breaking news
	
		
	
  - 
      
                   
                                                       మరీ ఇంత అలసత్వమా? 44 ఏళ్ల తర్వాత క్లీన్ చిట్మన దేశంలో కొన్ని కేసులు ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతూనే ఉంటాయి. కింద కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా..పైకోర్టులో సవాలు వేయడంతో కొన్నేళ్లుగా ఆ కేసులు ఓ కొలిక్కి రాకుండా ఉండిపోతాయి. ఈ క్రమంలో క్లయింట్లు చనిపోతే ఇక ఆ కేసు కోసం సంబంధిత బాధితులు ఏళ్లుగా నిరీక్షించి పోరాడితే గానీ న్యాయం జరగదు. ఈ పెండింగ్ కేసులు దేశం మొత్తంగా చాలానే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే..40 ఏళ్ల నాటి లంచం కేసు.. బాధితుడి చనిపోయిన కొన్నేళ్లకు క్లీన్ చీట్ లభించడం విశేషం. అత్యున్నత న్యాయస్థానం అతడి గౌరవాన్ని పునరుద్ధరించి.. పెన్షన్తో సహా తత్సంబంధిత ద్రవ్యప్రయోజనాలను చట్టపరమైన వారసులకు ఇవ్వాల్సిందిగా అదేశించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..దాదార్ నాగ్పూర ఎక్స్ప్రెస్లో టీటీఈగా పనిచేసిన వీఎం సౌదాగర్ 1988లో ప్రయాణికుల నుంచి రూ. 50ల లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. శాఖపరమైన విచారణ అనంతరం 1996లో సర్వీస్ నుంచి తొలగించారు. ప్రస్తుతం సదరు బాధితుడు బతికి లేకపోయినప్పటికీ..అతడి కుటుంబసభ్యులు న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. నిజానికి ట్రిబ్యూనల్ కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టులో సవాలు వేయండంతో..ఆ తీర్పు నిలిచిపోయింది. అప్పటి నుంచి ఆ కేసు..అలా పెండింగ్లోనే ఉండిపోయింది. గత సోమవారం అత్యున్నత న్యాయస్థానం సదరు బాధితులకు ఊరట లభించేలా చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బాధితుడిపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అతడి గౌరవాన్ని పునరుద్ధరించి పెన్షన్తో సహా అన్ని ద్రవ్య ప్రయోజనాలను మూడు నెలల్లోపు అతని చట్టపరమైన వారసులకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ వివాదం ఎలా వచ్చిందంటే..ఈ వివాదం మే 31, 1988 నాటిది. సౌదాగర్ ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ. 50 డిమాండ్ చేశాడని, వారిలో ఒకరికి ఛార్జీలో బ్యాలెన్స్లో రూ.18 తిరిగి ఇవ్వలేదని రైల్వే విజిలెన్స్ బృందం ఆరోపించింది. దీని ఆధారంగా డిపార్ట్మెంట్ విచారణ ప్రారంభించి..ఎనిమిదేళ్ల తర్వాత 1996లో సౌదాగర్ను సర్వీస్ నుంచి తొలగించారు. అయితే ఈ కేసులో కచ్చితమైన ఆధారాలు లేవని, విజిలెన్స్ బృందం గట్టి సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైంది. ప్రయాణికుల సాక్ష్యాలు లంచం తీసుకున్నారనే ఆరోపణకు మద్దతు ఇవ్వలేదు. అంతేగాదు ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు ఆయన ఎలాంటి డబ్బులు కోరలేదని, మిగతా కోచ్లను కూడా పర్యవేక్షించాక, రసీదు జారీ చేసి, మిగిలిన ఛార్జీని తిరిగి ఇస్తానని స్పష్టంగా చెప్పారు. దీంతో2002లో, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కేసును పరిశీలించి, సౌదాగర్ను తిరిగి నియమించాలని భారత రైల్వేలను ఆదేశించింది. అలాగే అధికారులు సమర్పించిన ఆధారాలేవి అతని తొలగింపుని సమర్థించలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే నాటి ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి బదులు..బాంబే హైకోర్టులో ట్రిబ్యునల్ ఉత్తర్వుని సవాలు చేయండంతో కోర్టు తీర్పుని నిలిపివేసింది. దాంతో అతని నియమకానికి అన్ని విధాలుగా తలుపులు మూసుకుపోయాయి. కానీ అతడి కుటుంబం ఆశ వదులు కోలేదు, ఎప్పటికైన న్యాయం లభిస్తుందని పోరాటం కొనసాగించింది. చివరికి 44 ఏళ్ల తర్వాత ఉపశమనం..దశాబ్దాల నాటి కేసుని సమీక్షించిన ధర్మాసనం సౌదాగర్పై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని తేల్చింది. విచారణ అధికారి విషయాలను వక్రీకరించారని, తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని పేర్కొంది సుప్రీం కోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సర్వీస్ ఇచ్చిన తీర్పు సరైనదేనని, విచారణ అధికారి చెబుతున్న ఆధారాలు సాక్ష్యుల మాటలతో ఏకభవించలేదని, అందువల్ల తొలగింపు శిక్షను రద్దు చేసే హక్కు ట్రిబ్యునల్కి ఉందని హైకోర్టు గుర్తించడంలో విఫలమైందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అదీగాక ఎలాంటి అధారాలు లేకుండా ఒక చనిపోయిన వ్యక్తి పేరు అవినీతి ఆరోపణలతో కళంకితమైందని మండిపడింది. అందువల్ల ఆయన గౌరవాన్ని పునరుద్ధరించేలా ఇలా సుప్రీం కోర్టు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చింది. ఏదీఏమైనా ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఉపశమనం లభించడం బాధకరం. చనిపోయేంత వరకు ఎంత మనోవేదన అనుభవించి ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కేసుల్లోని అలసత్వం..బాధితులు చనిపోయేంత వరకు న్యాయం లభించకపోవడం అనేది గమనార్హం, బాధకరం కూడా.(చదవండి: చెత్త వేశారో.. మీచెంతకే 'రిటర్న్ గిఫ్ట్'! స్ట్రాంగ్ క్లీనింగ్ పాఠం)
- 
      
                   
                                                       జనసేన ఎమ్మెల్యేకు చేదు అనుభవంసాక్షి,విజయనగరం: నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి చేదు అనుభవం ఎదురైంది. మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమెను స్థానికులు నిలదీశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బిక్కమోహం వేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆమెను నిలదీశారు. తుపాను సాయం కింద బియ్యం పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే లోకం మాధవి గ్రామానికి వచ్చారు. అయితే లబ్ధిదారుల జాబితాలో కొందరికి 25 కేజీల చొప్పున,కొందరికి 50 కేజీల చొప్పున, మరికొందరు పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇదే విషయంపై మత్స్యకార మహిళలు ఎమ్మెల్యేను గట్టిగా నిలదీశారు.తుపాను నష్టం అందరికీ ఒకేలా ఇవ్వాలి గాని పార్టీల వారీగా వివక్ష చూపడం ఏంటని ప్రశ్నించారు. పరిహారం జాబితా గందరగోళంగా ఉండటంతో ఎమ్మెల్యే సమాధానం చెప్పలేకపోయారు. చివరికి ప్రభుత్వానికి నివేదిస్తామని సమాధానం చెప్పి కారు ఎక్కి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై అన్ని మత్స్యకార గ్రామాలలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
- 
      
                   
                                                       రామ్-భాగ్యశ్రీ నుంచి మరో మెలోడీ సాంగ్రామ్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ఆంధ్రా కింగ్ తాలుకా'. నవంబర్ 28న మూవీ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రెండు పాటలు రాగా అవి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హీరోహీరోయిన్ల మధ్యలో తీసిన మరో మెలోడీ గీతాన్ని తాజాగా రిలీజ్ చేశారు. 'చిన్ని గుండెలోనా..' అంటూ సాగే ఈ గీతం వినసొంపుగా ఉంటూ శ్రోతల్ని అలరిస్తోంది.(ఇదీ చదవండి: కాంట్రాక్టర్ పేరు రాజమౌళి.. 'బాహుబలి'పై ప్రశాంత్ నీల్ రివ్యూ)గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ రామ్కి హిట్స్ దక్కట్లేదు. ఈ క్రమంలోనే 'ఆంధ్రా కింగ్ తాలుకా'పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఓ ఫ్యాన్ బయోపిక్ అనే ట్యాగ్ లైన్తో మూవీ తీస్తున్నారు. సినిమా హీరోలు, వాళ్ల ఫ్యాన్స్ మధ్య ఉండే ఎమోషన్స్ తదితర అంశాల్ని చూపిస్తూనే మరోవైపు ప్రేమకథని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లితో ఒక్కటైన తెలుగు సీరియల్ యాక్టర్స్)
- 
      
                   
                                                       సీఎం ప్రజావాణి చొరవతో బాలిక సౌమ్యకు పునర్జన్మహైదరాబాద్: ముఖ్యమంత్రి ప్రజావాణి చొరవతో బాలిక సౌమ్యకు పునర్జన్మ లభించింది. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న సౌమ్యకు సీఎం ప్రజావాణి అండగా నిలిచి ఆ బాలిక చికిత్సకు అవసరమైన రూ. 9 లక్షలు ఆర్థిక సాయం సమకూర్చారు. శుక్రవారం ప్రజాభవన్లో నిర్వహించిన సీఎం ప్రజావాణికి సౌమ్య తన తండ్రి తల్లిదండ్రులతో కలిసి వచ్చి సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యలకు ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చల్లని దీవెనలు తన ఆయుష్షును పెంచిందని సౌమ్య సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం ప్రజావాణిలో సౌమ్యకు రూ. 4 లక్షల సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కును చిన్నారెడ్డి, దివ్య అందించారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టి ( సెర్ప్) నుంచి మరో రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సౌమ్యకు అందించారు.జనగాం జిల్లా వెంకిర్యాల గ్రామానికి చెందిన ఈర్ల శ్రీనివాస్, అనురాధ తమ కుమార్తె సౌమ్య అనారోగ్య సమస్యను రెండు నెలల క్రితం సీఎం ప్రజావాణి దృష్టికి తీసుకువచ్చారు. తల్లి అనురాధ స్వయం సహాయక గ్రూపు సభ్యురాలు కాగా తండ్రి ఈర్ల శ్రీనివాస్ సన్నకారు రైతు. సౌమ్య దీనస్థితి గమనించి సీఎం ప్రజావాణి అండగా నిలిచింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఆసుపత్రిలో సౌమ్య శస్త్రచికిత్స విజయవంత మైంది.
- 
      
                   
                                                       పెళ్లితో ఒక్కటైన తెలుగు సీరియల్ యాక్టర్స్తెలుగు సీరియల్స్లో మనమ్మాయిలు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అలాంటిది 10కి పైగా సీరియల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బ్యూడీ సాండ్రా జైచంద్రన్. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఈమె.. తన భర్త మరో అమ్మాయితోనూ రిలేషన్లో ఉన్నాడని విడాకులు ఇచ్చేసింది. తర్వాత సీరియల్స్ చేసుకుంటూ బిజీ అయిపోయింది. ఈ ఏడాది ప్రియుడిని పరిచయం చేసిన ఈమె ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంది.(ఇదీ చదవండి: కాంట్రాక్టర్ పేరు రాజమౌళి.. 'బాహుబలి'పై ప్రశాంత్ నీల్ రివ్యూ)'కలవారి కోడలు' సీరియల్తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సాండ్రా.. 'ముద్దమందారం', 'శుభస్య శీఘ్రం'లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'ఆటో విజయశాంతి' సీరియల్ చేస్తోంది. అయితే కొన్నాళ్ల ముందు నుంచి 'మనసిచ్చి చూడు', 'శుభస్య శీఘ్రం' సీరియల్స్లో హీరోగా చేసిన మహేశ్ బాబు కాళిదాసుతో కలిసి సాండ్రా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. అలా కలిసి వీళ్లిద్దరూ వీడియోలు కూడా చేస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే సాండ్రా-మహేశ్ ప్రేమలో ఉన్నారా అని అంతా అనుకున్నారు. సడన్గా ఈ ఏడాది జూలైలో ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. అందరూ అనుకుంటున్నట్లు తాము లవ్లో ఉన్నామని వెల్లడించారు. జీవితాంతం ఈ ప్రేమను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు పెళ్లితో సీరియల్ నటులు ఇద్దరూ ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సాండ్రా.. సీరియల్స్తో పాటు ఆర్య, తకిట తకిట అనే తెలుగు సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్)
- 
      
                   
                                                       ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తుఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మరో ఓటమి ఎదురైంది. మెల్బోర్న్ వేదికగా ఆసీస్ జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా భారత్ నిర్ధేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు 6 వికెట్లు కోల్పోయి కేవలం 13.2 ఓవర్లలోనే ఊదిపడేశారు. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్ష్.. 2 ఫోర్లు, 4 సిక్స్లతో 46 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన ఎనిమిదివ ఓవర్లో మార్ష్ ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు.అతడితో పాటు ట్రావిస్ హెడ్(15 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్తో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.అభిషేక్ ఒంటరి పోరాటం..ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు చేశాడు. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) రాణించాడు.ఆసీస్ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం హోబర్ట్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs SA: రీఎంట్రీలో రిషభ్ పంత్ ఫెయిల్.. భారత్ ఆలౌట్.. .. స్కోరెంతంటే?
- 
      
                   
                                                       భారత్కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ (Ford).. తమిళనాడులోని చెన్నై ప్లాంట్లో తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్ను ఏర్పాటు చేయనుంది. ఇది నాలుగు సంవత్సరాల విరామం తర్వాత.. భారతదేశంలో ఉత్పత్తికి పునరాగమనాన్ని సూచిస్తుంది. ఒప్పందం ప్రకారం.. ఫోర్డ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.ఫోర్డ్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత 600 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంస్థకు చెందిన కొత్త సౌకర్యంలో సంవత్సరానికి 2,35,000 ఇంజిన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ఉత్పత్తి 2029లో ప్రారంభం కానుంది. కాగా ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంజిన్లను కంపెనీ.. ఎగుమతి చేయనుంది. కాబట్టి ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉంటాయి.ఇదీ చదవండి: ఏడేళ్లుగా వెయిటింగ్.. నా డబ్బు రీఫండ్ చేయండి: శామ్ ఆల్ట్మాన్2021లో ఫోర్డ్.. భారతదేశంలో వాహనాల తయారీని నిలిపివేసింది. దీనికి కారణం కంపెనీ ఊహకందని నష్టాలను చవిచూడటమే. ఒకప్పుడు ఎకోస్పోర్ట్, ఎండీవర్, ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసిన మరైమలై నగర్ ప్లాంట్.. అప్పటి నుంచి (2021 నుంచి) ఖాళీగానే ఉంది.Hard work and dedicated follow up of #TeamCMMKStalin pays off !#Ford is officially back to Chennai! 🎊Today, Ford and the Government of Tamil Nadu signed an MoU in the presence of Honourable @CMOTamilNadu Thiru. @MKStalin avargal and our Honourable DyCM Thiru @Udhaystalin… pic.twitter.com/NDwFyz4Utf— Dr. T R B Rajaa (@TRBRajaa) October 31, 2025
- 
      
                   
                                                       అందుకే తెలంగాణకు వచ్చా..హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్ శెలార్ శుక్రవారం భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్లో వీరి సమావేశం జరిగింది. సినిమా పరిశ్రమ (Film Industry) అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా నిర్మాణ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించిందని, రాచకొండ లాంటి ప్రాంతాలు సినిమా షూటింగ్స్కుు ఎంతో అనువైనవి మహారాష్ట్ర మంత్రికి కోమటిరెడ్డి వివరించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీలో బాలీవుడ్, హాలీవుడ్ స్థాయి సినిమాలు నిర్మిస్తారని,హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రాంతాలు సినిమాలు నిర్మించేందుకు ఉత్తమ వేదికలుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.తెలంగాణను హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్గా డెవలప్మెంట్ చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) వివరించారు. సినిమా పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు, సినీకార్మికుల సంక్షేమం లాంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.కోమటిరెడ్డికి శెలార్ ఆహ్వానంసినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, మహారాష్ట్రలో కూడా ఇట్లాంటివి అమలు చేసేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు ఆశిష్ శెలార్ (Ashish Shelar) వెల్లడించారు. మహారాష్ట్ర ఫిల్మ్ సిటీని సందర్శించాలని మంత్రి కోమటి రెడ్డిని ఆశిష్ శెలార్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్
- 
      
                   
                                                       హర హర మహాదేవ : కార్తీకంలో దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలుకార్తీక మాసంలో మహాశివుడిని భక్తితో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం, అలాగే కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ మాసం శివరాధనకు అంకితం. ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాలన్ని సందర్శించి, భక్తితో దీపారాధన చేస్తే మోక్షం లబిస్తుందని, కష్టాలన్నీ తొలగి, అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వాసం. కార్తీక మాసంలో ఒక్క రోజులోనే పంచారామాలను ఒక్కరోజులోనే సందర్శించడం మరో విశేషం. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో సందర్శించదగిన కొన్ని శివాలయాల గురించి తెలుసుకుందాం.నిజానికి చెప్పాలంటే శివాలయం లేని గ్రామం ఉండదు. అయినా ప్రసిద్ధ శివాలయాలను, జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలను దర్శించి తరించాలని భక్తులు భావిస్తారు. అమరారామం: గుంటూరు జిల్లాలోని అమరావతిలో ప్రధాన దైవం అమరలింగేశ్వర స్వామి. అమరేంద్ర ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినందున ఈ పేరు వచ్చింది. కృష్టా నది దక్షిణ ఒడ్డున ఉన్న బాల చాముండిక అమరలింగేశ్వర స్వామి భార్య. ఈ ఆలయం రెండు అంతస్తులను కలిగి ఉన్న భారీ శివలింగానికి ప్రసిద్ధి చెందింది.ద్రాక్షారామం: తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణానికి సమీపంలో ఉన్న ద్రాక్షారామంలో కొలువైన శివుడిని భీమేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని సూర్య భగవానుడు స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు.దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడి రాతి స్థంభాన్ని ఆలింగనం చేసుకుని భక్తితో మొక్కితే కోరిన కోర్కెలు తీరతాయని విశ్వాసం.సోమారామం: భీమవరంలో ఉన్న సోమారామం పంచారామాలలో మూడవది. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడట. ఇక్కడ శివుడిని పూజించడం ద్వారా చంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని నమ్ముతారు. అందుకే దీనికి సోమారామం అని పేరు వచ్చింది. చంద్రుని దశల ఆధారంగా దాని రంగు మారుతూ ఉంటుంది. పౌర్ణమి సమయంలో , సోమారామంలోని శివలింగం తెల్లగాను, అమావాస్య కు నల్లగా మారుతుందట.సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలోని కుమార రామ ఆలయం పంచారామాలలో చివరిది. వుడిని కుమార భీమేశ్వర స్వామిగా  కొలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని కార్తికేయుడు ప్రతిష్టించాడని ప్రతీతి. పూర్తిగా సున్నపురాయితో తయారు చేసిన ఇక్కడి శివలింగం దాదాపు 16 అడుగుల ఎత్తు ఉంటుంది అలాగే ఈ ఆలయం 100 స్తంభాల మండపం, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఏకశిలా నంది ప్రత్యేకం. కోటప్పకొండ : అత్యంత ప్రసిద్ధ శైవ దేవాలయాలలో గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండ ఒకటి. 1587 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండలో అత్యంత పురాతనమైన శివాలయం. శివుడిని త్రికూటేశ్వర స్వామి అని పిలుస్తారు.కోటప్పకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్పకొండలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు. ఈ కోటప్ప కొండను కాకులు వాలని కొండగా కూడా ఇది ప్రసిద్ధి. శ్రీశైలం: నంద్యాల జిల్లాలో కొలువై ఉన్న శ్రీశైలం దేవస్థానం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 179 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వయా పాలమూరు జిల్లా నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయాన్ని రెండో శతాబ్దంలో నిర్మించాని చెబుతారు. ఈ క్షేత్రంలో పాతాళగంగ, శిఖరేశ్వర దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచధార వంటి సందర్శనీయ ప్రదేశాలు.ఛాయ సోమేశ్వర స్వామి : నల్లగొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం. దీన్ని ఇక్ష్వాకు వంశస్తులు 11, 12వ శతాబ్దంలో నిర్మించారట. ఈ గుడిలోని శివ లింగం ప్రతిరోజూ శాశ్వతమైన నీడను కలిగి ఉంటుంది. అందుకే ఈ గ ఇక్కడి శివుడికి ఛాయా సోమేశ్వరుడనే పేరు వచ్చింది.రామప్ప దేవాలయం: తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమైన దేవాలయం. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. అత్యున్నతమైన వాస్తు, శిల్ప సంపదతో ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఆలయం. రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు.యాగంటి : కర్నూలు జిల్లాలోనే మరో ప్రముఖ శివాలయం ఉంది. 5వ శతాబ్దంలో నిర్మించారని ప్రతీతి. పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహ రూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలవడం మరో ప్రత్యేకత. అలాగే యాగంటి నంది ప్రతీ ఏడాదీ కొంచెం కొంచెం పెరుగుతుందని చెబుతారు.ఆలంపూర్ నవ బ్రహ్మ. : జోగుళాంబ-గద్వాల జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే ఈ తొమ్మిది దేవాలయాల శ్రేణిని చాళుక్యులు నిర్మించారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు అనుగ్రహించి ప్రపంచ సృష్టించడానికి కావలసిన శక్తులు బ్రహ్మకు ప్రసాదిస్తూ ఆశీర్వాదిస్తాడు. అందువల్ల శివునికి బ్రహ్మేశ్వరుడు అని కూడా పిలుస్తారు. బ్రహ్మ ఉపసర్గ మొత్తం కుమార, అర్క, వీర, బాల, స్వర్గ, గరుడ, విశ్వ, పద్మ, తారక బ్రహ్మ అనే తొమ్మిది ఆలయాలున్నాయి.సంగమేశ్వరుడు : కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య కొలువై ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రత్యేకత. సప్తనదీ సంగమంగా పిలువబడే శివయ్య ఏడాదిలో కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. వేల ఏళ్లనాడు ఆలయంలో ప్రతిష్టించిన వేప లింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం విశేషం.వేములవాడ రాజన్న: రాజన్న సిరిసిల్లాల జిల్లాలో వేములవాడ దేవస్థానంలో కొలువై ఉన్న శివాలయం నిర్మాణం, ఆధ్యాత్మిక పవిత్రత రెండింటికీ ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీగా పేరొందిది. ఇక్కడి ధర్మ గుండం జలాల్లో తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతారు.కీసర : లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరి క మేరకు శ్రీరామలింగేశ్వరస్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే కీసరగుట్ట. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చిమ అభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం.ఇవి కొన్ని శివాలయాలు మాత్రమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరెన్నో శివాలయాలు, పవిత్రమైనవిగా, భక్తులు కోర్కెలు తీర్చే కొంగుబంగారం విలసిల్లుతున్నాయి. భక్తుల ఆదరణకు నోచుకున్నాయి.
- 
      
                   
                                                       రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!మాస్ మహారాజా తాజాగా మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తోన్న మాస్ జాతర ప్రీమియర్స్ ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 31 రిలీజవుతుందని ప్రకటించినా మేకర్స్.. బాహుబలి ది ఎపిక్ దెబ్బకు ప్రీమియర్స్కే పరిమితయ్యారు. దీంతో మాస్ జాతర ఫస్ట్ డే కలెక్షన్స్పై ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రూ.61 లక్షలకే పరిమితమైంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడతో మాస్ జాతరకు ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు.బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ మూవీతో మాస్ జాతరకు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రముఖ ట్రేడింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు రూ. కోటి కూడా దాటలేదు. అడ్వాన్స్ బుకింగ్స్తో శుక్రవారం మధ్యాహ్నం వరకు కేవలం రూ.61 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్స్ సాయంత్రం రిలీజ్ చేయడం.. తక్కువ షోలు వేయడం కూడా వసూళ్లపై ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఉదయమే ప్రీమియర్స్తో పాటే మూవీ రిలీజ్ అయి ఉంటే వసూళ్ల పరంగా మాస్ జాతరకు కలిసొచ్చేది.ఓవరాల్గా చూస్తే శుక్రవారం ప్రీమియర్స్తో కలిపి రూ.2 నుంచి 3 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది రిలీజైన రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ వసూళ్ల కంటే తక్కువే. ఈ సినిమా తొలి రోజే రూ.3.45 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోవడంతో రవితేజ కెరీర్లో డిజాస్టర్గా నిలిచింది. వీకెండ్లో మాస్ జాతర రిలీజ్ కావడం నిర్మాతకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన శని, ఆది వారాల్లోనైనా మాస్ జాతర వసూళ్లు పుంజుకునే అవకాశముంది. కాగా.. మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు.
- 
      
                   
                                                       పీరియడ్ సెలవు : శానిటరీ ప్యాడ్ ఫోటోలు పంపమన్న సూపర్ వైజర్లుఒక పక్క మహిళలు, పీరియడ్ సమస్యలను అర్థం చేసుకున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పీరియడ్ లీవ్ను ప్రత్యేకంగా ప్రకటిస్తోంటే హర్యానాలోని ప్రముఖ విశ్వ విద్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వైనం కలకలం రపింది. హర్యానాలోని రోహ్తక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయంలో కొంతమంది మహిళా పారిశుద్ధ్య కార్మికులలు తాము పీరియడ్స్లో ఉన్నదీ లేనిదీ రుజువు చేసుకోవాల్సిన దుస్తితిపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది.అక్టోబర్ 26నక్యాంపస్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అక్టోబర్ 26న మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయాన్ని హర్యానా గవర్నర్ అషిమ్ కుమార్ ఘోష్ సందర్శించారు. ఆదివారం సెలవు అయినప్పటికీ మహిళలతో సహా పారిశుద్ధ్య కార్మికులందరిని విధులకు పిలిచారు. విధుల్లో ఉన్న పారిశుద్ధ్య మహిళలు ఆలస్యంగా వచ్చారు.మరికొంతమంది సెలవు అడిగారు. రుతుక్రమం, అనారోగ్యంతోఉన్నామని, సిబ్బంది చెప్పినప్పుడు, ఇద్దరు వినోద్, జితేంద్ర సూపర్వైజర్లు అబద్ధం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలకు సెలవు ఇవ్వలేదు సరికదా, ఆధారం కోసం వినియోగించిన శానిటరీ ప్యాడ్ ఫొటోలు పంపాలని వీరు బలవంతం చేశారు. ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ డ్యూటీకి వచ్చిన ఒక మహిళను వాష్రూమ్కు తీసుకెళ్లి, రుతుక్రమాన్ని మరో మహిళా సిబ్బందితో తనిఖీ చేయించారు. అలాగే ఇలా చేయడానికి నిరాకరించిన మహిళల్ని ఉద్యోగంలోంచి తీసేస్తామని కూడా బెదిరించారు.ఈ నేపథ్యంలో మహిళా పారిశుద్ధ్య సిబ్బంది నిరసన తెలిపారు.వీరికి తోటి మహిళా సిబ్బంది, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. నిరసనకు దిగాయి. దిగ్భ్రాంతి కరమైన సంఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. కమిషన్ ఛైర్పర్సన్తో సంఘటన ఫోటోలు . వీడియోలను కూడా బాధితలు పంచుకున్నారు.వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణన్ కాంత్ దీనిపై ఇంటర్నల్ దర్యాప్తునకు ఆదేశించింది. మరియు దోషులుగా తేలిన వారిని వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇద్దరు సూపర్వైజర్లతోపాటు, మరొకరిపై కేసు నమోదైంది.కాగా హర్యానాలో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక పీరియడ్లీవ్ విధానమేమీ లేదు. కానీ ఇటీవలి ఆదేశాల ప్రకారం అన్ని మహిళా కాంట్రాక్టు ఉద్యోగులు (హర్యానా కౌశల్ రోజ్గార్ నిగమ్ ద్వారా నియమించబడిన వారితో సహా) నెలకు రెండు రోజుల క్యాజువల్ సెలవులు తీసుకోవచ్చు.
- 
      
                   
                                                       ‘రోహిత్ ఆర్య’ ఎన్కౌంటర్లో ట్విస్ట్ముంబై: ఆడిషన్స్ పేరుతో చిన్నారులను కిడ్నాప్ చేసి, పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన ముంబై చిత్ర నిర్మాత ‘రోహిత్ ఆర్య’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.రోహిత్ ఆర్య అప్సర మీడియా ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్లను దక్కించుకున్నాడు. వాటిల్లో విద్యాశాఖలో పూర్తి చేసిన ప్రాజెక్టు నిమిత్తం రోహిత్ ఆర్యకు మహా ప్రభుత్వం రూ. 2 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఆ మొత్తం ఇవ్వలేదని కారణంతో రోహిత్ ఆర్య పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్2022-2023లో ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్ అనే పట్టణ పారిశుధ్య డ్రైవ్ ప్రాజెక్ట్ బాధ్యతల్ని నాటి మహరాష్ట్ర ప్రభుత్వం రోహిత్ ఆర్యకు అప్పగించింది. అప్సర మీడియా పేరుతో ఆ ప్రాజెక్ట్ పనుల్ని చేసింది. ప్రభుత్వ ప్రాజెక్ట్లో శుభ్రతా చర్యలు సూచించటం, రిపోర్ట్ చేయటం, విద్యార్థులు,సిబ్బందికి అవగాహన కల్పించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 2023 జూన్ 30న నాటి ప్రభుత్వం రూ. 9.9 లక్షలు చెల్లించింది.ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహరాష్ట్రలో ప్రభుత్వం మారడం, నూతన ప్రభుత్వానికి రోహిత్ ఆర్య చేస్తున్న ప్రాజెక్ట్పై అసంతృప్తిని వ్యక్తి చేసింది. అంతేకాదు ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేసింది. ప్రభుత్వం నిర్ణయంతో రోహిత్ ఆర్యకు భారీ మొత్తంలో నష్టం వచ్చింది.సంవత్సరం తర్వాత మరోసారిఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఏడాది తర్వాత ప్రభుత్వం ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, ఈసారి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని కోరాడు. దీనికోసం రూ. 2.42 కోట్లు డబ్బు ఇవ్వాలని మరొక డిమాండ్ను సమర్పించాడు. అదే సమయంలో ‘ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్’ డైరెక్టర్ హోదాలో ఆర్య పాఠశాలల నుంచి రిజిస్టేషన్ ఫీజును వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఫీజును వసూలు చేయడానికి ఆర్యకు అధికారం లేదని ప్రభుత్వం తెలిపింది.పైగా,పాఠశాలల నుంచి వసూలు చేసిన డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ కోసం నిధులు సేకరించనని హామీ ఇచ్చి అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. కానీ ఆర్య డబ్బును జమచేయకపోగా.. అఫిడవిట్ దాఖలు చేయలేదని ప్రభుత్వం తెలిపింది.ఈ క్రమంలో ఆడిషన్స్ పేరుతో గురువారం పిల్లల్ని కిడ్నాప్ చేసి మహరాషష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన మొత్తాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. పిల్లల్ని విడిపించేలా పోలీసులు ఆర్యతో చర్చలు జరిపారు. ఆ సమయంలో పిల్లల ప్రాణాలు తీసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. అనంతరం రోహిత్ ఆర్యను ఆస్పతత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రోహిత్ ఆర్య కన్నుమూశారు.
- 
      
                   
                                                       భర్తే కాదు.. బావతోనూ సంసారం చేయాలని చిన్న కోడలిపై దారుణంసాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ అత్తా,మామలు చిన్న కోడలిని చిత్ర హింసలకు గురి చేయడం కలకలం రేపింది. అందుకు తన తల్లిదండ్రులకు బాధితురాలి భర్త రంజింత్ కుమార్ వంతపాడటం గమనార్హం. జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ చిన్న కోడలిపై అత్తమామలు ఒత్తిడి తెచ్చారు. బావకి పిల్లలు లేనందున అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని కోరికను వ్యక్తం చేశారు. అందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆమెను గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. తల్లిదండ్రులు డిమాండ్కు భర్త మౌనంగా ఉండిపోవడంతో బాధితురాలికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏడాది క్రితం బాధితురాలు బాబుకు జన్మనిచ్చినప్పటికీ, తాము చెప్పినట్లు చేయలేదన్న కారణంతో గత పది రోజులుగా ఆమెను, ఆమె కుమారుణ్ని గదిలో బంధించారు. గదికి కరెంటు, మంచినీళ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. ఈ అమానుష చర్యలు ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.ఈ విషయంపై మానవ హక్కుల సంఘం నేతలకు సమాచారం అందడంతో, వారు పోలీసుల సహాయంతో శుక్రవారం బాధితురాలు నివసిస్తున్న ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. బాధితురాలిని బంధించిన గదికి తాళాలు పగలగొట్టి ఆమెను బయటకు తీసుకువచ్చారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
- 
      
                   
                                                       కాంట్రాక్టర్ పేరు రాజమౌళి.. 'బాహుబలి'పై ప్రశాంత్ నీల్ రివ్యూగత రెండు మూడేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కాస్త ఎక్కువగానే ఉంది. అయితే ఒకరిద్దరు హీరోల మూవీస్ మినహా మిగిలినవి పెద్దగా వర్కౌట్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు 'బాహుబలి ద ఎపిక్' పేరిట.. దర్శకుడు రాజమౌళి సరికొత్త ట్రెండ్ సృష్టించినట్లే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటివరకు రీ రిలీజ్ అంటే ఫ్యాన్స్, సగటు ప్రేక్షకుల హంగామా మాత్రమే ఉండేది. బాహుబలి రీ రిలీజ్కి మాత్రం సెలబ్రిటీలు రివ్యూలు ఇస్తున్నారు.ఓవర్సీస్లో 'బాహుబలి ఎపిక్' గురువారం రిలీజ్ కాగా.. మహేశ్ బాబు కొడుకు గౌతమ్ దీన్ని చూసి ఎలాంటి అనుభూతి కలిగిందో చెప్పాడు. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సోషల్ మీడియాలో తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. రాజమౌళికి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్కి సొంతంగా సోషల్ మీడియా అకౌంట్స్ లేకపోవడంతో ఇతడి భార్య లిఖిత తన ఇన్ స్టా స్టోరీలో రివ్యూని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ వెబ్ సిరీస్.. తెలుగు ట్రైలర్ రిలీజ్)'ఓ రోడ్కు మరమ్మత్తులు చేయాల్సి వచ్చింది. ఆ బాధ్యతని ఓ కాంట్రాక్టర్కి అప్పగించారు. కానీ మరమ్మత్తులు వేయమని చెప్పిన రోడ్డుని ఏకంగా 16 లైన్ల సూపర్ ఎక్స్ప్రెస్ హైవేగా మార్చాడు. ఆ రోడ్ పేరు పాన్ ఇండియా, ఆ కాంట్రాక్టర్ పేరు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి టీమ్ మొత్తానికి నా అభినందనలు. ఓ తరం కోసం కలలు కన్నందుకు కృతజ్ఞతలు' అని ప్రశాంత్ నీల్ తనదైన రివ్యూ ఇచ్చేశాడు.2015, 2017లో రిలీజైన బాహుబలి రెండు భాగాల్ని ఒక్కటిగా చేసిన 'ద ఎపిక్' పేరిట ఇప్పుడు రీ రిలీజ్ చేశారు. 3 గంటల 45 నిమిషాల నిడివితో దీన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. చాలావరకు సీన్లని తీసేశారు. అదే టైంలో శివుడు(ప్రభాస్).. బాహుబలి రాజ్యంలో అడుగుపెట్టే సమయంలో నాజర్ పాత్రతో చెప్పించే సీన్లని కొత్తగా జోడించారు. అలానే చివరలో 'బాహుబలి' పేరుతో ఓ యానిమేటెడ్ మూవీ 2027లో రిలీజ్ కానుందని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: బాక్సాఫీస్కి బాహుబలి ‘జ్వరం'.. ఈసారి ఎన్ని రికార్డులో!)
- 
      
                   
                                                       రిటర్న్ గిఫ్ట్.. ఫుడ్ డెలివరీ కాదు చెత్త డెలివరీ!పరిశుభ్రత గురించి ఎంతలా అవగాహాన కార్యక్రమాలు చేపట్టినా..మార్పు మాత్రం శూన్యం. స్వచ్ఛభారత్ అంటున్న..చెత్త, అపరిశుభ్రత తాండవిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో బెంగళూరు నగరవాసులకు గట్టి పాఠమే చెప్పనుంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ. చాలా వినూత్నమైన రీతీలో తగిన గుణపాఠం చెబుతోంది. చెప్పినా..వినకపోతే ఈ శాస్తి తప్పదని గట్టిగానే హెచ్చరిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం దీన్ని వింతైన చర్యగా అభివర్ణించడమే కాదు..ఈ పనిష్మెంట్ హాట్టాపిక్గా మారింది. విననివాళ్లకు అదే 'రిటర్న్ గిఫ్ట్'..ఈ మేరకు బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(బీఎస్డబ్ల్యూఎంఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) కరిగౌడ మాట్లాడుతూ.."ఇది వింతైన చర్య కాదు. మా కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యర్థాలను వేరు చేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పొడి, తడి చెత్తను సేకరించడానికి ఇళ్లకు దాదాపు 5 వేలకు పైగా ఆటోలు వెళ్తున్నాయి. అయినప్పటికీ కొందరు మాత్రం రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. ఆ వ్యక్తులను పట్టుకునేందుకే సీసీటీవీలను కూడా ఏర్పాటు చేశాం. ఎవరైతే చెత్తవెయ్యొదని అవగాహన కల్పిస్తున్నా వేస్తున్నారో వారికి రిటర్న్ గిఫ్ట్లా ఆ చెత్తను వాళ్ల ఇంటి వద్ద తిరిగి వేయడమేగాక, రూ. 2000లు వరకు జరిమానా విధిస్తాం. అలాగే ఇదేమి వింతేన చర్య కాదు. ఎందుకంటే మా కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి వ్యర్థాలను వేరు చేయడం గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో కూడా అవగాహన కల్పిస్తున్నాం. అలాగే రోడ్లపై చెత్త వేయకండని అభ్యర్థిస్తున్నాం. అయినా ఇలా చేస్తే..ఇలాంటి చర్య సమంజసమే. బెంగళూరు ఒక "ఉద్యానవన నగరం" అని హైలైట్ చేస్తూ.. ప్రజలను చెత్తను వేయొద్దని, పరిశుభ్రతను కాపాడుకోవాలని చెప్పారు. అయితే కొన్నిచోట్ల చెత్త సేకరించేవారు లేకపోవడంతోనే వాళ్లంతా ఇలా వీధుల్లో చెత్త వేస్తున్నారని అన్నారు. అందుకోసమే భారీ చెత్తడబ్బాలను కూడా ఏర్పాటు చేయనున్నామని." కరిగౌడ తెలిపారు. ఇలాంటి చర్యలు అన్ని రాష్ట్రాల్లో గట్టిగా అమలైతే పూర్తి స్థాయిలో స్వచ్ఛ భారత నినాదం విజయవంతమైనట్లే కదూ..!.(చదవండి: ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు !)
- 
      
                   
                                                       ఒక్క దెబ్బతో జీవితమే తలకిందులు.. భిక్షాటన చేస్తున్న నటిమేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చిందంటే ఏ ఎమోషన్ అయినా ఇట్టే పండించగలదు. అందుకే శక్తిమాన్ సహా 150కి పైగా సీరియల్స్ చేసింది. ఎక్కువగా గ్లామరస్గానే కనిపించేది. కానీ, సడన్గా తనకు అన్నింటిపైనా విరక్తి వచ్చింది. బంధాలు, బాంధవ్యాలు అన్నింటినీ కాదనుకుని సన్యాసం పుచ్చుకుంది. పీంతబర మాగా మారింది. హిమాలయాల్లో సన్యాసిగా జీవిస్తోంది.జీవితంపై విరక్తితాజాగా ఓ ఇంటర్వ్యూలో నుపుర్ అలంకార్ (Nupur Alankar) అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. గూగుల్లో చూస్తే నా జీవితంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుస్తుంది. పీఎంసీ (పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్) బ్యాంక్ కుంభకోణం జరిగినప్పుడు జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఈ స్కామ్ తర్వాతే అమ్మ అనారోగ్యంపాలైంది. మెరుగైన చికిత్స అందించడనికి బ్యాంకులో డబ్బున్నా.. దాన్ని బయటకు తీసుకుని వాడలేని పరిస్థితి. అమ్మ, సోదరి చావులు చూశాక నా జీవితం కూడా ముగిసిపోయిందనుకున్నా.. ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్నాను. భిక్షాటనఅందుకే అన్ని కనెక్షన్లు తెంచేసుకున్నాను. ప్రాపంచిక జీవితానికి దూరంగా.. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో సంతోంషంగా ఉన్నాను. ఇక్కడ భిక్షాటన ఉంటుంది. నేను కూడా భిక్షాటన చేస్తుంటాను. అందరూ నాకు దానధర్మాలు చేసినదాంట్లో కొంత దేవుడికి, మరికొంత నా గురువుకి ఇస్తాను. ఈ భిక్షాటన వల్ల మనిషిలో ఇగో అనేది చచ్చిపోతుంది. ఇకపోతే నాలుగైదు జతల బట్టలతోనే కాలం గడిపేస్తున్నాను. ఆశ్రమానికి వచ్చేవారు కొన్నిసార్లు దుస్తులు కూడా ఇస్తుంటారు. వాటినే ఉపయోగిస్తూ ఉంటాను. కొన్నిసార్లు మంచు తుఫానులు వంటివి వచ్చినప్పుడు గుహలో జీవించాను అని చెప్పుకొచ్చింది.PMB స్కామ్..నటి నుపుర్ సన్యాసం పుచ్చుకోవడానికి ప్రధాన కారణం తల్లి, సోదరి చావు! ఆ చావులకు ప్రధాన కారణం 2019లో జరిగిన పీఎంసీ బ్యాంక్ స్కామ్. వేల కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చినవెంటనే ఆర్బీఐ.. పీఎంబీ బ్యాంక్పై ఆరునెలలపాటు ఆంక్షలు విధించింది. వినియోగదారులు కేవలం రూ.1000 మాత్రమే నగదు విత్డ్రా చేసుకోవచ్చని కఠిన నిబంధనలు పెట్టింది. దీంతో ఆ బ్యాంక్లో నగదు డిపాజిట్ చేసుకున్న వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తర్వాత విత్డ్రా పరిమితులను సవరించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 200 మందికి పైగా కస్టమర్లు ప్రాణాలు కోల్పోయారు.చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు
- 
      
                   
                                                       రీఎంట్రీలో రిషభ్ పంత్ ఫెయిల్.. భారత్ ఆలౌట్.. స్కోరెంతంటే?దాదాపు మూడు నెలల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) విఫలమయ్యాడు. సౌతాఫ్రికా-‘ఎ’ జట్టుతో భారత్-‘ఎ’ (IND A vs SA A) కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పూర్తిగా నిరాశపరిచాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన పంత్.. 20 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో కేవలం 17 పరుగులే చేసి నిష్క్రమించాడు. సౌతాఫ్రికా బౌలర్ ఒకులే సిలీ బౌలింగ్లో జుబేర్ హంజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మేరకు రీఎంట్రీలో రిషభ్ పంత్ ఇలా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు ముందు భారత్ రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా -‘ఎ’ జట్ల మధ్య గురువారం బెంగళూరు వేదికగా తొలి అనధికారిక టెస్టు మొదలైంది. తొలిరోజు ఇలాటాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగింది దక్షిణాఫ్రికా ‘ఎ’. భారత ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ (4/83) సత్తా చాటడంతో గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. జోర్డాన్ హెర్మాన్ (141 బంతుల్లో 71; 8 ఫోర్లు), జుబేర్ హమ్జా (109 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్), రుబిన్ హెర్మాన్ (87 బంతుల్లో 54; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. హెర్మాన్ బ్రదర్స్ అదుర్స్ జోర్డాన్ హెర్మాన్, జుబేర్ హమ్జా రెండో వికెట్కు 132 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుకు మంచి ఆరంభం లభించగా... ఆ తర్వాత మన బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. గుర్నూర్ బ్రార్ (1/45) బౌలింగ్లో ర్యాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హంజా కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ అకెర్మన్ (18) ఎక్కువసేపు నిలవలేకపోగా... మూన్స్వామి (5) విఫలమయ్యాడు.ఈ దశలో జోర్డాన్ హెర్మాన్ సోదరుడు రుబిన్ హెర్మాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. టియాన్ వాన్ వురెన్ (75 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. భారత ‘ఎ’ బౌలర్లలో తనుశ్ కొటియాన్ 4 వికెట్లు పడగొట్టగా... మానవ్ సుతార్ 2 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. 309 పరుగులకు ఆలౌట్ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటను 299/9 ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా పది పరుగులు జోడించి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 91.2 ఓవర్లలో 309 పరుగులు సాధించింది.ఆయుశ్ మాత్రే హాఫ్ సెంచరీఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్-‘ఎ’కు ఓపెనర్లు సాయి సుదర్శన్, ఆయుశ్ మాత్రే శుభారంభం అందించారు. ఆయుశ్ అర్ధ శతకం (65)తో మెరవగా.. సాయి 32 పరుగులు చేశాడు. వన్డౌన్లో దేవ్దత్ పడిక్కల్ (6), ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన రజత్ పాటిదార్ (19), రిషభ్ పంత్ (17) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వారిలో ఆయుశ్ బదోని 38 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ఆల్రౌండర్ తనుశ్ కొటియాన్ 13 పరుగులు చేయగా.. మానవ్ సుతార్ 4, అన్షుల్ కాంబోజ్ 5 పరుగులకే పెవిలియన్ చేరారు. ఖలీల్ అహ్మద్ నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్గా వెనుదిరిగాడు. భారత్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఫలితంగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 58 ఓవర్లు ఆడి 234 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుకు 75 పరుగుల ఆధిక్యం లభించింది. సఫారీ బౌలర్లలో ప్రెనెలాన్ సుబ్రయేన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. షెపో మొరేకి, ఒకులే సిలీ, టియాన్ వాన్ వారెన్ ఒక్కో వికెట్ తీశారు. లుతో సింపాలా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: కేకేఆర్లోకి రోహిత్ శర్మ ‘కన్ఫామ్’!.. స్పందించిన ముంబై ఇండియన్స్
- 
      
                   
                                                       గంభీర్ ప్రయోగం సక్సెస్.. టీమిండియా పరువు కాపాడిన హర్షిత్టీమిండియా ఆల్రౌండర్ హర్షిత్ రానా మరోసారి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్లో రాణాను టీమ్ మెనెజ్మెంట్ ప్రమోట్ చేసింది.శివమ్ దూబే కంటే ముందు రాణా బ్యాటింగ్కు వచ్చాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన రాణా కీలకమైన పరుగులు సాధించాడు. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రాణా.. అభిషేక్ శర్మతో కలిసి ఆదుకున్నాడు. తొలుత కాస్త ఇబ్బంది పడినప్పటికి క్రీజులో కదుర్కొన్నాక మాత్రం ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మార్కస్ స్టోయినిష్ బౌలింగ్లో రాణా బాదిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్ అని చెప్పుకోవాలి. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న హర్షిత్.. 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 35 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడు బ్యాటింగ్ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గంభీర్ నమ్మకం నిజమే అంటూ నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. కాగా హర్షిత్ రాణాను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయడం పట్ల తీవ్ర విమర్శల వర్షం కురిసింది.గంభీర్ సపోర్ట్ అతడికి ఉందని, అందుకే వన్డే, టీ20లు రెండింటికి సెలక్ట్ చేశారని మాజీలు సైతం మండిపడ్డారు. అయితే వాళ్లందరికి గంభీర్ గట్టి కౌంటరిచ్చాడు. రాణాను మెరిట్ ఆధారంగా సెలక్ట్ చేశామని, అతడికి ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయని గౌతీ మద్దతుగా నిలిచాడు. ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో కూడా రాణా బంతితో బ్యాట్తో కూడా మెరిశాడు. ఇప్పుడు టీ20 సిరీస్లోనూ సత్తాచాటాడు.అభిషేక్ సూపర్ ఇన్నింగ్స్..ఇక ఈ మెల్బోర్న్ టీ20లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి అభిషేక్ మాత్రం తన విరోచిత పోరాటాన్ని కొనసాగించాడు. కేవలం 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్తో పాటు కూడా రాణా కూడా కీలక నాక్ ఆడడంతో ఆ మాత్రం స్కోర్ అయినా భారత్ సాధించగల్గింది. వీరిద్దరూ మినిహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా..బార్ట్లెట్,నాథన్ ఎల్లీస్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs AUS: సంజూకు ప్రమోషన్ ఇచ్చిన గంభీర్.. కట్ చేస్తే! 4 బంతులకేShort ball? No problem! #HarshitRana clears it for a six! 🚀Brings up a solid fifty stand fearless, fiery, and full Skyball mode on! 🔥#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/sOGZ6m3u5y— Star Sports (@StarSportsIndia) October 31, 2025
- 
      
                   
                                                       బాక్సాఫీస్కి బాహుబలి ‘జ్వరం'.. ఈసారి ఎన్ని రికార్డులో!‘జై మాహిష్మతి’ నినాదాలతో మరోసారి థియేటర్స్ దద్దరిల్లాయి. జక్కన్న చెక్కిన కళాఖండం ‘బాహుబలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’పేరుతో నేడు(అక్టోబర్ 31) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలతో కూడా భారీగా టికెట్స్ బుక్ అయ్యాయి. హైదరాబాద్లో అయితే అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. తొలిరోజే రూ. 20-25 కోట్లు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందనిట్రేడ్ వర్గాల అంచన వేస్తున్నాయి. కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా తొలి రోజు ఈ స్థాయి కలెక్షన్స్ రాలేదు. రీరిలీజ్ చిత్రాల్లో ఇదొక రికార్డు అవుతుందని సీనీ పండితులు చెబుతున్నారు. మున్ముందు ‘బాహుబలి: ది ఎపిక్’ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.‘బాహుబలి’అంటే యుద్ధం కాదు...పదేళ్ల క్రితం తెరపైకి వచ్చిన బాహుబలి సినిమా అప్పట్లోనే చరిత్ర సృష్టించింది.దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపోందించిన రీమాస్టర్ వెర్షన్ తిరిగి వచ్చి మళ్లీ అదే మంత్రం వేసింది. విడుదలైన మొదటి రోజు నుంచే అభిమానులు థియేటర్ల ముందు బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఫైర్వర్క్స్తో పండుగ చేసుకుంటున్నారు.‘బాహుబలి’ కథ కేవలం యుద్ధం కాదు అది భావోద్వేగాల కలయిక. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం, ప్రభాస్-రానా యాక్షన్, అనుష్క-తమన్నా నటన...ఇవన్నీ కలిసినప్పుడు తెరపై మళ్లీ మాయ సృష్టించాయి.బాహుబలి ఓ అద్భుతం..బాహుబలి కథ కేవలం యుద్ధం, ప్రతీకారం కాదు.. అది ధర్మం, త్యాగం, ప్రేమ, బాధ్యతలు నిండిన కుటుంబ గాథ.మాహిష్మతి రాజ్యం, అద్భుతమైన సెట్స్, ప్రభాస్ బాహుబలిగా చూపిన గంభీరత, రానా చేసిన భల్లాలదేవ శక్తి... దేవసేన స్వాభిమానం, శివగామి న్యాయపరమైన తాత్వికత..ఇవన్నీ కలగలసిన ఓ అద్భుతమైన భారతీయ చలనచిత్రం.గూస్బంప్స్ మూమెంట్స్..థియేటర్ల వద్ద అభిమానులు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా క్యూలైనలో నిలుస్తున్నారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అంతా #BaahubaliTheEpic తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ‘ఇప్పటికీ గూస్బమ్స్ వస్తున్నాయి..’ ‘ఎన్ని సార్లు చూసినా కొత్త అనుభూతినిస్తోంది..’ ‘ఇది కేవలం సినిమా కాదు.. మన తెలుగు సినిమా గర్వం..’అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఊహించని మలుపులతో త్రీడీ బాహుబలి:ది ఎపిక్ సినిమా ఇంటర్వెల్లో ‘బాహుబలి:ది ఎటర్నల్ వార్’ అంటు కోత్త త్రీడీ యానిమేషన్ టీజర్ను లాంచ్ చేశారు. ఇది బాహుబలి ప్రపంచాన్ని కొనసాగిస్తుంది అంటున్నారు రాజమౌళి. రూ. 120 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపోందించబోతున్నారు. ఇందులో ఊహించని మలుపులు, కొత్త పాత్రలు సంచలనం సృష్టించబోతున్నాయి. ఈ చిత్రానికి ఈషాన్ శుక్లా దర్శకత్వం వహించబోతున్నారు.
- 
      
                   
                                                       లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లుశుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 465.75 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో.. 83,938.71 వద్ద, నిఫ్టీ 155.75 పాయింట్లు లేదా 0.60 శాతం నష్టంతో 25,722.10 వద్ద నిలిచాయి.ఫైనోటెక్స్ కెమికల్, లాంకోర్ హోల్డింగ్స్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, ముఫిన్ గ్రీన్ ఫైనాన్స్, ది గ్రోబ్ టీ కంపెనీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, నెల్కాస్ట్, మాన్ అల్యూమినియం లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
- 
      
                   
                                                       కేజ్రీవాల్ ‘శీష్ మహల్ 2.0’ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశారు. తన శీష్ మహల్ కోసం పంజాబ్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కేజ్రీవాల్ తన రెండో శీష్ మహల్ నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరో శీష్ మహల్పై (అద్దాల భవనం 2.0) ఎంపీ ఎంపీ స్వాతి మలివాల్, బీజేపీ దాడికి దిగింది. బిగ్ బ్రేకింగ్ అంటూ శీష్ మహల్ 2.0ను ఫోటోను షేర్ చేసింది. పంజాబ్ ప్రజల సొమ్ముతో రాజధాని చండీగఢ్లో ఈ అద్దాల మేడను నిర్మించుకున్నారని ట్వీట్లో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ యూనిట్ ఎక్స్ వేదికగా ఓ ఫొటోను విడుదల చేసింది. బీజేపీ విడుదల చేసిన ఆ ఫొటోలోని ప్రాంతం చండీగఢ్ సెక్టార్ 2లోని ప్రభుత్వ బంగ్లా కాంప్లెక్స్. అందులోనే కేజ్రీవాల్ శీష్ మహల్ నిర్మించుకున్నారని మండిపడింది. కేజ్రీవాల్ను పంజాబ్ "సూపర్ సిఎం"గా అభివర్ణిస్తూ, "ఆమ్ ఆద్మీ (సామాన్యుడు) కావాలని కోరుకుంటున్న ఆప్ చీఫ్ మరో 'శీష్ మహల్'ను నిర్మించారని బీజేపీ విమర్శించింది. కేజ్రీవాల్కు ముఖ్యమంత్రి కోటా నుండి 2 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన 7 స్టార్ ప్రభుత్వ బంగ్లాను కేటాయించారంటా విమర్శించింది. ‼️ Big Breaking - आम आदमी का ढोंग करने वाले केजरीवाल ने तैयार करवाया एक और भव्य शीशमहल दिल्ली का शीश महल ख़ाली होने के बाद पंजाब के Super CM अरविंद केजरीवाल जी ने पंजाब में दिल्ली से भी शानदार शीश महल तैयार करवा लिया है 😳 चंडीगढ़ के सेक्टर 2 में CM कोटे की 2 Acre की आलीशान 7… pic.twitter.com/d3V4W23yRw— BJP Delhi (@BJP4Delhi) October 31, 2025మరోవైపు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పంజాబ్ ప్రభుత్వ వనరులను వ్యక్తిగత విలాసం కోసం దుర్వినియోగం చేస్తున్నారని స్వాతి మలివాల్ ఆరోపించడం మరింత సంచలనం రేపింది. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లో మరో శీష్ మహల్ అంటూ ఆరోపణలు ఆరోపించారు. మొత్తం పంజాబ్ ప్రభుత్వం ఒక వ్యక్తికి సేవ చేయడంలో నిమగ్నమై ఉందని మలివాల్ ఆరోపించారు. నిన్న, ఆయన (కేజ్రీవాల్) తన ఇంటి ముందు నుండి అంబాలాకు ప్రభుత్వ హెలికాప్టర్లో వెళ్లారని, అక్కడి నుంచి పంజాబ్ ప్రభుత్వ ప్రైవేట్ జెట్ ఆయనను పార్టీ పని కోసం గుజరాత్కు వెళ్లారని ఆమె ఆరోపించారు. दिल्ली का शीश महल ख़ाली होने के बाद अरविंद केजरीवाल जी ने पंजाब में दिल्ली से भी शानदार शीश महल तैयार करवा लिया है। चंडीगढ़ के सेक्टर 2 में CM कोटे की 2 Acre की आलीशान 7 स्टार सरकारी कोठी अरविंद केजरीवाल जी को मिल गई है। कल अंबाला के लिए घर के सामने से सरकारी हेलीकॉप्टर में… pic.twitter.com/Vy1MfMGkt1— Swati Maliwal (@SwatiJaiHind) October 31, 2025మరోవైపు బీజేపీ తాజా ఆరోపణలపై ఆప్ ఇంకా స్పందించలేదు. అయితే చండీగఢ్ ఆమ్ ఆద్మీ పార్టీ విభాగం ఆ ఆరోపణలను ఖండించింది. ఢిల్లీలో పార్టీ వివరణాత్మక ప్రకటన జారీ చేస్తుందని తెలిపింది. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాలో నివసించారు. ఆ సమయంలో దాని మరమ్మతుల కోసం ప్రాథమిక అంచనా వ్యయం రూ.7.91 కోట్లు కాగా.. 2020లో రూ. 8.62 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు. 2022లో పీడబ్ల్యూడీ శాఖ పనులు పూర్తిచేసే నాటికి ఆ ఖర్చు మూడు రెట్లు పెరిగి మొత్తం బంగ్లా మరమ్మతుల ఖర్చు రూ. 33.36 కోట్లకు చేరుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అంచనా వేసింది. సెప్టెంబర్ 2024 వరకు అరవింద్ కేజ్రీవాల్ ఆ బంగ్లాలోనే నివాసం ఉన్నారు. బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా ఫిర్యాదుపై కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) వాస్తవ నివేదికను సమర్పించింది.
- 
      
                   
                                                       ‘కర్మణ్యే వాధికారస్తే’ రివ్యూటైటిల్: కర్మణ్యే వాధికారస్తేనటీనటులు: బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్ర, బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్ తదితరులునిర్మాణ సంస్థ: ఉషస్విని ఫిలిమ్స్నిర్మాత: డి ఎస్ ఎస్ దుర్గాప్రసాద్దర్శకత్వం: అమర్ దీప్ చల్లపల్లిసంగీతం: గ్యానిఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్సినిమాటోగ్రఫీ: భాస్కర్ సామలవిడుదల తేది: అక్టోబర్ 31, 2029బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’(karmanye Vadhikaraste ). సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..మూడు డిఫరెంట్ కేసుల చుట్టు తిరిగే కథ ఇది. సినీస్టార్ పృథ్వీ(పృథ్వీ) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మరణిస్తాడు. ఈ కేసును ఏసీపీ అర్జున్ (శత్రు) విచారిస్తుంటాడు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. దీంతో ఆ వ్యక్తి గురించి ఆరా తీయగా.. ఫేక్ అడ్రస్తో ఆధార్ సృష్టించుకొని నగరానికి వచ్చినట్లుగా గుర్తిస్తాడు. అలాంటి కేసులు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో కూడా నమోదు అవుతాయి. వాటి వెనుక ఎవరు ఉన్నారనే దిశగా అర్జున్ విచారిస్తుంటాడు. మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుంటాయి. యాడ్ ఫిల్మ్మేకర్ జై(మాస్టర్ మహేంద్ర) అమ్మాయిలను ట్రాప్ చేసి, శారీరకంగా వాడుకొని హత్యలు చేస్తుంటాడు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు కోసం స్పెషల్ టీమ్ బరిలోకి దిగి విచారణ ప్రారంభిస్తుంది. ఇంకోవైపు సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ కీరిటీ(బ్రహ్మాజీ).. చెక్పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఓ బాలిక కనిపిస్తుంది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి, పరీక్షలు చేయించగా.. అత్యాచారానికి గురైనట్లుగా తెలుస్తుంది. ఆమెను కొంతమంది గ్యాంగ్ రేప్ చేశారని డాక్టర్ చెబుతారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు.. అ బాలికను తన ఇంట్లోని ఉంచుకొని చికిత్స అందిస్తుంటాడు. వేర్వేరుగా జరిగిన ఈ మూడు కేసుల వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చేశారు? ఆపరేషన్ జిస్మత్ మ్యాటరేంటి? జిష్ణు ఎవరు? హానీట్రాప్కి పాల్పడిందెరు? ఎందుకు చేశారు? ఫిల్మ్మేకర్ జైకి జిష్ణుకి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక డిఫరెంట్ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్. స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్లు.. ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అమర్ దీప్. ఇటీవల ఎక్కువ నమోదు అవుతున్న హానీట్రాప్ కేసుని ఇందులో చక్కగా చూపించారు. మూడు డిఫరెంట్ కేసులు..వాటి వెనుక ఎవరో ఒకరు ఉన్నారనే విషయం తెలిసినా.. ఆ ఒకరు ఎవరనేది మాత్రం ఎండింగ్ వరకు తెలియకుండా దర్శకుడు సెస్పెన్స్ మెంటేన్ చేశారు. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే.. అసలు కథ అర్థమవుతుంది. ఫస్టాఫ్ మొత్తం మూడు కేసులు..విచారణ చుట్టునే తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో మూడు కేసుల వెనుక ఉన్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అనేది చూపించారు. నిత్యం వార్తల్లో చూస్తున్న కొన్ని బర్నింగ్ ఇష్యూస్ని ఇందులో చూపించారు. ఓ పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాప్లో గందరగోళంగా అనిపించిన సన్నివేశాలకు సెకండాఫ్లో జస్టిఫికేషన్ ఇచ్చారు. స్క్రీన్ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఏసీపీ అర్జున్గా శత్రు చక్కగా నటించాడు. పలు సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లో కనిపించిన శత్రు..ఇందులో హీరోగా నటించి మెప్పించాడు. ఆయన పర్సనాలిటీకి ఏసీపీ అర్జున్ పాత్ర కరెక్ట్గా సెట్ అయింది. యాడ్ ఫిల్మ్మేకర్ జైగా మాస్టర్ మహేంద్ర తనదైన నటనతో మెప్పించాడు. ఆయన పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. బ్రహ్మాజీ చాలా రోజుల తర్వాత మరోసారి పోలీసు పాత్రలో కనిపించాడు. ఆయన పాత్ర చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది. బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
- 
      
                   
                                                       ‘చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకో’సాక్షి,అమరావతి: చంద్రబాబు,నారా లోకేష్ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం (అక్టోబర్31) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బాహ్య ప్రపంచానికి చూపించాను.చంద్రబాబు,నారా లోకేష్ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారు. కల్తీ మద్యం కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాను. నార్కో ఆనాలసిస్ టెస్ట్కు సిద్ధమే. నేను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా కుటుంబసభ్యులతో కలిసి ప్రమాణం చేశా. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? గన్నవరం ఎయిర్పోర్టులో జనార్ధన్ రావుకు రెడ్కార్పెట్ వేసి స్వాగతం పలికారు. రిమాండ్లో ఉన్న జనార్ధన్రావు వీడియోని ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు.
- 
      
                   
                                                       ఓటీటీలో హిట్ వెబ్ సిరీస్.. తెలుగు ట్రైలర్ రిలీజ్ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చూసే ఆడియెన్స్ కూడా ఉంటారు. వాళ్లలో చాలామందికి నచ్చే సిరీస్లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. తొలుత రిలీజ్ చేసినప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది. కానీ తర్వాత కాలంలో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సిరీస్ చివరి సీజన్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. తేదీలని ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా)ఇప్పటికే నాలుగు సీజన్లు రాగా వేటికవే అదరగొట్టేశాయి. 2022లో చివరగా నాలుగో సీజన్ రిలీజైంది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా ఈ సిరీస్ ఫ్యాన్ బాగానే ఎదురుచూస్తున్నారు. వాళ్ల వెయిటింగ్కి తెరదించుతూ కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్ తేదీల్ని అధికారికంగా ప్రకటించారు. నవంబరు 26, డిసెంబరు 25, డిసెంబరు 31వ తేదీల్లో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో విల్, మైక్, డస్టిన్, లూకస్ అనే నలుగురు పిల్లలు ఉంటారు. అనుకోకుండా ఓ రోజు ఎలెవన్ అనే అమ్మాయి.. ఈ నలుగురి కంట పడుతుంది. కొన్నిరోజులకే వీళ్లంతా స్నేహితులు అయిపోతారు. అయితే తమతో ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి సూపర్ పవర్స్ ఉన్నాయనీ ఈ పిల్లలకు తెలుస్తుంది. వీళ్లంతా కలిసి తమ ఊరికి ఎదురైన ప్రమాదాల్ని ఎలా ఆపగలిగారు? ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి? అనేది మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై షాకింగ్ రూమర్స్)
- 
      
                   
                                                       సంజూకు ప్రమోషన్ ఇచ్చిన గంభీర్.. కట్ చేస్తే! 4 బంతులకేటీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్పై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత ఇన్నింగ్స్ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభించడం మొదలు పెట్టారు.అయితే అప్పుడు శుభ్మన్ గిల్ టీ20 జట్టుకు దూరంగా ఉండడంతో శాంసన్ను ఓపెనర్గా అవకాశముంది. కానీ గిల్ తిరిగి టీ20 సెటాప్లోకి రావడంతో ఆసియాకప్-2025 నుంచి సంజూ బ్యాటింగ్ ఆర్డర్ మారిపోయింది. ఈ ఏడాది జరిగిన ఆసియాకప్లో భారత ఓపెనర్లుగా గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగగా.. శాంసన్ను మిడిలార్డర్లో బ్యాటింగ్కు పంపారు.కొన్ని మ్యాచ్లలో నంబర్ 6, మరి కొన్ని మ్యాచ్లలో ఐదో స్ధానంలో ఈ కేరళ బ్యాటర్ బ్యాటింగ్కు వచ్చాడు. దీంతో టీమ్ మెనెజ్మెంట్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సంజూ లాంటి అద్భుతమైన బ్యాటర్ను సరిగ్గా ఉపయోగించుకోవడంలేదని చాలా మంది మాజీలు మండిపడ్డారు.సంజూకు ప్రమోషన్..ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో సంజూ శాంసన్కు హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రమోషన్ ఇచ్చాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్ త్వరగా ఔట్ కోవడంతో శాంసన్ను నంబర్ 3లో బ్యాటింగ్కు పంపాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయించుకుంది.కానీ సంజూ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికపోయాడు. దీంతో సోషల్ మీడియాలో సంజూను ట్రోలు చేస్తున్నారు.టాపార్డర్లో అవకాశమిస్తే ఇలా ఆడుతావా అంటూ పోస్ట్లు పెడుతున్నారు. మరికొంత మంది శాంసన్ను మద్దతుగా నిలుస్తున్నారు. వేర్వేరు స్ధానాల్లో అతడిని బ్యాటింగ్కు పంపితే ఎలా, అతడికంటూ ఒక పొజిషన్ ఫిక్స్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.చదవండి: కేకేఆర్లోకి రోహిత్ శర్మ ‘కన్ఫామ్’!.. స్పందించిన ముంబై ఇండియన్స్Nathan Ellis got off to a rapid start, dismissing Sanju Samson for just two. #AUSvIND pic.twitter.com/lY4FAlbzDI— cricket.com.au (@cricketcomau) October 31, 2025
- 
      
                   
                                                       ఏడేళ్లుగా వెయిటింగ్.. నా డబ్బు రీఫండ్ చేయండిగ్లోబల్ మార్కెట్లో టెస్లా కార్లకు మంచి డిమాండ్ ఉంది. సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఈ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ (Sam Altman) 2018 జూలైలో 50000 డాలర్లతో టెస్లా రోడ్స్టర్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకుని ఇన్నాళ్లయినా.. ఇప్పటికీ కారు డెలివరీ జరగలేదు, డబ్బు కూడా రీఫండ్ కాలేదు. ఈ విషయాన్ని ఆల్ట్మాన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసారు.శామ్ ఆల్ట్మాన్.. టెస్లా రోడ్స్టర్ బుకింగ్స్, రీఫండ్ కోసం అభ్యర్థించిన మెయిల్ స్క్రీన్షాట్లను కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో 2018 జులై 11న కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను చెల్లించిన డబ్బును రీఫండ్ చేయమని కూడా మెయిల్ చేశారు. కానీ అతనికి అడ్రస్ నాట్ ఫౌండ్ అనే రిప్లై వచ్చింది.''టెస్లా రోడ్స్టర్ కారును కొనుగోలు చేయడానికి.. నేను ఉత్సాహంగా ఉన్నాను. కంపెనీ కారును డెలివరీ చేయడంలో జరిగిన ఆలస్యాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ 7.5 సంవత్సరాలు వేచి ఉండటం చాలా కాలంగా అనిపించింది'' అని కూడా శామ్ ఆల్ట్మాన్ మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు.రద్దు చేసుకోవడం కష్టంటెస్లా రోడ్స్టర్ కారును బుక్ చేసుకున్న తరువాత.. బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్న వారిలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ మాత్రమే కాకుండా, ప్రముఖ యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీ కూడా ఉన్నారు. ఈయన 2017లో రెండు టెస్లా రోడ్స్టర్లను రిజర్వ్ చేసుకున్నట్లు వెల్లడించారు. బుకింగ్ ప్రక్రియ సులభంగా జారిపోయింది. కానీ రిజర్వేషన్ను రద్దు చేసుకోవడం ఊహించిన దానికంటే చాలా కష్టమని బ్రౌన్లీ అన్నారు.టెస్లా రోడ్స్టర్టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. 2017లో రోడ్స్టర్ను పర్ఫామెన్స్ బేస్డ్ ఈవీగా ఆవిష్కరించారు. ఇది 1.9 సెకన్లలో 0 నుంచి 96 కి.మీ వేగాన్ని అందుకోగలదని.. గంటలు 402 కి.మీ గరిష్ట వేగంతో 997 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ స్పోర్ట్స్ కారు ఉత్పత్తిలోకి రాలేదు. 2024లో కూడా రోడ్స్టర్ బయటకు రాలేదని మస్క్ పేర్కొన్నారు. కాగా దీనిని ఎప్పుడు అధికారికంగా లాంచ్ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.A tale in three acts: pic.twitter.com/ClRZBgT24g— Sam Altman (@sama) October 30, 2025
- 
      
                   
                                                       అమలా నవమి ఉత్సవాలు, సాక్షి గోపాల్ టెంపుల్ గురించి తెలుసా?భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లా సాక్షి గోపాల్ పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. పూరీ నుండి 19 కి.మీ దూరంలో ఉన్న సాక్షిగోపాల్ పట్టణంలో ఉంది. ఇక్కడ రాధా కృష్ణులను ఆరాధిస్తారు. మధ్యయుగ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వచ్చి బియ్యం బదులుగా దేవతకు గోధుమలు సమర్పిస్తారు.సాక్షి గోపాల్ ఈ పేరు ఎలా వచ్చింది?సఖిగోపాల్ అని పిలువబడే ఒక పేదవాడు గ్రామాధికారి కుమార్తెను ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు.కానీ వారి ఆర్థిక స్థితిలో తేడాను చూసి గ్రామ పెద్ద వీరి ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే కొంతకాలానికి గ్రామపెద్ద సఖిగోపాల్తో పాటు, కొంతమంది ప్రజలు తీర్థయాత్ర కోసం కాశీకి వెళ్లారు. అక్కడ గ్రామ పెద్ద అనారోగ్యానికి గురవుతాడు. గ్రామస్తులు ఎవరూ అతనికి సహాయం చేయలేదు. అప్పుడు సఖిగోపాలు మాత్రమే సపర్యలు చేస్తాడు. దీంతో తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ ఇంటికి వచ్చిన మాట మారుస్తాడు. దీనికి సాక్షులని తెమ్మంటాడు. దీంతో స్వయంగా శ్రీకృష్ణుడు సాక్ష్యమిస్తాడు. అలా ఈ ఆలయానికి సాక్షిగోపాల్ అని పేరు వచ్చింది. ఇదీ చదవండి: పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయంఈ క్షేత్రంలో రాధాదేవీ పాద దర్శనం ప్రముఖ ఉత్సవం. ఏటా కార్తీక మాసం శుక్ల నవమి నాడు ఈ దర్శనం లభిస్తుంది. ఈ ఏడాది శుక్రవారం రాధా పాద దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ గోపాల్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. దీన్నే అక్షయ నవమి, అమలా నవమిగా పేర్కొంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సాక్షిగోపాల్ పట్టణం ఉత్సవ సన్నాహాలతో కళకళలాడుతోంది. ఈ ప్రత్యేక రోజున, భక్తులకు రాధారాణి దేవి పాదాలను చూసే అరుదైన అవకాశం లభిస్తుంది. ఏడాది పొడవునా దేవీ పాదాల దర్శనం లభించదు. ఈ దివ్య దృశ్యాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. రాధా పాద దర్శనం మోక్షం ప్రసాదిస్తుందని భక్తుల నమమ్మకం. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రాచీన సంప్రదాయానికి అనుగుణంగా రాధా పాద దర్శనం ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాధారాణి దేవత అద్భుతమైన ఒడియా ఇంటి ఆడపడుచు (ఒడియాణి) అలంకరణలో, సాక్షి గోపాలుడు నటవర్ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. శుక్రవారం ఉదయం 5 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. సంప్రదాయ ఆచార వ్యవహారాలతో పూజాదులు నిర్వహించి భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భారీ రద్దీకి అనుగుణంగా ఆలయ అధికార యంత్రాంగం విçస్తత ఏర్పాట్లు చేస్తుంది. గట్టి భద్రత రాధా పాద దర్శనం కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో సాక్షి గోపాలు పట్టణ వ్యాప్తంగా భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. వరుస క్రమంలో భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రవాణా క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల పైబడి భక్తులు రాధా పాద దర్శనం కోసం తరలి వస్తారని నిర్వహణ యంత్రాంగం అంచనా. తదనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పూరీ జిల్లా మేజి్రస్టేటు , పోలీసు సూపరింటెండెంట్ తదితర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా సాక్షిగోపాల క్షేత్రం సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు. దర్శనం పురస్కరించుకుని 11 వరుసల బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు పంచసఖ బహిరంగ స్థలం, పరిసర ప్రాంతాలలో సువిశాల పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
- 
      
                   
                                                       నష్టాల కంపెనీలు.. ఐపీవోకి ముందే లాభాలు!దేశ స్టార్టప్ వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన నమూనా ఉద్భవిస్తోంది. ఏళ్లుగా నష్టాల్లో కొట్టుమిట్టాడిన డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) బ్రాండ్లు ఐపీవోలను ప్రారంభించే సమయంలో అకస్మాత్తుగా లాభదాయకంగా మారుతున్నాయి. నాలుగు హై-ప్రొఫైల్ కంపెనీలు మామాఎర్త్, లెన్స్కార్ట్, బోట్, షుగర్ కాస్మెటిక్స్ అన్నీ పబ్లిక్ లిస్టింగ్కి దాఖలు చేసిన ఒక సంవత్సరంలోనే లాభాలను నివేదించాయి. మామాఎర్త్ మాతృ సంస్థ హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో నష్టాలను నివేదించింది. కానీ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.98.84 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ నవంబర్ 2023 లో షేరుకు రూ.325 వద్ద పబ్లిక్కి వెళ్లింది. నేడు ఇది రూ.271 వద్ద ట్రేడ్ అవుతోంది.మూడేళ్లుగా నష్టాల్లో ఉన్న కళ్లజోడు కంపెనీ లెన్స్కార్ట్ 2025లో ఉన్నట్టుండి లాభాల్లోకి వచ్చింది. దాని రూ.7,278 కోట్ల ఐపీవోకి ముందు 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.61 కోట్ల లాభాన్ని నివేదించింది. ఇక నష్టాల ఒడిదుడుకులు ఎదుర్కొన్న బోట్ కూడా 2025లో లాభాల్లోకి వచ్చింది. ఇప్పుడే ఐపీవోకి వచ్చేందుకు ప్రణాళిక వేస్తోంది. అలాగే 2023 చివరి వరకు నష్టాల్లో ఉన్న షుగర్ కాస్మెటిక్స్ ఇప్పుడు లాభదాయకంగా ఉంది. 2026లో ఐపీవోను ప్లాన్ చేస్తోంది.కాగా ఈ నాలుగు కంపెనీలు మరొక లక్షణాన్ని పంచుకుంటున్నాయి. వాటి వ్యవస్థాపకులు షార్క్ ట్యాంక్ ఇండియాషోలో జడ్జ్లుగా వ్యవహరించడం గమనార్హం. ఇది వ్యాపార నీతి, స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించే టీవీ షో.
- 
      
                   
                                                       దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. సతీసమేతంగా హాజరైన నిర్మాతప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా దిల్ రాజు ఇంట కూడా శుభకార్యం జరిగింది. ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు సోదరి కుమార్తె పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు.ఈ పెళ్లి వేడుక ఫోటోలను దిల్ రాజు సతీమణి తేజస్విని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. పెళ్లిలో దిల్ రాజుతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అక్క పెళ్లిలో కష్టపడుతున్న తమ్ముడు అంటూ దిల్ రాజు కుమారుడిని వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. దిల్ రాజు అన్న కుమార్తె కీర్తన పెళ్లి హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది.
- 
      
                   
                                                       ఎగుమతుల్లో రికార్డ్: భారత్ నుంచి 12 లక్షలు!జపనీస్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan).. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్. ఈ కంపెనీ తన ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలకు మన దేశం నుంచే ఎగుమతి చేస్తోంది. ఇప్పటి వరకు నిస్సాన్ 12 లక్షల వాహనాలను ఎగుమతి చేసినట్లు ప్రకటించింది.భారతదేశంలో నిస్సాన్ కంపెనీ మాగ్నైట్ కారును మాత్రమే విక్రయిస్తోంది. కాగా ఎక్స్-ట్రైల్ మోడల్ దిగుమతి చేసుకుంటోంది. అయితే మాగ్నైట్ కారును మనదేశం నుంచి.. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియా, యూరప్ వంటి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. కాగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రాంతానికి నిర్దేశించిన 1.2 మిలియన్ల మాగ్నైట్ వాహనాన్ని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స తమిళనాడులోని ఎన్నూర్లోని కామరాజర్ పోర్టులో ఆవిష్కరించారు.నిస్సాన్ కంపెనీ మాగ్నైట్తో పాటు.. గతంలో సన్నీ, కిక్స్ & మైక్రా వంటి వివిధ మోడళ్లను ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా & ఆగ్నేయాసియా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేసింది. ఇప్పుడు కేవలం మాగ్నైట్ కారును మాత్రమే ఎగుమతి చేస్తోంది. ఎగుమతి చేయడానికే సంస్థ వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తోంది. కాబట్టి ఇందులో స్టీరింగ్ వీల్ ఎడమవైపు ఉంటుంది. ప్రస్తుతం మాగ్నైట్ 65 దేశాలకు ఎగుమతి అవుతోంది.ఇదీ చదవండి: 25 ఏళ్లు.. 3.5 కోట్లు: అమ్మకాల్లో యాక్టివానిస్సాన్ మాగ్నైట్ ఫేస్లిఫ్ట్గత సంవత్సరం డిసెంబర్లో, నిస్సాన్ మాగ్నైట్ను కంపెనీ ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ చేసింది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందింది. కానీ యాంత్రికంగా ఎలాంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి అదే 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ & 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి.#NissanMotorIndia celebrates 1.2 million exports from India, with the Big. Bold. Beautiful. #NissanMagnite leading the way!A proud moment for our teams as we continue to bring Japanese innovation from India to 65+ countries.#OneCarOneWorld pic.twitter.com/yMqk9K4gHq— Nissan India (@Nissan_India) October 30, 2025
- 
      
                   
                                                       స్టడ్స్ రూ.455 కోట్ల ఐపీవోన్యూఢిల్లీ: హెల్మెట్ల తయారీ కంపెనీ స్టడ్స్ యాక్సెసరీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 557–585 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 30న ప్రారంభమైన ఇష్యూ నవంబర్ 3న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 455 కోట్ల విలువైన 77.86 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేస్తున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకి అందబోవు. యాంకర్ ఇన్వెస్టర్లకు 29న షేర్లను ఆఫర్ చేయనుంది.1975లో ఏర్పాటైన కంపెనీ ద్విచక్ర వాహన హెల్మెట్ల డిజైన్, తయారీ, మార్కెటింగ్ తదితరాలను చేపడుతోంది. స్టడ్స్, ఎస్ఎంకే బ్రాండ్లతో వీటిని విక్రయిస్తోంది. అంతేకాకుండా మోటార్సైకిల్ సంబంధ లగేజీ, గ్లోవ్స్, రెయిన్ సూట్స్, రైడింగ్ జాకెట్స్, ఐవేర్ తదితర యాక్సెసరీస్ను రూపొందిస్తోంది. స్టడ్స్తో మాస్ మార్కెట్పై దృష్టి పెట్టగా.. ప్రీమియం విభాగంలో ఎస్ఎంకేను 2016లో ప్రవేశపెట్టింది. కంపెనీ ఇంతక్రితం 2018 చివర్లో ఐపీవోకు దరఖాస్తు చేసి సెబీ నుంచి అనుమతి పొందింది. అయితే ఇష్యూకి రాకపోవడం గమనార్హం!
- 
      
                   
                                                       ఎంఎస్రాజు వ్యాఖ్యలపై పవన్ ఎందుకు స్పందించడం లేదు?: మల్లాది విష్ణుసాక్షి, తాడేపల్లి: భగవద్గీతను కించపరిచిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే టీటీడీ పాలకమండలి సభ్యునిగా తొలగించాలన్నారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే ఇలాంటి వారికి టీటీడీలో సభ్యునిగా కొనసాగిస్తారా?. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చటం సిగ్గుచేటు. ప్రపంచానికే మార్గదర్శకంగా ఉన్న భగవద్గీతను టీడీపీ ఎమ్మెల్యే రాజు కించపరచటం దారుణం’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.అలాంటి వ్యక్తిని టీటీడీ సభ్యునిగా నియమించటాన్ని ఏం అనాలి?. టీటీడీ చరిత్రలో ఇలాంటి సభ్యుడిని ఎప్పుడూ చూడలేదు. ఇంత జరుగుతున్నా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?. టీటీడీ గోశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని నిర్ణయించటం దారుణం. ఇదేనా టీటీడీ గోసంరక్షణ?. చంద్రబాబుది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే రాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ బీజేపీ కూడా ఎందుకు మాట్లాడటం లేదు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.
- 
      
                   
                                                       మాధురితో గుంజీలు తీయించిన మహానుభావుడు.. కల్యాణ్తో తనూజ లొల్లిహౌస్లో ఒక్కొక్కర్ని చెడుగుడు ఆడేసుకుంటోంది దివ్వెల మాధురి (Divvala Madhuri). తనకు ఎదురు తిరిగినవారిని మాటల ప్రవాహంతోనే దడదడలాడిస్తోంది. ఆమె నోట్లో నోరు పెట్టడమంటే సింహం బోనులో వెళ్లి కూర్చోవడమే అవుఉతంది! అలాంటి మాధురిని పిల్లిని చేశాడో కంటెస్టెంట్. అతడెవరో కాదు, కామెడీ కింగ్, టాస్కుల వీరుడు ఇమ్మాన్యుయేల్..మాధురితో గుంజీలు తీయించిన ఇమ్మూమాధురి సైలెంట్ అయిపోయిందంటే ఏదో తప్పు చేసే ఉంటుంది. లేకపోతే పిల్లిలా ఎందుకు మారిపోతుంది! ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో ఆమె తప్పుల్ని, ఆమెకిచ్చిన పనిష్మెంట్స్ను చూచాయగా చూపించారు. అందులో ఆమె పొద్దెక్కినా కూడా నిద్రపోతోంది. దీంతో కుక్కలు మొరిగాయి. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ ఆమెతో 20 గుంజీలు తీయించాడు. అయినా మాధురికి నిద్ర ఆగితే కదా.. మళ్లీ కునుకు తీస్తూనే ఉంది. దీంతో ఆమెతో పచ్చిమిర్చి తినిపించాడు.మరీ ఓవర్ చేస్తున్నారుఇక మరో ప్రోమోలో తనూజ, పవన్ గొడవపడ్డారు. రాత్రి బెండకాయ వద్దని పవన్.. నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు, నువ్వెవరు చెప్పడానికి.. నీలాగా ఎవరూ చేయట్లేదు అని ఒంటికాలిపై లేచింది. అటు దివ్య కూడా కాఫీ విషయంలో రీతూపై అరిచింది. ఈ గొడవలు చూస్తున్న జనాలు.. భరణి నాన్న వచ్చాక వీళ్లిద్దరూ మరీ ఓవర్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అసలు తనూజను రేషన్ మేనేజర్గా తీసేయండ్రా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు
- 
      
                   
                                                       ఒక్క నిర్ణయం.. జుకర్బర్గ్ సంపదలో భారీ పతనంమెటా (Meta) సంస్థ ప్రకటించిన 30 బిలియన్ డాలర్ల రుణ విక్రయం ప్రణాళిక ఇన్వెస్టర్లలో ఆందోళన రేపింది. దీని ఫలితంగా కంపెనీ షేర్లు 11 శాతం వరకు పడిపోయాయి. ఈ పతనం కారణంగా కంపెనీ చీఫ్ మార్క్ జుకర్బర్గ్ వ్యక్తిగత సంపద 235.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ఆయన ఐదవ స్థానానికి పడిపోయారు. రెండేళ్లలో ఇదే ఆయనకు కనిష్ఠ స్థానం.మెటా ఈ నిధులను ప్రధానంగా కృత్రిమ మేధస్సు (AI) పరిశోధన, మౌలిక సదుపాయాలపై వ్యయం చేయడానికి ఉపయోగించనున్నట్లు తెలిపింది. అయితే, పెరుగుతున్న ఏఐ ఖర్చులు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. కంపెనీ ఈ ఏడాది మూలధన వ్యయాలు 118 బిలియన్ డాలర్ల వరకు పెరగవచ్చని, 2026 నాటికి మరింత ఖర్చు చేయవచ్చని తెలిపిన తరువాత కనీసం ఇద్దరు విశ్లేషకులు మెటా షేర్ల రేటింగ్ను తగ్గించారు.మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) సంపదలో జరిగిన 29.2 బిలియన్ డాలర్ల నష్టాన్ని బ్లూమ్బర్గ్ ఇప్పటివరకు నమోదైన నాల్గవ అతిపెద్ద ఒక్కరోజు మార్కెట్ ఆధారిత పతనంగా పేర్కొంది.ఇదే సమయంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆల్ఫాబెట్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్లు.. జుకర్బర్గ్ను సంపద పరంగా అధిగమించారు. ఏఐ, క్లౌడ్ సేవలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆల్ఫాబెట్ షేర్లు 2.5% పెరిగాయి. విశ్లేషకుల అంచనాలను మించి ఆదాయం నమోదైంది.
- 
      
                   
                                                       ఆ ఇద్దరికీ కీలక పదవులు.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశించిన సీనియర్లకు అదిష్టానం బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అలాగే.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కేబినెట్ బెర్త్ ఆశించారు. అయితే బదులుగా ఆయనకు సలహాదారు పదవి కట్టబెడుతూ ఆరు గ్యారెంటీల అమలు బాధత్యను అప్పగించింది రేవంత్ ప్రభుత్వం. అలాగే.. ప్రేమ్సాగర్రావు కూడా కేబినెట్ అవకాశం కోసం ఆశలు పెట్టుకున్నారు. అయితే.. కేబినెట్ ర్యాంకు హోదాలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ను కేటాయించింది. ఆశావహుల జాబితా నుంచి ఈ ఇద్దరూ అవుట్ కావడంతో మంత్రి వర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యం, సామాజిక వర్గాల ప్రాధాన్యతను కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాజగోపాల్కు?ఇదిలా ఉంటే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అజారుద్దీన్కు మంత్రి పదవి నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో బెర్త్ దక్కుతుందా? అనే ఆయన వర్గీయులు ఎదురు చూస్తున్నారు.
- 
      
                   
                                                       ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు!ఒకేసారి రెండు స్కిల్స్ని ప్రదర్శించడం మాటలు కాదు. అది కూడా సంగీతాన్ని, స్మిమ్మింగ్ని మిళితం చేస్తూ..ప్రదర్శించడానికి ఎంతో ప్రాక్టీస్ ఉండాల్సిందే. లేదంటే నీటిలో తేలుతూ..సంగీత వాయిద్యా పరికరాలను వాయించడం అంత సులువు కాదు. అదికూడా రివర్స్(బ్యాక్ స్టోక్)తో ఈత కొడుతూ వాయిద్యడం అంత ఈజీ కాదు. కానీ ఈ యువకుడు ఆ అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను సృష్టించింది బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మ్యూజిక్ టీచర్ రూబెన్ జాసన్ మచాడో. మంగళూరులోని సెయింట్ అలోసియస్ కాలేజ్ స్విమ్మింగ్ పూల్లో 700 మీటర్లకు పైగా వెనుకకు(బ్యాక్స్ట్రోక్) ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ ఈ 30 ఏళ్ల సంగీతకారుడు ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. ఉదయం పదిగంటలకు బ్యాక్స్ట్రోక్ ప్రదర్శనను ప్రారంభించి..150 మీటర్లు వరకు ఈత కొడితే చాలన్నుకున్నాడట. కానీ అనుహ్యంగా 700 మీటర్ల వరకు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(GBWR)లకెక్కాడు. ఈ మేరకు GBWR రూబెన్కి అధికారిక సర్టిఫికేట్ను అందజేసింది. తన తండ్రి సూచన మేరకు ఈ వినూత్న రికార్డుని ప్రయత్నించానని చెబుతున్నాడు రూబెన్ జాసన్ఎవరీ రూబెన్ జాసన్..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ సేఫ్టీ (NIWS) ధృవీకరించిన లైఫ్ సేవర్ రూబెన్కు హిందూస్తానీ, వెస్ట్రన్ ఫ్లూట్ రెండింటిలోనూ ప్రావీణ్యం ఉంది. అలాగే సాక్సోఫోన్, గిటార్, వంటి ఇతర వాయిద్యాలను వాయించడంలో దిట్ట. ఇక ఆయన బాలీవుడ్, శాండల్వుడ్, కోస్టల్ చిత్రాలలో పలు పాటలకు సంగీతం సమకూర్చారు. అంతేగాదు భారతదేశం అంతటా అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చారు కూడా. ఆయన 2016 వరల్డ్ కల్చర్ ఫెస్టివల్లో కూడా పాల్గొన్నాడు. ఇక రూబెన్కు ఈ ఫ్లూట్ ప్రదర్శనలో సుమారు 15 ఏళ్లకు పైగా అనుభవం ఉండటం విశేషం. (చదవండి: ఎవరీ అయ్యలసోమయూజుల లలిత..? 'స్పెషల్ కేసు'గా ఆ మినహాయింపు..)
- 
      
                   
                                                       డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై షాకింగ్ రూమర్స్డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు చెప్పగానే 'హనుమాన్' సినిమా గుర్తొస్తుంది. అంతకు ముందు పలు చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ ఈ మూవీ అద్భుతమైన హిట్ కావడం.. ఇతడి పేరుని పాన్ ఇండియా లెవల్లో మార్మోగిపోయేలా చేసింది. ఈ ఊపులో ప్రశాంత్ వర్మకు పలువురు బడా నిర్మాతల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు అవే ఇతడిని ఇబ్బందుల్లో పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమే ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది.'హనుమాన్' రిలీజై ఇప్పటికి రెండేళ్లు అయింది. మధ్యలో ప్రశాంత్ వర్మ చేయాల్సిన రెండు సినిమాలు ఆగిపోయాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్తో అనుకున్నది ఒకటి కాగా, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో అనుకున్న మూవీ మరొకటి. ఇవి ఆగినప్పటికీ ప్రశాంత్ వర్మ ఖాళీగా అయితే లేడు. తన సినిమాటిక్ యూనివర్స్లో 'మహాకాళి' తీస్తున్నాడు. దీనికి కేవలం దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా.. 'జై హనుమాన్'కి దర్శకత్వం వహించాల్సి ఉంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్)'హనుమాన్' హిట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు బాగానే తీసుకున్నాడట. మీకే నెక్స్ట్ సినిమా చేసి పెడాతనని మాట కూడా ఇచ్చాడట. అలా రూ.80-100 కోట్ల వరకు అడ్వాన్సులు రూపంలో రాగా.. ఆ మొత్తంతో హైదరాబాద్లోని సొంతంగా ఓ స్టూడియోని నిర్మించుకున్నాడట. ఇప్పుడు అందరూ నిర్మాతలు, ప్రశాంత్ వర్మని కొత్త మూవీస్ గురించి అడిగేసరికి.. నేను స్టోరీ ఇస్తాను, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాను గానీ డైరెక్షన్ చేయనని అంటున్నాడట. దీంతో సదరు నిర్మాతలు.. ఇతడిపై ఫిర్యాదు చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్కి వెళ్లే ఆలోచనలో ఉన్నారట.మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు తమ సంస్థ నుంచి ఎలాంటి అడ్వాన్సులు ఇవ్వలేదని, లావాదేవీలు జరపడం లాంటివి చేయలేదని 'ఓజీ' తీసిన డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ట్వీట్తో క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటలు నిజమేనా అనే సందేహం కలుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై కచ్చితంగా మిగతా నిర్మాణ సంస్థలు కూడా స్పందించే అవకాశముందేమో! అప్పటివరకు వెయిట్ అండ్ సీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా)pic.twitter.com/FdXzUh8LDw— DVV Entertainment (@DVVMovies) October 31, 2025
- 
      
                   
                                                       టైం ప్లీజ్సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ గడువు నేటితో ముగియడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గడువును పొడిగించాలని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మూడునెలల్లోగా విచారణ పూర్తి చేయాలంటూ జులై 31వ తేదీన సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపుదారుల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తే అవసరమైతే వాళ్లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్కు సూచించింది కూడా. అయితే.. ఇప్పటిదాకా నలుగురి విచారణ మాత్రమే జరిగిందని, మిగిలిన వాళ్లను విచారించేందుకు రెండు నెలల గడువు పొడిగించాలని స్పీకర్ తరఫున తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
- 
      
                   
                                                       IND vs AUS: రెండో టీ20లో భారత్ ఓటమిAustralia vs India, 2nd T20I Melbourne Updates And Highlights: మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఆసీస్ చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్( 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 46) టాప్ స్కోరర్గా నిలవగా.. ట్రావిస్ హెడ్(15 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్తో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68) టాప్ స్కోరర్గా నిలవగా .. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.బుమ్ బుమ్ బుమ్రా..ఆస్ట్రేలియా ఆఖరిలో రెండు వికెట్లు కోల్పోయింది. తమ విజయానికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో బుమ్రా వరుస బంతుల్లో ఓవెన్, షార్ట్ను పెవిలియన్కు పంపాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్8.4: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి మూడో వికెట్గా వెనుదిరిగిన టిమ్ డేవిడ్ (2 బంతుల్లో 1). ఆసీస్ స్కోరు: 90-3(8.4). ఇంగ్లిస్ 5 పరుగులతో ఉన్నాడు. విజయానికి 68 బంతుల్లో 36 పరుగుల దూరంలో ఆసీస్. ఏడు వికెట్ల దూరంలో టీమిండియా.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి మార్ష్ (26 బంతుల్లో 46) అవుట్. ఆసీస్ స్కోరు: 87-2(8). విజయానికి 72 బంతుల్లో 39 పరుగులు అవసరం. ఇంగ్లిస్ 3 పరుగులతో ఉన్నాడు. టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్4.3: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి హెడ్ (15 బంతుల్లో 28) అవుట్. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోగా.. మార్ష్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 51-1(4.3). విజయానికి 93 బంతుల్లో 75 పరుగులు అవసరం.నాలుగు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 49-0(4)ట్రావిస్ హెడ్ 27, మార్ష్ 12 పరుగులతో క్రీజులోకి ఉన్నారు.పదో వికెట్గా బుమ్రాఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్కు క్యూ కట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68) రాణించగా.. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) అతడికి సహకారం అందించాడు. దీంతో భారత జట్టు కాస్త పరువు నిలుపుకోగలిగింది. 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కస్ స్టొయినిస్కు ఒక వికెట్ దక్కింది. భారత బ్యాటర్లలో గిల్ (5), సంజూ శాంసన్ (1), సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ పటేల్ (7), శివం దూబే (4), కుల్దీప్ యాదవ్ (0) సింగిల్ డిజిట్కే పరిమితం కాగా.. బుమ్రా రనౌట్ కావడంతో భారత్ పదో వికెట్ కోల్పోయింది.తొమ్మిదో వికెట్ డౌన్18.3: హాఫ్ సెంచరీ వీరుడు అభిషేక్ శర్మ (68)రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో అభిషేక్ LBW అయ్యాడు. బుమ్రా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 125-9(18.3) ఫోర్, సిక్సర్తో చెలరేగిన అభిషేక్18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 18వ ఓవర్లో అభిషేక్ ఫోర్, సిక్సర్ బాదాడు. అభిషేక్ 34 బంతుల్లో 68 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఎనిమిదో వికెట్ డౌన్కుల్దీప్ యాదవ్ (0) ఎనిమిదో వికెట్గా వెనుదిరిగాడు. స్టొయినిస్ బౌలింగ్లో అబాట్ (సబ్స్టిట్యూట్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా స్కోరు: 110-8(17). అభిషేక్ శర్మ 53 పరుగులతో ఉండగా.. వరుణ్ చక్రవర్తి క్రీజులోకి వచ్చాడు.శివం దూబే అవుట్బార్ట్లెట్ బౌలింగ్లో శివం దూబే (4)ఇచ్చిన క్యాచ్ను జోష్ ఇంగ్లిస్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ స్కోరు: 109-7(15.4). కుల్దీప్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్15.2:బార్ట్లెట్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్గా హర్షిత్ రాణా వెనుదిరిగాడు. రాణా 33 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35 పరుగులు రాబట్టాడు. శివం దూబే క్రీజులోకి వచ్చాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 105-5హర్షిత్ రాణా 31 బంతుల్లో 35, అభిషేక్ 27 బంతుల్లో 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ..టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వరుస క్రమంలో వికెట్లుకోల్పోయినప్పటికి అభిషేక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.టీమిండియా ఐదో వికెట్ డౌన్..అక్షర్ పటేల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులోకి హర్షిత్ రాణా వచ్చాడు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(37),రాణా(4) ఉన్నారు.పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 40-4.అక్షర్ 3, అభిషేక్ శర్మ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్4.5: తిలక్ వర్మ డకౌట్ అయ్యాడు. హాజిల్వుడ్ బౌలింగ్లో రెండు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి తిలక్ వెనుదిరగగా.. అతడి స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. టీమిండియా స్కోరు: 32-4(4.5). అభిషేక్ 24 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మూడో వికెట్ డౌన్4.3: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి సూర్య వెనుదిరిగాడు. అంతకు ముందే క్యాచ్ డ్రాప్ రూపంలో తనకు వచ్చిన లైఫ్ను సూర్య సద్వినియోగం చేసుకోలేక ఒక్క పరుగే చేసి నిష్క్రమించాడు. సూర్య స్థానంలో తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. అభిషేక్ 24 పరుగులతో ఉన్నాడు. టీమిండియా స్కోరు: 32-3(4.4)రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా3.3: నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగిన సంజూ శాంసన్(2). ఓపెనర్గా, మిడిలార్డర్లో ఆడించిన సంజూను వన్డౌన్లో పంపిస్తూ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. భారత్ స్కోరు: 23-2(3.3). అభిషేక్ 16 పరుగులతో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.Nathan Ellis got off to a rapid start, dismissing Sanju Samson for just two. #AUSvIND pic.twitter.com/lY4FAlbzDI— cricket.com.au (@cricketcomau) October 31, 2025 తొలి వికెట్ కోల్పోయిన భారత్2.4: హాజిల్వుడ్ బౌలింగ్లో మార్ష్కు క్యాచ్ ఇచ్చి గిల్ తొలి వికెట్గా వెనుదిరిగాడు. పది బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. సంజూ శాంసన్ వన్డౌన్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 22-1(2.5). అభిషేక్ 15, సంజూ రెండు పరుగులతో ఉన్నారు.రెండు ఓవర్లలో టీమిండియా స్కోరు: 18-0అభిషేక్ శర్మ నాలుగు బంతుల్లో 14, శుబ్మన్ గిల్ 8 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్ను హాజిల్వుడ్ కట్టుదిట్టంగా వేయడంతో టీమిండియాకు ఒక్క పరుగే వచ్చింది. తొలి బంతికే గిల్ను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా.. రివ్యూలో అనుకూల ఫలితం వచ్చింది. దీంతో టీమిండియా రివ్యూ నిలుపుకోగలిగింది.టాస్ గెలిచిన ఆసీస్టీమిండియాతో రెండో టీ20లో ఆస్ట్రేలియా (IND vs AUS) టాస్ గెలిచింది. మెల్బోర్న్ వేదికగా తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh).. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కాగా మార్ష్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టాస్ గెలవడం ఇది పందొమ్మిదోసారి. ప్రతిసారీ అతడు లక్ష్య ఛేదననే ఎంచుకోవడం విశేషం.ఒక మార్పుతో బరిలోకిటాస్ సందర్భంగా మార్ష్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయించుకున్నాం. వికెట్ బాగుంది. 40 ఓవర్లపాటు పిచ్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాం. మా తుదిజట్టులో ఒక మార్పు చేశాము. జోష్ ఫిలిప్ స్థానంలో మాథ్యూ షార్ట్ వచ్చాడు’’ అని తెలిపాడు.అదే జట్టుతో భారత్ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు. తొలి టీ20కి ఎంచుకున్న జట్టుతోనే తాము మెల్బోర్న్లో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్లో 2-1తో ఆసీస్ గెలుపొందగా.. టీ20 సిరీస్లోనైనా సత్తా చాటాలని భారత్ పట్టుదలగా ఉంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కాన్బెర్రాలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. అయితే, వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20 తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్.
- 
      
                   
                                                       నిద్రపోతున్నారా?.. మా ముందుకు రావాల్సిందే!సాక్షి, ఢిల్లీ: వీధి కుక్కల వ్యవహారంలో రాష్ట్రాల తీరుపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు గౌరవమే లేకుండా పోయిందంటూ జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో బెంచ్ శుక్రవారం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో విచారణలో ఊరట కోసం ప్రయత్నించిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు(సీఎస్లకు) చుక్కెదురైంది. వీధి కుక్కల పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు.. షెల్టర్ల సంగతిని పక్కనపెట్టి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అమలుపై అఫిడవిట్లను వీలైనంత తర్వగా తమకు సమర్పించాలని ఆగష్టులో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అయితే రెండు నెలలు గడుస్తున్నా ఏ రాష్ట్రం నుంచి కూడా సరైన స్పందన లేదు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలు హడావిడిగా దీపావళి సమయంలో అఫిడవిట్లు దాఖలు చేయడం అవి రికార్డుల్లోనూ అధికారికంగా నమోదు కాలేదు. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ‘‘దేశం పరువు తీస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. నవంబర్ 3వ తేదీన అన్ని రాష్ట్రాల సీఎస్లు తమ ఎదుట హాజరై అఫిడవిట్లు ఎందుకు సమర్పించలేకపోయారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే.. విచారణలో మినహాయింపు కోరుతూ సీఎస్లు కోర్టును అభ్యర్థించారు. వర్చువల్గా హాజరయ్యేందుకు అనుమతించాలంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలను కోరారు. అయితే.. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని.. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఫిజికల్గా హాజరు కావాల్సిందేనని.. లేకుంటే చర్యలు తప్పవని జస్టిస్ విక్రమ్నాథ్ హెచ్చరించారు. ఈ క్రమంలో.. తెలంగాణ, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్కు మాత్రమే మినహాయింపు ఉంటుందని పునరుద్ఘాటించారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన సమస్యలతో కోర్టు సమయం వృథా అవుతోంది. పార్లమెంట్ నిబంధనలు చేస్తుంది, కానీ ఎటువంటి చర్యలు ఉండవు. మేము కంప్లయన్స్ అఫిడవిట్లు ఫైల్ చేయమని ఆదేశిస్తే, వారు దానిని పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాలకు గౌరవం లేదు. వాళ్లు భౌతికంగా వచ్చి ఎందుకు కంప్లయన్స్ అఫిడవిట్లు దాఖలు చేయలేదో చెప్పాలి’’ అంటూ సోలిసిటర్ జనరల్ విజ్ఞప్తిని బెంచ్ తోసిపుచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎస్ మినహాయింపు కోరగా.. అందుకు సైతం కోర్టు ఒప్పుకోలేదు.
- 
      
                   
                                                       వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలువిలక్షణ నటుడు మోహన్బాబు కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) యాంకర్గా, నటిగా రాణిస్తోంది. ఇటీవలే దక్ష సినిమాతో పలకరించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై ఓపెన్ అయింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఇంటర్ చదివేవరకు కూడా అమ్మ సెలక్ట్ చేసిన బట్టలే వేసుకునేదాన్ని. తను ఎలా చెప్తే అలా నడుచుకునేదాన్ని. నా తలకు నూనె పెట్టి జడేసేది. అలాగే కాలేజీకి వెళ్లేదాన్ని. నాన్న అయితే చాలా స్ట్రిక్ట్.సడన్ సర్ప్రైజ్పెళ్లి తర్వాత అమెరికాలోనే సెటిలైన నేను కూతురు పుట్టే సమయానికి ఇండియాకు వచ్చాను. నా భర్త కూడా వచ్చాడు. కానీ, ఇక్కడ అడ్జస్ట్ అవలేకపోయాడు. అందుకే 2019లో అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. మీకు నచ్చినప్పుడు వస్తూ ఉండండి అని చెప్పాడు. దగ్గరుండి గొడవలుపడేకన్నా.. దూరంగా ఉండటమే మంచిదని నేనూ ఒప్పుకున్నాను. అయితే తనకెంత కోపమొచ్చినా సరే.. కూతురి ముందు ఒక్క మాట కూడా అనడు. నా తమ్ముడు మనోజ్ (Manchu Manoj) కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టపడ్డాడు. నేను మీకు తెలుసా? మూవీ కోసం అమెరికాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అప్పుడు సడన్గా సర్ప్రైజ్ అని మా ఇంటికొచ్చి కొన్నివారాలుండేవాడు. క్యాండిల్స్ కోసం లక్షలుఅప్పట్లో మేము సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్లం. ఆ సమయంలో నేలపై పడుకునేవాడు. కానీ, ఇప్పుడేమో ఎక్కువ లగ్జరీ కోరుకుంటున్నాడు. క్యాండిల్ కోసం లక్షలు ఖర్చుపెడుతున్నాడు. నేను హోస్ట్ చేసిన మేము సైతం షో విషయానికి వస్తే.. ఆ షో నన్నెంతగానో మార్చేసింది. దీని తర్వాత కూడా మంచిపనులు ఆపలేదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించాం. దివ్యాంగులకు ఆరంతస్తుల భవంతి కట్టించాం. గుంటూరులో ఒకావిడకు ఇల్లు కట్టించాం. ఇప్పటికీ రకుల్ ఓ అమ్మాయికి చదువు చెప్పిస్తోంది. సందీప్కిషన్ ఓ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఇలా చాలా ఉన్నాయి. కానీ, అవి బయటకు చూపించమంతే!ఇంట్లో పెద్ద గొడవముంబై షిఫ్ట్ అవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. ఎందుకో ముంబై వెళ్లాలని మనసుకు అనిపించింది, వెళ్లిపోయానంతే! పైగా అక్కడ నా కూతుర్ని సెలబ్రిటీలా ఎవరూ చూడరు, స్వేచ్ఛగా బతుకుతుంది. నా కూతుర్ని అడవిలో వదిలేస్తే ఆకులు తినైనా బతకాలి అనేలా పెంచాను. ఎందుకంటే ఈ లగ్జరీ జీవితం ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. అందుకే తనను సింపుల్గా పెంచాను. మొదట్లో తను విష్ణు స్కూల్కే వెళ్లేది. ఆరు నెలలు వెళ్లాక సడన్గా స్కూల్ మాన్పించేశాను. అప్పుడు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది.నా కూతురి భవిష్యత్తు ముఖ్యంనేను స్కూల్లో ఒక్క రూపాయి ఫీజు కట్టలేదు. పైగా అందరూ తనపై ఎక్కువ కేరింగ్ చూపించారు. కారు డోర్ తీయడం, లిఫ్ట్ నొక్కడం.. ఇలా తనను అడుగు కిందపెట్టనీయలేదు. ఇలాంటి లగ్జరీ వద్దనే ఆ స్కూల్ మాన్పించాను. గచ్చిబౌలిలోని ఓ చిన్న స్కూల్కు పంపించాను. ఇంట్లో వాళ్లు బాధపడ్డప్పటికీ నా నిర్ణయం మార్చుకోలేదు. వాళ్ల కోసం నా కూతురి భవిష్యత్తును పాడు చేయలేను. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు చూసిందే నిజమనుకుంటారు, అదే నేర్చుకుంటారు.శాపనార్థాలుమనోజ్ 'మిరాయ్' సినిమా ఈవెంట్లో ఏది మాట్లాడినా దాన్ని కట్ చేసి తప్పుగా ప్రచారం చేశారు. విష్ణు గురించి ఒక్క ముక్క తప్పుగా మాట్లాడకపోయినా సరే విష్ణును తిడుతున్నట్లుగా తప్పుడు థంబ్నైల్స్ పెట్టారు. అసలు ఒక కుటంబాన్ని కలపాలనుకుంటున్నారా? విడదీయాలనుకుంటున్నారా? వాళ్ల మధ్య ఇంకా అగ్గిరాజేసి విడదీయాలని చూసిన అందరూ సర్వనాశనం అయిపోతారు. ఈ జీవితంలోనే మీ కర్మ అనుభవిస్తారు అని మంచు లక్ష్మి శాపనార్థాలు పెట్టింది.చదవండి: బాహుబలి ఎపిక్లో కొత్త సీన్.. అదిరిపోయిందయ్యా!
- 
      
                   
                                                       కేకేఆర్లోకి రోహిత్ శర్మ ‘కన్ఫామ్’!.. స్పందించిన ముంబై ఇండియన్స్ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్గా నియమించింది ముంబై ఇండియన్స్. జట్టును ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన దిగ్గజ సారథి రోహిత్ను కాదని హార్దిక్ (Hardik Pandya)కు పగ్గాలు అప్పగించింది.ఈ నేపథ్యంలో అవమానభారంతో కుంగిపోయిన రోహిత్ శర్మ 2025లో ముంబై జట్టును వీడతాడనే ప్రచారం జరిగింది. అయితే, ఊహించని విధంగా హిట్మ్యాన్ అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్లోనే కొనసాగాడు. ఈ ఏడాది అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.కేకేఆర్లోకి రోహిత్ శర్మ!ఐపీఎల్-2025 వేలానికి ముందు ముంబై రోహిత్ను రూ. 16.30 కోట్లతో రిటైర్ చేసుకుంది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించినందున తనకు ఇది సరైన ధరేనని అతడు స్వయంగా వ్యాఖ్యానించడం విశేషం. అయితే, తాజాగా రోహిత్ శర్మ జట్టు మార్పు గురించి మరో వార్త తెర మీదకు వచ్చింది.కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్టే ఇందుకు కారణం. కాగా ఆస్ట్రేలియా ఇటీవలి వన్డే సిరీస్లో విజృంభించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ నంబర్వన్ వన్డే బ్యాటర్గాసుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రోహిత్ శర్మ ప్రపంచ నంబర్వన్ వన్డే బ్యాటర్గా నిలవడం మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం. సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్లో నిలిచిన ఐదో భారతీయ క్రికెటర్గా రోహిత్ గుర్తింపు పొందాడు. ఆసీస్తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో 202 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన 38 ఏళ్ల రోహిత్... తాజా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగు పరుచుకొని ‘టాప్’ ప్లేస్ దక్కించుకున్నాడు. రోహిత్ 781 పాయింట్లతో నంబర్వన్గా నిలవగా... భారత వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ (745 పాయింట్లు) రెండు స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్కు పరిమితమయ్యాడు.కన్ఫామ్ అంటూ కేకేఆర్ పోస్ట్ఈ నేపథ్యంలో కేకేఆర్.. ‘‘పురుషుల వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ కన్ఫామ్’’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో రోహిత్ శర్మ కేకేఆర్లో చేరుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇందుకు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వింగ్ గట్టిగానే బదులిచ్చింది.స్పందించిన ముంబైరోహిత్ శర్మ ఫొటోను పంచుకుంటూ.. ‘‘సూర్యుడు రేపు ఉదయించడం నిజమే.. కానీ రాత్రి (K)night మాత్రం సూర్యుడు రావడం కుదరదు. ఇది అసాధ్యం కూడా’’ అంటూ హిట్మ్యాన్ తమతోనే ఉంటాడన్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. కాగా రోహిత్ శర్మ ప్రాణ స్నేహితుడు, ఫిట్నెస్ కోచ్ అభిషేక్ నాయర్ కేకేఆర్ హెడ్కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్ జట్టు మార్పు ఉంటుందేమోననే సందేహాలు నెలకొనగా.. ముంబై ఫ్రాంఛైజీ ఇలా స్పష్టతనిచ్చేసింది.చదవండి: ఆమె ఒక అద్భుతం.. జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయి: భారత కెప్టెన్
- 
      
                   
                                                       కర్రెగుట్టల్లో కాల్పులు..!రాయ్పూర్: ఛత్తీస్గడ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మరోమారు తుపాకీ గర్జించింది. 288 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండే ఈ గుట్టలు తెలంగాణ ప్రాంతంలో 90 కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ భద్రత బలగాలు తొలుత ‘బచావో కర్రెగుట్టలు’.. ఆ తర్వాత ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ పేరుతో నక్సల్స్ ఏరివేతకు 24 వేల మంది పోలీసులను మోహరించాయి. డ్రోన్లతో గుట్టలను జల్లెడ పట్టాయి. అయితే.. ఆరుగురు పీఎల్జీ సభ్యుల(వీరిలో ముగ్గురు మహిళలు) ఎన్కౌంటర్ మినహా.. పెద్దగా పురోగతిని సాధించలేకపోయాయి. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి..ఆపరేషన్ సిందూర్ సమయంలో ఛత్తీస్గఢ్లోని కేంద్ర బలగాలు దేశ సరిహద్దులకు వెళ్లాయి. దీంతో.. ఉన్నఫళంగా ఆపరేషన్ కర్రెగుట్టలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ బలగాలు సైతం అబూజ్మఢ్పైనే ఎక్కువగా ఫోకస్ చేశాయి. కర్రెగుట్టల్లో 30కి పైగా భారీ కొండలు ఉండగా.. అప్పట్లో భద్రతాబలగాలు నీలం కొండ(సరాయ్), దోబే కొండలు, ఆలుబాకల్లో మూడు బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి. వెయ్యి మంది మావోయిస్టులు తలదాచుకున్న ఓ కలుగును గుర్తించాయి. అంతకు మించితే.. పెద్దగా పురోగతి సాధించింది లేదు.శుక్రవారం ఉదయం భద్రతాబలగాల బేస్ క్యాంపులపై మావోయిస్టులు మెరుపు దాడులు చేసినట్లు సమాచారం. ‘‘కేంద్ర బలగాలు కొత్త క్యాంపును ఏర్పాటు చేసే క్రమంలో కర్రెగుట్టల్లోకి వెళ్లాయి. ఆ సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. దానికి ప్రతిగా భద్రతాబలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. సుమారు గంట పాటు కాల్పులు కొనసాగాయి. ఇరువైపులా ప్రాణనష్టం జరిగిన దాఖలాలు కనిపించడం లేదు’’ అని ఓ అధికారి ‘సాక్షి డిజిటల్’కు వివరించారు. ఇంకా 400 మంది మావోయిస్టులు? తాజా ఘటనతో కర్రెగుట్టల్లో ఇంకా 400 మంది దాకా మావోయిస్టులు తలదాచుకుని ఉంటారని కేంద్ర బలగాలు భావిస్తున్నాయి. గతంలో జరిగిన ఎన్కౌంటర్ల సందర్భంలోనూ పీఎల్జీ దళ కమాండర్లు మృతిచెందారని, ఇప్పుడు కూడా హిడ్మా నేతృత్వంలోని పీఎల్జీ ఒకటో బెటాలియన్ దళానికి చెందిన మావోయిస్టులు కర్రెగుట్టల్లోని కొండల్లో తలదాచుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నాయి. తాజా ఘటనతో పోలీసులు కూంబింగ్ను ముమ్మరం చేశారు. అయితే.. మోంథా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో కర్రెగుట్టల్లో నడక కష్టంగా మారిందని, బురద, ఊబులతో ప్రమాదం పొంచి ఉందని బలగాలు భావిస్తున్నాయి. కూంబింగ్ మార్గాల్లో విష సర్పాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నాయి. దాంతో.. డ్రోన్ల సాయంతో కూంబింగ్కు సన్నాహాలు చేస్తున్నాయి.
- 
      
                   
                                                       రూ. 6,632 కోట్ల ఐపీవో.. ఒక్కో షేరు ధర రూ. 95–100స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘గ్రో’ (Groww IPO) మాతృ సంస్థ బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్, పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 6,632 కోట్లు సమీకరించనుంది. నవంబర్ 4న ఇష్యూ ప్రారంభమై 7న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నవంబర్ 3 బిడ్డింగ్ తేదీగా ఉంటుంది. ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 95–100గా ఉంటుంది. రూ. 61,700 కోట్ల (సుమారు 7 బిలియన్ డాలర్లు) వేల్యుయేషన్ను కంపెనీ అంచనా వేస్తోంది.ఐపీవోలో భాగంగా రూ. 1,060 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుుండగా, ప్రమోటర్లు..ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు 55.72 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. ప్రమోటర్లలో లలిత్ కేష్రి, హర్ష్ జైన్ మొదలైన వారు ఉన్నారు. వ్యవస్థాపకులకు కంపెనీలో 27.97 శాతం వాటా ఉంది.ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను టెక్నాలజీ, వ్యాపార విస్తరణకు కంపెనీ వినియోగించుకోనుంది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, మరింతమంది కస్టమర్లను ఆకర్షించేలా టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయడం, మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి కొనసాగిస్తామని గ్రో సహ–వ్యవస్థాపకుడు హర్ష్ జైన్ తెలిపారు.2016లో ఏర్పాటైన గ్రో.. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. 2025 జూన్ నాటికి 1.26 కోట్ల మంది యాక్టివ్ క్లయింట్లు, 26 శాతం పైగా మార్కెట్ వాటా ఉంది. ఇటీవలే వెల్త్ మేనేజ్మెంట్, కమోడిటీస్ మొదలైన విభాగాల్లోకి విస్తరించింది. ఈ ఏడాది మే నెలలో మార్కెట్ల నియంత్రణ సెబీకి కాన్ఫిడెన్షియల్ విధానంలో ప్రాస్పెక్టస్ను సమర్పించింది. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో గ్రో లాభం మూడు రెట్లు పెరిగి రూ. 1,824 కోట్లకు చేరింది.
- 
      
                   
                                                       ఎంఎస్ రాజుపై చర్యలేవీ?సాక్షి, విజయవాడ: టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుపై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధిలేని ఎమ్మెల్యేని టీటీడీ మెంబర్గా నియమించడమేంటి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని నిలదీశారు. ఎమ్మెస్ రాజు ఓ బుద్ధిలేని వ్యక్తి. భగవద్గీత పై నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను టిటిడి బోర్డు మెంబర్ గా పెట్టొచ్చా. టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించేముందు ఆ వ్యక్తికి హిందూ ధర్మం పై నమ్మకం, జ్ఞానం ఉందో లేదో చూడాలి. ఇలాంటి వాళ్లు టిడిపిలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలుగా ఉన్నారో చంద్రబాబు ఒకసారి సర్వేచేయాలి. ఎమ్మెస్ రాజును పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయాలి. భగవద్గీత , హిందూ ధర్మం పై మరొకరు వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఎమ్మెస్ రాజు పై చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబును రాజా సింగ్ డిమాండ్ చేశారు.‘భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదు’ అంటూ ఓ కార్యక్రమంలో ఎంఎస్ రాజు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది. ఈలోపు ఆయన అనుచరులు ఆ వ్యాఖ్యను సమర్థించే ప్రయత్నం చేశారు. అయితే విశ్వహిందూ పరిషత్ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం.. క్షమాపణలకు డిమాండ్ చేయడంతో ఆయన దిగిరాక తప్పలేదు.
- 
      
                   
                                                       పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే పెళ్లి విషయంలో కాస్త ఆలస్యం చేస్తుంటారు. ఈ ఏడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అభిషన్ జీవింత్ అనే కుర్రాడు.. ఇప్పుడు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడు. చాన్నాళ్లుగా ప్రేమిస్తున్న అఖిల అనే అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. శుక్రవారం ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్లో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించి ఓ ఫొటో కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: నటిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చిన్న కూతురు)యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టిన అభిషన్.. 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో దర్శకుడిగా మారి అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.7 కోట్ల బడ్జెట్ పెడితే దాదాపు రూ.80-90 కోట్ల కలెక్షన్ ఈ మూవీకి వచ్చాయి. ఇదే చిత్రంలోనూ నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. రీసెంట్గా హీరోగా ఓ మూవీ పూర్తి చేశాడు. రజనీకాంత్ కూతురు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్.మరోవైపు అభిషన్కి రీసెంట్గానే 'టూరిస్ట్ ఫ్యామిలీ' నిర్మాత మగేశ్ రాజ్.. ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని పెళ్లి బహుమతిగా ఇచ్చాడు. గురువారం చెన్నైలో రిసెప్షన్ జరగ్గా.. పలువురు తమిళ సినీ సెలబ్రిటీలు హాజరైన కొత్త జంటని దీవించారు. ఇప్పుడు పెళ్లి కూడా జరగడంతో నూతన వధూవరుల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి వేడుకకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా)
- 
      
                   
                                                       నోటి ఆరోగ్యంతో కొన్ని రకాల క్యాన్సర్లకు చెక్!నోటి ఆరోగ్యాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే పోతుందిలే అని ఉదాసీన వైఖరితో ఉంటారు. నిజానికి నోటి ఆరోగ్యం అంటే దంతాలు ,చిగుళ్ళు మాత్రమే కాదు. మొత్తం శరీర ఆరోగ్యానికి మూల స్థంభం లాంటిది. నోటి అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, ప్రమాదకర క్యాన్సర్లకు దారి తీస్తుంది. అందుకే దంతవైద్యులు, వైద్యులు ఇద్దరూ నోటి ఆరోగ్యం ముఖ్యమైనదని నొక్కి వక్కాణిస్తున్నారు. అదెలాగో చూద్దాం.డాక్టర్ సోనియా దత్తా, MDS, PhD, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ ప్రకారం సరైన నోటి ఆరోగ్యం దైహిక ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని క్యాన్సర్లు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ నివారణలో ఇదొక కీలక అంశం.క్యాన్సర్ నివారణకు సరైన నోటి ఆరోగ్యంమంచి నోటి ఆరోగ్యం కేవలం శుభ్రమైన దంతాలను కలిగి ఉండటం కంటే ఎక్కువ.నోటి ఆరోగ్యం అందం సౌకర్యం మాత్రమే కాదు. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి, నోటి పరిశుభ్రతను పాటించడం అవసరం.ఇది జీవన నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. సరిగా శుభ్రం చేయని నోటిలో బ్యాక్టీరియా పెరిగి, దీర్ఘకాలిక వాపు (inflammation) ఏర్పడుతుంది, ఇది కణజాల క్షీణతకు దారితీయవచ్చు.డాబర్ రెడ్ పేస్ట్ వంటి ఆయుర్వేద పేస్ట్తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం మరియు యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించడం వంటి సాధారణ అలవాట్లు బ్యాక్టీరియా భారాన్ని తగ్గించడ , నోటి లోపలి వ్యవస్థను సమతుల్యంగా ఉంచడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి.AIIMS (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నోటి పరిశుభ్రతను ప్రామాణిక ఆంకాలజీ సంరక్షణలో విలీనం చేయాలి . INHANCE (ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ) కన్సార్టియం, మంచి నోటి పరిశుభ్రత, (వార్షిక దంత పరీక్షలు, తక్కువ పళ్ళు తప్పిపోవడం, రోజువారీ బ్రషింగ్) తల , మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొంది.క్రమం తప్పకుండాచేసుకునే సాధారణ దంత పరీక్షలు చాలా ముఖ్యమైనవి. తద్వారా నోటి క్యాన్సర్ ముందస్తు సంకేతాలను గుర్తించవచ్చు. కనిపించకుండా ఉండే అనుమానాస్పద గాయాలు, నిరంతర పూతల లేదా కణజాల ఆకృతిలో మార్పులు ఈ పరీక్షల్లో వైద్యులు గుర్తిస్తారు. అలాగే పొగాకుకు నిషేధించడం, మద్యం పరిమితం చేయడం ద్వార క్యాన్సర్ ప్రమాదం మరింత తగ్గుతుంది. ఈ చర్యలు నోటి ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా దీర్ఘకాలిక క్యాన్సర్ నివారణ వ్యూహాలలో శక్తివంతమైన సాధనాలుగా కూడా పనిచేస్తాయి, ముఖ్యంగా తల మరియు మెడ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో.నోటి ఆరోగ్యం - కొన్ని రకాల క్యాన్సర్లు తల, మెడ క్యాన్సర్లు: దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధి, పేలవమైన నోటి పరిశుభ్రత లాంటివి నోరు, గొంతు స్వరపేటికలో ప్రాణాంతంగా మారే వాపు మరియు సెల్యులార్ మార్పులను పెంచుతాయి.జీర్ణవ్యవస్థ క్యాన్సర్లు: పీరియాడోంటల్ వ్యాధి కడుపు, ప్యాంక్రియాటిక్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాలతో ముడిపడి ఉంది.ఊపిరితిత్తుల మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు: నోటి అపరిశుభ్రత, అనారోగ్యం ఈ క్యాన్సర్ల ముప్పును పెంచుతుంది. (స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!)అయితే ఇది అన్ని క్యాన్సర్లను నిరోధించకపోయినా, మంచి నోటి సంరక్షణ కొన్ని రకాల క్యాన్సర్లు ముప్పును తగ్గిస్తుంది. మ్యూకోసిటిస్, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను తగ్గించడం ద్వారా క్యాన్సర్ చికిత్స ఫలితాలను మెరుగు పడతాయి. రోగనిరోధక పనితీరు మెరుగుపడుతుంది. నోటి సంరక్షణ ఎలా?ఆయుర్వేద పేస్ట్తో ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయించుకోవడం. యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ పొగాకు, ఆల్కహాల్కు దూరంగా ఉండటం చక్కెర, యాసిడ్ ఫుడ్స్, పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఇవి దంతాల ఎనామిల్ను పాడుచేస్తాయి, బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా దంతవైద్యుడిని సంప్రదించాలి.నోటిలో ఏదైనా అసాధారణ గడ్డలు, పుండ్లు లేదా ఇతర మార్పులను గమనించి నట్లయితే, వెంటనే దంతవైద్యుడిని సంప్రదించండి.
- 
      
                   
                                                       ఎవరీ అయ్యలసోమయూజుల లలిత..? 'స్పెషల్ కేసు'గా ఆ మినహాయింపు..తొలి మహిళ ఇంజనీర్గా కంప్యూటర్ రంగంలో కృషి చేసిన కర్ణాటకకు చెందని రాజేశ్వరి ఛటర్జీ లేదా మెరైన్ ఇంజనీర్ సోనాలి బెనర్జీ పేర్లనే చెప్పుకుంటాం. కానీ వారందరికంటే ఒక వితంతవు..నాటి సామాజిక పరిస్థితులను చేధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో చేరి, రాణించి దేశానికే ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. చరిత్ర ఆమె విజయాలను అంతగా గుర్తించకపోయినా..ఎలక్రికల్ ఇంజనీర్లో తొలి మహిళా గ్రాడ్యుయేట్ అనేది కాదనలేని సత్యం. అంతేగాదు ఎందరో అమ్మాయిలు ఆ రంగంలో చేరేలా పురికొల్పేందుకు కారణమైంది. నాడు ఆ ఒక్క మినహాయింపుతో..ఎవ్వరూ చేయలేని సాహసం చేసిన తొలి మహిళ ఆమె. ఔను ఏరంగంలోనైనా ఫస్ట్ పొజిషన్లో ఉండటం అంటే భయంగానే ఉంటుంది. ఎందుకంటే మార్గదర్శకులు ఉండరు, పైగా ఎన్నో కళ్లు మన గెలుపుని అనుమానిస్తాయి, తక్కువ అంచనా వేస్తాయి. వాటన్నింటిని అధిగమించి అసాధారణ గెలుపుని ఒడిసి పట్టి యావత్తు ప్రపంచం గుర్తించుకునేలా చేసిన తొలి మహిళా ఇంజనీర్ ఆమె. ఈ తరానికి అంతగా తెలియని, గుర్తింపుకు నొచుకుని ఆ మహిళ ఇంజనీర్ ఎవరంటే..ఆ మహిళే..భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యలసోమయూజుల లలిత. మన తెలుగమ్మాయే. చెన్నైలోని గిండిలోని ఇంజనీరింగ్ కళాశాలలో చేరినప్పుడూ తొలి రోజు కాలేజీలో ఎదురైన ఘటనకు మరెవ్వరైనా..మళ్లీ అడుగు పెట్టడానికే భయపడిపోతారు. కానీ లలిత ఉక్కు ధైర్యంతో ముందుకుసాగారామె. ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో అంతా అబ్బాయిలే ఉండేవారు. ఒకే ఒక్క అమ్మాయి తన సహచర విద్యార్థిగా అడుగుపెడుతుందని తెలిసి అంతా వింతగా, ఎగతాళిగా నవ్వులు వినిపిస్తున్నా..ఓపికతో భరించింది. కూర్చొనేందుకు చోటు లేని పరిస్థితి. ఆమె కోసం ప్రత్యేకంగా సెపరేట్గా వేసిన కూర్చీలో కూర్చొని పాఠాలు వినింది. కాటన్ చీరలో తలొంచుకుని నిశబ్దంగా వస్తున్న అమ్మాయిని చూసి అందరికీ చిన్న చూపు, ద్వేషం. అయినా తన పని, లక్ష్యంమీద దృష్టిపెట్టి..కొద్దికాలంలోనే ప్రొఫైసర్లకు, తన తోటి పురుష విద్యార్థులకు అభిమాన సహచర విద్యార్థినిగా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఆ కాలేజీలో మహిళ హాస్ట్ల్ లేకపోయినా..తన కోసం కేటాయించిన ప్రత్యేక గదిలో ఉండి, చదువుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి.ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు దారితీసిన పరిస్థితి..ఆగస్టు 27, 1919 చెన్నైలో ఒక తెలుగుకుటుంబంలో జన్మించిన లలిత నాటి కాలంలోని సామాజిక పరిస్థితులన్నింటిని ధిక్కరించి చదువుకున్న తొలి మహిళ. 15 ఏళ్ల ప్రాయానికే వివాహం చేసుకుని 18 ఏళ్లకే వితంతువుగా మారింది. శ్యామల అనే కూతురుకి తల్లిగా మారింది. ఒక్కసారిగా నిశబ్దంలోకి తొంగి చూస్తున్న ఆమె జీవితాన్ని మార్చాలనుకున్నాడు ఆమె తండ్రి ఇంజనీర్, లెక్చరర్ అయిన ప్రొఫెసర్ అయ్యల సోమయాజుల సుబ్బారావు. ఆమె జీవితంలోకి వచ్చిన నష్టాన్ని పూరించలేకపోవచ్చు..ఏదో వ్యాపకంతో ఆమె జీవితం చిగురించేలా చేయాలని ఆశించారు. కేవలం విద్యతోనే ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొంది ధైర్యంగా మనగలదని ప్రగాఢంగా నమ్మారాయన. ఆ ఉద్దేశ్యంతోనే ఇంట్లోనే లలితకు గణితం, భౌతిక శాస్త్రాన్ని బోధించారాయన. ఆ తర్వాత గిండిలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహించారు. అయితే ఆ సమయంలో మహిళా హాస్టళ్లు లేవు, ప్రత్యేక సౌకర్యాలు లేవు. స్త్రీని చేర్చుకునే విద్యావిధానం కూడా లేదు. కానీ సుబ్బారావుగారు స్వయంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రెడ్డికి విజ్ఞప్తి చేసి లలితను 'స్పెషల్ కేసు'గా చేర్చుకునేలా ఒప్పించారు. ఆ ఒక్క మినహాయింపు చరిత్ర గతిని మార్చేసింది. అయితే లలిత తండ్రి నమ్మకాన్ని నిజం చేసేలా తన కోర్సులో రాణించింది, మంచి స్కిల్ సంపాదించుకుంది. అలా 1944 నాటికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలై..భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యిందామె. గ్రాడ్యుయేషన్ అనంతరం లలిత సిమ్లాలోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(సీఎస్ఓ)లో చేరారు. అక్కడ ఆమె దేశానికి కీలకమైన విద్యుత్ పరికరాలు సాంకేతికత భద్రతా ప్రమాణాలను నిర్ణయించే విధులను నిర్వర్తించేది. ఆ తర్వాత కలకత్తాలోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్(ఏఈఐ)లో విద్యుత్ కేంద్రాల కోసం విద్యుత్ జనరేటర్లు, రక్షణ రిలేను రూపొందించారు. అంతేగాదు దేశ పురోగతికి శక్తినిచ్చే.. విద్యుత్గ్రిడ్కి సంబంధించిన సమర్థవంతమైన వ్యవస్థలో స్పెషలిస్ట్గా ఉన్నారు. నిశబ్దంగా ఉండే ఆమె ధోరణి వల్లే ప్రపంచానికి లలితా అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గురించి తెలియకుండాపోయింది. ఒక పక్క కూతురు శ్యామలను పెంచుతూనే ఇంజనీరింగ్ వృత్తిలో అంచలంచెలుగా రాణిస్తోందామె. ఆమెకు దక్కిన అసాధారణ గుర్తింపు..1964లో, న్యూయార్క్లో జరిగిన మొదటి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు, శాస్త్రవేత్తల సదస్సు(ICWES)లో లలిత భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ సదస్సులో ఆమె 35 దేశాల మార్గదర్శకులతో వేదికను పంచుకుంది. అంతలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విశేష ప్రతిభను కనబర్చిన ఆమె 1979లో మరణించారు. కానీ చరిత్ర ఆమె సాధించిన విజయాలను అంతగా గుర్తించలేదు. తొలి మహిళా ఇంజనీరింగ్గా ఎవరెవరో పేర్లను వినిపించేదే తప్ప వారందరికంటే..లలిత ఒక వితంతువుగా నాటి సామాజిక పరిస్థితులను చేధించుకుంటూ సాగిన వైనాన్ని గుర్తించకపోవడం బాధకరం.(చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..)
- 
      
                   
                                                       తెలంగాణ మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారంసాక్షి, హైదరాబాద్: రాజ్భవన్లో మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. అజహరుద్దీన్ కలిసి కేబినెట్లో 15 మంది మంత్రులు ఉన్నారు.కాగా, అజహరుద్దీన్కు ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనకు కీలకమైన పదవిని అప్పగిస్తారా లేక మైనారిటీ సంక్షేమ శాఖతో సరిపుచ్చుతారా అనే చర్చ జరుగుతోంది.ప్రమాణ స్వీకారం అనంతరం అజహరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ‘‘నన్ను మంత్రిగా చూసినందుకు నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు చాలా సంతోషపడుతున్నారు. నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రికి, రాష్ట్ర పార్టీ నాయకులకు కృతజ్ఞతలు. నేను ప్రత్యేకమైన వ్యక్తిని... నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిజం కావు. నా గురించి కిషన్ రెడ్డికి పూర్తిస్థాయిలో అవగాహన లేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు సరైనవి కావు. నా తక్షణ కర్తవ్యం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం’’ అని అజహరుద్దీన్ పేర్కొన్నారు.
- 
      
                   
                                                       భారత హాకీ దిగ్గజం కన్నుమూతభారత హాకీ దిగ్గజం మాన్యుయేల్ ఫ్రెడెరిక్ (Manuel Frederick- 78)కన్నుమూశారు. క్యాన్సర్తో పోరాడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.మొట్టమొదటి క్రీడాకారుడుకాగా కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన చెందిన ఫ్రెడెరిక్ రాష్ట్రం తరఫున ఒలింపిక్ పతకం గెలిచిన మొట్టమొదటి క్రీడాకారుడు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో భారత్ హాలాండ్ను ఓడించి కాంస్య పతకం గెలవడంలో ఆయన గోల్కీపర్గా తన వంతు పాత్ర పోషించారు.ధ్యాన్ చంద్ అవార్డుఅదే విధంగా.. నేషనల్ చాంపియన్స్ టైబ్రేకర్స్లో జట్టును 16 సార్లు విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించారు. భారత జట్టు తరఫున ఏడేళ్లపాటు హాకీ ఆడిన ఫ్రెడెరిక్ 2019లో ధ్యాన్ చంద్ అవార్డు అందుకున్నారు.కాగా ఫుట్బాల్ స్ట్రైకర్గా కెరీర్ ఆరంభించిన ఫ్రెడెరిక్.. ఆ తర్వాత హాకీ గోల్కీపర్గా నిలదొక్కుకున్నారు. అక్టోబరు 20, 1947లో జన్మించిన ఫ్రెడెరిక్ పదిహేడేళ్ల వయసులో బాంబే గోల్డ్ కప్ ఆడారు. 1971లో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఫ్రెడెరిక్.. క్యాన్సర్ బారిన పడి లోకాన్ని వీడారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇదీ చదవండి: ప్రాక్టీస్లో బంతి తగిలి... యువ క్రికెటర్ మృతి మెల్బోర్న్: ప్రాక్టీస్ సమయంలో బంతి బలంగా తగలడంతో... ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ మృతి చెందాడు. మెల్బోర్న్లో నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మెల్బోర్న్లో ఫెరన్ట్రీ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి అతడి మెడకు బలంగా తగిలింది. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా... వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ‘బెన్ ఆస్టిన్ మృతితో పూర్తిగా కుంగిపోయాము. దీని ప్రభావం మొత్తం క్రికెట్పై పడుతుంది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి’ అని క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాక్టీస్ సమయంలో బెన్ హెల్మెట్ ధరించినా... నెక్ గార్డ్ లేకపోవడంతోనే బంతి అతడి మెడ నరాలను దెబ్బతీసింది. 2014లోనూ ఆ్రస్టేలియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. న్యూ సౌత్ వేల్స్తో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ సందర్భంగా... సౌత్ ఆ్రస్టేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఫిలిప్ హ్యూగ్స్ 25 ఏళ్ల వయసులో బంతి చెవి దగ్గర బలంగా తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఇప్పుడు తాజా ఘటనతో మరోసారి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భాగంగా గురువారం భారత్, ఆసీస్ మధ్య సెమీఫైనల్ సందర్భంగా ప్లేయర్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. చదవండి: చిన్న పిల్లలా ఏడ్చేసిన హర్మన్ప్రీత్.. అంబరాన్నంటిన సంబరాలు.. వీడియో
- 
      
                   
                                                       కలల్ని అమ్ముకున్నారు.. ఇప్పుడు స్థానం లేదంటారా?అమెరికా ఉపాధ్యక్షుడు, ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్కు ఊహించని పరిణామం ఎదురైంది. వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారతీయ మూలాలున్న ఓ యువతి వాన్స్ ముఖం మీదే ఎండగట్టింది. అంతేకాదు.. ఆయన వ్యక్తిగత జీవితంపైనా ఆమె వేసిన ఓ ప్రశ్నతో ఆయన ఇబ్బందిపడినట్లు కనిపించారు. అమెరికాలోని మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ Turning Point USA అనే ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వాన్స్ ప్రసంగిస్తూ.. అమెరికాలో కఠినమైన వీసా పరిశీలన విధానానికి (strict vetting process) మద్దతు ప్రకటించారు. అమెరికాలోకి చట్టబద్ధంగా వచ్చే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో.. భారతీయ సంతతికి చెందిన ఓ యువతి మైక్ అందుకుంది. ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ‘‘మీరు ఇంతకాలం అమెరికా కలల్ని మాకు అమ్మారు, మా యవ్వనాన్ని, సంపదను ఖర్చు పెట్టించారు. అలాంటిది ఇప్పుడేమో ఎక్కువ మంది వస్తున్నారు.. వాళ్లను వెనక్కి పంపాలి అంటారా?.. మాకు ఇక్కడ స్థానం లేదంటారా?. మేము చట్టబద్ధంగా వచ్చాం, మీ నిబంధనలు పాటించాం. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి చెందనివాళ్లమంటారా?’’ అని వాన్స్ను నిలదీశారు. ఆ సమయంలో.. A brave young woman asks JD Vance: “When you talk about too many immigrants here, when did you guys decide that number? Why did you sell us a dream? You gave us the path and now tell us we don't belong here? Why do you have to be Christian to be American?” pic.twitter.com/mQ3CTAnN58— The Tennessee Holler (@TheTNHoller) October 30, 2025కొందరు చప్పట్లు చరుస్తూ ఆమెను అభినందించడం గమనార్హం. అయితే వాళ్లను వారిస్తూ ఆమె ఈ ప్రశ్నతో గొడవ చేయాలన్నది తన ఉద్దేశం కాదంటూ స్పష్టం చేశారు. దానికి వాన్స్ సమాధానం ఇవ్వలేదు. బదులుగా.. అత్యధిక ఇమ్మిగ్రేషన్ అమెరికా సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని.. కొంతమంది అక్రమ వలసదారులు దేశానికి మేలు చేశారని.. అంతమాత్రాన అందువల్ల లక్షల మందిని అనుమతించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. ఆ వెంటనే.. ఆ యువతి.. అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాల్సిందేనా? అని అడిగింది. దానికి వాన్స్ స్పందిస్తూ తాను మత బోధనను విశ్వసిస్తానని.. తన భార్య కూడా భవిష్యత్తులో అదే విశ్వాసాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే, ఆమెకు స్వేచ్ఛ ఉందని, అది తనకు సమస్య కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. వాన్స్ వైఖరిపై ఇండో అమెరికన్లు మండిపడుతున్నారు. హిందూ భార్యను కలిగి ఉండి, మతపరమైన మార్పును ఆశించడం ద్వంద్వ వైఖరేనంటూ పలువురు వ్యాఖ్యానించారు. వాన్స్ వివాహం వేద హిందూ సంప్రదాయంలో జరిగినదని కూడా కొందరు గుర్తు చేశారు. వాన్స్ను ప్రశ్నించిన ఆమె ఎవరన్నదానిపై ఇంకా స్పష్ట త రావాల్సి ఉంది.When JD Vance had hit his lowest, it was his “Hindu” wife and her Hindu upbringing that had helped him navigate through the tough times. Today in a position of power, her religion has become a liability. What a fall. What an epic fall for the man. pic.twitter.com/Zvz7bFQ0hZ— Monica Verma (@TrulyMonica) October 30, 2025
- 
      
                   
                                                       ఓటీటీలోకి ఫాంటసీ రొమాంటిక్ కామెడీ సినిమాతెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువ. తమిళ, మలయాళంలో మాత్రం చాలావరకు డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో మూవీస్ తీస్తుంటారు. దీంతో వీటిని మన ఆడియెన్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ ఫాంటసీ రొమాంటిక్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ముద్దు బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుందనే చూద్దాం.'పాపా', 'బ్లడీ బెగ్గర్' లాంటి డబ్బింగ్ మూవీస్తో తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో కవిన్. ఇతడి లేటెస్ట్ సినిమా 'కిస్'. ప్రీతి ఆస్రానీ హీరోయిన్. సెప్టెంబరు 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తమిళంలో మాత్రం దీన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్పై క్లారిటీ ఇచ్చేశారు. నవంబర్ 7 నుంచి జీ5లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నటిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చిన్న కూతురు)'కిస్' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో.. నెల్సన్(కవిన్) తల్లి దగ్గర పెరుగుతాడు. ప్రేమ, రొమాన్స్ లాంటివి ఇతడికి అస్సలు తెలీదు. ఓ రోజు అనుకోకుండా నెల్సన్ చేతికి ఓ పుస్తకం వస్తుంది. దీని ద్వారా అద్భుతమైన పవర్ వస్తుంది. ఎవరైనా ఇతడి ముందు ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తే వాళ్ల భవిష్యత్ ఏంటనేది ఇతడికి తెలిసిపోతుంది. అదే టైంలో తనకు బుక్ ఇచ్చిన సారా(ప్రీతి ఆస్రానీ) భవిష్యత్ ఏంటో నెల్సన్కి తెలుస్తుంది. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ప్రస్తుతానికి తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నప్పటికీ.. త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది. రొమాంటిక్ జానర్ మూవీస్ అంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి. ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి ఇడ్లీ కొట్టు, లోక ఛాప్టర్ 1, కాంతార ఛాప్టర్ 1 సినిమాలు వచ్చాయి. వీటితో పాటు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇవి కాకుండా తలవర అనే మలయాళ మూవీ కూడా బాగుంది. (ఇదీ చదవండి: బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్)
- 
      
                   
                                                       కోనసీమలో దారుణం.. బాలికపై జనసేన నేత అత్యాచారయత్నంసాక్షి, కోనసీమ జిల్లా: ఐ.పోలవరం మండలంలో దారుణం జరిగింది. బాలికపై జనసేన నాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. తమ కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ(బాబీ)పై జిల్లా ఎస్పీకి బాధితురాలి తల్లి ఫిర్యాదుర చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు గురిచేసేవాళ్లను చంపేయాలంటూని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
- 
      
                   
                                                       వ్యాపార ప్రకటనలో తొలిసారి నటించిన 'నందమూరి తేజస్విని'సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు, విశాఖపట్నం ఎంపీ భరత్ సతీమణి తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఓ జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మొదటిసారి ఆమె పనిచేశారు. ఈ క్రమంలో ఒక వీడియోను విడుదల చేశారు. కెమెరా ముందు ఆమె తొలిసారే కనిపించినప్పటికీ చాలా చక్కగా యాడ్లో ఒదిగిపోయారు. నిమిషం పైగానే నిడివి ఉన్న ఈ ప్రకటనలో అనుభవం ఉన్న నటిగా మెప్పించడం విశేషం.మొదటి నుంచి సినిమాలపై తేజస్విని ఆసక్తి చూపించేవారట! అందుకే ఆమె అఖండ 2 నిర్మాతగా పనిచేస్తున్నారు. ఆ పై తన తమ్ముడి మోక్షజ్ఞ చిత్రం కూడా ఆమె నిర్మాతగా లాంచ్ చేయనున్నారు. అయితే, ఇప్పుడు ఈ వాణిజ్య ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జ్యువెలర్స్ యాడ్కు దర్శకుడు వై.యమున కిషోర్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీకి తేజస్విని స్టెప్పులు అదుర్స్ అనేలా ఉన్నాయి.
- 
      
                   
                                                       స్వర్గం, నరకం అంతా మన లోపలే!ఒకానొకసారి, ఓ బలవంతుడైన వస్తాదు జ్ఞానం, ప్రశాంతతకు పేరుగాంచిన బౌద్ధ గురువు వద్దకు వచ్చాడు. ఆ వస్తాదు అంటే అందరికీ భయమే. అతని హృదయం కోపంతో గందరగోళంగా ఉండేది. చేస్తున్న పనుల పట్ల చిరాకూ పరాకూ పడుతుంటేవాడు. అతను సన్యాసి వద్దకు వచ్చీ రావడంతోనే తలవంచి నప్పటికీ అహంకారంతో అడిగాడు: ‘గురువుగారూ! నాకు స్వర్గం, నరకం గురించి బోధించాలి’. సన్యాసి అతని వైపు చూసి చిన్నగా నవ్వి, ‘నీకు వాటి గురించి చెప్పాలా? నీ మాటలో గర్వం కనిపిస్తోంది. నేను విడమరిచి చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు’ అన్నారు. ఆ మాటతో వస్తాదు కోపంతో ఊగిపోతూ, తన దగ్గరున్న కత్తిని తీసి ‘మీరన్న మాట నన్ను అవమానపరిచింది. నేను ఇప్పుడే మిమ్మల్ని చంపగలను’ అని అరిచాడు. సన్యాసి ఏమాత్రం కంగారు పడలేదు. అతని కళ్ళలోకి చూసి ప్రశాంతంగా చూస్తూ, ‘ఇదిగో ఈ నీ చర్యే నరకం’ అని చెప్పారు. వస్తాదు స్తంభించిపోయాడు. అతని కోపం కరిగిపోయింది. సిగ్గుపడ్డాడు. తన కత్తిని పక్కనపెట్టి సన్యాసి ముందు మోకరిల్లి, ‘క్షమించండి... నాకు వాస్తవాన్ని చిన్న మాటతో నేర్పించినందుకు ధన్యవాదాలు’ అని మృదువుగా అన్నాడు. సన్యాసి సున్నితంగా నవ్వి, ‘ఇదిగో ఇదే నువ్వడిగిన స్వర్గం’ అన్నారు. ఈ చిరుఘటన ధ్యానం సారాంశాన్ని చెబుతోంది. ధ్యానం జీవితం నుండి తప్పించుకోవడం గురించినది కాదు, అది మన అంతర్గత ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడం గురించి చెప్పేది. ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు, భావోద్వేగాలు సముద్రంలో అలల వలె పైకి ఎగరడం, కింద పడటం అనుభవంలోకి రావడం గమనిస్తాం. అప్పుడు ఆందోళనపడటం మానేసి, దాని కింద ఉన్న ప్రశాంతతను చూస్తాం. అందుకే బుద్ధుడంటాడు: ‘శాంతి లోపలినుండి వస్తుంది. బయట దానిని వెతక్కండి’ అని! -యామిజాల జగదీశ్
- 
      
                   
                                                       హైదరాబాద్లో ఎదుగుతున్న ఈ కంపెనీలు బెస్ట్: లింక్డ్ఇన్ లిస్ట్హైదరాబాద్: అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ హైదరాబాద్లో 2025 గానూ టాప్ స్టార్టప్ల జాబితాను విడుదల చేసింది. కెరీర్లు వృద్ధి చెందగల, అభివృద్ధి చెందుతున్న కంపెనీల వార్షిక ర్యాంకింగ్ ఇది. ఉద్యోగుల ఎదుగుదల, అనుసంధానిత ఆసక్తి, ఉద్యోగ ఆసక్తి , అగ్రశ్రేణి ప్రతిభావంతుల ఆకర్షణపై ప్రత్యేకమైన లింక్డ్ఇన్ డేటా ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.ఏరోస్పేస్ మార్గదర్శి స్కైరూట్ ఏరోస్పేస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా ఆ తరువాత రీసైక్లింగ్ ప్లాట్ఫామ్ రీసైకల్, సాస్ సంస్థ స్వైప్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టాప్ 10 జాబితాలో ఈసారి ఏడు సంస్థలు కొత్తగా ప్రవేశించాయి. వైవిధ్యమైన ఆవిష్కరణ కేంద్రంగా హైదరాబాద్ ఎంత వేగంగా ఎదుగుతోందో ఈ జాబితాను బట్టి తెలుస్తోంది.హైదరాబాద్లో 2025 టాప్ స్టార్టప్లు ఇవే..ర్యాంక్స్టార్టప్ పేరు1స్కైరూట్ ఏరోస్పేస్2రీసైకిల్3స్వైప్4జెహ్ ఏరోస్పేస్5విజెన్ లైఫ్ సైన్సెస్6క్రెడ్జెనిక్స్7ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్8భాంజు9లిక్విడ్నిట్రో గేమ్స్10కోస్కూల్లింక్డ్ఇన్ లిస్ట్లోని టాప్ స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగం ఎలా పొందాలో లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్ , లింక్డ్ఇన్ ఇండియా న్యూస్ సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరాజిత బెనర్జీ అందిస్తోన్న కొన్ని చిట్కాలు..ఏ కంపెనీలు ఉద్యోగాలిస్తున్నాయని మాత్రమే కాకుండా.. స్టార్టప్ల విస్తరణను కూడా ట్రాక్ చేయాలి. ఎందుకంటే రెండేళ్లలోనే 14 కొత్త సంస్థలు జాతీయ స్థాయికి ఎదిగాయి. దీన్ని ఉద్యోగ బోర్డులలో చూడలేరు. ముందుగానే ఊపును గుర్తించడానికి నిధులు, ఉత్పత్తి ఆవిష్కరణలు, మార్కెట్ విస్తరణను గమనించాలి.భవిష్యత్ ఎంట్రాప్రెన్యూర్షిష్కు అవకాశాలను అంచనా వేయాలి. అధిక-వృద్ధి చెందుతున్న స్టార్టప్లలో నాయకత్వం మీ వృద్ధిని టైటిల్ కంటే ఎక్కువగా నిర్దేశిస్తుంది. ఎంట్రాప్రెన్యూర్లు టీమ్స్ను ఎలా నిర్మిస్తారు.. కమ్యూనికేట్ చేస్తారు.. ప్రతిభను నిలుపుకుంటారు అని చూడటానికి లింక్డ్ఇన్ని ఉపయోగించండి. హైప్ కంటే నమ్మకం, స్పష్టత ముఖ్యమైనవి.కేవలం ఆవిష్కరణలతో కాకుండా క్రమశిక్షణతో కూడిన వ్యాపార నమూనాల కోసం చూడాలి. ఈ సంవత్సరం అగ్రశ్రేణి స్టార్టప్లు ఆవిష్కరణలను అమలుతో జత చేయడం ద్వారా విజయాన్ని అందుకుంటున్నాయి. క్విక్ కామర్స్ కొత్త వర్గాలలోకి ప్రవేశిస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నాయి. ఫిన్టెక్ రంగం మరింత అభివృద్ధి చెందుతోంది.సమస్యా పరిష్కారాలకు ప్రాధాన్యత ఉన్న రంగాలు, సంస్థల దృష్టి సారించాలి. ఈ సంవత్సరం అగ్రశ్రేణి స్టార్టప్లు ప్రాబ్లమ్ సొల్యూషన్స్పైనే దృష్టి సారించి ముందుకెళ్తున్నాయి. ఆ కంపెనీలు నిమగ్నమై ఉన్న సమస్యను మీరు అర్థం చేసుకుంటే, ఎల్లప్పుడూ రిలేటెడ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
- 
      
                   
                                                       గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణంసాక్షి, నెల్లూరు జిల్లా: గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ వార్డులో ఈ ఘటన జరిగింది. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత లోపం బయటపడింది. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- 
      
                   
                                                       బిగ్బాస్ తనూజపై యష్మి, శ్రీ సత్య ట్రోలింగ్ (వీడియో)బిగ్బాస్ తెలుగు సీజన్-9 ఇప్పటికే 50రోజులు పూర్తి చేసుకుంది. దీంతో సీజన్ విజేత ఎవరు అంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు లేడీ కంటెండర్ ఎవరూ విన్నర్ కాలేదు. కానీ, ఓటీటీ సీజన్లో బిందు మాధవి మాత్రమే విజేతగా నిలిచింది. అయితే, ఈసారి కన్నడ బ్యూటీ తనూజ ట్రోఫీ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి పలు ఓటింగ్ వేదికలలో తనే టాప్లో ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం హౌస్లో ఉన్నవారిలో తనూజ బెటర్ అంటూ చాలామంది బిగ్బాస్ ఫాలోవర్స్ చెప్పడం విశేషం. ఎమోషన్స్, టాస్కులు, ఎక్స్ప్రెషన్స్, ఇతరులతో కన్విన్సింగ్గా మాట్లాడటం వంటి అంశాల్లో ఆమె తనదైన ముద్ర వేస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమె ఆట తీరు నచ్చని వారి నుంచి నెగెటివ్ కూడా సోషల్మీడియాలో కొనసాగుతుంది. ఇలా రెండు కోణాల్లో తనూజ విన్నింగ్పై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఏకంగా బిగ్బాస్ టీమ్ కూడా ఆమె పట్ల సానుకూలంగా ఉన్నారంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే, ఈ కామెంట్లు ప్రతి సీజన్లో వస్తూనే ఉంటాయి. విన్నింగ్ రేసులో ఉన్న వారితో పాటు బిగ్బాస్ టీమ్పై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రతిసారి చూసిందే.తనూజపై ట్రోలింగ్కు దిగిన యష్మి, శ్రీ సత్యతాజాగా తనూజపై పాత కంటెస్టెంట్స్ ట్రోలింగ్కు దిగారు. ఒక వీడియోను తమ ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. బిగ్బాస్ సీజన్-8 కంటెస్టెంట్ యష్మి గౌడ, సీజన్-6లో పాల్గొన్న శ్రీ సత్య స్విమ్మింగ్ ఫూల్లో ఉంటూ తనూజపై పరోక్షంగా ట్రోలింగ్కు దిగారు. వారిద్దరూ తనూజను టార్గెట్ చేస్తున్నారని రెగ్యూలర్గా బిగ్బాస్ చూసే వాళ్లకు సులభంగా అర్థం అవుతుందని చెప్పవచ్చు. లాస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా మర్యాద మనీష్ హౌస్లోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో కల్యాణ్ను నామినేట్ చేసి హెచ్చరిస్తాడు. 'ముద్దుగా మాటలు చెప్పి మందార పూలు పెడుతున్నారు' అంటూ పరోక్షంగా తనూజతో జాగ్రత్త అనేలా హింట్ ఇస్తాడు. ఇప్పుడు ఇదే పాయింట్తో యష్మి గౌడ ఇలా ట్రోలింగ్ మొదలు పెట్టింది. 'అరేయ్.. ఏంట్రా నువ్వు ముద్దు మాటలు చెప్పి చెవిలో మందారం పువ్వులు పెడుతున్నావ్.. నాకు దెబ్బలు తగిలాయి ఫ్రెండ్స్.. ఇదీ (శ్రీ సత్య) ముద్దు ముద్దు మాటలు చెప్పి నా చెవిలో మందార పువ్వులు పెడుతుంది.' అంటూ ఇద్దరూ కలిసి ఒక వీడియో క్రియేట్ చేసి వదిలారు. గతంలో కూడా ఆమె పరోక్షంగా తనూజపై పోస్టులు పెట్టింది. కేవలం పీఆర్ టీమ్ వల్లే తన ఆట కొనసాగుతుంది అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు ఇలా ఏకంగా వీడియో షేర్ చేసింది.S7 #Nikhil mida Soniya vachi blame Veste Enjoy chesav ga niku #Thanuja la stand teeskune ammayi lu endku Nachutaru le #Yashmi 👎🏼😡. Cheap #BiggBossTelugu9 https://t.co/WOcl6esgvl— k®!t|=|i v€®m@ (@Priyaskp77777) October 30, 2025 View this post on Instagram A post shared by Y A S H M I G O W D A (@yashmigowda)
- 
      
                   
                                                       బాహుబలి ఎపిక్లో కొత్త సీన్.. అదిరిపోయిందయ్యా!రాజమౌళి సృష్టించిన కళాఖండం బాహుబలి (Baahubali Movie) వచ్చి పదేళ్లవుతోంది. ఇప్పటికీ దాని క్రేజ్ అలాగే ఉంది. సినిమా ఇండస్ట్రీ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించుకున్న బాహుబలి మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. బాహుబలి రెండు భాగాలను కలిసి 'బాహుబలి: ది ఎపిక్ మూవీ' (Baahubali The Epic Movie)గా శుక్రవారం (అక్టోబర్ 31) రిలీజ్ చేశారు. ఇందులో కొన్ని సీన్లను, పాటల్ని ఎత్తేస్తే.. రెండు భాగాల్లోనూ చూడని కొన్ని కొత్త సీన్లను యాడ్ చేశారు.చచ్చినవాడు ఎలా వస్తాడు?అందులో మహేంద్ర బాహుబలి.. మాహిష్మతి రాజ్యంలో అడుగుపెట్టే సీన్ అద్భుతంగా ఉంది. అతడు చనిపోయాడంటూ బిజ్జలదేవ (నాజర్) చెప్పే డైలాగ్.. మీ అంతు చూడటానికి మళ్లీ వస్తున్నానంటూ బాహుబలి వచ్చే తీరు అదిరిపోయింది. ఆ సీన్లో ఏముందంటే.. బాహుబలి చేతిలో నుంచి తప్పించుకున్న ఓ సైనికుడు రాజ్యానికి వచ్చి.. బాహుబలి బతికే ఉన్నాడంటూ బిజ్జలదేవకి చెబుతాడు. చచ్చినవాడు ఎలా వస్తాడు? గూస్బంప్స్ తెప్పించే సీన్వాడి రక్తం కారికారి భూమిలోకి ఇంకిపోయింది, వాడి శరీరం మంటల్లో కాలి కాలి బూడిదైపోయింది.. వాడి ప్రాణం ప్రాణహిత నది ప్రవాహంలో కొట్టుకుపోయింది.. కాలిన బూడిద గాలిలో చెల్లాచెదురైపోయింది. వాడి ఆయువు అనంతవిశ్వంలో ఆవిరైపోయింది అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో బాహుబలి రాజ్యంలో అడుగుపెడతాడు. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని దేవసేన చెప్పే డైలాగ్తో ఈ సీన్ నెక్స్ట్ లెవల్కు వెళ్తుంది. థియేటర్లో ఈ సీన్ చూసేవారి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం! ఇంత మంచి సీన్ ఎలా వదిలేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమాప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు భాగాలుగా వచ్చింది. మొదటి భాగం 2015లో రిలీజవగా రెండో భాగం 2017లో విడుదలైంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. అనుష్క శెట్టి, రమ్య కృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించాడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ రెండు భాగాల సమ్మేళనమే బాహుబలి: ది ఎపిక్. అయితే ఇందులో కిచ్చా సుదీప్తో పాటు కొన్ని సీన్లను, పాటలను తొలగించారు. అయినప్పటికీ 3.45 గంటల నిడివితో బాహుబలి ఎపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Best scene asla😭🔥#BaahubaliTheEpic pic.twitter.com/La1K6L2HBk— Satyá (@TheMovieBufffff) October 30, 2025The Best Deleted scene ever now witnessed in theater....🙏#Prabhas#BahubaliTheEpic #SSRajamouli pic.twitter.com/k9RMat2vrW— rakeshMk (@rakeshM53243116) October 30, 2025Interview lo cheppadu rajamouli duration valla theesesam ani Super undi scene 💥💥💥#BahubaliTheEpic #Prabhas pic.twitter.com/VPNC7yTV0t— Adhe_Magiccu (@Ade_magiccu) October 30, 2025 చదవండి: ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూ
- 
      
                   
                                                       ఆమె ఒక అద్భుతం.. జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయి: భారత కెప్టెన్ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. నవీ ముంబైలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో పటిష్ట ఆస్ట్రేలియా (IND vs AUS)పై చారిత్రాత్మక విజయంతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందిస్తూ.. జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేసింది.ఇదొక అద్బుతమైన భావనఆసీస్పై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా గర్వంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నా. చాలా ఏళ్లుగా మేము ఎంతో కష్టపడి ఇక్కడి దాకా చేరుకున్నాం. ఇదొక అద్బుతమైన భావన.ఈ టోర్నమెంట్ ఆరంభంలోనే మేము కొన్ని తప్పులు చేశాం. వాటిని సరిదిద్దుకుని ఈరోజు గెలిచి నిలిచాం. ఆఖరి వరకు మ్యాచ్ తీసుకురాకుండా.. ఇంకాస్త ముందుగానే మ్యాచ్ ముగిస్తే బాగుండనిపించింది. కానీ అలా తొందరపాటు చర్యలకు పాల్పడితే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితాన్ని మాకు అనుకూలంగా మార్చుకున్నాం’’ అని హర్మన్ప్రీత్ కౌర్ సంతృప్తి వ్యక్తం చేసింది.జెమీమా మాటలు ఆశ్చర్యపరిచాయిఇక సెంచరీ హీరో జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) గురించి ప్రస్తావన రాగా.. ‘‘జట్టు కోసం తాపత్రయపడే ప్లేయర్లలో జెమీమా ముందుంటుంది. బాధ్యత తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడదు. ఈరోజు తను అత్యంత ప్రత్యేకమైన నాక్ ఆడింది.పిచ్పై మేమిద్దరం ఆటను ఆస్వాదించాము. కలిసి బ్యాటింగ్ చేస్తున్నపుడల్లా ఒకరికొకరం మద్దతుగా ఉంటూ.. సమీకరణల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. ఈరోజు కూడా జెమీమా అన్నీ లెక్కలు వేసుకుంటూ నన్ను అప్రమత్తం చేస్తూనే ఉంది.‘ఐదు పరుగులు వచ్చాయి.. ఇంకో రెండే బంతులు మిగిలి ఉన్నాయి’ అంటూ ఇలా ప్రతీది కచ్చితంగా గుర్తుపెట్టుకుని నాతో చెబుతూ ఉంది. ఆట, జట్టు పట్ల తనకు ఉన్న అంకిత భావానికి ఇది నిదర్శనం.తనతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. జెమీమా ఆలోచనా తీరు, అద్భుత ఆట తీరును చూసి నేను ఆశ్చర్యపోయా. నన్ను కూడా ముందుకు నడిపించాలనే సంకల్పంతో తను ఇన్పుట్స్ ఇచ్చిన తీరు అద్భుతం. ఈ విజయంలో క్రెడిట్ తనకే ఇచ్చి తీరాలి’’ అని హర్మన్ప్రీత్ కౌర్ ప్రశంసల జల్లు కురిపించింది.కీలక పోరులో గెలిచి ఫైనల్కుకాగా నవీ ముంబైలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా... భారత్ 48.3 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అజేయ శతకం (127)తో సత్తా చాటగా.. హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ (88 బంతుల్లో 89) ఆడింది. వీరి ద్దరు కలిసి 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫైనల్లో టీమిండియా నవీ ముంబై వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది.చదవండి: రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు: జెమీమాOh, captain, our captain! 🥹🫡🇮🇳#HarmanpreetKaur's heartfelt speech post the semi-finals triumph against Australia! 👏🏻WATCH CWC 25 FINAL 👉 #SAvIND | SUN, NOV 2, 2 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/TDgCwiYmk8— Star Sports (@StarSportsIndia) October 30, 2025
- 
      
                   
                                                       ఆధునిక భారతదేశ శిల్పి.. వైఎస్ జగన్ ట్వీట్సాక్షి, తాడేపల్లి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఆధునిక భారతదేశ శిల్పి అంటూ ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ‘‘సంస్థానాలను భారతదేశంలో కలపటంలో పటేల్ కృషి చేశారు. ఆయన చూపిన నిబద్ధత, దృఢమైన నిర్ణయాలు దేశానికి పునాదిగా మారాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartfelt tributes to the sculptor of modern India, Sardar Vallabhbhai Patel ji, on his birth anniversary.His unwavering commitment to the integration of princely states into India laid the foundation for a strong and resilient India.#NationalUnityDay#IronManOfIndia pic.twitter.com/EkgTdSSisA— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2025
- 
      
                   
                                                       కఠారీ దంపతుల కేసులో సంచలన తీర్పుసాక్షి, చిత్తూరు: మాజీ మేయర్ కఠారీ అనురాధ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఐదుగురిని దోషులుగా ఇదివరకే నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం మరణ శిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ హత్యోదంతాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.2015 నవంబరు 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో ప్రవేశించిన దుండగులు.. మేయర్ కఠారి అనురాధపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆపై పక్క గదిలో ఉన్న కఠారి మోహన్ను కత్తులతో నరికారు. తీవ్ర గాయాలతో మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఈ ఘటన. ఈ కేసులో.. తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్(ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్.శ్రీనివాసాచారి(ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాష్రెడ్డి అలియాస్ జయారెడ్డి(ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్(ఏ5)లు దోషులుగా తేలారు. దీంతో ఈ ఐదుగురికి ఇవాళ మరణశిక్ష విధించారు 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు. కఠారి మోహన్కు శ్రీరామ్ చంద్రశేఖర్(చింటూ) మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాల నేపథ్యంతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. పదేళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 122 మంది సాక్షులను విచారించారు. A 1 నిందితుడు చంద్ర శేఖర్ @చింటూ, A 2 నిందితుడు వెంకట చలపతి@ ములబాగల్ వెంకటేశ్, A 3 నిందితుడు జయ ప్రకాష్ రెడ్డి, A 4 నిందితుడు మంజునాథ్, A 5 నిందితుడు వెంకటేశ్@ గంగన్న పల్లి వెంకటేశ్. వీళ్లలో ఏ3, ఏ4గా ఉన్న జయప్రకాష్రెడ్డి, మంజునాథ్.. అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. తీర్పు నేపథ్యంలో చిత్తూరు పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టు లపై,వాట్సప్ మెసేజ్ పై ప్రత్యేక నిఘా ఉంచారు. హైకోర్టుకు వెళ్తాం: చింటూ తరపు లాయర్సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లోనే మరణశిక్ష అత్యంత అరుదుగా ఉందంటూ నిందితుల తరఫు లాయర్ విజయ్ చంద్రారెడ్డి అంటున్నారు. చిత్తూరు కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని మీడియాకు తెలిపారు. ‘‘కఠారి అనురాధ మోహన్ దంపతుల కేసులో 57 మందిని విచారించారు. ఐదుగురికి మరణశిక్ష విధించారు. నిందితులను చిత్తూరు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక జడ్జిమెంట్ లో చాలా అరుదుగా మాత్రమే మరణశిక్ష విధించారు. వాళ్ల జీవితాలను బాగు చేయాలని మాత్రమే వ్యాఖ్యానించింది. 90 రోజుల్లోపు హైకోర్టును వెళ్తాం. హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారాయన.
- 
      
                   
                                                       మాట మీద నిలబడటం కొందరికే సాధ్యం!తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహాభారతంలోని కర్ణుడి పాత్ర చాలా ఇష్టమట. చేతికి ఎముక లేనట్టుగా దానం చేసే లక్షణం కర్ణుడిది. మిత్రధర్మం కోసం ప్రాణత్యాగమూ చేసి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో కర్ణుడి పాత్ర అంత వాస్తవికమైంది కాదనే చెప్పాలి. పైగా రేవంత్ ఏ రాజకీయ ధుర్యోధనుడితో ప్రస్తుతం మిత్ర సంబంధం ఉందన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు. రాజకీయ నేతలు తమని తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు కానీ ఆయన మాదిరిగా మాటమీద నిలబడే వారు చాలా అరుదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా సీఎం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహకరించినందుకు సినీ కార్మికులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మరీ ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలో సినీ జూనియర్ ఆర్టిస్టులు వేలమంది నివసిస్తూంటారు. వారి ఓట్లు దక్కించుకునేందుకు రేవంత్ ఈ మాట అన్నారేమో మరి!. ఎందుకంటే కార్మికుల సమ్మె ఎప్పుడో పరిష్కారమైతే ఇప్పుడు సన్మాన సభ ఏమిటో?.. అయితే ఈ సందర్భంగా రేవంత్ ఇంకో హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఆదాయంలో ఇరవై శాతం చెల్లిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని ప్రకటించారు. ధరల పెంపు నిర్మాతలు, హీరోలకు ఆదాయం తెస్తుందని, కార్మికులకు దక్కేది ఏమీ ఉండదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చెవులకు ఈ హామీ వినసొంపుగా ఉండొచ్చు. కానీ అది ఆచరణ సాధ్యమా?.. ఎందుకంటే... ప్రతి సినిమాకూ ఓ సంక్షేమ నిధి అంటూ ఏదీ ఉండదు. అందరికీ కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఎంతివ్వాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడొచ్చు. రేవంత్ మాట్లాడుతూ.. నిజమే కానీ టిక్కెట్ ధరలు అన్ని సినిమాలకూ పెరగవు. టిక్కెట్ ధరలు పెంచిన తరువాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలి? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టిక్కెట్ రేట్ పెంచిన వెంటనే అందులో 20 శాతం వేరుచేసి కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా?అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనపై నిర్మాతలతో చర్చించి ఆ తరువాత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.కొంతకాలం క్రితం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి, ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. హీరో అల్లు అర్జున్ జైలు పాలయ్యారు కూడా. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత షరా మామూలే. యధావిధిగా బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. బీజేపీ కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా సినిమా బెనిఫిట్ షోతోపాటు టిక్కెట్ రేట్ల పెంపునకూ ఓకే అన్నారు. గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి!. రేవంత్కు కర్ణుడి పాత్ర నిజంగానే అంత ఇష్టమైతే ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇంకో సంగతి చెప్పాలి. దానగుణంలో గొప్పవాడైన కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్న సంగతి మర్చిపోరాదు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడికి అనుయాయిగా కర్ణుడు కూడా అపకీర్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి. సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు.ఆలోచన బాగానే ఉంది కాని అందుకు అవసరమైన మూడు నాలుగెకరాల స్థలం ఈ మహానగరంలో ఎక్కడి నుంచి తెస్తారు? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు. కాని,కార్మిక సంఘాలు ఎలా వెదుకుతాయో చెప్పలేము. హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకు వచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలన్న ఆకాంక్ష కూడా మెచ్చుకోతగ్గదే. అయితే.. చంద్రబాబుతోపాటు రేవంత్ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న మీడియా సంస్థకు సొంతంగా ఒక స్టూడియో ఇప్పటికే ఉంది. దీనికి పోటీగా మరిన్ని వస్తాయంటే వారు ఊరకుంటారా? అయితే రామోజీ ఫిలిం సిటీకే హాలీవుడ్ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో పరిశ్రమ అభివృద్దికి వ్యూహారచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా, ఇంతకుముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా.. గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు?ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలను చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరగడం!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
- 
      
                   
                                                       అమెజాన్లో రూ. 2 లక్షల ఫోన్ ఆర్డర్ : పార్సిల్ చూసి టెకీ షాక్ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటున్న వారికి షాకింగ్ న్యూస్. దీపావళి సందర్భంగా బెంగళూరు టెక్నీషియన్కు ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. దాదాపు రెండు లక్షల రూపాయల స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి ( టైల్స్) వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా రూ.1.87 లక్షల విలువచేసే తనకెంతో ఇష్టమైన శామ్సంగ్ స్మార్ట్ఫోన్ను ఆర్డర్ చేశాడు బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమానంద్. దీపావళి నాటికి ఫోన్ తన చేతిలో ఉండేలా అక్టోబర్ 14న అమెజాన్ యాప్లో స్మార్ట్ఫోన్ కోసం ఆర్డర్ ఆర్డర్ పెట్టాడు. క్రెడిట్ కార్డ్ ద్వారా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు. ఇక ఎపుడు డెలివరీ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూశాడు. తనకిష్టమైన ఫోన్రాలేదు సరికదా రాయి వెక్కిరించింది. అయితే అదృష్టం ఏమిటంటే అక్టోబర్ 19న డెలివరీ అయిన సీల్డ్ ప్యాకేజీని అన్బాక్స్ చేస్తున్న వీడియోను అతను రికార్డ్ చేశాడు. దీంతో అమెజాన్ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించింది.అలాగే దీనిపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేశాడు మరియు తరువాత అధికారిక ఫిర్యాదు నమోదు చేయడానికి కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. FIR నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. "నేను రూ. 1.87 లక్షల విలువైన Samsung Galaxy Z Fold 7ని ఆర్డర్ చేశాను, కానీ నాకు షాక్ ఇచ్చేలా, దీపావళికి ఒక రోజు ముందు ఫోన్కు బదులుగా పాలరాయి రాయి వచ్చింది. దీంతో నా పండుగ ఉత్సాహం అంతా నాశనమైపోయింది. ఆన్లైన్లో, ముఖ్యంగా అమెజాన్లో షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ అనుభవం తీవ్ర నిరాశపరిచింది" అని ప్రేమానంద్ తన అనుభవాన్ని షేర్ చేశాడు.ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!
- 
      
                   
                                                       యోగ కోచ్గా ఐఐటీయన్..!ఐఐటియన్గా పెద్ద కలలు, ఖరీదైన కలలేవీ కనలేదు సౌరభ్. ‘మార్పు తెచ్చే శక్తి యోగాలో ఉంది’ అని గ్రహించిన ఈ కుర్రాడు దేశవ్యాప్తంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నాడు. ‘హబిల్డ్’ గ్లోబల్ మూమెంట్ ప్లాట్ఫామ్ ప్రారంభించాడు. ఈ విశ్వవేదికలో 169 దేశాల నుంచి 1.2 కోట్ల మంది యోగాభ్యాసకులుఉన్నారు. ఇక వరల్డ్ రికార్డ్లు సరే సరి... ‘ఐఐటీ పూర్తి చేసి ఆరుసంవత్సరాలైనా సౌరభ్ ఏమీ సంపాదించలేదు’ అని కొద్దిమంది అనుకునేవారు. వారికి తెలియని విషయం ఏమిటంటే సౌరభ్ చాలా సంపాదించాడు. ఎంతో పేరు! ఎన్నో రికార్డ్లు!! మహారాష్ట్రలోని ధనజ్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు సౌరభ్. అతడి పూర్వీకులు రాజస్థాన్కు చెందిన వారు. తాత లక్ష్మీచంద్ 1955లో యంబీబీయస్ పూర్తి చేశాడు. బాగా డబ్బులు సంపాదించాలి, లగ్జరీగా బతకాలి, పట్టణాలలో మాత్రమే ఉండాలి అనుకోలేదు. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రోడ్లు కూడా సరిగ్గా లేని మారుమూల గ్రామంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. వైద్యుడిగా సేవలందించడమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఎంతో చేశాడు లక్ష్మీచంద్. చిన్నప్పటి నుంచి తాత గురించి ఎన్నో మంచి విషయాలు విన్నాడు సౌరభ్. అలా తనకు తెలియకుండానే తాత స్ఫూర్తిగా మారాడు. స్వామి వివేకానంద బోధనలు కూడా సౌరభ్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఉద్యోగం కాదు. సమాజం కోసం ఏదైనా చేయాలి’ అనుకున్నాడు. కాలేజి రోజుల్లో ఒకసారి బెనారస్ నుంచి నాగ్పూర్కు ప్రయాణిస్తున్న సౌరభ్కు ఒక ధ్యానకేంద్రానికి చెందిన సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారితో పరిచయం తన జీవనగమనాన్ని మార్చింది. యోగాపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. వారు నిర్వహించే ధ్యాన, యోగ తరగతులకు హాజరయ్యేవాడు. యోగ తరగతులకు హాజరుకావడం టర్నింగ్ పాయింట్గా మారింది. క్రమం తప్పకుండా ధ్యానం, యోగా చేసేవాడు. దీనివల్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్తమ సమస్య ఉపశమనం దొరికినట్లయింది.యోగాలో ప్రావీణ్యం సాధించిన సౌరభ్ ఆ విద్యను వీలైనంత ఎక్కువ మందికి నేర్పించాలనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించాడు. దేశం నలుమూలలా తిరుగుతూ ఎంతోమందికి యోగా నేర్పించాడు. ‘యోగా బోధించడం కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగాను. ఆ సమయంలో నా సంతోషం మాటలకు అందనిది. ప్రతిరోజూ కొత్తగా, ఉత్సాహంగా ఉండేది. రోజూ నిద్ర లేవగానే ఈరోజు క్లాస్లో ఎలా బోధించాలి అనేదాని గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజూ పండగ జరుపుకున్నంత ఉత్సాహంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సౌరభ్.కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా యోగా ఆన్లైన్ క్లాస్లు ప్రారంభించాడు. అయితే మొదట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఆన్లైన్ క్లాస్లకు హాజరయ్యేవారు. తాను నిర్వహించే తరగతులు ఉచితం కాబట్టి వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదని గ్రహించిన సౌరభ్ తన ఆన్లైన్ క్లాస్లకు నెలకు వంద రూపాయలు ఫీజుగా పెట్టాడు.ముగ్గురితో మొదలైన ఆన్లైన్ క్లాస్ విద్యార్థుల సంఖ్య వందకు చేరింది. ఆ తరువాత దేశదేశాలకు విస్తరించి, విద్యార్థుల సంఖ్య లక్షలు దాటింది. తాను నిర్వహించే ఆన్లైన్ తరతులకు ముగ్గురు మాత్రమే హాజరైనప్పుడు సౌరభ్ నిరాశకు గురికాలేదు. ఘనమైన రికార్డ్లు నెలకొల్పినప్పుడు అహంతో ప్రవర్తించడం లేదు. యోగా నేర్పిన సమ్యక్ దృష్టితోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.వావ్ అనిపించే వరల్డ్ రికార్డులుయూట్యూబ్లో యోగా లైవ్ స్ట్రీమ్ను అత్యధికంగా వీక్షించిన ప్లాట్ఫామ్గా హబిల్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. అదే సంవత్సరం ఈ ప్లాట్ఫామ్ రెండు వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించింది. అందులో ఒకటి...ఒకేరోజులో చాలామంది లైవ్ వ్యూయర్స్కు సంబంధించింది, రెండోది లార్జెస్ట్ వర్చువల్ మెడిటేషన్ క్లాస్కు సంబంధించింది. మొదటి దానిలో 5,99,162 మంది, రెండో దానిలో 2,87,711 మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం 169 దేశాలకు చెందిన 7,52,074 మందితో వర్చువల్ యోగా సెషన్ నిర్వహించి మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు సౌరభ్. (చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..)
- 
      
                   
                                                       పసిడి ధరలు రివర్స్.. 22 క్యారెట్ల బంగారం ఏకంగా..పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుదలతో ఊగిసలాడుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Rate) ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. మరోవైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
- 
      
                   
                                                       శబరిమలలో దొంగిలించిన బంగారాన్ని అమ్మేశారు!పథనంతిట్ట: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కీలక ఆధారాలను సేకరించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి.. 476 గ్రాముల బంగారాన్ని అమ్మేసినట్లు దర్యాప్తులో వెల్లడించాడు. ఆ బంగారాన్ని 2019లోనే కర్ణాటకలో గోవర్ధన్ అనే వ్యాపారికి విక్రయించినట్లు వాంగ్మూలమిచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. 2019లో బంగారు తాపడాలకు మెరుగులు దిద్దే పనిలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే..! దీంతో కేరళ సర్కారుపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పినరయి విజయన్ సర్కారు ఈ అంశంపై దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ ప్రాథమిక దర్యాప్తులో ఉన్నికృష్ణన్ను ప్రధాన నిందితుడిగా తేల్చి, అరెస్టు చేసింది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న ఉన్నికృష్ణన్ను సిట్ అధికారులు కోర్టు అనుమతితో ఈ నెల 30వ తేదీ వరకు కస్టడీకి తీసుకుని, విచారించారు. ఈ క్రమంలో తొలుత 2 కిలోల బంగారం చోరీ అయినట్లు అనుమానాలు వ్యక్తమైనా.. తాజాగా ఉన్నికృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలంలో దొంగతనానికి గురైన బంగారం బరువును 476 గ్రాములుగా తేల్చారు. ఉన్నకృష్ణన్ కస్టడీ ముగియడంతో గురువారం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు. ఇక ట్రావెన్కోర్ బోర్డు సభ్యుల విచారణ ఉన్నికృష్ణన్ వాంగ్మూలం నేపథ్యంలో సిట్ అధికారులు ఇప్పుడు ట్రావెన్కోర్ దేవొస్వం బోర్డు(టీడీబీ) సభ్యులను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. 2019 నుంచి ఆరేళ్ల పాటు.. ఈ మోసాన్ని ఎందుకు గుర్తించలేదు? వ్యవస్థలో ఎక్కడ లోపముంది? ఉన్నికృష్ణన్కు ఇంటిదొంగల అండదండలున్నాయా? అనే కోణంపై బోర్డు సభ్యుల వాంగ్మూలాలు సేకరించనుంది. అంతేకాదు.. ఇప్పటికే 2019-25 మధ్యకాలంలో జరిగిన బోర్డు మీటింగ్లలో మినిట్స్ వివరాలను సిట్ స్వాధీనం చేసుకుంది. దాని ఆధారంగా బోర్డు సభ్యులను విడివిడిగా, కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంపన్న భక్తులతో ఉన్ని క్లోజ్ శబరిమలకు తరచూ బంగారం, నగదు వితరణ చేసే సంపన్న భక్తులతో ఉన్నికృష్ణన్ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని సిట్ గుర్తించింది. అతను బంగారంతోపాటు.. శబరిమలకు చెందిన భూముల వ్యవహారంలోనూ తలదూర్చినట్లు సిట్ నిగ్గుతేల్చింది. అక్రమ మార్గాల్లో సంపాదించిన మొత్తంతో ఉన్నికృష్ణన్ కేరళతోపాటు.. బెంగళూరు శివార్లలో తన పేరిట, బినామీల పేరిట భవనాలు, భూములను కొనుగోలు చేసినట్లు నిర్ధారించింది. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని సమాచారం.
- 
      
                   
                                                       తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలంసాక్షి, తిరుపతి: తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. సులభ్ కార్మికులు సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీటీడీ, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.
- 
      
                   
                                                       బీహార్ ఎన్డీయే మేనిఫెస్టో రిలీజ్పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఎన్డీయే కూటమి మేనిఫెస్టో(Bihar Election Manifesto) విడుదల చేసింది. కోటి ఉద్యోగాల హామీతో పాటు కోటి మంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే తమ లక్ష్యంగా అందులో ప్రకటించుకుంది. శుక్రవారం పాట్నాలోని మౌర్య హోటల్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్డీయే జాయింట్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నితీశ్కుమార్తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు సరిగ్గా వారం ఉంది(నవంబర్ 6న). ఈలోపు.. నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) వికసిత్ బీహార్ కోసం సంకల్ప పత్ర పేరిట ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వలస కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రంలో కోటి ఉద్యోగాల హామీ కీలక ప్రకటనగా మారే అవకాశం కల్పిస్తోంది. అలాగే.. మహిళా సాధికారత పేరిట లక్షపతి దీదీల హామీపైనా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు.. అధికారంలోకి మళ్లీ వస్తే, నైపుణ్య గణాంక సర్వే (Skill Census) నిర్వహిస్తామని హామీ చేర్చింది. యువతకు కోటి ఉద్యోగాల హామీకోటి మంది మహిళలను లక్షాధికారుల్నిచేసే లక్ష్యంతో లక్పతీ దీదీప్రతి జిల్లాలో కర్మాగార నిర్మాణంరైతులకు భరోసా పెంపు(రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంపు)మత్స్యకారుల సాయం డబుల్(రూ.9వేలు)వ్యవసాయ మౌలిక సదుపాయాల్లో లక్ష కోట్ల పెటటుబడిఎస్సీ విద్యార్థులకు రూ.2 వేల సాయంపాఠశాలలు పునరుద్ధరించడానికి నిధుల కేటాయింపుకేజీ టు పీజీ దాకా ఉచిత విద్య హామీస్కిల్ సెంటర్ల ఏర్పాటురైల్వే లైన్ల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు10 కొత్త పారిశ్రామిక పార్కుల నిర్మాణం.. ఇలా ఉన్నాయి ఇప్పటికే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విపక్ష మహాగట్బంధన్ (Mahagathbandhan) విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీహార్ కా తేజస్వి ప్రణ్ పత్ర (Bihar Ka Tejashwi Pran Patra) అనే టైటిల్తో ఆర్జేడీ నేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera) సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో.. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా కల్పిస్తామని ప్రకటించింది. కాంట్రాక్టు కార్మికులు, ఔట్సోర్సింగ్ వర్కర్లను పెర్మనెంట్ చేస్తామని, పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకువస్తామని తెలిపింది. రైతులు పండించిన పంటలన్నింటికీ కనీస మద్దతు ధర ఇస్తామని, మండీ, మార్కెట్ కమిటీలు పునరుద్ధరిస్తామని పేర్కొంది. జన్ స్వాస్థ్య సురక్ష యోజన కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని, జనాభాకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్ను పెంచుతామని హామీ ఇచ్చింది.
- 
      
                   
                                                       ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్లో పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించనుంది పుణేకి చెందిన రేసర్ డయానా పండోలె. ఈ ఛాంపియన్షిప్ నవంబర్లో మొదలవుతుంది. ఫెరారీ 296 చాలెంజ్ కారుతో దూసుకుపోనుంది. డయాన. ఫెరారీ 296 అనేది ఇటాలియన్ బ్రాండ్కు సంబంధించిన అత్యాధునిక, ట్రాక్–ఫోకస్ట్ మెషీన్.‘రేసింగ్’ అనేది డయానా ఎవరి నోటి నుంచో విన్న మాట కాదు. చిన్నప్పటి నుంచే రేసింగ్కు సంబంధించిన కబుర్లు ఇంట్లో వినేది. అమ్మా,నాన్నలకు రేసింగ్ అంటే ఇష్టం. కాలక్రమంలో వారి ఇష్టమే తన ఇష్టంగా మారింది.మొదట బైక్ నేర్చుకుంది. ఆ తరువాత కారు నడపడం నేర్చుకుంది. ఆ తరువాత రేస్ కార్లతో దూసుకుపోయేది. డయానాలో ఉత్సాహమే కాదు దానికి తగిన శక్తి,సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ను గెల్చుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది డయానా.పోటీలకు సంబంధించి పెళ్లికి ముందు ఉన్న ఉత్సాహం పెళ్లయిన తరువాత కొద్దిమందిలో కనిపించదు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 32 ఏళ్ల డయానాలో మునపటి ఉత్సాహం ఎంతమాత్రం తగ్గలేదు. తరగని ఆ ఉత్సాహమే గ్లోబల్ ఫెరారీ రేసింగ్ సిరీస్ పాల్గొంటున్న తొలి భారతీయ మహిళగా మరోసారి చరిత్ర సృష్టించేలా చేస్తోంది.(చదవండి: ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..)
- 
      
                   
                                                       ఏడ్చేసిన హర్మన్ప్రీత్.. అంబరాన్నంటిన సంబరాలు.. వీడియోఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్.. అమన్జోత్ కౌర్ (Amanjot Kaur) ఫోర్ బాది భారత్ విజయాన్ని ఖరారు చేయగానే సంబరాలు అంబరాన్నంటాయి.. పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి భారత్ వన్డే వరల్డ్కప్-2025 (WC 2025) ఫైనల్కు చేరగానే.. నవీ ముంబై జయహో భారత్ నినాదాలతో హోరెత్తిపోయింది.. జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగంఅమన్జోత్ సంతోషంలో మునిగిపోతే.. సెంచరీ హీరో జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగంతో నేలతల్లిని ముద్దాడింది.. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపింది.. భారత ప్లేయర్లంతా మైదానంలోకి దూసుకువచ్చి జెమీమాతో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.చిన్నపిల్లలా ఏడుస్తూఇక కీలక మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిసిన హర్మన్ప్రీత్ కౌర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డగౌట్లో కోచ్లు, ఆటగాళ్లను హత్తుకుంటూ హర్మన్ కన్నీటి పర్యంతమైంది.. భావోద్వేగాలను నియంత్రించుకోలేక చిన్నపిల్లలా ఏడుస్తూ సొంతగడ్డపై సాధించిన చారిత్రాత్మక విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ దృశ్యాలు చూసిన యావత్ భారతావని ఉద్వేగానికి లోనవుతూనే జయజయధ్వానాలు చేస్తోంది.. ‘న భూతో న భవిష్యతి’ అన్న చందంగా చాంపియన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళా జట్టును అభినందనలతో ముంచెత్తుతోంది.📽️ Raw reactions after an ecstatic win 🥹The #WomenInBlue celebrate a monumental victory and a record-breaking chase in Navi Mumbai 🥳Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwXt4 #TeamIndia | #INDvAUS pic.twitter.com/MSV9AMX4K1— BCCI Women (@BCCIWomen) October 31, 2025ఆసీస్ను ఓడించిఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్లో భారత్ మూడోసారి ఫైనల్కు చేరింది. నవీ ముంబై వేదికగా తాజా ఎడిషన్ రెండో సెమీ ఫైనల్లో ఆసీస్ను ఓడించి ఈ ఘనత సాధించింది. డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో గురువారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో కెప్టెన్, డేంజరస్ ఓపెనర్ అలీసా హేలీ (5)ను క్రాంతి గౌడ్ శుభారంభం అందించినా.. ఫోబీ లిచ్ఫీల్డ్, ఎలిస్ పెర్రీ భారత శిబిరానికి ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు మిగల్చలేదు. లిచ్ఫీల్డ్ శతక్కొట్టగా (119), పెర్రీ 77 పరుగులతో రాణించింది.ఆరో నంబర్ బ్యాటర్ ఆష్లే గార్డ్నర్ (45 బంతుల్లో 63) కూడా అర్ధ శతకంతో రాణించింది. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో ఆసీస్ 338 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లు షఫాలీ వర్మ (10), స్మృతి మంధాన (24) నిరాశపరిచారు.ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన జెమీమా అజేయ శతకం (127)తో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెకు తోడుగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (89) దంచికొట్టగా.. దీప్తి శర్మ (17 బంతుల్లో 24), రిచా ఘోష్ (16 బంతుల్లో 26) వేగంగా ఆడి విజయ సమీకరణాన్ని సులువు చేశారు.ఆఖర్లో అమన్జోత్ (8 బంతుల్లో 15) కూడా మెరుపులు మెరిపించింది. ఫలితంగా 48.3 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 341 పరుగులు చేసిన భారత్.. ఆసీస్పై ఐదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ విజయంతో ఫైనల్కు దూసుకువెళ్లింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం నాటి ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఇందుకు నవీ ముంబై వేదిక.చదవండి: Jemimah Rodrigues Emotional Video: రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదుTHIS IS WHAT IT MEANS! 💙🥹👉 3rd CWC final for India👉 Highest-ever run chase in WODIs👉 Ended Australia's 15-match winning streak in CWC#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/8laT3Mq25P— Star Sports (@StarSportsIndia) October 30, 2025
- 
      
                   
                                                       వెరీ సారీ... వారి దారి రహదారి కానే కాదు!అనగనగా దోల్ కోతర్ అనే గ్రామం ఉంది. మధ్యప్రదేశ్ సిది జిల్లాలోని ఈ గ్రామం సామాజిక మాధ్యమాలలో నవ్వులు పూయించడమే కాదు కోపంతో భగ్గుమనేలా చేస్తోంది. ఇంతకీ ఆ ఊళ్లో ఏం జరిగింది?ప్రధాన్మంత్రీ గ్రామ్ సడక్ యోజన ప్రాజెక్ట్లో భాగంగా గ్రామంలో కొత్తగా ఒక రోడ్డు నిర్మించాలనుకున్నారు. దారి మధ్యలో చేతి పంపు ఉంది. గ్రామ నీటి అవసరాలకు ఇదే ఆధారం.చేతి పంపును తీసేసి రోడ్డు నిర్మించడం సరికాదు అనుకున్న కాంట్రాక్టర్, ప్రత్యేక నిర్మాణంతో పంప్ను అలాగే ఉంచి, కొత్త రోడ్డు నిర్మించాడు.అయితే కథ సుఖాంతం కాలేదు. కాస్త సరదాగా చె΄్పాలంటే దుఃఖాంతం అయింది! గోతిలో హ్యాండ్ పంప్ ఉందని తెలియని వాహనదారులు అందులో పడి΄ోయి గాయాల ΄ాలవుతున్నారు. పిల్లలు ఆడుకుంటూ, ఆడుకుంటూ అందులో పడి΄ోతున్నారు.‘ఇదెక్కడి పంప్ రా బాబూ’ అని గ్రామ ప్రజలు నెత్తి, నోరు బాదుకుంటున్నారు. ఈ రోడ్డు పంప్ వ్యవహారం ఊరు దాటి, జిల్లా దాటి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. సురక్షితమైన మరో చోట హ్యాండ్ పంప్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. నెటిజనులు మాత్రం ‘రోడ్డు మధ్యలో ఉన్న దేశంలోని తొలి హ్యాండ్పంప్’ అని కామెంట్స్ పెడుతున్నారు! (చదవండి: ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..)
- 
      
                   
                                                       దివ్య, ఇమ్మూ అసలైన తోపులు.. ఓవర్ చేసిన శ్రీజ.. మరోసారి బైబై!హౌస్లో టెంపరరీ హౌస్మేట్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అప్పుడే పొగరు చూపిస్తోంది. షో మొదలైన మొదటి రెండు వారాలు తన యాటిట్యూడ్, అరుపులతో పరమ చెత్తగా అనిపించిన ఆమె ఎలిమినేషన్ ముందు మాత్రం మంచి పేరుతోనే బయటకు వచ్చేసింది. కానీ, బయట వస్తున్న సింపతీ, అభిమానం చూశాక గర్వం తలకెక్కింది. ఇంతకీ హౌస్లో ఏం జరిగిందో గురువారం (అక్టోబర్ 30వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..అన్నం మీద అలిగిన మాధురితనూజ ఏ ముహూర్తాన రేషన్ మేనేజర్ అయిందో కానీ కిచెన్లో ఒకటే గొడవలు.. ఈ సారి ఆ గొడవల్లో మాధురి బలైంది. అన్నం మీద అలిగి కూర్చుంది. తను తినకుండా ఉంటే భరణి (Bharani Shankar) చూసి తట్టుకోలేకపోయాడు. అతడే కాదు, సంజనా, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్.. ఇలా అందరూ తినమని బతిమాలారు. అందరూ పదేపదే అడిగేసరికి కాదనలేక తినేసింది. అలక తగ్గిపోయాక తనూజతో కలిసిపోయి తనకు జడేసింది.తనూజకి పొగరు: శ్రీజమధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూర కాస్త మిగిలింది, కావాలనుకున్నవాళ్లు రండని పిలిచింది తనూజ (Thanuja Puttaswamy). దీంతో సాయి సహా మరికొందరు వెళ్లి కూర వేసుకున్నారు. కాసేపటికి శ్రీజ.. కర్రీ ఉందా? అని అడగ్గా తనూజ స్పందించలేదు. దాంతో శ్రీజ.. నేను టెంపరరీ హౌస్మేట్ని అయినా అడిగినప్పుడు చెప్పండి, అంత యాటిట్యూడ్ అవసరం లేదు.. ఆమె(తనూజ)కు పొగరని ఇందుకే అన్నానంటూ ఫైర్ అయింది. ఇక్కడ పవన్.. తనూజకోసం స్టాండ్ తీసుకోవడం గమనార్హం!కల్యాణ్ను చిత్తు చేసిన ఇమ్మూఇక బిగ్బాస్.. కట్టు-పడగొట్టు టాస్క్ను రద్దు చేసి మరో గేమ్ ఇచ్చాడు. భరణి పరిస్థితి బాలేనందున అతడి కోసం దివ్య ఆడింది. శ్రీజ ఈ గేమ్లో అట్టర్ ఫ్లాప్ అవగా దివ్య అలవోకగా ఆడి గెలిచేసింది. మరో గేమ్లో శ్రీజ కోసం కల్యాణ్, భరణి కోసం రాము బరిలో దిగారు. ఇందులో కల్యాణ్ చకచకా ఆడి గెలిచేశాడు. తర్వాతిచ్చిన టాస్క్లో మాత్రం కల్యాణ్ చిత్తుగా ఓడిపోయాడు. భరణి కోసం ఆడిన ఇమ్మూ మరోసారి తన పవర్ చూపించాడు. ఇలా భరణి రెండు టాస్కులు గెలిచి ఆధిక్యంలో ఉన్నాడు.హర్టయిన పవన్అయితే శ్రీజ కోసం తాను ఆడతానన్నా తన పేరు లెక్కలోకి తీసుకోకపోవడంపై డిమాన్ పవన్ హర్టయ్యాడు. టాలెంట్, స్కిల్ ఉన్నా గుర్తించకపోతే బాధగా ఉంటుంది. ఈజీ గేమ్.. కల్యాణ్ ఆడలేకపోయాడు అని కామెంట్ చేశాడు. ఈ విషయంలో పవన్-శ్రీజకు గొడవ అయింది. తర్వాత కల్యాణ్.. గేమ్లో ఓడిపోయినందుకు శ్రీజకు సారీ చెప్పాడు. సారీ చెప్తే గూబ పగిలిపోద్ది.. అన్నీ మనమే గెలుస్తామా? అంటూ ఫ్రెండ్ను ఓదార్చింది. శ్రీజ రెండోసారి ఎలిమినేట్గతంలో నామినేషన్స్లో ఉన్నప్పుడు పవన్ సేవ్ చేయడం వల్లే శ్రీజ మరికొన్ని వారాలు హౌస్లో ఉంది. అతడే మొన్నటి టాస్క్లో దెబ్బలు తగిలించుకుని మరీ శ్రీజను గెలిపించాడు. అయినా పవన్ను పక్కనపెట్టడం ఏంటో ఆమెకే తెలియాలి! హౌస్లో ఆమె చేస్తున్న ఓవరాక్షన్ వల్ల ఓట్లు కూడా సరిగా పడలేదు. దీంతో ఆమె ఎలిమినేట్ అవగా భరణి హౌస్లో ఉండిపోయాడని తెలుస్తోంది.చదవండి: బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్
- 
      
                   
                                                       ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..నడిస్తే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప.. అని వైద్యులు పదే పదే చెవిన ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ తర్వాత శారీరక శ్రమ, ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వడానికి నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. మహమ్మారి సమయంలో ఎదురైన అనుభవాల రీత్యా.. వాకథాన్లపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో పార్కుల్లో వాకర్స్ మాత్రమే కాదు సుదూర ప్రాంతాలకు నడిచే వాకథానర్లు కూడా పెరుగుతున్నారు. వీరి కోసం పలు కార్పొరేట్ సంస్థలు వాకథాన్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా ఈ తరహా ఈవెంట్ల పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు.. ఏదో ఒక ఈవెంట్కు అనుగుణంగానో, సామాజిక కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసమో హైదరాబాద్ నగరంలో ఇటువంటి వాకథాన్లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ‘వాకథాన్లు’ – ‘వాకింగ్ మారథాన్ల’ సంక్షిప్త రూపం దేశవ్యాప్తంగా ఆరోగ్య ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫిట్నెస్, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన రీత్యా ‘వాకథాన్లు’ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాకథాన్లు నగర రోడ్లకే పరిమితం కాలేదు. చాముండి కొండలలోని అటవీ ట్రైల్స్, రాజస్థాన్లోని ఎడారి ప్రదేశాలతో సహా ప్రకృతి అందాల నడుమ ఇవి జరుగుతున్నాయి. సామాజిక ‘కారణాల’ కోసం నిధులను సమీకరించేందుకు నిర్వహించే వాకథాన్లు కూడా పెరిగాయి. ముంబైలో జరిగిన ‘చలో భారత్ వాకథాన్ 2025’లో 6,500 మందికి పైగా పాల్గొన్నారు. అవయవ దానం, రొమ్ము కేన్సర్ అవగాహన వన్యప్రాణుల సంరక్షణ వంటివి కూడా వాకథాన్లకు థీమ్స్గా మారుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘ఫిట్ ఇండియా‘ ఉద్యమం పెద్ద ఎత్తున వాకథాన్లను ప్రోత్సహించింది. గత 2020లో రాజస్థాన్లో 200కి.మీ ‘ఫిట్ ఇండియా వాకథాన్’ను నిర్వహించారు. వ్యవస్థలూ.. వ్యక్తిగతంగానూ.. వాకథాన్లు కార్పొరేట్ ప్రపంచాన్ని సైతం ఆకర్షించడం ప్రారంభించాయి. థ్రిల్ జోన్ వంటి ప్రత్యేక ఈవెంట్ నిర్వాహకులు టౌన్ స్క్రిప్ట్ వంటి ఈవెంట్–బుకింగ్ ప్లాట్ఫారమ్లు దేశవ్యాప్తంగా ఎండ్యూరెన్స్ వాకింగ్ ఈవెంట్లను సృష్టిస్తున్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశంలోని నగరాల్లో డజనుకు పైగా వాకథాన్లు జరుగుతున్నాయి. ‘మేం 2011–12లో బెంగళూరులో మా మొదటి ‘ట్రైల్వాకర్’ నిర్వహించినప్పుడు 320 మంది పాల్గొన్నారు. ప్రస్తుతం రెండు నగరాల్లో నిర్వహిస్తుంటే ప్రతి సంవత్సరం 1600 మందికి పైగా పాల్గొంటున్నారు’ అని ఆక్స్ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ చెప్పారు. మరోవైపు వ్యక్తిగతంగానూ రికార్డు స్థాయి నడకలతో గుర్తింపు పొందారు. కోయంబత్తూరుకు చెందిన నటరాజ్ 2021– 2023 మధ్య 798 రోజుల్లో 6,614 కి.మీ నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు. 2024లో పర్యావరణ అవగాహన పెంచడానికి విరాగ్ మధుమాలతి నవీ ముంబై నుంచి రాజస్థాన్ వరకూ 1,305 కి.మీ. నడిచి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కొంకణ్ ట్రయల్ నిర్వహిస్తున్నాం.. ‘గతంలో పలు మార్లు వాకథాన్, మారథాన్లలో పాల్గొన్న అనుభవం ఉంది. ప్రస్తుతం పుణె సమీపంలోని అందమైన గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, చెరువులు, వాగులు, వంకలు, ఘాట్లు.. ఇంకా అనేక ప్రకృతి సౌందర్యాల నడుమ కొంకణ్ ట్రయల్ వాకథాన్ నిర్వహిస్తున్నాం’ అని గ్రీన్ ట్రయిల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. తమ వాకథాన్ను నగరానికి పరిచయం చేసిన సందర్భంగా వీరు తమ ఈవెంట్ వివరాలు వెల్లడించారు. విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న వ్యాయామ, ఆరోగ్య ప్రియులమైన తామంతా కలిసి ఈ వేదికను స్థాపించామన్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనేవారు 100 కి.మీ దూరాన్ని 50 గంటల్లో, 50 కి.మీ దూరాన్ని 25 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. కనీసం ఇద్దరు నుంచి నలుగురు టీమ్గా పాల్గొంటారు. తమ వాకథాన్లో పాల్గొనేందుకు హైదరాబాద్తో పాటు బెంగళూర్, ముంబై, పుణె తదితర నగరాల నుంచి వాకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. బహుళ వాకథాన్లు.. బహుళ వాకథాన్లు చేసిన వారు 100 కి.మీ ట్రయల్ను పూర్తి చేయడానికి 32 గంటలకు పైగా సమయం గడుపుతారు. వారు ప్రతి 15–20 కి.మీ తర్వాత చిన్న విరామాలు తీసుకుంటూ నడుస్తారు. మొదటి 50 కి.మీలు పూర్తి చేసిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు ఒక దీర్ఘ విరామం తీసుకుంటారు. ఒక వ్యక్తి 100 కిలోమీటర్లు పూర్తి చేయడానికి కనీసం 1.5 లక్షల అడుగులు వేస్తాడు. చివరి 100 అడుగులు అత్యంత కష్టతరమైనదని వాక్థానర్లు అంటున్నారు. ఓపికకు పరీక్ష.. ‘వాకథాన్లు స్టామినాను, ఓపికను పరీక్షిస్తాయి.. మొదటి 10 కి.మీ. సరదాగా ఉంటుంది. కానీ తర్వాత నుంచి కష్టం మొదలవుతుంది’ అని వాకథాన్ ప్రియుడు ఇష్మీత్ సింగ్ చెప్పారు. ‘మారథాన్ 2–3 గంటల్లో ముగుస్తుందని ముందే తెలుస్తుంది. దానికి అనుగుణంగా శిక్షణ పొందినట్లయితే, దానిని పూర్తి చేయగలం. కానీ వాకథాన్ల కోసం చాలా దృఢసంకల్పం అవసరం’ అని సింగ్ అంటున్నారు. ఆయన తన చివరి 100 కి.మీ వాకథాన్ను 32 గంటల్లో పూర్తి చేశారు. వాకథాన్ శిక్షణలో భాగంగా రోజువారీ సెషన్లు, పోషకాహారం వంటివి సూచిస్తారు.. అమెచ్యూర్ వాకథానర్లు ఒకేసారి 25–30 కి.మీ లను కవర్ చేసే వారాంతపు నడకలతో ప్రారంభిస్తారు. వీరు నగర రోడ్లు, గ్రామ దారులు, పగలు, రాత్రి వేళల్లో, అలాగే అన్ని రకాల భూభాగాల్లో నడవడానికి అవకాశం పొందుతారు. ఇది గొప్ప అనుభవం అని వాకథానర్లు అంటున్నారు. (చదవండి: అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు)
- 
      
                   
                                                       పాక్.. ఖబడ్దార్తుర్కీయే(టర్కీ), ఖతార్ల మధ్యవర్తిత్వం ఫలించింది. కాల్పుల విరమణకు అఫ్గనిస్తాన్, పాకిస్తాన్లు అంగీకరించాయి. దీంతో ఇరు దేశాల సరిహద్దు ఉద్రిక్తతలకు తెర పడింది. ‘శాంతి కోసం ఇంకో అవకాశం..’ అంటూ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇటు తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం ఖరారు చేస్తూనే.. పాక్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాలిబాన్ తాత్కాలిక హోం మంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారు. తమ అంతర్గత సమస్యలను ఆఫ్గానిస్తాన్పై మోపే ప్రయత్నాలు చేస్తే, తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని పాక్కు ఆయన స్పష్టం చేశారు. ‘‘మీ సమస్య మీదే(తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ TTP సంస్థ కార్యకలాపాల గురించి). పరిష్కారం కూడా మీ వద్దే ఉంటుంది. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇందులో లాగుతున్నారు?.. .. ఒక దేశం తన ప్రయోజనాల కోసం మరో దేశ భూభాగాన్ని ఉల్లంఘించడం అనైతికం. మా సహనాన్ని పరీక్షిస్తే, మా ప్రతిస్పందన చాలా ఘాటుగా ఉంటుంది. ప్రపంచ సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్నాం. యుద్ధ భూమిలో అఫ్గన్లు తమ సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారు. అలాంటిది మళ్లీ పోరాడటంలో మాకు ఇబ్బంది లేదు” అని ఆయన అన్నారాయన.గత కొన్నివారాలుగా పాక్-అఫ్గన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాక్ తమ భూభాగంలో దాడులకు తెగబడుతోందని.. పౌరుల ప్రాణాలు తీస్తోందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించగా, అఫ్గన్ భూభాగంలో తలదాచుకున్న టీటీపీ ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా తాము దాడులు జరుపుతున్నామని పాక్ ప్రకటించుకుంది. ఈ క్రమంలో ఇరు వైపులా దాడులతో భారీగానే ప్రాణ నష్టం సంభవించింది. ఈ మధ్యలో తాత్కాలిక కాల్పుల విరమణ జరిగినా.. ఉల్లంఘనలు జరిగాయి. దీంతో ఖతార్, టర్కీ జోక్యం చేసుకుని ఇరుదేశాలకు ఓ ఒప్పందానికి తీసుకొచ్చాయి. నవంబర్ 6వ తేదీన ఇస్తాంబుల్ మరోమారు సమావేశమై ఒప్పందానికి తుదిరూపం దిద్దుతామని తుర్కీయే విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. గురువారం ప్రకటన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: టీటీపీ ఎలా పుట్టింది?.. ఆ ఒక్కడే పాక్ను ఎలా వణికిస్తున్నాడు?
- 
      
                   
                                                       ఎనిమిది పదుల వయసులో.. జాతీయ స్థాయి ఈత పోటీల్లో ప్రతిభఎనిమిది పదుల వయసులో ఎంతో చలాకీగా ఈత కొడుతూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. అంతేకాదు పదుల సంఖ్యలో పతకాలు సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయి ఈత పోటీల్లో తన ప్రతిభను చాటుతున్నాడు నగరంలోని కేపీహెచ్బీ కాలనీకి చెందిన లక్ష్మారెడ్డి. వ్యాయామం చేయడానికి కూడా బద్దకించే అనేక మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. – కూకట్పల్లి నగరంలోని కేపీహెచ్బీ కాలనీ ఫేజ్ –6లో నివాసముండే కే.లక్ష్మారెడ్డి(79) జాయతీ స్థాయి ఈత పోటీల్లో సత్తా చాటుతున్నాడు. ఎనిమిది పదుల వయసులోనూ ఇటీవల (అక్టోబర్–11,12) ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో 25, 50 మీటర్ల కేటగిరీలో రెండు ప్రథమ బహుమతులు సొంతం చేసుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. అదే పోటీల్లో 50, 100 మీటర్ల ఈత పోటీల్లోనూ రెండు ద్వితీయ పతకాలు, మిడ్లే పోటీలో ప్రథమ బహుమతి, రిలే పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించి వివిధ కేటగిరీల్లో ఒకే సారి ఏకంగా ఆరు పతకాలు కైవసం చేసుకున్నాడు. 65వ ఏట నుంచి.. లక్ష్మారెడ్డి తన 65వ ఏట నుంచి ఈత పోటీల్లో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్, నాందేడ్, కర్నూలు, కూకట్పల్లిలో నిర్వహించిన వివిధ కేటగిరిలో ఇప్పటికి 21 పతకాలను సాధించి, ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ యువతకు, తన తోటి వయసు వారికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆరోగ్యానికి నిత్యం సాధన.. ప్రతి రోజూ స్థానికంగా ఉండే స్విమ్మింగ్ పూల్లో ఈత ప్రాక్టీస్ చేస్తుంటారు. ముగ్గురు పిల్లలు ఉద్యోగాల రీత్యా ఒకరు విదేశాల్లో, మిగిలిన వారు బెంగళూరులో ఉంటున్నారు. భార్యతో పాటు కేపీహెచ్బీలో ఉంటూ స్థానికంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చుట్టుపక్కల ఆసక్తి కలిగిన పిల్లలకు కూడా ఈత నేర్పిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామాలు గానీ, లేదా ఈత గానీ సాధన చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మా రెడ్డి స్వస్థలం కృష్ణాజిల్లా, పెద ఓగిరాల. తన విజయాల గురించి చెబుతూ మిత్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ పోటీల్లో పాల్గొంటున్నానని వివరించారు.ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!
- 
      
                   
                                                       పంట పొలాలకు బాలీవుడ్ పాటలు వినిపిస్తాడు!మధ్యప్రదేశ్కు చెందిన యువ రైతు ఆకాష్ చౌరాసియ (Akash Chaurasia) ప్రతిరోజు ఉదయం తన ΄పొలానికి వెళతాడు. ‘వెళ్లి ఏం చేస్తాడు?’ అనే ప్రశ్నకు ‘ఇంకేమి చేస్తాడు. ΄ పొలం పనులు’ అంటే పప్పులో కాలేసినట్లే.అతడు వెళ్లేది పంట΄ పొలాలు, మొక్కలకు సంగీతం వినిపించడానికి!‘మనుషులే కాదు పంట పొలాలు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి. తద్వారా అవి ఆరోగ్యంగా ఉంటాయి’ అంటున్న ఆకాశ్ గత పది సంవత్సరాలుగా పంట పొలాలకు సంగీతం వినిపిస్తున్నాడు. కొత్త మొక్కలు నాటినప్పుడు స్పెషల్ మ్యూజికల్ థెరపీ సెషన్లు నిర్వహించడం అనేది మరో విశేషం.‘మొక్కల ఎదుగుదలపై సంగీతం సానుకూల ప్రభావం చూపుతుంది’ అంటున్నాడు ఆకాష్. ఆకాష్ మరో అడుగు ముందుకు వేసి ఆవులకు కూడా సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ‘ఆవులకు రోజూ సంగీతం వినిపించడం వల్ల గతంలో పోల్చితే అవి ఎక్కువ పాలు ఇస్తున్నాయి’ అని కూడా అంటున్నాడు. ఇదేదో బాగుంది కదూ..!ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!
- 
      
                   
                                                       రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు: జెమీమా కన్నీటి పర్యంతంనాలుగేళ్ల వయసులోనే ఆమె బ్యాట్ పట్టింది.. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది.. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది..కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటర్.. జట్టుకు అవసరమైన వేళ తన స్పిన్ మాయాజాలంతోనూ మెరవగలదు.. అంతర్జాతీయ స్థాయిలో జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ ఆమె ముందే ఉంటుంది..కానీ ఊహించని రీతిలో కొన్నాళ్ల క్రితం ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. కారణం ఎవరైనా.. ఆరోపణలు ఏవైనా కానీ.. జింఖానా క్లబ్లో ఆమెకున్న సభ్యత్వాన్ని రద్దు చేశారు.. ఆమె తండ్రి మతపరమైన సమావేశాలు పెట్టి ఆటగాళ్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో ఆమెను పక్కనపెట్టారు..దీంతో ఆమె డిప్రెషన్లో కూరుకుపోయింది.. క్రికెట్నే వదిలేద్దామా అన్నంతగా కుంగిపోయింది.. ఆ సమయంలో స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు.. థెరపీ తీసుకుని ముందుగా మైదానంలో బ్యాట్తో మళ్లీ మెరుపులు మెరిపించాలంటూ ప్రోత్సహించారు..ఆమె కోలుకుంది.. దేశం కోసం ఆడాలనే దృఢ సంకల్పానికి ఇలాంటి ఆరోపణల తాలుకు ప్రభావం అడ్డుకాకూడదని తనను తాను సముదాయించుకుంది.. మాతృభూమి కోసం అవాంతరాలను అధిగమించి ఈరోజు దేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.. ఆమే జెమీమా రోడ్రిగ్స్.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో వీరోచిత పోరాటంతో భారత్ను గెలిపించింది. భారీ లక్ష్యం, ముఖాముఖి రికార్డులు ఒత్తిడికి గురిచేస్తున్నా సొంత మైదానం (నవీ ముంబై)లో ప్రేక్షకుల మద్దతుతో ఆకాశమే హద్దుగా చెలరేగి.. తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.అజేయ శతకంతోఅనుకోని విధంగా వన్డౌన్లో బ్యాటింగ్ రావాల్సి వచ్చినా.. ఆత్మవిశ్వాసంతో క్రీజులో కుదురుకుని అజేయ శతకం బాదింది. 134 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత్కు ఫైనల్ బెర్తును ఖరారు చేసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది.ఈ క్రమంలో పాతికేళ్ల జెమీమా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. గత కొన్ని నెలలుగా ఆమె అనుభవించిన మానసిక క్షోభ ఇందుకు కారణం. మ్యాచ్ గెలవగానే తండ్రిని హత్తుకుని ఆమె ఏడ్చిన తీరు ఆమె వేదనకు అద్దం పట్టింది.Pure moments of joy! 💙 Tears, smiles, and family hugs. Jemimah’s match-winning knock says it all! 😭💪WATCH CWC 25 FINAL 👉 #SAvIND | SUN, NOV 2, 2 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/ENDkBF5vk2— Star Sports (@StarSportsIndia) October 30, 2025 ప్రతీరోజు ఏడ్చానుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం జెమీమా మాట్లాడుతూ.. ‘‘జీసస్కు నా కృతజ్ఞతలు. ఆయన సహకారం లేకపోతే నా ఒక్కదాని వల్ల కాకపోయేది. పట్టుదలగా నిలబడితే చాలు దేవుడే నా తరఫున పోరాడతాడనే బైబిల్లోని ఒక వాక్యాన్ని మ్యాచ్ చివరి క్షణాల్లో మళ్లీ మళ్లీ చదువుకున్నాను. నా సొంతంగా నేను ఏమీ చేయలేదు కాబట్టి గెలిపించాననే మాట చెప్పను. ఈ టోర్నీ ఆసాంతం మానసికంగా చాలా వేదనకు గురయ్యాను. దాదాపు ప్రతీరోజు ఏడ్చాను. కానీ దేవుడే అంతా చూసుకున్నాడు.నాసెంచరీకి ప్రాధాన్యత లేదుమూడో స్థానంలో బ్యాటింగ్కు దిగుతాననే విషయం మ్యాచ్కు ముందు తెలీదు. నాసెంచరీకి ప్రాధాన్యత లేదు. జట్టు గెలవడమే ముఖ్యం. నేను క్రీజ్లో ఇబ్బంది పడుతుండగా సహచరులు అండగా నిలిచారు. అభిమానుల ప్రోత్సాహం బాధను దూరం చేసింది. అందుకే విజయం సాధించగానే భావోద్వేగాలను నియంత్రించుకోలేక బాగా ఏడ్చేశాను’’ అని ఉద్వేగానికి లోనైంది. ఈ నేపథ్యంలో భారత ట్టు అభిమానులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. ‘‘ఏడవద్దు జెమీమా.. సగర్వంగా తలెత్తుకో చాంపియన్’’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.#JemimahRodrigues, take a bow! 🙌#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/2Ov9ixC7Ai— Star Sports (@StarSportsIndia) October 30, 2025చదవండి: IND Beat AUS In Semis: ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన భారత్
- 
      
                   
                                                       కారుపై మూత్ర విసర్జన వద్దన్నాడని..ఎడ్మంటన్: కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు.. అర్వి సింగ్ సాగూ(55) దాడికి గురై మరణించారు. కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో అక్టోబర్ 19వ తేదీన ఈ ఘటన జరగ్గా, ఆయన ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి.. గత శుక్రవారం ప్రాణాలు విడిచారు.అర్వి సింగ్ సాగూ.. తన స్నేహితురాలితో కలిసి నగరంలోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లడానికి తమ కారు వద్దకు వస్తుండగా.. ఓ వ్యక్తి.. సాగూ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిపై సాగూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆపమంటూ అరిచాడు. హే.. నువ్వేం చేస్తున్నావు?" అంటూ నిలదీశాడు.ఆ వ్యక్తి "నా ఇష్టం.. అంటూ దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా.. సాగూ తలపై బలంగా దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దాడు. దీంతో సాగూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితురాలు వెంటనే ఆయన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. సాగూ సోదరుడు, ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- 
      
                   
                                                       సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిశారు. గురువారం రాత్రి ముంబైలో సీఎంతో కొంత సమయం పాటు సల్మాన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ పేరిట ఒక డాక్యుమెంట్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే 20 ఏళ్లలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకుంటున్నారనే కోణంలో రాష్ట్ర పౌరులు తమ ఆలోచనలు, సూచనలను ఈ సర్వేలో చెప్పవచ్చు. దీనిని అందరికీ తెలిసేలా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సల్మాన్ కూడా తెలంగాణ గురించి స్పందించారు. రాష్ట్రం చాలా వేగవంతంగా పురోగతి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ సందేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.
- 
      
                   
                                                       లాభాల్లో స్టాక్ మార్కెట్లుదేశీయ కంపెనీల క్యూ2 ఫలితాలపై మదుపరుల అంచనాల మధ్య భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు అస్థిరంగా ఉన్నాయి. ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు వెంటనే పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 146 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 84,550 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా, నిఫ్టీ 50 సూచీ 33 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 25,911 వద్ద కదులుతోంది.మారుతి సుజుకి, టీసీఎస్, బీఈఎల్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ పీవీ, ఎల్ అండ్ టీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం మార్కెట్ రికవరీలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు కూడా లాభాల వైపు పయనిస్తున్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.61 శాతం, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.06 శాతం క్షీణించాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.8 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.5 శాతం, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
- 
      
                   
                                                       బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్, మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్, ఆర్జే సూర్య (RJ Surya) జీవితంలో పెళ్లి ఘడియలు వచ్చేశాయి. బుల్లితెర నటి సుధీర చెల్లెలు, ఆర్జే శౌర్యతో అతడి నిశ్చితార్థం జరిగింది. గురువారం జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది చూసిన అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్జే సూర్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ఈ ఎంగేజ్మెంట్కు బుల్లితెర నటి సుష్మ కిరణ్ సహా పలువురు హాజరయ్యారు. సుధీర.. కథలో రాజకుమారి సీరియల్లో యాక్ట్ చేసింది. ఆర్జే సూర్య.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. అమ్మ బీడీలు చుడితే నాన్న తాపీ పని చేసేవాడు. తండ్రి పనికి వెళ్తేనే ఆ కుటుంబానికి పూట గడిచేది. కుటుంబ పరిస్థితి వల్ల సూర్య స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పాన్ షాప్లో సోడా సీసాలు క్లీన్ చేసే పనికి కుదిరాడు. అలా రోజుకు 10 రూపాయలు సంపాదించాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ఓ అమ్మాయితో బ్రేకప్ అయి డిప్రెషన్లో ఉన్న సమయంలో ఆర్జేగా ఆఫర్ వచ్చింది. ఇంకేముంది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హీరోల గొంతును మిమిక్రీ చేస్తూ ఆకట్టుకున్నాడు. వాక్చాతుర్యంతో అబ్బురపరిచాడు. అలా తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొని ఎనిమిది వారాలు హౌస్లో ఉన్నాడు. ఆ తర్వాత ఫైమాతో కలిసి బీబీ జోడీ సీజన్ 1లో పాల్గొని విన్నర్గా నిలిచాడు.చదవండి: ఘనంగా నారా రోహిత్ వివాహం..
- 
      
                   
                                                       ఏస్ ఇన్వెస్టర్ డాలీ ఖన్నా పోర్ట్ఫోలియో చూశారా?స్టాక్ మార్కెట్లో టాప్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కదలికలను మదుపరులు, మార్కెట్ ఔత్సాహికులు నిశితంగా గమనిస్తుంటారు. వారి ఇన్వెస్ట్ శైలి, పోర్ట్ఫోలియో గురించి ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏస్ ఇన్వెస్టర్ డాలీ ఖన్నా ఆసక్తికరమైన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో గురించి తెలుసుకుందామా..డాలీ ఖన్నా షేర్ హోల్డింగ్ డేటా ఆధారంగా 2025 సెప్టెంబర్ త్రైమాసికం నుండి 2025 అక్టోబర్ 30 నాటికి సుమారు రూ. 484 కోట్ల విలువైన 11 స్టాక్స్ను ఆమె బహిరంగంగా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు పరంగా, ఈ స్టాక్స్ లో సగం ఘనమైన రాబడిని అందించాయి. 2025లో 101% వరకు ర్యాలీ చేశాయి. అదే సమయంలో మిగిలినవి తక్కువ పనితీరు కనబరిచాయి. 10% నుంచి 40% క్షీణించాయి.టాప్ గెయినర్లు ఇవే..మంగళూరు కెమికల్స్ & ఫెర్టిలైజర్స్: ఈ షేరు 101 శాతం పెరిగి రూ.154 నుంచి రూ.309కి పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 3.99%. దీని విలువ సుమారు రూ .146 కోట్లు.కాఫీ డే ఎంటర్ప్రైజెస్: ఈ స్టాక్ 86% పెరిగి రూ .23 నుండి రూ .42 కు పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.19% వాటా ఉంది. దీని విలువ సుమారు రూ .20 కోట్లు.సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్: ఈ షేరు 26 శాతం లాభపడి రూ.73 నుంచి రూ.92కు చేరుకుంది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.98%. దీని విలువ సుమారు రూ .51 కోట్లు.సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్: ఈ స్టాక్ 18% పెరిగి రూ .110 నుండి రూ .129 కు పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.43%. విలువ దాదాపు రూ .65 కోట్లు.ప్రకాష్ ఇండస్ట్రీస్: ఈ స్టాక్ 7% పెరిగి రూ .154 నుండి రూ .165 కు పెరిగింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.94%. దీని విలువ సుమారు రూ .87 కోట్లు.రాణించని స్టాక్స్ ఇవే..ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్: స్టాక్ రూ .315 వద్దే ఉంది. ఎలాంటి మార్పు లేదు. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 2.73%. దీని విలువ సుమారు రూ .22 కోట్లు.సావేరా ఇండస్ట్రీస్: ఈ స్టాక్ 3% క్షీణించి రూ .167 నుండి రూ .161 కు పడిపోయింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.14%. దీని విలువ దాదాపు రూ .2 కోట్లుజీహెచ్సీఎల్: ఈ షేరు 11 శాతం పడిపోయి రూ.724 నుంచి రూ.648కి పడిపోయింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.21%. దీని విలువ సుమారు రూ .75 కోట్లు.నేషనల్ ఆక్సిజన్: ఈ స్టాక్ 19% పడిపోయింది. రూ .134 నుండి రూ .109 కి తగ్గింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.22%. దీని విలువ సుమారు రూ .67 లక్షలు.కె.సి.పి. షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్: ఈ స్టాక్ 30 శాతం క్షీణించి రూ.45 నుంచి రూ.31కి చేరుకుంది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.8%. దీని విలువ సుమారు రూ .6 కోట్లు.ప్రకాష్ పైప్స్: ఈ స్టాక్ 41 శాతం పడిపోయి రూ.509 నుంచి రూ.298కి తగ్గింది. కంపెనీలో డాలీ ఖన్నా వాటా 1.69%. దీని విలువ సుమారు రూ .12 కోట్లు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
- 
      
                   
                                                       భారత్పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడి దాడి చేస్తాం: ప్రధాని మోదీఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగాయి. పటేల్ భారీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం. పరేడ్ను ప్రారంబించి జాతీయ ఏకతా ప్రతిజ్ఞను చేయించారాయన. అంతకు ముందు.. తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక పోస్ట్ ఉంచారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశం నివాళులు అర్పిస్తోంది. ఆయన భారత ఏకతకు ప్రేరణగా నిలిచారు. ఆయన చూపిన మార్గంలో దేశాన్ని బలంగా, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే సంకల్పాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటున్నాం అని సందేశం ఉంచారు. India pays homage to Sardar Vallabhbhai Patel on his 150th Jayanti. He was the driving force behind India’s integration, thus shaping our nation’s destiny in its formative years. His unwavering commitment to national integrity, good governance and public service continues to… pic.twitter.com/7quK4qiHdN— Narendra Modi (@narendramodi) October 31, 2025స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరిగిన పరేడ్లో వివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. ఫ్లాగ్ మార్చ్, CAPF, పోలీస్, NCC, బ్యాండ్ బృందాలు, గుర్రాలు, ఒంటెలు, శునకాలతో కూడిన మౌంటెడ్ యూనిట్లు ఈ పరేడ్లో పాల్గొన్నాయి. మహిళా బలగాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చివరగా ఎయిర్ షో నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతం నేపథ్యంలో ఈ పరేడ్ను నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.మోదీ మాట్లాడుతూ.. . దేశ సమగ్రత, ఐక్యత మనందరికీ చాలా ముఖ్యమైనది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. కానీ మా ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేరుస్తోంది. కశ్మీర్ సమస్యను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. ఆర్టికల్ 370 ని తొలగించి కశ్మీర్ ను భారత్ అభివృద్ధిలో భాగం చేశాం. భారత్ సరిహద్దులలో జనాభాను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై చర్యలు తీసుకోకుండా కళ్ళు మూసుకుంది. తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంతర్గత భద్రతను గాలికి వదిలేసింది. భారత్ పై కన్నెత్తి చూస్తే ఇంట్లోకి చొరబడి దాడి చేస్తాం. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ సహా ఉగ్రవాదులందరికీ భారత్ సత్తా తెలిసి వచ్చింది. అర్బన్ నక్సలైట్లు, వారికి మద్దతు ఇచ్చే వారిని వదిలిపెట్టం . భారత్ అంతర్గత భద్రతకు నక్సలైట్లు ముప్పుగా మారారు. దేశానికి ముప్పు ఏర్పడితే ప్రతి ఒక్కరికి భద్రత ప్రమాదంలో పడుతుంది’’ అని అన్నారు. ਸਰਦਾਰ ਵੱਲਭ ਭਾਈ ਪਟੇਲ ਦੀ 150ਵੀਂ ਜਯੰਤੀਕੌਮੀ ਏਕਤਾ ਦਿਵਸ ਵਜੋਂ ਮਨਾਇਆ ਜਾ ਰਿਹਾ ਦਿਨStatue of Unity ‘ਤੇ PM Modi ਨੇ ਦਿੱਤੀ ਸ਼ਰਧਾਂਜਲੀ#SardarVallabhbhaiPatel #jayanti #pmmodi #statueofunity #DailypostTV pic.twitter.com/znGkQRbK4f— DailyPost TV (@DailyPostPhh) October 31, 2025 Met the family of Sardar Vallabhbhai Patel in Kevadia. It was a delight to interact with them and recall the monumental contribution of Sardar Patel to our nation. pic.twitter.com/uu1mXsl3fI— Narendra Modi (@narendramodi) October 30, 2025 ఇదిలా ఉంటే.. పటేల్ జయంతి వేళ ప్రధాని మోదీ ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. గురువారం ఏకతా నగర్లోని పటేల్ మనవడు గౌతమ్ పటేల్, ఆయన భార్య నందిత, కుమారుడు కేదార్, కోడలు రీనా, మనవరాలు కరీనాతో కాసేపు ముచ్చటించారు. పటేల్ కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉంది. ఆయన దేశానికి చేసిన అపార సేవలను గుర్తుచేసుకున్నాం అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు.
- 
      
                   
                                                       World Cup 2025: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన భారత్సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణ ఆట తీరుతో రాణించి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Womens ODI World Cup 2025) ఫైనల్లో అడుగుపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్, దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా (Ind Beat Aus In Semis)ను ఓడించి.. ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.జెమీమా అజేయ శతకం.. హర్మన్ అదరహోఆసీస్ విధించిన 339 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127) అజేయ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించగా.. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (88 బంతుల్లో 89)తో మెరిసింది. ఆసీస్పై గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవడంతో పాటు భారత జట్టు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.ప్రతీకారం తీర్చుకుని1. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. వన్డే వరల్డ్కప్-2025 లీగ్ దశలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ విధించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా.. ఇపుడు అదే జట్టుపై టీమిండియా 339 పరుగుల టార్గెట్ పూర్తి చేసి బదులు తీర్చుకుంది.ప్రపంచంలోనే తొలి జట్టుగా2. వన్డే వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్లలో పురుషులు, మహిళల క్రికెట్లో 300కు పైగా స్కోరును ఛేదించడం ఇదే తొలిసారి.అత్యధిక అగ్రిగేట్3. ఈ మ్యాచ్లో భారత్- ఆస్ట్రేలియా సంయుక్తంగా 679 పరుగులు సాధించాయి. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక అగ్రిగేట్ సాధించిన జట్లుగా నిలిచాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్- సౌతాఫ్రికా పేరిట ఉండేది. బ్రిస్టల్లో 2017లో జరిగిన వరల్డ్కప్లో ఈ జట్లు 678 పరుగులు స్కోరు చేశాయి.పిన్న వయసులోనేఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబీ లిచ్ఫీల్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 22 ఏళ్ల వయసులో లిచ్ఫీల్డ్ ఈ ఘనత సాధించింది.చదవండి: ఆసీస్ను భారత్ చిత్తు చేసిందిలా.. దక్షిణాఫ్రికాతో ఫైనల్THIS IS WHAT IT MEANS! 💙🥹👉 3rd CWC final for India👉 Highest-ever run chase in WODIs👉 Ended Australia's 15-match winning streak in CWC#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/8laT3Mq25P— Star Sports (@StarSportsIndia) October 30, 2025
- 
      
                   
                                                       ఖమ్మంలో సీపీఎం నేత హత్యసాక్షి, ఖమ్మం: సీపీఎం నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఘటన జరిగింది. ఉదయం ఇంట్లో వాకింగ్ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు వచ్చి గొంతు కోసి హత్య చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే హత్య జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. సామినేని రామారావు సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు పని చేశారుసామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. దోషులను చట్టపరంగా శిక్షిస్తామని.. కలుషిత హింస రాజకీయాలకు తావులేదని భట్టి అన్నారు. క్లూస్ టీం, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
- 
      
                   
                                                       వెబ్సిరీస్లో మాధవన్.. కథ ఏంటో చెప్పిన డైరెక్టర్ఇప్పుడు ఓటీటీ (OTT) సంస్థలు వెండితెరకు ధీటుగా మారుతున్నాయి. ప్రముఖ నటీనటులు కూడా వెబ్ సిరీస్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా తాజాగా హీరో మాధవన్ (R Madhavan) లెగసీ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఆయనకు జంటగా నిమిషా సజయన్ నటించారు. ఈ వెబ్ సిరీస్ను నెట్ఫ్లిక్స్ సంస్థతో కలిసి స్టోన్ బెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. చారుకేశ్ శేఖర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సిరీస్కు మాధవనే బలంతాజాగా దర్శకుడు మాట్లాడుతూ.. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. ఒక వ్యక్తి తన సామ్రాజ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే లెగసీ అని చెప్పారు. మాధవన్ సిరీస్లో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నటన ఈ వెబ్ సిరీస్కు బలమన్నారు. ఈ వెబ్ సిరీస్ రూపకల్పనకు నెట్ఫ్లిక్స్, స్టోన్ బెంచ్ సంస్థలు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాయని పేర్కొన్నారు.నా ఫస్ట్ సిరీస్ ఇదేమాధవన్ మాట్లాడుతూ లెగసీ వెబ్ సిరీస్లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుందన్నారు. మంచి ఫ్యామిలీ రిలేషన్ షిప్, ఎమోషనల్, గ్యాంగ్స్టర్స్ కథాంశంతో కూడిన చిత్రాలను నిర్మించే స్టోన్ బెంచ్ సంస్థ తాజాగా రూపొందించిన ఈ లెగసీ వెబ్ సిరీస్లో నటించడం సరికొత్త అనుభవం అని పేర్కొన్నారు. తాను నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదని, అదేవిధంగా స్టోన్ బెంచ్ సంస్థలో ఇంతకు ముందు ఒక చిత్రంలో నటించానని, మళ్లీ ఈ వెబ్ సిరీస్లో నటించడం ఆనందంగా ఉందని నిమిషా సజయన్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) చదవండి: ఘనంగా నారా రోహిత్ వివాహం..
- 
      
                   
                                                       ‘పో బయటకు..’ సోదరుడికి షాకిచ్చిన బ్రిటన్ రాజుబ్రిటన్రాజు కింగ్ చార్లెస్ III తన సోదరుడు ప్రిన్స్ ఆండ్రూకి భారీ షాకిచ్చారు. రాయల్ టైటిల్స్ను వదులుకోవడంతో పాటు తక్షణమే అధికారిక మహల్ ఖాళీ చేయాలని ఆదేశించారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలలో బ్రిటన్ యువరాజు ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా ఇటీవల బయటకువచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కింగ్ చార్లెస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డ్యూక్ ఆఫ్ యార్క్ సహా అన్ని రాచరిక హక్కులను, ఆ హోదాల్లో అన్ని రకాల వసతులను వదులుకోవడంతో పాటు 30 గదుల విండ్సోర్ రెసిడెన్సీని ఖాళీ చేయాలని బ్రిటన్రాజు కింగ్ చార్లెస్ III తన సోదరుడు ప్రిన్స్ ఆండ్రూని ఆదేశించారు. ఈ మేరకు బకింగ్హమ్ ప్యాలెస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆండ్రూ ఈ ఆరోపణలను తిరస్కరించినా.. ఈ చర్యలు నైతికంగా అవసరమైనవేనని బ్రిటన్ బకింగ్హమ్ ప్యాలెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంలో బాధితులకు రాజు చార్లెస్, రాణి కామిల్లా మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపింది.విర్జీనియా జియూఫ్రే అనే మహిళ 17 ఏళ్ల వయసులో తనపై ప్రిన్స్ ఆండ్రూ లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ 2022లో పౌర న్యాయస్థానంలో కేసు వేశారు. అయితే.. ఆమెతో అనైతిక ఒప్పందం కుదుర్చుకుని ఆ కేసును ఆయన ముగించారు. ఆ సమయంలో ఆమెను అసలు తాను ఎన్నడూ కలవలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈలోపు.. ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రిన్స్ఆండ్రూ పేరు రావడం సంచలనంగా మారి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ వెంటనే తన అన్న.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఒత్తిడి మేరకు ప్రిన్స్ ఆండ్రూ తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ను వదులుకునేందుకు సిద్ధపడ్డారనే ప్రచారమూ జరిగింది. దానికి కొనసాగింపుగా తన బిరుదును, తనకు లభించే గౌరవాలను ఉపయోగించనంటూ ప్రిన్స్ ఆండ్రూ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 27వ తేదీన లిచ్ఫీల్డ్ క్యాథడ్రల్ వద్ద రాజు చార్లెస్ను ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ.. ఆండ్రూ-ఎప్స్టీన్ సంబంధాల గురించి ఎంతకాలంగా తెలుసు?” అని నిలదీశాడు. పోలీసులకు ఆండ్రూ విషయంలో కవర్అప్ చేయమని చెప్పారా? అని కూడా ప్రశ్నించాడు. అయితే చార్లెస్ అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది.అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలలో దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ సహా దాదాపు 200 మంది ధనవంతులు, శక్తిమంతుల పేర్లు ఉన్నాయి. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో.. ఎప్స్టీన్పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రిన్స్ ఆండ్రూపైనా సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్ వెళ్లినప్పుడు ఎప్స్టీన్ నివాసంలో ఓ గ్రూప్ ఫొటో దిగామని, అప్పుడు ప్రిన్స్ తనని అసభ్యంగా తాకాడని పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో క్లింటన్, ట్రంప్ పేర్లను కూడా ఆమె ప్రస్తావించడం గమనార్హం.
- 
      
                   
                                                       డీప్ ఫెక్పై స్పందించిన చిరంజీవిమెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా డీప్ ఫేక్ ఫోటోల విషయంపై స్పందించారు. కొద్దిరోజుల క్రితం తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారని సీపీ వీసీ సజ్జనార్కు ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీప్ ఫెక్ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినట్లు మీడియాతో చిరు చెప్పారు. డీజీపీతో పాటు హైదరాబాద్ సీపీ సజ్జనార్ డీప్ ఫేక్ ఫోటోల విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నారని చిరు ఇలా చెప్పారు. 'ఈ కేసును సజ్జనార్ స్వయంగా పర్యవేక్షస్తున్నారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారు. ఎవరూ డీప్ ఫెక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని అందరం ఆహ్వానించాలి. కానీ, దాని వల్ల ముప్పు కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుంది.' అని చిరంజీవి అన్నారు.
- 
      
                   
                                                       కార్తీక ఇంటికి మారి సెల్వరాజ్.. భారీ సాయంతమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ గొప్ప మనసు చాటుకున్నాడు. భారత U-18 మహిళల కబడ్డీ జట్టు వైస్-కెప్టెన్ కార్తీకకు రూ. 5 లక్షలు ప్రోత్సాహకంగా అందించారు. తమిళనాడుకు చెందిన కార్తీక రీసెంట్గా బహ్రెయిన్లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్లో భారత్ తరపున స్వర్ణం సాధించింది. ఇప్పటికే కార్తీక జట్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్ రూ. 20 లక్షలు అందించారు. భారత్తో పాటు తమిళనాడు కీర్తిని ఆమె పెంచిందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న కార్తీక చాలా పేదరికంతో ఉన్న కుటుంబంలో జన్మించింది. అమె తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం బహ్రెయిన్లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్లో భారత్ మహిళల కబడ్డీ జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఇరాన్పై భారత్ భారీ విజయం సాధించింది. ఈ గెలుపులో కార్తీకది కీలక పాత్ర ఉంది. దేశ కీర్తిని పెంచిన ఆ జట్టుకు మారి సెల్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ఆమె ఇంటికి వెళ్లి రూ. 5 లక్షల చెక్ను బహుమతికి ఇచ్చారు. కన్నగి నగర్ కార్తీక మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు.కబడ్డీ నేపథ్యంతో బైసన్మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటుడు ధ్రువ్విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్. నటి అనుపమపరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి, దర్శకుడు అమీర్, లాల్, మదన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్న్స్ పతాకంపై దర్శకుడు రంజిత్ నిర్మించారు. కబడ్డీ నేపథ్యంతో విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో సంచలన విజయం సాధించింది. బైసన్ చిత్రాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల తిలకించారు. ఆపై చిత్ర యూనిట్ను వారు మెచ్చుకున్నారు.சமீபத்தில் பஹ்ரைனில் நடந்த ஆசிய இளைஞர் விளையாட்டுப் போட்டியில் தங்கம் வென்ற இந்திய U-18 பெண்கள் கபடி அணியின் துணைத் தலைவராக விளையாடிய கார்த்திகா இந்தியாவிற்கும் தமிழ்நாட்டிற்கும் பெருமை தேடித்தந்து இறுதிப் போட்டியில் ஈரான் அணிக்கு எதிரான ஆட்டத்தில் பெற்ற வெற்றியில் அவர் முக்கிய… pic.twitter.com/nzTwkf1Aia— Mari Selvaraj (@mari_selvaraj) October 30, 2025
- 
      
                   
                                                       పంట పొలంలో పవన్ ‘షో’కోడూరు/అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటన ఒక ‘షో’లా సాగింది. కేవలం 15 నిమిషాల్లోపే రైతుల పరామర్శను ముగించారు. అది కూడా ముగ్గురు అన్నదమ్ములకు చెందిన ఒక్క పొలాన్ని మాత్రమే పరిశీలించారు. ఫొటోలు, వీడియో పోజులకే అధిక ప్రాధాన్యమిస్తూ.. ఇతర రైతులను దగ్గరికి రానివ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళా రైతులను పోలీసులు పక్కకు లాగేశారు. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓట్లు కావాలి గానీ.. సమస్యలు పట్టవా? డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ గురువారం కృష్ణా జిల్లా కోడూరు మండలం కృష్ణాపురంలో పర్యటించారు. ఈదురుగాలులకు నేలవాలిన ఐదెకరాల వరి పొలాన్ని పరిశీలించారు. ఆ పొలాన్ని సాగు చేస్తున్న ఇస్మాయిల్బేగ్పేటకు చెందిన అన్నదమ్ములు రమేశ్, వెంకటేశ్వరరావు, శివరామకృష్ణను పవన్ పరామర్శించారు. అప్పులు చేసి వరి సాగు చేస్తున్నామని.. తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయామని వారు వివరించారు.అనంతరం తీర ప్రాంతంలో ముంపు బారిన పడిన వరి పొలాల డ్రోన్ విజువల్స్ను పవన్ వీక్షించారు. అదే సమయంలో ఇస్మాయిల్బేగ్పేటకు చెందిన కొందరు మహిళా రైతులు తమ సమస్యలను పవన్కు చెప్పుకునేందుకు రాగా.. పోలీసులు వారిని నెట్టివేశారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక రైతు కుటుంబంతో మాట్లాడితే అందరి సమస్యలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు.మా ఓట్లు కావాలి గానీ.. మా సమస్యలు చెప్పుకుందామంటే తోసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హంసలదీవి, రామకృష్ణాపురం జనసేన నాయకులను కూడా దగ్గరికి రానివ్వకపోవడంతో.. వారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవుట్ ఫాల్ స్లూయిస్ గేట్లు దెబ్బతినడం వల్ల పొలాలు ముంపునకు గురవుతున్నాయని వారు చెప్పారు. స్లూయిస్ గేట్లు, రత్నకోడు డ్రెయిన్లను పరిశీలించకుండా ఒక్క పొలాన్ని చూసి వెళ్లిపోతే సరిపోతుందా? అంటూ మండిపడ్డారు.ఫొటో పోజులకే ప్రాధాన్యంపవన్కళ్యాణ్ పర్యటన యావత్తు ఫొటో పోజులకే ప్రాధాన్యమిచ్చారని స్థానికులు మండిపడ్డారు. మీడియా ప్రతినిధులు కాకుండా ప్రత్యేకంగా వచ్చి న కొందరు వీడియో, ఫొటో కెమెరాలతో చిత్రీకరిస్తుండగా.. మరికొందరు మూడు డ్రోన్ కెమెరాలతో హడావుడి చేశారు. తమను పట్టించుకోకుండా.. అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద రోడ్డు పక్కన పళ్ల వ్యాపారులతో ఫొటోలకు పోజులివ్వడంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- 
      
                   
                                                       హరీశ్కు కవిత పరామర్శసాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం పరామర్శించారు. తన భర్త అనిల్తో కలిసి కోకాపేటలోని హరీశ్రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణ రావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. హరీశ్రావు కుటుంబానికి కవిత దంపతులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీశ్రావు తల్లి, తన మేనత్త అయిన లక్ష్మిని కవిత పరామర్శించి ఓదార్చారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతోపాటు పలువురు ప్రముఖులు కూడా హరీశ్ నివాసానికి వెళ్లి ఆయన తండ్రి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు.
- 
      
                   
                                                       ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలాప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 4,774 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4,015 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 34,721 కోట్ల నుంచి రూ. 38,598 కోట్లకు బలపడింది.నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ. 9,315 కోట్ల నుంచి రూ. 9,141 కోట్లకు స్వల్పంగా నీరసించింది. నికర వడ్డీ మార్జిన్లు 2.88 శాతం నుంచి 2.52 శాతానికి బలహీనపడ్డాయి. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.73 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.98 శాతం నుంచి 0.54 శాతానికి దిగివచ్చాయి.మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,587 కోట్ల నుంచి రూ. 1,504 కోట్లకు భారీగా తగ్గాయి. ప్రస్తుత స్థాయిలో వృద్ధిని కొనసాగించేందుకు అవసరమైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో కె.సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. దీంతో అదనపు పెట్టుబడుల ఆవశ్యకత లేనట్లు తెలియజేశారు.యూనియన్ బ్యాంక్ లాభం డౌన్ప్రభుత్వ రంగ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 4,249 కోట్లకు పరిమితమైంది. కీలక వడ్డీ ఆదాయంతోపాటు, రిటెనాఫ్ ఖాతాల నుంచి రికవరీలు తగ్గడం ప్రభావం చూపింది.నికర వడ్డీ ఆదాయం 3 శాతం నీరసించి రూ. 8,812 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 2.9 శాతం నుంచి 2.67 శాతానికి బలహీనపడ్డాయి. పెట్టుబడుల విక్రయ లాభం 70 శాతం పడిపోయి రూ. 192 కోట్లకు పరిమితంకాగా.. రిటెన్ఆఫ్ ఖాతాల నుంచి రికవరీ 36 శాతం క్షీణించి రూ. 913 కోట్లను తాకింది. దీంతో ఇతర ఆదాయం 6 శాతం తక్కువగా రూ. 4,996 కోట్లకు చేరింది.స్థూల స్లిప్పేజీలు వార్షికంగా రూ. 5,219 కోట్ల నుంచి రూ. 2,151 కోట్లకు భారీగా తగ్గాయి. దీంతో మొత్తం ప్రొవిజన్లు రూ. 3,393 కోట్ల నుంచి రూ. 2,565 కోట్లకు క్షీణించాయి. కనీస మూలధన నిష్పత్తి 17.07 శాతంగా నమోదైంది. ఆదాయంలో వృద్ధిని పెంచుకోవడంతోపాటు.. లాభాలను పరిరక్షించుకోవడంలో సమన్వయం పాటించనున్నట్లు బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా ఎంపికైన ఆశీష్ పాండే పేర్కొన్నారు.
- 
      
                   
                                                       నరసింహకొండపై అపచారం..నెల్లూరు సిటీ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని పవిత్ర వేదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కొందరు అసభ్యకర వీడియోలను చిత్రీకరించారు. ఇవి సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో నిఘా కొరవడటంపై భక్తులు మండిపడుతున్నారు.నరసింహకొండపై వెలసిన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ యువజంట కౌగిలించుకుంటూ అసభ్యకర వీడియోలు చిత్రీకరించారు. ఆపై దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్చేశారు. ఈ వీడియోను చూసిన నెల్లూరు వాసులు, ఇతరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో.. వెంటనే ఆ జంట క్షమాపణ చెప్తూ పోస్టు పెట్టింది. ఆర్నెల్ల క్రితం కూడా కొండపైన చెట్ల మధ్యలో కొందరు మద్యం సేవిస్తూ వీడియోలను చిత్రీకరించారు.వీటినీ సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా నరసింహకొండపై తరచూ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆలయ ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయకపోవడం, ఆలయానికి ఎవరెవరు వస్తున్నారనే కనీస నిఘా వ్యవస్థ లేకపోవడం దారుణమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
- 
      
                   
                                                       ఘనంగా నారా రోహిత్ వివాహం..టాలీవుడ్ నటుడు నారా రోహిత్ (Nara Rohit) వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తను ప్రేమించిన సినీ నటి శిరీష (సిరి) (Sireesha)తో కలిసి ఏడడుగులు వేశారు. హైదరాబాద్లో గురువారం రాత్రి ఘనంగా వారి వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్లో వీరికి ఎంగేజ్మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే.
- 
      
                   
                                                       దేశంలో డేటా సెంటర్ల దూకుడు.. త్వరలోనే డబుల్..ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటే దేశీయంగా డేటా సెంటర్ల (డీసీ) సామర్థ్యం 2027 నాటికి రెట్టింపు కానుంది. ప్రాజెక్టులను వేగవంతం చేస్తే 2030 నాటికి అయిదు రెట్లకు పెరగనుంది. డేటా లోకలైజేషన్ చట్టాలు, సానుకూల నియంత్రణ విధానాలు, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.మెక్వారీ ఈక్విటీ రీసెర్చ్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం ప్రస్తుతం భారత్లో 1.4 గిగావాట్ల డీసీ సామర్థ్యం ఉండగా, 1.4 గిగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 5 గిగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ వచ్చే అయిదేళ్లలో భారత్లో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది.దీనికి తోడు టీసీఎస్ సైతం 6.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మెటా–గూగుల్ భాగస్వాములుగా జామ్నగర్లో సమగ్ర ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు జియో ఇటీవల ప్రకటించింది. అలాగే ఏడబ్ల్యూఎస్ భారత్లో క్లౌడ్ కెపాసిటీని 2030 నాటికి 13 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు పెట్టనుంది.
- 
      
                   
                                                       ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠసాక్షి, హైదరాబాద్: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఇవాళ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే తీవ్ర అభ్యంతరాలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు నేపథ్యంతో ఈ ప్రమాణంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన సీఈవో సుదర్శన్రెడ్డి బదులు కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఓ వర్గం ఓటర్లను ప్రలోభ పెట్టడమే అవుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. అయితే ఎస్ఈసీ నిన్ననే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కేబినెట్ విస్తరణ పరిణామాలను, అభ్యంతరాలను అందులో వివరించింది. ఇవాళ మరోసారి సీఈసీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి సంప్రదించినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లోనే దీనిపై స్పందన వెలువడే అవకాశం ఉంది. రాజ్భవన్లో మధ్యాహ్నాం 12.15గం. ప్రాంతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేయించనున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. అంతేకాదు.. ఈ ప్రమాణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ అజారుద్దీన్ పాల్గొంటారని తెలుస్తోంది. అయితే..గతంలో గోవాలోనూ ఇలాగే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్న టైంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది. స్వయంగా సీఈసీనే అప్పటి సీఎం మనోహర్ పారికర్కు ఫోన్ చేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు కూడా. ఇదే విషయాన్ని నిన్న బీజేపీ ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం. అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంతో మంత్రి పదవి ఇస్తుండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకోనివ్వకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని, అందుకు బీఆర్ఎస్ కూడా మద్దతు చెబుతోందని కాంగ్రెస్ మండిపడుతోంది. ఏ శాఖ ఇస్తారో?అజహరుద్దీన్ గనుక మంత్రిగా ప్రమాణం చేస్తే.. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారో అనే చర్చా నడుస్తోంది. ప్రస్తుతం కీలక శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. దీంతో అందులోంచి ఒకటి ఇస్తారా? లేదంటే ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల వద్ద నుంచి ఏదైనా అడ్జెస్ట్మెంట్ చేస్తారా? చూడాలి. ఇదీ చదవండి: ఆ బైపోల్ టైంలో మంత్రి పదవిని బీజేపీ ఎలా ఇచ్చింది?కాంగ్రెస్లో అసంతృప్తి? అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలన్న కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయంపై పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.
- 
      
                   
                                                       Hyd: పీపుల్స్ ప్లాజాలో సిటీ పోలీసుల ఏక్తా రన్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో సిటీ పోలీసులు ఏక్తారన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి.. జెండా ఊపి ప్రారంభించారు. 2k రన్లో డీజీపీ శివధర్రెడ్డి సీపీ సజ్జనార్ పాల్గొన్నారు.సర్ధార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం బాబు జగ్జీవన్ రాం విగ్రహం నుంచి అసెంబ్లీ ముందున్న సర్ధార్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                                       ఛఠ్ పూజలను కించపర్చారుచాప్రా/ముజఫర్పూర్: బిహార్లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బిహార్ ప్రజలు పవిత్రంగా నిర్వహించుకొనే ఛఠ్ పూజలను ఆ కూటమి కించపర్చిందని మండిపడ్డారు. అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మించడం విపక్ష నేతలకు ఇష్టం లేదన్నారు. ఓటు బ్యాంకు కోసం చొరబాటుదారులను కాపాడుతున్నారని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ గురువారం ముజఫర్పూర్, చాప్రాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. బిహార్లో అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీఏను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఛఠ్ పూజకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచి్చందని ఆనందం వ్యక్తంచేశారు. పవిత్రమైన ఈ పండుగపై కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి విషం కక్కుతోందని, డ్రామా అంటూ నిందలేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి దయ వల్ల ప్రధానమంత్రిని కాలేదు మన విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిపక్ష నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారు తీరిక చేసుకొని విదేశాలకు యాత్రలకు వెళ్తుంటారు తప్ప అయోధ్యలో రామమందిరాన్ని ఏనాడూ దర్శించుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. ఛాయ్ అమ్ముకొని బతికిన ఒక సామాన్యుడు ప్రధానమంత్రి కావడం చూసి విపక్ష నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని విమర్శించారు. తాను అలాంటి వారి దయ వల్ల ప్రధానమంత్రిని కాలేదన్నారు.
- 
      
                   
                                                       ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్ఈ పరీక్షలున్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతి బోర్డ్ పరీక్షలకు ఫైనల్ డేట్షీట్ను గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షలను వచ్చే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. పదో తరగతి పరీక్షలు మార్చి 10వ తేదీతో, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తాయని చెప్పారు. రెండు సబ్జెక్టుల మధ్య విద్యార్థులకు అవసరమైన మేర విరామం ఉంటుందని తెలిపారు. 12వ తరగతి విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని, ఫైనల్ డేట్షీట్ను రూపొందించామన్నారు. ప్రవేశ పరీక్షల కంటే ముందుగానే ఈ పరీక్షలు ముగుస్తాయని సీబీఎస్ఈ ఎగ్జామినేషనల్ కంట్రోల్ సన్యమ్ భరద్వాజ్ చెప్పారు.
- 
      
                   
                                                       హన్మకొండలో ఘోర ప్రమాదంసాక్షి, హనుమకొండ: ఎల్కతుర్తి మండలం గోపాల్పుర్ క్రాస్ రోడ్డు వద్ద రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పెళ్లి బృందంతో వస్తున్న బోలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. గాయపడిన మరో 12 మందిని ఎంజీఎంకు తరలించారు. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కురవి మండలం సుధాన్పల్లివాసులుగా పోలీసులు నిర్ధారించారు. వాళ్ల పేర్లు వెల్లడించాల్సి ఉంది.
- 
      
                   
                                                       ఆరో సబ్జెక్టుకు అరకొర స్పందనే!సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మిడియెట్ విద్యా విధానంలో చేపట్టిన సంస్కరణలపై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులకు అదనంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి సబ్జెక్టుల ఎంపికలో ‘ఎలక్టివ్’ విధానం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, రెండో భాష స్థానంలో నచ్చిన సబ్జెక్టును తీసుకునే అవకాశాన్నీ అమలు చేశారు. అయితే, కొత్త విధానంపై అవగాహన కల్పించడంలో వెనుకబడడం, విద్యా సంవత్సరం ముందు నుంచే మార్పులు, చేర్పులు చేయకపోవడంతో ఎలక్టివ్ విధానం విద్యార్థులను ఆకర్షించలేకపోయింది.దీంతో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే అదనపు సబ్జెక్టును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 42 మంది సైన్స్ విద్యార్థులు ఆర్ట్స్ సబ్జెక్టులు ఎంచుకోవడం గమనార్హం. ముఖ్యంగా జేఈఈ, నీట్ పరీక్షలు రాసేందుకు వీలుగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, బైపీసీ విద్యార్థులు మ్యాథమెటిక్స్ అదనపు సబ్జెక్టుగా ఎంచుకునే అవకాశం కల్పించగా ఈ రెండు గ్రూపుల్లోనూ కేవలం 2,592 మంది మాత్రమే ఆరో సబ్జెక్టును తీసుకున్నారు. ఇక రెండో భాష (సెకండ్ లాంగ్వేజ్) స్థానంలో ఏదైనా గ్రూప్ సబ్జెక్టు ఎంచుకునే అవకాశం ఇవ్వగా అతి కొద్ది మందే సబ్జెక్టును ఎంచుకున్నారు. రెండో భాష స్థానంలో సబ్జెక్టు ఎంచుకున్న 253 మందిగత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ అంచెల వారీగా సీబీఎస్ఈ సిలబస్ను అమల్లోకి తెచ్చింది. దీంతో 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ సిలబస్ చదువుకుని పరీక్షలు రాశారు. వీరికి అనుకూలంగా 2025–26 విద్యా సంవత్సరంలోనూ ఇంటర్మిడియెట్లో సీబీఎస్ఈ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో సబ్జెక్టుల ఎంపిక, లాంగ్వేజెస్ స్థానంలో కొత్త సబ్జెక్టు ఎంచుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరంలో 5,28,805 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 253 మంది మాత్రమే రెండో భాష స్థానంలో సైన్స్ సబ్జెక్టులను ఎంపిక చేసుకొన్నారు. ఇందులో 117 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, మరో 136 మంది బైపీసీ విద్యార్థులు మ్యాథమెటిక్స్ను ఎంచుకున్నారు. ⇒ ఆరో సబ్జెక్టు ఎంపికలోనూ విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు. ఎంపీసీ చదువుతున్న 1,059 మంది విద్యార్థులు ఆరో సబ్జెక్టుగా బయాలజీని ఎంచుకోగా, బైపీసీ చదువుతూ మ్యాథమెటిక్స్ తీసుకున్న వారు 1533 మంది ఉన్నారు. Ü ఎంపీసీ గ్రూప్ చదువుతూ ఆరో సబ్జెక్టుగా చరిత్రను ముగ్గురు, సివిక్స్ను ఇద్దరు, కామర్స్ మరో ఇద్దరు ఎంపిక చేసుకున్నారు.⇒ బైపీసీలో చేరిన కొందరు విద్యార్థులు ఆర్ట్స్ గ్రూపులనూ ఎంచుకున్నారు. 29 మంది విద్యార్థులు జియోగ్రఫీని, ఇద్దరు సివిక్స్, మరో ఇద్దరు చరిత్రను ఎంపిక చేసుకున్నారు. ⇒ సీఈసీ గ్రూపులో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే మ్యాథమెటిక్స్ ఎంపిక చేసుకొన్నారు.
- 
      
                   
                                                       అక్టోబర్ 31.. రాష్ట్రీయ ఏక్తా దివస్పట్నా: ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ సమైక్యతా దినోత్సవం) నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఏటా రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో పరేడ్ నిర్వహించినట్టుగానే రాష్ట్రీయ ఏక్తా దివస్ రోజున గుజరాత్లోని ఏక్తా నగర్లో భారీ పరేడ్ నిర్వహిస్తామని తెలిపారు. సర్దార్ వల్లబ్భాయి పటేల్ 150 జయంతి (అక్టోబర్ 31)ని పురస్కరించుకొని నవంబర్ 1 నుంచి భారత్ పర్వ్–2025 ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ పరేడ్ జాతీయ సమైక్యతను ప్రతిబింబిస్తుంది. సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రారంభిస్తున్న ఈ పరేడ్ ఏటా అక్టోబర్ 31న ఘనంగా జరుగుతుంది. ఈ పరేడ్ సర్దార్ పటేల్ సిద్ధాంతాలు, ఆయన సేవలను నేటి తరానికి తెలియజేసేలా ఉంటుంది. శుక్రవారం నిర్వహించే పరేడ్లో మహి ళా కంటింజెంట్, సాంస్కృతిక ప్రదర్శనలు, పారా మిలిటరీ పరేడ్ల వంటివి ఉంటాయి’అని షా వెల్లడించారు. 15 రోజులు భారత్ పర్వ్ సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత్ పర్వ్–2025 ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ ఉత్సవాలు నవంబర్ 1న ప్రారంభమై ప్రముఖ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జయంతి రోజైన నవంబర్ 15 వరకు గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (పటేల్ భారీ విగ్రహం) వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్కడే పటేల్ 150వ జయంతి వేడుకలను కూడా శుక్రవారం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని వెల్లడించారు.
- 
      
                   
                                                       రాజ్యాంగ సవరణతోనే బీసీలకు రిజర్వేషన్లుసాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కనీ్వనర్ టి.చిరంజీవులు, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్లతో సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే తమ లక్ష్యమన్నారు.కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత ఉభయ సభల్లో సభ్యుల సమ్మతి అనంతరం రాష్ట్రపతి ఆమోదంతోనే 9వ షెడ్యూల్లో చేర్చుతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు, ఆర్డినెన్స్, జీఓలతో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదన్నారు. ⇒ టి.చిరంజీవులు మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థ కాదని, ఇదొక స్వతంత్ర సంస్థ అని చెప్పారు. త్వరలో జరిగే శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన రెండు బిల్లులపై పార్లమెంట్లో చర్చించి ఆమోదించేలా బీజేపీ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బీసీల్లో ముస్లింలు ఉన్నారని, ఇందులో ఎవరికైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోందని, బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో డిసెంబర్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వినతులు సమరి్పస్తామని తెలిపారు. ⇒ విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అంశం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదని, జాతీయ సమస్య అన్నారు. బీసీల రాజ్యాధికారమే పోరాట లక్ష్యమని, ఈ ఉద్యమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదన్నారు. ఆయన అంత:పురం విడిచి ప్రజల్లోకి రావాలని, స్పందించకుంటే ఫామ్హౌస్కు వచ్చి ప్రశి్నస్తామని చెప్పారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణను టి.చిరంజీవులు ప్రకటించారు. ⇒ నవంబర్ 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించడం ⇒ నవంబర్ 4వ తేదీన జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ ⇒ నవంబర్ 6వ తేదీన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పణ ⇒ నవంబర్ 7న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి బీసీ రిజర్వేషన్ల ఉద్యమంపై అభిప్రాయాల సేకరణ ⇒ నవంబర్ 10వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ నిర్వహించి భవిష్యత్ పోరాట కార్యాచరణ ప్రకటన
- 
      
                   
                                                       లోకేష్ కనకరాజ్తో బాలీవుడ్ బ్యూటీకోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు భారీ చిత్రాలకు బ్రాండ్గా మారిన విషయం తెలిసిందే. మానగరం వంటి చిన్న చిత్రంతో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించి, తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత కార్తీతో ఖైదీ, విజయ్తో మాస్టర్, లియో ఆపై కమలహాసన్ కథానాయకుడిగా విక్రమ్, రజనీకాంత్ హీరోగా కూలీ తదితర భారీ యాక్షన్ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక్క చిత్రం ఆశించిన విజయం సాధించకపోతే ఇంతకు ముందు ఎన్ని సూపర్ హిట్ చిత్రాలను అందించినా అవి లెక్కలోకి రావన్నది దర్శకుడు లోకేష్ కనకరాజ్కు వర్తిస్తుంది. ఈయన తాజాగా తెరకెక్కించిన కూలీ చిత్రం అంచనాలను చేరుకోలేకపోయింది. అంతే లోకేష్ కనకరాజ్పై ట్రోలింగ్స్ వైరల్ కావడం మొదలెట్టాయి. అంతే కాదు హిందీలో షారూఖ్ ఖాన్తో చేయాల్సిన చిత్రం డ్రాప్ అయ్యిందనే ప్రచారం వైరల్ అయ్యింది. అదే విధంగా కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించే చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు అదీ చేజారి పోయింది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వానికి చిన్న బ్రేక్ ఇచ్చి నటనపై దృష్టి పెట్టారు. లోకేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలై నిర్మాణంలో ఉంది. ఇది గ్యాంగ్స్టర్ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం కోసం లోకేష్ కనకరాజ్ చాలా కసరత్తులు చేసి పాత్రకు తగినట్లు తనను తాను మలచుకున్నట్లు తెలిసింది. ఇకపోతే ఇందులో ఆయనకు జంటగా నటించే నాయకి ఎవరన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హిందీ బ్యూటీ వామిక కబి(Wamiqa Gabbi) ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ భామ ఇంతకు ముందు మాల్ నేరత్తు మయక్కమ్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తదుపరి కార్తీ హీరోగా ఖైదీ–2 చేయడానికి లోకేష్ కనకరాజ్ రెడీ అవుతారని సమాచారం.
- 
      
                   
                                                       2 దశల్లో ప్రాణహిత–చేవెళ్ల!సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును రెండు దశల్లో విభజించి ముందుగా తొలి దశ పనులను మాత్రమే పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 భవిష్యత్తులో జరిపే నీటి కేటాయింపుల ఆధారంగా.. రెండో దశ ప్రాజెక్టు కింద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీటి సరఫరా చేసే పనులు చేపట్టాలా? వద్దా? అనే అంశంపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకోనుంది.పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం 120 టీఎంసీల జలాలను కేటాయించాలని ట్రిబ్యునల్ను రాష్ట్రం కోరింది. ఉమ్మడి ఏపీలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదించిన ఆయకట్టులో అధిక భాగాన్ని తెలంగాణ ఏర్పాటైన తర్వాత పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ సరిపడా నీళ్లను కేటాయిస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా నీళ్లను తరలించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ ఇక తొలిదశ కింద గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి నేరుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీటి సరఫరా చేసే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితోపాటు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లను తరలించి కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ విభాగాలకు నీటి సరఫరా చేయాలని నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి నుంచి 71.5 కి.మీ. దూరంలోని మైలారం వరకు గ్రావిటీ కాల్వ నీళ్లు సరఫరా కానున్నాయి. అక్కడ పంప్హౌజ్ నిర్మించి నీళ్లను నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎత్తిపోయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనబెట్టి తక్కువ ఖర్చయ్యే ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసింది. దీని ప్రకారం మైలారం నుంచి 20.06 కి.మీ. మేర సొరంగాన్ని తవ్వి టేకుమట్ల వాగులో నీళ్లను పంపనున్నారు.వాగులో 11 కి.మీ. ప్రయాణించాక నీళ్లు దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్కు చేరుకుంటాయి. అక్కడి నుంచి నీళ్లను పంపింగ్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలనే ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న సుందిళ్ల బరాజ్కి సత్వరంగా మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని భావిస్తోంది. దీనికి రూ.100 కోట్ల వ్యయం కానున్నట్టు అంచనా. నవంబర్ 7న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ వెంటనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు సవరణ డీపీఆర్ రూపకల్పన కోసం రూ.11 కోట్ల అంచనాలతో టెండర్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 80 టీఎంసీల తరలింపు గత ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే 46.39 టీఎంసీలకు మించి నీళ్లను తరలించలేమని అధికారులు అంచనా వేశారు. 149 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే 88.72 టీఎంసీల నీళ్లను తరలించుకునేందుకు వీలుంటుందని తేల్చారు. 149.5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 108.5 టీఎంసీలు, 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 129.23 టీఎంసీలను తరలించుకోవచ్చని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇటీవలి సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి నీటిపారుదల శాఖను ఆదేశించారు. అనంతరం మహారాష్ట్రకు వెళ్లి 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి సమ్మతి తెలపాలని అక్కడి సీఎంకు విజ్ఞప్తి చేయనున్నారు. రోజుకి టీఎంసీ చొప్పున 80 రోజుల్లో 80 టీఎంసీలను తరలించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- 
      
                   
                                                       వారసత్వ వెలుగులుకాలంతో పాటు ఫ్యాషన్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, కొన్నింటికి కాలం అడ్డంకి కాదు. అవి భావాలూ, జ్ఞాపకాలూ కలిపిన అందంతో మరింత ప్రత్యేకతను చాటుతుంటాయి. అలాంటి వారసత్వ ఆభరణాలు బాలీవుడ్–టాలీవుడ్లలోనూ కొత్తగా వెలుగుతున్నాయి. వివాహ వేడుకలు, ఫ్యాషన్ వేదికలు, సినిమా ఈవెంట్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఆభరణం ఒక కథను, ఒక బంధాన్ని, ఒక జ్ఞాపకాన్ని మన ముందుంచుతుంది.వెండితెరమీద మెరిసే తారలు మోడర్న్ను మాత్రమే పరిచయం చేస్తారు అనుకుంటేపొరబాటు. తమ కుటుంబ వారసత్వాన్ని, ఆత్మీయతను ఆభరణాలలోనూ చూపుతుంటారు. శోభిత ధూళిపాళవివాహానికి ముందు జరిగే వేడుక సమయంలో శోభిత తన తల్లి, తాతమ్మగారి వారసత్వ ఆభరణాలు ధరించింది. వీటిలో సంప్రదాయ పసిడి హారం, కాసులపేర్లు ఉన్నాయి. ఆమె మాటల్లో – ‘మా అమ్మమ్మ ఈ ఆభరణాలు ధరించినప్పుడు నేను చిన్నపిల్లను. ఇప్పుడు అవే ఆభరణాలను నేను వేసుకున్నప్పుడు ఆమె నాకు మరీ మరీ గుర్తుకొచ్చింది’ అని చెబుతుంది. ఈ ఒక్క మాటతోనే ఆ ఆభరణం బంగారం కాదు, బంగారం లాంటి జ్ఞాపకం అని మనకు తెలిసిపోతుంది.కుటుంబ వారసత్వం అలియా తన వివాహ వేడుకలో పాత కాలపుపొల్కీ నెక్లెస్ ధరించింది. ఆ పీస్ ఆమె తల్లి సోనీ రాజ్దాన్ కానుకగా ఇచ్చినది. ‘ఇది కేవలం ఒక ఆభరణం కాదు. తల్లి ప్రేమకు ప్రతీక అని చెబుతుంది. ఆమె ఆ తర్వాత కూడా ఆ నెక్లెస్ని రీ–స్టైల్ చేసి మనీష్ మల్హోత్రా ఈవెంట్లో వాడింది.కీర్తీ సురేశ్తల్లి మేనక ఇచ్చిన టెంపుల్ జ్యువెలరీని కీర్తి పబ్లిక్ ఈవెంట్స్లో కూడా రీ–స్టైల్ చేసి వేసుకుంటుంది. ఆమె చెప్పినట్టుగా ‘మా అమ్మ ఆభరణాలు నేను మళ్లీ వేసుకుంటే, అది ఫ్యాషన్ కాదు గౌరవం’ అని చెబుతుంది.వారసత్వ రత్నాలుబాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన వివాహ వేడుకలో ధరించిన చోకర్ నెక్లెస్ వందేళ్ల కిందట ఆమె కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చింది. దానిని రాజస్థానీ డిజైనర్లు పొల్కీ ఆభరణంగా రూపొందించారు. ‘ఈ నెక్లెస్ మా అమ్మమ్మ ధరించింది. ఇప్పుడు నేను వేసుకుంటున్నానంటే అందుకు మా మధ్య ఉండే ఆత్మీయ బంధమే కారణం’ అని చెబుతుంది సోనమ్. ఇప్పుడు ఆభరణాల డిజైనర్లు కూడా ‘సెంటిమెంట్ స్టైల్’ అనే కొత్త లైన్ ను ఎంచుకుంటున్నారు. పాత ఆభరణాలను మోడర్న్ టచ్తో రీ–డిజైన్ చేయడం, వాటి కథను చెప్పేలా ప్రదర్శించడం ట్రెండ్ అయ్యాయి. వారసత్వ ఆభరణం అంటే కేవలం అలంకారమే కాదు అది ప్రేమ, గౌరవం, జ్ఞాపకం కూడా!
- 
      
                   
                                                       ఏఐ పాఠాలుసాక్షి, న్యూఢిల్లీ: దేశ విద్యా వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అన్ని పాఠశాలల్లోనూ 3వ తరగతి నుంచే ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటేషనల్ థింకింగ్ (సీటీ)ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యా శాఖ నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం–2020 జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం (ఎన్సీఎఫ్ఎస్ఈ) 2023 సిఫార్సుల మేరకు పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయను న్నారు. ఈ నెల 29వ తేదీన సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంగఠన్, నవోదయ విద్యాలయ సమితి ప్రతినిధులు, ఇతర విద్యా రంగ నిపుణులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ ఈ విషయం తెలిపారు.ఏఐ విద్యను మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ముడిపడి ఉన్న ఒక ప్రాథమిక సార్వత్రిక నైపుణ్యంగా పరిగణించాలన్నారు. ప్రజా ప్రయోజనం కోసం ఏఐ అనే భావనను బలోపేతం చేయడం, సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి ఏఐను నైతికంగా ఉపయోగించడంపై పునాది స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలి్పంచడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఏఐ, సీటీ పాఠ్యాంశాల రూపకల్పన కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఐఐటీ మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ కార్తీక్ రామన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు.నూతన పాఠ్యాంశాల అమలులో ఉపాధ్యాయ శిక్షణ అత్యంత కీలకమని కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ‘నిష్ఠ’శిక్షణా మాడ్యూల్స్, వీడియో ఆధారిత వనరులను విస్తృతంగా ఉపయోగించుకోనున్నారు. గ్రేడ్ల వారీగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలిస్తూనే దేశ అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను రూపొందించాలని సంజయ్ కుమార్ సూచించారు. డిసెంబర్ కల్లా పాఠ్యాంశాల అభివృద్ధి పూర్తి చేయాలన్నారు.
- 
      
                   
                                                       ఎంతటి విపత్తు వచ్చినా ఆదుకోవాలిసాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ఆ జిల్లాల్లోని ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఎంతటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఉద్యోగులు, అధికారులు, ఇన్చార్జి మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉండాలని నిర్దేశించారు.వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానల వల్ల ప్రధానంగా వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలతోపాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు. కొనుగోళ్లపై రోజూ నివేదికలు వరి కోతలు మొదలయ్యాయని, అనుకోని ఉపద్రవం ఏది వచ్చినా రైతులకు ఆవేదన మిగులుతుందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ‘వర్షంతో చాలాచోట్ల ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోవటం, రైతులు నష్టపోవటం ఆందోళన కలిగించింది. కళ్లాల్లో, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి.అవి అందుబాటులో లేని చోట దగ్గరలోని ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేయాలి’అని రేవంత్ కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోళ్లకు సంబంధించి రోజూ సాయంత్రం రిపోర్టు తెప్పించుకోవాలని, రిపోర్ట్ ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలకు ధాన్యం తడవకుండా తగినన్ని టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని, విధానపరమైన నిర్ణయాలు అవసరమైతే వెంటనే సివిల్ సప్లయిస్ కమిషనర్, సీఎస్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. హెల్ప్లైన్ ఏర్పాటు చేయండి వరంగల్లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టరేట్లో టోల్ఫ్రీ హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రస్థాయిలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా బృందాలను, అవసరమైన సామగ్రిని పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వెంటనే అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్సిబ్బందిని తక్షణమే తరలించాలని చెప్పారు. ఎక్కడైనా వరదలో ఇళ్లపై కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీరు, ఆహార ప్యాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించారు. శుక్రవారం ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. విద్యుత్శాఖ అప్రమత్తంగా ఉండాలి ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చెప్పారు. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్వేల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ను మళ్లించాలని సూచించారు. అవసరమైనచోట అత్యవసర వైద్య సేవలు అందించేలా వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ప్రకృతి విపత్తుల శాఖను ఆదేశించారు. వర్షాలతో ఖమ్మం జిల్లాలో డీసీఎం వ్యాన్, డ్రైవర్ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమని సీఎం అన్నారు.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, విపత్తుల నిర్వహణ విభాగం స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. నిధుల సమస్య లేదు: డిప్యూటీ సీఎం భట్టి సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి నిధుల సమస్య లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకుని 30 రోజుల్లోగా ర్యాటిఫై చేయాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి, కేబినెట్ సహచరులు ముందుగానే హెచ్చరించడం వల్ల ప్రాణ, భారీ ఆస్తినష్టం జరగకుండా నివారించామని చెప్పారు. రాబోయే 24 గంటలు కలెక్టర్లు, ఇతర అధికారులు తుపాను మాన్యువల్ దగ్గర పెట్టుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తమై పత్తి తడవకుండా టార్పాలిన్లు కప్పడం, గోదాముల్లోకి పత్తి పంటను షిఫ్ట్ చేయడంతో పంటను కాపాడుకోగలిగామన్నారు. విద్యుత్ శాఖ మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమైందని తెలిపారు. దెబ్బతిన్న సబ్స్టేషన్లను వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా ఇబ్బంది లేకుండా చేసినట్లు చెప్పారు.
- 
      
                   
                                                       ఈ కెమెరాకు భయం లేదు‘బిందూ... బాడీ’... అని ఆమెకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో. బిందు ఫ్రీలాన్స్ ఫోరెన్సిక్ ఫొటోగ్రాఫర్. రాత్రిళ్లు ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు సీన్ దగ్గర ఉన్న మృతదేహాలను చట్టపరమైన సాక్ష్యాలకు ఉపయోగపడేలా ఫొటోలు తీయడం ఒక విద్య. ఆ విద్యలో ఆరితేరిన బిందు కేరళలో ఇప్పటికి 3000 కేసులకు ఫొటోగ్రాఫర్గా పని చేసింది. పురుషులైనా స్త్రీలైనా ధైర్యంగా చేయలేని ఈ పనిని చేసి చూపిస్తున్న బిందు పరిచయం.కేరళ త్రిషూర్ జిల్లా కొడంగలూర్లోని బిందూ (46) ఇంటిలో అర్ధరాత్రి ఫోన్ మోగిందంటే ఆమెకు వెంటనే డ్యూటీ పడిందని అర్థం. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది... నేరం జరిగింది.. సూసైడ్ కేసు... అక్కడకు వెళ్లి వెంటనే ఫొటోలు తీయకపోతే ఆ సాక్ష్యాధారాలు చెదిరిపోవచ్చు. అందుకే బిందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కెమెరా బ్యాగ్ భుజాన వేసుకుని మోటర్ సైకిల్ మీద బయలుదేరుతుంది. త్రిషూర్ జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్లకు బిందూయే ఔట్సోర్స్ ఫొటోగ్రాఫర్. ఘటనా స్థలాలలో పోలీసులకు సహాయంగా, చట్టపరమైన పరిశోధనకు వీలుగా, న్యాయస్థానాల్లో ప్రవేశానికి అర్హమైన ఫొటోలు తీసే వారిని ‘ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్’ అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఫొటోగ్రాఫర్లు ఉంటారు. లేనప్పుడే సమస్య. త్రిషూర్లో బిందూయే చాలామందికి ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్.అనుకోకుండా ఒకరోజువి.వి.బిందుది కొడంగల్లో మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ వరకూ చదివాక ఆర్థిక స్తోమత లేక చదువు మానేసి ఒక ఫొటోస్టూడియోలో రిసెప్షనిస్టుగా చేరింది. అక్కడ లైటింగ్ చేసే కుర్రాళ్లు యజమాని లేనప్పుడు కెమెరాతో ఎలా ఫొటో తీయాలో ప్రయోగాలు చేస్తుంటే అప్పుడప్పుడు వారితో పాటు కలిసి గమనించేది. తొలుత ఏ ఆసక్తి లేకపోయినా తర్వాత ఆసక్తి ఏర్పడి ఆరు నెలల్లో కెమెరా అంటే ఏమిటో ఫొటోలు ఎలా తీయాలో ఫండమెంటల్స్లో కొట్టినపిండి అయ్యింది. దాంతో యజమాని ఆమెను అప్పుడప్పుడు వెడ్డింగ్ షూట్స్కు పంపేవాడు. అయితే ఒకరోజు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది... ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని. వేరే ఎవరూ దొరక్క బిందూను పంపాడు యజమాని. ఇది 2004లో జరిగింది. అది బావిలో మృతదేహం కేసు. అక్కడకు వెళ్లి ఫొటోలు తీసిన బిందు మళ్లీ ఆ పని జన్మలో చేయకూడదని నిశ్చయించుకుంది. ‘అలాంటి వృత్తిలో ఎవరు ఉంటారు?’ అంటుందామె. కాని మరి కొన్ని రోజులకు మళ్లీ ఫోన్ వచ్చింది. డబ్బు అవసరం ఆమెకు మళ్లీ కెమెరా పట్టుకుని వెళ్లేలా చేసింది.విరామం తీసుకున్నాపెళ్లయ్యాక ఈ పనికి విరామం ఇచ్చి 2008లో భర్తతో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది బిందు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భర్తతో విడిపోయి తిరిగి 2014లో కొడంగలూరుకు చేరుకుంది. వచ్చిన రోజే ఆమెకు మళ్లీ పోలీసుల నుంచి ఫోన్. ‘ఆశ్చర్యం ఏమిటంటే ఇన్నేళ్లలో నాలాగా ముందుకొచ్చిన ఫొటోగ్రాఫర్లు అక్కడ లేరు. నైపుణ్యం కూడా లేదు’ అందామె గర్వంగా. అందుకే పోలీసులు ఆమెను బతిమిలాడి తిరిగి పనిలో పెట్టారు. ఒక సి.ఐ. అయితే తన శాలరీ సర్టిఫికెట్ ఆమె లోను కోసం పూచీ పెట్టి 2 లక్షలు అప్పు ఇప్పించి మంచి కెమెరా కొనుక్కునేలా చేశాడు. ఇక బిందూ ఆగలేదు. పనిలో కొనసాగుతూనే ఉంది నేటికీ.కేసుకు 2000 రూపాయలుబిందు ఇప్పుడు ఏడు స్టేషన్లకు ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్గా ఉంది. ‘నాకు రోజుకు యావరేజ్గా ఒకటి లేదా రెండు కేసులు వస్తాయి. వెళ్లి ఫొటోలు తీస్తాను. కేసుకు రెండు వేల రూపాయలు ఇస్తారు. ఘటనా స్థలికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ చూసినవన్నీ మైండ్లో నిండిపోతాయి. కాని ఇంటికి వచ్చి ఒక్కసారి పిల్లల్ని చూసుకున్నాక అన్నీ మర్చిపోతాను. నా పని ఎలా చేయాలో నాకు తెలుసు. సీనియర్ ఆఫీసర్లు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడప్పుడు యంగ్ ఆఫీసర్లు ఇలా కాదు అలా అంటూ తెలివి ప్రదర్శిస్తారు. ఇవన్నీ మామూలే’ అంటుందామె. ఇంత భిన్నమైన వృత్తిలో ఇంతగా రాణిస్తున్న బిందూ గురించి బయటి లోకానికి తెలియదు. ఇటీవలే అక్కడి సీనియర్ ఫొటోగ్రాఫర్, నటుడు కె.ఆర్.సునీల్ ‘అసామాన్య సామాన్యుల’ పై ఒక పుస్తకం అక్కడ వెలువరించాడు. అందులో బిందూపై కూడా కథనం ఉంది. అలా ఆమె జీవితం అందరికీ తెలిసింది. గుండె దడదడనేర/ప్రమాద ఘటనా స్థలాల్లోకి పోలీసులు వెళ్లడానికే జంకుతారు. అలాంటిది బిందు వెళ్లి ఊరికే చూసి రావడం కాదు... కొన్ని నిర్దేశిత యాంగిల్స్లో దగ్గరగా వెళ్లి తీయాలి. కొత్తల్లో ఆమెకు చాలా వొణుకుగా ఉండేది. ‘ఒకసారి భయంతో ఫ్లాష్ మర్చిపోయి వెళ్లాను. మళ్లీ తెచ్చుకొని తీయాల్సి వచ్చేది. మరోసారి కెమెరాలో రీల్ లోడ్ చేయడం మర్చిపోయాను. కాని రాను రాను మెల్లగా అన్నీ అలవాటయ్యాయి. ఏ వృత్తయినా ప్రొఫెషనలిజం వచ్చేంత వరకూ కష్టమే. ఆ తర్వాత అంతా నల్లేరు మీద నడకే’ అంటుంది బిందూ.
- 
      
                   
                                                       'అమ్మ' అభయం.. 'తమ్ముళ్ల' దారుణంఈ ఫొటో చూసి చెరువో, నీటి కుంటో అని అనుకుంటే మీరు పొరపడినట్లే. బుక్కరాయసముద్రం మండలం పసులూరు లేఔట్లోని జగనన్న కాలనీ ఇది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇంటి నిర్మాణాలు చేపట్టే క్రమంలో పునాదుల వరకు నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. రాబందుల్లా మారి పునాది మట్టిని సైతం తరలించేశారు.లక్ష్మీదేవి అనే మహిళ అనంతపురంలో మూడు దశాబ్దాలుగా అద్దె ఇంట్లో ఉంటూ చిన్నాచితక పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటోంది. గత ప్రభుత్వంలో పసులూరులోని జగనన్న లేఔట్లో ఆమెకు స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేశారు. అప్పట్లోనే పునాది వరకు ఇంటి నిర్మాణం జరిగింది. సొంతింటి కల నెరవేరుతోందని లక్ష్మీదేవి ఆనందపడుతున్న సమయంలోనే ప్రభుత్వం మారడంతో ఆమె కల పటాపంచలైంది. ఇంటి చుట్టూ ఎర్రమట్టిని ‘తమ్ముళ్లు’ మేసేయడంతో నేడు ఇంటి స్థలమే నామరూపాల్లేకుండా పోయింది. దీంతో ఆమె ఆవేదన అంతా ఇంతా కాదు. అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని పసలూరు గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో 33 ఎకరాల్లో అధునాతన సౌకర్యాలతో జగనన్న లేఔట్ను ఏర్పాటు చేశారు. అనంతపురం నగరంలో అద్దె ఇళ్లలో నివసిస్తూ అవస్థలు పడుతున్న రెండు వేల మంది నిరుపేదలకు ఇక్కడ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఒక్కో ఎకరాకు రూ.13 లక్షలు వెచ్చించి ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి పేదలకు ప్లాట్లు పంపిణీ చేసింది. కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించింది. అప్పట్లోనే 600 ఇళ్లకు పునాదుల వరకూ నిర్మాణం కూడా పూర్తి చేసింది. నామరూపాల్లేకుండా.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎర్రమట్టి దోపిడీకి తెరలేపిన ‘తమ్ముళ్లు’ పసలూరు జగనన్న లేఔట్పై పడ్డారు. అనంతపురం నగరానికి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఇదే అదనుగా జేసీబీ, టిప్పర్లతో రాత్రీ పగలూ తేడా లేకుండా టిప్పర్ ఎర్రమట్టిని రూ.7 వేలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. రోజూ 100 టిప్పర్ల లెక్కన రూ.7 లక్షల చొప్పున జేబుల్లోకి వేసుకున్నారు. ఇష్టారాజ్యంగా తమ్ముళ్లు సాగించిన మట్టి దోపిడీతో జగనన్న లేఔట్ నేడు నామరూపాల్లేకుండా పోయింది. లేఔట్లోని ఇళ్ల పునాదుల చుట్టూ అడుగుల లోతుకు తవ్వడంతో నివాసయోగ్యానికి ఏ మాత్రమూ అనుకూలంగా లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా మళ్లీ లేఔట్ వేసేందుకు సాధ్యం కాని దుస్థితి నెలకొంది. సింహభాగం సొమ్ము ‘అమ్మ’కే.. కూటమి అధికారంలోకి వచ్చాక శింగనమల నియోజకవర్గ పరిధిలో మట్టికొండలు కరిగిపోతున్నాయి. ఇసుక, గ్రావెల్, మట్టితో సహా దొరికిన సహజ సంపదనంతా లూటీ చేస్తున్నారు. కీలక ప్రజాప్రతినిధి తల్లికి ప్రతి నెలా రూ. లక్షల్లో ముట్టజెబుతూ ముఠాలుగా ఏర్పడి మరీ తరలిస్తున్నారు. ‘అమ్మ’ ఆశీర్వాదంతో పగలూ, రాత్రి తేడా లేకుండా ఎర్రమట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. పసలూరు జగనన్న కాలనీలో కొల్లగొట్టిన ఎర్రమట్టి సొమ్ములో సింహభాగం ‘అమ్మ’కే సమర్పించినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు ఉండడం గమనార్హం. ఎర్రమట్టి టిప్పర్లు పసలూరు, కొత్తపల్లి, ఉప్పరపల్లి గ్రామాల మీదుగా రాకపోకలు సాగించడంతో ఆ మార్గమంతా అధ్వానంగా మారింది. అయినా అటు వైపు కన్నెత్తి చూసేందుకు కూడా అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. సెంటు భూమి ఇవ్వని బాబు సర్కారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వలేదు. అదిగో.. ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలాలను సైతం తమ్ముళ్లు మాయం చేయడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు.
- 
      
                   
                                                       ఎవరినీ వదలని ‘సైబరాసురులు’సాక్షి, హైదరాబాద్: కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టుగా.. కారెవరూ మోసం చేసేందుకు అనర్హం అన్నచందంగా మారింది సైబర్ నేరగాళ్ల సరళి. వృత్తి, వయస్సు, లింగభేదాలు, విద్యార్హతలు అన్న తేడా లేకుండా మాయ మాటలు చెప్పి తమ వలలోకి లాగుతున్నారు. అందినకాడికి వారి బ్యాంకు ఖాతాల నుంచి హాంఫట్ చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో విద్యార్థులు మొదలు వయోవృద్ధుల వరకు... గృహిణుల నుంచి బిజినెస్ మ్యాన్ల వరకు అన్ని వర్గాల వారు ఉంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సైబర్ మోసగాళ్ల చేతిలో అందరూ బాధితులవుతున్నారు.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) గణాంకాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఫిర్యాదు చేస్తున్న బాధితుల వయసు, వృత్తులను సైతం అధికారులు క్షుణ్ణంగా విశ్లేíÙస్తున్నారు. ఇలా ఇటీవల జరిపిన విశ్లేషణలో పలు ఆసక్తికరమైన అంశాలు గుర్తించారు. 2024 జనవరి నుంచి సెపె్టంబర్ వరకు నమోదైన కేసులు.. 2025 జనవరి నుంచి సెపె్టంబర్ వరకు కేసులతో పోలిస్తే పెట్టుబడి మోసాల్లో చిక్కుతున్న వారిలో విద్యార్థులు సైతం ఉన్నట్టు తేలింది. ఈ తరహా కేసుల్లో 6 శాతం పెరుగుదల నమోదైంది. అదేవిధంగా చుట్టాలు, స్నేహితుల ఫోన్లు, ఎస్ఎంఎస్ల పేరిట చేసిన సైబర్ మోసాల బాధితుల్లో గృహిణులే 25 శాతం మంది ఉన్నారు.
- 
      
                   
                                                       బాబు మరో కట్టు కథ!సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాల్లో చీవాట్లు, అక్షింతలతో అభాసుపాలైన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరో కట్టు కథ సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై నిజాలు నిగ్గుతేల్చాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై బురద జల్లేందుకు దుష్ప్రచారానికి దిగుతోంది. ఇందులో భాగంగా.. గతంలో సుబ్బారెడ్డి దగ్గర ఎప్పుడో పీఏగా పనిచేసిన చిన్నప్పన్న అనే చిరుద్యోగిని సిట్ అరెస్టుచేసింది. ఇతన్ని పావుగా వాడుకుని బాబు రూపొందించిన కట్టుకథ ఆధారంగా సుబ్బారెడ్డిపై సిట్ తప్పుడు ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవైపు చిన్నప్పన్న ఆంధ్ర భవన్లో చిరుద్యోగి అంటూ.. మరోవైపు అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ పరస్పర విరుద్ధ వాదనలు వినిపించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.చిన్నప్పన్న టీడీపీ ఎంపీ వేమిరెడ్డికి కూడా పీఏగా..2018కి ముందు సుబ్బారెడ్డి దగ్గర పనిచేసి మానేశాడు. అనంతరం ఢిల్లీలోని ఆంధ్రభవన్లో ఉద్యోగిగా చేరిన చిన్నప్పన్న ఏకంగా టీటీడీలోని ప్రొక్యూర్మెంట్ జీఎం స్థాయి అధికారులను సైతం ప్రభావితం చేశాడని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. చిన్నప్పన్న బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకున్న ఆస్తులు వంటి ఇతర అంశాలకు ముడిపెట్టి సుబ్బారెడ్డిని ఎలాగైనా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తుండడాన్ని చూస్తే ఇది పక్కా కుట్ర కథేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి.. ఇదే చిన్నప్పన్న ప్రస్తుత టీడీపీ ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి దగ్గర కూడా గతంలో పీఏగా పనిచేశాడు. ‘సుప్రీం’ చెప్పినా మారని బాబు తీరు..తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని వినియోగించారంటూ చేసిన ఆరోపణలపై సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం మండిపడింది. విచారణ సందర్భంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచేలా బాబు వ్యాఖ్యలున్నాయని ఆక్షేపించింది. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దని కూడా హితవు పలికింది. సర్వోన్నత న్యాయస్థానమే బాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. వాస్తవానికి.. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదని అప్పటి టీటీడీ ఈఓ శ్యామలరావు సైతం మీడియా సమావేశంలోనే కుండబద్ధలు కొట్టారు. డెయిరీల నుంచి వచ్చిన నెయ్యికి పరీక్షలు నిర్వహించి, నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేదని తేలిన రెండు ట్యాంకర్ల నెయ్యిని తిరిగి వెనక్కు పంపేశామని అప్పట్లో ఆయన తేల్చిచెప్పారు. ఇంత సుస్పష్టంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడనే లేదని తేలినప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బాబు పక్కా ప్రణాళికతో తాజా కుట్రకు తెరలేపారు.టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్ట్ విడుదల..ఇక గతేడాది సెప్టెంబరు 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే, ఆ మర్నాడే అంటే సెప్టెంబరు 19న టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్ట్ను రిలీజ్ చేశారు. నిజానికి.. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్లో విడుదల చేశారు. అనంతరం.. సెప్టెంబరు 20న టీటీడీ ఈఓ మీడియా ముందుకొచ్చి ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యతలేదని తేలినందువల్ల, ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబరు 22న మళ్లీ ఈఓ మాట్లాడుతూ.. తాను స్వయంగా సంతకంచేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చానని చెబుతూ.. అందులోని అంశాలు చదివి వినిపించారు. తమకు ఎన్డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. ఈఓ ఎంతో గోప్యమని చెప్పిన ఎన్డీడీబీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పుడే బాబు రాజకీయ కుట్రలకు రోడ్మ్యాప్ వేశారని అందరూ ఊహించారు. ఇప్పుడు తాజాగా చిన్నప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ పిఏ అంటూ పదేపదే సుబ్బారెడ్డిపై దుష్ప్రచారానికి చంద్రబాబు సర్కారు, ఎల్లో మీడియా తెరలేపాయి.
- 
      
                   
                                                       మనిషి ‘తిరుగుడు’ ఎక్కువైంది!సాక్షి, స్పెషల్ డెస్క్: 1850ల నాటి మాట... అప్పట్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే నడకే ప్రధాన సాధనం. కానీ, 2025 నాటికి పూర్తిగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికైనా వెళ్లాలంటే కార్లు, బస్సులు, మోటారు సైకిళ్లు, రైళ్లు, విమానాలు.. ఇలా ఎన్నో మార్గాలు. అందుకే, ఇప్పుడు నడక అనేది ఏకంగా ఏడో స్థానానికి వెళ్లిపోయింది. భూమిపై ఉన్న జలచరాల సంచారం (టోటల్ బయోమాస్ మూవ్మెంట్ – టీబీఎం) పారిశ్రామిక విప్లవం తరువాత.. సగానికి తగ్గిపోయింది. అదే సమయంలో మనుషులు అటూ ఇటూ తిరగడం 40 రెట్లు పెరిగింది. సుప్రసిద్ధ నేచర్ జర్నల్కి చెందిన ‘నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్’ విభాగంలో ప్రచురితమైన అధ్యయనం ఈ ఆసక్తికర వివరాలు వెల్లడించింది. భూమిపై జలచరాల సంచారం (టోటల్ బయోమాస్ మూవ్మెంట్ – టీబీఎం) పారిశ్రామిక విప్లవం తరువాత తగ్గిపోవడానికి ప్రధాన కారణం.. చేపలు, తిమింగలాలను మనుషులు వేటాడటమే. చెప్పాలంటే మొత్తం మానవుల టీబీఎంలో.. భూమిపై ఉన్న జంతువులు, జలచరాలు, పక్షుల టీబీఎం ఆరోవంతు మాత్రమేనట. ప్రస్తుతం మానవ సంచారంలో దాదాపు 65 శాతం.. మోటారు వాహనాల ద్వారానే జరుగుతోంది. నడక ద్వారా 20 శాతం ఉంటే.. సైకిల్ ద్వారా జరుగుతున్నది మరో 20 శాతం. విమానాల ద్వారా తిరుగుతున్నవారు 10 శాతం కాగా, రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నవారు 5 శాతం.ఆ నాలుగూ కారణంఈ అధ్యయనంలో అమెరికా, జర్మనీ, ఇజ్రా యెల్కు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. వీరు మానవ ప్రయాణాలు పెరగడానికి కార ణాలుగా ప్రధానంగా 4 అంశాలను పేర్కొన్నారు.⇒ జనాభా పెరుగుదల⇒ మోటారు వాహనాల వాడకం పెరగడం ⇒ శిలాజ ఇంధనాల వినియోగంలో వృద్ధి⇒ ప్రయాణాలకు అనువైన సదుపాయాలు, సౌకర్యాల ఏర్పాటు⇒ అధిక ఆదాయ దేశాల్లో ఉన్నవారు ప్రపంచ జనాభాలో దాదాపు 16 శాతం. మొత్తం జనాభా కదలికల్లో వీరిదే దాదాపు 30 శాతం.⇒ అల్పాదాయ దేశాల్లో ఉన్న వారు ప్రపంచ జనాభాలో 9 శాతం. మొత్తం జనాభా సంచారంలో వీరి వాటా కేవలం 4 శాతమే.95 శాతానికి పెరిగింది1850లలో..ఈ భూమిపై మొత్తం క్షీరదాల్లో క్రూర మృగాల (జలచరాలు, వన్యప్రాణులు) బరువు 50 శాతం ఉంటే.. మానవులు, ఇతర పెంపుడు జంతువుల బరువు 50 శాతం ఉండేది. 2020 నాటికి మానవులు, ఇతర పెంపుడు జంతువుల బరువు ఏకంగా 95 శాతానికి పెరిగిపోయింది.ఏమిటీ టోటల్ బయోమాస్ మూవ్మెంట్మనుషుల జనాభాతో పోలిస్తే భూమిపై పక్షులు, జంతువులు చాలా ఎక్కువ కదా, మరి అవి ప్రయాణించే దూరం కంటే మనుషులు ప్రయాణించే దూరం ఎక్కువ కావడం ఏమిటి? అనే సందేహం చాలామందికి వస్తుంది. అందుకు ప్రధాన కారణం దీన్ని గణించడానికి తీసుకునే ప్రమాణమే. పర్యావరణ ఆరోగ్యం, సహజ వనరుల వినియోగం, పర్యావరణంపై మానవుల ప్రభావం వంటి అంశాలు అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ‘టోటల్ బయోమాస్ మూవ్మెంట్’ను ఉపయోగిస్తారు.దీని ప్రమాణమే గ్రాస్ టన్ను కిలోమీటర్లు (జీటీకే). ఒక ప్రాణి బరువును, అది ఒక ఏడాదిలో ప్రయాణించిన దూరంతో గుణిస్తే వచ్చేదే జీటీకే. ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత ఎక్కువ జీటీకే అన్నమాట. చాలా పక్షులు ఏటా కొన్ని వేలు, లక్షల కిలోమీటర్లు వలస పోతుంటాయి. కానీ వాటి బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల వాటి టీబీఎం చాలా తక్కువగా ఉంటుంది.
- 
      
                   
                                                       యూపీఐ లావాదేవీల్లో గుత్తాధిపత్యం!న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీల్లో 80 శాతాన్ని కేవ లం 2 సంస్థలు (ఫోన్పే, జీపే) నియంత్రిస్తున్నాయంటూ.. ఈ ఏకాగ్రత రిస్క్ను తగ్గించేందుకు చ ర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ, ఆర్బీఐని ఇండి యా ఫిన్టెక్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) కోరింది. ఫిన్ టెక్ పరిశ్రమకు స్వీయ నియంత్రణ మండలిగా వ్య వహరిస్తున్న ఐఎఫ్ఎఫ్.. ఇందుకు సంబంధించి వి ధాపరమైన సూచనలు చేసింది. ఐఎఫ్ఎఫ్లో భాగమైన ఫిన్టెక్ సంస్థలతో విస్తృతమైన సంప్రదింపుల అనంతరం వీటిని రూపొందించినట్టు తెలిపింది. → యూపీఐపై 30 థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (టీపీఏపీలు) ఉండగా.. 80 శాతానికిపైగా లావాదేవీలు రెండు సంస్థల నియంత్రణల్లోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలు దోపిడీ ధరలతో (భారీ తగ్గింపులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు)తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటాయి. ముఖ్యంగా చిన్న సంస్థలు, దేశీ పోటీదారులను పోటీపడకుండా చేస్తాయి. → ప్రభుత్వానికి చెందిన భీమ్ ప్లాట్ఫామ్ సైతం ఈ ద్వందాధిపత్యం దెబ్బకు మార్కెట్ వాటాను కోల్పోయింది. → యూపీఐ లావాదేవీలను నగదుగా మార్చుకునే అవకాశం (ఎండీఆర్ చార్జీలు) లేకపోవడం, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు ఉన్న నిధుల వెసులుబాటు.. కొత్త సంస్థలు, చిన్న సంస్థల ప్రవేశానికి గట్టి అవరోధంగా నిలుస్తాయి. పోటీని అణచివేస్తాయి. → ఒక సంస్థ గరిష్టంగా 30 శాతం లావాదేవీలకే సేవలు అందించాలన్న పరిమితిని అమలు చేయడంలో ఎన్పీసీఐ జాప్యం చేస్తుండడం నిర్వహణపరమైన సవాళ్లను, ఏకాగ్రత రిస్్కను తెలియజేస్తుంది. ఎన్పీసీఐ ఈ పరిమితి అమలు చేయడానికి ముందుగానే ఈ సంస్థలు మరింత పెద్దవిగా అవతరించేందుకు అనుమతించడం.. వ్యూహాత్మకమే అనిపిస్తోంది. → ఈ ఏకాగ్రత రిస్్కను తగ్గించేందుకు బడా రెండు యూపీఐ సంస్థలు (టీపీఏపీలు) కాకుండా మిగిలిన వాటికి యూపీఐ ప్రోత్సాహకాల్లో అధిక వాటా అందుకునేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సదరు రెండు అతిపెద్ద టీపీఏపీలు ప్రోత్సాహకాల్లో అధిక భాగాన్ని పొందుతాయి. ఒక టీపీఏపీకి ప్రోత్సాహకాల్లో 10 శాతం గరిష్ట పరిమితి విధించాలి.
- 
      
                   
                                                       మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణం నేడుసాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గాన్ని శుక్రవారం విస్తరిస్తున్నారు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ ఒక్కరినే కేబినెట్లోకి తీసుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి సీఎస్కు లేఖ రాశారు. ఈసీ ఉత్తర్వులనుబట్టే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే అజహరుద్దీన్ను ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని అడ్డుకోవాలని.. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్రెడ్డికి ఫిర్యాదు చేసింది. గతంలో గోవాలో ఇలాగే ప్రమాణస్వీకార ఏర్పాట్లు జరుగుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు పేర్కొంది. బీజేపీ నేతల ఫిర్యాదుపై సుదర్శన్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. ఈసీ ఇచ్చే ఉత్తర్వులను అనుసరించి ఆయన కార్యాచరణ ఉండనుంది. ఏ శాఖ ఇస్తారో?అజహరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నాక ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనకు కీలకమైన పదవిని అప్పగిస్తారా లేక మైనారిటీ సంక్షేమ శాఖతో సరిపుచ్చుతారా అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి మహమూద్ అలీకి రెండు దఫాల్లోనూ కీలకమైన హోం, రెవెన్యూ శాఖలను కేసీఆర్ అప్పగించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన దగ్గర ఉన్న శాఖలను ఇచ్చే పక్షంలో పెద్దగా మంత్రుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చని.. లేదంటే మంత్రుల శాఖలు స్వల్పంగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
- 
      
                   
                                                       కృష్ణమ్మకు పోటెత్తిన వరదగాందీనగర్ (విజయవాడసెంట్రల్)/తాడేపల్లి రూరల్/విజయపురిసౌత్/అచ్చంపేట: భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లోని మున్నేరు, కీసర, వైరా, కట్టలేరు ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గురువారం రాత్రి 7 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజ్ వద్దకు 5.67 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో రెండోప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా డెల్టాలో పంటలు దెబ్బతినడంతో డెల్టా కాలువలకు నీటి విడుదల నిలిపివేసి, వచ్చిన వరదను వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటిమట్టం 14.6 అడుగులు ఉంది. లీక్ అవుతున్న కొండవీటి వాగు గేట్లు.. అమరావతి కరకట్ట వెంబడి కృష్ణానదిని, కొండవీటి వాగును విడదీస్తూ ఏర్పాటు చేసిన గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అయ్యి కొండవీటి వాగులోకి వస్తోంది. ఒక పక్క వాగుకు వచ్చే వరదను ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదిలోకి విద్యుత్ మోటార్ల ద్వారా తరలిస్తుంటే.. మరో పక్క కృష్ణానదిలోకి వచ్చిన వరద ఇదే గేట్ల ద్వారా లీక్ అయ్యి మళ్లీ కొండవీటి వాగులోకి చేరుతోంది. మొత్తం 18 గేట్లు ఉండగా 15 గేట్ల నుంచి నీరు వాగులోకి చేరుతోంది. ఒకవేళ వాగులోనూ వరద ఉధృతి పెరిగి, ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగితే ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, యర్రబాలెం ప్రాంతాలకు ముప్పు తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నుంచి 4క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల.. మోంథా తుపాను ప్రభావంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో గురువారం నాలుగు క్రస్ట్గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 1,49,139 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడ నుంచి 66,139 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంది.పులిచింతల నుంచి 4.8 లక్షల క్యూసెక్కులు విడుదల.. పులిచింతల ప్రాజెక్టు నుంచి గురువారం ఉదయం ఎలాంటి సమాచారం లేకుండా సుమారు ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో దిగువన ఉన్న గిరిజన తండాల రైతుల భూములు కోతకు గురై, పంటలు కొట్టుకుపోయాయి. జడపల్లి తండా, కంచుబోడు తండాలకు చెందిన మిర్చి రైతులు ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే పంట నష్టపరిహారం ఇవ్వాలని, కోతకు గురైన భూములను క్రమబద్దీకరించి తమ భూములను తమకు చూపాలంటూ నినాదాలు చేశారు.
- 
      
                   
                                                       రూ.81.63 కోట్ల పనికి రూ.307.41 కోట్లు!సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 5, 5ఏ ప్యాకేజీల్లో 2019 అక్టోబర్ 3 నాటికి మిగిలిన రూ.81.63 కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని కూటమి ప్రభుత్వం రూ.293.66 కోట్లకు పెంచేసింది. వాటిని 4.68 శాతం అధిక ధరలకు అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’ కు గతేడాది అక్టోబర్ 17న కట్టబెట్టింది. అంటే.. మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్లు (277% అధికం) అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్.. ఈనాడు రామోజీరావు కుమారుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందినది కావడం గమనార్హం. పెంచిన అంచనా వ్యయాన్ని నీకింత నాకింత అంటూ పచ్చ ముఠా పంచుకు తింటోందని సాగు నీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ‘ఏటీఎం’గా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను గుర్తు చేస్తున్నారు.నేడు రామోజీ కుమారుడి వియ్యంకుడికి నజరానా పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ 2019 అక్టోబరు 3 నాటికి రూ.117.05 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. మరో రూ.64.816 కోట్ల విలువైన పనులు మిగిలాయి. పుట్టా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులను రద్దు చేసి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ చేసిన సూచన మేరకు ఆ సంస్థ నుంచి ఆ పనులను తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2019 అక్టోబరు 3 నాటికి 5ఏ ప్యాకేజీ కింద రూ.64.816 కోట్లు, ఐదో ప్యాకేజీ కింద రూ.16.82 కోట్లు వెరసి ఆ రెండు ప్యాకేజీల్లో రూ.81.636 కోట్ల విలువైన పని మిగిలినట్లు స్పష్టమవుతోంది. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.293.66 కోట్లకు పెంచి.. ఏడాదిలోగా పూర్తి చేయాలనే నిబంధనతో గతేడాది అక్టోబర్ 17న ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 2019 నాటికి.. నేటికీ డీజిల్, స్టీలు, పెట్రోల్, సిమెంటు వంటి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అయినా సరే అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఇక టెండర్లలో 4.68 శాతం అధిక ధరకు రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు ప్రభుత్వం అప్పగించింది. అంటే మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్ల మేర అంచనాను పెంచి ఆ సంస్థకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. తద్వారా రామోజీ కుమారుడి వియ్యంకుడికి చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నారు.. ఇక పనులు దక్కించుకుని దాదాపు ఏడాది గడిచినా ఇప్పటిదాకా ఆ సంస్థ 50 శాతం పనులు మాత్రమే పూర్తి చేయడం గమనార్హం. నాడు పుట్టాకు నామినేషన్పై రూ.142.88 కోట్ల పనులు పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ (93.7 కి.మీ నుంచి 111 కి.మీ వరకు) పనులను 2005 మార్చి 23న రూ.181.60 కోట్లతో పూర్తి చేసేలా సాబీర్ డ్యాం అండ్ వాటర్ వర్క్స్ సంస్థ దక్కించుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెపె్టంబరు 8న రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. ఆ తర్వాత రెండున్నర నెలలు తిరగక ముందే అంటే 2016 నవంబర్ 30న ఐదో ప్యాకేజీలో 5.74 కి.మీల కాలువ తవ్వకం.. 11.001 కి.మీ పొడవున లైనింగ్.. 33 కాంక్రీట్ కట్టడాల నిర్మాణాలను ఏపీడీఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద తొలగించి.. వాటిని 5ఏ ప్యాకేజీ కింద విభజించి, అంచనా వ్యయాన్ని రూ.142.88 కోట్లుగా లెక్కగట్టి నాటి ఆర్థిక మంత్రి యనమల వియ్యకుండు, ప్రస్తుత మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన పీఎస్కే–హెచ్ఈఎస్(జేవీ) సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేశారు. ఆ పనుల్లో 100.3 కి.మీ నుంచి 102.5 కి.మీ వరకు, 110.5 కి.మీ నుంచి 111.487 కి.మీ వరకు కఠిన శిల (హార్డ్ రాక్)తో కూడిన భూమిని బ్లాస్టింగ్ చేసి తవ్వాలని.. అందుకు 3,77,938 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి వస్తుందని.. క్యూబిక్ మీటర్కు రూ.29.21 చొప్పున రూ.1.11 కోట్లు అదనంగా చెల్లించాలని 2018 మే 22న చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పుల వల్ల అదనంగా రూ.38.986 కోట్లు చెల్లించాలని 2018 జూలై 10న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు పీఎస్కే–హెచ్ఈఎస్ సంస్థతో పోలవరం అధికారులు సప్లిమెంటరీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీంతో.. ఆ సంస్థకు రూ.181.866 కోట్ల విలువైన పని అప్పగించినట్లైంది. అప్పటికి ఐదో ప్యాకేజీలో కాంట్రాక్టర్ సాబీర్ డ్యాం అండ్ వాటర్ వర్క్స్ సంస్థకు రూ.16.82 కోట్ల పని మిగిలింది.
- 
      
                   
                                                       పసిడి డిమాండ్కు ధరాఘాతంన్యూఢిల్లీ: బంగారం ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ, అదే పనిగా పెరుగుతూ పోతుండడం డిమాండ్పై ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో భారత్లో బంగారం డిమాండ్ 16 శాతం తగ్గి 209.4 టన్నులకు పరిమితమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో డిమాండ్ 248.3 టన్నులు ఉండడం గమనార్హం. ధరలు పెరగడంతో వినియోగ డిమాండ్ తగ్గినట్టు, మరోవైపు సురక్షిత సాధనంగా పెట్టుబడుల పరమైన డిమాండ్ పెరిగినట్టు వివరించింది. పరిమాణం పరంగా డిమాండ్ తగ్గినప్పటికీ, విలువ పరంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 2,03,240 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విలువ పరంగా డిమాండ్ 1,65,380 కోట్లతో పోల్చి చూస్తే 23% పెరిగింది. ధరలు అధికంగా ఉండడం వల్ల కొనుగోలు పరిమాణం తగ్గినప్పటికీ, విలువ అదే స్థాయిలో ఉన్నట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. → ఆభరణాల డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 117.7 టన్నులుగా ఉంది. 2024 సెప్టెంబర్ క్వార్టర్లో డిమాండ్ 171.6 టన్నులతో పోల్చి చూస్తే 31 శాతం తగ్గింది. ఆభరణాల కొనుగోలు విలువ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.1,14,270 కోట్ల స్థాయిలో ఉంది. ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులు తమ స్తోమత మేరకు పరిమాణం తగ్గించి కొనుగోలు చేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. → పెట్టుబడుల పరంగా పసిడి డిమాండ్ 20 శాతం పెరిగి 91.6 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే 74 శాతం పెరిగి రూ.88,970 కోట్లకు చేరింది. → సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం సగటు ధర 10 గ్రాములకు రూ.97,075గా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.66,614గా ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా ఔన్స్ ధర 3,456 డాలర్ల వద్ద ఉంది. 2024 సెప్టెంబర్లో ఇది 2,474 డాలర్ల స్థాయిలో ఉంది. → బంగారం దిగుమతులు సెప్టెంబర్ త్రైమాసికంలో 194.6 టన్నులకు పడిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 308.2 టన్నులతో పోల్చితే దిగుమతులు 37 శాతం తగ్గాయి. → పసిడి రీసైక్లింగ్ డిమాండ్ సైతం 7 శాతం తగ్గి 21.8 టన్నులకు పరిమితమైంది. పెట్టుబడుల డిమాండ్.. దీర్ఘకాలంలో విలువ పెరిగే సాధనంగా బంగారం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి ఈ గణాంకాలు నిదర్శనమని డబ్ల్యూజీసీ భారత సీఈవో సచిన్జైన్ పేర్కొన్నారు. పరిమాణం పరంగా డిమాండ్ 16 శాతం తగ్గినప్పటికీ, విలువ పరంగా 23 శాతం పెరగడాన్ని విస్మరించకూడదన్నారు. పండుగలు, వివాహాల సీజన్లో డిమాండ్ బలంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలి నెలల్లో ధరలు పెరగడంతో పెళ్లిళ్లకు సంబంధించి కొనుగోళ్లను కొందరు వాయిదా వేసుకున్నారని, దీంతో డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ సానుకూలంగా ఉండొచ్చన్నారు. పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గడానికి.. గతేడాది దిగుమతి సుంకం తగ్గించడం కారణంగా పెద్ద ఎత్తున దిగుమతులు నమోదు కావడాన్ని ప్రస్తావించారు. గతేడాది గరిష్ట బేస్ కారణంగా దిగుమతులు పెద్ద మొత్తంలో తగ్గిపోయినట్టు కనిపిస్తోందన్నారు. ఈ ఏడాది మొత్తానికి పసిడి డిమాండ్ 600–700 టన్నులుగా ఉండొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. మొదటి తొమ్మిది నెలల్లో 462 టన్నులుగా ఉన్నట్టు తెలిపింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 1,313 టన్నులుగా నమోదైంది.
- 
      
                   
                                                       తిండిలోనే ఉంది.. తూగుటుయ్యాల!సాక్షి, స్పెషల్ డెస్క్: పగటి పూట పండ్లు, కూరగా యలు, సంక్లిష్ట (నెమ్మదిగా జీర్ణమయ్యే) కార్బోహైడ్రేట్లను తీసుకునే వారు కలతలు లేని, ప్రశాంతమైన నిద్రను ఆస్వాదిస్తున్నారట. అందుకు భిన్నంగా – చక్కెర, ప్రాసెస్ చేసిన పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు.. శారీరక అసౌకర్యానికి, నిద్రాభంగానికి కారణం అవుతున్నాయట. ప్రముఖ జర్నల్ ‘స్లీప్ హెల్త్’లో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాలు వెల్లడించింది. నిద్రలేమికి ఒత్తిడి, గంటల తరబడి స్క్రీన్ను చూడటం, క్రమరహితమైన పని వేళలు ప్రధాన కారణాలుగా ఉన్నప్పటికీ... నిద్రను నియంత్రించటంలో ఆహారం బలమైన సహాయక పాత్రను పోషిస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి వాటితో కూడిన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు.. శరీర ధర్మాల సహజ లయను నిర్వహించడానికి, వాపుల గుణాన్ని తగ్గించడానికి, జీర్ణక్రియకు, తద్వారా మంచి నిద్రకు దోహదపడతాయని అధ్యయనంలో తేలింది. రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రించే అమెరికన్ యువతపై ఈ అధ్యయనం జరిగింది. ఆహారం నిద్రను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోటానికి వారి ఆహారపు అలవాట్లను, మణికట్టుకు అమర్చే నిద్ర మానిటర్ల రీడింగ్లను అధ్యయనవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు.ప్రాసెస్డ్ ఫుడ్స్ వద్దు ⇒ చక్కెర, ప్రాసెస్డ్ పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు అసౌకర్యాన్ని, రాత్రిపూట తరచూ మెలకువ రావటానికి కారణం అవుతున్నాయి. ⇒ కొన్ని ఆహారాలు సహజంగా నిద్ర నాణ్యతను పెంచుతున్నాయి. అరటిపండ్లు, కివీ పళ్లు, టార్ట్ చెర్రీస్ (పుల్లటి చెర్రీలు) సహజ మెలటోనిన్ను, సెరటోనిన్ కలిగి, నిద్ర స్పందనలను నియంత్రిస్తున్నాయి. పాలకూర, క్యాబేజీ రకం ఆకుకూరలలోని మెగ్నిషియం కండరాలను సడలిస్తోంది. గింజలు, అవకాడోలు, చిలగడదుంపలు నిద్ర హార్మోన్లను సమతులం చేయడంలో సహాయకారిగా ఉంటున్నాయి. సమయమూ ముఖ్యమే ⇒ ఆహారంతో పాటుగా, అది తీసుకునే సమయం కూడా నిద్రకు చాలా ముఖ్యం. ఆలస్యంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అధిక ప్రొటీన్లు లేదా కారంగా ఉండే వంటకాలు అజీర్ణాన్ని రేకెత్తిస్తాయి. కెఫిన్, డార్క్ చాక్లెట్ నిద్రను ఆలస్యం చేస్తున్నాయి. ⇒ మధ్యాహ్న భోజనాన్ని సమృద్ధిగా తీసుకోవాలి. అది జీర్ణక్రియ బలంగా ఉండే సమయం. ⇒ రాత్రి భోజనం తేలికగా, సమతులంగా ఉండాలి, రాత్రి 8 గంటలలోపు, లేదా నిద్రవేళకు కనీసం 2 గంటల ముందు తినటం పూర్తి చేయాలి. ⇒ పడుకునే ముందు ఒక చిన్న చిరుతిండి, అరటిపండు, గోరువెచ్చని పాలు లేదా నానబెట్టిన బాదం తినటం వల్ల అర్ధరాత్రి ఆకలిగా అనిపించదు.‘ప్రశాంత పోషకాలు’ ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉండే ఆహారాలు.. పాలు, గింజలు వంటివి. ఇవి నిద్ర హార్మోన్లను తయారు చేయటంలో కీలకం⇒ మెగ్నిషియం, విటమిన్ బి6.. ఆకుకూరలు, అరటిపండ్లు, అవకాడోలలో లభిస్తాయి. కండరాలను, నరాలను సడలించి విశ్రాంతినిస్తాయి.⇒ మెలటోనిన్ (రాత్రివేళల్లో మెదడులో ఉత్పత్తి అయ్యే హార్మోన్) అధికంగా ఉండే ఆహారాలు.. చెర్రీలు, ఓట్స్, కివీ, అరటిపండ్లు. ఇవి నాణ్యమైన నిద్రకు తోడ్పడతాయి. ⇒ పొటాషియం అధికంగా ఉండే టమాటా,చిలగడదుంపలు నిద్ర లయల్ని స్థిరీకరిస్తాయి.నిద్రాభంగం కలిగించేవి⇒ రాత్రి కడుపునిండా తినటం, ఆలస్యంగా తినటం, వేపుళ్లు, కారాలు.. జీర్ణక్రియను ఆలస్యం చేస్తాయి. కలత నిద్రకు కారణం అవుతాయి. ⇒ కెఫిన్, ఆల్కహాల్, చక్కెరలు మెలటోనిన్ను అణిచివేస్తాయి. నిద్రా భంగం కలిగిస్తాయి⇒ నిమ్మజాతి పండ్లు లేదా అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారాలు కూడా, బాగా పొద్దుపోయాక తింటే నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
- 
      
                   
                                                       జేసీబీలో వాగు దాటిన పెళ్లికుమార్తెలుజరుగుమల్లి(సింగరాయకొండ): ఓ పక్క దగ్గర పడుతున్న పెళ్లి ముహూర్తం...మరో పక్క గ్రామాన్ని చుట్టుముట్టిన వరద.. ఈ స్థితిలో వివాహాలు జరుగుతుందా లేదా.. అని రెండు కుటుంబాలు ఆందోళన చెందాయి. చివరకు అధికారులు చొరవ తీసుకుని జేసీబీలో ఇద్దరు పెళ్లి కూతుళ్లను ఊరు దాటించడంతో వివాహాలు జరిగాయి. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం సాదువారిపాలేనికి చెందిన అద్దంకి శ్రీనివాసులు, విజయల కుమార్తె దుర్గకు గురువారం ఉదయం 10 గంటలకు చినగంజాంలో వివాహం జరగాల్సి ఉంది. అదే గ్రామానికి చెందిన ఆత్మకూరి వెంకటేశ్వర్లు, అరుణ దంపతుల కుమార్తె అంజలి వివాహం కూడా అదే గ్రామానికి చెందిన సుధాకర్తో సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ వరాహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉంది. కానీ బుధవారం సాయంత్రం నుంచి ముసి వాగు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామం నుంచి గ్రామస్తులు బయటకు అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. దీంతో రెండు కుటుంబాల వారు అధికారులకు సమస్యను వివరించారు. దీంతో అధికారులు జేసీబీల సాయంతో పెళ్లికుమార్తెలను వరద నీటిని దాటించారు.
- 
      
                   
                                                       వలసదారులపై మరో పిడుగువాషింగ్టన్: అమెరికాలో వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ నాన్–ఇమిగ్రెంట్ ఉద్యోగుల పని అనుమతులను(వర్క్ పర్మిట్లు) అటోమేటిక్గా రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలికింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి వచి్చంది. దీంతో విదేశీ ఉద్యోగులు.. ప్రధానంగా అమెరికాలోని భారతీయ ఉద్యోగులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు, హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నెల 30వ తేదీ లేదా ఆ తర్వాత వర్క్ పర్మిట్లు(ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు–ఈఏడీ) పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై అటోమేటిక్ రెన్యువల్ సదుపాయం ఉండదు. అక్టోబర్ 30 కంటే ముందు వర్క్ పర్మిట్లు పొడిగించుకున్నవారిపై ఎలాంటి ప్రభావం పడదు. వారి వర్క్ పర్మిట్లు(ఈఏడీ) ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతాయి. అమెరికాలో ఈఏడీ పొడిగింపు కోసం ప్రతిఏటా 4.50 లక్షల మంది దరఖాస్తు చేస్తుంటారు. ఇకపై విదేశీ ఉద్యోగుల వర్క్ పర్మిట్లు రెన్యువల్ కావాలంటే ప్రత్యేక తనిఖీలు, పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతోపాటు వర్క్ పర్మిట్ల విషయంలో మోసాలకు తెరదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తేల్చిచెప్పింది. బైడెన్ నిర్ణయానికి మంగళం హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు(హెచ్–4 వీసాదారులు), ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో ఉన్న ఎఫ్–1 వీసా ఉన్న విదేశీ విద్యార్థులు సహా కొన్ని కేటగిరీల వలసదారుల వర్క్ పర్మిట్ల కాలవ్యవధి ముగిసినప్పటికీ 540 రోజుల దాకా చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకొనే అవకాశాన్ని జో బైడెన్ ప్రభుత్వ హయాంలో కల్పించారు. నిర్దేశిత గడవులోగా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఆటోమేటిక్గా వర్క్ పర్మిట్ రెన్యువల్ అయ్యేది. ఈ విధానానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికింది. వర్క్ పర్మిట్ గడువు ముగిసేదాకా వేచి ఉండకుండా రెన్యువల్ కోసం వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందే దరఖాస్తు చేసుకుంటే మంచిదని యూఎస్ సిటిజెన్íÙప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) స్పష్టంచేసింది. రెన్యువల్ దరఖాస్తు విషయంలో జాప్యం చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్(డాక్యుమెంటేషన్)లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. అసలు ఏమిటీ వర్క్ పర్మిట్? కొన్ని కేటగిరీల నాన్–ఇమిగ్రెంట్ వీసాదారులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవాలంటే వర్క్ పర్మిట్(ఈఏడీ) తప్పనిసరిగా కలిగి ఉండాలి. నాన్–ఇమిగ్రెంట్ విదేశీ కార్మికుడు అమెరికాలో నిర్దేశిత కాలంపాటు ఉద్యోగం చేయడానికి చట్టబద్ధమైన అనుమతి ఉందని చెప్పడానికి ఈఏడీ ఒక ఆధారం. గ్రీన్కార్డుతో అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందినవారికి వర్క్ పర్మిట్తో అవసరం లేదు. అయితే, గ్రీన్కార్డు పెండింగ్లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటే వర్క్ పర్మిట్ తీసుకోవాల్సిందే. హెచ్–1బీ వీసాదారులు కూడా పని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
- 
      
                   
                                                       చినతిరుపతిలో 'ఘోరం'ద్వారకాతిరుమల: రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో దారుణం చోటు చేసుకుంది. చిన్న తిరుపతిగా పేరున్న ఈ ఆలయం గోశాలలో గురువారం ఒక ఆవు, దూడ మృత్యువాత పడటం కలకలం రేపింది. కరెంటు షాక్తో మృతి చెందాయని సిబ్బంది, కాదు పాముకాటు వల్ల మృతి చెందాయని అధికారులు పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తున్నారు. తిరుమల తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు భారీగా తరలివచ్చే ఈ క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నిత్యం శ్రీవారి దర్శనానంతరం కొందరు భక్తులు ఆలయ తూర్పు ప్రాంతంలోని సప్త గోకులంలో గోపూజలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు దేవస్థానం సిబ్బంది గోసంరక్షణశాల నుంచి 9 ఆవులు, 9 దూడలను సప్త గోకులానికి తీసుకొస్తున్నారు. తిరిగి సాయంత్రం ఆరు గంటలకు గోసంరక్షణశాలకు తీసుకెళ్తున్నారు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం సప్తగోకులానికి వచ్చిన ఆవులు, దూడల్లో ఒక జంట (ఆవు, దూడ) సప్తగోకులం వెనుకకు వెళ్లి, ఫ్లడ్లైట్లు ఉన్న హైమాస్ట్ పోల్ వద్ద పడిపోయాయి. వీటిని గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇవి విద్యుదాఘాతం వల్ల మృతి చెందాయని కొందరు సిబ్బంది భావించగా, అవి పాము కాటు వల్లే మృతి చెందాయని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలంలోని ఫ్లడ్లైట్లకు విద్యుత్ సరఫరా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటుందని, ఆ తరువాత టైమర్ కంట్రోల్ ద్వారా ఆటోమేటిగ్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయం ఉదయం 6 తరువాతేనని, దీన్ని బట్టి ప్రమాదానికి విద్యుదాఘాతం కారణం కాదని అధికారులు చెబుతున్నారు.పోస్టుమార్టం నివేదికతోనే..పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఆవు, దూడ మృతికి కారణాలు తెలుస్తాయని మండల పశువైద్యాధికారి అంగర సురేష్ తెలిపారు. ఆవు, దూడ శరీర భాగాల నుంచి సేకరించిన నమూనాలను ఏలూరులోని యానిమల్ డిసీజ్ డయగ్నోస్టిక్ లేబొరేటరీ (ఏడీడీఎల్)కి పంపినట్టు చెప్పారు. అక్కడ నిర్ధారణ కాకపోతే విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (వీబీఆర్ఐ)కు పంపుతారని చెప్పారు.
- 
      
                   
                                                       రైతుకు భరోసా ఏదీ?: వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోంథా తుపాను బీభత్సం సృష్టించిందని... 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలయ్యేదని, రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేదని, విపత్తుల కారణంగా పంట నష్టపోతే రైతులకు బీమా పరిహారం దక్కేదని గుర్తుచేశారు. కానీ, కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిందని, ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా సదుపాయం ఉందని, మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. బాబు సృష్టించిన మరో విపత్తు ఇది అంటూ మండిపడ్డారు. మోంథా తుపాను నేపథ్యంలో గురువారం వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆరా తీశారు. తుపాను సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవడాన్ని ప్రశంసించారు. పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని, ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా గట్టిగా ప్రశ్నించాలని, ఆ తప్పిదాన్ని సవరించుకునేలా చొరవ చూపాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే... తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ అందరికీ అభినందనలు మోంథా తుపాను వచ్చినప్పటి నుంచి, ప్రజలతో మమేకమవుతూ మీమీ ప్రాంతాల్లో అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. పార్టీ పిలుపు మేరకు మీరంతా చాలా చక్కగా, చురుగ్గా పనిచేస్తున్నారు. రైతులు, ప్రజలకు తోడుగా ఈ తుపానులో నిలిచారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. రైతులకు తోడుగా నిలవాలి మోంథా తుపాను బీభత్సం ఎక్కువే ఉంది. తీవ్రత తగ్గినా, రైతులపై చాలా ప్రభావం చూపింది. పంటలకు చాలా నష్టం జరిగింది. పొట్ట దశకొచ్చిన పంటలు భారీ వర్షాలకు నేలకొరిగాయి. దీంతో దిగుబడి దారుణంగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు, అక్కడినుంచి రాయలసీమలోని కర్నూలు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా మోంథా ప్రభావం ఉంది. 25 జిల్లాలు, 396 మండలాలు, 3,320 గ్రామాల పరిధిలో ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలవాల్సి ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై మోంథా ప్రభావం చూపింది. ఇందులో 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. 1.15 లక్షల ఎకరాల పత్తి, 1.15 లక్షల ఎకరాల వేరుశనగ, 2 లక్షల ఎకరాల మొక్కజొన్న, మరో 2 లక్షల ఎకరాల ఉద్యాన పంటల మీద మోంథా తుపాను ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పంట నష్టం అంచనాల్లో రైతులకు తోడుగా నిలవాలి. పార్టీ నాయకులంతా రైతులకు అండగా ఉంటూ పనిచేయాలి. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు ఇది ‘మ్యాన్ మేడ్ కెలామిటీ’ చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతుల పరిస్థితి చూడాల్సి ఉంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ–క్రాప్ వ్యవస్థ పక్కాగా ఉండేది. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) సమర్థంగా పనిచేసేవి. వాటిలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండి సేవలందించేవారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు కలిసి పనిచేయడం వల్ల ప్రతి రైతుకు భరోసా దక్కేది. నాడు దాదాపు 85 లక్షల మంది రైతులకు దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా అమలు చేశాం. కానీ, ఈ రోజు కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే పంటల బీమా ఉంది. ఎవరైతే బ్యాంకులో రుణం తీసుకున్నారో వారికే పంటల బీమా సదుపాయం ఉంది. బ్యాంకర్లు రుణాలిచ్చినప్పుడు, ఇన్సూ్యరెన్స్ కట్టించారు కాబట్టి, కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే బీమా ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి? నాటి 85 లక్షల మంది రైతులు, 70 లక్షల ఎకరాలకు ఉచిత బీమా ఎక్కడ...? ఇప్పుడు కేవలం 19 లక్షల మంది రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఎక్కడ...? దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీతో పాటు, ఈ ఏడాది కూడా ఏ సీజన్లోనూ ఏ పంటకూ ప్రభుత్వం బీమా ప్రీమియం కట్టలేదు. కాబట్టి ఇది కచ్చితంగా మ్యాన్ మేడ్ కెలామిటీ (మానవ తప్పిదం కారణంగా సంభవించిన విపత్తు). కాబట్టి మనం పార్టీపరంగా రైతులకు అండగా నిలవాలి. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ జీరో ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు. గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 16 నెలల్లో 16 సార్లు తీవ్ర విపత్తులు, తుపాన్లు ఉత్పన్నమయ్యాయి. వీటికి అదనంగా మోంథా తుపాను తోడైంది. దీంతో రైతుల నడ్డి విరిగింది. తుపాను వల్ల 8 మంది చనిపోతే చంద్రబాబు క్రెడిట్ తీసుకోవడం ఏంటి? ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే క్రెడిట్ తీసుకున్నా అర్థం ఉంటుంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని ప్రకృతి విపత్తుల్లో 16 మంది మాత్రమే చనిపోయారు. ఇక కూటమి పాలనలో ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది? ఎంతమంది రైతులకు ప్రభుత్వం తోడుగా నిలిచింది అని చూస్తే ఈ ప్రభుత్వం తరఫున అందిన సాయం గుండుసున్నా. చివరకు ఈ–క్రాప్ కూడా చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేశారు. అయినా వారి లెక్కల ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణా దాదాపు రూ.600 కోట్లు సబ్సిడీ ఇవ్వాలి. అదికూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మిర్చి క్వింటాల్ రూ.11,781కు కొంటామన్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. కానీ, ఎక్కడా ఆ పని చేయలేదు. మామిడి కిలో రూ.12కు కొంటామన్నారు. ఒక్క రైతుకూ మేలు చేయలేదు. ఉల్లి క్వింటాల్కు రూ.1,200కు కొంటామన్నారు. కానీ, అక్కడా చేతులెత్తేశారు. ఆ తర్వాత హెక్టారుకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి, అది కూడా ఇవ్వకుండా మోసం చేశారు. రైతుల కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు రాష్ట్రంలో ఈ–క్రాప్ లేదు. దాన్ని నీరుగార్చారు. ఆర్బీకేలను నిరీ్వర్యం చేశారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అందుకే ఇదంతా మ్యాన్ మేడ్ కెలామిటీ. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 54.55 లక్షల రైతులకు తోడుగా నిలుస్తూ రూ.7,802 కోట్లతో ఉచిత పంటల బీమా పరిహారం ఇప్పించాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసి, నాడు ప్రభుత్వమే బీమా ప్రీమియం కట్టింది. రైతులపై ఎలాంటి భారం వేయలేదు. కానీ, ఈ ప్రభుత్వంలో అన్నీ మానవ తప్పిదాలే. అవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తుపాను రూపంలోనూ చాలా నష్టం వస్తోంది. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి, చంద్రబాబు మోసం చేశాడు. అందుకే ఈ రోజు రైతులకు జరుగుతున్న నష్టం, వారి కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు. ఆయన తప్పిదాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి ఇప్పుడు రైతులకు మనం తోడుగా నిలవాలి. పంట నష్టం అంచనాలో అండగా ఉండాలి. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి. ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా, వారి తరపున నిలవాలి. మాట్లాడాలి. ప్రజలు కానీ, రైతులు కానీ, పారీ్టకి సంబంధించినవారు కానీ.. ఎవరు కూడా ఎక్కడా మిస్ కాకుండా, ప్రభుత్వం కావాలని తప్పు చేయాలని చూస్తే, వాటిని గట్టిగా ప్రశ్నించాలి. రైతులకు మంచి జరిగేలా చూడాలి. నష్టం అంచనాలో ఎక్కడా, ఏ లోపం లేకుండా పూర్తి చొరవ చూపాలి. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డి, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను), శతృచర్ల పరీక్షిత్రాజు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మేరుగు నాగార్జున, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేవీ ఉషశ్రీ చరణ్, పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, ఆకెపాటి అమర్నాథ్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇంచార్జి చుండూరి రవి, పార్టీ నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, కడప మాజీ మేయర్ సురేష్, చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గాల్లో నవంబరు 11న ర్యాలీలు నిర్వహించాలి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 28నే అనుకున్నా, మోంథా తుపాను కారణంగా వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ అవుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. తద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి.
- 
      
                   
                                                       అజహరుద్దీన్కు మంత్రి పదవి కోడ్ ఉల్లంఘనేసాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేప థ్యంలో ఒక వర్గం ఓటర్లను ప్రలోభపరిచేలా సీఎం వ్యవహరిస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఎన్ని కల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ అజహ రుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టే ప్రయత్నాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మీడియా కథనాలు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది.ప్రభుత్వ చర్యను ఉపసంహరించేలా అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరింది. గురువారం ఈ మేరకు సీఈవోకు బీజేఎల్పీ ఉపనేత పాయల్శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, లీగల్ సెల్ నేత ఆంథోనిరెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. అజహరుద్దీన్కు మంత్రి పదవి ప్రతిపాదన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది.
- 
      
                   
                                                       బాబు గప్పాలకు ఆకాశమే హద్దు!సాక్షి, అమరావతి: చెప్పేవారు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రి వెంగళప్ప.. సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన మీడియా సమావేశం అచ్చం ఇలాగే సాగింది. వినేవాళ్లు ఏమనుకుంటారో అన్న స్పృహ కూడా లేకుండా ఆద్యంతం ఆయన గప్పాల ప్రవాహం సాగింది. ఈయనకు ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కూడా బుర్రకథలో మాదిరిగా తానాతందానా అన్నట్లుగా వంతపాడారు. ఆ వివరాలు..1. ఏ రిజర్వాయర్లోకి ఎంత నీరు వస్తుందో, ఎంత నీటిని విడుదల చేయాలో టెక్నాలజీతో ఇప్పుడు తెలుసుకున్నట్లు ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. నిజానికి.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) దేశంలోని ముఖ్యమైన జలాశయాల ప్రత్యక్ష నిల్వ సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు బులెటిన్లు విడుదల చేస్తుంది. ఏ పరివాహక ప్రాంతంలో ఎంత వర్షం కురుస్తుందో.. తద్వారా ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు వస్తుందనే విషయాన్ని రాష్ట్రాలకు చెప్పే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. కానీ, చంద్రబాబు మాత్రం ఇప్పుడే టెక్నాలజీ ద్వారా ఈ విషయాన్ని ఔపోశన పట్టినట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే, ఎప్పటి నుంచో ప్రతీ రిజర్వాయర్కు నీటి పర్యవేక్షణ విధానం ఉంది. వరదలు, వర్షాల ఆధారంగా ఏ ప్రాజెక్టుకు ఎన్ని క్యూసెక్కులు వస్తున్నాయో చూసుకుని దాని కింద ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం సంవత్సరాల తరబడి కొనసాగుతోంది. కొత్తగా ఇప్పుడు టెక్నాలజీతో ఈ అంశాన్ని కనుగొన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా, అతిశయోక్తిగా ఉంది. 2. భూగర్భ జలాలను కూడా రియల్ టైమ్లో పర్యవేక్షించినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో కూడా దశాబ్దాల తరబడి పర్యవేక్షణ విధానం కొనసాగుతోంది. సెన్సార్లు రియల్ టైమ్ మానిటరింగ్ ఎప్పటి నుంచో ఉంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలు ఏ రోజుకా రోజు దొరుకుతాయి. కొత్తగా ఈ ప్రభుత్వంలో తెచ్చిందేమీ కాదు.3. అన్ని టెక్నాలజీలను అనుసంధానం చేయడంతో పాటు డ్రోన్స్, సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ వరద నీరు ఉందో గుర్తించి ఆ నీటిని డ్రై చేశామని సీఎం చెప్పారు. ఇలాంటి రియల్ టైమ్ వ్యవస్థ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదన్నారు. అయితే, డ్రోన్లు, సీసీ కెమెరాలు కూడా కొత్తగా వచ్చినవి కావు. ఎప్పటి నుంచో ఉన్నాయి. అన్ని ప్రభుత్వాలు వీటిని అవసరమైనప్పుడల్లా అవసరమైన మేరకు ఉపయోగిసూ్తనే ఉన్నాయి. 4. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు జియో ట్యాగింగ్ చేశామన్నారు. నిజానికి.. ఈ విధానం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడో అమలుచేశారు. ఇళ్లకు గత ప్రభుత్వంలోనే జియో ట్యాగింగ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లు కొత్తగా వచ్చిన విధానమేమీ కాదు ఇది. 5. తుపానులు, వరదలకు సంబంధించి ఉత్తమ మాన్యువల్ రూపొందించినట్లు కూడా చంద్రబాబు గొప్పగా చెప్పారు. కరువు నియంత్రణకు బ్రిటీష్ కాలం నుంచే ఈ మాన్యువల్స్ ఉన్నాయన్నది ముఖ్యమంత్రికి తెలీదనుకోవాలా!?6. తుపాను కదలికలను గంట గంటకు టెక్నాలజీ ద్వారా పర్యవేక్షిస్తూ పౌరులకు 28 రకాల సూచనలతో మెసేజ్లు పంపుతూ అప్రమత్తం చేశామని ఐటీ శాఖ కార్యదర్శి కె. భాస్కర్ చెప్పారు. 5000 సచివాలయాల పరిధిలో జాగ్రత్తలు తీసుకుని ముందస్తు హెచ్చరికలను పౌరులకు జారీచేశామన్నారు. వాస్తవానికి.. ఫోన్లలో మెసేజ్లు పంపే విధానం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ కొనసాగింది. అప్పట్లో సచివాలయాల వారీగా ఇంటింటినీ మ్యాపింగ్ చేసి పౌరులకు అవసరమైన సమాచారాన్ని మెసేజ్ల రూపంలో పంపించేవారు. కానీ, ఇప్పుడే ఈ విధానం అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోంది. 7. అవసరమైన వారికి మెడిసిన్స్ పంపించామన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకునే సంప్రదాయం దశాబ్దాల కిందట నుంచి ఉంది. దీని ద్వారా ప్రజలు తమ ఇబ్బందులు ప్రభుత్వానికి చెప్పుకుని సాయం పొందడం ఇప్పుడు కొత్తేమీ కాదు.8. కాకినాడ దగ్గర తీరం దాటుతుందనుకుంటే 15 కిలోమీటర్ల తరువాత నర్సాపురం దగ్గర తీరం దాటిందని భాస్కర్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. కాకినాడలో కాకుండా అంతర్వేది వద్ద తుపాను తీరాన్ని దాటింది. అలాగే, వర్షం ఎక్కడ, ఎప్పుడు ఎంత పడుతుందో ముందస్తుగా చెప్పే విధానం ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం అట్టర్ఫ్లాప్ అయింది. ఓ విధంగా మోంథా దాగుడుమూతలు ఆడిందని చెప్పి నవ్వులపాలయ్యారు.9. టెక్నాలజీతో వాహనాలను ట్రాకింగ్ చేశామని.. ఇదే తొలిసారన్నారు. ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే.. ఆర్టీసీ బస్సుల రాకపోకలను తెలుసుకునేందుకు ఆ సంస్థ తన అధికారిక యాప్లోనే ప్రయాణికులకు బస్సుల ట్రాకింగ్ ఆప్షన్ కల్పించింది. అలాగే, నేరాలకు సంబంధించి పోలీసులూ వాహనాలు ట్రాక్ చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. 10. మొబైల్, ఇంటెర్నెట్ కమ్యునికేషన్ వ్యవస్థను పక్కాగా చేశామన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటినుంచో అమల్లో ఉంటే సీఎం చంద్రబాబు, ఐటీ కార్యదర్శి భాస్కర్ ఇప్పుడు తామే కనిపెట్టి అమలుచేసినట్లు చెప్పుకోవడం నవ్వు పుట్టిస్తోంది.
- 
      
                   
                                                       ట్రంప్, జిన్పింగ్ స్నేహగీతంసియోల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ ఆరేళ్ల తర్వాత ముఖాముఖి సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై దాదాపు రెండు గంటలపాటు చర్చించుకున్నారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనడానికి దక్షిణ కొరియాకు చేరుకున్న ఇరువురు నేతలు గురువారం బుసాన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైనా ఉత్పత్తులపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం. అలాగే అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడానికి చైనా అంగీకరించింది. మొత్తానికి అమెరికా, చైనాల మధ్య స్నేహ సంబంధాలకు ట్రంప్–జిన్పింగ్ భేటీ అద్దం పట్టింది. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని అమెరికాకు తిరిగివెళ్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. జిన్పింగ్తో ముఖాముఖి సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతమైందని అన్నారు. మాదక ద్రవ్యాల(ఫెంటానిల్) తయారీకి అవసరమైన రసాయనాలు విక్రయిస్తున్నందుకు శిక్షగా చైనాపై ఈ ఏడాది మొదట్లో విధించిన 20 శాతం టారిఫ్లను 10 శాతానికి తగ్గించబోతున్నట్లు తెలిపారు. దీంతో చైనాపై మొత్తం టారిఫ్లు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గిపోనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్లో తాను చైనాలో పర్యటించబోతున్నట్లు ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత జిన్పింగ్ సైతం అమెరికాకు రాబోతున్నారని వెల్లడించారు. మరిన్ని అడ్వాన్స్డ్ కంప్యూటర్ చిప్లను చైనాకు ఎగుమతి చేయడంపై జిన్పింగ్తో చర్చించానని అన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకం చేయబోతున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ విషయంలో పెద్దగా అవరోధాలేవీ లేవన్నారు. టిక్టాక్ సమస్యను పరిష్కరించుకుంటాం: చైనా ట్రంప్, జిన్పింగ్ భేటీలో టిక్టాక్ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు. టిక్టాక్ యజమాన్యాన్ని చైనా నుంచి అమెరికాకు బదిలీ చేయాలని ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. టిక్టాక్ను అమెరికా సంస్థకు అప్పగించాలని చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నారు. చైనా యాజమాన్యంలో ఉంటే అమెరికాలోని యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని అంటున్నారు. దీనికి చైనా అంగీకరించడం లేదు. అమెరికాతో నెలకొన్న టిక్టాక్ సమస్యను కచి్చతంగా పరిష్కరించుకుంటామని చైనా వాణిజ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై అమెరికాతో చర్చిస్తామని పేర్కొంది. మరోవైపు అమెరికాలో టిక్టాక్ను కొనసాగించేలా చైనాతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం సంకేతాలిచి్చంది.అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతులు అమెరికా నుంచి ప్రతిఏటా 25 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ దిగుమతి చేసుకోవడానికి చైనా అంగీకరించింది. ఈ మేరకు ట్రంప్, జిన్పింగ్ చర్చల్లో ఒప్పందం కుదిరినట్లు అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఈ ఒప్పందం వచ్చే మూడేళ్లపాటు అమల్లో ఉంటుందన్నారు. ఈరోజు నుంచి వచ్చే ఏడాది జనవరి దాకా చైనా 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలు చేయనుందని తెలిపారు. దీనివల్ల అమెరికా రైతులకు లబ్ధి చేకూరుతుందని బెసెంట్ వివరించారు.
- 
      
                   
                                                       దేశ ఖ్యాతిని చాటిన క్రీడాకారుడు అజహరుద్దీన్సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్గా సేవలందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహ్మద్ అజహరుద్దీన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ముస్లిం మైనారిటీ అనే ఏకైక కా రణంతో అజర్ను మంత్రివర్గంలోకి తీసుకోవద్దంటూ బీజేపీ కొర్రీలు పెడుతుందని ధ్వజమెత్తారు. గాంధీ భవన్లో గురువారం ఆయన మీడియా స మావేశంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉపఎన్ని కలో గెలిచే అవకాశం లేదని బీజేపీకి తెలుసని... అందుకే బీఆర్ఎస్కు లాభం చేసేందుకు కుట్రలకు తెరతీసిందని దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ తెరవెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత బట్టబయలు చేసిందని ఆయన గుర్తుచేశారు.గతంలో బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ రాష్ట్రంలో 8 సీట్లు గెలుచుకుందన్నారు. జూబ్లీహిల్స్లో బీఆర్ ఎస్కు లాభం చేకూర్చేందుకు ఆలస్యంగా బలహీనౖ మెన అభ్యర్థిని బీజేపీ ప్రకటించిందని భట్టి ఆరోపించారు. బీఆర్ఎస్కు లాభం కలిగించేందుకే అజహ రుద్దీన్ను మంత్రి కాకుండా బీజేపీ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. అజహరుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్పై బీజేపీ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసిందని... అయితే గవర్నర్ అలాంటి వ్యక్తి కాదనే నమ్మకం తనకుందని భట్టి అన్నారు. కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసిందని మండిపడ్డారు.రాజస్తాన్లో ఉపఎన్నిక వేళ మంత్రి పదవి ఎలా ఇచ్చారు?గతంలో రాజస్తాన్లోని శ్రీకరణ్పూర్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్ను బీజేపీ మంత్రివర్గంలోకి తీసుకుందని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఉపఎన్నికకు కేవలం 20 రోజుల ముందు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నా రని.. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శన మని భట్టి విమర్శించారు. మైనారిటీ అనే ద్వేషంతోనే అజహరుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని బీజపీ అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను మైనారిటీలు అర్థం చేసుకో వాలని.. ఉపఎన్నిక కేవలం జూబ్లీహిల్స్ నియోజక వర్గం వరకేనని, అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ అభ్యర్థి కాదన్నారు. మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో జరగడంలేదన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా సమాజంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం కాంగ్రెస్ మూల సిద్ధాంతమని భట్టి స్పష్టం చేశారు. అందులో భాగంగానే అజహరుద్దీన్కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. మంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన, ఆలోచన, ప్రణాళిక నిర్ణయాలపై నిబద్ధత ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మొంథా తుపానుకు సంబంధించి ప్రభుత్వం 46 గంటల ముందే అప్రమత్తమైందని.. సీఎం రేవంత్రెడ్డితోపాటు యావత్ కేబినెట్, సీఎస్, అధికార యంత్రాంగమంతా 24 గంటలూ పనిచేసి కావాల్సిన చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల భారీ ప్రాణ, ఆస్తి, ఇతర నష్టం జరగకుండా చూడగలిగినట్లు భట్టి తెలిపారు.
- 
      
                   
                                                       సంక్షోభాలు, తుపాన్లు వస్తే అమెరికా మనలా ఎదుర్కోలేదుసాక్షి, అమరావతి: ఉపగ్రహ చిత్రాలతో మోంథా తుపాన్ పరిస్థితిని అంచనా వేశామని, భారీవర్షాలు, గాలుల తీవ్రతపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని టెక్నాలజీలను అనుసంధానించి రియల్టైమ్ గవర్నెన్స్లో మోంథా కదలికలను పసిగట్టామని, తద్వారా వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించామని తెలిపారు. కానీ, వర్షాలు అక్కడ కాకుండా వేరేచోట కురిశాయన్నారు. ఓ విధంగా మోంథా దాగుడుమూతలు ఆడిందన్నారు. తుపాన్ను టెక్నాలజీ సాయంతో ఎలా ఎదుర్కొన్నామనే అంశాన్ని గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు వివరించారు. ‘‘మెరికాలో సంక్షోభం వస్తే మేనేజ్ చేయలేరు. తుపాన్లు వచ్చినా ఎదుర్కోలేరు. మనం 16 నెలల్లో టెక్నాలజీ వ్యవస్థను తయారు చేశాం. దానిని వినియోగించి అద్భుతంగా ఎదుర్కోగలిగాం. ఏ రిజర్వాయర్లో, ఏ చెరువులో ఎంత నీరుందో గుర్తించాం. ఎక్కడెక్కడ పెద్దఎత్తున ప్రవాహాలు వస్తాయో ఊహించి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేశాం. మరణాలు, ఆస్తి నష్టం బాగా తగ్గించాం. వరద నీటితో పాటు పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాం. గతంలో తుపాన్ ప్రభావం తగ్గిన వారం రోజుల వరకు కోలుకునే పరిస్థితి ఉండేది కాదు’’ అని వివరించారు. ‘‘మోంథా బీభత్సం సృష్టించింది. కాకినాడ దగ్గర ఊహిస్తే వేరేచోట తీరం దాటింది. ఇక్కడినుంచి తెలంగాణ వెళ్లింది. వరంగల్లో ఒకేసారి 43 సెంటీమీటర్లు వర్షం పడింది. రాష్ట్రంలో మోంథా కారణంగా రూ.5,265.51 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. పూర్తిస్థాయిలో అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తాం’’ అని తెలిపారు. పంటలకు రూ.829 కోట్లు, ఉద్యాన రంగంలో రూ.39 కోట్లు, సెరీకల్చర్కు రూ.65 కోట్లు, ఆక్వా రంగంలో రూ.1,270 కోట్లు, ఆర్అండ్బీకి రూ.2,079 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.109 కోట్లు, జల వనరుల విభాగంలో రూ.207 కోట్లు, పంచాయతీరాజ్ రూ.8 కోట్లు, విద్యుత్ శాఖ రూ.16 కోట్లు, పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఎదురుచూసే వారి కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి నెల, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు.వరి తినేవారు ఉండరు..టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య రంగంలో రూ.4, 5 వేల కోట్లు, సాగు నీటి ఎత్తిపోతల విద్యుత్ చార్జీల్లో రూ.8 వేల కోట్ల బడ్జెట్ తగ్గిస్తామని చంద్రబాబు తెలిపారు. ‘‘ఉపగ్రహం ద్వారా పంట ఉత్పత్తి అంచనా వేస్తాం. దానిప్రకారం మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. రైతులు ఖరీఫ్, రబీలోనూ వరి పంటనే వేస్తున్నారు. వరి తినేవారు ఉండరు. డిమాండ్ ఉన్న పంటలు వేస్తేనే లాభసాటి. ఈ ఖరీఫ్లో 37 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాం’’ అని పేర్కొన్నారు.
- 
      
                   
                                                       రెబల్స్తో ట్రబుల్స్అసంతృప్తుల బుజ్జగింపు బిహార్లో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. తొలి దశ ఎన్నికలు జరిగే 121 స్థానాల్లో 24 చోట్ల ఓట్లను చీల్చగల తిరుగుబాటు అభ్యర్థులున్నారు. ఎన్డీయే, ఇండియా కూటములకు వీరు సవాలుగా మారారు. దీంతో, సంకీర్ణ పొత్తుల పోరాటంలో ఓట్ల బదలాయింపు ఏ మేరకు జరుగుతుందనే ఆందోళన పార్టీలను వెంటాడుతూనే ఉంది. పొత్తుల కారణంగా సీట్లు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి అన్ని పార్టీల నేతలకు వచ్చింది. అయితే దీన్ని వారు సానుకూలంగా తీసుకోవడం లేదు. తాము చేస్తున్నది స్నేహ పూర్వక పోటీ మాత్రమేనని కొంతమంది రెబల్స్ చెబుతున్నారు. 2020 ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో 11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు సాధ్యమైంది. ఈ 11 స్థానాల్లో నూ తిరుగుబాటు అభ్యర్థులు 40 నుంచి 50 వేల ఓట్లు సాధించారు. వీరంతా ప్రధాన పార్టీలు టికెట్ నిరాకరించడంతో పోటీకి దిగిన వారే. సత్తా చూపేందుకేనా?సంకీర్ణ రాజకీయాలే బిహార్లో తిరుగుబాటు అభ్యర్థులకు తెగింపు నిస్తున్నాయనేది పట్నాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు జగదీవ్ పూరీ అభిప్రాయం. ఎన్డీయేలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎస్పీ ఉన్నాయి. ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ, వామపక్ష పార్టీలున్నాయి. ఇవి కాకుండా జన్సురాజ్, బీఎస్పీ, ఏఐఎంఐఎం వంటి పార్టీలూ పోటీ చేస్తున్నాయి. కూటముల మధ్య పొత్తుల కారణంగా సీట్ల సర్ధుబాటు అనివార్యమైంది. దీంతో ఐదేళ్లుగా నియోజకవర్గంలో బలాన్ని పెంచుకున్న నేతలకు సీట్లు దక్కలేదు. మౌనంగా ఉండిపోతే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్నారని ఎన్డీయే పక్షంలో సీటు రాని మధోల్ తెలిపారు. తమకు ప్రజాబలం ఉన్నప్పటికీ అగ్ర నేతలను ఆర్థికంగా లోబర్చుకున్నారనేది ఆయన ప్రత్యర్థులపై చేసే ఆరోపణ. అధిష్టానం బుజ్జగించినా రెబల్స్ వినేట్టు లేదని పలువురు నేతలు చెబుతున్నారు. బరి నుంచి తప్పుకున్నా, నష్టం చేయడానికి వారు మొగ్గు చూపడం పోటీ చేస్తున్న అభ్యర్థులను కలవర పెడుతోంది. రెబల్స్ తాకిడి ఉన్న స్థానాలు→ మాంఝీ స్థానంలో బీజేపీ రెబల్ రాణా ప్రతాప్ డబ్ల్యూ సవాల్గా మారారు. జేడీయూ అభ్యర్థి రణధీర్ సింగ్ను ఓడించడం లక్ష్యంగా చెబుతున్నారు. సీపీఎం ఎమ్మెల్యే సత్యేంద్ర యాదవ్ కూడా పోటీ చేస్తున్నారు.→ గరౌలిలో ఆర్జేడీ దిలీప్ సింగ్కు టికెట్ ఇచ్చింది. ఆర్జేడీ అభ్యర్థి రేయాజుల్ హక్ రాజు టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు స్వరం విన్పిస్తున్నారు. → సతావ్పూర్ కమల్ నుంచి ఎల్జేపీ అభ్యర్థి సురేంద్ర వివేక్పై జేడీయూ నేత శశికుమార్ అలియాస్ అమర్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యే సంతానంద్ సంబుద్ధ పోటీలో ఉన్నారు.→ జమాల్పూర్లో మాజీ మంత్రి శైలేష్ కుమార్ జేడీయూను వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జేడీయూ నచికేత మండల్ను నామినేట్ చేసింది. వీఐపీకి చెందిన నరేంద్ర తంతి బరిలో ఉన్నారు.→ చరివవారియార్పూర్లో ఆర్జేడీ నేత రామ్సఖా మహతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ అభ్యర్థి సుశీల్ కుష్వాహాను ఎదుర్కొంటున్నారు. జేడీయూ అభ్యర్థి అభిషేక్ కుమార్ పోటీ చేస్తున్నారు.→ జాలే స్థానం నుంచి రిషి మిశ్రా కాంగ్రెస్ అభ్యర్థి. చివరి నిమిషంలో ఆర్జేడీ నుంచి కాంగ్రెస్లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. 2020లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మక్సూద్ అహ్మద్ ఉస్మానీ తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మంత్రి, బీజేపీ నాయకుడు జీవేత్ ఇక్కడ పోటీ చేస్తున్నారు.→ బస్విధలో జేడీయూ ఎమ్మెల్యే సుదర్శన్ కుమార్ పార్టీ టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జేడీయూ డాక్టర్ పుష్పంజయ్ కుమార్ను, కాంగ్రెస్ త్రిశుల్ధారి సింగ్ను బరిలోకి దించాయి.→ మహ్నార్లో ఆర్జేడీ స్విందర్ సింగ్ను బరిలోకి దింపింది. ఆర్జేడీకి చెందిన సంజయ్ రాయ్ రెబల్గా మారారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అచ్యుతానంద సింగ్ (కాంగ్రెస్ను వీడి) పరాస్కు చెందిన ఆర్ఎల్ఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు.→ ఛప్రా నుంచి బీజేపీ అభ్యర్థి రాఖీ గుప్తా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఛోటీ కుమారికి పెద్ద సవాల్గా మారారు. ఆర్జేడీ నుంచి ఖేసరీ లాల్ యాదవ్ పోటీ చేస్తున్నారు.→ జగదీష్పూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్ విష్ణు లోహియా కుమారుడు కిషోర్ కునాల్కు టికెట్ ఇచ్చారు. రాజీవ్ రంజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.→ గోపాల్గంజ్లో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అనూప్లాల్ శ్రీవాస్తవ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సుభాష్ సింగ్ను నిలబెట్టింది. → బచ్వారలో బీజేపీ నేత శత్రుఘ్న కుమార్ ఆ పార్టీ అభ్యర్థి సురేంద్ర మెహతాపై తిరుగుబాటుదారు. అతను ఇప్పుడు పార్టీ ఇబ్బందులను మరింత పెంచుతున్నాడు.→ సూర్యగఢలో ఎల్జేపీ ఆర్జేడీకి చెందిన అశోక్ సింగ్ అని పిలిచే రవిశంకర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన జేడీయూకి చెందిన రామానంద్ మండల్ను ఎదుర్కొంటారు. ఆర్జేడీ నుంచి ప్రేమ్ సాగర్ చౌదరి పోటీ చేస్తున్నారు. వనం దుర్గా ప్రసాద్ (బిహార్ నుంచి సాక్షి ప్రతినిధి)
- 
      
                   
                                                       దేశ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తికి మంత్రి పదవా?సాక్షి, హైదరాబాద్: దేశ పరువుప్రతిష్టలను దెబ్బతీస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై గతంలో నిషేధానికి గురైన మాజీ క్రికెటర్ అజహ రుద్దీన్ను కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి దుయ్య బట్టారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన్ను ఇప్పుడు హడావుడిగా ఎవరిని ఉద్ధరించేందుకు మంత్రిని చేస్తున్నారని నిలదీశారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వడం చట్ట విరుద్ధమైనప్పటికీ అధికార కాంగ్రెస్ దిగజారి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత 22 నెలలుగా లేనిది జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందే మైనారిటీల సంక్షేమం కోసం మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వానికి గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ కక్కుర్తి పడుతోందని.. మైనారిటీలను సంతృప్తిపరిచేందుకు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కనపడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వంగి వంగి సలాం కొడుతున్నారని.. కుహనా లౌకికవాదం, బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్–బీఆర్ఎస్ మజ్లిస్కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నాయని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉపఎన్ని కలో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ అభ్యర్థే పోటీ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.స్లాటర్హౌస్ల మాఫియాను వదిలి గోరక్షకులపై అక్రమ కేసులా?గోరక్షణ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటించాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. పశువుల రవాణా, స్లాటర్ హౌస్ల నిర్వహణ విషయంలో కఠిన నిబంధనలున్నా పోలీసులు పూర్తిగా మాఫియా చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. స్లాటర్ హౌస్ మాఫియా పశువుల అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తోందని.. దీన్ని అరికట్టడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని విమర్శించారు. ఘట్కేసర్లో గోరక్షక్ సేవకుడు ప్రశాంత్ కుమార్ (సోనూసింగ్)పై తుపాకీతో కాల్పులకు పాల్పడిన మజ్లిస్ నేత మహ్మద్ ఖురేషీపై గతంలోనే అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు.పోలీసుల బాధ్యతను గోరక్షకులు నిర్వహిస్తుంటే చట్టాన్ని ఉల్లంఘించి గోవులను అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకోకపోగా గోరక్షకులపైనే అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ న్యూ బోయిగూడ, గోల్నాక ప్రాంతాల్లోని స్లాటర్హౌస్లను వెంటనే నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో 39 అక్రమ స్లాటర్ హౌసులపై తాను గతంలో సీఎం, సీఎస్లకు లేఖలు రాశానని, వాటిపై తీసుకున్న చర్యలు ఏమిటో వెల్లడించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కూడా అక్రమ స్లాటర్ హౌసుల్లో భాగస్వాములని కిషన్రెడ్డి ఆరోపించారు.
- 
      
                   
                                                       జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ ఆపదమొక్కులుసాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కులు మొ క్కుతోందని గురువారం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికలో గెలుపు కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దా నాలు చేయడం, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవడం, మంత్రు లు గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడి చేయడం చూ స్తుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసిపోతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహి స్తున్నట్లు కనిపిస్తోందని, జూబ్లీహిల్స్లో డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయక త్వానికి గుణపాఠం చెప్పడానికి ఇదే సరైన సమయమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
- 
      
                   
                                                       ముంబైలో 17 మంది పిల్లల కిడ్నాప్.. రక్షించిన పోలీసులుముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం కిడ్నాప్ కలకలం సృష్టించింది. వెబ్సిరీస్ రూపొందించేందుకు ఆడిషన్స్ పేరిట ఓ వ్యక్తి ఎనిమిది నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల్ని ఆర్ఏ స్టూడియోకి రప్పించి కిడ్నాప్ చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు 17 మంది పిల్లల్ని, ఒక వృద్ధుడిని, మరో వ్యక్తిని రక్షించారు. పోలీసులపై కాల్పులు జరిపిన కిడ్నాపర్ రోహిత్ ఆర్య (50) ఎదురు కాల్పుల్లో మృతిచెందాడు. ఆ స్టూడియోలో పనిచేసే కిడ్నాపర్ మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన వివరాలను సంయుక్త పోలీస్ కమిషనర్ సత్యనారాయణన్ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు..అసలేం జరిగింది?ముంబైలో పొవాయ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మహావీర్ క్లాసిక్ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఆర్ఏ స్టూడియో ఉంది. ఇందులో పనిచేసే రోహిత్ ఆర్య రెండు రోజులుగా ఒక వెబ్సిరీస్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. గురువారం దాదాపు 100 మంది వచ్చారు. వీరిలో 17 మందిని ఆపేసి ఒక గదిలో బంధించాడు. దీంతో భయపడిన పిల్లలు కేకలు వేయడంతో రహదారిపై వెళుతున్న ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య బృందం, క్విక్ రెస్పాన్స్ బృందాలతో కలిసి స్టూడియోకు వచ్చారు. ఆలోపే ఆర్య ఒకటిన్నర నిమిషం నిడివితో ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేశాడు. ‘ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నా ప్లాన్ అమలుచేద్దామనుకున్నా. అందుకే పిల్లల్ని కిడ్నాప్ చేశా. నేను కొందరిని ప్రశ్నించి వాళ్ల సమాధానాలు వినాలనుకుంటున్నా. పోలీసులు ఏమైనా తెలివితేటలు ప్రదర్శిస్తే.. తర్వాత ఈ పిల్లలకు ఏదైనా హాని జరిగితే దానికి నేను బాధ్యుడిని కాదు. పోలీసులు అతి తెలివి చూపిస్తే ఈ స్టూడియో మొత్తాన్ని తగలబెడతా..’ అని ఆ వీడియోలో చెప్పాడు. ఆర్యను శాంతిపజేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో పోలీసులు స్టూడియో లోపలికి వెళ్లేందుకు మార్గం వెతికారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో మొదటి అంతస్తు కిటికీ వద్దకు చేరుకున్నారు. తర్వాత ఎనిమిదిమంది కమెండోలు బాత్రూమ్ ద్వారా స్టూడియో లోపలికి ప్రవేశించారు. పోలీసుల రాకను గమనించిన ఆర్య తన చేతిలో ఉన్న లైటర్ చూపిస్తూ పిల్లల వద్ద ఉన్న రసాయన డబ్బాలను తగులబెడతానని బెదిరిస్తూనే ఎయిర్గన్తో పోలీసులపై కాల్పులు మొదలెట్టాడు. ⇒ పోలీసులు ఎదురుకాల్పులు జరపటంతో ఆర్యకు బుల్లెట్ల గాయాలయ్యాయి. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారని జోన్–10 పోలీస్ డిప్యూటీ కమిషనర్ దత్తు నలవాడే చెప్పారు. బందీలందరినీ రక్షించాక స్టూడియోలో పోలీసులు ఒక ఎయిర్గన్, పలు రసాయన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో అతడు విధ్వంసం సృష్టించాలని కుట్రపన్ని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ను కమెండోలు కేవలం 35 నిమిషాల్లో విజయవంతంగా ముగించారు.ఎవరీ కిడ్నాపర్ ?నాగ్పూర్కు చెందిన ఆర్య సొంతంగా యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ప్రస్తుతం ముంబైలోని చెంబూర్లో ఉంటూ ఈ స్టూడియోలో పనిచేస్తున్న అతడు 12 ఏళ్ల కిందట ‘లెట్స్ చేంజ్’ కార్యక్రమం మొదలెట్టాడు. పాఠశాల చిన్నారులను శుభ్రతకు అంబాసిడర్లుగా మార్చడం ఈ కార్యక్రమం ఉద్దేశం. నాటి విద్యాశాఖ మంత్రి దీపక్ కేసార్కర్ హయాంలో ఆర్య ఈ కాంట్రాక్టు సంపాదించాడు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అతడికి రూ.2 కోట్లు రావాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలంటూ గతేడాది జనవరిలో రెండుసార్లు నిరాహారదీక్ష చేశాడు. మంత్రి నివాసం ఎదుట కూడా ధర్నా చేశాడు. దీంతో అతడికి మంత్రి రూ.7 లక్షలు, రూ.8 లక్షల చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు చెల్లలేదు. మోసపోయానని గ్రహించిన ఆర్య ఆగ్రహంతో ఈ దుస్సాహసం చేసుంటాడని భావిస్తున్నారు.
- 
      
                   
                                                       కండరాలకూ జ్ఞాపకాలు!తెలివితేటలు, జ్ఞాపకశక్తి వంటి మాటలు వినగానే.. అవి మన మెదడు సొత్తే అనుకుంటాం. కానీ, మన శరీరం అంతటా అల్లుకొని ఉండే కండరాలకు కూడా సొంత తెలివితేటలు, జ్ఞాపకాలు ఉంటా యట. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు గానీ, వాస్తవం. అంతెందుకు..? వ్యాయామం చేస్తే కండరాలు బలంగా పెరుగుతాయని మనకు తెలుసు. అయితే, మానేసిన కొన్నాళ్లకు ఆ విషయాన్ని మనం మర్చిపోవచ్చు. కానీ, కండరాలు మాత్రం మర్చిపోవట. మళ్లీ కొన్నేళ్ల తర్వాత తిరిగి మొదలు పెట్టినా, మన కండరాలు గతంలో కన్నా చప్పున స్పందిస్తాయని అధ్యయనాల్లో తేలింది. – సాక్షి, సాగుబడికండరాలకూ సొంత తెలివితేటలతో కూడిన జ్ఞాపకాలుంటాయట. మీరు కండరాలను ఎంతగా ఉపయోగిస్తే, అవి మీ శరీరానికి అంత ఎక్కువ శాశ్వత ప్రయోజనకరమైన వనరుగా మారుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సైకిల్ తొక్కేట ప్పుడు శరీరంలో కండరాలు కలిసికట్టుగా సమన్వయంతో కదలటం నేర్చుకుంటాయి. ఆ చలనశీలతను చిరకాలం పాటు గుర్తుపెట్టుకుంటాయి. జ్ఞాపకాలతో మరింత వేగంగా!కండరాల ఎపిజెనెటిక్ జ్ఞాపకశక్తిపై షార్పుల్స్ విశేష పరిశోధనలు చేశారు. ప్రవర్తన, పరిస్థితుల ప్రభావం వల్ల జన్యు వ్యక్తీకరణలో వచ్చే మార్పులను ఎపిజెనెటిక్ మార్పులు అంటారు. అంటే, జన్యువులు మారవు, కానీ అవి పనిచేసే విధానం మారుతుంది. వ్యాయామంతో కలిగే జన్యు వ్యక్తీకరణ మార్పులకు సంబంధించిన జ్ఞాపకాలను కండరాలు చిరకాలం గుర్తుంచుకుంటాయని షార్పుల్స్ పరిశోధనలు రుజువు చేశాయి. కొన్ని నెలలు లేదా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వ్యాయామం ప్రారంభించినప్పుడు పాత జ్ఞాపకాల ఆధారంగా మొదట్లో కన్నా వేగంగా కండరాలు బలం పుంజుకుంటాయని ఆయన కనుగొన్నారు. చప్పున గుర్తుతెచ్చుకుంటాయిమన కండరాల్లోని కణాలు.. శరీర కదలికలను, వ్యాయామాన్ని కలకాలం గుర్తుపెట్టుకోగలవు. అవసరమైనప్పుడు వాటిని మళ్లీ చప్పున గుర్తుతెచ్చుకోవటమే కాకుండా మొదట్లో కన్నా చప్పున స్పందించగలవని ఇటీవల వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. ‘మానవ శరీరంలో అవయవాల చుట్టూ ఉండే కండరాల్లోని కణాలు విలక్షణమైనవి. అవి పొడవుగా, పల్చగా, పోగుల మాదిరిగా ఉంటాయి. నిద్రాణంగా ఉండే ఈ మూల కణాలు శరీర కదలికలు/వ్యాయామం వల్ల వత్తిడి కలిగినప్పుడు లేదా గాయం తగిలినప్పుడు చైతన్యవంతమై కండర వృద్ధికి దోహదపడతాయి. చాలా ఏళ్ల తర్వాత మనం మళ్లీ వ్యాయామం చేసినా గతంలో కన్నా చప్పున స్పందిస్తాయని మా పరిశోధనల్లో తేలింది’ అంటారు కండర శాస్త్రవేత్త డా. ఆడమ్ షార్పుల్స్. ఆయన ఓస్లోలోని నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ సైన్సెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రతికూల జ్ఞాపకాలు!కండర కణాలు అన్ని వేళలా ‘సానుకూల జ్ఞాపకాల’తోనే స్పందించాలనేం లేదు. ఒక్కోసారి ‘ప్రతికూల జ్ఞాపకాల’తోనూ ప్రతిస్పందించవచ్చు. ప్రతికూలతకు వ్యాధి కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు.. పదేళ్ల క్రితం రొమ్ము కేన్సర్కు చికిత్స పొందిన మహిళల్లో కండరాలు ‘ప్రతికూల జ్ఞాపకాల’ వల్ల వారి వయసుకు మించి పట్టు సడలి, క్షీణించటాన్ని షార్పుల్స్ గుర్తించారు. వారితో ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయించినప్పుడు కండరాలు వయసుకు తగిన రీతిలో పున రుజ్జీవనం పొంది పటుత్వం పెంచుకోగలిగాయి. ప్రతికూల జ్ఞాపకాలపై సానుకూల జ్ఞాపకాలు పైచేయి సాధించటం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన అంటారు.
- 
      
                   
                                                       ప్రియుడ్ని కాపాడబోయి.. కళ్లెదుటే జలసమాధై..సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాగులు, వంకలు ఉప్పొంగటంతో ఆరుగురు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) బుధవారం సాయంత్రం హనుమకొండలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రామానికి వెళ్లే కల్వర్టు వద్ద వరదనీటిలో పడి చనిపోయాడు. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్కు చెందిన అడపా కృష్ణమూర్తి అనే వృద్ధుడు వరదనీటిలో పడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో కోల రామక్క (80) ఇంట్లో పడుకోగా వర్షానికి గోడ కూలి చనిపోయింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెకు చెందిన పులి అనిల్ (30) ఖిలావరంగల్ సమీపం చింతల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బైక్పై వెళ్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ప్రేమికుడిని కాపాడే ప్రయత్నంలో.. హైదరాబాద్ నుంచి బైక్పై వస్తున్న ఓ ప్రేమజంట జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో వరదలో చిక్కుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడేపల్లికి చెందిన బరిగెల శివకుమార్ కలిసి బైక్పై వెళ్తుండగా తిమ్మంపేట గ్రామ శివారులోని బోల్ల మత్తడి కల్వర్టు వద్ద ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి శివకుమార్ బైక్తో సహా కొట్టుకుపోతుండగా శ్రావ్య అతన్ని కాపాడేందుకు వరదలోకి రావడంతో ఆమె కూడా కొట్టుకపోయింది.శివకుమార్ చెట్టుకొమ్మల సహాయంతో ప్రాణం కాపాడుకోగా, గల్లంతైన శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు బుధవారం బైక్పై సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళ్తుండగా మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం కల్పన గర్భవతిగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి ఆరా తీశారు. దంపతుల బాధిత కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చారు. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) జంపన్నవాగు (చిన్నవాగు) కల్వర్టుపై వరదలో కొట్టుకుపోయిన మరణించాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో తన ఇంటిలో పడుకున్న గద్దల సూరమ్మ (58)పై గురువారం తెల్లవారుజామున గోడ కూలి పడడంతో చనిపోయింది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన రాచ కృష్ణవేణి (45) తన భర్త ప్రభాకర్తో కలిసి గురువారం బైక్పై వెళ్తుండగా మజీద్పూర్– బాటసింగారం గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వరద కాల్వలో పడిపోయారు. స్థానికులు ప్రభాకర్ను కాపాడగా, కృష్ణవేణి నీట మునిగి మృతిచెందింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లలోని కోళ్ల ఫారాల్లో వర్షాలతో సుమారు 15 వేల కోళ్లు మృతి చెందాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నాగర్కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో పొలానికి వెళ్లిన రైతులు బుధవారం దుందుభి వాగు మధ్యలో చిక్కుకుపోయారు. తాడు సహాయంతో పోలీసు సిబ్బంది అవతలి ఒడ్డుకు చేరుకొని గురువారం రైతులకు ఆహారం అందజేశారు. వారు రెండు రోజులు అక్కడే ఉండనున్నారు. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో మానకొండూర్ రూరల్ మండలం శ్రీనివాస్నగర్ శివారులో వాగు ఒడ్డున ఉన్న 16 వేల బాతులు కొట్టుకుపోయాయి.
- 
      
                   
                                                       AP: క‘న్నీరే’ మిగిలిందినేను కౌలు భూమి 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా వరి కోతకు వచ్చి కోసుకునే సమయంలో తుపాను దెబ్బకు పదెకరాల్లో పంట నేలవాలిపోయింది. కొంత పంట నీట మునిగింది. నోటి కాడ కూడు లాగేసినట్టైంది. ప్రభుత్వం, అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలి. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతాం. – వడిశ మహేశ్వరరావు, రైతు, ధవళపేట, శ్రీకాకుళం ఎనిమిది ఎకరాల పొలంలో కేఎన్ఎం రకం వరి పంట సాగు చేశాం. రూ.4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి, నానా చాకిరి చేస్తే పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడం వల్ల మొత్తం నష్టపోయాం. నష్టపోయినట్లు అధికారులకు తెలిపినా ఇప్పటికీ పట్టించుకున్న నాథుడే లేడు. ఏ అధికారి రాలేదు. కనీసం నష్టపోయిన రైతుల నుంచి వివరాలైన తెలుసుకుంటే పరిహారం వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. – పెయ్యల శ్రీకాంత్, ఉప్పలపాడు, నెల్లూరు జిల్లా సాక్షి, అమరావతి: అన్నదాతకు కన్నీరే మిగిలింది. రెక్కల కష్టాన్ని మోంథా తుపాను తుడిచిపెట్టేసింది. ఏపుగా ఎదిగిన వరి కంకులు తలలు వాల్చాయి. కళ్లేదుటే కుళ్లిపోతున్నాయి. మురుగనీటి డ్రెయిన్లలో సకాలంలో పూడిక తీయకపోవడం వల్ల ముంపునీరు దిగే మార్గం లేక ఓ వైపు గోదావరి డెల్టా రైతులు గగ్గోలు పెడుతుంటే.. కృష్ణా డెల్టా పరిధిలో ముంపునీటిని మళ్లించేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మరొక వైపు కాకినాడ జిల్లాలో ఏలేరు, సుద్దగడ్డ రిజర్వాయర్లు, బాపట్ల జిల్లాలో పర్చూరు వాగు పొంగి ప్రవహిస్తూ పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. మరొక వైపు ముంపు లేని ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. పూర్తిగా ముంపునకు గురైన పంట చేల వైపు బృందాలు కన్నెత్తి చూడకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిగా పలు విపత్తుల బారిన పడిన సందర్భాల్లో పంట నష్టపోయిన తమకు పైసా పరిహారం కూడా అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను తలపిస్తున్న చేలు పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో వరి కంకులు నేలరాలాయి. చేలల్లో ముంపునీరు పోయే మార్గం లేక రైతులు తలలుబాదుకుంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్న పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. డ్రెయినేజీ వ్యవస్థను కూటమి సర్కారు గాలికి వదిలేయడంతో డ్రెయిన్లు పూడిపోయి అధ్వానంగా మారాయి. దీంతో మోంథా ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రవాహం సవ్యంగా సాగే పరిస్థితి లేకపోవడంతో నీరు పంట చేలను ముంచెత్తింది. దీనికితోడు అవుట్పాల్ స్లూయిస్సు, స్ట్రయిట్ కట్లు నిర్వహణ వైఫల్యం కూడా పంట పొలాల మునకకు కారణంగా కనిపిస్తోంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంకలో నేలమట్టమైన అరటి తోట పొంగి ప్రవహిస్తున్న ఏలేరు, సుద్దగడ్డ రిజర్వాయర్లు కాకినాడ జిల్లాలో ఏలేరు, సుద్దగడ్డ జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. ఏలేరులో ఇప్పటికే 22 వేల క్యూసెక్కుల నీరు చేరింది. కిందకు ఏడువేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో ఒకటి రెండ్రోజుల్లో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే పిఠాపురం బ్రాంచి కెనాల్ కింద 15 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. మరో 30వేల నుంచి 50వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ముంపునకు గురైన వేలాది ఎకరాల్లోని పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతం, బాపట్లతోపాటు పలు జిల్లాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు పంట చేలను ముంచెత్తుతున్నాయి. బాపట్ల జిల్లాలో మినుము, పత్తి, సోయాబీన్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న పంటలు సగానికిపైగా దెబ్బతిన్నాయి. లంకల్లో అరటి, బొప్పాయి పంటలు తుపాను ధాటికి పూర్తిగా నేల మట్టమయ్యాయి. దీంతో రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పంట నష్ట అంచనాలను పారదర్శకంగా పూర్తిచేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆవేదన చెందుతున్నారు.శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లిలో నేలవాలిన వరి మొలకెత్తిన దృశ్యం పంటంతా నీట మునిగిపోయిందినేను రెండు ఎకరాల్లో వరి పంట వేశాను. రూ.45 వేలు వరకు ఖర్చు చేశాను. పొట్ట దశలో వరి పంట ఉండగా తుపాన్ వల్ల పంటంతా నీట మునిగిపోయింది. నోటి కాడ కూడు లాగేసినట్టైంది. – పోతు ఈశ్వరరావు, చిన అప్పనపాలెం, బుచ్చెయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లామొక్కజొన్న పొత్తులు తడిచిపోయాయి ఈ ఏడాది సుమారు 50 సెంట్లు విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశా. పంట కంకులు (పొత్తులు) విరిచి నూర్పిడికి సిద్ధం చేశా. తుపాన్తో కంకులు తడిచిపోయాయి. మొలకలు వచ్చాయి. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల్లో కూరుకుపోతాం. – కత్తుల రాధ, జుమ్మువలస, విజయనగరం జిల్లానారు మడి కొట్టుకుపోయింది నాకు సిద్దిగుంటపాళెం సమీపంలో 3 ఎకరాల పొలం ఉంది. ఈ పొలాన్ని సాగు చేసే నిమిత్తం ఈ నెల 27న 10 సెంట్ల విస్తీర్ణంలో నారుమడి తయారు చేసి 90 కిలోల బిపీటీ విత్తనాలను చల్లుకున్నాను. తుఫాన్కు నారుమడి కొట్టుకుపోయింది. – కొక్కముళ్ళ పెంచలయ్య, నెల్లిపూడి, వాకాడు మండలం, తిరుపతి జిల్లా గుర్రపు డెక్కతో నీళ్లన్నీ చేలోనే.. తుపాన్తోపాటు కాలువల్లో గుర్రపుడెక్క పేరుకుపోవడం వల్ల చేలు నీటమునిగాయి. డెక్క సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యను మంత్రి నిమ్మల రామానాయుడుకు వివరించినా ఫలితం లేదు. ఇప్పుడు తీరని నష్టం జరిగింది. – పిట్టా రత్నరాజు, ఆగర్రు, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా పంట మొత్తం చేజారిపోయింది 8 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశా. ఎకరానికి రూ.40 వేలు ఖర్చయింది. 105 బస్తాలు కౌలు ఇవ్వాలి. తుపాన్ వల్ల పంట మొత్తం దెబ్బతింది. తీవ్రంగా నష్టపోయాను. సర్కారు ఆదుకోవాలి. – గరువు శ్రీను, శివదేవుని చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లామొక్కజొన్న దెబ్బతింది ఐదు ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే అధిక వర్షాలకు రెండు ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన మూడు ఎకరాల్లో పంట కోత కోసి ఆరబోస్తే తుఫాన్కు భారీ వర్షం కురిసి కల్లాల్లో ఆరబోసిన పొత్తులు తడిచిపోయింది. దీనిని ఎలా అమ్మాలో కూడా తెలియని దుస్థితి. ప్రభుత్వం స్పందించి తడిచిన పంటను కొనాలి. – సుబ్బన్న, రైతు, కరివేన, నంద్యాల జిల్లాతుపాను తుడిచిపెట్టేసింది గొడవర్రులో 60 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు పైగా పెట్టుబడి అయ్యింది. తుపాను కారణంగా మొత్తం వరి చేలు పూర్తిగా పడిపోయాయి. కంకులు నీటిలో నానుతున్నాయి. తాలు, తప్ప తప్ప మరేమీ చేతికి వచ్చేట్టు లేదు. తుపాను పూర్తిగా పంటను తుడిచేసింది. అధికారులు సమగ్రంగా నష్టం నమోదు చేసి ఆదుకోవాలి. – కురగంటి నాగేశ్వరరావు, కౌలురైతు, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా మొక్కలు విరిగిపడితేనే పరిహారమట! 8 నెలల క్రితం బొప్పాయి మొక్కలు నాటుకున్నాను. ఆరు ఎకరాల్లో పంట సాగు చేసా. నిండు కాపుతో కోత దశలో ఉంది. తుఫాన్తో పంటంతా దెబ్బతింది. ఆరు ఎకరాలకు రూ.5 లక్షలు అప్పుచేసి పెట్టుబడి పెట్టా. ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఉద్యానవనశాఖ అధికారుల దృష్టికి విషయం తీసుకెళితే మొక్కలు గాలికి విరిగిపడితేనే పరిహారం వస్తుందంటున్నారు. ఇదెక్కడి విడ్డూరమో అర్థం కావడం లేదు. – దమ్మని చంద్రమోహన్, శింగరపల్లె, బేస్తవారిపేట మండలం, ప్రకాశం జిల్లాకౌలు రైతులను ఆదుకోవాలి నేను 22 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. పంట పూర్తిగా నేలకొరిగింది. ఎకరానికి రూ.30 వేల చొప్పన పెట్టుబడి పెట్టాను. సుమారు రూ.6.5 లక్షల వరకూ పంట నష్టం వచ్చింది. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – యామసాని శివకుమార్, కౌలు రైతు, బిక్కవోలు, తూర్పు గోదావరి జిల్లావరి పంటకు మొలకలొచ్చాయి 10 కుంటల్లో వరి పంట సాగు చేశాను. రూ.20 వేలు ఖర్చు అయ్యింది. వరి పంట కోత దశకు వచ్చింది. 15 రోజులు తర్వాత కోత కోద్దామనుకున్నా. ఈలోగా వచ్చిన మొంథా తుఫాన్ కొంప ముంచింది. వరి పంట నేలవాలి మొలకలు వచ్చాయి. సర్కారు న్యాయం చేసి పరిహారం అందించాలి. – కుమార్స్వామి రెడ్డి, రైతు, టి.పుత్తూరు, తవణంపల్లె మండలం, చిత్తూరు జిల్లా తుపాను మా కొంప ముంచింది.. మాకు కాగుపాడు ఆయకట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సొంతంగా సాగు చేశాం. వంద బస్తాలు అవ్వాల్సింది. 60 బస్తాలు కూడా అవ్వుతాదో లే§దో అర్థం కావడం లేదు. పైగా ఆ పంటను పోగుచేసేందుకు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుంది. కోత మిషన్ ఖర్చులు అదనంగా అవుతాయి. తుఫాన్ మా కొంపముంచింది. – గండికోట నాగయ్య, ఉంగుటూరు, ఏలూరు జిల్లా
- 
      
                   
                                                       రాహుల్ తన ఇటలీ మూలాలు బయటపెట్టారు: అమిత్ షానలంద/లఖీసరాయ్: బిహార్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాం«దీని బీజేపీ అగ్రనేత అమిత్ షా లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘ఛాత్ పండుగ వేళ ఛాత్మాతను ప్రారి్థస్తున్నట్లు ప్రధాని మోదీ నాటకం ఆడుతున్నారని రాహుల్ బాబా ఆరోపించారు. ఇటలీ మూలాలున్న రాహుల్ గాంధీకి భారతీయ సనాతన విశ్వాసాలను పొగిడేంత కనీసం అర్హత కూడా లేదు. గతంలోనూ మోదీ తల్లిని కాంగ్రెస్ నేతలు అవమానించారు. ఈ అవమానాలకు బదులు తీర్చేకునేలా ఈవీఎం బటన్లపై ఎన్డీఏ గుర్తులున్న చోట్ల శక్తిమేరకు గట్టిగా ఒత్తండి. ఎంత బలంగా ఒత్తాలంటే ఆ ధాటికి ఇటలీలో భూప్రకంపనలు రావాలి’’అని అన్నారు. కాంగ్రెస్పైనా అమిత్ విమర్శలు గుప్పించారు. ‘‘ఐదు శతాబ్దాల అయోధ్య నిర్మాణ కలను కాంగ్రెస్ 70 ఏళ్లు అధికారంలో ఉండి కూడా సుసాధ్యం చేయలేకపోయింది. నలందలో ఆధునిక విశ్వవిద్యాలయాన్ని మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. గతంలో మాదిరి ఆనాటి జ్ఞానభాండాగారాలను ఏ ముఖ్తియార్ ఖిల్జీ కూడా నాశనంచేయలేడు’’అని అమిత్ వ్యాఖ్యానించారు. తారాపూర్లో బీజేపీ అభ్యరి్థ, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి త్వరలో సీఎం అయ్యే అవకాశాలున్నాయని అమిత్ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. ‘‘చౌదరికి ఓటేయండి. త్వరలో ప్రధాని మోదీ ఈయనకు పెద్ద బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు’’అని అన్నారు.
- 
      
                   
                                                       సర్వేపల్లి సిస్టర్స్కు స్వాగతంహీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యం ఉన్న పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, ఆల్రెడీ ‘అఖండ 2: తాండవం’ సినిమాకు చెందిన కొంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ని రికార్డు చేశారు తమన్.ఇదే సినిమాతో సర్వేపల్లి సిస్టర్స్ను పరిచయం చేస్తున్నారు తమన్. సర్వేపల్లి సిస్టర్స్ ఎనర్జిటిక్ వోకల్స్తో ఈ సినిమా మ్యూజిక్ స్కోర్ రెడీ అవుతోంది. ఈ విషయాలను గురువారం మేకర్స్ అధికారికంగా వెల్లడించి, సర్వేపల్లి సిస్టర్స్తో తమన్ ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఇక బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ’కు సీక్వెల్గా ‘అఖండ 2: తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే.
- 
      
                   
                                                       నెదర్లాండ్స్ ఎన్నికల్లో తేలని ఫలితంది హేగ్: నెదర్లాండ్స్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీ ఫర్ ఫ్రీడం(పీవీవీ), ప్రతిపక్ష డెమోక్రాట్స్66(డీ66)లకు సమానంగా 26 చొప్పున సీట్లు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా, 26 సీట్లు గెలుచుకోవడం డీ66 ఇదే మొదటిసారి. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ఏ ఒక్కటీ లేకపోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని పరిశీలకులు అంటున్నారు. కొన్ని మున్సిపాలిటీలు, దూరప్రాంతాల మున్సిపాలిటీలు, పోస్టల్ ఓట్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. వాటి లెక్కింపు ఎప్పటికి పూర్తయ్యేది స్పష్టం కాలేదు. నాలుగు పార్టీలతో ఏర్పడిన గత ప్రభుత్వం కేవలం 11 నెలలు మాత్రమే మనుగడలో ఉంది. వలస విధానాలపై అంతర్గత కుమ్ములాటలతో ఆ ప్రభుత్వం జూన్లో పడిపోయింది. దీంతో, తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికార పీవీవీకి గట్టి దెబ్బ తగిలింది. జేఏ21 అనే చిన్న పార్టీ గత పార్లమెంట్లో కేవలం ఒక్క సీటుండగా, ఈ ఎన్నికల్లో 9 సీట్లకు బలం పెంచుకుంది. తాజా ఫలితాల వల్ల ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుందని భావిస్తున్నారు.
- 
      
                   
                                                       అన్నదాత విలవిలసాక్షి, నెట్వర్క్: మోంథా తుపాను రాష్ట్రంలో అన్నదాతను నిండా ముంచింది. భారీ వర్షాలు, వరదలకు లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలతోపాటు సిద్దిపేట జిల్లాలోనూ దాదాపు 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. సవివరంగా పంట నష్టాన్ని అంచనా వేస్తే మరో రెండు లక్షల ఎకరాలు పెరగొచ్చని చెబుతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం వరి పంట 2,82,379 ఎకరాలు, పత్తి 1,51,707 ఎకరాలు, మొక్కజొన్న 4,963 ఎకరాలు, మిరప 3,613 ఎకరాలు, పప్పుధాన్యాలు 1,228 ఎకరాలు, వేరుశనగ పంట 2,674 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. దాదాపు 2,53,033 రైతులు పంటలు నష్టపోయినట్లు చెబుతున్నారు. నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టంకరీంనగర్ జిల్లాలో 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి 2,82,379 ఎకరాల్లో, పత్తి 1,51,707, మొక్కజొన్న 4,963, మిర్చి 3,613, వేరుశనగ 2,674, పప్పుదినుసు పంటలు 1,228, ఉద్యానవన పంటలు 1,300 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 196 మంది రైతులకు చెందిన 271 ఎకరాల్లో వరి, జగిత్యాల జిల్లాలో 19,128 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ తెలిపారు. ఇందులో 17,982 ఎకరాల్లో వరి, 1146 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని వివరించారు. నష్టం లక్ష ఎకరాలపైనే..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోంథా తుపాను రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. 46,299 మంది రైతులకు చెందిన 1,27,156 ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో 30,359 మంది రైతులకు సంబంధించిన 61,511 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 310 గ్రామాల్లో 35,487 ఎకరాల్లో వరి, 25,919 ఎకరాల్లో పత్తి, 105 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. సూర్యాపేట జిల్లాలో 21,107 మంది రైతులకు చెందిన 64,939 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో వరి 54,006 ఎకరాలు, పత్తి 10,933 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 54 గ్రామాల్లో 430 మంది రైతులకు చెందిన 706.30 ఎకరాల వరి పంట 33 శాతం వరకు దెబ్బతింది. నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నెల కావస్తున్నా ఇంతవరకు వేగంగా కొనుగోళ్లు సాగడం లేదు. జిల్లాలో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వానాకాలం సీజన్లో కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇంతవరకు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. వరంగల్ జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో నష్టంఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,29,228 మంది రైతులకు చెందిన దాదాపు 2 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే 80,500 మంది రైతులకు చెందిన 1,30,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లాలో 34,820 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. జనగామ జిల్లాలో 25,796 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 5,500 ఎకరాల్లో నష్టంసంగారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన వర్షానికి సుమారు 5,500 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనావేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లాలో సుమారు 250 ఎకరాల వరకు పత్తి, వరికి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలో వరి, పత్తి పంటలకు అధికంగా నష్టం జరిగింది. 3,351 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పత్తికి నష్టం వాటిల్లింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 36,970 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఖమ్మంలో 66 వేల ఎకరాల్లో పంట నష్టంఖమ్మం జిల్లాలో 43,104 మంది రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో వరి, పత్తి, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,124 మంది రైతులకు చెందిన 4,452 ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయని గుర్తించారు. సిద్దిపేట జిల్లా పంట నష్టం వాటిల్లింది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో వరద నీరు నాలుగు అడుగుల మేర పారటంతో ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లాలో 88 మెట్రిక్ టన్నుల ధాన్యం వరదకు కొట్టుకపోయిందని గుర్తించారు.ఎకరాకు రూ.10 వేల పరిహారం: మంత్రి తుమ్మలమోంథా తుపాన్ కారణంగా ఇళ్లు, పశువులు, పంటలతో పాటు ఇతర ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాలు వచ్చాయని, కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రమే ఎకరాకు రూ.10 వేల పరిహారం చెల్లిస్తుందని మంత్రి ప్రకటించారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తుమ్మల తెలిపారు. తల్లడిల్లిన తారవ్వఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే మురికి కాల్వలోకి కొట్టుకుపోవటంతో మహిళా రైతు తారవ్వ బోరున విలపించింది. హుస్నాబాద్ వ్య వసాయ మార్కెట్కు పది ట్రాక్టర్ల వడ్లను హుస్నాబా ద్ మండలం పోతారం (ఎస్) గ్రామానికి చెందిన కేడిక తారవ్వ తీసుకువచ్చింది. భారీ వర్షానికి దాన్యమంతా మురికి కాల్వలోకి కొట్టుకుపోయింది. మార్కెట్కు వచ్చిన కలెక్టర్ కాళ్ల మీద పడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రాధేయపడింది. కష్టమంతా నీటి పాలు ఈమె పేరు నేనావత్ బుజ్జి, నల్లగొండ జిల్లా చందంపేట మండలం నక్కలగండి తండాలో తనకున్న ఐదెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచే సింది. పత్తి చేతికందే సమయంలో మోంథా తుపాన్ కారణంగా నీటిపాలైందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. రూ.2.50 లక్షల వరకు తాను పెట్టిన పెట్టుబడి నష్టపోయానని, ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతోంది.అప్పే మిగిలిందిపది ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. పెట్టుబడి రూ.2.50 లక్షలు కాగా, కౌలు కోసం రూ.1.65 లక్షలు చెల్లించాల్సి ఉంది. అంతా బాగుంటే అప్పులు, పెట్టుబడి పోగా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని అనుకున్నా. కానీ అకాల వర్షంతో వరి పంట మొత్తం నీరు నిలిచింది. మాయదారి వాన నా కడుపు కొట్టింది. – పచ్చిపాల రవి, సుర్దేపల్లి, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లాపంట నష్టపోయి.. రైతు ఆత్మహత్యలింగాపూర్ (ఆసిఫాబాద్): మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. లింగాపూర్ మండలం సీతారాంనాయక్ తండాకు చెందిన జాదవ్ బలిరాం (59) ఎనిమిది ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చేను చూసేందుకు వెళ్లాడు. భారీ వర్షానికి పంటలు దెబ్బతినడంతో అక్కడే పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు సిర్పూర్(యూ) ఆస్పత్రికి.. అనంతరం పరిస్థితి విషమించడంతో ఉట్నూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
- 
      
                   
                                                       యాక్షన్... ఎమోషన్శర్వానంద్, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బైకర్’. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ–ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ‘బైకర్’ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ని నేటి నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు.‘బాహుబలి: ది ఎపిక్, మాస్ జాతర’ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లు, మల్టీప్లెక్స్లలో ఈ గ్లింప్స్ చూపించబోతున్నారు. ఈ విషయాన్ని పేర్కొని, శర్వానంద్ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ‘‘బైకర్’లో మోటార్ సైకిల్ రేసర్గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు శర్వానంద్. 1990, 2000 బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా రేసింగ్ యాక్షన్తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ డ్రామాగా రూపొందుతోంది. మూడు తరాల రేసింగ్ కథతో, కుటుంబ బంధాలతో సాగే కథ ఇది. ఈ మూవీ గ్లింప్స్ని డిజిటల్గా నవంబరు 1న రిలీజ్ చేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాకి కెమెరా: జె. యువ రాజ్, సంగీతం: జిబ్రాన్,
- 
      
                   
                                                       రోలింగ్ సూన్హీరో విక్రమ్ కెరీర్లోని 63వ సినిమా చిత్రీకరణ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో బోడి కె. రాజ్కుమార్ అనే నూతన దర్శకుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. గతంలో ‘ఆమెన్, లో అండ్ బిహోల్డ్’ వంటి షార్ట్ ఫిల్మ్స్తో వీక్షకులను మెప్పించారు రాజ్కుమార్. అయితే విక్రమ్ కెరీర్లోని 63వ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నట్లుగా గత ఏడాది డిసెంబరులో యూనిట్ ప్రకటించింది. కానీ ఇప్పుడు మడోన్ ప్లేస్లోకి రాజ్కుమార్ వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇంకా ‘96, సత్యం సుందరం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్కుమార్తోనూ విక్రమ్ ఓ సినిమా కమిటయ్యారు. అయితే విక్రమ్తో తాను డైరెక్ట్ చేయనున్న సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యం కానుందని, ఫాహద్ ఫాజిల్తో సినిమాను పూర్తి చేసిన తర్వాత విక్రమ్తో సినిమా చేస్తానని ఇటీవల ఓ సందర్భంలో దర్శకుడు సి. ప్రేమ్కుమార్ తెలిపారు. ఈ గ్యాప్లో నూతన దర్శకుడు రాజ్కుమార్ సినిమాతో బిజీ అవుతారు విక్రమ్.
- 
      
                   
                                                       పర్మిట్ మార్గాన్ని ఉల్లంఘించినా బీమా కంపెనీ పరిహారం చెల్లించాల్సిందే: సుప్రీంన్యూఢిల్లీ: ప్రమాద బీమా చెల్లింపు విషయమై సుప్రీంకోర్టు తీర్పు కీలక తీర్పు వెలువరించింది. హఠాత్తుగా ప్రమాదం చోటుచేసుకున్న సందర్భాల్లో యజమాని లేదా నిర్వాహకుడిపై పరిహారం భారం నేరుగా పడకుండా కాపాడటమే బీమా పాలసీ ఉద్దేశమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రమాదానికి గురైన వాహనం మార్గాన్ని (రూట్ను) ఉల్లంఘించి, పర్మిట్ను అతిక్రమించిందనే ఏకైక కారణం చూపుతూ బీమా సంస్థలు బాధితులకు పరిహారం నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. బాధితుడికి లేదా అతడిపై ఆధారపడిన వారికి పరిహారం నిరాకరించడం న్యాయ విరుద్ధం. ఆ ప్రమాదం బాధితుడి తప్పేమీ లేకుండా జరిగింది కాబట్టి, బీమా సంస్థ కచ్చితంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు వాహన యజమాని, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ బీమా కంపెనీ వేసిన పిటిషన్లను కొట్టివేసింది. 2014 అక్టోబర్ 7వ తేదీన కర్నాటకలో ఓ మోటారు సైకిల్ను రాంగ్రూట్లో వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఘటనలో మోటారు సైకిలిస్ట్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటారు ప్రమాదాల ట్రిబ్యునల్ రూ.18.86 లక్షల పరిహారాన్ని వడ్డీ సహా చెల్లించాలంటూ బీమా కంపెనీని ఆదేశించింది. దీనిపై, ఆ కంపెనీ కర్నాటక హైకోర్టుకు వెళ్లింది. ఆ మొత్తం సరైందేనని ధ్రువీకరించిన హైకోర్టు.. పరిహారాన్ని ముందుగా బాధిత కుటుంబానికి చెల్లించి, ఆ తర్వాత వాహన యజమాని నుంచి వసూలు చేసుకోవాలని తీర్పు వెలువరించింది. ఈ తీర్పును వాహన యజమానితోపాటు బీమా కంపెనీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, పైవిధంగా తీర్పు వెలువరించింది.
- 
      
                   
                                                       విన్నారా... విన్నారా?ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్స్కు వస్తూనే ఉంటాయి. అలాగే హీరోలు కూడా ఎప్పటికప్పుడు తమ కొత్త ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటూనే ఉంటారు. అయితే ప్రజెంట్ తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న తెలుగు హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. కథలు విన్నారనీ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశారనీ కొంతమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ఏ హీరో ఏయే దర్శకుల కథ విన్నారు? అనే విషయాలపై మీరూ ఓ లుక్ వేయండి.జెట్ స్పీడ్తో... హీరో రవితేజ జెట్ స్పీడ్తో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మాస్ జాతర’ సినిమా నేటి (అక్టోబరు 31) నుంచి థియేటర్స్లో ప్రదర్శితమౌతోంది. అలాగే రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ‘మ్యాడ్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్తో రవితేజ సినిమా చేయాల్సి ఉంది.ఈ చిత్రాలు ఇలా ఉండగానే... ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారని, కథ విన్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో తెరపైకి వచ్చింది. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కూడా రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపించారని, మరోసారి పూర్తి కథ విన్న తర్వాత ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. అయితే ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పవన్తో అనిల్ రావిపూడి? హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు మొదలవుతున్నాయనే టాక్ తెరపైకి వచ్చింది. ‘దిల్’ రాజు, ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుందని టాక్. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రోడక్షన్స్తో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని భోగట్టా.ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ‘రేసుగుర్రం, కిక్’ చిత్రాల ఫేమ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి... సురేందర్ రెడ్డితో సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాల చిత్రీకరణలను సెట్స్కు తీసుకువెళ్తారా? లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్ కల్యాణ్. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.తమిళ దర్శకుడితో...! ‘పెద్ది’ సినిమాతో రామ్చరణ్ బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీలంకలో మొదలైన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసి గురువారం రామ్చరణ్ హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలిసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్తో రామ్చరణ్ సినిమా చేయాల్సి ఉంది.మరోవైపు తమిళ దర్శకుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్, హిందీ దర్శకుడు ‘కిల్’ ఫేమ్ నిఖిల్ నగేశ్ భట్ చెప్పిన స్టోరీలను కూడా రామ్చరణ్ విన్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అలాగే దర్శకులు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కూడా రామ్చరణ్ సినిమాలు చేస్తారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి... నెల్సన్తో రామ్చరణ్ సినిమా ఎప్పుడు సెట్స్కు వెళ్తుంది? అసలు... ఈ తమిళ దర్శకుడితో రామ్చరణ్ సినిమా ఉంటుందా? అనే అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుంది.నాగచైతన్య 25 నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఓ మిథికల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది నాగచైతన్య కెరీర్లోని 24వ సినిమా. కాగా, నాగచైతన్య కెరీర్లోని 25వ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలై పోయాయన్న టాక్ వినిపిస్తోంది. దర్శకులు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ చెప్పిన కథలను హీరో నాగచైతన్య విన్నారని ఫిల్మ్నగర్ సమాచారం. మరి... నాగచైతన్య కెరీర్లోని ఈ 25వ సినిమాకు ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకరు ఖరారు అవుతారా? లేక మరో దర్శకుడి పేరు ఏమైనా తెరపైకి వస్తుందా? అనేది వేచి చూడాలి.గ్రీన్ సిగ్నల్ గోపీచంద్తో ‘విశ్వం’ సినిమా చేసి, మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ సినిమా తర్వాత తనదైన శైలిలో మరో ఎంటర్టైనింగ్ స్టోరీని శ్రీను వైట్ల సిద్ధం చేసుకున్నారని, ఈ కథను ఇటీవల శర్వానంద్కు వినిపించగా, ఈ హీరో ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ప్రస్తుతం ‘బైకర్’, ‘భోగి’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. అలాగే ఆల్రెడీ శర్వానంద్ హీరోగా నటించిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలా వచ్చే ఏడాది మూడు సినిమాలతో శర్వానంద్ సందడి చేయనున్నారు.స్పోర్ట్స్ డ్రామా ‘రౌడీ జనార్ధన’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రం కోసం హీరోయిన్ కీర్తీ సురేశ్, విజయ్ దేవరకొండలపై మహారాష్ట్ర సరిహద్దుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా. అయితే ఈ సినిమా తర్వాత తనకు ‘టాక్సీవాలా’తో సూపర్హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్తో ఓ పీరియాడికల్ వార్ డ్రామా కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.అయితే రీసెంట్గా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా స్టోరీని విజయ్ దేవరకొండకు వినిపించారని, ఈ కథ పట్ల విజయ్ కూడా సుముఖంగా ఉన్నారని, యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్నగర్ సమాచారం. మరి... ‘రౌడీ జనార్ధన’ తర్వాత విజయ్ దేవరకొండ.. రాహుల్ సంకృత్యాన్ సినిమాను స్టార్ట్ చేస్తారా? లేక విక్రమ్ కె. కుమార్ సినిమాను మొదలు పెడతారా? అనే అంశాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకులు రాహుల్ సంకృత్యాన్, విక్రమ్ కె. కుమార్ల సినిమాలను విజయ్ ఒకేసారి సెట్స్కు తీసుకువెళ్లే అవకాశాలూ లేక పోలేదు.ద్విపాత్రాభినయం ‘తమ్ముడు’ సినిమా తర్వాత నితిన్ కొత్త చిత్రంపై ఇంకా సరైన స్పష్టత లేదు. దర్శకుడు శ్రీను వైట్ల, ‘బలగం’ ఫేమ్ దర్శకుడు వేణు యెల్దండి చెప్పిన కథలను నితిన్ విన్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమాలేవీ ఫైనలైజ్ కాలేదు. కాగా, ఇటీవల దర్శకుడు వీఐ ఆనంద్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేసుకుని, నితిన్కు వినిపించారట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త విభిన్నంగా ఉండటంతో ఈ కథ నచ్చి, నితిన్ ఈ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రంలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం ‘ఫంకీ’ సినిమాతో విశ్వక్ సేన్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబరు చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్తో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సీక్వెల్ను చేయనున్నారట. అలాగే శర్వానంద్తో ‘శ్రీకారం’ సినిమా తీసి, ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిశోర్ ఓ కథను సిద్ధం చేసి, విశ్వక్ సేన్కు వినిపించారని, ఈ సినిమాకు విశ్వక్ దాదాపు ఓకే చెప్పారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడితో...! ఇటీవలే ‘కె–ర్యాంప్’ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రజెంట్ ‘చెన్నై లవ్స్టోరీ’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఇటీవల మరో రెండు మూడు కొత్త సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాల్లో ఒకటి సుకుమార్ శిష్యుడు వీర అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.జటాయులో..? ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘జటాయు’ అనే టైటిల్తో ఓ పవర్ఫుల్ స్టోరీని ఎప్పుడో సిద్ధం చేశారు. కానీ ఈ కథతో ఈ చిత్రం ఇంకా సెట్స్కు వెళ్లలేదు. ఇందులో విజయ్ దేవరకొండ వంటి వారు హీరోలుగా నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ ‘జటాయు’ స్టోరీని ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా విన్నారని, ఈ యువ హీరోతో ఈ’ సినిమా ఆల్మోస్ట్ ఖరారై పోయిందని, ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా విషయాలపై అధికారిక ప్రకటన రానుందట. ఇక రోషన్ ప్రజెంట్ ‘చాంపియన్’ అనే ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ఇలా తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు
- 
      
                   
                                                       ఈఓ యూఎస్లో.. డిప్యూటీఈవో యూకేలోయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై పర్యవేక్షణ కొరవడింది. ఈఓ వెంకట్రావు నెలరోజులకు పైగా వ్యక్తిగత సెలవుపై అమెరికాకు వెళ్లారు. ఆయన లేనప్పుడు బాధ్యతలు చూడాల్సిన డిప్యూటీ ఈఓ లండన్, యూరప్ దేశాల్లో ఉన్నారు. ఇక ఇన్చార్జ్ ఈఓగా నియమితులైన రవినాయక్ సెప్టెంబర్ 24న బాధ్యతలు స్వీకరించారు. మొక్కుబడిగా రెండు, మూడుసార్లు విధులకు హాజరై.. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కార్తీకమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో భక్తులకు అందుబాటులో ఉండి, ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉంటుంది. కానీ, ఉన్నతస్థాయి అధికారులు ఏ ఒక్కరూ లేకపోవడంతో ద్వితీయశ్రేణి, క్షేత్రస్థాయి సిబ్బందిదే ఇష్టారాజ్యంగా మారింది.ఉన్నతాధికారులంతా సెలవుల్లో..ఆలయ ఈఓ వెంకట్రావు ఆగస్టు 30వ తేదీన పదవీవిరమణ పొందాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఆ తర్వాత పది రోజులు మాత్రమే విధులకు హాజరయ్యారు. సెప్టెంబర్ 25న వ్యక్తిగత సెలవులపై అమెరికాకు వెళ్లారు. ఆయన స్థానంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ రవినాయక్ (ఐఏఎస్) ఇన్చార్జ్ ఈఓగా గత నెల 24న బాధ్యతలు చేపట్టారు. సెలవులపై వెళ్లిన ఈఓ వెంకట్రావు ఇంకా రాకపోవడం.. ఇన్చార్జ్ ఈఓ సరిగా రాకపోవడంతో దేవస్థానం పాలన అస్తవ్యస్తంగా మారింది.డీఈఓ, అనువంశిక ధర్మకర్త సైతంఈఓ సెలవుపై వెళితే ఆ బాధ్యతలను డీఈఓ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్) చూసుకోవాలి. కానీ, డీఈఓ కూడా ఈఓ కంటే ముందుగానే యూకే, యూరప్ దేశాల్లో శ్రీస్వామి వారి కల్యాణం చేసేందుకు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, అర్చకులతో కలిసి వెళ్లారు. పరిపాలన, పర్యవేక్షణ చేసేలా అధికారులు ఉన్నతస్థాయి వారు ఎవరూ లేకపోవడంతో భక్తులకు సమస్యలు ఎదురైనా పరిష్కరించేవారు లేకుండాపోయారు. ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్చార్జ్ ఈఓ వచ్చినా..ఇన్చార్జ్ ఈఓగా నియమితులైన రవికుమార్ బాధ్యతలు ఈనెల 25వ తేదీతో ముగిశాయి. ఆ తర్వాత దేవాదాయశాఖ ఇన్చార్జ్ కమిషనర్ హరీశ్కు ఇన్చార్జ్ ఈఓగా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఇటీవల దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు.చెక్పోస్టు వద్ద అక్రమాలుఅధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యాదగిరి క్షేత్రంలో అక్రమాలు పెరుగుతున్నాయి. యాదగిరికొండపైకి కార్లలో రావాలంటే మూడవ ఘాట్ రోడ్డు చెక్పోస్టులో రూ.500 రుసుము చెల్లించాలి. చెక్పోస్టు సిబ్బంది టికెట్ జారీ చేసిన తర్వాతనే కొండపైకి వాహనాలను అనుమతిస్తారు. వాహన నంబర్, రుసుము వివరాలు లేకుండానే ఖాళీ టికెట్లు జారీ చేస్తుండటం వెలుగుచూసింది. ఈ విషయంపై ఓ వాహనదారుడు ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. మరికొందరు ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నించగా, వారు లేరని తెలిసి వెనుదిరిగారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
- 
      
                   
                                                       కాళ్ల పారాణి ఆరక ముందే కాటికి..కోస్గి: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పాటు.. పోలీసులు, గ్రామ పెద్దల వద్ద పంచాయతీలోనూ న్యాయం జరగలేదు. దీనికితోడు తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ నవ వధువు పెళ్లి జరిగిన మూడు రోజులకే బలవన్మరణానికి పాల్పడింది.స్థానికుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల మల్లప్ప, మైబమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, శ్రీలత (21) అనే కుమార్తె ఉన్నారు. శ్రీలత అదే గ్రామానికి చెందిన శ్రీశైలం అలియాస్ సూరి అనే యువకుడిని ప్రేమించింది. వీరి ప్రేమ విషయం మూడు నెలల క్రితం అమ్మాయి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు వేరే పెళ్లి సంబంధం చూశారు. దీంతో శ్రీలత అప్పట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబాల పంతం..తన కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రేమించిన యువకుడు చెప్పిన విధంగా శ్రీలత డయల్ 100కు ఫోన్ చేసి బలవంతంగా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇరు కుటుంబాల వారు గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పగా అమ్మాయి సైతం ఒప్పుకోవడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇరు కుటుంబాల వారు పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లికి ఒప్పుకునేది లేదని పంతం పట్టడంతోపాటు యువకుడు సైతం పెళ్లికి నిరాకరించాడు. ఈ క్రమంలో శ్రీలతకు ఈ నెల 26న షాద్నగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు. మంగళవారం యువతి మేనమామ ఉండే మోత్కూర్కు వధూవరులు వచ్చారు. వారి ఇంట్లో శ్రీలత పురుగు మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను వికారాబాద్ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా పరిస్థితి విషమించి గురువారం ఉదయం మృతిచెందింది. ఈ ఘటనపై యువతి సోదరులు.. శ్రీలత ప్రేమించిన యువకుడిపై కోస్గి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా, సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని, అక్కడే ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. రాజకీయ రగడ..మరో పక్క శ్రీలత ప్రేమించిన యువకుడు సూరి అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి దగ్గర డ్రైవర్గా పనిచేస్తుండటంతో రాజకీయ రగడ మొదలైంది. ఆ నాయకుడి అండతోనే యువకుడు పెళ్లికి నిరాకరించాడని, పోలీసులు సైతం వారికే మద్దతు ఇస్తున్నారని బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, ప్రజా సంఘాల నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యువతి మృతదేహంతో పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
- 
      
                   
                                                       డిప్యూటీ సీఎం పదవిపై ఆశలేదునిజామాబాద్ సిటీ: ఉప ముఖ్యమంత్రి పదవిపై తనకు అస్సలు ఆశ లేదని.. పీసీసీ చీఫ్గా చాలా సంతృప్తిగా ఉన్నానని మహేశ్ కుమార్గౌడ్ పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ పదవి బరువు బాధ్యతలతో కూడుకున్న చాలా పెద్దదన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని మహేశ్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మాజీ ఎంపీ అజహరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోకుండా బీజేపీ అడ్డుపడుతోందని ఆయన మండిపడ్డారు. ఏది ఏమైనప్పటికీ కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకొని తీరుతామని స్పష్టం చేశారు.డిసెంబర్లో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు మహేశ్గౌడ్ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కె నగేశ్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, రాజమహేందర్, జావేద్ అక్రం తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                                       Telangana: ఓరుగల్లు క‘న్నీరు’సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాను దెబ్బకు వరంగల్ నగరం కన్నీరు పెడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కురిసిన కుంభవృష్టితో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని 141 కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గురువారం కూడా కాలనీలు, రహదారులపై మోకాలిలోతు నీళ్లు నిలిచి ఉండటంతో జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్యావసరాలు, విలువైన వస్తువులన్నీ తడిసిపోవటంతో ప్రజలు ఆకలిదప్పులతో అలమటించే పరిస్థితి ఏర్పడింది. ముంపు బాధితులను డీఆర్ఎఫ్, ఎస్జీఆర్ఎఫ్, పీజీ ఎఫ్టీ బృందాలు పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించాయి. ఇళ్ల పైకప్పులపై తలదాచుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. గురువారం సాయంత్రానికి వరదనీరు తగ్గినా బురద ఉండడంతో దుర్వాసనతో ప్రజలకు తిప్పలు తప్పలేదు. ఎస్ఆర్ నగర్లోని ఓ ఇంట్లోకి వరద నీరు చేరడంతో అనారోగ్యానికి గురై మంచంలో ఉన్న వ్యక్తి నీటిలో పడి చనిపోయాడు. ప్రముఖుల పర్యటన: వరంగల్లోని ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్లో మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ సత్యశారద గురువారం పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. రామన్నపేటలో మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ అలంకార్ జంక్షన్లో వరదనీటి ప్రవాహ తీరును కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. నయీంనగర్ బ్రిడ్జి, జవహర్ కాలనీ, దేవరాజ్ కాలనీ, వడ్డెపల్లి శ్యామల గార్డెన్ ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ పర్యటించారు. ఎంపీ కడియం కావ్య లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిచ్చారు. ఒక్కసారిగా తన్నుకొచ్చిన వరద: ఐనవోలు మండలం కొండపర్తి చెరువు కట్టకు గండిపడంతో ఆ నీళ్లంతా కొత్తపల్లి, భట్టుపల్లి చెరువు నుంచి నేరుగా బొందివాగు నాలా ద్వారా హంటర్ రోడ్డు పరిసరాలను ముంచెత్తింది. బంధం చెరువు, బెస్తం చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల మత్తళ్లు పొంగి నగరాన్ని ముంచెత్తాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి వచ్చిన నీళ్లలో యువకులు వలలు వేసి చేపలు పట్టారు. ఆక్రమణలే సమస్యకు కారణం.. వరంగల్ నగరం ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతోంది. ముఖ్యంగా బెస్తం చెరువు, ఉర్సు రంగ సముద్రం, బంధం చెరువు, వడ్డెపల్లి చెరువు, గోపాల్పూర్ చెరువు, చిన్నవడ్డెపల్లి చెరువు, బొందివాగు నాలా, కట్టమల్లన్న నుంచి చిన్నవడ్డెపల్లికి వచ్చే నాలా, అగర్తాలా నాలా, సాకారాశి కుంట నాలా తదితర నీటి వనరులు అక్రమణకు గురికావడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. సరైన మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ లేకపోవడం కూడా ముంపునకు కారణమవుతోంది. రూ.100 కోట్లతో నయీంనగర్ నాలాను పటిష్టం చేయటంతో కొన్ని కాలనీలు వరద ముంపు నుంచి తప్పించుకున్నాయి. 2020 సెపె్టంబర్లో భారీ తుపాన్కు వరంగల్ నగరంలో వరద ముంచెత్తి ఏడుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. 171 కాలనీలు వారం రోజులపాటు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఐదేళ్ల తరువాత మోంథా తుపాను వరంగల్ను అతలాకుతలం చేసింది. నగరంలోని 141 కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. నేడు సీఎం రేవంత్రెడ్డి ఏరియల్ సర్వే... నీట మునిగిన వరంగల్ మహానగరం సహా ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అకాల వర్షం, వరదలపై ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ లో పర్యటిస్తానని తెలిపారు. భయం గుప్పిట్లోనే పరీవాహకం మోంథా తుపాన్ ప్రభావంతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాల్వ ఒడ్డు వద్ద మున్నేటి వరద ప్రవాహం గురువారం సాయంత్రం 5 గంటలకు 25.80 అడుగుల మేర నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం లేకున్నా మున్నేరుకు వరద పెరుగుతుండడంతో పరీవాహక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వరద ఉధృతి దృష్ట్యా బుధవారం సాయంత్రం నుంచే కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లి గుడి వెనుక రోడ్డు, ధంసలాపురం కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఖమ్మం నయాబజార్ కళాశాలకు 100 కుటుంబాలు, ధంసలాపురం పాఠశాలకు 30 కుటుంబాలను తరలించారు. ఖమ్మం–బోనకల్ రహదారిపై నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ఐదుగురు మృతి.. పలువురు గల్లంతు మోంథా తుపాన్ ప్రభావంతో వాగులు, వంకలు ఉప్పొంగటంతో ముగ్గరు వ్యక్తులు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) బుధవారం సాయంత్రం హనుమకొండలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రామానికి వెళ్లే కల్వర్టు వద్ద వరదనీటిలో పడి చనిపోయాడు. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్కు చెందిన అడపా కృష్ణమూర్తి అనే వృద్ధుడు వరదనీటిలో పడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో కోల రామక్క (80) ఇంట్లో పడుకోగా వర్షానికి గోడ కూలి చనిపోయింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెకు చెందిన పులి అనిల్ (30) ఖిలావరంగల్ సమీపం చింతల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బైక్పై వెళ్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. హైదరాబాద్ నుంచి బైక్పై వస్తున్న ఓ ప్రేమజంట జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో వరదలో చిక్కుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడేపల్లికి చెందిన బరిగెల శివకుమార్ కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి శివకుమార్ బైక్తో సహా కొట్టుకుపోతుండగా శ్రావ్య అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి వరదలో పడిపోయింది. శివకుమార్ చెట్టుకొమ్మల సహాయంతో ప్రాణం కాపాడుకోగా, గల్లంతైన శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు బుధవారం బైక్పై సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళ్తుండగా మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం కల్పన గర్భవతిగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి ఆరా తీశారు. దంపతుల బాధిత కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చారు. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) జంపన్నవాగు (చిన్నవాగు) కల్వర్టుపై వరదలో గల్లంతయ్యాడు. గురువారం గాలింపు చేపట్టగా వాగుకు కొంతదూరంలో సంపత్ మృతదేహం లభ్యమైంది. అదేవిధంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో తన ఇంటిలో పడుకున్న గద్దల సూరమ్మ (58)పై గురువారం తెల్లవారుజామున గోడ కూలి పడడంతో చనిపోయింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లలోని కోళ్ల ఫారాల్లో వర్షాలతో సుమారు 15 వేల కోళ్లు మృతి చెందాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నాగర్కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో పొలానికి వెళ్లిన రైతులు బుధవారం దుందుభి వాగు మధ్యలో చిక్కుకుపోయారు. తాడు సహాయంతో పోలీసు సిబ్బంది అవతలి ఒడ్డుకు చేరుకొని గురువారం రైతులకు ఆహారం అందజేశారు. వారు రెండు రోజులు అక్కడే ఉండనున్నారు. హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై వాహనాల దారిమళ్లింపు నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు కుడి భాగంలో నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న అలుగు నీటి ప్రవాహం ధాటికి హైద్రాబాద్–శ్రీశైలం హైవేపై బ్రిడ్జి వద్ద రోడ్డు బుధవారం అర్థరాత్రి కొట్టుకుపోయింది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహనాలను నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మీదుగా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా నుంచి శ్రీశైలం, అచ్చంపేటకు పంపిస్తున్నారు. కొట్టుకపోయిన రోడ్డు పునరుద్ధరణ పనులు గురువారం ప్రారంభించారు. మరోసారి తెరపైకి ‘లైడార్ సర్వే’హైదరాబాద్ నగరంలోని జలాశయాలు, చెరువులు, నాలాల అక్రమణదారులపై హైడ్రా ద్వారా ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే తరహాలో వరంగల్లోనూ ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. హైడ్రా తరహాలో వాడ్రాను తీసుకురావాలని ఇప్పటికే సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, వరంగల్లోని చెరువులపై లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ (లైడార్) సర్వే చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలోనే ఈ సర్వే చేయాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా మోంథా తుపానుతో నగరం మొత్తం నీట మునగటంతో మళ్లీ లైడార్ సర్వే తెరపైకి వచ్చింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 75 చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారంతో సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు.
- 
      
                   
                                                       సహజ, రష్మిక నిష్క్రమణచెన్నై: చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత నంబర్వన్ సహజ యామలపల్లి, భారత రెండో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ప్రపంచ 340వ ర్యాంకర్ సహజ 2–6, 2–6తో ప్రపంచ 78వ ర్యాంకర్, మూడో సీడ్ డొనా వెకిచ్ (క్రొయేషియా) చేతిలో... ప్రపంచ 341వ ర్యాంకర్ రష్మిక 5–7, 6–7 (2/7)తో ప్రపంచ 117వ ర్యాంకర్ కింబర్లీ బిరెల్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓటమి పాలయ్యారు. వెకిచ్తో 78 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సహజ ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయింది. తన తొలి సర్వీస్లో 25 పాయింట్లకుగాను 13 పాయింట్లు... రెండో సర్వీస్లో 31 పాయింట్లకుగాను 15 పాయింట్లు స్కోరు చేసింది. కింబర్లీతో జరిగిన మ్యాచ్లో రష్మిక అద్భుతంగా ఆడినా విజయాన్ని అందుకోలేకపోయింది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక 12 ఏస్లు సంధించి, 7 డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను ఏడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. తన తొలి సర్వీస్లో 56 పాయింట్లకుగాను 34 పాయింట్లు... రెండో సర్వీస్లో 56 పాయింట్లకుగాను 19 పాయింట్లు సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సహజ, రష్మికలకు 4,470 డాలర్ల (రూ. 3 లక్షల 96 వేలు) ప్రైజ్మనీతోపాటు 30 ర్యాంకింగ్ పాయింట్ల చొప్పున లభించాయి. డబుల్స్ విభాగం తొలి రౌండ్లో సహజ (భారత్)–కరోలైన్ వెర్నర్ (జర్మనీ) ద్వయం 6–3, 3–6, 7–10తో పొలీనా–మరియా (ఉజ్బెకిస్తాన్) జంట చేతిలో ఓడిపోయింది.
- 
      
                   
                                                       యూకీ జోడీ పరాజయంన్యూఢిల్లీ: పారిస్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో భారత డబుల్స్ టెన్నిస్ నంబర్వన్ యూకీ బాంబ్రీ కథ ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం 4–6, 7–6 (7/5), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. 1 గంట 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–పావ్లాసెక్ మూడు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. తొలి సర్వీస్లో 49 పాయింట్లకుగాను 36 పాయింట్లు... రెండో సర్వీస్లో 27 పాయింట్లకుగాను 14 పాయింట్లు సాధించారు. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన యూకీ–పావ్లాసెక్లకు 26,275 యూరోల (రూ. 26 లక్షల 94 వేలు) ప్రైజ్మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
- 
      
                   
                                                       104 మందిని చంపేసి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాట104 మందిని చంపేసి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాట
- 
      
                   
                                                       ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక జోడీసార్బ్రుకెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ గద్దె రుత్విక శివాని శుభారంభం చేసింది. తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–18, 21–13తో జొనాథన్ బింగ్–క్రిస్టల్ లాయ్ (కెనడా) జంటపై విజయం సాధించింది. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రుత్విక–రోహన్లకు తొలి గేమ్లో కాస్త పోటీ లభించినా... రెండో గేమ్లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రియాన్షి 21–19, 8–21, 13–21తో భారత్కే చెందిన రక్షితశ్రీ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ లక్ష్య సేన్తోపాటు కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో లక్ష్య సేన్ 21–14, 21–11తో భారత్కే చెందిన శంకర్ ముత్తుస్వామిపై గెలుపొందగా... కిరణ్ జార్జి 18–21, 21–18, 21–19తో ప్రపంచ 13వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించాడు. మరో మ్యాచ్లో ఆయుశ్ శెట్టి 21–11, 21–11తో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్యె (సింగపూర్)కు షాక్ ఇచ్చాడు. హైదరాబాద్కు చెందిన తరుణ్ మన్నేపల్లి తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. తరుణ్ 11–21, 12–1తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.
- 
      
                   
                                                       చమురు కొనుగోళ్లకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాంన్యూఢిల్లీ: రష్యన్ చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్ తన ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు మరిన్ని కొత్త మార్గాలను అన్వేíషింంచనుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైస్వాల్ గురువారం ప్రకటించారు. రష్యాలో ప్రభుత్వరంగ అతిపెద్ద చమురు సంస్థ రోస్నెఫ్ట్తోపాటు అక్కడి అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ లక్ఆయిల్లపై ఆంక్షల కొరడా ఝలిపించామని దక్షిణకొరియాలో ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే భారత్ స్పందించడం గమనార్హం. అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ ఈ సంస్థల నుంచి తక్కువ ధరకు చమురుకొనే బదులు ఇదే రేట్లకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయగల అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకుంటూ అమెరికా పెట్రోలియం ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోబోందన్న వార్తల నడుమ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ ఇంకా చర్చలు జరుపుతోందని గుర్తుచేశారు. అయితే గత నెలలతో పోలిస్తే తాజాగా రష్యన్ సంస్థల నుంచి భారత చమురు కొనుగోళ్లు తగ్గినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఛాబహార్ పోర్ట్ విషయంలో ఊరట ఇరాన్లోని కీలక ఛాబహార్ ఓడరేవు నుంచి అంతర్జాతీయ నౌకల రాకపోకలపై అమెరికా విధించిన ఆంక్షలను భారత్ కోసం కొద్దికాలం పక్కనబెట్టింది. ఆరు నెలలపాటు ఆంక్షల నుంచి భారత్ను మినహాయింపునిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మినహాయింపు అక్టోబర్ 29వ తేదీ నుంచి మొదలవుతుందని జైస్వాల్ చెప్పారు. అంతర్జాతీయంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో తనకు ప్రతికూలంగా మారొద్దనే అక్కసుతో అమెరికా ఈ ఓడరేవుపై సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఆంక్షలు విధించడం తెల్సిందే. అయితే భారత అభ్యర్థనతో ఆ ఆంక్షల అమలును నెలరోజులు వాయిదా వేశారు. తాజా చర్చలతో దానిని మరో ఆరునెలలు పొడిగించారు. ఛాబహర్ పోర్ట్ను అనుసంధానత, సత్సంబంధాలే లక్ష్యంగా భారత్, ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధిచేశాయి.
- 
      
                   
                                                       ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీతో జై షా భేటీన్యూఢిల్లీ: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు జై షా భేటీ అయ్యారు. లుసానేలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. 1900 పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో తొలిసారి క్రికెట్ పోటీలు నిర్వహించగా... ఆ తర్వాత మరెప్పుడూ విశ్వక్రీడల్లో క్రికెట్కు చోటు దక్కలేదు. ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజెలిస్లో జరగనున్న ఒలింపిక్స్లో తిరిగి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. మహిళల, పురుషుల విభాగాల్లో ఆరేసి జట్లు ఒలింపిక్స్లో పాల్గొంటుండగా... టి20 ఫార్మాట్లో మ్యాచ్లు జరగనున్నాయి. ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనం చేయనుండగా... దీనిపై ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీని కలవడం ఆనందంగా ఉంది.ఆ దిశగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో పాటు ఒలింపిక్ ఉద్యమంలో క్రికెట్ పాత్ర, దాని ప్రాధాన్యత గురించి చర్చించాం’ అని జై షా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇదే అంశంపై ఐఓసీ అధ్యక్షురాలితో ఈ ఏడాది ఆరంభంలోనూ జై షా సమావేశమయ్యారు.
- 
      
                   
                                                       సూడాన్లో నరమేధంఖార్టుమ్: సూడాన్లోని ఉత్తర దార్ఫుర్ ప్రాంతంలో ఉన్న ఎల్–ఫషేర్ నగరంలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్) మూకలు రక్తపు టేరులు పారిస్తున్నాయి. నగరంలోకి ఆదివారం ప్రవేశించిన ఈ బలగాలు వేలాది మంది పౌరులను నిర్బంధంలోకి తీసుకున్నాయి. వారిలో కనీసం 1,500 మందిని చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నగరంలోని సౌదీ ఆస్పత్రిని దిగ్బంధించి, మరో 460 మందిని బలి తీసుకున్నట్లు సమాచారం. భయకంపితులైన జనం ప్రాణాలరచేత బట్టుకుని పలాయనమవుతున్నారు. వారిని కూడా ఆర్ఎస్ఎఫ్ మూకలు వదలడం లేదు. చిత్రహింసల పాల్జేజి, చంపేస్తున్నారు. ఎలాగోలా తప్పించుకుని కాలి నడకన కనీసం 36 వేల మంది జనం అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలోని టవిలా పట్టణానికి చేరుకున్నట్లు సమాచారం. 48 గంటల వ్యవధిలోనే 15 వేల మంది నగరం వీడినట్లు అంచనా. ఇప్పటికే అక్కడ గూడుకోల్పోయిన వారు 6.50 లక్షలమంది ఉన్నట్లు అంచనా. ఖననం చేసే వారు లేకపోవడంతో ఎల్–ఫషెర్ నగరంలో ఎక్కడ చూసినా మృతదేహాలే పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అక్కడ భయానక వాతావరణం నెలకొందన్నారు. కట్టుబట్టలతోనైనా తాము బయట పడటం అదృష్టమని చెప్పారు. ఆర్ఎస్ఎఫ్ సామూహిక జననానికి పాల్పడుతోందని సూడాన్ ఆర్మీ ఆరోపిస్తోంది. ఎల్–ఫòషేర్లో నరకానికి మించిన దారుణ పరిస్థితులున్నాయని ఐరాస మానవీయ విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్ వ్యాఖ్యానించారు. ఎల్–ఫòషేర్ నగరాన్ని ఏడాదిన్నర కాలంగా ఆర్ఎస్ఎఫ్ దిగ్బంధించింది. ఆహారం, ఇతర అత్యవసరాలు అందకుండా చేసింది. సూడాన్ ఆర్మీ నగరం నుంచి ఉపసంహరించుకోవడంతో రెచ్చిపోతోంది.
- 
      
                   
                                                       ఈ రాశి వారికి స్థిరాస్తి లాభం.. వాహనయోగంగ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తిక మాసం, తిథి: శు.దశమి తె.3.54 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి ఏకాదశి, నక్షత్రం: ధనిష్ఠ ప.2.39 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.9.48 నుండి 11.23 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.03 వరకు, తదుపరి ప.12.10 నుండి 12.56 వరకు, అమృత ఘడియలు: లేవు.సూర్యోదయం : 6.01సూర్యాస్తమయం : 5.27రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం.. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ముఖ్య నిర్ణయాలు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.వృషభం... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. యత్నకార్యసిద్ధి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు.మిథునం... కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యలతో విభేదాలు. దైవచింతన. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.కర్కాటకం.... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. మానసిక అశాంతి. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.సింహం.... మీ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.కన్య... కార్యజయం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి లాభం. వాహనయోగం.తుల..... దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. విద్యార్థులకు ఒత్తిడులు.వృశ్చికం... ప్రయాణాలు వాయిదా. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యం.ధనుస్సు..... వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం.మకరం.... వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుస్తారు. ప్రయత్నాలు మందగిస్తాయి. కార్యక్రమాలలో అవరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు.కుంభం... కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మీనం.... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. అనారోగ్యం.
- 
      
                   
                                                       యుద్ధం ఆపానన్న ట్రంప్తో మోదీ వాదనలో గెలవలేరుషేక్పురా(బిహార్): ఆపరేషన్ సిందూర్ వేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న వాదనలకు అడ్డుకట్ట వేసే ధైర్యం ప్రధాని మోదీకి అస్సలు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. బిహార్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా గురువారం నలంద, షేక్పురాలో సభలో రాహుల్ ప్రసంగిస్తూ మోదీపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ‘‘తన కారణంగానే భారత్, పాక్ యుద్ధం ఆగిందని ఇప్పటికే ఎన్నో సార్లు ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై డప్పు కొట్టారు. ఆయన ప్రకటనలను ప్రధాని మోదీ కనీసం అడ్డుకునే సాహసం చేయట్లేరు. మీరు మాట్లాడేది అబద్ధం అని మాట వరసకు కూడా ట్రంప్కు చెప్పే ధైర్యం మోదీకి లేదు. ఇటీవల కాలంలో మోదీ అమెరికాకు వెళ్లాల్సింది. కానీ ట్రంప్ భయానికే ఆయన అమెరికా వైపు కన్నెత్తి చూడట్లేరు. నిజంగానే మోదీకి అంతటి ధైర్యం ఉంటే బిహార్ ఎన్నికల ర్యాలీల్లో యుద్ధం ఆపింది ట్రంప్ కానేకాదు అని మోదీ కరాఖండీగా ప్రకటించాలి’’అని రాహుల్సవాల్ విసిరారు. ధైర్యశాలి ప్రధాని అంటే మా నాన్నమ్మే ‘‘నిజానికి ప్రధాని అంటే ఎంతటి ధైర్యశాలిగా ఉండాలో మా నాన్నమ్మ, నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలి. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడితో ఇందిర సూటిగా ‘మాకు మీరంటే ఏమాత్రం భయంలేదు’అని ముఖం మీదే చెప్పేశారు. ఆమె తెగింపు గల నాయకురాలు’’అని ఇందిరను రాహుల్ గుర్తుచేసుకున్నారు. బిహార్లో భూములు అందుబాటులో లేవన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘బడా పారిశ్రామిక సంస్థకు చవగ్గా భూములు అమ్మేస్తూ పోతే ఇక భూముల లభ్యత ఎలా సాధ్యం?’’అని ప్రశ్నించారు.
- 
      
                   
                                                       దబంగ్ ఢిల్లీ x పుణేరి పల్టన్... నేడు ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్లీగ్ దశలో టాప్–2లో నిలిచిన రెండు జట్ల మధ్య ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ టైటిల్ పోరు జరగనుంది. మాజీ చాంపియన్స్ దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ జట్లు రెండోసారి పీకేఎల్ విన్నర్స్ ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో నేడు జరిగే ఫైనల్లో తలపడనున్నాయి. న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియం ఈ మెగా ఫైనల్కు వేదిక కానుంది. ఈ సీజన్లో పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. మూడు సార్లూ మ్యాచ్లు నిర్ణీత సమయంలో సమంగా ముగిసి ఫలితం ‘టైబ్రేక్’లో తేలింది. ‘టైబ్రేక్’లో దబంగ్ ఢిల్లీ రెండుసార్లు గెలుపొందగా... ఒకసారి పుణేరి పల్టన్ విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో ఢిల్లీ తరఫున ఫజల్, సౌరభ్, నీరజ్, ఆశు మలిక్... పుణేరి పల్టన్ తరఫున ఆదిత్య షిండే, అస్లామ్, పంకజ్ నిలకడగా రాణించారు. రాత్రి 8 గంటలకు మొదలయ్యే టైటిల్ పోరును స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
- 
      
                   
                                                       పైచేయి ఎవరిదో!మెల్బోర్న్: తొలి టి20 మ్యాచ్ వర్షంతో రద్దయిన తర్వాత భారత్, ఆ్రస్టేలియా తర్వాతి పోరుకు సిద్ధమయ్యాయి. నేడు ఎంసీజీలో జరిగే రెండో టి20లో ఇరు జట్లు తలపడతాయి. గత మ్యాచ్లో ఫలితం రాకపోయినా... ఆట ముగిసేసరికి టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో అదే జోరును కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఆసీస్ కూడా సొంతగడ్డపై విజయంతో ఆధిక్యంలో నిలవాలని భావిస్తోంది. భారత జట్టు ఎంసీజీలో తాము ఆడిన ఆరు టి20ల్లో నాలుగు గెలిచింది. మ్యాచ్కు వర్షసూచన ఉంది. మార్పుల్లేకుండా... కాన్బెర్రా మ్యాచ్లో ఇరు జట్లకు కూడా తమ ఆటగాళ్లను పెద్దగా పరీక్షించే అవకాశం రాలేదు. దాంతో తుది జట్టులో ఎలాంటి మార్పూ లేకుండా టీమ్లు బరిలోకి దిగడం ఖాయం. దూకుడుకు మారుపేరైన అభిõÙక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చేందుకు ఇది మరో అవకాశం. గిల్, సూర్య కూడా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నారు. తిలక్ వర్మ, సామ్సన్, దూబేలతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సీనియర్ బుమ్రాతో పాటు హర్షిత్ పేస్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటాడు. కుల్దీప్, వరుణ్ల స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడం ఆసీస్ బ్యాటర్లకు అంత సులువు కాదు. మరోవైపు ఆసీస్ బృందంలోనూ హిట్టర్లకు కొదవ లేదు. కెప్టెన్ మార్ష్, హెడ్, టిమ్ డేవిడ్, స్టొయినిస్ ఒంటి చేత్తో మ్యాచ్ను శాసించగల బ్యాటర్లు. ఇన్గ్లిస్, ఒవెన్, ఫిలిప్ రూపంలో దూకుడుగా ఆడగల ఇతర ఆటగాళ్లూ ఉన్నారు. భారీ స్కోరు సాధించేందుకు, భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు కావాల్సిన బృందం ఆసీస్ వద్ద ఉంది.
- 
      
                   
                                                       టాంజానియాలో వివాదాస్పదంగా ఎన్నికలునైరోబి(కెన్యా): టాంజానియాలో ఎన్నికలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. గురువారం రెండో రోజు కూడా నిరసనలు కొనసాగాయి. వివిధ ఘటనల్లో ఇద్దరు చనిపోయినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1961 నుంచి అధికారంలో ఉన్న చమా చా మపిండుజి(సీసీఎం) మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు నేతల్ని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఎన్నికల సంస్కరణలకు పిలుపునిచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత టుండు లిస్సును దేశద్రోహం నేరం కింద జైలులో పెట్టారు. రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి లుహా ఎంపినాను సైతం అనర్హుడిగా ప్రకటించారు. దీంతో, ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు హసన్తో ఎన్నికల బరిలో చిన్నాచితకా పార్టీలకు చెందిన 16 మంది పోటీ పడ్డారు. వీరెవరూ ప్రచారం కూడా చేయలేదు. బుధవారం పోలింగ్ జరిగింది. జనం స్పందన అంతంతమాత్రంగానే ఉంది. నిరసన కారులు ఒక బస్సుకు, గ్యాస్ స్టేషన్కు నిప్పంటించారు. పలు చోట్ల పోలీస్స్టేషన్లపై దాడులకు దిగారు. పోలింగ్ స్టేషన్లను ధ్వంసం చేశారు. ఘర్షణల్లో ఒక పౌరుడు, ఒక పోలీసు అధికారి చనిపోయారు. దీంతో, ప్రభుత్వం బుధవారం సాయంత్రం వాణిజ్య రాజధాని దారెస్సలామ్లో కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ రాత్రి నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. గురువారం ఉద్యోగులను ఇళ్ల నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. అత్యవసరం కాని సిబ్బంది బయటకు రావద్దని సూచించింది. రహదారులపై ఆర్మీ అడ్డంకులను ఏర్పాటు చేసింది. సరైన పర్మిషన్లు లేని వారిని ఇళ్లకు పంపించి వేసింది. ప్రధాన ఎయిర్పోర్టుకు చేరుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను సైన్యం నిలువరించింది. కెన్యా సరిహద్దులకు సమీపంలో ఉన్న మంగాంగా పట్టణంలో నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. వ్యాపార సంస్థలు పనిచేయలేదు. గురువారం వెలువడిన మొట్టమొదటి ఫలితాల్లో 272 నియోజకవర్గాలకు గాను 8 చోట్ల 96.99 శాతం ఓట్లు అధ్యక్షుడు హసన్కే పడినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఫలితాలపై యూరోపియన్ పార్లమెంట్ తీవ్రంగా స్పందించింది. ‘టాంజానియాలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. నిష్పాక్షికమూ కాదు’అంటూ వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం, పౌరుల హక్కుల కోసం గట్టిగా నిలిచి పోరాడాలని ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిచ్చింది.
- 
      
                   
                                                       ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ రివ్యూతెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్ధాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా మొదటి భాగం 2015లో రిలీజ్ కాగా..రెండో భాగం 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ రెండు సినిమాలు కలిపి ఓకే చిత్రంగా ‘బాహుబలి: ది ఎపిక్’(Baahubali The Epic Review)పేరుతో నేడు (అక్టోబర్ 31) మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు ఇక్కడ కూడా ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్గా మార్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..బాహుబలి కథ అందరికి తెలిసిందే. థియేటర్స్తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక(తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బంధీగా ఉన్న దేవసేన(అనుష్క శెట్టి) తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బంధీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. భళ్లాలదేవుడు(రానా) కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిచాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బళ్లాల దేవుడిని అంతం చేస్తాడు. ఇదే ది ఎపిక్ కథ(Baahubali The Epic Review Telugu).విశ్లేషణముందుగా చెప్పినట్లుగా ఇదంతా అందరికి తెలిసిన, చూసిన కథే. పార్ట్ 1 చూసినప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియదు. కాబట్టి అంతా పార్ట్ 2 చూశారు. మరి ‘బహుబలి: దిపిక్’ దేని కోసం చూస్తారు? అల్రేడీ చూసి చూసి ఉన్న చిత్రమే కదా అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే జక్కన మరోసారి మ్యాజిక్ చేశాడు. బోర్ కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్తో కథను చెప్పుకొచ్చాడు. ఆరున్నర గంటల సినిమాను 3.45 గంటలకు కుదించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా సన్నివేశాలను పేర్చాడు. తెరపై చూస్తుంటే కొత్త సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. ఫస్టాప్లో పార్ట్ 1 కథని, సెకండాఫ్లో పార్ట్ 2 కథను చూపించాడు. ఈ రెండు భాగాల్లో ప్రేక్షకులకు బాగా నచ్చిన సన్నివేశాలన్నింటిని హైలెట్ చేశాడు. ప్రధాన పాత్రల పరిచయ సన్నివేశాలు.. బళ్లాలదేవుడి పట్టాభిషేకం, కాలకేయులతో యుద్ధం..తల నరికే సీన్..ఇవ్వన్నీ తెరపై చూస్తుంటే గూస్బంప్స్ గ్యారెంటీ. రెండు భాగల్లో ఏదో ఒకటి చూసిన వారికి కూడా ఈ సినిమా అర్థమయ్యేలా సీన్లను పేర్చాడు. అవంతిక లవ్స్టోరీ సీన్లను కట్ చేసినా..కొత్తగా చూసిన వారికి అర్థమయ్యేలా రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సుదీప్ కిచ్చతో పాటు కొన్ని కీలకమైన సీన్లను, పాటలను తొలగించినా.. కథలోని ఆత్మను మిస్ కానివ్వకుండా జక్కన్న జాగ్రత్తపడ్డాడు. కీరవాణి రీరికార్డింగ్ కూడా ఈ సినిమాకు ప్రెష్నెస్ని తీసుకొచ్చింది. అయితే నిడివి మాత్రం కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. కనీసం ఇంకో 20 నిమిషాల నిడివిని అయినా తగ్గిస్తే బాగుండేదేమో. మొత్తానికి బాహుబలి 1& 2 లాగే ది ఎపిక్ చిత్రాన్ని కూడా థియేటర్ విజువల్ వండర్లా తీర్చిదిద్దడంలో జక్కన్న వందశాతం సక్సెస్ అయ్యాడు.నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? ప్రభాస్, రానాతో పాటు ఇందులో కీలక పాత్రల్లో నటించిన వారంతా తమ తమ కెరీర్తో ది బెస్ట్ ఇచ్చారు. ప్రభాస్-అనుష్క జోడీని మరోసారి అలా తెరపై చూస్తుంటే.. రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంటుంది. యాక్షన్ సీన్లలో రానా, ప్రభాస్ పోటీ పడి నటించారు. రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా, సుబ్బరాజుతో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది. పదేళ్ల క్రితమే కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. వీఎఫెక్స్ అదిరిపోయాయి. అంతకు డబుల్ బడ్జెట్ పెడుతున్న సినిమాలకు కూడా ఈ స్థాయిలో సన్నివేశాలను తీర్చిదిద్దలేకపోతున్నారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా రీరిలీజ్లలో కూడా ‘బహుబలి’ ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే చెప్పాలి.
- 
      
                   
                                                       ఆపత్కాలంలో ఆసరా ఏది?తెలుగు రాష్ట్రాలను కంటి మీద కునుకు లేకుండా చేసిన మొంథా తుపాను చివరకు ప్రశాంతంగా ముగిసినా ఎడతెరిపి లేని వర్షాలతో లక్షలాది ఎకరాల పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. రెండు చోట్లా నదులూ, వాగులూ, వంకలూ, గెడ్డలూ ఉద్ధృతంగా ప్రవహించి కట్టలు తెంచుకుని జనావాసాలను ముంచెత్తాయి. సముద్రంలో పెను తుపానుగా బలపడి ప్రళయ భీకర రూపంతో భయపెడుతూ వచ్చిన తుపాను, తీరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఏర్పడిన ‘విండ్ షీర్’(గాలికోత) ధాటికి విచ్ఛిన్నమై శాంతించిందని వాతావరణ నిపుణులంటున్న మాట. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంతాల్లో 15 లక్షల ఎకరాల్లోని వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి విస్తీర్ణమే 11 లక్షలంటున్నారు. తెలంగాణలో దాదాపు 14 జిల్లాలు మొంథా ప్రభావంతో కుండపోత వర్షాలతో ఇక్కట్లపాలయ్యాయి. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినటంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం సైతం నీట మునిగింది. ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లను ముందుగా గుర్తించే సాంకేతికత అందుబాటులో కొచ్చి తుపాను తాకిడి ప్రాంతాల్లోని ప్రజలను సహాయ శిబిరాలకు తరలించటం సులభ మవుతోంది. కానీ అది మాత్రమే సరిపోదు. విపత్తులొస్తే... పంట నష్టం ఏర్పడితే జరగ గల నష్టాన్ని అంచనా వేసుకుని పంటల బీమా పథకాలను అమలు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీలివ్వాలి. రైతులకు ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా’ వంటి పథకాలుండాలి. ఆర్బీకేలు అన్ని విధాలా సాయపడాలి. పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలుండాలి. ఎన్నో తుపాన్లు చూశానని ఏపీ ముఖ్యమంత్రి స్వోత్కర్షకు పోతున్నారు. నిజమే... ఆయన వచ్చి నప్పుడల్లా అయితే తుపాన్లు లేదా కరువు కాటకాలు రివాజైన సంగతి తెలుసు. మరి ఎన్నో తుపాన్లు చూసిన నేతకు ఆపత్కాలంలో అక్కరకొచ్చే ముందస్తు చర్యలు తీసు కోవాలన్న స్పృహ ఎందుకు అడుగంటింది? అంతకుముందు జగన్ ప్రభుత్వ హయాంలో 85 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా పథకం అమలు చేశారు. అందువల్ల విపత్తుల బారిన పడిన 54.5 లక్షలమంది రైతులకు రూ. 7,802 కోట్లు బీమా పరిహారం లభించింది. కానీ తన ఏలుబడి మొదల య్యాక బాబు వీటన్నిటినీ ఎలా విస్మరించగలిగారు? ఆర్బీకేలను భ్రష్టుపట్టించారు. ఇన్పుట్ సబ్సిడీలు అటకెక్కాయి. నిరుడూ, ఈ ఏడాదీ ఈ సబ్సిడీల రూపేణా ఒక్క రూపాయి అందించింది లేదు. బాబు సర్కారు నిర్వాకం వల్ల ఇప్పుడు పంట రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకు మాత్రమే బ్యాంకులు కల్పించిన బీమా సదు పాయం ఉంది. మొంథా వల్ల తీవ్రంగా నష్టపోయిన మిగతా 66 లక్షల మంది రైతులు ఏం కావాలి? ‘రైతు భరోసా’ పేరు మార్చి ‘అన్నదాత సుఖీభవ’ అన్నారు. పేరేదైతేనేం... ఈ రెండేళ్లలో ప్రతి రైతుకూ ఇంతవరకూ రూ. 40,000 చొప్పున నగదు అందాలి. కానీ ఇచ్చిందెంత? కేవలం రూ.5,000! అనుభవశాలి చేయాల్సిన పనేనా ఇది?! ప్రభుత్వం నుంచి ఏదో రూపేణా సాయం అందుతుంటే, పంటలకు బీమా సదు పాయం ఉంటే, దిగుబడులకు గిట్టుబాటు ధరలు అందజేస్తే ఇలాంటి కష్టకాలంలో నిండా మునిగిపోయామన్న దిగులు రైతులను ఆవరించేది కాదు. అవన్నీ ఎగ్గొట్టినందుకు దోషిగా నిలబడాల్సింది పోయి రైతులతో ఆయన పరిహాసమాడుతున్నారు. ప్రచార యావ శ్రుతి మించి ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చుని తుపాను నిలువరించినట్టు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలు తిండి, నీళ్లు లేక అలమటిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలు అసలు చూస్తున్నారా? అక్కడక్కడ తూ తూ మంత్రంగా సాయం చేసి చాటుకోవటం తప్ప బాధితులందరికీ అందజేయాలన్న సంకల్పం ఏదీ? కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పక్షాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటం కొంత ఊరట. ఎన్టీఆర్ జిల్లాలో ఒక పునరావాస కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అందించిన ఆహారం తీసుకున్నారన్న కక్షతో అక్కడివారిని టీడీపీ పెత్తందార్లు వెళ్లగొట్టిన వైనం తెలుసా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. డబుల్ ఇంజన్ సర్కారని చెప్పుకుంటున్నారు గనుక బాధిత రైతులందరికీ తక్షణ సాయం అందించాలి. నష్టం అంచనాలు పక్కాగా ఉండాలి. నష్టపోయినవారికి సాధ్యమైనంత త్వరగా పూర్తి పరిహారం అందేలా చూడాలి.
- 
      
                   
                                                       ఐటీసీ లాభం ప్లస్కోల్కతా: డైవర్సిఫైడ్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్లో నికర లాభం 3% వృద్ధితో రూ. 5,187 కోట్లకు చేరింది. జీఎస్టీ సవరణలు, అధిక వర్షాల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ విభాగం సవాళ్లు ఎదుర్కొంది. గతేడాది ఇదే కాలంలో రూ. 5,054 కోట్లు ఆర్జించింది. ఇబిటా స్వల్పంగా(2%) బలపడి రూ. 6,695 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 21,536 కోట్ల నుంచి రూ. 21,256 కోట్లకు స్వల్పంగా క్షీణించింది. నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ను డైరెక్టర్, స్వతంత్ర డైరెక్టర్గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. 2026 జనవరి నుంచి కాంత్ ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఎఫ్ఎంసీజీ గుడ్ క్యూ2లో సిగరెట్లుసహా బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతోకూడిన ఎఫ్ఎంసీజీ విభాగం ఆదాయం 7% పుంజుకుని రూ. 15,473 కోట్లను అధిగమించినట్లు ఐటీసీ వెల్లడించింది. అగ్రి బిజినెస్ ఆదాయం రూ. 5,845 కోట్ల నుంచి రూ. 4,038 కోట్లకు క్షీణించగా.. పేపర్ బోర్డులు, ప్యాకేజింగ్ టర్నోవర్ స్వల్ప వృద్ధితో రూ. 2,220 కోట్లకు చేరింది. ఐటీసీ షేరు బీఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 419 వద్ద ముగిసింది.
- 
      
                   
                                                       రైతుల కడుపు కొట్టేలా దిగుమతులా?కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలి బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ సమావేశంలో సరైన వైఖరినే ప్రదర్శించారు. భారతదేశం తలకు పిస్తోలు గురి పెట్టి ఎవరూ బలవంతంగా ఒప్పందాలపై సంతకాలు చేయించలేరని తెగేసి చెప్పారు. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థి తులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ధైర్యంగా పలికిన మాటలు నాకొక పాత సంఘటనను గుర్తుకు తెచ్చాయి. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంది. ఒకప్పుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడా ఉన్న జగ్జీవన్ రామ్ కోపంతో దాని సమావేశం నుంచి ఒక సారి వాకౌట్ చేశారని చెబుతారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పిన దాని ప్రకారం, ‘‘మీ వ్యవసాయ ఎగుమతులను మాపై రుద్దాలని చూస్తే సహించేది లేదు’’ అని అమెరికా సీనియర్ అధికారి ఒకరికి జగ్జీవన్ రామ్ నిస్సంకోచంగా చెప్పారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వివిధ హోదాలలో దాదాపు అందరు వ్యవసాయ మంత్రుల వద్ద పని చేశారు కదా! మీకు ఎవరు ఉత్తమమైన వ్యవసాయ మంత్రిగా తోచా’రని అడిగినపుడు స్వామినాథన్ పై ఉదంతం చెప్పారు. జగ్జీవన్ రామ్ 1974 నుంచి 1977 వరకు వ్యవసాయ, సేద్యపు నీటి శాఖ మంత్రిగా పనిచేశారు. కాచుకుని ఉన్న అమెరికావిస్తారమైన భారతీయ వ్యవసాయ మార్కెట్లోకి అడుగు పెట్టాలని అమెరికా ఏనాటి నుంచో కాచుకుని ఉందని మనం గుర్తుంచుకోవాలి. అమెరికాతో సాగుతున్న వాణిజ్య చర్చలలో భారత్ ఇంతవరకు దృఢ వైఖరినే అనుసరిస్తూ వస్తోంది. వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్య సంపదల రంగాలను కాపాడుకుని తీరుతామని చెబుతోంది. కానీ, మన దేశంలోని కొన్ని బలమైన వర్గాలు ఎప్పుడూ బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు మొగ్గు చూపుతూ వస్తున్నాయి. ఆత్మనిర్భరత సాకుతో అవి తమ వైఖరిని సమర్థించుకుంటున్నాయి. అమెరికా సంస్థలకు ద్వారాలు తెరిస్తే– దేశంలోని పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పాడిపరిశ్రమ, యాపిల్, ఇతర పండ్ల విభాగాల వారి ప్రయోజనాలను పణంగా పెట్టినట్లు అవుతుంది. అమెరికా సహజంగానే తన తదుపరి లక్ష్యంగా మొదట వరిని, తర్వాత గోదుమలను ఎంచుకుంటుంది. అమెరికా సిసలైన ప్రయోజనాలు వీటిలోనే ఇమిడి ఉన్నాయి. జన్యుపరంగా సవరించిన (జీఎం) యాపిల్స్, మొక్కజొన్న, సోయాబీన్ల ప్రవేశం వివాదాస్పదంగా మారడంతో, దానికి సంబంధించిన కార్యనిర్వాహక పత్రాన్ని నీతి ఆయోగ్ ఇప్పటికే ఉపసంహరించుకుంది. సుంకాలు లేని విధంగా పత్తి దిగుమతికి అనుమతిస్తున్నట్లుగానే, పాలు, పాల ఉత్పత్తులకు కూడా మార్కెట్ ద్వారాలు తెరవడం సముచితంగా ఉంటుందని వాదించే ఆర్థికవేత్తలు కొందరు తయారయ్యారు. కానీ, వారొక సంగతిని గ్రహించడం లేదు. అమెరికాలో సుమారు 8,000 మంది పత్తి రైతులున్నారు. అక్కడి వ్యవసాయ క్షేత్ర సగటు పరిమాణం 600 హెక్టార్లు. వారికి ఏటా లక్ష డాలర్లకు పైగా సబ్సిడీ అందుతుంది. అది అంతర్జాతీయ ధరలను తగ్గిస్తుంది. ఫలి తంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రైతులు దెబ్బతింటారు. మన దేశంలో పత్తి రైతులు 98 లక్షల మందికి పైగా ఉన్నారు. వారి కమతాలు సగటున 1 నుంచి 3 ఎకరాలు మాత్రమే. చౌక ధరలకు, సబ్సిడీ దిగుమతులను అనుమతిస్తే, అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి బతుకు బండలవుతుంది. దానికి బదులు, దేశీయ పత్తి పరిశ్రమ మన రైతులకు అండగా నిలిస్తే, అది నిజంగా ఉభయ తారకమైనది అవుతుంది. పత్తి దిగుమతిపై సుంకాలు పైసా కూడా లేకుండా చేయడం ద్వారా, భారత్ తన రైతులను తోడేళ్ళ బారిన పడేసినట్లయింది. చౌక దిగుమతులతో రైతులకు నష్టంపప్పు ధాన్యాల విషయంలో సరఫరా–డిమాండ్ సూత్రం పనిచేయడం లేదు. పప్పు ధాన్యాల విస్తీర్ణం 3.07 కోట్ల హెక్టార్ల నుంచి గత ఐదేళ్ళలో 2.76 కోట్ల హెక్టార్లకు కుంచించుకుపోయింది. దానివల్ల డిమాండ్ కొద్దిగా పెరిగినా, ఆ మేరకు రైతుల మార్కెట్ యార్డు ధరలు ఏమీ పెరగలేదు. నిజానికి, వాటి ప్రస్తుత మార్కెట్ ధరలు, ప్రకటించిన కనీస మద్దతు ధరల కన్నా సుమారు 30 శాతం తక్కువగా ఉన్నాయి. దిగుబడి తగ్గడం వల్ల ఏర్పడిన వెలితిని చౌక దిగుమతులు భర్తీ చేయడమే దానికి కారణం. ఆ దిగుమతులు కూడా అవసరమైన దానికన్నా రెండింతలున్నాయి. చాలా రకాల చిక్కుళ్ళు సుంకాలు లేకుండా దిగుమతి అయ్యాయి. ఒక్క 2024–25లోనే 7.6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. అలాగే, 2020 –21లో పప్పు ధాన్యాల దిగుమతికి రూ. 12,153 కోట్లను వెచ్చిస్తే, గడచిన ఐదేళ్ళలో దిగుమతి వ్యయం ఇప్పటికే అంటే 2024–25లో రూ. 47,000 కోట్లను దాటినట్లు వార్తలు సూచిస్తున్నాయి. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే నెపంతో జీఎం సోయా గింజల దిగుమతిని సమర్థించుకుంటున్నారు. నిజానికి, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని సోయా రైతులు గిట్టుబాటు ధర కోసం లబోదిబోమంటున్నారు. సోయాబీన్ కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 5,328గా నిర్ణయించగా, మార్కెట్ ధరరూ. 3,500 నుంచి రూ. 4,000 మధ్య ఊగిసలాడుతోంది. ఒత్తిళ్లకు లొంగకూడదు!కేంద్రం తగిన నియమ, నిబంధనలను రూపొందించేంత వరకు జీఎం ఆహార పదార్థాల దిగుమతి, అమ్మకాలను నిలిపి వేయాలని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దిగుమతులకు అది కాస్త బ్రేకు వేయవచ్చు. జీఎం సోయాబీన్ దిగుమతులకు ద్వారాలు తెరవవలసిందని అమెరికా గతంలోనూ మనపై ఒత్తిడి తెచ్చింది. బయోటెక్నాలజీ –ఫుడ్ సెక్యూరిటీ ఫోరమ్ (ఢిల్లీ) చేపట్టిన ఉద్యమం వల్ల, ఎట్టకేలకు భారతీయ రేవులకు అమెరికా సోయా బీన్ చేరగానే దాన్ని (దేశీయ ఉత్పత్తితో కలపకుండా) వేరుగా ఉంచా లని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆదేశించింది. అమెరికా సరఫరాదారులు తమ దేశంలోని సీనియర్ అధికారుల మద్దతుతో ఆ చర్యను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ, భారత్ ఆ ఒత్తిడికి తలొగ్గ లేదు. ఇప్పుడూ అదే రకమైన వైఖరిని అనుసరించాలి. ఆహార పదార్థాలను నౌకల నుంచి దించుకొనే దయనీయమైన పాత రోజులలోకి భారత్ మళ్ళీ జారి పోకూడదు.దేవీందర్ శర్మవ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com
- 
      
                   
                                                       అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్లో వేల కోట్లు స్వాహా!న్యూఢిల్లీ: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ (అడాగ్) వేల కోట్ల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఇన్వెస్టిగేటివ్ పోర్టల్ కోబ్రాపోస్ట్ సంచలన ఆరోపణలు చేసింది. 2006 నుంచి గ్రూప్ కంపెనీల ద్వారా రూ. 41,921 కోట్ల నిధులు మళ్లించినట్లు ఓ నివేదికలో తెలిపింది. అయితే, తమ గ్రూప్ సంస్థల షేర్ల ధరలను కుదేలు చేయడానికి జరుగుతున్న విషప్రచారంగా అడాగ్ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. వివరాల్లోకి వెళ్తే .. రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తదితర లిస్టెడ్ గ్రూప్ సంస్థలు బ్యాంక్ రుణాలు, ఐపీవోలు, బాండ్లు తదితర రూపాల్లో సమీకరించిన రూ. 28,874 కోట్లను ప్రమోటర్కి చెందిన కంపెనీలకు మళ్లించినట్లు కోబ్రాపోస్ట్ పేర్కొంది. అలాగే అనుబంధ సంస్థలు, డొల్ల కంపెనీల నెట్వర్క్ ద్వారా సింగపూర్, మారిషస్, సైప్రస్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల నుంచి 1.535 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 13,047 కోట్లు) మోసపూరిత విధానాలతో భారత్లోకి మళ్లించినట్లు వివరించింది. ‘బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్, సైప్రస్, మారిషస్ మొదలైన దేశాలకు చెందిన డజన్ల కొద్దీ సంస్థలు, సబ్సిడరీలు, డొల్ల కంపెనీల్లాంటి వాటి ద్వారా రూ. 41,921 కోట్ల పైగా నిధుల మళ్లింపు జరిగింది‘ అని కోబ్రాపోస్ట్ తెలిపింది. ఈ పరిణామాలతో ఆరు కీలకమైన లిస్టెడ్ కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని పేర్కొంది. సింగపూర్ కనెక్షన్.. సింగపూర్కి చెందిన ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్కి నెక్స్జెన్ క్యాపిటల్ అనే ఒక ’రహస్యమయ లబ్దిదారు’ నుంచి 750 మిలియన్ డాలర్లు లభించగా, అటు తర్వాత ఎమర్జింగ్ మార్కెట్ సంస్థను మూసివేయడానికి ముందు ఆ నిధులు రిలయన్స్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన రిలయన్స్ ఇన్నోవెంచర్స్కి బదిలీ అయ్యాయని కోబ్రాపోస్ట్ వెల్లడించింది. ఇది ’మనీ లాండరింగ్’ లావాదేవీ అయి ఉండొచ్చని పేర్కొంది. కంపెనీల చట్టం, ఫెమా, పీఎంఎల్ఏ, సెబీ చట్టం, ఆదాయ పన్ను చట్టం మొదలైన వాటిని ఉల్లంఘిస్తూ అనేక లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ, సెబీ, ఎన్సీఎల్టీ, ఆర్బీఐ మొదలైన వాటి దగ్గరున్న ఫైలింగ్స్, ఆదేశాల్లో ఉన్న వివరాల ఆధారంగా ఈ విషయాలు తమ విచారణలో వెల్లడైనట్లు కోబ్రాపోస్ట్ ఎడిటర్ అనిరుద్ధ బెహల్ తెలిపారు. వీటి వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్, మొండిబాకీలు మొదలైన రూపాల్లో మొత్తం రూ. 3.38 లక్షల కోట్ల ప్రజా సంపద పోయిందని ఆయన ఆరోపించారు.తోసిపుచ్చిన అడాగ్.. కోబ్రాపోస్ట్ నివేదికలో ఆరోపణలను అడాగ్ కొట్టిపారేసింది. గ్రూప్ అసెట్స్ను దక్కించుకోవాలనే దురాలోచన గల సంస్థలు.. ఎప్పుడో పాతబడిన, బహిరంగంగా ఉన్న, సీబీఐ.. ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పరిశీలించిన సమాచారాన్ని తిరగతోడి ఈ ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఇది తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, సంబంధిత భాగస్వాములను తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న విషప్రచారమని పేర్కొంది. కోబ్రాపోస్ట్కి నిర్దిష్ట ఎజెండాను పెట్టుకుని స్టింగ్ ఆపరేషన్ చేస్తుందనే ట్రాక్ రికార్డు ఉందని అడాగ్ తెలిపింది. ‘రిలయన్స్ గ్రూప్, అనిల్ అంబానీ, 55 లక్షల మంది వాటాదారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు, స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ గ్రూప్ సంస్థల షేర్లను కుదేలు చేసి, ఆయా కంపెనీలను దక్కించుకునేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం ఇది‘ అని అడాగ్ వ్యాఖ్యానించింది. అటు గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ ఇటీవల తమ షేర్ల ట్రేడింగ్ ధోరణుల్లో మార్పులు చోటు చేసుకోవడంపై విచారణ జరపాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిర్యాదులు చేశాయి.
- 
      
                   
                                                       చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగాతొలి వన్డే ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడేందుకు భారత మహిళల జట్టు అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. . గురువారం నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది.ఆసీస్ నిర్ధేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) కూడా వీరోచిత పోరాటం కనబరిచింది. వీరిద్దరూ మూడో వికెట్కు 156 బంతుల్లో 167 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. హర్మన్ ప్రీత్ ఔట్ అయినా.. జెమీమా మాత్రం పట్టువదల్లేదు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి భారత జట్టును మూడో సారి ఫైనల్కు చేర్చింది.చరిత్ర సృష్టించిన భారత్..ఇక ఈ మ్యాచ్లో సంచలన విజయం సాధించిన భారత మహిళల జట్టు ఓ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజింగ్ చేసిన జట్టుగా భారత్ రికార్డులెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఇదే టోర్నమెంట్లో వైజాగ్ వేదికగా భారత్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఈ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కానీ తాజా మ్యాచ్లో భారత్ 339 పరుగుల టార్గెట్ను చేధించి ఆసీస్ను అధిగమించింది. భారత్, ఆస్ట్రేలియా తర్వాతి స్ధానంలో శ్రీలంక(302) ఉంది. ఇక నవంబర్ 2న ముంబై వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది
- 
      
                   
                                                       భారత మహిళా జట్టుకు పలువురు ప్రముఖుల ప్రశంసఐసిసి మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్కి చేరిన భారత మహిళా జట్టుకు పలువురు ప్రముఖులు ప్రశంసించారు. భారత మహిళా జట్టు 2025 ప్రపంచకప్ సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. జట్టు పోరాటం, ఆత్మవిశ్వాసం, కీలక విజయాలపై సెలబ్రిటీల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. Fabulous victory! 🇮🇳Well done @JemiRodrigues and @ImHarmanpreet for leading from the front. Shree Charani and @Deepti_Sharma06, you kept the game alive with the ball.Keep the tricolour flying high. 💙 🇮🇳 pic.twitter.com/cUfEPwcQXn— Sachin Tendulkar (@sachin_rt) October 30, 2025There are wins that go beyond numbers on a scoreboard. This was one of them.Under pressure, with the world watching @ImHarmanpreet played with the calm and conviction of a true leader while @JemiRodrigues brought pure focus and intent to play an innings of a lifetime! This… pic.twitter.com/CdAwK07sCT— Yuvraj Singh (@YUVSTRONG12) October 30, 2025Australia soch rahi thi ek aur semi-final hai, aaram se jeeto aur pahuncho Final- hamari ladkiyon ne socha yeh to mauka hai asli dhamaka karne ka! Saare criticism ko dho daala. Kya khel dikhaya. Proud of our women in blue. pic.twitter.com/oX5BfWK3PM— Virrender Sehwag (@virendersehwag) October 30, 2025 अद्भुत जीतऐतिहासिक प्रदर्शनभारत की बेटियों ने दिखाया हम नहीं किसी से कम। #WomensWorldCup2025 के सेमीफाइनल मुकाबले में भारतीय महिला क्रिकेट टीम ने ऑस्ट्रेलिया को 5 विकेट से धूल चटाई।जेमिमा रोड्रिगेज और हरमनप्रीत कौर के जज़्बे को सलाम। पूरी टीम को बधाई,बहुत-बहुत शुभकामनाएं!… pic.twitter.com/szNYRJnirP— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 30, 2025Emotions run high 🥹🥹Historic win for India 🇮🇳 as they overpower an unbeaten Australian side to storm into the World Cup Final #CWC25 #WomensWorldCup2025 #INDWvsAUSW #JemimahRodrigues pic.twitter.com/EXghDmHFnu— Cricbuzz (@cricbuzz) October 30, 2025𝙏𝙚𝙖𝙧𝙨 𝙊𝙛 𝙅𝙤𝙮 💙Absolute scenes from Navi Mumbai 🇮🇳#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvAUS | @JemiRodrigues | @mandhana_smriti | @ImHarmanpreet pic.twitter.com/Mw6DahFmz2— BCCI Women (@BCCIWomen) October 30, 2025 Take a bow, Team India! 🇮🇳🏏Brilliant performance by our women's cricket team, @BCCIWomen, in the semifinal of the ICC #WomensWorldCup2025 beating the formidable Australia.An exceptional display of perseverance and teamwork to secure a well-deserved spot in the finals. A… pic.twitter.com/hytIOUcsod— Piyush Goyal (@PiyushGoyal) October 30, 2025
- 
      
                   
                                                       భారత్ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలుతాడేపల్లి: ఐసిసి మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్కి చేరిన భారత మహిళా జట్టుకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడాన్ని ఆయన అభినందించారు. ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్ లో కూడా అలాగే రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మహిళా జట్టు చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుందని కితాబునిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఫైనల్కు వెళ్లిన టీమ్కు ఆయన ఆల్ది బెస్ట్ చెప్పారు.What a historic win! A fantastic record-breaking chase by the Indian women's team to beat Australia in the World Cup semi-final! On to the final! All the best, team India!#WomensWorldCup2025 pic.twitter.com/7Qyqc6gIaJ— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2025
- 
      
                   
                                                       జెమీమా తుఝే సలామ్అద్భుతం అనే మాట చాలా చిన్నదిగా అనిపిస్తోంది... ఈ అసాధారణ ప్రదర్శనను వర్ణించాలంటే అది సరిపోదు... ఎదురుగా ఉన్నది ఎదురు లేకుండా సాగుతున్న ప్రత్యర్థి... డిఫెండింగ్ చాంపియన్... ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్ను గెలుచుకునే తత్వం... మన ముందు ఏకంగా 339 పరుగుల లక్ష్యం...మహిళల వన్డే చరిత్రలో ఏ జట్టూ ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు... షఫాలీ విఫలం కాగా, టాప్ బ్యాటర్ స్మృతి ఆరంభంలోనే వెనుదిరిగింది... కానీ జెమీమా, హర్మన్ గట్టిగా నిలబడ్డారు... ఒత్తిడిని దరి చేరనీయకుండా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్లారు... కీలక సమయాల్లో ఆసీస్ మళ్లీ పైచేయి సాధిస్తూ సవాల్ విసురుతోంది... గతంలో ఎన్నో సార్లు ఇలాంటి సందర్భాల్లో కుప్పకూలిన జ్ఞాపకాలు... గెలుపునకు చేరువవుతున్నట్లే కనిపించింది... కానీ ఒక్కో వికెట్ పడుతుండటంతో ఉత్కంఠ... కానీ చివరకు అమన్జోత్ షాట్తో టీమ్లో సంబరాలు... పైకి కఠినంగా కనిపించే కెప్టెన్ కూడా కన్నీళ్లపర్యంతం... అంతటా ఆనందం, ఆనందబాష్పాలు...ఏడేళ్ల వన్డే కెరీర్... తొలి వన్డే ప్రపంచ కప్... టోర్నీకి ముందు చక్కటి ఫామ్... కెరీర్లో రెండు సెంచరీలు ఈ ఏడాదే వచ్చాయి... అయితే వరల్డ్ కప్లో వరుస వైఫల్యాలు... తొలి 3 మ్యాచ్లలో 2 డకౌట్లు... మీడియాతో మాట్లాడినంత సేపు కూడా క్రీజ్లో నిలవడం లేదని వ్యాఖ్యలు... ఆటకంటే పాటలు, డ్యాన్స్లపైనే దృష్టి అనే విమర్శలు... ఒక మ్యాచ్లో ఆడించకుండా పక్కన పెట్టేశారు కూడా... కానీ జెమీమా రోడ్రిగ్స్ తన జీవితంలో అత్యంత విలువైన ఆటను అసలు వేదికపై ఆడింది. తీవ్ర ఒత్తిడి ఉండే నాకౌట్ మ్యాచ్లో రెండో ఓవర్లోనే క్రీజ్లోకి... గతంలో కీలక సమయాల్లో మ్యాచ్ను కోల్పోయిన గుర్తులు... కానీ ఆమె ‘జెమ్’లాంటి ప్రదర్శనతో తన విలువను చూపించింది. శతకాన్ని దాటి అలసటతో బాధపడుతున్నా చివరి వరకు పోరాడింది.. మరచిపోలేని చిరస్మరణీయ ఇన్నింగ్స్తో చరిత్రలో తన పేరు లిఖించుకుంది. నవీ ముంబై: వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. అసాధారణ ప్రదర్శనతో ఆ్రస్టేలియాపై ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు ఆఖరి పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఫోబ్ లిచ్ఫీల్డ్ (93 బంతుల్లో 119; 17 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ సాధించగా...ఎలైస్ పెరీ (88 బంతుల్లో 77; 6 ఫోర్లు, 2 సిక్స్లు), యాష్లీ గార్డ్నర్ (45 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లకు 341 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127 నాటౌట్; 14 ఫోర్లు) అద్భుత శతకానికి కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 89; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అండగా నిలిచింది. వీరిద్దరు 156 బంతుల్లోనే 167 పరుగులు జోడించారు. భారత్ జోరు... టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన షఫాలీ వర్మ (5 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... స్మృతి మంధాన (24 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా హీలీ చక్కటి క్యాచ్కు వెనుదిరిగింది. కానీ ఈ దశలో జత కలిసిన జెమీమా, హర్మన్ అసాధారణ పట్టుదల కనబర్చారు. 57 బంతుల్లో జెమీమా, 65 బంతుల్లో హర్మన్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. భారీ భాగ స్వామ్యం తర్వాత ఎట్టకేలకు హర్మన్ను అవుట్ చేయడంలో ఆసీస్ సఫలమైంది. అయితే జెమీమా మాత్రం ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. 115 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న ఆమె... దీప్తి శర్మ (17 బంతుల్లో 24; 3 ఫోర్లు), రిచా (16 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు), అమన్జోత్ (8 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో జట్టును విజయం దిశగా నడిపించింది. 339 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇదే ప్రపంచకప్లో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆ్రస్టేలియా ఛేదించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆసీస్ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది.‘కప్’ వదిలేసిన హీలీ... జెమీమా అద్భుత ఇన్నింగ్స్కు అదృష్టం కూడా కలిసొచ్చింది. 61 పరుగుల వద్ద ఆమె ఇచి్చన కష్టసాధ్యమైన క్యాచ్ను వదిలేసిన హీలీ, ఆ తర్వాత 82 వద్ద జీవితంలో మర్చిపోలేని తప్పు చేసింది. జెమీమా స్వీప్ చేయగా బంతి అక్కడే గాల్లోకి లేచింది. ఈ అతి సునాయాస క్యాచ్ను హీలీ జారవిడిచింది. 41 బంతుల్లో భారత్ 55 పరుగులు చేయాల్సిన స్థితిలో తాలియా (జెమీమా స్కోరు 106) మరో సునాయాస క్యాచ్ వదిలేసింది. ఈ దశలో జెమీమా అవుటైనా...పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేదేమో! స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (బి) క్రాంతి 5; లిచ్ఫీల్డ్ (బి) అమన్జోత్ 119; పెరీ (బి) రాధ 77; మూనీ (సి) జెమీమా (బి) శ్రీచరణి 24; సదర్లాండ్ (సి అండ్ బి) శ్రీచరణి 3; గార్డ్నర్ (రనౌట్) 63; తాలియా మెక్గ్రాత్ (రనౌట్) 12; కిమ్ గార్త్ (రనౌట్) 17; అలానా కింగ్ (సి) రిచా (బి) దీప్తి 4; మోలినో (బి) దీప్తి 0; షుట్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 338. వికెట్ల పతనం: 1–25, 2–180, 3–220, 4–228, 5–243, 6–265, 7–331, 8–336, 9–336, 10–338. బౌలింగ్: రేణుక 8–0–39–0, క్రాంతి 6–0–58–1, శ్రీచరణి 10–0–49–2, దీప్తి 9.5–0–73–2, అమన్జోత్ 8–0–51–1, రాధ 8–0–66–1. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) గార్త్ 10; స్మృతి (సి) హీలీ (బి) గార్త్ 24; జెమీమా (నాటౌట్) 127; హర్మన్ (సి) గార్డ్నర్ (బి) సదర్లాండ్ 89; దీప్తి (రనౌట్) 24; రిచా (సి) గార్త్ (బి) సదర్లాండ్ 26; అమన్జోత్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 26; మొత్తం (48.3 ఓవర్లలో 5 వికెట్లకు) 341. వికెట్ల పతనం: 1–13, 2–59, 3–226, 4–264, 5–310. బౌలింగ్: షుట్ 6–0–40–0, గార్త్ 7–0–46–2, గార్డ్నర్ 8–0–55–0, మోలినో 6.3–0–44–0, సదర్లాండ్ 10–0–69–2, అలానా 9–0–58–0, తాలియా 2–0–19–0.
- 
      
                   
                                                       వజ్రాల మెడతో రష్మిక.. కలర్ఫుల్ శారీలో వితికా శేరు!దే దే ప్యార్ దే అంటోన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫ్యామిలీతో చిల్ అవుతోన్న ప్రియాంక చోప్రా.. కలర్ఫుల్ శారీలో మెరిసిపోతున్న వితికాశేరు.. బాలీవుడ్ భామ శివాంగి జోషి హోయలు.. వజ్రాల మెడతో మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)
- 
      
                   
                                                       ఘనంగా 'ఆటా' 19వ మహాసభల కిక్ ఆఫ్ వేడుకబాల్టిమోర్: అమెరికా తెలుగు సంఘం (ATA) తన 19వ మహా సభలను పురస్కరించుకుని బాల్టిమోర్లో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు, 30 మంది ట్రస్టీలు, 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తమ భారీ సదస్సును లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. దేశం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అమెరికా అంతటా వివిధ సేవా కార్యక్రమాలతో జాతీయ తెలుగు సంఘంగా పేరుపొందిన 'ఆటా' బాల్టిమోర్లో తన 19వ మహాసభలను, యువజన సదస్సును నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్లోని బాల్టిమోర్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మహాసభలు జరగనుంది. ఆటా బోర్డు సమావేశం తాజాగా బాల్టిమోర్లోని రెనైసాన్స్ హార్బర్ ప్లేస్ హోటల్లో విజయవంతంగా జరిగింది.ఆటా మహాసభల కిక్-ఆఫ్ ఈవెంట్లో స్థానిక తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉల్లాసభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు జరిగాయి. కిక్-ఆఫ్ మీట్ విజయవంతంగా రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల డాలర్లను సేకరించిందని ఆటా నాయకులు ప్రకటించారు. ఇది తెలుగు అమెరికన్ల ఐక్యత, అంకితభావాన్ని నొక్కి చెబుతూ ఒక ముఖ్యమైన నిధుల సేకరణ ప్రారంభాన్ని సూచించిందని తెలియజేశారు.ఆటా అధ్యక్షుడు జయంత చల్లా మాట్లాడుతూ, ‘‘బాల్టిమోర్, స్థానిక ఆర్గనైజింగ్ టీమ్లు అసాధారణమైన నిబద్ధతను అభిరుచిని ప్రదర్శించాయి. ఈ స్థాయి టీమ్వర్క్, కమ్యూనిటీ మద్దతుతో, 19వ ఆటా మహాసభ తెలుగు గుర్తింపును జరుపుకోవడంలో, యువ నాయకత్వాన్ని సాధికారికం చేయడంలో నిస్సందేహంగా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది’’ అని అన్నారు.బోర్డు సమావేశం, కిక్-ఆఫ్ ఈవెంట్ను అద్భుతమైన విజయవంతం చేసినందుకు బాల్టిమోర్ ఆర్గనైజింగ్ టీమ్, స్పాన్సర్లు, వాలంటీర్లు, కమ్యూనిటీ మద్దతుదారులకు ఆటా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.తెలుగు సంస్కృతి, భాష, విద్య, యువత సాధికారత, వ్యాపార నెట్వర్కింగ్ అమెరికాలోనూ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మానవతా సేవను ప్రోత్సహించడానికి ఆటా అంకితమైందన్న విషయాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటా నాయకత్వం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ను సందర్శించింది. ఇది 425,000ం చదరపు అడుగుల విస్తీర్ణంతో, అనేక సమావేశ గదులు, ఎగ్జిబిట్ హాళ్లు, స్థానిక హోటళ్లకు ప్రత్యక్ష ప్రవేశంతో విస్తరించి ఉంది.ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లోనే 19వ ఆటా మహాసభల టీంను కూడా ప్రకటించింది. 19వ ఆటా మహాసభల కన్వీనర్గా మేరీలాండ్ కు చెందిన శ్రీధర్ బానాలను నియమించింది. కో ఆర్డినేటర్గా వర్జీనియాకు చెందిన రవి చల్లాను నియమించింది. నేషనల్ కో ఆర్డినేటర్గా శరత్ వేములను, డైరెక్టర్ గా సుధీర్ దమిడి, కో కన్వీనర్ గా అరవింద్ ముప్పిడి, కో కోఆర్డినేటర్ గా జీనత్ కుందూర్, కో నేషనల్ కో ఆర్డినేటర్ గా కౌశిక్ సామ, కాన్ఫరెన్స్ రీజినల్ కో ఆర్డినేటర్ తిరుమల్ మునుకుంట్ల, కో డైరెక్టర్ కిరణ్ అల తదితరులను నియమించింది.అలాగే మహాసభ కోర్ టీమ్కు వ్యూహాత్మక పర్యవేక్షణ, సహాయం అందించడానికి అనుభవజ్ఞులైన నిర్వాహకులు, వివిధ నైపుణ్యం కలిగిన సభ్యులతో కూడిన అడ్ హాక్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ టీమ్ను కూడా ఏర్పాటు చేసింది. రామకృష్ణ ఆల – నాష్విల్లే, టెన్నెస్సీ, రఘువీర్ మారిపెద్ది- టెక్సాస్, విజయ్ కుండూరు – న్యూజెర్సీ, జేపీ ముద్దిరెడ్డి – టెక్సాస్, రాజు కాకర్ల – పెన్సిల్వేనియా, మహీధర్ ముస్కుళ – ఇల్లినాయిను నియమించారు
- 
      
                   
                                                       ఆసియా యూత్ గేమ్స్లో భారత్ పతకాల మోత..బహ్రెయిన్ వేదికగా జరుగుతున్న ఆసియా యూత్ గేమ్స్ మూడో ఎడిషన్లో భారత బాక్సర్లు సత్తాచాటారు. ఈ పోటీల్లో భారత యువ బాక్సింగ్ బృందం ఐదు పతకాలు సాధించింది. అందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం ఉంది. గురువారంగురువారం ఉదయం జరిగిన తొలి ఫైనల్(46 కేజీల విభాగం)లో భారత బాక్సర్ ఖుషీ చంద్.. చైనాకు చెందిన లూ జిన్క్సియుపై 4:1 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 50 కేజీల విభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన మా జోంగ్ హ్యాంగ్తో జరిగిన బౌట్ తొలి రౌండ్లోనే 'రిఫరీ స్టాప్డ్ కాంటెస్ట్' (RSC) ద్వారా అహానా శర్మ విజయం సాధించింది.దీంతో భారత ఖాతాలో రెండు గోల్డ్మెడ్ చేరింది. ఇక 54 కేజీల ఈవెంట్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన ముహమ్మదోవా కుమ్రినీసోపై 5:0 తేడాతో విజయం సాధించిన చంద్రిక భోరేషి పూజారి.. గోల్డ్మెడల్ను కైవసం చేసుకుంది.
- 
      
                   
                                                       ఎస్కేప్ ఎపిసోడ్: ఆర్థిక నేరస్తుడిని తప్పించిన ఎస్ఐ సస్పెండ్సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఉత్తర్వుల జారీ చేశారు. సదాశివపేట దగ్గర ఆర్థిక నేరస్తుడిని తప్పించిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ డి.శ్రీకాంత్ గౌడ్ను సస్పెండ్ చేశారు. ముంబైలో ఉప్పలపాటి సతీష్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తుండగా పరారయ్యాడు. ఉప్పలపాటి సతీష్ పరారీ అయ్యేందుకు సహకరించడంతో శ్రీకాంత్ గౌడ్ సస్పెన్షన్కు గురయ్యారు.ఘరానా మోసగాడు సతీష్ను పట్టుకోవడం నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ప్రతి అంశంలోనూ టాస్క్ఫోర్స్ ఎస్ఐ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి కోసం ఎస్ఐ నేతృత్వంలో బృందాన్ని గత గురువారం అక్కడకు పంపారు. గత గురువారం రాత్రి (23వ తేదీ) సతీష్తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆ వెంటనే వారి వద్ద ఉన్న దాదాపు ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిందితుల్ని పోలీసులు తమ వాహనంలోనే తరలిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వారి చేతికి అందనీయరు. టాస్క్ఫోర్స్ ఎస్ఐ మాత్రం తన బృందం ఉన్న కారును వదిలి నిందితులతో కలిసి వాళ్ల కారు ఎక్కారు. ఫోన్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేశాడు. ఈ వాహనాన్ని నిందితుడి డ్రైవరే నడిపారు.వీరిది ఎస్యూవీ వాహనం కాగా పోలీసులది పాత ఇన్నోవా. దీంతో ఈ రెండు వాహనాల మధ్య దూరం దాదాపు 40 కి.మీలకు చేరింది. గురువారం రాత్రి షోలాపూర్లో నిందితులతో కలిసి భోజనం చేసిన ఎస్ఐ ఆ సమయంలోనూ తన బృందంతో మాట్లాడారు. వీరి వాహనం సదాశివపేట్ చేరడానికి రెండు గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంది. గత శుక్రవారం (24వ తేదీ) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సతీష్, ఎస్ఐ తదితరులు ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేట్లోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న నగరం నుంచి వచ్చిన కారులో ఎక్కిన నిందితులు కొల్హాపూర్ వైపు పారిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి ఎస్ఐ సమాచారం ఇచ్చారు.సాధారణ పరిస్థితుల్లో సదరు ఎస్ఐ అక్కడే ఉండిపోవడమో, సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా నిందితులు వెళ్లిన దారిలో గాలిస్తూ వెళ్లడమో చేస్తారు. అయితే ఇతను మాత్రం నిందితు డి కారులో, అతడి డ్రైవర్తో కలిసి హైదరాబాద్ పయనమ య్యా రు. కొద్దిసేపటికి దాబా వద్దకు చేరుకున్న బృందం ఎస్ఐని సంప్రదించగా.. తాను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాడు. అలా సిటీకి వచ్చేసిన సదరు ఎస్ఐ ఎక్కడెక్కడకు వెళ్లా డు? ఎవరెవరిని కలిశాడు? తదితర అంశాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎస్ఐతో పాటు సతీష్ కుటుంబీకులు ప్రయాణించిన కారు డ్రైవర్ను పోలీసులు ప్రశ్నించారు.
- 
      
                   
                                                       కార్పొరేట్ ఆర్ధిక ఫలితాలు ఇలా..ప్రముఖ కంపెనీలు ఎట్టకేలకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో క్యూ2 ఫలితాలని విడుదల చేశాయి. ఈ ఫలితాలను పరిశీలిస్తే..హ్యాట్సన్పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోని హ్యాట్సన్ ఆగ్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలానికి ఆకర్షణీయమైన పనితీరు చూపించింది. లాభం ఏకంగా 70 శాతం ఎగసి రూ.109 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.64 కోట్లుగానే ఉంది. ఆదాయం సైతం 17 శాతం వృద్ధి చెంది రూ.2,072 కోట్ల నుంచి రూ.2,427 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,991 కోట్ల నుంచి రూ.2,284 కోట్లకు చేరాయి.రేమండ్ లైఫ్స్టైల్బ్రాండెడ్ దుస్తులు, టెక్స్టైల్స్ కంపెనీ రేమండ్ లైఫ్స్టైల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 75 కోట్లను అధిగమించింది. బ్రాండెడ్ టెక్స్టైల్స్, దుస్తుల అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 42 కోట్లు ఆర్జించింది. రేమండ్ గ్రూప్ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 1,708 కోట్ల నుంచి రూ. 1,832 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,758 కోట్లకు చేరాయి. పార్క్ ఎవెన్యూ, కలర్ప్లస్, పార్క్స్, ఎతి్నక్స్ తదితర బ్రాండ్ల కంపెనీ నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 259 కోట్లను తాకగా.. 13.9 శాతం మార్జిన్లు సాధించింది. డీసీఎం శ్రీరామ్డైవర్సిఫైడ్ దిగ్గజం డీసీఎం శ్రీరామ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం రెండు రెట్లుపైగా జంప్చేసి రూ. 159 కోట్లకు చేరింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 63 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 3,184 కోట్ల నుంచి రూ. 3,531 కోట్లకు బలపడింది. కెమికల్స్, వినైల్, అగ్రికల్చర్ తదితర విభాగాలు కలిగిన కంపెనీ మొత్తం వ్యయాలు సైతం రూ. 3,796 కోట్ల నుంచి రూ. 4,873 కోట్లకు పెరిగాయి. కెమికల్స్, వినైల్ విభాగాల ఆదాయం రూ. 777 కోట్ల నుంచి రూ. 1,108 కోట్లకు ఎగసింది. ధనలక్ష్మీ బ్యాంక్ప్రయివేట్ రంగ సంస్థ ధనలక్ష్మీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 23 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 26 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 380 కోట్ల నుంచి రూ. 418 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం రూ. 329 కోట్ల నుంచి రూ. 384 కోట్లకు పెరిగింది. కాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.82 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు నిలకడను చూపుతూ 1.12 శాతంగా నమోదయ్యాయి.వరుణ్ బెవరేజెస్గ్లోబల్ పానీయాల దిగ్గజం పెప్సీకోకు బాట్లర్గా వ్యవహరించే వరుణ్ బెవరేజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ3)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 745 కోట్లను అధిగమించింది. ఫైనాన్స్ వ్యయాలు తగ్గడం, ఇతర ఆదాయం పుంజుకోవడం, కరెన్సీ లాభాలు ఇందుకు సహకరించాయి. గతేడాది(2024) ఇదే కాలంలో రూ. 629 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,932 కోట్ల నుంచి రూ. 5,048 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 4,156 కోట్ల నుంచి రూ. 4,253 కోట్లకు పెరిగాయి. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే విషయం విదితమే. అమ్మకాలు 2.4 శాతం పుంజుకుని 27.38 కోట్ల కేసులకు చేరాయి.
- 
      
                   
                                                       ‘నా కుమార్తె చనిపోయిందన్న కనికరంలేదు వీళ్లకి.. లంచం పేరుతో కాల్చుకు తిన్నారు’!సాక్షి,బెంగళూరు: గుండెను మెలిపెట్టే ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషాద ఘటనలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉన్నత ఉద్యోగి ఒక్కగానొక్క కుమార్తె మరణించిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు లంచాలు ఇచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ నుంచి ఉన్నతస్థాయి పోలీసు అధికారి వరకు ఎలా లంచాలు అడిగారో? అందుకు తాను లంచాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో?లింక్డిన్ పోస్టులో సుదీర్ఘంగా వివరించారు. ఆ పోస్టును కొద్దిసేపటికే డిలీట్ చేశారు. అప్పటికే ఆ పోస్టు వైరల్గా మారింది.ఆ లింక్డిన్ పోస్టులో..బెంగళూరులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)కె.శివకుమార్ కుమార్తె అక్షయ శివకుమార్(34). కంప్యూటర్ సైన్స్లో బీటెక్, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ పెట్టుబడుల సంస్థ గోల్డ్మన్ సాచ్స్ ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇతర సంస్థల్లో మూడేళ్లు పనిచేశారు.అయితే ఈ క్రమంలో వర్క్ఫ్రమ్ హోమ్లో విధులు నిర్వహిస్తున్న అక్షయ గతనెల సెప్టెంబర్ 18 మెదడు రక్తస్రావం కారణంగా ఇంట్లోనే మరణించారు. అక్షయ మరణించిన తర్వాత అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. ఆ సమయంలో పలువురు తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేశారని, మరికొందరు తనపట్ల దారుణంగా వ్యవహరించారని వాపోయారు. https://t.co/yJRWH989TU— DCP Whitefield Bengaluru (@dcpwhitefield) October 30, 2025 ‘నా కుమార్తె మరణం తర్వాత..అవసరమైన ఫార్మాలటీస్లను పూర్తిచేసేందుకు అవసరమైన పత్రాలను పొందడానికి అంబులెన్స్ ఆపరేటర్ నుంచి పోలీసు అధికారుల వరకు..శ్మశానవాటిక నుంచి బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కార్యాలయ సిబ్బంది వరకు దాదాపు అందరికీ లంచాలు చెల్లించాల్సి వచ్చింది.పోలీస్ స్టేషన్లో కూడా తనను నగదు రూపంలో చెల్లించమని బలవంతం చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్,పోస్టుమార్టం నివేదిక కాపీని ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పోలిస్స్టేషన్ చుట్టూ నాలుగు రోజులు తిరిగాం. పనికాలేదు. పోలీసులు స్టేషన్లోని బహిరంగంగా నన్ను లంచం డిమాండ్ చేశారు. ఆ లంచాన్ని కూడా పోలిస్ స్టేషన్లోనే ఇచ్చారు. నేను నా ఏకైక బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉంటే.. ఈ సమాజం సానుభూతి లేకుండా నన్ను లంచం పేరుతో కాల్చుకు తిన్నది. ఇది దారుణం. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చెల్లించాను. మరి పేదల పరిస్థితి ఏంటి?నా కుమార్తె భౌతికకాయాన్ని కసవనహళ్లిలోని ఓ ఆస్పత్రి నుంచి కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. ఇందుకోసం అంబులెన్స్ డ్రైవర్ రూ.3వేలు డిమాండ్ చేశాడు. పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాపట్ల కుమార్తె చనిపోయిందన్న కనికరం కూడా చూపించలేదు పోలీసు అధికారులు లంచం అడిగారు. అసభ్యంగా మాట్లాడారు. ‘(తన గురించి మాట్లాడుతూ..)ఒక వ్యక్తి ఇప్పటికే మానసికంగా కుంగిపోయి, భావోద్వేగంగా తల్లడిల్లుతున్న సమయంలో పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడం,నిర్లక్క్ష్యంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం. వాళ్లకు కుటుంబం లేదా? వారికి బావోద్వేగాలు ఉండవా? ఇది అక్కడితో ఆగలేదు. బీబీఎంపీ నుంచి డెత్ సర్టిఫికెట్ పొందడానికి చాలా ఇబ్బంది పడ్డా. డెత్ సర్టిఫికెట్ కోసం బీబీఎంపీ కార్యాలయానికి ఐదురోజుల పాటు కాళ్లరిగేలా తిరగా. కొనసాగుతున్న ‘కుల సర్వే’ కారణంగా ఎవరూ అందుబాటులో లేరు. చివరికి బీబీఎంపీ సీనియర్ అధికారిని సంప్రదించిన తర్వాతే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందుకోసం సదరు అధికారి నా వద్ద నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన రుసుము కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిలో.. ఈ అరాచకం నుంచి బెంగళూరును రక్షించగలరా? నారాయణ మూర్తి, అజీమ్ ప్రేమ్జీ, మజుందార్ షాలు బిలియన్ల కొద్దీ డబ్బున్న పెద్దలు ఈ నగరాన్ని రక్షించగలరా? వారు చాలా మాట్లాడతారు కానీ...అని ముగించారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు వైట్ఫీల్డ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శివకుమార్ ట్వీట్లో పేర్కొన్న సంఘటనకు సంబంధించి, బెల్లందూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ పీఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అసభ్యకరమైన లేదా అనుచితమైన ప్రవర్తనను సహించదు’అని పోలీసులు తెలిపారు.
- 
      
                   
                                                       మహేశ్ బాబు మాస్ యాక్షన్ మూవీ.. మళ్లీ వచ్చేస్తోందిసూర్య భాయ్.. ఎలాగోలా ముంబయిలో బతకాలని రాలేదు.. ఈ ముంబయిని ఏలడానికి వచ్చా.. ఈ డైలాగ్ గుర్తుందా? ప్రిన్స్ ఫ్యాన్స్కు అయితే వెంటనే చెప్పేస్తారు. ఈ డైలాగ్ మూవీ పేరుతో పాటు క్యారెక్టర్ కూడా వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. అంతలా ఈ సినిమాలో డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అదేనండి.. మన మహేశ్ బాబు నటించిన మాస్ యాక్షన్ మూవీ బిజినెస్మెన్. అదే సూర్యభాయ్ అంటే పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ .. ఇలాంటి మళ్లీ వినాలనుకుంటున్నారా? అది థియేటర్లలో మరోసారి వింటే ఎలా ఉంటుంది. అందుకే మీకోసం మళ్లీ వచ్చేస్తున్నాడు సూర్య భాయ్.మరోసారి మిమ్మల్ని అలరించేందుకు సూర్య భాయ్ వస్తున్నాడు. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. 2012లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మాస్ యాక్షన్ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. వచ్చేనెల నవంబర్ 29న ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 4కె వర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 46 years of Superstar @urstrulyMahesh in Telugu Cinema will be celebrated with the re-release of #Businessman💥#Businessman4K - noveMBer 29th, 2025 🦁#BusinessmanReRelease@MsKajalAggarwal #PuriJagannadh @musicthaman #RRMakers @MangoMassMedia #TeluguFilmNagar pic.twitter.com/m0D3yel12t— Telugu FilmNagar (@telugufilmnagar) October 30, 2025
- 
      
                   
                                                       అజారుద్దీన్కు మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్ర: భట్టిసాక్షి, హైదరాబాద్: అజారుద్దీన్కు మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్రలు చేస్తోందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎన్నికల కమిషన్కు బీజేపీ నేతలు లేఖ రాశారని.. జూబ్లీహిల్స్ బయట ఎన్నికల కోడ్ లేదన్నారు. తెలంగాణకు, హైదరాబాద్కు గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్. ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద బీజేపీకి ప్రేమ లేదు. ఈ దేశానికి పేరు తెచ్చిన అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి... వద్దని బీజేపీ ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది’’ అని భట్టి మండిపడ్డారు.‘‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ సరెండర్ అయింది. బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుంది. బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చే పనిలో భాగంగానే అజారుద్దీన్పై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ప్రమాణ స్వీకారం జరగకుండా ఉండేందుకు గవర్నర్పై బీజేపీ ఒత్తిడి తెస్తుంది. జూబ్లీహిల్స్ బయట ఎన్నికల కోడ్ లేదు. కరగ్పూర్ నియోజకవర్గంలో పోలింగ్కు ముందు అభ్యర్థిని మంత్రిగా బీజేపీ ప్రకటించింది. అజారుద్దీన్ ఇక్కడ అభ్యర్థి కూడా కాదు.. అయినా అభ్యంతరం ఎందుకు?’’ అంటూ భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
- 
      
                   
                                                       జియో యూజర్లకు బంపరాఫర్: రూ.35000 విలువైన సర్వీస్ ఫ్రీ!అన్లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉపయోగించే.. 18-25 సంవత్సరాల వయసు కలిగిన జియో వినియోగదారులు 18 నెలల పాటు రూ.35,100 విలువైన గూగుల్ జెమిని AI ప్రో సేవను ఉచితంగా పొందవచ్చు. దీనికోసం రిలయన్స్ కంపెనీ.. గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో ఏఐ స్వీకరణను వేగవంతం చేయడానికి.. యువ సబ్స్క్రైబర్లకు గూగుల్ జెమినీ AI ప్రోను ఉచితంగా అందించడానికి కంపెనీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఇది అక్టోబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే.. అర్హత కలిగిన యూజర్లు అన్లిమిటెడ్ 5G ప్లాన్లపై గూగుల్ AI ప్రో ఉచితంగా పొందవచ్చు. ఇది అపరిమిత చాట్, 2TB క్లౌడ్ స్టోరేజ్, Veo 3.1 లో వీడియో జనరేషన్, నానో బనానాతో ఇమేజ్ జనరేషన్ వంటివెన్నో అందిస్తుంది.రూ. 349 నుంచి ప్రారంభమయ్యే 5జీ అన్లిమిటెడ్ ప్లాన్లకు (ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్) ఉచిత జెమినీ ప్రో లభిస్తుంది. ఇది యాక్టివేషన్ చేసుకున్న రోజు నుంచి 18 నెలల వరకు అందుబాటులో ఉంటుంది (అపరిమిత 5G ప్లాన్ యాక్టివ్లో ఉండాలి). యువ భారతీయులలో సృజనాత్మకత, విద్య & ఆవిష్కరణలకు ఆజ్యం పోసేందుకు కంపెనీ దీనిని ప్రత్యేకంగా రూపొందించింది. దీనిని మైజియో యాప్ ద్వారా నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు.1.45 బిలియన్ భారతీయులకు ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్ వంటి వ్యూహాత్మక & దీర్ఘకాలిక భాగస్వాములతో మా సహకారం ద్వారా, భారతదేశాన్ని అల్-ఎనేబుల్డ్ కాకుండా అల్-ఎంపవర్డ్ గా మార్చాలని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.FREE BENEFITS WORTH ₹35,100 🎉FREE pro plan of Google Gemini for 18-months (worth ₹35,100) for Jio users aged 18–25 years (early access) using an eligible Unlimited 5G plan.Enjoy unlimited chats, 2TB cloud storage, video generation on Veo 3.1, image generation with Nano… pic.twitter.com/O5Pqpo2K4r— Reliance Jio (@reliancejio) October 30, 2025
- 
      
                   
                                                       కేకేఆర్ హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్..ఐపీఎల్-2026 సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ను కేకేఆర్ నియమించింది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీకరించారు.గత సీజన్లో హెడ్కోచ్గా పనిచేసిన చంద్రకాంత్ పండిట్ స్థానాన్ని నాయర్ భర్తీ చేయనున్నాడు. "అభిషేక్ నాయర్ 2018 నుంచి కేకేఆర్ సెటాప్లో భాగంగా ఉన్నాడు. ఎంతో మంది మా ఆటగాళ్లను అభిషేక్ తీర్చిదిద్దాడు. హెడ్ కోచ్గా అతడు మా జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నామని" వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా నాయర్ 2018 నుంచి కేకేఆర్ బ్యాక్ రూమ్ స్టాఫ్లో భాగంగా ఉన్నాడు. అంతకుముందు కేకేఆర్ అకాడమీలో యువ ఆటగాళ్లను తాయారు చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.నాయర్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. భారత జట్టు సహాయక కోచ్గా కూడా నాయర్ పనిచేశాడు. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ కారణంగా అసిస్టెంట్ కోచ్లపై వేటు వేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో నాయర్ తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఐపీఎల్-2025లో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కేకేఆర్ జట్టు ప్రధాన కోచ్గా కూడా అతడు బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా నాయర్ ఇటీవలే డబ్ల్యూపీఎల్ జట్టు యూపీ వారియర్స్ హెడ్ కోచ్గా కూడా ఎంపికయ్యాడు.
- 
      
                   
                                                       ఓఆర్ఆర్పై ప్రమాదాల నివారణకు ‘ఓఆర్ఆర్పై నో పార్కింగ్’ ప్రచారంహైదరాబాద్: నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను నివారించే లక్ష్యంతో ‘ఓఆర్ఆర్పై నో పార్కింగ్’ అనే ప్రచారానికి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ దేశంలోనే ప్రముఖ, అతిపెద్ద, లిస్టెడ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అయిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ వారి స్పెషల్ పర్పస్ వెహికిల్. నగరంలోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ఈ సంస్థే నిర్వహిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్)తో కలిసి ఈ నెలరోజు ప్రచారానికి ఐఆర్బీ సంస్థ శ్రీకారం చుట్టింది.“ఓఆర్ఆర్ మీద పార్కింగ్ సురక్షితం కాదు” అనే కీలకమైన సందేశాన్ని అందరికీ చేరవేయడం, ఈ హైస్పీడ్ కారిడార్ మీద అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడం ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో వాహన దారులకు అవగాహన కల్పించడం ఈ ప్రచార లక్ష్యం. 158 కిలోమీటర్ల పొడవున్న ఈ ఓఆర్ఆర్ను గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేలా తీర్చిదిద్దారు. అయితే, ఇటీవలి కాలంలో కొన్నిచోట్ల వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల కొన్ని తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా వరకు లారీలు, ట్రక్కులను ఇలా పార్క్ చేయడంతో ఇవి వేగంగా వచ్చే వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి.ప్రమాదాన్ని సూచించే లైట్లు లేదా రిఫ్లెక్టివ్ వార్నింగ్ పరికరాలు ఏవీ లేకుండానే ఇలా అక్రమంగా భారీ వాహనాలను పార్కింగ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని భద్రతాధికారులు, నిపుణులు తరచు గుర్తిస్తున్నారు. ఈ ప్రచారం ప్రారంభం సందర్భంగా హెచ్జీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, “ఔటర్ రింగ్ రోడ్డు అనేది వాహనాలు వేగంగా వెళ్లడానికి ఉందేతప్ప ఆగడానికి, పార్కింగ్ చేయడానికి కాదు! ఇలా షోల్డర్స్ మీద, అత్యవసర లేన్లలోను అక్రమంగా పార్క్ చేసిన వాహనాల వల్లే దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి.అందుకే ఈ విషయంపై అవగాహన పెంచేందుకు మేం ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే, ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఈ ప్రచారం చేస్తున్నాం. దీనిద్వారా ప్రతి వాహనదారుడు కూడా ఓఆర్ఆర్ మీద ఒక్క క్షణం ఆగినా అది ప్రాణాంతకం కావచ్చని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సౌలభ్యం కంటే రక్షణకే ఎప్పుడూ తొలి ప్రాధాన్యం ఇవ్వాలి” అని చెప్పారు.ఈ సందర్భంగా ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే డైరెక్టర్ మాట్లాడుతూ, “ఓఆర్ఆర్ అనేది అంతర్జాతీయ మొబిలిటీ కారిడార్. అది హైదరాబాద్ వృద్ధి, సామర్థ్యాలకు నిదర్శనం. అయితే, ఈ రోడ్డును అక్రమ పార్కింగ్ కోసం దుర్వినియోగం చేయడం వల్ల నివారించదగ్గ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారం వల్ల అవగాహన పెరిగి, ప్రాణాలను కాపాడగలం. ఓఆర్ఆర్ మీద అత్యవసర పరిస్థితి వస్తే తప్ప వాహనాలను ఎప్పుడూ పార్కింగ్ చేయకూడదన్న సందేశం అందరికీ బలంగా వెళ్తుంది” అని వివరించారు.నెలరోజుల పాటు నిర్వహించే ఈ ప్రచారంలో ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, దాని భాగస్వాములు కలిసి క్షేత్రస్థాయిలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ ప్రచారాలు, వాణిజ్య డ్రైవర్లతోను, లాజిస్టిక్ సంస్థల నిర్వాహకులు, ప్రైవేటు వాహనాల యజమానులతో సెషన్లు నిర్వహిస్తారు. తద్వారా సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఈ రోడ్డును వాళ్లు వాడుకోగలరు.దాంతోపాటు ఈ ప్రచారంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) కూడా చేయి కలుపుతున్నాయి. ప్రధానమైన ఓఆర్ఆర్ ఇంటర్సెక్షన్ల వద్ద ‘నో పార్కింగ్ ఆన్ ఓఆర్ఆర్’, ‘నో ఫ్యూయెల్ ఆన్ ఓఆర్ఆర్’ అనే ఫ్లెక్సీలను ప్రదర్శిస్తారు. తద్వారా, ఓఆర్ఆర్ మీదకు వెళ్లేముందే వాహనదారులకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా ‘ఓఆర్ఆర్ మీదకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అనుమతి లేదు’ అనే విషయాన్ని కూడా ప్రచారం చేస్తారు. తద్వారా ఈ వర్గాలకూ అవగాహన పెంచుతారు.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ఈ ప్రచారం ద్వారా ‘సున్నా మరణాల కారిడార్’గా మార్చడమే లక్ష్యంగా భావిస్తున్నారు. తద్వారా ఓఆర్ఆర్ మీద జరిగే చాలావరకు ప్రమాదాలను కేవలం ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రవర్తనల ద్వారా నివారించవచ్చని చెబుతున్నారు.
- 
      
                   
                                                       టిమ్స్.. కార్పొరేట్ వైద్యసేవలుసనత్నగర్లో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. కార్పొరేట్ హంగులతో ప్రభుత్వ ఆసుపత్రి సిద్ధమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన ఈ ఆసుపత్రిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో 11.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+5 అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మిస్తోంది. ఇందులో వెయ్యి పడకలు, 30 విభాగాల్లో కార్పొరేట్ తరహా వైద్యసేవలు రోగులకు అందనున్నాయి. –సాక్షి, సిటీబ్యూరోరాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే క్రిటికల్ కేసులకు రిఫరల్ ఆసుపత్రులుగా ఉన్న గాంధీ, ఉస్మానియా, నిలోపర్, ఫీవర్, ప్రసూతి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం భావించింది. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నుంచి అత్యవసర పరిస్థితుల్లో నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఆసుపత్రులకు వెళ్లాలంటే ట్రాఫిక్ తిప్పలు తప్పడంలేదు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే ప్రత్యామ్నాయంగా నగరం నలుమూలలా పెద్ద ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సనత్నగర్, ఎల్బీనగర్, అల్వాల్లో సుమారు రూ.2,500 కోట్లతో మూడు ఆసుపత్రులను ప్రతిపాదించింది. సనత్నగర్లోని ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో టిమ్స్ నిర్మాణానికి 22.6 ఎకరాలు కేటాయించింది. రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టింది. ఎల్బీ నగర్, అల్వాల్లో ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేయాలని తొలుత ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నా వివిధ కారణాలతో పనులు పూర్తికాలేదు.గుండె జబ్బులకు ప్రత్యేకం.. సనత్నగర్ టిమ్స్ (Sanathnagar TIMS) ఆసుపత్రిలో ప్రధానంగా గుండె జబ్బులకు అత్యాధునిక శస్త్రచికిత్సలు అందించనున్నారు. క్యాథ్ల్యాబ్లు, ఆధునాతన ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉంటాయి. అవయవ మార్పిడికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆపరేషన్ థియేటర్లు, నిపుణులైన వైద్యులను కేటాయించనున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ ఫర్ కార్డియాక్ డిసీజెస్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం అందుబాటులోకి రానుంది. సుమారు 500 పడకలను గుండె వ్యాధుల రోగులకు కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని హృద్రోగ నిపుణులతో సమావేశం నిర్వహించారు. అదే సమయంలో ఇతర విభాగాలైన ప్రసూతి, పీడియాట్రిక్, న్యూరాలజీ, ఈఎన్టీ, పల్మనరీ, ఇతర విభాగాల్లోనూ ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఆసుపత్రి ప్రధాన భవనంలో బ్లాక్ల వారీగా ఇలా... ఏ బ్లాక్: అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్స్ బీ బ్లాక్: ఓపీ నమోదు కేంద్రం, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, క్యాథ్ల్యాబ్స్ సీ బ్లాక్: రేడియాలజీ డిపార్ట్మెంట్, పాథోలాజికల్ ల్యాబ్స్, సాధారణ, ప్రైవేటు వార్డులు, వీఐపీ షూట్స్ డీ బ్లాక్: పరిపాలన, అకడమిక్ బ్లాక్లు, 200 సీట్ల సామర్థ్యం ఉన్న ఆడిటోరియంచదవండి: జస్ట్ మిస్.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?ఆపరేషన్ థియేటర్స్, బెడ్స్ ఇలా.. ఐసీయూలో 300, సాధారణ వార్డులో 500, ప్రైవేట్ వార్డుల్లో 200 పడకలు ఉంటాయి. మరో 30 పడకలతో డయాలసిస్ సెంటర్ ఉంటుంది. మేజర్ ఆపరేషన్ థియేటర్లు 16, మైనర్ ఆపరేషన్ థియేటర్లు 6, పాథోలజీ ల్యాబ్స్ 17, మైక్రో బయాలజీ ల్యాబ్స్ 12, బయో కెమెస్ట్రీ ల్యాబ్స్ 10, ఇతర ల్యాబ్లు 5, ఎక్స్రే యంత్రాలు 5, కాత్ ల్యాబ్లు 2, ఎమ్మారై, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, న్యూక్లియర్ మెడిసిన్ వార్డులు ఒక్కొక్కటి చొప్పున అందుబాటులోకి రానున్నాయి. రోగులకు సహాయంగా వచ్చే 200 మందికి ఆశ్రయం కల్పించే విధంగా ధర్మశాల, ఆసుపత్రి మొత్తానికి సరిపడా కేంద్రీకృత వంటశాల, లాండ్రీ, 30 మృతదేహాలను భద్రపరిచేవిధంగా మార్చురీ సిద్ధమవుతున్నాయి.
- 
      
                   
                                                       ముందు బీమా చెల్లించండి.. తర్వాతే ఏమైనా!: సుప్రీంకోర్టుఈ రోజుల్లో దాదాపు అందరూ బీమా తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరిగినప్పుడు.. కొన్ని కారణాలను చూపిస్తూ బీమా సంస్థలు పరిహారం చెల్లించకుండా తప్పించుకుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 'వాహనం రూట్ ఉల్లంఘన జరిగినా కూడా, ప్రమాద బాధితుడికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిందే' అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ప్రమాదం జరిగిన సమయంలో.. వాహనం రూట్ మారిందని ప్రమాద బాధితులకు బీమా కంపెనీ పరిహారాన్ని తిరస్కరించకూడదు. సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని బీమాను తిరస్కరించలేరు. ప్రమాద బాధితుడికి న్యాయం చేయడమే బీమా ముఖ్య ఉద్దేశం. బీమా చెల్లించిన తరువాత.. ఏవైనా అవకతవకలు ఉంటే.. రూల్స్ ఉల్లంఘించిన వాహన యజమానిపై లేదా డ్రైవర్ నుంచి రికవరీ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
- 
      
                   
                                                       మీడియాపై సీఎం చంద్రబాబు అసహనంసాక్షి,విజయవాడ: మోంథా తుపాను నివేదికపై మీడియా ప్రశ్నలకు సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మీకు సంచలన వార్తలే కావాలి, వాస్తవం అవసరం లేదు’అంటూ ఆయన మీడియాపై ఘాటుగా స్పందించారు.గురువారం ఏపీలో బీభత్సం సృష్టించిన మోంథా తుపాను ప్రభావంపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించారు. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టం) ద్వారా తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారం తక్షణమే తెలుసుకున్నామని తెలిపారు. అయితే, ‘ఆ డేటాను కేంద్రానికి పంపించారా?’ అని మీడియా ప్రశ్నించడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ‘అన్నీ రియల్ టైమ్లో ఎలా సాధ్యమవుతాయి?’ అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ‘మీకు సెన్సేషన్ వార్తలు కావాలి, రియాలిటీ అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇంకా నివేదిక పంపించలేదని, త్వరలో పంపించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు.
- 
      
                   
                                                       'పదేళ్లైనా ఎక్కడా తగ్గలేదు'.. రాజమౌళి స్పీచ్ వైరల్దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో సందడి చేశారు. బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ షో సందర్భంగా ఆడియన్స్ను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి రిలీజై పదేళ్లయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదన్నారు. ఇదంతా మీవల్లే సాధ్యమైందని కామెంట్స్ చేశారు. మహిస్మతి రాజ్యంలోని ప్రజలంతా బాగున్నారా? అంటూ అభిమానులను పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మీ అందరి ప్రేమ వల్లే మరోసారి మీ ముందుకు తీసుకొస్తున్నామని రాజమౌళి అన్నారు. పదేళ్లుగా మీరు ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జై మహిస్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. కాగా.. బాహుబలి రెండు పార్టులను కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాహుబలి ది ఎపిక్(Baahubali: The Epic) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. THE DIRECTOR addressing the audience at @PrasadsCinemas PCX screen!! It’s SHOW TIME.. #BaahubaliTheEpic #Baahubali pic.twitter.com/1dY6hj7cYE— Baahubali (@BaahubaliMovie) October 30, 2025
- 
      
                   
                                                       టీమిండియా కొంపముంచిన చెత్త ఫీల్డింగ్..మహిళల వన్డే వరల్డ్కప్-2025లో భాగంగా భారత్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు.లిచ్ఫీల్డ్ సూపర్ సెంచరీ..తొలుత ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ మెరుపు సెంచరీతో చెలరేగింది. 22 ఏళ్ల లిచ్ఫీల్డ్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించింది. 93 బంతులు ఎదుర్కొన్న లిచ్ఫీల్డ్.. 17 ఫోర్లు, 3 సిక్స్లతో 119 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎల్లీస్ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 77), గార్డెనర్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.బౌలర్లు విఫలం..ఈ కీలక పోరులో భారత బౌలర్లు చెతులేత్తేశారు. స్పిన్నర్ శ్రీచరణి మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీనియర్ ఆల్రౌండర్ దీప్తీ శర్మ బంతితో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 9.5 ఓవర్లు బౌలిగ్ చేసిన దీప్తీ.. రెండు వికెట్లు పడగొట్టినప్పటికి ఏకంగా 73 పరుగులు సమర్పించుకుంది. ఆమెతో పాటు రాధా యాదవ్, అమన్ జ్యోత్ కౌర్ కూడా భారీగా పరుగులిచ్చారు. భారత బౌలింగ్ను కంగారులు ఓ ఆట ఆడుకున్నారు. చరణి మాత్రం తన 10 ఓవర్ల కోటాలో 49 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించింది.చెత్త ఫీల్డింగ్..ఇక ఫీల్డింగ్లో టీమిండియా తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మ్యాచ్లో కూడా ఫీల్డింగ్లో భారత్ తీవ్ర నిరాశపరిచింది. తొలుత హర్మన్ ప్రీత్ విడిచిపెట్టిన క్యాచ్ నుంచి మొదలైన ఫీల్డింగ్ కష్టాలు మ్యాచ్ ఆఖరి వరకు కొనసాగాయి. ఈ మ్యాచ్లో మిస్ ఫీల్డ్స్, బంతిని సరిగ్గా అందుకోకపోవడం, ఓవర్ త్రోస్ వంటి తప్పిదాలను భారత ఫీల్డర్లు చేశారు. అందుకు భారత్ భారీ మూల్యం చెల్సించుకోవాల్సి వచ్చింది. టీమిండియా ప్లేయర్లు సరిగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే ఆసీస్ స్కోర్ 300 పరుగుల మార్క్ను దాటకపోయేది.ఈ టోర్నీలో భారత జట్టు ఫీల్డింగ్ గణాంకాలు పట్టిన క్యాచ్లు- 35 వదిలేసిన క్యాచ్లు-18 క్యాచింగ్ సామర్థ్యం- 66% మిస్ అయిన స్టంపింగ్లు- 3 మిస్ఫీల్డ్లు - 74 ఓవర్త్రోలు అయిన బంతులు- 6 చదవండి: IND vs SA: టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ ఫెయిల్! అయినా భారీ స్కోర్
- 
      
                   
                                                       మెరుగైన భారత్ కోసం ఏఐ: రూ.1 కోటి బహుమతిభారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్.. తన జాతీయ విద్యా కార్యక్రమం ‘శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో 2025’ నాల్గవ ఎడిషన్ విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమం యువ విద్యార్థులు సాంకేతికతను వినియోగించి తమ స్థానిక కమ్యూనిటీల్లోని వాస్తవ ప్రపంచ సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుంది.మొదటి నాలుగు విజేత జట్లుపెర్సెవియా (బెంగళూరు)నెక్ట్స్ప్లే.ఏఐ (ఔరంగాబాద్)పారస్పీక్ (గురుగ్రామ్)పృథ్వీ రక్షక్ (పలాము)ఐఐటి ఢిల్లీకి చెందిన ఎఫ్ఐటీటీ ల్యాబ్స్లో మెంటర్షిప్ మద్దతుతో, తమ ఆవిష్కరణాత్మక ప్రోటోటైప్లను స్కేలబుల్ రియల్-వరల్డ్ పరిష్కారాలుగా అభివృద్ధి చేయడానికి రూ. 1 కోటి విలువైన ఇంక్యుబేషన్ గ్రాంట్లు అందుకున్నారు. జ్యూరీ ప్యానెల్లో.. శామ్సంగ్ మాత్రమే కాకుండా, విద్యా సంస్థలు, ప్రభుత్వం & పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్యానెల్ నాలుగు ప్రధాన నేపథ్య ట్రాక్లలో ఫైనలిస్టుల పరిష్కారాలను అంచనా వేసింది.అత్యుత్తమ ప్రపంచాన్ని నిర్మించడంలో తమ సృజనాత్మకత & అంకితభావాన్ని ప్రతిబింబించినందుకు టాప్ 20 ఫైనలిస్ట్ జట్లు ఒక్కొక్కటి రూ 1 లక్ష నగదు బహుమతితో పాటు తాజా శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్ఫోన్లను కూడా అందుకున్నాయి. అదనంగా, ఈ కార్యక్రమం ఐదు ప్రత్యేక అవార్డుల కింద బహుమతులను అందించింది
- 
      
                   
                                                       ఆ కార్లను తుక్కుగా అమ్మేస్తున్నారుకఠ్మాండూ: నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత(జెన్-జీ) చేపట్టిన ఆందోళనల్లో దహనమైన కార్లను ఇప్పుడు ప్రభుత్వం తుక్కు కింద జమకట్టి.. కిలోల్లా అమ్మేస్తోంది. ఆగస్టు నెలలో జెన్-జీ ఉద్యమం తారాస్థాయికి చేరుకోవడంతో యువత పార్లమెంట్ భవనం, సుప్రీంకోర్టు, ప్రభుత్వ అధినేతల ఇళ్లు, రోడ్లపై పార్క్ చేసిన వాహనాలను దహనం చేసిన విషయం తెలిసిందే..! ఆందోళనలతో దెబ్బతిన్న వాహనాలను ఇప్పుడు తుక్కు కింద అమ్మడం తప్పితే.. ఎలాంటి ఉపయోగం ఉండదని, వాటి శకలాలను పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాల ఆవరణలో పెట్టడం వల్ల స్థలాభావం తప్పదని ప్రభుత్వ ఇంజనీర్లు పేర్కొన్నారు.కిలోకు రూ.45 రూపాయలుఅగ్నికి ఆహుతైన వాహనాల నుంచి ఇనుమును వేరు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇంజన్లు సక్రమంగా ఉన్న వాహనాలను వేలం వేయాలని నిర్ణయించింది. అయితే.. ఎందుకూ పనికిరాకుండా ఉన్న వాహనాల నుంచి సేకరించిన ఇనుమును తుక్కుగా అమ్మేయడానికి రంగం సిద్ధం చేసింది. బన్వేశ్వర్లో నిర్ణయించిన వేలంలో ఓ స్క్రాప్ వ్యాపారి కిలోకు రూ.45 చొప్పున చెల్లించి, కార్ల తుక్కును కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.తొలి దశలో ఈ వాహనాల వేలం..తొలి దశలో సింఘా దర్భార్ వద్ద ఉన్న 145 కార్లు, 256 ద్విచక్ర వాహనాలు, రెండు బస్సుల స్క్రాప్ను వేలం వేయాలని నిర్ణయించినట్లు పట్టణాభివృద్ధి శాఖ సెక్షన్ ఆఫీసర్ కేశవ్ శర్మ మీడియాకు తెలిపారు. ప్రధాని కార్యాలయం, అధికారిక నివాసం సహా.. 22 చోట్ల వాహనాల శకలాలు పడి ఉన్నాయని ఆయన చెప్పారు. వాటన్నింటినీ దశల వారీగా వేలం వేస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో 500 వాహనాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల వద్ద దహనమైన కార్లు, వాహనాల తుక్కును తదుపరి దశలో వేలం వేయాల్సి ఉందని వివరించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకే తుక్కుగా కార్ల విక్రయం ప్రారంభమైందన్నారు.
- 
      
                   
                                                       దుల్కర్ సల్మాన్ కాంత.. మరో సాంగ్ వచ్చేసిందిమలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సో జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత. ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో సాంగ్ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన సాంగ్ దుల్కర్ సల్మాన్ అభిమానులను అలరిస్తోంది. ఇంగ్లిష్ లిరిక్స్తోపాటు తమిళం, తెలుగు ర్యాప్తో కూడిన ఈ సాంగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటను సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. ఈ సాంగ్కు జాను చంతర్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు.
- 
      
                   
                                                       ఒంటినిండా నగలు ధరిస్తే.. రూ. 50వేలు జరిమానా!బంగారు నగలు ఉంటే.. ఎవరికైనా ధరించుకోవాలని, ఓ నలుగురికి చూపించుకోవాలని ఉంటుంది. అయితే ఇలాంటి ఆడంబరాలకు స్వస్తి పలకడానికి.. ఉత్తరాఖండ్లోని జౌన్సర్-బావర్ గిరిజన ప్రాంతంలోని కంధర్ గ్రామ నివాసితులు ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఉల్లంఘించిన వారికి రూ. 50వేలు జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.ఆడంబరాలను అరికట్టడానికి మాత్రమే కాకుండా.. ఆర్ధిక అసమానతలను తగ్గించడానికి గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి మహిళలు కూడా స్వాగతించారు. ఇకపై అక్కడి మహిళలు వివాహాది శుభకార్యాలకు వెళ్లినా.. కేవలం చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలి. ఇవి కాదని ఎవరైనా ఇతర బంగారు నగలను ధరిస్తే.. వారికి రూ. 50,000 జరిగిమానా విధించనున్నట్లు గ్రామపెద్దలు హెచ్చరించారు.బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. డబ్బున్నవారు గోల్డ్ కొనుగోలు చేస్తారు. పేదరికంలో ఉన్నవారికి ఇది సాధ్యం కాదు. బంగారం కొనాలని అప్పులు చేస్తే.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో అప్పులు పెరుగుతాయని కంధర్ గ్రామపెద్దలు.. కొత్త నిర్ణయం తీసుకున్న సందర్భంగా వివరించారు.వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారం. అది ప్రదర్శించడానికి వేదిక కాదు. ఆడంబరాలు/ప్రదర్శనలు అనే గోడలను కూల్చివేసినప్పుడే.. నిజమైన సమానత్వం సాధించబడుతుందని అక్కడి నివాసితులు నమ్ముతున్నారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం.. ధనిక & పేద కుటుంబాల మధ్య పోల్చుకోవడం కొంత తగ్గుతుంది. అనవసరమైన ఖర్చులను అరికట్టవచ్చు. ఇది సామాజిక ఐక్యతను పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
- 
      
                   
                                                       53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టబోతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తదుపరి సీజేఐగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సంబంధించిన డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ దాదాపు 15 నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతో రా ష్ట్రపతి ముర్ము జస్టిస్ సూర్యకాంత్ను సుప్రీంకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ సూర్యకాంత్కు అభినందనలు తెలియజేశారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లా పెటా్వర్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జని్మంచారు. 1981లో హిసార్లోని ప్రభుత్వ పీజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ లా అభ్యసించారు. 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ‘మాస్టర్ ఆఫ్ లా’లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 2000 జూలై 7 నుంచి 2004 జనవరి 8 దాకా హరియాణా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్గా సేవలందించారు. 2004 జనవరి 9 నుంచి 2018 అక్టోబర్ 4 దాకా పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2018 అక్టోబర్ 5 నుంచి 2019 మే 23 దాకా హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆరేళ్లుగా సుప్రీంకోర్టులో సేవలందిస్తున్నారు. 2000 సంవత్సరం కంటే ముందే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన జస్టిస్ సూర్యకాంత్ 2011లో మాస్టర్ ఆఫ్ లా పూర్తిచేయడం విశేషం.కీలక తీర్పుల్లో భాగస్వామి సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామ్యం కూడా ఉంది. పలు ధర్మాసనాల్లో ఆయన పనిచేశారు. జమ్మూకశీ్మర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటి కీలక అంశాల్లో ఆయన తీర్పులిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ తీర్పు ఇచి్చన బెంచ్లో జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యుడే. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దని ఆయన ఆదేశించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సహా ఇతర బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆదేశించి చరిత్ర సృష్టించారు. రక్షణ దళాల్లో వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకాన్ని సమరి్థంచారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో సభ్యుడిగా పనిచేశారు. జాతీయ భద్రత పేరిట ప్రముఖుల గోప్యతకు భంగం కలిగించడం సరైంది కాదని తేలి్చచెప్పారు. 2022లో మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా పరమైన లోపాలు బయటపడ్డాయి. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్న ధర్మాసనం విచారించింది.
- 
      
                   
                                                       పడిపోయిన టాప్ ఐటీ కంపెనీ లాభాలుదేశీయంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను కలిగిన ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2025) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్(క్యూ3)లో యూఎస్ కంపెనీ నికర లాభం 53 శాతం క్షీణించి 27.4 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఈ కాలంలో 39 కోట్ల డాలర్లమేర నగదేతర ఆదాయ పన్ను వ్యయాల కారణంగా లాభాలు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది.గతేడాది(2024) క్యూ3లో 58.2 కోట్ల డాలర్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 7 శాతంపైగా ఎగసి 541.5 కోట్ల డాలర్లను తాకింది. ఏఐలో పెట్టుబడులు ఇందుకు సహకరించగా.. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను తాజాగా మెరుగుపరచింది. వెరసి ఇంతక్రితం ప్రకటించిన 20.7–21.1 బిలియన్ డాలర్లను 21.05–21.1 బిలియన్ డాలర్లకు సవరించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే.ఈ బాటలో చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో 5.27–5.33 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఈ క్యూ3లో ఆర్డర్ల బుకింగ్స్ 5 శాతం నీరసించగా.. 6,000 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,49,800ను తాకింది. ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించే బాటలో సాగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
- 
      
                   
                                                       భారత బౌలర్లను ఉతికారేసిన 22 ఏళ్ల ఆసీస్ బ్యాటర్మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా భారత్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. ఈ కీలక పోరులో 22 ఏళ్ల లిచ్ఫీల్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. భారత బౌలర్లను ఉతికారేసింది.దీప్తీ శర్మ వంటి స్టార్ స్పిన్నర్ను సైతం లిచ్ఫీల్డ్ విడిచిపెట్టలేదు. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లతో ఈ ఆసీస్ యువ సంచలనం అలరించింది. ఆమె పెర్రీతో కలిసి రెండో వికెట్కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లిచ్ఫీల్డ్.. కేవలం 77 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్ను అందుకుంది.ఆమెకు ఇదే తొలి వరల్డ్ కప్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్గా 93 బంతులు ఎదుర్కొన్న లిచ్ఫీల్డ్.. 17 ఫోర్లు, 3 సిక్స్లతో 119 పరుగులు చేసింది. దీంతో మహిళల వన్డే వరల్డ్కప్ నాకౌట్స్లో సెంచరీ చేసిన మూడో ఆసీస్ ప్లేయర్గా లిచ్ఫీల్డ్ నిలిచింది. ఆమె కంటే ముందు హీలీ, కరెన్ రోల్టన్ ఈ ఫీట్ సాధించారు.అదే విధంగా మహిళల వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్గా లిచ్ఫీల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు హర్మన్ ప్రీత్ కౌర్ పేరిట ఉండేది. 2017 ప్రపంచకప్ సెమీస్లో ఆసీస్పై హర్మన్ 90 బంతుల్లో సెంచరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కేవలం 77 బంతుల్లోనే శతక్కొట్టిన లిచ్ఫీల్డ్.. హర్మన్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.WHAT A SHOT BY 22 YEAR OLD PHOEBE LITCHFIELD AGAINST DEEPTI SHARMA.🔥- Phoebe Litchfield & Ellyse Perry dominating Indian bowlers Kranti Gaud, Radha, Amanjot Kaur.🥶pic.twitter.com/WpHTXWA0AC— MANU. (@IMManu_18) October 30, 2025
- 
      
                   
                                                       కాపర్కు పెరుగుతున్న డిమాండ్..దేశీయంగా కాపర్కు డిమాండ్ బలపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 1,878 కిలో టన్నులకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ 1,718 కిలో టన్నులతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా (ఐసీఏ ఇండియా) ఈ వివరాలను నివేదిక రూపంలో విడుదల చేసింది.ఆర్థికంగా పురోగమిస్తుండడం, కీలక రంగాల్లో కాపర్ వినియోగం పెరుగుతుండడం డిమాండ్కు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ విద్యుత్ సామర్థ్యాల విస్తరణ వంటివి డిమాండ్ను అధికం చేస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణ రంగం నుంచి కాపర్కు డిమాండ్ 11 శాతం పెరగ్గా, మౌలిక సదుపాయాల రంగం నుంచి 17 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది.‘‘భారత్లో ఆర్థిక, పారిశ్రామిక పురోగతికి అనుగుణంగా కాపర్ డిమాండ్ పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన వనరులు, సుస్థిర రవాణా పరిష్కారాలు, మౌలిక వసతుల అభివృద్ధి కాపర్ డిమాండ్ను పెంచుతున్నాయి. దేశ అభివృద్ధికి కీలక వనరుగా కాపర్ తనవంతు పాత్రను తెలియజేస్తోంది’’అని ఐసీఏ ఇండియా తెలిపింది.అయితే వికసిత్ భారత్ ఆకాంక్షకు అనుగుణంగానే ప్రస్తుత కాపర్ డిమాండ్ ఉందా? అని ప్రశ్నించుకోవాలని ఏసీఏ ఇండియా ఎండీ మయాంక్ కర్మార్కర్ పేర్కొన్నారు. కాపర్ నిల్వలను అభివృద్ధి చేసుకోవడం, దేశీ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా భవిష్యత్ డిమాండ్ను చేరుకోవచ్చని సూచించారు.భవిష్యత్తు బంగారంబంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకో కొత్త ధరకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరంగా జరిగిపోతోంది పసిడి. ఇన్వెస్టర్లు సైతం స్వర్ణంపై సంపూర్ణ విశ్వాసం పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘భవిష్యత్ బంగారం’గా మరో లోహం ఆశలు పూయిస్తోంది. అదే ‘రాగి’ (Copper). మల్టీ నేషనల్ మైనింగ్ సంస్థ వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కాపర్ను 'తదుపరి బంగారం'గా అభివర్ణించారు. ఇది క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ఎక్కువగా ప్రాముఖ్యతను పొందుతోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు, ఏఐ, రక్షణ పరికరాలలో కాపర్కు పెరుగుతున్న డిమాండ్ను ఆయన ప్రస్తావించారు. కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్ పదాన్ని తొలగించి కేవలం 'బారిక్'గా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపై దృష్టి మారే సంకేతంగా ఆయన పేర్కొన్నారు.The world's second largest gold producer, Barrick Gold is rebranding to just Barrick. That is because it sees its future in copper.Copper is the new super metal which is being heavily used in every advanced technology, whether EVs, renewable energy infrastructure, AI or defence… pic.twitter.com/YUDC5Rid4r— Anil Agarwal (@AnilAgarwal_Ved) April 17, 2025
- 
      
                   
                                                       20 మంది పిల్లల కిడ్నాప్.. నిందితుడు రోహిత్ హతంముంబై: 20 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసిన నిందితుణ్ని పోలీసులు కాల్చి చంపారు. గురువారం ముంబైలోని పోవై ప్రాంతంలో 20 మంది పిల్లలను బంధించిన నిందితుడు రోహిత్ ఆర్యపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో రోహిత్ ఆర్య చికిత్స పొందుతూ మరణించాడు. తాను నిర్మించనున్న సినిమా,డైలీ సీరియల్స్,వెబ్ సిరీస్లో బాల నటీనటులు కావాలంటూ కిడ్నాపర్ రోహిత్ ఆర్య ఓ యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్ చూసిన 100 మందికి పైగా పిల్లలు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ప్రముఖ నివాస ప్రాంతం ‘పోవై’ ఆర్ఏ స్టూడియోకు తరలివచ్చారు. ఆడిషన్స్ ఇచ్చేందుకు వచ్చిన 100 మంది పిల్లలో 20మంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. వీరి వయస్సు 15 ఏళ్ల లోపే ఉంటుంది.అయితే, గురువారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో పిల్లలు కిడ్నాప్కు గురైనట్లు ‘పోవై’ ప్రాంత పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లల్ని రక్షించేందుకు పోలీసులు కిడ్నాపర్ రోహిత్ ఆర్యతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. పిల్లల్ని విడుదల చేసేందుకు రోహిత్ అంగీకరించలేదు. పైగా పిల్లల ప్రాణాలు తీస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాత్రూం ద్వారా పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ సమయంలో నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపారు.ఈ కాల్పులకు ముందు పిల్లలు కిడ్నాప్కు గురైన ‘పోవై’ స్టూడియోలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిల్లల్ని బంధించిన కిడ్నాపర్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో కిడ్నాపర్ రోహిత్ ఆర్య మాట్లాడుతూ.. ‘నావి మామూలు డిమాండ్లే. నేను కొంతమందిని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. వాళ్ల నుంచి నాకు జవాబు కావాలి. నేను ముందుగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ప్లాన్ మార్చి పిల్లల్ని కిడ్నాప్ చేశా. ఈ వీడియో చూసిన తర్వాత పిల్లల్ని రక్షించాలని పోలీసులు ఏదైనా ప్రయోగం చేస్తే ఈ ప్రదేశాన్ని తగలబెడతా. డబ్బును ఆశించడం లేదు. అలాగని ఉగ్రవాదిని కూడా కాదు’ అంటూ బెదిరింపులకు దిగాడు.అప్రమత్తమైన పోలీసులు రోహిత్ చెర నుంచి పిల్లల్ని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. పిల్లల్ని కాపాడి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోహిత్ ఆర్య ఎవరు? పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఆయన మానసిక స్థితి ఎలా ఉంది? అన్న కోణం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.VIDEO | Mumbai: Police rescue over 20 children who were held hostage inside a flat in Powai area. The suspect, who identified himself as Rohit Arya has been arrested, as per the officials.(Source: Third Party) pic.twitter.com/EsQRqDuISi— Press Trust of India (@PTI_News) October 30, 2025
- 
      
                   
                                                       తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారుసాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12.15 నిమిషాలకు కొత్తమంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా రేపు రాజ్ భవన్లో కేబినెట్ మంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాజ్ భవన్ దర్బార్ హాల్ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్, తదితర అంశాలపై అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 11న ఉప ఎన్నికలు జరగనుండగా, ఈ నెల 31న మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజారుద్దీన్తో రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చే డిసెంబర్ ఏడో తేదీతో రెండేళ్లు పూర్తికానుండగా, ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించలేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో అజారుద్దీన్ను మంత్రిగా ప్రభుత్వం నియమించనుండటం ఆసక్తికరంగా మారింది.
- 
      
                   
                                                       250 మెగావాట్స్ పవర్ ప్లాంట్ సొంతం చేసుకున్న ఎంఈఐఎల్తమిళనాడులో నేవేలి వద్ద 250 మెగావాట్ల లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొనుగోలు చేసింది. అబుదాబి కేంద్రంగా ఉన్న సంస్థ నుంచి వందశాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎంఈఐఎల్ గురువారం ప్రకటించింది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఎంఈ ఐఎల్ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈఐఎల్ ఎనర్జీ) తమిళనాడులోని నేవేలిలో ఉన్న టిఏక్యూఏ నేవెలీ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (టిఏక్యూఏ నేవెలీ) సంస్థను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ పిజెఎస్సి (టిఏక్యూఏ) నుంచి 100 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది.ఈ స్వాధీన ప్రక్రియ ఎంఈఐఎల్ గ్రూప్ వ్యూహాత్మక పరిణామంగా చెప్పవచ్చు. ఒక పెద్ద ఈపీసి కాంట్రాక్టర్ నుంచి అంతర్గతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యాజమాన్యం, నిర్వహణలో నిమగ్నమైన సమగ్ర ఇన్ఫ్రా డెవలపర్గా మారే దిశలో కీలకమైన అడుగుగా ఎంఈఐఎల్ చేసిన ఈ కొనుగోలు నిలుస్తోంది.టిఏక్యూఏ నేవెలీ 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన లిగ్నైట్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని తమిళనాడులోని నేవెలీ ప్రాంతంలో నిర్వహిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రానికి ఆ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిరంతర, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించడంలో ఈ యూనిట్ స్థిరమైన పనితీరు రికార్డును ఇప్పటికే నెలకొల్పింది.ప్రస్తుతం ఇంధన రంగంలో 5.2 గిగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యాన్ని ఎంఈఐఎల్ కలిగి ఉంది. తమిళనాడు ప్లాంట్ కొనుగోలు ద్వారా ఈ రంగంలో తన స్థానాన్ని సంస్థ మరింత బలపరుచుకుంటోంది. అలాగే, దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు స్థిరమైన, భారీ స్థాయిలో పనిచేసే ఉత్పత్తి ఆస్తుల పోర్ట్ఫోలియోను నిర్మించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.టిఏక్యూఏ నేవెలీని తన ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి ఆపరేషన్లలో సులభంగా సమన్వయం చేయడాన్ని ఎంఈఐఎల్ ఎనర్జీ ప్రాధాన్యంగా తీసుకుంటోంది. దీని ద్వారా ఆపరేషనల్ ఎక్సలెన్స్, సమర్థవంతమైన ఆస్తి నిర్వహణ తదితరాలకు సంస్థ కట్టుబడింది.ఈ సందర్భంగా ఎంఈఐఎల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సలిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ''ఉన్నత నాణ్యత గల విద్యుత్ ఉత్పత్తి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఈపీసీ రంగంలో మా అత్యుత్తమ నైపుణ్యాన్ని మౌలిక సదుపాయాల యాజమాన్యంతో కలిపి వ్యూహాత్మక మార్పు సాధించడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుంది. మా ప్రధాన దృష్టి, దేశీయ ఇంధన భద్రతను పెంపొందించే, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించే, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధికి మద్దతు ఇచ్చే వ్యూహాత్మక పెట్టుబడులపై కొనసాగుతుంది. థర్మల్, హైడ్రో, పునరుత్పాదక శక్తి రంగాలను సమన్వయం చేసే సమతులిత, స్థిరమైన విద్యుత్ ఉత్పత్తి పోర్ట్ఫోలియో నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాము'' అని అన్నారు. టిఏక్యూఏ నేవెలీ స్వాధీనం మా ఆర్గానిక్, ఇనార్గానిక్ వృద్ధి వ్యూహాలకు అనుగుణంగా ఉంది. భారత విద్యుత్ రంగంపై మాకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోంది అని అన్నారు.ఎంఈఐఎల్ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి, చమురు, సహజ వాయువు, పునరుత్పాదక శక్తి, మౌళిక సదుపాయాలు, తయారీ, నీటి నిర్వహణ తదితర రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. భవిష్యత్తులో భారత ఇంధన స్వావలంబన, ఆర్థిక స్థిరత్వంకు తోడ్పడే అవకాశాలను పరిశీలించి ముందుకు సాగుతోంది.
- 
      
                   
                                                       టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ ఫెయిల్! అయినా భారీ స్కోర్బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎ, భారత్-ఎ మధ్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటలో భారత్పై సౌతాఫ్రికా బ్యాటర్లు పై చేయి సాధించారు. ప్రోటీస్ ఎ జట్టు డే వన్ ఆట ముగిసే సమయానికి 85.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. క్రీజులో షెపో మోరెకి(4), కుహ్లే సెలె(0) ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జోర్డాన్ హెర్మాన్(71), హంజా(66), రుబిన్ హెర్మాన్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ మార్క్స్ అకెర్మాన్(18) పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ముంబై స్పిన్నర్ తనీష్ కొటియన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మానవ్ సుత్తర్ రెండు, అన్షుల్ కాంబోజ్, ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.పంత్ రీ ఎంట్రీ..ఇండియా-ఎ జట్టుకు సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. గాయం కారణంగా వెస్టిండీస్తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పంత్.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ కాలి మడమకు గాయమైంది.దీంతో అతడు దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో భారత్-ఎ తరపున ఆడాలని రిషబ్ నిర్ణయించుకున్నాడు. రెండో అనాధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.చదవండి: IND vs SA: లంచ్కు ముందే టీ బ్రేక్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
- 
      
                   
                                                       IND vs SA: కోహ్లిని అవమానించిన రిషభ్ పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్టెస్టు క్రికెట్లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. సంప్రదాయ ఫార్మాట్లో కెప్టెన్గా భారత్ను అగ్రస్థానంలో నిలిపిన కోహ్లి.. మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో జట్టును ఫైనల్కు చేర్చాడు.ఇక టీమిండియా తరఫున మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి.. 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు కూడా ఉన్నాయి. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు ముందు తనకు ఇష్టమైన టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లి.భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గాఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ సందర్భంగా పంత్ భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం బెంగళూరు వేదికగా తొలి టెస్టు మొదలైంది.కోహ్లిని అవమానించిన పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్ఈ మ్యాచ్లో పంత్ ‘18’ నంబర్ ఉన్న జెర్సీ ధరించడం కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కాగా 18 నంబర్ విరాట్ కోహ్లిది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘‘రిషభ్ పంత్ కావాలనే 18వ నంబర్ జెర్సీ ధరించి కోహ్లిని అవహేళన చేయాలని చూస్తున్నాడా?.. కోహ్లి అంటే పడని.. హెడ్కోచ్ గౌతం గంభీర్ దృష్టిలో పడి.. అతడిని ఆకట్టుకోవాలనే ఇలా చేస్తున్నాడా?అది కింగ్ కోహ్లి నంబర్. క్రీడా ప్రపంచంలో దిగ్గజ ఆటగాడు రిటైర్ అయిన తర్వాత అతడి గౌరవార్థం జెర్సీ నంబర్కు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి’’ అంటూ తీవ్ర స్థాయిలో కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా ఇటీవల భారత్- ‘ఎ’ తరఫున ఇంగ్లండ్ లయన్స్తో మ్యాచ్లో పేసర్ ముకేశ్ కుమార్ కూడా 18 నంబర్ ఉన్న జెర్సీ ధరించగా ఇలాగే విమర్శలు వచ్చాయి.అసలు విషయం ఇదీ!ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘భారత్- ‘ఎ’ జట్టులో జెర్సీ నంబర్లు ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించబడవు. వాటిపై పేర్లు కూడా ఉండవు. కాబట్టి మ్యాచ్కు ముందు తమకు వచ్చిన జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే పర్టికులర్గా జెర్సీ నంబర్లకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని తెలిపాయి.కాగా సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో టాస్ గెలిచిన భారత్-‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 79 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్!?
- 
      
                   
                                                       రష్మిక ది గర్ల్ఫ్రెండ్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతుంది.ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. కురిసే వాన తడిపేయాలన్ని భూమే ఏదో.. అంటూ సాగే మూడో లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్కు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోగా.. ఈ రొమాంటిక్ లిరికల్ సాంగ్ సినీ ప్రియులను అలరిస్తోంది. కాగా.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది.
- 
      
                   
                                                       దారుణం.. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన వైద్యులుసాక్షి, మహబూబాబాద్: వైద్యం కోసం వచ్చిన రోగిని ఆధార్ కార్డు లేదనే నెపంతో ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఆసుపత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఆసుపత్రి ఆవరణలో రోగి.. వైద్యం కోసం రెండు రోజుల పాటు పడిగాపులు కాస్తూ నిరీక్షించి నీరసించడంతో సిబ్బంది మృతి చెందాడనే అనుమానంతో మార్చురీలో భద్రపరిచిన అమానవీయ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వి.రవి మూత్ర పిండాల వ్యాధితో ఇబ్బంది పడుతూ మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు. రోగికి తోడుగా ఎవ్వరు ఉండక పోవడంతో పాటు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో రోగి 2 రోజుల పాటు ఆస్పత్రి ఆవరణలో పడిగాపులు పడి.. నీరసించి ఆ చేతనంగా మారిపోయాడు. రోగి మృతి చెందాడనే అనుమానంతో వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని మార్చూరికి తరలించి భద్ర పరిచారు.మరుసటి రోజు మార్చురిని శుభ్ర పరచడానికి వచ్చిన స్వీపర్లు.... రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగిని వైద్యం చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఇంత దారుణం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు.. మానవత్వం మంటగలిపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
