినిమా, డ్రామా.. వంటివి చూడటం, ప్రకృతి మధ్యలో ట్రెక్కింగ్ చేయడం, లేదా మనసుకు నచ్చిన చోటు ఎక్కడికైనా వెళ్లడం వంటివన్నీ ఇందులోకి వస్తాయి.సోలో డేటింగ్ ప్రత్యేకత ఏమిటి?ఇంటెన్షనల్ టైమ్ అలోన్ – యాదృచ్చికంగా ఏదో ఒంటరిగా ఉండటం కాదు, ప్రణాళిక బద్దంగా నాణ్యమైన సమయం మనకోసమే సమయం కేటాయించుకోవడం.ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ – కాంప్రమైజ్ అవకుండా మనకిష్టమైనదే చేయడం.ప్రెజర్ లెస్ హ్యాపీ నెస్ – ఎవరినీ ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేకుండా, మన మనసు చెప్పింది అనుసరించడం.సోలో డేటింగ్... ప్రయోజనాలుకాన్ఫిడెన్స్ పెరుగుతుంది – ఒంటరిగా ఆనందించగలం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఇతరుల పై ఆధారపడడం తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది – సామాజిక బాధ్యతల నుండి విరామం లభిస్తుంది.సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది – నిజంగా మనకు ఏం కావాలో మనకు నచ్చినది ఏంటో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.స్పాంటేనియిటీ పెరుగుతుంది – ఇతరుల కోసం ఎదురు చూడకుండా కొత్త విషయాలు ప్రయత్నించే ధైర్యం వస్తుంది.సోలో డేటింగ్ కోసం...కొన్ని ఎంపికలుపార్క్లో పుస్తకంతో పిక్నిక్పెయింటింగ్ లేదా పొటరీ క్లాస్ఒంటరిగా సినిమా లేదా మ్యూజియం సందర్శనమనసుకు నచ్చిన మ్యూజిక్ తో ఒక లాంగ్ డ్రైవ్రెస్టారెంట్లో ఫ్యాన్సీ డిన్నర్...అంతర్జాతీయ ట్రెండ్స్అమెరికా, యూరప్ దేశాల్లో సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్గా మారింది. #MeTime, #SoloDate, #SelfLove అనే హాష్ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చివరగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, సోలో డేటింగ్ అనేది లొన్లీగా ఫీల్ అవ్వడం కాదు. అది మనసు నింపుకోవడం, మనల్ని మనమే ప్రేమించడం. ఒంటరి తనం ప్రాప్తించింది అంటే భాధ కలుగుతుంది కానీ ఈ ఒంటరి తనం ప్లాన్ చేసుకుంది అంటే ఏదో సాధించిన ఆనందం ఆవరిస్తుంది అంటున్నారు సైకాలాజిస్ట్స్..ఎస్. సత్యబాబు -
11 ఏళ్ల బంధానికి స్వస్తి? భార్యకు కన్నడ హీరో విడాకులు!
కన్నడ హీరో అజయ్ రావు (Ajay Rao) వైవాహిక బంధానికి బీటలు వారిందంటూ కొంతకాలంగా ప్రచారం జోరందుకుంది. 11 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ భార్య స్వప్న విడాకుల కోసం దరఖాస్తు చేసిందని టాక్ నడుస్తోంది. కొద్ది నెలలుగా భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా గృహ హింస కింద భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని రూమర్లు వినిపిస్తున్నాయి.తెలీదంటూనే..తాజాగా ఈ వ్యవహారంపై అజయ్ పెదవి విప్పాడు. నా భార్య కోర్టుకు వెళ్లిందా? ఏమో, నాకైతే తెలియదు. ఈ విషయం గురించి నా భార్యతో మాట్లాడతాను అన్నాడు. అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇలాంటి సున్నిత వ్యవహారంపై గోప్యత పాటించాలని కోరుతున్నాను. మా వ్యక్తిగత విషయాల గురించి ఎవరూ ఎటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని విన్నపిస్తున్నాను. సమస్యలనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి. దయచేసి మా ఫ్యామిలీ విషయాలను పబ్లిసిటీ చేయొద్దు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చాడు.ఈ మధ్యే గొడవలు?కాగా అజయ్-స్వప్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2014 డిసెంబర్ 18న వీరి వివాహం జరిగింది. 2019లో వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు చెరిష్మా జన్మించింది. 2024లో అజయ్ బెంగళూరులో ఓ ఇల్లు కొనుక్కుని భార్యాకూతురితో సహా అందులోకి షిఫ్ట్ అయ్యాడు. ఈ గృహప్రవేశ వేడుకకు కన్నడ సినీప్రముఖులు సైతం హాజరయ్యారు. ఇటీవలే అజయ్ నిర్మాతగా మారాడు. యుద్ధకాండ 2 అనే సినిమాను నిర్మించడంతో పాటు అందులో హీరోగా నటించాడు.సినిమాతో భారీ నష్టాలుఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ గొడవలు పెద్దవి కావడంతో ఇన్స్టాగ్రామ్లోనూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతదూరం వెళ్తుందో చూడాలి! ఇకపోతే అజయ్ రావు.. ఎక్స్క్యూజ్మీ (2003) సినిమాతో హీరోగా మారాడు. తాజ్ మహల్, ప్రేమ్ కహానీ, కృష్ణ లవ్ స్టోరీ, కృష్ణ-లీల వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. రొమాంటిక్ హీరో ఇమేజ్ కారణంగా అతడికి సాండల్వుడ్ కృష్ణ అనే బిరుదు దక్కింది. ఇతడు చివరగా యుద్ధకాండ చాప్టర్ 2 చిత్రంలో కనిపించాడు. View this post on Instagram A post shared by Krishna Ajai Rao (@krishna_ajai_rao) చదవండి: DNA బ్యూటీ ఛాతీ పైభాగంలో టాటూ.. అర్థమేంటో తెలుసా? -
యూపీలో రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. యోగితో పూజా పాల్ భేటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమాజ్వాద్ పార్టీ(ఎస్పీ) నుంచి బహిష్కరణ ఎదుర్కొన్న ఎమ్మెల్యే పూజా పాల్ తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సమావేశమయ్యారు. లక్నోలోని సీఎం నివాసంలో యోగితో ఆమె భేటీ అయ్యారు. దీంతో, ఆమె బీజేపీలో చేరుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఇటీవల యూపీ అసెంబ్లీలో ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్.. బీజేపీ ప్రభుత్వం, సీఎం యోగి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో ఇటీవల విజన్ డాక్యుమెంట్ 2047పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూజా పాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. యూపీలో నేరగాళ్లపై యోగి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. నేరాల అదుపు కోసం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వైపే చూస్తోందన్నారు. తన భర్త (బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్) హత్య కేసులో నిందితుడు అతీక్ అహ్మద్ ఆగడాలపై చర్యలు తీసుకోవడంతో తనకు న్యాయం జరిగిందన్నారు. దీంతో, అసెంబ్లీలో బీజేపీ నేతలు కూడా ఆమె వ్యాఖ్యలపై సంతోషం వ్యక్తం చేశారు.Samajwadi Party expelled MLA Pooja Pal met Chief Minister Yogi Adityanath at his official residence in Lucknow(Source: UP CMO) pic.twitter.com/H2Bv99U2SM— ANI (@ANI) August 16, 2025ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను సమాజ్వాజ్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సీరియస్గా తీసుకున్నారు. పూజా వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ సందర్భంగా అఖిలేష్.. పూజా పాల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డరని పేర్కొన్నారు. అనంతరం, ఆమెపై వేటు వేశారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ఆమె చర్యలు పార్టీకి నష్టం కలిగించారని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె.. సీఎం యోగిని కలవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. Samajwadi Party expelled MLA Pooja Pal after she praised CM @myogiadityanath ji in her assembly speech for delivering justice through the encounter of gangster Atiq Ahmed.She recalled how Atiq Ahmed murdered her husband and how it was CM Yogi who ensured justice.This is… pic.twitter.com/9sS9E3u8Wj— Tulla Veerender Goud (@TVG_BJP) August 14, 2025 -
Mumbai: ఘనంగా గణపతి ఆగమన్.. ఊరూవాడా సంబరాలు
ముంబై: మహానగరం ముంబైలో ఈనెల 27 నుంచి జరగబోయే గణేశుని ఉత్సవాలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గణేశుని మండపాలకు విగ్రహాలను తరలించే ‘గణపతి ఆగమన్’ అంత్యంత వేడుకగా జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆగస్టు 27న వినాయక చవితి జరగనుండగా, ఇప్పటికే విగ్రహాలను తీసుకువచ్చి పందిళ్లలో నెలకొల్పుతున్నారు. ఈ సందర్బంగా జరుగుతున్న ఆగమన్ వేడుకలు వీధివీధినా కనిపిస్తున్నాయి. డ్రమ్స్ దరువుల మధ్య గణపతి బప్పా మోర్యా నినాదాలు మార్మోగుతున్నాయి. ముంబైలోని ప్రముఖ గణేశ్ విగ్రహ తయారీ కేంద్రాలలో ఒకటైన పరేల్ నుండి వివిధ ప్రాంతాలకు గణపతి విగ్రహాలు తరలివెళుతున్నాయి. Ganpati Aagaman 2025Parelcha Maharaja & Govinda #GanpatiBappaMorya pic.twitter.com/HjzyAvnaoj— मुंबई Matters™🇮🇳 (@mumbaimatterz) August 10, 2025దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే గణేశ్ నవరాత్రులు ముంబై అంతటా అత్యంత వైభవంగా జరుగుతాయి. గణేష్ ఉత్సవం 2025 దగ్గర పడుతున్నందున, మండపాల కోసం తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు వస్తున్న దరఖాస్తులను బృహన్ ముంబై విద్యుత్ సరఫరా అధికారులు త్వరతిగతిన క్లియర్ చేస్తున్నారు. -
మీ పిల్లలను కోటీశ్వరులను చేయొచ్చు..
పిల్లల భవిష్యత్తు కోసం, వారి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి తల్లిదండ్రులూ ఆలోచిస్తారు. ఇందు కోసం ఎంతో కొంత పొదుపు చేయాలని ఆరాటపడతారు. ముఖ్యంగా ఉన్నత విద్య, ప్రత్యేక శిక్షణలు, విదేశీ కోర్సులు వంటి ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగానే వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరం. ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేస్తే తక్కువ కాలంలోనే వారికి దాదాపు కోటి రూపాయలు కూడబెట్టవచ్చు.పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టేందుకు అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచ్వల్ ఫండ్స్, బంగారం, ప్రభుత్వ పొదుపు పథకాల వంటి వివిధ పెట్టుబడి సాధనాల సమ్మిళితంతో పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను సులువుగానే కూడబెట్టవచ్చు. వీటిలో మ్యూచ్వల్ ఫండ్స్ సిప్లు (SIP) అధిక వృద్ధి అవకాశాలను అందిస్తే, పీపీఎఫ్ (PPF) లాంటి పథకాలు భద్రతతో పాటు పన్ను ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. బంగారం పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే సాధనంగా పనిచేస్తుంది.15 ఏళ్లలో రూ.కోటి కూడబెట్టే ప్రణాళికమ్యూచువల్ ఫండ్స్ – సిప్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.6,000 - ప్రతి సంవత్సరం 10% పెంపు - రాబడి అంచనా: 12% - మొత్తం పెట్టుబడి: రూ.22.87 లక్షలు - అంచనా లాభం: రూ.29.22 లక్షలు - తుది మొత్తం: రూ.52.10 లక్షలు బంగారంపై..- నెలవారీ పెట్టుబడి: రూ.5,500 - రాబడి అంచనా: 10% - మొత్తం పెట్టుబడి: రూ.9.90 లక్షలు - అంచనా లాభం: రూ.13.08 లక్షలు - తుది మొత్తం: రూ.22.98 లక్షలు పీపీఎఫ్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.7,500 - వడ్డీ రేటు: 7.1% - మొత్తం పెట్టుబడి: రూ.13.50 లక్షలు - వడ్డీ లాభం: రూ.10.90 లక్షలు - తుది మొత్తం: రూ.24.40 లక్షలు పై మూడు మార్గాల్లో చెప్పినట్లు ప్రతినెలా 15 ఏళ్లపాటు పొదుపు చేస్తే తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను చేరుకోవచ్చు. ఇది కేవలం ఊహజనిత ప్రణాళిక మాత్రమే. పైన పేర్కొన్న రాబడులు అంచనా మాత్రమే. తల్లిదండ్రులు తమకు అనువైన పెట్టుబడి మార్గాలను ప్రయత్నించవచ్చు.ఘ👉 ఇదీ చదవండి: కస్టమర్లకు వింత షాకిచ్చిన ఎస్బీఐ -
డాలస్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. "దేశ స్వాతంత్ర్య సముపార్జనలో, సర్వసం త్యాగం చేసి అసువులు బాసిన సమరయోధులకు, గాంధీ, నెహ్రు, వల్లభ భాయ్ పటేల్, నేతాజీ శుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల కృషి ఎంత కొనియాడినా తక్కువే అన్నారు. డా. తోటకూర భారత పతాక ఆవిష్కరణ చేసి, శుక్రవారం పనిరోజు అయినప్పటికీ, ఉదయమే ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయలు హాజరుకావడం వారి మాతృ దేశభక్తిని చాటు తుందని అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి డబుల్ హార్స్ వారు ఇండియా నుంచి పంపిన అందరికీ ప్రీతి పాత్రమైన తెలుగింటి సున్నిండలు అందరి ముఖాలలో చిరునవ్వులు చిందించాయి. బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, మహేందర్ రావు, రాజేంద్ర వంకావాల, తిరుమల్ రెడ్డి కుంభం, జస్టిన్ వర్గీస్, భారతి మిశ్రా, కళయ్ కృష్ణమూర్తి తదిర నాయకులు హాజరైనారు.(చదవండి: బ్రూనై తెలుగు సంఘం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు) -
సొరకాయ, కీరదోసతో స్నాక్స్ చేసేద్దాం ఇలా..!
గోవా ప్రాన్స్ రిషాయిడోకావలసినవి: రొయ్యలు– ఒక కప్పు (శుభ్రపరిచి హాఫ్ బాయిల్ చేçసుకోవాలి)ఉల్లిపాయ– ఒకటి (చిన్నది, తరిగినది)పాలు– అర కప్పుఉప్పు, మిరియాల పొడి– రుచికి తగినంతమైదాపిండి– ఒక కప్పు పైనేనీళ్లు, నూనె– సరిపడాగుడ్లు– 2 (పగలగొట్టి, కొద్దిగా పాలల్లో కలిపి పెట్టుకోవాలి)బ్రెడ్ పౌడర్– ఒక కప్పుతయారీ: ముందుగా కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని; ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగిన తర్వాత రొయ్యలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకుని; మూతపెట్టి చిన్నమంట మీద బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు మైదాపిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఉండను పూరీలా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. రొయ్యల మిశ్రమం బాగా ఉడికిన తర్వాత కాస్త చల్లారనిచ్చి, కొద్దికొద్దిగా పూరీల్లో నింపుకుని చిత్రంలో చూపిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని గుడ్లు, పాల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి.సొరకాయ మంచూరియాకావలసినవి: సొరకాయ తురుము– 1 కప్పుమైదాపిండి– 4 టేబుల్ స్పూన్లు, కార్న్ పౌడర్– 1 టేబుల్ స్పూన్ , గోధుమపిండి– 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్– అర టీ స్పూన్, కారం– 1 టీ స్పూన్ , జీలకర్ర– అర టీ స్పూన్ , ఉల్లిపాయ ముక్కలు– 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి), పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి), కొత్తిమీర తురుము, కరివేపాకు– కొద్ది కొద్దిగా (అభిరుచి బట్టి), ఉల్లికాడ ముక్కలు– కొద్దిగా, టమాటో సాస్– 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్– 2 టీ స్పూన్లు, సోయా సాస్– 1 టీ స్పూన్ , నూనె– సరిపడా, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని; అందులో సొరకాయ తురుము, మైదాపిండి, కార్న్ పౌడర్, గోధుమపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత మరో కళాయి తీసుకుని; అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని; ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.పికిల్డ్ కుకుంబర్కావలసినవి: కీర దోసకాయలు– 3 లేదా 4 మధ్యస్థ పరిమాణంలో వెల్లుల్లి– 2 రెబ్బలు (సన్నగా తరగాలి)అల్లం– ఒక చిన్న ముక్క (సన్నగా తురుముకోవాలి)సోయా సాస్, వెనిగర్– 2 టేబుల్ స్పూన్లు చొప్పుననువ్వుల నూనె– ఒక టీ స్పూన్చిల్లీ ఫ్లేక్స్– అర టీస్పూన్పంచదార పొడి– ఒక టీస్పూన్పుల్లలు– 2–3 తయారీ: ముందుగా కీర దోసకాయలను శుభ్రంగా కడిగి, చివరలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై చిత్రంలో ఉన్న విధంగా కీర దోసకాయల తొక్కతీసి, కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిపై ఉప్పు జల్లి పది నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత దోసకాయలను చల్లటి నీటితో శుభ్రంగా కడిగి, పొడిగా తుడవాలి. ఈలోపు ఒక గిన్నెలో సన్నగా తరిగిన వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, సోయా సాస్, వెనిగర్, నువ్వుల నూనె, పంచదార వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బ్రష్తో కీరాలకు పూయాలి. ఇప్పుడు వాటిని ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచి, సర్వ్ చేసుకునే ముందు వాటికి పుల్లలు గుచ్చి సర్వ్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. (చదవండి: ఈ చిరుజల్లుల్లో టేస్టీ టేస్టీ స్నాక్స్ చేసేద్దాం ఇలా..!) -
కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్
కోలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), వడివేలు నటించిన చిత్రం 'మారీశన్'(Maareesan).. జులైలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ సుదీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్స్లో ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠతకు గురిచేసింది. కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, లివింగ్స్టన్, తీనప్పన్, రేణుక, శరవణన్ సుబ్బయ్య వంటి వారు నటించారు. సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.ఆగష్టు 22 నుంచి నెట్ఫ్లిక్స్లో మారీశన్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళ్తో పాటు తెలుగు, హిందీ,కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమా ఫహాద్ ఫాజిల్కి మరో విభిన్న పాత్రను అందించగా, వడివేలు హాస్యంతో పాటు భావోద్వేగాన్ని కూడా చూపించారు. మీరు కామెడీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడితే.. మారీశన్ తప్పక చూడవచ్చు.దయాలన్ (ఫహాద్ ఫాజిల్) అనే దొంగ, వేలాయుధం పిళ్లై (వడివేలు) అనే అల్జీమర్స్ బాధితుడి వద్ద చాలా డబ్బు ఉందని తెలుసుకుంటాడు. వేలాయుధం తన స్నేహితుడిని కలవడానికి ఊరికి బయలుదేరుతాడు. దయాలన్ అతన్ని మాటలతో మాయ చేసి, తన బైక్పై తీసుకెళ్తాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగింది? దయాలన్ దోచుకున్నాడా..? లేక వేలాయుధం పరిస్థితిని చూసి మారిపోయాడా..? అనే ప్రశ్నలకి సమాధానం ఈ సినిమాలో ఉంటుంది. -
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. రాజగోపాల్రెడ్డిపై యాక్షన్!
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే చాన్స్ ఉంది.అంతకుముందు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ..‘వరంగల్ పంచాయతీపై నలుగురిని అక్కడికి పంపాలని నిర్ణయం తీసుకున్నాం. వారు ఎవరెవరు అనేది పార్టీ సూచిస్తుంది. నేను మంటలు పెట్టడానికి లేను. చల్లార్చే పనిలో ఉన్నాను. నా పని ఫైరింజన్ చేసే పని. పీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ నాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్లపై చర్చ చేశారు.. పరిశీలిస్తాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరితే మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పారని, కానీ మాట తప్పారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మంత్రి పదవి లభించలేదనే కారణంతో అసహనానికి గురైన రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. -
ఆసియా కప్కు పాక్ జట్టు ప్రకటన.. అనుకున్నదే జరిగింది..!
యూఏఈ వేదికగా త్వరలో జరుగనున్న ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 17) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించినట్లుగానే స్టార్ ఆటగాళ్లుగా చెప్పుకునే బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్లకు చోటు దక్కలేదు. సల్మాన్ అలీ అఘా కెప్టెన్గా కొనసాగనున్నాడు. వేటు పడుతుందని భావించిన మరో స్టార్ షాహీన్ అఫ్రిది జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.పాక్ సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు పెద్ద పీఠ వేశారు. రిజ్వాన్ స్థానంలో మహ్మద్ హరీస్ వికెట్కీపర్గా ఎంపికయ్యాడు. ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ లాంటి గుర్తింపు ఉన్న ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కింది.పాక్ సెలెక్టర్లు ఇదే జట్టుకు ఆసియా కప్కు ముందు యూఏఈలోనే జరిగే ట్రై సిరీస్కు కూడా ఎంపిక చేశారు. ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే ఈ ట్రై సిరీస్లో పాక్తో పాటు ఆతిథ్య జట్టు యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్ పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆసియా కప్ ప్రారంభమవుతుంది (సెప్టెంబర్ 9-28 వరకు). ఈ ఖండాంతర టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. పాక్, భారత్.. ఒమన్, యూఏఈతో కలిసి ఒకే గ్రూప్లో (ఏ) ఉన్నాయి.ఆసియా కప్లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్లో జరుగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరో రెండు మ్యాచ్లకు కూడా ఆస్కారం ఉంది. అయితే ఈ టోర్నీలో భారత్ పాల్గొంటుందా లేదా అన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. పహల్గాం దాడి తర్వాతి పరిణామాల్లో భారత్ పాక్ను అన్ని విషయాల్లో వెలి వేసింది. క్రికెట్ సహా అన్ని రంగాల్లో పాక్ను బహిష్కరించింది.ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో భారత్ పాక్తో మ్యాచ్లను బాయ్కాట్ చేసింది. ఆసియా కప్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. భారతీయులంతా పాక్తో ఏ విషయంలోనూ సంబంధాలు కోరుకోవడం లేదు. ట్రై సిరీస్, ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్ -
దివ్యాంగుడి కుమార్తెకు ఎస్ఐ బెదిరింపులు
సాక్షి, చిత్తూరు జిల్లా: ‘ఏయ్.. ఎందుకు వీడియోలు తీస్తావ్.. పో.. చెప్పుకో పో.. నా విధులకు ఆటంకం కలిగిస్తే.. నీకు మెడికల్ సీటు రాదు.. జైలుకు పంపిస్తా. తమాషా అనుకుంటున్నావా’.. అంటూ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎస్ఐ ఓ దివ్యాంగుడి కుమార్తెను బెదిరించారు. వివరాలివీ.. బంగారుపాళ్యం మండలం కరిడివారిపల్లికి చెందిన సుందరరాజు అనే దివ్యాంగుడుకి, హోంగార్డు కన్యాకుమార్ అనే వ్యక్తి మధ్య భూవివాదం తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు హోంగార్డుకు వత్తాసు పలుకుతున్నారని దివ్యాంగుడి కుమార్తె వాణి ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసులు వచ్చే క్రమంలో వీడియో తీసింది. దీంతో ఎస్ఐ.. ‘ఏయ్ ఎందుకు వీడియోలు తీస్తున్నావ్..’ అంటూ వాణిని అడ్డుకోబోయారు. ఎందుకు నా ఫోన్ లాక్కున్నారంటూ వాణి పోలీసులను ప్రశి్నంచింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాననడంతో.. ‘పో.. చెప్పుకో.. పో.. నా విధులకు ఆటంకం కలిగిస్తే నీకు మెడికల్ సీటు రాకుండా చేస్తా. జైలుకు పంపిస్తా. తమాషా చేస్తున్నావా’.. అంటూ ఆ యువతిపై ఎస్సై మండిపడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎస్ఐ తీరుపై వికలాంగుల సంఘాలు మండిపడుతున్నాయి. -
ఎందుకంత ఏడుపు? కుక్కలనే పెళ్లి చేసుకోవచ్చుగా!: ఆర్జీవీ
ఢిల్లీ వీధుల్లో శునకాలు కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆగస్టు 11న తీర్పు వెలువరించింది. 8 వారాల్లోగా కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని ఎవరు అడ్డుకున్నా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ తీర్పును జంతుప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూగజీవాలపై దయ చూపించాలని కోరుతున్నారు. తీర్పు వెనక్కు తీసుకోవాలని హీరోయిన్ సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హ.. ఇలా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకుంటున్నారు.కుక్క కోసం కన్నీళ్లా?సదా అయితే శునకాలను చంపేస్తారు, ఏం చేయాలో తెలియట్లేదు దేవుడా.. అంటూ బోరున ఏడ్చేసింది. ఇలాంటివారిపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనుషులు చనిపోతే పాపం అనట్లేదుకానీ కుక్కల కోసం కన్నీళ్లు కారుస్తున్నారా? అని మండిపడ్డాడు. అదే సమయంలో జంతుప్రేమికులకు ఇవే నా సలహాలు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశాడు.🐶 పేద ప్రజలను దత్తత తీసుకుని వారిని మీ ఇంట్లో ఉంచుకోండి. అన్ని వీధులను కుక్కలకు వదిలేయండి.🐶 శునకాలు మీ కుటుంబసభ్యులైతే వాటినే పెళ్లి చేసుకోవచ్చుగా!🐶 శునకాల జనాభా నియంత్రణకు బదులు వాటిపై మీ ప్రేమను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందిగా!🐶 మీ పిల్లల్ని వీధి కుక్కలతో ఆడుకునేందుకు పంపించండి.🐶 వీధుల్లో శునకాలు స్వేచ్ఛగా తిరగాలంటున్నారు. మరి మీ బ్రీడ్ డాగ్స్ను కూడా వీధుల్లో ఉండనివ్వండి. ఏసీ గదుల్ని వదిలేసి అవి వీధుల్లో ఎలా మనుగడ సాగిస్తాయో చూద్దాం.🐶 పిల్లలతో సమానంగా కుక్కలకూ సమానహక్కులు ఉన్నాయంటున్నారు. అలాంటప్పుడు డాగ్స్ కోసం పాఠశాలలు, పిల్లల కోసం బోన్లు నిర్మించండి.🐶 మీరెప్పుడైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్కు వెళ్లొద్దు, వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోండి.🐶 మీరు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చేసి వీధి కుక్కల్ని ఆ గదుల్లో నిద్రపోనివ్వండి.🐶 మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. కాబట్టి గుడిలో దేవుళ్ల స్థానంలో కుక్కలను పెట్టండి. మోక్షం కోసం వాటినే ప్రార్థించండి.🐶 'కుక్కలను దత్తత తీసుకోండి- పిల్లల్ని చంపండి' పేరిట ఓ ఫౌండేషన్ ప్రారంభించండి.🐶 వీధికుక్కలు నిరుపేదలపైనే దాడి చేస్తుంటే.. మురికివాడలో ఉన్నవాళ్లందరినీ మీ విల్లాలోకి పంపించండి. మీ బ్రీడ్ శునకాలను వీధుల్లో కాపలాగా పెట్టండి.🐶 పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల్ని ఎవరైనా చంపేస్తే వాటికోసం సంతాపసభ నిర్వహించండి. HERE are some FANTASIC SOLUTIONS for DOG LOVERS regarding their Mmmmuuuaahhh for STREET DOGS 1.Why don’t you adopt all the poor people and bring them into your homes and leave the streets for the dogs?2.If dogs are like your family, then why not marry your Labradors, Huskies…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025Here are my 10 points addressing the DOG LOVERS who are UPSET about the SUPREME COURT’S decision on STRAY DOGS 1. People are being bitten and killed all over by stray dogs. And dog lovers are busy tweeting about dog rights.😳https://t.co/9RLkoJdqOE can love your pets in your…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025చదవండి: అఖిల్ మూవీలో జగపతిబాబును వద్దన్న నాగార్జున -
జూ.ఎన్టీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. ఆర్కే రోజా రియాక్షన్
సాక్షి, తిరుపతి: జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమా, రాజకీయాలు మిక్స్ చేయెద్దంటూ ఆమె హితవు పలికారు. అరచేతితో సూర్యుడ్ని ఆపలేరన్నారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొన్నా.. అభిమానులు పవన్ సినిమాకు రాలేదంటూ రోజా వ్యాఖ్యానించారు.ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్త్రీశక్తి పేరుతో మహిళలను దగా చేశారని ఆమె మండిపడ్డారు. 16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారంటూ రోజా దుయ్యబట్టారు. 14 నెలలు తర్వాత స్తీశక్తి బస్సు ప్రారంభించారు. లోకల్గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సులకు అమలు చేశారు’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.‘‘రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి.. ఇవాళ ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కోతలు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. తిరుమల, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం పుణ్య క్షేత్రాలకు ఉచిత దర్శనం లేదు. భగవంతుడు పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. మహిళల్ని మోసం చేశారు. పల్లె వెలుగు బస్సుల్లోనే పంపిస్తామని ఎన్నికలు ముందు మీరు చెప్పారు. మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు...కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. సూపర్ సిక్స్.. హిట్ కాదు.. సూపర్ ప్లాప్. తిరుపతి నుంచి తిరుమలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు. శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ గుడి, సింహాచలానికి ఉచిత ప్రయాణం లేదు. ఆడబిడ్డ నిధి.. 18 ఏళ్లు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డ లేరు కాబట్టి.. చంద్రబాబుకు ఆడవాళ్లను గౌరవించడం తెలీదు. కానీ, పవన్ కళ్యాణ్కు ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్నించాలి.జగనన్న ఆడబిడ్డలకు చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసమే.. అబద్ధాలు చెప్పారు. మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలో బాగుపడింది లేదు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటూ చెప్పి చంద్రబాబు మోసం చేశాడు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పట్టాలు తప్పిన పాక్ రైలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం నాడు లోధ్రాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెషావర్ నుండి కరాచీకి వెళ్తున్న అవామ్ ఎక్స్ప్రెస్ రైలు లాహోర్కు దాదాపు 400 కి.మీ దూరంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు కోచ్లు చెల్లాచెదురయ్యాయి. డిప్యూటీ కమిషనర్ లుబ్నా నజీర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్దారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు. One killed, several injured as passenger train derails in Pakistan's Punjab#trainaccident #Pakistan #awamexpresshttps://t.co/UiKhnREKAy— IndiaTV English (@indiatv) August 17, 2025ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. అధికారులు దెబ్బతిన్న కోచ్లను పక్కకు తొలగిస్తున్నారు. ట్రాక్ను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో పాక్లోని పంజాబ్లో ఇది మూడవ రైలు ప్రమాదం. కొన్ని రోజుల క్రితం ముసా పాక్ ఎక్స్ప్రెస్ రైవిండ్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగస్టు ప్రారంభంలో ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. నాడు 10 కోచ్లు బోల్తాపడి, 30 మంది గాయపడ్డారు. వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
నార్కోలెప్సీ: స్లీప్లోకి స్లిప్!
కొందరు ఎక్కడ ఉంటే అక్కడ నిద్రలోకి జారిపోతుంటారు. ఇలా బస్సెక్కగానే అలా నిద్రపోతుంటారు. వాళ్లను చూసినప్పుడు కొంతమంది వాళ్లంత అదృష్టవంతులు లేరని అంటుంటారు. ఇలా పడుకోగానే అలా నిద్రపట్టేయడం మంచిదే. అయితే నిద్రకు ఉపక్రమించినప్పుడు నిద్రపట్టడానికీ... తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోవడానికీ తేడా ఉందంటున్నారు వైద్యనిపుణులు. కొందరు కూర్చుని పనిచేస్తూ చేస్తేనే... మరికొందరు కూర్చుని తింటూ తింటూ కూడా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ‘నార్కొలెప్సీ’ అనే స్లీప్ సమస్య ఉన్నవారు పట్టపగలు తాము పని చేస్తూ చేస్తూనే తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. దీన్ని ఒక రకం స్లీప్ డిజార్డర్గా పరిగణించాలి.నార్కోలెప్సీ ఎలా వస్తుందంటే...? నిద్రలో కొన్ని దశలు అంటే స్లీప్ సైకిల్స్ నడుస్తుంటాయి. మొదట ప్రాంరంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ దశలవారీగా స్లీప్సైకిల్స్ కొనసాగుతుంటాయి. వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఈ ఆర్ఈఎమ్ నిద్ర దశ సాధారణం కంటే వేగంగా వచ్చేస్తుంది. ఈ దశలో కను΄ాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.ఎందుకో ఇప్పటికీ పెద్దగా తెలియదు... ఈ సమస్య జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి కుటుంబాల్లోని పిల్లల్లో కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. అయితే నార్కొలెప్సీ ఎందుకొస్తుందనే అంశం ఇంకా నిర్దిష్టంగా తెలియరాలేదు. ఈ సమస్యతో బాధపడేవారు హెవీ మెషిన్స్, డ్రైవింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. చికిత్స... నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిసెతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. వారు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. ఇప్పటికి దీనికి పూర్తిగా చికిత్స లేక΄ోయినా నార్కోలెప్సీతో బాధపడేవారు స్లీప్ స్పెషలిస్టులను సంప్రదిస్తే... వారు కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్, యాంఫిటమైన్ మందులతో కొంతవరకు మంచి ఫలితాలు వచ్చేలా చూస్తారు. అలాగే ఈ సమస్య తాలూకు మేనేజ్మెంట్ ఎలాగో సూచిస్తారు. డా‘‘ రమణ ప్రసాద్, సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్, పల్మునాలజిస్ట్, హైదరాబాద్ (చదవండి: -
మెజారిటీ వ్యాధులకు మూలం మనసే
ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఈ మాట మనకు అంతగా రుచించకపోయినా, ఒకసారి కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లొస్తే బా..గా... అర్థమవుతుంది. అందుకే ఈ మధ్య హెల్త్ కాన్షన్ బాగా పెరిగింది. అయితే నిజానికి అర్థం కావాల్సింది మానసిక ఆరోగ్యం లేకుండా శారీరక ఆరోగ్యం లేదన్నదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే మాట చెప్తోంది.వైరస్, బాక్టీరియా, గాయాలు, జన్యుపరమైన సమస్యలు తప్ప, మిగతా దీర్ఘకాలిక వ్యాధుల్లో మన భావోద్వేగాలు, జీవనశైలి, ఆలోచనలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనకు వచ్చే శారీరక వ్యాధుల్లో 70 శాతం cవల్లేనన్నది సైంటిఫిక్ స్టడీస్ లో తెలిసిన, తెలుస్తున్న విషయం.శరీరం-మనసు మధ్య unresolved conflicts వల్లే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయనేది భయపెట్టే విషయం కాదు, నిజానికి ఆశ కలిగించే సత్యం. ఎందుకంటే జబ్బుకు మూలం మనసులో ఉంటే, పరిష్కారం కూడా మనసునుండే మొదలవుతుంది.సైకోసొమాటిక్ మోడల్‘సైకోసొమాటిక్’ అంటే మానసిక-భావోద్వేగ కారకాలు శరీరంపై ప్రభావం చూపుతాయని. మనసు (psyche) లో మొదలైన బాధ, మెదడు (brain) ద్వారా సంకేతమై, శరీరం (soma)లో వ్యక్తమవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, అణచివేసిన భావాలు, భయం, బాధ, కోపం-ఇవి నాడీవ్యవస్థ సిగ్నల్స్ ద్వారా హార్మోన్లు, ఇమ్యూన్ వ్యవస్థ, అవయవాల పనితీరును మార్చుతాయి. ఫలితంగా మైగ్రేన్ నుంచి IBS వరకు, ఆస్తమా నుంచి నిద్రలేమి వరకు చాలా సమస్యలు ముదిరిపోతాయి లేదా తిరిగి తిరిగి వస్తుంటాయి. ఎన్ని మందులు వాడినా తగ్గవు.ఒత్తిడి సంబంధిత ప్రధాన వ్యాధులుహృదయ సంబంధ వ్యాధులు – Emotional stress → Sympathetic overdrive → హార్ట్ ఎటాక్ రిస్క్.డయాబెటీస్ – Chronic anger/overwhelm → Insulin resistance.ఆటో–ఇమ్యూన్ డిసార్డర్స్ – Emotional suppression → Immune dysregulation.జీర్ణ సంబంధ వ్యాధులు – Anxiety → IBS, acid reflux.చర్మ సమస్యలు – Stress → Psoriasis, eczema flare-ups.సైంటిఫిక్ ఆధారాలుప్రైమరీకేర్ విజిట్స్ లో 60 నుంచి 80 శాతం ఫిర్యాదులు, అంటే తలనొప్పులు, నిద్రలేమి, జీర్ణ సమస్యలు, బీపీ, అలసట, చర్యవ్యాధులు లాంటి వాటికి మానసిక ఒత్తిడే కారణమని అమెరికన్ ఫ్యామిలీ మెడిసిన్ జర్నల్ (2012) చెప్తోంది. గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ లో మానసిక ఒత్తిడి, లైఫ్స్టైల్ ఫ్యాక్టర్స్ ప్రధాన పునాది అని ప్రపంచ ఆరోగ్యం సంస్థ 2017లో పేర్కొంది.దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలహీనపడటం, ఇన్ఫ్లమేషన్ పెరగడం, హార్మోనల్ డిస్టర్బెన్స్ రావడం... ఇవి అనేక వ్యాధులకు కారణమని హార్వర్డ్ మెడికల్ స్కూల్ రివ్యూ ఆర్టికల్ (2013) నిర్ధారించింది.ఎలా అంచనా వేయాలి? గత రెండు మూడేళ్లుగా పని ఒత్తిడి, ఇంటి సమస్యలు, నష్టాలు, అనారోగ్యాలు, నిద్రలేమిని గమనించండి. ఏ లక్షణం ఎప్పుడు చెలరేగుతుంది? ఎవరి దగ్గర, ఏ మాటలకు, ఏ సన్నివేశం తర్వాత చెలరేగుతుందో గుర్తించండి. ఒత్తిడి, నొప్పి, అలసట, మూడ్, నిద్ర రోజువారీగా ఎలా ఉందో 0-10 స్కేల్ పై స్కోర్ చేయండి. వారినికి ఒకసారి గ్రాఫ్ చూసుకోండి. ఆకస్మికంగా ఛాతీనొప్పి, జ్వరం, తీవ్ర అలసటలాంటివి అనిపిస్తే తక్షణమే డాక్టర్ ను కలవండి.సమతుల్యతతోనే పరిష్కారం...1) నిద్ర, ఆహారం, కదలిక బ్యాలెన్స్ డ్ గా ఉండాలి. రోజుకు 7-9 గంటల నిద్ర ఒకే సమయంలో ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి... ప్రొటీన్, ఫైబర్, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 30-45 నిమిషాల నడక ఉండాలి. 2) నర్వస్-సిస్టమ్ రెగ్యులేషన్ ను ప్రాక్టీస్ చేయాలి. నిమిషానికి ఐదారు శ్వాసలు ఉండేలా 8-10 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. హమ్మింగ్ గార్గ్లింగ్, బాడీ స్కాన్ లాంటి ఎక్సర్సైజ్ ల ద్వారా వాగస్ నెర్వ్ ను బూస్ట్ చేయాలి. 3) మీరేం ఫీలవుతున్నారో అది రోజుకు పదినిమిషాలు రాయండి. సీబీటీ, యాక్ట్ లాంటి సైకోథెరపీ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి. “ఏం ఫీల్ అవుతున్నాను? దానికి నేను ఏ పేరుపెడతాను? నేడు చిన్నగా ఎలా విడుదల చేస్తాను?”ఎమోషన్ ప్రాసెసింగ్4) ఎదుటివారి మాటను యాక్టివ్ గా వినడం, ఒంటరితనపు ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు ఔషధం. అవసరమైనప్పుడు ‘ఇప్పుడు కాదు, రేపు ఉదయం మాట్లాడుకుందాం’ అని చెప్పడం నేర్చుకోండి. 5) వారానికొకసారి మీ జీవితానికి అర్థం, పరమార్థం, విలువలు, విశ్వాసాల గురించి చిన్న లిస్ట్ రాయండి. 6) మనసుతో చేసే పనులకు మందులు, డైట్, ఎక్సర్సైజ్ లు తోడైతే ఫలితం త్వరగా కనిపిస్తుంది. సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
కాలమూ కాటేస్తది..! పక్షవాతంపై సీజన్స్ ప్రభావం..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం రావడానికి మన సీజన్స్ కూడా ఓ అంశంగా ఉంటాయన్న విషయం తెలుసా? వేసవిలో ఒక రకంగా, వర్షకాలంలో మరో రకంగా, చలికాలంలో ఇంకో రకంగా ఇలా వేర్వేరు తీరుల్లోస్ట్రోక్ వచ్చేలా ఆయా కాలాలు పక్షవాతాన్ని పరోక్షంగా ట్రిగర్ చేస్తాయన్న సంగతీ మీకు తెలుసా? చాలామందికి తెలియని ఈ విషయాన్ని చూద్దాం... రండి...స్ట్రోక్ రావడానికి ఆ సీజన్ తాలూకు వాతావరణం కూడా కొంత మేర కారణమవుతుంటుంది. అలా కాలాలకూ స్ట్రోక్కూ సంబంధముంటుంది. ఆరుబయట అప్పుడుండే వాతావరణం దేహంలోపల ఉండే మెదడు స్ట్రోక్కు ఎలా కారణమవుతుందన్న కోణంలో చూసినప్పుడు... వాతావరణంలోని అప్పుడుండే ఉష్ణోగ్రత, తేమ... ఆమాటకొస్తే అప్పుడున్న వాతావరణంలోని గాలిలోని కాలుష్యాలూ (ఎయిర్ క్వాలిటీ) ఇవన్నీ స్ట్రోక్ను ప్రేరేపిస్తాయి. అదెలాగో తెలుసుకునే ముందు అసలు స్ట్రోక్ (బ్రెయిన్ స్ట్రోక్ / పక్షవాతం) అంటే ఏమిటో చూద్దాం.బ్రెయిన్ స్ట్రోక్ అంటే... అన్ని అవయవాల్లాగే మెదడుకూ ప్రతినిత్యం రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు అందుతుండాలి. పైగా మెదడు కీలకమైన అవయవం కావడంతో మొత్తం దేహానికి సరఫరా అవుతుండే రక్తంలోంచి 20 శాతం మెదడుకే సప్లై అవుతుంటుంది. ఇంతటి కీలకమైన మెదడుకు ఏ కారణంగానైనా రక్తసరఫరా జరగక΄ోవడం వల్ల పక్షవాతం / స్ట్రోక్ వస్తుంది. ఇందులోనూ మళ్లీ రెండు రకాలుగా రక్తం అందకపోవడం జరుగుతుంది. అవి... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడులోని రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల అక్కడి భాగాలకు రక్తప్రసరణ సరిగా జరగక వచ్చే స్ట్రోక్ను ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏయే భాగాలకు రక్తం అందదో ఆ సెంటర్స్ నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడులో రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తస్రావం అయి వచ్చే పక్షవాతాన్ని హేమరేజిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏ భాగంలో రక్తస్రావం అవుతుందో ఆ భాగం నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 3) ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) : ఇది ఒక రకంగా చూస్తే ఇస్కిమిక్ అటాకే గానీ... ఇందులో తొలుత పక్షవాతం లక్షణాలు కనిపించాక మళ్లీ అవి 24 గంటలలోపు తగ్గి΄ోయి బాధితులు దాదాపుగా రికవర్ అయితే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’గా చెబుతారు. అంటే... భారీ భూకంపం రావడానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల (ట్రిమర్స్)లాగే... ఓ పెద్ద స్ట్రోక్ రావడానికి ముందస్తు సూచనగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ ఈ మినీ–స్ట్రోక్ తాలూకు చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడక΄ోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్గా పరిగణిస్తారు. ఇక స్ట్రోక్ లక్షణాలైన... దేహంలోని ఒకవైపు భాగాలు బలహీనంగా మారడం, అయోమయం, మాట్లాడటంలో ఇబ్బంది / మాట ముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు భాగంపై నియంత్రణ కోల్పోవడం వంటివి కనిపిస్తే... ఆ బాధితులను తక్షణం ఆసుపత్రికి తరలించాలి. చివరగా... వాతావరణాన్నీ అందులోని మార్పులనూ మనమెవరమూ మార్చలేమూ, నియంత్రించలేం. అయితే మన వ్యక్తిగత అలవాట్లతో మంచి జీవనశైలి మార్పులతో ఆరోగ్యంగా ఉండటం ద్వారా పక్షవాతం ముప్పును నివారించగలం. కాబట్టి మంచి జీవనశైలితో వ్యక్తిగత ఆరోగ్య నిర్వహణతో స్ట్రోక్ ముప్పును తప్పించుకోవచ్చు.వేసవిలోని వేడిమి...డీ–హైడ్రేషన్ : ఎండాకాలంలో వాతావరణంలో విపరీతమైన వేడిమి ఉంటుంది. దాంతో ఒంట్లోని నీళ్లు చెమట రూపంలో చాలా ఎక్కువగా వాతావరణంలోకి చేరుతుండటంతో దేహం డీ–హైడ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే రక్తంలోని నీటిపాళ్లు తగ్గుతాయో అప్పుడు రక్తం చిక్కబడుతుంది. చిక్కబడ్డ రక్తం కాస్తా క్లాట్స్కు కారణమవుతాయనీ, దాంతో అవి స్ట్రోక్నూ ప్రేరేపించవచ్చన్న విషయం తెలిసిందే. వడదెబ్బ (హీట్స్ట్రోక్) : వడదెబ్బ కూడా స్ట్రోక్ ముప్పును పెంచడంతోపాటు ఆ టైమ్లో కనిపించే లక్షణాలనూ కనిపించేలా చేస్తుంది. అత్యంత ఎక్కువగా అలసటకూ / నీరసానికి గురి కావడం (ఓవర్ ఎగ్జర్షన్) : వేసవిలో తక్కువగా శ్రమ చేసినప్పటికీ ఆ శ్రమ తాలూకు లక్షణాలై అలసటా, నీరసం, నిస్సత్తువగా, తీవ్రంగా చెమటలు పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఎర్రటి ఎండలో దేహానికి తీవ్రమైన శ్రమ కలిగించడం జరిగితే... ఒకవేళ బాధితుల్లో ఇంతకు మునుపే రక్త΄ోటు వంటి రిస్క్ఫ్యాక్టర్లు ఉన్నవారైతే వాళ్లలో స్ట్రోక్ ముప్పు మరింతగా పెరుగుతుంది.వర్షాకాలంలో...ఇన్ఫెక్షన్లు : నీళ్లు పెరగడం కారణంగా అందులో వృద్ధి చెందే బ్యాక్టీరియల్ / వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా దేహంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల. రక్తపోటులో హెచ్చుతగ్గులు (బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్) : వాతావరణంలో వర్షం కురవబోయే ముందర తీవ్రమైన ఉక్కబోత లేదా వర్షం కురవగానే ఉండే చలి... ఇలా వర్షాకాలంలో వాతావరణంలోని వేడిమి అస్థిమితంగా ఉండటం వల్ల దానికి అనుగుణంగా రక్త΄ోటూ మారుతుంటుంది. ఇలా రక్త΄ోటు లోని హెచ్చుతగ్గులు (బీపీ ఫ్లక్చుయేషన్స్) స్ట్రోక్ ముప్పును పెంచుతాయి. వాతావరణంలోని అధిక తేమ, డీ హైడ్రేషన్ : మాన్సూన్ సీజన్లో వర్షం కురవబోయే ముందరి ఉక్క΄ోతతో దేహం డీ–హైడ్రేషన్కు గురికావడం... దాంతో రక్తం చిక్కబడటం వంటి అంశాలు రక్త΄ోటు ముప్పును పెంచుతాయి. ముప్పును పెంచే వ్యక్తిగత అంశాలు : నిజానికి సీజన్ల తాలూకు ఈ మార్పులన్నీ స్ట్రోక్ ముప్పును ప్రతి ఒక్కరిలోనూ సమానంగా పెంచవు. అంతకు మునుపే వ్యక్తిగతంగా రిస్క్ ఎక్కువగా ఉన్నవారిలో ఇవి స్ట్రోక్ ముప్పును పెంచుతాయి.చలికాలంలో...వాతావరణంలోని వేడిమి ఒక సెంటీగ్రేడ్ తగ్గినా... అది స్ట్రోక్ వచ్చే ముప్పును నాలుగు శాతం పెంచుతుందన్నది నిపుణులు గమనించిన అంశం. వాసోకన్స్ట్రిక్షన్ : చలికాలంలోని తీవ్రమైన చల్లదనం కారణంగా రక్తనాళాలు సన్నబారతాయి. ఇలా రక్తనాళాలు సన్నబారడాన్ని వాసోకన్స్ట్రిక్షన్ అంటారు. నాళం సన్నబారడంతో రక్తం ప్రవహించే వేగం (రక్తపోటు / బీపీ) పెరుగుతుంది. రక్తపు సాంద్రత పెరగడం : చల్లదనం కారణంగా అన్ని ద్రవాలూ చిక్కబడ్డట్టే రక్తమూ చిక్కబడుతుంది. ఇలా రక్తం చిక్కబడటం అన్నది రక్తంలో క్లాట్స్ పెరిగేలా చేసి స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. చురుకుదనం తగ్గడం : చలికాలంలో జనం వేసవిలో ఉన్నంత చురుగ్గా ఉండరు. వాళ్ల కదలికలూ మందగిస్తాయి. ఇలా చురుకుదనం తగ్గి, కదలికలు తగ్గడంతో దేహానికి అవసరమైన వ్యాయామం అందక బరువు పెరగుతారు. అంతేకాదు... చురుకుదనం తగ్గడంతో రక్తంలో (కొలెస్ట్రాల్ వంటి) కొవ్వుల మోతాదులూ పెరుగుతాయి. బరువూ, కొవ్వులూ పెరగడం స్ట్రోక్ ముప్పును పెంచుతుందన్న విషయం తెలిసిందే. డీ–హైడ్రేషన్ : చలికాలంలో నీళ్లు తాగడం తగ్గుతుంది. దాంతో రక్తంలో నీటి మోతాదులూ తగ్గడంతో రక్తం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడటమన్నది స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు : చలికాలంలో ఫ్లూ, శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగడంతో... అది స్ట్రోక్ ముప్పు కూడా పెరిగేలా చేస్తుంది. వాతావరణ కాలుష్యాలు : చలికాలంలో వాతావరణంలోకి చేరే పొగ, కాలుష్యాలన్నీ అప్పుడు కురిసే మంచు (ఫాగ్)తో కలిసి ‘స్మాగ్’ అనే మంద΄ాటి కాలుష్యాల తెరలు ఏర్పడేలా చేస్తాయి. కాలుష్యాలతో కూడిన స్మాగ్ కూడా స్ట్రోక్ ముప్పును పెంచేస్తుంది. నివారణ...ప్రతి ఒక్కరూ తగినన్ని నీళ్లూ ద్రవాహారాలు తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండటం. అన్ని సీజన్లలోనూ ఆయా సీజన్లో దొరికే పోషకాలతో కూడిన మంచి సమతులాహారం తీసుకోవడం. ఏ సీజన్లోనైనా తగినంత వ్యాయామం చేస్తూ, దేహాన్ని చురుగ్గా ఉంచడం. కంటినిండా తగినంత నిద్రపోతుండటంతోపాటు ఒత్తిడి లేకుండా చూసుకోవడం.ఒకవేళ అధికరక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉంటే... మందులతో వాటిని ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. (చదవండి: ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?) -
కాళేశ్వరంపై మరో కుట్ర.. మోటర్లే టార్గెట్: హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం మోటర్లను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మోటర్లను నాశనం చేసి అది.. బీఆర్ఎస్పై నెపం వేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ మధ్య విభేదాలు ఉంటే మీరు మీరు చూసుకోండి.. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద పగ, ప్రతీకారం తీర్చుకుంది. నీళ్లను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నేను వారం రోజుల క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్కు లేఖ రాశాను. సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్కు నీళ్ల విలువ తెలియదు. ప్రభుత్వం నడపడం చేతకావడం లేదు.. ఎందుకు ప్రాజెక్టుల నీళ్లను వృథా చేస్తున్నారు. ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా అన్నపూర్ణ, మిడ్ మానేరు, ప్రాజెక్టును నింపాలి. వేలాది మంది రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తాం. మీరు ఆన్ చేయకుంటే మేమే ఆన్ చేస్తాం.కాళేశ్వరంపై మరో కుట్ర చేస్తున్నారు.. మోటర్లను ఆన్ అండ్ ఆన్ చేయడం వలన మోటార్లు పనికి రాకుండా చేస్తున్నారు. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి. ఆన్ చేసి ఆఫ్ చేయకూడడని బీహెచ్ఈఎల్ ఇప్పటికే హెచ్చరించింది. మోటర్లను నాశనం చేసి.. అది బీఆర్ఎస్పై వేయాలని కుట్ర చేస్తున్నారు. మీ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే మీరే చూసుకోండి. దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్కు నష్టం జరుగుతోంది. కమీషన్ పంచుకోవడానికి సమయం సరిపోవడం లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
దేశంలో అత్యంత ఖరీదైన మెట్రో.. ప్రయాణికులపై మరో వాత
బెంగళూరు: దేశంలో అత్యంత ఖరీదైన మెట్రోగా బెంగళూరు మెట్రో(నమ్మ మెట్రో) పేరుగాంచిది. ఇప్పుడు ఈ మెట్రో మరోమారు వార్తల్లో నిలిచింది. ప్రయాణికులకు అదనపు లగేజీ రుసుమును విధించగానే ప్రయాణికులు భగ్గుమంటున్నారు. కొందరు ఈ విషయంలో మెట్రోను సమర్థిస్తుండగా, మరికొందరు ఇది ప్రయాణికులకు ఇది ఎంతో భారమని వ్యాఖ్యానిస్తున్నారు.భారీ పరిమాణంలో ఉన్న తన లగేజీకి అదనంగా ఛార్జ్ చేసిన బెంగళూరు మెట్రోపై ఒక ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేశాడు. ఆ ప్రయాణికుడు ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్టులో ఇటువంటి రుసుము సమర్థనీయమా? అని అడగడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. అవినాష్ చంచల్ అనే ఈ ప్రయాణికుడు తన ‘ఎక్స్’ పోస్టులో ఇలా రాశాడు. “ఈ బ్యాగ్ కోసం బెంగళూరు మెట్రోలో రూ.30 అదనంగా చెల్లించాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. బెంగళూరు మెట్రో ఇప్పటికే దేశంలోనే అత్యంత ఖరీదైనది. ఇప్పుడు మరింత భారంగా మారనున్నది’ అని రాశారు. I am absolutely stunned that I had to pay 30rs in the Bangalore metro for this bag. The Bangalore metro is already the most expensive in the country, and this just adds to the burden.This is just another example of how the @OfficialBMRCL is excluding people from accessing metro. pic.twitter.com/syJX8elbhh— Avinash Chanchal (@avinashchanchl) August 16, 2025ఈ పోస్ట్ పలువురిని ప్రశ్నింపజేసింది. కొందరు చంచల్కు మద్దతు పలుకగా, మరికొందరు పెద్ద బ్యాగులు మరింత స్థలాన్ని ఆక్రమిస్తాయని కనుక, వాటిపై ఛార్జ్ వేయాలని వాదించారు. మరొక యూజర్.. బ్యాగ్ స్కానర్లో సరిపోయే దానికంటే పెద్దదిగా ఉంటేనే అదనపు రుసుము చెల్లించాలని సూచించారు. తాను సూట్కేస్, బ్యాక్ప్యాక్ను అనేకసార్లు ఛార్జ్ చేయకుండానే తీసుకెళ్లానని, అవి పరిమిత బరువుతోనే ఉన్నాయన్నారు. లగేజీకి ప్రత్యేక నిల్వ స్థలం ఉంటే రుసుము విధించినా అర్ధవంతంగా ఉంటుందని మరికొందరు అంటున్నారు. -
చరిత్ర సృష్టించిన మ్యాక్స్వెల్
విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ తన దేశం తరఫున టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో మరో విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. ఈ ఇద్దరు టీ20ల్లో చెరో 12 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. వార్నర్ 110 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించగా.. మ్యాక్స్వెల్ 124 మ్యాచ్లో వార్నర్ రికార్డును సమం చేశాడు.నిన్న (ఆగస్ట్ 16) సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో మెరుపు అర్ద శతకం బాది, తన జట్టును గెలిపించిన మ్యాక్సీ.. తన టీ20 కెరీర్లో 12వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓడిపోవాల్సిన ఈ మ్యాచ్లో మ్యాక్సీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. మ్యాక్సీ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ మ్యాచ్తో పాటు సిరీస్ను కూడా కైవసం చేసుకుంది.తీవ్ర ఒత్తిడిలో మ్యాక్సీ ఆడిన ఈ ఇన్నింగ్స్ అతడి టీ20 కెరీర్లో అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు. 173 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో బరిలోకి దిగిన మ్యాక్సీ కళ్లు మూసి తెరిచేలోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన జట్టును సేఫ్ జోన్లో ఉంచాడు. అంతేకాకుండా చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసమైన తరుణంలో ఊహించని షాట్ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.ఈ ఇన్నింగ్స్లో 36 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఆసీస్, రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా గెలుపొందాయి.బ్రెవిస్ విధ్వంసంఅంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదిన డెవాల్డ్ బ్రెవిస్ ఈ మ్యాచ్లోనూ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో 6 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రెవిస్ విధ్వంసానికి డస్సెన్ (38 నాటౌట్) మెరుపులు కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. -
పెళ్లై పిల్లలున్నా కొనసాగిన బంధం.. ప్రేయసిని దారుణంగా చంపేసిన ప్రియుడు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రేమించుకున్న ఆ జంట ఏ కారణం చేతనో ఒక్కటి కాలేకపోయింది. వేర్వేరు వ్యక్తులతో వారికి వివాహాలు అయ్యాయి. అయినా వారి మధ్య ప్రేమ కొనసాగి చివరకు ఇద్దరినీ బలి తీసుకుంది. ప్రియురాలిని కత్తితో హత్య చేసిన ప్రియుడు అదే కత్తితో తానూ పొడచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్ సుతార్(35), రేష్మ(29)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే రేష్మకు మరో వ్యక్తితో వివాహం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆనంద్కు వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లయి పిల్లలు ఉన్నా ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఈ విషయం రేష్మ భర్తకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆనంద్ను పిలిపించి హెచ్చరించి వదిలేశారు. ఆగ్రహంతో ఉన్న ఆనంద్ రేష్మను నిర్జనప్రదేశానికి పిలిపించుకుని కత్తితో పొడిచి హత్య చేశాడు.అదే కత్తితో తానూ పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నందగడ పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఓటీటీ సిరీస్లో లెస్బీయన్ లిప్లాక్.. అవసరమా?
సినిమాల్లో ఇప్పుడు లిప్లాక్ సీన్స్ కామన్ అయిపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని చిత్రాల్లో ముద్దు సన్నివేశాలను జోడిస్తున్నారు. ఇక వెబ్ సిరీస్లలో అలాంటి సన్నివేశాలకు అడ్డూ అదుపే లేదు. ప్రేక్షకులు కూడా వాటిని రొటీన్ సీన్లలాగే ట్రీట్ చేస్తున్నారు. ఒకప్పటిలా ఆ సన్నివేశాలపై చర్చించడం.. ఖండించడం జరగట్లేదు. కానీ చాలాకాలం తర్వాత మళ్లీ ఓ ముద్దు సీన్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ వెబ్ సిరీస్లో లెస్బియన్ మధ్య కిస్ సీన్ పెట్టడం అవసరమా అని ఓ వర్గం ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అంధేరా’ ఆగస్ట్ 14న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో ప్రియా బాపట్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజక్తా కోలి, సుర్వీన్ చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాఘవ్ ధర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్కి మంచి టాక్ వచ్చినప్పటికీ.. ఇందులో ఇద్దరు నటీమణుల మధ్య వచ్చే లెస్బియన్ ముద్దు సన్నివేశంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కథలో భాగంగా సుర్వీన్ చావ్లా- ప్రియా బాపట్ మధ్య ముద్దు పెట్టుకోవాలి. ఇద్దరూ ఈ సీన్లో అద్భుతంగా నటించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా నేచురల్గా నటించారని కొంతమంది వారిపై ప్రశంసలు కురిపిస్తుంటుంటే.. మరికొంతమంది మాత్రం ఆ సీన్ అనవసరంగా పెట్టారని విమర్శిస్తున్నారు. అలాగే ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ షోల్లో ఇటువంటి సీన్స్ అవసరం లేదని వాదిస్తున్నారు. -
'దేవుడా.. ఈ రోజు ప్రాణాలతో ఉంచు!’
‘బ్రహ్మపుత్ర నదిలో రాఫ్టింగ్ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే ప్రవాహం పెరిగింది. పెద్ద అలలా నీరు రావడం, అదే సమయంలో రాళ్లు ఎక్కువగా ఉండటంతో రాఫ్ట్ అదుపు తప్పి కిందపడిపోయాను. బ్రహ్మపుత్ర ప్రయాణమే ఆఖరుదని అనుకున్నాను. ఆ క్షణంలో దేవుడ్ని, దేశాన్ని ప్రార్థించుకున్నాను. కష్టమ్మీద మళ్లీ రాఫ్ట్లోకి ఎక్కాను. ఇక అక్కడి నుంచి వెనుదిరగలేదు. ప్రపంచ రికార్డు సాధించే దిశగా సాగిన మా ప్రయాణం విజయవంతమైంది.బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందాను’అని వెల్లడించారు ఆర్మీ మేజర్, వైద్యాధికారి వాసుపల్లి కవిత. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన మేజర్ కవిత.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. విశాఖలోని తూర్పు నౌకాదళానికి ఇటీవల వచ్చిన ఆమె తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. దేవుడికి, దేశానికి ప్రార్థించి.. 1,040 కిలోమీటర్ల బ్రహ్మపుత్ర నదిని 28 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇండో–టిబెటెన్ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు మా ప్రయాణం సాగింది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం చేసి, దేవుడికి, దేశానికి ప్రారి్థంచి మా ప్రయాణం మొదలుపెట్టేవాళ్లం. 28 రోజుల్లో పూర్తి చేయాలంటే సమయం వృథా చేయకూడదు. అందుకే ఆహారం కూడా మితంగా, బోట్లోనే తీసుకునేవాళ్లం. ఒక్కోసారి 12 గంటలపాటు ఏకధాటిగా రాఫ్టింగ్ చేశాం. అనుకున్నది సాధించాం. సాహస క్రీడలకు స్వర్గధామం ‘అడ్వెంచర్ స్పోర్ట్స్లో భారత్ వెనుకబడి ఉంది.. మన దేశంలో వీటికి ప్రాధాన్యం లేదు’అని చాలా మంది అంటారు. మేం దానిపైనే దృష్టి సారించాం. ఈ రాఫ్టింగ్తో ఒక మెట్టు ఎక్కాం. ఇకపై బ్రహ్మపుత్ర రివర్ రాఫ్టింగ్ పేరు చెబితే మొదట మా పేరే వినిపిస్తుంది. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి ఉన్న ప్రాధాన్యం సాహస పర్యాటకానికి లేదు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, జీవ వైవిధ్యంతో కూడిన సాహస పర్యాటకానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావాలన్నదే మా ప్రయత్నం. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు! వైద్యులకు మానసిక స్థైర్యం ఉంటుంది కానీ, శారీరకంగా దృఢంగా ఉండరని చాలా మంది అంటుంటారు. అది తప్పని నిరూపించాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. చిన్నప్పటి నుంచి నా ఆలోచనలు ఇలాగే ఉండేవి. పాఠశాల రోజుల్లో క్రీడలపై ఎక్కువ దృష్టి పెట్టాను. మగవాళ్లతో పోలిస్తే మహిళలు ఎందులోనూ తక్కువ కాదని చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు దాన్ని నిరూపించాను. రాష్ట్రపతి మెడల్తో ఆత్మవిశ్వాసం అరుణాచల్ప్రదేశ్లో పని చేస్తున్నప్పుడు 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న గోరీచెన్ బేస్ క్యాంప్కు మెడికల్ ఆఫీసర్గా నాలుగైదుసార్లు వెళ్లాను. నన్ను గమనించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ డైరెక్టర్.. ‘మీరు కూడా ట్రెక్ చేయవచ్చు కదా’అని సలహా ఇచ్చారు. అప్పుడే రాఫ్టింగ్ కోర్సులో చేరాను. ఆ సమయంలోనే నేనెందుకు గోరీ చెన్ పర్వతాన్ని అధిరోహించకూడదు? అనిపించింది. నా మీద నాకు నమ్మకం వచ్చాక పర్వతారోహణకు సిద్ధమయ్యాను. ఒక రోజు ట్రెక్లో చాలా మంది ఉన్నారు. పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చింది. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాను. విజయవంతంగా శిఖరాన్ని చేరి దేశ పతాకాన్ని ఎగురవేశాను. అదే సమయంలో ట్రెక్ చేస్తున్న ఓ మహిళ ఊపిరాడక ఇబ్బంది పడుతోంది. వెంటనే స్పందించి ఆమె ప్రాణాలు కాపాడాను. ఎంబీబీఎస్ చేసినందుకు ఆ రోజు ఎంతో ఆనందం కలిగింది. ఈ సంఘటనకు గానూ రాష్ట్రపతి నుంచి విశిష్ట సేవా పతకం అందుకున్నాను. నాన్న భరోసా.. అమ్మ ఆత్మవిశ్వాసం! నాన్న రామారావు రైల్వే క్లర్క్. అమ్మ గృహిణి. నాకు ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా, నా చదువు పూర్తి చేయడానికి నాన్న ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంబీబీఎస్ అయ్యాక పీజీ చేస్తానని చెప్పాను. అప్పుడు నాన్న ఆర్థిక పరిస్థితిని వివరించారు. వైద్య వృత్తిలో స్థిరపడాలనుకుంటున్న సమయంలో, ఆర్మీలో కూడా మెడికల్ ఆఫీసర్గా పనిచేయవచ్చని తెలుసుకున్నాను. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పగా.. రక్షణ రంగం అనగానే వాళ్లు కొంచెం భయపడ్డారు. అక్కడ బాగుంటే కొనసాగుతాను, లేదంటే తిరిగి వచ్చి వైద్య వృత్తిలో స్థిరపడతానని వారికి నచ్చజెప్పాను. నాన్న భరోసా ఇచ్చారు. అమ్మ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అందుకే కెప్టెన్గా మొదలై.. మేజర్ స్థాయికి చేరుకున్నాను. ఎవరెస్ట్ ఎక్కుతా.. పీజీ చేస్తా! ఈ ప్రపంచ రికార్డు నన్ను మరిన్ని సాహస యాత్రల వైపు నడిపిస్తోంది. సింధు ఉపనది జస్కర్ నదిలో రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నాను. రాఫ్టింగ్ క్రీడకు పుట్టినిల్లు అయిన అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన కొలరాడో నదిలో రాఫ్టింగ్ చేయాలన్నది నా కోరిక. మకాలు పర్వతారోహణతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కూడా అడుగులు వేస్తున్నాను. వైద్య వృత్తిలో భాగంగా స్పోర్ట్స్ మెడిసిన్ లేదా ఆప్తమాలజీలో పీజీ కూడా చేస్తాను.సుడిగుండంలో చిక్కుకున్నా.. మొదటి రోజు ప్రయాణం చాలా సవాలుగా అనిపించింది. రాక్ సర్ఫింగ్ సమయంలో రాఫ్ట్ బోల్తాపడి రాళ్ల మధ్య ఇరుక్కుపోయాను. సేఫ్టీ కయాక్ను పట్టుకొని 200 మీటర్ల వరకు ప్రయాణించాను. రెస్క్యూ సిబ్బంది సాయంతో అతి కష్టం మీద మళ్లీ రాఫ్ట్లోకి వచ్చాను. కొద్ది దూరం వెళ్లాక, మరోసారి టీమ్ మొత్తం 6 అడుగుల లోతైన నీటిలో పడిపోయాం. అక్కడ ఏర్పడిన సుడిగుండంలో నేను చిక్కుకున్నప్పుడు ఇక నా పని అయిపోయిందని అనుకున్నాను. ‘ప్రతి నిమిషం నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, నీ టీమ్ను నడిపించడానికి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కో’అని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి.. బలంగా ప్రయతి్నంచి బయటపడ్డాను. ఇలా వారం రోజుల పాటు ప్రయాణం నరకప్రాయంగా సాగింది. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. నిర్దేశించుకున్న 28 రోజుల్లో 1,040 కిలోమీటర్ల రివర్ రాఫ్టింగ్ను విజయవంతంగా పూర్తి చేశాం.(చదవండి: చిన్న వయసులోనే రచయిత్రిగా స్నేహా దేశాయ్..!) -
బీజేపీ కీలక సమావేశం.. ఉపరాష్ట్రపతి రేసులో రాజ్నాథ్, లక్ష్మణ్..
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికపై అధికార బీజేపీ దృష్టి పెట్టింది. తమ అభ్యర్థిని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం భేటీ కానుంది. సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతలను ఎన్డీయే అప్పగించింది. పార్టీ అభ్యర్థి పేరుపై ఈ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 4న ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అభ్యర్థి ఎంపిక పరిశీలనలో పేర్లు ఇవే..ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పరిశీలనలో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత, ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రి చారి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఉన్నట్టు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. సెప్టెంబర్ 9న కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగియనుంది. లోక్సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 781 మంది సభ్యులు కలిగిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో నెగ్గాలంటే కనీసం 391 ఓట్లు అవసరం. 422 మంది ఎంపీల బలం కలిగిన అధికార ఎన్డీయేకు స్పష్టమైన విజయావకాశాలు ఉన్నాయి. మరోవైపు విపక్ష ‘ఇండియా’ కూటమి సైతం తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. -
'సికందర్' ప్లాప్తో నాకు ఎలాంటి సంబంధం లేదు: మురుగదాస్
మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన "సికందర్" చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. అభిమానులు కూడా ఈ చిత్రంపై విమర్శలు చేశారు. సికందర్ స్క్రిప్ట్ విషయంలో వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ సినిమా వైఫల్యానికి కారణం తాను కాదంటూ మురుగదాస్ తాజాగా చెప్పుకొచ్చారు. సుమారు సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్తో రూపొందించబడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ. 170 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు బాలీవుడ్ పేర్కొంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు. సాజిద్ నదియాద్వాలా ఈ మూవీని నిర్మించారు.సికందర్ సినిమా వైఫల్యానికి ప్రధాన కారణం సల్మాన్ ఖాన్ అనే అర్థం వచ్చేలా మురుగదాస్ చెప్పుకొచ్చాడు. 'ఈ కథ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. కానీ నేను బాగా తెరకెక్కించలేకపోయాను. కానీ, దానికి నేను మాత్రమే బాధ్యత వహించను. గజిని రీమేక్ అయినప్పటికీ బాగా ఆడింది. సికందర్ స్ట్రెయిట్ సినిమా.. అక్కడ నాకు కమాండింగ్ యూనిట్ లేదు. నేను అనుకున్న కథను మార్చేశారు. కొన్ని కారణాల వల్ల నేను కూడా ఏం చేయలేకపోయాను. కాబట్టి సికందర్ వైఫల్యానికి నేను బాధ్యత వహించను.' అని ఆయన పేర్కొన్నారు.టాలీవుడ్పై పరోక్ష వ్యాఖ్యలుఇదే ఇంటర్వ్యూలో మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలామంది దర్శకులు రూ. 1000 కోట్ల సినిమాలు తీస్తున్నారు. వాళ్లు తీసే సినిమాలు కేవలం జనాలకు కనువిందు చేసేలా ఉంటాయి. కానీ, తమిళ దర్శకులు తీసే సినిమాలు ప్రజలను ప్రభావితం చేసేలా ఉంటాయి. మేము సామాజిక కోణంలో సినిమాలు చేస్తాం. ప్రజలను ఆలోచింపచేసే సినిమాలు చేస్తాం.' అంటూ ఆయన కామెంట్లు చేశారు. #ARMurugadoss about #Sikandar Failure. So #SalmanKhan was the reason behind failure👀pic.twitter.com/oIywwHRrX6"Sikandar Base story was very close to my heart. But i couldn't able to execute well. But I'm not the only one who is responsible for it. Ghajini is remake but it's…— AmuthaBharathi (@CinemaWithAB) August 16, 2025 -
టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ ముందు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ను బూతుల తిట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియో వైరల్గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేశారు.ఎమ్మెల్యే ప్రసాద్, జూ.ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఫోన్ ఆడియో లీక్ రాష్ట్రవాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వార్ -2 సినిమా ఆడదంటూ పదేపదే చెప్పిన దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ను అత్యంత దారుణంగా దూషించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ హెచ్చరించడంతో పాటు బూతులతో రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అయి ఉండి.. ఇంత అసభ్యకరమైన భాషను వాడటంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు తేల్చి చెప్పారు. నాలుగు గోడల మధ్య క్షమాపణ చెబితే కుదరదని.. ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు. మేం ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావ్ అంటూ జూ.ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు.టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ ఉదయం నుంచి తీవ్ర దుమారం రేగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు, నారా లోకేష్లకు నచ్చదు.. అందుకే ఆయన సినిమాలు ఆడనివ్వను.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మీరూ చూడవద్దంటూ దగ్గుపాటి ప్రసాద్ హుకూం జారీ చేశారు. అసభ్య పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్ను దూషించిన ఆడియో వైరల్ కావటంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు.జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్య పదజాలంతో దూషించారు ఎమ్మెల్యే దగ్గుపాటి.. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ షోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. ఒక్కసారి గా రెచ్చిపోయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ పై రాయలేని భాషలో నోరు పారేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను వ్యతిరేకిస్తారని.. మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడవద్దంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వనని.. బాక్సులు, స్క్రీన్లు కాల్చేయిస్తానంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో భయపడ్డ.. దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ విడియో విడుదల చేశారు. అది ఫేక్ వీడియో అన్న ఎమ్మెల్యే.. తనకు నారా-నందమూరి కుటుంబాలపై గౌరవం ఉందంటూ చెప్పుకొచ్చారు.మరో వైపు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని... అలా చెప్పకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీలు చించి వేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందుబాటులో లేరని... ఆయన వచ్చాక బహిరంగ క్షమాపణలు చెప్పిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం హామీ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన విరమించారు -
అఖిల్ మూవీలో జగపతిబాబును వద్దన్న నాగార్జున
గత కొంతకాలంగా విజయాల్లేక తడబడుతున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ ఏడాది వరుస హిట్లు వచ్చాయి. నాగచైతన్య తండేల్ సినిమాకు వంద కోట్లు రాగా, నాగార్జున (Nagarjuna Akkineni) కుబేర చిత్రానికి రూ.132 కోట్లు వచ్చాయి. అలా తండ్రీకొడుకులిద్దరూ ఈసారి సెంచరీ కొట్టారు. అఖిల్ అక్కినేని మాత్రం ఈ రేసులో ఎక్కడో ఆగిపోయాడు. ఏజెంట్తో డిజాస్టర్ అందుకున్న ఇతడు ప్రస్తుతం లెనిన్ మూవీ చేస్తున్నాడు.టాక్ షోలో నాగ్దీన్ని నాగవంశీతో కలిసి నాగార్జున నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలో అఖిల్కు తండ్రిగా కనిపించనున్నారన్న టాక్ కూడా వినిపించింది. ఈ మూవీలో నటించేందుకు జగపతిబాబుకు ఆఫర్ ఇస్తే.. దానికి నాగ్ ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని ఆయన జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో వెల్లడించాడు. ఈ షోకు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అవును, రిజెక్ట్ చేశా..జగ్గూ భాయ్ మాట్లాడుతూ.. అఖిల్ (Akhil Akkineni) రీసెంట్ సినిమా(లెనిన్)లో ఏదో చిన్న పాత్రకు నన్ను అడిగారట! ఇంత చిన్న క్యారెక్టర్కు ఆయన్ను అడగడమేంటి? మేం కలిసేదే తక్కువ. ఇలాంటివి చేస్తే మా స్నేహమే చెడిపోతుంది అన్నావంట కదా అని అడిగాడు. అందుకు నాగ్.. అవును, ఆ చిన్న పాత్రకు నువ్వెందుకని తిరస్కరించాను అని చెప్పాడు. దీంతో జగపతిబాబు థాంక్యూ చెప్తూ.. నిజానికి నీకసలు సంబంధం లేదు. ఆ సినిమాకు నీతోపాటు మరో నిర్మాత కూడా ఉన్నారు. ముందు మనం ఫ్రెండ్స్నువ్వు విలువల్ని పాటిస్తావు.. అది నాకెంతో ఇష్టం అన్నాడు. అది వినగానే నాగ్.. వీటన్నింటికంటే ముందు మనమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు. లెనిన్ విషయానికి వస్తే.. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ కిరణ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత -
పాతిక వేలలో ఒప్పో నుంచి కొత్త ఫోన్
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా కే13 టర్బో సిరీస్ ప్రో 5జీ, టర్బో 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో అంతర్గతంగా కూలింగ్ ఫ్యాన్ ఉంటుందని, దేశీయంగా స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచరును అందించడం ఇదే ప్రథమం అని సంస్థ తెలిపింది. భారీగా మల్టీ టాస్కింగ్, గేమింగ్కి అనువుగా ఇవి ఉంటాయని వివరించింది.7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ చార్జింగ్, 1.5 అమోలెడ్ డిస్ప్లే తదితర ఫీచర్లు వీటిలో ఉన్నాయి. దీని ధర రూ. 27,999 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఆఫర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 24,999 నుంచి లభిస్తుందని సంస్థ తెలిపింది. టర్బో ప్రో 5జీ ఫోన్ల సేల్ ఆగస్టు 15 నుంచి, టర్బో 5జీ ఫోన్ల అమ్మకాలు 18 నుంచి ప్రారంభమవుతాయి.ముఖ్యమైన ఫీచర్లుఇండియాలో మొట్టమొదటి సారిగా అంతర్గత కూలింగ్ ఫ్యాన్ ఉన్న స్మార్ట్ఫోన్గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందింది.ట్రిపుల్-లెవల్ కూలింగ్ సిస్టమ్: కూలింగ్ ఫ్యాన్, ఎయిర్ డక్ట్స్, 5000mm² వేపర్ చాంబర్.ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ఎస్ఓసీర్యామ్ & స్టోరేజ్: 8జీబీ/12జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్.డిస్ప్లే: 6.8 అంగుళాల ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1500 నిట్స్ బ్రైట్నెస్.బ్యాటరీ: 7000mAh, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ (15 నిమిషాల్లో 50%).కెమెరా: 50MP + 2MP రియర్, 16MP ఫ్రంట్, 4K 60fps వీడియో సపోర్ట్.సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ఓఎస్ 15, 2 ఓఎస్ అప్డేట్లు, 3 ఏళ్లు సెక్యూరిటీ ప్యాచ్లుధర & లభ్యతకే13 టర్బో ప్రో 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 కాగా డిస్కౌంట్లో రూ. 34,999 లకు లభిస్తుంది. అలాగే కే13 టర్బో 5జీ ఫోన్ ధర రూ. 27,999 కాగా తగ్గింపులు పోగా రూ. 24,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్లు ఫ్లిప్కార్ట్, ఒప్పో ఈ-స్టోర్లు, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూటమి సర్కార్ మరో వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూటమి సర్కార్ వెన్నుపోటు పొడిచింది. ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే పలు కీలక విభాగాలు ప్రైవేటుకు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నారు. దశల వారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రైవేటీకరణ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.స్టీల్ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ జాబితాలోకి మరో విభాగం చేరింది. శనివారం విడుదల చేసిన నోటీసులో స్టీల్ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ)–1కు సంబంధించి యాజమాన్యం ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) జారీ చేసింది. ‘కాంప్రహెన్సివ్ టెక్నికల్ మేనేజ్ మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కేప్టివ్ పవర్ ప్లాంట్–1 అండ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్’ పనులకు సంబంధించి ఈవోఐ దాఖలుకు సెప్టెంబర్ 9న ఆఖరు తేదీగా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం బిడ్లు తెరవనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వైజాగ్ స్టీల్ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. -
వీధి కుక్కలు కనిపించకపోతే ఏమవుతుందంటే..!
కుక్కలు వీధుల్లో కనిపించకుండా చూడాలని, వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలనే సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన వారితో పాటు తీవ్రంగా అభ్యంతరం చెప్పినవారు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మూగజీవులైన వీధికుక్కలు మాట్లాడుతున్నట్లు క్రియేట్ చేసిన వీడియోలు నెట్లోకంలో హల్చల్ చేస్తున్నాయి. కంటెంట్ క్రియేటర్ షిరిన్ సెవనీ శునకవేషధారణతో, శునకంలా మాట్లాడిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఆమె వీధికుక్కల తరఫున వకాల్తా పుచ్చుకుంది. ‘వీధికుక్కలు కనిపించకుండాపోతే ఏం జరుగుతుంది?’ కాప్షన్తో సుమిత్ మిత్రా అనే కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశాడు. కొందరు క్రియేటర్లు ఏఐ–జనరేటెడ్ వీడియోలతో వీధి శునకాలతో మాట్లాడించారు. అలాంటి ఒక వీడియోలో ఒక శునకం గట్టిగా ఇలా నినాదం ఇస్తుంది.... ‘వీధుల్లో ఉండడం అనేది వీధి కుక్కలుగా మా ప్రాథమిక హక్కు’ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ఒక కోతి గన్మైక్తో శునకాన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో, బాలుడికి, శునకానికి మధ్య జరిగిన సంభాషణ... ఇలాంటి వీడియోలు ఎన్నో బాగా పాపులర్ అయ్యాయి. View this post on Instagram A post shared by Shirin sewani (@shirin_sewani) (చదవండి: కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!) -
1 నుంచి నెలవారీ రేషన్ కోటా
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి యథావిధిగా ప్రజా పంపిణీ కేంద్రాల (రేషన్ దుకాణాలు) ద్వారా సన్న బియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం పంపిణీ చేసిన నేపథ్యంలో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ దుకాణాలు మూసివేశారు. సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ నెల కోటా సన్న బియ్యాన్ని రాష్ట్ర స్థాయి గోదాముల (స్టేజ్–1) నుంచి మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లను పౌరసరఫరాల సంస్థ పర్యవేక్షిస్తోంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా రేషన్కార్డులు పొందిన వారందరికీ సెప్టెంబర్ నెలలో సన్నబియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈసారి లబ్ధిదారులకు బియ్యంతో పాటు చేతి సంచిని (బ్యాగ్) అందజేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. -
మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. ఆస్ట్రేలియాకు కంటితుడుపు విజయం
ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టుతో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపు ఆసీస్కు కంటితుడుపుగా మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే కైవసం చేసుకుంది (తొలి రెండు వన్డేలు గెలిచి).మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తడబడింది. ఆసీస్ బౌలర్లు తహ్లియా మెక్గ్రాత్ (8-0-40-3), అనిక లియారాయ్డ్ (3-0-16-2), ఎల్లా హేవర్డ్ (10-0-40-2), సియన్నా జింజర్ (8.4-0-50-2), లూసీ హ్యామిల్టన్ (10-2-34-1) సత్తా చాటడంతో 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (52), యస్తికా భాటియా (42) పోరాటపటిమ కనబర్చి భారత్కు ఈ మాత్రం స్కోరైన అందించారు.వీరు మినహా టీమిండియాలో ఎవరూ రాణించలేదు. నందిని కశ్యప్ (28), రఘవి బిస్త్ (18), తనుశ్రీ సర్కార్ (17), కెప్టెన్ రాధా యాదవ్ (18), తనుజా కన్వర్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. తేజల్ హసబ్నిస్ (1), మిన్నూ మణి (5), సైమా ఠాకోర్ (0), షబ్నమ్ షకీల్ (7 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అలిస్సా హీలీ (మిచెల్ స్టార్క్ భార్య) (84 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి శతకంతో ఆసీస్ను విజయతీరాలకు చేర్చింది. ఆమెకు మరో ఓపెనర్ తహ్లియా విల్సన్ (59), రేచల్ ట్రెనామన్ (21 నాటౌట్) సహకరించారు.ఈ మ్యాచ్లో ఓడినా భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో గెలుచుకుంది. టీ20ల్లో ఎదురైన పరాభవానికి భారత్ వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
చిన్న వయసులోనే రచయిత్రిగా స్నేహా దేశాయ్..!
ఒకవైపు మెయిన్స్ట్రీమ్ టీవీ షోలు, మరోవైపు ‘మహారాజ్’ ‘లాపతా లేడీస్’లాంటి భిన్నమైన బాలీవుడ్ చిత్రాలతో చిన్న వయసులోనే రచయిత్రిగా పెద్ద పేరు తెచ్చుకుంది స్నేహా దేశాయ్. గుజరాత్ నాటకరంగం నుంచి టీవీరంగంలోకి అడుగు పెట్టిన స్నేహ అప్పుడప్పుడు టీవీ షోలలో నటించినప్పటికీ రచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. ఎంతోమంది సీనియర్ రచయితల దగ్గర సహాయకురాలిగా పనిచేసింది. ‘మిసెస్ తెందూల్కర్’తో టీవీ రైటర్గా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తరువాత రాసిన ‘ఆర్కే లక్ష్మణ్ కే దునియా’ ‘బిహా హమారీ బహు కా’లాంటి టీవీ షోలతో రైటర్గా పేరు తెచ్చుకుంది. ‘టీవీ అంటే అప్పుడే కాదు నాకు ఎప్పటికీ ఇష్టమే’ అని చెప్పే స్నేహ టీవీ కోసం ప్రతి నెల 56 ఎపిసోడ్లు రాసేది. గుజరాతీ ప్రాంతీయ టీవీకి రాస్తున్న స్నేహకు ‘మహారాజ్’ సినిమా అవకాశం వచ్చింది. దీనికి కారణం ‘మహారాజ్’ అనేది గుజరాతీ నేపథ్యం ఉన్న కథ. ఈ సినిమాకు స్నేహ రాసిన స్క్రీన్ప్లే ఆమిర్ఖాన్కు బాగా నచ్చింది. దీంతో ‘లా పతా లేడీస్’కు పనిచేసే అవకాశం వచ్చింది. బిప్లబ్ గోస్వామి రాసిన కథకు స్క్రీన్ప్లే రాయల్సిందిగా ఆమిర్ఖాన్ నుంచి పిలువు వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ‘మహిళలు రాసేవి పురుషులు కూడా రాస్తారు. అయితే ఇద్దరి దృష్టి కోణం వేరుగా ఉంటుంది. మహిళగా నా అనుభవాలు, ఆలోచనలు పురుషులతో భిన్నంగా ఉండడం అనేది సహజం. లాపతా లేడీస్లో ఎన్నో స్త్రీ పాత్రలు ఉంటాయి. ఒక మహిళగా ఆ పాత్రలను అర్థం చేసుకొని రాయడం నాకు సులువు అయింది’ అంటోంది స్నేహ దేశాయ్. -
కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!
వీధికుక్కల పట్ల అమానవీయంగా ఉండే వారి కంటే మానవత్వంతో వ్యవహరించే వారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో దిల్లీకి చెందిన దేవీజీ ఒకరు. డెబ్బై నుంచి ఎనభైవరకు వీధికుక్కల ఆలనాపాలనా చూసుకుంటుంది దేవీజీ. భర్త చనిపోయిన, పిల్లలు దూరమైన దేవికి శునకాలే పిల్లలు. స్ఫూర్తిదాయకమైన దేవీజీ గురించి కంటెంట్ క్రియేటర్ నీతూ బిషత్ రావత్ ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తనకు ఉన్న చిన్నస్థలంలోనే వీధి కుక్కలకు ఆశ్రయం ఇస్తున్న దేవీజీ రోజూ వాటికి ఆహారం అందించడానికి నానా కష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో దేవీజీకి తోచిన సహాయం చేయాలని నెటిజనులను కోరింది నీతు. ఆమె వీడియో షేర్ చేయడానికి ముందు దేవీజీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. దేవీజీ గురించి తెలుసుకున్న ఎంతోమంది ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఇన్ని కుక్కలను పెంచుకొని ఏం చేస్తావు?’ అని ఎంతోమంది దేవీజీని వెటకారంగా అడిగేవారు. దీనికి ఆమె చిరునవ్వు మాత్రమే సమాధానం అయ్యేది. అయితే అసలుసిసలు సమాధానం తరచుగా కనిపించే ఒక దృశ్యంలో దొరుకుతుంది. ఆ దృశ్యం: తల్లి చుట్టూ పిల్లలు చేరినట్లు దేవీజీ చుట్టూ శునకాలు చేరుతాయి. తన పిల్లలతో మాట్లాడినట్లుగానే శునకాలతో ప్రేమగా మాట్లాడుతూ కనిపిస్తుంది దేవిజీ. View this post on Instagram A post shared by Neetu Bisht Rawat (@iam_neetubishtrawat) (చదవండి: ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’) -
DNA బ్యూటీ ఛాతీ పైభాగంలో టాటూ.. అర్థమేంటో తెలుసా?
పెద్దగా ప్రచారంలోకి రాని ముఖమే అయినా, తెరపై కనిపించినప్పుడల్లా చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకునే నటి నిమిషా సజయన్ (Nimisha Sajayan). ప్రస్తుతం బలమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..బ్లాక్బెల్ట్నిమిషా తండ్రి సజయన్, తల్లి అనంతవల్లి ఇద్దరూ కేరళ వాసులే అయినా, కుటుంబం ముంబైలో స్థిరపడింది. ఆమె బాల్యం ముంబై వీధుల్లో గడిచింది. అందుకే ‘ఆ నగరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటుందామె. నిమిషా తైక్వాండోలో నిపుణురాలు. బాల్యంలోనే బ్లాక్బెల్ట్ సాధించింది. పాఠశాల నుంచే ఫుట్బాల్, వాలీబాల్ బృందాలకు నాయకత్వం వహించింది. యోధురాలిగా ఎదిగిన ఆమె, తెరపై మార్దవానికి నిర్వచనంగా మారింది.మేకప్ నచ్చదునటన విషయంలో పైపైమెరుపుల కంటే అభినయమే అవసరం అన్నది నిమిషా అభిప్రాయం. అందుకే ఆమె చేసిన చిత్రాల్లో గ్లామర్కు చోటు తక్కువ. ‘ఒరు కుప్రసిద్ధ పయ్యన్’, ‘చోళ’ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డులు అందుకుంది. ‘నాకు మేకప్ నచ్చదు, అవసరమైతే పాత్ర కోసమే మేకప్ చేసుకుంటాను’ అన్న ఆమె వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికప్పుడు వంట నేర్చుకుని..కానీ తను వెంటనే స్పందించి, ‘వ్యక్తిగత అభిరుచి వేరు, నటనా బాధ్యత వేరు’ అంటూ వివాదాన్ని ముగించింది. ఓ సినిమా సెట్లో వంటవాడి దగ్గర పరోటా చేయడం నేర్చుకుని, స్పాట్లో స్వయంగా పరోటా చేసి పెట్టిన సంఘటన తెర వెనక ముచ్చటగా మారి వైరల్ అయింది. చిన్నతనంలో ఇంటి ఆవరణలో నీళ్లు పోస్తున్నట్లు నటించి, తండ్రిపై నీళ్లు చల్లడమే తన మొదటి నటన అని గుర్తు చేసుకుంటుంది. GST చెల్లించలేదని ఆరోపణలుఆమెపై వేసిన పన్నుల వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ముప్పై లక్షల జీఎస్టీ చెల్లించలేదన్న ఆరోపణలపై ఆమె తల్లి ప్రత్యక్షంగా స్పందించి ఆధారాలతో సహా ఖండించారు. ‘అక్కడ నా తల్లే నిజమైన హీరో’ అని నిమిషా చెప్పింది. చిత్రలేఖనంతో పాటు ఫొటోగ్రఫీలోనూ నిమిషా ప్రతిభావంతురాలే! ఈ రెండూ ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. సంప్రదాయ వంటలు అంటే ప్రాణం. పాల పాయసం, చేపల వంటలు, సధ్యా లేకుండా ఏ పండుగ తనకు అసలైన పండుగలా అనిపించదట.రంగు అడ్డు కాదుకొందరు రంగుపై వివక్ష చూపుతూ ‘ఇలాగుంటే పాత్రలు రావు’అని విమర్శించినా, నిమిషా మాత్రం ‘ప్రతిభ ఉన్న చోట రంగు అడ్డుకాదు’ అన్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. ఆమె ఛాతీపై ఉన్న సూర్యచక్రపు గుర్తు తన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి, సృజనాత్మకంగా ఉండాలి’ అని నమ్ముతుంది. ఈమె చివరగా DNA సినిమాలో కనిపించింది. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) చదవండి: బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్ -
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ ఇటీవల ఒక ట్రెండ్గా మారింది. ఈ కళలోని ప్రత్యేక ఆకర్షణ అనేక సృజనాత్మక ఆలోచనలకు రూపం ఇస్తోంది. మనసుకు నచ్చిన కళాఖండాలతో ఇంటి అలంకరణను మార్చుకోవడానికి ఈ ఆర్ట్ వీలు కల్పిస్తుంది. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్, ఫంక్షనల్ డెకర్ లేదా ఫ్యాన్సీ వస్తువులైనా ఎపాక్సీ రెసిన్ కళ ఇంటికి కొత్త అందాన్ని తీసుకురాగలదు. రెసిన్ను ప్లాస్టిక్, వార్నిష్ వంటి అంటుకునే పదార్థాలు, ఇతర ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఎపాక్సీ రెసిన్ అనేక పొరలతో కూడి ఉంటుంది.గోడ మీద ప్రకృతి అందాలుఎపాక్సీ రెసిన్తో వాల్మీదకు ప్రకృతి దృశ్యాలను తీసుకురావచ్చు. నదీ నదాల అందాన్ని, నీటి కదలికను అనుకరించేలా, మంత్రముగ్ధులను చేసేలా ఈ ఆర్ట్ ద్వారా మన ముందుకు తీసుకువస్తున్నారు కళాకారులు. వాడిపోని పూల సొగసుసున్నితమైన పువ్వులను ఈ ఆర్ట్లో ఉపయోగించవచ్చు. పువ్వులను, కొమ్మలను ఎపాక్సీ రెసిన్తో కలిపితే అందమైన రూపం మీ ముందు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన టెక్నిక్ పువ్వుల సహజ సౌందర్యాన్ని కాపాడుతుంది. అద్భుతమైన వాల్ హ్యాంగింగ్స్ను సృష్టించడానికి ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ మెటీరియల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎపాక్సీ రెసిన్తో గోడ గడియారాలు, పెయింటింగ్స్, హ్యాంగింగ్స్ వంటి ఎన్నో రకాల అలంకరణ వస్తువులను తయారు చేయవచ్చు.డిజైనర్ ఫర్నిచర్సముద్రపు గవ్వలు, గులకరాళ్లు, పువ్వులు, లతలు వంటి సహజ వస్తువులను నిగనిగలాడే ఎపాక్సీ రెసిన్తో టేబుల్ టాప్స్, చెయిర్స్కి అద్భుతమైన అందాన్ని తీసుకురావచ్చు. ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ ఐడియాలుఎపాక్సీ రెసిన్ ఆర్ట్ వాల్ ఆర్ట్, ఫర్నిచర్కు మాత్రమే పరిమితం కాదు. వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ట్రేలు, ఇతర డెకర్ ఉత్పత్తులను రెసిన్తో తయారు చేయవచ్చు. ఈ కస్టమైజ్డ్ డిజైన్స్కి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. (చదవండి: మెట్లు దిగితే సముద్రం..! కళ కోసం అక్కడకు వెళ్లాల్సిందే..) -
కేకేఆర్ ఆటగాడి మెరుపు ప్రదర్శన.. విధ్వంసకర ఇన్నింగ్స్తో సవాల్
కేఎస్సీఏ మహారాజా టీ20 టోర్నీలో కేకేఆర్ ఆటగాడు లవ్నిత్ సిసోడియా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో గుల్బర్గా మిస్టిక్స్కు ఆడుతున్న అతు.. నిన్న (ఆగస్ట్ 16) శివమొగ్గ లయన్స్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర అర్ద శతకం బాదాడు. ఫలితంగా అతని జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్.. 15.5 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలై మ్యాచ్కు ఆటంకం కలిగించింది. దీంతో లయన్స్ ఇన్నింగ్స్ను ఆక్కడే ఆపేసి, వీజేడి పద్దతి ప్రకారం గుల్బర్గా లక్ష్యాన్ని 9 ఓవర్లలో 93 పరుగులకు కుదించారు.LUVNITH SISODIA MAGIC IN MAHARAJA TROPHY...!!!- Chasing 92 runs from 9 overs, Luvnith 58*(24) & Nikin Jose 34*(15) madness in the chase for Gulbarga Mystics. 🤯👌pic.twitter.com/qRKcJ0rz5O— Johns. (@CricCrazyJohns) August 16, 2025వర్షం తగ్గాక ఛేదన మొదలుపెట్టిన గుల్బర్గా కళ్లు మూసి తెరిచేలోగా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ సిసోడియా మెరుపు ఇన్నింగ్స్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 58 పరుగులు) ఆడి తన జట్టును గెలిపించాడు. అతనికి మరో ఓపెనర్ నికిన్ జోస్ (15 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) సహకరించాడు.వీరిద్దరి ధాటికి గుల్బర్గా 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. సిసోడియా, జోస్ జోడీ లయన్స్ బౌలర్ విధ్వత్ కావేరప్ప బౌలింగ్ను చీల్చి చెండింది. అతను వేసిన 2 ఓవర్లలోనే ఏకంగా 40 పరుగులు పిండుకుంది.అంతకుముందు ధృవ్ ప్రభాకర్ (44) రాణించడంతో లయన్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తుషార్ సింగ్ (22), నిహాల్ ఉల్లాల్ (17), అనిరుద్దా జోషి (15 నాటౌట్), హార్దిక్ రాజ్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుల్బర్గా బౌలర్లలో శశి కుమార్ 2, విజయ్ కుమార్ వైశాక్, మోనిశ్ రెడ్డి తలో వికెట్ తీశారు.కేకేఆర్ యాజమాన్యానికి సవాల్కర్ణాటకకు 25 ఏళ్ల లవ్నిత్ సిసోడియాను (లెఫ్ట్ హ్యాండర్) ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ 30 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో సిసోడియాకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. సిసోడియా మెరుపు బ్యాటింగ్తో పాటు వికెట్కీపింగ్ కూడా చేయగలడు. ఈ సీజన్ మహారాజా ట్రోఫీలో సిసోడియా ప్రదర్శనలను కేకేఆర్ యాజమాన్యం పరిశీలిస్తూ ఉంటుంది. ఈ ప్రదర్శనలతో సిసోడియా కేకేఆర్ యాజమాన్యానికి సవాల్ విసురుతున్నాడు. సిసోడియా ఇదే ప్రదర్శనలను కొనసాగిస్తే వచ్చే ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కవచ్చు. -
మెట్లు దిగితే సముద్రం..!
ప్రపంచంలో కడలి తీరాలు ఎన్ని ఉన్నా పర్యాటకులు మెచ్చే బీచ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గ్రీస్లోని శాంటోరిని ద్వీపంలో ఉన్న అమూడీ బీచ్ అలాంటిదే. నిజానికి ఇది ఒక చిన్న నౌకాశ్రయం. ఓయా అనే గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ బీచ్కి వెళ్లాలంటే 300 మెట్లు దిగితే చాలు. నడవలేని వారు మరోదారిలో వాహనాలపైన కూడా వెళ్లొచ్చు. ఇక్కడ రాక్ జంపింగ్ ఫేమస్. ఓయా కొండ మీద నుంచి ఈ బీచ్లోకి చాలామంది ఔత్సాహికులు దూకుతుంటారు. ఇక్కడ సాయంత్రం వేళల్లో సరదాగా సేదతీరే స్థానికులతో, ప్రకృతి ఆస్వాదించే పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ అనేక ఫిష్ టావర్న్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి. రుచుల ప్రియులకు తాజా చేపలను, సంప్రదాయ గ్రీకు రెసిపీలతో వండి వడ్డిస్తుంటారు రెస్టారెంట్లోని షెఫ్స్. ఇక్కడి నుంచి సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి ఒక్కసారి వెళ్తే కచ్చితంగా మరోసారి వెళ్లాలనే ఆశ పుడుతుందట! నిజానికి ఈ బీచ్కి వెళ్లిన పర్యాటకులు ఓయా గ్రామస్థుల ఆదృష్టానికి కుళ్లుకోకుండా ఉండలేరేమో!కళోత్సాహంకళాకారులు ఎప్పుడూ ‘శభాష్’ అనే ప్రశంసలను, కరతాళ ధ్వనులను కోరుకుంటారు. అలాంటి కళలను అభినందించాలన్నా, ప్రదర్శించాలన్నా ఆగస్టు నెలలో స్కాట్లండ్ వెళ్లాల్సిందే! స్కాట్లండ్ రాజధాని ఎడిన్ బర్గ్లో ఆగస్ట్ 1 నుంచి ప్రారంభమైన ఎడిన్ బర్గ్ ఫెస్టివల్ ఫ్రింజ్ వేడుకలు ఆగస్టు 25 వరకు జరగనున్నాయి.సుమారు మూడు వారాల పాటు కొనసాగుతున్న ఈ పండుగలో వేలాదిమంది కళాకారులు, నటులు, హాస్యనటులు, సంగీతకారులు, వివిధ ప్రదర్శకులు పాల్గొంటారు. ఈ ఫ్రింజ్లో నాటకాలు, కామెడీ షోలు, సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, సర్కస్లు ఇలా మరెన్నో ప్రదర్శనలు ఉంటాయి. ఎడిన్ బర్గ్లోని థియేటర్లు, పబ్లు, కేఫ్లు, వీధులలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలు సహా వందలాది ప్రదేశాలలో ప్రదర్శనలు జరుగుతాయి. ఈ పండుగ నూతన ప్రతిభను వెలికితీయడానికి, ప్రయోగాత్మక కళలను ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశం. ప్రపంచం నలుమూలల నుంచి కళాకారులు, ప్రేక్షకులు ఈ పండుగకు తరలివస్తారు.(చదవండి: దెయ్యాల కొంపలను తలపించే నిర్జన కట్టడాలు) -
క్లౌడ్ బరస్ట్తో మరోసారి ఆకస్మిక వరదలు.. ఏడుగురు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఇటీవల క్లౌడ్ బరస్ట్ విషాద ఘటన మరువక ముందే మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తాజాగా కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో వచ్చిన ఆకస్మిక వరదల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతికి ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్లోని కథువా జిల్లాలోని ఘటీ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి, ఆదివారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో, ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదల ధాటికి రైల్వే ట్రాక్లు, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వరదలకు కథువా పోలీసు స్టేషన్ నీట మునిగింది. దీంతో, కేంద్ర బలగాలు, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి.A heart wrenching video from Jod village near Janglot where people were stuck in mudslide after #cloudburst in #Kathua #JammuAndKashmir pic.twitter.com/OaSZt5S5iC— Ajay Jandyal (@ajayjandyal) August 17, 2025 మరోవైపు.. కథువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగార్డ్, చాంగ్డా గ్రామాలు.. లఖన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిల్వాన్-హుట్లీలలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, పెద్దగా నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఉజ్ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో, స్థానికులను అక్కడి నుంచి తరలిస్తున్నారు.#Breaking Machail Yatra ke Badh ab Kathua main aaya Cloud Brust#CloudBrust in #Kathua District Ghati, Janglote. Railway track effected, NHW also effected Police station Kathua submerged in waterEvacuation is going on. pic.twitter.com/IS3kEB6M2y— Ashish Kohli ॐ🇮🇳 (@dograjournalist) August 17, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జమ్ము కశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వరద ఉద్ధృతికి గ్రామంలోని పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కిష్ట్వార్ పోలీసు కంట్రోల్ రూమ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.Extremely Heavy Rainfall in Kathua District : Railway Track , Highway affected , Police station #Kathua submerged in Water pic.twitter.com/C3t67Wt2V3— Cross Town News (@CrossTownNews) August 17, 20254 dead, many injured after a cloudburst cut off a remote village in Kathua district of Jammu and Kashmir.The cloudburst hit Jod Ghati in Rajbagh area of the district during the intervening night of Saturday and Sunday.#Kathua #JammuKashmir pic.twitter.com/8uod9zI0rN— Vani Mehrotra (@vani_mehrotra) August 17, 2025 -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
మారాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి జ్యోతి చందేకర్ (69) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆగస్టు 16న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మరాఠీ సిరీయళ్లతో పాటు పలు చిత్రాల్లోనూ జ్యోతి నటించారు. 12 ఏళ్ల వయసులోనే కెరీర్ని ప్రారంభించి, తనదైన నటనతో ఇండస్ట్రీలో కి వచ్చిన అతి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘ఛత్రీవాలీ’, ‘తూ సౌభాగ్యవతి హో’ సీరియళ్లు జ్యోతి కెరీర్ని మలుపు తిప్పాయి. బుల్లితెరపై వచ్చిన ఫేమ్తో సినిమా చాన్స్లు వచ్చాయి. ధోల్కీ, ‘తిచా ఉంబర్తా’. ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలు జ్యోతికి నటిగా మంచి గుర్తింపుని సంపాదించిపెట్టాయి. మారాఠి ఇండస్ట్రీ నుంచి ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పుణెలోని తమ నివాసం జ్యోతి చందేకర్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు ఆమె కూతురు, నటి తేజస్విని పండిట్ తెలిపారు. -
బిగ్బాస్ విన్నర్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు
హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. గురుగ్రామ్లో ఉన్న ఆయన ఇంటి వద్దకు ముగ్గురు యువకులు ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో చేరుకుని కాల్పులు జరిపారు.దాడి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. కాల్పులు జరిగినప్పుడు ఎల్విష్ యాదవ్ తన నివాసంలో లేడు. వివాదాస్పద యూట్యూబర్గా ఆయన పేరుంది. బహుళ అంతస్తులతో నిర్మించిబడిని ఆయన ఇంటి కింది అంతస్తులలో బుల్లెట్లు దూసుకుపోయాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 'ఈ సంఘటన ఈరోజు ఉదయం 5.30 మరియు 6 గంటల మధ్య జరిగింది. బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సెక్టార్ 57లోని యాదవ్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. దాడి జరిగినప్పుడు అతని కేర్ టేకర్, కొంతమంది కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు. కానీ ఎవరికీ గాయాలు కాలేదు.' అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన వారు విచారణ ప్రారంభించారు.2024లో నోయిడా పోలీసులు ఎల్విష్ను రేవ్ పార్టీలో పాము విషం సరఫరా కేసులో అరెస్టు చేశారు. అతడి దగ్గర 9 పాములతో పాటు 20ml పాము విషం స్వాధీనం చేసుకున్నారు. ఆపై కాశీ విశ్వనాథ ఆలయ సముదాయంలో ఫోటోలు, వీడియోలు తీసినందుకు ఎల్విష్పై కేసు నమోదైంది. జైపూర్లోని ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తిని ఎల్విష్ యాదవ్ చెంపపగలగొట్టిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా పలు వివాదాలు ఆయన చుట్టూ ఉన్నాయి. -
బాల్యపు గాయాలే భవిష్యత్ నిర్ణేతలు!
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా తపన పడతారు. మంచి స్కూల్, ట్యూషన్, కోచింగ్... ఇలా చేయాల్సిన దానికి మించి చేస్తారు. మార్కులు, ర్యాంకులతో పిల్లల విజయాన్ని కొలుస్తారు. కాని, మీ బిడ్డ జీవితంలో అతిపెద్ద విజయం ఎగ్జామ్ హాల్లో కాదు, తన మనసులో జరుగుతుంది. ప్రతి బిడ్డ మనసులో ఒక రిపోర్ట్ కార్డ్ ఉంటుంది. అది మార్కులకు సంబంధించినది కాదు, భావాలకు, అనుభవాలకు సంబంధించినది. ఆ రిపోర్ట్ కార్డ్లో భయం, నిర్లక్ష్యం, అవమానం లాంటివి ఉంటే, అవే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వీటినే సైకాలజీలో ‘కనిపించని గాయాలు’ అని పిలుస్తారు.గత ఏడాది ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్ ఫోబియాతో కౌన్సెలింగ్ కోసం వచ్చాడు. ఆ స్టూడెంట్తో మాట్లాడాక తెలిసింది అతని భయానికి కారణం సబ్జెక్ట్ కాదు, 90 శాతం కంటే తక్కువ మార్కులు వస్తే ‘నువ్వెందుకూ పనికిరావు’ అని తండ్రి తిట్టడమని. అందుకే అతనితో పాటు తండ్రికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చాను. మూడు నెలల్లో ఫోబియా మాయమైంది. 10 జీపీఏతో పదోతరగతి పాసయ్యాడు. పరిశోధనలేం చెబుతున్నాయి?అనుభవాలను బట్టి మెదడు వైర్ అవుతుంది. సురక్షితమైన, ప్రేమతో కూడిన వాతావరణంలో ఫోకస్, డెసిషన్ మేకింగ్కు కారణమయ్యే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బాగా అభివృద్ధి చెందుతుంది. నిరంతరం భయంతో ఉంటే భయాన్ని నియంత్రించే అమిగ్డాలా హైపర్ యాక్టివ్ అవుతుంది. బాల్యంలో అవమానం, నిర్లక్ష్యం, శారీరక లేదా భావోద్వేగ దౌర్జన్యం ఎదుర్కొన్న పిల్లలు నాలుగు రెట్లు ఎక్కువగా డిప్రెషన్, ఆందోళనకు గురవుతారని 17 వేల మంది పిల్లలపై జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. అలాంటి పిల్లలు చదువులో వెనుక బడతారు. పెరిగి పెద్దయ్యాక, కెరీర్లో స్థిరత్వం లేక ఇబ్బందులు పడతారు. సంబంధాలలో సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు.బాల్యంలో ఎమోషనల్ కనెక్షన్ ఉన్న పిల్లలకే జీవితంలో, కెరీర్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువని హార్వర్డ్ స్టడీలో కూడా వెల్లడైంది. ఫార్చ్యూన్ 500 సీఈఓలలో 70 శాతం మందికి సురక్షితమైన బాల్యం ఉండటమే ఇందుకు పెద్ద ఉదాహరణ. కొనసాగే గురుతులు...బాల్యంలో మనసుకైన గాయాలు కనిపించవు. కాని, వాటి ప్యాటర్న్ పెద్దయ్యాక కూడా కనిపిస్తుంది.బాల్యంలో ప్రేమ షరతులతో కూడినదైతే పెద్దయ్యాక అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తారు. ఓటమిని అంగీకరించడం నేర్పించకపోతే, టాపర్ అయినా ఎగ్జామ్ ఫెయిల్ అవుతాననే భయంతోనే బ్రతికేస్తుంటాడు. ‘నువ్వెందుకూ పనికిరావు’ అనే మాటల మధ్య పెరిగిన బిడ్డకు ఎంత టాలెంట్ ఉన్నా పెద్ద అవకాశాలను తప్పించుకునే వ్యక్తిగా మారతాడు. 7 స్టెప్స్ప్రతి పేరెంట్ తప్పులు చేస్తారు. అలాగని అపరాధభావనతో కుంగిపోకండి. ఆ ప్యాటర్న్ను బ్రేక్ చేయండి.మీ బిడ్డను ఇతరులతో పోల్చుతున్నారా? చిన్న చిన్న విషయాలకే తిడుతున్నారా? గాయం ఇక్కడే మొదలవుతుందని గుర్తించండి.∙మీరు ఈ రోజు మాట్లాడే మాటలు, మీ బిడ్డ ఇన్నర్ వాయిస్ అవుతుంది. అందుకే ఆ వాయిస్ ‘ఐ యామ్ గుడ్’ అని చెప్పేలా చూసుకోండి.∙విమర్శను కనెక్షన్తో మార్చండి. ‘నువ్వు లేజీ’ అని కాకుండా, ‘నువ్వు అలిసిపోయినట్టున్నావ్, మళ్లీ మాట్లాడదాం’ అని చెప్పండి. కనెక్షన్ = కరెక్షన్ అని గుర్తుంచుకోండి.ఇంటిని సురక్షిత ప్రదేశంగా మార్చండి. నో జడ్జ్మెంట్ జోన్ క్రియేట్ చేయండి. ఫలితాలకే కాదు, ప్రయత్నానికీ సెలబ్రేషన్ చేయండి.ఏఐ యుగంలో మార్కులు కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ గెలిపిస్తుంది. పాత గాయాలు నయం చేయకపోతే, మీ బిడ్డ భవిష్యత్తునే సాఫ్ట్వేర్ బగ్స్తో నడుస్తుందని గుర్తించండి.మీ గతం మీ ప్రస్తుతాన్ని ప్రభావితం చేస్తుంది. మీ ప్రవర్తన మీ బిడ్డ మనసుకు గాయాలు చేయవచ్చు. అందుకే మీ గాయాలు హీల్ అయ్యేందుకు థెరపీ తీసుకోండి. ఇదేమీ బలహీనత కాదు. బలం. తల్లిదండ్రుల అపోహలుపిల్లల మంచి కోసమే తిడుతున్నాం అనుకుంటారు కాని, ప్రేమంటే భయమనే ప్రోగ్రామ్ను బ్రెయిన్లో ఇన్స్టాల్ చేస్తున్నారనేది నిజం.తిట్టినా పిల్లలు మర్చిపోతారనుకుంటారు. అది తప్పు. వాళ్లు మర్చిపోరు. అవి వారి అన్కాన్షస్లో చేరి, జీవితంలో రిపీట్ అవుతాయి.భారీ ఫీజులు చెల్లించి మంచి స్కూల్లో చేర్పిస్తే సక్సెస్ గ్యారంటీ అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. ఎమోషనల్ సేఫ్టీనే మొదటి పాఠశాల. అది పేరెంట్స్ నుంచే రావాలి. సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’) -
జూనియర్ ఎన్టీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వవంటూ హెచ్చరించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం వైరల్గా మారింది.ఎమ్మెల్యే ఆడియో సంభాషణలు ఆలస్యంగా వెలుగుచూశాయి. దగ్గుబాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ను దారుణంగా దూషించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వచ్చిందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.. సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
‘శారద’లో మరో విద్యార్థి బలవన్మరణం.. ‘లేఖ’లో విద్యా విధానంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యా కుసుమం నేల రాలింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. వర్శిటీకి చెందిన బిటెక్ విద్యార్థి శివమ్ డే(24) తన హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటన దరిమిలా విశ్వవిద్యాలయంలో విషాదఛాయలు అలముకున్నాయి.బీహార్లోని మధుబనికి చెందిన శివమ్.. వర్శిటీలోని హెచ్ఎంఆర్ హాస్టల్లో ఉంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఫోరెన్సిక్ బృందం శివమ్ గదిని పరిశీలించింది. అక్కడ శివమ్ రాసిన లేఖ పోలీసులకు దొరికింది. దానిలో శివమ్ ‘మీరు దీనిని చదివే సమయానికి నేను చనిపోయివుంటాను. నా మరణం నా సొంత నిర్ణయం. ఇందులో ఎవరికీ సంబంధం లేదు. నేను ఒక ఏడాదిగా ఇందుకోసం ప్లాన్ చేస్తున్నాను. రెండేళ్లుగా తరగతులకు హాజరు కావడం లేదు. నా ఫీజులను నా కుటుంబానికి తిరిగి చెల్లించండి. భారతదేశ విద్యా వ్యవస్థ నిరాశాజనకంగా ఉంది. దీనిని పరిష్కరించకపోతే, దేశం పురోగతి సాధించలేదు. నా అవయవాలను అవసరమైనవారికి దానం చేయండి’ అని శివమ్ ఆ లేఖలో రాశాడు.కుమారుని ఆత్మహత్య గురించి తెలుసుకున్న శివమ్ కుటుంబసభ్యులు.. తమ కుమారుడు రెండేళ్లుగా తరగతులకు హాజరు కాకుంటే, ఆ విషయాన్ని తమకు ఎందుకు చెప్పలేదని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కాగా శారదా యూనివర్సిటీలో గత నెలలో రెండవ ఏడాది దంత విద్యార్థిని హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాకల్టీ వేధింపులపై ఆరోపణలు చేస్తూ ఆమె ఒక లేఖ రాసింది. ఈ ఘటన క్యాంపస్లో నిరసనలకు దారితీసింది. ఈ కేసు నేపధ్యంలో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. శివమ్ ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. -
‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’
మీ బాస్ను ఎలా మేనేజ్ చేయాలో మీకు ఎవరూ నేర్పించరు. వారిని మేనేజ్ చేయడానికి, ముందుగా వారు ఎలాంటి వ్యక్తో మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీకు ఎం.బి.టి.ఐ. (మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్) సహాయపడవచ్చు. బాస్లు ఎలా పని చేస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, అనే అంశాలపై ఆధారపడి ఈ ఇండికేటర్ బాస్లను కమాండర్, విజనరీ, హార్మనైజర్, స్ట్రాటిజిస్ట్, ఎనలిస్ట్, సపోర్టర్, మ్యావరిక్, ఫ్రీ స్పిరిట్ అనే 8 రకాల వ్యక్తులుగా విభజించింది. ఈ ఎనిమిది మందిలో మీ బాస్ ఏ టైపు మనిషో కింద ఇచ్చిన ఇండికేటర్ ‘కీ’ చెబుతుంది. కనుక ఇండికేటర్ను ఫాలో అయిపోండి. ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అంటారు కనుక బాస్ తత్త్వానికి అనుగుణంగా మీరు మారండి. ప్రశాంతంగా ఉండండి. కెరీర్లో విజయం సాధించండి.కమాండర్లు వీళ్లు ఫలితాలనే నమ్ముతారు. పనిలో వేగాన్ని, స్పష్టతను కోరుకుంటారు. సామర్థ్యం, నాయకత్వం, తర్కం వీళ్లలో ముఖ్యమైనవి. వీళ్లకు సమావేశాలు, డెడ్లైన్లు ముఖ్యం. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా వ్యవహరించే ఉద్యోగులను వీరు అభిమానిస్తారు. ఇలాంటి వారితో పేరాల్లో కాకుండా బుల్లెట్ పాయింట్లలో మాట్లాడాలి. కుంటి సాకులు, భావోద్వేగాలు వీళ్లు నచ్చవు. గడుపులోపే చెప్పిన పని అయిపోవాలి. ఇలాంటి వాళ్ల దగ్గర అస్తవ్యస్తంగా, అనిశ్చితంగా ఉంటే మీ కెరీర్ దెబ్బతిన్నట్లే. విజనరీలు వీరు శక్తిమంతులు. ఐడియాల పుట్టలు. వినూత్న ఆవిష్కరణల్ని ఇష్ట పడతారు. వీరు వర్క్ప్లేస్ని శక్తిమంతంగా మార్చేస్తారు. భవిష్యత్తుపై దృష్టి ఉంటుంది. పని ఎలా జరుగుతోందో చూడరు. ఎంత జరిగిందో అడుగుతారు. వీరిని ఆకట్టుకోవడానికి ఫ్రెష్ ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనల్ని అప్పటికప్పుడు ఆచరణలో పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగి ఆఫీస్కి వచ్చేటప్పుడు, ఆఫీస్ నుండి వెళ్లేటప్పుడు ఆ ప్రయాణంలో సైతం ఆఫీస్ పని చేయవలసి వస్తుంది. రూల్స్ మాట్లాడకూడదు. స్ప్రెడ్షీట్లను కుమ్మరించకూడదు. అంతులేని ఫాలో–అప్లతో వారిని ముంచెత్తకూడదు. ఉద్యోగికి సమయస్ఫూర్తి లేకపోవడం వారిని నిరాశపరుస్తుంది.హార్మౖనైజర్లు ఉద్యోగులతో వీరు స్నేహపూర్వకంగా ఉంటారు. అందర్నీ కలుపుకుని పోతారు. సామరస్యాన్ని కోరుకుంటారు. టీమ్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తారు. మీ పుట్టినరోజును గుర్తుంచుకుంటారు. లేదా మీ కుటుంబం బాగోగుల గురించి అడుగుతారు. హెల్ప్ చేసేందుకు రెడీగా ఉంటారు. వీరి నాయకత్వం పరస్పర విశ్వాసం, భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. వీరితో పనిచేయడానికి కమ్యూనికేటివ్గా ఉండాలి. టీమ్ కల్చర్ నిర్మాణానికి మీ సహకారాన్ని కోరుకుంటారు. ఘర్షణాత్మక ధోరణిని అస్సలు ఇష్టపడరు. టీమ్ ఒకలా ఆలోచిస్తే మీరు టీమ్కు విరుద్ధంగా ఆలోచించటం వీరిలో అసహనం కలిగిస్తుంది. స్ట్రాటెజిస్టులుఆలోచనాత్మకమైనవారు. లక్ష్యాలే ముఖ్యమైన దార్శనికులు. లోతుగా ఆలోచిస్తారు. జాగ్రత్తగా ప్రణాళిక వేస్తారు. స్వేచ్ఛ, వ్యూహాత్మకత విలువైనవిగా భావిస్తారు. నాటకీయతను ఇష్టపడరు. అన్నీ తెలుకుని ఉంటారు. పైకి వ్యక్తపరచరు. నాణ్యమైన పనిని ఆశిస్తారు. వీరి దగ్గర భావోద్వేగ ప్రకోపాలు, నిస్సారపు ఆలోచనలు, అస్తవ్యస్తమైన ఆలోచనలు ఉద్యోగికి నష్టాన్ని తెస్తాయి. నిర్మాణాత్మక వాదనలు మాత్రమే వీరి దగ్గర చేయాలి.ఎనలిస్టులు కచ్చితమైనవారు, తార్కికంగా ఉంటారు. ప్రతిదీ వివరంగా తెలుసుకుంటారు. స్పష్టత ముఖ్యం. ఆధారాలు అవసరం. మీరు వాగ్దానం చేసిన వాటిని అమలు చేయాలని వీరు ఆశిస్తారు. అరకొర పనులను, నిర్ణయాలలో ఊగిసలాటను ద్వేషిస్తారు. డేటా, నిర్మాణం, దృఢమైన తార్కికతతో వీరికి సహాయకారిగా ఉండండి. నాటకీయత వద్దు. ప్రాక్టికల్గా ఉండండి. భావోద్వేగ విజ్ఞప్తులతో, అస్పష్టమైన నిబద్ధతలతో లేదా ఒక పనిని దాటవేయడం ద్వారా వారిని నిరాశపరచకండి.సపోర్టర్లు నిశ్శబ్దంగా ఉంటారు. నమ్మదగినవారు. సేవా దృక్పథం కలిగినవారు. స్థిరమైన జట్లకు వెన్నెముకగా ఉండాలని కోరుకుంటారు. స్థిరంగా, శ్రద్ధగా, విశ్వాసపాత్రంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాలకు విలువ ఇస్తారు. వీరి దగ్గర మీరు స్థిరంగా, సానుభూతితో, మర్యాదగా ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అదనపు పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు బాగా రాణిస్తారు. మాటలతో కాకుండా చేతలతో మీరు నమ్మకాన్ని సంపాదించాలి. మీలోని దూకుడు ప్రవర్తన, ఆకస్మిక మార్పులు, టీమ్ని విమర్శించటం వంటి పనులతో వీరికి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది.మ్యావరిక్లు చురుగ్గా, వేగంగా, వ్యూహాత్మకంగా ఉంటారు. వీరిది నో–నాన్సెన్ ధోరణి. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. పనులు పూర్తి చేసే వారిని విలువైనవారిగా భావిస్తారు. తన ఉద్యోగులు సమయాన్ని గౌరవించాలని, ఒత్తిళ్లను స్వీకరించాలని కోరుకుంటారు. మితిమీరిన ప్రణాళికల్ని ఇష్టపడరు. అధిక డాక్యుమెంటేషన్ను కూడా లైక్ చెయ్యరు. ప్రతిదానికీ నెమ్మదిగా ప్రతిస్పందిస్తుంటే మిమ్మల్ని నిష్కర్షగా పక్కనపెట్టేస్తారు.ఫ్రీ స్పిరిట్ కలిగినవారు స్వతంత్రమైన, సృజనాత్మకమైన, హృదయపూర్వకమైన గుణాలున్నవారు. వీరికి విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. తన టీమ్కు స్వేచ్ఛను ఇస్తారు. మీలో అభిరుచి, చొరవ ఉంటే మిమ్మల్ని టీమ్ లీడర్గా గుర్తిస్తారు. వీరితో నిజాయితీగా, దాపరికం లేకుండా ఉండాలి.మీ బాస్ సరే, మీరు ఎలాంటి వారు?ఇది తెలుసుకోవాలంటే 41 క్యూ.కామ్ లేదా 16 పర్సనాలిటీస్.కామ్లో ఈ ఎం.బి.టి.ఐ. ఆన్లైన్ పరీక్ష రాయండి. ఎలాంటి బాస్ మీకు సరిపడతారో తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్· సాక్షి, స్పెషల్ డెస్క్ -
గ్లెన్ మ్యాక్స్వెల్పై భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహం
ఆసీస్ విధ్వంసక బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తీరు భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ వెటరన్ మెరుపు వీరుడు ఐపీఎల్ మినహా అన్ని చోట్లా సత్తా చాటడమే ఇందుకు కారణం. తాజాగా మ్యాక్సీ తన జాతీయ జట్టుకు ఆడుతూ (సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టీ20) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోవాల్సిన మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో ఆసీస్ సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. తీవ్ర ఒత్తిడిలో ఆడిన ఈ ఇన్నింగ్స్ మ్యాక్స్వెల్ టీ20 కెరీర్లో అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు.173 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో బరిలోకి దిగిన మ్యాక్సీ కళ్లు మూసి తెరిచేలోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన జట్టును సేఫ్ జోన్లో ఉంచాడు. అంతేకాకుండా చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసమైన తరుణంలో ఊహించని షాట్ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్లో 36 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ ఇన్నింగ్స్ తర్వాత మ్యాక్సీపై అందరూ ప్రశంసలు కురిపిస్తుండగా.. భారత అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. మ్యాక్స్వెల్ ఐపీఎల్లో ఆడడు కానీ, మిగతా చోట్లంతా సత్తా చాటుతాడంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి భారత క్రికెట్ అభిమానుల్లో బాధకు అర్దముంది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఇతగాడికి ఐపీఎల్ అవకాశాలిస్తే.. దారుణంగా నిరుత్సాహపరిచాడు. గత రెండు మూడు సీజన్లుగా పరిస్థితి ఇదే. గత సీజన్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండింది. 5 మ్యాచ్ల్లో కేవలం 48 పరుగులే చేసి మధ్యలో స్వదేశానికి చెక్కేశాడు. పంజాబ్ కింగ్స్ అతనిపై భారీ అంచనాలు పెట్టుకొని, మంచి మొత్తానికి కొనుగోలు చేసింది. వారి ఆశలపై మ్యాక్స్వెల్ నీళ్లు చల్లాడు.ఈ వైఫల్యాలు చూసి మ్యాక్స్వెల్ ఫామ్ కోల్పోయుంటాడనుకోవడానికి వీళ్లేదు. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో అతను అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. 12 మ్యాచ్ల్లో 175 స్ట్రయిక్రేట్తో 252 పరుగులు చేశాడు. తన జాతీయ జట్టుకు ఆడేప్పుడు మ్యాక్స్వెల్ మరింత అంకితభావంతో ఆడి చెలరేగుతాడు. ఈ ఏడాది టీ20ల్లో ప్రదర్శనలే ఇందుకు ఉదాహరణ. ఈ యేడు అతను ఆసీస్ తరఫున 8 టీ20 ఇన్నింగ్స్లు ఆడి 174.2 స్ట్రయిక్రేట్తో 169 పరుగులు చేశాడు.మ్యాక్స్వెల్ తన సొంత దేశం తరఫున ఎలా ఆడినా.. భారత అభిమానులకు పోయేదేమీ లేదు. అయితే దేశం తరఫున ఆడేప్పుడు చూపే అంకితభావాన్ని ఐపీఎల్ల్లోనూ కనబర్చాలని వారు ఆశిస్తున్నారు. ఏ ఫ్రాంచైజీ అయినా ఆటగాళ్లను భారీ అంచనాలు పెట్టుకునే కొనుగోలు చేస్తుంది. అలాంటప్పుడు ఆటగాళ్లు తమపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి.అయితే మ్యాక్సీ మాత్రం అలా చేస్తున్నట్లు కనిపిండం లేదు. ఏదో హాలిడే ఎంజాయ్ చేసేందుకు భారత్కు వస్తున్నాడా అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకుంది కూడా ఇక్కడే కాబట్టి, అత్తగారింటికి చుట్టపు చూపుకు వచ్చినట్లు వచ్చిపోతున్నాడు. ఐపీఎల్ ఆరంభంలో మ్యాక్సీలో కనిపించిన కమిట్మెంట్ ఇటీవలకాలంలో కనిపించడం లేదు. పంజాబ్కు ముందు ఆర్సీబీ తరఫున తరఫున కూడా వైఫల్యాల పరంపర కొనసాగించాడు. ఇది చూస్తే, చాలా మంది ఆసీస్ ఆటగాళ్ల లాగే మ్యాక్స్వెల్కు కూడా ఐపీఎల్ అంటే గిట్టదేమో అని అనిపిస్తుంది. -
భారత్కు మరో షాకిచ్చిన అమెరికా.. ట్రంప్ ప్లాన్ అదేనా?
ఢిల్లీ: భారత్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య చర్చల కోసం భారత్కు రావాల్సిన అమెరికా బృందం ట్విస్ట్ ఇస్తూ.. తమ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, వారి తదుపరి పర్యటనపై సస్పెన్స్ నెలకొంది.వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంతో భారత్పై అమెరికా భారీగా సుంకాల భారాన్ని మోపింది. ట్రంప్ ఇటీవల భారత్పై 50శాతం సుంకాలు విధించారు. పాత 25శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదనపు 25% టారిఫ్లు ఈ నెల 27ను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సుంకాలు అమలులోకి రాకముందే.. అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపి మధ్యంతర ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.🚨 US trade team CALLS OFF Aug 25–29 Delhi visit for trade talks. pic.twitter.com/TOVBv10nwZ— Beats in Brief 🗞️ (@beatsinbrief) August 16, 2025ఈ క్రమంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఐదు దఫాలు చర్చలు జరిగాయి. ఆరో దఫా చర్చలకు అమెరికా ప్రతినిధులు ఈ నెల 25-29 మధ్య భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ దఫా చర్చల్లో భాగంగా.. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు సంబంధించిన చిక్కుముడులు వీడే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, తాజాగా వారు ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. చర్చలకు సంబంధించిన తదుపరి తేదీలను కూడా వారు వెల్లడించలేదు. దీంతో, మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు ఉంటాయా? లేదా? అనే సందిగ్థత నెలకొంది. ఒకవేళ చర్చలు విఫలమైతే.. భారత్పై టారీఫ్ల భారం పడే అవకాశం ఉంది. కాగా, భారత్పై సుంకాలు విధించాలనే ఆలోచనతోనే ట్రంప్ ఇలా ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా, భారత్ను టార్గెట్ చేసి ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ దేశ ప్రజలకు సూచనలు చేశారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ట్రంప్తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య చర్చలు సఫలం అవుతాయా? అని అందరూ ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు. -
రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైల్వే శాఖ కొత్తగా తీసుకొస్తున్న డిజిటల్ అప్గ్రేడ్ ద్వారా టికెట్ బుకింగ్ వేగం నాలుగు రెట్లు పెరగనుంది. పండుగ కాలాల్లో, ప్రత్యేక రైళ్ల సమయంలో, లేదా జనరల్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఆలస్యం, సాంకేతిక సమస్యలు తగ్గనున్నాయి.కొత్త పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా నిమిషానికి 1 లక్ష టికెట్లు బుక్ చేయగల సామర్థ్యం కలుగుతుంది. పీఆర్ఎస్కు ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు బుక్ చేసే సామర్థ్యం ఉంది. ఈ అప్గ్రేడ్లో భాగంగా క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్, మెరుగైన నెట్వర్క్, భద్రతా వ్యవస్థలు, ఆధునిక హార్డ్వేర్ అమలు చేయబోతున్నారు.ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి రైల్వే శాఖ రైల్వన్ (RailOne) అనే కొత్త సూపర్ యాప్ను కూడా ఇటీవల ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్, పీఎస్ఆర్ స్టేటస్, కోచ్ పొజిషన్, ఫుడ్ ఆర్డర్, ఫీడ్బ్యాక్ వంటి సేవలను ఒకే చోట పొందగలుగుతారు. రైల్వన్ యాప్లో సింగిల్ సైన్-ఆన్ విధానం అమలులో ఉంది. దీని ద్వారా బయోమెట్రిక్ లేదా ఎంపిన్ ద్వారా లాగిన్ చేయవచ్చు. పలు ప్రాంతీయ భాషల మద్దతుతో, ఈ యాప్ గ్రామీణ, ప్రాంతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగిస్తోంది.అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) పరిమితిని కూడా రైల్వే శాఖ ఇదివరకే తగ్గించింది. అప్పటివరకు ప్రయాణానికి 120 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండగా, నవంబర్ 1, 2024 నుంచి దీన్ని 60 రోజులకు పరిమితం చేసింది. ఇక దీపావళి, ఛఠ్ పూజా వంటి పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఊరట కలిగించేందుకు, రైల్వే శాఖ ఫెస్టివల్ రౌండప్ ట్రిప్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద అక్టోబర్ 13–26, నవంబర్ 17–డిసెంబర్ 1 మధ్య రిటర్న్ టికెట్లపై 20% డిస్కౌంట్ అందిస్తోంది. -
దెయ్యాల కొంపలను తలపించే నిర్జన కట్టడాలు
ప్రపంచంలో ఎన్నో భారీ కట్టడాలు ఉన్నాయి. వీటిలో ప్రజల సామూహిక అవసరాల కోసం నిర్మించినవి కొన్ని, ప్రైవేటు వ్యక్తుల విలాసాల కోసం నిర్మించుకున్నవి మరికొన్ని. మనుషుల సంచారం ఉన్నప్పుడే ఎంతటి కట్టడానికైనా కళాకాంతులు ఉంటాయి. మనిషి అలికిడైనా లేని కట్టడాలు దయ్యాల కొంపలను తలపిస్తాయి. ఎంతో వ్యయప్రయాసలతో నిర్మించినా, మనిషి అలికిడి లేకపోవడం వల్ల కళ తప్పిన కొన్ని నిర్జన నిర్మాణాల గురించి తెలుసుకుందాం...ఆర్ఫియమ్ థియేటర్ప్రపంచంలో ఇంకా సినిమా ప్రభావం మొదలవక ముందు నాటక ప్రదర్శనల కోసం నిర్మించిన రంగస్థల కేంద్రం ‘ఆర్ఫియమ్ థియేటర్’. ఇది అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం న్యూబెడ్ఫోర్డ్లో ఉంది. దీనిని న్యూబెడ్ఫోర్డ్లోని ఫ్రెంచ్ షార్ప్షూటర్స్ క్లబ్ నిర్మించింది. తర్వాత దీనిని బోస్టన్కు చెందిన ఆర్ఫియమ్ సర్క్యూట్కు లీజుకిచ్చింది. సరిగా ‘టైటానిక్’ ఓడ మునిగిపోయిన రోజునే– 1912 ఏప్రిల్ 15న ఈ థియేటర్ ప్రారంభమైంది. నాటి నుంచి యాభయ్యేళ్ల పాటు 1962 వరకు ఇక్కడ విరివిగా నాటక ప్రదర్శనలు జరిగేవి. సినిమా, టెలివిజన్ ప్రభావం పెరగడంతో 1959 నాటికే దీని ప్రాభవం క్షీణించింది. నష్టాలతో నడపలేక ‘ఆర్ఫియమ్’ యాజమాన్యం 1962లో దీనిని మూసేసింది. అప్పటి నుంచి ఈ కట్టడం జనసంచారం లేక బోసిపోయి, శిథిలావస్థకు చేరుకుంది.సాథోర్న్ యూనిక్ టవర్దాదాపు ముప్పయ్యేళ్ల కిందట ‘బూమ్’ బుడగ విస్తరించినప్పుడు థాయ్లండ్ ఆర్థిక వ్యవస్థ కూడా కాసుల గలగలలతో కళకళలాడేది. స్థిర చరాస్తి రంగాల్లోకి పెట్టుబడుల ప్రవాహం ఉద్ధృతంగా సాగేది. రియల్ ఎస్టేట్ రంగం మూడు వెంచర్లు, ఆరు అపార్ట్మెంట్లలా ఒక వెలుగు వెలిగేది. ఆ కాలంలోనే బ్యాంకాక్లో ఈ నలభై అంతస్తుల కట్టడం రూపుదిద్దుకుంది. బ్యాంకాక్ నగరం నడిబొడ్డున చావోఫ్రాయా నదికి చేరువలో భారీ స్థాయిలో సంపన్నుల విలాసాలకు అనువుగా ఈ అపార్ట్మెంట్ భవన నిర్మాణాన్ని తలపెట్టారు. నిర్మాణం ఇంకా కొనసాగుతున్న దశలోనే ‘బూమ్’ బుడగ బద్దలైంది. అపార్ట్మెంట్ నిర్మాణ కార్యక్రమానికి నిధులు నిలిచిపోయాయి. సాథోర్న్ యూనిక్ కంపెనీ ఈ భవన నిర్మాణ కార్యక్రమాన్ని సిఫ్యా కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. డబ్బులు ముట్టకపోవడంతో సిఫ్యా కన్స్ట్రక్షన్ కంపెనీ 1997లో నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసింది. ఆ తర్వాత దీనిని పూర్తి చేయడానికి సాథోర్న్ యూనిక్ కంపెనీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవేవీ సఫలం కాలేదు. ఫలితంగా ఈ కట్టడం కళతప్పి, ‘ఘోస్ట్ టవర్’గా మిగిలింది.వాన్లీ యూఎఫ్ఓ విలేజ్అప్పుడపుడు ఆకాశంలో ‘అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్’ (యూఎఫ్ఓలు) కనిపించినట్లుగా వార్తలు వస్తుంటాయి. యూఎఫ్ఓలను నేల మీద ఉండగా చూసినవాళ్లు ఎవరూ లేరు. అలాంటిది యూఎఫ్ఓలో బస చేసినవారు ఉండటమనే ప్రశ్నే లేదు. యూఎఫ్ఓలు నేల మీదకు వస్తే, వాటిని చూడాలని, కుదిరితే వాటిలో కాలం గడపాలని కోరుకునేవారు తక్కువేమీ కాదు. అలాంటివారి కోరిక తీర్చాలనే ఉద్దేశంతోనే తైవాన్కు చెందిన హుంగ్ కువో గ్రూప్ రాజధాని తైపీ నగరానికి చేరువలోని సాంఝీలో యూఎఫ్లో ఆకారంలో నిర్మించిన భవంతులతో రిసార్ట్ నిర్మాణం తలపెట్టింది. ఈ రిసార్ట్లో యూఎఫ్లోను తలపించేలా గూళ్లలాంటి చిన్న చిన్న ఇళ్లను నిర్మించడానికి 1978లో పనులు ప్రారంభించింది. కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తిచేసింది కూడా! ఆర్థిక ఇబ్బందులతో పాటు ఈ ప్రదేశంలో ఆత్మహత్యలు, వాహన ప్రమాదాలు వంటి వరుస దుస్సంఘటనలు ఎదురవడంతో 1980లోనే ఈ నిర్మాణాన్ని నిలిపివేసింది. అప్పటి నుంచి ఇక్కడ యూఎఫ్ఓ ఆకారంలో నిర్మించిన ఇళ్లన్నీ ఖాళీగా మిగలడంతో పాడుబడిన దశకు చేరుకున్నాయి. ఈ కట్టడాలపై అనేక వదంతులు ప్రచారంలో ఉండటంతో స్థానకులు సైతం ఇక్కడకు రావడానికి భయపడతారు.ర్యుగ్యాంగ్ హోటల్ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నగరం నడిబొడ్డున శిఖరంలా నిలిచి కనిపించే ఈ హోటల్లో ఇప్పటి వరకు అతిథులెవరూ అడుగుపెట్టలేదు. ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ ఇల్ సుంగ్ హయాంలో దేశానికే తలమానికంలా నిలిచేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నూటైదు అంతస్తుల హోటల్ భవంతి నిర్మాణాన్ని 1987లో ప్రారంభించారు. దేశానికి తరచుగా ఆర్థిక కష్టాలు ఎదురవడంతో ఈ హోటల్ నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. కుంటుతూ కుంటుతూనే ఇందులో మూడువేల గదులను, ప్రతి గదికి బయటివైపు మూడువేల గాజు పలకలను కళ్లు జిగేల్మనిపించేలా నిర్మించారు. ఇందులో ఐదు రివాల్వింగ్ రెస్టరెంట్లను కూడా నిర్మించారు. దీర్ఘకాలం పనులు నిలిచిపోయాక, కిమ్ జాంగ్ ఉన్ పాలన మొదలయ్యాక అర్ధాంతరంగా నిలిచిపోయిన దీని పనులు మళ్లీ మొదలయ్యాయి. పాతికేళ్ల కిందట మొదలైన ఆ పనుల్లో భాగంగా హోటల్ బయటివైపు నిర్మాణాన్ని కూడా పూర్తిచేశారు. అయితే, ఈ హోటల్ కార్యకలాపాలేవీ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికీ చక్కగా నివాసయోగ్యంగా ఉన్నా, మనిషి అలికిడి లేకుండా మిగిలిన ఈ హోటల్ను ‘హోటల్ ఆఫ్ డూమ్’గా అభివర్ణిస్తూ పాశ్చాత్య మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. సిటీహాల్ సబ్వే స్టేషన్ఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్థానిక రైళ్ల రాకపోకల కోసం నిర్మించిన భూగర్భ రైల్వేస్టేషన్. దీనిని 1904లో నిర్మించారు. అప్పట్లో ఇది ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించేది. వంపు తిరిగిన దీని ప్లాట్ఫామ్ కారణంగా పొడవాటి రైళ్లు నిలిపేందుకు సానుకూలత లేకపోవడమే దీని లోపం. జనాభాకు తగినట్లుగా రైళ్లకు బోగీలు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో 1945లోనే ఈ స్టేషన్ మూతబడింది. నాటి నుంచి ఇది నిర్మానుష్యంగా మిగిలింది. ఈ రైల్వేస్టేషన్కు అప్పట్లో జార్జ్ లూయిస్ హీన్స్, క్రిస్టఫర్ గ్రాంట్ లా ఫార్జ్ అనే ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్లు రూపకల్పన చేశారు. పైకప్పుకు వేలాడే ఇత్తడి షాండ్లియర్లు, నున్నని రాతి పలకలతో నిర్మించిన గచ్చు, విశాలమైన ప్రవేశమార్గం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆనాటి రవాణా వ్యవస్థ వైభవానికి ఆనవాలుగా నిలిచి ఉన్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాక కళ తప్పిన ఈ స్టేషన్ ఇప్పుడు కొంత శిథిలావస్థకు చేరుకుంది. (చదవండి: -
పెద్ద పులులను సైతం హడలెత్తించే కుక్కలు..!
పశ్చిమ గోదావరి జిల్లా: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని.. వాటి ఉనికిని కనిపెట్టి తప్పించుకుని తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్డాగ్స్ వాటి కంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. అడవిలో సంచరించే అడవి పందిని ఈ వైల్డ్డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి(సాంబార్ డీర్), మనిమేగం లాంటి పెద్ద జింక జాతి జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వెంటాడి వేటాడతాయి. ఈ వైల్డ్డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊర కుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. వీటి తోకకు వెంట్రుకలు కుచ్చుగా ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి. అభయారణ్యాల్లో అధికంగా సంచారం అభయారణ్యాలుగా ఉన్న పాపికొండలు, నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200 కుక్కలకు పైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్న నేపద్యంలో ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమతుల్యతకు ప్రధాన భూమిక వైల్డ్ డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులైన చిరుత పులి, పెద్దపులి, అడవి కుక్కల సంఖ్య తగ్గిపోతే వాటి ఆహార జంతువులైన వివిధ జంతువులు, జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవి పందులు, జింకల సంఖ్య పెరుగుదల ప్రమాదకరంగా మారకుండా నియంత్రణలో ఈ అడవి కుక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని అధికారులు అంటున్నారు. -
హీరోగా తేజ వారసుడు ఎంట్రీ సరే.. హీరోయిన్ పేరే కాస్త డౌట్..?
టాలీవుడ్ దర్శకుడు తేజ ఎన్నో ప్రేమ కథలను వెండితెరపై చూపించాడు. చిత్రం, నువ్వూ-నేను, జయం వంటి చిత్రాలతో పాటు నేనే రాజు-నేనే మంత్రి వంటి పొలిటికల్ డ్రామా కథను కూడా చూపించాడు. అయితే, కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు. సరైన కథతో భారీ హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడిని వెండితెరకు పరిచయం చేయాలని, అది కూడా ఒక ప్రేమకథతో బాక్సాఫీస్ వద్దకు రావాలని ఆయన చూస్తున్నారు. ఈమేరకు షోషల్మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతుంది.సుమారు రెండేళ్ల క్రితం పిరియాడిల్ ఎపిక్ లవ్స్టోరిగా విక్రమాదిత్య మూవీని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తేజ వెల్లడించాడు. ఇదే చిత్రంతో తన కుమారుడు అమితవ్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేయాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. లక్ష్మి నరసింహా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను కూడా గతంలోనే విడుదల చేశారు. 18వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ‘విక్రమాదిత్య’ అనే పిరియాడికల్ లవ్స్టోరితో తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే. కాగా త్వరలోనే ‘విక్రమాదిత్య’ను సెట్స్పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.హీరోయిన్గా సూపర్స్టార్ కృష్ణ మనవరాలుఇదే ప్రాజెక్ట్తో సూపర్స్టార్ కృష్ణ మనవరాలు, రమేష్బాబు కుమార్తె అయిన భారతిని హీరోయిన్గా పరిచయం చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ద్వారా ఆమె కథానాయికగా పరిచయం కానున్నట్లు షోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొంత సమయం పాటు వేచి ఉండాల్సిందే. -
నత్త జిగురుతో కాంతులీనే చర్మం..!
ఈ అత్యాధునిక చర్మ సంరక్షణ పరికరం అందాన్ని కోరుకునేవారికి ఒక వరం. చర్మానికి ఎల్ఈడీ థెరపీలను అందించే డివైస్లు ఎన్ని అందుబాటులోకి వచ్చినా, సౌందర్యప్రియులకు ఈ మెషిన్ అందించే పర్ఫెక్షనే వేరు! దీనిలోని ఫొటో–బయోమాడ్యులేషన్ టెక్నాలజీ.. ఆన్ చెయ్యగానే ఎరుపు కాంతిని విడుదల చేస్తూ, కేవలం 12 నిమిషాల్లోనే ముఖానికి కొత్త మెరుపుని అందిస్తుంది. దీని పనితీరు క్లినికల్ పరీక్షల్లో కూడా నిగ్గుతేలింది.ఈ డివైస్ ముఖాకృతిలోనే రూపొందడంతో దీని ముందు ముఖాన్ని ఉంచినప్పుడు అన్నివైపుల నుంచి లైట్ థెరపీ జరుగుతుంది. దాంతో చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. ఈ డియోర్ స్కిన్ లైట్ థెరపీని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు అందుకున్న తర్వాత వయసుతో వచ్చే ముడతలు, మచ్చలు చాలా వరకూ తగ్గుతాయి. చర్మం యవ్వనంగా మారుతుంది.ఈ మాస్క్ డివైస్ అన్ని రకాల చర్మాలకు అనువైనదే. సున్నితమైన స్కిన్ టైప్ ఉన్నవారికి కూడా పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డివైస్ ఒక టేబుల్ ల్యాంప్లా అనిపిస్తుంది. దీని స్టాండ్ ఎటువైపు అయినా వంగుతూ, వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. దీన్ని ఆన్ చేసి లైట్ థెరపీ పొందేటప్పుడు, పడుకుని లేదా కూర్చుని కూడా ఈ ట్రీట్మెంట్ పొందొచ్చు.వినూత్నమైన బ్యూటీ ట్రీట్మెంట్స్లో ‘స్నెయిల్ క్రాల్ ట్రీట్మెంట్’ లేదా ‘స్నెయిల్ ఫేషియల్’ ఒక రకం! ఈ చికిత్సలో నత్తల నుంచి స్రవించే జిగురుతో చర్మంపై మసాజ్ చేస్తారు. ఈ విధానం ఎన్నో ఏళ్ల క్రితమే గ్రీస్లో ప్రారంభమైంది. తూర్పు ఆసియాలో, ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఈ నత్త జిగురుతో చర్మం తేమను పెంచడం, గాయాలను నయం చేయడం, కణాల పునరుద్ధరణ చేయడంతో పాటు కొన్ని రకాల చర్మ క్యాన్సర్లను కూడా నివారించవచ్చని నిపుణులు తేల్చారు. ఈ ట్రీట్మెంట్తో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, ముఖంపై గీతలు, ముడతలు తగ్గుతాయి. అలాగే గాయాలు, అలర్జీలు, దురదలు వంటి సమస్యలు కూడా నయమవుతాయి. ఈ చికిత్సలో నేరుగా నత్తను చర్మంపై వదులుతారు. లేదంటే నత్త నుంచి సేకరించిన జిగురు ముఖానికి పూస్తారు. నత్త జిగురుతో ఇప్పుడు ఎన్నో సౌందర్య ఉత్పత్తులు కూడా తయారవుతున్నాయి. (చదవండి: ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?) -
తల్లిపై ‘అనుమానం’తో రెండుసార్లు అకృత్యం.. చేసిన పనికి శిక్ష ఇదేనంటూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మానవత్వం మంటగలిసిన ఉదంతం చోటుచేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు తన సొంత తల్లిపై రెండుసార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు తనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తనను ‘శిక్షిస్తున్నాడని’ ఫిర్యాదు చేసింది.బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్కు వచ్చి, తన కుమారునిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. వీరి కుటుంబం హౌజ్ ఖాజీ ప్రాంతంలో ఉంటోంది. బాధితురాలి పెద్ద కుమార్తెకు వివాహం కాగా, ఆమె అదే పరిసరాల్లో తన భర్త, అత్తమామలతో ఫాటు ఉంటోంది.జూలై 17న బాధితురాలు, ఆమె భర్త , చిన్న కుమార్తె సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ సమయంలో నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వారిని వెంటనే తిరిగి రమ్మని కోరాడు. తల్లికి వెంటనే విడాకులు ఇవ్వాలని, ఆమెకు కొన్నేళ్లుగా ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తాను కనుగొన్నానని చెప్పాడు. తరువాత కూడా కుమారుడు ఇదే తరహాలో తండ్రికి ఫోన్లు చేస్తూ వచ్చాడు. ఈ నేపధ్యంలో అరేబియా నుంచి వారి కుటుంబం ఆగస్టు ఒకటిన ఢిల్లీకి తిరిగివచ్చింది.తల్లిని చూడగానే ఆ కుమారుడు ఆమెపై దాడి చేశాడు. కుమారుని ప్రవర్తనకు భయపడి తల్లి ఇల్లు విడిచిపెట్టి పెద్ద కుమార్తె ఇంటిలో ఆగస్టు 11 వరకూ ఉంది. ఆ తరువాత ఆమె తిరిగి తన ఇంటికి వచ్చింది. ఆరోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో, నిందితుడు తన తల్లితో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నానని చెప్పాడు. తరువాత ఆమెను గదిలో బంధించి, అత్యాచారం చేశాడు. ఆమె ఎంతలా వేడుకున్నప్పటికీ విడిచిపెట్టలేదు. గతంలో ఆమె చేసిన తప్పుకు శిక్షిస్తున్నానని చెప్పాడు.బాధితురాలు వెంటనే ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే గురువారం తెల్లవారుజామున కుమారుడు ఆమె గదిలోనికి వచ్చి మళ్లీ లైంగిక దాడి చేశాడు. మర్నాడు తల్లి జరిగిన విషయాన్ని చిన్న కుమార్తెకు చెప్పింది. తరువాత వారిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకుని, నిందితునిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్ 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తుకు ఉపక్రమించారు. -
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..?
నాకు ఇటీవల హెపటైటిస్–బీ వచ్చిందని తెలిసింది. ఇప్పుడు నేను ఎనిమిది నెలల గర్భవతిని. మా కుటుంబంలో కొంతమందికి కూడా ఇదే వ్యాధి ఉంది. ఈ విషయం డాక్టర్కు ముందుగా చెప్పాలా? నా బిడ్డకు కూడా ఈ వ్యాధి వస్తుందా?– జ్యోతి, హైదరాబాద్ గర్భవతిగా ఉన్న మీరు ఈ హెపటైటిస్–బీ వంటి వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ఒక వైరస్ వలన కలిగే వ్యాధి. ఇది రక్తం ద్వారా వ్యాపించి, మీ లివర్ను ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో వైరస్ ఉంటే, బిడ్డ పుట్టే సమయంలో తల్లి రక్తంతో సంపర్కంలోకి వచ్చేటప్పుడు వైరస్ బిడ్డకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన విషయం. శిశువులకు వైరస్ సోకినప్పుడు దాదాపు తొంభై శాతం శాశ్వత లివర్ వ్యాధిగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించాలంటే మీరు ఇప్పుడే మీ వైద్యులకు చెప్పాలి. ముందుగా సమాచారం ఉంటే తగిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. బిడ్డ పుట్టిన వెంటనే ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించేందుకు ప్రత్యేకమైన రక్షణ చికిత్సలు ఉన్నాయి. బిడ్డ పుట్టిన నాటికి రెండు పనులు చేయాలి. ఒక్కటి ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది వైరస్ను వెంటనే అడ్డుకుంటుంది. రెండు, హెపటైటిస్–బీ టీకా మొదటి మోతాదును ఇవ్వాలి. ఈ రెండు కూడా బిడ్డ పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపల చేయాలి. తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరు మోతాదుల టీకా షెడ్యూలును పూర్తి చేయాలి. మొదటి మోతాదు పుట్టిన వెంటనే, రెండవ మోతాదు నాలుగు వారాల్లో, మూడవది ఎనిమిది వారాల్లో, నాల్గవది పన్నెండు వారాల్లో, ఐదవది పదహారు వారాల్లో, ఆరవది ఇరవై నెలల్లో వేయాలి. ఆరు మోతాదులు పూర్తయిన తర్వాత బిడ్డకు రక్తపరీక్ష చేయాలి. అప్పుడే శరీరంలో రోగనిరోధక శక్తి ఏర్పడిందో లేదో తెలుస్తుంది. తల్లి ఈ సంగతిని వైద్యులకు ముందుగానే చెప్పడం వల్లే సాధ్యమవుతుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డను సంపూర్ణంగా రక్షించవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా తగిన సమాచారం డాక్టర్కి ఇవ్వండి. నేను గర్భధారణకు ప్లాన్ చేస్తున్నాను. కొంతమంది రుబెల్లా వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని చెబుతున్నారు. కాని, ఇదివరకు నాకు ఈ వ్యాధి వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పండి.– అనిత, రాజమండ్రిమీరు గర్భధారణ కోసం సిద్ధమవుతుంటే, రుబెల్లా వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రుబెల్లా అనేది ఒక వైరస్ వలన వచ్చే వ్యాధి. ఇది దగ్గుతో, తుమ్ముతో గాలిలోకి వచ్చే జలకణాల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది తేలికపాటి జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో కనిపిస్తుంది. కాని, గర్భధారణ సమయంలో ఈ వైరస్ సోకితే, బిడ్డకు తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు కలగవచ్చు. ఈ వ్యాధి గర్భంలో ఉన్న శిశువుకు సోకితే, చెవిటితనం, కాటరాక్ట్ వంటి కంటి లోపాలు, గుండెకు సంబంధించిన లోపాలు, మెదడు ఎదుగుదలపై ప్రభావం, లేదా గర్భస్రావం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ తొలి మూడు నెలల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నివారించడానికి ముందుగా ఒక రక్త పరీక్ష చేయించుకోవాలి. రుబెల్లా ఐజీజీ అనే పరీక్ష చేసి, మీ శరీరంలో ఇప్పటికే ఈ వైరస్కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉన్నాయా లేదా తెలుసుకుంటారు. యాంటీబాడీలు ఉన్నట్లయితే, మీ శరీరానికి రక్షణ ఉంది కాబట్టి టీకా అవసరం ఉండదు. యాంటీబాడీలు లేనట్లయితే, తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఎమ్ఎమ్ఆర్ (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) రూపంలో ఇవ్వబడుతుంది. ఒక మోతాదుతో ప్రారంభించి, అవసరమైతే రెండో మోతాదును కొన్ని వారాల గ్యాప్లో వేయొచ్చు. అయితే, వ్యాక్సిన్ వేసిన తరువాత కనీసం రెండు నెలల పాటు గర్భం ధరించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో శరీరం రక్షణ ఏర్పరచుకుంటుంది. ఇది శిశువును రక్షించడంలో కీలకంగా పనిచేస్తుంది. టీకా వల్ల కొన్నిసార్లు తేలికపాటి జ్వరం రావచ్చు. మీరు ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్ వేసుకున్నారా అనే విషయం స్పష్టంగా గుర్తులేనట్లయితే, పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. టీకా అవసరమైతే ఇప్పుడే వేయించుకుని, రెండు నెలలు గడిచిన తరువాత గర్భధారణకు ప్లాన్ చేసుకోండి. ఇలా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు ఎలాంటి హానికి గురికాకుండా, ఆరోగ్యంగా జన్మించే అవకాశం ఉంటుంది. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్(చదవండి: Independence Day 2025: మోదీ ప్రసంగంలో ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు..! హాట్టాపిక్గా ఊబకాయం..) -
ఓ చూపు చూశారు!
పెళ్లి, పెళ్లి చూపులు... ఈ రెండు సందర్భాల్లోనూ ఇరుపక్షాలు తమ స్థాయిని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ వీక్నెస్నే క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిన ఓ గ్యాంగ్ 2011లో దేశ వ్యాప్తంగా అనేక కుటుంబాలను ఓ చూపు చూసింది. వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చి, పెళ్లి చూపులకి రమ్మంటూ ఆహ్వానించి, మత్తుమందు కలిపిన పానీయాలు ఇచ్చి అందినకాడికి దోచుకుపోయిన ఆ ముఠా ఆరు రాష్ట్రాల్లో హడలెత్తించింది. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అన్నదమ్ములు శ్రీనివాస్, రుషికేశ్లతో పాటు అదే ప్రాంతానికి చెందిన రమేష్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. 2003లో నాలుగేళ్ల బాలుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేసి జైలుకు వెళ్లడంతో నేర జీవితం ప్రారంభించారు. 2010లో హైదరాబాద్ శివారులోని ఓ పంచాయతీ సర్పంచ్ని డబ్బు కోసం బెదిరించారు. ఇలాంటి నేరాలు చేస్తే పోలీసులకు దొరికిపోయి జైళ్లు, బెయిళ్లతో ఇబ్బందులు పడుతున్నామని భావించింది. అందువల్ల పోలీసులకు చిక్కే అవకాశాలు తక్కువగా ఉండే లాభసాటి నేరాలు చేయాలనుకున్న ఈ ముఠా తమను గుర్తుపట్టని ప్రాంతాలకు వెళ్లి, అప్పటికే సంబంధం తెగిపోయే టార్గెట్లను ఎంచుకుని, పక్కా పథకం ప్రకారం నేరాలు చేయాలని నిర్ణయించుకుంది. తమ పథకాన్ని అమలులో పెట్టడంలో భాగంగా వీళ్లు వేసిన ఎత్తే డమ్మీ పెళ్లి చూపులు. దీనికోసం ఈ ముగ్గురూ ఇంటర్నెట్ నుంచి అందమైన యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేసుకున్నారు. వీటి ఆధారంగా తయారు చేసిన బయోడేటాల్లో ఆ యువతి ఉన్నత విద్యనభ్యసించినట్లు, పెద్ద సంస్థలో పని చేస్తున్నట్లు ఆకర్షణీయమైన వివరాలు చేర్చి, అలాంటి యువతికి అదే స్థాయి సంపన్నుడైన వరుడు కావాలంటూ వివిధ మేట్రిమోనియల్ సైట్స్లో పోస్ట్ చేసింది. సంప్రదింపుల కోసం బోగస్ వివరాలతో రూపొందించిన ఈ–మెయిల్ ఐడీలను పొందుపరచేది. కొన్ని పత్రికల్లోనూ ఇదే తరహాలో ప్రకటనలు ఇచ్చింది. వీటికి ఆకర్షితులై సంప్రదించిన వారిని మాటలతో ముగ్గులోకి దింపేది. వాళ్లు పెళ్లి కుమార్తె వివరాలు కోరితే... తక్షణం చెప్పే వాళ్లు కాదు. అలా చేస్తే ఎదుటి వారికి పూర్తిగా నమ్మకం రాదనే భావనతో కొత్త కథ నడిపే వాళ్లు. అంతకు ముందే యువతిని చూసి వెళ్లిన ఐఏఎస్/ఐపీఎస్ అధికారి అభిప్రాయం చెప్పడానికి రెండుమూడు రోజుల సమయం కోరారని, వారి నుంచి సమాధానం రాకుండా మీకు ఏ విషయం చెప్పలేమంటూ నమ్మబలికే వాళ్లు. ఈ సంప్రదింపులన్నీ ఈ–మెయిల్స్ ద్వారానే జరిపేవాళ్లు. అలా కొన్ని రోజులు గడిచాక వరుడి తరఫు వారికి సదరు ఐఏఎస్/ఐపీఎస్ అధికారికి తమ అమ్మాయి నచ్చిందని చెప్పారని, అయితే ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో పని చేస్తున్నందున పెళ్లి చేయమని చెప్పామని నమ్మబలికే వాళ్లు. ఆపై తమ ఆస్తిపాస్తులు వివరాలు తెలుసుకోవడానికి, అమ్మాయిని చూడటానికి, తమ ఆతిథ్యం స్వీకరించడానికి వివిధ ప్రాంతాలకు రావాలంటూ ఆహ్వానించేది. ఇలా పెళ్లి చూపులకు వచ్చే ముందు ఆ వరుడి తరఫు వాళ్లు భారీగా బంగారు నగలు తీసుకుని వచ్చే వాళ్లు. వీళ్లు రావడానికి ముందే ‘జస్ట్ డయల్’ సాయంతో అక్కడి అనువైన ప్రాంతంలో సర్వీస్ అపార్ట్మెంట్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లు సైతం అద్దెకు తీసుకునేది. అవి తమ సొంతమే అన్నట్లు నమ్మించడానికి అనువుగా ఏర్పాటు చేసేది. కొన్ని సందర్భాల్లో రిసార్టుల్లో సూట్స్ బుక్ చేసి సిద్ధం చేసేది. ‘అతిథుల’ కోసం ఖరీదైన కార్లనూ ‘జస్ట్ డయల్’ సహాయంతోనే బుక్ చేసి.. వాటిలోనే ఎయిర్పోర్టుకు వెళ్లి వారిని రిసీవ్ చేసుకునేది. అక్కడ నుంచి వారిని సిద్ధం చేసి ఉంచిన సర్వీస్ అపార్ట్మెంట్లు, రిసార్టులకు తీసుకువెళ్లి, కాబోయే వియ్యంకుల మాదిరి బిల్డప్ ఇస్తూ రెండు మూడు రోజుల పాటు అతిథి మర్యాదలు చేసేది. ఆపై అదను చూసుకుని వారు తినే/తాగే పదార్థాల్లో మత్తుమందు కలిపి వారివద్ద ఉన్న బంగారం, డబ్బు తీసుకుని ఉడాయించేది. మత్తు వదిలాక నిద్రలేచే అతిథులు నిలువు దోపిడికీ గురయ్యామని తెలుసుకుని గొల్లుమనే వాళ్లు. ఈ గ్యాంగ్ ఓ పక్క ఈ పంథాలో దోపిడీలు చేస్తూనే, మరోపక్క ట్రావెల్స్ కార్లపైనా పంజా విసిరేది. ‘జస్ట్ డయల్’ నుంచి ట్రావెల్స్ నిర్వాహకులకు ఫోన్ నెంబర్ తీసుకుని సంప్రదించేది. వివిధ పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలంటూ వాహనాన్ని బుక్ చేసుకుని, ప్రయాణాల్లో కొన్ని చోట్ల లాడ్జిల్లో బస చేసేది. అక్కడ కారు డ్రైవర్కు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి, అతడు స్పృహతప్పాక, కారు తాళాలు తీసుకుని, కారుతో ఉడాయించేది. మత్తు వదిలాక డ్రైవరే లాడ్జి బిల్లు చెల్లించి బయటపడాల్సి వచ్చేది. ఇలా కార్లు చోరీ చేసే ఈ ముఠా, వాటిని బోగస్ పత్రాల సాయంతో అమ్మి సొమ్ము చేసుకునేది. ఈ ముఠా హైదరాబాద్, జహీరాబాద్, కేరళ, కర్నూలు, తిరుపతి, ఏలూరు, కర్ణాటక, ముంబై, తమిళనాడు, పాండిచ్చేరీల్లో 24 నేరాలు చేసింది. ఈ ముఠా ఇదే పంథాలో 2003 నుంచి నేరాలు సాగిస్తున్నా, 2011 వరకు ఎక్కడా చిక్కలేదు. పెళ్లి చూపులు, అద్దెకు కార్లు పేరుతో జరుగుతున్న నేరాలపై 2011లో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు సమాచారం అందింది. బాధితులను మత్తులోకి దించేందుకు టాబ్లెట్లు వినియోగించినట్లు తేలడంతో ఆ నేరాలన్నీ ఒకే గ్యాంగ్ పనిగా అనుమానించింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, కేజీ బంగారం, ఐదు వాహనాలు, చోరీ సొమ్ముతో కొన్న ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఈ ముఠాపై నమోదైన కేసుల్లో అత్యధికం కోర్టుల్లో రుజువు కాలేదు. కేసులు నమోదులో జాప్యం, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే కాకుండా, ఫిర్యాదుదారులూ ధైర్యంగా ముందుకు రాకపోవడంతో వీగిపోయాయి. -
Tollywood Strike: చిరంజీవి ఇంటికి టాలీవుడ్ పంచాయితీ
వేతనాలు పెంచాలంటూ టాలీవుడ్ సిసీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. గతంలో చెప్పినట్లుగా 30 శాతం వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని కార్మికులు అంటుంటే.. ‘పెంచేదే లే’ అని నిర్మాతలు చెబుతున్నారు. కార్మికుల యూనియన్లతో నిర్మాతలు చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం లభించలేదు. అటు యూనియన్ లీడర్లు, ఇటు నిర్మాతలు..ఎవరూ తగ్గడం లేదు. దీంతో ఈ సమస్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది.(చదవండి: కార్మికుల సమ్మె.. అక్కడివరకు పరిస్థితి రానివ్వొద్దు: నారాయణమూర్తి)ఈ రోజుల సాయంత్రం నిర్మాతల బృందం మరోసారి చిరంజీవిని కలువనున్నారు. అలాగే సోమవారం సాయంత్రం ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి భేటీ కానున్నారు. మంగళవారం రోజు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో కలిసి చిరంజీవీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చిరంజీవితో భేటీ తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఈ వారం కథ: పునీతులు
పొద్దెక్కుతోంది. మబ్బుల్నే లేచిన ఈశ్వరి చకచకా బీడీల ఆకు కత్తిరిస్తోంది. పక్కనే ఉయ్యాలలో పడుకోబెట్టిన పాప ఉలిక్కిపడి లేచి ఏడుపందుకుంది. తప్పదన్నట్లు లేచి, బిడ్డకు పాలిస్తూ ‘ఇంకొంచెంసేపు పడుకోవే తల్లీ!’ అంటూ మురిపెంగా పాప బుగ్గలు నిమిరింది. పాప మెరిసే కళ్ళతో తల్లినే నిటారుగా చూస్తోంది. ఆడపిల్ల అయినా తండ్రి కళ్లే వచ్చాయి. అచ్చం రాజేష్ చూస్తున్నట్లే ఉంది అని మురిసిపోతున్న ఆమె మనసు భర్త వైపు మళ్లింది.ప్రసవానికి వచ్చిన ఈశ్వరికి బిడ్డ పుట్టి ఆరు నెలలైనా తల్లిగారింట్లోనే ఉంటోంది. తన ఇంటికి వెళితే తనూ, తన భర్తనే. ఇక్కడైతే తనకు, పసిపిల్లకు తోడుగా తల్లి, తమ్ముడు ఉన్నారు. ఎమ్మెస్సీ చదివిన రాజేష్ తమ ఊర్లోనే ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెబుతున్నాడు. రెండు ఊర్ల మధ్య గంట బస్సు ప్రయాణం. అందుకే శని, ఆదివారాలు తానే వచ్చిపోయేవాడు. అలా హాయిగా ఉంటున్న వారి మధ్య ఏడాది పరీక్షలు వచ్చి అడ్డుగా నిలిచాయి. ఉదయం, సాయంత్రం కాలేజీలో స్పెషల్ క్లాసులు నడుస్తున్నాయి. ఆదివారాల్లో కూడా భార్య, కూతురును చూసి వచ్చేంత తీరిక లేని పని. రాజేష్ రాక దాదాపు నెల రోజులవుతోంది.పాలు తాగుతూ నిద్రపోయిన బిడ్డను హమ్మయ్య అనుకుంటూ ఈశ్వరి మెల్లగా ఉయ్యాలలో వేసి మళ్ళీ ఆకును ముందేసుకుంది. డెలివరీ అయిన నెల రోజులు తప్ప వచ్చిన్నుంచి రోజుకు వేయి బీడీలు చేస్తోంది. తమ్ముడిది బీడీ కంపెనీలో గుమస్తా కొలువు. తన డెలివరీకి అయిన ఖర్చులైనా ఇంటికి ముట్టజెప్పాలని ఆమె ఆరాటం.అప్పుడే దూరం నుంచే ‘అక్కా!’ అని అరుచుకుంటూ వస్తున్నాడు ఆమె తమ్ముడు.‘ఏందిరా శ్రీనూ.. మెల్లగరా!’ అని ఆయన్నే చూస్తోంది.‘బావను పోలీసులు పట్టుకుపోయిండ్రట’ అంటూ ఇంట్లోకి వచ్చాడు.‘ఎందుకురా!’ అంటూ లేచి నిలబడింది ఒక్కసారిగా.తమ్ముని వెనుకే కాలేజీ వాచ్మన్ మల్లన్న కూడా వచ్చాడు.‘ఏంటిదే మల్లన్నా.. సారుకేమైందే?’ అని ఎదురెళ్ళింది.లోపలున్న తల్లి అరుగు మీదికి వచ్చింది.మల్లన్న నోరిప్పటానికి కిందిమీద అయితున్నాడు.‘చెప్పే అన్నా.. ఏమైంది!’ అని ఏడుస్తూ ఆయన భుజాలు పట్టి కుదిపింది ఈశ్వరి.‘సారు కాలేజీల ఆడపిల్లను పాడు చేసిండట’ అని మెల్లగా అని, ఇంకేమీ చెప్పలేకపోయాడు.‘ఎప్పుడు. ఎక్కడ!’ అంది నమ్మబుద్ధికాక.‘నిన్న పొద్దుగూకంగ. కాలేజీలనేనట!’ అంటూ తనకు తెలిసింది చెప్పాడు.‘నేనత్తపా!’ అని బిడ్డను చంకలో వేసుకుంది.‘అక్కడేమున్నది. కోపంతోటి ఊరోళ్లు మీ సామాన్లను బజార్లేసి కాలవెట్టిన్రు. నువ్వు ఊర్లెకస్తే ఊకోరు’ అన్నాడు ఊర్లోని తీవ్రత ఆమెకు అర్థమయేలా.‘ఇదెక్కడి అన్యాలముల్లో..’ అని రాగం తీస్తూ కూలబడింది.‘ఇప్పుడు బావ ఎక్కడున్నడు?’ అని శ్రీను మల్లన్నను అడిగాడు.‘జగిత్యాల పోలీసులచ్చి తీసుకపోయిండ్రు’ అన్నాడు.ఏడుస్తూనే ఈశ్వరి బిడ్డని చంకనేసుకొని తమ్ముణ్ణి తీసుకోని బయలుదేరింది. వాకిట్లోకి వచ్చినంక ‘మల్లన్నా.. అన్నం తిని పో!’ అని తల్లివైపు చూసి, ముందుకు నడిచింది.జగిత్యాల పాత బస్టాండులో దిగి పిల్లను భుజం మీద వేసుకొని ఈశ్వరి దబదబా నడుచుకుంటూ పోలీస్స్టేషన్ గేటు ముందట నిలబడింది. ఆమె వెనుకాలే వచ్చిన శ్రీను– జవాన్తో ‘పొద్దుగాల్ల పూడూర్ నుంచి మా బావను పోలీసులు పట్టుకచ్చిండ్రు’ అన్నాడు.‘రేప్ కేసోడా! ఆన్ని ఇప్పుడే జైలుకు తీసుకపోయిండ్రు’ అని రోడ్డుకు ఆ వైపున్న జైలు వైపు చేయెత్తి చూపాడు.ఈ మాట వినగానే ఏడ్చుకుంటూ రోడ్డు దాటి కోర్టు వెనుకాల ఉన్న జైలు గేటు వైపు ఉరికింది ఈశ్వరి.‘అక్కా ఆగే.. గిట్లురుకుతే బస్ కిందవడి సత్తవ్!’ అంటూ ఆమె వెనుక నడిచాడు శ్రీను.జైలు గేటు దగ్గరికి పోగానే ‘ఏయ్! దూరం జరుగు’ అని గదమాయించాడు జైలు పోలీస్.శ్రీను ఆయనకు తమ పరిస్థితిని శాంతంగా వివరించాడు.‘ఇప్పుడే తెచ్చిండ్రు. గింత జల్ది ములాఖత్ ఇయ్యరు’ అన్నాడు జవాన్. ‘ఈమె మా అక్క, ఆయన పెండ్లాం. మా బావ మంచోడు. అట్ల చదువుకొనే పిల్లను పాడు చేసేటోడు కాదు. ఒక్కసారి మేం మాట్లాడాలె. గంతే! లోపలికి పంపిత్తే నూర్రూపాలిత్త’ అని జేబులో చేయి పెట్టిండు శ్రీను.‘ఓయ్ గదంత నడవదిక్కడ’ అని జవాన్ అంటుండగా మోటార్ సైకిల్ మీద ఒకాయన సరాసరి ఈశ్వరి, శ్రీనుల దగ్గరికి వచ్చి, ‘నా పేరు రాజేందర్. వకీలును. మా బావ పూడూర్ సర్పంచ్. మీ గురించి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండు’ అన్నాడు.‘యాళ్ళకచ్చిండ్రు. మా బావను చూడాలే!’ అన్నాడు శ్రీను దండం పెడుతూ.‘సరే!’ అనుకుంటూ ఆయన లోపలి పోయాడు. ఈశ్వరి, శ్రీను కూడా ఆయన వెంట వెళ్లి లోపల ఓ చెట్టు కింద నిలబడ్డారు.వకీలు వెంట రాజేష్ వస్తున్నాడు. దూరం నుంచే ఆయన ముఖం కమిలిపోయినట్లు కనబడుతోంది. బహుశా ఊర్లో దెబ్బలు బాగానే కొట్టినట్లున్నారు.ఈశ్వరి కళ్ళల్లో నీళ్లు అప్పటికే ఏడ్చి ఏడ్చి ఎండిపోయాయి. ఇప్పుడామెకు రాజేష్లో తన భర్త కనబడ్తలేదు. ఒక పిల్లను బలాత్కారం చేసిన మృగాడు అగుపడుతున్నాడు.రాజేష్ దగ్గరికి రాగానే, ‘పాపపుముండ కొడుకా! నీ బతుకు చెడ. నిన్ను నమ్మి చదువుకోనికి వచ్చిన పిల్లను పాడు జేస్తవా! అంత మదమెక్కిందా! ఆగలేకపోతే నేనే వస్తుంటి కదా! నిను నమ్మి పోతే బతుకే ఆగం చేసినవ్ గద! పో బాడకవ్, నీ సావు నువ్వు సావుపో!’ అని ముఖం మీద ఉమ్మేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఎంతో దిగులుగా భర్తను చూడ్డానికి వచ్చిన మల్లీశ్వరి ఇట్లా ఆడపులి అవుతుందని ఎవరూ అనుకోలేదు. వకీలు ఇదంతా చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు.రాజేష్ను లోపలికి తీసికెళ్లారు.కాసేపటికి కోలుకున్న వకీలు ‘ఏందయ్యా మీ అక్క అట్ల జేసింది?’ అన్నాడు శ్రీనుతో.‘అక్క అట్లంటదని నేను కూడా అస్సలు అనుకోలేదు సార్. మీదవడి ఏడుస్తదనుకుంటే ఇట్లజేసింది. దానికి బావ అంటే మస్తు ఇష్టం. అసుంటోడు ఇట్ల జేసేసరికి దానికి వశం కాని కోపమచ్చినట్లుంది. అది సల్లవడ్డంక నేను సముదాయిస్తా గని ఇప్పుడు మనం ఏంజెయ్యాలె?’ అన్నాడు శ్రీను.‘మీ బావ చేసింది పెద్ద తప్పు. బెయిల్ దొరకుడు కష్టం. అయితే ఆ పిల్లతోటి మా సారుది తప్పేం లేదు. అంత నా ఇష్ట ప్రకారమే జరిగింది అని కోర్టుల చెప్పించాలె. పోలీసులతోని ఎఫ్ఐఆర్ల వేరే సెక్షన్లు పెట్టించాలె. బాగనే ఖర్చయితది. అంతా లక్ష దాక..’ అంటూ ఆగాడు వకీలు.‘అట్లయితే మా బావ బయిటికస్తడా?’ అన్నాడు శ్రీను ఆశగా.‘కోషిష్ చేద్దాం. చేతుల పైసలుంటె..’ అని మళ్ళీ సగమే మాట్లాడాడు వకీలు.‘పైసల సంగతి నేను చూసుకుంటా!’ అని వకీలుకు భరోసా ఇచ్చి, అక్కను వెతుక్కుంటూ శ్రీను బస్సెక్కి ఇంటికి వచ్చాడు.ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రోజుటి తీరే ఈశ్వరి బీడీలు చేస్తూ కూచుంది. పాప నిద్రపోతోంది.ఏమైందిరా అన్నట్లు తల్లి శ్రీను మొకం చూసింది. కొంచెం ఆగమన్నట్లు సైగ చేశాడు.కొద్దిసేపటికి ‘అక్కా! బావను బయటికి తేవచ్చు అని వకీల్ సాబ్ అన్నడు. పైసలు ఖర్చయితయట లక్ష రూపాయల దాకా’ అని ఆగాడు.ఈశ్వరి ఏమీ మాట్లాడలేదు.‘మాట్లాడవేమే! మొగాడు జైల్ల ఉంటె ఇట్లనేనా చేసేది?’ అంది తల్లి.‘అట్ల జేసినంక ఆడు నా మొగడే కాదు. ఉంచుకుంటే మీతోటి ఉంటా. ఎల్లగొడితే నా బతుకు నేను బతుకుత’ అంది ఈశ్వరి మొండిగా.‘అది గట్లనే అంటది గని నువ్వు అప్పోసప్పోజేసి బావనైతే బయటికిదే. అటెనుక అన్ని సుదురాయిస్తయి’ అంది తల్లి ఇంటి పెద్దగా.ఓ రోజు బాధితురాలి వాంగ్మూలం జడ్జి రూములో రికార్డు అయింది.‘ఆ రోజు ఏం జరిగింది.. రాజేష్ నిన్ను ఏం చేశాడో చెప్పు’ అని జడ్జి శాంతంగా అడిగాడు. తడుస్తున్న కళ్ళను తుడుచుకోవడం తప్ప నోరిప్పలేదు.‘క్లాసులో మీ సార్ నిన్ను ఏం చేశాడు? అప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా?’ అడిగాడు జడ్జి మరింత ఓపిగ్గా.ఏడుపే సమాధానం.‘ఆయన ఏం చేశాడో నీ మెడికల్ రిపోర్ట్స్లో ఉంది. అది ఎలా జరిగిందో నీ నోట చెబితే కేసు ముందుకు పోతుంది’ అన్నాడు కొంత అసహనంగా.ఆమె ఏడ్పు ఆపకపోవడంతో ‘ఈ మాటకైనా సమాధానం చెప్పు.. రాజేష్ నీపై చేయి వేస్తే వద్దని చెప్పవా?’ అన్నాడు.దించి ఉన్న తలను నిలువుగా, అడ్డంగా ఊపింది.కేసు కాగితాల్లో జడ్జి ఆమె వయసును చూశాడు. పద్దెనిమిదేళ్ళకు నెల రోజులు తక్కువగా ఉంది. ఇంకేమీ అడగకుండా ‘సరే.. వెళ్లు’ అంటూ ఆమెను పంపించేశాడు.‘బెయిల్ పిటిషన్ వేయాలి’ అని వకీలు శ్రీను వంక చూశాడు.ఆయన చూపులు పసిగట్టి ‘అయిదు వేలు ఉన్నయ్!’ అన్నాడు శ్రీను.‘సరే తే!’ అని డబ్బులు పాకెట్లో పెట్టుకొని వకీల్ వెళ్ళిపోయాడు.బెయిల్ రోజు కేసు తిరగబడింది.అంతా ముందే తెలిసినట్లు జడ్జి ‘ఇది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కిందికి వస్తది. అది నాన్ బెయిలెబుల్ అఫె. కరీంనగర్లో పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది. ఈ కేసును అక్కడికి బదిలీ చేస్తున్న’ అని చెప్పి ఫైలును పక్కన పెట్టేశాడు.రాజేష్ను పోలీసులు తీసికెళ్లారు.ఏమీ అర్థం కాక శ్రీను వకీల్ దగ్గరికి వెళ్ళాడు.‘పోక్సో కేసయింది. కరీంనగర్ కోర్టుకు పోవాలే. ఆన్నే ఫ్రీ లీగల్ సెల్ ఉంటది. వకీలును ఇస్తరు’ అని శ్రీనుకు ఓ చీటీ రాసిచ్చి, నా పని అయిపోయింది అన్నట్లుగా వకీలు జారుకున్నాడు.తెల్లారే శ్రీను కరీంనగర్ వెళ్లి కోర్టులో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని కలిశాడు. వాళ్లు వివరాలు తీసుకొని, ఒక వకీలు దగ్గరికి పంపారు. ‘పోక్సో కేసు కాబట్టి నెల రోజుల్లోపలే తీర్పు వస్తది’ అన్నాడు కొత్త వకీలు.ఆయన అన్నట్లే పదిహేను రోజులకే విచారణకు వచ్చింది.జడ్జి ప్రశ్నలకు రాజేష్ తల వంచుకొని మౌనమే నా సమాధానం అన్నట్లు నిలబడ్డాడు.‘మైనర్ బాలికపై లైంగిక అత్యాచారం చేసిన ముద్దాయి రాజేష్కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష, యాభై వేల రూపాయల జరిమానా విధిస్తోంది’ అని ఒకే వాక్యంలో జడ్జి తీర్పు చెప్పేశారు. స్పీడ్ కోర్టు తన పవర్ చూయించింది.నిజామాబాద్ జైల్లో చోటు లేదని రాజేష్ను చర్లపల్లి జైలుకు పంపారు.రాజేష్ కాలం మౌనంగా, విచారంగా సాగుతోంది. భార్య ఘాటైన తిరస్కారంతో ఆయన మనసు మరింత కుంచించుకు పోయింది. జైలులో బతకడానికి పర్వాలేదు కాని, చావడానికే మార్గం లేదని విషాదంగా నవ్వుకున్నాడు. బయట చావడానికి ఎన్నో దారులు. ఉరి వేసుకోవచ్చు, రైలు కింద పడవచ్చు, విషం తాగవచ్చు, కత్తితో కోసుకోవచ్చు. ఇక్కడ అవేవీ కుదురవు. ఖైదీ చస్తే నేరం జైలు అధికారులు మోయాలి. అందుకే చావనీయరు.చర్లపల్లి జైలు అధికారుల్లో శోభన్ ఒకరు. ఆయన మనిషికి ఎక్కువ, పోలీసుకు తక్కువ. తన బ్యారక్లోని ప్రతి ఖైదీనీ ఆయన కళ్లు స్కాన్ చేస్తుంటాయి. కోర్టు శిక్ష వేసినా, మనిషిలోని మంచి చెడులను ఆ కళ్లు వేరు చేసి చూడగలవు. కొన్నాళ్లుగా రాజేష్ ఒంటరితనాన్ని గమనించిన శోభన్ ఓ రోజు అతన్ని తన ఆఫీసుకు పిలిపించాడు.‘రా! కూచో.. కోర్టుకు సాక్ష్యాలు కావాలి కాని, జైలుకు వాటితో పనిలేదు. మాతో ఏదైనా మాట్లాడచ్చు’ అన్నాడు.జైలర్ ఇచ్చిన చొరవతో రాజేష్ చాలా రోజుల తర్వాత నోరు విప్పాడు.‘నేను కాలేజీలో మ్యాథ్స్ చెప్పేవాణ్ణి. డెలివరీకి వెళ్లిన భార్య, పుట్టిన పాప ఇంకా అత్తవారింట్లోనే ఉన్నారు. ఈలోగా ఈ సంఘటన జరిగింది. ఒక టీచర్గా నేను చేసింది తప్పే. కారణమేదైనా విధి నిర్వహణకు నాది నమ్మక ద్రోహమే. పోక్సో చట్టం దృష్టిలో నాది నేరమే. అంతా నా ఇçష్ట ప్రకారమే జరిగింది అని పదిహేడేళ్ల అమ్మాయి జడ్జికి చెప్పినా మగాడే నేరస్తుడు అని బొంబాయి కోర్టు శిక్ష వేసింది. మంచీ చెడూ అని గీత గీసి వేరుచేయలేని సున్నితమైన విషయం ఇది. నా విషయంలో మాత్రం నా కుటుంబానికి తీరని ద్రోహం చేశాను. ఐదేళ్ల తరవాత బయటికి వెళ్లినా, మళ్ళీ నా వాళ్ల ముందు నిలబడే మొకం నాకు లేదు’ అన్నాడు తల దించుకుంటూ.తప్పు ఎలా జరిగిందో చెప్పకున్నా జరిగిన నష్టాన్ని రాజేష్ లెక్కేస్తున్న తీరు శోభన్ను కదిలించింది. స్త్రీ పరువు, వృత్తి ధర్మం, కుటుంబ బాధ్యతలకు విలువిచ్చే మనిషి కూడా ఓ ఉద్రేక క్షణాన విచక్షణ కోల్పోవడం దురదృష్టమే అనిపించింది. ఎమ్మెస్సీ చదవాడని తెలిశాక రాజేష్కు జైలు స్కూల్లో పని దొరికింది. తన చదువు నలుగురికి పనికొస్తున్నందుకు రాజేష్కు కొంత తృప్తిగా ఉంది.అలా రెండేళ్లు గడిచాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా రాజేష్ను కలవడానికి ఎవరూ రాలేదు. అసలు అక్కడి పరిస్టితి ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో శోభన్ ఓ సెలవు రోజు సరాసరి రాజేష్ అత్తవారింటికి వెళ్ళాడు.తానెవరో చెప్పగానే శ్రీను ‘నమస్తే సార్!’ అంటూ కుర్చీ వేశాడు.గోడవారగా కూచొని బీడీలు చుడుతున్న ఈశ్వరి తలెత్తి ఆయన్ని చూడలేదు. ఆమె పక్కనే పాపను ముందేసుకుని అమ్మమ్మ కూచుంది.‘ఏమయ్యా మీ బావను చూడ్డానికి రావచ్చు కదా!’ అన్నాడు శోభన్ చొరవగా.‘ఎవరూ పోవద్దని మా అక్క ఒట్టేయించుకుంది సార్!’ అన్నాడు శ్రీను.అప్పుడాయన ఈశ్వరి వైపు తిరిగి ‘నీ భర్త తప్పే చేశాడు కాని చెడ్డవాడు కాదమ్మా!’ అన్నాడు శాంత స్వరంలో.ఆమె జవాబీయలేదు.‘తప్పు చేసినంక మంచోడెట్లయితడు అంటది. బావ గురించి ఇంకో మాటే మాట్లాడది’ అన్నాడు శ్రీను.‘జైల్లో బతుకుతున్నవాళ్లకు తమవారిని కలవడమే పరమానంద క్షణాలు. తమ కోసం ఎవరు రాని ఖైదీలు భోజనం కూడా సరిగా చేయరు. నలుగురిలో కలవరు. రాజేష్ పరిస్థితి అలాగే ఉంది. అందుకే నేను ఇక్కడి దాకా వచ్చాను.’ అన్నాడు శోభన్.ఈశ్వరిలో కదలిక లేదు. ఆ మాటలు విననట్లే ఉంది.‘అది చాలా మొండిది సార్.. మేం చెప్పి చెప్పి చాలించుకున్నాం’ అన్నాడు శ్రీను.‘తమ వారు జైల్లో ఉంటే ఏ కుటుంబానికైనా నలుగురి ముందు తలవంపే! ఓ రకంగా కుటుంబమంతా శిక్ష అనుభవిస్తున్నట్లే! కాలాన్ని వెనుకకు తిప్పలేం. కాబట్టి ఏదో తోవ పట్టుకొని మనమే ముందుకు నడవాలి’ అని ఆగి, జవాబు కోసం ఈశ్వరి వైపు చూశాడు. షరా మామూలే. ఆమెలో ఏ మార్పు లేదు. అంతలో ఒకామె టీ తీసుకోని వచ్చింది.కప్పు అందుకుంటూ ‘ఈమె ఎవరు?’ అన్నాడు శోభన్. ‘అదే పిల్ల, విమల. మా బావకు శిక్ష..’ అని ఆగాడు శ్రీను.ఆ మాట వినగానే చేయి కాలినట్లు కప్పు వెంటనే పక్కన పెట్టాడు.‘ఈ ఊరేనా?’‘‘కాదు. దూరమే. కాని, కోర్టు తీర్పు వచ్చినంక ఊర్లె కుల పంచాయతీ పెట్టిండ్రు. ‘దీని బతుకు ఖరాబు చేసినోనికి ఐదేండ్లు జైలు శిక్ష, యాభై వేలు జుల్మానాతో సరిపోయింది. మరి దీన్ని ఎవడు చేసుకుంటడు’.. అని విమల నాయన అడిగిండు. ‘కోర్టులనే పంచాయతీ తెగింది. ఇంకేముంటది’ అని పెద్దమనుషులు అన్నరు. అప్పుడు విమల నాయన మా అక్కతోటి ‘అవునే ఈశ్వరీ.. నువ్వు ఆడదానివే కదా.. ఆడు నీ మొగడే కదా.. న్యాయం నువ్వే చెప్పు. నీ మాటే ఖరారు’ అన్నడు. అప్పుడు అక్క లేచి విమల చేయి పట్టుకోని.. రాజేష్ వచ్చినంక సంసారం చేసేది విమలతోనే’ అని ఈమెను ఇంటికి తెచ్చింది’’ అన్నాడు శ్రీను.ఈశ్వరి శిల్పంలా అలాగే ఉంది. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో శోభన్ బుర్రకు తట్టడం లేదు. ఈశ్వరి పట్ల గౌరవం పెరిగినా, ఆమెను కరిగించే విద్య తన వద్ద లేదనుకున్నాడు. ప్రత్యర్థి చెక్ పెట్టాక దారి తెలియని ఆటగాడిలా లేచి నిలబడ్డాడు.‘సరే.. వెళ్ళొస్తా!’ అంటూ బయటికి వచ్చాడు. ఈశ్వరి గంభీర మౌనాన్ని ఛేదించలేక శోభన్ వాగ్బాణాలన్నీ విరిగిపోయాయి. ఆయన మనసంతా గందరగోళంగా ఉంది.ఊరి బయట ఉన్న చిన్న హోటల్లో టీ తాగుతూ కాసేపు గడిపాడు. చేసేదేమి లేక కొంత గ్యాప్ తీసుకోని మళ్ళీ రావాలని అనుకుంటూ బయటికి వచ్చాడు. కారు డోర్ తెరుస్తుండగా కొద్ది దూరంలో రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టు కింద విమల నిలబడి ఈయన్నే చూస్తూ కనబడింది. ఆమెను గుర్తు పట్టి అక్కడే ఉండు అని చేయి ఊపి కారును తీసికెళ్ళి ఆమె ముందు ఆపాడు.కారు దిగుతూ ‘ఏంటమ్మా ఈమె ఎవరికీ అర్థం కాకుండా ఉంది’ అన్నాడు తాను చెట్టు కిందికి వెళుతూ.‘పట్టింపులు ఎక్కువైనా.. ఈశ్వరక్క చాలా మంచిది. నన్ను మా ఇంట్లో కన్నా మంచిగా చూసుకుంటది. డిగ్రీ కూడా చదివిస్తానంటున్నది. తర్వాత ఏదైనా ఉద్యోగం చేస్తాను. అయితే..’ అని విమల అటు ఇటు చూసింది.‘నీకేం కాదమ్మా.. నేను ఉన్నాను కదా! మనసులో ఉన్నదంతా చెప్పేయ్!’ అన్నాడు.‘నాకు శ్రీను అంటే ఇష్టం’ అంది మెల్లగా.ఈ ట్విస్టుకు అడ్జస్టు కావడానికి శోభన్కు కొంత సమయం పట్టింది.‘జరిగింది ఓ పీడకల అనుకుంటా సార్! దాన్నే తలుచుకుంటూ ఏడుస్తూ కూచుంటే ఇక్కడ కొన్ని జీవితాలు, కుటుంబాలు కోలుకోలేని దెబ్బ తింటున్నాయ్’ అంది.విమల మాటలు ఆయనకు ఎన్నడూ చదవని పాఠంలా అనిపించాయి. గాయపడిన పక్షి ఎగరడానికి రెక్కలను టపటప ఆడిస్తున్నట్లుగా ఉన్నాయి.‘మరి శ్రీను..’ అన్నాడు విషయంలోకి వస్తూ.‘శ్రీనుకు కూడా ఇష్టమే. అసలైతే రాజేష్ సార్ జైలు నుంచి రాగానే మేమిద్దరం దూరంగా వెళ్లిపోదామనుకున్నాం. అయితే ఈశ్వరక్క నమ్మకాన్ని దెబ్బ తీశామనే బాధ వదిలేది కాదు. మీరు తలుచుకుంటే మా నలుగురి బతుకుల్ని సరిదిద్దగలరని ఆశ పుడుతోంది’ అంది చేతులు జోడిస్తూ. ఆ మాటలకు ఈశ్వరి వేసిన కటికముడి కొద్దిగా విచ్చుకుంటున్న ఆశ శోభన్ మనసులో కదిలింది.‘గుడ్ విమలా! మీ నిర్ణయం వండర్ ఫుల్. నా సర్వీసులో ఇదొక డిఫరెంట్ చాలెంజ్. వదిలి పెట్టను. మళ్ళీ వస్తాను. మళ్ళీ మళ్ళీ వస్తాను. విజయం మనదే. ఆల్ ది బెస్ట్!’ అంటూ కారులో కూచున్నాడు.‘మెనీ మెనీ థాంక్స్ సార్. బై బై!’ అంటూ విమల వీడ్కోలు చెప్పింది. -
టీచర్తో బీజేపీ నేత లవ్ ట్రాక్.. భార్య ఉండగా ఆమెతో రిలేషన్..
జైపూర్: రాజస్థాన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు ఒకరు దారుణానికి ఒడిగట్టారు. తన ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యనే కిరాతకంగా హత్య చేశారు. అయితే, ఆమెను దొంగలు హత్య చేసినట్టు నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన బీజేపీ నాయకుడు రోహిత్ సైనీ. ఆయనకు సంజుతో కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే, రోహిత్కు రీతు సైనీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ రెండేళ్లుగా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. రీతు సైనీ అప్పటికే వివాహం కాగా.. భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో తనకు అడ్డుగా ఉన్న సంజును ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని రీతు సైనీ ప్లాన్ చేసింది. ఆమెను హత్య చేయాలని భర్త రోహిత్, అతడి ప్రియురాలు ప్లాన్ చేశారు.ఇందులో భాగంగా ఆగస్టు పదో తేదీన తమ ప్లాన్ ప్రకారం సంజును వారు హత్య చేశారు. అనంతరం, రోహిత్ సైనీ.. పోలీసులను, కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నంలో భాగంగా.. ఆరోజు రాత్రి తన ఇంట్లో దోపిడీ జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంట్లో చోరీకి వచ్చిన దొంగలే.. సంజును హత్య చేశారని తెలిపాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారం, డబ్బులు దొంగతనం చేసి.. సంజును హత్య చేశారని పేర్కొన్నాడు. अजमेर के किशनगढ़ में भाजपा नेता रोहित सैनी ने प्रेमिका के साथ मिलकर पत्नी संजू सैनी की हत्या की थी। प्रेमिका भी मर्डर की प्लानिंग में शामिल थी। प्रेमिका तलाकशुदा है और प्राइवेट स्कूल में टीचर है। उसके एक चार साल की बेटी भी है।एडिशनल एसपी (ग्रामीण) दीपक कुमार ने बताया- शिवाजी… pic.twitter.com/2eqNWhWyrk— Rajasthan One (@rajasthanone11) August 17, 2025దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో రోహిత్, రీతు సంబంధం గురించి బయటకు వచ్చింది. ఈ క్రమంలో తమదైన తీరులో పోలీసులు.. రోహిత్ను ప్రశ్నించగా.. అసలు నేరం ఒప్పుకున్నాడు. అనంతరం, రోహిత్, రీతును పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అరెస్టులను రూరల్ అదనపు ఎస్పీ దీపక్ కుమార్ ధృవీకరించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించామని ఆయన అన్నారు. -
ఏఐ కారణంగా... వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి?
ప్రతి నాణేనికీ బొమ్మ బొరుసులు ఉంటాయి; ప్రతి పరిణామానికీ మంచి చెడులు ఉంటాయి; కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) కూడా ఉభయ కోణాలూ ఉంటాయి. ఏఐ దెబ్బకు ఇప్పటికే ఉన్న అనేక ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ సాంకేతికత కొత్త ఉద్యోగాలకు ఊపిరి పోస్తుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఏఐ కారణంగా...వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి? ఏఐ కాయిన్కి అటూ ఇటూ ఒకసారి పరిశీలించి చూద్దాం.ఏఐ దెబ్బకు ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు పోయిన మాట నిజమే! సమీప భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకూ ఎసరొచ్చే పరిస్థితులు కూడా నిజమే! కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన తర్వాత టైపిస్టుల ఉద్యోగాలు క్రమంగా తెరమరుగైపోయాయి. చిన్నా చితకా పట్టణాల్లోనూ కనిపించే టైప్ ఇన్స్టిట్యూట్లు శాశ్వతంగా మూతబడ్డాయి. కొత్త సాంకేతికత ఏదైనా విరివిగా వాడుకలోకి వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. నిజానికి లెక్క చూసుకుంటే, కంప్యూటర్ల వల్ల పోయిన ఉద్యోగాల కంటే కొత్తగా వచ్చిన ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన కొత్తలో టైపిస్టుల ఉద్యోగాలు పోయినా, కనీస నైపుణ్యాలు కలిగినవారికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చాయి. కంప్యూటర్ల వాడకం పెరిగాక రకరకాల అవసరాల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. అదే రీతిలో ఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు లేకుండా పోయినా, ఇంకొన్ని కొత్త తరహా ఉద్యోగాలు రానున్నాయి. ఏఐ కారణంగా పోయే ఉద్యోగాల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అమెరికన్ కంపెనీ ‘ఆంత్రోపిక్’ సీఈవో, ‘క్లాడ్’ ఏఐ మోడల్ రూపకర్త డేరియో అమోడీ ఏఐ ప్రభావం వల్ల వచ్చే ఐదేళ్లలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు సగానికి సగం తగ్గిపోతాయని చెబుతుంటే, ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ వంటి అంతర్జాతీయ సంస్థలు భిన్నమైన అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఏఐ ప్రభావం వల్ల వచ్చే ఐదేళ్లలో కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఈ సంస్థలు చెబుతున్నాయి.కోట్లలో కొత్త ఉద్యోగాలుఈ ఏడాది పూర్తయ్యేలోగా ఏఐ వల్ల వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 9.7 కోట్ల ఉద్యోగాలు కొత్తగా పుట్టుకొస్తాయని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ అంచనా వేస్తోంది. వైద్యరంగంలో రోగనిర్ధారణ చేయడంలో ఏఐ మానవ వైద్యులను మించిన పనితీరును ఇప్పటికే ప్రదర్శిస్తోంది. అకౌంటింగ్, భాషానువాదం వంటి రంగాల్లోనూ ఏఐ తన సత్తా చాటుకుంటోంది. ఏఐ ఎన్ని సేవలకు ప్రత్యామ్నాయం కాగలిగినా, అంతిమ నిర్ణయం తీసుకునే శక్తి మాత్రం మానవులదే! మానవ నిర్ణయాత్మక శక్తికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు. రానున్న కాలంలో ఏఐ మరింతగా అభివృద్ధి చెంది, పరిశ్రమల తీరుతెన్నులను మార్చేస్తుందని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఆరోగ్య, ఆర్థిక, సాంకేతిక తదితర రంగాల్లో ఏఐ ప్రభావం వల్ల 2030 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు5 కోట్ల వరకు కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘మెక్ కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్’ అంచనా వేస్తోంది. సాంకేతిక నైపుణ్యానికి తోడు మానవ కౌశలం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ మేధాశక్తి అవసరమయ్యే ఉద్యోగాలు పలు రంగాల్లో కొత్తగా పుట్టుకొస్తాయని, వీటికి తగినట్లుగా శరవేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలను సాధించగలిగితే, ఏఐ ఆధారిత ఉద్యోగాలను దక్కించుకోవడం అంత కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా వచ్చే ఉద్యోగాలుఏఐ వాడకం పెరగడం వల్ల పలు రంగాల్లో కొన్ని సాంకేతిక, సాంకేతికేతర ఉద్యోగాలు రానున్నాయి. ఆ కొత్త ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల్లోపనిచేసేవారు నిర్వర్తించే విధుల గురించి సంక్షిప్త సమాచారండేటా సైంటిస్ట్డేటా సైంటిస్టులు సంస్థకు అవసరమైన డేటాను విశ్లేషించి, అందులోని సమాచారాన్ని సంస్థ నిర్ణయాలకు ఉపయోగపడేలా క్రోడీకరించి అందిస్తారు.మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్: మెషిన్ లెర్నింగ్ మోడల్స్కు రూపకల్పన చేయడం, వాటిని వాస్తవ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ల ప్రధానమైన పనులు. వీరు డేటా సైంటిస్టులకు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు మధ్య వారధిలా పనిచేస్తారు.రోబోటిక్స్ ఇంజినీర్: రోబోల రూపకల్పన, నిర్మాణం, ఆటోమేటెడ్ సిస్టమ్స్తో రోబోలను అనుసంధానం చేయడం రోబోటిక్స్ ఇంజినీర్ల ప్రధానమైన పనులు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్స్ ఇంజినీరింగ్ విభాగాల సమ్మిళిత పరిజ్ఞానంతో వీరు పనిచేస్తారు.ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్: ఏఐ రీసెర్చ్ సైంటిస్టులు కొత్త ఆల్గోరిథమ్స్ను, ఏఐ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చేసేందుకు కావలసిన మెలకువలను రూపొందించడం; డిజైనింగ్ ప్రయోగాలు చేయడం; నమూనాలను రూపొందించడం; వాటికి అవసరమైన పరిశోధనలు సాగించడం వంటి పనులు చేస్తారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) ఇంజినీర్: ఎన్ఎల్పీ ఇంజినీర్లు– మనుషుల భాషను అర్థం చేసుకుని, విశ్లేషించేలా కంప్యూటర్లను రూపొందిస్తారు. మనుషుల భాషలోని ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేలా కంప్యూటర్లను తీర్చిదిద్దుతారు.కంప్యూటర్ విజన్ ఇంజినీర్: ఫొటోలు, ఇతర చిత్రాలు, వీడియోలను చూసి, వాటిని అర్థం చేసుకుని విశ్లేషించేలా కంప్యూటర్లను రూపొందించడంలో కంప్యూటర్ విజన్ ఇంజినీర్లు కీలకంగా పనిచేస్తారు.ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్: ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించుకునే సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందిస్తారు. సంస్థ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తారు.ఏఐ ఆర్కిటెక్ట్: సంస్థకు అవసరమైన ఏఐ సిస్టమ్స్ను రూపొందించడంలోను, వాటిని వినియోగంలోకి తేవడంలోను ఏఐ ఆర్కిటెక్ట్లు కీలకంగా పని చేస్తారు. ఏఐ సాంకేతిక ఉపయోగానికి అవసరమైన అవకాశాలను గుర్తించడంలోను, ఏఐ సాంకేతికతకు తగిన సాధనా సంపత్తిని సమకూర్చడంలోను వీరిదే ప్రధాన పాత్ర.ఏఐ ట్రైనర్: ఏఐ సిస్టమ్స్కు శిక్షణ ఇవ్వడం ఏఐ ట్రైనర్ల పని. డేటాను, ఫీడ్బ్యాక్ను అర్థం చేసుకుని, పనితీరును మెరుగుపరచుకునేలా ఏఐ సిస్టమ్స్ను వీరు అభివృద్ధి చేస్తారు.ప్రాంప్ట్ ఇంజినీర్: జెనరేటివ్ ఏఐ మోడల్స్ నుంచి ఆశించిన ఔట్పుట్ను రాబట్టేందుకు అవసరమయ్యే ఆదేశాలను, సూచనలను రూపొందించడంలో ప్రాంప్ట్ ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఏఐ అప్లికేషన్ల పనితీరును గరిష్ఠస్థాయిలో మెరుగుపరచే దిశగా వీరు వాటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటారు.ఏఐ ఎథిసిస్ట్: ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఏఐ ఎథిసిస్టుల అవసరం కూడా పెరుగుతుంది. ఏఐ వల్ల జరిగే అనుకోని పొరపాట్లను, వాటి కారణంగా ఎదురయ్యే నైతిక సమస్యలను నివారించేందుకు తగిన రీతిలో ఏఐ సిస్టమ్స్ను తీర్చిదిద్దడం, ఏఐ వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఏఐ ఎథిసిస్టుల ప్రధానమైన పనులు.ఎక్స్ప్లెయినర్స్ఏఐ డెవలపర్స్కు, ఏఐ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస్థల యాజమాన్యాలకు మధ్య ఎక్స్ప్లెయినర్స్ వారధిలా పనిచేస్తారు. ఏఐ విధానాలు పారదర్శకంగా ఉండేలా చూడటం, వాటి పనితీరును, ప్రయోజనాలను వ్యాపార సంస్థల యాజమాన్యాలకు వివరించడంలో ఏఐ డెవలపర్స్ కీలక పాత్ర పోషిస్తారు. మార్పులకు లోనయ్యే ఉద్యోగాలుఏఐ ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న పలు ఉద్యోగాల్లో మార్పులు ఇప్పటికే మొదలయ్యాయి. ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఈ ఉద్యోగాల్లో మరిన్ని మార్పులు కూడా జరగనున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పని ఏఐ వల్ల మరింత సులభతరం అవుతుంది. కోడింగ్ వంటి కొన్ని పనులను ఏఐ చేసేయగలుగుతుంది. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పనిభారం తగ్గుతుంది. అంతమాత్రాన వారి అవసరం పూర్తిగా లేకుండాపోదు. సంక్లిష్టమైన పనులు సజావుగా జరిగేలా చూడటంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్ర కొనసాగుతుంది. డేటా అనలిస్టుల పని కూడా ఏఐ వల్ల సులభతరం అవుతుంది. డేటా సేకరణ, విశ్లేషణ వంటి పనులను ఏఐ స్వయంగా చేసేస్తుంది. మార్కెట్ ధోరణులను గుర్తించడం, డేటా ఫలితాలను విశ్లేషించడం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో డేటా అనలిస్టులు మరింత సమర్థంగా పనిచేసేందుకు వీలు చిక్కుతుంది. ఏఐ వల్ల సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్ ఉద్యోగుల పని కూడా చాలా వరకు తేలికవుతుంది. టార్గెటెడ్ యాడ్స్ గుప్పించడం వంటి పనులను ఏఐ స్వయంగా చేసేస్తుంది. మనుషులతో నేరుగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ఉద్యోగులు స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది.కనుమరుగయ్యే ఉద్యోగాలుఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు అతి త్వరలోనే తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలైతే దాదాపుగా కనుమరుగైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. టైపింగ్, కాపీయింగ్, పేస్టింగ్ వంటి పనులను ఏఐ స్వయంగా చేయగలుగుతోంది. దీనివల్ల డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏఐతో పనిచేసే అధునాతన డ్రైవర్లెస్ వాహనాలు ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి పెద్దసంఖ్యలో వాడుకలోకి వస్తే, ఇక డ్రైవర్ ఉద్యోగాలు కూడా కనుమరుగైపోతాయి. కర్మాగారాల్లో బరువులు ఎత్తడం, బరువైన వస్తువులను ఒకచోటి నుంచి మరొక చోటికి చేర్చడం వంటి పనులను సునాయాసంగా చేయగలిగే ఏఐ రోబోలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే వాడుకలోకి వచ్చాయి.ఇవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేటట్లయితే, కర్మాగారాల్లో పనిచేసే నైపుణ్యాలు లేని కార్మికుల ఉద్యోగాలు అంతరించిపోతాయి. ఈ–కామర్స్ రంగంలో ఏఐ వాడకం మెల్లగా పెరుగుతోంది. ఇది మరింతగా పెరిగితే, రిటైల్ సేల్స్ ఉద్యోగులు ఇతర ఉపాధి మార్గాలను వెదుక్కోక తప్పదు. అకౌంటింగ్ రంగంలో బుక్ కీపింగ్ సహా ప్రాథమిక అకౌంటింగ్ పనులన్నీ ఏఐ సాయంతో ఆటోమేషన్ ద్వారా జరిగిపోతున్నాయి. దీనివల్ల కిందిస్థాయి అకౌంటింగ్ ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏఐ ద్వారా అందుబాటులోకి వచ్చిన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) సిస్టమ్స్ పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో త్వరలోనే పత్రికా సంస్థలు, ప్రచురణ సంస్థల్లో ప్రూఫ్ రీడర్స్, ట్రాన్స్లేటర్స్ ఉద్యోగాలు ఇకపై ఉండకపోవచ్చు. ఏఐ ప్రభావం వల్ల మనుషులు చేసే ఉద్యోగాల్లో చాలావరకు అంతరించిపోతాయని, ఉద్యోగాల్లో మనుషుల అవసరం గణనీయంగా తగ్గిపోతుందనే వాదనలు జనాల్లో గందరగోళం రేపుతున్నాయి. ఏఐ ప్రభావం వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నా, అంతకు మించి కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏఐ సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోగలిగే వారికి సమీప భవిష్యత్తులోనే పుష్కలంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయని ప్రపంచస్థాయి ప్రీఎమినెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ‘గోల్డ్మన్ సాక్స్’ అంచనా వేసింది. ఏఐ కారణంగా 25 శాతం వరకు నైపుణ్యాలు లేని కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఉన్నట్లు చెబుతోంది. మరోవైపు ఏఐ కారణంగా 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అమెరికన్ బహుళజాతి ఆర్థిక సంస్థ ‘జేపీ మోర్గాన్ చేజ్’ అంచనా వేస్తోంది. ఏఐ ప్రభావంతో వచ్చే ఉద్యోగాలు, పోయే ఉద్యోగాల పరిస్థితులు ఎలా ఉన్నా, ఏఐ ప్రభావం వల్ల ప్రపంచం మరింత ముందుకు పురోగమించడం మాత్రం ఖాయం. -
ఊచకోత.. సిక్సర్ల సునామీ.. చరిత్రలో అత్యధిక స్కోర్
పురుషుల హండ్రెడ్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదైంది. నిన్న (ఆగస్ట్ 16) వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల రికార్డు స్కోర్ చేసింది.ఇన్విన్సిబుల్స్ చారిత్రక స్కోర్ సాధించడానికి జోర్డన్ కాక్స్ ప్రధాన కారకుడు. కాక్స్ 29 బంతుల్లో 10 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో అజేయమైన 86 పరుగులు సాధించాడు. అజీత్ డేల్ వేసిన ఓ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు. ఇన్విన్సిబుల్స్ ఇన్నింగ్స్లో విల్ జాక్స్ (38), ముయేయే (33), సామ్ కర్రన్ (34), డొనోవన్ ఫెరియెరా (18) కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా ఇన్విన్సిబుల్స్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. గతంలోనూ ఈ రికార్డు ఇన్విన్సిబుల్స్ (208) పేరిటే ఉండేది. తాజాగా ఇన్విన్సిబుల్స్ తమ రికార్డును తామే బద్దలు కొట్టుకుంది. రికార్డు స్కోర్ చేసిన అనంతరం ఇన్విన్సిబుల్స్ లక్ష్యాన్ని సునాయాసంగా కాపాడుకుంది. టామ్ కర్రన్ (18-8-15-4), బెహ్రెన్డార్ఫ్ (15-7-20-3) చెలరేగి బౌలింగ్ చేసి వెల్ష్ ఫైర్ను 93 బంతుల్లో 143 పరుగులకే ఆలౌట్ చేశారు. జానీ బెయిర్స్టో (28 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లూక్ వెల్స్ (29), టామ్ కొహ్లెర్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
విన్ఫాస్ట్ కార్ల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫైనాన్సింగ్
న్యూఢిల్లీ: ఇన్వెంటరీ, ఆటో ఫైనాన్సింగ్ సదుపాయం కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు విన్ఫాస్ట్ ఆటో ఇండియా తెలిపింది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. భారత్లో ఒక బ్యాంకింగ్ సంస్థతో కుదర్చుకున్న తొలి ఎంఓయూ ఇది.నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలకు ముందు ఎలాంటి అంతరాయాలు లేని రుణ సదుపాయాలు అందించడం ఈ ఒప్పంద లక్ష్యమని కంపెనీ వివరించింది. భారతీయ కస్టమర్లకు సౌకర్యవంతమైన, ఆధునాతన ఎలక్ట్రిక్ వాహనాలను అందించే ప్రయత్నాల్లో ఈ ఎంఓయూ మైలురాయిగా నిలుస్తుందని విన్ఫాస్ట్ ఇండియా సీఈఓ ఫామ్ సాన్ చౌ తెలిపారు.‘ఈవీల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఫైనాన్సింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కస్టమర్ల ఆకాంక్షలకు పెద్దపీట వేయడంలో బ్యాంకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిటైల్ అసెట్స్ హెడ్ అరవింద్ వోహ్రా తెపారు. విన్ఫాస్ట్ ఆటో ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్ ముందు వీఎఫ్7, వీఎఫ్6 మోడళ్లను లాంచ్ చేయనుంది. -
ఎమ్మెల్యే మాధవి తీరు సరికాదు
కడప సెవెన్రోడ్స్: స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా శుక్రవారం కడప పోలీసు పెరేడ్ మైదానంలో కడప ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డి జిల్లా ఉన్నతాధికారులైన జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తదితర అధికారులతో వ్యవహరించిన తీరుపై రెవెన్యూ అధికారులు భగ్గుమంటున్నారు. ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు, ఏపీ రెవెన్యూ సరీ్వసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవన్ చంద్రశేఖర్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, ఇతర వర్గాలకు జిల్లా యంత్రాంగం పోలీసు మైదానం వద్ద తగిన సౌకర్యాలు కల్పించిందన్నారు. పండుగ వాతావరణంలో స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతున్న సమయంలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఒకటిన్నర గంట ఆలస్యంగా అక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం మంత్రి, కలెక్టర్, ఎస్పీ మాత్రమే వేదికపై ఆశీనులు అవుతారన్నారు. ప్రజాప్రతినిధుల కోసం వేదిక పక్కన వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశామన్నారు. కాగా, ఎమ్మెల్యే మాధవి రెడ్డి కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో పాటు.. ఆలస్యంగా వచ్చే విషయాన్ని కనీసం ముందస్తుగా తమ వ్యక్తిగత సహాయకుల ద్వారానైనా అధికారులకు తెలియజేయలేదన్నారు. అప్పటికే ఎమ్మెల్యేకు కేటాయించిన సీటులో ఇతరులు కూర్చొన్నారని తెలిపారు. దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే కూర్చొన్న వారిని అక్కడి నుంచి పంపివేసి ఎమ్మెల్యేను ఆహ్వానించారన్నారు. ఎమ్మెల్యే మాధవీ అక్కడ కూర్చొనేందుకు విముఖత చూపారన్నారు. దీంతో వేదికపై ప్రత్యేకంగా కూర్చుని సమకూర్చి ఆహ్వానించుమన్నారు. ముందుగానే వేదికపై కుర్చీ వేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేయడంతో పాటు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ స్వయంగా వెళ్లి వేదికపైకి రావాలంటూ ఆహ్వానించినా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుషంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సివిల్ సరీ్వసెస్ సాధించి జిల్లా ప్రజలకు సేవలు అందించేందుకు వచ్చిన జాయింట్ కలెక్టర్పై ఎమ్మెల్యే అమర్యాదకరంగా ప్రవర్తించడం జిల్లాకే అవమానకరమని వాపోయారు. ఎమ్మెల్యేతోపాటు అక్కడికి వచ్చిన అనధికార ప్రజాప్రతిని«ధి కూడా జిల్లా రెవెన్యూ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించడం గర్హనీయమన్నారు. అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించడం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదన్నారు. స్వయంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వెళ్లి వేదికపైకి రావాలంటూ ఎమ్మెల్యేను ఆహ్వానించినప్పటికీ ఆమె రాకుండా వెళ్లిపోయిందని తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో పాల్గొని ఆస్వాదించే బదులు తనకు కుర్చీ వేయలేదంటూ అధికారులపై రుసరుసలాడటం అత్యంత హేయమని దుయ్యబట్టారు. జిల్లా అధికారులనే ఆమె దురుసుగా మాట్లాడుతోందంటే ఇక కిందిస్థాయి అధికారులపై ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
పిడకల ధూపం.. ఆరోగ్య ధూమం
ఆవుపేడకు ఉన్న ప్రశస్తి తెలిసినదే! ఆవుపేడతో తయారు చేసిన పిడకలను ఇదివరకటి కాలంలో పొయ్యి రాజేసుకోవడానికి వంటచెరకుగా వినియోగించేవారు. ఇప్పటికీ ఆవుపేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్, అగరొత్తులు, జపమాలలు, కుండీలు, దేవుళ్ల ప్రతిమలు, ప్రమిదలు, బొమ్మలు, విభూది, పళ్లపొడి వంటి వాటి తయారీకి ఉపయోగిస్తున్నారు. అయితే, రైతు సుబ్బరాజు ఆవుపేడకు వనమూలికలను జతచేసి, అగ్నిహోత్ర పిడకలను తయారుచేస్తున్నారు.పర్యావరణ పరిరక్షణే లక్ష్యంచిత్తూరు జిల్లా నగరి మండలం, రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు విలక్షణమైన పద్ధతిలో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలను సాగుచేసిన రైతుగా, పాడి రైతుగా తనకు గల అనుభవంతో పర్యావరణ రక్షణ కోసం ఏదైనా చేయాలనే తపనతో ఆయుర్వేద గ్రంథాలను అధ్యయనం చేయడమే కాకుండా, ఆయుర్వేద నిపుణులను కలుసుకొని, వారి సూచనలతో అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. ఇంటి వద్దనే ఒక పాక వేసుకుని, ఈ అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నారు.ఆయుర్వేద మూలికలతో... దేశవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతి, తామర మొదలైన సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాంసి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, సుగంధిపాల, గ్రంథి, చెంగల్వకోష్టు, పచ్చకర్పూరం వంటి మూలికలు, ఆయుర్వేద ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి, కావలసిన ఆకారంలో పిడకలను తయారు చేసి ఎండబెడతారు. వీటి తయారీకి కావలసిన సామగ్రిని సమకూర్చుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులూ అందుబాటులో ఉంటే ఒక మనిషి రోజుకు మూడువందల వరకు పిడకలను తయారుచేసి, ఎండబెట్టవచ్చు. ఈ పిడకలను హోమద్రవ్యంగా అగ్నిహోత్రంలో వినియోగించవచ్చు. అలాగే, వీటి పొగను ఇంట్లో ధూపంగా కూడా వేయవచ్చు. ఈ పిడకల నుంచి వెలువడే పొగ సుగంధభరితంగా ఉండి, ఇంట్లోని వాతావరణాన్ని ఆధ్యాత్మికతతో నింపుతుంది. పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చి పలువురు ఈ అగ్నిహోత్ర పిడకలను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఒకసారి ఈ పిడకలను వాడి, వాటి నాణ్యతను తెలుసుకున్నవారు మళ్లీ మళ్లీ వాటిని వినియోగిస్తున్నారు.ఆరోగ్యం కోసం చేస్తున్నా...ఆరోగ్యకరమైన పంటలను అందించడానికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అలాగే గాలిని కూడా వీలైనంత మేరకు ఆరోగ్యకరంగా మార్చాలనే ఆలోచనతోనే ఈ పిడకల తయారీని ప్రారంభించాను. పూర్వీకులు ఉదయాన సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ను నిర్మూలించేందుకు ఆవు పేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఇటీవలి ప్రయోగాల్లో కనుగొన్నారు. ఒక పిడక మీద సెల్ఫోన్ ఉంచినపుడు దాని నుంచి వెలువడే రేడియేషపరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాల్లో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకుని, కొందరు ఆయుర్వేద నిపుణుల సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారుచేస్తున్నాను. వీటి తయారీకి కావలసిన వస్తువులను సేకరించడం చాలా కష్టతరంగా మారింది. పది కిలోల పేడతో పిడకలు తయారు చేయాలంటే, మూడు కిలోల నెయ్యి అవసరం. వీటి తయారీకి వాడే పాలు, పెరుగు, పంచితంతో పాటు వీటిలో వేసే మూలికలు ఇక్కడ లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపులకు వెళ్లి తీసుకువచ్చా. ఇలా తయారుచేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోంది. నేను రూ. 30కే విక్రయిస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నా.– సుబ్బరాజు, పాడిరైతు, రాజులకండ్రిగ, నగరి మండలం. కోనేరి చంద్రమోహన్, నగరి(చదవండి: మట్టి నుంచి విద్యుత్తు!) -
‘కుర్చీ కోట్లాట’.. మాధవీరెడ్డి తీరుపై కలెక్టర్ చెరుకూరి సీరియస్
సాక్షి, వైఎస్సార్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వేదికపై తనకు కుర్చీవేయలేదని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అధికారులపై చిందులేశారు. తనకు వేదికమీద చోటు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీపై గుడ్లురిమి కేకలేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డిపై కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తాజాగా మాట్లాడుతూ.. వేదికపై తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి తిరిగి వెళ్లిపోయారు. అన్నీ ప్రోటోకాల్ ప్రకారమే చేశాం. స్వాతంత్ర్య వేడుకలు ప్రారంభమైన గంటన్నర తర్వాత ఎమ్మెల్యే వచ్చారు. వచ్చే ముందు ఎమ్మెల్యే కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఫలితంగా వీఐపీలకు కేటాయించిన సీట్లకు ఇతరులు కూర్చున్నారు. వెంటనే వారిని లేపి రెవెన్యూ అధికారి ఎమ్మెల్యేని పిలిచి.. వీఐపీ సీట్లో ఆమెను కూర్చోవాలని కోరారు. అందుకు ఆమె విముఖత చూపారు. ముందుగానే వేదికపై తనకు కుర్చీ వేయలేదని ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. అందుకోసం మేం ఆమెకు వేదికపై కుర్చీ వేసి ఆహ్వానించాం. వేదికపైకి రావాలని జాయింట్ కలెక్టర్, తాను వెళ్లి ఆహ్వానించినా రాలేదని స్పష్టం చేశారు. అయినా ఆమె వేదికపైకి రాకుండా వెళ్లిపోయారు. ఆమెకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మేమంతా ప్రోటోకాల్ ప్రకారమే చేశాం’ అని చెప్పుకొచ్చారు.ఇక, ఎమ్మెల్యే తీరును ఇప్పటికే జిల్లా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తప్పుపట్టింది. వేదికపైకి ఆహ్వానించిన జాయింట్ కలెక్టర్పై పరుషంగా వ్యవహరించడం కడప జిల్లాకే అవమానకరం. కుర్చీ వేయలేదని రుసరుసలాడటం అత్యంత హేయమైన చర్య. ఉన్నతాధికారులతోనే ఇలా వ్యవహరిస్తే ఇక కింది స్థాయి ఉద్యోగులతో ఎలా ప్రవర్తిస్తారో అర్ధం చేసుకోవచ్చు. కుర్చీ కోసం దురుసుగా వ్యవహరించిన ఎమ్మెల్యే మాధవీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను అసోసియేషన్ కోరింది. -
స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలోకి ఓలా ఎలక్ట్రిక్
ముంబై: ఓలా ఎలక్ట్రిక్ తన ఉత్పత్తుల పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా స్పోర్టియర్ వెర్షన్లో కనిపిస్తున్న ఓ స్కూటర్ టీజర్ను బుధవారం విడుదల చేసింది. ఓలా ‘కృత్రిమ్’ ఏఐ ఫీచర్స్తో ఈ స్పోర్ట్స్ స్కూటర్లు రానున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.ప్రతి ఏటా ఆగస్టు 15న నిర్వహించే తన వార్షిక ‘సంకల్ప్’ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయంగా టీవీఎస్ ఎన్టార్క్, యమహా ఏరోక్స్ 155, ఏప్రిలియా ఎస్ఆర్160 మోడళ్లు స్పోర్ట్స్ స్కూటర్ల విభాగంలో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఓలా ఎలక్ట్రిక్ డ్యూయల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ సదుపాయాలతో పాటు సొంతంగా తయారు చేసిన 4680 సెల్ ఫీచర్లతో జెన్ 3 స్కూటర్లను ఆవిష్కరించింది. -
ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళల దాడి
మాదాపూర్ : మాదాపూర్లో ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళలు దాడి చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన మేరకు.. షేక్పేటలో ఉంటున్న తల్లిదండ్రులు తన కూతురిని నీట్ ఎగ్జామ్ కౌచింగ్ కోసం జులై 13 నుంచి హస్టల్లో ఉంచారు. 10 రోజుల క్రితం నిర్వాహకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలపడంతో బంధువులు, తల్లిదండ్రులు వచ్చి నిర్వాహకుడిపై దాడి చేశారు. మాదాపూర్ ఇమేజ్గార్డెన్ రోడ్డులో ఉన్న అర్ణవ్ ప్లాజాలో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హస్టల్లో 16 సంవత్సరాల బాలిక ఉంటుంది. బాలికపై హాస్టల్ నిర్వాహకుడు సత్యప్రకాశ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. పూలకుండీలను ధ్వంసం చేసి దాడికి దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.అనంతరం సత్యప్రకాశ్ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘పరదా’ చర్చనీయాంశమవుతుంది: ప్రవీణ్ కాండ్రేగుల.
‘‘పరదా’ కోసం మేం సృష్టించిన ఊరు, సంస్కృతి, పాత్రలన్నీ కల్పితాలే. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. మా సినిమాకు అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. అయితే డబ్బులు వస్తే, ఈ తరహా చిత్రాలను నిర్మించేందుకు మరింతమంది నిర్మాతలు ముందుకొస్తారు. అందుకని వసూళ్లు బాగుండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రవీణ్ కాండ్రేగుల. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ–‘‘నా తొలి చిత్రం ‘సినిమా బండి’కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన విజయ్గారికి ‘పరదా’ కథ చెప్పగా, ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత అనుపమ గారికి కథ వినిపించగా ఎమోషనల్ అయ్యారు. ఆ నెక్ట్స్ దర్శన, సంగీతగారు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. ఓ ఊర్లో మహిళలందరూ ఎందుకు పరదాలు ధరిస్తారనే విషయాన్ని సినిమా స్టార్టింగ్లోనే చెప్పాం. ఆడవాళ్లలోనే కాదు... మగవాళ్లల్లో కూడా ఒక పరదా ఉంటుందని ఈ ‘పరదా’తో చెప్పే ప్రయత్నం చేశాం. ‘హైవే’ సినిమాలో ఆలియా భట్గారి నటకు నేను పెద్ద అభిమానిని. ‘పరదా’లో ఆలియా స్థాయి నటను అనుపమ చేశారు. దర్శన, సంగీతగార్లు బాగా యాక్ట్ చేశారు. గోపీసుందర్గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మృదుల్ సేన్ అనే అమ్మాయి అద్భుతమైన విజువల్స్ను అందించారు. ‘సినిమాబండి, శుభం, పరదా’లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నాకు కమర్షియల్ సినిమాలపై కూడా మంచి గ్రిప్ ఉంది. చాన్స్ వస్తే పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు. -
అదితి శంకర్ ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
డైరెక్టర్ కూతురే అయినా, ఆమెను కెమెరా ముందు నిలిపింది కేవలం తన టాలెంటే! అందుకే, ప్రతిభను నమ్ముకుని ముందుకెళ్లే అదితి శంకర్ అందానికి కారణం కూడా ఆమె ఆత్మవిశ్వాసమేనట!నాకు బ్యూటీ సీక్రెట్లు ఏవీ లేవు! ప్రతిరోజూ స్నానం చేయడం, బాగా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, అంతే! సంప్రదాయ దుస్తులు అంటే ఇష్టం. ముఖ్యంగా చీరల్లో నేను రాణిలా మెరిసిపోతుంటాను. అందుకే ప్రత్యేక సందర్భాల్లో నా మొదటి ఎంపిక చీరలే. ఇవి నాకు అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తాయని అంటోంది అదితి శంకర్. ఇక్కడ ఆమె ధరించిన డ్రెస్ బ్రాండ్ నిరాలీ, ధర రూ. 35,000, జ్యులరీ బ్రాండ్: ఎమిథిస్ట్, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. డబుల్ చెయిన్... డబుల్ ఇంపాక్ట్!ఫంక్షనేమో చిన్నదే కాని, అది చాలా దగ్గరి వారిది. పెద్దగా తయారవకుండానే, ప్రత్యేకంగా కనిపించాలి. అయితే, ఒక్కసారి మెడలో ఈ డబుల్ లేయర్డ్ చెయిన్ వేసుకోండి. తళతళలాడే భారీ నగలు లేకుండానే, ఈ ఒక్క ఆభరణమే అందరి చూపులను ఆకర్షించేలా చేస్తుంది. సింపుల్ అయినా సాఫిస్టికేటెడ్, క్యూట్ అయినా కిల్లర్ లుక్కి చిరునామా డబుల్ లేయర్డ్ చెయిన్తో అందుకే దీని ప్రభావం కూడా రెట్టింపుగా ఉంటుంది. అయితే, ఈ హారం వేసుకునేటప్పుడు కొన్ని స్టయిలింగ్ చిట్కాలు గుర్తుంచుకోవాలి. చెయిన్ స్పష్టంగా మెడపై మెరిసిపోవాలంటే వీ–నెక్ లేదా ఓపెన్ నెక్ బ్లౌజ్ ఉండేలా చూసుకోవాలి. పెద్ద చెవిపూసలు వేసుకుంటే ఈ చెయి తో పోటీ పడతాయి. అందుకే చిన్న స్టడ్స్ లేదా చిన్ని జుమ్కీలు సరిపోతాయి. చేతికి తక్కువ గాజులు, ముఖానికి మినిమల్ మేకప్ అంతే, సిద్ధం! జుట్టు విషయంలో కూడా సహజంగా వదిలిన లైట్ కర్ల్స్ ఉంటే మెడ బాగా కనిపిస్తుంది, చెయిన్ మరింత మెరిసిపోతుంది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిన్న డబుల్ చెయన్తో మీ లుక్కి ఒక డబుల్ ఇంపాక్ట్ గ్యారంటీ!. డ్రెస్..బ్రాండ్: నిరాలీధర: రూ. 35,000జ్యూలరీ:బ్రాండ్ : ఎమిథిస్ట్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ రివ్యూ.. వివాదాల సినిమా ఎలా ఉందంటే?
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి (Suresh Gopi), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala).. కోర్ట్రూమ్ డ్రామా కాన్సెప్ట్తో దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించారు. అయితే, టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీతాదేవి మరో పేరు జానకి కావడం.. ఈ మూవీలో దాడికి గురైన మహిళా పాత్రకు ఆ పేరు పెట్టడంతో సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో టైటిల్లో చిన్న మార్పు చేసి (‘వి’ యాడ్ చేశారు) (Janaki v vs State of Kerala) కేవలం మలయాళంలో మాత్రమే జులైలో విడుదల చేశారు. అయితే, తాజాగా 'జీ 5'లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగులో త్వరలో విడుదల కావచ్చు. అయితే, సబ్టైటిల్స్తో చూసే ఛాన్స్ ఉంది.థ్రిల్లర్ కథాంశంతో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ రూపొందింది. న్యాయం కోసం పోరాడే యువతి కథే ఈ చిత్రం. జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ.. పండగ కోసం కేరళలోని తన సొంత ఊరికి వస్తుంది. అయితే, అక్కడ ఆమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. కానీ, నిందితుల తరఫున డేవిడ్ అనే ప్రముఖ లాయర్ (సురేశ్ గోపి) వాదిస్తాడు. దీంతో కేసు ఓడిపోవడం, తండ్రిని కోల్పోవడం, గర్భం దాల్చడం వంటి సంఘటనలు ఆమె జీవితాన్ని కుదిపేస్తాయి. జానకి ప్రభుత్వాన్ని తన బిడ్డను చూసుకోవాలని కోరుతుంది. దీనిపై కేరళ హైకోర్టు ఎలా స్పందించింది..? అనే అంశం కథలో కీలకం. ఒక కానిస్టేబుల్ సహాయంతో కేసు తిరిగి ఓపెన్ చేయడంతో కథ కొత్త మలుపులు తిరుగుతుంది. జానకి చేసిన న్యాయ పోరాటంలో ఫైనల్గా ఎవరు గెలిచారు..? నిందితుల పక్షాన సురేశ్ గోపి ఎందుకు వాదించాల్సి వచ్చింది. జానకికి జన్మించిన బిడ్డ బాధ్యతను చివరగా ఎవరు తీసుకుంటారు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఈ చిత్రం న్యాయ వ్యవస్థ, మహిళల హక్కులు, సామాజిక బాధ్యతలపై ప్రశ్నలు వేస్తూ.. భావోద్వేగంగా సాగుతుంది. మీరు లీగల్ డ్రామా సినిమాలు ఇష్టపడితే, ఇది తప్పక చూడవచ్చు. కథలో చెప్పిన అంశం చిన్నదైనా సరే చాలామందిని ఆలోచింపచేస్తుంది. అయితే, ఇలాంటి కథలు వెండితెరపై చాలానే కనిపించాయి. కానీ, ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించిన ఈ చిత్రం కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎక్కువ సమయం సాగదీశారనిపిస్తుంది. ఇలాంటి కథలకు కోర్టు రూమ్ ఎపిసోడ్స్ చాలా బలంగా ఉండాలి. కానీ, చాలా పేలవంగా దర్శకుడు చూపించాడు. అడ్వకేట్గా సురేశ్ గోపి వంటి స్టార్ నటుడు ఉన్నప్పటికీ బలమైన డైలాగ్స్ చెప్పించలేకపోయాడు.జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ స్టోరీ ప్రారంభం నుంచే నెమ్మదిగా సాగుతుంది. జానకి విద్యాధరన్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చాలా బాగా నటించింది. అయితే, ఆమె పాత్రను ఇంకా బలంగా చూపించాల్సి ఉంది. మరోవైపు జానకి కేసులో నిందితుల తరఫున వాదించేందుకు డేవిడ్ (సురేశ్ గోపి) ముందుకు రావడంతో కథలో కాస్త స్పీడ్ అందుకుంటుంది. అక్కడక్కడ జానకిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలతో ఆయన విసిగించినా ప్రేక్షకులకు నచ్చుతుంది. గర్భం దాల్చకుండానే ఆమె ఇలాంటి నేరం జరిగిందని ఆరోపణలు చేస్తుందా అనే ఫీల్ కలిగించేలా కొన్ని సీన్లు ఉంటాయి. అవి బాగానే కనెక్ట్ అవుతాయి. డేవిడ్ వంటి లాయర్ ఎంట్రీ ఇవ్వడంతో జానకి కేసును కోర్టు కొట్టివేస్తుంది. అయితే, ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలౌతుంది. తండ్రిని కోల్పోయి ఆపై లైంగికి దాడికి గురై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు సాయంగా కానిస్టేబుల్ ఫిరోజ్ (అస్కర్ అలీ) ఎంట్రీ ఇస్తాడు. అతను చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠను రేకిత్తిస్తుంది. ఆ సమయంలో కేసును వాదించేందుకు డేవిడ్ కూతురు అడ్వకేట్ నివేదిత (శృతి రామచంద్రన్) రంగంలోకి దిగుతుంది. ఫైనల్గా కోర్టు రూమ్ డ్రామాలో జానకికి ఎలాంటి న్యాయం జరిగింది అనేది పెద్దగా ఉత్కంఠత లేకుండానే దర్శకుడు కథ ముగిస్తాడు. కానీ, కోర్టు డ్రామా సినిమాలు చూసేవారికి తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుంది. జీ5లో అందుబాటులో ఉంది. అయితే, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం సబ్టైటిల్స్తో చూడొచ్చు. త్వరలో తెలుగులో కూడా విడుదల కావచ్చు. వీకెండ్లో కుటుంబంతో కలిసి చూసేయండి. ఎలాంటి అశ్లీలత లేదు. -
దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఖరీదైపోయింది. ఒకప్పుడు దేశంలోనే అందుబాటు ఇళ్ల ధరల మార్కెట్లో హైదరాబాద్ ముందు వరసలో నిలవగా.. ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన రెండో నగరంగా అభివృద్ధి చెందింది. ఆధునిక వసతులు, విలాసవంతమైన జీవన శైలి, కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు, నిర్మాణ వ్యయాలు, భూములు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల వంటివి నగరంలో ఇళ్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. లగ్జరీదే మూడో వంతు వాటా.. నగరంలో ఇళ్ల అమ్మకాల్లో విలాసవంతమైన గృహాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మొత్తం విక్రయాలలో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల వాటా మూడో వంతు కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. క్రెడాయ్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ తాజా గణాంకాల ప్రకారం.. జనవరి–జూన్ మధ్య కాలంలో నగరంలో రూ.56,345 కోట్ల విలువైన 30,553 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల విలువలో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ధర ఉన్న ప్రీమియం ఫ్లాట్ల వాటా మరో 34 శాతంగా ఉంది. ధర ఏడాదిలో రూ.20 లక్షల పెరుగుదల.. కరోనా మహమ్మారి తర్వాత నగరంలో లగ్జరీ గృహాల మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ లగ్జరీ ప్రాపర్టీ విభాగానికి బూస్ట్ లాగా మారింది. దీంతో నగరంలో ఏటా గృహాల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. సగటు టికెట్ పరిమాణం పరిశీలిస్తే.. 2024 ప్రారంభంలో రూ.1.62 కోట్లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా రూ.1.84 కోట్లకు చేరుకుంది. ఏడాదిలో రూ.20 లక్షల వరకూ ధరలు పెరిగాయి. ఎన్సీఆర్ తర్వాత దేశంలో రెండో అత్యంత ఖరీదైన మార్కెట్గా హైదరాబాద్ అవతరించింది. అందుబాటు ఇళ్ల కొరత.. నగరంలో సగటు కొనుగోలుదారుకు ఇంటి యాజమాన్యం అందుబాటులో ఉండటం లేదు. సరసమైన గృహాలు దాదాపు కనుమరుగయ్యాయి. రూ.70 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఫ్లాట్ల అమ్మకాల విలువలో కేవలం 3 శాతమే ఉండటమే ఉదాహరణ. ఇవి కూడా ఎక్కువగా ఇస్నాపూర్, ఆదిభట్ల, కిస్మత్పూర్, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. నగరంలో అందుబాటు గృహాల కొరత తీవ్రంగా ఉంది. చాలా మంది కొనుగోలుదారులు కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సౌకర్యాలకు సమీపంలో ఉన్న లగ్జరీ గృహాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ వంటి పశ్చిమ హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే చదరపు అడుగు ధర కనిష్టంగా రూ.10వేలుగా ఉండగా.. ఇతర ప్రాంతాలలో రూ.8 వేలుగా ఉంది. -
జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. పలువురి పరిస్థితి విషమం
ముంబై: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం అర్ధరాత్రి దాటేవరకూ ఉత్సాహంగా కొనసాగాయి. అయితే కొన్నిచోట్ల వేడుకల్లో స్వల్ప ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహారాష్ట్ర అంతటా దహీ హండీ(ఉట్టికొట్టే వేడుక) ఉత్సవాలు జరిగాయి. ముంబైలో ఈ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. VIDEO | Mumbai: Maharashtra Chief Minister Devendra Fadnavis joins Dahi Handi celebrations on the occasion of Sri Krishna Janmashtami.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Vo7noDFJ4B— Press Trust of India (@PTI_News) August 16, 2025పెరుగుతో నిండిన మట్టి కుండలను పగలగొట్టేందుకు మానవ పిరమిడ్లను ఏర్పరిచే సంప్రదాయ కార్యక్రమంలో వందలాది గోవిందులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలు విషాదకరంగా మారాయి.బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విడుదల చేసిన డేటా ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల నాటికి వేడుకల సమయంలో మొత్తం 95 గోవిందులకు గాయాలయ్యాయి. వీరిలో 19 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో చాలామందికి తక్షణ వైద్య సహాయం అందించి, తర్వాత డిశ్చార్జ్ చేశారు.VIDEO | Janmashtami 2025: 'Dahi Handi' event underway at Hindu Colony, Dadar, Mumbai.#janmashtami2025 #MumbaiNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/E68d1t1mI7— Press Trust of India (@PTI_News) August 16, 2025దహి హండి అనేది కృష్ణుని జన్మదినాన్ని గుర్తుచేసుకునేందుకు మహారాష్ట్ర అంతటా జరుపుకునే ఉత్సాహభరితమైన వేడుక ఈ సంప్రదాయ కార్యక్రమంలో గోవిందులు పేరుతో యువకులు బృందాలుగా ఏర్పడి పాల్గొంటాయి. వారంతా మానవ పిరమిడ్లుగా ఒకరిపై ఒకరు నిలుచుంటారు.VIDEO | Janmashtami 2025: 'Dahi Handi' event underway at Hindu Colony, Dadar, Mumbai.#janmashtami2025 #MumbaiNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/0dWIMc7SPn— Press Trust of India (@PTI_News) August 16, 2025మరోవైపు పెరుగు, వెన్న లేదా ఇతర పాల ఉత్పత్తులతో నిండిన మట్టి కుండ (హండి)ను తాళ్లతో ఎత్తుగా వేలాడదీస్తారు. దీనిని మానవ పిరమిడ్లుగా ఏర్పడినవారు కొల్లగొడతారు. ఈ పండుగ శ్రీకృష్ణుని చిలిపిచేష్టలను గుర్తుచేసింది. పురాణాల్లోని వివరాల ప్రకారం శ్రీకృష్ణుడు బాల్యంతో తన స్నేహితులపై నిలుచుని వెన్నతో కూడిన ఉట్టిని అందుకునేవాడు. VIDEO | #Janmashtami : BJP leader Kirit Somaiya (@KiritSomaiya) breaks 'Dahi Handi' in Bhandup, #Mumbai.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/tyUnbRMw10— Press Trust of India (@PTI_News) August 27, 2024 -
మట్టి నుంచి విద్యుత్తు!
మట్టిలోని బాక్టీరియా అనగానే మొక్కలకు పోషణ ఇచ్చే జీవులుగా మాత్రమే అనుకోకండి. ఇప్పుడు అదే బాక్టీరియా మనకు విద్యుత్తును కూడా ఇస్తోంది! పచ్చదనానికి ఆధారంగా పనిచేసే సూక్ష్మజీవులే ఇప్పుడు పవర్ జనరేటర్లుగా మారిపోయాయి. ఫిలిప్పన్స్ ఇంజినీర్లు కేవలం మట్టిలో ఉండే బాక్టీరియాతో పనిచేసే ఒక వీథి దీపాన్ని తయారు చేశారు. దీనికి ఎటువంటి విద్యుత్తు తీగలు అవసరం ఉండవు. దీపం కింద ఉండే నేలలోని ప్రత్యేకమైన బాక్టీరియా జీవక్రియలో భాగంగా విడుదల చేసే ఎలక్ట్రాన్లను ‘మైక్రోబియల్ ఫ్యూయెల్ సెల్స్’ సాంకేతికత ద్వారా విద్యుత్తుగా మారుస్తుంది. ఆ విద్యుత్తుతో ఒక బల్బును నాలుగు నుంచి ఆరు గంటలపాటు వెలిగించేలా ఏర్పాటు చేశారు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. అందుకే, ఇప్పటికీ విద్యుత్తు సదుపాయం లేని గ్రామాల్లో ఇది చాలా ఉపయోగపడే పరిష్కారంగా మారుతుంది. అయితే, ప్రస్తుతం ఈ ఆవిష్కరణ ప్రయోగ దశలోనే ఉంది. మార్కెట్లోకి పూర్తిగా తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నిజంగా వాడకంలోకి వస్తే, మీ ఇంటి పక్కనే ఉన్న మట్టి నుంచే గ్రీన్ ఎనర్జీ ఉద్భవిస్తుంది. ఓ వైపు చెట్టు పెరుగుతుంది, మరోవైపు చుక్కలా బల్బు వెలుగుతుంది! (చదవండి: స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్ ఏం చెబుతోందంటే..) -
మరో విధ్వంసకర శతకం.. బీభత్సం సృష్టించిన టీమిండియా యువ కెరటం
రెడ్ బాల్ క్రికెట్కు మాత్రమే పనికొస్తాడనుకున్న భారత అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ యశ్ ధుల్.. టీ20 ఫార్మాట్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో సెంట్రల్ ఢిల్లీకి ఆడుతున్న ధుల్.. వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు.కొద్ది రోజుల కిందట నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్పై మెరుపు సెంచరీతో (56 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు) విరుచుకుపడిన చేసిన ధుల్.. తాజాగా అదే జట్టుపై మరోసారి విధ్వంసకర శతకంతో (51 బంతుల్లో 105; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు.ధుల్ సెంచరీలతో పేట్రేగిపోయిన రెండు సందర్భాల్లో సెంట్రల్ ఢిల్లీ ఘన విజయాలు సాధించింది. తాజాగా నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ 16 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 7 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ధుల్తో పాటు యుగల్ సైనీ (28 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటాడు. నార్త్రన్ ఢిల్లీ బౌలర్లలో కెప్టెన్ హర్షిత్ రాణా, అర్జున్ రప్రియ తలో 3 వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నార్త్రన్ ఢిల్లీ అద్భుతంగా పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. 16 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు సర్తక్ రంజన్ (52), అర్నవ్ బుగ్గా (43) మెరుపు ఇన్నింగ్స్లతో గెలుపుకు గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన వారు దాన్ని కొనసాగించలేకపోయారు. మధ్యలో వైభవ్ కంద్పాల్ (34) మినహా అంతా విఫలమయ్యారు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లు తలో చేయి వేసి నార్త్రన్ ఢిల్లీ గెలుపుకు అడ్డుకున్నారు.ఆ ముద్రను చెరిపేసిన ధుల్రెడ్ బాల్ బ్యాటర్గా ముద్రపడిన ధుల్.. వరుస టీ20 సెంచరీలతో ఆ ఇమేజ్ను చెరిపేశాడు. తాజా ప్రదర్శనలతో ఆల్ ఫార్మాట్ బ్యాటర్ అనిపించుకున్నాడు. ధుల్కు అండర్-19 క్రికెట్ ఆడే రోజుల నుంచి నిదానంగా ఆడతాడన్న చెడ్డ పేరుంది. టెక్నిక్ పరంగా బలంగా ఉన్నప్పటికీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో, ముఖ్యంగా టీ20ల్లో అవేవీ లెక్కలోని రావు.అందుకే ధుల్ తన శైలిని మార్చుకొని బ్యాట్ను ఝులిపించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డీపీఎల్లో రెండు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డాడు. ధుల్కు ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గానూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతని సారథ్యంలో భారత్.. అండర్-19 జట్టు 2021 ఆసియా కప్, 2022 వరల్డ్కప్ గెలిచింది.ధుల్ రంజీ అరంగేట్రంలో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి సీనియర్ లెవెల్లో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత 2022లో అతనికి ఐపీఎల్ అవకాశం దక్కింది. ఆ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన ధుల్.. 3 ఇన్నింగ్స్ల్లో కేవలం 16 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆ సీజన్లో పేలవ ప్రదర్శన తర్వాత ధుల్ను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. తాజాగా ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ధుల్ను మరోసారి దక్కించుకునే ప్రయత్నం చేయవచ్చు. -
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ముంబై: బ్యాంకాక్–ముంబై ఇండిగో విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. శనివారం వేకువజామున ముడు గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో ఎయిర్బస్ విమానం లాండయ్యింది. ఆ సమయంలో విమానం తోకభాగం రన్వేను తాకింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం తక్కువ ఎత్తులో విమానాశ్రయం చుట్టూ ఎగురుతూ ల్యాండ్ అయ్యే సమయంలో ఘటన చోటుచేసుకుంది. అనంతరం మరో ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండైంది. ఈ నేపథ్యంలో విమానం పైలట్, కోపైలట్లను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డీజీసీఏ తెలిపింది.ఈ నేపథ్యంలో ఘటనపై ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండగా ఇండిగో ఎయిర్బస్ A321 విమానం తోక రన్వేను తాకింది. ఆ తర్వాత, విమానం మరొక సమీపానికి వెళ్లి సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రామాణిక ప్రోటోకాల్ను అనుసరించి, విమానం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించే ముందు అవసరమైన తనిఖీలు, మరమ్మతుల అనుమతి తర్వాతే వెళుతుంది. ప్రయాణికులు, సిబ్బంది, విమానాల భద్రత మా మొదటి ప్రాధాన్యత. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.IndiGo plane tail touches runway at Mumbai amid bad weather@tweets_amit with more details#indigoflight #Mumbai @suyeshasavant pic.twitter.com/nDzTY1yxFe— IndiaToday (@IndiaToday) August 16, 2025 -
భారత్-చైనా బోర్డర్ సమస్య.. ధోవల్తో కీలక చర్చలు
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రెండు రోజుల పర్యటనకు గాను సోమవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకునే విషయమై జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)అజిత్ ధోవల్తో ఆయన చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిఖ శిఖరాగ్ర భేటీలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెలాఖరులో చైనా వెళ్లనున్న సమయంలో వాంగ్ యీ చేపట్టనున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.సరిహద్దు సమస్యపై రెండు దేశాల ప్రభుత్వాలు నియమించిన ప్రత్యేక ప్రతినిధులు వాంగ్, ధోవల్లు. గతేడాది డిసెంబర్లో అజిత్ ధోవల్ చైనా వెళ్లి వాంగ్తో చర్చలు జరిపారు. ఈ దఫా అజిత్ ధోవల్ ఆహ్వానం మేరకు వాంగ్ యీ భారత్కు వస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రధానంగా సరిహద్దు సమస్యపైనే వీరు చర్చలు సాగనున్నాయి. రెండు రోజుల పర్యటన సమయంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కూడా వాంగ్ యీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఎస్సీవో శిఖరాగ్రం చైనాలోని టియాంజిన్లో ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగనున్నాయి. చైనా ప్రస్తుత ఎస్సీవో అధ్యక్ష బాధ్యతల్లో ఉంది.ప్రధాని మోదీ ఈ నెల 29వ తేదీన జపాన్లో పర్యటించనున్నారు. అట్నుంచి చైనాలోని టియాంజిన్కు వెళ్తారు. 2020 మేలో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు దేశాల సైనికుల నడుమ తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నప్పటి నుంచి సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు దేశాలు వేలాదిగా సైనికులను సరిహద్దులకు అత్యంత సమీపంలో మోహరించడం, అనంతరం కొన్ని పాయింట్లలో ఉపసంహరించుకోవడం తెల్సిందే. మిగతా ఘర్షణాత్మక ప్రాంతాల్లో సైన్యం ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపుపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. -
వ్యోమగామి శుభాంశు శుక్లాకు ఢిల్లీలో ఘన స్వాగతం
న్యూఢిల్లీ: అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడు, ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఘనంగా స్వాగతించారు. #WATCH | Delhi: Group Captain Shubhanshu Shukla arrives back in India. He is welcomed by Union MoS for Science & Technology, Dr Jitendra Singh and Delhi CM Rekha Gupta.He was the pilot of NASA's Axiom-4 Space Mission, which took off from NASA's Kennedy Space Centre in Florida,… pic.twitter.com/FTpP1NaY0O— ANI (@ANI) August 16, 2025ఆక్సియం-4 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ)విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వ్యోమగామి శుభాన్షు శుక్లా భారత్ చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా ప్లాట్ ఫారం‘ఎక్స్’లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. శుక్లా సాధించిన విజయాన్ని ప్రశంసించారు. దేశమంతా అతని విజయానికి గర్విస్తున్నదన్నారు. భారత్ చేరుకున్న శుక్లా ముందుగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు. అనంతరం, యూపీలోని సొంతూరు లక్నోకు బయలుదేరి వెళతారు. ఆ తర్వాత అక్టోబర్లో మొదలయ్యే గగన్యాన్ మిషన్ శిక్షణలో పాల్గొంటారు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం–4 మిషన్లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. జూన్ 26వ తేదీ నుంచి ఐఎస్ఎస్లో పలు ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి జూలై 15న భూమిపైకి చేరుకున్నారు. శనివారం శుభాంశు విమానంలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు.‘నేను స్వదేశానికి చేరుకునేందుకు విమానంలో కూర్చు న్నప్పుడు, మిశ్రమ భావోద్వేగాలు కలిగాయి. గత ఏడాదికాలంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుగా ఉన్న అద్భుతమైన వ్యక్తులను విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు ఓ వైపు బాధ, మిషన్ తర్వాత మొదటిసారిగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, దేశంలోని ప్రతి ఒక్కరినీ కలవబోతున్నందుకు మరో వైపు ఉత్సాహం ఉన్నాయి. జీవితం అంటే ఇదేనేమో అని అనుకుంటున్నాను’అని శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం హూస్టన్లోని భారత కాన్సులేట్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో శుక్లాతోపాటు వ్యోమగామిగా ఎంపికైన ప్రశాంత్ నాయర్ కూడా పాల్గొన్నారు. #WATCH | Delhi: Group Captain Shubhanshu Shukla arrives back in India. He is welcomed by Union MoS for Science & Technology, Dr Jitendra Singh and Delhi CM Rekha Gupta.He was the pilot of NASA's Axiom-4 Space Mission, which took off from NASA's Kennedy Space Centre in Florida,… pic.twitter.com/FTpP1NaY0O— ANI (@ANI) August 16, 2025 -
బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్
తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకొని స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న నటి కీర్తిసురేష్( Keerthy Suresh). మలయాళంలో బాల తారగా కెరీర్ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత కథానాయకిగా అవతారమెత్తి మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రలో జీవించి జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. అదేవిధంగా తక్కువ కాలంలోనే ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే తన బాల్య స్నేహితుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈమె చేతిలో రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు ఉన్నాయి. అయితే వివాహానంతరం కీర్తిసురేష్ కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు. అయినా ఖాళీగా లేరు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. కాగా వివాహానంతరం ఈ అమ్మడు కాస్త బరువెక్కారనే కామెంట్స్ను ఎదుర్కొన్నారు. అలాంటి కామెంట్స్పై స్పందించిన కీర్తిసురేష్ పెళ్లి తర్వాత బరువు పెరిగిన విషయం నిజమేనన్నారు.. అయితే బరువు తగ్గడానికి కార్డియో కసరత్తులు చేసి స్లిమ్గా మారడానికి పోరాడానన్నారు. వారానికి 300 నిమిషాలు ప్రకారం ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు 9 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. తీవ్ర ప్రయత్నం, ఆహారపు కట్టుబాట్లు కలిస్తే ఫలితం సాధ్యమేనని కీర్తి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నూతన చిత్రాలకు సంబంధించిన కథలు వింటున్నానని, త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని ఆమె తెలిపారు. -
నేడు ఢిల్లీలో ప్రధాని మోదీ..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రవాణా సౌకర్యాలకు కొత్త ఊపిరి పోసే రెండు కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని రోహిణిలో రూ.11 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. అనుసంధానత మెరుగు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ భారాన్ని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగంగా ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్–2 (యూఈఆర్–2) ప్రాజెక్టులను చేపట్టారు. ప్రపంచ స్థాయి రవాణా సదుపాయాలు, మలీ్ట–మోడల్ కనెక్టివిటీ కలి్పంచడమే వీటి ప్రధాన ఉద్దేశం. ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై దాదాపు రూ.5,360 కోట్లతో 10.1 కిలోమీటర్ల ఢిల్లీ భాగం అభివృద్ధి చేశారు. ప్యాకేజీ–1 కింద శివమూర్తి కూడలి నుంచి ద్వారకా సెక్టార్–21 ఆర్యూబీ వరకు (5.9 కి.మీ), ప్యాకేజీ–2 కింద ద్వారకా సెక్టార్–21 ఆర్యూబీ నుంచి ఢిల్లీ–హరియాణా సరిహద్దు వరకు (4.2 కి.మీ) నిర్మాణం చేశారు. ఇది యశోభూమి, డీఎంఆర్సీ బ్లూ, ఆరెంజ్ లైన్లు, కొత్తగా వచ్చే బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా బస్ డిపోలతో నేరుగా అనుసంధానమవుతుంది. గత సంవత్సరం మార్చిలో హరియాణా విభాగంలోని 19 కి.మీ భాగాన్ని మోదీ ప్రారంభించారు. యూఈఆర్–2 ప్రాజెక్టు రూ.5,580 కోట్లతో యూఈఆర్–2లోని అలీపూర్–డిచాన్ కలాన్ రహదారితో పాటు, బహదూర్గఢ్, సోనిపట్లకు కొత్త లింక్ రోడ్లు కూడా ప్రజల వినియోగానికి అందించనున్నారు. ఇవి ఢిల్లీ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ముకర్బా చౌక్, ధౌలా కువాన్, ఎన్హెచ్–09 వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి. అంతేగాక పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని పెంచడంతో పాటు ఎన్సీఆర్లో రవాణా వేగవంతం అవుతుంది. ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా రోహిణిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. -
ఇంకా చిక్కని 82 మంది ఆచూకీ
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని కిష్తవాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల విధ్వంసానికి గురైన చోసితీ గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సంభవించిన ఆకస్మిక వర్షాలు, వరదల ధాటికి ముగ్గురు సీఐఎస్ఎఫ్ జవాన్లు, ఒక స్పెషల్ పోలీసు ఆఫీసర్ సహా 60 మంది దుర్మరణం పాలయ్యారు. 167 మందిని అధికారులు రక్షించారు. మరో 82 మంది జాడ గల్లంతయ్యింది. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన భారీ బండరాళ్లను పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఉదయం చిసోతీని సందర్శించారు. బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి పరిహారం అందజేస్తామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున ఇస్తామన్నారు. ధ్వంసమైన ఇళ్లకు సైతం పరిహారం ప్రకటించారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన గ్రామస్థులను ఒమర్ అబ్దుల్లా ఓదార్చారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ శుక్రవారం అర్ధరాత్రి చోసితీ గ్రామానికి చేరుకున్నారు. సహాయక చర్యలను సమీక్షించారు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జితేంద్ర సింగ్ పరామర్శించారు. సహాయ పునరావాస చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు ఇప్పటిదాకా 50 మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. క్లౌడ్ బరస్ట్లో కనీసం 16 నివాస గృహాలతోపాటు పలు ప్రభుత్వ భవనాలు, మూడు ఆలయాలు, 30 మీటర్ల వంతెన ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలో వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు మచైల్ మాత యాత్రను వరుసగా మూడోరోజు శనివారం సైతం రద్దు చేశారు. -
పోలవరం కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తు ఎన్డీయే ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చి మరీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ‘కూలేశ్వరం’అని కారుకూతలు కూసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు పోలవరంను.. ‘కూలవరం’అనే ధైర్యం ఉందా? అని శనివారం ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్డీఎస్ఏను దించి బీఆర్ఎస్పై బీజేపీ నేతలు బురదజల్లారు. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయినా పోలవరం కాఫర్ డ్యామ్పై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?’అని నిలదీశారు. ‘ఏపీలో ఏకంగా పది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్కు గుట్టుచప్పుడు కాకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బరాజ్ వద్ద మరమ్మతులు లేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే. 2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఉలుకూ, పలుకూ లేదు. తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్డీఎస్ఏ అడ్రస్ లేదు. పంజాబ్నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్ర రైతును తీర్చిదిద్దిన కేసీఆర్పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుమీద కాంగ్రెస్, బీజేపీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
టీ ఒక్కటి వెయ్యి రూపాయలా..?
దుబాయ్: భారత్లో ఒక్క టీ ఖరీదు వెయ్యి రూపాయలుందంటూ వ్లాగర్ పరీక్షిత్ బలోచ్ ఆశ్చర్యంతో చేసిన పోస్ట్కు భారీగా స్పందన లభిస్తోంది. దుబాయ్లో ఉంటున్న భారతీయ ట్రావెల్ వ్లాగర్, రేడియో ప్రజెంటేటర్ ఇటీవల ముంబైలో తనకు కలిగిన అనుభవాన్ని ఇన్స్టాలో పంచుకున్నారు. ‘ముంబైలోని ఓ హోటల్లో ఒక కప్పు టీ తాగితే నాకు వెయ్యి రూపాయల బిల్లయింది. అది చూసి షాకయ్యా. సాధారణమైన అవసరాలు సైతం ఇంత ఖరీదుగా మారడం చూసి నమ్మలేకపోయా. దుబాయ్లో ఉంటూ దిర్హామ్లలో సంపాదన కలిగిన నేను భారత్లో ఉండగా ఎన్నడూ పేదవానిగా భావించలేదు. కానీ, టీ బిల్లు చూసి మునుపటిలా కాకుండా, భారత్లో సైతం పరిస్థితులు మారాయని అనిపించింది’అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. దీనికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. భారత్లో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. పలువురు ఇలాంటి అనుభవాల్నే పంచుకున్నారు. ముంబైలాంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ‘నేను ఏటా ముంబై వెళ్తుంటా. కొన్నిటికైతే దుబాయ్ కంటే ముంబైలోనే ఖరీదెక్కువ’అని ఒకరంటే, ‘చివరికి ఏవరో ఒకరు ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. భారత్కు వచ్చాక పేదవానిగా మారింది నేను ఒక్కడినే అని ఇప్పటిదాకా అనుకునేవాణ్ని’అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఇండియా వెళ్లిన ప్రతిసారీ నాకు ఇదే అనుభవం ఎదురవుతోంది. డాలర్లలో సంపాదన కలిగిన నేనే ఇంతగా ఇబ్బంది పడితే, స్థానికంగా ఉండే వారు ఎలా బతుకుతున్నారో ఏమో? ఇంత డబ్బు వారికి ఎలా వస్తుంది? నాకీ విషయం తెలిస్తే, ఇండియాను వదిలేసే వాణ్నే కాదు’అంటూ ఇంకొకరు ముక్తాయింపునిచ్చారు. -
హృద్యంగా.. సరికొత్తగా..
సాక్షి, హైదరాబాద్: వారంతా సరికొత్త హృదయాలతో కొంగొత్త జీవనం గడుపుతున్నారు.. కానీ ఆ పునర్జన్మ పొందేందుకు పడిన కష్టనష్టాలు, వ్యయప్రయాసలు తమ లాంటి వైద్య పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి రాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే గుండె మార్పిడి శస్త్రచికిత్సల కోసం నిరీక్షిస్తున్న రోగుల కోసం నిరంతరం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ల సంబంధ సమాచారం అందించేందుకు వీలుగా హారి్టయెస్ట్ పీపుల్ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గుండె మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న 240 మంది వ్యక్తులు, వారి కుటుంబీకులు కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు. గుండె మార్పిడికి ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను ఎప్పటికప్పుడు గ్రూప్లో షేర్ చేస్తూ రోగులు, వారి కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. కీలక సమయంలో సహాయం.. గ్రూప్ వ్యవస్థాపక సభ్యురాలు, గ్రూప్ అడ్మిన్లలో ఒకరైన ముంబైకి చెందిన ఆర్మైటీ హోమి ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల క్రితం గుండె మార్పిడి ఆపరేషన్ కోసం తన కుమార్తెను ఎయిర్ అంబులెన్స్లో చెన్నైకి తరలించే క్రమంలో ఎదురైన సమస్యలు, సవాళ్లు ఇతర రోగులకు ఎదురవకుండా చూసేందుకే వాట్సాప్ గ్రూప్కు శ్రీకారం చుట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ‘చాలా మంది గుండె, ఇతర అవయవాల మార్పిడి కోసం చిన్న పట్టణాల నుంచి ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కీలక సమయంలోనే మా గ్రూప్ సభ్యులు అవసరమైన సహాయం చేస్తారు’అని హోమి వివరించారు. ఐఐటీ బాంబే మాజీ ప్రొఫెసర్, ఏడేళ్ల క్రితం గుండె మార్పిడి చేయించుకున్న డా. వినీ కిర్పాల్ సైతం ఈ గ్రూప్లో చేరారు.తనకు ఎదురైన అనుభవాల సారంతో ఇప్పటికే ‘న్యూ లైఫ్ న్యూ బిగినింగ్స్’పుస్తకం ద్వారా అవయవ గ్రహీతలు, దాతలు, అవయవ మార్పిడి వైద్యుల విశ్లేషణలు, అభిప్రాయాలను వినీ కిర్పాల్ వెలుగులోకి తీసుకొచ్చారు. మరో గ్రూప్ సభ్యురాలు, కిడ్నీ గ్రహీత జయ జైరామ్.. 28 ఏళ్లకుపైగా అవయవదాన రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న మోహన్ ఫౌండేషన్ (మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్వర్క్) ముంబై విభాగానికి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. బ్రెయిన్ డెడ్కు గురయ్యే రోగుల కుటుంబాలను అవయవదానానికి ప్రోత్సహించడంపై ఆమె దృష్టిపెట్టారు. -
రూ. 30,000 కోట్లతో బ్రిజ్ క్షేత్ర అభివృద్ధి
మథుర: ఉత్తరప్రదేశ్లో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. యూపీలోని బ్రిజ్ ప్రాంతంలో ద్వాపర యుగంతో సంబంధం ఉన్న మథుర, బృందావన్, బర్సానా, గోకుల్(బ్రిజ్ క్షేత్ర)ను రూ.30,000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు. ఈ నాలుగు దివ్య క్షేత్రాలను అనుసంధానించబోతున్నట్లు తెలిపారు. పురాణాల ప్రకారం శనివారం శ్రీకృష్ణుడి 5,252వ జన్మదినం. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మథుర పట్టణంలో పలువురు యోగులు, గురువులను సన్మానించారు. మథుర–బృందావన్లో రూ.646 కోట్ల విలువైన 118 అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం అసాధ్యమని పదేళ్ల క్రితం అన్నారని, ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందని చెప్పారు. -
‘ఖజానా’ దోచింది బిహార్ గ్యాంగే!
చందానగర్: సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో బిహార్కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్ ఈమేరకు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న చందానగర్లోని ఖజానా షోరూంలో ఆరుగురు దొంగలు ముసుగులు ధరించి దొరికినకాడికి వెండి వస్తువులను అపహరించారు. దీన్ని చాలెంజ్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి 48 గంటల్లోనే ఇద్దరిని పట్టుకున్నారు. వీరి టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే...బిహార్కు చెందిన ఆశిష్ (22)తోపాటు మరో ఐదుమంది జీడిమెట్లలోని ఆస్టెస్టస్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకొని కూలి పనులు చేసుకుంటున్నారు. వీరిని బిహార్లోని శరణ్, శివాణ్ జిల్లాలకు చెందిన వారీగా గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆశిష్ స్నేహితుడు దీపక్ కుమార్ (22) వీరికి కావలసిన సౌకర్యాలు చూసుకుంటున్నాడు. వీరు ఏ1 మోటార్స్ వద్ద రెండు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేశారు. కొద్దిరోజుల నుంచి ఆరుగురు మూడు జ్యువెలరీ దుకాణాలపై రెక్కీ నిర్వహించారు. అయితే ఖజానా జ్యువెలరీ వద్ద భద్రత తక్కువ ఉండటంతో దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.బిహార్లోని శరణ్ జిల్లాకు చెందిన ఆశిష్ గ్యాంగ్ టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే. ఒకసారి ఒక నగరంలో దొంగతనం చేస్తే మళ్లీ ఆ నగరానికి రాకపోవడం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకు బిహార్, రాజస్తాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో దొంగతనాలు చేశారు. ఈ గ్యాంగ్ తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ చేయడం ఇదే మొదటిసారి. వీరు దోచుకున్న ఆభరణాలను బిహార్, ఢిల్లీలో విక్రయిస్తుంటారు. వేర్వేరు రాష్ట్రాల్లో గ్యాంగ్ ముఖ్యనాయకుడిపై రెండు హత్య కేసులు సహా మొత్తం 10 కేసులుండగా, ఆశిష్పై 4 కేసులున్నాయి.దొంగ చిక్కాడు ఇలా....ఖజానాలో చోరీ అనంతరం ఆరుగురు నిందితులు రెండు బైకులపై బీదర్ వైపు వెళ్లారు. ప్రధాన రోడ్లపై కాకుండా గ్రామాల వైపు నుంచి రాష్ట్రాన్ని దాటారు. బైకులను రాష్ట్ర సరిహద్దు వద్ద వదిలేసి ప్రజా రవాణాలో వెళ్లారు. పోలీసు లు చాకచక్యంగా వ్యవహరించి నిందితులు వాడిన సెల్ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించి బీదర్ నుంచి వారిని వెంబడించారు. వారు బీదర్ వద్ద త్రుటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు.దీంతో రెండు పోలీసు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లాయి. ఈ క్రమంలో పుణేలో ఆశిష్ను పట్టుకున్నారు. తర్వాత వీరికి సహకరించిన దీపక్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మిగతా వారందరినీ పట్టుకుంటామని డీసీపీ వినీత్ తెలిపారు. ‘జ్యువెలరీ షోరూంల నిర్వాహకులు దుకాణంలో చొరబాటు హెచ్చరిక అలారమ్ను బిగించుకోవాలి. ఆ అలారమ్ స్థానిక పోలీస్ స్టేషన్కు అనుసంధానమై ఉండాలి’ అని చెప్పారు. -
రేపే ట్రంప్, జెలెన్స్కీ భేటీ
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సోమవారం వాషింగ్టన్లో భేటీ కాబోతున్నానని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వెల్లడించారు. శనివారం ఉదయమే ట్రంప్తో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. చాలాసేపు సంభాషణ జరిగిందని పేర్కొన్నారు. వ్యక్తిగత భేటీ కోసం సోమవారం వాషింగ్టన్కు రావాలంటూ ఆహా్వనించినందుకు ట్రంప్కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని, సాధారణ ప్రజల మరణాలకు ముగింపు పలికే దిశగా ట్రంప్తో సమగ్రంగా చర్చించబోతున్నానని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఉక్రెయిన్–రష్యా సంఘర్షణకు తెరతించడానికి యూరప్ దేశాలు చురుకైన పాత్ర పోషించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికాతోపాటు యూరప్ దేశాల అధినేతల నుంచి ఉక్రెయిన్ భద్రతకు హామీ కోరుతున్నామని ఉద్ఘాటించారు. తమకు విశ్వసనీయమైన సెక్యూరిటీ గ్యారంటీ కావాలన్నారు. -
ఖమ్మం జిల్లాలో నీలి పుట్టగొడుగులు
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లాలోని పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన నీలి పుట్టగొడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వీటిని ‘బ్లూ పిన్కిగిల్ మశ్రూమ్ ఎంటొలోమా హోచెస్టెటెరి’జాతికి చెందిన పుట్టగొడుగులుగా నిర్ధారించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ విభాగంలో ఈ జాతి పుట్టగొడుగును గుర్తించగా, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కనిపించాయి. ఈ నీలిరంగు పుట్టగొడుగులకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఆకర్షణీయంగా ఆకాశ నీలిరంగులో ఉంటుంది. దీంతో దీన్ని స్కై బ్లూ మశ్రూమ్ అని అంటారు.న్యూజిలాండ్కు చెందిన ఈ జాతి మనదేశంలో అరుదుగా కనిపిస్తోంది. ఎంటొలోమా జాతికి చెందిన ఈ పుట్టగొడుగులు విషపూరితమని అటవీ అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటిని ఆహారంగా వినియోగించవచ్చా.. లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, పులిగుండాల అటవీ ప్రాంతంలో ఈ పుట్ట గొడుగు కనిపించడంతో ఖమ్మం అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ప్రత్యేకతను సంతరించుకుంది.అధ్యయనానికి చర్యలుఖమ్మం అడవుల్లో అరుదైన పుట్టగొడుగు జాతి దర్శనమిచ్చింది. ఇది ఇక్కడి పర్యావ రణ ప్రాధాన్యతను మరింతగా బలపరు స్తోంది. జీవవైవిధ్యం రక్షణలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. అయితే, ప్రజలు అడ వుల్లో తెలియని పుట్టగొడుగులను తాకొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి విషపూరితమై ఉండొచ్చు. అందువల్ల ఈ జాతిపై మరింతగా అధ్యయనం చేయనున్నాం. –సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఖమ్మం జిల్లా అటవీ అధికారి -
నేడు స్వదేశానికి శుభాంశు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో గడిపి చరిత్ర సృష్టించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆదివారం అమెరికా నుంచి స్వదేశానికి రానున్నారు. యాగ్జియం–4 మిషన్ కోసం అమెరికాలో గత ఏడాదిగా శిక్షణ పొందిన శుక్లా ముందుగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు. అనంతరం, యూపీలోని సొంతూరు లక్నోకు బయలుదేరి వెళతారు. ఆ తర్వాత అక్టోబర్లో మొదలయ్యే గగన్యాన్ మిషన్ శిక్షణలో పాల్గొంటారు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం–4 మిషన్లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. జూన్ 26వ తేదీ నుంచి ఐఎస్ఎస్లో పలు ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి జూలై 15న భూమిపైకి చేరుకున్నారు. శనివారం శుభాంశు విమానంలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నేను స్వదేశానికి చేరుకునేందుకు విమానంలో కూర్చు న్నప్పుడు, మిశ్రమ భావోద్వేగాలు కలిగాయి. గత ఏడాదికాలంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుగా ఉన్న అద్భుతమైన వ్యక్తులను విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు ఓ వైపు బాధ, మిషన్ తర్వాత మొదటిసారిగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, దేశంలోని ప్రతి ఒక్కరినీ కలవబోతున్నందుకు మరో వైపు ఉత్సాహం ఉన్నాయి. జీవితం అంటే ఇదేనేమో అని అనుకుంటున్నాను’అని శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం హూస్టన్లోని భారత కాన్సులేట్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో శుక్లాతోపాటు వ్యోమగామిగా ఎంపికైన ప్రశాంత్ నాయర్ కూడా పాల్గొన్నారు. -
రూ.12 కోట్ల విలువైన బంగారందోపిడీ కేసులో దొంగ అరెస్ట్
హిందూపురం/చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట ఎస్బీఐ బ్రాంచ్లో గత నెల 27వ తేదీన జరిగిన భారీ దోపిడీ కేసులో అనిల్కుమార్ పన్వార్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు హరియాణలో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హిందూçపురం డీఎస్పీ కేవీ మహేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ అనంతరం పన్వార్ను కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. పన్వార్పై 16 కేసులు ఉన్నట్లు సమాచారం. బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ గ్రిల్ను గ్యాస్ కట్టర్తో తొలగించి లోపలికి చొరబడిన దొంగలు ఐరన్ లాకర్ డోర్ను గ్యాస్కట్టర్తో కత్తిరించి.. అందులోని సుమారు రూ.12 కోట్ల విలువైన 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన ప్రత్యేక పోలీసు బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటించి, పాత నేరస్తులను విచారించి, అత్యాధునిక సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించాయి. చోరీకి గురైన సొత్తు ఆచూకీ ఇంకా తెలియరాలేదని, కోర్టు అనుమతితో పన్వార్ను కస్టడీకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని డీఎస్పీ తెలిపారు. -
నా దేశం.. శత్రుదుర్భేద్యం!
శ్రీకృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం స్ఫూర్తితో.. దేశానికి భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించారు. దీంతో ప్రపంచదేశాల దృష్టి ఒక్కసారిగా మనపై పడింది. నిజమే.. రక్షణ రంగంలో ఇప్పుడున్నది ఒకప్పటి భారత్ కాదు. గత పదేళ్లలోనే రక్షణ రంగంలో ఉత్పత్తుల విలువ పెరగడం.. దిగుబడులు తగ్గడమే ఇందుకు నిదర్శనం. అప్పట్లో మన ఆయుధాల్లో 65 శాతం దిగుమతులే. అది ఇప్పుడు 35 శాతానికి పరిమితం చేయగలిగాం. ‘మేడిన్ ఇండియా’ ఆయుధాలతో మన సత్తా ఏంటో ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రపంచానికి చాటాం. – సాక్షి, స్పెషల్ డెస్క్త్వరలో దేశానికి సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ రానుంది. ఇందులో భాగంగా దేశంలోని కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని ఏర్పాటు చేయనున్నారట. అంతేకాదు, ప్రతిదాడి వ్యవస్థను కూడా రూపొందిస్తారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటి వాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్డోమ్ తరహాలో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్షణ ఉత్పత్తుల్లో మన దేశం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందనడానికి ప్ర‘బల’ నిదర్శనం. ఉత్పత్తుల్లో రికార్డు2013–14లో దేశ రక్షణ రంగ బడ్జెట్ రూ.2.53 లక్షల కోట్లు. 2025–26లో అది 2.6 రెట్లు పెరిగి రూ.6.81 లక్షల కోట్లకు చేరింది. 2024–25లో మనదేశం రికార్డు స్థాయిలో రూ.2.09 లక్షల కోట్ల విలువైన 193 డిఫెన్స్ కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇందులో రూ. 1.69 లక్షల కోట్ల విలువైన 177 కాంట్రాక్టులు దేశీయ సంస్థలవే కావడం గమనార్హం. 2014–15లో దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.46,429 కోట్లు. 2024–25లో ఇది రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షల కోట్లకు చేరిందని ఇటీవల కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అంటే మూడు రెట్లకుపైగా పెరిగింది! 2019–20లో ఇది కేవలం రూ.79,071 కోట్లే. అంటే 5 ఏళ్లలోనే దాదాపు రెట్టింపయిందన్నమాట. ఎగుమతుల జోరు» 2013–14లో రూ.686 కోట్లుగా ఉన్న మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు.. 2024–25 నాటికి ఏకంగా 34 రెట్లు పెరిగి రూ.23,622 కోట్లకు చేరాయి. ఈ ఎగుమతుల్లో రక్షణ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల వాటా 77 శాతం కాగా.. ప్రైవేటు రంగ వాటా 23 శాతం కావడం విశేషం. వీలైనంత త్వరలో రక్షణ పరికరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. మనదేశ రక్షణ ఉత్పత్తులు అమెరికా, ఫ్రాన్స్ వంటి 100 దేశాలకు వెళ్తున్నాయి. అమెరికా వాటా 10% లోపే!గత దశాబ్దకాలంలో మనదేశ రక్షణ దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. మనకు ప్రధాన ఎగుమతిదారులు రష్యా, ఫ్రాన్స్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) గణాంకాల ప్రకారం.. » మన మొత్తం దిగుమతుల్లో సుమారు 40 శాతం రష్యా నుంచే వస్తున్నాయి. » 2020లో ఫ్రాన్స్ నుంచి దిగుమతులు 25 శాతానికిపైగా ఉంటే.. 2021లో ఏకంగా 50 శాతానికి పెరిగాయి. ఆతరవాత తగ్గుతూ 2024లో సుమారు 15 శాతానికి పరిమితమయ్యాయి.» మొత్తం దిగుమతుల్లో ఇజ్రాయెల్ నుంచి 2022 వరకు 10 శాతంగానే ఉన్న వాటా.. 2023లో ఒక్కసారిగా 40 శాతానికి చేరింది. 2024లో అది సుమారు 28 శాతానికి చేరింది. » 2020 నుంచి చూస్తే అమెరికా వాటా ఎప్పుడూ 20 శాతం కూడా దాటలేదు. ప్రస్తుతం 10 శాతంలోపే ఉంది.ఆ మూడు దేశాలే..మనదేశానికి యుద్ధ విమానాల సరఫరాలో ఫ్రాన్స్ కీలకపాత్ర పోషిస్తోంది. 2020–25 మధ్య రికార్డు స్థాయిలో 2,543 సరఫరా చేయగా, రష్యా నుంచి 1,280 దిగుమతి చేసుకున్నాం. ఇక మిసైళ్ల విషయానికొస్తే రష్యా నుంచి 1,149, ఇజ్రాయెల్ నుంచి 802 వచ్చాయి. శత్రువుల దాడులను తట్టుకోగలిగే దుర్భేద్యమైన రక్షణ వాహనాలు రష్యా నుంచి మాత్రమే 963 వచ్చాయి. గగన తల భద్రతా వ్యవస్థలు రష్యా నుంచి 390, ఇజ్రాయెల్ నుంచి 376 వచ్చాయి. ఫ్రాన్స్ నుంచి 899, రష్యా నుంచి 304 షిప్స్ దిగుమతి చేసుకున్నాం. ఏయే ఆయుధాల కోసం ప్రధానంగా ఏయే దేశాలపై ఆధారపడుతున్నామంటే..విమానాలు: ఫ్రాన్స్, రష్యా, అమెరికాగగనతల రక్షణ వ్యవస్థలు: రష్యా, ఇజ్రాయెల్దుర్భేద్యమైన రక్షణ వాహనాలు: రష్యామిసైళ్లు: రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్సెన్సర్లు: ఇజ్రాయెల్, జర్మనీ, ఫ్రాన్స్షిప్స్ : ఫ్రాన్స్, రష్యా -
‘ఆన్లైన్’లో గ్రామాలు గ్రేట్!
సాక్షి, అమరావతి: ఇప్పుడంతా ఆన్లైన్ ఆర్డర్ల యుగం..! దుస్తుల నుంచి సెల్ఫోన్ల వరకు.. పుస్తకాల నుంచి వంటింట్లో వస్తువుల దాక.. అన్నిటికీ ఆన్లైన్. అయితే, ఇందులో పల్లెలు, పట్టణాలకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అటు దేశవ్యాప్తంగానూ... ఇటు మన రాష్ట్రంలోనూ... పట్టణవాసుల కంటే గ్రామీణ ప్రజలు ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇంటికి చేర్చే (హోం డెలివరీ) సేవలు అందుబాటులో ఉండడంతో పట్టణ ప్రజలు ఆహార వస్తువులను ఎక్కువగా ఆర్డర్ పెడుతున్నారు. జాతీయ స్థాయితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆన్లైన్ కొనుగోళ్లపై సమగ్ర మాడ్యులర్ సర్వే: టెలికాం–2025 ఈ వివరాలు వెల్లడించింది. దీనిప్రకారం..⇒ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో కొంటున్న కుటుంబాలు: 75.7 శాతం. ఏపీలో 75.2 శాతం. ⇒ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆహార వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్న కుటుంబాలు 4.3 శాతం. ఏపీలో 3.2 శాతం. ⇒ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం కుటుంబాలు ఆహార, ఆహారేతర వస్తువులనూ ఆన్లైన్లో కొంటున్నాయి. ఏపీలో వీరి శాతం 21.6. ⇒ దేశంలో పట్టణాల్లో 10 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్లైన్లో ఖరీదు చేస్తుండగా.. ఏపీలో 18.7 శాతం కుటుంబాలు ఇదే పద్ధతిని ఎంచుకుంటున్నాయి. ⇒ దేశంలో పట్టణాల్లో 37.6 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువుల కోసం ఆన్లైన్ను ఆశ్రయిస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో ఈ శాతం 36.1. ⇒ దేశంలో పట్టణాల్లో 52.4 శాతం కుటుంబాలు ఆహారం, ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో కొంటుండగా, రాష్ట్రంలో ఈ శాతం 45.3. ⇒ దేశంలో మొత్తం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి 7.6 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తుండగా, 53.3 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువులను మాత్రమే ఆన్లైన్లో ఖరీదు చేస్తున్నాయి. ⇒ దేశంలో 39 శాతం కుటుంబాలు ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తున్నాయి. ⇒ ఏపీలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 11.7 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్లైన్లో కొంటుండగా... 53.7 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువులను మాత్రమే ఆర్డర్ పెడుతున్నాయి. 34.6 శాతం కుటుంబాలు ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులను కూడా ఆన్లైన్ ద్వారానే తీసుకుంటున్నారు. -
రక్తపోటును పెంచేస్తున్న సూరీడు!
వాషింగ్టన్: ఎండ తగిలితే ఒళ్లు వేడెక్కుతుంది. రాత్రిళ్లు ఒళ్లు చల్లబడుతుంది. కానీ రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడైనా సరే మన రక్తపోటును సూరీడు ప్రభావితం చేస్తాడనే కొత్త విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆరు సంవత్సరాలపాటు చైనాలోని క్వింగ్డావో, వేహాయ్ నగరాల్లోని 5,00,000 మంది ప్రజల రక్తపోటు స్థాయిలను పర్యవేక్షించి శాస్త్రవేత్తలు ఈ కొత్త విషయాన్ని కనుగొన్నారు. సౌరతుపాన్ల కారణంగా భూమి మీదకు దూసుకొచ్చే ఉష్ణగాలులు మన భూ అయాస్కాంతావరణాన్ని ప్రభావితంచేసి చివరకు మన బీపీని పెంచేస్తాయని స్పష్టమైంది. సౌరతుపాన్ల కారణంగా భూ అయాస్కాంతావరణంలో సంభవించే మార్పులు మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపతాయనే దానిపై అధ్యయనం సాగింది. ముఖ్యంగా మహిళల బీపీని సౌరతుపాను ప్రభావితం చేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఈ సౌరతుపాను దృగి్వషయం మన బీపీని ప్రమాదకరస్థాయిలో పెంచేస్తుందా? దీని ఇతర దుష్ప్రభావాలు ఏంటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సౌర గాలులకు మానవ ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందని తెల్చే ఈ పరిశోధనా తాలూకు వివరాలు తాజాగా కమ్యూనికేషన్స్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా మధ్యస్థాయి అయస్కాంతావరణం ఉండే చైనాలోని రెండు నగరాలను ఎంచుకున్నారు. అక్కడి 5లక్షలకుపైగా ప్రజల రక్తపోటు స్థాయిల రికార్డ్లను సౌరతుపాన్ల కాలంతో పోల్చిచూశారు. భూ అయస్కాంతావరణం(జీఎంఏ)లో మార్పులకు తగ్గట్లు అక్కడి ప్రజల బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా మహిళల బీపీ అనేది జీఎంఏకు అనుగుణంగా స్పందిస్తున్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతున్న వారికి సౌరశక్తి అనేది ప్రతికూలకంగా మారుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు మరింత సమర్థవంతంగా తీసుకునేందుకు ఇలాంటి పరిశోధనలు దోహదపడతాయిన వారు చెప్పారు. సౌరతుపాన్లు ఇప్పటికే ఉపగ్రహాలు, కమ్యూనికేషన వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లపై పెను ప్రభావం చూపుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడీ జాబితాలోకి మానవ ఆరోగ్యం వచ్చిచేరింది. భూగోళం మీది వాతావరణంతోపాటు అంతరిక్ష అంశాలు సైతం మనిíÙపై ప్రభావం చూపుస్తాయని తాజా అధ్యయనం చాటుతోంది. -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు. సోదరులు, సోదరీలతో విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు అనుకూలించినా లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఎరుపు, తెలుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.వృషభం...వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఆసక్తికర సమాచారం తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.మిథునం....ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రాగలవు. సోదరులు, సోదరీలతో వివాదాలు పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రత్యర్థులు కూడా మీకు వెన్నంటి నిలుస్తారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త విధులు పొందే వీలుంది. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేతనీలం రంగులు. గణేశాష్టకం పఠించండికర్కాటకం...చేపట్టిన వ్యవహారాలు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వివాదాలు. మానసిక అశాంతి. తెలుపు, పసుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి.సింహం....కొత్త పనులు విజయవంతంగా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సుదీర్ఘ విరామం అనంతరం బంధువులను కలుసుకుంటారు. మీ ఆలోచనలు మిత్రులను ఆకట్టుకుంటాయి. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని సమస్యలు, వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం చివరిలో అనుకోని ఖర్చులు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.కన్య....మిత్రులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాభావంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. సాంకేతిక వర్గాలు, రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు అందవచ్చు. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.తుల....ఏ పని ప్రారంభించినా వెనుదిరగక పూర్తి చేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. కొన్ని వస్తువులు తిరిగి దక్కించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి.M ఉద్యోగాలలో నిరాశ నుండి బయటపడి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అన్నింటా విజయాలు. వారం ప్రార ంభంలో ధనవ్యయం. బంధువులతో మాటపట్టింపులు. నేరేడు, తెలుపు. రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.వృశ్చికం....వ్యవహారాలలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సేవాకార్యక్రమాలు విరివిగా చేపడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు ‡ తీరతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబసభ్యుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు, సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి పెట్టుబడులు పెంచుతారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం రాగలదు. కళాకారులు, రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.ధనుస్సు...దృఢదీక్షతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు కేసుల నుంచి కొంత బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు,భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.మకరం....అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత విముక్తి లభిస్తుంది. సాంకేతిక నిపుణులు, రాజకీయవర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.కుంభం....ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆప్తుల సహాయసహకారాలు తీసుకుంటారు. మీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని మిత్రులను ఆశ్చర్యపరుస్తారు. కళారంగం వారు, క్రీడాకారులకు సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మీనం...కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితుల ప్రభావం నుండి కొంత బయటపడతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఏ బాధ్యత అప్పగించినా వెనుకడుగు వేయరు. రాజకీయవేత్తలు, కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన, వివాదాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి. -
ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి అంతర్ జిల్లా దొంగ పరార్
ప్రొద్దుటూరు క్రైం: జైళ్లలో నిఘా లోపాలను బయటపెడుతున్న వ్యవహారం ఇది. మూడు రోజుల క్రితమే దొంగతనం కేసులో అరెస్టయిన మహమ్మద్ రఫీ అనే అంతర్ జిల్లా దొంగ, వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి పరారయ్యాడు. రఫీపై కడప, కర్నూలు, అనంతపురంసహా వివిధ జిల్లాల్లో 25 చోరీ కేసులు ఉన్నాయి. గతంలో ఒక కేసులో అరెస్టయిన రఫీ, 2021లో జమ్మలమడుగు సబ్ జైలు నుంచి కూడా పరారవడం గమనార్హం. తాజా ఘటనలో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో మిగిలిన ఖైదీలతోపాటు కాలకృత్యాల కోసం జైలు గది నుంచి ఆవరణలోకి వచ్చిన రఫీ, అటు తర్వాత తహసీల్దార్ కార్యాలయం వైపు ఉన్న గోడ దూకి పరారయ్యాడు. రిమాండ్లో ఉన్న ఖైదీ పరారైన విషయాన్ని జైలు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపారు. శుక్రవారం రాత్రి విధుల్లో ఇన్చార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. సమాచారం అందుకున్న జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, కడప జైలర్ అమర్ బాషా శనివారం ప్రొద్దుటూరు సబ్ జైలుకు వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. దీనిపై తనకు నివేదిక పంపాలని కడప జైలర్ బాషాను డీఐజీ ఆదేశించారు. ఘటనపై ప్రొద్దుటూరు సబ్ జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించి.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సబ్ జైలు చుట్టూ ఎత్తయిన గోడ ఉంది. ప్రహరీ చుట్టూ విద్యుత్ ప్రవాహ కంచెను ఏర్పాటు చేశారు. అయినా దొంగ పారిపోవడం చర్చనీయాంశంగా ఉంది. -
అలాగైతే గందరగోళమే
న్యూఢిల్లీ: రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదించి, పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు నిర్దిష్ట గడువు(టైమ్లైన్) విధించడం వల్ల రాజ్యాంగపరమైన గందరగోళం తలెత్తుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. బిల్లులకు సమ్మతి తెలియజేసే లేదా తిప్పి పంపించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టులకు ఉండదని స్పష్టంచేసింది. ఒకవేళ గడువు విధిస్తే రాష్ట్రపతి, గవర్నర్ల అత్యున్నత స్థానాన్ని, గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. రాష్ట్రపతి, గవర్నర్ల విధుల్లో లోటుపాట్లు ఉంటే, వారు సక్రమంగా స్పందించకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సరైంది కాదని వెల్లడించింది. రాజ్యాంగపరమైన ప్రక్రియ ద్వారా ఆ లోటుపాట్లు సరిదిద్దాలని తెలియజేసింది. సమ్మతి కోసం రాష్ట్రాల అసెంబ్లీల నుంచి వచ్చిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు నిర్దేశించవచ్చా? అనే దానిపై అభిప్రాయాలు తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తూ నోటీసులు జారీ సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇటీవల లిఖితపూర్వక వివరణను సుప్రీంకోర్టుకు సమరి్పంచారు. ఈ వివరణలో కేంద్రం ఏం చెప్పిందంటే... రాజ్యాంగ రూపకర్తలు అవి ఆశించలేదు ‘‘ప్రభుత్వంలో భాగమైన ఒక వ్యవస్థ రాజ్యాంగం తనకు అప్పగించని విధులు నిర్వర్తించాలని చూస్తే అది చివరకు రాజ్యాంగపరమైన గందరగోళానికే దారితీస్తుంది. ఒక వ్యవస్థ విఫలమైతే లేదా ని్రష్కియాత్మకంగా వ్యవహరిస్తే లేదా పొరపాట్లు చేస్తే... మరో వ్యవస్థ అందులో కలుగుజేసుకోవడం తగదు. ఒక వ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను మరో వ్యవస్థ చెలాయించడం చెల్లదు. రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలకు వాటికంటూ ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఎవరైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినప్పుడు లేదా సంస్థల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైన సందర్భాల్లో కూడా ఒక వ్యవస్థకు లేని అధికారాలు చెలాయించడానికి అనుమతి ఇస్తే రాజ్యాంగపరమైన విపరిణామాలే సంభవిస్తాయి. లేని అధికారాలను కల్పించడం లేదురాజ్యాంగం మన దేశంలో చట్టబద్ధమైన పాలనను స్థిరపర్చింది. వ్యవస్థల మధ్య సున్నితమైన సమతౌల్యాన్ని నిర్దేశించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువులు విధిస్తే గనుక ఆ సమతౌల్యాన్ని నీరుగార్చినట్లే అవుతుంది. రాజ్యాంగంలోని అర్టికల్ 142 అనేది కోర్టులకు లేని అధికారాలను కల్పించడం లేదు. రాజ్యాంగ, శాసన విభాగాల బాధ్యతలు, అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. రాష్ట్రపతి, గవర్నర్లది రాజకీయంగా అత్యున్నత స్థాయి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నప్పటికీ.. ఆరి్టకల్ 200, 201లు రాష్ట్రపతి, గవర్నర్లకు ఎలాంటి టైమ్లైన్ విధించడం లేదు. బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు ప్రత్యామ్నాయాల గురించి మాత్రమే అవి చెబుతున్నాయి. రాజ్యాంగానికి లోబడి ఒక వ్యవస్థను మరో వ్యవస్థ అదుపు చేసే విధానం(చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) ఉన్నప్పటికీ అదే రాజ్యాంగం ప్రకారం సమాజంలో మూడు మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వహక, న్యాయ విభాగాలకు వాటికే సంబంధించిన ప్రత్యేక అధికారాలు (జోన్లు) ఉంటాయి. మరో విభాగం అందులో వేలుపెట్టలేదు. రాష్ట్రపతి, గవర్నర్లకు సైతం వారికే ప్రత్యేకమైన అధికారాలు, అత్యున్నత హోదాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’. -
శ్రీవాణి టికెట్ల కేంద్రం వద్ద భక్తుల నిరసన
తిరుమల: తిరుమలో శ్రీవాణి టికెట్ల కోసం వచ్చిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆ ప్రభావం శ్రీవాణి టికెట్ల జారీపైనా పడింది. శనివారం తెల్లవారుజామున శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు భారీగా భక్తులు చేరుకోవడం.. టికెట్లను ముందుగానే జారీ చేయడంతో టికెట్లు దొరకని భక్తులు ఆందోళన చేపట్టారు. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు శుక్రవారం భారీగా భక్తులు చేరుకోవడంతో రాత్రి 11 గంటల నుంచి ముందుగా టోకెన్లను జారీ చేశారు.అప్పటికే భక్తుల రద్దీ మరింత పెరగడంతో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు శ్రీవాణి టికెట్లను భక్తులకు జారీచేశారు. అనంతరం శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్దకు చేరుకున్న మిగిలిన భక్తులకు టికెట్లు లేవని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా తెల్లవారుజాము నుంచి ముందుగా వచ్చిన భక్తులకు టోకెన్లు జారీచేసి ఉదయం 10 గంటల నుంచి టికెట్లను జారీ చేస్తారు. భక్తుల రద్దీ నియంత్రించలేనంతగా ఉండటంతో ముందుగానే టికెట్లను జారీ చేశారు.అయితే శ్రీవాణి టికెట్ల కేంద్రం వద్ద టికెట్లు లేవని సిబ్బంది చెప్పడంతో కొందరు భక్తులు రోడ్డుపై కూర్చుని ఆందోళన చేపట్టారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు తిరుమలలో ఆందోళన చేయడం తగదని సూచించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ముందుగా టికెట్ల జారీ చేశామని తెలిపారు. భక్తుల సమస్యలపై ఫిర్యాదుచేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. దీంతో భక్తులు రద్దీ సమయంలో శ్రీవాణి దర్శన టికెట్లు కోటా పెంచి ఇవ్వాలని తిరుమల టూటౌన్ సీఐ శ్రీరాముడుకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భక్తులు ఆందోళనను విరమించారు. -
‘యుపిక్స్’ చీటింగ్ కేసులో నిందితుల అరెస్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని కొందరు వ్యక్తులు గ్రూప్గా ఏర్పడి 183 మంది నుంచి దాదాపు రూ.353 కోట్లు దండుకుని మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. వీరు యుపిక్స్ క్రియేషన్ అనే యానిమేషన్ సంస్థను చూపి, హాలీవుడ్ సినిమాలకు వర్క్చేసే ఈ సంస్థలో పెట్టుబడి పెడితే ఏడాదిలోనే రెట్టింపు డబ్బులు పొందొచ్చని అమాయకులకు ఆశ చూపి క్రమేణా రూ.కోట్లలో పెట్టుబడులు రాబట్టారని ఆయన చెప్పారు. మోసం చేసిందిలా.. నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ అనే వ్యక్తి విజయవాడ సత్యనారాయణపురం పోలీస్స్టేషన్ పరిధిలోని ఆదిశేషయ్య వీధిలో యుపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని 2014లో ఏర్పాటుచేశారు. అనంతరం.. లక్ష్మీకిరణ్కు పేరం మాల్యాద్రి, అతని కొడుకు పేరం మహేశ్వరరెడ్డి, కొత్తూరి వేణుగోపాలరావు, మిట్టపల్లి రాజేంద్రబాబు అతని కొడుకు మిట్టపల్లి రాజీవ్కృష్ణ తోడయ్యారు. వీరంతా 2018లో ఒక గ్రూప్గా ఏర్పడి అమాయకులకు వల వేశారు. తొలుత లాభాలు వచ్చినట్లు చూపించి వారి బంధువులు, స్నేహితులకు సక్రమంగా కమీషన్లు చెల్లిస్తూ మరిన్ని డిపాజిట్లు చేయించేలా వారిని ప్రోత్సహించారు. అలా వచ్చిన మొత్తాలను వారి సొంత ఖాతాల్లోకి మళ్లించేవారు. ఇలా దాదాపు 183 మంది నుంచి రూ.353 కోట్లు సేకరించారు. ఇందులో రూ.194 కోట్ల వరకూ వారి సొంత ఖాతాలకు మళ్లించారు.వెలుగు చూసిందిలా.. ఈ సంస్థలో రూ.20 కోట్లు పెట్టుబడి పెడితే మోసం చేశారంటూ ఈ ఏడాది ఏప్రిల్ 14న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్కుమార్ సత్యనారాయణపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. డీసీపీ కె. తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విచారణ అధికారిగా ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్తో పాటు మరో నలుగురు ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో కమిషనర్ రాజశేఖరబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. దర్యాప్తులో ముఠా మోసాలు బయటపడ్డాయి. అనంతరం.. పక్కా సమాచారంతో ప్రధాన నిందితులు నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ (33)ను విజయవాడలో, మిట్టపల్లి రాజేంద్రబాబు (63), మిట్టపల్లి రాజీవ్కృష్ణ (30)ను నరసరావుపేటలో పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కేజీల వెండి ఆభరణాలు, ఒక కారు, బీఎండబ్ల్యూ బైక్, కంప్యూటర్లు స్వాదీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలనూ ఫ్రీజ్ చేశారు. నిందితులకు సంబంధించిన సుమారు రూ.23 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్మెంట్కు పెట్టినట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు నగదు రివార్డులతో సత్కరించి అభినందించారు. -
వైఎస్సార్సీపీలో పలు విభాగాలకు నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు విభాగాలకు నియామకాలు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది.⇒ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ను పార్టీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగం అధ్యక్షుడిగా నియమించారు.⇒ శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన అంబటి శ్రీనివాసరావుకు రాష్ట్ర పోలినాటి వెలమ విభాగ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ⇒ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఎల్లా భాస్కర్రావును రాష్ట్ర అతిరస విభాగ అధ్యక్షుడిగా నియమించారు.⇒ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన పులిపాటి దుర్గారెడ్డికి పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు.⇒ పల్నాడు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియో జకవర్గానికి చెందిన షేక్ దస్తగిరిని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. -
పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో పార్లమెంటు భవనం పరిసరాలు ప్రత్యేకంగా ఉన్న తరహాలోనే తెలంగాణ శాసనసభ ప్రాంగణాన్ని కూడా రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉభయసభలున్న ప్రాంగణం యావత్తు కొంత గందరగోళంగా ఉంది. వారసత్వ భవనం అయినప్పటికీ, ప్రధాన భవనానికి చేరువలో ఇతర భవనాలుండటంతో ఆ భవన ప్రత్యేకతకు కొంత భంగంవాటిల్లుతోందని ప్రభుత్వం భావిస్తోంది. సభ జరిగే సమయంలో వాహనాలకు సరైన పార్కింగ్ వసతి లేకపోవటంతో ప్రధాన భవనం చుట్టూరా నిలుపుతున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న భవనం అయినప్పటికీ, దాని ప్రత్యేకతను ఇనుమడింపజేసేలా పచ్చిక బయళ్లు లేకపోవటం వెలితిగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాన భవనానికి అతి చేరువలో ఉన్న ఇతర భవనాలను తొలగించి.. కొంచెం దూరంగా, క్రమపద్ధతిలో కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ్యులు, మండలి సభ్యులు, వీఐపీలకు ఆ భవనంలో చాలినన్ని వసతులు లేవని, అందుకు ప్రత్యేకంగా మరో భవనం నిర్మించి వసతులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రోడ్లు, భవనాల శాఖ ఓ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఉద్యానవన శాఖ స్థలాన్ని సేకరించి.. శాసన మండలి కూడా శాసనసభ ఉన్న ప్రధాన భవనంలోకే మారనుంది. ఇప్పటికే పాత అసెంబ్లీ హాల్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి పునరుద్ధరించారు. ప్రస్తుతం జూబ్లీహాలు వెనకవైపు కొనసాగుతున్న మండలి ప్రాంగణాన్ని ఖాళీ చేయనున్నారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తాన్ని రీమోడలింగ్ చేయబోతున్నారు. ఇందుకోసం ఉద్యానవన విభాగం ఆదీనంలోని స్థలాలను సేకరించి దానికి మరోచోట ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ నుంచి తరలించాలని నిర్ణయించారు. అలా సేకరించిన నర్సరీ, ఉద్యానవన స్థలాలను కొత్త నిర్మాణాలకు వాడబోతున్నారు. జూబ్లీహాలు భవనానికి కూడా వారసత్వ హోదా ఉండటంతో దానిని తొలగించే వీలులేదు. దీంతో ఆ భవనాన్ని రీమోడలింగ్ చేయబోతున్నారు. దాని చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను కూడా వినియోగించుకోనున్నారు. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా భారీ పార్కింగ్ యార్డును రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సాధారణ పార్కింగ్ స్థలం వాహనాలకు సరిపోని పక్షంలో ప్రత్యేకంగా పార్కింగ్ టవర్ను నిర్మించే యోచనలో ఉన్నారు. మొత్తంమీద వాహనాలను ప్రధాన భవనం ఛాయల్లో పార్క్ చేయకుండా చేస్తారు. ఇక పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, ప్రింటింగ్ ప్రెస్ ఉన్న భవనాలు తొలగించి ఆ ప్రాంతాన్ని లాన్గా మార్చబోతున్నారు. ముందు వైపు, ఆ చుట్టు పక్కల ఎలాంటి ఇతర నిర్మాణాలు లేకుండా క్రమబద్ధం చేస్తారు. వాటికీ రీమోడలింగ్.. ఇక పబ్లిక్ గార్డెన్లో ఉన్న ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, జవహర్ బాలభవన్, హెల్త్ మ్యూజియంలు వినియోగంలో లేవు. వాటిని కూడా రీమోడలింగ్ చేయటం ద్వారా ఎలాంటి అవసరాలకు వినియోగించవచ్చనే విషయంలో ప్లాన్ చేస్తున్నారు. వీఐపీలకు, సందర్శకులకు వేర్వేరు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేయబోతున్నారు. పార్లమెంట్లో ఉన్న సెంట్రల్ హాల్ మాదిరిగా ఇక్కడ కూడా అలాంటి హాల్ నిర్మాణం, అక్కడ శాసన సభ్యులు కలసి కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా ఏర్పాట్లు, సమావేశాల నిర్వహణకు వినియోగించుకునేలా నిర్మాణం చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు మూడు రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో ముఖ్యమంత్రి ఆమోదించే ప్రణాళిక ప్రకారం త్వరలో నిర్మాణాలు ప్రారంభించనున్నారు. -
పుతిన్ పైచేయి!
ఉక్రెయిన్పై దురాక్రమణ దండయాత్ర మొదలెట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్కు అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అమెరికాసహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ వారెంట్లు, సైబర్ దాడులతో శత్రుదేశాలు చుట్టుముట్టినా ఏమాత్రం బెదరక పుతిన్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ట్రంప్ సమక్షంలోనే ప్రదర్శించి రష్యాకు ఎదురులేదని నిరూపించారు. సంయుక్త ప్రకటన సమయంలోనూ ట్రంప్ కంటే ముందే మాట్లాడి తన వాదనను మొదటే గట్టిగా వినిపించారు. దాదాపు 13 నిమిషాలపాటు సంయుక్త ప్రకటన చేస్తే అందులో అగ్రభాగం 8 నిమిషాలు పుతినే మాట్లాడాడు. దాంతో ట్రంప్ చివర్లో మమ అనిపించి ప్రసంగాన్ని ముగించారు. ట్రంప్తో భేటీ పర్వంలో అడుగడుగునా పుతిన్ తన పైచేయిని ప్రదర్శించడం విశేషం.ఎర్రతివాచీ స్వాగతంలో తొలి గెలుపు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చు కోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలను స్వీకరించిన ట్రంప్ నుంచే స్వయంగా రెడ్కార్పెట్ సాదర స్వాగతాన్ని పొంది పుతిన్ తన రష్యాకు అంతర్జాతీయంగా ప్రభ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది అమాయక ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారన్న అపవాదు ఉన్న దేశాధ్యక్షునికి అలస్కా ఎయిర్పోర్ట్లో సాధారణ స్వాగతంతో ట్రంప్ ముగిస్తే సరిపోయేది. కానీ అత్యంత ఆప్తుడైన మిత్రుడు తరలివస్తే ఎంతగా ప్రేమతో ఆహా్వనం పలుకుతామో అదేతరహాలో పుతిన్కు ట్రంప్ ఎర్రతివాచీ పరిచి మరీ సాదరంగా ఆహా్వనించారు. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా సమహోదా ఉన్న ట్రంప్ స్వయంగా వెళ్లి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకలేదు. కానీ యుద్ధనేరారోపణలు ఎదుర్కొ ంటున్నాసరే స్వయంగా ట్రంప్ వెళ్లి పుతిన్కు స్వాగతం పలకడం ద్వారా అగ్రరాజ్యాధినేతకు తాను ఏమాత్రం తీసిపోనని పుతిన్ బహిరంగంగా నిరూపించారు. ఉక్రెయిన్ మొదలయ్యాక దౌత్యపరంగా, ఆర్థికంగా, ఆంక్షల పరంగా రష్యా ఏకాకిగా తయారైందని పశి్చమదేశాల మీడియా చెబుతున్నదంతా ఒట్టిమాటలేనని, అమెరికా దృష్టిలో పుతిన్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రపంచనేత అని రుజువైంది. ట్రంప్తో సోదరభావంతో మెలగడం, కరచాలనం, ఒకే కారులో ప్రయాణించడం ద్వారా తానూ ట్రంప్ ఒకేస్థాయి అని పుతిన్ అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు.కాల్పుల విరమణ.. గప్చుప్ ఉక్రెయిన్తో దాడులు ఆపి కాల్పుల విరమణను అమల్లోకి తేవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. అలాంటి కీలక ‘కాల్పుల విరమణ’పదాన్ని మాటవరసకైనా ట్రంప్ ప్రస్తావించకుండా పుతిన్ విజయవంతంగా కట్టడిచేశారు. మేమే ‘ఆ మార్గం’లో ఇంకా పయనించలేదు. అక్కడి దాకా వెళ్లేందుకు ఇంకొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది అని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారుగానీ ‘కాల్పుల విరమణ’అనే పదం పలకడానికి కూడా ఆయన సాహసించలేదు. తద్వారా పుతిన్ తన కనుసన్నల్లో, తాను అనుకున్నదే భేటీలో జరిగేలా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పాక్షిక విజయం కూడా సాధించని ట్రంప్ ఈ భేటీలో మా ప్రతిపాదనలకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాపై మరోదఫా ఆంక్షలు విధిస్తానని రెండ్రోజుల ముందు ట్రంప్ చేసిన భీష్మప్రతిజ్ఞ ఉత్తిదేనని తేలిపోయింది. ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ ముగిసినా సరే ట్రంప్లో ఎలాంటి నిరసన, ఆందోళన కనిపించలేదు. పైగా పుతిన్ చేసిన మాస్కో పర్యటన ప్రతిపాదనకు ట్రంప్ సంతోషం వ్యక్తంచేయడం విచిత్రం. పైగా తాము అనుకున్న ఫలితాలు రాకపోయినా ట్రంప్.. పుతిన్తో చర్చలు సానుకూలంగా సాగాయని విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం. దీంతో భేటీపై ట్రంప్కు ఎలాంటి పట్టు సాధించలేకపోయారని అర్థమవుతోంది. భేటీ జరుగుతున్నాసరే రష్యా దాడులుచేసేలా పుతిన్ ఆదేశాలిచ్చి తన మొండి వైఖరిని మరోసారి చూపించారు. శాంతి చర్చలను వాణిజ్య చర్చలుగా మార్చిన పుతిన్ యుద్ధం ఆపాలన్న డిమాండ్తో ముందుకొచి్చన అమెరికాను వాణిజ్యచర్చలకు బలవంతంగా పుతిన్ కూర్చోబెట్టినట్లు ఈ భేటీ తర్వాత ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతోంది. ‘‘వాణిజ్యం, డిజిటల్, హై–టెక్, స్పేస్ వంటి రంగాల్లో అమెరికా–రష్యా పెట్టుబడులు, వాణిజ్య సహకారం మరింతగా బలపడనుంది. ఆర్కిటిక్లోనూ సహకారం బాగుంది’’అని సంబంధంలేని విషయాలనూ పుతిన్ చెప్పుకొస్తున్నా ఆయనను అడ్డుకోవాల్సిందిపోయి ట్రంప్ ఆయనకు వంతపాడటం విచిత్రం. పుతిన్తోపాటు ట్రంప్ ఆ తర్వాత గొంతు కలుపుతూ.. ‘‘రష్యా వ్యాపార భాగస్వాములు మాతో వాణిజ్యానికి ఉవి్వళ్లూరుతున్నారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా శాంతి చర్చలను పుతిన్ విజయవంతంగా వాణిజ్యచర్చలుగా మార్చేశారు. పదికి పది.. కానీ సున్నా సమావేశం ముగిశాక ఈ భేటీలో పూర్తి సత్ఫలితాలను సాధించామని, 10/10 మార్కులు కొట్టేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యానాల్లో పిసరంతైనా నిజం లేదని తేలిపోయింది. వాస్తవానికి ఆ పది మార్కులు పుతిన్ దోచేశారు. శాంతి ఒప్పందం దిశగా కనీసం ఒక్క షరతు విషయంలో పుతిన్ను ట్రంప్ ఒప్పించలేకపోయారు. ఎయిర్పోర్ట్లో ట్రంప్తో కరచాలనం, రెడ్కార్పెట్ స్వాగతం, ట్రంప్ కలిసి మీడియాకు ఫొటోలకు పోజులు, కలిసి కారులో ప్రయాణం, దారి పొడవునా కారులో నవ్వులు, భేటీ సందర్భంగా తమ వాదనను గట్టిగా వినిపించడం, సంయుక్త ప్రకటన వేళ తొలుత మాట్లాడం సహా ప్రతి సందర్భంలోనూ పుతిన్ పైచేయి సాధించారు. సాధారణంగా ఇతర దేశాల నేతలు మాట్లాడేటప్పుడు హఠాత్తుగా కల్గజేసుకుని, వెటకారంగా మాట్లాడి వారిని అవమానించే ట్రంప్.. ఈసారి మాత్రం పుతిన్ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటం గమనార్హం. యుద్ధం, శాంతి, ఉక్రెయిన్ ప్రాంతాల దురాక్రమణ, కాల్పుల విరమణ వంటి కీలక పదాలను కనీసం ట్రంప్ ప్రస్తావించేందుకు సైతం సాహసించకపోవడం పుతిన్ దౌత్యవిజయంగా చెప్పొచ్చు. సొంత గడ్డపై జరిగిన భేటీలోనే నోరుమెదపని ట్రంప్ ఇక రష్యాలో జరగబోయే రెండో రౌండ్ భేటీలో ఏపాటి మాట్లాడతారనే అనుమానాలు బలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మద్యం బెల్టుపై పోరు‘గీత’o
సాక్షి, అమరావతి/కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో 75వేల మద్యం బెల్ట్షాపులను తొలగించి, గీత కార్మికుల ఉపాధిని కాపాడే వరకు పోరాటం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం(ఎంబీవీకే)లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు ఆండ్ర మాల్యాద్రి(కేవీపీఎస్), పి.బాలకృష్ణ(ఏపీ చేనేత కార్మిక సంఘం), ఎం.భాస్కరయ్య(వృత్తిదారుల సంఘం), రామన్న, అనిల్, రమాదేవి, రెడ్డయ్య వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ బతుకుదెరువు కోసం గీత కార్మికులు సాగిస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికారు. రాష్ట్రంలో బెల్ట్షాపులు తొలగించి గీత కార్మికుల ఉపాధిని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 58 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదరర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోకపోగా ఉన్న ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. మద్యం ఆదాయం రుచి మరిగిన ప్రభుత్వం కల్లు అమ్మకాలను దెబ్బతీసి గీత కార్మికుల పొట్ట కొట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలోనే లెక్కలేనన్ని బెల్ట్ షాపులు ఉన్నాయని, అక్రమ మద్యం ఏరులై పారుతోందని, ఇక రాష్ట్రంలోని దుస్థితి చెప్పనవసరంలేదని పేర్కొన్నారు. మంచినీటికి కొరత ఉందేమోకానీ మద్యం ఎక్కడç³డితే అక్కడ దొరకడంతో రాష్ట్రంలో నిత్యం హత్యలు, లైంగికదాడులు వంటి ఘోరాలు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే గీత వృత్తి రక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జుత్తిగ నరసింహామూర్తి హెచ్చరించారు. దశలవారీ పోరాటంలో కీలక ఘట్టాలు ఇలా..గీత కార్మికుల సమస్యలపై ఉద్యమించేందుకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 58 రోజులపాటు నిర్వహిస్తున్న దశలవారీ పోరాటంలో ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నా రు. 30న జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి సెపె్టంబర్ 8న మంగళగిరిలో ఎక్సైజ్ కమిషనర్ను కలుద్దాం రండి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు.సెప్టెంబర్ 10న ముఖ్యమంత్రికి సమస్యలపై వినతిపత్రం అందించి 12న బెల్ట్ షాపులు, కల్లు పాలసీ, ఉపాధిపై జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సెపె్టంబర్ 25న జిల్లాల్లో సమీక్షలు, సభలు నిర్వహించి అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే 30 తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని జుత్తిగ నరసింహమూర్తి వెల్లడించారు. ఈ సమావేశంలో సిమ్మ అప్పారావు, కడలి పాండు బత్తిన నాగేశ్వరరావు, దాసరి సూరిబాబు, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, పామర్తి వెంకటేశ్వరరావు, బెజవాడ వెంకటేశ్వరరావు, నోట్ల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. -
ప్రమాదంలో తుంగభద్ర డ్యాం 7 గేట్లు
హొళగుంద: తుంగభద్ర డ్యాం మళ్లీ ప్రమాదం అంచున ఉంది. గతేడాది 19వ గేటు నదిలో కొట్టుకుపోగా టీబీ బోర్డు అధికారులు దాని స్థానంలో స్టాప్లాగ్ గేట్ ఏర్పాటు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. అయితే మిగిలిన గేట్లకూ కాలం చెల్లిందని, మొత్తం గేట్లను మార్చాలని గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఇచి్చన నివేదిక ఆధారంగా మొత్తం 33 కొత్త గేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. సేఫ్టీ కోసం 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు కుదించి ఖరీఫ్కు మాత్రమే నీళ్లిచ్చి రబీ సమయంలో పనులు మొదలు పెట్టెందుకు నిర్ణయం తీసుకున్నారు.అయితే ఇంకా సమయం ఉండడం, జలాశయానికి వరద పెద్ద ఎత్తున వస్తుండడంతో మళ్లీ ఎక్కడ కొత్త సమస్య వస్తుందోనని టీబీ బోర్డు అధికారులతో పాటు ఏపీ, కర్ణాటకకు చెందిన కర్నూలు, బళ్లారి, రాయచూరు, అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. 19వ స్టాప్లాగ్ గేటు మినహాయించి మిగిలిన 32 గేట్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా.. అందులో 4, 11, 18, 20, 24, 27, 28వ గేట్లు మరీ అధ్వాన స్థితికి చేరినట్లు తెలుస్తోంది.ఆ గేట్లు రెండు మీటర్ల ఎత్తు వరకు ఎత్తేందుకూ సమస్యగానే ఉందని అధికారులు చెబుతున్నారు. తుప్పు పట్టి ఉండటంతో ఆ గేట్లను ఎత్తితే.. దింపడం, దించితే ఎత్తడం ఇబ్బందికరమంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనంటూ కన్నడ టీవీ చానళ్లలో ప్రసారమైన వార్తలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఉత్కంఠతో మొదలై ఉసూరుమనిపించి..
జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్న్(అలాస్కా): ఎడాపెడా టారిఫ్ల పిడిగుద్దులు కురిపించి ప్రపంచదేశాలకు సుంకాల ముచ్చెమటలు పట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శక్తిసామర్థ్యాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదుట నిర్విర్యమయ్యాయి. అలాస్కాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రపంచ దేశా లు అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూసిన ట్రంప్, పుతిన్ శిఖరాగ్ర చర్చలు దాదాపు మూడు గంటలపాటు జరిగినా చివరకు ఎలాంటి సత్ఫలితాలనివ్వకుండానే ముగిశాయి. దీంతో దురాక్రమణ జెండా ఎగరేసి ఉక్రెయిన్పై బాంబుల మోత మోగిస్తున్న రష్యాను నిలువరించి ఉక్రెయిన్లో శాంతికపోతాలు ఎగిరేలా చేస్తానన్న ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరలేదు. అలాస్కాకు చేరుకున్నది మొదలు చర్చలు, సంయుక్త ప్రకటనదాకా ఆద్యంతం పుతిన్దే పైచేయి కనిపించింది. అయితే శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేశామని ట్రంప్ ప్రకటించగా ఒప్పందం కంటే ‘పరస్పర అవగాహన’దిశగా సఖ్యత కుదిరిందని పుతిన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్లో శాంతిస్థావనకు ఇరునేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే నిర్దిష్ట ప్రణాళికలను ఇరువురూ బయటపెట్టలేదు. కానీ ఈ చర్చలకు కొనసాగింపుగా రష్యా రాజధాని మాస్కోలో మరోదఫా చర్చలు జరిగే అవకాశముంది. పుతిన్పై ప్రశ్నల శరాలు తన ఏలుబడిలో రష్యా మీడియా పుతిన్ను ముక్కుసూటి ప్రశ్నలడిగే దుస్సాహసం చేయదు. కానీ అమెరికాలో అడుగుపెట్టిన పుతిన్కు అమెరికా అంతర్జాతీయ మీడియా ప్రశ్నలతో మూకుమ్మడి దాడి చేసింది. పుతిన్ దాదాపు ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వనప్పటికీ ప్రశ్నల బాణాలు సంధిస్తూ మీడియా పుతిన్కు నోటమాట రానివ్వకుండా చేసింది. ‘‘ఉక్రెయిన్లో అమాయక పౌరుల ప్రాణాలను తీయడం ఎప్పుడు ఆపేస్తారు? శాంతిస్థాపనకు కంకణం కట్టుకున్నానని మీరు చెప్పే మాటలను ట్రంప్ ఎందుకు నమ్మాలి? ఇలా పలు ప్రశ్నలను మీడియా గట్టిగా అడిగినా పుతిన్ మౌనంగా ఉండిపోయారు. తాను ఆ ప్రశ్నలను వినదల్చుకోలేదు అన్నట్లు చెవులు మూసుకున్నారు. సాదర స్వాగతం పలికిన ట్రంప్ పుతిన్ కంటే ముందే యాంకరేజ్ సిటీలోని ఎయిర్పోర్ట్కు ట్రంప్ చేరుకున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన పుతిన్కు ట్రంప్ ఎర్ర తివాచీ పరచి మరీ సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజిచ్చారు. రెడ్కార్పెట్పై నడిచి వెళ్లేటప్పుడు అమెరికా అత్యంత భారీ బాంబులను జారవిడిచే బీ–2 బాంబర్ యుద్ధవిమానాలతోపాటు ఎఫ్–22 ఫైటర్జెట్లు గగనతలంలో దూసుకుపోయాయి. ట్రంప్ తన బీస్ట్ కారులో పుతిన్ను ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో ఇద్దరూ వెనకసీట్లో కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. తర్వాత జాయింట్ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్న్ వైమానిక స్థావరంలో ఏర్పాటుచేసిన సమావేశమందిరానికి చేరుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలçహాదారు మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, జాతీయ భద్రతా సలహాదారు యూరీ ఉషకోవ్ల సమక్షంలో ట్రంప్, పుతిన్లు సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్పై దాడులు మొదలెట్టాక పుతిన్ అమెరికా గడ్డపై కాలుమోపడం ఇదే తొలిసారి.అమెరికా మా పొరుగు దేశం భేటీ తర్వాత సంయుక్త సమావేశంలో పుతిన్ తొలుత మాట్లాడారు. ‘‘అమెరికా, రష్యాలు పొరుగుదేశాలే. మమ్మల్ని కేవలం మహాసముద్రాలే వేరుచేస్తున్నాయి. అది కూడా కేవలం నాలుగు కిలోమీటర్లే. మిగతా అంశాల్లో మేం మిత్రదేశాలమే. అందుకే రెడ్కార్పెట్పై నాకు స్వాగతం పలకేటప్పుడు ట్రంప్ నన్ను హలో పొరుగుమిత్రుడా(నెయిబర్) అని సంబోధించారు. అమెరికాలో ఇప్పటికీ ఆర్థోడాక్స్ చర్చిలు ఉన్నాయి. మా మధ్య సాంస్కృతిక బంధం బలోపేతానికి కృషి చేస్తాం. పరస్పర ప్రయోజనకర, సమస్థాయి ఒప్పందాలకు ఈ సాంస్కృతికబంధాలు వారధిగా నిలుస్తాయి. ప్రచ్ఛన్నయుద్ధంకాలంనుంచి ఇరు దేశాల సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఇకమీదట విభేదాలు విడనాడి చర్చల మార్గంలో పయనిద్దాం. వాస్తవానికి ఇలాంటి భేటీ ఎప్పుడో జరగాల్సింది’’అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం అంశాన్ని పుతిన్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘సంక్షోభమే ఈ సమావేశాలకు ప్రధాన పునాది. ఉక్రెయిన్ను చుట్టుముట్టిన సమస్యలకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఉక్రేనియన్ల ఆందోళనను అప్పుడూ పట్టించుకున్నా. ఇప్పుడూ పట్టించుకుంటున్నా. మా మూలాలు ఒక్కటే. పరస్పర సంఘర్షణ కారణంగా ఇరువైపులా శాంతి ప్రక్రియలో ఉక్రేనియన్లు, యురోపియన్లు అవరోధాలు కల్పించొద్దు. అంతా శుభమే జరగాలని కోరుకుంటున్న ట్రంప్కు నా ధన్యవాదాలు. మా ఇరు పక్షాలు చక్కటి ఫలితాల కోసమే పాటుపడుతున్నాయి. అమెరికా శ్రేయస్సు కోసం ట్రంప్ పరితపిస్తున్నారు. అలాగే రష్యా స్వప్రయోజనాలు మాకు ముఖ్యం. ట్రంప్తో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. కానీ ఉక్రెయిన్ అంశంలో అమెరికాతో ఒక అవగాహనకు వచ్చాం’’అని పుతిన్ స్పష్టంచేశారు.నేరుగా శాంతి ఒప్పందమే అత్యుత్తమం తర్వాత ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడు వ్లాదిమిర్తో సమావేశం అత్యంత సత్ఫలితాలనిచి్చంది. అయితే తదుపరి దశ(శాంతిచర్చల)కు చేరే క్రమంలో ఎంతో పురోగతి సాధించాం. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాకు సువర్ణావకాశం దక్కింది. కానీ ఇంకా కొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది. (శాంతి)ఒప్పందం కుదరాలంటే అంతకుముందు మరో ఒప్పందం కుదరాలి. సంక్షోభం సమసిపోవాలంటే నాటో కూటమి దేశాలు, ఉక్రెయిన్ వల్లే సాధ్యం. ఒప్పందం పూర్తిగా వాళ్ల చేతుల్లోనే ఉంది. వారానికి వేల మంది చనిపోకుండా నిలువరించాల్సి ఉంది. చర్చల కొనసాగింపుగా మరోదఫా వ్లాదిమిర్తో భేటీ కావాల్సి ఉంది’’అని ట్రంప్ అన్నారు. దీంతో వెంటనే పుతిన్ కల్పించుకుని ‘‘ఈసారి మాస్కోలో కలుద్దాం’’అని అన్నారు. తర్వాత ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఉక్రెయిన్, రష్యాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఈ యుద్ధాన్ని ముగించేందుకు అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా అది సమగ్ర స్థాయిలో అమలుకావడం కష్టమే. కాల్పుల విరమణ తరచూ ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉక్రెయిన్, రష్యా నేరుగా శాంతి ఒప్పందం చేసుకోవాలి. సోమవారం వైట్హౌస్లో జెలెన్స్కీతో సమావేశమవుతా. మా చర్చలు ఫలవంతమయ్యాక పుతిన్తో మాట్లాడతా. ఆ తర్వాత పుతిన్, జెలెన్స్కీలు ఒక్కచోటకు చేర్చి యుద్ధవిరమణకు కృషిచేస్తా’’అని ట్రంప్ అన్నారు. -
3 రోజుల పాటు కోస్తాలో అతి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు, సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.19న కోస్తాంధ్ర అంతటా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ప్రఖర్ జైన్ సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
ఆగని ర్యాగింగ్!
సాక్షి, అమరావతి: దేశంలోని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చట్టం అమల్లో ఉన్నప్పటికీ... ర్యాగింగ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వైద్యకళాశాలల్లో గత ఏడాది (2024)లో 165 ర్యాగింగ్ కేసులు నమోదైనట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 33 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తర్వాత బిహార్లో 17, అత్యల్పంగా కేరళలో ఒక కేసు నమోదైనట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్లో ఆరు కేసులు నమోదయ్యాయి. ర్యాగింగ్ నిరోధంపై వైద్య విద్యాసంస్థల డీన్లు, ప్రిన్సిపాల్స్తో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా క్రమం తప్పకుండా మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించకపోతే గుర్తింపు రద్దు వైద్య విద్యాసంస్థలు ర్యాగింగ్ నిరోధక ప్రొటోకాల్ను పాటిస్తున్నాయా.. లేదా.. అని నిర్ధారించేందుకు వార్షిక ర్యాగింగ్ నిరోధక నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ప్రొటోకాల్ పాటించకపోతే జరిమానాలు విధించడంతోపాటు విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు సురక్షిత వాతావరణం ఉండేలా ర్యాగింగ్ నివారణ, నిషేధం నిబంధనలు–2021ను అమలు చేస్తున్నట్లు వివరించింది. అడ్మిషన్ బ్రోచర్లు, బుక్లెట్లలో ర్యాగింగ్ నిరోధక చర్యల గురించి నిర్దిష్ట సమాచారం అందిస్తున్నట్లు తెలిపింది. కళాశాలలు, ఆస్పత్రులు, హాస్టళ్లతోసహా క్యాంపస్లోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు ర్యాగింగ్ నిరోధక పోస్టర్లు, హోర్డింగ్లను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు ర్యాగింగ్కు సంబంధించిన ఫిర్యాదులను దాఖలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసిందని, ఫిర్యాదులను యాంటీ ర్యాగింగ్ సెల్ పర్యవేక్షిస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. -
ఇందులో తప్పేముంది సార్! పొద్దున లేచినప్పటి నుంచి మీరు చేసేది అదేగా సార్!!
ఇందులో తప్పేముంది సార్! పొద్దున లేచినప్పటి నుంచి మీరు చేసేది అదేగా సార్!! -
ఇంటర్నేషనల్ చదువుకు కొత్త అడ్రస్.. న్యూజిలాండ్
సాక్షి, అమరావతి: భారతీయ విద్యార్థుల విదేశీ విద్య గమ్యస్థానాల్లో న్యూజిలాండ్ సరికొత్త ఆశాకిరణంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కఠినంగా మారుతున్న వీసా నిబంధనలు, విధాన అనిశ్చితుల నేపథ్యంలో విద్యకు న్యూజిలాండ్ కీలకమైన కేంద్రంగా అవతరిస్తోంది. ఇంగ్లిష్ మాట్లాడే వాతావరణం, పారదర్శక విధానాలతో పాటు ముఖ్యంగా భారత సంస్థలతో పెరుగుతున్న సంబంధాలతో న్యూజిలాండ్ ఆశాజనకంగా కనిపిస్తోంది.34% వృద్ధి నమోదుఎడ్యుకేషన్ న్యూజిలాండ్ డేటా ప్రకారం 2023లో న్యూజిలాండ్ విద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 7,930 కాగా, 2024లో కేవలం జనవరి–ఆగస్టు మధ్యే 34 శాతానికి పైగా వృద్ధితో 10,640కి పెరిగింది. వాస్తవానికి న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాల్లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా 11 శాతం. చైనా తర్వాత అతిపెద్ద విదేశీ విద్యా వనరుగా భారత్ నిలుస్తోంది. ఒక్క మహిళా విద్యార్థుల్లోనే 2023 నుంచి 2024కు 100 శాతం పెరుగుదల నమోదయ్యింది. 2030 నాటికి 40 వేల వరకూ భారతీయ విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా న్యూజిలాండ్ అడుగులు వేస్తోంది. న్యూజిలాండ్లో వార్షిక ట్యూషన్ ఫీజులు భారతీయ కరెన్సీలో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపే ఉంటున్నాయి.ఈ నేపథ్యంలో ‘బిగ్ ఫోర్’ దేశాలైన యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలకు ప్రత్యామ్నాయంగా భారతీయ విద్యార్థుల దృష్టి న్యూజిలాండ్కు మారింది. న్యూజిలాండ్ ఇటీవల తమ దేశానికి విద్య, ఉద్యోగాల కోసం వచ్చే విదేశీ విద్యార్థులు, అభ్యర్థులకు విధించే నిబంధనల నుంచి భారత్కు మినహాయింపులు ఇచ్చింది. దీంతో వలస ప్రక్రియలో మినహాయింపులు పొందుతున్న ఎనిమిది దేశాల సరసన (ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, స్వీడన్, స్విట్జర్లాండ్) భారత్ చేరింది. తద్వారా భారత విద్యార్థులకు అంతర్జాతీయ అర్హత అంచనా (ఐక్యూఏ) మినహాయింపులు లభించాయి.ఐక్యూఏ అనేది న్యూజిలాండ్ క్వాలిఫికేషన్స్ అథారిటీ (ఎన్జెడ్క్యూఏ) నిర్వహించే ఒక అధికారిక బెంచ్ మార్కింగ్ ప్రక్రియ. ఒక విదేశీ విద్యార్హత.. ఆ దేశ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో ఈ ప్రక్రియ నిర్ధారిస్తుంది. దీనికి తోడు ప్రత్యేక స్కాలర్ షిప్ పథకం ద్వారా విద్యార్థికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తోంది.పని గంటల పెంపుపోస్టు స్టడీ వర్క్ (పీఎస్డబ్ల్యూ) పాలసీ కూడా న్యూజిలాండ్లో చదువుకునే విదేశీ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. కనీసం 30 వారాల మాస్టర్ లేదా డాక్టోరల్ లెవల్ స్టడీని పూర్తి చేసిన విద్యార్థులు ఆ దేశంలోనే ఉండి మూడేళ్ల వరకు పని చేసుకునే వెసులుబాటు ఉండటం విద్యార్థులకు కలిసివస్తోంది. ఇటీవల వారానికి పని గంటలను 20 నుంచి 25కు పెంచింది. నవంబర్ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. చదువుకుంటూ పని చేసుకుని, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలనే విద్యార్థులకు ఎంతగానో ఉపకరించే అంశం ఇది. క్యూఎస్ ర్యాంకుల్లోనూ..న్యూజిలాండ్కు చెందిన ఎనిమిది విశ్వవిద్యాలయాలు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2026లో ఉత్తమ ర్యాంకులు పొందాయి. ఇవి ఇంజనీరింగ్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, హాస్పిటాలిటీ, నర్సింగ్ వంటి విద్య రంగాల్లో విస్తృత శ్రేణిలో ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి.భాగస్వామ్య ఒప్పందాలుఇటీవల భారత్–న్యూజిలాండ్ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు పెరుగుతున్నాయి. గతేడాది న్యూజిలాండ్ ప్రభుత్వం ఐఐఎం–అహ్మదాబాద్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (జీఐఎఫ్టీ సిటీ), కర్ణాటక ఉన్నత విద్యా మండలిలో విద్యా సహకార ఒప్పందాలు చేసుకుంది. దేశంలో అభివృద్ధి చెందుతున్న విద్యా రంగానికి అనుగుణంగా విధాన మార్పిడి నిర్ణయాలను వేగంగా తీసుకుంటోంది. -
మహిళలకు 'ఉచితం లేదు'
కదిరి అర్బన్: స్పెషల్ సర్వీసు పేరుతో ఆర్టీసీ అధికారులు మహిళల ఉచిత ప్రయాణానికి బ్రేక్ వేశారు. దీనిపై మహిళల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రావణ శనివారం సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం పాలపాటిదిన్నె ఆంజనేయస్వామిని దర్శించుకుందామని ఎంతో ఆశతో బయలుదేరిన మహిళా భక్తులకు నిరాశ మిగిలింది.పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులకే ‘స్పెషల్ సర్వీసులు’ అని పేర్కొంటూ.. స్త్రీ శక్తి పథకం కింద ‘మహిళలకు ఉచిత ప్రయాణం లేదు’ అని పోస్టర్లు అతికించారు. దీంతో మహిళా భక్తులు అధికారులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రమంతా మహిళలకు ఉచిత ప్రయాణమని గొప్పులు చెబుతూనే ఇలా మెలికలు పెట్టడం ఏంటని ప్రశి్నంచారు. దీనిపై కదిరి ఆర్టీసీ డీఎం మైనోద్దీన్ మాట్లాడుతూ.. పాలపాటిదిన్నెకు మొత్తం 7 స్పెషల్ సర్వీసులు వేశామని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లేదని చెప్పారు. -
పల్లెవెలుగు బస్సులకూ వర్తించని ‘స్త్రీ శక్తి’
కడప కోటిరెడ్డి సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన స్త్రీ శక్తి పథకం పల్లె వెలుగు బస్సుల్లో సైతం వర్తించకపోవడంపై మహిళలు మండిపడ్డారు. శ్రావణమాసం నాలుగో శనివారం సందర్భంగా ఆర్టీసీ అధికారులు కడప నుంచి వేంపల్లె మీదుగా పవిత్రమైన గండి క్షేత్రానికి రెండు బస్సులను ఏర్పాటుచేశారు. గండి ఆలయానికి ఉచితంగా వెళ్లవచ్చని భావించిన మహిళలు బస్సు ఎక్కాక డబ్బులు చెల్లించాలని కండక్టర్ కోరడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాయచోటి నుంచి గండికి వెళ్లే బస్సుల్లో కూడా చార్జీలు వసూలు చేశారు. ఆయా బస్సుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదని స్టిక్కర్లను ఏర్పాటు చేయడంతో మహిళలు టీడీపీ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
పోటెత్తిన గోదావరి
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/నిర్మల్/రామగుండం: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి నది పోటెత్తింది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 6,738 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 97.29 టీఎంసీలకు చేరింది. రెండు మూడు రోజుల్లో జైక్వాడ్ నిండితే గోదావరి ప్రధాన పాయ ద్వారా తెలంగాణలోకి వచ్చే వరద ప్రవాహం మరింత పెరగనుంది. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు వరద రాష్ట్రంలో మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టుకు 31,412 క్యూసెక్కుల వరద వస్తుండగా, 21.34 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,634 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు అయినప్పటికీ డ్యామ్ భద్రతపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్ఆర్పీ) హెచ్చరికల నేపథ్యంలో నిల్వను 21 టీఎంసీలకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 31,500 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.22 టీఎంసీలకు చేరాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.04 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 54.63 టీఎంసీలకు పెరిగాయి. కడెం నదిపై నిర్మించిన కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 1.33 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 3.06 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ, 2.04 లక్షల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం 18 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు దిగువన చేపల వేటకు వెళ్లిన కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ (41) నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు 15వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో ఐదు గేట్లు ఎత్తి 25,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 10,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఐదు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్, కడెం నుంచి వస్తున్న వరద తోడుకావడంతో దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, 18.23 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 20 గేట్లను ఎత్తి 53,800 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. నంది పంప్హౌస్ ద్వారా మరో 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్కు తరలించి అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ ద్వారా 11,000 క్యూసెక్కులను మిడ్మానేరు రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి త్వరలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్లోకి నీటి పంపింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. దిగువ గోదావరిలో కొనసాగుతున్న ఉధృతి ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన వరద ఇంకా చేరకపోవడంతో దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్కి 6,142, అన్నారం బరాజ్కి 7,825 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. అయితే, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీళ్లు నింపరాదని ఎన్డీఎస్ఏ సూచించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో దిగువ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్ నుంచి ధవళేశ్వరం బరాజ్కు దిగువన సముద్రంలో కలిసే వరకూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నది వచ్చి కలవడంతో మేడిగడ్డ బరాజ్కి 3.73 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, దాన్ని మొత్తం కిందికి విడుదల చేస్తున్నారు. దానికి ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బరాజ్లోకి 4.60 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 3.56 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండడంతో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు గుండా ప్రవహించి ధవళేశ్వరం బరాజ్ మీదుగా సముద్రంలోకి వరద చేరుతోంది. వాగులు వంకలు ఏకంరాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పలు జిల్లాల్లో పొంగుతున్న వాగులు సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతినటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక విభాగాలు సిద్ధమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా: ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబాబాద్, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాకాల వాగు బ్రిడ్జి పైనుంచి వరద పొంగిపొర్లుతోంది. దీంతో ఏటి అవతలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ మండలంలోని గుంజేడువాగు, గాదెవాగు, రాళ్లతెట్టెవాగు, ముస్మివాగు, మొండ్రాయిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బయ్యారం మండలం ఇల్లెందు– మహబూబాబాద్ రహదారి పైనుంచి జిన్నెలవర్రె వాగు పొంగి ప్రవహిస్తోంది. ములుగు జిల్లా మేడారంలోని జంపన్నవాగులో మేడారం బ్రిడ్జిని ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నగర్– వెంగ్లాపూర్ మధ్య ఉన్న యాసంగి తోగు వరద రోడ్డును కమ్మేయడంతో పస్రా నుంచి మేడారానికి శనివారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, ఎల్బాక, పడిగాపూర్, నార్లాపూర్ గ్రామాల్లోని వరి పొలాలు నీట మునిగాయి. ఎల్బాక, పడిగాపూర్ గ్రామా లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు సామర్థ్యం 33 ఫీట్ల 6 ఇంచులు కాగా, శనివారం సాయంత్రం వరకు చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపసముద్రం, భీంఘనపురం రిజర్వాయర్లలోకి 18 అడుగుల మేర నీరు చేరింది. మోరంచవాగు ఉప్పొంగి ప్రవహించింది. చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల చలివాగుకు వరద పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా: ఖమ్మం, పాలేరు, వైరా, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. వైరా, కారేపల్లి మండలాల్లో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల కాలనీలను వరద ముంచెత్తగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మున్నేటికి వరద నెమ్మదిగా పెరుగుతుండడంతో నీటిమట్టం శనివారం రాత్రి 15 అడుగులకు చేరింది. దీంతో మున్నేటికి ఇరువైపులా పరిస్థితులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి స్థానికులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పత్తి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో శనివారం కుండపోతగా వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అత్యధికంగా 98.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూరు, కాగజ్నగర్ పట్టణాల్లో లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఆదిలాబాద్ తరుణం వాగులో రెండు లారీలు వరదలో చిక్కుకుపోగా, డ్రైవర్లను పోలీసులు రక్షించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్, భాగ్యనగర్, కృష్ణానగర్ కాలనీల్లోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బజార్హత్నూర్, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి తదితర మండలాల్లో పత్తి, సోయా, వరి పంటలు దెబ్బ తిన్నాయి. ఇంద్రవెల్లి మండలం ముట్నూరు వద్ద ఆదిలాబాద్–మంచిర్యాల రహదారి తెగిపోయింది. సిరికొండలోని చిక్మాన్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సాత్నాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పంట పొలాలు నీట మునిగాయి. బోధన్ డివిజన్ పరిధిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. జలాల్పూర్–బడాపహాడ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచాయి. కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రామారెడ్డి మండలంలో 12.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పోచారం ప్రాజెక్టు నిండి అలుగులు పోస్తూ మంజీరలోకి ప్రవహిస్తోంది. ఎగువన సింగూరు, గణపురం ఆనకట్టల ద్వారా కూడా దిగువకు నీటిని వదులుతుండడంతో మంజీర ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 31 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒక ఇల్లు పూర్తిగా, 11 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. -
బాబు మార్కు కనికట్టు!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి యూనిట్ విద్యుత్ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ధర ఎక్కువన్నారు.. పాతికేళ్ల పాటు వ్యవసాయ అవసరాలకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తెస్తుంటే వద్దన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత తక్కువ ధరకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల మినహాయింపుతో విద్యుత్ తీసుకుంటా మంటే అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేశారు.. కానీ, అదే కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక యూనిట్ విద్యుత్కు రూ.3.20 చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో పిలిచిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం కోసం పంపేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సన్నాహాలు చేస్తున్నాయి. మరి ఈ పాలకులను ఏమనాలి? రెండు నాల్కల ధోరణి అనాలా? అవకాశవాదం అనాలా? ప్రజలను తప్పుదారి పట్టించే మోసగాళ్లు అనాలా? అధిక ధర ముసుగులో కమీషన్లు కొట్టేసే కేటుగాళ్లు అనాలా?సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనిట్ సోలార్ విద్యుత్ రూ.2.49కే వస్తోందంటే నానా యాగీ చేసిన ఇదే కూటమి.. అధికారంలోకి రాగానే యూనిట్ విద్యుత్ను రూ.3.20 చొప్పున ప్రైవేటు సంస్థల నుంచి కొనేందుకు సిద్ధమైపోయింది. తమకొక న్యాయం.. ఎదుటి వాళ్లకు మరో న్యాయం అని నిస్సిగ్గుగా చెబుతూ బరితెగించింది. రాష్ట్రంలో దాదాపు 19 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఉంటే, వీటిలో 3 లక్షల సర్వీసులకు సరిపోయేలా కుసుమ్ పథకం కింద 3,325 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం గల మినీ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 1,185.80 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈ ఏడాది మార్చిలో సర్కిళ్ల వారీగా టెండర్లు పిలిచాయి. యూనిట్కు కనిష్ఠంగా రూ.3.19 గరిష్ఠంగా రూ.3.60 ధరను గుత్తేదారులు కోట్ చేశారు. తాజాగా ఈ టెండర్ల ధరలను కూడా ఖరారు చేశారు. దాని ప్రకారం.. యూనిట్కు రూ.3.19 నుంచి రూ.3.20 మధ్య ఇవ్వనున్నారు. ఎకోరాన్ కంపెనీకి యూనిట్కు రూ.3.18, వృద్ధిమాన్ సంస్థకు యూనిట్కు రూ.3.19, భవ్య కంపెనీకి రూ.3.20 చొప్పున టెండర్లను ఖరారు చేసేందుకు రంగం సిద్ధమైంది. నిజానికి వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్కు ఢోకా లేకుండా అందించేందుకు గత ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ఇంకా అమలులోనే ఉంది. దాని ప్రకారం ఇంతకంటే తక్కువ ధరకు సెకీ నుంచి విద్యుత్ను తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ దానిని కాదని, పొలాల వద్ద మినీ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి సౌర విద్యుత్ బహిరంగ మార్కెట్లో ఇంత కన్నా తక్కువ ధరకే వస్తోంది. అప్పనంగా 5,983.5 ఎకరాలు ధారాదత్తంమినీ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రైవేటు సంస్థలకు టెండర్లు అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలోని 9 సర్కిళ్లలో 610 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కం టెండర్లు పిలిచింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు సర్కిళ్ల పరిధిలో ప్రాజెక్టుల ఏర్పాటుకు 3,055 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఈ డిస్కం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోని 4 సర్కిళ్లలో 355.50 మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు 1,842 ఎకరాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 220.30 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించగా, దీని కోసం 1,086.5 ఎకరాలు గుర్తించారు. మొత్తంగా 5,983.5 ఎకరాలను సిద్ధం చేశారు. మిగులు ఉండగా కొత్తవి ఎందుకు?రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రిడ్ గరిష్ట డిమాండ్ 13 వేల మెగావాట్లు మించి లేదు. అది కూడా వేసవి వంటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న రోజుల్లో మాత్రమే. మిగతా ఏడాదంతా 10 వేల మెగావాట్లలోపే విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. భవిష్యత్ అవసరాల కోసం, డిమాండ్ భారీగా పెరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకంటూ ఇప్పటికే డిస్కంలు 23 వేల మెగావాట్లకు పీపీఏలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల నుంచి ప్రస్తుతం సుమారు 14 వేల మెగావాట్ల విద్యుత్ సమకూరుతోంది. అంటే డిమాండ్కు అవసరమైన విద్యుత్ కంటే ఎక్కువగానే విద్యుత్ అందుబాటులో ఉంది. దీంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని అనేకసార్లు నిలిపివేయాల్సి వస్తోంది. ఇలాంటి మిగులు విద్యుత్ పరిస్థితులు రాష్ట్రంలో ఉండగా, ఇంకా అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది కూటమి ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల డిస్కంలపై ఆర్థికంగా చాలా భారం పడే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.అధికారం చేతికి రాగానే దోపిడీ⇒ చంద్రబాబు అధికారంలోకి రాగానే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పట్టాలెక్కించడానికి ఉపక్రమించారు. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన యూనిట్ రూ.4.60 చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ 400 మెగావాట్ల పునరుత్పాదక (పవన–సౌర హైబ్రీడ్) విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి, వాటి నుంచి పాతికేళ్ల పాటు రాష్ట్ర విద్యుత్ సంస్థలకు విద్యుత్ను విక్రయించేలా ఏర్పాటు చేశారు.⇒ వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గతంలో చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్న పీపీఏల వల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని గుర్తించి, వాటిని పునఃపరిశీలించాలని భావించింది. ఆ క్రమంలోనే యాక్సిస్ పీపీఏలను పక్కన పెట్టింది. కానీ మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పట్టాలెక్కించారు చంద్రబాబు. తాను సగంలో ఆపేసిన దానిని ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో మార్కెట్లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ, రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారు. ⇒ భవిష్యత్తులో పునరుత్పాదక విద్యుత్ ధరలు తగ్గుతాయని, కావున సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి యూనిట్ రూ.2.49తో సౌర విద్యుత్ను కొనుగోలు చేయడం భారమని వాదించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మినీ సోలార్ ప్రాజెక్టుల పేరుతో రూ.3.20తో యూనిట్ కొనుగోలుకు సిద్ధమైపోయింది.సబ్సిడీ ఎగ్గొట్టే కుట్రమినీ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వెనుక ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ను ఎత్తేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా సమస్య వచ్చి, ఆ సంస్థలు ఎదురు తిరిగితే రైతులకు ఈ కేంద్రాల నుంచి విద్యుత్ లభించకపోవచ్చు. అప్పుడు వారికి విద్యుత్ ఎలా అందిస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల కోసం డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లు అందించింది. అదే టీడీపీ గత హయాంలో 2014–19 మధ్య ఐదేళ్లకు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. పైగా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. చంద్రబాబు గత అయిదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా, జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 వ్యవసాయ ఫీడర్ల ద్వారా 9 గంటలు పగటి పూట విద్యుత్ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామర్థ్యాన్ని గత ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు వాటి వద్దనే టీడీపీ ప్రభుత్వం సోలార్ ప్లాంట్లు పెట్టిస్తామంటోంది. ఇదంతా వ్యవసాయానికి ఇప్పుడు ఇస్తున్న దాదాపు రూ.12 వేల కోట్ల సబ్సిడీని ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.‘సెకీ’ ఒప్పందంపై ఎన్నో కుట్రలు ⇒ రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేయడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి 17 వేల మిలియన్ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్ను కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వంలో ఒప్పందం జరిగింది. అది కూడా అత్యంత చవకగా.. యూనిట్ రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ⇒ 2022–23లో యూనిట్ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్ను తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన సెకీ నుంచే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా యూనిట్ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్ రూ.2.49కే ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ⇒ సౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు వస్తుందని చెప్పింది. సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సైతం ఆదేశాలిచ్చింది. సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్ ప్రసార చార్జీలు ఉండవని కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) కూడా స్పష్టం చేసింది.⇒ చివరికి ‘సెకీ’, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్టీఎస్ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ గత ప్రభుత్వంపై బుదరజల్లి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు వేశారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్, ఎల్లో మీడియా సెకీ ఒప్పందంపై విషం గక్కాయి. సెకీ ఒప్పందాన్ని ఓ అవినీతి భూతంగా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేశాయి. అసత్య కథనాలు, అబద్ధ ప్రచారాలతో రైతులకు సైతం ఉచిత విద్యుత్ను దూరం చేయాలని ప్రయత్నించాయి. ⇒ ఈ కుట్రలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పటాపంచలు చేసింది. సెకీ ఒప్పందం సక్రమమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే బాబు ప్రభుత్వం అదే సౌర విద్యుత్ను యూనిట్కు రూ.3.20 చొప్పున చెల్లించి కొంటున్నారంటే దాని వెనుక ఎంతటి అవినీతి దాగుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. -
ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. గతేడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్తో పోలిస్తే ఈసారి 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇందులో దాదాపు మూడో వంతు మార్కెట్ వాటా యాపిల్దే ఉంది. సైబర్మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం యాపిల్ ఐప్యాడ్ సరఫరాలు వార్షికంగా 10 శాతం, త్రైమాసికాలవారీగా 78 శాతం పెరిగాయి. 30 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఐప్యాడ్ 11 సిరీస్కి డిమాండ్ నెలకొనడం ఇందుకు దోహదపడింది. సమీక్షాకాలంలో యాపిల్ మొత్తం విక్రయాల్లో దీని వాటా 70 శాతం పైగా నమోదైంది. ఇక, 15 శాతం వార్షిక వృద్ధి, 27 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండో స్థానంలో నిల్చింది. విస్తృతమైన ఉత్పత్తుల పోర్ట్ఫోలియో కారణగా అఫోర్టబుల్, ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్లో కంపెనీ నిలకడగా రాణించింది. మొత్తం శాంసంగ్ ట్యాబ్ల విక్రయాల్లో గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ 5జీ వాటా ఏకంగా 81 శాతంగా నమోదైంది. 2025లో ట్యాబ్లెట్ మార్కెట్ 10–15 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని సీఎంఆర్ అంచనా వేసింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు 18 శాతం పెరిగినప్పటికీ లెనోవో మార్కెట్ వాటా ఫ్లాట్గా 16 సాతం స్థాయిలోనే కొనసాగింది. → షావోమీ, వన్ ప్లస్ల అమ్మకాలు వరుసగా 81 శాతం, 95 శాతం పెరగ్గా, మార్కెట్ వాటా 15 శాతం, 6 శాతంగా నమోదైంది. → రేటుకు తగ్గ విలువను అందించే షావోమీ, వన్ప్లస్ లాంటి బ్రాండ్ల ట్యాబ్లెట్లకు విద్యార్థులు, గిగ్ వర్కర్ల నుంచి డిమాండ్ కనిపించింది. → దేశీ మార్కెట్ క్రమంగా మరింత ఉత్పాదకత, వినోదాన్ని అందించే 5జీ ఆధారిత ప్రీమియం, రేటుకు తగ్గ విలువను ఇచ్చే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల వైపు మళ్లుతోంది. పండుగ సీజన్ నేపథ్యంలో అమ్మకాలు నిలకడగా వృద్ధి చెందవచ్చు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం
దోమలపెంట/నాగార్జునసాగర్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ఆనకట్ట వద్ద శనివారం ఐదు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్ వే ద్వారా 41,112 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 38,879 క్యూసెక్కులు, సుంకేçశుల నుంచి 30,653 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,10,644 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి వస్తోంది. దీంతో 5 గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేరకు ఎత్తి 1,33,720 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు.మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,509 క్యూసెక్కులు కలిపి 65,824 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.1 అడుగుల నీటిమట్టం వద్ద 199.7354 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల్లో పోతిరెడ్డిపాడు ద్వారా 25,333, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,426 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు కేంద్రంలో 16.956 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.357 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు. పై నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తి 1,56,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 29,516 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశ యం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు). ప్రస్తుత నీటిమట్టం 587.40 అడుగులు(305.7464టీఎంసీలు) ఉంది. -
చంద్రబాబు సర్కార్ పాపం.. పోలవరానికి శాపం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణానికి వీలుగా గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడానికి నిర్మించిన ఎగువ కాఫర్ డ్యామ్ తాజాగా కుంగిపోయింది. వాస్తవానికి దీనిపై భారీ వాహనాల రాకపోకలకు అనుమతించకూడదు. కానీ.. బట్రెస్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులకు అవసరమైన మట్టి, రాళ్లు, కంకర, సిమెంటును భారీ వాహనాల్లో ఎగువ కాఫర్ డ్యామ్ మీదుగానే సరఫరా చేస్తున్నారు.ఇందుకోసం కాఫర్ డ్యామ్ల మధ్య ప్రత్యేకంగా దారిని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్దే. కానీ.. కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చి, కమీషన్లు వసూలు చేసుకోవడానికి ఎగువ కాఫర్ డ్యామ్ మీదుగానే భారీ వాహనాల్లో వాటిని సరఫరా చేయడానికి సర్కార్ అనుమతించింది. ఆ భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రకంపనలు, ఒత్తిడి వల్ల ఎగువ కాఫర్ డ్యామ్ 10 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతున దిగువకు కుంగి పోయింది.శుక్రవారం ఉదయం దీన్ని గమనించిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా రాళ్లు, మట్టి వేసి పూడ్చివేశారు. మళ్లీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చేశారు. ఈ పనులను పోలవరం ఎస్ఈ రామచంద్రరావు, ఏజెన్సీ ప్రతినిధులు పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యామ్ భద్రతపై చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధి లోపం మరోసారి బహిర్గతమైందని సాగునీటి రంగ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. కమీషన్ల కక్కుర్తి వల్లే సీపేజీ ⇒ గోదావరికి 2017లో వరద ప్రవాహం ముగిశాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లను 2018 జూన్ నాటికి అప్పటి చంద్రబాబు సర్కార్ పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మించే ప్రదేశంలో కమీషన్ల కక్కుర్తితో ఇసుక సాంద్రతను తప్పుగా లెక్కించి.. 40 మీటర్ల లోతుతో నిర్మించాల్సిన జెట్ గ్రౌటింగ్ వాల్ను 20 మీటర్ల లోతుతో నిర్మించింది. ⇒ గోదావరి ప్రవాహం ప్రభావం జెట్ గ్రౌటింగ్ వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో 2018లో గోదావరి వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య కోతకు గురై దెబ్బతింది. 20 మీటర్ల లోతుతో నిర్మించిన జెట్ గ్రౌటింగ్ వాల్ పటిష్టంగా ఉందో లేదో తెలుసుకోకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించి.. 2019 మార్చి నాటికి పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. ⇒ దీనివల్లే ఎగువ కాఫర్ డ్యామ్లో భారీ ఎత్తున సీపేజీ (లీకేజీ) సమస్య ఉత్పన్నమైందని, ఇది ఎగువ కాఫర్ డ్యామ్ భద్రతను ప్రశ్నార్థకం చేసిందని స్పష్టం చేసింది. ఎగువ కాఫర్ డ్యామ్ భద్రతకు బట్రెస్ డ్యామ్ను నిర్మించాలని సూచించింది. దాంతో రూ.వందల కోట్లు వెచ్చించి బట్రెస్ డ్యామ్ను నిర్మించాల్సి వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.వెంటాడుతున్న పాపాలు ⇒ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో కేంద్రమే పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించాలి. కానీ.. కమీషన్ల కక్కుర్తితో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. 2016 సెప్టెంబర్ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పటి చంద్రబాబు సర్కార్ దక్కించుకుంది. ⇒ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) సూచించిన విధానాన్ని తుంగలో తొక్కి.. కమీషన్లు వచ్చే పనులనే చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ గ్యాప్–2 పునాది డయా ఫ్రం వాల్ను నిర్మించింది. ⇒ దీంతో 2017, 2018 గోదావరి వరదల ఉధృతికి డయా ఫ్రం వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురైంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయలేక.. ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి, 2019 ఫిబ్రవరి నాటికి చేతులెత్తేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లలో వదిలేసిన ఖాళీలు అంటే 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద 800 మీటర్లకు కుదించుకుపోయి ప్రవహించడం వల్ల వరద ఉధృతి మరింత పెరిగి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురైంది.⇒ 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. చంద్రబాబు సర్కార్ తప్పిదాలను సరిదిద్ది.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించింది. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీలను పూర్తి చేసి.. ఎడమ కాలువలో కీలకమైన నిర్మాణాలను పూర్తి చేసి.. కేంద్రంతో చర్చించి నిధుల సమస్యను పరిష్కరించింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించి పోలవరం ప్రాజెక్టుకు జీవంపోసింది. ⇒ చంద్రబాబు సర్కార్ 2016–18 మధ్య కమీషన్ల కక్కుర్తితో చారిత్రక తప్పిదాలకు పాల్పడకపోయి ఉంటే 2023 నాటికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
యాపిల్ ఉత్పత్తుల సరఫరా 21% అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో భారత్లో యాపిల్ ఉత్పత్తుల సరఫరా వార్షికంగా 21.5 శాతం పెరిగి 59 లక్షల యూనిట్లకు చేరుకుంది. అత్యధికంగా సరఫరా అయిన మోడల్గా ఐఫోన్ 16 నిల్చింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఓ నివేదికలో ఈ విషయాలు తెలిపింది. దీని ప్రకారం గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే దేశీ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల సరఫరా 0.9 శాతం పెరిగి 7 కోట్లకు చేరింది. పోకో, షావోమీ, వన్ప్లస్, రియల్మి తదితర చైనా సంస్థల ఫోన్ల సప్లై తగ్గింది. ఇక రెండో త్రైమాసికంలో మొత్తం 3.7 కోట్ల స్మార్ట్ఫోన్స్ సరఫరా అయ్యాయి. యాపిల్ ఐఫోన్ల సరఫరా 19.7 శాతం పెరిగి 27 లక్షల యూనిట్లకు చేరింది. స్మార్ట్ఫోన్ మార్కెట్లో 7.5 శాతం వాటా దక్కించుకుంది. మరిన్ని విశేషాలు.. → జూన్ క్వార్టర్లో 19 శాతం మార్కెట్ వాటాతో వివో అగ్ర స్థానంలో (23.5 శాతం వార్షిక వృద్ధి) నిల్చింది. 14.5 శాతం వాటాతో శాంసంగ్ (21 శాతం వృద్ధి) రెండో స్థానంలో ఉంది. ఒప్పో (13.4 శాతం వాటా, 25.4 శాతం వృద్ధి), మోటరోలా (8 శాతం వాటా, 39.4 శాతం వృద్ధి) ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. → వన్ప్లస్ మార్కెట్ వాటా 4.4 శాతం నుంచి 2.5 శాతానికి, సరఫరా 39.4 శాతం మేర పడిపోయాయి. → రియల్మి మార్కెట్ వాటా 9.7 శాతానికి, స్మార్ట్ఫోన్ల సప్లై 17.8 శాతం మేర క్షీణించాయి. అటు షావోమీ మార్కెట్ వాటా కూడా 9.6 శాతానికి, వాల్యూమ్స్ 23.5 శాతం స్థాయిలో తగ్గాయి. పోకో 3.8 శాతానికి తగ్గగా, సరఫరా 28.8 శాతం మేర క్షీణించింది. → ప్రీమియం సెగ్మెంట్ డివైజ్లు (రూ.52,000 నుంచి రూ. 70,000 వరకు) అత్యధికంగా 96.4% వృద్ధి చెందాయి. మార్కెట్ వాటా 2 నుంచి 4 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో ఐఫోన్ 16/15ల వాటా అయిదింట మూడొంతులు ఉంది. → సూపర్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లు (రూ. 70,000 కన్నా పైన) 15.8% వృద్ధి చెందగా, మార్కెట్ వాటా పెద్దగా మార్పులు లేకుండా 7 శాతంగా కొనసాగింది. శాంసంగ్, యాపిల్ మార్కెట్ వాటా వరుసగా 49%, 48%గా ఉంది. ఈ సెగ్మెంట్లో ఐఫోన్ 16, గెలాక్సీ ఎస్25, ఎస్24 అల్ట్రా, ఎస్25, ఐఫోన్ 16ప్లస్ కీలక మోడల్స్గా ఉన్నాయి. → స్మార్ట్ఫోన్ల సగటు విక్రయ ధర (ఏఎస్పీ) 10.8% పెరిగి రికార్డు స్థాయిలో 275 డాలర్లకు చేరింది. → ఎంట్రీ స్థాయి (రూ. 8,700 లోపు) సెగ్మెంట్ 22.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది క్వార్టర్తో పోలిస్తే మార్కెట్ వాటాను 14 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. → మాస్ బడ్జెట్ సెగ్మెంట్ (రూ. 8,700 నుంచి రూ. 17,400 వరకు) ఫోన్ల సరఫరా పరిమాణం 1.1 శాతం పెరగ్గా, ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్ (రూ. 17,400 – రూ. 35,000) సరఫరా 2.5 శాతం, మార్కెట్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గాయి. -
ఫార్మా విలేజ్లకు భూసేకరణ గండం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు భూ సేకరణ సవాలుగా మారింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఫార్మా విలేజ్ ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోనూ ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ విడుదల చేసినా.. భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మిగతా చోట్ల ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, భూమి లభ్యతను గుర్తించే దశలోనే అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు కోసం సేకరించిన 13వేల ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీతోపాటు యంగ్ ఇండియా యూనివర్సిటీ వంటి ఇతర అవసరాలకు ప్రభుత్వం కేటాయిస్తుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఫార్మా యూనిట్ల ఏర్పాటుకు భూకేటాయింపుల కోసం పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు. పది ఫార్మా విలేజ్లకు ప్రతిపాదన ఫార్మారంగానికి రాష్ట్రాన్ని అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఫార్మా విలేజ్లు (లైఫ్ సైన్సెస్ హబ్)లు ఏర్పాటు చేస్తామని 2024 ఫిబ్రవరి 27న జరిగిన బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్రెడ్డి ప్రకటన చేశారు. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు వేల నుంచి మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు 20వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేశారు. తొలి దశలో లగచర్ల, న్యాల్కల్లో.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఫార్మా విలేజ్ కోసం భూ సేకరణకు 2024 జూలై 19న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్ల, దుద్యాలలో 580 మంది రైతుల నుంచి 1,358 ఎకరాలు సేకరిస్తామని చెప్పింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూరు, వడ్డి, మల్గి గ్రామాల్లోనూ మరో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు అవసరమయ్యే 2003.39 ఎకరాల భూ సేకరణకు 2024 ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఫార్మా విలేజ్తో తాము ఉపాధి కోల్పోతామని లగచర్ల రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. అయితే ఫార్మా విలేజ్కు బదులుగా ‘మలీ్టపర్పస్ ఇండ్రస్డియల్ పార్కు’ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి 1,358 ఎకరాల భూసేకరణకు గత నవంబర్ 29న మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీపర్పస్ ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటు భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కాగా, మరో 150 ఎకరాల మేర సేకరించాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇదిలాఉంటే న్యాల్కల్లోనూ రైతుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఇతర జిల్లాల నుంచి ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు అవసరమైన భూమి లభ్యతకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని టీజీఐఐసీ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు పైనా.. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల పరిధిలో 19వేల ఎకరాల్లో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు 11వేల ఎకరాల మేర భూ సేకరణ జరగ్గా, ఇందులో కొన్ని న్యాయపర వివాదాలు సాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మా సిటీ లక్ష్యాన్ని పునర్నిర్వచిస్తూ గ్రీన్ ఫార్మాసిటీతోపాటు సకల హంగులతో కూడిన ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందులో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, ఏఐ సిటీ వంటి ప్రాజెక్టులను ప్రకటించింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను అదే అవసరాలకు ఉపయోగించాలని లేని పక్షంలో తమ భూములు తిరిగి అప్పగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు ఫార్మా విలేజ్లకు భూసేకరణ క్లిష్టంగా మారుతుండగా, మరోవైపు పొరుగునే ఉన్న కర్ణాటక ఫార్మా పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
రిస్క్ లను ఎదుర్కొనే చర్యలు అవసరం
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) నుంచి వచ్చే రిస్క్లను అధిగమించే విధానాన్ని బ్యాంక్లు, ఇతర ఆర్థిక సంస్థలు రూపొందించుకోవాలంటూ ఆర్బీఐ ప్యానెల్ ఒకటి సిఫారసు చేసింది. తగిన రక్షణలు లేకపోతే రిస్క్ లు మరింత పెరిగిపోవచ్చని పేర్కొంది. ఆర్థిక రంగంలో ఏఐని బాధ్యాయుత, నైతిక మార్గంలో వినియోగించేందుకు తగిన కార్యాచరణను సూచించాలంటూ గత డిసెంబర్లో ఆర్బీఐ ప్యానెల్ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ ప్యానెల్ తన నివేదికను ఆర్బీఐకి సమరి్పంచింది. రిస్క్ లకు తగిన రక్షణలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏఐతో ఆర్థిక సేవల రంగం తన సామర్థ్యాలను పెంచుకోవచ్చని ప్యానెల్ సూచించింది. అభివృద్ధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఏఐ కొత్త మార్గాలను చూపిస్తుందని పేర్కొంది. బహుళ నమూనా, బహుభాషా ఏఐతో ఆర్థిక సేవలకు దూరంగా ఉన్న వారికి సైతం చేరువ కావొచ్చని సూచించింది. ఆర్బీఐ నియంత్రణల్లోని సంస్థలు బోర్డు ఆమోదిత ఏఐ విధానాన్ని రూపొందించుకోవాలని పేర్కొంది. సైబర్ భద్రత విధానాలను మెరుగుపరుచుకోవడం, ఘటనలకు సంబంధించి వెంటనే నివేదించడం తదితర సూచనలను కూడా ప్యానెల్ చేసింది. -
గూగుల్ని అడిగేస్తూ..చెప్పింది చేసేస్తూ..
ఒకప్పుడు.. తేలికపాటి అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుడి దగ్గరికో దగ్గరిలోని మెడికల్ షాపుకో వెళ్లేవాళ్లం. డాక్టర్ రాసినవో, మెడికల్ షాపువాళ్లు ఇచ్చినవో మందులు తెచ్చుకునేవాళ్లం. దగ్గరివాళ్లు ఇచ్చే ఆరోగ్య సలహా పాటించేవాళ్లం. ఇప్పుడు ఇంటర్నెట్ కాలం నడుస్తోంది. ఆరోగ్యం, శరీర సంరక్షణకు సంబంధించి ప్రజల ప్రవర్తన, ప్రాధాన్యతలు ఎంతలా మారాయంటే సమస్య వచ్చినప్పుడే కాదు ఆర్యోగంగా ఉండేందుకూ ఏం చేయాలో సింపుల్గా గూగుల్ను అడిగేస్తున్నారు! – సాక్షి, స్పెషల్ డెస్క్ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు, అనుమానాలను.. ఇతరులతో చర్చించడానికి చాలామంది ఇష్టపడరు. అంతేకాదు, హాస్పిటల్కు వెళితే ఖర్చు అని వెనకడుగు వేసేవారూ ఉన్నారు. ఇంటర్నెట్ రాక, గూగుల్ సెర్చ్ ఇంజిన్ దైనందిన జీవితంలో భాగమయ్యాక ఇలాంటి వాళ్లందరికీ పెద్ద ఉపశమనం లభించినట్టు అయింది. చిన్న సమస్య తలెత్తినా, అనుమానం ఉన్నా, వేరొకరికి చెప్పలేనిదైనా.. ఒకరిపై ఆధారపడకుండా సింపుల్గా గూగుల్ని అడిగేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ ‘కాంటార్’ రూపొందించిన ‘హెల్త్ అండ్ వెల్నెస్ ఇన్ ఇండియా’ నివేదికే ఇందుకు నిదర్శనం. హెల్త్, వెల్నెస్కు సంబంధించి 2024లో నెటిజన్లు గూగుల్లో వెతికిన 110 రకాలకుపైగా అంశాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. ‘మన’ గూగుల్‘ఫలానా ఉత్పత్తి వాడాను, చాలా బాగా పనిచేసింది’. ‘ఫలానా పద్ధతి పాటించడం వల్ల పరిష్కారం దొరికింది’ అంటూ మన అనుకున్నవారిచ్చే సలహా పాటిస్తాం. మరి మన అని అనుకున్నవారు లేకపోతే? గూగుల్ను ఆశ్రయిస్తున్నారు! ప్రపంచవ్యాప్తంగా రోజుకు 850 కోట్ల వరకు గూగుల్ సెర్చెస్ నమోదవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ సెర్చ్ ఇంజిన్ ‘మన’ అయిందో అర్థం చేసుకోవచ్చు. భారత్ నుంచి గూగుల్లో నెలకు 1,200 కోట్ల విజిట్స్ నమోదవుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో యూఎస్ తర్వాత రెండో స్థానం మనదే. అయితే సెర్చ్ ఇంజిన్ చూపించే ఉత్పాదనను ఎంత మంది కొన్నారు, రేటింగ్స్ ఏంటి, రివ్యూలు ఏం చెబుతున్నాయో తెలుసుకున్నాకనే యూజర్లు అడుగు ముందుకేస్తున్నారు. జాగ్రత్త అవసరంగూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లను నమ్మి ఔషధాలు కొని, వాడేయటం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుడు.. పేషెంట్ శరీర తత్వాన్ని పూర్తిగా తెలుసుకుని మందులు సిఫార్సు చేస్తాడు. కానీ గూగుల్ అలాకాదు.. సాధారణీకరించి మందులు చెప్పేస్తుంది. అందువల్ల గూగుల్ సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలు పోషకాలు–సప్లిమెంట్లు, ప్రత్యామ్నాయ వైద్యం, చర్మ సంరక్షణ, శారీరక దృఢత్వం, శరీర బరువు నిర్వహణ, మానసిక ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, నిద్ర, రోగనిరోధక శక్తి, అధునాతన వైద్యం, డీటాక్సిఫికేషన్ , దీర్ఘాయువు, బీ12 అధికంగా ఉండే ఆహారం, నడకకు ఉత్తమమైన షూ, సున్నిత చర్మానికి సౌందర్య సాధనాలు, చక్కెర లేని ఆహార పదార్థాలు.. వగైరా.టాప్–5 పోకడలునమ్మదగిన ఆరోగ్య పరిష్కారాలుప్రత్యక్షంగా కనిపించే, నమ్మకమైన ఫలితాలను వినియోగదారులు కోరుకుంటున్నారు. చర్మ సంరక్షణ, శరీర బరువు నిర్వహణ, వ్యాయామంపై 2.66 కోట్ల సెర్చులు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇవి 39% పెరిగాయి. చర్మ ఆరోగ్యానికి కొల్లాజెన్, మెరుగైన నిద్ర కోసం మెలటోనిన్, శక్తి కోసం ప్రీ–వర్కౌట్ సప్లిమెంట్స్ కోసం జనంలో ఆసక్తి పెరిగింది.క్లినికల్, స్వీయ–సంరక్షణసైన్ ్స ఆధారిత వెల్నెస్ ఎక్కువగా కోరుకుంటున్నారు. బరువు తగ్గించే జీఎల్పీ–1 మందులు, జ్ఞాపకశక్తి పెంచే సప్లిమెంట్లు, హార్మోన్ల ట్రాకింగ్ కోసం 1.46 కోట్ల శోధనలు జరిగాయి. 2023తో పోలిస్తే ఇవి 13 శాతం ఎక్కువ. అంతర్గత ఆరోగ్యం–బాహ్య శక్తిఅందం, మానసిక స్థితి, శరీర బరువు నిర్వహణ, వృద్ధాప్యం వంటి సమస్యలు.. పోషకాహారం, పేగు (గట్) ఆరోగ్యం, రోగనిరోధక శక్తితో ముడిపడి ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. ఈ తరహా సెర్చ్లు 1.45 కోట్ల వరకు జరిగాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహకరించే ఔషధాలు, మల్టీవిటమిన్ లపై జనంలో ఆసక్తి పెరిగింది.ఆరోగ్యకర దినచర్యలురోజువారీ దినచర్యలు, ఆరోగ్య నిర్వహణలపై ప్రజల శ్రద్ధ పెరిగింది. 9% పెరుగుదలతో ఈ విభాగంలో 99 లక్షల శోధనలు నమోదయ్యాయి. హైడ్రేషన్, ఋతు చక్రం, ధ్యానం, యోగా వంటివి ట్రాక్ చేయడానికి సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మహిళలు నెలసరి సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యామ్నాయ వైద్యంఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, డిటాక్స్ టీ, బయోహ్యాకింగ్ వంటి వాటి గురించి 17% వృద్ధితో 87 లక్షల సెర్చ్లు జరిగాయి. (శాస్త్ర, సాంకేతికతల సాయంతో మన శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం లేదా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడాన్ని బయో హ్యాకింగ్ అంటారు.)పోషకాలు–సప్లిమెంట్లువిటమిన్ బీ12 కోసం 27 లక్షల శోధనలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇవి 54 శాతం ఎక్కువ కావడం గమనార్హం.చర్మ ఆరోగ్యంసున్నితమైన చర్మం కోసం సెర్చులు 30% పెరిగాయి.బరువు నిర్వహణజీఎల్పీ1 ఔషధాలైన ఓజెంపిక్ కోసం 216%, జెప్బౌండ్కు 943% అధికంగా సెర్చులు నమోదయ్యాయి.ఒత్తిడి తగ్గేందుకు కార్టిసాల్ కోసం శోధనలు 59% పెరిగాయి.మహిళల ఆరోగ్యంగతంతో పోలిస్తే.. రుతుచక్రంలోని దశల గురించి వెతకడం 100 శాతానికిపైగా పెరిగింది.నిద్రమెలటోనిన్ సంబంధిత స్ప్రే, గమ్మీలు, ట్యాబ్లెట్ల కోసం సెర్చులు 27% పెరిగి 45 లక్షలకు చేరుకున్నాయి. చక్కెరచక్కెర రహిత, చక్కెరకు ప్రత్యామ్నాయాల కోసం.. గతంలో కంటే 14 శాతం ఎక్కువగా 74 లక్షల శోధనలు జరిగాయి. -
మేమెక్కడికి పోవాలె.. ఈ పల్లె.. మా గడ్డ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఆ పల్లెలో మూడు తరాల ప్రజలు ఉన్నంతలో సుఖంగా జీవించారు. ప్రస్తుతం నాలుగో తరం జీవనం సాగిస్తోంది. 200 ఏళ్లకు పైగా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆ పల్లె వాసులకు దేవాదాయ శాఖ రూపంలో ఆపద ముంచుకొచ్చింది. ఆలయ మాన్యం భూమిలో ఊరు ఉందంటూ.. గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు హుకుం జారీచేశారు. దీంతో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. నారాయణపేట జిల్లాలోని పల్లెగడ్డ వాసుల దీనగాథపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్..250కి పైగా కుటుంబాలు.. 16,124 జనాభాపర్వత ప్రాంతమైన పల్లెగడ్డ మొదట నారాయణపేట జిల్లా మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 2018లో ఇది నూతన జీపీగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఈ పల్లెలో 250 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నాయి. మొత్తం 16,124 మంది జనాభా.. 745 మంది ఓటర్లు ఉన్నారు. 20 ఎకరాలు గ్రామకంఠం భూమిగా రికార్డులో నమోదై ఉంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చిన్న రాజమూరు ఆంజనేయ స్వామి ఆలయం పేరిట సర్వే నంబర్ 269, 270, 271లో 69 ఎకరాల మాన్యం భూమి ఉంది. దీనికి పైభాగాన మరికల్లో నివసిస్తున్న కాట్టెకొండ వంశీయుల భూములు ఉన్నాయి. సుమారు 200 ఏళ్ల క్రితం ఆ వంశస్తులైన హన్మన్న, ముసిలన్న, చిన్న రాజన్న, తిమ్మన్న సదరు ఆలయ భూమిలో గుడిసెలు వేసుకుని కుటుంబాలతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో వారి వారసులు సైతం అక్కడే వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డారు. క్రమక్రమంగా జనాభా పెరుగుతూ వచ్చింది. పక్కా ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. దీంతో అప్పటి పెద్దలు గ్రామానికి పల్లెగడ్డగా నామకరణం చేశారు.2018లో 11 మందికి... ఇటీవల 25 మందికి..ఆలయ మాన్యం భూమిలో నిర్మించుకున్న ఇళ్లు తొలగించాలని 2018లో దేవాదాయ శాఖ అధికారులు పల్లెగడ్డ వాసులు 11 మందికి నోటీసులు జారీ చేశారు. దీంతో వారు నారాయణపేట జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్, జూలైలో మరో 25 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 18న దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ కోర్టుకు హాజరుకావాలని అందులో పేర్కొనడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొందిఏడేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా..అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయా లంటున్నారనే విషయాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఏడేళ్లుగా నారాయణపేట కోర్టు చుట్టూ తిరుగుతున్నా. గ్రామం ఖాళీ చేసి పోతే మా బతు కులేం కావాలి? మాకు అన్యాయం జరగకుండా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. – హన్మంతు, పల్లెగడ్డముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం..నేనొక్కడినే కాదు.. చాలా మంది అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నారు. మా ముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలంటూ నాతో పాటు 25 మందికి నోటీసులిచ్చారు. మాకు ప్రభుత్వం ఎక్కడైనా ఇళ్లు నిర్మించి ఇస్తే.. ఊరు ఖాళీ చేయడానికి అభ్యంతరం లేదు. – గోవింద్, పల్లెగడ్డ ఆధారాలుంటే కోర్టుకు సమర్పించాలి..చిన్నరాజమూరు ఆంజనేయ స్వామి ఆలయ భూమిలో ఇళ్లు నిర్మించడం వల్లే పల్లెగడ్డ గ్రామస్తులకు దశల వారీగా నోటీసులిస్తున్నాం. వారి వద్ద ఏమైనా ఆధారాలుంటే కోర్టులో సమర్పించాలి. లేకుంటే కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – కవిత, దేవాదాయ శాఖ ఈఓ, మహబూబ్నగర్ -
నిర్ణయాల ప్రక్రియలో కీలకంగా ఏఐ
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) పూర్తిగా ఆటోమేషన్ సాధనంగా కన్నా, మెరుగైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలోనే మరింత కీలకంగా ఉపయోగపడుతుందని పలు దిగ్గజ కంపెనీలు భావిస్తున్నాయి. పబ్లికేషన్ సంస్థ సీఐవోఅండ్లీడర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 2023 నుంచి వివిధ సృజనాత్మక ప్రక్రియల్లో కంటెంట్ మార్కెటింగ్ నుంచి సాఫ్ట్వేర్ కోడింగ్ వరకు జనరేటివ్ ఏఐ వినియోగం అయిదు రెట్లు పెరిగింది. 2025 ఆఖరు నాటికి కంపెనీలు 30 శాతం ఐటీ సరీ్వసులు పూర్తిగా ఏఐతో ఆటోమేట్ చేయనున్నాయి. వ్యయాలను తగ్గించుకోవడం, ప్రాసెసింగ్, నిర్వహణ సామరŠాధ్యలను పెంచుకోవాలన్న లక్ష్యాలే ఏఐని వినియోగించుకోవడానికి కారణమని 98.4 శాతం కంపెనీలు తెలిపాయి. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు కృత్రిమ మేథ విలువైన సాధనంగా ఉపయోగపడుతుందని 96 శాతం కంపెనీలు వివరించాయి. 2025 మే–జూలై మధ్య నిర్వహించిన సర్వేలో రూ. 5,000 కోట్ల పైగా వార్షిక టర్నోవరు ఉన్న కంపెనీలకు చెందిన 350 మంది చీఫ్ ఐటీ (లేదా) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు పాల్గొన్నారు. రిపోర్ట్లో మరిన్ని విశేషాలు.. → 2025లో 93 శాతం కంపెనీలు ఏఐ, అనలిటిక్స్పై పెట్టుబడులను పెంచనున్నాయి. సగం పైగా సంస్థ లు బడ్జెట్లను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నాయి. → ఐటీ కార్యకలాపాల్లో ఆటోమేషన్ కోసం, లోపాలను గుర్తించడం వంటి పనులకు 41 శాతం కంపెనీలు ఏఐని వినియోగిస్తున్నాయి. → చాట్బాట్లు, పర్సనలైజేషన్ లాంటి అవసరాల కోసం ఫైనాన్స్ (31 శాతం), కస్టమర్ సర్వీస్ (28 శాతం) విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. → 90 శాతం కంపెనీలు డేటా భద్రత, గోప్యతను ఏఐ వినియోగానికి ప్రధాన సవాలుగా ఉంటోంది. డేటా నాణ్యతపరమైన సవాళ్లు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. → 85 శాతం సంస్థలు ఏఐ సాధనాలను అంతర్గతంగానే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. -
అబార్షన్.. ఒకటే ఆప్షన్!
హైదరాబాద్లో ఉంటున్న హరీశ్, సుష్మ దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్లయిన ఐదేళ్లకు సుష్మ గర్భం దాల్చింది. డాక్టర్ సిఫారసు మేరకు ఐదు నెలల తరువాత స్కానింగ్ సెంటర్లో పరీక్షలు చేయించుకోగా, గర్భంలోని శిశువు కుడికాలులో చిన్న దోషం ఉన్నట్లు ఆధునాతన స్కానర్ ద్వారా తెలిసింది. దీంతో లోపం ఉన్న శిశువు వద్దంటూ దంపతులు అబార్షన్కు మొగ్గుచూపారు.సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో పెరుగుతున్న గర్భస్రా వాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యా ప్తంగా గణనీయంగా అబార్షన్లు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం గణాంకాలతో వెల్లడించింది. రాష్ట్రంలో 2020–21లో అధికారి కంగా 1,578 అబార్షన్లు జరగగా, 2024–25 నాటికి 16,059కి పెరిగాయి. అంటే ఐదేళ్లలో ఏకంగా 917 శాతం గర్భస్రావాలు పెరిగినట్లు ఇటీవల రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. దేశంలో 2024– 25లో 8,93,372 ఆబార్షన్లు జరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. అధికారికంగానే ఒక ఏడాదిలో దేశవ్యాప్తంగా దాదాపు 9 లక్షల అబార్షన్లు జరిగాయంటే, అనధికారికంగా గ్రామాల్లో ఆర్ఎంపీలు, ఇతర గుర్తింపు లేని డాక్టర్ల ద్వారా జరుగుతున్న అబార్షన్ల సంఖ్య ఎంత ఉంటుందో అంచనాకు అందని పరిస్థితి. ఏ చిన్న వైకల్యాన్నైనా గుర్తించేలా...గర్భస్థ శిశువు ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు టిఫ్ఫా (టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ అనొమాలిస్) స్కాన్ అనే సరికొత్త సాంకేతిక పరికరం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం ద్వారా శిశువు కడుపులో పడిన నాలుగు నెలల నుంచి ఆరు నెలల్లోపు శిశువుకు సంబంధించిన పూర్తి ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చు. శిశువు మెదడు, గుండె, వెన్నుముక, పక్కటెముకలు, అంతర్గత అవయవాల గురించి ఈ యంత్రం సమగ్ర వివరాలిస్తుంది. దీంతో గర్భస్థ శిశువు ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా దంపతులు అబార్షన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఓ ప్రముఖగైనకాలజిస్టు ‘సాక్షి’కి తెలిపారు. 2017 నుంచి రికార్డులు తప్పనిసరి గతంలో అబార్షన్ కేసులు రికార్డుల్లో ఉండేవి కావు. ఇప్పుడు హెచ్ఎంఐఎస్ (హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ద్వా రా గర్భస్రావాల సమాచారం సక్రమంగా నమోదవుతోంది. 2017 లో అమల్లోకి వచ్చిన కొత్త గర్భస్రావ చట్టం కారణంగా మరింత స్పష్టమైన గణాంకాలు వెల్లడవుతున్నాయి. దీంతో కరీంనగర్, ఖమ్మం వంటి అధిక గర్భస్రావాలు జరిగే జిల్లా కేంద్రాల్లో ఇప్పు డు లెక్కలు బహిర్గతమవుతున్నాయని ఓ అధికారి తెలిపారు.తెలంగాణలో 608 హెల్త్కేర్ సెంటర్లుదేశంలో గర్భస్రావ సేవల కోసం ప్రత్యేకంగా 12,434 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో రాష్ట్రంలో 608 కేంద్రాల్లో గర్భస్రావ సేవలున్నాయి. ప్రతి సెంటర్కు సగటున 26 కేసులు వస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. అత్యధికంగా తమిళనాడులో 2,623 ఉండగా, ఏపీలో 833 ఉన్నాయి.ప్రధాన కారణాలివీ..» ఆరోగ్య సమస్యలు, జన్యుపరమైన లోపాలతోపాటు పెరుగు తున్న జీవన వ్యయాలు కూడా ప్రైవేటు ఉద్యోగులు, రైతులను గర్భవిచ్ఛిత్తి వైపు ఉసిగొల్పుతున్నట్లు ఓ నివేదిక చెబుతోంది. » గర్భవిచ్ఛిత్తికి సమయాన్ని గర్భదారణ తరువాత 20 వారాల నుంచి 24 వారాల వరకు పొడిగిస్తూ 2021లో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టాన్ని సవరించడం. » అవాంఛిత గర్భధారణలు కూడా అబార్షన్కు ఓ కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.» గర్భస్థ శిశువు ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకునే పరిస్థితి ఇప్పటికీ ఉండటం. » ప్రస్తుత పరిస్థితుల్లో 30 ఏళ్ల వరకు యువతీ యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. గర్భం దాల్చే యువతుల వయస్సు 30 దాటినప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా గర్భవిచ్ఛిత్తి జరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటున్నాయి. అదీగాక గర్భస్థ శిశువు ఏమాత్రం అనారోగ్యంతో ఉన్నా అబార్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. » కోవిడ్ అనంతరం ఉద్యోగ భద్రత, జీవన విధానం మార్పులతో దంపతులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కోరుకుంటుడటం కూడా అబార్షన్లు పెరగడానికి కారణమని అంటున్నారు.» కుటుంబ ప్రణాళిక, మహిళల ఆరోగ్య రక్షణ, సామాజిక అవగాహన వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రతరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఎడారి దేశంలో బిక్కుబిక్కుమంటూ..
వెల్గటూర్: బతుకుదెరువు కోసం ఎడారి దేశం వెళ్లిన తొమ్మిది మంది తెలుగువారు అక్కడ ఓ ముఠా చేతిలో మోసపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరిలో ఆరుగురు తెలంగాణవారు కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. తమను కాపాడి ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి పంపించాడు జగిత్యాల జిల్లా ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ గ్రీన్ స్కెచ్ ఎల్ఎల్సీ కంపెనీలో ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగంలో చేరాడు. అతడితోపాటు తెలంగాణకు చెందిన మరో ఐదుగురు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పనికి కుదిరారు. అక్కడ వీరికి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను వేరే కంపెనీలో ఎక్కువ జీతం వస్తుందని చెప్పగా.. అతడి మాటలు నమ్మిన ఈ తొమ్మిది మంది అతడితో ఓ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఆ ముఠా సభ్యులు వీరి నుంచి ఐడీ కార్డులు, సిమ్కార్డులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, సంతకాలు, ఫొటోలు తీసుకుని ఈనెల 5న విడిచిపెట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కిరణ్తోపాటు ఏపీకి చెందిన ఓ వ్యక్తిని విడిచి పెట్టారు. మిగిలిన ఏడుగురిని పోలీసుల అదుపులోనే ఉంచుకున్నారంటూ కిరణ్ సెల్ఫీ వీడియో తీసి అతని స్నేహితులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డికి పంపించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు జేబలాలి ప్రాంతంలో సిమెంట్ పైపుల్లో తలదాచుకున్నట్లు కిరణ్ తెలిపాడు. పోలీసుల అదుపులో ఉన్నవారిలో వెల్గటూర్ మండలం జగదేవుపేటకు చెందిన మధు, నిజామాబాద్ జిల్లాకు చెందిన వినయ్, రాజు, శ్రీకాంత్ నిర్మల్ జిల్లాకు చెందిన అశోక్, ఏపీకి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. పొట్ట కూటికి ఆశపడి పొరుగు దేశం వెళ్లి మోసపోయిన తమవారిని ప్రభుత్వం ఆదుకొని ఇండియాకు తీసుకురావాలని కిరణ్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
నాసిరకంగా కట్టింది కాక.. ఇప్పుడు ఇలాంటి ప్రకటనలా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేసేందుకు ఎవరో ప్రయత్నాలు చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఇప్పుడు మాట్లాడటం దొంగలు పడ్డ రెండేళ్లకు కుక్కలు మొరిగినట్టుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. నాసిరకం పనులు చేసి, కుంగిపోయేట్టు ప్రాజెక్టులు నిర్మించి, అనువుగాని చోట కట్టి అభాసుపాలయింది కాక, ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆ పార్టీ మరింత దిగజారుతోందని ఎద్దేవా చేశారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన తర్వాత రెండున్నర నెలలు బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందని, అప్పుడు ఆ పార్టీ ముఖ్య నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. ఘటన జరిగినప్పుడు కాంగ్రెస్, బీజేపీ, జేఏసీ నేతలతో సహా ఎవరినీ అక్కడకు వెళ్లనీయలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలతో అధికారం పోవాలని అసలు ఆ ప్రాజెక్టును కూల్చింది కేసీఆరో, కేటీఆరో, కవితనో, హరీశ్రావో మీరే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.తమ విలాసవంతమైన జీవితం ఎక్కడ బయటపడుతోందోనని అధికారం పోయిన తర్వాత ప్రగతిభవన్ నుంచి విలువైన వస్తువులన్నింటినీ కేసీఆర్ కుటుంబం తీసుకెళ్లిపోయిందని ఆరోపించారు. బంగారం, వెండి, విలువైన ఫర్నిచర్ను రెండు లారీల్లో సర్దుకువెళ్లారని, కేవలం ఖాళీ కుర్చీలు, గోడలు మాత్రమే మిగిల్చి వెళ్లారని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు స్క్రిప్ట్నే రేవంత్ వినిపించారు
సూర్యాపేట టౌన్: సీఎం రేవంత్రెడ్డి తీరు చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపేనని, గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలకు పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాల్సిందని, ఇది చెప్పలేదు అంటే బనకచర్లకు అనుమతిస్తున్నట్లే అని స్పష్టమవుతుందన్నారు. బనకచర్ల కట్టి తీరుతామన్న చంద్రబాబుకు అనుకూలంగానే.. కాళేశ్వరంలో మాకు నీళ్లు అవసరం లేదు అన్నట్లు ఉందని ఆరోపించారు.ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికేనని అన్నారు. రేవంత్ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ని ఇక్కడ వినిపించారని విమర్శించారు. బనకచర్లకు అనుమతులు రావాలంటే కాళేశ్వరంను రికార్డ్లో నుంచి మాయం చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇక్కడ రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఉన్న నందిమేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్లను ప్రారంభించారంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లే కదా అని అన్నారు.కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల నుంచి నీళ్లు ఇస్తామంటూ కొత్త పాట అందుకున్నారని, దేవాదుల నీళ్లు ఇస్తామన్న ప్రాంతానికే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిందంతా అబద్ధం అని రుజువైందని చెప్పారు. -
హెచ్పీవీ–ఫ్రీ ఇండియా
సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా, భవిష్యత్ సురక్షితంగా ఉండేలా అట్టడుగు వర్గాల బాలికలకు ఉచిత హెచ్పీవి వ్యాక్సిన్ అందించే లక్ష్యంగా సుదీర్ఘ కారు యాత్ర ప్రారంభించారు ప్రియా రాజ్గోపాల్, మీనాక్షి సాయి. ‘హెచ్పీవీ–ఫ్రీ ఇండియా’ నినాదంతో ముంబైలో మొదలైన ఈ కారు యాత్ర 40 రోజుల్లో 15 రాష్ట్రాలను చేరుతుంది. తాము వెళ్లిన ప్రాంతాలలో గర్భాశయ క్యాన్సర్, నివారణ గురించి పేదింటి మహిళలకు అవగాహన కలిగిస్తున్నారు ప్రియా, మీనాక్షి. ప్రస్తుతం వారి యాత్ర తమిళనాడుకు చేరింది. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది. చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో డా.జయశ్రీ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేద బాలికలు ఉచిత హెచ్పీవి టీకా తీసుకున్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్కు మాత్రమే కాకుండా వెజైనల్ క్యాన్సర్, వల్వర్ క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. లక్షమంది నిరుపేద బాలికలకు హెచ్పీవీ టీకా వేయించాలనేది ప్రియా రాజ్గోపాల్, మీనాక్షి సాయిల లక్ష్యం. మనోబలం మూర్తీభవించిన ఈ మహిళలకు అదేమీ పెద్ద కష్టం కాబోదు. -
ఓసీ లేకుండా విద్యుత్ కనెక్షన్ కుదరదు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ అధికారులిచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) సమర్పించకుండా బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పింది. బిల్డర్లు తరచూ.. ఆమోదించిన ప్లాన్ మార్చి నిర్మాణం చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా అదనపు అంతస్తులు కడుతున్నారని, ఆ తర్వాత క్రమబద్ధీకరణకు కోరుతున్నారని.. ఇవన్నీ ఉల్లంఘనలేనని వ్యాఖ్యానించింది. గతంలో తాము ఇచ్చిన సడలింపులను దుర్వినియోగపరిస్తే మౌనంగా ఉండలేమని తేల్చిచెప్పింది. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే సమర్థించలేమని హైకోర్టు పేర్కొంది. సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించలేమని స్పష్టం చేసింది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నుంచి ఓసీ పొందాలని ఓ కేసులో పిటిషనర్ను ఆదేశించింది. అది సమర్పించిన తర్వాతే టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ కనెక్షన్ ఇస్తుందని చెప్పింది. హైదరాబాద్ హిమాయత్నగర్లోని తన భవనానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఓసీ కోసం పట్టుబట్టకుండా టీజీఎస్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహమ్మద్ ఆరిఫ్ రిజ్వాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. స్టిల్ట్తో పాటు ఐదు అంతస్తుల నిర్మాణం జీహెచ్ఎంసీ మంజూరు చేసిన ప్రణాళిక ప్రకారమే జరిగిందన్నారు. అన్ని చార్జీలు చెల్లించిన తర్వాతే విద్యుత్ కనెక్షన్కు అనుమతి కోరామని చెప్పారు. టీజీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది శ్రీధర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలో ఓసీ సడలింపులకు అధికారులు అనుమతి ఇవ్వడంతో చాలా మంది లబ్ధిదారులు ఆ తర్వాత కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించలేదన్నారు. విద్యుత్ కనెక్షన్ పొంది సరఫరాను అనుభవిస్తున్నారని.. దీంతో ఈ ఏడాది జనవరిలో టీజీఎస్పీడీసీఎల్ ఓ సర్క్యులర్ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు విద్యుత్ సేవలకు ఓసీ తప్పనిసరి చేసిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉల్లంఘనలను ప్రోత్సహించేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. -
‘రంగు’ భళా.. ఆరోగ్యం డీలా!
స్వీట్ షాపునకు వెళ్తే ప్రకృతిలోని అన్ని రంగులూ అక్కడే ఉన్నాయా అన్నట్టు ఉంటుందా దృశ్యం. రెస్టారెంట్ల విందు భోజనమూ ఇందుకు ఏమీ తీసిపోదు. పుత్తడిని తలదన్నేలా మెరిసే జిలేబీలు మొదలు.. కుంకుమ పువ్వు దట్టించినట్టు కనిపించే బిర్యానీల వరకు.. భోజన ప్రియుల జిహ్వకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ నోరూరించే రంగు రంగుల ఆహార పదార్థాల వెనుక ఉన్న రసాయనాలు ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇంటి వంటకాలైతే రోజులో కొన్ని రకాలే చేయగలం. అదే బయటి ఫుడ్ అయితే మనకు నచ్చినన్ని కొనుక్కోవచ్చు. ఇంటి పట్టున ఉండే ఆర్డర్ చేస్తే నిమిషాల్లోనే ఫుడ్ చేతికందుతోంది. జనంలో ఆహారపుటలవాట్లు మారడం, ఆదాయాలు పెరగడం బయటి ఫుడ్ వినియోగానికి ఆజ్యం పోస్తున్నాయి. రెస్టారెంట్, వీధి బండ్లపై విక్రయించే ఫుడ్కు జనం అలవాటు పడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేలా సింథటిక్ ఫుడ్ కలరెంట్స్ (ఎస్ఎఫ్సీ) వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.పరిమితి మించితే ముప్పేసింథటిక్ ఫుడ్ కలరెంట్స్ వాడకం పరిమితికి మించితే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఎనిమిది సింథటిక్ ఆహార రంగులను అనుమతిస్తోంది. ఆహార ఉత్పత్తిని బట్టి వీటి వినియోగ పరిమితులు ఉంటాయి. ఇవి నిర్దేశించిన పరిమితుల్లో ఉపయోగిస్తే ఎటువంటి సమస్యా లేదు. పరిమితికి మించి లేదా దీర్ఘకాలిక వినియోగమే ముప్పుగా పరిణమిస్తోంది. ముఖ్యంగా నియంత్రణ లేని అనధికారిక ఆహార విక్రేతల నుంచి కొనుగోలు చేసిన ఆహారమే ప్రమాదాలకు కారణం అవుతోందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, సున్నితత్వం ఉన్న వ్యక్తులు వీటికి దూరంగా ఉండడమే మేలని వారు సూచిస్తున్నారు.అవయవాలపైనా ప్రభావంఈ సింథటిక్ రంగులు వాడితే ఆహార పదార్థాలు ఆకట్టుకునేలా ఉంటాయి. వేడి, వెలుతురులోనూ రంగు స్థిరంగా ఉంటుంది. ధర కూడా తక్కువ. అందుకే ఆహార పదార్థాల విక్రేతలు వీటిని విరివిగా, పరిమితికి మించి ఈ రసాయన రంగులను వాడుతున్నారు. ఎంత పరిమాణంలో రంగులు వాడారన్న విషయమూ వినియోగదార్లకు తెలియదు. కొన్ని సింథటిక్ ఫుడ్ కలరెంట్స్ను దీర్ఘకాలం, అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో అధిక చురుకు వంటి ప్రవర్తనా సమస్యలు, అలర్జీ, లేదా అవయవాలు చెడిపోయే ప్రమాదమూ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెరుగైన పర్యవేక్షణకుతోడు ఈ రంగుల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరమూ ఉందని సూచిస్తున్నారు.అస్పష్టమైన సమాచారంప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో వినియోగించిన సింథటిక్ రంగుల వివరాలను కంపెనీలు వెల్లడించిన తీరే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐఎన్ ఎస్ 110, ఈ 129, అనుమతి పొందిన రంగు.. ఇలాంటి పేర్లతో కంపెనీలు రంగుల వివరాలను ప్యాక్లపై ముద్రిస్తాయి. సగటు భారతీయ వినియోగదారునికి ఇటువంటి సమాచారం అర్థం చేసుకోవడం కష్టం. వీధుల్లో, రోడ్లపై విక్రయించే స్నాక్స్, మిఠాయిలు, లేదా రెస్టారెంట్లలో విక్రయించే ఆహార పదార్థాల్లో వినియోగించే కృత్రిమ రంగుల వివరాలను తెలిపే విధానమే లేదు. దుకాణాల్లో అమ్మే వస్తువులన్నీ సురక్షితమన్న భావన చాలా మంది వినియోగదారుల్లో ఉంది. అయితే కొన్ని బ్రాండ్లు, రెస్టారెంట్లు శుభ్రమైన, మొక్కల ఆధారిత రంగులతో ఆహార పదార్థాలు రూపొందించడం శుభపరిణామం.రంగుల మాయకృత్రిమ రంగులు, వినియోగించే వస్తువులు, అధిక వాడకం వల్ల వచ్చే సమస్యలు1 టార్ట్రాజిన్ (ఈ 102/ఐఎన్ ఎస్ 102) వినియోగం: పసుపు వర్ణంలో ఉండే స్వీట్స్, చిప్స్, శీతల పానీయాలుసమస్యలు: పిల్లల్లో అధిక చురుకు, ఆస్తమా, చర్మ సమస్యలు2 సన్ సెట్ యెల్లో ఎఫ్సీఎఫ్ (ఈ 110/ఐఎన్ ఎస్ 110)వినియోగం: పచ్చళ్లు, పళ్లరసాలు, సాసెస్, బేకరీ ఉత్పత్తులుసమస్యలు: అలర్జీ, అధిక చురుకు, జీర్ణ సమస్యలు3 కార్మోయిసిన్ (ఈ 122/ఐఎన్ ఎస్ 122)వినియోగం: జెల్లీస్, జామ్స్, సిరప్స్, స్వీట్స్సమస్యలు: చర్మ సమస్యలు, అధిక చురుకు4 ఇండిగో కార్మిన్ (ఈ 132/ఐఎన్ ఎస్ 132) వినియోగం: ఐస్క్రీమ్స్, క్యాండీస్సమస్యలు: అలర్జీ, వికారం, అధిక రక్తపోటు5 పాన్సో 4ఆర్ (ఈ 124/ఐఎన్ ఎస్ 124) వినియోగం: కేక్స్, బిస్కట్స్లో కోటింగ్, డిజర్ట్స్, సాసులుసమస్యలు: ఆస్తమా, దద్దుర్లు6 బ్రిలియంట్ బ్లూ (ఈ 133/ఐఎన్ ఎస్ 133)వినియోగం: శీతల పానీయాలు, పాల పదార్థాలు, స్వీట్స్సమస్యలు: దద్దుర్లు, అలర్జీ, శ్వాస సమస్యలు7 ఎరిథ్రోసిన్ (ఈ 127/ఐఎన్ ఎస్ 127) వినియోగం: కాండీడ్ ఫ్రూట్స్, కేక్ టాపింగ్స్, చెర్రీస్సమస్యలు: థైరాయిడ్ సమస్యలు, డీఎన్ ఏకు నష్టం, అలర్జీఎఫ్ఎస్ఎస్ఏఐ తనిఖీలుసంవత్సరం పరిశీలించిన శాంపిళ్లు నాణ్యతా ప్రమాణాలు లేనివి పెట్టిన కేసులు 2024-25 1,94,116 34,388 31,407 -
‘కాళేశ్వరం’ పేల్చివేత కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసేందుకు జరి గిన కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ హస్తం ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్ ఆరోపించారు. కేసీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర పన్నాయన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2022లో రికార్డు స్థాయిలో గోదావరికి వరద వచ్చినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు తట్టుకున్నాయ న్నారు. కానీ ఎవరో స్క్రిప్టు రాసినట్లుగా మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిపోయిందని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపాలి‘మేడిగడ్డ కుంగితే పిల్లర్లకు ఎక్కడా పగుళ్లు రావని ఇంజనీరింగ్ నిపుణులు చెపుతున్నారు. మేడిగడ్డలో 20వ నంబర్ పిల్లర్ను ఎవరో పేల్చే కుట్రచేశారు. కుట్ర వెనుక ఉన్న అసాంఘిక శక్తులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తేల్చాలి. ఘటన జరిగిన వెంటనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి మొబైల్ ఫోన్ డేటా చెక్ చేస్తే వెంటనే దొరికేవాళ్లు. దీని వెనుక రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్రెడ్డి ఉన్నారా? లేదా? అనేది సిట్ ఏర్పాటు చేసి తేల్చాలి. లేదా అక్కడ తక్కువ స్థాయిలో ఏమైనా భూకంపాలు వచ్చాయా లేదా అనేది తేల్చాలి’ అని ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.కాగా, 2023 అక్టోబర్ 21న రాత్రి మేడిగడ్డ బరాజ్ వద్ద పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినట్లు మరుసటి రోజు మహదేవ్పూర్ పోలీసు స్టేషన్లో ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారని ప్రవీణ్కుమార్ గుర్తు చేశారు. అయితే పేలుళ్ల కోణంలో పోలీసులు విచారణ జరపకపోగా, ఇప్పటి వరకు ఎవరి వద్దా స్టేట్మెంట్లు రికార్డు చేయలేద న్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాసిన వెంటనే వచ్చిన ఎన్డీఎస్ఏ మేడిగడ్డ పేలుళ్లపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. -
గేమ్చేంజర్ జీఎస్టీ సంస్కరణలు!!
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల్లో ప్రతిపాదిత మార్పులను ‘కొత్త తరం’గేమ్ చేంజర్ సంస్కరణలుగా సీనియర్ ప్రభుత్వాధికారులు అభివర్ణించారు. ఇవి అంతిమంగా 2047 నాటికి ఒకే శ్లాబ్ దిశగా బాటలు వేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సాధారణంగా ఆదాయ, వ్యయాల సామర్థ్యాలు దాదాపు ఒకే స్థాయిలో ఉండే సంపన్న దేశాలకు సింగిల్ రేటు విధానం అనువుగా ఉంటుంది. అలా మన దగ్గర కూడా ఒకే శ్లాబ్ విధానాన్ని తేవడమే అంతిమ లక్ష్యం. అయితే, ప్రస్తుతం అందుకు సమయం అనువుగా లేదు.భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారిన తర్వాత దానిపై దృష్టి పెట్టొచ్చు’అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్న నాలుగు శ్లాబులను 5 శాతం, 18 శాతం కింద రెండు శ్లాబులుగా, డీమెరిట్ గూడ్స్పై 40 శాతంగా సవరించాలని కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రెండు శ్లాబుల విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత దన్ను లభిస్తుందని, అమెరికా టారిఫ్ ముప్పులను కూడా కొంత వరకు అధిగమించవచ్చని అధికారులు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు తొలుత రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ప్యానెల్కి, ఆ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వెళ్తాయి. పన్ను సంస్కరణలపై జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్లో సమావేశం అయ్యే అవకాశం ఉంది.ధరలు తగ్గుతాయి.. వినియోగం పెరుగుతుంది..కొత్త విధానంతో చాలా నిత్యావసర వస్తువులు తక్కువ శ్లాబులోకి మారడం వల్ల వాటి ధరలు తగ్గుతాయని, వినియోగం పెరుగుతుందని ఒక అధికారి వివరించారు. ‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ), మధ్య తరగతి, పేదలు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నెక్ట్స్జెన్ జీఎస్టీని సిఫారసు చేశాం. అలాగే రోజువారీ వినియో గించే ఉత్పత్తుల ధరలు కూడా తగ్గేలా ప్రతిపాదనలు చేశాం’ అని తెలిపారు. పన్నులు తగ్గడం వల్ల ప్రజల చేతిలో మరింత డబ్బు మి గులుతుందని, ఇది అంతిమంగా వినియోగం మరింత పెరగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.పన్ను రేట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి కేంద్రం స్వల్పకాలికం కన్నా దీర్ఘకాలిక పరిష్కార మార్గం వైపే మొగ్గు చూపిందని చెప్పారు. ‘మేం ఒక్కొక్క ఉత్పత్తిని నిశితంగా పరిశీలించాం. రైతులు ఉపయోగించే పురు గు మందులు కావచ్చు, విద్యార్థుల పెన్సిళ్లు లేదా ఎంఎస్ఎంఈలకు అవసరమయ్యే ముడి వస్తువులు కావచ్చు.. ప్రతిదానిపై కూలంకషంగా చర్చించాం. మెరిట్, స్టాండర్డ్ శ్లాబుల కింద వర్గీకరించాం’ అని ఆ అధికారి చెప్పారు.తాజా ప్రతిపాద నల ప్రకారం 12% కేటగిరీలో ఉన్న వెన్న, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ మొదలైన 99% ఉత్పత్తులు 5% శ్లాబ్లోకి మారనున్నాయి. 28% శ్లాబ్లోని ఏసీలు, టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు లాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, అలాగే సిమెంట్ లాంటి ఉత్పత్తులు 18% శ్లాబ్లోకి వస్తాయి. ప్రస్తుతం 12% శ్లాబ్ పరిధిలో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్, దుస్తులు మొదలైన 20% ఉత్పత్తులను 5% శ్లాబ్లోకి మార్చడం వల్ల ఆదాయం తగ్గినా, వినియోగం పెరగడం వల్ల ఆ లోటును భర్తీ చేసుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. -
టాప్ షూటర్లంతా బరిలోకి...
న్యూఢిల్లీ: కజకిస్తాన్లో జరిగే ఆసియా చాంపియన్షిప్లో భారత టాప్ షూటర్లంతా పతకాలపై గురిపెట్టేందుకు సిద్ధమయ్యారు. డబుల్ ఒలింపిక్ పతకాల విజేత మను భాకర్, సిఫ్త్ కౌర్, అర్జున్ బబుతా, సౌరభ్ చౌదరి తదితర మేటి షూటర్లు సహా 182 మందితో కూడిన భారత బృందం ఆసియా చాంపియన్షిప్లో పాల్గొంటోంది. ఈ టోర్నీ బరిలోకి దిగుతున్న భారీ సేన మన జట్టే కావడం విశేషం. సోమవారం నుంచి కజకిస్తాన్లోని షింకెంట్ నగరంలో ఈ పోటీలు జరుగనున్నాయి. రైఫిల్, పిస్టల్, షాట్గన్ విభాగాల్లో 58 ఈవెంట్లలో పోటీలుంటాయి. ఇందులో 46 వ్యక్తిగత ఈవెంట్లు కాగా, 12 మిక్స్డ్ టీమ్ ఈవెంట్ పోటీలు నిర్వహిస్తారు. భారత్ సీనియర్ విభాగంలోనే ఒక్కో ఈవెంట్లో ఐదుగురు చొప్పున షూటర్లను బరిలోకి దింపుతోంది. వీటిలో మూడు పతకాలకు ఆస్కారం ఉండగా, మరో ఇద్దరు ర్యాంకింగ్ పాయింట్స్ కోసం ఆడతారు. ఇప్పటివరకు జరిగిన ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లలో భారత్ 59 పతకాలు గెలుపొందింది. ఇందులో 21 స్వర్ణాలు, 22 రజతాలు, 16 కాంస్యాలున్నాయి. చివరిసారిగా చాంగ్వాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన ఈవెంట్లో భారత జట్టు ఆరు బంగారు పతకాలు, 8 రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 19 పతకాలతో టాప్–3లో నిలిచింది. గత టోర్నీలో సత్తా చాటిన మను భాకర్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ విజయోత్సాహంతో ఉంది. ఆమె 10 మీ., 25 మీ పిస్టల్ ఈవెంట్లతో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ పోటీపడనుంది. ఆమెతో పాటు ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబుతా, సౌరభ్, అనిశ్ భన్వాలాలపై భారత్ పతకాల ఆశలు పెట్టుకుంది. సీనియర్, జూనియర్ విభాగాల్లో ఒలింపిక్ ఈవెంట్స్తో పాటు ఒలింపిక్స్లో లేని సెంటర్ ఫైర్, స్టాండర్డ్, ఫ్రీ పిస్టల్, రైఫిల్ ప్రోన్, డబుల్ ట్రాప్ ఈవెంట్లలో కూడా పోటీలు నిర్వహిస్తారు. -
ఆంధ్రప్రదేశ్ ఓటమి
జలంధర్: హాకీ ఇండియా (హెచ్ఐ) జూనియర్ పురుషుల జాతీయ చాంపియన్షిప్లో ఆంధ్ర ప్రదేశ్కు ఘోర పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో కర్ణాటక 10–1 గోల్స్ తేడాతో ఆంధ్రప్రదేశ్పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కర్ణాటక తరఫున హర్పాల్ (12వ, 35వ నిమిషాల్లో), తనీశ్ రమేశ్ (17వ, 56వ ని.) చెరో రెండు గోల్స్ సాధించారు. మిగతా వారిలో రాజు మనోజ్ గైక్వాడ్ (5వ ని.) నితీశ్ శర్మ (10వ ని.) కెపె్టన్ ధ్రువ (25వ ని.), అచ్చయ్య (24వ ని.), కుశాల్ బోపయ్య (51వ ని.), పూజిత్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. మిగతా మ్యాచ్ల్లో హరియాణా 3–0తో దాద్రా నగర్ హవేలిపై విజయం సాధించగా, ఉత్తర ప్రదేశ్ 9–2తో మహారాష్ట్రపై జయభేరి మోగించింది. ఆతిథ్య పంజాబ్ 8–4తో తమిళనాడుపై గెలుపొందింది. -
సునీల్ ఛెత్రీకి దక్కని చోటు
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా భారత ఫుట్బాల్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సునీల్ ఛెత్రీకి... తాజా ప్రాబబుల్స్లో చోటు దక్కలేదు. త్వరలో జరగనున్న సీఏఎఫ్ఏ నేషన్స్ కప్ కోసం కొత్త కోచ్ ఖాలిద్ జమీల్ శనివారం 35 మందితో ప్రాబబుల్స్ను ప్రకటించాడు. అందులో స్టార్ స్ట్రయికర్ ఛెత్రి పేరు లేదు. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి... ఆ తర్వాత జట్టు అవసరాల కోసం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరిగి బరిలోకి దిగిన సునీల్ ఛెత్రి గత నాలుగు మ్యాచ్ల్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. అయితే కేవలం ప్రదర్శన ఆధారంగానే ఛెత్రిని ఎంపిక చేయలేదా లేక... అతడే స్వయంగా ఈ టోర్నీకి దూరంగా ఉంటానని చెప్పాడా అనే విషయంలో స్పష్టత కొరవడింది. దీనిపై అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధికారులను వివరణ కోరగా... ‘జట్టు ఎంపికలో మా ప్రమేయం లేదు. దీనికి సంబంధించిన అన్నీ విషయాలు హెడ్ కోచ్ చూసుకుంటారు’ అని వెల్లడించారు. రెండేళ్ల పదవీ కాలానికి గానూ భారత మాజీ ప్లేయర్ జమీల్ ఇటీవలే టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ప్రాబబుల్స్కు ఎంపికైన వారితో శనివారమే బెంగళూరులో శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అందులో 22 మంది పాల్గొనగా... మిగిలిన 13 మంది ఆటగాళ్లు డ్యురాండ్ కప్ మ్యాచ్లు ముగియగానే జట్టుతో చేరనున్నారు. ప్రాబబుల్స్లో గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు, చింగ్లెన్సనా సింగ్, రాహుల్ భేకె, రోషన్ సింగ్, సురేశ్ సింగ్, అనిరూధ్ థాపా, దీపక్ టాంగ్రి, లాలెంగ్మావియా రాల్టె, లిస్టన్ కొలాకో, మన్వీర్ సింగ్, అమ్దుల్ సమద్, అన్వర్ అలీ, జాక్సన్ సింగ్, మహేశ్ సింగ్ తదితరులు ఉన్నారు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని... గతేడాది జూన్లో కువైట్తో మ్యాచ్ అనంతరం ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆ తర్వాత భారత జట్టు ప్రదర్శన మరింత పడిపోవడంతో... ఈ ఏడాది మార్చిలో మాల్దీవులుతో మ్యాచ్కు ముందు అప్పటి టీమిండియా హెడ్ కోచ్ మారŠెక్వజ్ మనోలో విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని పక్కన పెట్టి ఛెత్రీ తిరిగి జట్టుతో చేరాడు. మాల్దీవులుతో మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించగా.. అందులో ఛెత్రీ ఒక గోల్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో మ్యాచ్ ‘డ్రా’ కాగా... హాంకాంగ్ చేతిలో టీమిండియా ఓడింది. థాయ్లాండ్తో స్నేహపూర్వక మ్యాచ్లో సైతం పరాజయం పాలైంది. దీంతో జట్టు ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ మనోలో హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఏఐఎఫ్ఎఫ్ జమీల్ను కొత్తకోచ్గా ఎంపిక చేసింది. అతడి ఆధ్వర్యంలో భారత జట్టు నేషన్స్ కప్లో బరిలోకి దిగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 29న తజకిస్తాన్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 1న ఇరాన్తో, 4న అఫ్గానిస్తాన్తో తలపడుతుంది. అనంతరం ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భాగంగా అక్టోబర్లో సింగపూర్తో టీమిండియా ఇంటా బయట మ్యాచ్లు ఆడనుంది. -
అండర్–19 వరల్డ్కప్నకు అమెరికా
దుబాయ్: వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అండర్–19 పురుషుల ప్రపంచకప్నకు అమెరికా జట్టు అర్హత సాధించింది. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నమెంట్కు అమెరికా... చివరిదైన 16వ జట్టుగా ఎంపికైంది. ఇటీవలి కాలంలో సీనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శన కనబరుస్తూ అందరి ప్రశంసలు దక్కించుకుంటున్న అమెరికా... ఇప్పుడు జూనియర్ స్థాయిలోనూ సంచలనాలు రేపేందుకు సిద్ధమైంది. 2024లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్–19 ప్రపంచకప్లో పాల్గొన్న టాప్–10 జట్లు నేరుగా ఈ సారి బరిలోకి దిగనుండగా... ఆతిథ్య హోదాలో జింబాబ్వే వరల్డ్కప్ ఆడనుంది. మిగిలిన ఐదు జట్లను వేర్వేరు క్వాలిఫయింగ్ ఈవెంట్ల ద్వారా ఎంపిక చేశారు. తాజాగా అమెరికా అర్హత టోర్నీలో అదరగొట్టింది. బెర్ముడా, అర్జెంటీనా, కెనడాపై విజయాలు సాధించి... మరో మ్యాచ్ మిగిలుండగానే వరల్డ్కప్ బెర్త్ పట్టేసింది. జార్జియా వేదికగా డబుల్ రౌండ్రాబిన్ పద్ధతిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో అర్జున్ మహేశ్ సారథ్యంలోని అమెరికా జట్టు చివరి మ్యాచ్లో 65 పరుగుల తేడాతో కెనడాపై విజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్నకు అర్హత సాధించింది. 2026 అండర్–19 పురుషుల ప్రపంచకప్లో పాల్గొననున్న జట్లు జింబాబ్వే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, జపాన్, స్కాట్లాండ్, టాంజానియా, అమెరికా. -
ఓ మంచి జ్ఞాపకంలాంటి సినిమా
‘‘సుందరకాండ’ చిత్రం ట్రైలర్ను లాంచ్ చేసిన ప్రభాస్గారికి థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్, పాటలకి చాలా మంచి స్పందన వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాని కుటుంబమంతా చూడొచ్చు. వినాయక చవితికి మా చిత్రం విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ సినిమా మంచి జ్ఞాపకంలా ఉంటుంది’’ అని నారా రోహిత్ చెప్పారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ లీడ్ రోల్స్లో నరేశ్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘సుందరకాండ’. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో శ్రీదేవి విజయ్కుమార్ మాట్లాడుతూ–‘‘చాలా కాలం తర్వాత ‘సుందరకాండ’ లాంటి సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.మంచి వినోదాత్మక చిత్రమిది... అందరూ సంతోషంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా వినాయక చవితి పండగ రోజు రిలీజ్ అవడం సంతోషంగా ఉంది. మా చిత్రం అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్ నిమ్మలపూడి. ‘‘మా సినిమాని చూసి, మా యూనిట్ని ఆశీర్వదించాలి’’ అని సంతోష్ చిన్నపొల్ల పేర్కొన్నారు. ‘‘సుందరకాండ’ లాంటి రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పటివరకు రాలేదు.. ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు నరేశ్ విజయకృష్ణ. నటి వాసుకి మట్లాడారు. -
విజేత అరోనియన్
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. బ్లిట్జ్ విభాగంలో 18 పాయింట్లతో వియత్నాంకు చెందిన లియామ్ లె క్వాంగ్తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. అమెరికా ప్లేయర్ లెవాన్ అరోనియన్ 24.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన అరోనియన్... మరో రెండు రౌండ్లు మిగిలుండగానే టైటిల్ గెలుచుకున్నాడు. ఫాబియానో కరువానా (అమెరికా; 21.5 పాయింట్లు), మ్యాక్సిమ్ లాగ్రేవ్ (ఫ్రాన్స్; 21 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఇటీవల లాస్ వెగాస్ ్రïఫీస్టయిల్ గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచిన 42 ఏళ్ల అరోనియన్... అదే జోరులో ఇక్కడ కూడా విజేతగా నిలిచాడు. అరోనియన్కు 40 వేల డాలర్లు (సుమారు రూ. 35 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. రెండు రోజుల విశ్రాంతి అనంతరం గుకేశ్ సింక్యూఫీల్డ్ కప్లో బరిలోకి దిగనున్నాడు. దీంట్లో భారత్ నుంచి యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద కూడా పాల్గొననున్నాడు. సింక్యూఫీల్డ్ టోర్నీ క్లాసికల్ పోరు కావడంతో ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన గుకేశ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగే అవకాశం ఉంది. -
అల్లు అర్జున్ సినిమా.. పవర్ఫుల్ పాత్రలో శివగామి
శక్తిమంతమైన పాత్రల్లో రమ్యకృష్ణ ఏ స్థాయిలో విజృంభించగలరో చెప్పడానికి ‘రాజమాత శివగామి’ పాత్ర ఒక ఉదాహరణ. ‘బాహుబలి’లోని ఆ పాత్రను రమ్యకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఆమె నటించారు. ఇప్పుడు ఈ పాత్ర ప్రస్తావన ఎందుకంటే... మరోసారి ఈ తరహా పవర్ఫుల్ రోల్లో రమ్యకృష్ణ కనిపించనున్నారట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రంలోని ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటూ రమ్యకృష్ణను సంప్రదించారట అట్లీ. రమ్యకృష్ణ కూడా తన అంగీకారం తెలి పారని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని భోగట్టా. అలాగే మొత్తం ఐదుగురు కథానాయికలు ఉంటారని సమాచారం. హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఇంకా మృణాల్ రాకూర్, రష్మికా మందన్నా, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక భారీ ఎత్తున వీఎఫ్ఎక్స్ ఉన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. -
కథ విన్నారా?
హీరో నాగచైతన్య, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ కథను రెడీ చేసి, నాగచైతన్యకు వినిపించారట. ఈ కథ నాగచైతన్యకు నచ్చిందని, దీంతో ఈ కథకు మరింత మెరుగులుదిద్దే పనిలో దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారని టాక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అలాగే దర్శకులు బోయ పాటి శ్రీను, శివ నిర్వాణ కూడా నాగచైతన్యకు కథలు వినిపించారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగచైతన్య ఏ దర్శకుడితో తన కొత్త సినిమాను ముందుగా సెట్స్కు తీసుకువెళ్తారనే సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. ఇక ప్రస్తుతం ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలోని ‘వృషకర్మ’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో నాగచైతన్య బిజీగా ఉన్నారు. -
నిబంధనల ప్రకారమే తీసుకున్నాం!
చెన్నై: దక్షిణాఫ్రికా సంచలన బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ను ఐపీఎల్–2025 సీజన్ మధ్యలో జట్టులో తీసుకోవడం గురించి వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వివరణ ఇచ్చిoది. సీజన్ మధ్యలో గాయపడిన పేస్ బౌలర్ గుర్జప్నీత్ సింగ్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. దీని కోసం సీఎస్కే బ్రెవిస్కు రూ.2.20 కోట్లు చెల్లించింది. సీజన్ ఆరంభానికి ముుందు రూ.75 లక్షల కనీస విలువతో వచ్చిన బ్రెవిస్ను ఐపీఎల్ వేలంలో ఎవరూ తీసుకోలేదు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20లో బ్రెవిస్ 56 బంతుల్లోనే 125 పరుగులు బాది వార్తల్లో నిలిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే టీమ్ సభ్యుడైన సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానల్లో బ్రెవిస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 6 మ్యాచ్లు ఆడిన బ్రెవిస్ 180 స్ట్రైక్రేట్తో 225 పరుగులు సాధించి చెన్నై గెలిచిన మ్యాచ్లలో కీలక పాత్ర పోషించాడు. ‘బ్రెవిస్ అద్భుతమైన బ్యాటర్. అయితే కనీస ధర ఎక్కువ కావడంతో అతడిని ఎవరూ తీసుకోలేదు. సీజన్ మధ్యలో ఏ జట్టయినా తీసుకుంటే అతని కనీస ధరనే చెల్లించాలి. కానీ నేను ఫలానా మొత్తం ఇస్తేనే వస్తానంటూ బ్రెవిస్ ఏజెంట్ల ద్వారా డిమాండ్ చేశాడు. అయినా సరే సీఎస్కే తీసుకుంది’ అని అన్నాడు. దీనిపై సీఎస్కే తాజాగా స్పందించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారమే తాము బ్రెవిస్ను తీసుకున్నామని చెప్పింది. ‘గాయపడిన ఆటగాడి స్థానంలో ఎవరినైనా తీసుకుంటే ఆ ప్లేయర్కు ఇచ్చే మొత్తమే కొత్త ఆటగాడికి ఇవ్వాలని నిబంధనల్లో ఉంది. మేం దీనిని ఎక్కడా ఉల్లంఘించలేదు’ అని సీఎస్కే పేర్కొంది. వచ్చే సీజన్ కోసం చెన్నైను వీడేందుకు అశ్విన్ దాదాపుగా సిద్ధమైన తరుణంలో ఇది చర్చనీయాంశమైంది. -
తాన్యా హేమంత్కు సింగిల్స్ టైటిల్
న్యూఢిల్లీ: సైపాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ తాన్యా హేమంత్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 86వ ర్యాంకర్ తాన్యా 15–10, 15–8తో కానాయ్ సకాయ్ (జపాన్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన తాన్యా తుదిపోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్ల్లో గెలుపొందింది. 21 ఏళ్ల తాన్యాకు ఇది నాలుగో అంతర్జాతీయ టైటిల్.అంతకుముందు ఇండియా ఇంటర్నేషనల్ (2022), ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ (2023), బెండిగో ఇంటర్నేషనల్ (2024)లో తాన్యా టైటిల్స్ గెలుచుకుంది. గతేడాది అజర్బైజాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫైనల్లో భారత షట్లర్ మాళవిక బన్సోద్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. తాజా టోర్నీలో తాన్యా... సెమీఫైనల్లో రిరినా హిరామొటో (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో లీ జిన్ యీ మెగన్ (సింగపూర్)పై, ప్రిక్వార్టర్స్లో నొడొకా సునకవా (జపాన్)పై విజయాలు సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ట్రయల్స్లో భాగంగా... ఈ టోర్నమెంట్లో ఒక్కో గేమ్లో 21 పాయింట్లకు బదులు 15 పాయింట్లుగా నిర్వహించారు. -
ఫైనల్లో అనాహత్
బేగా (ఆస్ట్రేలియా): ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) చాలెంజర్ టూర్ ఈవెంట్లో భారత ప్లేయర్ అనాహత్ సింగ్ ఫైనల్కు దూసుకెళ్లింది. న్యూ సౌత్వేల్స్ స్క్వాష్ బేగా ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం 17 ఏళ్ల అనాహత్ సింగ్ 3–2 (10–12, 11–5, 11–5, 10–12, 11–7)తో నూర్ ఖఫాగీ (ఈజిప్ట్)పై విజయం సాధించింది. 54 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో టాప్సీడ్గా బరిలోకి దిగిన భారత ప్లేయర్ అదరగొట్టింది. 14 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అనాహత్... అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 18 పీఎస్ఏ టోర్నీల్లో పాల్గొన్న అనాహత్... అందులో 12 టైటిల్స్ గెలిచింది. మరో సెమీఫైనల్లో భారత ప్లేయర్ ఆకాంక్ష సాలుంఖే 1–3 (9–11, 11–7, 10–12, 6–11)తో హబీబా హనీ (ఈజిప్ట్) చేతిలో ఓడింది. 42 నిమిషాల పాటు సాగిన పోరులో ఆకాంక్ష చక్కటి పోరాట పటిమ కనబర్చినా... కీలక సమయంలో పాయింట్లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది. ఫైనల్లో హబీబా హనీతో అనాహత్ తలపడనుంది. పీఎస్ఏ స్క్వాష్ టూర్ సీజన్లో ఇదే తొలి ప్రపంచ స్థాయి ఈవెంట్ కాగా... టైటిల్ సాధించడమే లక్ష్యంగా అనాహత్ బరిలోకి దిగనుంది. -
ప్రశాంతమైన కన్మణి
పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్మోహన్ పోషించిన కన్మణి పాత్ర ఫస్ట్ లుక్ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ‘‘ఓజీ’లో పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారు.ప్రతి తు పానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంకా అరుళ్మోహన్ కన్మణి పాత్ర. మా సినిమా నుంచి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘ఫైర్ స్టార్మ్..’కు విశేష స్పందన లభించింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్న ఈ సినిమాకి సంగీతం ఎస్. తమన్, కెమెరా: రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస. -
వీరీ వీరీ గుమ్మడిపండు ఈ సినిమా వచ్చేదెప్పుడు?
ఒకప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని, థియేటర్స్ దొరికితే చాలు... సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నాన్–థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు, బాక్సాఫీస్పోటీ, ఓటీటీ సంస్థల నిబంధనలు... ఇలా ఓ సినిమా రిలీజ్ కావడానికి, కాకపోవడానికి చాలా కారణాలే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇంకా విడుదల వాయిదా పడుతూ వస్తున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ఈ సెప్టెంబరు 5న చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అనుష్కా శెట్టి ‘ఘాటి’, రష్మికా మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’, తేజ సజ్జా ‘మిరాయ్’, ‘ది బెంగాలీ ఫైల్స్’, శివకార్తికేయన్ ‘మదరాసి’ వంటి సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అయితే ఇన్ని సినిమాలు ఒకే తేదీకి రిలీజ్ కావడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో వీటిలో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని, ఈ వాయిదా పడే చిత్రాల్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఉండొచ్చనే టాక్ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు సెప్టెంబరు 5న రిలీజ్ కావాల్సిన విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ చిత్రం సెప్టెంబరు 19కి వాయిదా పడింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను అరుణ్ ప్రభు దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ – స్పిరిట్ మీడియా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. 200 కోట్ల రూ పాయల భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ ‘భద్రకాళి’ సినిమా కథనం సాగుతుంది.సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్?నిర్మాతలు–సినీ కార్మికుల మధ్య వేతనాల పెంపు విషయమై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు జరగడం లేదు. ఈ ప్రభావం సంక్రాంతి రిలీజ్కు రెడీ అవుతున్న సినిమాలపై పడొచ్చు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆగస్టు 5 నుంచి మొదలు కావాల్సిన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ మొదలు కాలేదు. దీంతో షూటింగ్కు ఆలస్యమౌతోంది. సమ్మె కారణంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంకా రవితేజ ‘అనార్కలి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ చిత్రబృందాలు తమ సినిమాలను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించాయి. కానీ సినీ కార్మికుల ప్రస్తుత సమ్మె కారణంగా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తోంది. అలాగే డిసెంబరులో రిలీజ్కు సిద్ధమౌతున్న అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రంపై కూడా ఈ సమ్మె ప్రభావం కాస్త గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.సత్యలోకానికి పయనం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘విశ్వంభర’ సినిమా ఇంకా థియేటర్స్లోకి రాలేదు. సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా విడుదల కాకపోవడంతో సమ్మర్కి థియేటర్స్లోకి వస్తుందని ఆడియన్స్ ఊహించారు. కానీ సమ్మర్లో కూడా థియేటర్స్లోకి రాలేదు. ఆ మాటకొస్తే... ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత లేదు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మించిన ఈ ‘విశ్వంభర’ ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు గ్రాఫిక్స్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో క్వాలిటీ పరంగా చిత్ర యూనిట్ రాజీ పడకుండాపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయిస్తోందని సమాచారం. గ్రాఫిక్స్ కోసమే రూ. 25 కోట్లకుపైగా బడ్జెట్ను మేకర్స్ కేటాయించారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే.ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా టీజర్ విడుదల కావొచ్చని, ఈ సినిమా విడుదల తేదీపై అప్పుడు ఓ స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక పద్నాలుగు లోకాలను దాటి, హీరో సత్యలోకం వెళ్లి, అక్కడ హీరోయిన్ను ఎలా కలుసుకుంటాడు? అనే నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో విశ్వంభర అనే పుస్తకం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ పుస్తకంలోని అంశాల ఆధారంగానే హీరో సత్యలోకానికి వెళ్తాడని, ఈ క్రమంలో హీరోకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో రావు రమేశ్ నటించారని టాక్.ఆలస్యంగా రాజాసాబ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్, కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్, వీటీవీ గణేశ్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావడం లేదని, సంక్రాంతికి ఈ విడుదలయ్యే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం ‘ది రాజాసాబ్’ విడుదల వాయిదాకు ప్రధాన కారణమట. పైగా ఈ సినిమా కోర్టు కేసులో ఇరుక్కుందనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘ది రాజాసాబ్’ చిత్రం ప్రధానంగా తాత–మనవడి అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్య పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు ఆడియన్స్కు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో ‘రాజా డీలక్స్’ అనే భవనం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ భవనం లోపలే ప్రధాన కథ జరుగుతుందని తెలిసింది.పండక్కి రానట్లే! రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల మళ్లీ జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ ఆగస్టు 27న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ విడుదల వాయిదా పడిందని భోగట్టా.ఇంకా రెండు పాటల చిత్రీకరణ ఉందని, అలాగేపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కి కూడా ఇంకా సమయం పట్టేట్లు ఉందని... ఈ కారణాల వల్లే ‘మాస్ జాతర’ ఈ వినాయకచవితి పండక్కి థియేటర్స్లోకి వచ్చే అవకాశం లేదనే టాక్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను తొలుత ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే 9కి వాయిదా వేశారు. ఇటీవల ఆగస్టు 27న రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆగస్టు 27న కూడా ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే రైల్వేపోలీస్ ఆఫీసర్గా రవితేజ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రైల్వేస్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందట. అలాగే హీరో రవితేజ–విలన్ నవీన్చంద్ర కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్ను అలరించేలా ఉంటాయని తెలిసింది.సంబరాలు ఎప్పుడు? సాయి దుర్గా తేజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. రూ. 125 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ చైతన్యా రెడ్డి, కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.కానీ ఆ తర్వాత ఈ సెప్టెంబరు 25నే పవన్ కల్యాణ్ గ్యాంగ్స్టర్ డ్రామా ‘ఓజీ’, బాలకృష్ణ మైథలాజికల్ అండ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ రిలీజ్కు రెడీ అయ్యాయి. దీంతో సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ విడుదల వాయిదా పడుతుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 80 శాతంపైనే పూర్తయింది. కానీ విడుదల తేదీపై మేకర్స్ నుంచి మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబరు 25న ‘ఓజీ’, ‘అఖండ 2’ సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి కాబట్టి ఈ తేదీకి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా రాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి అతి త్వరలోనే ఓ స్పష్టత రావొచ్చు. ఇక రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని తెలిసింది.స్వయంభూ నిఖిల్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా, సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఓ దశలో ఈ దసరాకు ‘స్వయంభూ’ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారట మేకర్స్. కానీ భారీ వీఎఫ్ఎక్స్, యుద్ధ సన్నివేశాలు ఉండటంతోపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు మరింత సమయం పడుతుందని, ఈ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. శక్తికి, ధర్మానికి చిహ్నమైన సెంగోల్ (బంగారు రాజదండం) నేపథ్యంలో ‘స్వయంభూ కథనం సాగుతుందట. మరో విషయం ఏంటంటే... ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నారని సమాచారం.ఓం శాంతి శాంతి శాంతిః తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అ΄్పాజీ) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణ, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బా, వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్ నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఆ మధ్య ఈ సినిమాను ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఆగస్టు 1న ఈ సినిమా విడుదల కాలేదు. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక మలయాళంలో సూపర్డూపర్ బ్లాక్బస్టర్గా నిలిచిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు తెలుగు రీమేక్గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రూపొందిందని తెలిసింది. భార్యాభర్తల నేపథ్యంలో ‘జయ జయ జయ జయహే’ సినిమా కథనం సాగుతుంది. మహిళలంటే చులకన భావం ఉన్న ఓ భర్తకు అతని భార్య ఏ విధంగా బుద్ధి చెప్పిందన్నదే ఈ సినిమా కథనం.భార్యాభర్తల కథ లావణ్యా త్రి పాఠి, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. భార్యాభర్తల అనుభందం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి)’ చిత్రాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్ను విడుదల చేశారు. అయితే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఇలా ఈ ఏడాదిలో రిలీజ్కు సిద్ధం అవుతూ, ఇంకా విడుదల తేదీని కన్ఫార్మ్ చేసుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
డిజిటల్ పునర్జన్మ!
మనకిష్టమైన వారు భౌతికంగా మరణించినా మనం వారితో మాట్లాడొచ్చు. ఇదెలా సాధ్యం? భవిష్యత్లో చోటుచేసుకోబోయే మార్పుల గురించి ముందుచూపుతో ఊహించే కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్న దానిని బట్టి చూస్తే.. మనం సాంకేతిక అమరత్వాన్ని సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రస్తుతం ఆ పరిస్థితులకు మనం కొంత దూరంలో ఉన్నప్పటికీ ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) అనేది మరణించిన వ్యక్తులను వారి స్వరం, ప్రవర్తన, నిర్ణయం తీసుకునే విధానం తదితర అంశాల ద్వారా ‘సజీవంగా’నిలిపే అవకాశాలను మెరుగుపరుస్తోంది. మీరు షేర్ చేసే ప్రతి ఫొటో, మీరు పంపే పోస్ట్, వాయిస్ నోట్ వంటివి డిజిటల్ డీఎన్ఏగా మారుతున్నాయి. ఇలాంటి సాంకేతిక వనరులకు జీవం పోసి కొన్నిరూపాల్లో చావును అధిగమించే దిశలో కృతిమ మేధ (ఏఐ) ద్వారా కృషి జరుగుతోంది. ఇది అర్థంకాని సైన్స్ ఫిక్షన్లాగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్ లో ఇలాంటివి ‘గ్రీఫ్టెక్’ద్వారా వాస్తవరూపం దాల్చే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ గ్రీఫ్టెక్ వినియోగం ఇప్పుడిప్పుడే మొదలైందని అంటున్నారు. ఏమిటీ ‘గ్రీఫ్ టెక్’? 2020లో దక్షిణ కొరియా టీవీషో ఒక అవాస్తవ పునఃకలయికను ప్రసారం చేసింది. శోకతప్తమై దుఃఖిస్తున్న ఓ తల్లి వర్చువల్ రియాలిటీ (వీఆర్) ద్వారా మరణించిన తన కుమార్తెతో సంభాషించింది. డిజిటల్ సాంకేతిక సహకారంతో ఆ బిడ్డ కదిలింది, మాట్లాడింది, తల్లి ప్రశ్నలకు ప్రతిస్పందించింది. ఇది వాయిస్ నమూనాలు, వీడియో ఫుటేజ్, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా సాధ్యమైంది. దీనినే ‘గ్రీఫ్ టెక్’అని పిలుస్తున్నారు. మరణించిన వ్యక్తి ఎలా టెక్ట్స్ చేశాడు, ఎలా జోక్ చేశాడు లేదా ఎలా స్పందించాడు తదితర అంశాల ఆధారంగా అనుకరణ బ్యాట్లను సృష్టిస్తున్నారు. ఈ అనుభూతులు ఎలా సాధ్యం? చనిపోయిన వారిని ఏఐ ద్వారా డిజిటల్ రూపంలో పునర్జీవింపచేస్తారు లేదా ఆ అనుభూతిని కలిగిస్తారు. –ప్రధానంగా సంబంధిత వ్యక్తుల నుంచి సేకరించిన ఏఐ నమూనాల నుంచి ఇది సాధ్యమవుతుంది. –చనిపోయిన వారి టెక్సŠట్ మెసేజ్లు, ఈ–మెయిల్లు, సోషల్ మీడియా పోస్ట్లు, వాయిస్ నోట్లు, వీడియో రికార్డింగ్లు వంటివి ఉపకరిస్తున్నాయి. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వ లక్షణాలు, నిర్ణయం తీసుకునే విధానాలు సహాయపడుతున్నాయి. –వారి బయోమెట్రిక్ డేటా (ముఖ కవళికలు, స్వరం) వంటివి దోహదపడుతున్నాయి. –వీటి ఆధారంగా నాడీ నెట్వర్క్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఏఐ ఆయా వ్యక్తులను అనుకరించగలదు. –ఫలానా వ్యక్తి ఇంకా సజీవంగా ఉన్నట్టుగా సంభాషించగలదు. –రెప్లికా, ప్రొజెక్ట్ డిసెంబర్, హియర్ ఆఫ్టర్ ఏఐ వంటి సాధనాలు ఇప్పటికే ఇలాంటి వాటిని అందిస్తున్నాయి. –మరణించిన వారి స్వరం మాదిరిగానే సంబం«దీకులతో సంభాషించేలా చేయొచ్చు. చనిపోయిన తాత లేదా బామ్మ స్వరాలను ఉపయోగించి మనవళ్లు, మనవరాళ్లకు నిద్రవేళ కథలను చెప్పే సౌలభ్యం కూడా కలుగుతుందని అంటున్నారు. సమాధానం లేని ప్రశ్నలెన్నో... ఒక వ్యక్తి భౌతికంగా మరణించాక కూడా బతికి ఉన్నట్టుగా భ్రమలో మునగడం డిజిటల్ మరణానంతర జీవితం అనే జవాబులేని ప్రశ్నలను ముందుకు తెస్తోంది. ⇒ ఇది మరణించిన వారి గురించి పడే బాధను తగ్గిస్తుందా? లేదా వారి జ్ఞాపకాలు వెంటాడేలా చేస్తుందా? ఈ డిజిటల్ సాంకేతిక భ్రాంతి/ అయోమయాల మధ్య చనిపోయిన వారు ఎంతకాలం ‘జీవించగలరు’? ఈ ఏఐ అమరత్వాన్ని ఎవరు నియంత్రిస్తారు? సంబంధిత వ్యక్తి కుటుంబమా, టెక్ కంపెనీలా లేక ఆయా దేశాలు/రాష్ట్రాల ప్రభుత్వాలా? ⇒ డిజిటల్ క్లోన్ ఓ వ్యక్తిగా ఉండటం విరమించి పూర్తిగా వేరే వ్యక్తిగా వ్యవహరిస్తే లేదా హ్యాకింగ్కు గురైతే ఏమి జరుగుతుంది? ⇒ ఆయా మాధ్యమాల ద్వారా మనం జ్ఞాపకశక్తిని కాపాడుకుంటున్నామా? లేదా భ్రమల్లో విహరించేలా తయారవుతున్నామా? ఇది వరంగా పరిణమిస్తుందా లేక శాపంగా మారుతుందా? ⇒ ఈ ప్రశ్నలకు జవాబులు డిజిటల్ సాంకేతికతను ఏ రూపంలో, ఏ అవసరానికి ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
ఒక్కటి దాటినా కోతే!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లలోపు ఉంటే గృహజ్యోతి పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తోంది. అయితే, ఈ పథకం లబ్ధిదారుల ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగి విద్యుత్ వినియోగం 200 యూనిట్లకు మించితే వారు పథకానికి అర్హత కోల్పోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వవర్గాలు. ఈ మేరకు గృహజ్యోతి పథకాన్ని కుదించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందనే చర్చ జరుగుతోంది. గృహజ్యోతి పథకం కింద ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల సంఖ్యను కట్టడిచేయడంతోపాటు కొత్త లబ్ధిదారులు పెరగకుండా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికోసం ఈ పథకం కింద కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉచిత విద్యుత్ వినియోగదారుల సంఖ్య ఏటా పెరుగుతూపోతే ఆర్థిక భారం భారీగా పెరిగిపోతుందన్న ఆందోళనతో లబ్ధిదారుల సంఖ్యను కుదించాలని సర్కారు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. 16 నెలల్లో 12 లక్షల మంది పెరిగారు.. గృహాలకు ప్రతినెలా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక 2024 మార్చి నుంచి గృహజ్యోతి పథకం అమలును ప్రారంభించింది. 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ పథకం అమలవుతోంది. మొదట్లో 39 లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. ఆ తరువాత కూడా దరఖాస్తులు రావడంతో ఈ లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. దీంతో ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమైనట్టు తెలిసింది. పథకం ప్రారంభమైన 16 నెలల్లో కొత్తగా 12 లక్షల మంది చేరారు. అంటే జూలైలో ఈ పథకం కింద లబ్ధిదారులు 51.26 లక్షల మంది ఉన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం సబ్సిడీ కింద ప్రతి నెలా రూ.185 నుంచి 200 కోట్ల వరకు రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు చెల్లిస్తోంది. ఒక్క యూనిట్ ఎక్కువైనా.. విద్యుత్ వినియోగం ఆధారంగా 0–50 యూనిట్ల వరకు యూనిట్కు రూ.1.95 పైసలు, 51–100 యూనిట్ల వినియోగానికి యూనిట్కు రూ.3.10 చొప్పున బిల్లు వసూలు చేస్తారు. వినియోగం 100 యూనిట్లకు పెరిగితే 0–200 యూనిట్ల మధ్య వినియోగానికి ప్రతీ యూనిట్కు రూ.3.40 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్న వారిలో 0–50, 50–100 యూనిట్లను వినియోగించే పేదలే ఎక్కువ. వీరితోపాటు 100–200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న లబ్ధిదారులందరికీ జీరో బిల్ వస్తోంది. అంటే 200 యూనిట్లలోపు కరెంటు వాడిన వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువైనా వారు పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక నెలలో 201 యూనిట్లు విద్యుత్ వినియోగించి.. ఆ తరువాత నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడినా వారికి ఈ పథకం వర్తిస్తోంది. ఇకపై ఏదైనా నెలలో 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగిస్తే వారిని శాశ్వతంగా ఈ పథకం కింద అనర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చలు జరిగినట్టు తెలిసింది. తెల్ల కార్డులు 93 లక్షలు.. గృహజ్యోతి పథకం మార్గదర్శకాల ప్రకారం తెల్లరేషన్ కార్డు ఉన్నవారంతా అర్హులు. రాష్ట్రంలో దాదాపు 93 లక్షల తెల్లకార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఉచిత విద్యుత్ లబ్ధిదారులు 51.26 లక్షల మంది ఉన్నారు. అయితే, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హుల సంఖ్య పెరిగితే.. ఆ మేరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుంది. సకాలంలో డిస్కంలకు ఆ నిధులు చెల్లించకుంటే ఆ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.185 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు డిస్కంలకు సబ్సిడీగా చెల్లిస్తోంది. వినియోగదారుల సంఖ్య పెరిగితే సబ్సిడీ మొత్తం కూడా భారీగా పెరుగుతుంది. అందువల్ల 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే వారిని అనర్హులుగా ప్రకటిస్తే ఖజానాపై భారం గణనీయంగా తగ్గుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
త్వరగా సమాధానం ఇవ్వకుంటే ‘లాపతా ఈసీ’ అని కూడా పెడతార్సార్!
త్వరగా సమాధానం ఇవ్వకుంటే ‘లాపతా ఈసీ’ అని కూడా పెడతార్సార్! -
ఈ రాశి వారికి భూలాభాలు.. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.నవమి రా.8.32 వరకు తదుపరి దశమి, నక్షత్రం: కృత్తిక ఉ.6.45 వరకు తదుపరి రోహిణి, వర్జ్యం: రా.9.46 నుండి 11.14 వరకు, దుర్ముహూర్తం: సా.4.40 నుండి 5.32 వరకు, అమృత ఘడియలు: రా.2.14 నుండి 3.44 వరకు.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.22రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.వృషభం.... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.మిథునం... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.కర్కాటకం... వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.సింహం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.కన్య.... ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.తుల..... కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.వృశ్చికం... కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన మార్పులు.ధనుస్సు... ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.మకరం.... వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కుంభం... మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.మీనం... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ధనలాభం. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. -
జెలెన్స్కీ, (ఉక్రెయిన్ అధ్యక్షుడు) రాయని డైరీ
శుక్రవారం అలాస్కాలో ట్రంప్, పుతిన్ కలిసినప్పుడు చరిత్రలో నేను చదువుకున్న ‘యాల్టా’ సమావేశమే నాకు గుర్తుకొచ్చింది!నేను పుట్టటానికి 33 ఏళ్ల ముందు జరిగిన సమావేశం అది. అప్పటికి పుతిన్ పుట్టలేదు. ట్రంప్ కూడా పుట్టలేదు. యాల్టా సమావేశం జరిగిన ఏడాదికి ట్రంప్, ఏడేళ్లకు పుతిన్ పుట్టారు.‘యాల్టా’ ఇప్పుడు ఉక్రెయిన్లో ఉంది. అప్పట్లో సోవియెట్ యూనియన్లో ఉంది. యాల్టాకు పోలికగా ఇప్పుడు అలాస్కా నాకు గుర్తుకు రావటానికి తగినన్ని కారణాలే ఉన్నాయి.రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో యాల్టా సమావేశం జరిగింది. ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో అలాస్కా సమావేశం జరిగింది.యాల్టా సమావేశం రూజ్వెల్ట్, స్టాలిన్, చర్చిల్ల మధ్య జరిగింది. అలాస్కా సమావేశం ట్రంప్, పుతిన్ల మధ్య జరిగింది.యాల్టాలో రూజ్వెల్ట్, చర్చిల్ కలిసి స్టాలిన్కు కొన్ని దేశాల భూభాగాలను పంచి పెట్టారు! ఇప్పుడు ట్రంప్ కూడా ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాలను నా చేత ఇప్పించేందుకు ట్రంప్కు మాట ఇచ్చి ఉంటారా?!అలాస్కాకు, యాల్టాకు అన్నిటికన్నా ముఖ్యమైన పోలిక... యాల్టా సమావేశం ఫిబ్రవరిలో జరగటం! ఆ తర్వాత 77 ఏళ్లకు ఉక్రెయిన్ మీదకు రష్యా దురాక్రమణ కూడా ఫిబ్రవరిలోనే ప్రారంభం అవటం!శనివారం ఉదయం ట్రంప్ పర్సనల్ సెక్రెటరీ నటాలీ ఫోన్ చేసి, ‘‘ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాపీగా లేరు...’’ అన్నారు!సోమవారం వాషింగ్టన్లో ట్రంప్కూ, నాకూ మధ్య జరగబోయే సమావేశంలో ట్రంప్ తనేమి చెప్పబోతారో, దాన్నే ముందుగా నటాలీ చేత నాకు చెప్పించటానికి ట్రంప్ ఫోన్ చేయించి ఉంటారని నాకు అర్థమైంది. ‘‘ట్రంప్ ఒక్కరేనా, ప్రెసిడెంట్ పుతిన్ కూడా హ్యాపీగా లేరా?’’ అన్నాను.నా వ్యంగ్యాన్ని ఆమె సరిగానే అర్థం చేసుకున్నప్పటికీ, అదేమీ పట్టనట్లు ‘‘మీరూ, పుతిన్ ఓపెన్ డోర్స్ మీటింగ్లో కూర్చుంటే బాగుంటుందని ప్రెసిడెంట్ ట్రంప్ భావిస్తున్నారు...’’ అన్నారు.‘‘ఓపెన్ ఆన్సర్లు లేకుండా, ఓపెన్ డోర్ మీటింగులతో ఏమౌతుంది చెప్పండి మిసెస్ నటాలీ?’’ అన్నాను.నటాలీ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత, ‘‘మూడో ప్రపంచ యుద్ధం కనుక మొదలైతే ఇక అదే చివరిది అవుతుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు’’ అన్నారు!!మూడో ప్రపంచ యుద్ధం వస్తే అదే ఆఖరి యుద్ధం అవుతుందని జోస్యంలా చెప్పటం కాకుండా, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఈ భూగోళానికే పెద్ద విపత్తు అని ఒక జాగ్రత్తలా ఎవరూ ఎందుకు మాట్లాడరు!‘‘మిసెస్ నటాలీ! రోజంతా మీరు ప్రెసిడెంట్ పక్కనే ఉంటారని, ఇంటర్నెట్లో ప్రెసిడెంట్ ట్రంప్పై వచ్చే ప్రశంసాపూర్వకమైన కథనాలను ఆయనకు అందిస్తుంటారని విన్నాను. ట్రంప్ కనుక పుతిన్తో, ‘మీరే ముందు యుద్ధం ఆపేయండి’ అని ఒక్క మాట అనగలిగినా మా వైపు నుండి కూడా ఒక ప్రశంసాపూర్వకమైన కథనం మీకు లభ్యమౌతుంది...’’ అన్నాను, నవ్వుతూ.ఆ మాటకు తనూ నవ్వారు. ఇద్దరం ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కెరీర్లో ఉన్నవాళ్లం. ఆ మ్యాజిక్ ఏదో మా మాటల్లో పనిచేసినట్లుంది. ప్రెసిడెంట్కు సెక్రెటరీగా కాకుండా, ఒక కో–ఆర్టిస్ట్గా నాతో సైన్ ఆఫ్ అయ్యారు నటాలీ.అలాస్కా సమావేశం జరిగినప్పటికీ కీవ్ను ఆక్రమించేందుకు రష్యా ఇంకా ఇంకా దగ్గరికి వస్తూనే ఉంది! రేపు ట్రంప్తో నా మీటింగ్ తర్వాత కూడా రష్యాకు నేను ఒకటే చెబుతాను.‘‘మీరు మాపై దాడికి వచ్చినప్పుడు మీరు మా ముఖాలను చూస్తారు. మా వీపులను కాదు, మా ముఖాలను!’’ అని చెప్పిందే చెబుతాను.