breaking news
-
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. మరో టీజర్ వచ్చేసింది
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, శ్రీ గౌరీప్రియ జంటగా నటిస్తున్న అమెరికా బ్యాక్డ్రాప్ లవ్స్టోరీ చిత్రం 'VISA-వింటారా సరదాగా'. ఈ చిత్రానికి ఉద్భవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ నుంచి మరో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ కథ మొత్తం అమెరికాలోనే తెరకెక్కించారు. ముఖ్యంగా సత్య, రోహిణి కామెడీ టీజర్లో అలరిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. -
TG: ప్రజలకు గవర్నర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ధైర్యసాహసాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, సమగ్రతను పరిరక్షించేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి కృషిభారత్ను మరింత బలమైన, స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని శ్రీ శివప్రతాప్ శుక్లా కోరారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందేలా శాంతి, సౌభ్రాతృత్వం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.ఐక్యతతోనే అభివృద్ధిఐక్యత, సమగ్రత, అభివృద్ధి స్ఫూర్తితో ఉజ్వల భారతావని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. దేశ ప్రగతిలో యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ గర్వంగా రెపరెపలాడాలని, దాని మూడు రంగులు దేశ ప్రజల్లో ధైర్యం, శాంతి, విశ్వాసానికి ప్రతీకలుగా నిలవాలని గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు -
అభిషేక్ పోరెల్కు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన కోర్టు
అత్యాచారం, బెదిరింపులు కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్, బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్కు కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. 23 ఏళ్ల పోరెల్కు పశ్చిమ బెంగాల్లోని చిన్సురా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో శుక్రవారం అతడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కర్ణాటకకు చెందిన ఒక వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోరెల్పై జూన్ 23న కేసులు నమోదు చేశారు. గత మూడేన్నరేళ్లుగా తమ మధ్య పరిచయం ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు పేర్కొంది. గత ఏడాదిన్నరగా మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని పోరెల్ బెదిరింపులకు దిగాడని ఆరోపించింది. అయితే జూన్లో ఫిర్యాదు అనంతరం పోరెల్ను విచారించడానికి పోలీసులు పలుమార్లు ప్రయత్నించినా అతడు అందుబాటులోకి రాలేదు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అతడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. -
కేవలం ఒక్క రూపాయి.. 24 రోజుల వ్యాలిడిటీ!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫ్రీడమ్ 2.0 పథకం కింద 2026 స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లో భాగంగా.. వినియోగదారులు కేవలం రూ.1కే కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు.ఈ ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త వినియోగదారులు రోజూ 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్ను కూడా పొందుతారు. వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే. కొత్త సిమ్ కనెక్షన్ కోసం అధిక మొత్తం చెల్లించకుండా బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రయత్నించాలనుకునే వినియోగదారులకు ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది.This Independence Day, why not start something better?Your first step towards a better connection is here.#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #IndependenceOffer #FRC1 @CMDBSNL @robertravi21 pic.twitter.com/HObE4inHxD— BSNL India (@BSNLCorporate) August 12, 2026రూ.2,399 ప్లాన్!బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కూడా కేవలం సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.నిజానికి చాలా కంపెనీలు యాన్యువల్ ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం మరో 47 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తుంది. అంటే ఏడాది పూర్తయినా ఇంకా కొన్ని రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
సుహాస్ మండాడి.. క్రేజీ లవ్ సాంగ్ రిలీజ్
సుహాస్, సూరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మండాడి. ఈ రా అండ్ రస్టిక్ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. తెలుసా నీకే పిల్లా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. కృష్ణ తేజస్వీ, రేష్మా శ్యామ్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
‘పాంచాలి పంచభర్తృక’ మూవీ రివ్యూ
టైటిల్: పాంచాలి పంచభర్తృకనటీనటులు: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ పృధ్వీ, సరీహ్ ఫార్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులుదర్శకుడు: గంగా సప్తశిఖరసంగీతం: మహేష్ నారాయణ, బ్షేక్నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి (అమెరికా), రాజ్ పవన్ఎడిటర్: జానీ బాషా నాగ‘పాంచాలి పంచభర్తృక’ టైటిల్ చాలా క్రేజీగా ఉండటం.. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్ వంటి భారీ తారాగణం నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ల హవా నడుస్తోంది. దీనికి కామెడీని కూడా జోడించడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. మరి నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.కథేంటంటే..డాక్టర్ దమయంతిని డాన్సన్ మనుషులు ఎత్తుకెళతారు. ఆమెను చంపేస్తామని బెదిరించి తమ బిజినెస్లో సహకరించేలా ఒప్పిస్తారు. మరోవైపు సీరియల్స్ తీసుకునే చిత్తరంజన్ (జెమిని సురేష్)కు సినిమా తీయాలని కోరిక. దాని కోసం యత్నిస్తూ ఉంటాడు. అద్దె ఇంటి కోసం కాట్రాజ్, పుష్పరాజ్ ఇద్దరూ వెదుకుతూ ఉంటారు. వారికి చిత్తరంజన్ తమ అపార్ట్మెంటులోని పెంట్ హౌస్లో తమతో పాటు ఉండాలని చెబుతాడు. అలా అద్దె షేర్ చేసుకుంటూ ఉంటారు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ బాబ్జీ ముగ్గురు ఉండటానికి అంగీకరించకపోతే అతడిని పొగిడి బుట్టలో వేసుకుంటారు. అలా నలుగురూ ఏకమవుతారు. ఒకరోజు ఒక అమ్మాయిని తెచ్చుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అలా సెనోరిటాని ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఆమె తన బాయ్ఫ్రెండ్ గురించి వాళ్లకు చెబుతుంది. ఆ తరువాత నలుగురూ ఓ పని మీద బయటకు వెళతారు. వెళ్లి వచ్చేసరికి సెనోరిటా రక్తపు మడుగులో పడి ఉంటుంది. ఆ శవాన్ని మాయం చేద్దామని సూట్కేసులో పెడితే చివరకు ఆ సూట్కేసు కూడా మాయమవుతుంది. అసలు శవంతో ఉన్న సూట్కేసు ఏమైంది? పరమసుందరి (రాజేంద్ర ప్రసాద్) ఎవరు? సినిమాలో రోజ్మేరి పాత్ర ఏమిటి? సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు అలియాస్ ఎకో ఏం చేశాడు? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.ఎలా ఉందంటే..సినిమాలో పాత్రల పరిచయానికి కమెడియన్ సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆసక్తికరం. పాత్రల పరిచయమే చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఇక పాత్రల పేర్లు సైతం మరింత ఆసక్తికరం. సినిమా విషయానికి వస్తే కథ, కథనం అన్నీ చాలా బాగున్నాయి. నలుగురు వ్యక్తులు కలిసి అమ్మాయిని తెచ్చుకోవడం.. ఆమెతో గడపాలని అనుకుంటుండగానే ఆమె మరణించడం.. ఆ తరువాత అసలు ఆమెను ఎవరు చంపేశారు? అనేది లాస్ట్ వరకూ గెస్ చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. స్క్రీన్ప్లే అంత గ్రిప్పింగ్గా ఉంటుంది. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, కామెడీ సన్నివేశాలు, మర్డర్తో నడిపిన దర్శకుడు.. సెకండాఫ్లో అసలు ఎవరు మర్డర్ చేశారు? అనేదే కాకుండా వరుసగా ఎక్కడా గందరగోళం లేకుండా చిక్కుముడులను విప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక చివరిలో రెండు ట్విస్ట్లు ఉంటాయి. అవి ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. ఒక సస్పెన్స్, థ్రిల్లర్ను కామెడీతో జత చేసి నడిపిన తీరు ఆకట్టుకుంది. సినిమాలో అనవసరమనే పాత్ర ఏదీ లేదు. ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, పృధ్వీరాజ్ వంటి ప్రముఖ నటులు తమ కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు.ఎవరెలా నటించారంటే..ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ పృధ్వీలు తమ పాత్రలకు న్యాయం చేశారు. జెమినీ సురేష్కు మంచి ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఆయన కూడా దానిని చక్కగా వినియోగించుకున్నారు. రోల్ రైడాకు ఇంతకాలానికి సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర దక్కింది. ముఖ్యంగా చాలా మంది కొత్తవారికి ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. సరీహ్ ఫార్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. ఈ సినిమాలో ప్రొడ్యూసర్ రాజ్ పవన్ సైతం ఓ కీలక పాత్రలో నటించారు. కొత్తగా నటిస్తున్నప్పటికీ ఎక్కడా తడబడకుండా బాగా నటించారు.టెక్నికల్ పరంగా..దర్శకుడు గంగా సప్తశిఖర ఈ కథను ఫుల్ ఎంటర్టైనింగ్గా తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి పాత్రకూ ప్రాధాన్యమిస్తూ.. ప్రతి పాత్రను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమాను ప్రెజెంట్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎంతో అనుభవమున్న దర్శకుడి మాదిరిగానే అనిపిస్తారు. పైగా ఆయన స్వయంగా ఈ చిత్రంలో ఓ పాత్రలో నటించి మెప్పించారు. సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలుగా నటించి నవ్వులు పూయించారు. మ్యూజిక్ విషయానికి వస్తే టైటిల్ సాంగ్ బాగుంది. మిగిలిన పాటలన్నీ ఓకే ఓకే. పవన్ నిర్మాతగానే కాకుండా ఎడిటింగ్, మ్యూజిక్ విషయంలోనూ దృష్టి సారించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
చంద్రబాబూ.. గుర్తుంచుకో.. ఇవన్నీ సంకేతాలే: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఎక్కడైతే అణిచివేత ఉంటుందో.. అక్కడ ప్రజల తిరుగుబాటు కూడా అదే స్థాయిలో ఉంటుందని చంద్రబాబు తెలుసుకోవాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ నెల రోజూలు నాతో పాటు నా కుటుంబానికి కష్టకాలం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్కు నమస్కారాలు’’..ప్రభుత్వంలోని వారు కూడబలుక్కుని ఒక సాధారణ ప్రమాదాన్ని.. హత్యాయత్నంగా చూపించి జైలుకి పంపారు.దీనిపై అన్ని వర్గాల ప్రజలు చిన్న పిల్లలపై రాజకీయాల అంటూ గొంతెత్తి మాట్లాడారు. ప్రభుత్వం అభద్రతా భావంతో చేసిన రాజకీయ కక్ష ఇది. రాజకీయాలలో తొక్కేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆతృతతో చేశారు.’’ అని సీదిరి మండిపడ్డారు.‘‘ఈ జిల్లాలోనే ఎమ్మెల్యేలు, వారి పిల్లలే పిల్లలే ఆక్సిడెంట్ చేశారు. దానిపై ఈ ప్రభుత్వం ఎలా మాట్లాడింది? మా మీద కక్ష తీర్చుకోవటం కోసం నా కొడుకుని బలితీసుకోవటం పట్ల అంతటా చర్చ జరుగుతుంది. నేను ఏం తప్పు చేశాను.. నన్ను జైలులో పెట్టేశారని మొదట్లో నాకు చిన్న నిరాశభావం ఉండేది. ఎప్పుడైతే మా నాయకుడు రాడానికి నిర్ణయం తీసుకున్నారో.. ఇది రాష్ట్ర వ్యాప్త చర్చ అవుతుందని తెలిశాక జైలులో ఉండటాన్ని సానుకూలంగా తీసుకున్నాను. ఈ నెల రోజులు కాలం నాకు, నా కుటుంబానికి దీక్ష సమయం లాంటిది...మా నాయకుడు వచ్చేటప్పుడు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే కిరణ్, తిలక్, జిల్లా పార్టీ అధ్యక్షులుపైన, ధర్మాన కుమారుడు పైన, చింతాడ రవి పైన కేసులు పెట్టారు. ఇవన్నీ చూస్తే ప్రజల్లో వచ్చిన నిరసన జ్వాలను ప్రభుత్వం తట్టుకోలేకోతుందేమోననుకుంటున్నాను. స్టేషన్ ఆఫీసర్లతో రాష్ట్ర ముఖ్యమ్మంత్రి రివ్యూ చేయటం దేశ చరిత్రలో ఇది మొదటిది. మరింత అణిచివేత ధోరణిలోకి వెళ్తామని మెసేజ్ ఇవ్వటమే ఇది. వైఎస్సార్సీపీకి, సాధారణ జనానికి మంచి రోజులు వచ్చినట్టే.. రానున్న కొద్ది రోజుల్లో వైఎస్ జగన్ సీఎం పీఠం అధిరోహిస్తాడనడానికి ఇవన్నీ సంకేతాలు. రాజకీయాలలో నేనొక ధన్యుడిని’’ అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. -
వికసిత్ భారత్ కోసం అందరూ కృషి చేయాలి: రాష్ట్రపతి
ఢిల్లీ భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న(శుక్రవారం) సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశ భద్రత, ఐక్యత, మరియు ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆమె తన సందేశంలో పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ‘ వికసిత్ భారత్ కోసం అందరూ కృషి చేయాలి. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికీ అందించాలి. వందేమాతరం గీతాన్ని మనం గౌరవించాలి. యువత తమ స్పప్నాలను సాకారం చేసుకోవాలి. న్యాయవ్యవస్థ, చట్ట సభలను గౌరవించాలి. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 కోట్ల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. కిసాన్ సమ్మాన్తో వ్యవసాయం, అనుబంధాల రంగాల బలోపేతం’ అని తన సందేశంలో పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. -
79 ఏళ్లలో మారిపోయిన భారతీయుల ఖర్చు తీరు!
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశం ముందు పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, తక్కువ పారిశ్రామిక సామర్థ్యం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. అప్పట్లో.. సాధారణ కుటుంబానికి స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు.. కనీస అవసరాలు తీరే మంచి జీవితం రావాలనే ఆశ కూడా.చారిత్రక అంచనాల ప్రకారం.. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. అందుకే తొలి దశాబ్దాల్లో దేశ ఆర్థిక ప్రయాణం ప్రధానంగా ప్రజలను కనీస జీవన ప్రమాణాల వైపు తీసుకెళ్లడంపైనే సాగింది. కానీ.. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. ఒకప్పుడు కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనడం పెద్ద లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఏ బ్రాండ్ కొనాలి, ఎలాంటి కారు తీసుకోవాలి, వెకేషన్కు ఎక్కడికి వెళ్లాలి అనే స్థాయికి భారతీయుల ఆలోచనలు మారాయి.ఈ మార్పు మన ఇళ్లలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు టీవీ కొనడం పెద్ద విషయం. ఆ తర్వాత ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, స్కూటర్, కారు వంటివి కుటుంబాల అవసరాల జాబితాలోకి చేరాయి. ఇప్పుడు మాత్రం సాధారణ కారు సరిపోతుందా? SUV కొనాలా? ఎలక్ట్రిక్ కారు తీసుకోవాలా? అనే స్థాయికి వినియోగదారుల ఆలోచన చేరింది.ఏం కొనాలి నుంచి..పొదుపు విషయంలోనూ మార్పు వచ్చింది. గతంలో బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తులే ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, సిప్, ఇన్సూరెన్స్ వంటి పెట్టుబడులు కూడా సాధారణ కుటుంబాలకు పరిచయం అయ్యాయి. అంటే.. భారతీయుల కథ ''ఏం కొనాలి?'' అనే స్థాయి నుంచి ''ఏది నాకు ఎక్కువ విలువ ఇస్తుంది?'' అనే స్థాయికి మారుతోంది.కుటుంబాల ఖర్చుల్లో కూడా ఈ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా.. గ్రామీణ, పట్టణ వినియోగ వ్యత్యాసం కూడా క్రమంగా తగ్గుతోంది. గతంలో పట్టణ కుటుంబాలు గ్రామీణ కుటుంబాల కంటే చాలా ఎక్కువ ఖర్చు చేసేవి. ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఆదాయం, డిజిటల్ సేవలు, క్రెడిట్ సౌకర్యాలు, ఆన్లైన్ షాపింగ్ పెరగడంతో వినియోగ అవకాశాలు విస్తరిస్తున్నాయి. గతంలో ''కూడు, గూడు, గుడ్డ'' ప్రధాన అవసరాలైతే.. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి, ఏ బ్రాండ్ దుస్తులు ధరించాలి, ఏ ప్రాంతంలో నివసించాలి అనే ఎంపికలు కూడా వినియోగంలో భాగమవుతున్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయంలో..కారు, మొబైల్, ప్రయాణం వంటి రంగాల్లో ఈ ప్రీమియమైజేషన్ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చిన్న హ్యాచ్బ్యాక్ కారు కొనడం పెద్ద కల. ఇప్పుడు SUVలపై భారతీయుల ఆసక్తి భారీగా పెరిగింది. కొత్త కారు కొనలేని వారు కూడా మంచి ఫీచర్లు ఉన్న ప్రీమియం సెకండ్హ్యాండ్ కార్ల వైపు చూస్తున్నారు.ఇదే విధంగా రూ.30 వేలకుపైగా ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా కూడా గణనీయంగా పెరిగింది. వినియోగదారులు ప్రతి వస్తువుపై ఎక్కువ ఖర్చు చేయడం లేదు. తమకు ముఖ్యమైన వస్తువుల విషయంలో మాత్రం ఎక్కువ డబ్బు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇక ప్రయాణాల విషయంలోనూ మార్పు వచ్చింది. విదేశీ పర్యటనలు ఒకప్పుడు కొద్దిమంది సంపన్నులకు మాత్రమే సాధ్యమైన విషయం. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కూడా విదేశీ ట్రిప్ ఒక సాధారణ ఆశగా మారుతోంది. 2025లో భారతీయులు రికార్డు స్థాయిలో 3.28 కోట్లకు పైగా విదేశీ ప్రయాణాలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.పొదుపు నుంచి సంపద సృష్టిఇక మరో పెద్ద మార్పు పొదుపు నుంచి సంపద సృష్టి వైపు వచ్చింది. గతంలో భవిష్యత్ భద్రత కోసం డబ్బును బ్యాంకులో దాచుకోవడం, బంగారం కొనడం లేదా స్థలం తీసుకోవడం సాధారణం. ఇప్పుడు యువతతో పాటు మధ్యతరగతి కుటుంబాలు కూడా సిప్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. వార్షిక గృహ ఆర్థిక పొదుపుల్లో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వాటా FY12లో కేవలం 2 శాతం ఉండగా, FY25 నాటికి 15 శాతానికి పైగా పెరిగింది. సిప్ పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. అంటే భారతీయుల ఆర్థిక ఆశయం కూడా మారుతోంది. 'డబ్బు దాచుకోవాలి అనే ఆలోచన నుంచి 'డబ్బుతో మరింత సంపద సృష్టించాలి' అనే ఆలోచనకు ప్రజలు వస్తున్నారు. -
వెంకీమామకు 40 ఏళ్లు.. ఈ సారి దేశ రక్షకుడిగా..!
వెంకీ మామ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు పూర్తయింది. కలియుగ పాండవులు మూవీతో వెండితెరపై అడుగుపెట్టిన వెంకటేశ్.. స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. యాక్షన్, లవ్తో పాటు కామెడీ జోనర్లో నటించారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన వెంకీమామ.. ఈ ఏడాది మెగాస్టార్ మూవీలో మెప్పించారు.ప్రస్తుతం అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టారు వెంకటేశ్. వీరద్దరి కాంబోలో వస్తోన్న మూవీ.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. నేటికి వెంకీ మామ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని వెంకటేశ్ రోల్ను పరిచయం చేశారు. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా కనిపించనున్నారు. ఈ పోస్టర్ వెంకీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 40 Glorious Years of our Victory @VenkyMama garu in TFI 😍😍😍It’s an absolute honour to celebrate this incredible milestone with a very special look from our film 🤗Meet our Lt colonel VENKAT REDDY🔥#VenkyAnil5 #NKRAR2 #40YearsOfVictoryVenkatesh pic.twitter.com/WcvkXFEuox— Anil Ravipudi (@AnilRavipudi) August 14, 2026 -
భారత ఆల్రౌండర్కు ఊహించని అవకాశం
రాజస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహిపాల్ లామ్రోర్కు ఊహించని అవకాశం వచ్చింది. కౌంటీ చాంపియన్షిప్లో ఆడేందుకు సర్రే జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఈ ఆర్సీబీ మాజీ ఆల్రౌండర్ ఆదివారం ఇంగ్లండ్కు చేరుకోనున్నాడు.ఈ నేపథ్యంలో మహిపాల్ లామ్రోర్ సంతోషం వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్టార్తో మాట్లాడుతూ.. ‘ఏ క్రికెటర్కైనా కౌంటీ చాంపియన్షిప్లో ఆడటం అనేది గొప్ప అవకాశం. సీనియర్ ఆటగాళ్లతో కలిసి సర్రేకు ఆడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా’’ అని 26 ఏళ్ల లామ్రోర్ పేర్కొన్నాడు.కాగా సర్రే జట్టు.. మిడిలార్డర్లో ఆడగల, లెఫ్టార్మ్ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల బ్యాటర్ కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే సర్రే మెన్స్ క్రికెట్ డైరెక్టర్ అలెక్ స్టెవర్ట్ మహిపాల్ లామ్రోర్ పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.కాగా మహిపాల్ లామ్రోర్ 63 ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడి.. 3836 పరుగులు సాధించాడు. ఇందులో పది శతకాలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దేశీ సీజన్ 2024-25లో లామ్రోర్ ఉత్తరాఖండ్పై ట్రిపుల్ సెంచరీ కూడా బాదాడు.ఇదిలా ఉంటే.. డివిజన్ వన్ పాయింట్ల పట్టికలో సర్రే ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్లు పూర్తి కాగా.. ఇంకా ఆరు మిగిలి ఉన్నాయి. ఆగష్టు 20న ది ఓవల్ వేదికగా నాటింగ్హామ్షైర్తో మ్యాచ్తో తాజా సైకిల్ను సర్రే మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఊహించని రీతిలో లామ్రోర్కు అవకాశం రావడం విశేషం. కాగా టీమిండియా క్రికెటర్ రాహుల్ చహర్ ఇప్పటికే సర్రే జట్టుకు ఆడుతున్నాడు. -
వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ఇదే..? జడేజాకు నో ఛాన్స్?
వన్డే ప్రపంచకప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి ఇప్పటి నుంచే క్రికెట్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా కోల్కతా నైట్రైడర్స్ మాజీ బ్యాటర్ మన్విందర్ బిస్లా చేరాడు.ఈ ప్రపంచకప్ కోసం అత్యుత్తమ భారత ప్లేయింగ్ ఎలెవన్ను బిస్లా ఎంపిక చేశాడు. ఈ జట్టులో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, యువ పేసర్ అర్ష్దీప్ సింగ్లకు చోటు దక్కలేదు. బిస్లా ఓపెనింగ్ జోడీగా కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మలను ఎంచుకున్నాడు. అదేవిధంగా ఆ తర్వాత స్ధానాల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లకు అతడు అవకాశమిచ్చాడు. ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్కు చోటు దక్కింది. ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్కు చాన్స్ ఇచ్చాడు. ఇక పేస్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, సిరాజ్లను బిస్లా ఎంపిక చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు ఛాన్స్ లభించింది. కాగా జడేజా ప్రస్తుతం భారత వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు. 37 ఏళ్ల జడేజా చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో వన్డేల్లో ఆడాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్తో వన్డే సిరీస్లకు అతడిని ఎంపిక చేయలేదు.వన్డే ప్రపంచ కప్ కోసం మన్విందర్ బిస్లా ఎంపిక చేసిన భారత తుది జట్టు ఇదే: శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మరియు కుల్దీప్ యాదవ్. -
ఐటీసీ ఎస్ఆర్ఏ 'వందేమాతరం' 150 వసంతాల వేడుకలు
న్యూఢిల్లీ: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మన జాతీయ గీతం 'వందేమాతరం' 150 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ, ఐటీసీ లిమిటెడ్ ఘనంగా నివాళులర్పించింది. ఐటీసీ సంగీత్ రీసెర్చ్ అకాడమీ (ఐటీసీ ఎస్ఆర్ఏ) రూపొందించిన ‘దేశ్ ఏక్ రాగ్ 3’ అనే మ్యూజిక్ వీడియో ద్వారా ఈ సంగీత నివాళిని సమర్పించింది. ‘దేశ్’ రాగంలో స్వరపరిచిన ఈ గీతానికి ఐటీసీ ఎస్ఆర్ఏ గురువులు, విద్వాంసులు, సంగీత శిక్షకులు మరియు ఇతర సంగీతకారులు ప్రాణం పోశారు. దేశంలో జాతీయ మేల్కొలుపు, గర్వం మరియు ఐక్యతకు శాశ్వత చిహ్నంగా నిలిచిన ఈ గీతానికి ఐటీసీ అర్పించిన ఘన నివాళికి ఈ వీడియో ప్రతిరూపంగా నిలుస్తుంది.స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఐటీసీ చైర్మన్, ఐటీసీ ఎస్ఆర్ఏ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ సంజీవ్ పూరి ఈ వీడియోను లింక్డ్ఇన్లో పంచుకున్నారు. మాతృభూమి పట్ల భక్తి, ఐక్యత మరియు ప్రేమను చాటే వందేమాతరం సందేశం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గురువులు, సంగీత శిక్షకులు మరియు శిష్యులు ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘దేశ్ ఏక్ రాగ్ 3’.. మన గొప్ప దేశానికి, దాని అద్భుతమైన సాంస్కృతిక వారసత్వానికి ఐటీసీ అందిస్తున్న హృదయపూర్వక నివాళి అని ఆయన కొనియాడారు. ఐటీసీ ఎస్ఆర్ఏ దాదాపు ఐదు దశాబ్దాలుగా కాపాడుతున్న మన దేశ గాత్ర మరియు వాయిద్య సంప్రదాయాలకు ఈ వీడియో అద్దం పడుతోందని తెలిపారు. కాగా, ఈ సిరీస్లోని మూడవ ఎడిషన్ 2027లో రానున్న ఐటీసీ ఎస్ఆర్ఏ స్వర్ణోత్సవ ప్రయాణాన్ని కూడా సూచిస్తుంది.అకాడమీకి చెందిన విశిష్టమైన 'గురు-శిష్య పరంపర' ఈ ప్రదర్శనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత స్ఫూర్తితో వందేమాతరాన్ని సమర్పించేందుకు గురువులు, విద్వాంసులు ఏకమయ్యారు. పండిట్ అజయ్ చక్రబర్తి, పండిట్ ఉల్హాస్ కశాల్కర్, పండిట్ పార్థ ఛటర్జీ, విదుషీ సుభ్రా గుహ, పండిట్ ఉదయ్ భవాల్కర్, శ్రీ ఓంకార్ దాదర్కర్, శ్రీ అబీర్ హుస్సేన్ మరియు శ్రీ బ్రజేశ్వర్ ముఖర్జీ వంటి ప్రముఖ గురువులు ఇందులో పాల్గొన్నారు. అకాడమీ మొదటి విద్యార్థి మరియు ప్రస్తుత గురువు అయిన పండిట్ అజయ్ చక్రబర్తి నుండి 11 ఏళ్ల విద్యార్థి వైభవ్ ముఖోపాధ్యాయ వరకు, వివిధ తరాలకు చెందిన దాదాపు 70 మంది కళాకారులు తమ గాత్రాన్ని, నైపుణ్యాన్ని అందించారు.ఐటీసీ ఎస్ఆర్ఏ గురువు శ్రీ అబీర్ హుస్సేన్ ఈ ప్రత్యేక కూర్పును రూపొందించగా, కోల్కతాకు చెందిన స్వతంత్ర ఫిల్మ్మేకర్ పృథా చక్రబర్తి ఈ వీడియోకు దర్శకత్వం వహించారు. ఈ వీడియోను యూట్యూబ్ లింక్ : https://youtu.be/lPqU_ROp4OQ ద్వారా వీక్షించవచ్చు.'దేశ్ ఏక్ రాగ్' ప్రయాణం రెండేళ్ల క్రితం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభమైంది. గురు-శిష్య పరంపరను కేంద్రంగా చేసుకుని, శాస్త్రీయ నృత్యాలను కూడా కలుపుతూ 2025లో ‘దేశ్ ఏక్ రాగ్ 2’ విడుదలైంది. ఈ రెండు ఎడిషన్లు వివిధ ప్లాట్ఫారమ్లలో మిలియన్ల కొద్దీ వ్యూస్, ప్రశంసలు అందుకున్నాయి. -
‘సినిమా అంటే వంద కుటుంబాల సమూహం’
కన్నడ నటుడు భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఈ చిత్రంలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, కన్నడ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మేరకు పూజా కార్యక్రమాల్ని శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బండి నాగరాజు నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఎమోషనల్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనుంది. జైభార్గవ్, మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్, కాదంబరి కిరణ్, కిల్లి క్రాంతి, అనంత ప్రభు, టేస్టీ తేజ, సాయి కిషోర్, నితిన్, తదితరులు నటించనున్నారు.హీరో, డైరెక్టర్ భార్గవ్ మాట్లాడుతూ ‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాటలో ఎంత వైబ్ ఉందో ఈ సినిమాలోనూ అలాంటి ఫీల్ ఉంటుంది. ఈ చిత్రంతో తెలుగులో సినీ ప్రయాణం మొదలు పెట్టడం సంతోషంగా ఉంది. సినిమా అంటే వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. నాగరాజు సినిమా పట్ల ప్యాషన్ ఉన్న నిర్మాత. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. రోహిత్ సూపర్ హిట్ సాంగ్స్ అందించారు’ అని అన్నారు. -
'కొంచెమైనా సిగ్గుండాలి.. కూతురి వయసున్న అమ్మాయితో'
బాలీవుడ్ నటుడు గోవిందా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్లు గోవిందాను వెనకేసుకొచ్చిన సునీత.. ఈ సారి మాత్రం గట్టిగానే కడిగేస్తోంది. ఇటీవల గోవిందా నటి కోమల్ రాణి స్వర్ణకర్తో కనిపించడంతో సునీత ఫైరవుతోంది. తన కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడు.. గోవిందాకు కొంచెమైనా సిగ్గుండాలని ప్రశ్నించింది.ఇటీవల ముంబయి విమానాశ్రయంలో గోవిందాతో పాటు నటి కోమల్ రాణి స్వర్ణకర్ జంటగా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇది చూసిన కొందరు గోవిందా భార్య సునీత అహుజాను ప్రశ్నించారు. దీంతో ఆమె తనదైన శైలిలో స్పందించింది. అసలు వీళ్లిద్దరు సినిమా తీయకుండానే ప్రమోషన్స్ చేస్తున్నారా? అంటూ మండిపడింది. అతను తన కూతురి వయస్సులో ఉన్న అమ్మాయితో తిరుగుతున్నాడు... కనీసం కొంచెమైన సిగ్గుండాలి కదా సునీత నిలదీసింది.కోమల్ రాణి స్వర్ణకర్ ఎవరు?కోమల్ రాణి స్వర్ణకర్ బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమైంది. గోవింద ఇటీవలే 'రూపా', 'దునియాదారి' చిత్రాలను ప్రకటించారు. వీటిలో 'రూపా' చిత్రంలో రాణి స్వర్ణకర్ను కథానాయికగా పరిచయం చేశారు. ఈ ప్రాజెక్టులను గోవిందానే నిర్మిస్తున్నారు. దీంతో గోవింద రాబోయే రెండు ప్రాజెక్టులలోనూ ఆమె భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
భారతదేశపు విభిన్న శబ్దాలతో జాతీయ గీతానికి సరికొత్త రూపం
హైదరాబాద్:: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రత్యేక నివాళిగా, హైదరాబాద్లోని అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్ అయిన 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్', జన గణ మన గీతానికి ఒక అందమైన రాగాన్ని సృష్టించడానికి దేశవ్యాప్తంగా 50 శబ్దాలను ఒకచోట చేర్చి ఒక వినూత్న సంగీత ప్రచారాన్ని సృష్టించింది.చెన్నైకి చెందిన ‘బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్’ సంస్థ రూపొందించి, సృష్టించిన ఈ కొత్త ప్రచారంలో, దేశవ్యాప్తంగా సేకరించిన 50కి పైగా విభిన్న శబ్దాలను ఉపయోగించారు. రాకెట్ ప్రయోగం, వెళ్తున్న రైలు, పక్షులు, పాఠశాల గంటలు, దేవాలయ గంటలు, వీధులు, ప్రజలు, సంగీత వాయిద్యాలు, ప్రకృతి కదలికల వంటి శబ్దాలన్నింటినీ కలిపి జాతీయ గీతం బాణీలో ఒకే పాటగా మలిచారు."భారతదేశం మా ఇల్లు. మా అందమైన ఇంటికి ఇది ఒక సంగీత నివాళి. ఒక డెవలపర్గా, మేము ఎల్లప్పుడూ ఆవిష్కరణల ద్వారా ఆనందాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాము. ఆలోచనల పరంగా సరళంగా ఉంటూనే, భావోద్వేగ పరంగా ఒక శక్తివంతమైన పనిని మేము చేయాలని కోరుకున్నాము." అని 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్' సీఈఓ సిద్ధార్థ్ రెడ్డి ఇందుకూరి అన్నారు."మేము 100కు పైగా శబ్దాలను రికార్డ్ చేసి, వాటితో వారాల తరబడి ప్రయోగాలు చేశాము. సంగీతపరంగా అర్థవంతంగా కలిసివచ్చే వాటిని ఎంచుకున్నాము. ఈ సౌండ్ మరియు ఫిల్మ్ 35 కంటే ఎక్కువ మార్పులకు గురయ్యాయి. అన్నింటినీ ఒకచోట చేర్చడానికి మాకు దాదాపు 100 రోజులు, పలువురు భాగస్వాములు అవసరమయ్యారు. ఇది చాలా శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ అద్భుతమైన ఫలితం వచ్చింది " అని 'బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్' వ్యవస్థాపకుడు అభిషేక్ డి షా అన్నారు. ఈ ప్రచార చిత్రం ఆగష్టు 12, 2026 నుంచి 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్' యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం అవుతుంది. -
ప్రభుత్వ టీచర్లపై నారా లోకేష్ రెడ్బుక్ కక్ష
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ టీచర్ల పై నారా లోకేష్ రెడ్ బుక్ కక్ష సాధింపులకు దిగింది. ముగ్గురు టీచర్లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడినందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసినందుకు టీచర్లను బాబు సర్కార్ సస్పెండ్ చేసింది.లక్షలాదిమంది ఉపాధ్యాయుల సమస్యపై కేంద్రమంత్రికి విన్నవించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే, వారితో వెళ్లారని ముగ్గురు ఉపాధ్యాయులను చంద్రబాబు ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. సంగమేశ్వర రెడ్డి, అమరనాథ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కడప డీఈవో.. తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశారు. డీఎస్సీ అక్రమాల ర్యాలీలో పాల్గొన్నారంటూ తప్పుడు అభియోగాలతో సస్పెన్షన్ చేశారు. విద్యాశాఖలో టీచర్లపై రెడ్ బుక్ ప్రయోగించడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. -
రాహుల్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలా చిల్లర వ్యాఖ్యలంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి నుండి అటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని రాజ్నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడి పదవి గౌరవాన్ని రాహుల్ దెబ్బతీస్తున్నారని, ఈ వ్యాఖ్యలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య చర్యకు ముప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘నిన్న ప్రధాని నరేంద్ర మోదీపై, భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నీచమైనవి, ఖండించదగినవి. ఇది వ్యక్తిగతంగా నాకు కూడా బాధ కలిగిస్తోంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ప్రతిపక్ష నాయకుడి నుండీ ఇంతటి అసభ్యకరమైన, ఊహించలేని ప్రవర్తనను నేను ఎన్నడూ చూడలేదు. ఇటువంటి ప్రవర్తన ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లడానికి తీవ్రమైన సంకేతం’ అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.కాగా, ప్రధాని మోదీ విదేశాంగ విధానం అంతా విదేశీ నాయకులను కౌగిలించుకోవడమేనని రాహుల్ గాంధీ ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలో జరిగిన రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ ప్రసంగిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తన అసలైన స్వభావాన్ని ఎప్పుడో కోల్పోయిందని, ప్రస్తుతం అది అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారిందని ఆరోపించారు. -
ఐదేళ్లుగా వింత ప్రయోగం.. దొంగతనం కాలేదన్న సీఈఓ!
భారత్ అగ్రి వ్యవస్థాపకుడు, సీఈఓ 'సిద్ధార్థ్ డయలాని' బెంగళూరులో చేసిన ఓ చిన్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్యతో కలిసి గత ఐదేళ్లుగా ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారట. ఎక్కడికి వెళ్లినా బైక్ను పార్క్ చేసినప్పుడు హెల్మెట్కు ఎలాంటి లాక్ వేయకుండా సీటుపైనో, సైడ్ మిర్రర్పైనో పెట్టి వెళ్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఒక్క హెల్మెట్ కూడా దొంగతనం కాలేదని ఆయన చెప్పడంతో నెట్టింట చర్చ మొదలైంది.బెంగళూరులో ప్రజలు ఒకరినొకరు ఎంతవరకు నమ్మవచ్చో తెలుసుకోవడాని ఈ ప్రయోగం చేస్తున్నట్లు సిద్ధార్థ్ డయలాని పేర్కొన్నారు. దీనికోసం పెద్దగా పెట్టుబడి పెట్టకుండా.. హెల్మెట్ ప్రయోగం స్టార్ట్ చేశారు. ఐదేళ్లుగా హెల్మెట్లు సురక్షితంగా ఉండటంతో.. బెంగళూరు ఒక హై-ట్రస్ట్ సిటీ అని చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే.. ఈ ప్రయోగానికి వారు ఒక కండిషన్ కూడా పెట్టుకున్నారు. ఏ రోజు తమ హెల్మెట్ దొంగతనానికి గురవుతుందో.. తరువాత ఆ ప్రాంతానికి వెళ్లడం మానేస్తామని సిద్ధార్థ్ చెప్పారు. అంటే.. ఒక్క హెల్మెట్ పోవడం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రజలపై తమ నమ్మకం పోయినట్లే అన్నమాట. ఈ విషయం కొంతమంది నెటిజన్లను ఆకట్టుకుంది. చాలామంది తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.కొందరు సిద్ధార్థ్ డయలాని చేసిన పనిని మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. ''హెల్మెట్ రేటు తక్కువగా ఉండటం వల్ల ఎవరూ పట్టించుకోకపోయి ఉండొచ్చు.. ఖరీదైనది పెట్టి చూడండి, అప్పుడు అసలు విషయం తెలుస్తుంది'' అంటూ కామెంట్ చేశారు. మరికొందరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం బైక్, హెల్మెట్ రెండూ సురక్షితంగా ఉండకపోవచ్చని హెచ్చరించారు. దీంతో బెంగళూరు మొత్తం ఒకేలా ఉండదని, ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.Me and my wife have been running a social experiment in Bangalore. Whenever we park our two wheeler in any area, we don't lock our helmets. We just keep it on the side mirror or on the seat. It's a low cost experiment to know if Bangalore is a high trust city or not.It has…— Siddharth Dialani (@siddharth_iitm) August 13, 2026 -
‘హుషారు పిట్టలు’ మూవీ రివ్యూ
అన్షు, వాసవి గణేషన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించారు. బిక్షు దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ షో వేశారు మేకర్స్. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..తెలంగాణలో ఓ గ్రామానికి చెందిన రవి(అన్షు) టెన్త్ క్లాస్ టాపర్. చదవు తప్ప ఇంకేమి తెలియదు. అలాంటి వాడికి ఆ ఊర్లో ఉండే రవి బ్యాచ్ బలవంతంగా అశ్లీల వీడియోలు చూపించి.. అతనిని వాటికి అడిక్ట్ అయ్యేలా చేస్తాడు. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన పుట్ట చిట్టి(వాసవి గణేశన్)... స్కూల్ టాపర్ అయిన రవికి ఆకర్షితురాలవుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన ఆకర్షణ కాస్తా... ఇద్దరూ ఒక్కటయ్యేంత వరకూ వెళుతుంది. దాంతో రవి చదువు పక్కదారి పడుతుంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన టీనేజ్ ఆకర్షణ... చివరకు కడుపు తెచ్చుకునే దాకా వెళ్తుంది. దాంతో వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకుంటారు. అందుకు పెద్దలు అంగీకరించారా? వీరి టీనేజ్ లవ్ స్టోరీ చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు పుట్ట చిట్టి అంత చిన్న వయసులోనే శారీరక వాంఛలకు ఎందుకు ఆకర్షితురాలైంది? తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు వీరిద్దరి జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకొచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. నేటి 5జీ ప్రపంచంలో సెల్ఫోన్ పిల్లల చేతిలో ఓ సాధారణ వస్తువుగా మారిపోయింది. అరచేతిలోనే ప్రపంచాన్ని చూసే అవకాశం రావడంతో మంచి విషయాలతో పాటు, వయసుకు మించిన కంటెంట్ కూడా వారి ముందుకు సులభంగా వస్తోంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలపై నీలి చిత్రాలు, సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుంది? ఆ ప్రభావం వారి ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను ఎలా మార్చుతుంది? తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను వినోదంతో పాటు సందేశాత్మకంగా చూపించే ప్రయత్నమే ఈ ‘హుషారు పిట్టలు’.సినిమాలో రసూల్ యాదవ్ అనే చిన్నారి స్కూల్లో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి గల కారణాలను చూపించిన విధానం ఆలోచింపజేస్తుంది. పిల్లల ప్రవర్తన వెనుక తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితం, ఇంట్లో వారు మాట్లాడే విధానం, పిల్లలు చూసే కంటెంట్ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో దర్శకుడు బిక్షు చక్కగా ప్రస్తావించారు.అలాగే పసితనంలో ఓ టీనేజ్ అమ్మాయి తన బాయ్ఫ్రెండ్తో హద్దులు మీరి ప్రవర్తించడం, ఆ సంఘటనలను చూసిన చిన్నారి పెరిగి టీనేజ్లోకి వచ్చిన తర్వాత తాను కూడా అలాగే ప్రవర్తించాలని భావించడం వంటి అంశాలను ‘పుట్ట చిట్టి’ క్యారెక్టర్ ద్వారా చూపించారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? వారి ఎదుగుదలలో ఎలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి? అనే విషయాలను దర్శకుడు సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు.సినిమా ఫస్టాఫ్ మొత్తం రొమాంటిక్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. అయితే రొమాన్స్ని పదే పదే చూపించడంతో కథలు అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండాఫ్లో అసలు కథను తెరపైకి తీసుకువచ్చి ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో ఇలాంటి అంశాలతో కొన్ని సినిమాలు వచ్చినా.. తల్లిదండ్రులను ఆలోచింపజేసే స్థాయిలో ఈ సినిమాలో సందేశాన్ని అందించే ప్రయత్నం కనిపిస్తుంది.ముఖ్యంగా నేటి 5జీ నెట్వర్క్ ప్రపంచంలో పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియకుండా సెల్ఫోన్లో ఏం చేస్తున్నారు? ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు? సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారు? అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరాన్ని కూడా సినిమాలో చూపించారు. అయితే కొన్ని రొమాటిక్ సన్నివేశాలతో పాటు డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్కి ఇబ్బందికరం. యాత్ మాత్రం ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. రవి పాత్రలో అన్హు బాగా నటించాడు. కామెడీ, రొమాన్స్, సంభాషణలు అన్నింటిలోనూ తన ఈజ్ ను చూపించారు. అలాగే వాసవి గణేశన్ కూడా తన క్యూట్ నెస్ అండ్ గార్జియస్ లుక్స్ తో యూత్ ను మెస్మరైజ్ చేస్తుంది. హీరోయిన్ తండ్రిగా నటించిన గోవర్ధన్... అతని తండ్రిగా నటించిన వృద్ధుడు కూడా బాగా నటించారు. అలాగే హీరో తండ్రి పాత్రలో నటించిన రమేష్ నకిరే కంటి... అతని భార్య కూడా నిత్యం కలహాలతో ఉండే భార్య భర్తలుగా ఆకట్టుకుంటారు. వీరి చిన్న కుమారుడిగా నటించిన రసూల్ యాదవ్ పాత్ర కూడా కథలో భాగమైంది. కుర్రాడు తన పాత్రకు న్యాయం చేశాడు. మిగతా పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి.సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘వ్యాపార స్వాతంత్య్రం’ ఎలా వచ్చిందంటే..
ఒకప్పుడు భారత్లో వ్యాపారం అంటే అనుమతులు, పన్నులు, ప్రభుత్వ నియంత్రణల మధ్య సాగేది. స్వాతంత్య్రం తర్వాత దేశ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం పరిశ్రమలపై మరింత నియంత్రణ సాధించింది. 1991 ఆర్థిక సంస్కరణలతో పరిస్థితి పూర్తిగా మారింది. నేడు డిజిటల్ సింగిల్ విండో, డీరెగ్యులేషన్, లేబర్ కోడ్లతో వ్యాపారం ప్రారంభించే విధానం మరో దశలోకి వెళ్లింది.స్వాతంత్యానికి ముందు.. వ్యాపారం అంటే?1947కు ముందు ‘బిజినెస్ ప్రారంభించడానికి ఒకే చట్టం’ అంటూ ఏదీ లేదు. కంపెనీలు, కర్మాగారాలు, గనులు, ఉప్పు, మద్యం, బ్యాంకింగ్, దిగుమతులు-ఎగుమతులకు వేర్వేరు చట్టాలు, నిబంధనలు ఉండేవి. బ్రిటిష్ ఇండియా, సంస్థాన ప్రాంతాల్లోనూ విధానాలు భిన్నంగా ఉండేవి.కంపెనీల ఏర్పాటుకు 19వ శతాబ్దంలోనే చట్టపరమైన వ్యవస్థ మొదలై, చివరకు కంపెనీల చట్టం, 1913 అమల్లోకి వచ్చింది. కంపెనీల ఏర్పాటు, నిర్వహణ, మూసివేతకు ఇది ప్రాతిపదికగా నిలిచింది. అయితే నేటి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో దీన్ని పోల్చలేం. వలస పాలనలో ఆర్థిక విధానాలు ప్రధానంగా బ్రిటిష్ పాలన అవసరాలకు అనుగుణంగా ఉండేవి.ఉప్పుపై ప్రభుత్వ నియంత్రణ ఇందుకు ఉదాహరణ. 1882 ఉప్పు చట్టం ద్వారా ఉప్పు తయారీ, సేకరణ, నిర్వహణపై నియంత్రణ ఉండేది. ప్రజలు స్వయంగా ఉప్పు తయారు చేయడం, విక్రయించడం స్వేచ్ఛగా చేయలేకపోయారు. ఈ పరిస్థితి మహాత్మాగాంధీ నేతృత్వంలోని ఉప్పు సత్యాగ్రహానికి కీలక నేపథ్యంగా మారింది.కర్మాగారం పెట్టాలంటే కార్మిక చట్టాలుపరిశ్రమలపై నియంత్రణతో పాటు కార్మిక చట్టాలు కూడా వచ్చాయి. 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం అమల్లోకి వచ్చింది. పిల్లల పనివేళలు, కొన్ని భద్రతా అంశాలపై పరిమితులు విధించింది. 1891, 1911, 1922, 1934లో చట్టాలు మరింత విస్తరించాయి. పని గంటలు, కార్మిక సంక్షేమం, భద్రత వంటి అంశాలు కూడా నియంత్రణలోకి వచ్చాయి.1947 తర్వాత.. ప్రభుత్వ ఆధిపత్యంస్వాతంత్య్రం తర్వాత భారత్ స్వయం సమృద్ధి కలిగిన పారిశ్రామిక దేశంగా ఎదగడంపై దృష్టి పెట్టింది. 1948 పారిశ్రామిక విధానంతో పరిశ్రమల్లో ప్రభుత్వ పాత్రకు రూపం వచ్చింది. కొన్ని కీలక రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచి, మరికొన్నింటిలో ప్రైవేటు రంగానికి అవకాశం ఇచ్చారు. 1951లో వచ్చిన పరిశ్రమల (Development and Regulation) చట్టం ద్వారా కొన్ని పరిశ్రమల స్థాపన, విస్తరణపై కేంద్రానికి లైసెన్సింగ్ అధికారం లభించింది.1956 పారిశ్రామిక విధానంతో ప్రభుత్వ పాత్ర మరింత పెరిగింది. పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి కేటాయించినవి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి అనువైనవి, ప్రైవేటు రంగానికి చెందినవిగా విభజించారు. దీంతో పరిశ్రమ ప్రారంభించడం, ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, విస్తరించడం వంటి వాటికి ప్రభుత్వ అనుమతులు కీలకమయ్యాయి. ఇదే ‘లైసెన్స్ రాజ్’కు బలం చేకూర్చింది.1991.. అతిపెద్ద మలుపు1991 ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. జూలై 24, 1991న ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానంలో చాలా పరిశ్రమలకు లైసెన్సింగ్ను రద్దు చేశారు. వ్యూహాత్మక, భద్రత, పర్యావరణ, ప్రమాదకర ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని రంగాలను మాత్రం మినహాయించారు.సామర్థ్య నియంత్రణలు కూడా గణనీయంగా తొలగడంతో కంపెనీలకు ఉత్పత్తి, విస్తరణ నిర్ణయాల్లో స్వేచ్ఛ పెరిగింది. ప్రైవేటు రంగానికి మరిన్ని అవకాశాలు, విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుచుకున్నాయి. అంటే 1950–80లలో ‘ముందు ప్రభుత్వ అనుమతి.. తర్వాత పెట్టుబడి’ విధానం ఉంటే, 1991 తర్వాత మార్కెట్ ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగింది.కంపెనీల చట్టంలోనూ మార్పులు1913 కంపెనీల చట్టం స్థానంలో స్వాతంత్య్రం తర్వాత కంపెనీల చట్టం, 1956 వచ్చింది. ఆ తర్వాత పారదర్శకత, పెట్టుబడిదారుల రక్షణ, కార్పొరేట్ పాలనకు ప్రాధాన్యం పెరగడంతో కంపెనీల చట్టం, 2013 అమల్లోకి వచ్చింది.ఇప్పుడు.. డిజిటల్గా వ్యాపారం2026 నాటికి వ్యాపారం ప్రారంభించే విధానం మరింత డిజిటల్గా మారింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరమైన అనుమతులను గుర్తించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం NSWS 32 కేంద్ర విభాగాల మార్గదర్శకత్వాన్ని, 34 రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల కోసం అప్లికేషన్ సదుపాయాలను అందిస్తోంది. కొత్త ఇండస్ట్రియల్ లైసెన్స్, ఇండస్ట్రియల్ ఎంట్రాప్రెన్యూర్ మెమొరాండం (IEM) దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇందులోకి మారింది.2025లో మరో కీలక సంస్కరణ2025 నవంబర్ 21 నుంచి నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర కోడ్లుగా ఏకీకృతం చేశారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగుల భద్రత-ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనలను ఒకే విస్తృత చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడం వీటి లక్ష్యం.మొత్తంగా చూస్తే.. బ్రిటిష్ కాలంలో పరిమితులు, పన్నులు, ఏకాధికారాల నుంచి స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వ ఆధిపత్యం, ఆపై 1991లో మార్కెట్ సంస్కరణలు.. ఇప్పుడు డిజిటల్ అనుమతులు, సరళీకృత నిబంధనల వరకు భారత్లో వ్యాపార వ్యవస్థ ఎన్నో దశలను దాటింది. -
వరల్డ్లోనే బిజియెస్ట్ ఎయిర్పోర్టు ఏదో తెలుసా?, హీత్రూ కాదు!
సియోల్: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా దక్షిణ కొరియా ఇంచియాన్ విమానాశ్రయం అవతరించింది. ఆ స్థానంలో ఉన్న లండన్లోని హీత్రూ విమానాశ్రయాన్ని అధిగమించింది. ఇది అగ్రస్థానాన్ని పొందడం ఇదే మొదటిసారి. సేవా నాణ్యతలో వరుసగా 12వ ఏడాది కూడా అగ్రగామి విమానాశ్రయంగా నిలిచిన ఇంచియాన్, ఈ కొత్త బిరుదుతో అగ్రశ్రేణి గ్లోబల్ హబ్ విమానాశ్రయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సమా చారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,234 విమానాశ్రయాలలో ఇది అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను నిర్వహించింది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే 38.4 మిలియన్ల అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలు అందించింది. లండన్ హీత్రూ విమానాశ్రయం 37.79 మిలి యన్ల ప్రయాణికులతో రెండో స్థానంలో, సింగపూర్ చాంగీ విమానాశ్రయం 34.53 మిలియ న్లతో మూడవ స్థానంలో నిలిచాయి.2024, 2025ల్లో రెండో స్థానంలో నిలిచిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఈసారి మొదటి ఐదు స్థానాల నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. అమెరికా–ఇరాన్ మధ్య సంఘర్షణ కారణంగా దక్షిణాసియాలోని విమానయాన కేంద్రాల నుంచి ప్రయాణికులు మళ్లడం కూడా తమ స్థానం మెరుగుపడటానికి పాక్షికంగా కారణమని ఇంచియాన్ విమానాశ్రయం పేర్కొంది. గతంలో యూరప్కు వెళ్లేందుకు దుబాయ్ మీదుగా ప్రయాణించే వారు ఇప్పుడు ఇంచియాన్ మీదుగా ప్రయాణిస్తున్నారని, దీనివల్ల గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ట్రాన్స్ఫర్ ప్రయాణికుల సంఖ్య 18% పెరిగిందని విమానాశ్రయ కార్పొరేషన్ తెలిపింది. చదవండి: బ్రిటన్ ప్రధాని సలహాదారుగా ఎన్నారై -
యాదగిరిగుట్ట పాలక మండలి కీలక నిర్ణయాలు
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలకమండలి సమావేశంలో 26 అంశాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. ధర్మకర్తల మండల చైర్మన్ సత్యనారాయణరెడ్డి తన సొంత నిధులతో బాలాలయ స్థలంలో నిత్య కల్యాణ మండపం నిర్మించనున్నారు. రూ 9.87 కోట్లతో రాయగిరి వద్ద నిర్మించనున్నారు. 3.67 కోట్లతో ఆర్చ్ నిర్మించనున్నారు. కొండపై ఎలక్ట్రికల్ శంకు చక్రం నామాలకు ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ రూ. 84 లక్షలు విరాళం ప్రకటించారు.అన్న ప్రసాదం భోజన సామర్థ్యం 2 వేల మందికి పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తులసి కాటేజ్ వద్ద ప్రత్యేక కల్యాణ కట్ట, డోనార్ ఎగ్జిబిషన్ సెంటర్ నిర్మాణం, సోలార్ పవర్ జనరేషన్ నిర్మాణం, కాలినడకన మెట్ల మార్గంలో షెడ్ నిర్మాణం, 43.12 కోట్లతో దీక్షపరుల మండపం నిర్మించేలా పాలకమండలి నిర్ణయాలు తీసుకుంది. -
Asia Cup 2026: టీమిండియాకు భారీ షాక్
ఏసీసీ మహిళల ఆసియా కప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ టోర్నీకి దూరమైంది. ఆసియా కప్ ఈవెంట్తో పాటు.. ఆసియా క్రీడలకు కూడా ఆమె అందుబాటులో ఉండటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇంగ్లండ్ వేదికగా ‘ది హండ్రెడ్’ మహిళల లీగ్-2026లో జెమీమా రోడ్రిగ్స్ సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అయితే, ఇటీవల ఆగష్టు 3 నాటి మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో విలవిల్లాడింది.గాయం తీవ్రతరంఫలితంగా హండ్రెడ్ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు జెమీమా దూరమైంది. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్న ఆమె గాయం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వైద్య బృందం సూచన మేరకు ఆమెకు విశ్రాంతి అవసరమని నిర్ణయించింది.ఈ క్రమంలో ఆసియా కప్, ఆసియా క్రీడలకు జెమీమా రోడ్రిగ్స్ దూరమైనట్లు బోర్డు ప్రకటించిది. ఇక ఆసియా కప్ టోర్నీకి మాత్రం జెమీమా స్థానంలో ప్రతికా రావల్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఆసియా కప్ నిర్వహణకు ఆగష్టు 28- సెప్టెంబరు 13 మధ్య షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు యూఏఈ వేదిక.ఆసియా కప్-2026 టోర్నీకి భారత మహిళల జట్టు (అప్డేటెడ్)హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, భారతి ఫల్మలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి.కమలిని (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, ప్రతికా రావల్.చదవండి: ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్పై పాంటింగ్ ఫైర్ -
యాక్టర్ రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం..
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ(La trobe University) ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ పట్టాను ప్రదానం చేసింది. మెల్బోర్న్లో ఆగస్టు 14న జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.దాదాపు మూడు దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమకు అందించిన సేవలు, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని గుర్తించి దీనిని అందజేశారు. అంతకముందు 2019లో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. దీంతో ఇప్పుడీమె ఈ డాక్టరేట్ అందుకున్న రెండో భారతీయ సినీ ప్రముఖరాలిగా నిలిచింది.రాణి మాట్లాడుతూ సినిమానే నా కలను నిజం చేసే మార్గం అయిందన్నారు. కాగా ఈమె నటించిన ‘బ్లాక్’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘ హిచ్చి’, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రాలు మహిళా సాధికారత, సామాజిక మార్పు వంటి అంశాలను ప్రతిబింబించాయి. -
వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి? హర్భజన్ సమాధానమిదే
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు నిజంగా ఒక అద్భుతం.మైదానంలో సూర్యవంశీని అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వైభవ్ను కట్టడి చేసేందుకు ఒకే ఒక్క మార్గం ఉందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అతడికి డిఫెన్సివ్గా బౌలింగ్ చేయడం కంటే, వికెట్ పడగొట్టేందుకు ప్రయత్నించడమే బెటర్ అని భజ్జీ తెలిపాడు. "వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. కేవలం 14-15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ను శాసించే ఆటగాడిని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం అతడికి బౌలింగ్ చేయడానికి భయపడుతున్నారు.అయితే అతడిని ఔట్ చేయాలంటే ఒకే మార్గం ఉంది. అతడిని పరుగులు సాధించకుండా ఉండేలా బౌలింగ్ చేస్తే మీరు అతడిని ఔట్ చేయలేరు. వికెట్ గురుంచే ప్రయత్నం చేయాలి. షాట్ ఆడేందుకు ఆఫర్ చేయాలి. ఇది ప్రతిసారీ వర్కవుట్ కాకపోవచ్చు. కొన్ని సార్లు ఆ బంతులు సిక్సర్లగా కూడి వెళ్లవచ్చు. ఇదంతా ఆటలో భాగమే. ఏదేమైనప్పటికి వైభవ్ ఒక అసాధరణ ప్లేయర్ అని మనం అంగీకరించాలి" అని ఓ ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. -
ఐపీవోకు ముత్తూట్ ఫిన్కార్ప్.. రూ.3,000 కోట్లపై కన్ను
న్యూఢిల్లీ: ముత్తూట్ పప్పచాన్ గ్రూప్ కంపెనీ ముత్తూట్ ఫిన్కార్ప్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది.ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ మొత్తం తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధులను సమకూర్చుకోనుంది. భవిష్యత్ అవసరాల కోసం టైర్–1 మూలధనాన్ని పెంచుకునేందుకు ఐపీవో పెట్టుబడులను వెచ్చించనుంది. డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీ ముత్తూట్ ఫిన్కార్ప్ ప్రధానంగా బంగారు ఆభరణాలపై రుణాలందిస్తోంది. అయితే బిజినెస్ రుణాలు, ఆస్తులపై రుణాలు, సప్లై చైన్ ఫైనాన్సింగ్, డిజిటల్ రుణాలు, మైక్రోఫైనాన్స్, గృహ రుణాలు తదితరాలతో పోర్ట్ఫోలియోను విస్తరించింది.రెండు దశాబ్దాలుగా బంగారు ఆభరణాలపై రుణాలు సమకూర్చుతోంది. దేశవ్యాప్తంగా బ్రాంచీల నెట్వర్క్ను విస్తరించింది. 2026 మార్చి 31కల్లా నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ. 73,445 కోట్లకు చేరాయి. 5,610 బ్రాంచీలను కలిగి ఉంది. -
కాంతార హీరోకు ప్రతిష్టాత్మక అవార్డ్
కాంతార హీరో రిషబ్ శెట్టి మరో ఘనత సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. కాంతార ఏ లెజెండ్ చాప్టర్-1 మూవీకి గానూ బెస్ట్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. అంతేకాకుండా లీడర్షిప్ ఇన్ సినిమా అవార్డు కూడా దక్కించుకున్నారు.ఈ అవార్డుల వేడుక ఆస్ట్రేలియా వేదికగా జరిగింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్-17 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ దిగ్గజ నటి రేఖ ఎక్స్లెన్స్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపికయ్యారు. ఇండస్ట్రీలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీకి ప్రత్యేక గుర్తింపునిస్తూ సన్మానించారు. మరోవైపు దుల్కర్ సల్మాన్ , కీర్తి కుల్హరి, విజయ్ వర్మ, రసికా దుగల్ ఉత్తమ నటీనటులుగా అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఈ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా కొత్త లోకా చాప్టర్-1 నిలిచింది. -
జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదల
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. ఆయనకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 22న సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన అనంతరం అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల రోజూలు నాతో పాటు నా కుటుంబానికి కష్టకాలం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్కు నమస్కారాలు...ప్రభుత్వంలోని వారు కూడబలుక్కుని ఒక సాధారణ ప్రమాదాన్ని.. హత్యాయత్నంగా చూపించి జైలుకి పంపారు.దీనిపై అన్ని వర్గాల ప్రజలు చిన్న పిల్లలపై రాజకీయాల అంటూ గొంతెత్తి మాట్లాడారు. ప్రభుత్వం అభద్రతా భావంతో చేసిన రాజకీయ కక్ష ఇది. రాజకీయాలలో తొక్కేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆతృతతో చేశారు.’’ అని సీదిరి మండిపడ్డారు.కాగా, వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది. సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది.పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు. -
భార్య కోసం అతిపెద్ద పూల తోట..!
ఇటీవల కాలంలో భార్యభర్తల బంధాలు ఎంత ఘోరంగా మారిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. అలాంటి తరుణంలో నెట్టింట వైరల్ అవుతున్న కథ నెటిజన్ల మనసుని అమితంగా ఆకర్షిస్తోంది. వారి 35 ఏళ్ల అనురాగ దాంపత్యానికి ముచ్చటపడి అభినందనలు చెబుతుండటం విశేషం. ఇంతకీ అసలేం జరిగిందంటే..చైనాకి చెందిన జౌజియావోలిన్, తన భార్య యిన్ జీ కోసం భారీ తోటను నిర్మించాడు. అది ఎంత పెద్దదంటే..ప్రపంచంలో అతిపెద్ద ఉద్యానవన తోట. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో అతిపెద్ద రంగరంగు పూల తోట కనువిందు చేస్తోంది. ఆ దంపతులే ఈ భారీ తోటను స్వయంగా చూసుకుంటున్నారు. ఒక టెలివిజన్ షోలో ఈ దంపతులు కనిపించడంతో వారి కథ వెలుగులోకి వచ్చింది. ఆ షో వారిని ఆదర్శ జంటగా అభివర్ణించడం విశేషం.ఇంతకీ జౌజియావోలిన్ ఎందుకు ఈ తోటను నిర్మించాడంటే..2013లో తన భార్య యిన్ బీజింగ్లో పెరిగే హాలీహాక్లుగా పిలిచే ఆ పువ్వులంటే తనకెంత ఇష్టమో చెప్పింది. ఆ నేపథ్యంలోనే జౌ ఆమె కోసం ఒక తోటను నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతనికి తోటపని చేసిన అనుభవం లేదు. అయినా తన సొంత ఇంటిని అమ్మి..ఝువాన్లాంగ్ టౌన్లో సుమారు 80 హెక్టార్ల లోయను కొని, హాలీహాక్ మొక్కలను పెంచడం గురించి నేర్చుకున్నాడు. అలా పదేళ్లకు పైగా దేశ విదేశాల నుంచి విత్తనాలను సేకరించి ఒక పెద్ద తోటనే నిర్మించాడు. అదికాస్తా ఇప్పుడు అతి పెద్ద వైవిధ్యమైన హాలీహాక్ తోటగా ప్రసిద్ధి చెందింది. 35 ఏళ్ల వైవాహిక బంధం వారిది. పిల్లలు లేని ఆ దంపతులు తమ విశ్రాంత జీవితాన్ని పెంపుడు జంతువులు, పూల మొక్కల మధ్య గడుపుతున్నారు. సంప్రదాయబద్ధంగా సంపద లేదా కుటుంబంతో కాకుండా ప్రకృతిలో తమ ఆనందాన్ని వెతుక్కుంటున్న ఈ జంట నిజంగానే ఆదర్శ దంపతులు కదూ..!. నెటిజన్లు కూడా డబ్బు సంపాదించడం, పిల్లలను పెంచడం కంటే జీవితంలో ఇంకా చాలానే ఉందని నిరూపించారు ఈ దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..) -
ఇండిగో విమానం రద్దు : ఆగ్రహంతో రగిలిపోయిన మహిళ వీడియో వైరల్
ముందస్తు సమాచారం ఇవ్వకుడానే విమానం రద్దు కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళా ప్రయాణికురాలు గ్రౌండ్స్టాప్తో గొడవకు దిగిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. బిడ్డ అనారోగ్యం కారణంగా ఆమె అత్యవసరంగా విమానంలో వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. తీరా ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో ఆమె ఆవేదన గురైంది. ఒడిశాలోని భువనేశ్వర్ ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.ఆగస్టు 13న భువనేశ్వర్ నుండి కోల్కతా వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 7352) సాంకేతిక లోపం వల్ల రద్దయింది. ఫ్లైట్ క్యాన్సిలేషన్తో తీవ్ర నిరాశకు గురైన ఒక మహిళా ప్రయాణికురాలు విమానాశ్రయంలోని లగేజీ బెల్ట్పైకి ఎక్కి మరీ గొడవ చేయడం వివాదానికి దారి తీసింది. ఇండిగో సిబ్బంది డెస్క్పై ఉన్న పేపర్లు, డాక్యుమెంట్లను విసిరికొడుతూ సిబ్బందిపై విరుచుకుపడింది. విమానంలో ప్రయాణించాల్సిన ఆ మహిళ బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని, ("ఇన్ కా బచ్చా బిమార్ హై") అందుకే ఆమె అంత ఆందోళన చెందిందని అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు చెప్పారు. తోటి ప్రయాణికులు నీళ్లు ఇచ్చి ఆమెను శాంతపరిచేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరికి సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది జోక్యం చేసుకుని, మీరు ఎయిర్పోర్ట్ ఆస్తికి నష్టం కలిగిస్తున్నారంటూ హెచ్చరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.🚨Woman travelling with her sick child creates ruckus at Bhubaneswar Airport after IndiGo cancelled the Kolkata-bound flight over technical glitch without updates pic.twitter.com/nfXZ8NC40F— The Tatva (@thetatvaindia) August 14, 2026 ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. గంటల తరబడి వేచి చూసిన తర్వాత సమాచారం సరిగ్గా ఇవ్వకుండా ఫ్లైట్ క్యాన్సిల్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మరికొందరు ఇండిగోను తప్పుపట్టారు. ఆమె ప్రవర్తన తప్పే అయినప్పటికీ ఆమె కోపానికి కారణాన్ని, మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవాలని కొందరు కోరారు.మరోవైపు విమానాలు రద్దయితే గ్రౌండ్ స్టాఫ్పై ప్రతాపం చూపడం సరికాదని, వారు కేవలం విధి నిర్వహణలో ఉంటారని నెటిజన్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు.ఎయిర్పోర్ట్ ఆస్తిని పాడుచేసినందుకు మరియు భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెను 'నో-ఫ్లై లిస్ట్' (విమాన ప్రయాణాల నుంచి నిషేధం)లో పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు.ఇండిగో స్పందనఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది."ప్రీ-డిపార్చర్ తనిఖీలలో సాంకేతిక లోపం గుర్తించడం వల్ల సురక్షిత చర్యల్లో భాగంగా విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు ఆహారం, బస (అకామడేషన్), ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు లేదా పూర్తి రీఫండ్ వంటి సౌకర్యాలు కల్పించాం. విమానాశ్రయం ఆస్తికి నష్టం కలిగించి నియమాలు ఉల్లంఘించిన సదరు మహిళను 'అన్రూలీ ప్యాసింజర్' (Unruly Passenger) గా గుర్తించి నిబంధనల ప్రకారం భద్రతా సంస్థలకు అప్పగించామని తెలిపింది. -
'అభిమాని అంత్యక్రియలు.. నేనలా చేయడం కరెక్ట్ కాదు'
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్- ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయొలెంట్గా అనిపించింది. ఈ యాక్షన్ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.టాక్సిక్ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు యశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఓ అభిమాని అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. తాను వెళ్తే అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. అందుకే తన అభిమాని అంత్యక్రియలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. అతని మరణం నన్ను బాధించిందని.. కానీ నేను వెళ్తే మిగతా అభిమానులు కూడా అదే పని చేస్తారని యశ్ తెలిపారు.కాగా.. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని మాండ్యా జిల్లా కొడిదొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యశ్ అభిమాని రామకృష్ణ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన అంత్యక్రియలకు యశ్, రాజకీయ నాయకుడు సిద్దరామయ్య హాజరు కావాలని కోరుతూ ఒక లేఖను రాశాడు. ఇది చూసి సిద్దరామయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ యశ్ హాజరు కాలేదు. తాజాగా తాను అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. అలాంటి వాటిని ప్రోత్సహిస్తే.. మిగతా ఫ్యాన్స్ కూడా అలానే చేస్తారని.. ఆ ఆలోచనా విధానమే తప్పని యశ్ స్పష్టం చేశారు. -
బలోచిస్థాన్ హోంమంత్రిపై దాడి
బలోచిస్తాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా లాంగౌ కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఈ దాడి నుంచి హోంమంత్రి సురక్షితంగా బయటపడ్డారు. కలత్ నుంచి క్వెట్టా వెళ్తున్న ఈ కాన్వాయ్ను మస్తుంగ్ జిల్లాలోని ఖద్కోచా గోరు సమీపంలో సాయుధులు లక్ష్యంగా చేసుకున్నారు. కాల్పుల్లో నలుగురు ఏటీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే షాహీద్ నవాబ్ గౌస్ బక్ష్ రైసాని ఆసుపత్రికి తరలించారు.పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో జరిగిన ఈ దాడి కలకలం రేపుతుంది. అయితే, ఏ మిలిటెంట్ గ్రూప్ కూడా ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు అధికారులు ఆ ప్రాంతంలో దర్యాప్తు చేపట్టారు.బలోచిస్తాన్ మస్తుంగ్ జిల్లా పదే పదే వార్తల్లో నిలుస్తోంది. బలోచ్ వేర్పాటువాద గ్రూపులు, ఇస్లామిస్ట్ మిలిటెంట్లు ఇద్దరూ ఈ జిల్లాలో దాడులకు పాల్పడుతున్నాయి. 2026 జూలైలో మస్తుంగ్లో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లో ఆత్మాహుతి దళ సభ్యుడితో సహా ఐదుగురు మిలిటెంట్లను హతమార్చినట్లు పాకిస్థాన్ భద్రతా బలగాలు తెలిపాయి. ఈ ఆపరేషన్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లు లభించినట్లు సైన్యం వెల్లడించింది.అలాగే ఈ ఏడాది జనవరిలో బలోచిస్తాన్ వ్యాప్తంగా భద్రతా సంస్థలు, ప్రభుత్వ భవనాలు, పలు జిల్లాల్లోని ఇతర కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ దాడి ప్రభావిత ప్రాంతాల్లో ఈ జిల్లా కూడా ఉంది. 2018 జూలైలో ఈ జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి జరగగా 149 మంది మృతి చెందారు. పాకిస్థాన్లో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఇది ఒకటిగా నిలిచింది. దీనికి ఇస్లామిక్ స్టేట్ (ISIS) బాధ్యత వహించింది. బలోచిస్తాన్ హోంమంత్రిని లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు.2016 జనవరిలో అప్పట్లో బలోచిస్తాన్ హోంమంత్రిగా ఉన్న మీర్ సర్ఫరాజ్ అహ్మద్ బుగ్తి డెరా బుగ్తిలో తన కాన్వాయ్పై రిమోట్ ద్వారా పేల్చిన బాంబు దాడి నుంచి తప్పించుకున్నారు. డాన్ పత్రిక కథనం ప్రకారం.. కాన్వాయ్లోని ఒక వాహనం దెబ్బతిన్నప్పటికీ, బుగ్తి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు బలోచ్ రిపబ్లికన్ ఆర్మీ బాధ్యత వహించింది. -
'కొందరు కావాలనే నాపై కుట్ర': అనసూయ
టాలీవుడ్ నటి అనసూయ పేరు మరోసారి తెరపైకొచ్చింది. కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న అనసూయ వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా వివాదాలతో కాదు. సనాతన ధర్మంపై ఆమె చేసిన కామెంట్స్తో హాట్ టాపిక్గా నిలిచింది. అనసూయ సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలోనే అనసూయ తన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చింది. కొందరు తన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని పేర్కొంది. తాను ఏ మత విశ్వాసాలనూ కించపర్చేలా మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. తాను మాట్లాడింది కేవలం కొందరి గురించి మాత్రమేనని తెలిపింది. తనపై వల్గర్ కామెంట్స్.. పర్సనల్ ఎటాక్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే వాళ్ల గురించి అని తన పోస్ట్లో వెల్లడించింది. అందుకే తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని అనసూయ రాసుకొచ్చింది.అనసూయ తన పోస్ట్లో రాస్తూ..'కొందరు కావాలనే నా మాటలను వక్రీకరిస్తున్నారు. అందుకే నేను వివరణ ఇవ్వాల్సి వస్తోంది. నేను కొందరి గురించి మాత్రమే మాట్లాడా. నాపై అభ్యంతర కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దిగే వాళ్ల గురించి మాత్రమే చెప్పా. అది ఏ మతాన్ని గానీ, వర్గాన్ని గానీ కించపరచలేదు. నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్లకు స్పష్టంగా చెప్పాలనుకుటున్నా. నేను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని. నా ధర్మం, విలువలు, విశ్వాసాల పట్ల నాకు ఎలాంటి చింత లేదు. ధైర్యంగా ఉండటం.. నిజం వైపు నిలబడటం, తప్పును తప్పు అని చెప్పడం, ఎదుటివారిని మనిషిగా గౌరవించడం.. ఇవన్నీ నాకు ధర్మమే నేర్పింది. నన్ను నేను హనుమాన్ జీ కుమార్తెగా భావిస్తా. ఆయన బలమే నాకు స్ఫూర్తి' అంటూ పోస్ట్ చేసింది. అంతేకాకుండా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండటం నా నైజం కాదని తెలిపింది. నా మాటల్లో అసలు విషయం పక్కనపెట్టి.. సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా వక్రీకరించినట్లు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికింది. మతం ఆధారంగా నేను ఎవరిపైనా ఓ నిర్ణయానికి రాను. నన్ను వేధించే వాళ్లను మాత్రమే ప్రశ్నిస్తానని రాసుకొచ్చింది. అందువల్ల ఎడిట్ చేసిన క్లిప్లు, సగం సగం కథనాలు చూసి మోసపోవద్దని సుదీర్ఘ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
79 నుంచి 80కి.. మన జీవితంలో ఏం మారింది?
జాతీయ జెండా రెపరెపలాడుతుంది.. దేశభక్తి గీతాలు మార్మోగుతాయి.. ఎర్రకోట వేదికగా దేశ ప్రగతి ప్రస్థానం మరోసారి వినిపిస్తుంది. రహదారుల నుంచి రాకెట్ల వరకు.. డిజిటల్ చెల్లింపుల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత్ సాధించిన విజయాలను ప్రభుత్వం దేశం ముందుంచుతుంది. కానీ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం కేవలం విజయాలను లెక్కించుకునే సందర్భమే కాదు.. ఆ అభివృద్ధి సామాన్యుడి జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో సమీక్షించుకునే సమయం కూడా.79వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 80వ దినోత్సవం వరకు భారత్ ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, డిజిటల్ విప్లవం, అంతరిక్ష పరిశోధనలు, ప్రపంచ వేదికపై పెరిగిన ప్రాధాన్యం.. ఇవన్నీ కొత్త భారత్ చిత్రాన్ని చూపిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగాలు, ధరల భారం, ఆదాయ అసమానతలు, వ్యవసాయ సమస్యలు వంటి ప్రశ్నలు కూడా కొనసాగుతున్నాయి. అభివృద్ధి వేగం పెరిగిన ఈ ఏడాదిలో.. ఆ మార్పు ప్రతి భారతీయుడి జీవితంలో ఎంతవరకు కనిపించింది? ఇదే 80వ స్వాతంత్ర్య దినోత్సవం ముందున్న అసలు ప్రశ్న.జీడీపీ నుంచి జేబు దాకా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. తయారీ రంగం, సేవల రంగం, మౌలిక వసతులు, స్టార్టప్ వ్యవస్థల్లో పెట్టుబడులు పెరిగాయి. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు పరిశ్రమలకు ఊతమిస్తున్నాయి.భారత్ ఆర్థిక పరిమాణం పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిలో భారత మార్కెట్ ఆకర్షణీయంగా మారిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.అయితే మరోవైపు సామాన్య కుటుంబాల లెక్కలు వేరుగా ఉన్నాయి. నిత్యావసర ధరలు, విద్య, వైద్య ఖర్చులు, ఇళ్ల అద్దెలు పెరగడం మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. దేశ సంపద పెరుగుతున్న వేగం.. ప్రతి కుటుంబ ఆర్థిక భద్రత పెరుగుతున్న వేగంతో సమానమా? అనే చర్చ కొనసాగుతోంది.మన డిజిటల్ భారతం.. భారత్లో అత్యంత వేగంగా కనిపించిన మార్పుల్లో డిజిటల్ విప్లవం ఒకటి. ఒకప్పుడు బ్యాంకు సేవల కోసం రోజుల తరబడి వేచి చూసిన ప్రజలు ఇప్పుడు మొబైల్ ద్వారా క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చిన్న వ్యాపారి, కూరగాయల విక్రేత, ఆటో డ్రైవర్.. ఇలా సామాన్యుడి జీవితంలోనూ డిజిటల్ చెల్లింపులు భాగమయ్యాయి. యూపీఐ వంటి వ్యవస్థలు భారత ఆర్థిక లావాదేవీల రూపాన్ని మార్చాయి.అదే సమయంలో కృత్రిమ మేధస్సు (AI) కొత్త అవకాశాలను తెస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, మీడియా రంగాల్లో సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అయితే AI కారణంగా ఉద్యోగాల స్వరూపం ఎలా మారుతుందన్న ఆందోళన కూడా పెరుగుతోంది.రయ్.. రయ్..తిరిగేయ్దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కొత్త ఎక్స్ప్రెస్వేలు, రహదారులు, మెట్రో ప్రాజెక్టులు, రైల్వే ఆధునీకరణతో ప్రయాణ రూపం మారుతోంది. వందే భారత్ వంటి రైళ్లు ఆధునిక రైల్వేకు ప్రతీకగా నిలుస్తున్నాయి. నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతోంది. విమానాశ్రయాల విస్తరణతో విమాన ప్రయాణం కూడా ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది.అయితే మరోవైపు గ్రామీణ రహదారులు, ప్రజా రవాణా, నగరాల్లో ట్రాఫిక్, కాలుష్యం వంటి సమస్యలు ఇంకా సవాళ్లుగానే ఉన్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరడం కూడా అంతే ముఖ్యం.అంతరిక్ష విజయాలే..చంద్రయాన్ విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మానవ సహిత అంతరిక్ష ప్రయాణం, ప్రైవేటు అంతరిక్ష సంస్థలకు అవకాశాలు, కొత్త పరిశోధనలపై దృష్టి పెరిగింది. అంతర్జాతీయ రాజకీయాల్లోనూ భారత్ పాత్ర పెరిగింది. అమెరికా, రష్యా, యూరప్, ఇండో-పసిఫిక్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ ప్రపంచ సమస్యలపై తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తోంది. ప్రపంచ వేదికపై పెరిగిన ఈ ప్రాధాన్యం భారత్ ఆర్థిక, దౌత్య శక్తిని ప్రతిబింబిస్తోంది.యువ భారత్.. ఆశలు పెద్దవి, సవాళ్లు కూడాభారత్ యువ జనాభా దేశానికి అతిపెద్ద బలం. అదే సమయంలో వారికి అవకాశాలు కల్పించడం అతిపెద్ద బాధ్యత. ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. కొత్త రంగాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే లక్షలాది మంది యువతకు స్థిరమైన ఉద్యోగం, మెరుగైన వేతనం, ఉద్యోగ భద్రత ఇప్పటికీ కీలక అంశాలుగానే ఉన్నాయి. పోటీ పరీక్షలు, నియామకాల ఆలస్యం వంటి అంశాలు యువతలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. జెన్జీ ఉద్యమాలు తెరపైకి వస్తున్నాయి.అభివృద్ధి కథలో మరో వైపు79 నుంచి 80కి భారత్ ప్రయాణం చూస్తే విజయాలు స్పష్టంగా కనిపిస్తాయి. డిజిటల్ శక్తి పెరిగింది. మౌలిక వసతులు విస్తరించాయి. అంతరిక్షం నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత్ తన ముద్ర వేస్తోంది. కానీ ఒక దేశ అభివృద్ధిని కేవలం జీడీపీ, భారీ ప్రాజెక్టులు, అంతర్జాతీయ గుర్తింపుతో మాత్రమే కొలవలేం.ఒక రైతు ఆదాయం పెరిగిందా?ఒక యువకుడికి ఉద్యోగం దొరికిందా?ఒక కుటుంబానికి వైద్యం, విద్య భారం తగ్గిందా?ఒక సామాన్యుడి జీవన ప్రమాణం మెరుగుపడిందా?.. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే అసలు అభివృద్ధికి కొలమానం.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ తన విజయాలను వేడుకగా జరుపుకుంటోంది. అదే సమయంలో ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భమూ ఇదే. గత ఏడాదిలో భారత్ చాలా మారింది.. కానీ ఆ మార్పు ప్రతి భారతీయుడి జీవితంలో మరింత స్పష్టంగా కనిపించడమే వచ్చే ప్రయాణానికి అసలైన సవాల్.:::వెబ్ ప్రత్యేకం -
కోట్ల విలువైన ఫుట్బాల్ క్లబ్.. రూ.100కే అమ్మకం!
కోట్ల రూపాయల విలువైన ఒక ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫుట్బాల్ క్లబ్ను కేవలం 100 రూపాయలకే అమ్మేశారంటే.. ఎవరైనా నమ్మగలరా?, కానీ టాటా స్టీల్, జంషెడ్పూర్ ఎఫ్సీ ఫుట్బాల్ అండ్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్పీఎల్) విషయంలో ఇదే జరిగింది. గోవాకు చెందిన.. చర్చిల్ బ్రదర్స్ స్పోర్ట్స్ క్లబ్కు వంద రూపాయలకే విక్రయించింది. ఇది ప్రస్తుతం క్రీడా, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంత తక్కువ ధరలు టాటా లాంటి దిగ్గజ కంపెనీ ఎందుకు అమ్మేసింది?, దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.జంషెడ్పూర్లో ఎన్నో ఏళ్లుగా ఫుట్బాల్ను ప్రోత్సహించిన టాటా స్టీల్, ISLలో జంషెడ్పూర్ ఎఫ్సీని బలమైన జట్టుగా తీర్చిదిద్దిన తర్వాత ఇప్పుడు యాజమాన్య బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. ఈ ఒప్పందంతో క్లబ్కు సంబంధించిన ఐఎస్ఎల్ స్పోర్టింగ్ లైసెన్స్తో పాటు ఇతర హక్కులు, బాధ్యతలు కూడా చర్చిల్ బ్రదర్స్కు బదిలీ కానున్నాయి. అయితే.. దీనికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF)తో పాటు మరికొన్ని అవసరమైన అనుమతులు రావాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆగస్టు 31లోపు పూర్తయ్యే అవకాశం ఉంది.సెప్టెంబర్ 2026 నుంచి చర్చిల్ బ్రదర్స్ కొత్త బాధ్యతలు చేపట్టనుంది. జట్టులోని 12 మంది ఆటగాళ్లు, ఇద్దరు కోచ్ల కాంట్రాక్టులను కూడా కొత్త యాజమాన్యం కొనసాగించనుంది. అంటే.. జంషెడ్పూర్ ఎఫ్సీ క్లోజ్ అవ్వడం లేదు.. కేవలం దాని యజమాని మాత్రమే మారుతున్నాడు.ఐఎస్ఎల్ క్లబ్ను రూ.100కే ఎందుకు ఇచ్చారు?దీనికి సమాధానం క్లబ్ వెనుక ఉన్న కంపెనీ ఆర్థిక పరిస్థితి అనే తెలుస్తోంది. జెఎఫ్ఎస్పీఎల్ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 32.23 కోట్ల టర్నోవర్ సాధించింది. మార్చి 2026 నాటికి దాని నికర విలువ మైనస్ రూ.5.8 కోట్లుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే.. సంస్థ ఆర్థికస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. రూ.100కు విక్రయించడం అనేది అసలు ధర కాదు. ఇది టోకెన్ మొత్తం మాత్రమే.నిజానికి టాటా ఫుట్బాల్ అకాడమీ 1987లో జంషెడ్పూర్లో ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఈ అకాడమీ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు శిక్షణ పొందారు. వారిలో చాలామంది భారత జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు.ఇదీ చదవండి: కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు! -
‘జీరో’ నుంచి రూ .1.4 కోట్ల జీతానికి.. టెకీ సక్సెస్ స్టోరీ వైరల్
కెరీర్ ప్రారంభంలో జీతం లేకుండా పనిచేసిన ఓ టెక్ ప్రొఫెషనల్.. 14 ఏళ్లకు పైగా అనుభవంతో ప్రస్తుతం ఏడాదికి దాదాపు రూ.1.4 కోట్ల సమానమైన వేతనం అందుకుంటున్నానని వెల్లడించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ 35 ఏళ్ల క్లౌడ్, డెవ్ఆప్స్ ప్రొఫెషనల్ తన జీతం ఎలా దశలవారీగా పెరిగిందో సోషల్ ప్లాట్ఫామ్ రెడిట్లో పంచుకున్నారు.రెడిట్లోని r/IndianWorkplaceలో ‘DevOpsHumbleFool’ పేరుతో ఉన్న యూజర్ తన కెరీర్ ప్రయాణాన్ని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ‘సగటు కంటే తక్కువ’ కాలేజీ నుంచి చదువు పూర్తి చేశానని, తన కెరీర్ను ఢిల్లీలో జీతం లేని ఉద్యోగంతో ప్రారంభించానని చెప్పారు. ఆ పని ఏడాదిలోపే ముగిసిందని, అనంతరం బెంగళూరులో రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరి రెండేళ్లు పనిచేసినట్లు రాసుకొచ్చారు.ఆ తర్వాత మరో సంస్థలో రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వేతనం పెరిగింది. అక్కడ దాదాపు 4.7 సంవత్సరాలు పనిచేశారు. తదుపరి బెంగళూరు సంస్థలో రూ.17 లక్షల ప్యాకేజీతో చేరి, ఐదేళ్లలో దాన్ని రూ.35 లక్షలకు పెంచుకున్నారు. ఈ దశలో మరో సంస్థ నుంచి రూ.70 లక్షల ఆఫర్ వచ్చినప్పటికీ, తాను ఆ ఉద్యోగంలో చేరలేదని చెప్పారు. అయితే ఆ ఆఫర్ తన మార్కెట్ విలువను అర్థం చేసుకునేలా చేసిందని పేర్కొన్నారు.రూ.35 లక్షల నుంచి విదేశీ క్లయింట్ల వరకు..కెరీర్లో కీలక మలుపు విదేశీ క్లయింట్లతో పనిచేయడం ద్వారా వచ్చిందని ఆయన వివరించారు. ‘క్లయింట్ A’తో సుమారు రెండేళ్లు పనిచేసిన సమయంలో ఏడాదికి రూ.1.15 కోట్ల సమానమైన ఆదాయం వచ్చినట్లు, ప్రస్తుతం ‘క్లయింట్ B’తో ఏడాదికి రూ.1.40 కోట్ల స్థాయిలో సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాలు అమెరికా డాలర్లలో అందుతున్నాయని, తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని ఆయన కామెంట్లలో స్పష్టం చేశారు. క్లయింట్ A రిమోట్ రోల్ కాగా, క్లయింట్ B పాత్ర ఆన్సైట్ అని తెలిపారు.సైడ్ గిగ్స్తో అదనపు ఆదాయంప్రధాన ఉద్యోగంతో పాటు కెరీర్లో సైడ్ గిగ్స్ కూడా చేశానని ఆయన వెల్లడించారు. అలా తనకు నెలకు సుమారు రూ.15,000 నుంచి రూ.65,000 వరకు అదనపు ఆదాయం వచ్చేదని చెప్పారు. యూట్యూబ్, పెయిడ్ ఇంటర్వ్యూలు, చిన్న ప్రాజెక్టులు, టెక్నికల్ కన్సల్టేషన్స్, ఫోన్ ద్వారా టెక్నికల్ సహాయం వంటి పనులు చేసేవాడినని వివరించారు. తన యూట్యూబ్ కంటెంట్ కారణంగా లింక్డ్ఇన్లో గుర్తింపు పెరిగి, అక్కడి నుంచే చాలా సైడ్ గిగ్ అవకాశాలు వచ్చాయని తెలిపారు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ఉద్యోగం, వీసా నిబంధనల నేపథ్యంలో సైడ్ గిగ్స్ పూర్తిగా నిలిపివేశానని చెప్పారు.డిగ్రీ కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యంతన విద్యా నేపథ్యం గొప్పది కాకపోయినా, DevOps, Cloud టెక్నాలజీలపై విస్తృత నైపుణ్యాలు తన కెరీర్ ఎదుగుదలకు ప్రధాన కారణమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. జావా డెవలపర్గా కెరీర్ ప్రారంభించి, బిల్డ్ & రిలీజ్ ఇంజినీరింగ్ నుంచి డెవాప్స్, ఆ తర్వాత క్లౌడ్ విభాగంలోకి మారినట్లు వివరించారు. ప్రస్తుతం తన పనిలో కోడింగ్ భాగం సుమారు 10 శాతం మాత్రమేనని చెప్పారు. AI తన పనిని ఇప్పటివరకు దెబ్బతీయలేదని, అయితే తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి AI సాధనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నానని తెలిపారు.30ల్లోనూ విదేశీ అవకాశాలు సాధ్యమేనంటూ..తాను 30లలోనే అమెరికాకు వెళ్లానని, 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉండటం వల్ల విదేశీ అవకాశాలు మరింత అందుబాటులోకి వచ్చాయని ఆయన చెప్పారు. తొలుత రిమోట్ అవకాశాన్ని పొందిన తర్వాత వర్క్ వీసా ద్వారా అమెరికాకు వెళ్లినట్లు, ప్రస్తుతం H-1Bపై ఉన్నట్లు కామెంట్లలో వెల్లడించారు. తనకు తెలిసిన ఓ సీనియర్ 42 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారని కూడా పేర్కొన్నారు.అయితే అధిక జీతంతో పాటు విదేశీ ఉద్యోగ జీవితంలోని సవాళ్లను కూడా ఆయన ప్రస్తావించారు. కుటుంబానికి దూరంగా ఉండటం, ఒంటరితనం, వీసాపై ఆధారపడటం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వంటి అంశాలు అమెరికాలోని జీవితంలో ప్రతికూలతలుగా పేర్కొన్నారు.ఈ పోస్టుపై వందలాది మంది స్పందించారు. ముఖ్యంగా తక్కువ జీతాలతో కెరీర్ ప్రారంభిస్తున్న యువత తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు డెవాప్స్, క్లౌడ్ వంటి నైపుణ్యాల్లోకి ఎలా మారాలి, సైడ్ గిగ్స్ ఎలా సంపాదించాలి, AI వల్ల టెక్ ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది వంటి ప్రశ్నలు అడిగారు. టెకీ మాత్రం నైపుణ్యంతో పాటు ఆన్లైన్ ప్రొఫెషనల్ ప్రెజెన్స్ను పెంచుకోవడం తన కెరీర్లో కీలకంగా పనిచేసిందని సూచించారు. -
ఆనాడు అర్థరాత్రి వందేమాతరం ఆలపించింది ఆ మహిళే..!
ఆగస్టు 14, 1947 అర్థ రాత్రి స్వాతంత్ర్య వచ్చిందని అందరికి తెలుసు. కానీ ఆ రోజు అర్థరాత్రి స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తున్న తరుణంలో 'విధితో ఒప్పందం' అనే జవహర్లాల్ నెహ్రూ ప్రసంగమే హైలెట్గా నిలిచింది. కానీ ఆ రాత్రి ఆయన మాటల కంటే ఒక మహిళా గాత్రం అందరి చెవుల్లో పడింది. నెహ్రూ ప్రసంగంలోని ఒక్క వాక్యం కూడా వినిపించక మునుపే అంతా ఊపిరి బిగబెట్టుకుని ఆసక్తితో ఎదురుచూస్తున్న సభలో ఒక మహిళ లేచి 'వందేమాతరం'లోని తొలి చరణాన్ని ఆలపించారు. ఆ వనిత ఎవరంటే..ఆమెనే సుచేతా కృపలానీ. ఆ ఒక్క క్షణం పాటు, ఆ నవభారతదేశపు స్వరం ఆమెదే అయ్యిందిపోరాట మార్గాన్ని ఎంచుకున్న ఉపాధ్యాయినికృపలానీ మొదట విప్లవకారిణిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించలేదు. 1908లో జన్మించిన ఆమె, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్రను అభ్యసించి, ఆ తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ చరిత్రను బోధించేవారు . అక్కడే ఆమెకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆచార్య జె.బి. కృపలానీతో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహానికి దారితీసింది. అయితే ఆ వివాహం కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా జరిగింది. ఆ తర్వాత స్వాతంత్ర్య ఉద్యమం ఆమెను క్రమంగా బోధనా వృత్తికి దూరం చేసింది. 1942 నాటి 'క్విట్ ఇండియా' ఉద్యమ సమయంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లి రహస్యంగా ప్రతిఘటనను నిర్వహించారు. అరుణా అసఫ్ అలీ, రామ్ మనోహర్ లోహియా వంటి ప్రముఖులతో కలిసి పనిచేసిన ఆమెను 1944లో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. పోరాటంలో మహిళలు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకూడదని దృఢ సంకల్పంతో, 1940లోనే ఆమె కాంగ్రెస్ మహిళా విభాగాన్ని స్థాపించారు.పదిహేను మందిలో ఒకరుఇంకా స్వాతంత్ర్యం రాని దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించడానికి 1946లో రాజ్యాంగ పరిషత్ (Constituent Assembly) ఏర్పాటైనప్పుడు, కృపలానీ అందులో సభ్యురాలిగా ఎంపికయ్యారు. దాదాపు మూడు వందల మంది సభ్యులున్న ఆ సభలో ఉన్న పదిహేను మంది మహిళల్లో ఆమె ఒకరు. సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్ వంటి ప్రముఖులతో కలిసి ఆమె ఆ సభలో కూర్చున్నారు. చర్చలలో, ఆమె ఆర్భాటంగా కాకుండా ఆచరణాత్మకంగా వ్యవహరించారు. మహిళల హక్కులు, సమానత్వం కొత్త ప్రభుత్వం ఏ రూపంలో ఉండాలనే విషయాలపై మాట్లాడారు. 1947లో, దేశ విభజన బెంగాల్ను అట్టుడికిస్తున్నప్పుడు, ఆమె గాంధీతో కలిసి నోవాఖలీకి ప్రయాణించి, అల్లర్ల బాధితుల మధ్య పనిచేశారు. ఆనాడు స్వాతంత్య్రాన్ని కమ్ముకున్న ఆ హింస నడిబొడ్డులోకి ఆమె అడుగుపెట్టారు.అర్ధరాత్రి గీతంఆమె జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం స్వాతంత్య్రానికి ముందు రోజు వచ్చింది. రాజ్యాంగ సభ అధికారిక రికార్డు ఆ క్రమాన్ని యథాతథంగా భద్రపరుస్తుంది. అజెండాలోని మొదటి అంశం వందేమాతరం మొదటి చరణాన్ని ఆలపించడం అని రాష్ట్రపతి ప్రకటించగా, సుచేతా కృపలాని దానిని ఆలపిస్తుండగా సభ వినడానికి లేచి నిలబడింది. ఆ తర్వాత సమావేశంలో ఆమె 'సారే జహాన్ సే అచ్చా' ప్రారంభ పంక్తులు, 'జన గణ మన' మొదటి చరణాన్ని ఆలపించారు. అప్పుడే నెహ్రూ మాట్లాడటానికి లేచారు. 'వందేమాతరం' అనే నినాదం దశాబ్దాలుగా స్వాతంత్ర్య పోరాటానికి యుద్ధ నినాదంగా నిలిచింది. ఆ స్వాతంత్య్రాన్ని సాధించిన స్త్రీపురుషుల ముందు, తన స్వంత స్వరంతో ఆ నినాదాన్ని స్వేచ్ఛా భారతదేశంలోకి తీసుకువెళ్లే బాధ్యత ఆమెపై పడింది.ఆమె స్వరం ఇప్పటికీ మోస్తున్నదిఆమె మిగిలిన జీవితం ఆ ప్రారంభానికి అనుగుణంగానే సాగింది. ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1963లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే భారతదేశ రాష్ట్రానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారామె. ఆమె హాయంలో ఉన్న తీవ్రమైన ఉద్యోగుల సమ్మె, ఆహార సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి, ఆ తర్వాత పదవి నుంచి వైదొలిగారు. అయినప్పటికీ, ఆమె గానమే నిలిచి ఉంది. తరచుగా కొద్దిమంది మహనీయుల మాటల ద్వారా తన స్వేచ్ఛను గుర్తుచేసుకునే దేశం. వాస్తవానికి ఒక మహిళ మాటలు వింటూ స్వేచ్ఛవాయువులను పీల్చుకుంది దేశం. అప్పటి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం నాడు వందేమాతరం గీతం ఆలపించిన ప్రతిసారీ, ఆనాడు స్వతంత్ర నవ భారతదేశంలో ఆమె ఆలపించిన తొలి గీతమే ప్రతిధ్వనిస్తుంటుంది కదూ..!. -
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
ఆన్లైన్లో తనపై తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం జరుగుతోందంటూ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన ఇంటి పేరు ప్రతిష్ఠను ట్రేడ్మార్క్తో పోల్చవచ్చా? ఆ ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా? అనే అంశాలపై న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తింది.2023లో ఆరాధ్య బచ్చన్, తన తండ్రి అభిషేక్ బచ్చన్తో కలిసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై యూట్యూబ్లో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని వీడియోల్లో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిందని, మరికొన్నింటిలో ఆరాధ్య మరణించిందని కూడా ప్రచారం చేసినట్లు ఆరోపించారు.ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ.. ఒక వ్యక్తి తన ప్రతిభ, కృషి, విజయాల ద్వారా సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠను ట్రేడ్మార్క్తో పోల్చవచ్చా? అలాంటప్పుడు ఆ పేరు ప్రతిష్ఠ తదుపరి తరాలకు బదిలీ అవుతుందా? అనే ప్రశ్నను అడిగారు.తప్పుడు ప్రచారం చేశారంటూ..ఆరాధ్య తరఫున వాదించిన న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ వివాదం కేవలం ఆరాధ్య వ్యక్తిగత ప్రతిష్ఠకు మాత్రమే సంబంధించినది కాదన్నారు. బచ్చన్ కుటుంబానికి చెందిన పేరు, ఫొటోలను ఉపయోగించి ఆమెకు క్యాన్సర్ వచ్చిందని, ఆమె మరణించిందని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.ఈ కేసులో మూడు ప్రధాన అంశాలను పరిశీలించాలని హైకోర్టు నిర్ణయించింది. కుటుంబ పేరుకు సంబంధించిన ప్రతిష్ఠ తరతరాలకు వర్తిస్తుందా? తప్పుడు వార్తలు హక్కుల ఉల్లంఘనగా పరిగణించవచ్చా? పరువునష్టం మేధో సంపత్తి హక్కుల పరిధిలోకి వస్తుందా? అనే అంశాలపై విచారణ చేపట్టనుంది. -
ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్పై పాంటింగ్ ఫైర్
బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆట తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త బ్యాటింగ్తో తొలిరోజే ప్రత్యర్థి ముందు తలవంచారని మండిపడ్డాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ అనూహ్య ప్రదర్శనతో చెలరేగింది. డార్విన్లోని మరారా స్టేడియంలో బలహీన ప్రత్యర్థిపై బరిలోకి దిగిన కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు చెలరేగడంతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. ఒంటరి పోరాటం చేసిన స్టీవ్ స్మిత్ (109 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ (6/55) ఆరు వికెట్లతో కంగారూలను పడగొట్టగా... మరో ఇద్దరు పేసర్లు ఇబాదత్ హుసేన్, తస్కీన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.ఇదేం బ్యాటింగ్?ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియా బ్యాటర్లను విమర్శించాడు. ‘‘తొలి సెషన్లో పిచ్ కాస్త భిన్నంగా ఉందని ఒప్పుకొంటాను. అయినా సరే ఆసీస్ బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు టెక్నికల్గా ఎన్నో తప్పులు చేశారు.ఇందుకు వారికి క్షమాపణే లేదు. ఏదేమైనా ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై 54 పరుగుల తేడాతో గట్టెక్కిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు.ముందుగా ఆసీస్ బౌలింగ్ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని రిక్కీ పాంటింగ్ విమర్శించాడు.ముసలోళ్ల జట్టుఅదే విధంగా.. ఆసీస్ ప్రస్తుత జట్టుపై స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసి 1928 తర్వాత బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఆడిన జట్టే అత్యధిక మంది ‘వృద్ధుల’తో నిండిన జట్టు అనుకుంటా. కామెరాన్ గ్రీన్ (27 ఏళ్లు) తప్ప మిగిలిన వారంతా 30 ఏళ్లు పైబడిన వారే. జట్టు పునర్నిర్మాణంలో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో యువ బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయినా సరే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని పాంటింగ్ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.తేలిపోయిన బ్యాటర్లుకాగా గురువారం నాటి తొలిరోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఆసీస్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. పరిస్థితులు సీమ్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో పాటు దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్టు ఆడుతున్న జట్టులో ఆ ప్రభావం కనిపించింది. తొలి సెషన్లోనే వెదరాల్డ్ (23), హెడ్ (22), లబుషేన్ (1), గ్రీన్ (13) వెనుదిరిగారు. లంచ్ తర్వాత స్మిత్, కేరీ (19) ఐదో వికెట్కు 55 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.అయితే తక్కువ వ్యవధిలో కేరీతో పాటు వెబ్స్టర్ (12), కమిన్స్ (9), స్టార్క్ (1) అవుటయ్యారు. మరో ఎండ్లో 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్ ఆ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో 9వ వికెట్గా పెవిలియన్ చేరగా, కొద్ది సేపటికే లయన్ (7) అవుట్తో ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే.ఆధిక్యంలో బంగ్లాదేశ్ఇదిలా ఉంటే.. తొలిరోజు వికెట్ నష్టానికి 96 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. రెండోరోజూ జోరు కొనసాగించింది. శుక్రవారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ కంటే 153 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ముందు బయటకు నడువ్: స్టార్క్ ఆగ్రహం -
కోటి రూపాయల జాబ్ వదులుకున్నాడు, కారణం తెలిస్తే షాక్!
ఐదంకెల జీతం, విలాసవంతైన జీవనశైలి, లగ్జరీ ఇల్లు, ఖరీదైన కారు ఇవే జీవితం అనుకొని పరుగులు తీసే కాలానికి ఇక చెల్లు అంటోంది నేటి యువత. ప్రస్తుత కాలంలో ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మస్కాన్ అటార్ అనే మహిళ లింక్డిన్లో షేర్ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారింది. జెన్ జీ డబ్బు, కెరీర్ వృద్ధి,పని-జీవిత సమతుల్యతను ఎలా చూస్తారనే దానిపై ఆన్లైన్లో చర్చకు దారి తీసింది.స్టోరీ ఏంటంటే..ఏడాదికి కోటీ రూపాయల వార్షికవేతనం అంటే ఎవరైనా ఆనందంతో ఎగిరి గంతేస్తారు. కానీ ఓ జెన్-జీ మాత్రం అంత భారీ ఆఫర్కు సింపుల్గా నో చెప్పేశాడు. అదేంటి పిచ్చా అని అనుకుంటున్నారా? ఆగండి ఇక్కడే ఉంది అసలు సంగతి. విషపూరితమైనదిగా భావించిన పని ప్రదేశంలో పనిచేయడానికి అతడికి ఇష్టం లేదట. అందుకే ఉద్యోగ అవసరం చాలా ఉన్నప్పటికీ, ఈ ఉద్యోగావకాశాన్ని తిరస్కరించాడు.‘టాక్సిక్ వర్క్ప్లేస్’లో పనిచేయడం కంటే తక్కువ జీతమైనా తనకు నచ్చిన పని చేసుకోవడమే మేలని తన స్నేహితుడు నిర్ణయించుకున్నాడనీ మస్కాన్ అటార్ చెప్పుకొచ్చారు. కెరీర్లో కీలక దశలో ఉన్న సమయంలో ఇంత భారీ మొత్తాన్ని వదులుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు . 25 ఏళ్ల వయసు లోనే అతడు అంత భారీ ఆఫర్ను వద్దనుకోవడానికి చూపిన స్పష్టత తానైతే ఆ వయసులో చూపించలేక పోయేదాన్నని ముస్కాన్ పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, లైఫ్స్టైల్ ఆకాంక్షలు, సమాజపు ఒత్తిడి వల్ల సాధారణంగా ఎవరైనా ఆ డబ్బు వైపే మొగ్గు చూపుతారని అన్నారు.నేటి తరం యువత (Gen Z) కేవలం ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాల వెనుక పడకుండా, పని ప్రశాంతత (Work-life balance), మానసిక ఆరోగ్యం మరియు దీర్ఘకాలిక లక్ష్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ఘటన తెలుపుతోందన్నారు.అంతేకాదు రాబోయే రోజుల్లో నిపుణులైన ఉద్యోగులను నిలుపుకోవాలంటే కంపెనీలు తమ పని సంస్కృతిని, వాతావరణాన్ని మార్చుకోక తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్సోషల్ మీడియాలో ఈ పోస్ట్పై నెటిజన్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కోటి ఆఫర్ను తిరస్కరించడం వెనక ఆర్థికంగా బలమైన నేపథ్యం లేదా నెలకు కొంతకాలం ఆదాయం లేకపోయినా ఉండ గలిగే వెసులుబాటు ఉన్నవారికే సాధ్యమని కొందరు వ్యాఖ్యానించగా నా మిడిల్ క్లాస్ మెంటాలిటీకి 45 ఏళ్ల వయసులో కూడా నేను అంత పెద్ద ఆఫర్ను వదులుకోలేను. అలాంటి ఆఫర్లు ఉంటే నాకే రీడైరెక్ట్ చేయండి!" అని ఒక నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. భవిష్యత్తు పని సంస్కృతి రాబోయే రోజుల్లో కేవలం జీతం మాత్రమే కాకుండా ఉద్యోగి మానసిక ఆరోగ్యం, వర్క్ శాటిస్ఫేక్షన్కు ప్రాధాన్యత ఇచ్చే ఉద్యోగులే భవిష్యత్తు కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తారని మరికొందరు సమర్థించారు. ఇదీ చదవండి: లిప్త పాటులో సుఖ్బీర్ ప్రాణాలను కాపాడింది ఈయనే : సర్వత్రా ప్రశంసలు. -
తుది జట్టులో అతడికి నో ఛాన్స్! బిగ్ హింట్ ఇచ్చిన గిల్
భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత ప్లేయింగ్ ఎలెవన్కు సంబంధించి కెప్టెన్ శుభ్మన్ గిల్ బిగ్ హింట్ ఇచ్చాడు. తొలి టెస్ట్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశముంది.రవీంద్ర జడేజా, మానవ్ సుత్తార్, కుల్దీప్ యాదవ్ పేర్లు స్పిన్నర్లగా ఖారారైనట్లు సమాచారం. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్తో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ బంతిని పంచుకోనున్నట్లు గిల్ సంకేతాలు ఇచ్చాడు. దీంతో గుర్నూర్ బ్రార్, జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ అకిబ్ నబీలు బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది."గుర్నూర్ బ్రార్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. పాత బంతితో కూడా అతడు బౌన్స్ రాబట్టగలడు. అయితే మరోవైపు ప్రసిద్ద్ కృష్ణ కూడా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రసిద్ధ్ ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్లో సత్తాచాటాడు. అందుకే వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం నిజంగా కష్టమైన నిర్ణయమే. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ప్రసిద్ద్, బ్రార్ వంటి పేస్ బౌలర్లకు తమ సత్తా చాటుకునేందుకు ఈ సిరీస్ ఒక మంచి అవకాశం" అని గిల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో తన టాలెంట్ను నిరూపించుకోవడంతో గుర్నూర్ బ్రార్ను శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు కూడా ఎంపిక చేశారు. కానీ శ్రీలంక కండీషన్స్ కారణంగా అతడికి తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. లంక పిచ్లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ముగ్గురు ఫుల్ టైమ్ స్పిన్నర్లతో బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది.భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజురైంది. సీదిరి అప్పలరాజుకు సోంపేట కోర్టు.. ఇవాళ(శుక్రవారం) బెయిల్ మంజూరు చేసింది. గత నెల 22న సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే.సీదిరి అప్పలరాజుపై పెట్టిన కేసు రాజకీయ కక్షతోనేనని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది. యాక్సిడెంట్ కేసును.. హత్య కేసుగా మార్చడం, అందులో సీదిరిని ఏ3గా చేర్చి.. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది.వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది.సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు.కాగా, సీదిరి అక్రమ అరెస్టు కేసులో నమోదైన సెక్షన్లు చూసిన వారెవరైనా రోడ్డు ప్రమాదం కేసులో ఇన్ని సెక్షన్లు పెట్టొచ్చా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. యు/ఎస్ 105 ఆర్/డబ్లూ 61(2) అఫ్ బీఎన్ఎస్, 231,238,240, 242,249 ఆర్/డబ్ల్యూ 49బిఎన్ఎస్ సెక్షన్లను సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు బనాయించారంటే దానివెనక ఎంత రాజకీయం నడించిందో ఇట్టే అర్ధమవుతుంది. -
ఘనంగా రమేష్ హాస్పిటల్స్ వార్షికోత్సవ వేడుకలు!
1988 ఆగస్టు 15న కేవలం ఆరు పడకలతో ప్రత్యేక గుండె వైద్య ఆసుపత్రిగా ప్రారంభమైన రమేష్ హాస్పిటల్స్, 38 ఏళ్ల సేవా ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య సంస్థగా ఎదిగింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ప్రాంతానికే చేరువ చేయాలనే లక్ష్యంతో సాగిన ఈ ప్రయాణంలో లక్షలాది మంది రోగుల విశ్వాసాన్ని సంస్థ సంపాదించింది.ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, తిరువూరు కేంద్రాల ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యం, అత్యవసర వైద్యం, క్రిటికల్ కేర్, అవయవ మార్పిడి, డిజిటల్ ఆరోగ్య సేవలు, గ్రామీణ వైద్యం, వైద్య విద్య, పరిశోధన వంటి విభాగాల్లో సేవలు అందిస్తోంది. ఈ 38 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న విజయవాడలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బి. సోమరాజు ముఖ్య అతిథిగా హాజరుకాగా, డాక్టర్ కామినేని పట్టాభి రామయ్య, డాక్టర్ సమరం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను రాయితీలతో మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రూపొందించిన రమేష్ ప్రీమియం హెల్త్ కార్డును ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం.సి. దాస్ ప్రారంభించారు. -
పోలీసులు మీ బండి తీసుకెళ్లారా.. అయితే త్వరపడండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కేసుల్లో జప్తు చేసిన, వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న 2,193 వాహనాలు ప్రస్తుతం పోలీసుల అధీనంలో ఉన్నాయని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ గురువారం పేర్కొన్నారు. వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించామని తెలిపారు. ఆయా వాహనాల వేలంపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, లేదా వాహన యాజమాన్య హక్కులు, ఫైనాన్స్/హైపోథికేషన్ క్లెయిమ్లు ఉన్నవారు సంబంధిత ఆధారాలతో ఆరు నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలని కొత్వాల్ సూచించారు. ఆ సమయంలోపు బంజారాహిల్స్లోని ఐసీసీసీ భవనంలో ఉన్న సిటీ పోలీసు కమిషనరేట్లో దరఖాస్తు సమర్పించి తమ వాహనాలను క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపారు. వేలానికి సిద్ధంగా ఉన్న వాహనాల పూర్తి వివరాలు అంబర్పేట్ పోలీసు ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్ఏఆర్ సీపీఎల్ పోలీసు గ్రౌండ్స్లోని ‘ఆక్షన్ టీమ్’ వద్ద అందుబాటులో ఉన్నాయి. సిటీ పోలీసు అధికారిక వెబ్సైట్ (www.hyderabadpolice.gov.in) ద్వారానూ ఈ వాహనాల వివరాలను పరిశీలించవచ్చని సీపీ ఒక ప్రకటనలో తెలిపారు.చదవండి: మెట్రో ప్రయాణికులకు ఊరట.. 60 కొత్త కోచ్లు! -
నేను తప్పు చేశా.. ఆ రూట్లో వెళ్లొద్దు
డంకీ రూట్లో వెళ్లి మెక్సికోలో చిక్కుకుపోయిన ఓ పంజాబీ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను తప్పు చేశాను.. ఎవరూ ఆ రూట్లో అమెరికాకు వెళ్లొద్దంటూ అభ్యర్థించాడు. ఆ వీడియోలో ఆ యువకుడు ఒక గదిలోని మంచంపై పడుకుని.. చేతులు జోడించి వేడుకుంటూ.. 'డంకీ' మార్గం ద్వారా ఎవరూ మెక్సికోకు రావద్దని విజ్ఞప్తి చేశాడు.ఆ వీడియోలో తాను తప్పించుకోవడానికి ప్రయత్నించిన తర్వాత తనపై దాడి చేశారని ఆ యువకుడు ఆరోపిస్తున్నాడు. తనను ఎంత తీవ్రంగా కొట్టారంటే.. తాను సరిగ్గా నడవలేకపోతున్నానని.. ఇదే పొరపాటును ఎవరూ చేయవద్దంటూ ఆ యుకుకులు పదే పదే విజ్ఞప్తి చేశాడు. సురక్షితంగా తీసుకువెళ్తామని నమ్మించిన ఏజెంట్లు తనపై తీవ్రంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆ యువకుడు.. అలాంటి ఏజెంట్ల మాటలు నమ్మొద్దంటూ హచ్చరించాడు.అయితే, ఆ వీడియోలో అతని పేరు, చిరునామా వెల్లడి కాలేదు. 33 సెకన్ల పాటు ఉన్న ఈ క్లిప్ను ఆగస్టు 13న అప్లోడ్ చేసినట్లు సమాచారం. 'డంకీ' మార్గం ద్వారా ప్రయాణించిన పలువురు యువకులు మెక్సికోలో చిక్కుకుపోయారని.. వారి భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నారని పలు సోషల్ మీడియా పోస్టులు కూడా పేర్కొంటున్నాయి.విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ఉపయోగించే మార్గాన్నే ‘డంకీ’ రూట్గా అంటారు. ఈ పదం.. పంజాబీ వాడుక భాషలో నుంచి వచ్చింది. ప్లానింగ్ లేకుండా ఒకచోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం.. నకిలీ పత్రాలతో షిప్ కంటైనర్లు, వాహనాల సీక్రెట్ కంపార్టుమెంట్లలో దేశ సరిహద్దులు దాటడం అన్నమాట. మంచి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనే కోరిక.. కానీ చదువు, సరైన అర్హతలు లేకపోవడంతో చాలామంది అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు.ముందుగా భారత్ నుండి కెనడాకు టూరిస్ట్ వీసాపై వెళ్తారు. టొరంటో చేరుకున్నాక ఏజెంట్ పిలుపు కోసం హోటళ్లలో వేచి ఉంటారు. అక్కడి నుండి 2,100 కి.మీ దూరంలోని మనిటోబా ప్రావిన్స్కు, ఆపై ఎమర్సన్ గ్రామానికి చేరుకుంటారు. ఇది సరిహద్దు ప్రాంతం. ఇక్కడ 40 డిగ్రీల చలిలో, మోకాళ్ల లోతు మంచులో నడుస్తూ అమెరికాలోకి ప్రవేశిస్తారు. దక్షిణ అమెరికా ద్వారా వెళ్లే ఈ మార్గం అత్యంత భయంకంగా ఉంటుంది. పనామా అడవులు, నదులు, కొండలను దాటాల్సి ఉంటుంది. -
'ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..
పసిబిడ్డలు ఏడిస్తే సహజంగా ఏం చేస్తాం పాలు, లేదా డైపర్ వంటివి తనిఖీ చేస్తాం. ఒకవేళ అవి కాకపోతే భయపడ్డాడేమోనని దగ్గరకి తీసుకోవడం లేదా ఊయల్లో వేసి ఊపడం వంటివి చేస్తే ఆ పసివాడు ఏడుపు ఆపుతాడు. సహజంగా ఎవ్వరైనా ఇలానే చేస్తాం. కానీ ఈసారి నెట్టింట వైరల్ అవుత్తున్న వీడియోలో వ్యక్తి మాదిరి చేసి చూడండి. అంతేగాదు ఈ ఘటన మన ఆధ్యాత్మకి శక్తి గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఉండటం విశేషం. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో క్లిప్లో ఒక తండ్రి ఏడుస్తున్న బిడ్డను పట్టుకుని ..నెమ్మదిగా ఓం శబ్దాన్ని ఆలపిస్తాడు. క్షణాల్లో బిడ్డ ఏదో మత్తువచ్చినట్లుగా శాంతించి నిద్రపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య పేరెంటింగ్ హ్యాక్గా మారింది. కఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్ లైక్లు రావడమే గాక నెటిజన్ల మనసుని దోచుకుంది కూడా."ఓం" అనేది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన ఒక పవిత్రమైన మంత్రం. దీనికి భారతీయ ఆధ్యాత్మికత, యోగ సంప్రదాయాలలో "ఓం"కు సుదీర్ఘ చరిత్ర ఉంది, అక్కడ దీనిని మంత్రంగా, ధ్యానం చేసేటప్పుడు ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ పద్ధతి భారతీయ తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే “ఓం” జపించడం వల్లనే శిశువు ఏడుపు ఆగిపోతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ లయబద్ధమైన శబ్దాలు, పునరావృతమయ్యే ఇంద్రియ అనుభూతి, కదలిక, సంరక్షకుని సాన్నిధ్యం వల్ల శాంతిని చేకూరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఈ ఓం మంత్రపై పరిశోధనలు పెద్దలపైనే జరిగాయి. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో 2022లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ధ్యానంలో ఎటువంటి అనుభవం లేని 33 మంది పెద్దలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఓం జపం చేయడం వల్ల, వాళ్లలో ప్రతికూల భావాలు తగ్గడమే గాక ఆలోచన విధానంలో కూడా మంచి మార్పు వచ్చింది.పేరెంట్స్ ప్రయత్నించొచ్చా?తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, శిశువులలో కడుపునొప్పి, మితిమీరిన ఏడుపు లేదా నిద్ర సమస్యలను 'ఓం' నయం చేస్తుందనడానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. అలాగే, ఈ ధ్వని శిశువు నాడీ వ్యవస్థపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పడానికి కూడా తగినంత ఆధారాలు కూడాలేవు.అయితే శిశువులు తమ సంరక్షకుల స్వరాలకు లయబద్ధమైన ఇంద్రియ అనుభవాలకు అత్యంత వేగంగా స్పందిస్తారు. అందువల్ల, ఈ "ఓం", శిశువులకు జోలపాట లేదా గుసగుసలు లేదా "ష్ష్ష్" వంటి ఊహించదగిన శ్రవణ సంకేతంగా పనిచేయవచ్చునని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శిశువు ఏడుపు ఆపడానికి ఇలాంటి "ఓం" టెక్నిక్ని అనుసరించడంలో సమస్యల లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ దీన్ని ఓ అద్భుత పరిష్కారంగా మాత్రం చూడొద్దని హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by Siqueiros Bolado (@ck.bolado)గమనిక: ఇది కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. అలాగే కొన్ని శబ్దాలు సహజంగా ప్రభావం చూపిస్తాయని అవగాహన కల్పించేందుకు మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది. (చదవండి: ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..) -
రూ.13 వేల కోట్ల కేసు.. డ్రగ్ కింగ్పిన్ అరెస్టు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా కీలక సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు. గత రెండేళ్లుగా పరారీలో ఉంటూ తప్పించుకుని తిరుగుతున్న వీరేందర్ సింగ్ను.. ఎన్సీబీ అధికారులు ఇంటర్పోల్ సాయంతో అదుపులోకి తీసుకుని భారత్కు రప్పించారు. సుమారు రూ. 13 వేల కోట్ల డ్రగ్స్ సంబంధిత కేసులో కింగ్ పిన్గా ఉన్న వీరేందర్ సింగ్ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన కొకైన్, సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు వీరేందర్ సింగ్ బసోయా. దుబాయ్ కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ను నడిపిస్తున్న వీరేందర్ సింగ్ బసోయాను యూఏఈలో అరెస్ట్ చేశారు. భారతీయ, అరేబియా అధికారుల సమన్వయంతో భారత్కు రప్పించిన ఎన్సీబీ.. అదుపులోకి తీసుకుంది.బసోయాను యూఏఈ నుంచి భారత్కు తీసుకు వచ్చిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. విదేశాలలో దాక్కున్న మాదకద్రవ్యాల స్మగ్లర్లను నిర్దాక్షిణ్యంగా వేటాడి, వారి మొత్తం వ్యవస్థను ప్రభుత్వం అత్యంత కఠినమైన పద్ధతితో నాశనం చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపై జీరో టోలరెన్స్ పద్ధతితో ఒక కొత్త మైలురాయిని సృష్టిస్తూ పరారీలో ఉన్న డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ వీరేందర్ సింగ్ బసోయాను యూఏఈ నుంచి భారత్కు రప్పించడంలో ఎన్సీబీ విజయం సాధించింది. డ్రగ్స్ సరఫరా దారులు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని మన ఏజెన్సీలు మరోసారి నిరూపించుకున్నాయి. భారత చట్టాలను వారు ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని విషయం మరోసారి రుజువైంది’ అని పేర్కొన్నారు. Modi govt is relentlessly tracking down drug traffickers hiding abroad and destroying their entire ecosystem with a ruthless approach.Creating a new milestone in the policy of zero tolerance against narcotics, the NCB secured the return of fugitive drug kingpin Virender Singh…— Amit Shah (@AmitShah) August 14, 2026రూ. 13 వేల కోట్ల డ్రగ్స్ సిండికేట్వేల కోట్ల డ్రగ్స్ రాకెట్లో కీలక సూత్రధారిగా ఉన్న బసోయా.. 2023లో తన కుమారుడి వివాహం తర్వాత దేశం విడిచి పారిపోయాడు. ఆ తర్వాత 2024 అక్టోబర్లో ఢిల్లీ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన క్రమంలో బసోయా పేరు తెరపైకి వచ్చింది.2024, అక్టోబర్ 1వ తేదీన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ జాతీయ రాజధానిలోని మహిపాల్పూర్ ఎక్స్టెన్షన్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో వారికి సుమారు 16 కిలోల కొకైన్ లాంటి పదార్థం, 547 కిలోల కొకైన్ మరియు 39.706 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి లభించాయి. అధికారులు తుషార్ గోయల్, హిమాన్షు కుమార్, మరియు ఔరంగజేబ్ సిద్ధిఖీ అనే ముగ్గురిని అరెస్టు చేశారు.రెండు రోజుల తర్వాత, జతిందర్ సింగ్ గిల్ అలియాస్ జస్సీగా గుర్తించిన మరో వ్యక్తిని అమృత్సర్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అక్టోబర్ 5న, పంజాబ్లో అతను ఉపయోగించిన ఫార్చ్యూనర్ వాహనాన్ని సోదా చేయగా, సుమారు 1.096 కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. కోర్టు రికార్డుల ప్రకారం, ఆ వాహనం బసోయా సోదరుడు రవీందర్కు చెందినది గుర్తించారు. అక్టోబర్ 10వ తేదీన, ఢిల్లీలోని రమేష్ నగర్లో 208 కిలోల అనుమానిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ను స్పైసీ స్నాక్స్ ప్యాకెట్లలో దాచి ఉంచారు. తదనంతరం, అక్టోబర్ 13న గుజరాత్లోని అంక్లేశ్వర్లో ఉన్న ఆవ్కర్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణం నుండి 518.18 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు.2026 జనవరిలో అదే సిండికేట్లో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై సిక్కింలో తిలక్ ప్రసాద్ శర్మ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు ఢిల్లీ పోలీసులుఈ మొత్తం నెట్వర్క్కు విదేశాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరేందర్ సింగ్ బసోయాతోపాటు సంసార్ ధునేలు దీనికి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. వీరు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా సామ్రాజ్యం మలేషియా, పాకిస్తాన్, థాయ్లాండ్, దుబాయ్ల వరకు విస్తరించి ఉన్నాయి. వీరు డ్రగ్స్ను ప్రధానంగా దక్షిణ అమెరికా నుండి దుబాయ్ మీదుగా భారతదేశానికి తీసుకువచ్చేవారు. బసోయా విదేశాల నుంచి తన నెట్వర్క్ను కొససాగిస్తూ తప్పించుకుని తిరుగుతూ తన డ్రగ్స్ మాఫియాలో కింగ్పిన్గా మారిపోయాడు. సుమారు రూ. 13,000 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా కేసులో వీరేందర్ బసోయా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు..అక్టోబర్ 10న, ఢిల్లీలోని రమేష్ నగర్లో 208 కిలోల అనుమానిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ను స్పైసీ స్నాక్స్ ప్యాకెట్లలో దాచి ఉంచారు. తదనంతరం, అక్టోబర్ 13న గుజరాత్లోని అంక్లేశ్వర్లో ఉన్న ఆవ్కర్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణం నుండి 518.18 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
కెప్టెన్గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం: శుబ్మన్ గిల్
శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్లో ఆతిథ్య జట్టును 2-0తో వైట్వాష్ చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తొలి టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు.కెప్టెన్గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం‘‘కెప్టెన్గా నా పాత్రలో నేను ఎంతో సౌకర్యవంతంగానే ఉన్నాను. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడమే మా లక్ష్యం. అందుకోసం మేము ఆరు నుంచి ఏడు టెస్టులు గెలవాల్సి ఉంది. కాబట్టి శ్రీలంక నుంచే ఆ పని మొదలుపెడతాము’’ అని గిల్ పేర్కొన్నాడు.నాకు దక్కిన గొప్ప గౌరవంఅదే విధంగా.. ‘‘చారిత్రక 600వ టెస్టులో నాయకుడిగా టీమిండియాను ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అది కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజు కావడం మరింత విశేషం’’ అని గిల్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక.మా జట్టుతో సంతృప్తిగానే ఉన్నాంకాగా శ్రీలంకతో టెస్టు సిరీస్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)పై వస్తున్న విమర్శలపై గిల్ స్పందించాడు.‘‘మేము CoEతో తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్ల గాయాల గురించి అప్డేట్లు తెలుసుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ సాయి సుదర్శన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అతడిని టెస్టు మ్యాచ్లో ఆడించి రిస్క్ తీసుకోలేము. మా జట్టులో ఉన్న పదిహేను మంది సభ్యులతో ప్రస్తుతం సంతృప్తిగానే ఉన్నాము’’ అని గిల్ పేర్కొన్నాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..ఇదిలా ఉంటే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. తాజా సీజన్లో మిగిలిన తొమ్మిది మ్యాచ్లలో కనీసం ఆరు మ్యాచ్లు తప్పక గెలవాల్సిందే. ఇందులో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కాస్త ఈజీ టార్గెట్. ఆ తర్వాత, న్యూజిలాండ్తో రెండు, ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.వీటిలో కనీసం ఆరు గెలవడంతో పాటు రెండు డ్రా చేసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఏడు టెస్టులు గెలవాలి. ఇక ఈ సీజన్లో ఇప్పటికి టీమిండియా తొమ్మిది టెస్టులు పూర్తి చేసుకుని.. నాలుగు గెలిచి.. నాలుగు ఓడిపోయి.. ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. -
మిచెల్ స్టార్క్ మరో అరుదైన ఘనత.. కపిల్దేవ్ రికార్డ్ బ్రేక్
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మరో అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టార్క్ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్ (434)ను మిచెల్ అధిగమించాడు.డార్విన్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో లిట్టన్ దాస్ వికెట్తో స్టార్క్ ఈ ఫీట్ సాధించాడు. స్టార్క్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్లో 106 మ్యాచ్లు ఆడి 435 వికెట్లు పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు పడగొడితే డేల్ స్టెయిన్ (439) రికార్డును కూడా దాటేసి టాప్-5లోకి అతడు అడుగుపెడతాడు.ప్రస్తుతం స్టార్క్ ఆరో స్ధానంలో ఉన్నాడు. అయితే టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఎడమ చేతి వాటం బౌలర్గా మాత్రం స్టార్క్నే కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ల జాబితాలో జేమ్స్ అండర్సన్(704) అగ్రస్ధానంలో ఉన్నాడు.టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్లు:జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్) – 704స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) – 604గ్లెన్ మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) – 519డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) – 439మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 435*కపిల్ దేవ్ (భారత్) – 434ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆతిథ్య ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. బంగ్లా జట్టు ప్రస్తుతం 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. -
సమంత మా ఇంటి బంగారం.. మరో ఓటీటీలో స్ట్రీమింగ్
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. జూన్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్ స్టార్ వేదికగా సౌత్ భాషల్లో అందుబాటులో ఉంది.తాజాగా మా ఇంటి బంగారం క్రేజ్ దృష్ట్యా మరో ఓటీటీకి వచ్చేసింది. సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ మూవీ హిందీ ఓటీటీ రైట్స్ను సోని లివ్ కొనుగోలు చేసింది. ఇక హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. Ek parivaar. Ek raaz. Aur ek bangaaram bahu, jo sab badal degi 🔥Action Queen Samantha's Maa Inti Bangaaram (Hindi) is streaming now on SonyLIV pic.twitter.com/hyW4jWO7lm— Sony LIV (@SonyLIV) August 14, 2026 -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 70.71 పాయింట్లు లేదా 0.091 శాతం నష్టంతో 78,009.25 వద్ద, నిఫ్టీ 29.85 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 24,366.00 వద్ద నిలిచాయి.జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్, ఓలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు!
తరచుగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి, తాజాగా ఉద్యోగ జీవితం గురించి చెప్పారు. ''జీవితం అంటే కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేసి, నెలాఖరులో జీతం తీసుకోవడమేనా?'' అని ప్రశ్నించారు.చాలామంది చిన్నప్పటి నుంచి ఒకే విధమైన మార్గంలో వెళ్తుంటారు. చదువు.. ఉద్యోగం.. జీతం.. ఖర్చులు.. మళ్లీ ఉద్యోగం. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. మనం డబ్బు సంపాదిస్తున్నాం, కుటుంబాన్ని చూసుకుంటున్నాం, బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. కానీ ఒక సమయంలో మనల్ని మనమే ''నేను అసలు ఎందుకు ఇలా జీవిస్తున్నాను? నా జీవితానికి అర్థం ఏమిటి?'' అని బహుశా ఆలోచించకపోవచ్చు.ఇదే విషయాన్ని కియోసాకి చెబుతూ.. నేను పని చేస్తున్నానంటే, అది ''కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రం కాదు. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చేస్తున్నా'' అని పేర్కొన్నారు. అంటే మనం చేసే పని మనకు డబ్బు మాత్రమే కాకుండా, ఒక సంతృప్తిని, ఒక ఉద్దేశ్యాన్ని కూడా ఇవ్వాలని ఆయన ఉద్దేశ్యం.కియోసాకి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. కొందరు ఆయన మాటలతో ఏకీభవించినప్పటికీ.. మరికొందరు వ్యతిరేకించారు.చాలామంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించడం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అని అన్నారు. జీవిత లక్ష్యం అంటే ఏదో పెద్ద విజయం సాధించడంలో దొరకదు. కొన్నిసార్లు, ఒక సాధారణ పనిని నిలకడగా, చక్కగా చేయడంలో కూడా అది లభిస్తుందని ఇంకొందరు అన్నారు.9 to 5 for just $?Found it interesting my last X had so few loves relative to number of views.My previous X was dedicated to working to fulfill your spirit’s mission…your life’s purpose….for the gift of life.Working 9 to 5 just for $…seems to me…. to be an empty life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 14, 2026 -
బాలీవుడ్పై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు
40ఏళ్లుగా సినిమా, బుల్లితెర రంగాల్లో రాణిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటి కిటు గిద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. బాలీవుడ్లో స్పష్టమైన నిబంధనలు లేవని.. అది అసలు నిజమైన ఇండస్ట్రీ కాదని వ్యాఖ్యానించారు.‘పదేళ్లు పనిచేసిన నటికి మరో పదేళ్లు హుందాగా జీవించే అవకాశం ఉండాలి. కానీ మన దగ్గర ( బాలీవుడ్లో) అలాంటి పరిస్థితి లేదు. నటీనటులకు ఒకేసారి పారితోషికం చెల్లించి, సినిమాపై ఉన్న అన్ని హక్కులను నిర్మాతలే ఉంచుకుంటారు. వయసు పెరిగిన మహిళలకు ఇండస్ట్రీలో సరైన పాత్రలు రావడంలేదు. టెలివిజన్లో 30 ఏళ్లు దాటిన మహిళలను అమ్మమ్మ పాత్రల్లో చూపించడం విచిత్రంగా ఉంది. ముఖంపై వృద్ధాప్యం ఛాయలు లేకపోయినా అలాంటి పాత్రలే ఇస్తున్నారు’ అని అన్నారు.1980,90 కాలంలో బుల్లితెర, సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిటు గిద్వానీ. ‘హోళీ’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం ‘ఎయిర్ హోస్టెస్’, ‘స్వాభిమాన్’, ‘శక్తిమాన్’ వంటి సిరియాల్లో నటించారు. ‘ఫ్యాషన్’, ‘ధోబీ ఘాట్’ ‘జానే తు యా జానే నా’ వంటి చిత్రాల్లోనూ నటించారు. -
లిప్త పాటులో సుఖ్బీర్ ప్రాణాలను కాపాడింది ఈయనే : సర్వత్రా ప్రశంసలు
మహారాష్ట్రలోని నాందేడ్లోని మాతా సాహిబ్ గురుద్వారాను సందర్శించి బయటకు వస్తున్న శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై గురువారం మధ్యాహ్నం జరిగిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్న బాదల్ సర్జరీ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.మహారాష్ట్ర పోలీసు భద్రతా బృందానికి చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ సంతోష్ వైజ్నాథ్ కేంద్రే సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే బాదల్ ఈ పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోగలిగారు. దీంతో పోలీసు అధికారి నెట్టింట విశేషంగా నిలుస్తున్నారు. సమయానికి స్పందించి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్న ఇన్స్పెక్టర్ కేంద్రే , మహారాష్ట్ర పోలీసు బృందంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.ఎలా కాపాడారు? గురుద్వారాలో పనిచేసే జస్పాల్ సింగ్ అనే నిహంగ్ సిఖ్, తన శాలువా కింద కిర్పాన్ (కత్తి) దాచుకుని సుఖ్బీర్ సింగ్ బాదల్ పొట్టలో పొడవడానికి యత్నించాడు. అయితే అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్ కేంద్రే క్షణాల వ్యవధిలో స్పందించి దుండగుణ్ని అడ్డుకుని కిందకు పడేసారు. ఈ క్రమంలో బాదల్ చేతికి స్వల్ప గాయమైంది. అలాగే ఇన్స్పెక్టర్ కేంద్రే చేతికి కూడా గాయమైంది. పోలీసులు వెంటనే నిందితుడు జస్పాల్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు.హరి సిమ్రత్ కౌర్ కృతజ్ఞతలుఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్స్పెక్టర్ కేంద్రేను సుఖ్బీర్ సింగ్ బాదల్ భార్య హరి సిమ్రత్ కౌర్ సందర్శించి కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త ప్రాణాలు కాపాడినందుకు ప్రత్యుపకారంగా ఏదైనా చేయగలనా అని ఆమె ప్రశ్నించినపుడు "ఇది నా బాధ్యత. ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికే మాకు శిక్షణ ఇస్తారు. స్పందించడానికి నాకు క్షణకాలం మాత్రమే సమయం లభించింది, నా విధిని నేను నిర్వహించాను" అని కేంద్రే వినమ్రంగా బదులిచ్చారు.ఎవరీ కేంద్రే 2001లో మహారాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుల్గా చేరిన సంతోష్ కేంద్రే, ఆ తర్వాత ప్రమోషన్లు పొంది ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు.ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్మరోవైపు పంజాబ్ను స్వాధీనం చేసుకోవాలని, రాష్ట్రంలో శాంతిని భంగం చేయాలని చూస్తున్నారని, కానీ అకాలీదళ్ నేతగా ఆ పరిస్థితి రానివ్వబోనని సుఖ్బీర్ సింగ్ వెల్లడించారు. రెండు సార్లు పవిత్రమైన ప్రదేశాల్లో తనపై అటాక్ జరిగిందని, అయినా తానెప్పుడూ భయపడలేదని, ఇప్పుడూ భయపడలేదన్నారు. పంజాబీల సంక్షేమానికి శిరోమణి అకాలీదళ్ కట్టుబడి ఉందన్నారు. కాగా 2024 డిసెంబర్లో కూడా సుఖ్బీర్ బాదల్పై గోల్డెన్ టెంపుల్లో కూడా హత్యాయత్నం జరిగింది. ఈ రెండు ఘటనలనుంచి ఆయనపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్ -
దాడి తర్వాత అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ రియాక్షన్ ఇదే
నాందేడ్: తాను భయపడే ప్రసక్తే లేదని అకాలీదళ్ చీఫ్, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. తనపై జరిగిన దాడిని ఆయన కుట్రగా అభివర్ణించారు. పంజాబ్ శాంతిభద్రతలను అస్థిరపరిచే కుట్ర జరుగుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అకాలీదళ్ కట్టుబడి ఉందన్నారు.మహారాష్ట్రలోని నాందేడ్లో తనపై జరిగిన దాడి ఘటనపై ఆయన ఇవాళ(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం తమ పార్టీ ఎలాంటి బలిదానానికైనా సిద్ధంగా ఉందని.. అయితే పంజాబ్ శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమంటూ తేల్చి చెప్పారు. పంజాబ్ ప్రగతి, మతసామరస్యం, ఐక్యత తమ మొదటి ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు.నాందేడ్లోని ఓ గురుద్వారాను తన కుటుంబంతో కలిసి దర్శించుకునేందుకు వెళ్లిన సమయంలో జస్పాల్ సింగ్ అనే వ్యక్తి చిన్నకత్తితో సుఖ్బీర్ సింగ్ బాదల్ దాడికి యత్నించాడు. అయితే ఆయనతో పాటు ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ కావడంతో బాదల్ కుడి చేతికి గాయమైంది. దాడి చేసిన నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోగా.. అతడు పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత రెండేళ్లుగా ఆ గురుద్వారాలో సేవకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. జగపతిబాబు 'వదలా', హార్టిన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫారెస్ట్ గార్డ్ లాంటి తెలుగు మూవీస్తో పాటు రష్మిక 'కాక్ టెయిల్ 2', కాటలన్, భారత భాగ్య విధాత, ఆరూపి లాంటి పరభాషా చిత్రాలు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటికి తోడుగా మరో తెలుగు మూవీ దాదాపు ఏడు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)'పల్సర్ బైక్' పాటతో ఫేమస్ అయిన సింగర్ రమణ, ప్రశాంత్ ప్రధాన పాత్రలు చేసిన రూరల్ యాక్షన్ డ్రామా 'వినరా ఓ వేమ'. ఈ ఏడాది జనవరి 2న థియేటర్లలో రిలీజైంది. ప్రశాంత్ కల్యాణ్-రాజు మద్దెల సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కంటెంట్ ఓ మాదిరిగా ఉండటం, స్టార్స్ లేకపోవడంతో దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడిది ఏడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.గతేడాది నవంబరు 14న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'గోపీగాళ్ల గోవా ట్రిప్'.రోహిత్ & శశి దర్శకత్వం వహించగా అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పుడీ కామెడీ చిత్రం ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఉయిర్' తెలుగు రివ్యూ) -
క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డ్
స్కాట్లాండ్ యంగ్ ఆఫ్స్పిన్నర్ లైల్ రాబర్ట్సన్ తన అంతర్జాతీయ కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో భాగంగా డండీ వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన రాబర్ట్సన్.. అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏకపక్ష పోరులో రాబర్ట్సన్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన 10 ఓవర్ల కోటాలో 52 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా వన్డేల్లో డెబ్యూ మ్యాచ్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన చేసిన స్పిన్నర్గా రాబర్ట్సన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్పిన్నర్ అరాఫత్ మిన్హాస్ (5/32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో అరాఫత్ను 23 ఏళ్ల రాబర్ట్సన్ అధిగమించాడు.ఓవరాల్గా వన్డే డెబ్యూలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్గా కగిసో రబాడ వంటి దిగ్గజాలు సరసన ఈ స్కాటిష్ స్పిన్నర్ నిలిచాడు. ఈ జాబితాలో తన సహచర ఆటగాడు చార్లీ క్యాసెల్ ఉన్నాడు. 2024లో ఒమన్తో జరిగిన మ్యాచ్లో క్యాసెల్ 21 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో రాబర్ట్సన్ మరో వికెట్ పడగొట్టి ఉండింటే క్యాసెల్ రికార్డును సమం చేసేవాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడాను రాబర్ట్సన్ దెబ్బతీశాడు. అతడి స్పిన్ ధాటికి కెనడా 177 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా స్కాట్లాండ్ 170 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాటిష్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.చదవండి: స్మిత్ ప్రపంచ రికార్డు.. భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్! -
మెట్రో ప్రయాణికులకు ఊరట.. 60 కొత్త కోచ్లు!
సాక్షి, హైదరాబాద్: కొత్త కోచ్లపై హైదరాబాద్ మెట్రో రైల్ దృష్టి సారించింది. కోచ్ల నిర్మాణ సంస్థ ఎంపికలో సంప్రదింపులకు త్వరలో కన్సల్టెన్సీని నియమించనుంది. ఈ మేరకు ఆన్లైన్ బిడ్డింగ్ నోటిఫికేషన్ వెలువరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం జరిగిన హెచ్ఎంఆర్ఎల్ పాలకమండలి సమావేశంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ ఇదే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరితగతిన కొత్త కోచ్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.ప్రయాణికుల డిమాండ్ మేరకు కొత్తగా 60 బోగీలను కొనుగోలు చేయాలని గత పాలకమండలి సమావేశంలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. గురువారం సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు అధికారులు చెప్పారు. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్రంజన్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.ప్రస్తుతం మెట్రో రైళ్లు 3 బోగీలతో రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులకు రద్దీ మేరకు ప్రతి మెట్రోకు అదనంగా మరో 3 బోగీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ప్రతిపాదించారు. మరోవైపు మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన 5 మార్గాలపైనా జనరల్ కన్సల్టెన్సీలను నియమించేందుకు హెచ్ఎంఆర్ఎల్ చర్యలు చేపట్టింది. చదవండి: టీడీఆర్పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం -
ఈ హీరోలు గుర్తున్నారా? ఇంతకీ ఏమయ్యారు?
ఇండస్ట్రీలో సరైన అవకాశాలు కోసం వేలమంది కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. మరికొందరు మాత్రం వచ్చిన ఛాన్సులని సరిగా నిలుపుకోలేక ఇబ్బందిపడుతుంటారు. ఇండస్ట్రీ అంటేనే అలాంటిది మరి. హీరోహీరోయిన్ల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. అసలు విషయానికొస్తే.. హిట్స్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు వైష్ణవి తేజ్, కార్తికేయ గత కొన్నేళ్ల నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ వీళ్లు ఏమయ్యారు? అసలేం చేస్తున్నారు?(ఇదీ చదవండి: బాసూ.. ఆ సినిమాని మర్చిపోయారా?)మొదటగా వైష్ణవ్ తేజ్ విషయానికొద్దాం. 'మెగా' హీరో అనే ట్యాగ్ వల్ల పెద్దగా కష్టం లేకుండానే హీరో అయిపోయాడు. తొలి సినిమా 'ఉప్పెన'తో సక్సెస్ అందుకోవడమే కాకుండా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి అప్పట్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాడు. కానీ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ అని మూడు చిత్రాలు చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.2023లో 'ఆదికేశవ'తో చివరగా కనిపించిన వైష్ణవ్ తేజ్.. తర్వాత మరో సినిమా చేయలేదు. మధ్యలో మారుతి అని మరో దర్శకుడు అని పలువురు పేర్లు వినిపించాయి కానీ ఏది ఖరారైతే కాలేదు. మధ్యలో ఓ హీరోయిన్తో ప్రేమ, డేటింగ్ రూమర్స్ వచ్చాయి కానీ వీటిలో ఎంత నిజముందో తెలీదు. యాక్టింగ్ కాకుండా వేరే ఏమైనా చేస్తున్నాడనేది కూడా తెలీదు. వైష్ణవ్ సోదరుడు సాయిధరమ్ తేజ్ అయితే ప్రస్తుతం 'సంబరాల ఏటిగట్టు' అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా అప్పుడెప్పుడో మొదలైంది. షూటింగ్ అలా నడుస్తూనే ఉంది. ఎప్పుడొస్తుందనే అప్డేట్ లేదు.వైష్ణవ్ లానే కెరీర్ ప్రారంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో హీరో కార్తికేయ. 2017లో 'ప్రేమతో మీ కార్తిక్' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. 2018లో రిలీజైన 'ఆర్ఎక్స్ 100' ఇతడి జీవితాన్ని మార్చేసింది. హిట్ అవ్వడంతో పాటు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ఊపులో హీరో కమ్ విలన్గా గ్యాంగ్ లీడర్, వలిమై, బెదురులంక 2012, చావు కబురు చల్లగా, 90ఎమ్ఎల్ తదితర చిత్రాలు చేశాడు. ఫలితాలతో సంబంధం లేకుండా నటుడిగా పేరు సంపాదించాడు.2024లో 'భజే వాయువేగం'తో సక్సెస్ అందుకున్న కార్తికేయ.. తర్వాత నుంచి పూర్తిగా కనిపించడం మానేశాడు. బిజినెస్లోకి ఎంటరయ్యాడని అందుకే యాక్టింగ్ పెట్టేశాడని కొందరు అంటుండగా.. లేదు లేదు స్వయంగా దర్శకుడిగా మారి కొత్త ప్రాజెక్టుతో త్వరలో రాబోతున్నాడని మరికొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం హిట్ కొట్టిన ఇద్దరు యంగ్ హీరోలు ఇలా సినిమాలు చేయకుండా ఉండిపోవడం కాస్త విచిత్రంగానే ఉంది. మరి ఇండస్ట్రీకి దూరమైపోయారా? లేదంటే త్వరలో రీఎంట్రీ ఇస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. ఫోన్లో ఫొటోలు తీసుకోను: నాగ్) -
ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..
పాత్రికేయ రంగం అంటేనే సంఘర్షణలతో ముడిపడి ఉంటుంది. ఏది పడితే అది రాసే అవకాశం ఉండదు. అధికారులకు అననుకూలంగా రాసామో అంతే సంగతులు. అలాంటి రక్షణలేని వృత్తి ఇది. ఎప్పుడు మీడియా గొంతును నొక్కేసేలా దాడులు, కక్ష సాధింపు చర్యలు ఉంటూనే ఉంటాయి. కానీ తొలిసారిగా మహిళల హక్కులు, ప్రకృతి విపత్తుల కోసం చాలా చురుకుగా ప్రపంచానికి తెలియజేసే ఓ ఫోటో జర్నలిస్ట్ జైలు పాలవ్వడమే కాదు ఎన్నే ఏళ్లు జైలు శిక్ష విధించారో తెలిస్తే కంగుతింటారు. పైగా పాత్రికేయరంగంలో ఇన్ని సవాళ్లు ఉంటాయా అనిపిస్తుంది. మంచి జరగాలని ప్రయత్నిస్తే మొత్తానికి వాళ్ల కథే ముగిసిపోతుంది అనేలా అయ్యింది ఈ జర్నలిస్ట్ పరిస్థితి.ఇరాన్ దేశల్లో నిరసనలు, మహిళలు జీవితాలను డాక్యుమెంట్ చేయడంలో పేరుగాంచిన ఫోటో జర్నలిస్ట్కి జైలుపాలవ్వడమే కాదు ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష విధించారు. 2025లో ఇరాన్ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం ఈ శిక్షణు విధించింది. ఇది గూఢచర్యం, శత్రుదేశాల సహకారాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన చట్టం. ఆమెపై జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారనే ఆరోపణలతో టెహ్రాన్ కోర్టు ఈ శిక్ష విధించింది. ఆమె ఇరాన్ అధికారులకు ప్రతికూలంగా ఉండే మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారని, యూఎస్ ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న సంస్థలకు ఫోటోలు అందించారని ఆరోపణలతో ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఇరాన్ అంతరంగిక వర్గాల సమాచారం. అంతేగాదు ఇంటెలిజెన్స్ వింగ్ సభ్యులు ఆమె ఇంటిపై దాడిచేసి, ల్యాప్టాప్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కనీసం ఆమె కేసుకి సంబంధించిన కాఫీలు కూడా ఇవ్వకుండా కోర్టు ముందుంచి ఈ శిక్ష విధించడం గమనార్హం. ఇదిలా ఉండగా మోయిరీ ఇరాన్లో వైమానిక దాడుల వల్ల జరిగిన నష్టాన్ని చూపించే ఫోటోల తోపాటు తన పనికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా మోయిరీపై ఇరాన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఇదేమి ఆమెకు మొదటి జైలు శిక్ష కాదు, గతంలో ఘర్చక్ జైలులో రెండేళ్లు శిక్షఅనుభవించింది. అలాగే 2022లో, పోలీసు కస్టడీలో మహ్సా అమినీ మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా "స్త్రీ, జీవితం, స్వేచ్ఛ" నిరసనలను కవర్ చేసినందుకు గానూ ఏకంగా ఎనిమిది నెలలు జైలు శిక్ష విధించగా మూడేళ్లు శిక్ష అనుభవించి క్షమాభిక్ష అనంతరం విడుదలైంది. తాజాగా మరోసారి సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటుండటం గమనార్హం. (చదవండి: అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా రక్తంతో ఫేషియల్..! అందం కోసం ఇంత పెయిన్ తప్పదా?) -
స్టాండప్ కమెడియన్కు భారీ ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి,న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హాస్యనటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు భారీ ఊరట నిచ్చింది. సమయ్తో పాటుమరో నలుగురిపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ స సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ జె.వి. మోహనలతో కూడిన ధర్మాసనం, రైనాతదితరులు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడాన్ని గమనించి, వారిపై ఉన్న అన్ని కేసులను కొట్టి వేసింది.ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో చేసిన వ్యాఖ్యలక గాను, రైనాతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అసభ్యకరమైన జోకులపై గతంలోనే రైనాను మందలించిన కోర్టు, దివ్యాంగుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నిధులు సేకరించాలని రైనాను ఆదేశించింది. గత విచారణ సందర్భంగా, చేసిన తప్పులను సరిదిద్దుకుంటామని ఇచ్చిన హామీలను పాటించకుండా రైనా కోర్టును మోసం చేశారంటూ కోర్టు రైనా, మరో నలుగురిపై రూ. 3 లక్షల జరిమానా విధించింది.ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్కాగా ఈ షోలో స్పైనల్ మస్కులర్ అట్రోఫీ చికిత్సకు అయ్యే అధిక ఖర్చుపై రైనా సున్నితత్వం లేని వ్యాఖ్యలు చేశారని, అలాగే అటువంటి వైకల్యం ఉన్న వ్యక్తిని ఎగతాళి చేశారని ఆరోపిస్తూ క్యూర్ SMA ఇండియా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించిన రైనాతో పాటు, ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైన విపున్ గోయల్, బల్ రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి థక్కర్ , నిశాంత్ జగదీష్ తన్వర్లు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఈ పిటిషన్లో ప్రస్తావించారు.ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్ -
టీడీఆర్పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీఆర్ (Transferable Development Rights)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్ సర్టిఫికెట్ల జారీ బాధ్యత హెచ్ఎండీకే అప్పగించిన ప్రభుత్వం.. హెచ్ఎండీఏ పరిధిలోని క్యూర్, ఫ్యూర్ ప్రాంతాల్లో వర్తిస్తుందని స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోనూ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ప్రజా ప్రయోజన ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారికి టీడీఆర్ సర్టిఫికెట్లను ప్రభుత్వం ఇవ్వనుంది. హెచ్ఎండీఏ జారీ చేసే టీడీఆర్ను హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగం, డిస్పోజల్కు అవకాశం ఉంది. టీడీఆర్ సర్టిఫికెట్ల ప్రాసెసింగ్ పూర్తిగా ఆన్లైన్లోనే జరగనుంది. బిల్డ్ నౌ వ్యవస్థలో అవసరమైన మార్పులను ప్రభుత్వం చేయనుంది. -
ముందు బయటకు నడువ్: మిరాజ్పై స్టార్క్ ఆగ్రహం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తోంది. తొలి టెస్టులో ఆల్రౌండ్ ప్రదర్శనతో కంగారూలపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బంగ్లా జట్టు తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్లో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ కంగారూలకు చుక్కలు చూపించాడు.198 పరుగులకే ఆలౌట్మహమూద్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 71 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన బంగ్లా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితికి చేరుకుంది.తంజిద్ సెంచరీమొత్తంగా 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బంగ్లా 351 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ సెంచరీ (101)తో కదం తొక్కగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో 84 పరుగులతో రాణించాడు. ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ 32, హసన్ మహమూద్ 13 పరుగులతో క్రీజులో నిలిచారు.ముందు బయటకు నడువ్ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సహనం కోల్పోయాడు. మెహదీ హసన్ మిరాజ్తో వాగ్వాదానికి దిగాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో 105 ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్లో స్టార్క్ వేసిన ఐదో బంతిని మిరాజ్ థర్డ్మాన్ దిశగా బాది సింగిల్కు వెళ్లాడు.ఈ క్రమంలో మిరాజ్ పిచ్ (డేంజర్ ఏరియా) మధ్య నుంచి పరుగు తీశాడు. దీంతో స్టార్క్ కోపంతో ఊగిపోతూ.. ‘ముందు వికెట్ మీది నుంచి బయటకు నడువు’ అని హెచ్చరించాడు. ఇందుకు మిరాజ్ గట్టిగానే బదులిచ్చాడు. స్టార్క్ అడ్డుగా ఉండటం వల్లే తాను పిచ్ మధ్యలోకి పరుగు తీయాల్సి వచ్చిందని అంపైర్ కుమార్ ధర్మసేనకు చెప్పాడు.అంపైర్ కూడా వార్నింగ్ ఇచ్చాడుదీంతో స్టార్క్, మిరాజ్లను విడదీసిన ధర్మసేన.. మిరాజ్కు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే రెండుసార్లు పిచ్ డేంజర్ జోన్లోకి వచ్చావని.. మరోసారి గనుక ఇది పునరావృతమైతే జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ పడుతుందని హెచ్చరించాడు. "Get off the wicket!"Mitchell Starc and Mehidy Hassan Miraz had a heated exchange in #AUSvBAN: https://t.co/854LsTds7l pic.twitter.com/fTJtsn4px8— cricket.com.au (@cricketcomau) August 14, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో స్టార్క్ ఇప్పటికి రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం (20), వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (0)లను అవుట్ చేశాడు.చదవండి: స్మిత్ ప్రపంచ రికార్డు -
ఏఐ జగత్తులో టాలెంట్ వార్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త ప్రాభవం అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలను విస్మయానికి గురిచేస్తోంది. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, ప్రముఖ ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సల్ను తమ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా రూ.800 కోట్ల (100 మిలియన్ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు వెలువడిన నివేదికలు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశమయ్యాయి. ఒక ఏఐ పరిశోధకుడికి ఈ స్థాయిలో పారితోషికం దక్కడం అంతర్జాతీయ సాంకేతిక చరిత్రలో అరుదైన ఘట్టం.ఎవరీ త్రపిత్ బన్సల్?త్రపిత్ బన్సల్ విజయం రాత్రికి రాత్రే సాధ్యమైంది కాదు; ఇది దశాబ్దానికి పైగా సాగిన కఠోర సాధన, నాణ్యమైన పరిశోధనల ఫలితం. 2007-2012 మధ్య ఐఐటీ కాన్పూర్ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేసిన బన్సల్, అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు. తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పట్టా పొందారు.తన పరిశోధనా కాలంలో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థల్లో ఇంటర్న్షిప్లు చేస్తూ డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) రంగాల్లో విశేష అనుభవాన్ని గడించారు. 2022లో ఓపెన్ఏఐలో చేరిన బన్సల్.. సంస్థ సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుత్సకెవర్తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఓపెన్ఏఐ అత్యంత సాంకేతిక సంక్లిష్టమైన రీజనింగ్ మోడల్ ‘ఓ1’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి గ్లోబల్ ఏఐ వర్గాల్లో గుర్తింపు పొందారు.మెటా ఎందుకింత భారీ ఆఫర్ ఇచ్చింది?ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్’ (ఏజీఐ), సూపర్ ఇంటెలిజెన్స్ సాధించేందుకు గూగుల్, మెటా, ఓపెన్ఏఐల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా, తమ 'సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్'ను బలోపేతం చేసేందుకు అత్యుత్తమ మేధావులను ఆకర్షిస్తోంది. బన్సల్కు ఉన్న మ్యాథమెటికల్ పునాది, అడ్వాన్స్డ్ ఏఐ రీజనింగ్ మోడళ్లపై ఉన్న అసాధారణ పట్టు మెటా వ్యూహాలకు కీలకంగా మారుతాయని కంపెనీ భావిస్తోంది.యువతకు సందేశంకోడింగ్ షార్ట్కట్లు, స్వల్పకాలిక కోర్సులతో కొన్ని విజయాలు సాధించాలనుకునే ఈ డిజిటల్ యుగంలో.. సుదీర్ఘ అధ్యయనం, ప్రాథమిక విజ్ఞానం, నిరంతర పరిశోధన మాత్రమే అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయని త్రపిత్ ప్రయాణం నిరూపిస్తోంది. సబ్జెక్టుపై తిరుగులేని నైపుణ్యం ఉంటే ప్రపంచమే మన కోసం వస్తుందని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ : ఖలిస్తాన్ బెదిరింపుల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ 80వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలకు బాంబు బెదరింపు కలకలం రేపింది. శుక్రవారం నాడు ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అనేక ఇతర ప్రదేశాలకు ఖలిస్తాన్ పేరుతో బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఢిల్లీని ఖలిస్తాన్గా మారుస్తామని ఆ బెదిరింపు ఇమెయిల్లో పేర్కొన్నారు.సిక్కుల కోసం ఖలిస్తాన్ అనే పేరుతో ఒక స్వతంత్ర సార్వభౌమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకునే వేర్పాటువాద ఉద్యమ ఖలిస్తాన్ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారని ఆ ఇమెయిల్లో పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 2:11 గంటలకు ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుతుంది, ఆ తర్వాత గంటకే జిల్లా కోర్టులలో పేలుళ్లు జరుగుతాయి. ఢిల్లీ కోర్టులు సిక్కులకు వ్యతిరేకంగా ఉన్న కేసులను మాత్రమే వింటాయంటా విమర్శలు గుప్పించడం గమనార్హం. జామ్నగర్ హౌస్, ఝండేవలన్ భవనం, సాకేత్ కార్యాలయం, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టెర్మినల్ 3, ఢిల్లీ కంటోన్మెంట్లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) కార్యాలయంతో సహా మరో ఆరు ప్రదేశాలకు కూడా బెదిరింపులొచ్చినట్టు సమాచారం. ఢిల్లీ మెట్రో, అంబాలా వెళ్లే రైళ్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారును భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రాంతాలకు అగ్నిమాపక వాహనాలను పంపారు. అయితే ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్ -
సాగునీరు ఇచ్చే సన్నద్ధత లేదా?
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో నీటి నిల్వలు పడి పోయాయనీ, అందువల్ల కృష్ణా డెల్లాకు సాగునీరు ఇవ్వలేమనీ జూలై 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రకటించింది. వరి పంట వేయ వద్దనీ, వరి పంట వేస్తే తర్వాత నీరు లేక నష్టపోయేది రైతులేననీ హెచ్చరిక జారీ చేశారు మంత్రిపుంగవులు. ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాభావంతో పాటు కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఖరీఫ్కు చాలాముందే ప్రకటించారు. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కాని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదు.జూన్– జూలై నెలల మధ్య సాగు నీరు విడుదల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. జూన్ నెలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు నీరు విడుదల తేదీలను కూటమి మంత్రులు ప్రకటించారు. మంత్రుల ప్రకటనతో అప్పులు చేసి సేద్యానికి కావాల్సిన వనరులను రైతులు సమకూర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల ఇప్పుడు సాగు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం వల్ల రైతాంగం తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నారు.జల వనరుల వ్యవస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రకాశం బ్యారేజి నీటి నిల్వ 2.978 టీఎమ్సీలు కాగా, పూర్తి నీటి మట్టం 3.071 టీఎమ్సీలు. 96.97% నీటి నిల్వ ఉన్నందువల్ల సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని నిపుణులు చెబుతున్నారు. పులిచింతలలో ప్రస్తుతం 29.039 టీఎమ్సీల నీరు ఉంది. మరి కూటమి ప్రభుత్వం సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదు?కృష్ణా డెల్టాలో ప్రధాన సేద్యం వరి. అలాంటి వరి సేద్యం చేయవద్దంటే, రైతులు ఖరీఫ్ సేద్యానికి దూరం కావడమే కదా! ప్రకాశం బ్యారేజి కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదల చేయకపోతే ఆ పంటల సేద్యం సాధ్యం కాదు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుని, పూడికలు తీసి నీటితో వాటిని నింపి ఉంటే, వాటి ద్వారా నీరు లభించేది. ఇది పాలకుల వైఫల్యం కాదా?రాష్ట్రంలోని 608 మండలాల్లో 250 మండలాలు తీవ్ర కరువు మండలాలుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో కరవును ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కరవు మండలాల్లో గ్రామీణ ఉపాధి హామీ పనులను 250 రోజులకు పెంచి గ్రామీణ పేద కుటుంబాలకు పనులు కల్పించాలి. ఆ పనుల వేతనం పెంచాలి. రైతాంగానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా ఇవ్వాలి. వారు తీసుకున్న పంట రుణాలు రద్దు చేయాలి. తాగు నీటి సమస్య లేకుండా చూడాలి. ఈ డిమాండ్ల సాధన కోసం రైతాంగం, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి.- బొల్లిముంత సాంబశివరావు, వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
అంచనాలు అందుకోని ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రభుత్వం 2026 జూలైలో విడు దల చేసిన శ్వేతపత్రం కొత్త చర్చకు తెరతీసింది. 2024–25లో రాష్ట్ర స్వంత ఆదాయాలు రూ. 96,270 కోట్లు కాగా, జీతాలు, పెన్షన్లకు రూ. 92,869 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాష్ట్ర సొంత ఆదాయానికి దాదాపు సమానమైన మొత్తం జీతాలు, పెన్షన్లకే వెళ్తున్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ‘రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే పోతోంది’ అనే వాదనను నేరుగా అంగీకరించడం సరైంది కాదు. రాష్ట్ర సొంత ఆదాయం, మొత్తం రెవెన్యూ ఆదాయం, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు, అప్పులు... ఇవన్నీ వేర్వేరు. ఏ ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నాం అన్నదే శాతాన్ని నిర్ణయిస్తుంది.2024–25లో రాష్ట్రానికి వాస్తవంగా వచ్చిన రెవెన్యూ రిసిప్షన్ రూ. 1,67,676 కోట్లు. ఇందులో రాష్ట్ర పన్ను ఆదాయం రూ. 89,435 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 5,972 కోట్లు కాగా, కేంద్ర పన్నుల వాటా రూ. 52,080 కోట్లు, కేంద్ర గ్రాంట్లు రూ. 20,188 కోట్లు. బడ్జెట్లో అంచనా వేసిన రూ. 2,01,174 కోట్లతో పోలిస్తే వాస్తవ రెవెన్యూ ఆదాయం రూ. 33,498 కోట్లు తక్కువగా వచ్చింది. రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలోనే రూ. 20,354 కోట్ల లోటు నమోదైంది. ఇదే రాష్ట్ర ఆర్థిక సమస్యకు కీలక సంకేతం. సమస్య కేవలం జీతాల భారం కాదు; ఆదాయాన్ని అంచనాల మేరకు సమకూర్చుకోలేకపోవడం.2024–25లో రెవెన్యూ ఖర్చు రూ. 2,27,961 కోట్లు కాగా, రెవెన్యూ రాబడి రూ. 1,67,676 కోట్లు మాత్రమే. ఫలితంగా రెవెన్యూ లోటు రూ. 60,285 కోట్లకు చేరింది. మరోవైపు భవిష్యత్తు మౌలిక వసతులకు కీలకమైన క్యాపిటల్ ఔట్లే కేవలం రూ. 16,141 కోట్లే. బడ్జెట్ అంచనా రూ. 32,713 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు సగం.2026–27 నాటికి ఆదాయ రాబడి రూ. 2,34,140 కోట్లుగా అంచనా వేయగా, రాష్ట్ర సొంత వనరులు రూ. 1,37,320 కోట్లు. అదే సమయంలోవడ్డీ చెల్లింపులు రూ. 37,281 కోట్లు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థికసంక్షోభాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమస్యగా చూడటం సరికాదు. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ వ్యయమే అయినప్పటికీ... వైద్యం, విద్య, పోలీసు, రెవెన్యూ వంటి కీలక ప్రజాసేవలు వాటితోనే నడుస్తాయి. రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతున్నారు? భవిష్యత్తు అభివృద్ధికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు? అన్నవి ఈ సందర్భంలో తలెత్తుతున్న అసలు ప్రశ్నలు.– సీహెచ్.వి. ప్రభాకర్ రావు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో ఉద్యోగాల కోసం ఎంపికైన 200 మందికి పైగా విద్యార్థులు, యువ ఇంజనీర్ల ఆన్బోర్డింగ్ ఆలస్యంపై వివాదం ముదిరింది. ‘ఎలైట్ హైరింగ్ 2025’ కార్యక్రమం కింద ఎంపికైన అభ్యర్థులను నెలల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారంటూ ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఆగస్టు 13న కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసిన నైట్స్.. ఈ వ్యవహారంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరింది.ఆఫర్ లెటర్ ఇచ్చినా.. జాయినింగ్ డేట్ లేదునైట్స్ వివరాల ప్రకారం.. బాధిత అభ్యర్థులు ఫిబ్రవరి 2025లో విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొని టెక్నికల్, వాయిస్ అసెస్మెంట్లను పూర్తి చేశారు. ఇంటర్వ్యూ ప్రక్రియ అనంతరం 2025 జూలైలో ఆఫర్ లెటర్లు, ఆగస్టులో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LOI) అందుకున్నారు. నిర్ణీత గడువులోనే వాటిని అంగీకరించారు. అయితే ఆ తర్వాత వారి నియామక ప్రక్రియ ముందుకు సాగలేదని సంఘం ఆరోపించింది.డిసెంబర్ 2025లో అభ్యర్థులు మరోసారి విప్రో నిర్వహించిన సర్వే ద్వారా కంపెనీలో చేరేందుకు తమ ఆసక్తిని ధ్రువీకరించారు. అనంతరం మార్చి 2026లో కోడిలిటీ టెక్నికల్ అసెస్మెంట్ నిర్వహించగా, అందులోనూ ఉత్తీర్ణులయ్యారు. మార్చి 24న క్లియరెన్స్ సమాచారం అందిందని నైట్స్ పేర్కొంది. మార్చి 25న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లింక్ అందగా, మార్చి 26న అభ్యర్థులు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. చిరునామా ధ్రువీకరణకు సంబంధించిన ప్రశ్నను కూడా అదే రోజు పరిష్కరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విప్రో పోర్టల్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ 100 శాతం పూర్తయి, ‘No Action Required’గా కనిపించిందని సంఘం తెలిపింది.అన్ని నియామక దశలను పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు నిర్దిష్ట జాయినింగ్ తేదీ ఇవ్వలేదని నైట్స్ ఆరోపించింది. బాధితులు విప్రో హెచ్ఆర్, ఆన్బోర్డింగ్ హెల్ప్డెస్క్లతో పాటు ఇతర అధికారిక మార్గాల ద్వారా పలుమార్లు సంప్రదించినా స్పష్టమైన సమాధానం రాలేదని పేర్కొంది. విద్యాసంస్థలు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారులు కూడా విప్రో క్యాంపస్ సంబంధిత సిబ్బందిని సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది.ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు ఇతర అవకాశాలను వదులుకున్నారని, దీంతో విద్యా ఖర్చులు, వసతి, రోజువారీ అవసరాలు, కుటుంబ బాధ్యతల విషయంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని నైట్స్ పేర్కొంది. దీర్ఘకాలంగా స్పష్టత లేకపోవడం అభ్యర్థుల్లో మానసిక ఆందోళనకు కూడా కారణమవుతోందని తెలిపింది.కార్మిక శాఖను ఏం కోరిందంటే..విప్రోతో ఈ అంశాన్ని చర్చించి బాధిత అభ్యర్థులందరి ప్రస్తుత స్థితిని స్పష్టం చేయాలని నైట్స్ కార్మిక శాఖను కోరింది. ఆఫర్ లెటర్లు, LOIలు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయా? ఆలస్యానికి అసలు కారణం ఏమిటి? ఆన్బోర్డింగ్ ఎప్పటిలోగా పూర్తవుతుంది? అనే అంశాలపై కంపెనీ నుంచి స్పష్టమైన సమాధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. ఇక కొందరి అభ్యర్థిత్వాలను ముందుకు తీసుకెళ్లకూడదని కంపెనీ నిర్ణయిస్తే, వారిని నిరవధికంగా ఎదురుచూడనివ్వకుండా నిర్ణయం, కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కూడా కోరింది.విప్రో స్పందన ఇదీ..మరోవైపు, ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని విప్రో స్పష్టం చేసింది. కంపెనీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామక ప్రక్రియ కొనసాగుతుందని, తదుపరి అప్డేట్లను అభ్యర్థులకు తెలియజేస్తామని తెలిపింది. అయితే, ఈ వివాదంపై విప్రో నుంచి వచ్చిన ఈ స్పందనలో నిర్దిష్ట జాయినింగ్ తేదీ లేదా 200 మందికి పైగా అభ్యర్థుల కోసం టైమ్లైన్ వెల్లడించలేదు. -
పేదలెక్కువైన సంపన్న రాష్ట్రం
పుష్కర తెలంగాణ రాష్ట్రం జీఎస్డీపీ, తలసరి ఆదాయం లాంటి ఆర్థికాభివృద్ధి సూచికలలో దూసుకుపోతోంది. దేశంలో పారిశ్రామికంగా బలమైన మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి 5,407 డాలర్ల తలసరి జి.ఎన్.ఐ.తో తెలంగాణ ఎగువ మధ్య స్థాయి ఆదాయ రాష్ట్రంగా (యు.ఎం.ఐ.ఎస్.) ఢిల్లీ, కర్ణాటక తరువాత మూడవ రాష్ట్రంగా ఆవిర్భవించిందని ప్రపంచ బ్యాంక్ తన ‘కంట్రీ ఇన్కమ్ క్లాసిఫికేషన్ – 2026’ నివేదికలో వెల్లడించింది. ఇది రాష్ట్రానికి దక్కిన గౌరవంగానే చూడాలి. కానీ దీన్ని రాష్ట్ర అభివృద్ధికి గీటురాయిగా చెప్పలేం. రాష్ట్రంలో ఆదాయం సమకూరే మార్గాలు, ఆదాయ పంపిణీ తీరు రాష్ట్ర వాస్తవిక అభివృద్ధికి అద్దం పట్టడం లేదు.తెలంగాణలో జిల్లాల మధ్య తీవ్ర అంతరాలు ఉన్నట్లుగా ‘తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్లుక్ సర్వే – 2026’ గుర్తించింది. రాష్ట్ర ఆదాయంలో 51 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి లాంటి జిల్లాల నుండి వస్తుంటే... మిగతా 49 శాతం ఆదాయం 29 జిల్లాల నుండి వస్తోంది. రాష్ట్ర ఆదాయ పంపిణీ తీరులో కూడా తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి.ఐటీ, ఫార్మా రంగాలు; రియల్ ఎస్టేట్, గ్లోబల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నుండి రాష్ట్రానికి ఆదాయం సమకూరటం వలన రాష్ట్ర సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం అయ్యింది. తలసరి జి.ఎన్.ఐ. ఎక్కువగా కనపడుతున్నా అభివృద్ధి ఫలాలు, పెరిగిన ఆదాయం కింది వర్గాలకు చేరడంలేదు. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ వృత్తుల బలోపేతం ద్వారా గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచాలి. అంతే కాక ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు పరచడం, గ్రామీణ అవస్థాపన నిర్మాణాన్ని చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలి. అలాగే విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు పెరిగినప్పుడే కింది వర్గాల ఆదాయాలు, కొనుగోలు శక్తి కూడా పెరిగి ఆర్థిక అంతరాలు తగ్గుతాయి.రాష్ట్రంలో 1.14 కోట్ల కుటుంబాలు ఉంటే 89 లక్షలకు పైగా కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని ప్రభుత్వ సామాజిక, ఆర్థిక సర్వేలు తేటతెల్లం చేస్తు న్నాయి. తెలంగాణ పేదలు ఉన్న సంపన్న రాష్ట్రంగా తెలంగాణ కనిపిస్తుంటే రాష్ట్ర ఏర్పాటుకు చేసిన త్యాగాలకూ, ఉద్యమాలకూ అర్థం ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సంపద పెరగడమే కాదు, ఆ సంపద కింది వర్గా లకు చేరడమే నిజమైన అభివృద్ధికి గీటురాయి.– డా. తిరునహరి శేషు, అర్థశాస్త్ర ఉపన్యాసకులు, కేయూ -
సీజేపీకి బార్ కౌన్సిల్ చైర్మన్ చురక!
నల్సర్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ వివాదంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెనకడుగు వేసినా.. వేడి ఇప్పుట్లో చల్లారేలా కనిపించడం లేదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ మిశ్రా రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ పట్టబడుతోంది. అవసరమైతే ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై, సీజేపీ ఆరోపణలపై మనన్ మిశ్రా కాస్త భిన్నంగా స్పందించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు చేసిన వాళ్లకు ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ విషయంలో తమ లక్ష్యం కూడా అదే అని స్పష్టం చేశారు. ‘‘అభిజీత్ దీప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా.. వారికి చెప్పదలచుకున్నది ఒక్కటే. విద్యార్థుల హక్కులను కాపాడటమే మా ఉద్దేశం. ఈ విషయంలో మా ప్రయోజనాలు, వారి లక్ష్యం ఒకటే’’ అని మనన్ మిశ్రా తెలిపారు.వివాదానికి కారణం ఇదేహైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యే ప్రతిపాదనపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం నేపథ్యంలో బీసీఐ.. 2026లో నాల్సార్ నుంచి న్యాయ విద్య పూర్తి చేసే విద్యార్థుల ఎన్రోల్మెంట్పై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు విద్యార్థుల చర్యలకు మొత్తం బ్యాచ్ను బాధ్యులను చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.‘‘తొందరపాటులో నిర్ణయం తీసుకున్నాం’’తొలుత ఇచ్చిన ఆదేశాలపై మనన్ మిశ్రా వివరణ ఇచ్చారు. విద్యార్థులకు నష్టం కలిగించాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదన్నారు. ‘‘ఆ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నదే. విషయం కౌన్సిల్ దృష్టికి వచ్చిన వెంటనే నిలిపివేశాం. సీనియర్ సభ్యులతో చర్చించిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకున్నాం. దీనిపై ఎలాంటి విచారణ అవసరం లేదు’’ అని తెలిపారు.‘‘బీసీఐకి, సీజేపీకి ఘర్షణ లేదు’’విద్యార్థుల ప్రయోజనాల విషయంలో బీసీఐ, సీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మనన్ మిశ్రా స్పష్టం చేశారు. ‘‘ఎవరైనా అపార్థంలో ఉంటే స్పష్టం చేయాలనుకుంటున్నాను. దేశ యువత ప్రయోజనాలను కాపాడటం మనందరి బాధ్యత. అభిజీత్ దీప్కే కోరేది కూడా అదే.. మేము కోరేది కూడా అదే. కాబట్టి ఎలాంటి ఘర్షణ లేదు’’ అని పేర్కొన్నారు.రూ.14 కోట్ల ఆరోపణలపై స్పందనబీసీఐ సమావేశాలు, సదస్సుల కోసం రూ.14 కోట్లు ఖర్చు చేసిందన్న సౌరవ్ దాస్ ఆరోపణలపైనా మనన్ మిశ్రా స్పందించారు. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని, అలాంటి భారీ ఖర్చులు ఏవీ జరగలేదని చెప్పారు. బీసీఐ వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహిస్తుందని, వాటిని రూ.14 కోట్ల వ్యయంతో నిర్వహించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.సీజేపీ మాత్రం విజయంగా..బీసీఐ ఆదేశాల ఉపసంహరణను సీజేపీ నేతలు తమ విజయంగా అభివర్ణించారు. సౌరవ్ దాస్ సోషల్ మీడియాలో ‘‘ఇట్స్ డన్ బ్రో’’ అంటూ స్పందించారు. గతంలో తమ ఉద్యమ సమయంలో వైరల్గా మారిన నినాదాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. అయితే మనన్ మిశ్రా రాజీనామా కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు.సుప్రీం నోటీసులుఇదిలా ఉంటే.. ఇది పూర్తిగా సీజేఐకి, విద్యార్థులకు సంబంధించిన అంశమని సుప్రీం కోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్.. విద్యార్థులు తప్పు చేసినా, నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉంటుందని చెప్పింది. బార్ కౌన్సిల్ జోక్యం అనవసరమని వ్యాఖ్యానించింది. అసలు అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ బీసీఐకు నోటీసులు పంపింది. మరోవైపు.. నిరసన తెలిపిన విద్యార్థులను విచారించాలంటూ గత ఆదేశాల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించడంపైనా నల్సార్ స్పందించింది. అది తమకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. -
రూ.50 కూలీ.. రూ.4,000 కోట్ల బడ్జెట్ సినిమాకు స్టార్ హీరో
నేడు తెరపై కనిపిస్తున్న కొంతమంది స్టార్ హీరోల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగి ఉంటాయి. కొందరు అవకాశాలను అందిపుచ్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటే.. మరికొందరు మధ్యలోనే వెనుదిరుగుతారు. అయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా తన కలను వదులుకోకుండా ముందుకు సాగిన వారిలో కన్నడ స్టార్ యశ్ ఒకరు. రోజుకు రూ.50 కూలీతో టీలు అందించిన ఈ స్టార్ ఇప్పుడు రూ.4,000 కోట్ల భారీ సినిమా ప్రాజెక్టులకు స్టార్గా నిలిచాడు.బస్సు డ్రైవర్ కుమారుడిగా..హసన్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో నవీన్కుమార్ గౌడగా జన్మించిన యశ్.. ప్రభుత్వ బస్సు డ్రైవర్ అరుణ్కుమార్, గృహిణి పుష్ప దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తమ కుమారుడు జీవితంలో ఎదుగుతాడనే నమ్మకాన్ని ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ కోల్పోలేదు.తొలి ప్రయత్నం విఫలం..చిన్నప్పటి నుంచే యశ్కు సినిమాలంటే ఎంతో ఇష్టం. దీంతో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత తన కలను నెరవేర్చుకోవడానికి బెంగళూరుకు వెళ్లాడు. సహాయ దర్శకుడిగా మారాలన్న ఆయన తొలి ప్రయత్నం అందని ద్రాక్షగానే మిగిలింది. అయినా నిరాశ చెందకుండా బీవీ కారంత్కు చెందిన బెనక నాటక బృందంలో రోజుకు రూ.50 వేతనంతో పనిచేశాడు. కళాకారులకు టీలు అందించడం, వేదికలను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూనే నటనపై దృష్టి పెట్టాడు.బుల్లితెరతో గుర్తింపు..2004లో నాటక రంగంలో తొలి ప్రధాన పాత్రను దక్కించుకున్న యశ్.. అదే ఏడాది బుల్లితెరపై కూడా అడుగుపెట్టాడు. అనంతరం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 2007లో 'జంబాడ హుడుగి' చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన యశ్.. 'మొగ్గిన మనసు' సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత 'మోడలసాల', 'కిరాతక', 'లక్కీ', 'జాను' వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. 2012 నుంచి 2014 వరకు వచ్చిన 'డ్రామా', 'గూగ్లీ', 'రాజా హులి', 'గజకేసరి', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' చిత్రాలు ఆయనను కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా నిలబెట్టాయి.తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు..అయితే, యశ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'రాకీ భాయ్' పాత్రతో యశ్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యాడు.నాలుగేళ్ల విరామం తర్వాత యశ్ 'టాక్సిక్', 'రామాయణ' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఈ రెండు చిత్రాలు భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులుగా నిలిచాయి. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న 'రామాయణ', రూ.500 కోట్ల వ్యయంతో రూపొందుతున్న 'టాక్సిక్' చిత్రాల్లో నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. రోజుకు రూ.50 కూలీతో ప్రారంభమైన యశ్ ప్రయాణం.. నేడు వేల కోట్ల ప్రాజెక్టులకు నాయకత్వం వహించే స్థాయికి చేరడం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం. -
అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా.. అలాంటి ఫేషియల్..!
అందం అంటే శుభ్రంగా తినడం, ఖరీదైన చర్మ సంరక్షణ, వేలకు వేలు బ్యూటీపార్లర్ ఖర్చులు మాత్రమే కాదండోయ్. ప్రముఖ డెర్మటాలజీ చికిత్సలు కూడా ఉంటాయి. అదే సెలబ్రిటీల నవయవ్వన రహస్యం. అయితే దాని వెనుక నొప్పి కూడా భరించాల్సిందే. కేవలం మొటిమలు, లేజర్ ట్రీట్మెంట్, వంటి కాస్మెటిక్ చికిత్సలు గురించి విన్నాం. ఇంకాస్తా ముందడుగు వేస్తే..చిన్న చిన్న సూదుల చికిత్సతో వృద్ధాప్యాన్ని నివారించే వాటి గురించి విన్నాం, చూశాం కూడా. అయితే ఇదే ఏకంగా వాటిన్నిటిని మించిన షేషియల్ చికిత్స. సింపుల్గా చెప్పాలంటే మీ రక్తంతోటే మిరుమిట్లు గొలిపే అందం. వాట్ ఇందేంటి. అనుకోకండి. అదెలా చేస్తారు, ఎలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.సౌందర్యానికి సంబంధించి..వైద్య క్లినిక్స్లో హైడ్రా ఫేషియల్స్, ఆక్సిజన్ ఫేషియల్స్, కెమికల్ పీల్స్, LED థెరపీ ఫేషియల్స్, వైరల్ వాంపైర్ ఫేషియల్ వంటివి ఎంచుకుంటారు. ఇవే కాకుండా రక్తపిశాచి లాంటి ఒక చికిత్స ఉంది. అది అచ్చం నీలాంబరి మూవీలో అందంకోసం రమ్మకృష్ణ అందమైన యువకుల రక్తం ఎక్కించుకుంటే..అత్యంత అందంగా మారిపోతుందే అలాంటి చికిత్స ఇది. అయితే ఇందులో వేరేవాళ్ల రక్తం కాకుండా మన నుంచి తీసుకున్న బ్లడ్తోనే చేస్తారట.ఎలాగంటే..ఒక ప్రొఫెషనల్ వైద్యుడు సాధారణ రక్త పరీక్ష వలె చేయి నుంచి కొంత రక్తాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసే యంత్రంలో సీనాని పెడతారు. ఆ తర్వత ముఖం అంతట చిన్న సూదులు అమర్చిన పరికరంతో ముఖంపై ఒకవైపు అంతా అప్లై చేస్తారు. చూడటానికి ఇది చాలా నొప్పిగా ఉంటుంది. కానీ అంత నొప్పి ఏ మాత్రం ఉండదట. లాస్ట్లో ఆ రక్తంలోని ప్లాస్మానికి ముఖానికి అంతటా అప్లై చేస్తాడు. చిన్న సూదుల గుండా ముఖంలోకి చొప్పిస్తాడు. ఆ తర్వాత ముఖం చూస్తే నిజంగా రక్తపిశాచి మాదిరిగా భయానకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వైపు అంత ఎర్రగా కందిపోయి ఉంటుంది. అయితే ఎరుపు రంగు సాయంత్రం కల్లా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్స చేసిన ముఖం వైపు కన్ను చాలా మెరుగ్గా కనిపిస్తుందట. ఇది ఎలాంటిదంటే మన నుంచి రక్తం తీసుకుని వెయ్యిసార్లు ముఖంపై పొడిచి సౌందర్య చికిత్స అట. దీని గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నటి షెహ్నాజ్ ట్రెజరీ. ఆమె ఎంటీవీ వీజేగా కెరీర్ ప్రారంభించి తెలుగు, హిందీ తోపాటు కొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించిందామె. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) (చదవండి: 51 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు..!1992లోనే..) -
స్మిత్ ప్రపంచ రికార్డు.. భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్!
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అరుదైన ఫీట్ సాధించాడు. డార్విన్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లా తొలి ఇన్నింగ్స్లో స్మిత్ మూడు క్యాచ్లు తీసుకున్నాడు. నజ్ముల్, లిటన్ దాస్లను తొలి రెండు క్యాచ్లుగా తీసుకున్న స్మిత్ 36 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్ను ఒడిసిపపట్టాడు. స్మిత్కు ఇది 218వ క్యాచ్. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఫీల్డర్ల జాబితాలో జో రూట్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జో రూట్ 165 టెస్టుల్లో 218 క్యాచ్లు తీసుకుంటే స్మిత్ మాత్రం 124 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఇక ఈ జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (210 క్యాచ్లు) రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే (205 క్యాచ్లు), సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్ కలిస్ (200 క్యాచ్లు) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక భారత్ నుంచి చూసుకుంటే వీవీఎస్ లక్ష్మణ్ (135 క్యాచ్లు), కోహ్లి (121 క్యాచ్లు), సచిన్ టెండూల్కర్ (115 క్యాచ్లు) టెస్టుల్లో వందకు పైగా క్యాచ్లు అందుకున్న జాబితాలో చోటు సంపాదించారు.తంజిద్ శతకం.. పట్టు బిగించిన బంగ్లామ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మెహదీ హసన్ (32 బ్యాటింగ్), హసన్ మహ్ముద్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ (101) మెయిడెన్ శతకంతో మెరవగా, కెప్టెన్ నజ్ముల్ (84) అర్ధశతకంతో ఆకట్టుకోగా, మోమినుల్ హక్ (49) రాణించాడు. Photo Credit: Twitterఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హాజిల్వుడ్ చెరో 2 వికెట్లు తీయగా, కమిన్స్, నాథన్ లియోన్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. రెండోరోజు ఆటలోనూ బంగ్లాదేశ్ ఆధిపత్యమే స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియా బౌలర్లో రోజు మొత్తంలో ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. ఇప్పటికైతే ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ మంచి ఆధిక్యంలో నిలిచి టెస్టులో పట్టు బిగించిందని చెప్పొచ్చు. మ్యాచ్లో ఎవరిది పైచేయి కానుందనేది మూడోరోజు ఆటలో తేలిపోనుంది.Read: రొనాల్డో, జార్జినా వివాహం వెనుక షాకింగ్ ట్విస్ట్! -
చక్కెర ఫ్యాక్టరీ కోసం పోరాడుతాం.. అమర్నాథ్
సాక్షి, విశాఖ: చెరుకు రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం చేయడం దండగ అన్న విధంగా చంద్రబాబు పాలనను నడిపిస్తున్నారన్నారు. ఈ రోజు (శుక్రవారం) విశాఖలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చెరుకు రైతులను కూటమి సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చెల్లించడం లేదన్నారు.రాష్ట్రంలో ఉన్న ఆరు షుగర్ ఫ్యాక్టరీలు మూసివేసేలా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఏటికొప్పాక, తాండవ, భీమసింగ్ ఫ్యాక్టరీలను మూసివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నాడని తెలిపారు. షుగర్ రైతులను ఆదుకుంటున్నట్లు నలుగురు మంత్రులతో కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే సహకార రంగంలో నడుస్తుందని, గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి రూ. 30 కోట్లు విలువైన చెరుకు తోలారని ఇప్పటికీ రైతులకు బకాయిలు ఇవ్వలేదన్నారు.ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తామని చక్కెర పరిశ్రమల్లో రైతులే వాటాదారులని సెప్టెంబర్ నాటికి రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ప్రతిపాదన వస్తే మేము వ్యతిరేకించామని. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు రైతుల నడ్డి విరుస్తున్నాయన్నారు. చెక్కర కర్మాగారం కోసం పోరాడెందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి ప్రకటించారు. -
సిరుల సింహాసనంపై అంబానీ సామ్రాజ్యం
భారత ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తున్న దిగ్గజ కుటుంబ వ్యాపార సంస్థలు సంపద సృష్టిలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ‘హరూన్ ఇండియా - 2026’ తాజా నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత విలువైన బహుళ తరాల (మల్టీజనరేషనల్) కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుటుంబం రూ.25.83 లక్షల కోట్ల విలువతో దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా మొదటి స్థానంలో నిలిచింది.టాప్-10 సంపన్న కుటుంబ వ్యాపారాలుర్యాంక్వ్యాపార కుటుంబంవిలువ (లక్షల కోట్లలో)1అంబానీ కుటుంబంరూ.25.832కుమార్ మంగళం బిర్లా కుటుంబంరూ.8.143జిందాల్ కుటుంబంరూ.8.024బజాజ్ కుటుంబంరూ.7.705మహీంద్రా కుటుంబంరూ.5.156అనిల్ అగర్వాల్ కుటుంబంరూ.4.457మురుగప్ప కుటుంబంరూ.3.068నాడార్ కుటుంబంరూ.2.919ప్రేమ్జీ కుటుంబంరూ.2.7210ధాని, చోక్సీ, వకీల్ కుటుంబాలురూ.2.48అదానీ గ్రూప్ మినహాయింపునకు కారణమేంటి?ఈ జాబితాలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ లేదనే ప్రశ్న సాధారణంగా ఉద్భవిస్తుంది. హరూన్ వర్గీకరణ విధానం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ తరాలుగా పరంపరగా కొనసాగుతున్న వంశపారంపర్య వ్యాపార సంస్థలను మాత్రమే ఈ జాబితాలోకి తీసుకున్నారు. గౌతమ్ అదానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని హరూన్ ‘తొలి తరం వ్యాపారం’గా పరిగణించింది. తొలి తరం వ్యాపార సంస్థల విభాగంలో అదానీ కుటుంబం రూ.19.57 లక్షల కోట్లు అగ్రస్థానంలో నిలిచింది.దేశ కార్పొరేట్ పన్ను వసూళ్లలో దాదాపు 17% వాటాను ఈ కుటుంబ వ్యాపార సంస్థలే అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి. తరాలు మారినా సుపరిపాలన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన నాయకత్వంతో ఈ వ్యాపార సామ్రాజ్యాలు గ్లోబల్ మార్కెట్లో భారత్ను అగ్రపథంలో నిలుపుతున్నాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
సమావేశాలు సరే, సమస్యల మాటేంటి?
భారతదేశ భవిష్యత్తును నిర్దేశించేది, నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉండేది, 143 కోట్ల భారతీయుల తలరాతలను మార్చేది పార్లమెంట్. తమ తమ ప్రాంతాలలో చోటు చేసుకున్న సమస్యలను ఎంపీలు ప్రస్తావించేందుకు పార్లమెంటు ఓ కీలకమైన వేదిక. ఇప్పుడు కేవలం ఆరోపణలు, విమర్శలకే ఎక్కువ సమయం సరిపోతోంది.దేశంలో పెద్ద గుంతలతో నిండిన రహదారులను దాటడం, మునిగి పోయిన నగరాల్లో నడవడం, అంతులేని ఉద్యోగ దరఖాస్తు లతో చెమటలు పట్టడం, దొంగతనాల వల్ల కోట్లు నష్టపోయే విద్యుత్ రంగానికి ధర చెల్లించడం దేశంలో సాధారణ దృశ్యాలు అయ్యాయి. ప్రతి వారం ప్రజల తెరలపై ఒక వంతెన వంగిపోవడం, ఒక కారును రహదారి మింగేయడం వంటి దృశ్యాలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, ప్రభుత్వ సమాధానాలు చూస్తే దేశంలో పరిస్థితి కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.‘ఎన్ని రహదారులు కూలిపోయాయి?’ అనే ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం 49 అని. ఇది 2014 నుండి 2025 వరకు ఉన్న డేటా. ప్రతి వర్షాకాలం కల్లోలం సృష్టిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టణ వరదల బాధ్యతను రాష్ట్రాలు, స్థానిక సంస్థలపై మోపుతుంది. ఇది రాజ్యాంగపరంగా సరైనదే. అయితే, అతి పెద్ద పట్టణా భివృద్ధి కార్యక్రమం ఢిల్లీ నుండి నిర్వహించబడుతోంది. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ కింద 8,064 ప్రాజెక్టులలో 7,790 పూర్తయ్యాయి. ఖర్చు రూ. 1,56,257 కోట్లు. ఖర్చు అంటే కేవలం డబ్బు కదలిక మాత్రమే, పరిష్కారం కాదు.ఈ వారం ఎంపీలు నీటి కాలుష్యం, అంచనాలు, ప్రమాణాలు, పరిష్కారాలపై కూడా గొంతెత్తారు. 2023–24 నుండి 2.52 కోట్ల ప్రయోగశాల నమూనాల సేకరణ జరిగిందనీ, 2.87 కోట్ల ఫీల్డ్ పరీక్షలు జరిగాయనీ, ట్యాంకర్ మాఫియా నీటి కొరత నిజమనీ ప్రభుత్వం అంగీకరించింది.ఇక ప్రాథమిక విద్య విషయానికి వస్తే, భవిష్యత్తు ఆశల వెన్నె ముక విరిగిపోయింది. ప్రభుత్వం 10.05 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 11.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. ప్రైవేట్ రంగం 3.42 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 8.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. విధానాలు, కంప్యూటరైజేషన్ గురించి చర్చల మధ్య ఈ వివరాలు వెల్లడయ్యాయి. 73,481 పాఠశాలలకు విద్యుత్ లేదు. 1,00,843 పాఠశాలల్లో ఒక్క గురువు మాత్రమే ఉన్నారు. అందుకే యువత వ్యవస్థలోని సమస్యలతో పోరాడు తున్నారు. మొన్న జంతర్ మంతర్లో, ఇప్పుడు జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటకల్లో కనిపిస్తున్న ఆగ్రహం చదువు, ఉపాధి రంగా లపై అసంతృప్తిని ఎలుగెత్తి చాటుతున్నది.ఇంతలోపే ఆగస్ట్ 15 వచ్చేసింది. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించడం మామూలే. కానీ రోజురోజుకూ రూపాయి మరింత బలహీనమవుతోంది. ముడి చమురు ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆర్థిక లోటు పెరుగుతోంది. దివాళా చట్టం కింద 2020 నుండి డిసెంబర్ 2025 వరకు 25,900 కేసులు దాఖలయ్యాయి. పాలనలో బాధ్యత, సమర్థత లోపించడం వల్లనే ఈ సమస్యలు కొనసాగుతున్నాయి. – కృష్ణ తేజ, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి -
‘హద్దుల్లో ఉంటే మంచిది’.. రాజగోపాల్కు పీసీసీ చీఫ్ కౌంటర్
యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత అసంతృప్తి స్వరం వినిపించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేస్తూనే.. పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్.. పార్టీకి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేస్తూ.. సీఎం అయినా, సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్లో ఒకే నిబంధన వర్తిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్రెడ్డి హద్దుల్లో ఉండాలి అని స్పష్టం చేశారు.చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజగోపాల్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని తాను విమర్శించడం లేదని చెప్పారు. అయితే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నానని తెలిపారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులు, పాత కాంగ్రెస్ నాయకులు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కాలని అన్నారు. కాంగ్రెస్ను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ ఆత్మగౌరవం అంశాన్ని కూడా రాజగోపాల్రెడ్డి ప్రస్తావించారు. “సీమాంధ్ర పాలకుల మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ ప్రభుత్వం నడవకూడదు.. తెలంగాణ ఆత్మగౌరవంతోనే ప్రజాపాలన సాగాలి” అని అన్నారు.ప్రభుత్వ పాలన పేదల కోసం ఉండాలని.. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలహీనపడకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని మరోసారి తేల్చిచెప్పిన రాజగోపాల్రెడ్డి.. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మొత్తంగా.. పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూనే కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? లేక పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారా? అన్న చర్చ మొదలైంది.మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేస్తూ.. సీఎం అయినా, సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్లో ఒకే నిబంధన వర్తిస్తుందని అన్నారు. పార్టీ గీత దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరాన్ని బట్టి ఎవరి సేవలను ఎప్పుడు వినియోగించుకోవాలో పార్టీ నాయకత్వానికి తెలుసని వ్యాఖ్యానించారు.రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి “రాజగోపాల్రెడ్డి హద్దుల్లో ఉండాలి” అని స్పష్టం చేశారు. ఆయన బాధను తాము అర్థం చేసుకోగలమని.. అయితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇక రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి హామీ ఉందన్న ప్రచారంపైనా పీసీసీ చీఫ్ స్పందించారు. ఆయనకు మంత్రి పదవి హామీకి సంబంధించిన సమాచారం తనకు ఉందని, అయితే తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “క్రమశిక్షణ ఒక లెవల్ వరకే ఉంటుంది” అంటూ పరోక్షంగా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, ప్రభుత్వం.. పార్టీ వేరు కాదు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. సమిష్టి నిర్ణయంతోనే అన్ని జరుగుతాయి. కో-ఆర్డినేషన్ కమిటీ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టేందుకు కాదు. ప్రభుత్వం ఏం చేసినా పార్టీతో చర్చించడం అవసరం అని వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదన్న రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమకారులేనని అన్నారు. ప్రతి ఒక్కరి కోరికను ఒకేసారి తీర్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల రాజగోపాల్రెడ్డి “కాంగ్రెస్లోనే ఉన్నా.. రాహుల్గాంధీ నాయకత్వంలో పనిచేస్తా” అంటూ పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. మహేశ్గౌడ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు మంత్రి పదవిపై హామీ ఉందన్న సంకేతం.. మరోవైపు ‘హద్దుల్లో ఉండాలి’ అంటూ హెచ్చరిక.. దీంతో రాజగోపాల్రెడ్డి విషయంలో తెలంగాణ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
మరోసారి పెరగనున్న టాటా కార్ల ధరలు?
టాటా కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ మేరకు టాటా మోటార్స్ నుంచి సంకేతాలు వచ్చాయి. ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో, 2027 ఆర్థిక సంవత్సరంలో అవసరాన్ని బట్టి విడతల వారీగా, క్రమాంకితంగా ధరలు పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) యాజమాన్యం వెల్లడించింది. అయితే, మొత్తం భారాన్ని వినియోగదారులపై ఒకేసారి మోపకుండా.. ధరల సవరణతో పాటు ఖర్చుల తగ్గింపు చర్యలను కొనసాగించనున్నట్లు తెలిపింది.టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సీఎఫ్వో ధీమన్ గుప్తా 2027 ఆర్థికేడాది క్యూ1 ఫలితాల సందర్భంగా మాట్లాడుతూ, ఏడాది పొడవునా మరిన్ని “క్రమాంకిత ధరల పెంపులు” చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే తదుపరి పెంపు ఎంత శాతం ఉండొచ్చు, ఎప్పుడు అమలు చేస్తారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ప్రధాన ఉద్దేశం మార్జిన్లను కాపాడుకోవడంతో పాటు కార్లకు ఉన్న కస్టమర్ విలువ ప్రతిపాదనను దెబ్బతీయకుండా చూడటమేనని యాజమాన్యం స్పష్టం చేసింది.ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంపు2026లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ (ICE) కార్లపై 0.5% పెంపు అమలు చేసింది. ఆ తర్వాత జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, ఈవీలు సహా మొత్తం ప్యాసింజర్ వెహికల్ పోర్ట్ఫోలియో ధరలను 1.5% వరకు పెంచింది. జూలై పెంపు 2027 ఆర్థికేడాది క్యూ1 ఆర్థిక ఫలితాల్లో పూర్తిగా ప్రతిబింబించలేదని కంపెనీ తెలిపింది. అందువల్ల రెండో త్రైమాసికంలో ఆ పెంపు నుంచి కొంత ప్రయోజనం మార్జిన్లకు లభించే అవకాశం ఉంది.కమోడిటీ ఖర్చులు మరింత పెరిగే అవకాశంమరోవైపు, ముడి సరుకుల ధరలు కంపెనీకి ప్రధాన సవాలుగా మారుతున్నాయి. Q1లో కమోడిటీ సంబంధిత వ్యయ ఒత్తిడి గణనీయంగా ఉండగా, Q2లోనూ అదనపు ఖర్చు భారం ఉంటుందని యాజమాన్యం అంచనా వేసింది. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం వంటి ఇన్పుట్ ధరల కదలికలు ఆటో కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపుతున్నాయి.అమ్మకాల్లో మాత్రం జోరుధరల పెంపు నిర్ణయం వస్తున్న సమయంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ వ్యాపారంలో డిమాండ్ మాత్రం బలంగానే ఉంది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ మొత్తం 1,82,574 కార్లు, SUVలను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలోని 1,24,809 యూనిట్లతో పోలిస్తే 46% వృద్ధి. దేశీయ అమ్మకాలు 45% పెరిగి 1,80,166 యూనిట్లకు చేరాయి. -
బిడ్డ కోసం తల్లి పోరాటం.. గెలిచిన పేగు బంధం!
ఒకేసారి ఇద్దరు పసికందుల చిరునవ్వులను ముద్దాడే ఆ తల్లి ప్రపంచంలో ఒక్కసారిగా చీకట్లు ముసిరాయి. తన రెండు కళ్లలాంటి కవల బిడ్డల్లో ఒక చిన్నారిని భర్త బలవంతంగా లాక్కెళ్తుంటే.. ఆ తల్లి గుండె పగిలిపోయింది. 23 నెలల పసికందు అమ్మ పాలు లేక, కన్నతల్లి స్పర్శకు దూరమై అలమటించిపోతుంటే.. ఆ తల్లి నిద్రలేని రాత్రుళ్లతో నరకం అనుభవించింది. కన్నబిడ్డకు దూరమైతే తల్లి మనసు ఎంతగా తల్లడిల్లిపోతుందో.. పేగు బంధం కోసం ఆమె ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుందో నిరూపించే హృదయవిదారక ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది. ఆ తల్లి చేసిన న్యాయపోరాటం, పోలీసుల నిర్లక్ష్యంపై బాధిత వైద్యురాలు, పీవోడబ్ల్యూ నేతలు మీడియాతో వెల్లడించిన వివరాల ప్రకారం..సీతంపేట ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న డాక్టర్ దండి గాయత్రి, భర్త వెంకట సిద్ధార్థకు కవల పిల్లలు. భర్త అత్తింటి వేధింపులు తాళలేక గాయత్రి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసి, భర్త నుంచి వేరుగా తన ఇద్దరు పసిపాపలతో తన తల్లి రాజ్యలక్ష్మి ఇంట్లో ఉంటున్నారు. ఈ తరుణంలో భర్త వెంకట సిద్ధార్థ, గాయత్రి ఇంటికి వెళ్లి ఆమెపై దాడికి తెగబడి బలవంతంగా ఒక పాపను ఎత్తుకెళ్లాడు.కనికరించని ఖాకీలు..!‘నా బిడ్డను నాకు తెచ్చివ్వండి’ అని కన్నీరుమున్నీరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆ తల్లికి ఖాకీల నుంచి నిరాశే ఎదురైంది. ‘ఏమైనా ఉంటే కోర్టులోనే చూసుకోండి’ అని చెప్పడంతో ఆ తల్లి మరింత కుంగిపోయింది. కానీ, పసికందు ఆకలి కేకలు ఆ తల్లిలోని పోరాట పటిమను నిద్రలేపాయి. పీవోడబ్ల్యూ నేత లక్ష్మి, న్యాయవాది గంగాభవాని ఇచ్చిన ధైర్యంతో ఆ కన్నతల్లి న్యాయస్థానం తలుపు తట్టింది.హైకోర్టు మెట్లెక్కి..హైకోర్టులో దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఆ తల్లి వేదనను, పసిపాప భవిష్యత్తును పరిశీలించిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఏకంగా రాష్ట్ర డీజీపీనే కోర్టుకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిద్రమత్తులో ఉన్న పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా పరుగులు తీసింది. చివరకు హైకోర్టు సమక్షంలోనే భర్త వెంకట సిద్ధార్థ ద్వారా ఆ 23 నెలల చిన్నారిని ఈ నెల 12న తల్లి గాయత్రికి అప్పగించారు. కన్నబిడ్డ కోసం ఆ కన్నతల్లి చేసిన అమూల్యమైన పోరాటం ముందర ఏ శక్తులూ నిలబడలేవని రుజువైంది. చివరకు ఆ తల్లి ప్రేమ, పేగు బంధమే గెలిచాయి.పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిని నేతలు తీవ్రంగా నిరసించారు. మైనార్టీ తీరే వరకు పిల్లలు తల్లి వద్దే ఉండాలని చట్టాలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ, పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని పీవోడబ్ల్యూ నేత లక్ష్మి మండిపడ్డారు. బాధితురాలు హైకోర్టు వరకు వెళ్లేలా చేయడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. తల్లి నుంచి బిడ్డను బలవంతంగా తీసుకువెళ్లడంలో పోలీసుల సహకారం కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని న్యాయవాది గిరిధర్ ఆరోపించారు.నా పోరాటానికి అండగా నిలిచారు – డాక్టర్ గాయత్రితన బిడ్డను తిరిగి దక్కించుకోవడానికి తాను సాగించిన ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో అండగా నిలిచిన పీవోడబ్ల్యూ బృందానికి, న్యాయవాదులకు డాక్టర్ గాయత్రి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పీవోడబ్ల్యూ నేతలు డి.రోహిణి, వెంకటలక్ష్మి, గాయత్రి తల్లి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొని ఆ తల్లి పోరాట పటిమను కొనియాడారు. -
చీఫ్ సెలక్టర్ లేదా హెడ్కోచ్ అవుతా: టీమిండియా దిగ్గజం
భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో భాగమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. తనకు ఏ పదవి ఇచ్చినా వంద శాతం న్యాయం చేస్తానంటూ మనలోని మాటను వెల్లడించాడు.గంభీర్, అగార్కర్పై విమర్శలుకాగా టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్, చీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరి నేతృత్వంలో వైట్బాల్ క్రికెట్లో ఐసీసీ టోర్నీలో భారత జట్టు మంచి ఫలితాలు నమోదు చేస్తున్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఇటీవల ఘోర పరాభవాలు చవిచూసింది.వరుస పరాభవాలుఎన్నడూలేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ కావడం.. పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్స్వీప్ కావడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్కు తొలిసారి వన్డే సిరీస్ కోల్పోవడం.. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్ కావడం.. ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ కావడం, వన్డే సిరీస్ను కోల్పోవడం తాజా ఉదాహరణలు.చీఫ్ సెలక్టర్, హెడ్కోచ్ అయ్యేందుకు సిద్ధంఈ నేపథ్యంలో శ్రీలంకతో తాజాగా రెండు టెస్టుల సిరీస్ తర్వాత వీరి భవితవ్యంపై స్పష్టత రానుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హర్భజన్ సింగ్ బీసీసీఐలో ఏ పదవి ఇచ్చినా చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం గమనార్హం.‘‘బీసీసీఐ అధ్యక్షుడు, చీఫ్ సెలక్టర్ లేదంటే హెడ్కోచ్... ఈ మూడింటిలో ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భారత క్రికెట్కు ఏ స్థాయిలోనైనా సేవ చేయడం నాకు ఎల్లప్పుడూ సంతోషమే. భవిష్యత్తులో ఈ మూడింటిలో ప్రతీ పాత్ర పోషించాలని నేను కోరుకోవడం లేదు.గంభీర్కు మద్దతుఅయితే, నా తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఒకవేళ నాకే గనుక నిజంగా అవకాశం వస్తే.. అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అని భజ్జీ PTI ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా ప్రతీ దానికి గంభీర్ను విమర్శించడం తగదని.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే అతడు ప్రతీ నిర్ణయం తీసుకుంటాడని అండగా నిలిచాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్కు బీసీసీఐ అత్యున్నత పదవి! -
12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
ఒక సాదాసీదా దోశ వ్యాపారాన్ని కోట్ల రూపాయల స్థాయికి చేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఫుడ్ బిజినెస్లో కోట్ల రూపాయలు సంపాదించాలంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వడ్డించే వంటకాన్ని సరిగ్గా, పరిశుభ్రంగా అందిస్తే వ్యాపారం విజయవంతం కావచ్చని ముంబైలోని బెన్నె దోస రెస్టారెంట్ నిరూపించిందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా అంటున్నారు. బెన్నె దోశ లేదా వెన్న దోశ విజయ రహస్యాన్ని విశ్లేషిస్తూ దాని సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.ముంబైలోని బాంద్రాలో కేవలం 12 సీట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ‘బెన్నె’ (Benne) దోశ కేఫ్, ప్రస్తుతం రూ. 350 కోట్ల విలువైన బ్రాండ్గా ఎదిగి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకాను ఆకర్షించింది. ప్రముఖ దోశల చైన్ అయిన 'బెన్నె' ఇంత భారీ విజయం సాధించడానికి కారణమని తాను నమ్మే విషయాలను గోయెంకా విశ్లేషించారు. ఒక నిర్దిష్టమైన మెనూ, తెలివైన నిర్వహణ, అందుబాటు ధరలు, అన్నింటికన్నా ముఖ్యంగా, ఆ బ్రాండ్ చుట్టూ అల్లుకున్న ఎమోషన్ లాంటి అంశాలను ఆయన పేర్కొన్నారు.దావణగెరె-శైలి బెన్నె (వెన్న) దోశ స్పెషల్ : చాలా మందికి అలవాటైన పెద్ద, పలుచని, కరకరలాడే దోశలలా కాకుండా, ఈ కర్ణాటక స్టైల్ దోశ విభిన్నంగా ఉంటుంది. చిన్నగా, లోపల మెత్తగా ఉండి, వెన్నతో నిండుగా ఉంటుంది. ఈ విలక్షణమైన శైలే బెన్నెకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది.Why has ‘Benne’ succeeded so spectacularly?- One hero product: Davangere-style butter dosa- Small menu, easy to perfect and replicate- Electronic self order + self service creates engagement - Affordable enough to become a habit- Long queues created social media buzz-… pic.twitter.com/VcpMCEX2lB— Harsh Goenka (@hvgoenka) August 9, 2026 అఖిల్ అయ్యర్, శ్రియా నారాయణ్ అనే భార్యాభర్తలు ప్రారంభించిన ఈ స్టార్టప్, దేశంలోని ప్రముఖ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్లకు గట్టి పోటీనిస్తోంది. ముంబైలో అథెంటిక్ కర్ణాటక/బెంగళూరు శైలి దావణగెరె బెన్నె దోశ దొరకకపోవడంతో, ఈ రుచిని అందరికీ అందించాలనే ఆశయంతో ఈ జంట స్వయంగా కేఫ్ పెట్టాలనుకున్నారు. 2024 లో ముంబైలోని బాంద్రాలో కేవలం 12 మంది కూర్చునే చిన్న అవుట్లెట్తో ప్రయాణం మొదలైంది. సాంప్రదాయ దక్షిణ భారత శైలి హోటల్ అయిన దానికి వారు 'బటర్' అని పేరు పెట్టారు.ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్ దీని విజయానికి గల ప్రధాన కారణాలలో ఒకటి, వారు దావణగెరె శైలి వెన్న దోశను తమ కాన్సెప్ట్గా చేసుకోవడమే అంటారు హర్ష గోయెంకా. సాధారణ రెస్టారెంట్లలా వంద రకాల మెనూ కాకుండా, కేవలం 'దావణగెరె స్టైల్ బెన్నె దోశ'పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. అంతేకాదు సరైన చట్నీ రుచి కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు, సాంప్రదాయ రుచి కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుండి కాస్ట్ ఐరన్ పెనాలను తెప్పించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, వ్యాపారం పెరిగేకొద్దీ అదే పద్ధతిని, రుచిని అందించేలా జాగ్రత్త వహించారు. క్విక్-సర్వీస్ రెస్టారెంట్కు, ఆ సరళత మరో పెద్ద ప్రయోజనం. ఫలితం ఈ కేఫ్ రోజుకు 800 పైగా దోసలు విక్రయిస్తూ, నెలకు రూ.1 కోటి రాబడిని అందుకుంటోంది.ఇక బెన్నే ఎలక్ట్రానిక్ సెల్ఫ్-ఆర్డరింగ్, సెల్ఫ్-సర్వీస్ను ఉపయోగిస్తుంది, దీనివల్ల విస్తృతమైన టేబుల్ సర్వీస్ అవసరం తగ్గడమే కాకుండా, కస్టమర్లను కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేస్తుంది. తద్వారా క్యూలో నిల్చునే కష్టాలు లేకుండా, రెస్టారెంట్కు ప్రజలకు త్వరగా సేవ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. అయినా ఈ రెస్టారెంట్ వద్ద ఆహార ప్రియులు బారులు తీరిన వైనం ఈ వెన్న దోశ క్రేజ్కు అద్దం పట్టాయి. అంతేనా దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ వంటి సెలబ్రిటీలు రెస్టారెంట్ను సందర్శించడం, సోషల్ మీడియా పోస్టులు ఆసక్తిని మరింత పెంచాయి. ఇపుడీ బెన్నె దోశ ఖ్యాతి ముంబైలో అనేక శాఖలతో పాటు, ఢిల్లీలోని బ్రాంచ్లో కూడా వెలుగొందుతోంది. -
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్!
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్! -
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తామని తెలిపింది. రైతులకు అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొంది. భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పక్షానే అత్యున్నత ధర్మాసనం ఉంటుందని స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్ చట్టాలపై అభ్యంతరాలుంటే రైతులు కోర్టులను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. -
మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని అమ్మనాన్న ఏడ్చారు
బిగ్బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ రేపటి(ఆగస్టు 15) నుంచి ప్రసారం కానుంది. ఈ పోటీలో 70 మంది సామాన్యులు పాల్గొనగా 15 మంది తుది పోటీ కోసం ఎంపికయ్యారు. వీళ్లలో మిగతా అందరికంటే సూర్యాపేట్కి చెందిన రైతు, సింగర్ ఝాన్సీని ప్రోమోల్లో ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఆమె చెప్పిన విషయాలని ఎమోషనల్గా చూపిస్తున్నారు. మరి ఈమె ఏం చెప్పింది? ఫైనల్-15కి సెలెక్ట్ అయిందా? లిస్టులో ఎవరెవరున్నారంటే?(ఇదీ చదవండి: నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. ఫోన్లో ఫొటోలు తీసుకోను: నాగ్)ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు కష్టాలు ఏముంటాయి? అని జడ్జి నవదీప్ ఈమెని అడగ్గా.. 'పెట్టుబడి పెట్టందే పంట పండదు. చివరకొచ్చేసరికి ఆ పెట్టుబడి పెట్టినంత కూడా రాదు. కానీ వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేం. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రకృతితోనే పోటీపడాలి. నేను పుట్టినప్పుడు మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని మా అమ్మవాళ్లు ఏడ్చారు. ఈ రోజు నువ్వు కన్నది ఆడపిల్లని కాదు నలుగురికి స్పూర్తిగా ఉండే ఓ మగరాయుడు లాంటి బిడ్డని కన్నావ్ అని అంటున్నారు' అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.ఇకపోతే అగ్నిపరీక్ష తుదిపోటీలకు ఎంపికైన వారిలో రాజ కుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మితిలేష్, శ్రష్టి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగి తుల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీళ్లలో నుంచి బిగ్ బాస్ 10వ సీజన్లోకి ఎవరు అడుగుపెడతారానేది షో మొదలయ్యే రెండు మూడు రోజుల ముందు తెలిసే అవకాశముంది.వచ్చే నెలలో ప్రారంభమయ్యే బిగ్బాస్ కొత్త సీజన్ కోసం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలని టీం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆటో రాంప్రసాద్ దాదాపు ఖరారు కాగా యాదమ్మ రాజు, దీపిక రంగరాజు, ఎక్స్ప్రెస్ హరి, ఆషిక, నూకరాజు, పల్లవి గౌడ లేదా పల్లవి రామిశెట్టి లాంటి టీవీ సెలబ్రిటీలు ఈసారి షోలోకి రానున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు: ఉప్పల్ బాలు) -
ఏడేళ్ల తరువాత డీపీ మార్చిన ప్రభాస్.. కారణం ఇదేనా
స్టార్ హీరోలు ఏ చిన్న పనిచేసినా వైరల్గా మారుతుంటారు. ఈ తరహాలోనే రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఓ చిన్న మార్పు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. ఇన్స్టాగ్రామ్ మొదలుపెట్టిన ఏడు సంవత్సరాల తరువాత తన ప్రొఫైల్ ఫొటోను ప్రభాస్ మార్చడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఇన్నాళ్లూ ‘ బాహుబలి’ చిత్రంలోని ఫొటోనే డీపీగా ఉంచాడు. ఇప్పుడు ఫౌజీ చిత్రంలోని కొత్త స్టిల్ను ప్రొఫైల్గా మార్చారు. 'బాహుబలి' తర్వాత సలార్, కల్కీ వంటి భారీ చిత్రాలు ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ ప్రభాస్ తన డీపీని మార్చలేదు. ఇప్పుడు 'ఫౌజీ' చిత్రంలోని స్టిల్ను పెట్టడంపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాపై ప్రభాస్కు ఉన్న నమ్మకమే దీనికి కారణమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. ఇప్పటికే విడుదలైన తేదీ పోస్టర్తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ప్రభాస్ చేసిన ఈ మార్పు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గుప్తనిధులకై తండ్రికి వల.. బాలికతో నగ్న పూజలు!
ఆంధ్రప్రదేశ్, కడప: క్షుద్ర పూజలకు అడ్డుపడుతున్నాడనే వల్లూరులో బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యాయత్నానికి నిందితులు ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను వల్లూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన కారు, వేటకత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, కమలాపురం సీఐ మోహన్, వల్లూరు ఎస్సై శివనాగిరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారి కథనం ప్రకారం..డబ్బు ఆశ చూపి బాలికతో నగ్న పూజలుచిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన కాణిపాకం విజయ్కుమార్ అలియాస్ విజయ్, చిత్తూరు టౌన్ దుర్గానగర్కు చెందిన కర్ణం బాల హేమనాథ్ అలియాస్ హేమంత్, అదే ప్రాంతానికి చెందిన కర్ణం హేమనాథ్ బాల సుబ్రహ్మణ్యం ఒక ముఠాగా ఏర్పడ్డారు. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేయాలని నిర్ణయించారు. వీరు అనంతపురం జిల్లా శెట్టూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక తండ్రితో పరిచయం చేసుకుని డబ్బు ఆశ చూపి నగ్న క్షుద్ర పూజలు నిర్వహించారు.అనంతరం గుప్తనిధుల విషయమై కడపకు చెందిన వెంకటేష్ యాదవ్ను సంప్రదించగా, మరోసారి పూజలు చేయాలని బాలికను కడపకు తీసుకురావాలని సూచించాడు. ఈ క్రమంలో ఈ నెల 9న కారులో బాలికను, ఆమె తల్లిని కడపకు తీసుకొచ్చారు. అయితే వెంకటేష్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో బాలికను, ఆమె తల్లిని వల్లూరులోని విజయ్కుమార్ స్నేహితురాలు భాగ్యలక్ష్మి ఇంటికి తీసుకెళ్లారు. అయితే భాగ్యలక్ష్మి కొడుకు నాగ సాయి ప్రణవ్కు వీరిపై అనుమానం వచ్చింది. తన తల్లితో విజయ్కుమార్ సన్నిహితంగా ఉండటంతో అసలు వచ్చినవారెవరని ఆరా తీశాడు.దీంతో క్షుద్రపూజలకు ప్రణవ్ అడ్డుగా ఉన్నాడని నిందితులు ఈ నెల 10న అతడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో హతమార్చేందుకు దాడి చేశారు. అయితే ప్రణవ్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. నిందితులు పరారయ్యారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులు విజయ్కుమార్, హేమంత్, సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే అనంతపురంలో నిర్వహించిన క్షుద్రపూజలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కేసును అనంతపురానికి బదిలీ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈ కేసులో భాగ్యలక్ష్మి, వెంకటేష్ యాదవ్ పాత్రలపై లోతుగా దర్యాప్తు సాగిస్తున్నట్టు పేర్కొన్నారు. -
రొనాల్డో, జార్జినా వివాహం వెనుక షాకింగ్ ట్విస్ట్!
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆగస్టు 11న తన లాంగ్టైమ్ గర్ల్ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకలా జరిగింది. అయితే రొనాల్డో, జార్జినా వివాహం వెనుక దాగున్న ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్ధిక నిబంధనలు, షరతులతో రొనాల్డో, జార్జినా వివాహం జరగడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. వివాహ ధృవీకరణ పత్రంలోని వివరాల ప్రకారం, రొనాల్డో, జార్జినాలు 'ఆస్తి విభజన' చట్రం కింద వివాహం చేసుకున్నారు. ఈ లెక్కన వీరిద్దరు తమ వ్యక్తిగత ఆస్తులపై ఎవరికి వారే పూర్తి నియంత్రణ కలిగి ఉంటారని పోర్చుగీసు చట్టం చెబుతోంది.పోర్చుగీసు చట్టం ప్రకారం..పోర్చుగీస్ చట్టం ప్రకారం ఇలాంటి ఏర్పాటు వల్ల వివాహానికి ముందు, లేదా వివాహ సమయంలో ఇరుపక్షాల్లో ఎవరైనా సంపాదించిన ఆస్తులు, సంపాదనపై వారికే పూర్తి హక్కులు ఉండేలా రూపొందించడం జరుగుతుంది. ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకున్న దంపతులు విడాకులు తీసుకున్నప్పటికీ ఆస్తుల విభజనలో హక్కు మాత్రం ఇద్దరికి సమానంగా ఉంటుంది. ఉదాహరణకు ఒప్పందం ప్రకారం రొనాల్డో తన ఆదాయ వనరుల్లో కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్లు, వ్యాపార సంస్థల నుంచి వచ్చే ఆదాయంతో పాటు తాను ఆడుతున్న ఫుట్బాల్ క్లబ్ సహా సీఆర్7 హోటల్ చైన్లో అతడికి వచ్చే మొత్తం సంపాదన మొత్తంగా అతడికే చెందుతాయి తప్ప జీవిత భాగస్వామి జార్జినాకు పొందే అవకాశం ఉండదు.విడిపోతే నెలకు రూ. కోటి చెల్లింపుఅయితే ఒకవేళ భవిష్యత్తులో రొనాల్డో, జార్జినా విడిపోతే పోర్చుగీసు చట్టంలోని మొదటి నిబంధన ప్రకారం జార్జినాకు రొనాల్డో నుంచి 100,000 యూరో మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.10 కోట్లు) ఫించన్ రూపంలో అందుకుంటుంది. మరో నిబంధన ప్రకారం మాడ్రిడ్లోని లా ఫింకాలోని రొనాల్డోకు చెందిన విలాసవంతమైన భవనంపై మాత్రం జార్జినా పూర్తి యాజమాన్య హక్కు కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ భవనం ఆస్తి విలువ 5.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 53.50 కోట్లు)గా ఉంది. ఇక రొనాల్డో, జార్జినా వివాహం వారి ఐదుగురు పిల్లలు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సీక్రెట్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి వివాహానికి రొనాల్డో సహచర ఆటగాళ్లు కానీ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నస్ర్ క్లబ్ సహచరులు కానీ, సెలబ్రెటీలు ఎవరూ హాజరుల కాలేదు. మరో విషయమేంటంటే, వీరి పెళ్లి జరిగినప్పటికీ, ఈ ఇద్దరు తమ ఇంటిపేర్లను మార్చుకోకూడదని నిర్ణయించుకున్నారు.Read: తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లతో.. సర్ఫరాజ్కు చాన్స్! -
51 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు..!1992లోనే..
చదువుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉన్నవారికి వయసు ఎన్నడూ అడ్డంకి కాదని పలువురు నిరూపిస్తున్న ఘట్టాలు చూశాం. అంతేగాదు క్షణికావేశంలో కోరుకున్న కోర్సు చదవలేకపోయామనో, అనుకున్నది సాధించలేకపోయామనో జీవితాలను అంతం చేసుకునే యువతకు కనవిప్పు కలిగించేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా అలాంటి కోవలోకి చెన్నైవాసి చేరారు. పైగా ఆయన దివ్యాంగుడు, చక్కగా మరో రంగంలో కెరీర్ నిర్మించుకుని రిటైర్మెంట్ తీసుకునే వయసుకి వచ్చేశారు. అయినా తన చిరకాల కోరికను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ..యువతకు స్ఫూర్తిని రగిల్చారు. ఆయనే చెన్నైకి చెందిన 51 ఏళ్ల సురేష్ కుమార్. తమిళనాడులోని నాగపట్నం జిల్లా వేలంకన్ని నివాసి అయిన సురేష్ 1992లో 12వ తరగతి పూర్తి చేశారు . అప్పటి నుంచి ఆయనకు మెడిసిన్ చదవాలనే కోరిక ప్రబలంగా ఉండేది. అయితే అప్పట్లో మెడిసిన్ సీటు దక్కించుకోలేకపోయాడు. అదీగా కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా ఫార్మకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేశాడు. ఆ తర్వాత ఎంబీఏ, రెండు పీహెచ్చ్డీలు పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన డయాగ్నోస్టిక్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. నీట్లో సీటు సాధించాడు ఇలా..2022లో, సుప్రీంకోర్టు మెడికల్ అడ్మిషన్ల వయోపరిమితిని తొలగించిన తర్వాత కుమార్ నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యాడు. కానీ దానిని చేధించలేకపోయాడు. అయితే 2026లో 18 నెలల ప్రిపరేషన్ తర్వాత మళ్లీ మెడికల్ ప్రవేశ పరీక్షకు ప్రయత్నించాడు. ఈసారి 192 మార్కుల సాధించి పీడబ్ల్యూడీ కోటా కింద చెన్నైలో నాగపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించాడు. పూర్తి సమయం పని చేస్తూనే, సురేష్ కుమార్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ప్రిపరేషన్ కొనసాగించాడు. అతను తరచుగా రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు ప్రిపరేషన్ సాగించినట్లు తెలిపాడు. తనకు అర్థంకానీ జీవశాస్త్రాన్ని కొడుకు అర్థమయ్యేలా బోధించినట్లు వివరించారు. అలాగే గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసి తన ప్రిపరేషన్ సామర్థ్యాన్ని ట్రాక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగానే వైద్య విద్య అభ్యసించాలనే కోరిక మరింత పెరిగిందని అన్నారు. పదవీవిరమణ వయసులో ఇలా కాలేజ్కి వెళ్లి చదువుకోవాలన్న తన ఆశయానికి భార్య దుర్గ, కుటుంబం పూర్తి మద్దతు ఇచ్చిందని చెప్పారు. తన భార్య ఉపాధ్యాయురాలని చెప్పారు. ఇక తనకు ఎనిమిది, పది చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను తన 72 ఏళ్ల తల్లితో కలిసి జీవించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తనకు సీటు కేటాయించిన మెడికల్ కాలేజ్ ఏడు కి.మీల దూరంలో ఉందని అందుకని సైకిల్పై వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించింది. అందులో స్పోర్ట్స్ కేటగిరీ కింద 15 సీట్లు, మాజీ సైనికుల పిల్లలకు 11, పీడబ్ల్యూడీ కేటగిరీ కింద 224, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5% కోటా కింద 614 సీట్లతో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది.(చదవండి: పాట పాడినందుకు విధుల నుంచి తొలగించారు..! ఇవాళ ఏకంగా..) -
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్యులు ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో భాగంగా కరోనరీ యాంజియోగ్రఫీ పరీక్ష కూడా చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఎయిమ్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జేపీ నడ్డాకు ఆగస్టు 13న(గురువారం) అస్వస్థత కారణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు కరోనరీ యాంజియోగ్రఫీతో పాటు పలు పరీక్షలు చేపట్టారు.కార్డియాలజీ విభాగంలో పరిశీలనప్రస్తుతం జేపీ నడ్డా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. “జేపీ నడ్డాకు అసౌకర్యంగా అనిపించడంతో పరీక్షలు నిర్వహించాం. కరోనరీ యాంజియోగ్రఫీ సహా పలు పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కార్డియాలజీ విభాగంలో పరిశీలనలో ఉన్నారు” అని ఎయిమ్స్ తన ప్రకటనలో వెల్లడించింది.ఇంకా వైద్యుల పర్యవేక్షణలో..నడ్డా ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వర్గాలు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నాయి. వైద్యుల సూచనల మేరకు ఆయనకు చికిత్స, పర్యవేక్షణ కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా గతంలో బాధ్యతలు నిర్వహించిన నడ్డా(65).. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. అటు జంతర్ మంతర్ నిరసనల సమయంలో సీజేపీ ప్రతినిధులతోనూ కేంద్రం తరఫున చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులు, అభిమానులు నడ్డా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. -
‘ఎంపీ డెవలపర్స్’ బ్రాండ్ అంబాసిడర్గా సమంత
దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నటి సమంత కొత్త బాధ్యతలను స్వీకరించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ ‘ఎంపీ డెవలపర్స్’(MP Developers) తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా సమంతను నియమించినట్లు ప్రకటించింది.ఈ భాగస్వామ్యానికి ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ అనుబంధం ఉందని కంపెనీ చెప్పింది. ఎంపీ డెవలపర్స్ సంస్థ ప్రస్థానం, నటి సమంత కెరీర్.. రెండూ చెన్నైలోని పల్లవరం ప్రాంతం నుంచే ప్రారంభం కావడం విశేషం. చెన్నై మూలాల నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించే దిశగా సాగుతున్న తమ ప్రయాణానికి సమంత చేరిక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.14 ఏళ్ల విశ్వసనీయత.. 250కి పైగా ప్రాజెక్టులుకంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో స్థాపించిన ఎంపీ డెవలపర్స్ గత 14 ఏళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో విశేష పురోగతిని సాధించింది. ఇప్పటివరకు 250కి పైగా నివాస ప్రాజెక్టులను పూర్తి చేసింది. 3,000 కంటే ఎక్కువ కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంది. చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో ప్రస్తుతం 1.5 మిలియన్ చదరపు అడుగుల (15 లక్షల చ.అ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఎంపీ డెవలపర్స్ యాజమాన్యం స్పందిస్తూ.. ‘ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల భవనం మాత్రమే కాదు; అది ఒక కుటుంబం భవిష్యత్తు కలలకు పునాది. అత్యుత్తమ లొకేషన్, సమర్థవంతమైన డిజైన్, నిర్మాణ నాణ్యత, కస్టమర్ల సుదీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం’ అని తెలిపింది.గ్రోత్ గ్యారెంటీ హోమ్స్సొంతింటి కలను నెరవేర్చుకోవడంతోపాటు ఇల్లు కొనడాన్ని భవిష్యత్తుకు బలమైన పెట్టుబడిగా మార్చే దిశగా ఎంపీ డెవలపర్స్ ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ అనే వినూత్న భావనను అందుబాటులోకి తెచ్చింది.ఈ ప్రాజెక్టుల ప్రధాన ముఖ్యాంశాలుఅధిక అభివృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేయడి.మెరుగైన రవాణా / కనెక్టివిటీ సౌకర్యాలు కల్పించడం.ఆచరణాత్మకమైన, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించే గృహాలను రూపొందించడం.విస్తరణ దిశగా అడుగులుఈ సందర్భంగా ఎంపీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ మలినేని మాట్లాడుతూ.. ‘మా 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రోజు ఒక కీలకమైన కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 250కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేసి 3,000 కుటుంబాల విశ్వాసాన్ని పొందడం మా బాధ్యతను మరింత పెంచింది. సమంతతో ఈ కొత్త భాగస్వామ్యం మా బ్రాండ్ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. ఇది ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. తమిళనాడులోని ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు ఎన్ఆర్ఐ వినియోగదారులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అన్నారు. ‘Built for Living. Guaranteed for Growth’ అనే స్పష్టమైన విధానంతో నాణ్యమైన ఇళ్లను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబం భవిష్యత్తు పురోగతికి విలువ జోడించడమే లక్ష్యంగా ఎంపీ డెవలపర్స్ తన తదుపరి ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందన్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
టాప్ 100 పోలీస్ చీఫ్లలో ఇద్దరు తెలుగు అధికారులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ నాయకత్వాన్ని గుర్తిస్తూ ఫేమ్ ఇండియా, ఏషియా పోస్ట్ సంయుక్తంగా 100 మంది ఉత్తమ పోలీస్ చీఫ్ల జాబితాను విడుదల చేశాయి. వీరిలో వి.వి.రాకేష్ రెడ్డి పి.(ఎస్.పి.గోల్పారా).. అసోం, గుండాలరెడ్డి రాఘవేంద్ర (ఎస్పీ ఝార్సుగూడ), ఒడిషా ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు చోటు దక్కించుకున్నారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్, సాంకేతికత వినియోగం, పారదర్శక పరిపాలన, సంక్షోభ సమయాల్లో వేగవంతమైన నిర్ణయాలు, ప్రజలతో విశ్వాసపూర్వక సంబంధాలు వంటి అంశాల్లో విశేషంగా పనిచేసిన అధికారులను ఈ జాబితాకు ఎంపిక చేశారు.ఒక సమాజం నిజమైన అభివృద్ధి సాధించాలంటే ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావన కలిగి ఉండాలని, ఆ భద్రతే విద్య, వ్యాపారం, పరిశ్రమలు, సామాజిక జీవితం సజావుగా ముందుకు సాగేందుకు పునాదిగా నిలుస్తుందని ఫేమ్ ఇండియా పేర్కొంది. చట్టవ్యవస్థను కాపాడటం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన వెన్నుముకగా పనిచేస్తుందని తెలిపింది. జిల్లా పోలీస్ చీఫ్లు, ప్రధాన పోలీస్ విభాగాల అధిపతులు ఎస్పీ, ఎస్ఎస్పీ, డీసీపీ, కమిషనర్ వంటి హోదాల్లో ఉన్నప్పటికీ వారి బాధ్యతలు అత్యంత విస్తృతంగా ఉంటాయంది. నేరాలను నియంత్రించడం, మహిళలు-పిల్లలకు రక్షణ కల్పించడం, సైబర్ నేరాలు-సంఘటిత నేరాలను అరికట్టడం, ట్రాఫిక్ను నిర్వహించడం, సంక్షోభ పరిస్థితుల్లో వేగంగా స్పందించడం వంటి బాధ్యతలతో పాటు ప్రజల విశ్వాసాన్ని కూడా వారు సంపాదించాల్సి ఉంటుందని పేర్కొంది.ఫేమ్ ఇండియా ఎడిటర్ ధీరజ్ కుమార్ మాట్లాడుతూ, నిర్మాణాత్మక జర్నలిజాన్ని ప్రోత్సహించడం తమ సంస్థ లక్ష్యాల్లో భాగమని, సమాజంపై సానుకూల ప్రభావం చూపుతున్న పరిపాలకులు, ప్రజాసేవకుల పనితీరును వెలుగులోకి తీసుకురావడంలో ఫేమ్ ఇండియా చాలాకాలంగా కృషి చేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా చట్టవ్యవస్థను పర్యవేక్షిస్తున్న అనేక మంది జిల్లా పోలీస్ చీఫ్లు, యూనిట్ అధిపతుల నుంచి 100 మందిని ఎంపిక చేయడం కష్టమైన ప్రక్రియని పేర్కొన్నారు.ఫేమ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింగ్ మాట్లాడుతూ, ఈ సర్వే నిరంతర ప్రక్రియ అని, అధికారుల పనితీరు, ప్రజాసేవా రికార్డును భవిష్యత్తులోనూ పరిశీలిస్తామని చెప్పారు. తదుపరి దశలో ఈ 100 మంది నుంచి భారత్లోని టాప్ 25 పోలీస్ చీఫ్లను ఎంపిక చేసి, ఫేమ్ ఇండియా రాబోయే సంచికలో ప్రచురించనుంది. ఎంపికయ్యే ఆ 25 మంది అధికారులకు ప్రత్యేక సన్మానాలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.కాగా ఈ గౌరవంపై గుండాలరెడ్డి రాఘవేంద్ర స్పందించారు. “ఇది మొత్తం జార్సుగూడ పోలీసు కుటుంబం సాధించిన సమిష్టి విజయం. వృత్తి నైపుణ్యం, సున్నితత్వం, సాంకేతికత, వినూత్న ఆలోచనలతో ప్రజలకు సేవ చేయడంతో పాటు నేరాలపై ఏమాత్రం సహనం లేకుండా పనిచేయడమే మా లక్ష్యం” అని రాఘవేంద్ర తెలిపారు.గుండాల రెడ్డి రాఘవేంద్ర నేపథ్యంజార్సుగూడ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న , ఐపీఎస్ దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేస్తున్న టాప్ 100 ఐపీఎస్ అధికారులలో గుర్తింపు పొందారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సాంకేతికత ఆధారిత దర్యాప్తు, ముందస్తు నేర నియంత్రణ, మాదకద్రవ్యాల కట్టడి, సైబర్ నేరాల ఛేదన, కేసుల వేగవంతమైన దర్యాప్తు, బలహీన వర్గాల రక్షణతో పాటు పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంపై రాఘవేంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన నాయకత్వంలో జార్సుగూడ పోలీసులు రాష్ట్రంలోని జిల్లా వారీ ప్రగతి డ్యాష్బోర్డ్లో మొదటి స్థానం, తప్పిపోయిన చిన్నారులను గుర్తించడంలో 95.7 శాతం ట్రేసింగ్ రేటు సాధించడంతో పాటు హత్యలు, దోపిడీలు, ఏటీఎం కేసులను విజయవంతంగా ఛేదించారు. అలాగే భారీగా మాదకద్రవ్యాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పోక్సో, ఇతర కీలక క్రిమినల్ కేసుల్లో దోషులకు శిక్షలు పడేలా చేశారు. -
నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. నెలకొకసారి అలా చేస్తుంటా
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 'తిరంగా కా సురక్ష' పేరుతో శుక్రవారం ఓ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న తెలుగు హీరో నాగార్జున.. తానూ సైబర్ క్రైమ్ బాధితుడినేనని చెప్పి షాకిచ్చారు. నాలుగేళ్ల క్రితం సైబర్ ఫ్రాడ్కి గురయ్యానని, బ్యాంక్ అధికారి పేరుతో కాల్ వచ్చిన సంగతి బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు: ఉప్పల్ బాలు)'మేం ఇంజనీరింగ్ చదివే టైంలో అంటే 1977లో అపుడే కంప్యూటర్స్ వచ్చాయి. మా కాలేజీ రోజుల నుంచే మెయిల్ అకౌంట్స్ మాల్ వేర్స్, హ్యాకింగ్ జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్లు హెచ్చరించేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సైబర్ క్రైమ్ సమస్య కొనసాగుతూనే ఉంది. నేను కూడా సైబర్ ఫ్రాడ్ బాధితుడినే. ఐదేళ్ల క్రితం బ్యాంక్ ఆఫీసర్నని ఓ వ్యక్తి కాల్ చేశాడు. మార్కెటింగ్ గురించి బాగా తెలిసిన వ్యక్తి నన్ను ఇన్వెస్ట్మెంట్ గురించి బలవంతం చేశాడు. అంతెందుకు మాయమాటలతో మా కుటుంబంలోనే కొందరిని ఆరు ఏడు గంటల పాటు డిజిటల్ అరెస్ట్ కూడా చేశారు''విదేశాలకు నార్కోటిక్ సబ్స్టాన్స్ పార్సిల్ పేరుతో కాల్స్ చేసేవారు. అయితే సైబర్ క్రైమ్ నేరాలని అరికట్టడంలో దేశంలోనే తెలంగాణ సైబర్ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. నేను వారానికి ఒకసారి మొబైల్ పాస్ వర్డ్, నెలకోసారి వైఫై పాస్వార్డ్స్ మారుస్తూ ఉంటాను. నా మొబైల్లో కనీసం ఫొటోలు కూడా తీసుకోను. ఇండస్ట్రీలో పైరసీ అరికట్టడం కోసం సీవీ ఆనంద్, సజ్జనార్ ఎంతగానో కృషి చేశారు. ఈ విషయంలోనూ తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉంటారు. ఇతర దేశాలకు వెళ్లి మరీ సైబర్ నేరస్థులని పట్టుకుని అరెస్ట్ చేశారు. జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది' అని నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ) -
ఆస్తి దాహం.. కొడుకు చేసిన పని వైరల్
ఆస్తి కోసం బంధాలను మరిచిపోయిన ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. మంచాన పడ్డ తండ్రికి వైద్యం చేయిస్తానంటూ అందరినీ నమ్మబలికి తన వెంట తీసుకెళ్లాడు. ఆపై ప్రాణం పోయాక.. ఛీ కొట్టే పనికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో వైరల్ అవుతోంది. యూపీ లక్నోలోని ఖరౌహా గ్రామానికి చెందిన ఛత్రపాల్ (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకు మహేంద్ర, కోడలు లక్ష్మి ఛత్రపాల్ను వేధించసాగారు. దీంతో ఆయన తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ జీవనం సాగించారు. ఈ క్రమంలో.. ఓరోజు తన ఆస్తిని కూతుళ్లకు సమానంగా పంచుతున్నానని, కొడుకు-కోడలును బహిష్కరిస్తున్నట్లు పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పరిణామంతో మహేంద్ర, అతని భార్య రగిలిపోయారు. అయితే జులై 7న ఛత్రపాల్ ఆరోగ్యం క్షీణించడంతో మహేంద్రకు అతని సోదరి సమాచారం ఇచ్చింది. దీంతో మహేంద్ర తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి, వైద్యం చేయిస్తానంటూ తండ్రిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ రెండు రోజులకే అంటే జులై 9న ఛత్రపాల్ మృతి చెందారు.తండ్రి అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్న కుమార్తెలకు మరో షాక్ ఎదురైంది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మహేంద్ర తన మృత తండ్రి బొటనవేలిని ఖాళీ కాగితాలపై ముద్రిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పత్రాలపై తీసుకున్న వేలిముద్రలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకుంటారోనని అనుమానం వ్యక్తం చేశారు.ఆపై ఊహించిందే జరిగింది. ఆస్తంతా తనదేనంటూ గొడవకు దిగాడు మహేంద్ర. దీంతో ఛత్రపాల్ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి శవంతో ఖాళీ పేపర్లపై వేలిముద్ర వేయించుకున్న దృశ్యాల్ని పోలీసులకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైరల్గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
‘ప్రతీ నీటి బొట్టూ మా రెడ్లైన్’.. భారత్కు పాక్ హెచ్చరిక!
ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య నీటి వివాదం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘పాకిస్తాన్ నీటిలో ప్రతి ఒక్క చుక్కా మా రెడ్లైన్’ అంటూ భారత్ను ఆయన హెచ్చరించారు. భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే నేరుగా స్పందిస్తామని వ్యాఖ్యానించారు.శాంతి గురించి మాట్లాడుతూనే.. భారత్కు హెచ్చరికలు జారీ చేయడం పాకిస్థాన్ రాజకీయాల్లోని ద్వంద్వ వైఖరిపై మరోసారి చర్చకు దారితీసింది. ఓవైపు శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే.. మరోవైపు నీటి విషయంలో ఎలాంటి చర్యనైనా సహించేది లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.అసలు వివాదం?1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. సింధు నదీ వ్యవస్థలోని నీటిని రెండు దేశాలు ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఈ ఒప్పందం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సింధు, జీలం, చీనాబ్ నదులను ప్రధానంగా పాకిస్తాన్కు, రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్కు కేటాయించింది. అయితే ఇరు దేశాలకు కొన్ని పరిమిత వినియోగ హక్కులను కూడా ఒప్పందం కల్పించింది. అయితే 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ దాడికి పాక్ మద్దతున్న ఉగ్రవాదులే కారణమని భారత్ ఆరోపించింది. ఆ తర్వాత పాకిస్తాన్పై తీసుకున్న కీలక చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ‘అబేయన్స్’లో ఉంచింది. ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ మొదలైంది.భారత్ ట్విస్ట్.. ఒప్పందం అమలులో ఉన్న సమయంలో భారత్ నుంచి పాకిస్తాన్కు నదుల నీటి మట్టాలపై కీలక సమాచార మార్పిడి జరిగేది. ముఖ్యంగా వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం పెరిగితే ముందస్తు హెచ్చరికలు పాకిస్తాన్కు ఉపయోగపడేవి. ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఈ సమాచారాన్ని పంచుకోవడం కూడా భారత్ ఆపేసింది. దీంతో నీటి అంశం కేవలం రెండు దేశాల మధ్య జల వివాదంగా కాకుండా.. భద్రత, ఉగ్రవాదం, దౌత్యం, రాజకీయ ఒత్తిడి అన్నీ కలిసిన పెద్ద అంశంగా మారింది. ఇప్పుడు షెహ్బాజ్ షరీఫ్ వ్యాఖ్యలు కూడా అదే రాజకీయ నేపథ్యంలో చూడాల్సి ఉంది. “మేము శాంతిని కోరుకుంటున్నాం.. కానీ మా శాంతిని బలహీనతగా భావించొద్దు” అంటూ ఆయన ఒకవైపు చెబుతూనే.. భారత్ తమ నీటి హక్కులను ప్రభావితం చేసే చర్యలు తీసుకుంటే గట్టిగా స్పందిస్తామని హెచ్చరించారు. అంటే.. శాంతి సందేశమా? లేక రాజకీయ హెచ్చరికా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.పాక్ మాత్రం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా నిలిపివేసిందని ఆరోపిస్తోంది. తమకు ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే ఉందని వాదిస్తూ అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తుతోంది. కానీ, భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని ఒకవైపు, నీటి సహకారాన్ని మరోవైపు విడదీసి చూడాలనే పాక్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూనే నీటి విషయంలో పాత ఒప్పందం ప్రకారం హక్కులు కావాలనుకోవడం ఎలా? అన్నది భారత రాజకీయ వాదనలో కీలక అంశంగా మారింది. ఇదే ఇప్పుడు పాకిస్తాన్కు పెద్ద సవాలుగా మారుతోంది. ఎందుకంటే నీటి అంశాన్ని అంతర్జాతీయ ఒత్తిడి కోసం ఉపయోగించాలనుకుంటున్న ఇస్లామాబాద్కు.. భారత్ మాత్రం దీనిని తన భద్రతా ప్రయోజనాలతో ముడిపెడుతోంది. -
10 ఏళ్లకు స్టైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్
సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ (Instagram) తన స్టైల్ మార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తన వర్డ్మార్క్ లోగో (అక్షరాల శైలి)ను రీఫ్రెష్ చేసింది. ఈ విషయాన్ని మెటా ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్గా మారాయి. గత 10 ఏళ్లుగా యాప్ పైన ఉండే వర్డ్మార్క్ మారలేదు. అందుకే ఈ మార్పు చేశాం. ఇది మరింత క్లీన్గా, మోడరన్గా ఉంటూనే ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ శైలిని ప్రతిబింబిస్తుంది అంటూ ఆదమ్ మోస్సేరి ఈ మార్పుపై వివరణ ఇచ్చారు. View this post on Instagram A post shared by Adam Mosseri (@mosseri) ఇన్స్టాగ్రామ్ పేరులోని అక్షరాల రూపాన్ని (Typography) పునఃరూపకల్పన చేశారు. పాత స్క్రిప్ట్ శైలినే కొనసాగిస్తూనే, అక్షరాలను మరింత స్పష్టంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే అందరికీ సుపరిచితమైన రంగుల గ్రాడియంట్ కెమెరా ఐకాన్ (Camera Icon)లో ఎలాంటి మార్పు లేదు. 2016లో క్లాసిక్ బ్రౌన్ కెమెరా స్థానంలో ఈ గ్రాడియంట్ ఐకాన్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనఈ కొత్త డిజైన్పై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ అసలుగుర్తింపు దెబ్బతినకుండా చక్కగా మోడరనైజ్ చేశారని కొందరు యూజర్లు మెచ్చు కుంటున్నారు. మరికొందరు ఈ డిజైన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపొందించినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. వర్డ్మార్క్లోని 'r' అక్షరం చూడటానికి 'z' లాగా కనిపిస్తోందని, ఇన్స్టాగ్రామ్ కాస్త "Instagzam" లా మారింది అంటూ మరికొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లతో.. సర్ఫరాజ్కు చాన్స్!
శ్రీలంకతో గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాలే పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాతి మూడు రోజులు స్పిన్నర్లకు ఉపయుక్తంగా ఉంటుందని పిచ్ రిపోర్ట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మ్యాచ్కు ఒక్కరోజు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ, తుదిజట్టు ఇంకా ఖరారు కాలేదు. గాలే పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఈ లెక్కన కుల్దీప్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ లేదా సారాంశ్ జైన్లో ఒకరు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు దక్కించుకోనున్నారు. ఇక సిరాజ్, గుర్నూర్ బ్రార్ లేదా ప్రసిధ్ క్రిష్ణలు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో తొలి ఐదు స్థానాల్లో (జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, గిల్, పంత్) ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఆరో స్థానంపై తెగ చర్చ నడుస్తోంది. ఆరో స్థానంలో జురెల్ లేదా సర్ఫరాజ్ల్లో ఒకరికే చాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే సీనియార్టీ ప్రకారం జురెల్ కంటే సర్ఫరాజ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్ఫరాజ్ లంకతో తొలి టెస్టులో ఆడడం దాదాపు ఖాయమైనట్లే.టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్/సారాంశ్, సిరాజ్, గుర్నూర్/ప్రసిధ్ క్రిష్ణ.🚨 NOT A TURNER ❌ - Galle pitch is likely to be batting friendly in first 2 days. [Sahil Malhotra from TOI]India likely to field 2 quicks & 3 spinners for depth and balance. pic.twitter.com/vx6k5h5aLy— Johns. (@CricCrazyJohns) August 14, 2026Read: వీవీఎస్ లక్ష్మణ్కు బీసీసీఐ అత్యున్నత పదవి? -
కారు ప్రమాదం.. దురుసుగా మాట్లాడిన నిర్మాత మురళి
హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను సినీ నిర్మాత బొమ్మకు మురళికి చెందిన కారు ఢీ కొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం రాత్రి అబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పరుశురామ్ తెలిపిన మేరకు.. నాంపల్లి ఆండాలమ్మబాడ ప్రాంతానికి చెందిన సునీత గన్ఫౌండ్రీలోని ఎస్బీఐలో హౌస్ కీపింగ్గా పనిచేస్తోంది.బుధవారం రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా అబిడ్స్ చాపల్ రోడ్డు వద్ద ఎదురుగా రోడ్డుపై నిలిచి ఉన్న కారు ఒక్కసారిగా అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మహానందను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.డ్రైవర్ను చంపుకోండి: నిర్మాత మురళి బాధితురాలి వైద్యానికి అవసరమైన ఖర్చు భరించాలని స్థానికులు డ్రైవర్ను కోరారు. అయితే తాను కేవలం డ్రైవర్మాత్రమేనని.. యజమాని అయిన ప్రొడ్యూసర్ బొమ్మకు మురళితో మాట్లాడాలని సమాధానం చెప్పాడు. దీంతో వారు నిర్మాతతో మాట్లాడారు. అయితే అతను.. డ్రైవర్నే డబ్బులు అడగాలని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు చెప్పకుండా కారు బయటకు తీసుకెళ్లాడని.. కావాలంటే మీరు చంపుకోండి.. పోలీస్ కేసు పెట్టుకోండి అని అన్నారు. తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని దురుసుగా మాట్లాడాడు.ఇదిలా ఉండగా నిర్మాత భార్యను షాపింగ్ కోసం తీసుకువచ్చి కారును రోడ్డుపైనే ఆపి నిద్రపోయాడు. ప్రొడ్యూసర్ భార్య డ్రైవర్కు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా నిద్రలేచి కారును స్టార్ట్ చేయగా మహిళను ఢీకొట్టినట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ పరశురామ్ తెలిపారు. -
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ
మూడు నెలల క్రితం 'కరుప్పు'(తెలుగులో వీరభద్రుడు)తో హిట్ కొట్టిన సూర్య.. ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో వచ్చేశాడు. దీనికి తెలుగువాడైన వెంకీ అట్లూరి దర్శకుడు కాగా, నాగవంశీ నిర్మాత. మమిత బైజు హీరోయిన్. రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. ఎలా ఉందంటే?కుటుంబ నేపథ్యంలో సాగే సినిమా ఇది. సాంప్రదాయాలు, బంధాలు, తల్లి-కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాల చుట్టూ కథ తిరుగుతుంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు, మానవ సంబంధాలని హృదయాలను హత్తుకునేలా తీర్చిదిద్దాడు. కాసేపు నవ్విస్తూ మరి కాసేపు భావోద్వేగానికి గురిచేస్తూ బోర్ కొట్టకుండా కథనాలు నడిపించాడు.సంజయ్ విశ్వనాధ్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించే సన్నివేశంతో మూవీ ప్రారంభమవుతుంది. తర్వాత సంజయ్ ఫ్యామిలీ నేపథ్యం, మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన తీరు చూపించారు. ఆ వెంటనే బిడ్డ కోసం సరోగసి మార్గం ఎంచుకోవడం... కొడుకు సర్జరీ కోసం సరోగసి మదర్ మ్యాడీ ఇండియాకు రావడంతో కథ కామెడీ టర్న్ తీసుకుంటుంది. మ్యాడీ చేసే అల్లరి థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. అదే సమయంలో తల్లితో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు గుండెని బరువెక్కిస్తాయి.టీవీ షో ఎపిసోడ్ అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తి పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనం చాలావరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. మదర్ ఎపిసోడ్లో తెరపై సూర్య కన్నీళ్లు పెట్టుకుంటే సీట్లో ఉన్న ప్రేక్షకుడి గుండె బరువెక్కుతుంది. ఆ తర్వాత కథనం కొంతవరకు నెమ్మదిగా సాగుతుంది. పెళ్లి ఎపిసోడ్ అయితే కొంత సాగదీత అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉంది.ఎవరెలా చేశారంటే?సంజయ్ విశ్వనాధ్ పాత్రల్లో సూర్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. మమితకు మంచి పాత్ర లభించింది. మ్యాడీగా ఆమె చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మమిత పాత్రను మర్చిపోరు. తల్లిగా రాధిక చక్కగా నటించింది. మిగిలిన వాళ్లు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతిక విషయాలకొస్తే మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్ తెరపై చాలా రిచ్గా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్లో కొన్ని సీన్లని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.అంజి శెట్టే , సాక్షి వెబ్ డెస్క్ -
చైనా గేమ్లో పావుగా భారత్?.. అమెరికా షాకింగ్ ఆరోపణలు
అమెరికా–చైనా వాణిజ్య పోరు మరో కీలక మలుపు తిరిగింది. చైనాపై అమెరికా విధించిన భారీ టారిఫ్లను తప్పించుకునేందుకు.. భారత్ సహా 40కిపైగా దేశాల మీదుగా చైనా తన వస్తువులను అమెరికా మార్కెట్లోకి పంపుతోందని అమెరికా ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ‘షాడో ట్రాన్స్షిప్మెంట్ నెట్వర్క్’గా అభివర్ణించారు. అంతేకాదు.. ఇక ఇలాంటి సరుకులను గుర్తించేందుకు అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను రంగంలోకి దింపబోతోంది. దీంతో అసలు చైనా ఏం చేస్తోంది? భారత్ పేరు ఈ వ్యవహారంలో ఎందుకు వచ్చింది? అమెరికా చెప్పే ‘ట్రాన్స్షిప్మెంట్’ అంటే ఏమిటి? అన్న ఆసక్తి మొదలైంది.‘ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్’ పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనాలో తయారైన వస్తువులు నేరుగా అమెరికాకు వెళ్తే భారీ టారిఫ్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొన్ని సరుకులను మూడో దేశాల మీదుగా అమెరికాకు పంపుతున్నారని ఆరోపించింది. ఈ క్రమంలో వస్తువులను మరో దేశానికి పంపించి అక్కడ రీప్యాకేజింగ్, రీలేబెలింగ్, స్వల్ప స్థాయి ప్రాసెసింగ్, ఇన్వాయిస్ లేదా షిప్పింగ్ మార్గంలో మార్పులు చేస్తున్నారని అమెరికా పేర్కొంది. దీంతో అసలు వస్తువు చైనాలో తయారైనప్పటికీ.. పత్రాల్లో అది మరో దేశం నుంచి వచ్చినట్లుగా కనిపించే అవకాశం ఉంటుందని తెలిపింది.అంటే.. చైనా సరుకు.. మధ్యలో మరో దేశం.. చివరికి అమెరికా మార్కెట్! ఇదే అమెరికా ఆరోపిస్తున్న ట్రాన్స్షిప్మెంట్ విధానం. ఈ నెట్వర్క్లో భారత్తో పాటు మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల పేర్లను కూడా నవారో ప్రస్తావించారు. ఈ మార్గంలో అక్రమంగా మళ్లుతున్న వస్తువుల విలువ ఏటా 40 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అమెరికా నివేదిక అంచనా వేసింది. అయితే ఈ అంచనా ఉపయోగించిన పద్ధతి, ట్రాన్స్షిప్మెంట్కు ఇచ్చే నిర్వచనాన్ని బట్టి మారుతుందని స్పష్టం చేసింది.టార్గెట్ భారత్..ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికా నివేదికలో పుణే,గుజరాత్,చెన్నై ఉత్పత్తి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనా తయారు చేసిన పంపులు, కంప్రెషర్లు భారత్ మీదుగా అమెరికాకు చేరుతున్నాయని నవారో ఉదాహరణగా చెప్పారు. ఇక్కడే ఒక కీలక విషయాన్ని గమనించాలి. అమెరికా నివేదికలో భారత్ పేరు రావడం అంటే భారతదేశం మొత్తం అక్రమంగా చైనాకు సహకరిస్తోందని అర్థం కాదు. నిజమైన భారతీయ తయారీ, చట్టబద్ధమైన ప్రాసెసింగ్, విదేశీ పెట్టుబడులు, సరఫరా గొలుసుల మార్పులను కూడా అక్రమ ట్రాన్స్షిప్మెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అందుకే అమెరికా ఇప్పుడు తన తదుపరి ఆయుధంగా AIని ఉపయోగించబోతోంది.‘డిటెక్టివ్ బోర్డర్’గా పేర్కొన్న AI ఆధారిత వ్యవస్థ ద్వారా అమెరికా అధికారులు షిప్మెంట్లకు సంబంధించిన భారీ డేటాను విశ్లేషించనున్నారు. సరుకు ఎక్కడి నుంచి బయలుదేరింది? దాని గత రూట్ ఏంటి? తయారీదారు ఎవరు? కంపెనీల యాజమాన్య సంబంధాలు ఏంటి? ఒక దేశానికి అంత భారీగా ఆ వస్తువులను తయారు చేసే సామర్థ్యం ఉందా? ఉత్పత్తి వర్గీకరణలో ఏమైనా అనుమానాలున్నాయా? వంటి అంశాలను పరిశీలించనున్నారు. అనుమానం బలపడితే.. సరుకును అడ్డుకోవడం, అదనపు సుంకాలు వసూలు చేయడం, జరిమానాలు విధించడం లేదా అమెరికా మార్కెట్లోకి ప్రవేశాన్ని నిరోధించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదంతా ఎందుకు?2018లో చైనాపై అమెరికా సెక్షన్ 301 కింద టారిఫ్లు విధించిన తర్వాత.. చైనా ఎగుమతులు మూడో దేశాల ద్వారా మళ్లించే విధానం పెరిగిందని అమెరికా ఆరోపిస్తోంది. భారీ సుంకాల నుంచి తప్పించుకునేందుకు మూడో దేశాలను మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారని వాషింగ్టన్ వాదిస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా వ్యూహం మారుతోంది. గతంలో ‘చైనా నుంచి నేరుగా వస్తోందా?’ అని చూసే స్థాయి నుంచి.. ఇక ‘చైనా నుంచి వచ్చి మధ్యలో ఏ దేశాల మీదుగా తిరిగి వచ్చింది?’ అనే స్థాయికి తనిఖీలు వెళ్లబోతున్నాయి.భారత్పై ఎఫెక్ట్?భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు విస్తరిస్తున్న సమయంలో.. భారతదేశాన్ని చైనా టారిఫ్లను తప్పించుకునే మార్గంగా ఉపయోగిస్తున్నారన్న అనుమానాలు పెరిగితే, కొన్ని భారతీయ ఎగుమతులపై అదనపు తనిఖీలు లేదా చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు.. అమెరికా ఆరోపణలకు తగిన ఆధారాలు, నిర్దిష్ట కేసులు, అధికారిక దర్యాప్తు ఫలితాలు బయటకు రావాల్సి ఉంది. కేవలం ఒక నివేదికలో దేశం పేరు ప్రస్తావించబడటాన్ని బట్టి మొత్తం భారత ఎగుమతి రంగంపై తీర్పు ఇవ్వడం సరికాదు. -
వల్గర్ వీడియోలు.. దేనికి పనికొస్తాయని అడిగారు: ఉప్పల్ బాలు
శనివారం(ఆగస్టు 15) నుంచి బిగ్బాస్ తెలుగు అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రసారం కానుంది. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు దీనిని టెలికాస్ట్ చేయనున్నారు. ఇందులో మొత్తం 70 మంది సామాన్యులు పోటీపడగా వాళ్లలో 15 మందిని ఎంపిక చేశారు. వీళ్లకు పోటీలు పెట్టి ఐదారుగురిని బిగ్బాస్ 10వ సీజన్లోకి తీసుకోనున్నారు. అయితే తనకెలాంటి పోటీలు పెట్టకుండా అన్యాయంగా బయటకు పంపేశారని, దీనికి నవదీప్ కారణమని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఉప్పల్ బాలు వరస వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: సంక్రాంతి బరిలో శ్రీనువైట్ల.. రెండేళ్ల తర్వాత దొరికిన హీరో)'మిడిల్ క్లాస్ వాళ్లంటే మనసుండదా? మేం ఎన్నోరోజుల నుంచి కష్టపడి వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటే ఓ ప్రశ్న అడగకుండా, టాస్క్ పెట్టకుండా.. మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? అవి వల్గర్గా ఉంటాయి అని అన్నారు. నవదీప్ గారు మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? మీరు ఎవరికైనా లక్ష రూపాయలు దానం చేశారా? ఎవరైనా పెళ్లయితే పుస్తె మెట్టలు ఇప్పించారా? మీరెలా మాట్లాడతారు సర్? అంటే మిడిల్ క్లాస్ వాళ్లం ఏం చేయలేం? మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు. మేమే తోపులం అనుకుంటున్నారా? మీకు అవకాశమిస్తే మీరక్కడ కూర్చున్నారు. ఏదో ఒకరోజు మీకు శాపం తగులుతుంది. అగ్నిపరీక్షకు పిలిచి అవమానించడం కాదు. నవదీప్ గారు నేను అస్సలు వదిలిపెట్టను. అక్కడ ఏం జరిగిందనేది ప్రతి ఒక్కటి చెబుతాను. న్యాయం జరగాలి నాకు' ఉప్పల్ బాలు తన వీడియోలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది: రష్మిక) View this post on Instagram A post shared by BIGGBOSS10TELUGU (@officialbiggbosstelugu) -
విజయ్ సర్కార్కు బిగ్ విక్టరీ
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు బిగ్ రిలీఫ్ లభించింది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు తమిళనాడు సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయంలో ఈ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కరూర్ బాధిత కుటుంబాలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సరైంది కాదని ఈ ఉద్యోగాలు చెల్లవని ఈ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.కాగా గతేడాది సెప్టెంబర్లో కరూర్లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు. ఆ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కరూర్ బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. బాధితులకు ఆర్ధిక సాయం అందించవచ్చు. కానీ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో మరణించినవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత, నిర్దేశిత నియామక ప్రక్రియ (TNPSC వంటి పరీక్షలు) ద్వారా రావాలే తప్ప, ఇలా ఉచితంగా పంచేది కాదని స్పష్టం చేసింది.ఇది సాధారణ అభ్యర్థుల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంతైనా ఆర్థిక సాయం అందించుకోవచ్చని, కానీ రాజ్యాంగ నిబంధనలు, పరిమితులను దాటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పెట్టేది కాదని వ్యాఖ్యానిస్తూ కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టేవిధించింది. దీంతో కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట లభించింది. -
‘‘మధ్యలో మీ జోక్యమేంటి?’’.. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: నల్సార్ లా వర్సిటీ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ విద్యార్థులే తప్పు చేసినా.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంలో బీసీఐ జోక్యం చేసుకోవడం పూర్తిగా అనవసరమని వ్యాఖ్యానించారు.హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనాల్సిన కార్యక్రమంపై నిరసన వ్యక్తం అయ్యింది. జంతర్ మంతర్ విద్యార్థుల లాఠీఛార్జి పిటిషన్ విచారణలో ఆయన వైఖరి సరిగా లేదని.. ఆయన నుంచి పట్టా అందుకోవడం తమకు ఇష్టం లేదని చెబుతూ వర్సిటీ నిర్వాహకులకు వాళ్లు సైన్ పిటిషన్ అందజేశారు. ఈ వ్యవహారాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరువు వ్యవహారంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో.. 2026 బ్యాచ్ న్యాయ విద్యార్థుల ఎన్రోల్మెంట్ను నిలిపివేయాలని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యార్థులందరినీ ఒకే కోణంలో చూడటం సరికాదని, కొందరి చర్యలకు మొత్తం బ్యాచ్ను బాధ్యులను చేయడం అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా.. విచారణ సందర్భంగా బీసీఐ జోక్యంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.బీసీఐకి నోటీసులుసీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్ను విచారణ జరిపింది. నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ వివాదంపై సుప్రీంకోర్టు బీసీఐకి నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అసలు ఆ ఆదేశాలు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఇప్పటికే వివాదాస్పద ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు బీసీఐ కోర్టుకు తెలిపింది. ఈ తరుణంలో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.‘‘ఇది విద్యార్థులు–నా మధ్య విషయం’’నల్సార్ విద్యార్థులపై బీసీఐ తీసుకున్న చర్యలపై స్పందించిన సీజేఐ.. ఇది విద్యార్థులకు, తనకు మధ్య ఉన్న అంశమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమని అన్నారు. నిరసన వ్యక్తం చేశారనే కారణంతో వారి భవిష్యత్పై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.‘‘విద్యార్థుల హక్కుల పరిరక్షణే ముఖ్యం’’బీసీఐ చైర్మన్ మానన్ మిశ్రా కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. తొందరపాటులో ఆదేశాలు ఇచ్చామని, విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే 40 నిమిషాల్లో సవరించామని పేర్కొన్నారు. బీసీఐ, విద్యార్థుల హక్కుల విషయంలో ఎలాంటి ఘర్షణ లేదని స్పష్టం చేశారు. ‘‘అభిజీత్ దీప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా.. మా లక్ష్యం ఒక్కటే. విద్యార్థుల హక్కులను కాపాడటం’’ అని మానన్ మిశ్రా వ్యాఖ్యానించారు.‘కాక్రోచ్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదంఈ వివాదానికి నేపథ్యం సీజేఐ సూర్యకాంత్ గతంలో చేసిన బొద్దింకల వ్యాఖ్యలు. ఆయన చేసిన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో ఆన్లైన్ ప్రచారం, ఆందోళనలు జరిగాయి.. అయితే తాను నకిలీ డిగ్రీలతో వస్తున్న న్యాయవాదుల్ని ఉద్దేశించే అన్నానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ జెన్జీ ఉద్యమం చల్లారలేదు. తాజా బీసీఐ ఆదేశాల అనంతరం CJP నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ‘‘అన్ని లీగల్ కాక్రోచ్లు ఒక్కటైతే?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీసీఐ చైర్మన్పైనా విమర్శలు కూడా చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.బీసీఐకి సీజేఐ స్పష్టమైన సంకేతంనల్సార్ వ్యవహారంలో సీజేఐ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల అభిప్రాయ స్వేచ్ఛ, నిరసన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంస్థలు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ పరిణామం మరోసారి తెరపైకి తెచ్చింది. -
ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
కొడుకుని క్రికెటర్ చేయాలని తండ్రి కిడ్నీ దానం
హైదరాబాద్, లక్డీకాపూల్: 16 ఏళ్ల వర్ధమాన క్రికెటర్కు అతని తండ్రి మూత్రపిండాన్ని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) వైద్యులు విజయవంతంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఈ వివరాలు గురువారం యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున వెల్లడించారు. మలక్పేటకు చెందిన బాలుడు చిన్నప్పటినుంచీ విరాట్ కోహ్లీని ఆరాధిస్తూ బౌలర్గా రాణిస్తున్నాడు. అయితే పుట్టుకతోనే మూత్రనాళ సమస్యతో బాధపడుతున్నాడు. ’ప్రీ–ఎంటివ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్’ చేయాలని ఏఐఎన్యూ వైద్యులు సూచించారు. బాలుడి తండ్రి ఖాజా అసీముద్దీన్ తన ఒక మూత్రపిండాన్ని కుమారుడికి దానం చేయాలని నిర్ణయించారు. డాక్టర్ మల్లికార్జున నేతృత్వంలో శస్త్రచికిత్స నిర్వహించారు. -
ఆగస్టు 15.. ఢిల్లీలో హైఅలర్ట్
సాక్షి, ఢిల్లీ: రేపు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రకోట చూట్టూ వెయ్యి కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోకి వచ్చే వాహనాలన్నిటినీ తనిఖీ చేపడుతున్నారు.భారత్ రేపు తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తారు. మన జాతీయ గేయం 'వందేమాతరం' రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవ చరిత్రలోనే మొదటిసారిగా ఎర్రకోటపై వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు.ఎర్రకోట నుండి ప్రధాని చేసే ప్రసంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'భాషిణి' అనువాదకం ద్వారా దేశంలోని 22 అధికారిక భాషల్లోకి ఒకే సమయంలో అనువదించి ప్రసారం చేస్తారు. దీనివల్ల ఎవరి మాతృభాషలో వారు ప్రసంగాన్ని స్పష్టంగా వినవచ్చు. -
వీవీఎస్ లక్ష్మణ్కు బీసీసీఐ అత్యున్నత పదవి?
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే బీసీసీఐ అత్యున్నత పదవిని అలంకరించనున్నట్లు సమాచారం. గంభీర్ స్థానంలో టీమిండియా హెడ్కోచ్గా రానున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్కు బీసీసీఐ (హెడ్కోచ్ పదవికి మించి) డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.కొత్తగా రూపొందించనున్న డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవికి లక్ష్మణ్ అయితేనే మంచి ఫలితం ఉంటుందని బీసీసీఐ భావించింది. అంతేకాదు లక్ష్మణ్ ఆ పదవిలో తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహిస్తాడని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు సీఈవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.ప్రస్తుతం లక్ష్మణ్ సీవోఈ హెడ్గా ఆటగాళ్ల పునరావాసం, శిక్షణ వంటి బాధ్యతలు చూస్తున్నాడు. 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా నియమితులైతే, ఆయన పరిధి మరింత విస్తృతం కానుంది. సీనియర్ పురుషుల, మహిళల జట్ల వ్యూహరచన, జాతీయ సెలక్షన్ కమిటీతో సమన్వయం, జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకు ఆటగాళ్ల ప్రగతిని పర్యవేక్షించడం వంటి కీలక అధికారాలు ఆయన చేతికి రానున్నాయి.ఇదే సమయంలో, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం కూడా సెప్టెంబర్తో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించాలా? లేక కొత్త వారిని నియమించాలా? అనే అంశంపై కూడా బీసీసీఐ చర్చిస్తోంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కొత్త కోచింగ్ బృందంతో సమన్వయం కోసం లక్ష్మణ్ లాంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.గతంలో రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టాలని బీసీసీఐ కోరినప్పటికీ, లక్ష్మణ్ సున్నితంగా తిరస్కరించాడు. బెంగళూరులోని నూతన సీవోఈ ప్రాజెక్టుపై దృష్టి సారించేందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు గాడిన పడటంతో, ఆయన అనుభవాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది. Read: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్ -
కర్ణాటకలో కొత్త బిల్లు.. ఆరెస్సెస్కు చెక్ పెట్టేందుకేనా?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్-ఆరెస్సెస్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ భవనాలు, భూములు, పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు తదితర ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వినియోగించుకునే విధానాన్ని నియంత్రించేందుకు సిద్ధమైన కొత్త బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యం ఆరెస్సెస్ను కట్టడి చేయడమేనా? అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.‘కర్ణాటక రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రెమైసెస్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ బిల్–2026’ పేరుతో తీసుకొస్తున్న ఈ చట్టం ద్వారా ప్రభుత్వ ఆస్తుల వినియోగానికి స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాల కోసం ప్రభుత్వ స్థలాలను ఉపయోగించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసినా, వాటికి నష్టం కలిగించినా చర్యలు, జరిమానాలకు అవకాశం ఉండనుంది. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాత్రం ఈ బిల్లు ఏ ఒక్క సంస్థను లక్ష్యంగా చేసుకుని తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. ప్రజా ఆస్తులను రక్షించడం, వాటి వినియోగంలో జవాబుదారీతనం తీసుకురావడమే ఉద్దేశమని చెప్పారు. ప్రత్యేకంగా ఆరెస్సెస్, ఏదైనా సంస్థ, క్లబ్, యూనియన్ లేదా ఎన్జీవోను అడ్డుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు.అయితే, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆరెస్సెస్ ప్రభుత్వ స్థలాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రజా ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 2025లో ప్రభుత్వం ఇలాంటి వినియోగంపై నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, ఆ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టులో సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పుడు అదే అంశానికి చట్టబద్ధమైన రూపం ఇవ్వడానికి కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 2026 జూన్లో ప్రియాంక్ ఖర్గే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్కు బహిరంగ లేఖ రాయడం కూడా ఈ పరిణామానికి రాజకీయ నేపథ్యాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆరెస్సెస్ చట్టపరమైన నమోదు, ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాల్లో పారదర్శకత, పన్నుల నిబంధనలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తాజాగా కేబినెట్ ఆమోదించిన బిల్లుపై సహజంగానే ఆరెస్సెస్ పేరు చర్చకు వచ్చింది. కొన్ని రాజకీయ వర్గాలు ఇది ఆరెస్సెస్ కార్యకలాపాలపై నియంత్రణ పెంచే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం “నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి” అని చెబుతోంది.ఈ బిల్లు కేవలం ఆరెస్సెస్ కార్యక్రమాలకే పరిమితం కాదు. ప్రభుత్వ భూములు, భవనాలు, పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు వంటి ప్రజా ఆస్తులను ఉపయోగించే ప్రైవేటు సంస్థలు, సంఘాలు, అసోసియేషన్లు, సొసైటీలు అన్నింటికీ ఒకే విధమైన అనుమతి వ్యవస్థను తీసుకురావడం ప్రతిపాదనలో ఉంది. అనుమతి లేకుండా వినియోగించడం లేదా ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అంశాలపై కూడా చర్యలు ఉండనున్నాయి. అయితే అసలు రాజకీయ పరీక్ష ఇక ముందే ఉంది. కేబినెట్ ఆమోదించిన బిల్లును శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాల్సి ఉంది. అక్కడ ప్రతిపక్షం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది? ప్రభుత్వం నిబంధనలను ఎలా అమలు చేస్తుంది? ఆరెస్సెస్ సహా ఇతర సంస్థలు దీనిపై న్యాయపరంగా స్పందిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ (197 బంతుల్లో 101 పరుగులు) శతకంతో చెలరేగాడు. డార్విన్ వేదికగా ఆడుతున్న టెస్టులో తంజిద్ తన కెరీర్లో డెబ్యూ సెంచరీ అందుకున్నాడు. అయితే తంజిద్కు ఇది రెండో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అంతేకాదు ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా తంజిద్ చరిత్ర సృష్టించాడు. అంతకముందు ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో బంగ్లాదేశ్కు హసన్ సర్కార్ సాధించిన 76 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డు కనుమరుగైంది. ఓవరాల్గా విదేశాల్లో సెంచరీ సాధించిన రెండో బ్యాటర్గా తంజిద్ నిలిచాడు. 2022లో మహ్మదుల్ హసన్ డర్బన్ వేదికగా సౌతాఫ్రికాపై 137 పరుగులు సాధించాడు. ఇక ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన రెండో బంగ్లాదేశ్ క్రికెటర్గా తంజిద్ మరో రికార్డు అందుకున్నాడు. గతంలో 2006లో షాహ్రియర్ నఫీ 138 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే బంగ్లాదేశ్ ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. నజ్ముల్ షాంటో (75 బ్యాటింగ్), ముష్ఫికర్ రహీమ్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక తంజిద్, నజ్ముల్ కలిసి మూడో వికెట్కు 93 పరుగులు జోడించారు. అంతకముందు మోమినుల్ హక్ (49) అర్ధసెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. బంగ్లా బౌలర్ మహ్ముద్ హసన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇదే మ్యాచ్లో తస్కిన్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఆరో బంగ్లాదేశ్ బౌలర్గా తస్కిన్ నిలిచాడు. తస్కిన్ కంటే ముందు షకీబ్ అల్ హసన్ (712 వికెట్లు), ముష్రఫె మోర్తజా (389), ముస్తాఫిజుర్ రెహ్మన్ (383), మెహదీ హసన్ (369 వికెట్లు), తైజుల్ ఇస్లామ్ (302 వికెట్లు) ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 77 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.Tanzid Hasan has the first Test century of his career! 👏#MilestoneMoment | @NRMAInsurance | #AUSvBAN pic.twitter.com/lXkIJrXHAO— cricket.com.au (@cricketcomau) August 14, 2026 A moment to remember. 💯🇧🇩 Tanzid Hasan Tamim celebrates a maiden Test century in Darwin! What a knock. 🔥🏏#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/WypnVcwYBw— Bangladesh Cricket (@BCBtigers) August 14, 2026Read: 47 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్న మాజీ స్పిన్నర్ -
కూటమిలో కుంపటి.. మరో కొత్త తలనొప్పి!
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత అద్వాన్నంగా పనిచేస్తున్నది ఆ పార్టీల నేతలే బహిర్గతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంత అరాచకం సాగుతున్నది కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఓపెన్గా మాట్లాడుతున్నారు. టీడీపీకి ఒకప్పుడు గట్టి మద్దతుదారులుగా ఉన్న కొంతమంది మేధావులు ప్రభుత్వ తీరుపై పెదవి విరవడమే కాకుండా, ప్రభుత్వం ఐసీయులో ఉందని కామెంట్ చేస్తున్నారు.ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య ఆరోపణల పర్వం, విజయవాడలో టీడీపీకే చెందిన డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులుతో బలవంతపు రాజీనామా చేయించడం తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా సహాకార పాల ఉత్పత్తుల సంఘం విజయ డెయిరీ చైర్మన్గా చలసాని ఆంజనేయులు మరోసారి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్లకు నచ్చలేదేమో తెలియదు. క్యాబినెట్ సమావేశం జరుగుతుండగానే ఇద్దరు మంత్రులు హుటాహుటీన డెయిరీ ఆఫీస్కు వెళ్లి ఆంజనేయులు రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు పంపకపోతే వారు ఎందుకు వస్తారన్నది టీడీపీ వర్గాలలో ఉన్న టాక్.ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెంటనే రంగంలో దిగి డెయిరీ కార్యాలయానికి వెళ్లి ఆంజనేయులును బెదిరించారట. రాజీనామాకు ఆయన సుముఖంగా లేరు. అయినా మంత్రుల హూంకరింపులతో ఆంజనేయులు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆంజనేయులు కూడా టీడీపీకి చెందినవారే అయినా ఎందుకు ఇంతగా కక్ష కట్టారన్న చర్చ జరుగుతోంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈయనపై అసంతృప్తిగా ఉన్నారట. ఆయన అలిగారట. దాంతో ఆయనను బుజ్జగించడానికి గాను ఆంజనేయులుతో రాజీనామా చేయించాలని అధిష్టానం భావించిందట.అయితే చంద్రబాబు కుటుంబానికి చెందిన పాల కంపెనీకి లాభం చేకూర్చడానికే చలసానితో రాజీనామా చేయించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అది వేరే విషయం. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రి యాజమాన్యానికి మంత్రులు చెప్పారట. అంతేకాక ఈ క్రమంలో ఆంజనేయులుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మద్దతుదారులుగా పేరొందిన కొందరు యూట్యూబ్ చానళ్లలో ఆవేదన వ్యక్తం చేశారు. పైగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన పార్ధసారధి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బెడ్పై ఉన్న ఆంజనేయులుతో రాజీనామా పత్రాన్ని తీసుకుని ఫోటో దిగడంపై వారు మండిపడ్డారు. పార్ధసారధి తన లాయల్టీని రుజువు చేసుకోవడానికి ఇంతగా తాపత్రయ పడ్డారని వీరు అంటున్నారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీకి వ్యతిరేకంగా అన్ని ఆరోపణలు చేసినా, మరికొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా, వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని టీడీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఘట్టం గుర్తుకు వస్తుంది. 1995లో పార్టీని చంద్రబాబు కైవసం చేసుకున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆస్పత్రికి వెళ్లి ఎన్టీఆర్ నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారని చెబుతారు. సరిగ్గా అదే రీతిలో టీడీపీ నాయకత్వం ఇప్పుడు వ్యవహరించిందన్నమాట. కాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రభుత్వంలో సాగుతున్న అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటికి పలుమార్లు ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన కొందరు సాగిస్తున్న గంజాయి, ఇసుక మాఫియాలపై ఓపెన్గానే మాట్లాడారు.తాజాగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్పై సంచలన ఆరోపణలు చేశారు. మద్యం, ఇసుక, గ్రావెల్ మాఫియాలలో దామచర్లకు వాటాలు ఉన్నాయని, రేషన్ బియ్యం మాఫియా నుంచి నెలకు 25 లక్షలు వసూలు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ అడ్డాగానే దందాలు సాగిస్తున్నారని కూడా బాలినేని అన్నారు. దీనికి ప్రతిగా దామచర్ల కూడా బాలినేనిపై పలు ఆరోపణలు చేశారు. బాలినేని పార్టీ మారకపోతే, బాలినేని ఆయన కుమారుడు ఈపాటికి జైలులో ఉండేవారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలు చూస్తే ఏమి అర్దం అవుతుంది. ప్రభుత్వంలోను, అలాగే అధికార కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు అడ్డూ, ఆపు లేకుండా పోయిందనే కదా! కాని వీరిద్దరు సమన్వయం పాటించాలని టీడీపీ, జనసేన ముఖ్యనేతలు ఒంగోలులోని తమ పార్టీ నేతలకు సందేశం పంపించారట. అంతే తప్ప ఇరువురు చేసుకున్న ఆరోపణలపై విచారణ చేయించి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా లేదన్నమాట.అవినీతిని కాపాడటమంటే ఇది కదా అన్నది ప్రజల భావన. దీనిని కప్పిపుచ్చుకోవడానికి మూడు పార్టీల సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారు. మనలో మనం విమర్శలు చేసుకోవదని సలహా ఇచ్చాయి. అంతే తప్ప అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించలేదు. పనిలో పనిగా సోషల్ మీడియాలో కూటమి మిత్రపక్షాలలో విభేదాలు సృష్టించడానికి వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని పిచ్చి ఆరోపణ చేశారు.ఈ మధ్య ఒక సినిమాకు సంబంధించి టీడీపీ, జనసేనల అభిమానులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారట. కొందరైతే దూషణలకు దిగారట. వాటిని వైఎస్సార్సీపీ అంటకట్టి తప్పించుకోవాలని చూస్తే ఎవరు నమ్ముతారు! కాగా రాష్ట్రంలో జరుగుతున్న అద్వాన్న పాలనను, అవినీతిని ప్రశ్నించని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీపై కొత్త ఆరోపణ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గోవింద నామాన్ని పేరడిగా వాడుతున్నారన్నది ఆయన అభ్యంతరమట. నిజంగానే ఆయన చిత్తశుద్దితో అభిప్రాయపడితే తగు సూచన చేయడం తప్పుకాదు. కాని సినిమాలలో ఎన్ని రకాల పేరడిలు హిందూ మత విశ్వాసాలపై జరిగాయో ఆయనకు తెలియదా! గోవిందా పేరుతో సినిమానే వచ్చింది. గతంలో ఎన్టీఆర్ ఒక సినిమాలో గోవింద అంటూ ఒక బాబాపై పాటకట్టారే. ఇలా ఎన్నో సన్నివేశాలు సినిమాలలో ఉన్నాయి. వాటి గురించి ఏమంటారో తెలియదు.మంత్రి లోకేష్ కూడా గతంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా గోవిందా.. అంటూ నినాదాలు చేసిన వీడియోలు కూడా చక్కర్లు తిరుగుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాటను కూడా చూపుతున్నారు. అందుకే ఏదైనా విమర్శ చేయాలనుకుంటే ముందూ, వెనక ఆలోచించాలని అంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తిరుమల స్వామివారి ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశారు. వైఎస్సార్సీపీపై బురద వేసే క్రమంలో ఈ ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న విమర్శలు వచ్చాయి. తదుపరి సీబీఐ దర్యాప్తులో అలాంటి జంతు కొవ్వు కల్తీ ఏది జరగలేదని తేలింది. మరి దానిపై వీరు స్పందించలేదు. ఇప్పుడు మాత్రం మళ్లీ సనాతన ధర్మం పేరుతో ప్రజలను ఏమార్చడానికి వచ్చినట్లుగా ఉంది.ఒంగోలులో తన పార్టీ నేత చేసిన ఆరోపణలపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు. పైగా రెండు పార్టీలు కాంప్రమైజ్ ఫార్ములా వర్కవుట్ చేయడం ఏమిటి? ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఒక కామెంట్ ఆసక్తికరంగా ఉంది. చలసాని ఆంజనేయులు నుంచి ఆస్పత్రిలోనే రాజీనామా పత్రాన్ని మంత్రి పార్ధసారధి తీసుకుంటున్న పోటో టాగ్ చేస్తూ ఐసీయూలో పార్టీ, ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ వారిని నిత్యం దూషించే చంద్రబాబు నాయుడు.. ఏబీతో పాటు మరికొందరు టీడీపీ వీర మద్దతుదారులు చేస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చే ధైర్యం చేయగలరా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సంక్రాంతి బరిలో శ్రీనువైట్ల.. రెండేళ్ల తర్వాత దొరికిన హీరో
అప్పట్లో వెంకీ, ఢీ, రెడీ లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న శ్రీనువైట్ల.. కాలక్రమంలో ట్రెండ్కి తగ్గ మూవీస్ తీయలేక చాలా వెనకబడిపోయారు. అవే రొటీన్ కామెడీ చిత్రాలు తీయడంతో అవి పెద్దగా ఆడలేదు. చివరగా రెండేళ్ల క్రితం గోపీచంద్తో 'విశ్వం' తీశారు గానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో శనివారం జరిగిన పూజా కార్యక్రమంతో లాంఛనంగా మూవీ మొదలైంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల కొత్త మూవీ చేస్తున్నారు. దీనికి 'జార్జ్ క్రిష్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జనవరి 14న సినిమా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ వదిలారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తుండగా అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. గతంలో శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా, నారీ నారీ నడుమ మురారీ లాంటి చిత్రాలతో సంక్రాంతికి హిట్స్ అందుకున్న శర్వానంద్.. ఈసారి ఏం చేస్తాడనేది చూడాలి?(ఇదీ చదవండి: పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది: రష్మిక) -
అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: అమరావతి పేరిట అడ్డగోలు నిర్మాణాలు.. వాటిపై వ్యయాలు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చు చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా, అప్పులు సైతం చేస్తున్నారని చేస్తున్నారన్నారు. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఏడేళ్లలో అమరావతికి చంద్రబాబు చేసిందేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడు అద్భుత నగరం నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. ఇది మార్కెటింగ్ తప్ప మరొకటి కాదన్నారు. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాదన్నారు. మరోవైపు ఖర్చులను భారీగా పెంచుతున్నారని మండిపడ్డారు. ‘‘అమరావతి అంటే అద్భుత నగరం కాదు.. అవినీతి, దోపిడీకి కేంద్రం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రోడ్ల నిర్మాణంపై ప్రశ్నలుఅమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయాలపై అంబటి రాంబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. కిలోమీటర్ రోడ్డుకు రూ.180 కోట్ల వరకు ఖర్చు చూపిస్తున్నారన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఏ దేశంలోనూ రోడ్ల కోసం ఇంత భారీగా ఖర్చు చేయరని అన్నారు. 21.77 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,519 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తున్నారని.. రూ.100 కోట్లలో పూర్తయ్యే పనులను అంచనాలు పెంచి రూ.356 కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు. చదరపు మీటర్ రోడ్డుకు రూ.10 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రైతుల పరిస్థితిపై ప్రశ్నలురాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల పరిస్థితిపైనా అంబటి ప్రశ్నలు లేవనెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లే అవుట్లు అందించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొలాలు ఇచ్చినందుకు రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.‘‘అద్దాల భవనాల పేరుతో వేల కోట్లు’’అమరావతిలో అద్దాల భవనాలు, భారీ నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంబటి అన్నారు. తాత్కాలిక స్టీల్ బ్రిడ్జి కోసం రూ.80 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిలో చదరపు అడుగు ధర రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు పెరిగిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.‘‘బాబు, లోకేశ్లకు చెప్పే ధైర్యం ఉందా?’’అమరావతిలో జరుగుతున్న వ్యయాలపై ప్రజలు, మేధావులు ఆలోచించాలని అంబటి రాంబాబు కోరారు. అప్పులు తీసుకువచ్చి వాటిలోనూ కమీషన్లు దండుకుంటున్నారంటూ చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్పై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. -
సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, తిరుపతి: ఏపీ సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు (శుక్రవారం) మానుకొండూరు రైల్వేస్టేషన్ పరిధిలో సంపర్క్ క్రాంత్రి ట్రైన్ S1 కోచ్లో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే రైలు నిలిపివేసి మరమ్మత్తులు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం ట్రైన్ యాథావిధిగా గమ్యస్థానాలకు వెళ్లింది. ప్రయాణికులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. -
పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది
కొన్నిరోజుల క్రితం 'మైసా' షూటింగ్ సందర్భంగా గాయపడిన రష్మిక.. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. అయితే ఎక్కువరోజులు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది అని చెబుతూ కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే తన పేరిట అన్నదానం కూడా నిర్వహించారని చెబుతూ ఓ వీడియోని పంచుకుంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)'ఎప్పుడైనా ఎక్కువరోజులు ఇంట్లో ఉంటే ఇలానే గడుస్తుంది. క్షణం తీరిక లేకుండా గడిపేవారికి విశ్రాంతి.. భయంగా అనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు బిజీబిజీగా గడిపే పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది. బహుశా జీవితం అంటే ఇదేనేమో?' అని సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ పెట్టింది.గతేడాది నవంబరులో 'గర్ల్ ఫ్రెండ్'తో హిట్ కొట్టిన రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది. రెండు నెలల క్రితం 'కాక్ టెయిల్ 2' అనే హిందీ మూవీతో థియేటర్లలోకి వచ్చింది. భర్తతో కలిసి చేస్తున్న 'రణబాలి' షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' చేస్తోంది. దీని చిత్రీకరణలోనే తుంటి భాగానికి గాయమవగా.. ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అత్తారింట్లో రెస్ట్ తీసుకుంటోంది. తాజాగా రష్మిక అమ్మ ఈమె దగ్గరకొచ్చి పలకరించింది.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విటర్ రివ్యూ) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
తల్లి మార్కెట్కు రానివ్వలేదని.. కూతురు విషాద నిర్ణయం!
హైదరాబాద్: తల్లి మందలించడంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ బ్యాంక్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తర ప్రదేశ్కు చెందిన మీనాదేవికుటుంబం మల్లాపూర్ బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. బుధవారం తల్లి కూరగాయల మార్కెట్కు వెళ్తుండగా తను కూడా వస్తానని కూతురు ఖుషి చౌహాన్ (14) అడిగింది. దీంతో తల్లి వద్దని చెప్పి వెళ్లింది. మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మార్కెట్ నుంచి వచ్చిన తల్లి చూసేసరికి కుమార్తె ఆత్మహత్య చేసుకుంది.ముఖ్య గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
ఫాంటసీ థ్రిల్లర్ తెలుగు సినిమా 'కెరూబ్'
విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'కెరూబ్' బాలు బల్లెకారి నిర్మించారు. ఫాంటసీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఎం జె నాయుడు (జీవన్) తీశారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. సెప్టెంబరులో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు దర్శకనిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఆహ్లాదకరమైన ప్రకృతిలో హీరో వేణువు వాయిస్తున్నట్లు ఇందులో చూపించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు. -
మానవ చరిత్రలో కన్నీటి అధ్యాయం.. మోదీ
సాక్షి, ఢిల్లీ: దేశ చరిత్రలో అత్యంత బాధాకరమైన అధ్యాయాలలో దేశ విభజన ఒకటని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ఆగస్టు 14 "విభజన భయానక స్మృతి దినం" సందర్భంగా ఎక్స్ ఖాతాలో విభజన దినోత్సవ విషాద స్మృతులను ఆయన పంచుకున్నారు. దేశ విభజన అంతులేని జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందని, కుటుంబాలను నిర్వాసితులను చేసిందని అపారమైన మానవ వేదనకు కారణమైందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.ప్రధాని ఎక్స్ ఖాతాలో "ఈరోజు మనం విభజన విషాధ స్మృతి దినాన్ని పాటిస్తున్నాము. విభజన కారణంగా ప్రభావితమైన ప్రతి ఒక్కరి ధైర్యాన్ని మనం గుర్తుచేసుకుంటున్నాము. ఇది అనేక జీవితాలను ఛిన్నభిన్నం చేసిన చారిత్రక క్షణం... కుటుంబాలు నిర్వాసితులయ్యాయి, ప్రియమైన వారిని కోల్పోయారు అపారమైన బాధను అనుభవించారు. " అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ఈ విషాదాన్ని తట్టుకుని నిలబడిన వారి పట్టుదలను ఆ సందర్భంగా ఆయన కొనియాడారు.ఊహించని కష్టాలు ఎదురైనప్పటికీ, చాలా మంది తమ జీవితాలను మళ్లీ నిర్మించుకుని దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. "వారి జీవిత ప్రయాణాలు మానవ ఆత్మ యొక్క బలాన్ని మనకు గుర్తుచేస్తాయి. మన దేశంలో ఐక్యతను, సౌభాత్రాన్ని కాపాడుకోవాలనే మన సంకల్పాన్ని ఈ రోజు మరింతగా బలోపేతం చేయాలి. ఒక వికసిత్ భారత్ను నిర్మించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం" అని ఆయన జోడించారు.కాగా విభజన బాధితులకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సైతం నివాళులర్పించారు. భారతదేశ విభజన వల్ల జరిగిన అపారమైన మానవ వేదనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఎంతటి కష్టాలు ఎదురైనా తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్న ప్రజల ధైర్యాన్ని మరియు పట్టుదలను ఆయన ప్రశంసించారు.లక్షలో సంఖ్యలో మరణాలు1947లో జరిగిన దేశ విభజన మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద విషాదకరమైన వలసలలో ఒకటి. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ దేశాలుగా విడిపోయింది. ఆ సమయంలో దాదాపు 1 కోటి 50 లక్షల మంది ప్రజలు సరిహద్దులు దాటారు. విభజన రేఖల వల్ల రెండు వైపులా తీవ్రమైన మతకల్లోలాలు జరిగాయి. ప్రజలు తమ ఇళ్లు, భూములు, వ్యాపారాలను ఉన్నపళంగా వదిలి శరణార్థులుగా మారారు. రవాణాపై దాడులు శరణార్థులతో వెళ్తున్న రైళ్లు, బస్సులు నడిచి వెళ్తున్న కాన్వాయ్లపై దాడులు జరిగాయి. సుమారు 2 లక్షల నుండి 20 లక్షల మంది వరకు చనిపోయారని అంచనా. లక్షలాది మంది ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయి, ఏళ్ల తరబడి శరణార్థుల శిబిరాల్లో మగ్గిపోయారు. ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన ప్రజల త్యాగాల జ్ఞాపకార్థం 2021 నుండి ఏటా ఈ రోజును "విభజన భయానక స్మృతి దినం" గా జరుపుకుంటున్నారు. -
తిరుగు ప్రయాణంలో విషాదం.. అన్నదమ్ముల పిల్లలు మృత్యు ఒడికి!
హైదరాబాద్, మోతీనగర్: మూడు కుటుంబాలు కలిసి దైవ దర్శనం చేసుకున్నాయి. తిరుగు పయనంలో నగరానికి బయలుదేరాయి. ఈ క్రమంలో వీరు వస్తున్న వాహనం అదుపుతప్పడంతో ఇద్దరు బాలురు మృతి చెందిన విషాదకర ఘటన షోలాపూర్లో చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.. కూకట్పల్లి పరిధి గాయత్రీనగర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్లోని మూడు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని తుల్జా భవానీ మాత దర్శనానికి వెళ్లి ఇదేరోజు తిరిగి నగరానికి వస్తుండగా.. షోలాపూర్ ఉమగ్రా వద్ద ఉదయం 10.30 గంటలకు వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఉజ్వల్ చౌదరి (12), దివేష్ చౌదరి (11) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంటర్ విద్యార్థిని డింపుల్ (17) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.మూలమలుపు కారణంగా వాహనాలు సరిగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు ఉజ్వల్, దివేష్ వరుసకు అన్నదమ్ములు. 6వ తరగతి చదువుతున్నారు. ఉజ్వల్ చౌదరి తండ్రి గణేష్, తల్లి రేఖ. దివేష్ చౌదరి తండ్రి చోగారాం, తల్లి చంపాదేవి. వీరు ఇరువురు కూడా వరుసకు అన్నదమ్ములే. వీరంతా బంగారం వ్యాపారం చేస్తుంటారు. మృతులకు గురువారం వి.రామారావు నగర్లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. బాధిత కుటుంబ సభ్యులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పరామర్శించారు. -
47 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్న మాజీ స్పిన్నర్
యాభై ఏళ్లకు దగ్గరగా ఉన్న ఆటగాళ్లు మహా అయితే ఏం చేస్తారు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి హాయిగా విశ్రాంతి తీసుకోవడం చూస్తుంటాం. కానీ సౌతాఫ్రికా మాజీ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మాత్రం 47 ఏళ్ల వయసులోనూ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఇమ్రాన్ తాహిర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2026లో గయానా అమెజాన్ వారియర్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. వయసు పెరిగినా తన స్పిన్లో పదును తగ్గలేదని నిరూపిస్తూ ఇమ్రాన్ తాహిర్ సూపర్ బౌలింగ్తో అదరగొట్టాడు. జమైకా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ఇమ్రాన్ తాహిర్ రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడం విశేషం. అంతేకాదు వయసుకు ఫిట్నెస్తో సంబంధం లేదని నిరూపిస్తూ ఇమ్రాన్ తాహిర్ రీజా హెండ్రిక్స్ ఇచ్చిన క్యాచ్ను ముందుకు వంగి అందుకోవడం ద్వారా అబ్బురపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇమ్రాన్ తాహిర్ 2011లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 20 టెస్టుల్లో 57 వికెట్లు, 107 వన్డేల్లో 173 వికెట్లు, 38 టీ20ల్లో 63 వికెట్లు పడగొట్టాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే జమైకా కింగ్స్మెన్పై గయానా అమెజాన్ వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా కింగ్స్మెన్ 19.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. రీజా హెండ్రిక్స్ (40) టాప్ స్కోరర్. గయానా బౌలర్లలో మొహమ్మద్ నబీ 4 వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహిర్, షమర్ జోసెఫ్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం గయానా వారియర్స్ 14.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షెయ్ హోప్ (56 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ చేయగా, గ్లెన్ ఫిలిప్స్ (28), నబీ (19) రాణించారు.47-YEAR-OLD IMRAN TAHIR IS STILL STRONG 😁🔥- He is dominating CPL as Captain & Bowler. pic.twitter.com/DsFm7dCLqA— Johns. (@CricCrazyJohns) August 14, 2026Read: ‘ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు’.. స్టార్ ప్లేయర్కు గంభీర్ వార్నింగ్! -
ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. స్టేషన్లో పెళ్లి.. గంటలోనే విషాదం!
ఇన్స్టాగ్రామ్లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ ప్రేమ కోసం కుటుంబాన్ని ఎదిరించింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు రైల్వే స్టేషన్లోనే అతడి చేత సింధూరం పెట్టించుకుంది. కొత్త జీవితంపై ఎన్నో కలలు కంటూ.. ఆ పెళ్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పెళ్లైన కొన్ని గంటల్లోనే ఆమె జీవితం విషాదంగా ముగిసింది.బీహార్లోని పూర్ణియా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 19 ఏళ్ల మానిషా కుమారి బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. దిల్ఖుష్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడితో ఆమెకు ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ ప్రేమకు కుటుంబం నుంచి అంగీకారం లభించలేదు. మానిషాకు మరో యువకుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మానిషా.. ప్రియుడు దిల్ఖుష్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆగస్టు 10న దిల్ఖుష్ మానిషాను అరారియా నుంచి తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ పూర్ణియా జంక్షన్కు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు లేరు.. బంధువులు లేరు.. పెళ్లి సందడి లేదు. అయినా తమ ప్రేమే తమకు అండగా భావించిన ఆ జంట.. రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే పెళ్లి చేసుకున్నారు. దిల్ఖుష్ మానిషా పాపిట్లో సింధూరం పెట్టాడు. ఇద్దరూ భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కానీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించిన కొద్దిసేపటికే కథ ఒక్కసారిగా మారిపోయింది.పెళ్లి తర్వాత ఇద్దరూ రాంబాగ్ నుంచి సిటీ కాళీ ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఎండ తీవ్రంగా ఉంది. మార్గమధ్యంలో మానిషాకు ఒక్కసారిగా కళ్లు తిరిగాయి. దీంతో, ఆమెను హుటాహుటిన పూర్ణియా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. మరోవైపు.. కుటుంబ సభ్యులు తమ కూతురి కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఆసుపత్రిలో విషాద వార్త వినిపించింది. చికిత్స పొందుతూనే మానిషా మృతి చెందింది. కొన్ని గంటల క్రితం భర్త పక్కన నిలబడి సింధూరంతో పెళ్లి ఫొటో దిగిన యువతి.. అదే రోజు విగతజీవిగా మారింది. మానిషా కుటుంబ సభ్యులు ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోలు చూసి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎక్కడుందో తెలుసుకునేలోపే.. ఆమె మరణవార్త కుటుంబానికి చేరింది.మానిషాకు అకస్మాత్తుగా ఏమైంది?ఎండ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైందా? లేక ఆమె మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? యువతి ఆకస్మిక మరణం అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేహాట్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. మానిషా భర్త దిల్ఖుష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరారియా నుంచి బయలుదేరినప్పటి నుంచి.. స్టేషన్లో జరిగిన పెళ్లి.. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడం.. ఆసుపత్రిలో మృతి చెందడం వరకు జరిగిన మొత్తం పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మానిషా మృతికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడనుంది. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొదలైన ప్రేమ.. చివరకు రైల్వే స్టేషన్లో పెళ్లిగా మారింది. ఆ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో మెరిసిన కొన్ని గంటల్లోనే.. అదే కథ విషాదంగా ముగిసింది. -
రెడ్ జోన్లో నిఫ్టీ, సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు తగ్గి 24,325 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 291 పాయింట్లు నష్టపోయి 77,783 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.92బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.65 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.65 శాతం పెరిగింది.నాస్డాక్ 0.81 శాతం పుంజుకుంది.Today Nifty position 14-08-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ 3జీ కటింగ్తో.. ఒక్క మొక్క 3 రెట్లు దిగుబడి!
మిద్దె తోటల్లో మొక్కలు గుబురుగా పెరిగి, ఎక్కువ దిగుబడి రావటానికి చేసే ఒక ముఖ్యమైన పద్ధతే 3జీ కటింగ్. ప్రధానంగా తీగ జాతి మొక్కలైన సొర, కాకర, దోస, బీర వంటి పంటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.1. మొక్క మొదటి తరాన్ని 1జీ అని, దాని నుంచి వచ్చే కొమ్మలను 2జీ అని, ఆ కొమ్మల నుంచి వచ్చే మరిన్ని కొమ్మలను 3జీ అని అంటారు. మొక్కకు కేవలం మగ పూలు కాకుండా, ఎక్కువ ఆడ పూలు (కాయలుగా మారేవి) రావటానికి ఈ పద్ధతిని వాడతారు.2. మొదటి తరం (1G -1st Generation) : మొక్క పెరగడం ప్రారంభించినప్పుడు, ప్రధాన కాండం సుమారు 7–8 అడుగుల పొడవు పెరిగే వరకు ఉంచాలి. ఆ తర్వాత, ఆ ప్రధాన కాండం చివరను (కొనను) కత్తిరించాలి. దీన్నే 1జీ కటింగ్ అంటారు.3. రెండో తరం (2G -2nd Generation) : ప్రధాన కాండం కత్తిరించిన తర్వాత ఆకు మూలల నుంచి కొత్తగా 2–3 కొమ్మలు వస్తాయి. వీటిని 2జీ కొమ్మలు అంటారు. ఈ 2జీ కొమ్మలు కూడా 2–3 అడుగులు పెరిగిన తర్వాత, వాటి చివరలను కూడా కత్తిరించాలి.4. మూడో తరం(3G -3rd Generation) : ఇప్పుడు 2జీ కొమ్మల నుంచి మరిన్ని కొత్త కొమ్మలు (3జీ) వస్తాయి.ఈ 3జీ కొమ్మలపైనే అత్యధికంగా ఆడ పూలు వస్తాయి, ఫలితంగా కాయలు ఎక్కువగా కాస్తాయి.5. మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కనీసం 10–12 ఆకులు ఉన్నప్పుడే కటింగ్ ప్రారంభించాలి.6. పొద జాతి మొక్కలకు (మిరప, టమోటా, మందార, మల్లె వంటివి) మనం చేసే కటింగ్ను సాధారణంగా ‘పించింగ్’ అని కూడా అంటారు. మొక్క 10–12 ఆకులతో ఒక అడుగు ఎత్తు పెరిగినప్పుడు, పై భాగంలోని లేత చిగురును తుంచేయాలి.7. చిగురు తుంచిన చోట నుండి రెండు, మూడు కొత్త కొమ్మలు వస్తాయి. అవి కొంచెం పెరిగిన తర్వాత వాటి చిగుర్లను కూడా తుంచితే, మొక్క మరింత గుబురుగా మారి ఎక్కువ పూలు, మొగ్గలు వస్తాయి.8. గోరుచిక్కుడు మొక్కకు సాధారణంగా 3జీ కటింగ్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది సహజంగానే కొమ్మలతో పెరుగుతుంది. అయితే మరీ పొడవుగా పెరుగుతుంటే పైభాగాన్ని తుంచవచ్చు.9. టమాటాలో 3జీ కటింగ్ కంటే సక్కర్స్ తొలగించటం, ప్రూనింగ్ చేయటం దిగుబడి పెంచడానికి బాగా పనిచేస్తుంది.10. టమాటాలో ΄ాకే రకాలు ఉంటాయి. ఇవి చాలా ఎత్తు పెరుగుతాయి. వీటి చివరలను కట్ చేస్తే పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి, సాధారణంగా వీటి కాండం పక్కల నుండి వచ్చే అనవసరమైన చిన్న రెమ్మలను తీసేయాలి. 11. పొద రకం టమాటా మొక్కలు కొంత ఎత్తు పెరిగి ఆగిపోతాయి. వీటిని ఎక్కువగా కత్తిరించాల్సిన అవసరం లేదు, కేవలం కింద నేలకు తగిలే ఆకులను తీసేస్తే సరిపోతుంది.12. టమాటా మొక్కలు లో అనవసరమైన కొమ్మలను లేదా చివరలను కత్తిరించడం వల్ల మొక్క తన శక్తిని పండ్లు పెద్దవిగా పెరగడానికి, త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగిస్తుంది. సీజన్ చివరలో మొక్క చివరలను కత్తిరించడం వల్ల కొత్తగా పూలు పూయడం ఆగి, అప్పటికే ఉన్న కాయలు త్వరగా పండుతాయి.13. కటింగ్ చేసిన వెంటనే మొక్కకు లిక్విడ్ ఫెర్టిలైజర్ (జీవామృతం లేదా బియ్యం కడిగిన నీళ్లు) లేదా వర్మీ కంపోస్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎందుకంటే కొత్త కొమ్మలు రావడానికి మొక్కకు శక్తి కావాలి. ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో తయారుచేసే జీవామృతం మొక్కకు అమృతంలా పనిచేస్తుంది. ఇది వారానికి ఒకసారి. పోయవచ్చు.14. గోళ్లతో తుంచడం కంటే పదునైన కత్తెర వాడటం మేలు. కత్తిరించిన భాగం వద్ద కొంచెం పసుపు రాస్తే ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. 15. కటింగ్ తరువాత మొక్క పైన నీరు చల్లకుండా, మొదట్లో మాత్రమే పోయాలి. 16. తీగ జాతి మొక్కలలో (సొర, బీర, కాకర వంటివి) పూత, పిందె దశలో ఉన్నప్పుడు 3జీ కటింగ్ చేయడం సరైన పద్ధతి కాదు. 3జీ కటింగ్ ప్రక్రియను మొక్క చిన్నగా ఉన్నప్పుడే (సుమారు 1 మీటర్ లేదా 6–8 ఆకులు ఉన్నప్పుడు) ప్రారంభించాలి. దీని ఉద్దేశ్యం కొత్త రెమ్మలను (2జీ, 3జీ కొమ్మలను) పుట్టించి, వాటిపై ఎక్కువ ఆడ పూలను వచ్చేలా చేయడం.17. పూత, పిందె దశలో కొమ్మలను కత్తిరించడం వల్ల ఇప్పటికే ఉన్న పూలు, పిందెలు రాలిపోయే అవకాశం ఉంది. అలాగే, మొక్క తన శక్తిని కొత్త కొమ్మల ఉత్పత్తికి మళ్లిస్తుంది, దీనివల్ల ఉన్న కాయలు సరిగ్గా పెరగవు. తగినంత ఎరువులు, నీరు అందిస్తే కాయలు నాణ్యంగా పెరుగుతాయి.18. ఒకవేళ మొక్క కేవలం మగ పూలనే పూస్తూ, అసలు పిందెలు పడకపోతే, అప్పుడు చివరి రెమ్మలను కొద్దిగా తుంచవచ్చు (పించింగ్). కానీ పద్ధతి ప్రకారం చేసే 3జీ కటింగ్ మాత్రం పంట ప్రారంభ దశలోనే పూర్తి చేయాలి. 19. 3ఎ కటింగ్ ద్వారా ఒకే మొక్క నుండి సాధారణం కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు.20. మొక్కకు నత్రజని ఎక్కువగా అందడం వల్ల ఆకులు, మగ పూలు విపరీతంగా వస్తాయి. బూడిద లేదా అరటిపండు తొక్కల పొడి వంటివి వేయడం ద్వారా పొటాషియం, ఫాస్పరస్ అంది, ఆడ పూల సంఖ్య పెరుగుతుంది. అరటిపండు తొక్కలను 2–3 రోజులు నీటిలో నానబెట్టి, ఆ నీటిని మొక్కలకు పోయడం వల్ల పొటాషియం అందుతుంది.21. ఇంట్లో వాడిన కోడిగుడ్డు పెంకులను పడేయకుండా, వాటిని పొడి చేసి మట్టిలో కలపడం లేదా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి మొక్కలకు పోయటం ద్వారా కాల్షియం అంది పిందెలు కుళ్ళిపోకుండా ఉంటాయి. పూత రాలకుండా బలంగా ఉంటుంది.22. హ్యాండ్ ΄ాలినేషన్ చేయాలి. ఒకవేళ తోటలో తేనెటీగలు లేకపోయినా లేదా ఆడ పూలు తక్కువగా ఉన్నా పిందెలు కాయలుగా మారవు. అప్పుడు మనమే స్వయంగా పరాగ సంపర్కం చేయవచ్చు. బాగా వికసించిన మగ పూవును కోసి, దాని రేకులను తీసివేసి ఆ మగ పూవు మధ్యలో ఉండే పరాగ రేణువులను ఆడ పూవు (పువ్వు కింద చిన్న పిందె ఉండేది) మధ్య భాగంలో మెల్లగా తాకించాలి.. ఈ పనిని ఉదయం 6 నుండి 9 గంటల లోపు చేస్తే ఫలితం బాగుంటుంది.23. బాగా పులిసిన మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలిపి ఒక లీటరుకు 10 లీటర్ల నీరు కలిపి మొక్క అంతా తడిచేలా పిచికారీ చేయడం వల్ల పూత బాగా వస్తుంది. ఇది ‘మిరకిల్ లిక్విడ్’ లాగా పనిచేస్తుంది. ఇంగువను పిచికారీ చేయటం వల్ల పూత రాలదు. మగ పూల కంటే ఆడ పూలు వచ్చే అవకాశం పెరుగుతుంది.24. మట్టి ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. కానీ నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మగ పూలు పెరిగే అవకాశం ఉంటుంది.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం. మొబైల్: 94906 02366 -
అదంతా ఫేక్?.. జెన్జీ ముసుగు వెనుక షాకింగ్ ‘లెక్క’!
సోషల్ మీడియాలో ఓ తరం.. వీధుల్లో మరో శక్తి.. అంటూ జెన్ జీ గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. భారత్లోనూ పరీక్షల వ్యవహారాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యవస్థలపై ప్రశ్నలతో జెన్ జీ యువత ఆందోళనలు చేపట్టిన సందర్భాలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. అయితే పోరాటాలు, ట్రెండ్స్, సోషల్ మీడియా యాక్టివిజంతో ఎప్పుడూ వార్తల్లో కనిపించే ఈ తరం.. తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు విషయంలో ఎలా వ్యవహరిస్తోంది?.. ఓ తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రావెల్, లైఫ్స్టైల్, ఎక్స్పీరియన్స్లకు ప్రాధాన్యం ఇచ్చే తరం అంటూ కనిపించే జెన్ జీ.. నిజ జీవితంలో మాత్రం డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందట!. భారీ కొనుగోళ్లు, విహారయాత్రల కంటే రోజువారీ అవసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది.శాలరీసే(SalarySe) నిర్వహించిన ఈ అధ్యయనం కోసం 5.2 లక్షల మందికి పైగా జీతం పొందుతున్న Gen Z వినియోగదారుల యూపీఐ లావాదేవీలను విశ్లేషించారు. సాధారణంగా జెన్జీ అంటే ప్రయాణాలు, డిజిటల్ లైఫ్, అనుభవాల కోసం ఎక్కువ ఖర్చు చేసే తరం అనే అభిప్రాయం ఉంది. కానీ వాస్తవ ఖర్చుల లెక్కలు మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి.70 శాతం ఖర్చు.. ఈ ఐదు కేటగిరీలకే!జెన్జీ తమ నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ భాగం అవసరాలకే వెళ్తోంది. బిల్లులు, సబ్స్క్రిప్షన్లు అత్యధికంగా 20.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత కిరాణా సరుకుల కోసం 15.7 శాతం ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ సంబంధిత చెల్లింపులకు 12.2 శాతం, షాపింగ్కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం ఖర్చవుతోంది. ఈ ఐదు విభాగాలు కలిపి నెలవారీ ఖర్చుల్లో 70 శాతానికి పైగా ఆక్రమిస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్ లైఫ్ కంటే.. జీవితంలోని సాధారణ అవసరాలే వారి బడ్జెట్లో పెద్ద భాగాన్ని తీసుకుంటున్నాయి.ట్రావెల్కు కేవలం 5 శాతంజెన్జీకు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టం అనే ప్రచారం ఉన్నప్పటికీ.. వారి నెలవారీ ఖర్చుల్లో ట్రావెల్ వాటా కేవలం 5 శాతమేనని అధ్యయనం చెబుతోంది. ప్రయాణాలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నా.. అవి వారి రెగ్యులర్ బడ్జెట్ను పెద్దగా ప్రభావితం చేయడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే వినోదం, ప్రయాణాలపై ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.OTTలకు కూడా చోటుడిజిటల్ వినోదానికి Gen Zలో ఆదరణ కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సబ్స్క్రిప్షన్ ఖర్చుల్లో జియోహాట్స్టార్ 12.4 శాతంతో ముందంజలో ఉండగా.. నెట్ఫ్లిక్స్ 10.7 శాతం, స్పాటిఫై 5.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. యూపీఐ, ఆటోపే వంటి డిజిటల్ చెల్లింపు విధానాలు యువత ఆర్థిక అలవాట్లను మార్చుతున్నాయని అధ్యయనం పేర్కొంది. బిల్లులు ఆటోమేటిక్గా చెల్లించడం, సబ్స్క్రిప్షన్లు డిజిటల్గా కొనసాగడం వంటి విధానాలు Gen Z జీవితంలో సాధారణంగా మారాయి.వయసు పెరిగేకొద్దీ..అధ్యయనం 18–23 ఏళ్ల వయసు, 24–29 ఏళ్ల వయసు ఉన్న Gen Z గ్రూపులను కూడా పరిశీలించింది. ఆసక్తికరంగా.. ఇరు వర్గాల్లోనూ విచక్షణతో చేసే ఖర్చులు (డిస్క్రెషనరీ స్పెండింగ్) 32 శాతంగానే ఉన్నాయి. అయితే వయసు పెరిగేకొద్దీ అవసరాలపై ఖర్చు పెరుగుతోంది. 18–23 ఏళ్ల వయసు వారిలో అవసరాల ఖర్చు 50 శాతం ఉండగా.. 24–29 ఏళ్ల వయసు వారిలో అది 59 శాతానికి పెరిగింది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు పెరిగేకొద్దీ ఖర్చుల ప్రాధాన్యతలు మారుతున్నాయని ఇది సూచిస్తోంది.డిజిటల్ ఫైనాన్స్ వైపు Gen Zశాలరీసే సహ వ్యవస్థాపకుడు పీయూష్ బగారియా ప్రకారం.. భారత జెన్జీ పూర్తిగా డిజిటల్ ఆధారిత ఆర్థిక జీవనశైలిని అభివృద్ధి చేసుకుంటోంది. యూపీఐ విస్తృతి కారణంగా డబ్బు నిర్వహణ, చెల్లింపుల విధానం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు.మొత్తంగా చూస్తే.. సోషల్ మీడియాలో కనిపించే ట్రావెల్, లైఫ్స్టైల్ ఇమేజ్కు భిన్నంగా జెన్జీ వాస్తవ ఖర్చుల తీరు కనిపిస్తోంది. కలలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక భద్రతకే యువత ప్రాధాన్యం ఇస్తోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
విప్రో తీరుపై ఆగ్రహం.. కేంద్ర మంత్రికి అత్యవసర లేఖ!
దేశీయ ఐటీ దిగ్గజం విప్రోలో ఎంపికైన 200 మందికి పైగా కొత్త ఇంజినీర్లు, విద్యార్థుల ఆన్బోర్డింగ్లో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘నైట్స్’ (NITES - Nascent Information Technology Employees Senate) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని బాధిత అభ్యర్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది.విప్రో ‘ఎలైట్ హైరింగ్ 2025’ ప్రక్రియ కింద ఎంపికైన 200 మందికి పైగా అభ్యర్థులకు జులై 2025లో ఆఫర్ లెటర్లు, ఆగస్టు 2025లో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ అందాయి. మార్చి 2026లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నా నేటికీ అధికారికంగా విధుల్లో చేరే తేదీ కేటాయించలేదు. కంపెనీ హెచ్ఆర్ బృందాలు, సహాయక కేంద్రాలను సంప్రదించినా ఎటువంటి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర మానసిక, ఆర్థిక ఆందోళనకు గురవుతున్నారని నైట్స్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా ఆవేదన వ్యక్తం చేశారు.నైట్స్ ప్రధాన డిమాండ్లుబాధిత అభ్యర్థుల ఆన్బోర్డింగ్కు సంబంధించి సమయ పరిమితితో కూడిన స్పష్టమైన ప్రణాళికను విప్రో ప్రకటించాలి. ఆఫర్ లెటర్లు, ఎల్ఓఐల చెల్లుబాటుపై అధికారిక ప్రకటన వెలువడాలి. ఒకవేళ ఎంపికను రద్దు చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని అభ్యర్థులకు రాతపూర్వకంగా స్పష్టం చేయాలి.క్యాంపస్ ఎంపికల్లో విప్రో ఉద్యోగం వచ్చిందనే ధీమాతో చాలామంది ఇతర కంపెనీల అవకాశాలను వదులుకున్నారని, ప్రస్తుత జాప్యం వారి కెరీర్ను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఐటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని వేధిస్తున్న అనిశ్చితి, క్లయింట్ ప్రాజెక్టుల మందగమనమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై విప్రో యాజమాన్యం స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే! -
కోరమాను.. ధాన్యానికి పురుగులు పట్టకుండా రక్షణ!
English Name: Spinons Kino tree/ Indian Laurel figశాస్త్రీయ నామం: బ్రిడేలియా రేటుScientific Name: Bridelia retusa (L) A. Juss Synonym(s): Bridolia spinosa (Roxb.) Wild. / Clutia retusa L.కుటుంబం: యుఫర్బేసిFarm-ily: Euphorbiaceaeవివిధ భాషల్లో ‘కోరమాను’ చెట్టు పేర్లు: అస్సామీ: కుహిర్, కుహిట్, కున్ హి ఇంగ్లిష్: సైనోంన్స్ కినోటి, ఇండియన్ లారెల్ ఫిగ్ కన్నడ: మల్లు హన్నె మర, కోవే ముల్లు హన్నె, ముల్లు జోగల, ఆసన, గుజ్జు, కోమంచి, కొయ్యముంచి, బీల్ కుంబెతమిళం: ముల్లు వెంగై, అదమరుడు, కడుగా తెలుగు: బొంతవేగి, కొరమాను, కోరమద్ధి, కోడేరు, దుర్వమద్ది, మల్లుమద్ది, పైమద్ది మరాఠీ: ఆసనమలయాళం: ముల్కెని, ఉల్లు వెంగ బెంగాలీ: జైయో హిందీ: కాజి, ఖజ, కస్సై కట్టి దామన్ సంస్కృతం: ఆసన, ఏకవీర, మహావీరపూత:ఏప్రిల్ – మే పండ్లు:జులై – ఆగస్టు (పూత, కాతలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. నేల, వాతావరణం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు).ఉనికి...కోరమాను చెట్టు దాదాపు 10–15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్ల లేత దశలో కాండంపై కురుచటి ముళ్లు ఉంటాయి. చెట్లు ఎదుగుతున్నపుడు ముళ్లు మొద్దుబారతాయి. ఈ చెట్లు సముద్ర మట్టానికి 650 – 1000 మీటర్ల ఎత్తయిన ్రపాంతాల్లోని అడవుల్లో కూడా పెరుగుతాయి. ఈ చెట్లు బెట్టెను తట్టుకోగలవు.కోరమద్దికి సక్కర్లు (వేరు బయటకు కనబడ్డ దగ్గర నేల పైకి పొడుచుకు వచ్చే మొలకలు) వచ్చే గుణం ఉంది. వీటి ఆవాసం ఈస్ట్ ఆసియా, చైనా, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా. నల్లమల అడవుల్లో కూడా వీటి ఉనికి కనిపిస్తుంది. ఇదే తెగకు చెందిన దాదాపు 10 జాతులు నల్లమలలో ఉన్నవి. (Reddy et al., 1991). ఈ చెట్లు ఎక్కువగా ఆకులు రాల్చే ఉష్ణమండలపు అడవుల్లో ఉంటాయి.ఉపయోగాలు...కొరమాను పండ్లు ముదురు గోధుమ రంగులో గుండ్రంగా ఉంటాయి. వీటిని తింటారు. వగరు+తీపి రుచితో ఉంటాయి. వీటి పూలు మంచి వాసనను వెదజల్లుతూ ఉంటాయి. చెట్లు పూత దశలో ఉన్నప్పుడు తేనెటీగలకు మంచి నేస్తాలుగా మారతాయి.ఎండిన చెట్లు వంట చెరుకుగా, ఫర్నీచర్ తయారికి ఉపయోగపడతాయి.ఈ చెట్టుకు కీటక నాశక గుణాలున్నాయి.ధాన్యాన్ని నిల్వ చేయటానికి గాదెపై కోరమద్ది చెక్క వేస్తే గింజలకు పురుగు పట్టదు.ఈ చెట్టు బెరడును విరేచనాలు తగ్గించడానికి వాడతారు.వీటి ఆకులు, బెరడు, వేర్లను నాటు వైద్యంలో అనేక రోగాలను ముఖ్యంగా మలేరియా, రక్తహీనత, ఆస్తమా, చక్కెర రోగం, విరేచనాలు, క్యాన్సర్, సుఖరోగాలు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, మూత్ర నాళ సమస్యలు, కామెర్లు, పుండ్లు తదితర రోగాలను నయం చేయటానికి వాడుతుంటారు.జీవ వైవిధ్యంలో ఈ చెట్టుకు కూడా స్థానం ఉంది. ఈ చెట్లను పంటలతో పాటు కలిపి ఆగ్రో ఫారెస్ట్రీలో పెంచవచ్చు.ఈ చెట్ల పండ్ల నుంచి జ్యూస్ తయారు చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.వీటి ఆకులు, పండ్లు, బెరడు, వేర్లలో ఫైటోకెమికల్స్ (స్టెరాయిడ్స్, ట్యానిన్స్, ఫినాల్స్, ఫ్లెవోనైడ్స్, సపోనిన్స్ ఉంటాయి. Rupali et a ., 2016).ఈ చెట్లకు ఆయుర్వేదంలో, సిద్ధ వైద్యంలో, నాటు వైద్యంలో, యునానీ, హోమియోపతిలో మంచి పేరుంది.మాగిన కోరమాను పండ్లలో ఆల్ఫా–సిటోస్టిరాల్, గ్యాలిక్, ఎల్లెజిక్ ఆమ్లాలు ఉంటాయి. (Mahapatra and Panda, 2009).ఎన్నో విలువలు ఉన్న ఈ జాతి పండ్ల చెట్లు పంట పొలాల్లో పెంచితే జనాలకు ఎంతో ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి ఈ పండ్ల చెట్లపై పరిశోధనలు ఎంతో అవసరం. అట్లే ఈ చెట్ల ఉనికిని కాపాడటానికి నల్లమలలో అధిక మొత్తంలో నాటటం ఎంతైనా అవసరం.కోరమాను పండ్లను పక్షులు బాగా ఇష్టపడతాయి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924 -
‘ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు’.. స్టార్ ప్లేయర్కు గంభీర్ వార్నింగ్!
గాలే వేదికగా రేపటి నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇంకా ఖరారు కాలేదు. తుది జట్టుపై ఒక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక్క స్థానం విషయంలో మాత్రం మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. సాయి సుదర్శన్ గాయపడడంతో సర్ఫరాజ్ ఖాన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. దీంతో ధ్రువ్ జురెల్ తుది జట్టులో కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి.జురెల్తో పోలిస్తే సర్ఫరాజ్ ఖాన్కు టెస్టుల్లో మంచి రికార్డు ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ధ్రువ్ జురెల్కు మేనేజ్మెంట్ నుంచి హెచ్చరికలు వస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ జట్టులో చోటు ఉండాలంటే ధ్రువ్ జురెల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని, లేదంటే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని కోచ్ గంభీర్ అతడికి సున్నితంగానే హెచ్చరించినట్లు సమాచారం. పంత్ రెగ్యులర్ వికెట్ కీపర్గా ఉండడంతో ఇంతకాలం జురెల్ అదనపు బ్యాటర్గా జట్టులో కొనసాగాడు. తాను ఆడిన 10 టెస్టుల్లో బ్యాటింగ్కు మాత్రమే పరిమితమయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్ల్లో జురెల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక 2025లో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లోనూ ధ్రువ్ జురెల్ విఫలమయ్యాడు. దీంతో ప్లేయింగ్ ఎలెవెన్లో చోటు నిలుపుకోవాలంటే జురెల్ తన ప్రదర్శనను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరముందని యాజమాన్యం భావిస్తోంది. ఆఫ్గన్తో ఏకైక టెస్టులోనూ జురెల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అయితే లంక-ఏ జట్టుపై సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించి టచ్లోకి వచ్చినట్లు అనిపించాడు. కానీ ఇటీవలే లంక ఎలెవెన్తో వార్మప్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో జురెల్ వరుసగా 1, 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రావడంతో జురెల్పై ఒత్తిడి పెరిగిపోయింది. ఆరో స్థానంలో ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనే దానిపై మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతున్న వేళ ధ్రువ్ జురెల్ రాణించకపోవడం అతడికి మైనస్గా మారే అవకాశముంది. అంతేకాదు జురెల్తో పోలిస్తే సర్ఫరాజ్ నాలుగు టెస్టులు తక్కువే ఆడినప్పటికీ, ఒక సెంచరీతో పాటు రెండు అర్ధసెంచరీలు ఎక్కువగా సాధించడం విశేషం. దీంతో లంకతో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్కు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.Read: లంకతో తొలి టెస్టు.. రికార్డుల వేటకు టీమిండియా సిద్ధం! -
సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో సూర్య.. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీతో కలిసి చేసిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమిత బైజు హీరోయిన్ కాగా రాధిక, రవీనా టండన్ కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. నేడు(ఆగస్టు 14) తెలుగు, తమిళంలో రిలీజైన ఈ సినిమా గురించి ట్విటర్ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమంటున్నారు?(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే కథాంశంతో ఈ సినిమా తీశారు. ఇందులో సూర్య.. ఒలింపిక్ షూటర్ పాత్రలో కనిపించాడు. 20 ఏళ్ల చలాకీ అమ్మాయి పాత్రని మమిత బైజు చేసింది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ పర్లేదనిపించాయి.ఇక సినిమా విషయానికొస్తే కొందరికి బాగా నచ్చేసింది. ఆ మేరకు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫస్టాప్ బాగుందని, సెకండాఫ్ తేలిపోయిందని అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత మెలోడ్రామా ఎక్కువైందని, క్లైమాక్స్ ఇంకా బాగా తీసి ఉండొచ్చని రాసుకొస్తున్నారు. ఓవరాల్గా డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. మరికొందరు మాత్రం తమకు ఒక్క సీన్ కూడా నచ్చలేదని అంటున్నారు.(ఇదీ చదవండి: 'అగధ' మూవీ రివ్యూ)#VishwanathAndSons – One of the BEST FAMILY ENTERTAINERS in Recent Times…!!This one is a breezy, light hearted family entertainer from #Suriya and Director #VenkyAtluri.The lead performances and writing are the biggest strengths of the film.Don’t expect a #LuckyBhaskar kind…— Rangasthalam (@RangasthalamIN) August 14, 2026Disaster Review for #VishwanathAndSons 💔Weakest Movie from #VenkyAtluri #VishwanathAndSons pic.twitter.com/HUfsTQhJCr— 𝗕𝗵𝗮𝗿𝗮𝗻𝗶🥃🎲 (@Anirudhoff_) August 14, 2026#VishwanathAndSons Review: “A Decent Family Entertainer”👉Rating : 2.75/5Positives:⁰👉#Suriya performance⁰👉#MamithaBaiju & Radhika are well cast⁰👉Venky Atluri’s dialogues work well⁰👉A few good emotional momentsNegatives:⁰👉Uneven 2nd half⁰👉Some subplots don’t work…— PaniPuri (@THEPANIPURI) August 14, 2026🔥 #VishwanathAndSons — OVERALL REVIEW 🔥When the story was leaked and the trailer dropped, I was worried that the film might have nothing more to offer. But the 2nd half has a major surprise that wasn’t revealed in any publicity material! 🔥The director shows two sides of… pic.twitter.com/JizKxv2OBu— Kollywood Wire (@KollywoodWire) August 14, 2026#VishwanathAndSons - VATCHABLE ONES!Good 1st Hlf & Avg 2nd Half.OKayish Feel Good Family Entertainer!— Christopher Kanagaraj (@Chrissuccess) August 14, 2026#VishwanathAndSons First half - Excellent 👌- Took 15 Mins to setup the plot and Conflict !!- Once #MamithaBaiju entered, the film took off and totally entered into the fun mode. Mamitha & her mannerisms was super cute🥰😀 - #Suriya's Screen presence and performance was… pic.twitter.com/A4x9vB0HPn— AmuthaBharathi (@CinemaWithAB) August 14, 2026#VishwanathAndSons A Watchable, Clean Family Entertainer With a Good 1st Half but a Weak 2nd Half!After a slow start, the first half feels refreshing and stays focused on the core plot with a good mix of fun and emotion. Just when you expect that flow to continue, the second…— Venky Reviews (@venkyreviews) August 14, 2026 -
బీజేపీకి వార్నింగ్ బెల్స్.. సీఎం కుర్చీకే ముప్పు?
బీహార్ రాజకీయాల్లో ఒక్క ఉప ఎన్నిక.. ఎన్నో ప్రశ్నలకు తెరతీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్లో ఆ పార్టీని ఓడిస్తూ జన సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్ సాధించిన విజయం ఇప్పుడు బీజేపీ శిబిరంలో చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా.. ఈ విజయాన్ని ముందుగానే బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా చిత్రీకరించిన పీకే.. ఫలితం వచ్చిన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. దీంతో అసలు టార్గెట్ బంకీపూర్ సీటా? లేక బీహార్లో బీజేపీ నాయకత్వమా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.బంకీపూర్ అంటే బీజేపీకి సాధారణ నియోజకవర్గం కాదు. 1995 నుంచి వరుసగా ఆ పార్టీ గెలుస్తూ వచ్చిన బలమైన కోట. నితిన్ నబీన్ ఈ సీటును ఐదుసార్లు గెలిచారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగి రాజ్యసభకు వెళ్లడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్టీకి అంత బలమైన సీటు కావడంతో.. మొదట బీజేపీ వర్గాల్లో ఈ ఎన్నికను పెద్ద సవాలుగా భావించలేదు. పైగా బీజేపీ శిబిరం పోటీని ‘నో కాంటెస్ట్’ అన్నంత ధీమాతో చూసింది. కానీ రంగంలోకి దిగిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పరిస్థితి నుంచి.. తన తొలి ప్రత్యక్ష ఎన్నికల పోరులోనే బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయంగా పీకేకు భారీ బూస్ట్గా మారింది.అసలు ట్విస్ట్ ఇక్కడే..ఎన్నికలకు ముందే పీకే బంకీపూర్ పోరును కేవలం ఎమ్మెల్యే ఎన్నికగా చూడలేదు. సామ్రాట్ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా ప్రచారం చేశారు. బీజేపీ గెలిస్తే అది సీఎం నాయకత్వానికి ప్రజల ఆమోదంగా భావించాలని వ్యాఖ్యానించారు. అంటే.. ఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా వస్తే దాన్ని నేరుగా సామ్రాట్ చౌదరి నాయకత్వానికి వ్యతిరేక తీర్పుగా మలుచుకోవాలన్నది పీకే వ్యూహం. దీంతో, ఇప్పుడు పీకే అడుగులు బంకీపూర్ దాటి.. నేరుగా సీఎం వైపు పడుతున్నాయి. ఎన్నికల ఫలితం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీహార్కు ‘సామర్థ్యం, సత్ప్రవర్తన ఉన్న’ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా కూడా సామ్రాట్ చౌదరినే రాజకీయంగా టార్గెట్ చేస్తూ విమర్శలు కొనసాగిస్తున్నారు.అయితే ఇక్కడ బీజేపీకి మరో చిక్కు ఉంది. బంకీపూర్ ఓటమి కేవలం సీఎం చౌదరికి సంబంధించినదేనా? లేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వ్యక్తిగత కంచుకోట కోల్పోవడమా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు రెండో కోణాన్నీ బలంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ఓటమి సామ్రాట్ కంటే నితిన్ నబిన్ కుటుంబానికి, మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టు కోల్పోవడానికే ఎక్కువ సంకేతమని అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే బంకీపూర్లో గెలిచింది మరో సంప్రదాయ పార్టీ ఆర్జేడీనో లేక కాంగ్రెస్ పార్టీనో కాదు. 2025 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన జన సురాజ్ పార్టీ. ఆ పార్టీ అధినేతగా పీకే స్వయంగా బరిలోకి దిగి.. బీజేపీకి చెందిన అత్యంత సురక్షితమైన పట్టణ నియోజకవర్గాన్ని చేజిక్కించుకున్నారు. ఇది జన సురాజ్కు ఒక సీటు మాత్రమే కాదు.. ‘బీజేపీకి ప్రత్యామ్నాయం కావచ్చు’ అనే రాజకీయ సందేశాన్ని పరీక్షించుకునే తొలి పెద్ద అవకాశంగా మారింది.ఆర్జేడీకి ఝలక్..మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే.. ఇక్కడ మరో పెద్ద రాజకీయ ట్విస్ట్ కూడా ఉంది. పీకే దెబ్బ బీజేపీతోనే ఆగలేదు. బంకీపూర్లో ఆర్జేడీ కూడా వెనుకబడింది. ఆ పార్టీ సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంక్లో కొంత భాగం జన సురాజ్ వైపు మళ్లిందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ ఓటమి తర్వాత ఆర్జేడీ తన సంస్థాగత వ్యవస్థపై పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే.. పీకే ఇప్పుడు బీజేపీ, ఆర్జేడీ రెండింటికీ మధ్యలోకి వచ్చి కొత్త రాజకీయ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.అయితే. పీకే గెలిచింది ఒక సీటు మాత్రమే కావచ్చు.. కానీ ఆయన గెలిచిన చోటు మాత్రం బీజేపీకి అత్యంత బలమైన కోట. ఇప్పుడు ఆ విజయాన్ని పీకే రాష్ట్రవ్యాప్త రాజకీయ ప్రచారంగా మలిస్తే? ఉద్యోగాలు, విద్య, అవినీతి, పాలన వంటి అంశాలతో యువతను ఆకర్షించగలిగితే? సంప్రదాయ కుల సమీకరణాలకు అతీతంగా ఓటర్లను కూడగట్టగలిగితే? అప్పుడు బీహార్లో పోటీ కేవలం బీజేపీ వర్సెస్ ఆర్జేడీగా ఉండకపోవచ్చు. మూడో శక్తిగా జన సురాజ్ ఎదగడం మొదలైతే.. అది ఎన్డీఏకే కాకుండా మొత్తం బీహార్ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంటుంది. -
అరుణాచలం వెళ్తున్న బస్సుకు యాక్సిడెంట్.. నలుగురు సీరియస్
సాక్షి, మహబూబ్నగర్: భూత్పుర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరుణాచలం వెళ్తున్న ప్రైవేట్ బస్సు డివైడెర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదసమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇరాన్ నెత్తిన అమెరికా మరో పిడుగు! అవసరమైతే..
తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని.. అవసరమైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కుండబద్ధలు కొట్టేసింది. ఈ తరుణంలో అమెరికా ఒత్తిడి మరింత పెంచింది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ‘ నో ఎండ్ ప్లాన్’తో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జలసంధిలో నౌకా దిగ్బంధాన్ని (బ్లాకేడ్) కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. అవసరమైతే నిరవధికగా ఆ పని చేయాలని భావిస్తోంది. అంటే నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ లేకుండా ఇరాన్ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై నిఘా కొనసాగించడం(అవసరమైతే దాడులు జరపడం) అన్నమాట.కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడం, ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని చెప్పారు. అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మార్చుతూ హర్ముజ్ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని తెలిపారు.ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలునౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్ను చర్చల బల్లపైకి తీసుకురావడమేనని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.హర్ముజ్ జలసంధే కేంద్రంగా పోరుఅణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇప్పుడు హర్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరిగేది. తమపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఈ వ్యూహాత్మక మార్గంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు హర్ముజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ చెబుతోంది.రెండు చమురు నౌకలపై దాడిహర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడి జరిగినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు ఇరాన్ కారణమని యూఏఈ ఆరోపించింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. నౌకల రాకపోకలు కూడా భారీగా తగ్గిపోయాయి.నౌకల రాకపోకలకు బ్రేక్యుద్ధానికి ముందు హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 130 నుంచి 140 వరకు నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక దశలో రోజుకు కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు సమాచారం. అమెరికా గతంలో ఇరాన్ నౌకలు, పోర్టులపై ఉన్న దిగ్బంధాన్ని కొంతకాలం సడలించినప్పటికీ.. తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. దీనివల్ల ఇరాన్కు కీలకమైన విదేశీ మారక ఆదాయంపై ప్రభావం పడుతోంది.ప్రపంచ చమురు మార్కెట్లో కలవరంఇరాన్ సంక్షోభం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 43 లక్షల బ్యారెళ్ల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది దాదాపు 4 శాతానికి సమానం. అయితే మరోవైపు డిమాండ్ తగ్గడం, అమెరికా ముడిచమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు కొంత తగ్గాయి. గురువారం ధరలు 2 శాతానికి పైగా పడిపోయాయి.ట్రంప్పై దేశీయ ఒత్తిడిఇరాన్తో యుద్ధం ముగించాలని అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది. పెరిగిన ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారింది. ట్రంప్ ఈ మధ్య హర్ముజ్పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ దీనిని ఖండిస్తూ.. ఆంక్షలు ఎత్తివేయడం, తమ నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు నెరవేరే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని స్పష్టం చేసింది.యుద్ధం కంటే ఆర్థిక దెబ్బే వ్యూహమా?ఇరాన్పై సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ గతంలో హెచ్చరించినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్కు ఆయుధాల సరఫరాకు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హెగ్సెత్ తెలిపారు.అబ్రహం లింకన్ నౌకపై వదంతులుహర్ముజ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకపై సిబ్బంది మరణించారన్న వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. ఈ యుద్ధం ఆగదని.. తమ జీవితాలు ఇంతేనన్న వైరాగ్యంతో ఏడుగురు నేవీ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నది ఇరాన్ మీడియా కథనాల సారాంశం. అయితే అది తప్పు సమాచారమని అమెరికా తెలిపింది. 260 రోజులకు పైగా సముద్రంలో ఉన్నప్పటికీ అబ్రహం లింకన్ క్యారియర్ గ్రూప్ సిబ్బంది ధైర్యంగా ఉన్నారని CENTCOM పేర్కొంది. ఆగస్టు 3న సముద్రంలో పడిపోయిన ఒక నావికుడిని కూడా సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఈ తరుణంలో.. లింకన్ నౌకను ఒడ్డుకు రప్పించి జార్జ్ వాషింగ్టన్ నౌకతో రిప్లేస్ చేశామని, ఇది సాధారణ చర్యేనని ప్రకటించుకుంది.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు ఇప్పుడు అమెరికా–ఇరాన్ ఘర్షణలో కీలక అంశంగా మారింది. ఒకవైపు అమెరికా నిరవధిక బ్లాకేడ్, ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు ఇరాన్ వ్యూహాత్మక మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోరు ఎంతకాలం కొనసాగుతుందన్నది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది. -
ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!
ఇంటి ముందు సొంత కారును నిలిపే సౌకర్యం కూడా ఇకపై ఉచితం కాదు. అవును.. దేశంలోనే ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, రోడ్ల దురాక్రమణను అరికట్టేందుకు పట్టణాభివృద్ధి శాఖ ‘గ్రేటర్ బెంగళూరు అథారిటీ (పార్కింగ్) నిబంధనలు-2026’ ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ విధానం ప్రకారం నివాస ప్రాంతాల్లోని రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తే రకాన్ని బట్టి ఏటా గరిష్ఠంగా రూ.25,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.వాహన రకాన్ని బట్టి వార్షిక రుసుములుప్రతిపాదిత డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం నివాస వీధుల్లో పార్కింగ్ చేయడానికి వార్షిక పర్మిట్ తప్పనిసరి. అందుకోసం హ్యాచ్బ్యాక్ / చిన్న కార్లకు ఏటా రూ.15,000, సెడాన్ కార్లకు ఏటా రూ.20,000, ఎస్యూవీలకు ఏటా రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పర్మిట్ కాలపరిమితి ఏడాది మాత్రమే. అయితే, భవన నిర్మాణ నిబంధనలకు లోబడి సొంత స్థలంలో నిర్ణీత పార్కింగ్ సదుపాయం ఉన్న నివాసాల వద్ద మాత్రమే పర్మిట్లు మంజూరు చేస్తారు. రహదారి వెడల్పు కనీసం 6 మీటర్లు ఉండి ట్రాఫిక్కు ఆటంకం కలగని చోట్లే ఈ పర్మిట్ చెల్లుబాటు అవుతుంది.ఆన్-స్ట్రీట్, ఆఫ్-స్ట్రీట్ చార్జీలువాణిజ్య, ప్రధాన రహదారులను ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరించారు. ఆన్-స్ట్రీట్ పార్కింగ్లో భాగంగా కార్లకు గంటకు రూ.40-రూ.80 వరకు, ద్విచక్ర వాహనాలకు రూ.20-రూ.40 వరకు వసూలు చేయనున్నారు. రెండు గంటలు దాటితే చార్జీలు మరింత పెరుగుతాయి. బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలను ప్రోత్సహించేందుకు ఆఫ్-స్ట్రీట్ చార్జీలను తగ్గించారు. కార్లకు నెలకు రూ.2,000-రూ.4,000 కాగా రాత్రి వేళల్లో (రాత్రి 8-ఉదయం 8 వరకు) 50% రాయితీ ఇవ్వనున్నారు.అభ్యంతరాలకు 30 రోజుల గడువుప్రజాభిప్రాయాలు, అభ్యంతరాల సమర్పణకు ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చింది. వాహనాల విచ్చలవిడి పార్కింగ్ను నియంత్రించాలని చూస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇది మధ్యతరగతి ప్రజలపై అదనపు భారమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా హార్టిన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫారెస్ట్ గార్డ్ లాంటి తెలుగు మూవీస్తో పాటు.. కాక్ టెయిల్ 2, కాటలన్, భారత భాగ్య విధాత, ఆరూపి లాంటి వేరే భాషల చిత్రాలు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటితో పాటు ఓ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: 'అగధ' మూవీ రివ్యూ)జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'వదలా'. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఓ మగాడిపై అతి వ్యామోహం అనే కాన్సెప్ట్తో దీనిని తీశారు. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడిది సడన్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.'వదలా' విషయానికొస్తే.. యోగి సిద్ధార్థ్ (జగపతిబాబు) ఓ డాక్టర్. భార్య ప్రియ (లయ). తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా బతుకుతుంటాడు. 20 ఏళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ల దాంపత్య జీవితంలోకి అముద (హృతిక శ్రీనివాస్) అనే యువతి వస్తుంది. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈమెని సిద్ధార్థ్ చికిత్స చేసి కాపాడతాడు. అలా ఇతడిపై ఆరాధాన భావంతో ఆ కుటుంబానికి దగ్గరైన ఆమె.. తర్వాత సిద్ధార్థ్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.ఈ క్రమంలోనే భార్యాభర్తల కాపురంలో చిచ్చుపెట్టేందుకు ఓ ప్లాన్ వేస్తుంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి సిద్ధార్థ్.. అతని భార్యకి ఫోన్లు, సందేశాలు పంపుతూ సైకోలా వేధించడం మొదలు పెడుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు అముద ఎవరు? ఆమె కథేంటి? ఈ సైకో యువతి నుంచి తన కుటుంబాన్ని సిద్ధార్థ్ ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా) -
లంకతో తొలి టెస్టు.. రికార్డుల వేటకు టీమిండియా సిద్ధం!
శ్రీలంక, భారత్ మధ్య శనివారం నుంచి గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే లంక తొలి టెస్టు కోసం తమ తుది జట్టును ప్రకటించగా, భారత్ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. తుది జట్టుపై ఒక అంచనా ఉన్నప్పటికీ, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో గాలేలో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేశారు.👉భారత వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే టెస్ట్ క్రికెట్లో వంద సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే డబ్ల్యూటీసీ చరిత్రలో మూడువేల పరుగులు పూర్తి చేసిన మొదటి వికెట్ కీపర్గా నిలవడానికి పంత్కు మరో 220 పరుగులు కావాలి. శ్రీలంకలో ఇప్పటివరకు ఏ భారతీయ వికెట్ కీపర్ కూడా టెస్ట్ సెంచరీ చేయలేదు, ఈసారి పంత్ ఆ రికార్డును అందుకుంటాడా అన్నది చూడాలి.👉యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో 50 సిక్సర్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ఓపెనర్గా జైస్వాల్ నిలవనున్నాడు. 24 ఏళ్ల వయసులోనే 5 వేర్వేరు దేశాల్లో టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ సరసన చేరేందుకు జైస్వాల్కు ఒక్క శతకం అవసరం.👉అంతర్జాతీయ క్రికెట్లో 10వేల పరుగులు (అన్ని ఫార్మాట్లు) పూర్తి చేసుకోవడానికి కేఎల్ రాహుల్ మరో 170 పరుగుల దూరంలో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ తర్వాత విదేశాల్లో 10 టెస్ట్ సెంచరీలు చేసిన రెండో ఆసియా ఓపెనర్ నిలిచేందుకు రాహుల్ కు రెండు సెంచరీలు దూరంలో నిలిచాడు.👉ఇక టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ టెస్ట్ క్రికెట్లో మూడువేల పరుగులు పూర్తి చేసుకోవడానికి మరో 31 పరుగులు అవసరం. కెప్టెన్గా 2వేల పరుగులు సాధించడానికి అతడికి 150 పరుగులు కావాలి. ఇక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల తర్వాత శ్రీలంకలో టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్గా నిలిచేందుకు గిల్ ఎదుట సువర్ణావకాశం ఉంది.👉లంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను గెలుచుకుని, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. -
పురుగుమందులు విఫలం.. పంట మార్పిడి సఫలం!
పంటలను వ్యాధులు, తెగుళ్ల నుంచి కాపాడుకోవటానికి నేడు చాలా మంది రైతులు క్రిమిసంహారక రసాయనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే, మితిమీరిన రసాయనాల వాడకం అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా, రైతులపై పెట్టుబడి భారాన్ని విపరీతంగా పెంచుతోంది. ఒడిశాలోని సినాపాలి బ్లాక్ బార్గావ్ గ్రామానికి చెందిన రైతు మురళీధర్ నాయక్ అనుభవాలే దీనికి స్పష్టమైన నిదర్శనం. ఈ రైతు అనుభవాన్ని ప్రాతిపదికగా చేసుకొని, ప్రస్తుత వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల పరిమితులు, పంట మార్పిడి ప్రాముఖ్యతను వివరించే కథనం.మురళీధర్ తన 2.5 ఎకరాల పొలంలో బిందు సేద్యం (డ్రిప్), సోలార్ పంప్, ప్లాస్టిక్ మల్చింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో టొమాటోలు, వంకాయలు, పుచ్చకాయలను ఏక పంటలుగా సాగు చేస్తున్నారు. కానీ, ఇటీవలి భారీ వర్షాలు, నీటి పారుదల సమస్యల కారణంగా ఆయన టొమాటో పంటకు ‘ఎండు తెగులు’ సోకింది. పంటను కాపాడుకోవటానికి వేల రూపాయలు వెచ్చించి ఎంతగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినా తెగులు అదుపులోకి రాలేదు.పంట మార్పిడే శాశ్వత పరిష్కారంఈ రసాయన వ్యర్థాల చక్రబంధం నుంచి బయటపడటానికి ‘పంట మార్పిడి’ ఒక్కటే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఒకే భూమిలో ప్రతి సీజన్లో లేదా ప్రతి ఏటా వేర్వేరు కుటుంబాలకు చెందిన పంటలను మార్చి మార్చి సాగు చేయటం వల్ల తెగుళ్ల జీవచక్రం తెగిపోతుంది. ఉదాహరణకు: పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ఆకుకూరలు. దీనివల్ల నేలలో వ్యాధికారక క్రిముల ఉనికి తగ్గి, మట్టి సారవంతమవుతుంది.జైవిక సమతుల్యతే కీలకండ్రిప్ ఇరిగేషన్, ప్లాస్టిక్ మల్చింగ్ వంటి సాంకేతికతలు నీటిని, శ్రమను ఆదా చేయగలవు. కానీ నేలలో జీవ సంబంధమైన సమతుల్యతను పునరుద్ధరించలేవు. పంటకు తెగులు రాగానే రసాయనిక పురుగు మందుల వాడటం వల్ల ఖర్చు పెరగటమే తప్ప పంట దిగుబడి పెరగదు. సాంకేతికతతో పాటు నేల స్వభావానికి అనుగుణంగా ‘పంట మార్పిడి’ పద్ధతిని పాటించటమే రైతుల ఆర్థిక భద్రతకు, సుస్థిర దిగుబడులకు అసలైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇవీ ప్రధాన పంట కుటుంబాలుతెగుళ్ల చక్రాన్ని తెగ్గొట్టి వాటి తీవ్రతను తగ్టించటానికి, భూసారాన్ని పరిరక్షించటానికి వేర్వేరు కుటుంబాలకు చెందిన పంటలను మార్చి మార్చి సాగు చేయాలి. ప్రధాన పంట కుటుంబాలు, వాటి ఉదాహరణలు...పప్పుధాన్యాలు (లెగ్యుమినేసి / ఫాబేసే): పెసర, మినుము, కంది, బఠాణీలు, శనగలు, వేరుశనగ తదితర పప్పుధాన్యాలు. ఇవి నేలలో నత్రజనిని స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి.ధాన్యపు పంటలు (గ్రామినేసి / పోయేసే): వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి తదితరాలు.బంగాళదుంప కుటుంబం (సోలనేసే): టొమాటో, వంగ, మిరప, బంగాళదుంప తదితరాలు.ఆవాలు/ క్యాబేజీ కుటుంబం (బ్రాసికేసే / క్రసిఫెరే): క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, ఆవాలు, బ్రోకలీ తదితరాలు.తీగజాతి కూరగాయలు (కుకుర్బిటేసే): గుమ్మడి, దోస, కాకర, సొరకాయ, కీర తదితరాలు.క్యారెట్ కుటుంబం (అంబెలిఫెరే / అపిసే): క్యారెట్, కొత్తిమీర తదితరాలు.ఈ విధంగా ఒక కుటుంబానికి చెందిన పంట తర్వాత వేరే కుటుంబానికి చెందిన పంటను వేయటం వల్ల ఒకే రకమైన తెగుళ్లు లేదా పురుగులు ఆశించకుండా వాటి జీవచక్రం తెగిపోతుంది.రసాయనాలకు లొంగని తెగుళ్లు: అసలు కారణం ఏమిటి?ఉద్యానవన శాఖ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టొమాటోలు, వంకాయలు, బంగాళాదుంపలు, మిరప కాయలు వంటివి ఒకే ‘సోలనేసి’ అనే వృక్ష కుటుంబానికి చెందిన పంటలు. ఒకే పొలంలో వరుసగా ఒకే కుటుంబానికి చెందిన పంటలను సాగు చేయటం వల్ల ఆ నేలలో వ్యాధికారక శిలీంధ్రాలు, బాక్టీరియాల తీవ్రత భారీగా పెరిగిపోతుంది. ఒకసారి నేల ద్వారా సంభవించే ఎండు తెగులు తీవ్రత పెరిగితే, ఎలాంటి క్రిమిసంహారక రసాయనాలు చల్లినా పెద్దగా ప్రయోజనం ఉండదు. -
స్నేహితురాలే సొంత చెళ్లెలు! 40 ఏళ్లకు డీఎన్ఏ టెస్టుతో షాక్!
కథల్లో, సినిమాల్లో మాత్రమే కనిపించే కొన్ని అద్భుత సంఘటనలు... కొన్నిసార్లు నిజజీవితంలోనూ చోటుచేసుకుంటుంటాయి. అలాంటి సంఘటనే ఇది. పుట్టిన కొన్నిరోజులకే వేర్వేరు అనాథాశ్రమాలకు చేరి, వేర్వేరు కుటుంబాల్లో పెరిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. నాలుగు దశాబ్దాల తర్వాత డీఎన్ఏ టెస్టు ద్వారా తిరిగి ఒకటయ్యారు.భారతదేశంలో పుట్టిన మీనా గెల్టింక్ (43), మీనాల్ టిజ్సెన్ (44)లను చిన్నప్పుడే నెదర్లాండ్స్కు చెందిన రెండు వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. వారిద్దరు కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే పెరుగుతున్నప్పటికీ తమకు ఒక తోబుట్టువు ఉందనే విషయం ఇద్దరికీ తెలియదు. అయితే 1996లో దత్తత పిల్ల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిమధ్య స్నేహం ఏర్పడి... సరదాగా ఉత్తరాలలో ‘సిస్’ అని పిలుచుకునేవారు. కానీ కాలక్రమేణా వీరిమధ్య సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 15 ఏళ్లపాటు దూరంగా ఉన్నారు.అయితే ఈ ఏడాది ఏప్రిల్లో ‘మై హెరిటేజ్’ యాప్ ద్వారా చేసిన డీఎన్ఏ పరీక్ష వీరి జీవితాలను ఒక్కసారిగా మార్చివేసింది. ఫ్రాన్స్లో ఉంటున్న మీనాల్ ఫోన్కి ఒకరోజు ‘మీనాల్ యువర్ సిస్టర్... 100 శాతం డీఎన్ఏ మ్యాచ్’ అని నోటిఫికేషన్ వచ్చింది. మొదట నమ్మలేకపోయిన మీనాల్, సోషల్ మీడియాలో వెతికి పాత ఫోటోలను పరిశీలించాక... 30 ఏళ్ల క్రితం కలిసిన ఆనాటి టీనేజ్ స్నేహితురాలే తన సొంత చెల్లెలని తెలిసి ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వీరిద్దరూ నెదర్లాండ్స్లో ఎంతో సంతోషంగా కలుసుకున్నారు.పెంచిన తల్లిదండ్రులున్నప్పటికీ ఇంతకాలం ఏదో ఒక తెలియని లోటు ఉండేదని... తన సోదరి రాకతో జీవితంలో తప్పిపోయిన పజిల్ ముక్క దొరికినట్లుందని మీనా చెబుతోంది. అయితే ‘‘తాము అక్కాచెల్లెళ్లమని తెలియకముందే మంచి స్నేహితులం. నిజానికి మేము మొదటినుంచీ అక్కాచెల్లెళ్లమే, కాకపోతే ఆ విషయం మాకు ఆలస్యంగా తెలిసిందని’’ ఈ సందర్భంగా మీనాల్ చెబుతోంది. -
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు.. రంగంలోకి జార్జ్ వాషింగ్టన్ నౌక
టెహ్రాన్: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎంతో కాలంగా సముద్రంలోనే ఉండి అమెరికాకు సేవలంధిస్తున్న అబ్రహం లింకన్ యుద్ధ నౌక స్థానంలో యుఎస్ మరో వార్షిప్ను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరొక శక్తివంతమైన నౌక యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ను మధ్యప్రాచ్యానికి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనని, లింకన్ నౌక సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలకు దీనికి సంబంధం లేదని అధికారులు తెలిపారు.ఎంతోకాలంగా అరేబియా సముద్రంలో మోహరించిన అబ్రహం లింకన్ నౌకలో సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వహిస్తున్నారు. గత నవంబర్ 21న శాన్ డియాగో నుంచి పసిఫిక్ ప్రాంతం కోసం బయలుదేరిన ఈ నౌక, ఫిబ్రవరి 28న ఇరాన్తో యుద్ధం ప్రారంభం కావడంతో మధ్యప్రాచ్యానికి దారి మళ్లించబడింది. ఎలాంటి పోర్ట్ కాల్ (ఓడరేవు సందర్శన) లేకుండానే ఈ నౌక ఏకంగా 200 రోజులకు పైగా సముద్రంలోనే గడపడం సిబ్బందికి అత్యంత క్లిష్టమైన పరీక్షగా మారింది. గత 250 రోజులకు పైగా సాగుతున్న ఈ ప్రయాణంతో నావికుల్లో తీవ్రమైన అలసట, మానసిక క్షోభ నెలకొన్నాయి.సిబ్బంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆత్మహత్య ఆలోచనలు మరియు కొందరు సిబ్బంది ఓడ నుంచి దూకే ప్రయత్నాలు చేశారన్న వార్తలు కుటుంబ సభ్యులు, చట్టసభ సభ్యుల్లో ఆందోళన రేకెత్తించాయి. మరోవైపు, ఆహార కొరత, నీటి కాలుష్యం, మరుగుదొడ్ల సమస్యలు, బూజు పట్టడం, మెయిల్ వ్యవస్థ దెబ్బతినడం వంటి దుర్భర పరిస్థితులను కుటుంబ సభ్యులు ఎత్తిచూపారు. శాన్ డియాగోలో జరిగిన సమావేశంలో బాధ్యుల తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ ఆరోపణలను అమెరికా నావికాదళం రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తోసిపుచ్చారు. ఆత్మహత్యాయత్నాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సిబ్బందికి కౌన్సెలర్లు, శుద్ధి చేసిన నీరు, భోజనం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే, యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా కేంద్రాలు దెబ్బతినడం వల్ల ఆహారం, పరిశుభ్రతా వస్తువుల అందజేతలో కొన్ని అంతరాయాలు ఏర్పడినట్లు నావీ అంగీకరించింది. ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే స్పష్టత లేకపోవడం, నావికులు మానసికంగా మరింత కుంగిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం లింకన్కు విధుల నుంచి విరామం ఇవ్వడానికి జార్జ్ వాషింగ్టన్ను పంపుతున్నట్లు తెలుస్తోంది. జార్జ్ వాషింగ్టన్ ప్రస్తుతం వియత్నాంలోని డానాంగ్ నుంచి బయలుదేరిన ఈ నౌక సింగపూర్ జలసంధి మీదుగా హిందూ మహాసముద్రం వైపు ప్రయాణిస్తున్నట్లు యూఎస్ నావీ అధికారులు తెలిపారు. -
‘ఆపండి.. ప్లీజ్’.. క్షణక్షణానికీ పెరిగిన భయం.. ర్యాపిడో బైక్ నుంచి దూకిన యువతి
ఆఫీసుకు వెళ్లేందుకు బుక్ చేసుకున్న ర్యాపిడో బైక్.. కొద్దిసేపటికే ఆమెకు భయానక ప్రయాణంగా మారింది. తెలిసిన రోడ్డు కాస్తా నిర్మానుష్యమైన మార్గంగా మారింది. గమ్యం వైపు వెళ్తున్నామా.. లేక ఎక్కడికో తీసుకెళ్తున్నారా అన్న అనుమానం మొదలైంది. ‘బైక్ ఆపండి.. మరో రూట్లో వెళ్లండి’ అంటూ ఆమె ఎంత చెప్పినా డ్రైవర్ ఆపలేదని బాధితురాలు ఆరోపించారు. చివరకు ప్రాణాలపై భయంతో కదులుతున్న బైక్ నుంచే దూకేశారు. అనంతరం, ఓ వీడియో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది.వీడియో ప్రకారం.. బాధితురాలు ఆయేషా శ్రీవాస్తవ ఆఫీసుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ను బుక్ చేసుకున్నారు. తొలుత ప్రయాణం సాధారణంగానే సాగింది. కానీ కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ తాను గుర్తించలేని, నిర్మానుష్యంగా కనిపించే మరో మార్గంలోకి బైక్ను మళ్లించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. చుట్టూ చూస్తే పెద్దగా జనసంచారం కనిపించకపోవడంతో భయపడినట్లు ఆమె తెలిపారు. డ్రైవర్ను ప్రశ్నించగా.. అది విశ్వవిద్యాలయానికి వెళ్లే నేరుగా ఉన్న దారేనని చెప్పినట్లు ఆయేషా పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమెకు నమ్మకం కలగలేదు. మరో మార్గంలో వెళ్లాలని, లేదంటే బైక్ను ఆపాలని పలుమార్లు కోరినప్పటికీ డ్రైవర్ స్పందించలేదని ఆరోపించారు.Gig worker shcoker: A Terrifying Ride: Demand for Accountability In Delhi Ayesha Srivastav had to jump off a moving Rapido bike. The driver ignored her requests, took an isolated route and refused to stop. She suffered injuries from the jump.Shockingly Rapido took action… pic.twitter.com/J463SCdg0B— Ramesh Tiwari (@rameshofficial0) August 12, 2026పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన ఆమె.. డ్రైవర్ను ఆపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దీంతో తన భద్రతపై తీవ్ర భయానికి గురై.. చివరకు కదులుతున్న బైక్ నుంచి దూకేశారు. రోడ్డుపై పడిపోవడంతో ఆయేషా చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. వైద్య చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఘటన తర్వాత కూడా తనకు సరైన స్పందన లభించలేదని ఆమె ఆరోపించారు. ర్యాపిడో కస్టమర్ సపోర్ట్ను సంప్రదించినా సకాలంలో స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించారు. View this post on Instagram A post shared by ✩⋆ 🖤 𝒜𝓎𝑒𝓈𝒽𝒶 𝓈𝓇𝒾𝓋𝒶𝓈𝓉𝒶𝓋 🖤 ⋆✩ (@ayesha_srivastav96) ‘వేలాది మంది మహిళలు ప్రతిరోజూ ర్యాపిడోలో ప్రయాణిస్తున్నారు. మహిళల భద్రత విషయంలో మీరు ఏం చేస్తున్నారు? డ్రైవర్ వివరాలు ఇవ్వండి. అతడిపై చర్యలు తీసుకోండి’ అంటూ ఆమె సంస్థను ప్రశ్నించారు. ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాపిడో స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపిన సంస్థ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్ను తమ ప్లాట్ఫామ్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. డ్రైవర్ వివరాలను ఆయేషాకు అందజేసినట్లు, అవసరమైన న్యాయపరమైన చర్యల్లో ఆమెకు సహకరిస్తామని తెలిపింది. వైద్య లేదా చట్టపరమైన సహాయం అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. -
ఎల్ నినో ముప్పు.. కానీ భారత్పై మేఘాల మాయాజాలం!
ఎల్ నినో ప్రభావంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. రుతుపవనాలు మరోసారి బలాన్ని పుంజుకుంటున్నాయి. ఆకాశం నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని చాలా ప్రాంతాలు దట్టమైన మేఘాలతో కప్పుకున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం తూర్పు, మధ్య భారతంలో వర్షాలకు ఊతమిస్తోంది.ప్రస్తుతం వాతావరణ నిపుణుల దృష్టి మొత్తం బంగాళాఖాతం వైపే ఉంది. అక్కడ ఏర్పడే అల్పపీడనాలు రుతుపవనాలకు కీలకమైన ఇంధనంలా పనిచేస్తాయి. సముద్రం నుంచి తేమను తీసుకువచ్చి భూభాగంపైకి వర్షాలను తీసుకువస్తాయి. తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.శాటిలైట్ చిత్రాల్లో..భారత ఉపగ్రహాలు, అంతర్జాతీయ వాతావరణ ఉపగ్రహాలు పంపిన చిత్రాల్లో అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం మీదుగా గంగా మైదానాలు, ఈశాన్య రాష్ట్రాల వరకు మేఘాల విస్తరణ కనిపిస్తోంది. ముఖ్యంగా బంగాళాఖాతం పరిసరాల్లో దట్టమైన మేఘాలు ఉండటం బలమైన వర్ష వ్యవస్థకు సంకేతంగా భావిస్తున్నారు. తూర్పు భారతంపై కనిపిస్తున్న చల్లటి మేఘ శిఖరాలు బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు సూచనగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల స్థానికంగా వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.ఎల్ నినోతో ఎందుకు టెన్షన్?సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ గాలుల మార్పులు చోటుచేసుకుని వర్షపాతంపై ప్రభావం చూపుతాయి. అయితే ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ కచ్చితంగా కరవే వస్తుందని చెప్పలేం. ఇతర వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు బలపడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నప్పటికీ.. బంగాళాఖాతం నుంచి వరుసగా ఏర్పడుతున్న వర్ష వ్యవస్థలు రుతుపవనాలకు కొంత ఊరటనిస్తున్నాయి.కీలకమైన ఆగస్టు వర్షాలుభారత వ్యవసాయానికి రుతుపవనాలు ఎంతో కీలకం. దేశంలోని కోట్లాది మంది రైతులు వర్షాధార పంటలపై ఆధారపడుతుంటారు. జూన్, జూలైలో వర్షాల తీరును బట్టి పంటల సాగు ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో వచ్చే వర్షాలు పంటల ఎదుగుదలకు చాలా అవసరం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపించగా.. మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అసమాన పరిస్థితులను సమతుల్యం చేయడంలో బంగాళాఖాతం నుంచి వచ్చే అల్పపీడనాలు కీలకంగా మారుతున్నాయి.రుతుపవనాలకు కొత్త ఊపుప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు పూర్తిగా బలహీనపడలేదని సూచిస్తున్నాయి. ఎల్ నినో ముప్పు ఉన్నప్పటికీ.. బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ, వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు వర్షాలకు బలాన్ని ఇస్తున్నాయి.ఆగస్టు రెండో భాగంలో తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మరింత చురుగ్గా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎల్ నినో ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది రాబోయే వారాల్లోని వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఆకాశంలో కనిపిస్తున్న మేఘాలు.. రుతుపవనాలకు మరోసారి ఆశలు రేకెత్తిస్తున్నాయి. -
పూజ వేరు.. విన్నపం వేరు..
కతోలికులు మరియ మాత ముందు కూర్చొని, మూడు దేవరహస్యాలతో 15 ఘట్టాలతో కూడుకొన్న జపదండ చెబుతారు. క్రీస్తు ప్రభు గురించి, తండ్రి దేవునికి సంబంధించి, ఆత్మ దేవునికి సంబంధించిన రహస్యాలే అవి. ఆ యా ఘట్టాలన్నీ కొత్త నిబంధనా సంఘటనలే. దేవునికీ తమకూ మధ్యవర్తిగా ఆమెను నిలబెట్టి, ఆ ప్రభునికి ‘మా బాధలూ గాథలూ చేరవేయవమ్మా మా మరియమ్మా’ అని వేడుకొంటారు. పూజ వేరు, విన్నపం వేరు.బైబిల్లో ఆమెకు ఎదురైన చిన్న సంఘటనల్లోని మాటల్నే జపంగా మార్చుకొని పదే పదే ఉచ్ఛరించడం వల్ల ఆమె కేవేవో పూజలు జరుగుతున్నాయనుకోకూడదు. ఈ విషయమై ఇటీవల విశ్వ కాపరి, పోప్ లియో ప్రత్యేకమైన సందేశం ఇచ్చిన సంగతి మరువగూడదు. శిలువపై మరణించబోతున్న యేసు ప్రభువు, తన తల్లి బాధ్యత ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. మరియ మాత ఓ చిన్న ఇంట్లో నివసించేది. ఆమె ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేది. అందరినీ ప్రేమతో చూసుకునేది. తన చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించేది. పేదలకు సహాయం చేసేది. యేసు చెప్పిన మాటలను ప్రజలకు గుర్తు చేసేది.ఓ రోజు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, ‘మరియమ్మా! దేవుడు నిన్ను తన దగ్గరకు పిలుస్తున్నాడు’ అని చెప్పాడు. కొంతకాలానికి ఆమె భూలోక జీవితాన్ని ముగించింది. యేసు శిష్యులు ఆమెను ఎంతో గౌరవంగా సమాధి చేశారు. కొన్ని రోజుల తర్వాత వారు సమాధి దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ మరియ మాత శరీరం కనిపించలేదు. దేవుడు ఆమెను శరీరంతో సహా పరలోకానికి తీసుకువెళ్లాడని వారు విశ్వసించారు. ఆమెకు తిన్నగా మోక్షాన్ని ఆరోపించారు. ఇది ‘మోక్షారోపణ’. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియ మాత మోక్షారోపణ పండుగ జరుపుకొంటారు. అమె ఎంతో ధన్యురాలని పిలుస్తారు. (లూకా 1:48)– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (ఆగస్టు 15న మరియా మోక్షారోపణ పండుగ) -
క్రికెట్లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక కోచ్ మృతి
శ్రీలంక క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రికెటర్ల మధ్య జరిగిన దాడిలో 62 ఏళ్ల లంక క్రికెట్ కోచ్ సుమిత్ ఫెర్నాండో కన్నుమూశారు. కొలంబోలో మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇది చోటుచేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఫెర్నాండో గురువారం రాత్రి చికిత్స పొందుతూ మరణించారు.కాగా సుమిత్ ఫెర్నాండో గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుశాల్ మెండిస్కు పాఠశాల స్థాయిలో కోచ్గా వ్యవహరించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 8న ఒక క్రీడా ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న కొంతమంది యువ క్రికెటర్లు తాగునీటి కోసం వెళ్లగా, అక్కడ నీటి వసతి అందుబాటులో లేదు. ఈ విషయంపై ఆటగాళ్లకు, స్టేడియం సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ముదరడంతో సుమిత్ ఫెర్నాండో జోక్యం చేసుకున్నారు. దీంతో ఇద్దరు యువ క్రికెటర్లు కోచ్ ఫెర్నాండోపై భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుమిత్ ఫెర్నాండోను కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన చికిత్స పొందుతూ మరణించడంతో లంక క్రికెట్ విషాదంలో మునిగిపోయింది.మొరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీలో మాజీ కోచ్గా పనిచేసిన ఫెర్నాండో.. పలువురు పాఠశాల స్థాయి క్రికెటర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన శిక్షణ ఇచ్చిన వారిలో ఒకరైన మెండిస్.. ఆ తర్వాత శ్రీలంక వన్డే కెప్టెన్గా ఎదిగారు. అనంతరం ఫెర్నాండో.. శ్రీలంక దేశీయ క్రికెట్ వ్యవస్థలో ఒక ప్రముఖ క్లబ్ అయిన బ్లూమ్ఫీల్డ్ క్రికెట్ & అథ్లెటిక్ క్లబ్లో గ్రౌండ్స్ క్యూరేటర్గా పనిచేశారు.అయితే సుమిత్ ఫెర్నాండోతో ఘర్షణకు దిగిన ఇద్దరు ఆటగాళ్లలో ఒక 17 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. ఇప్పుడు, ఆ గొడవ జరిగిన దాదాపు వారం రోజుల తర్వాత, కొలంబో పోలీసులు ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. కోచ్ ఫెర్నాండోపై దాడి చేశాడనే అనుమానంతో అతడిని అరెస్టు చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నందున, అతను ఆగస్టు 17 వరకు కస్టడీలో ఉండే అవకాశం ఉంది. అతని ప్రాథమిక కస్టడీని కోర్టు పొడిగించినట్లు సమాచారం.చదవండి: సెంచరీ దిశగా తంజిద్.. ఆసీస్కు చుక్కలు చూపిస్తున్న బంగ్లా! -
‘హగ్’ కామెంట్ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలతో కొనసాగించే సాన్నిహిత్యంపై విమర్శలు చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త మాటల యుద్ధానికి తెరలేపాయి. మరీ ముఖ్యంగా షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్పై బీజేపీ, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురువారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వింత ఆలోచనలు వస్తుంటాయి. ఇదే విదేశాంగ విధానం అనుకుంటున్నారు’’ అంటూ వేదికపైనే కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను ఆలింగనం చేసుకున్నారు.RaGa is in full roast mode.🤣🔥Rahul Gandhi just gave the most savage demonstration of “hug diplomacy”.*Runs and hugs Sandeep Dikshit*The hall couldn’t stop laughing. This one will travel. pic.twitter.com/XodlA8MvS8— Rajat Jain (@RajatJain) August 13, 2026ఈ సమయంలో సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘నన్ను మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?’’ అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘోల్లున నవ్వారు. దీనికి రాహుల్ గాంధీ.. ‘‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’’ అంటూ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది.మోదీ ‘హగ్ డిప్లమసీ’పై రాహుల్ సెటైర్పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకున్న సందర్భాలను ఉద్దేశించే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాల కంటే వ్యక్తిగత ఇమేజ్, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ గతంలోనూ మోదీపై విమర్శలు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని స్థాయిని, అంతర్జాతీయ సంబంధాలను ఎగతాళి చేసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది.బీజేపీ–ఆర్ఎస్ఎస్పై రాహుల్ విమర్శలుఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తన అసలు స్వరూపాన్ని కోల్పోయిందని, పెద్ద పారిశ్రామిక వర్గాల ప్రభావంలోకి వెళ్లిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.‘‘మోదీ, అమిత్ షాకు నిద్ర లేకుండా చేస్తాం’’కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. అయితే తమ పోరాటం ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు.సందీప్ దీక్షిత్ నేపథ్యంసందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన ఆయన.. ‘సంకేత్’ అనే సంస్థను నడిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతూ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. షీలా దీక్షిత్ ప్రస్తావనతో బీజేపీ కౌంటర్ఈ వివాదంలో బీజేపీ నేతలు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చారు. 2024లో ప్రధాని మోదీ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ షీలా దీక్షిత్ను గౌరవిస్తూ, ఆమెపై వచ్చిన ఆరోపణల తీరుపై బాధపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇప్పుడు అదే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శిస్తోంది. మెలోనీ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళా దేశాధినేతను రాజకీయ వ్యంగ్యంలోకి లాగడం సరికాదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పలువురు సీనియర్ జర్నలిస్టులు సైతం ఈ తరహా రాజకీయం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. In 2024, PM Modi publicly said he was PAINED by the way Sheila Dikshit was "INSULTED" with baseless Corruption allegations.Today her own son, Sandeep Dikshit, stands on stage with Rahul & mocks the same Prime Minister 💔> He reduces a diplomatic gesture to a cheap joke by… pic.twitter.com/tALdiFnJhd— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 13, 2026‘‘మెలోనీ పేరు ప్రస్తావించలేదు’’రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. ఆయన ఎక్కడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రధాని మోదీ విదేశాంగ శైలిపై రాజకీయ విమర్శ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలు.. అంతర్జాతీయ దౌత్యంలో వ్యక్తిగత హావభావాలను ఎలా చూపిస్తున్నారనే అంశంపైనే రాహుల్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ నేతలతో చేసే కౌగిలింతలను కాంగ్రెస్ గతంలోనూ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.ట్రెండింగ్లో మెలోనీప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ ట్రెండ్ను పసిగట్టిన ఇద్దరూ.. అందుకు తగ్గట్లే మెలోడీ పేరుతో సరదా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో యూరప్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుకరించడం గమనార్హం. అంతెందుకు కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతోనూ ఈ మధ్య నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అయితే.. తాజా రాహుల్ గాంధీ హగ్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యంతరాల నేపథ్యంతో నెట్టింట మెలోనీ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చేశారు. -
అమెరికాకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్
వాషింగ్టన్ డీసీ: అమెరికా ఆయుధ సంపత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక దళంతో పాటు ఆధునిక యుద్ధ నౌకలు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల సైనిక స్థావరాలతో ఆ దేశం ఎంతో స్ట్రాంగ్గా ఉంది. అయితే శత్రుదుర్బేద్యంగా కనిపించే వాషింగ్టన్.. ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం చేతిలో చతికిలపడాల్సి వచ్చింది. అవును ఇది అక్షరాల నిజం ఇటీవల జర్మనీలో జరిగిన "కంబైన్డ్ రిజాల్వ్" సైనిక విన్యాసంలో ఉక్రెయిన్ డ్రోన్లు అమెరికా దళాలను ముప్పుతిప్పలు పెట్టాయి. వాల్ స్ట్రీట్ జనరల్ కథనం ప్రకారం.. జర్మనీలో జరిగిన 'కంబైన్డ్ రిజాల్వ్' సైనిక విన్యాసాలలో ఉక్రెయిన్ డ్రోన్ ఆపరేటర్లు అమెరికా బలగాలను, వారి సాయుధ వాహనాలను పదేపదే గుర్తించి మరీ 'నాశనం' చేశారని తెలిపింది. ఒక దశలో ఉక్రెయిన్ డ్రోన్ బృందాలు ఏకంగా ఒక పూర్తి అమెరికన్ ఆర్మర్డ్ బ్రిగేడ్ (సాయుధ దళాన్ని) తుడిచిపెట్టేశాయని అమెరికా అధికారులే స్వయంగా వెల్లడించినట్లు పేర్కొంది. రష్యాతో గత నాలుగున్నర ఏళ్లుగా సాగుతున్న యుద్ధ అనుభవం ఉక్రెయిన్కు డ్రోన్ల వినియోగంలో అపారమైన నైపుణ్యాన్ని ఇచ్చింది. ఈ రకమైన ఆధునిక యుద్ధ పద్ధతులను నేర్చుకోవడానికి అమెరికా సైన్యం ఇంకా ప్రయత్నిస్తూనే ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిపింది.అయితే ఈ విన్యాసంలో నేరుగా మందుగుండు సామాగ్రి ఉపయోగించరు. డ్రోన్లు వాహనాలపై నుండి లేదా వాటికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు, పరిశీలకులు ఆ వాహనం వర్చువల్గా 'నాశనమైంది' అని ప్రకటిస్తారు. ఉక్రెయిన్ దళాలు ఎంత వేగంగా అమెరికా వాహనాలను కూల్చేసాయంటే, కొన్ని వాహనాలను నాశనమైనట్లు ప్రకటించి మళ్లీ బతికించి కొత్త యూనిట్లుగా విన్యాసాల్లోకి పంపాల్సి వచ్చింది. అయితే రెండు వారాల పాటు సాగిన ఈ డ్రిల్ తర్వాత అమెరికా సైనికులు క్రమంగా పరిస్థితులకు అలవాటు పడ్డారు. వారు తమ దళాలను విడదీయడం, కదలికలను దాచడం మరియు శత్రువుల కంటికి పడకుండా ఉండటానికి 'ఎలక్ట్రానిక్ వార్ఫేర్' పద్ధతులను ఉపయోగించడం నేర్చుకున్నట్లు అధికారులు ప్రకటించారు.అనంతరం ఉక్రెయిన్ దళాలు అమెరికన్లకు డ్రోన్లను ఆఫెన్సివ్గా (దాడి చేయడానికి) ఎలా వాడాలో శిక్షణ కూడా ఇచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విధమైన శిక్షణ అమెరికాలో దొరకదని '"ఇలాంటి అద్భుతమైన శిక్షణ అమెరికాలో దొరకడం అసాధ్యం" అని నాటో సైనికదళం నాయకుడు ఎయిర్ ఫోర్స్ జనరల్ అలెక్సస్ గ్రింకెవిచ్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ దళాలతో శిక్షణ పొందిన తర్వాత నాటో సైన్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్ల వినియోగంలో ఉక్రెయిన్ ముందంజఉక్రెయిన్ కేవలం డ్రోన్లను ఎగరేయడమే కాకుండా, యుద్ధ రంగంలో అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవడం, వాటిని రిపేర్ చేయడం మరియు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయడంలో నైపుణ్యం సాధించింది. కానీ, అమెరికా సైనికులకు యుద్ధ రంగంలో దాడి జరుగుతున్నప్పుడు డ్రోన్లను రిపేర్ చేయడం లేదా ఆయుధాలను అమర్చడంలో అనుభవం చాలా తక్కువగా ఉంది. డ్రోన్ల కోసం అమెరికా బిలియన్ల ఖర్చు.. కానీ మారిన వ్యూహంసుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రోన్ల సాంకేతికతను ఆధునిక యుద్ధాలలో చేర్చడంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాయి.పెంటగాన్ కొత్త డ్రోన్లు మరియు కౌంటర్-డ్రోన్ వ్యవస్థల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేసింది. కానీ ప్రస్తుతం యుద్ధ రంగం మారిపోయింది. ఇప్పుడు సమస్యలు సృష్టిస్తోంది అమెరికా తయారు చేసిన ఖరీదైన, అధునాతన లాంగ్-రేంజ్ డ్రోన్లు కావు. చిన్నవి, చౌకైన ఫ్రంట్లైన్ డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతూ, యుద్ధ నిఘా సమాచారంతో కలిపితే ఎంతటి విధ్వంసం సృష్టించవచ్చో ఉక్రెయిన్ నిరూపించింది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ డ్రోన్ల దాడులను తిప్పికొట్టడానికి అమెరికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ దాడుల్లో అమెరికా సైనికులు మరణించడమే కాకుండా, ఆయుధాలు, విమానాలు కూడా ధ్వంసమయ్యాయి.కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. గత ఆరు నెలలుగా అమెరికా ఇరాన్పై దాడి చేస్తున్నా యుద్ధం కొలిక్కి రాలేదు. వారంలోనే యుద్ధాన్ని ముగిస్తానని బింకాలు పలికిన ట్రంప్ యుద్ధం ఎలా ముగించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికా ఆధునాతన డ్రోన్ల వినియోగంలో అమెరికా వైఫల్యం మరోసారి తేటతెల్లమైంది. ఈ ఆపరేషన్ ఏంటి?అమెరికా వాహనాలను ముప్పతిప్పలు పెట్టిన డ్రోన్లు'కంబైన్డ్ రిజాల్వ్' అనేది మైదాన ప్రాంత యుద్ధాలపై ఆధారపడిన భారీ స్థాయి ఆర్మీ విన్యాసం. ఇందులో అమెరికా దళాలు సాయుధ వాహనాలు, పదాతి దళం, హెలికాప్టర్లు మరియు డ్రోన్లతో పాల్గొంటాయి. అయితే, ఉక్రెయిన్ డ్రోన్ బృందాలు చాలా వేగంగా వీటిని ముక్కలు ముక్కలుగా చేసి పారేశాయి. ఇలాంటి విన్యాసాల్లో నిజమైన మందుగుండు సామగ్రిని ఉపయోగించరు. ఈ విన్యాసాలు వాస్తవ యుద్ధ పరిస్థితులలో లోపాలను గుర్తించడానికి నిర్వహించబడ్డాయి. -
ప్రభుత్వం మారితే సరిపోదు.. అదే నాకు బహుమతి: వాంగ్చుక్
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం ప్రభుత్వాలు మారడం సరిపోదని.. దేశ రాజకీయ వ్యవస్థలోనే మౌలిక మార్పులు రావాలని ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ అన్నారు. దేశానికి ఇప్పుడు ఒక ‘శాంతియుత విప్లవం’ అవసరమని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్చుక్ భారత్ భవిష్యత్తుపై తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఒకప్పుడు భారత్తో సమానంగా లేదా వెనుకబడి ఉన్న థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు నేడు వేగంగా ముందుకు దూసుకెళ్లాయని ఆయన గుర్తుచేశారు. ‘ఇదే వేగంతో కొనసాగితే 2047 నాటికి భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఆయన హెచ్చరించారు.విద్య వెనుకబడితే.. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. ఇటీవల మార్పు కోసం ప్రజలు చేపట్టిన ఆందోళనలను ప్రస్తావించిన ఆయన.. కొన్ని సందర్భాల్లో మంత్రుల రాజీనామాలు జరిగినా, కేవలం వ్యక్తుల మార్పుతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఇదే సమయంలో తన విమర్శలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రజల గొంతుకలను అణచివేస్తున్నారనే ఆరోపణలు వివిధ ప్రభుత్వాలపై వస్తున్నాయని అన్నారు.2012-13లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తుచేస్తూ.. ఆ ఉద్యమం తర్వాత ప్రభుత్వం మారినా అవినీతి, అన్యాయం పూర్తిగా అంతం కాలేదని వ్యాఖ్యానించారు. సమస్యలు ఇప్పుడు మరో రూపంలో మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయని అన్నారు. భారత్ రాజకీయ వ్యవస్థలో ప్రధాన సమస్య నాయకులను ఎన్నుకునే విధానమే అంటూ తన అభిప్రాయపడ్డారు. నాయకులు సరైనవారు కాకపోతే.. మొత్తం దేశమే తప్పుదారి పడుతుందని.. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్యపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.THIS INDIPENDENCE DAY, I NEED YOUR HELP...This country needs a peaceful revolution, at least in how we chose our leaders... if we are to remain even a respectable nation by 2047.Close to half of our MPs have criminal cases and a third have serious charges like murder, rape &… pic.twitter.com/10byPuzwtX— Sonam Wangchuk (@Wangchuk66) August 13, 2026అదే నాకు బహుమతి.. అయితే తాను అధికార పార్టీని కానీ, ప్రతిపక్షాన్ని కానీ లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘ఇది ఏ పార్టీ సమస్య కాదు.. దేశ సమస్య’ అని వ్యాఖ్యానించారు. దేశానికి కొత్త రాజకీయ దిశను చూపించగల వ్యక్తులను గుర్తించేందుకు ప్రజల సహకారం కోరారు. కేవలం మేధావులు మాత్రమే కాకుండా.. నిస్వార్థంగా పనిచేసే, మంచి వ్యక్తిత్వం కలిగిన, సూత్రాలకు కట్టుబడి ఉండే వ్యక్తులు కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా అలాంటి వ్యక్తుల పేర్లను ప్రజలు సూచించాలని ఆయన కోరారు. వివిధ రాష్ట్రాలు, నగరాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి నాకు ఇవ్వగలిగే ఉత్తమ బహుమతి.. అలాంటి మంచి వ్యక్తుల పేర్లను సూచించడమే అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. -
సెంచరీ దిశగా తంజిద్.. బంగ్లా చేతిలో ఆసీస్కు చుక్కలు!
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ (20) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, మరో ఓపెనర్ తంజిమ్ హసన్ (71 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతుండగా, అతడికి షాంటో సహకరిస్తున్నాడు. అంతకముందు మోమినుల్ హక్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ పేసర్లు మెరిసిన చోట ఆస్ట్రేలియా పేస్ త్రయం వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. కమిన్స్, హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్ బౌలింగ్ను ఆచితూచి ఆడిన బంగ్లా బ్యాటర్లు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించడం విశేషం. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ (71) అర్ధసెంచరీ చేయగా, మిగతావాళ్లు పూర్తిగా తేలిపోయారు. హసన్ మహ్ముద్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా, తస్కిన్ అహ్మద్, ఇబదత్ హొస్సేన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. అనంతరం ఆసీస్ బౌలింగ్ను బంగ్లాదేశ్ సమర్థంగా ఎదుర్కొంది. అయితే సున్నా పరుగుల వద్ద లయన్ క్యాచ్ వదిలేయడంతో తంజిద్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుచకున్నాడు.చదవండి: క్రికెట్లో పెను విషాదం.. ఆటగాళ్ల దాడిలో శ్రీలంక కోచ్ మృతి -
‘ఆయనకేం.. చెత్తబుట్టలో కూడా దాక్కుంటారు!’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించిన రహస్య ఆపరేషన్ అంతర్జాతీయ చర్చకు దారితీసింది. టర్కీలోని అంకారాలో నాటో సదస్సు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన్ని మరో చిన్న విమానంలోకి మార్చిన ఘటనపై విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ మీడియా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ఘటన అమెరికా అధ్యక్షుడి భద్రతా ఆందోళనలను బయటపెట్టిందంటూ వ్యాఖ్యానించింది.నాటో సదస్సు కోసం టర్కీ వెళ్లిన ట్రంప్ తిరుగు ప్రయాణం సందర్భంగా ఎయిర్ఫోర్స్ వన్పై క్షిపణి (shoulder-fired missile) దాడి ముప్పు ఉందన్న సమాచారంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. ముప్పు నమ్మదగినదిగా, తక్షణ చర్య అవసరమయ్యే స్థాయిలో ఉందని భావించి ఈ రహస్య మార్పిడి చేపట్టినట్లు సమాచారం.ఇరాన్ మీడియా వ్యంగ్యంఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వ మీడియా తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సైనిక శక్తికి భయపడుతున్నారనే సంకేతంగా ఈ విమాన మార్పిడిని చిత్రీకరించింది. ట్రంప్ తాజా “స్కాండల్”గా అభివర్ణిస్తూ.. ఇది ఆయనకు అవమానకర పరిస్థితి అని ఇరాన్ టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఇరాన్ దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్ను కేటరింగ్ బాక్స్లో దాచినట్లు చూపించే మీమ్ను కూడా షేర్ చేసింది. “త్వరలో చెత్త బుట్టలో దాచాల్సి వస్తుంది” అనే వ్యాఖ్యను జోడించింది.He will be hidden in a trash can before long. pic.twitter.com/ZTkAahNIKw— Iran Embassy SA (@IraninSA) August 11, 2026Brave American hero, or a coward hiding in a catering truck? pic.twitter.com/t1vcmrdcHw— Iran Embassy SA (@IraninSA) August 12, 2026కేటరింగ్ వాహనంలో రహస్య తరలింపుజూలై 8న అంకారా నుంచి బ్రిటన్కు బయలుదేరే సమయంలో ట్రంప్, ఆయనతో ఉన్న కొద్దిమంది సిబ్బందిని కేటరింగ్ ట్రక్కు ద్వారా పెద్ద విమానం నుంచి చిన్న ప్రభుత్వ విమానం C-32Aలోకి మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో అసలు ఎయిర్ఫోర్స్ వన్ వేరుగా బయలుదేరింది. అందులో సీనియర్ అధికారులు, వైట్హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉన్నారు.ఈ ఆపరేషన్ వివరాలను తొలుత వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ట్రంప్ ప్రయాణ వివరాలు, ఆయన అంకారాలో ఉన్న హోటల్ అంతస్తు వరకు ఇరాన్కు తెలిసినట్లు అమెరికా అధికారులు ఆందోళన చెందారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అలాగే ఇలాంటి డీకాయ్ ఆపరేషన్లు(మోసపూరిత భద్రతా వ్యూహం) సర్వసాధారణమేనని వ్యాఖ్యానించింది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఘటనఅమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్పై గతంలోనూ దాడి కుట్ర ఆరోపణలు వచ్చాయి. 2024లో ట్రంప్ అప్పటి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ ఓ ఇరానియన్పై కేసు నమోదు చేసింది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్ల యుద్ధం మొదలైంది. అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులకు శాశ్వత ముగింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విమాన మార్పిడి ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.భద్రతా చర్యా? రాజకీయ ప్రచారమా?అమెరికా వర్గాల ప్రకారం ఇది అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న ముందస్తు జాగ్రత్త మాత్రమే. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సమాచారంతోనే డీకాయ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే కేవలం ఒక ఏజెన్సీ సమాచారంతోనే.. అదీ ధృవీకరణ చేసుకోకుండానే అమెరికా భద్రతా బలగాలు ట్రంప్ను అలా తరలించారని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరాన్ మాత్రం దీన్ని అమెరికా బలహీనతకు సంకేతంగా చూపిస్తూ ప్రచారం చేస్తోంది. ట్రంప్ను రక్షించేందుకు చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కొత్త కారణంగా మారింది. -
'అగధ' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే..మహిమ (ఉల్కా గుప్తా) ఒకానొక సందర్భంలో తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఓ గుహను చూస్తుంది. ఆ గుహ వద్ద ఓ వింత ఘటన జరుగుతుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు బబ్లూ మరణిస్తాడు. ఆమె ప్రేమికుడు సింహా (శ్రవణ్ రెడ్డి) మాత్రం కనిపించడు. ఇంకో వైపు మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఊర్లోని ప్రజల సమస్యలను తీరుస్తూ ఉంటుంది. ఆత్మలకు మోక్షం కలిగిస్తుంటుంది. ఇక కొన్ని రోజులకు మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. తన సోదరి మహిమ మరణంతో మహాదేవి సొంత ఊరికి వస్తుంది. తన ఇంటికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉందని మహాదేవి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో సింహా నుంచి మహాదేవి తెలుసుకున్న అంశాలు ఏంటి? ఈ షికావో గుహ వద్ద ఏం జరిగింది? అసలు ఈ అగధ ఎవరు? మహాదేవి కుటుంబాన్ని ఈ అగధ ఎందుకు చంపుతోంది? చివరకు అగధను మహాదేవి ఏం చేస్తుంది? ఈ కథలో హరిణి (జోవికా విజయ్ కుమార్) పాత్ర, బాబా (షిజు) కారెక్టర్ ఏంటి? అన్నదే కథ.ఎలా ఉందంటే?అగధ సినిమాకి టైటిల్ మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. కథ మాత్రం చాలా పాతగా ఉంటుంది. ఇంత వరకు మనం దేవుడు, దెయ్యం అనే కాన్సెప్ట్లో ఎన్నో సినిమాల్ని చూసి ఉంటాం. అలాంటి కేటగిరీలోకే ఈ చిత్రం కూడా చేరుతుంది. కానీ ఇందులో దేవుడు, దెయ్యం రెండూ మనకు ప్రత్యక్షంగా కనిపించవు. దైవ శక్తి, దుష్టశక్తికి జరిగే పోరు ఎంతో ఇంట్రెస్ట్గా, ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా సాగాలి. కానీ ఇందులో అలాంటి అంశాలేవీ కనిపించవు. ఎక్కడా కూడా కొత్త సీన్ గానీ, అద్భుతంగా అనిపించే ఎపిసోడ్స్ కానీ రావు. ఫస్ట్ హాఫ్ సో సో గానే అనిపిస్తుంది. ఆరంభం ఓ పది నిమిషాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత కామాక్షి పాత్ర ఎంట్రీతో కాస్త డల్గానే సాగుతుంది. మహిమ పాత్ర ఆత్మహత్య చేసుకోవడం, హరిణి వింత ప్రవర్తన, సింహా ఎంట్రీ ఇవన్నీ కాస్త ఇంట్రెస్టింగ్గానే కనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఏమంతా గొప్పగా అనిపించదు. ఇక ఆ గుహలో ఏం జరిగింది? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, అగధ ఎవరు అనే ఆసక్తిని రేకెత్తించడంతో ఇంటర్వెల్ కార్డ్ను వేస్తారు. సెకండాఫ్ మీద అందరికీ ఓ ఉత్సుకత కలిగేలా కట్ చేస్తారు. సెకండాఫ్లో ఏదైనా మెరుపులు, కొత్తదనం ఉంటాయని ఆశిస్తే నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. దైవ శక్తిని కూడా గొప్పగా చూపించినట్టు కనిపించదు, దుష్ట శక్తి కూడా అంతగా విజృంభించదు. అసలు ఈ రెండింటి మధ్య అంత యుద్దం, భీకరమైన సన్నివేశాలు కనిపించదు. దైవానికి, దుష్టశక్తికి పోరాటం అంటే మామూలుగానే గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారంతా. కానీ ఇందులో అలాంటి మూమెంట్స్ ఉండవు. పైగా క్లైమాక్స్ సాదాసీదాగా అనిపిస్తుంది. ఇదేంటి ఇంత సింపుల్గా తేల్చారు, తేలిపోయినట్టుందే అన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరగా అగధ అద్భుతం అనిపించకపోయినా.. ఓ మోస్తరుగా మెప్పించే అవకాశం ఉంది.ఎవరెలా చేశారంటే..కామాక్షి భాస్కర్ల తన పాత్రకు న్యాయం చేసింది. మహాదేవి కట్టూబొట్టూ ఇలా అన్నింట్లోనూ వేరియేషన్స్ చూపించింది. శ్రవణ్ రెడ్డికి నటించే స్కోప్ దక్కింది. విలనిజం బాగానే చూపించాడు. జోవికా, ఉల్కా గుప్తా, భాను చందర్, షిజు, వనితా ఇలా అందరూ మంచి నటనను కనబర్చారు. వైవా రాఘవ్, కనకవ్వ లాంటి ఇతర పాత్రలు కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.సాంకేతిక విషయాలకొస్తే..‘అగధ’ కెమెరామెన్ నాని మంచి అవుట్ పుట్ ఇచ్చారు. విజువల్స్ నేచురల్గా ఉంటాయి. సీజీ వర్క్, వీఎఫ్ఎక్స్ మాత్రం గొప్పగా అనిపించవు. రాకేష్ మ్యూజిక్ బాగుంటుంది. జునైద్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. రాజీవ్ సెట్ వర్క్ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉంటాయి. మొదటి సినిమానే అయినా ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి. -
‘డల్’ కాదు మోడల్!
ఊహ తెలిసినప్పటి నుంచి ఒక అమ్మాయికి మోడల్ కావాలన్న ఆశ. కాని పుట్టుకతోనే గుండె లోపం. ఈ లోపం ఉంటే సహజంగానే పిల్లలు యాక్టివ్గా కనిపించడం చాలా కష్టం. అయితే ఆరోగ్య సమస్య అడుగడుగునా ఆమెను ఇబ్బంది పెడుతున్నా, ఊపిరి తీసుకునే ప్రతిసారి గుండె లయ తనని వెక్కిరిస్తున్నా, మోడల్ కావాలన్న ధ్యాస మాత్రం మారలేదు.. ర్యాంప్ వాక్ చేసేవరకు ఆమె గమనం ఆగలేదు... పోర్టోరికోకి చెందిన సోఫియా పుట్టుకతోనే డౌన్స్ సిండ్రోమ్తో పుట్టింది. డౌన్ సిండ్రోమ్ అంటే గుండె లోపం. పిల్లల ఎదుగుదల సరిగా లేకపోవడం, మాటలు రాకపోవడం, నేర్చుకోవడం ఆలస్యమవడం, శారీరక ఎదుగుదల సవ్యంగా జరగకపోవడం వంటివి ఈ సిండ్రోమ్ తాలూకు లక్షణాలు.. సహజంగా ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్లు అంత ఉత్సాహంగా ఉండరు. క్లాస్లో డల్ స్టూడెంట్స్లా కనిపిస్తారు. కాని సోఫియా మాత్రం తన లోపానికి ఏరోజూ తలొగ్గలేదు. ప్రతిసారీ తనని తాను మరింత మెరుగుపరుచుకుంది. సోఫియాకి 17వ ఏట గుండెకు శస్త్ర చికిత్స చేశారు. తరచూ ఆమె హాస్పిటల్కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునేది... అనేక వైద్యసవాళ్లు ఎదుర్కొన్నా ఆమె మాత్రం కుంగిపోలేదు... మోడలింగ్ వైపు అడుగులేసింది. 2019లో 23వ ఏట ్ర΄÷ఫెషనల్ మోడలింగ్ ప్రారంభించింది. ‘ఐ లవ్ ఇట్’ పేరిట ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించింది. 2020లో న్యూయర్క్ ఫ్యాషన్ వీక్లో రన్ వేపై నడిచింది. ఆమె ప్రయాణంలో అతి పెద్ద మలుపు 2022లో వచ్చింది. ‘విక్టోరియాస్ సీక్రెట్ లవ్ క్లాడ్ కలెక్షన్’ ప్రచారంలో పాల్గొన్న తొలి డౌన్స్ సిండ్రోమ్ మహిళగా సోఫియా చరిత్ర సృష్టించింది. తనలా డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్నవారికి ధైర్యాన్నిచ్చేందుకు క్యాంపెయిన్ను మొదలుపెట్టింది. అలా మోడల్గా, వ్యాపారవేత్తగా, మోటివేషనల్ స్పీకర్గా కొనసాగుతున్న సోఫియా జీవితం మనకిచ్చే సందేశం ఒక్కటే.. అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టకూడదు అని. -
ఫోన్ వల్లే ఇదంతా... మీ పిల్లలు జాగ్రత్త!
‘అవసరానికి మించి మొబైల్ వాడకండి. పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు, వాళ్లు మాట వినకుండా మారాం చేసేటప్పుడు ఫోన్ మాత్రం వాళ్లకు ఇవ్వకండి... అనుభవంతో చెబుతున్నా.. మొబైల్ వల్ల నరకం చూశా.’ అని ప్రముఖ నటి షకీల సోషల్ మీడియాలో తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. కొన్ని వందల సినిమాల్లో నటించిన షకీల సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు.. అయితే గంటల తరబడి ఫోన్ చూడడం, ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించేముందు ఫోన్ పక్కకు ఉంచి దానినే చూస్తూ పడుకోవడం వల్ల ఆమె ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఇటీవలే ఆమె మెడకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకుని డిచార్జ్ అయ్యారు. ఈ ఆపరేషన్కు లక్షల ఖర్చయిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆమె నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గేమ్స్ ఆడడం, రీల్స్ చూడడం, యూట్యూబ్ కంటెంట్తో కాలక్షేపం చేయడం, అవసరం లేకున్నా ఏదో ఒకటి సర్ఫ్ చేస్తూ ఉండడం వల్లే ఈ వ్యాధి సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. మొబైల్ వాడకం అవసరమే.. కాని అవసరానికి మించి వాడడం వల్లే తనకీ దుస్థితి వచ్చిందని షకీల పేర్కొన్నారు. విపరీతమైన మెడనొప్పి వల్ల తీవ్రమైన బాధను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని, మొబైల్కి వారిని దూరంగా ఉంచండంటూ షకీలసోషల్ మీడియాలో పిల్లల తల్లిదండ్రులను కోరారు. -
ఆయ్...యమలోకంలో
భూలోకాన్ని స్పీడ్గా ఆక్రమించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చాలా ఆలస్యంగా యమలోకానికి చేరింది. ‘యమలోకం ఇప్పుడు ఏఐ మయం’ అనే భారీ హెడ్లైన్తో నరకలోక పత్రిక ‘హెల్ పోస్ట్’ మొదటి పేజీలో పెద్దవార్త ప్రచురితమైంది. యమలోకంలో ఏఐ టెక్నాలజీ ప్రారంభమైన తొలి రోజు: ‘పాపిని ప్రవేశ పెట్టండి’ అని అరిచారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు. బోన్లోకి ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు రక్షణకారులు. ‘అయ్యా... వీరి పేరు కారప్పన్. భూలోకంలో ఎక్కడ కారం ఉన్నా దొంగిలిస్తాడు. అలా టన్నుల కొద్ది కారాన్ని దొంగిలించి కోట్లకు పడగెత్తాడు. కారం అంటే పడి చస్తాడు. అలా చచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇతడిపై భూలోక పోలీసు ఠాణాల యందు మిక్కిలి కేసులు ఉన్నవి. చిత్రగుప్తుల వారి చిట్టా కూడా ఇతడు కరుడు గట్టిన కారం దొంగ అని చెప్పుచున్నది’ అన్నాడు ఆ.అ (ఆరోపణ అధికారి)‘కారప్పన్... నువ్వు నరకలోక న్యాయస్థానానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నావా?’ అడిగారు ఇ. అధికారవర్యులు.‘అయ్యా, ఆరోపణ అధికారి చెప్పినదానిలో మిరప గింజంత నిజం కూడా లేదు. నా పేరు కారప్పన్ అయినంత మాత్రాన కారం దొంగగా ముద్ర వేయడం శోచనీయం, గర్హనీయం. చిత్రగుప్తుల వారి చిట్టా ఎప్పుడో అవుట్డేట్ అయింది. దాన్ని నమ్మొద్దు’ అన్నాడు కారప్పన్.కట్ చేస్తే....నరక లోకరక్షణ అధికారులు కారప్పన్ను ఏఐ చాట్బాట్ ‘యమహో...అదరహో’ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ చాట్బాట్లో కారప్పన్ పూర్తి వివరాలు అప్లోడ్ చేసి...‘వీరిపై ఎన్నో ఆరోణలు ఉన్నాయి. అవి నిజమా కాదా?’ అని ప్రాంప్ట్ ఇచ్చారు.‘ఒక్కటి కూడా నిజం కాదు. కారప్పన్కు కారం అంటే చిన్నప్పటి నుంచి విరక్తి. అతడు తినే భోజనంలో రవ్వంత కారం కూడా ఉండదు. కాకికి కూడా హాని చేయని కారంజన్ముడు!’ అని చెప్పింది ఏఐ చాట్బాట్.విచిత్రం ఏమిటంటే... కారప్పన్ మాత్రమే కాదు ఆ తరువాత బోన్లో ప్రవేశ పెట్టిన 120 మంది కరుడు గట్టిన నేరస్థులను కూడా ‘ఉత్తములు, ఆదర్శనీయులు’ అని తేల్చేసింది ఏఐ చాట్ బాట్. దీంతో ఇన్వెస్టిగేషన్ అధికారీవర్యులకు ఏ.ఐ చాట్బాట్పై అనుమానం వచ్చింది.‘గది సంఖ్య ఆరువందల రెండులో ఉన్న ప్రసిద్ధ గంధపు చెక్కల మహా దొంగ వీరప్పన్ను ఏ.ఐ. చాట్బాట్ దగ్గరకు తీసుకురండి’ అని అరిచారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు. మీసాలు తిప్పుతూ ‘తిప్పరా మీసం...కొట్టరా చందనం’ అని పాడుతూ ఏ.ఐ. చాట్బాట్ దగ్గరికి వచ్చాడు వీరప్పన్.‘వీరప్పన్ వ్యక్తిత్వం గురించి తెలియజేయండి’ అని ఏఐ చాట్బాట్కు ప్రాంప్ట్ ఇచ్చారు అధికారులు.‘చాలా ఉత్తముడు. గంధపు చెక్కలను జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు. హింసకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం. చీమకు కూడా హాని తలపెట్టని మహోన్నతుడు. మానవతావాది...’ ఇలా జవాబు ఇచ్చింది ఏఐ చాట్బాట్.‘ఈ యంత్రమును అత్యవసరముగా భాగ్యనగరంలోని మూసీలో విసిరేయండి’ అని ఆజ్ఞాపించారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు.అసలు విషయం‘నరక లోక ఏఐ స్కామ్’లో టెక్ అప్పలరాజును దోషిగా తేల్చారు నరకలోక దర్యాప్తు అధికారులు. నెలక్రితం జరిగిన ఘోర యాక్సిడెంట్లో చనిపోయిన టెక్ రాజు నరకానికి వచ్చాడు. యమలోకంలో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన బాధ్యతలను టెక్ రాజుకు అప్పగించారు అధికారులు. ఇదే అదనునుగా తనలాంటి కరుడు గట్టిన క్రిమినల్స్ను ఆదుకోవడానికి ‘యమహో... అదరహో’ ఏ.ఐ. చాట్బాట్లో తన టెక్ తెలితేటలతో మార్పులు చేశాడు. ఏ.ఐ. చాట్బాట్ అన్నీ అబద్ధాలే చెప్పేలా ఫాల్స్ ఫ్యాక్ట్స్ ప్రాసెసింగ్ (ఎఫ్ఎఫ్పీ) చేశాడు. అసలు విషయం ఇదన్నమాట!– యాకుబ్ పాషా -
రుద్రవీణ నిర్ణిద్ర గానం
సితార్, వీణ గురించి తెలిసినంతగా చాలామందికి ‘రుద్రవీణ’ వాద్యం గురించి తెలియదు. నేర్చుకునేవారు చా...లా తక్కువగా ఉంటారు. ‘రుద్రవీణ’ నేర్చుకునే వారికి మంచి జరగదు’ అనే అపోహ, మూఢనమ్మకాలే దీనికి కారణం. ఆ అపోహల అడ్డుగోడలను కాలదన్ని ‘రుద్రవీణ’లో ప్రావీణ్యం సాధించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు బెంగళూరుకు చెందిన జ్యోతి హెగ్డే. గురుకులం ఏర్పాటు చేసి రుద్రవీణలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రుద్రవీణ కళాకారిణిగా సంగీత నాటక అకాడమీ అవార్డ్ అందుకున్నారు...‘సంగీత నాటక అకాడమీ పురస్కారం వల్ల నాకు వ్యక్తిగత సంతోషం కంటే రుద్రవీణకు ఈ గుర్తింపు లభించింది అనే సంతోషమే ఎక్కువగా ఉంది’ అంటారు జ్యోతి హెగ్డే.సితార్, వీణలాంటి తంత్రి వాద్యాలతో పోలిస్తే ‘రుద్రవీణ’లో ప్రావీణ్యం సాధించిన కళాకారులు చాలా తక్కువ. ఈ వాద్యంలో ప్రావీణ్యం సాధించిన మొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు జ్యోతి హెగ్డే. అయితే ఆ గుర్తింపును సున్నితంగా తిరస్కరిస్తారు హెగ్డే.హంపీ శిల్పాల్లో రుద్రవీణ‘అజంతా, ఎల్లోరా గుహలు, హంపీ శిల్పాలను చూసినప్పుడు మహిళల చేతుల్లో రుద్రవీణ కనిపిస్తుంది. సరస్వతీదేవి, పార్వతీదేవి కూడా రుద్రవీణ వాయిస్తున్న చిత్రాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు రుద్రవీణ వాయించిన మొదటి మహిళను నేను ఎలా అవుతాను... అనిపిస్తుంది. అయితే ఇప్పటికాలంలో రుద్రవీణను ఎంచుకున్న మొదటి మహిళను మాత్రం నేనే’ అంటారు హెగ్డే.ఆ ధ్వనిలో ఆధ్యాత్మిక పరిమళంకాలేజీ రోజుల్లో జ్యోతి హెగ్డే సితార్ తీగల మీద సాధన చేస్తుండేవారు. ఈ క్రమంలో ‘సమ్థింగ్ స్పెషల్’ లాంటి సంగీత పరికరం ‘రుద్రవీణ’ పరిచయం అయింది. ఆ పరిచయం తనను వీనుల విందైన రుద్రవీణ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ‘రుద్రవీణ ధ్వనిలో ఆధ్యాత్మిక పరిమళం ఉంది. తీగలను మీటుతూ స్వరాలను పలికిస్తున్నప్పుడు ఆ ధ్వని నాలో ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వని, రాగాలను నాలో లీనం చేసుకుంటాను. నా అంతర్గత ఆధ్యాత్మిక స్థితిని తెలియజేయడానికి ఇది నాకు తోడ్పడుతుంది’ అంటారు హెగ్డే.అది మూఢనమ్మకం మాత్రమే...‘బరువైన రుద్రవీణ వాయిద్యాన్ని వాయించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది’ అనే అపోహ, మూఢనమ్మకం ఉండడం వల్ల ఆ వాద్యానికి దగ్గరైన వారి సంఖ్య తక్కువ. ‘ఎన్నో అపోహలు ఉన్నప్పటికీ నేను రుద్రవీణ వైపు ఆకర్షితం కావడానికి కారణం... బహుశా ప్రశాంతత, ధ్యానం పట్ల ఇష్టం ఉండడం కావచ్చు. ముగ్గురు గురువుల దగ్గర శిక్షణ పొందాను. మొదట్లో వారు, నువ్వు అమ్మాయివి కదా రుద్రవీణ వాయించడం కష్టం అన్నారు. రుద్రవీణను ఎత్తి, వాయించగల శారీరక బలం నాలో ఉంది అని వారితో చె΄్పాను. ఇతరులు మూడు గంటల సాధన చేస్తే నన్ను నేను నిరూపించుకోవడానికి పది గంటలు సాధన చేసేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు హెగ్డే. ‘రుద్రవీణ వాయించడానికి మహిళలు శారీరకంగా, మానసికంగా సరిపోతారు. కావాల్సిందల్లా నేర్చుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం మాత్రమే’ అంటున్న హెగ్డే, తన గురుకులంలో అరవైమందికి పైగా విద్యార్థులకు రుద్రవీణలో శిక్షణ ఇస్తున్నారు.గురువు దగ్గరే పరిపూర్ణతకళాకారులను తయారుచేయడానికి, వారిని తీర్చిదిద్దడానికి ఆన్లైన్ తరగతులు, నెలకొకసారి జరిగే క్లాసులు సరిపోవని కోవిడ్ కాలంలో గ్రహించాను. శిష్యులు గురువుకు దగ్గరగా ఉన్నప్పుడే, నేర్చుకోవడంలో వారికి పరిపూర్ణత వస్తుంది. ఇది మాత్రమే కాకుండా గురువు జీవనశైలి, ఆలోచనా విధానం, అంకితభావం, కళాత్మక వ్యక్తిత్వాన్ని గ్రహించే అవకాశం లభిస్తుంది.– జ్యోతి హెగ్డే -
మళ్లీ ద్విపాత్రాభినయం?
‘రంగస్థలం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు రుక్మిణి వసంత్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి పేర్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమాలో రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఒక రోల్ పవర్ఫుల్గా ఉంటుందని, మరో పాత్రలో సున్నిత మనస్కుడిగా కనిపిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే... ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ సమయంలో రామ్చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. ఇటీవలే చరణ్ చేతికి సర్జరీ జరిగింది. ఈ కారణంగా ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు. చరణ్ పూర్తిగా కోలు కున్న తర్వాత ‘ఆర్సీ 17’ ప్రారంభం అవుతుందని ఊహించవచ్చు. -
కళ నేర్చిన కాళ్లు కవాతు నేర్పాయి..
‘ఇంత లావణ్యరాశివి. నువ్వు తుపాకీ పట్టావా?’ అన్నాడు బ్రిటిష్ అధికారి.‘క్షమాపణ అడుగు. ఉరిశిక్ష రద్దు చేస్తాను’ అని కూడా అన్నాడు. ఆమె అడగలేదు. కాన్పూర్లో ఆమె నాట్యగత్తె మాత్రమే కాదుతన దేశభక్తితో బ్రిటిష్వారిని ఉరుకులెత్తించిన వీరనారి. 400 మంది మహిళలతో సైన్యం తయారు చేసిన దళనాయకి.పేరు అజ్జన్ బాయి. వృత్తికి ‘తవాయిఫ్’. కాని దేశానికి వీరపుత్రిక.ఆడు’... అంటే ఆడాలి. ‘పాడు’ అంటే పాడాలి. నవాబుల కాలంలో ఉత్తరభారతంలో ‘తవాయిఫ్’లుగా పేరుబడ్డ నాట్యగత్తెల జీవితం అది. దక్షిణాదిన ‘దేవదాసీ’లది, ఉత్తరాదిన ‘తవాయిఫ్’లది సమాజంలో ఒకేలాంటి స్థానం. కాని ఈ ‘దేవదాసీ’ల్లో ఈ ‘తవాయిఫ్’లలోనూ చరిత్రను లిఖించిన వారు ఎందరో ఉన్నారు. కాన్పూరుకు చెందిన అజ్జన్ బాయిది అలాంటి చరిత్ర. 1857 తిరుగుబాటులో కాన్పూర్ వేదికగా సిపాయిలను నడిపించి, నాట్యగత్తె ముసుగులో గూఢచారిగా మారి, చివరకు దేశం కోసం నవ్వుతూ ప్రాణాలర్పించిన అజ్జన్బాయి వీరగాథ నేటికీ ఒక అద్భుతం.లక్నో నుండి కాన్పూర్ కోఠా వరకుఅజ్జన్బాయిది లక్నో. అమె అసలు పేరు అజీజున్నిసా. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో ఆ రోజుల్లో అలాంటి ఆడపిల్లల్ని ‘కోఠా’ (నాట్యగత్తెలు ఉండే చోటు)లకు తరలించేవారు. అలా అజ్జన్బాయి లక్నో నుంచి కాన్పూర్కు మారి ‘లడ్కీ మహల్’ అనే కోఠాకు చేరింది. అయితే కాళ్లకు గజ్జెలు కట్టడం కంటే చేతిలో పుస్తకం పట్టడం గురించే అజ్జన్బాయి ధ్యాస. తన నాట్యం చూడటానికి వచ్చే పెద్దమనుషుల ద్వారా దేశ పరిస్థితులు తెలుసుకునేది. పెద్దమనుషులు ఇళ్లలోని స్త్రీలతో ఏ విషయాలూ పంచుకోకపోయినా ఇలాంటి చోట అనేకం విశదపరుస్తుంటారు. అప్పటికి తవాయఫ్ అంటే కేవలం సాహిత్యం, సంగీతం, సంస్కృతికి చిహ్నం. కానీ 1856లో బ్రిటిష్ వారు అవధ్ను ఆక్రమించిన తర్వాత తవాయిఫ్లను ‘వేశ్యలు’ అని ముద్ర వేశారు. దాంతో వారికి రాజాశ్రయం పోయింది. గౌరవం పోయింది. అప్పుడే అజ్జన్ గుండెలో కోపం పుట్టింది. ఆ కోపమే దేశభక్తి అయ్యింది.మస్తానీ దళం 1857 మే నెలలో మీరట్లో సిపాయిల తిరుగుబాటు మొదలై విప్లవజ్వాలలు దేశవ్యాప్తంగా ఎగసిపడినప్పుడు అజ్జన్బాయి నేరుగా రంగంలో దిగింది. కాన్పూర్లో ఆమె తన తోటి మహిళలతో కలిసి ‘మస్తానీ దళం’ అనే ప్రత్యేక మహిళా సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మహిళలు పగటిపూట వీధుల్లో తిరుగుతూ విప్లవకారుల్లో ధైర్యాన్ని నింపేవారు. గాయపడిన భారతీయ సైనికులకు సేవలు చేస్తూ, వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేవారు. రాత్రివేళల్లో బ్రిటిష్ అధికారుల ముందు నాట్యం చేస్తూ, వారు మత్తులో ఉన్నప్పుడు రహస్య సైనిక సమాచారాన్ని సేకరించేవారు. ఆ సమాచారాన్ని నానా సాహెబ్, తాంతియా తోపే వంటి విప్లవ నాయకులకు చేరవేస్తూ గూఢచారులుగా పని చేశారు.మగ దుస్తుల్లో యుద్ధరంగంలోకి...కాన్పూర్లో బ్రిటిష్ వారికి భారీ సైనిక హెడ్క్వార్టర్స్ ఉంది. జూన్లో నానాసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు ఈ హెడ్క్వార్టర్స్ను మూడు వారాలు దిగ్బంధించారు. దెబ్బకు బ్రిటిష్ వారు ఓటమి అంగీకరించి అలహాబాద్ వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. ఆ సమయంలో అజ్జన్బాయి స్వయంగా మగవారి దుస్తులు ధరించి, గుర్రమెక్కి, రెండు చేతుల్లో పిస్తోళ్లు పట్టుకుని సైనికుల కవాతులో పాల్గొంది. శత్రువుల ఫిరంగి గుండ్లు ముంచెత్తుతున్నా భయపడకుండా స్వయంగా బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. కేవలం 25 ఏళ్ల వయస్సులో ఆమె చూపిన ఈ రణరూపం బ్రిటిష్ సైన్యాన్ని వణికించింది.హావ్లాక్ కోర్టు మార్షల్దెబ్బ తిన్న బ్రిటిష్వారు శక్తి కూడదీసుకొని చెలరేగారు. కాన్పూర్ను భారీ సైన్యంతో బ్రిటిష్ జనరల్ హావ్లాక్ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు కాన్పూర్ వాసులను ఊచకోత కోశాడు. అజ్జన్బాయిని బంధించాక ఆమెను చూసి ‘ఇంత అందమైన మహిళ ఇంతటి వీరత్వాన్ని ఎలా ప్రదర్శించిందో’ అని హావ్లాక్ ఆశ్చర్యపోయాడు. ‘నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి, విప్లవకారుల రహస్యాలిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం’ అని ఆశ చూపాడు. దానికి అజ్జన్బాయి ‘నువ్వు నా ప్రాణాలు తీయగలవు కానీ నా తల వంచలేవు. నాకు కావాల్సింది బ్రిటిష్ సామ్రాజ్య నాశనం మాత్రమే’ అని గర్జించింది. కోపంతో ఊగిపోయిన హావ్లాక్ ఆమెను కాల్చి చంపాలని ఆదేశించాడు. ఫైరింగ్ స్క్వాడ్ ఆమె ముందు నిలబడి బుల్లెట్లు గుండెల్లోకి దింపుతున్నా చిరునవ్వుతో, దేశభక్తి నినాదాలు చేస్తూ ఆమె అమరురాలయ్యింది. ఇవాళ చరిత్ర పుస్తకాల్లో అజ్జన్బాయి పేరు లేదు. కానీ కాన్పూర్ గల్లీల్లో ఇప్పటికీ ఆమె కథ చెప్పుకుంటారు. నృత్యానికి ఆడించాల్సిన చేతులతో ఆమె తుపాకీ పట్టింది. ఎందుకంటే ఆమెకు తెలుసు సంస్కృతి బతకాలంటే స్వాతంత్య్రం ముఖ్యమని. భావితరాల మేలు కోసం తన వర్తమానాన్ని త్యాగం చేసిన అమర వీరురాలు అజ్జన్బాయి. అలాంటివారిని స్మరించుకునే వేళే మన సిసలైన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక. -
ట్రంప్ ప్రెస్ సెక్రటరీ లెవిట్ రాజీనామా
వాషింగ్టన్: వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా చేశారు. ఆగస్టు నెలాఖరులో పదవి నుంచి వైదొలగనున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బయటినుంచి సలహాదారుగా కొనసాగుతారు. తన ఇద్దరు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి వైట్హౌస్లోని ఈ ఒత్తిడితో కూడిన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత స్థాయి పదవిని చేపట్టిన వారిలో అత్యంత చిన్న వయస్సు వ్యక్తైన లెవిట్, తన 18 నెలల పదవీకాలంలో ట్రంప్కు గట్టి విధేయురాలిగా పేరు సంపాదించారు. వైట్హౌస్ బ్రీఫింగ్ సమయంలో విలేకరులతో తీవ్ర వాగ్వాదాలకు దిగి నిత్యం వార్తల్లో నిలిచారు. 28 ఏళ్ల లెవిట్.. మే నెలలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ప్రసూతి సెలవు తర్వాత ఇటీవలే వైట్హౌస్కు తిరిగి వచ్చారు. అయితే, కష్టమైన ఉద్యోగమైన ప్రెస్సెక్రటరీగా, తల్లిగా తన బాధ్యతలను సమతుల్యం చేసుకోవడం కష్టంగా మారిందని రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రెండు బాధ్యతలకు సంపూర్ణంగా న్యాయం చేయలేనని గ్రహించానన్నారు. ప్రెస్ సెక్రటరీ పదవి తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. అయితే, లెవిట్ వైట్హౌస్ నుంచి నిష్క్రమించినా రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారని, బయటి కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేస్తారని, ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ ఉద్యమంతో కలిసి పనిచేస్తారని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. లెవిట్ పనితీరును ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఆమెను వైట్ హౌస్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రెస్ సెక్రటరీల్లో ఒకరిగా అభివర్ణించారు. 2018 నుంచి 2024 ఎన్నికల ప్రచారం వరకు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఇదిలా ఉండగా, జులైలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ట్రంప్ భద్రతా చర్యలు మీడియాకు తెలిసిన సమయంలో లెవిట్ నిష్క్రమణ చర్చనీయాంశమవుతోంది. అధ్యక్షుడితో ప్రయాణించే జర్నలిస్టులకు ఆయన కదలికల గురించి తెలిసేలా చూసుకునే సాధారణ పద్ధతికి విరుద్ధంగా జరగడం ఆమె నిష్క్రమణకు కారణమైందనే చర్చ జరుగుతోంది.అతి పిన్న వయస్కురాలైన ప్రెస్ సెక్రటరీ2025 జనవరిలో 26 ఏళ్లవయసులో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులైన అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. వార్తా మాధ్యమాలతో వైట్ హౌస్ సంబంధాలను పునర్వ్యవస్థీకరించారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్తో కలిసి పనిచేస్తూ, ఏ జర్నలిస్టులకు అధ్యక్షుడిని కలిసే అవకాశం ఇవ్వాలనే నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడంలో సహాయపడ్డారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ రొటేటింగ్ ప్రెస్ పూల్ను నిర్ణయించే సాంప్రదాయ వ్యవస్థనుంచి తొలగించారు. బదులుగా, పరిపాలన పాడ్కాస్ట్లు, న్యూస్లెటర్లు, కొత్త డిజిటల్ మాధ్యమాలకు ఎక్కువ పాధాన్యత ఇచ్చారు. బ్రీఫింగ్ గదిలో ప్రత్యేకంగా న్యూ మీడియా సీటును సృష్టించారు. అయితే, ఈ కొత్త వ్యవస్థ సానుభూతి కవరేజీ మాధ్యమాలకు అనుకూలంగా వ్యవహరించే పరిపాలనకు అవకాశం కల్పిస్తుందని విమర్శించారు. -
కృష్ణబిలం.. ఆపై నక్షత్రం!
భూమితోపాటు ఎనిమిది గ్రహాలున్న మన సౌర కుటుంబానికి వెలుగునిచ్చే అతి పెద్ద నక్షత్రం మన సూరీడు! ఈ సహజ నక్షత్రం సైజు ఎంతో తెలుసా? భూమిలాంటి గ్రహాలు సుమారు 13 లక్షలు కలిపితే ఉండేంత! అంతటి సూరీడికి లక్ష రెట్లు పెద్దదైన ఖగోళ వస్తువును ఒక్కసారి ఊహించుకోండి???? కొంచెం అటుఇటుగా సౌర కుటుంబం ఒకమూల నుంచి ఇంకో మూల వరకూ ఉన్న వంద అస్ట్రనామికల్ యూనిట్ల సైజు! అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త రోహన్ నాయుడు అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు సాయంతో మొట్టమొదటిసారి ఇలాంటి ఖగోళ వస్తువును గుర్తించారు. విశ్వ రహస్యాలు ఛేదించగల ఈ ఆవిష్కరణతో ఇప్పుడు ‘‘కృష్ణ బిల నక్షత్రం’’అన్న పదం ఖగోళ వస్తువుల జాబితాలోకి చేరింది!!! విశ్వం మొత్తం 13.5 కోట్ల ఏళ్ల క్రితంనాటి మహా విస్ఫోటనంతో మొదలైందని సైన్స్ చెబుతుంది. ఆ తరువాత క్రమేపీ విస్తరించే క్రమంలో గ్రహాలు, నక్షత్రాలు, కృష్ణ బిలాలు ఏర్పడ్డాయి. ఈ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు, మరెన్నో రహస్యాలను ఛేదించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఎంఐటీ శాస్త్రవేత్త రోహన్ నాయుడు చేసిన ప్రయత్నాల్లోనే సౌర కుటుంబం సైజున్న భారీ ఖగోళ వస్తువు ఉనికి స్పష్టమైంది. విశ్వం ఏర్పడ్డ కొన్ని లక్షల సంవత్సరాల కాలంలోనే ఈ ‘ఎంఓఎం–బీహెచ్1’కూడా పుట్టుకొచి్చందని అంచనా. మన సూర్యుడి కంటే కోట్ల రెట్లు ఎక్కువ వెలుగునిస్తూండటంతో నక్షత్రమేమో అనుకున్నారు కానీ లక్షణాలను నిశితంగా పరిశీలిస్తే... మునుపెన్నడూ చూడనిదని తెలిసింది. పోనీ కృష్ణ బిలమని అనుకుందామా అంటే ఆ ఛాయలు కూడా లేవు. దీంతో రోహన్ నాయుడు దీనికో కొత్త పేరు పెట్టారు. కృష్ణ బిల నక్షత్రం అని! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అది జోకర్ల గుంపు
న్యూఢిల్లీ: బీజేపీ–ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ను భారతదేశంపై అవగాహన లేని జోకర్ల గుంపుగా అభివరి్ణంచారు. దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత వాస్తవికతపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ గుంపునకు ఏమీ తెలియదని ఆరోపించారు. తమకు, మరికొందరికి ప్రయోజనం చేకూర్చే ఒక వ్యవస్థను దేశంపై రుద్దడమే బీజేపీ–ఆర్ఎస్ఎస్ రాజకీయ సిద్ధాంతమని మండిపడ్డారు. ప్రధాని మోదీ విదేశాంగ విధానం అంతా విదేశీ నాయకులను కౌగిలించుకోవడమేనని ఎగతాళి చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తన అసలైన స్వభావాన్ని ఎప్పుడో కోల్పోయిందని, ప్రస్తుతం అది అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారిందని ఆరోపించారు. బడా బాబులు ఆర్ఎస్ఎస్ను తమ స్వలాభం కోసం వాడుకుంటున్నారని చెప్పారు. నేటి భారతదేశానికి ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. వివిధ అంశాలపై మీడియా ప్రభుత్వ వైఖరికి వంతపాడుతోందని అన్నారు. మీడియా పరిమితులను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. కొంతమంది విదూషకులు మనపై పెత్తనం చెలాయించకుండా చూడటమే జాతీయ స్ఫూర్తి అని స్పష్టంచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాజీనామాలు సమర్పించాల్సిందేనని, అప్పటిదాకా వారికి నిద్ర పట్టదని వ్యాఖ్యానించారు. వారిని నిద్రపోనివ్వబోమని వ్యాఖ్యానించారు. ద్వేషం, హింస లేకుండానే అనుకున్నది సాధిస్తామని స్పష్టంచేశారు. మన సంస్కృతి కోసం పోరాడుతున్నామని వివరించారు. మన దేశం ద్వేషం, పగతో కాకుండా ప్రేమ, సోదరభావం, అహింసతో ముడిపడి ఉందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. -
బాధితులే నిందితులా?.. పరాకాష్టకు కుట్ర రాజకీయాలు
బీసీ నాయకులపై చంద్రబాబు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజు, ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కారుమూరి సునీల్, గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తఫాలపై ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూస్తున్నాం.– వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, కర్నూలు: వెన్నుపోటు పార్టీ రెడ్బుక్ రాజ్యాంగం సాక్షిగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అన్యాయంగా అరెస్టు చేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, బాధితులే నిందితులవుతున్నారని.. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతలే లక్ష్యంగా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే విరూపాక్షి తన పార్టీ కార్యకర్తను కాపాడుకోవడానికి వెళితే ఆయనపైనే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బాధితుల పక్షాన ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. వారు ఎమ్మెల్యేలైనా కూడా లెక్కలేకుండా అర్ధరాత్రి పూట పోలీసులే దొంగలు, బందిపోటు గూండాల మాదిరిగా ఇంట్లోకి చొరబడి సీసీ టీవీ కెమెరాలు దొంగిలించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్నారు. గాంధీ పుట్టిన దేశంలో ఇలాంటి దుర్బర పరిస్థితులు నెలకొనడం బాధాకరమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నాయకులను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం 3.50 గంటల ప్రాంతంలో ములాఖత్లో కలుసుకున్నారు. అరగంటపాటు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. తానున్నానని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? ‘‘ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా విరూపాక్షి గెలుపొందారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంట్లోకి అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో పోలీసులు అక్రమంగా చొరబడి నిద్ర పోతున్న ఆయన్ను అరెస్టు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇది జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లోకి పోలీసులు దొంగల్లా చొరబడి.. సీసీ కెమెరాలను దొంగిలించి.. డోర్లు పగలగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? మనుషుల సంచారం లేని రాత్రి సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం దారుణం. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? పగటి పూట నోటీసు ఇస్తే ఎమ్మెల్యే స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వడా? విరూపాక్షికి సంబంధించి ఒక కేసులో 34 మందిపై, రెండో కేసులో మరో 14 మందిపై కేసు పెట్టారు. మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. వీరిలో ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి సహా మొత్తంగా 38 మంది రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యేతోపాటు ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఆయన తమ్ముడి కొడుకుసహా కేసు పెట్టి జైలుపాలు చేశారు. మరో తమ్ముడి కొడుకును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కుటుంబాన్ని ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసుల ఆరు తప్పులు.. ఎమ్మెల్యే విరూపాక్షిపై పెట్టిన కేసుల్లో పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఈ క్రమంలో వారు ఆరు తప్పులు చేసి అడ్డంగా ఇరుక్కున్నారు. (ఇందుకు సంబంధించి ఫోన్ కాల్ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు చూపారు) 1 బాధితులపై దాడి చేసి.. వారిపైనే కేసులు పెట్టడం మొదటి తప్పు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం సంగాలకు చెందిన గిరి అనే పార్టీ కార్యకర్త తన ఇంటిపై దాడి జరుగుతోందని, అందుకు సంబంధించి తన ఇంటి ఫొటోలు, వీడియోలను ఎమ్మెల్యేకు ఆగస్టు 1వ తేదీన రాత్రి 7.45 గంటలకు పంపారు. ఎమ్మెల్యే వెంటనే 7.47 గంటలకు చిప్పగిరి ఎస్ఐకి ఫోన్ చేసి గిరిని కాపాడాలని కోరారు. ఆ వెంటనే ఆలూరు సీఐకి కూడా ఫోన్ చేస్తే కలువలేదు. తిరిగి 8.03 గంటలకు సీఐకి ఫోన్ చేసి కాపాడాలని కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 8.08 గంటలకు గిరి.. ఎమ్మెల్యేకు మరోసారి ఫోన్ చేసి కాపాడకపోతే చంపేస్తారని చెప్పాడు. మానవత్వం ఉన్న ఎమ్మెల్యే స్వయంగా సంగాలకు వెళ్లి.. అక్కడ పరిస్థితులను తెలుసుకొని గిరిని తన వెంట తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే తప్పు చేశారని ఆయనపై కేసు పెట్టడం పోలీసుల మొదటి తప్పు 2 నేమకల్లులో ఎమ్మెల్యే కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో నేమకల్లులో ఓ టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చింపారని చెప్పి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. ఇక్కడ పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే రెండో కేసు పెట్టి మరో తప్పు చేశారు. 3 ఎమ్మెల్యే కారుపైనే దాడి చేసి.. ఆయన తమ్ముడి చేయి విరగ్గొట్టి, దాడి చేసిన వారి జోలికి వెళ్లకుండా ఎమ్మెల్యేపైనే మూడో కేసుపెట్టి పోలీసులు మూడో తప్పు చేశారు. 4 టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన సంగాల గిరి, చేయి విరిగిపోయిన తమ్ముడిని ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కేసు పెట్టాలని కోరినా పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం నాలుగో తప్పు. ఇక్కడ ఎమ్మెల్యేపైనే రివర్స్ కేసు పెట్టారు. 5 సంగాల, నేమకల్లులలో జరిగిన సంఘటనలపై ఎవరూ ఫిర్యాదు చేయకున్నా.. పోలీసులే కేసులు కట్టడం ఐదో తప్పు. 6 ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొళ్లి.. పోలీసులే సీసీటీవీ కెమెరాలను దొంగల్లా తీసుకెళ్లడం ఆరో తప్పు. ఏదైనా ఫిర్యాదు వస్తే ప్రాథమిక విచారణ చేసి పోలీసులు కేసులు పెట్టాలి. మా ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసు పేరుతో వ్యవస్థను నడిపాం. చంద్రబాబు ప్రభుత్వంలో అవేమీ లేకుండా బాధితులెవరూ ఫిర్యాదు ఇవ్వకున్నా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబూ ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నావో తెలుసుకో.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టడానికి ఏకంగా టీడీపీ కార్యకర్త పది మంది చూస్తుండగా తన భార్య బట్టలు చింపే వరకు దిగజారారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపే వీడియో బయటకు రావడంతో రాష్ట్రం నివ్వెర పోయింది. చివరికి ఆ ఆడబిడ్డతో తప్పుడు మాటలు చెప్పించే పని చేయడం అన్యాయం. రాష్ట్రం ఎంత దిగజారి పోయిందో చెప్పడానికి చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలే నిదర్శనం. మీరే దాడి చేసి.. మీరే చేయి విరగ్గొట్టి.. మా పార్టీ నేతపై మీరే అక్రమ కేసులు పెడితే ప్రజాస్వామ్యం బతుకుతుందా? సంగాల గిరిపై దాడి, ఎమ్మెల్యే తమ్ముడి చేయి విరిగ్గొట్టిన సంఘటనల్లో పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులే సీసీ టీవీలను మాయం చేశారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో ఇట్టే తెలుస్తోంది. బీసీ నాయకత్వంపై చంద్రబాబు కుట్రలు పేరు పొందిన బీసీ నాయకులపై చంద్రబాబునాయుడు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజుపై ఆయన 18 ఏళ్ల కుమారుడి బైక్ యాక్సిడెంట్ను వక్రీకరించి కుట్ర, హత్యాయత్నం కింద అక్రమ కేసు పెట్టారు. శ్రీకాకుళం జైలులో ఉన్న అప్పలరాజును నేను చూడడానికి వెళితే ప్రజలు విపరీతంగా వచ్చిన నేపథ్యంలో ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి మహిళా ఎస్ఐని చంపబోయాడని అక్రమ కేసు పెట్టారు. బుద్ధుంటే పోలీసులు ఇలాంటి కేసులు ఎలా కడతారు? వేల మందిలో మహిళలను ఎలా చంపుతారు? కర్నూలులో బోయ కులస్తుడు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై చంద్రబాబునాయుడు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి. ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తాఫాపై ఏరకంగా అక్రమ కేసు పెట్టారో చూశాం. ముస్తాఫా కుటుంబీకులు డబ్బులు ముందుగానే ఇచ్చినా, తీసుకున్న వారు డబ్బులు ఇవ్వకపోగా పొగాకు కూడా ఇవ్వలేదు. ఈ కేసులో ముస్తాఫా బా«ధితుడు అయితే అతనిపైనే కేసులు పెట్టడం అన్యాయం. అలాగే ఏలూరు ఎంపీగా పోటీ చేసిన యాదవ నేత కారుమూరి సునీల్.. లిక్కర్ టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టారు. నన్నూర్ టోల్గేట్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ వెంటే ముందుకు సాగుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట గ్రిల్ వద్ద నిలబెట్టి వీడియోలు తీసి అవమానించారు.. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్ర రాజకీయాలకు హద్దే లేకుండా పోతోంది. దిగజారి కక్ష సాధింపులకు దిగుతున్నారు. జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్లో కలుసుకోవడానికి వెళ్లిన నన్ను అవమానించారు. సాధారణంగా జైలులోకి ప్రవేశించిన తర్వాత వెళ్లిన వారిని కూర్చోబెట్టి వీడియో, ఫోటోలు తీసి పంపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నన్ను మాత్రం గ్రిల్ వెలుపల నిలబెట్టి ఫొటోలు, వీడియోలు తీసి అవమానించారు. ఎందుకిలా చేశారని సూపరింటెండెంట్ను ప్రశ్నిస్తే.. పై నుంచి వచ్చిన ఆదేశాలతో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. దీన్నిబట్టి వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉద్దేశ పూర్వకంగానే నన్ను అవమానించాడు. ఇది దారుణం. ఇది చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట. అన్యాయంగా కేసులు.. అరెస్టులుఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులపై అన్యాయంగా పోలీసులు కేసులు పెట్టారు. కేసుల నమోదు, ఎఫ్ఐఆర్లు డొల్లతనంగా ఉన్నాయి. ఒక ఫిర్యాదులో ఉన్న నలుగురి పేర్లు.. అదే ఫిర్యాదులో వేరే నిందితులుగా చూపారు. ఏ–10 యాదవల్లి ప్రేమకుమార్ను ఏ–22గా కూడా చూపారు. ఏ–17 మాల గాదిలింగను ఏ–25గా.. ఏ–19 సత్తిరెడ్డిని ఏ–23గా ఎ.సత్యనారాయణరెడ్డి అని చూపారు. ఏ–18 కురవ లింగప్పను మళ్లీ ఏ–24 గా చూపించారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కక్ష సాధింపు పరాకాష్టకు చేరింది. ఎల్లకాలం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని గట్టిగా చెబుతున్నా. మీరు ఈరోజు ఏవైతే దుష్ట సంప్రదాయాల విష బీజాలు విత్తుతున్నారో.. రేపు అవే రెండింతలై మిమ్మల్ని చుట్టుకుంటాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి చూస్తూ చూస్తూ ఉండగానే రెండేళ్లయిపోయింది. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికి ఇంకో మూడేళ్లు కూడా అయిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబునాయుడు నాటిన విష బీజాలు రెండింతలవుతాయని ఆయన గుర్తుంచుకోవాలి’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్నినాని.. వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్వీమోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఇషాక్బాషా, మధుసూదన్, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోటెత్తిన జనసునామీ!కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్నూలు కదిలింది.. ఓర్వకల్లు హోరెత్తింది.. రహదారులు జనసంద్రాలయ్యాయి..! కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారిపై జన ప్రభంజనం కనిపించింది. తుంగభద్ర, హంద్రీ ప్రవాహంతో పోటీ పడుతూ యువ తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. పోలీసుల ఆంక్షలు, చెక్ పోస్టులు, అడ్డంకులను చేధించుకుని ఇసుకేస్తే రాలనంతగా తరలి వచ్చింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ కష్టాలు చెప్పుకునేందుకు.. తమ గోడు వెళ్లబోసుకునేందుకు.. న్యాయం కోసం మొరపెట్టుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆడబిడ్డ నిధి అందని మహిళలు.. తల్లికి వందనం మిస్సయిన తల్లులు.. ఉద్యోగం లేక, నిరుద్యోగ భృతి లేక అల్లాడుతున్న యువత.. దగా డీఎస్సీలో మోసపోయామని ఆవేదన చెందుతున్న ఉద్యోగార్థులు.. కరువుసీమలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడు లేక విలవిల్లాడుతున్న రైతులు.. కర్నూలులో హైకోర్టు కోసం న్యాయవాదులు.. కష్టాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు.. సూపర్సిక్స్.. సూపర్సెవెన్ హామీలను నమ్మి మోసపోయామని వాపోతున్న వివిధ వర్గాల ప్రజలు.. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. ఒక్కటే ఆశ.. జగన్ తమ గోడు వింటారన్న నమ్మకం! తమకు అండగా ఉంటారన్న నమ్మకం ! వీరి ఆవేదనకు తోడుగా.. తమ అభిమాన నేతను ఒక్కసారి చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటెత్తిన జనంతో ఓర్వకల్లు నుంచి కర్నూలు వరకు జనసునామీ కనిపించింది. జననేత పర్యటన ఆసాంతం ‘జెన్ జీ’ యూత్ జోష్ వెల్లువెత్తింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా.. ఎండ తీవ్రత ఠారెత్తిస్తున్నా.. 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఐదు గంటలకు పైగా సమయం పట్టేంతగా జనప్రవాహం ఉప్పొంగింది. కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారి, బైపాస్ రోడ్డు, నగర పురవీధులు ఎటుచూసినా జనసంద్రమే. యువత, మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా జగన్కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు.. పూలవర్షాలు.. ‘జై జగన్’ నినాదాలతో కర్నూలు దద్దరిల్లింది. జనమే జనం.. జననేతకు బ్రహ్మరథం.. ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఎయిర్పోర్టు నుంచి కర్నూలు– హైదరాబాద్ జాతీయ రహదారి కూడలికి చేరుకునేందుకే అరగంటకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత పూడిచెర్ల క్రాస్, రాక్ గార్డెన్, హెచ్ 8 హోటల్ జంక్షన్, నన్నూరు, నన్నూరు టోల్ ప్లాజా, ప్రజా నగర్, కర్నూలు రింగ్ రోడ్డు జంక్షన్, వెంకన్నబావి, గుత్తి పెట్రోల్ బంక్ జంక్షన్, కల్లూరు, షరీఫ్ నగర్, హ్యాంగవుట్ హోటల్ సెంటర్, జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్, చెన్నమ్మ సర్కిల్, కేశవ గ్రాండ్ హోటల్ జంక్షన్, బళ్లారి చౌరస్తా, ఆటోనగర్, సంతోష్ నగర్, పంచలింగాల సర్కిల్, పంచలింగాలపల్లె మీదుగా జిల్లాజైలు వరకు దాదాపు 38 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగింది. జగన్ను చూసేందుకు కర్నూలు, నంద్యాల పరిసర జిల్లాల నుంచి వచ్చిన జనంతో కర్నూలు నగరం జనసంద్రాన్ని తలపించింది. ఓర్వకల్లు ఎయిర్పోర్టు వద్ద భారీగా తరలి వచ్చిన జనసందోహానికి అభివాదం చేస్తున్న జననేత వైఎస్ జగన్కు డీఎస్సీ అభ్యర్థుల మొరమెగా డీఎస్సీ పేరిట తమను దగా చేశారంటూ.. అన్ని అర్హతలు ఉండి డీఎస్సీలో ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. జాతీయ రహదారిపై ప్రజానగర్ వద్ద వీరంతా ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. తప్పకుండా మీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద్ద వైఎస్ జగన్ను కలిసిన డాక్యుమెంట్ రైటర్లు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొడుతోందంటూ వాపోయారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు సంతోష్నగర్ వద్ద కలిసి విజ్ఞాపన పత్రం అందించారు. కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కర్నూలు జిల్లాకు చెందిన పలువురు రైతులు మొరపెట్టుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వర్షాలు పడవని, కరువుతో సీమ ప్రజలు అల్లాడిపోతుంటారని వాపోయారు. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు నమ్మి మోసపోయిన వివిధ వర్గాల ప్రజలు దారి పొడవునా వైఎస్ జగన్ను కలిసి తమ వినతులు అందజేశారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ను సుగాలీ ప్రీతి తల్లి పార్వతి దేవి కలిసి తమగోడు చెప్పుకున్నారు. తనకోసమే పార్టీ పెట్టానని చెప్పుకున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం తనను అన్ని విధాలుగా వంచించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మంచి జరిగిందంటే అది మీ హయాంలో మాత్రమేనని పార్వతి గుర్తుచేసుకున్నారు. -
300 మందిపై కేసులు నమోదు
రాంచీ: జార్ఖండ్లో ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలకు స్వస్తి పలకాలంటూ ఉద్యమిస్తున్న విద్యార్థులు, పరీక్షార్థులు పదో తేదీన రాంచీలో అసెంబ్లీ ముట్టడి వేళ లాఠీచార్జ్, పలువురికి గాయాలైన ఘటనలో పోలీసులు కేసుల నమోదు మొదలెట్టారు. శాసనసభ సమీపంలోని విధాన్ సభా పోలీస్స్టేషన్లో గుర్తు తెలియని 300 మందిపై కేసులు నమోదుచేశారు. ‘‘పదో తేదీన అసెంబ్లీ సమీపంలో పోలీసులపై రాళ్లు రువ్వి, ఉద్రిక్తతలకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదుచేశాం. విద్యార్థుల శాంతియుత ర్యాలీ వెంటనే ఉద్రిక్తంగా తయారైంది. రాళ్ల దాడిలో 14 మంది పోలీసులు గాయపడ్డారు. సీసీటీవీ కెమెరాలు, వీడియోలో ఫుటేజీలను పరిశీలించి ఆయా వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేస్తాం’’అని రాంచీ ఎస్పీ పరాస్ రాణా గురువారం చెప్పారు. మరోవైపు రాంచీలోని జైపాల్సింగ్ ముండా స్టేడియంలో పరీక్షార్థుల ఉద్యమం గురువారం 20వ రోజుకు చేరుకుంది. ‘‘ఉద్యమనేతల నిరాహార దీక్షలు కొనసాగించారు. పరీక్షల విధానంలో సంస్కరణలు, పాత పరీక్షలను రద్దుచేయడం, నియామక ప్రక్రియలో అక్రమాలపై ఇతర రాష్ట్రాల మాజీ జడ్జీలతో దర్యాప్తు జరిగేదాకా ఉద్యమం కొనసాగుతుంది. డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’అని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. 12 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆస్పత్రిపాలైన ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో తాజా ఆరోగ్యస్థితిని ప్రభుత్వం బహిర్గతంచేయట్లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
‘లీగల్ కాక్రోచెస్ ఏకమైతే?.. నల్సార్ వివాదంపై అభిజిత్ సంచలనం!
న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , నల్సార్ లా యూనివర్సిటీ వివాదంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. గతంలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి పునాది వేసిన నినాదాన్ని ఇప్పుడు న్యాయవ్యవస్థకు ముడిపెడుతూ ఆయన సరికొత్త సామాజిక చర్చకు తెరలేపారు.నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని ఆ వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ 2026 బ్యాచ్కు చెందిన దాదాపు 70 మంది విద్యార్థులు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు అధికారికంగా విజ్ఞప్తి లేఖను సమర్పించారు. ఆ తర్వాత, వీరి నిర్ణయానికి మద్దతుగా తదుపరి బ్యాచ్లకు చెందిన మరో 380 మంది విద్యార్థులు కూడా డిమాండ్పై సంతకాలు చేశారు. ఆ రకంగా, ఆ తర్వాత మొత్తం మీద వ్యతిరేకత వ్యక్తం చేసిన విద్యార్థుల సంఖ్య దాదాపు 450 కి చేరింది.ఈ క్రమంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నల్సార్ 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్లు ఎవరినీ లాయర్లుగా ఎన్రోల్ చేసుకోవద్దంటూ అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లను ఆదేశించింది. ఈ సామూహిక నిషేధంపై తీవ్ర విమర్శలు రావడంతో, కొన్ని గంటల వ్యవధిలోనే బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే నిషేధాన్ని ఎత్తేసినట్లు ఆయన పేర్కొన్నారు.బీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిజీత్ దిప్కే ఎక్స్ వేదికగా స్పందించారు. ‘న్యాయవాద రంగంలోని కాక్రోచ్లు అంతా ఒకటైతే ఎలా ఉంటుంది?’ అంటూ ప్రశ్నించారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దేశ యువతను ఉద్దేశించి కాక్రోచ్ అని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆ సమయంలో అమెరికాలో ఉన్న దిప్కే.. ‘దేశంలోని బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది?’ అంటూ ప్రారంభించిన సోషల్ మీడియా పోస్ట్, ఆ తర్వాత 'కాక్రోచ్ జనతా పార్టీ' ఏర్పాటుకు బీజం పడింది. పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఈ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన భారీ విద్యార్థి నిరసనల కారణంగానే అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే సీజేఐ వివాదంలోకి రావడంతో అభిజీత్ దిప్కే ఈ 'లీగల్ కాక్రోచ్ 'ను వాడారు. అంతేకాకుండా 2012 నుండి బీసీఐ చైర్మన్గా కొనసాగుతున్న మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలంటూ సరికొత్త ప్రచారానికి ఆయన తెరలేపారు. బీసీఐ నిషేధాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ, ఆ లేఖను పూర్తిగా వెనక్కి తీసుకోలేదని సీజేపీ ముఖ్య ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిరసన తెలిపిన విద్యార్థులు, వారికి సహకరించిన అధ్యాపకులపై విచారణ జరిపి పేర్లు సేకరించాలని బీసీఐ కొత్త లేఖలో పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. శాంతియుతంగా అసమ్మతిని వ్యక్తం చేసిన విద్యార్థులపై జరుగుతున్న వేధింపులను ఆపాలని, బీసీఐ తన ఆదేశాలను పూర్తిగా ఉపసంహరించుకోకపోతే లా విద్యార్థులు, సీనియర్ న్యాయవాదులతో కలిసి బీసీఐ కార్యాలయం, చైర్మన్ నివాసం వద్ద భారీ నిరసనలు చేపడతామని సీజేపీ హెచ్చరించింది. మనన్ కుమార్ మిశ్రా అధికార బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, తాము ఈ అణచివేతపై నిశ్శబ్దంగా ఉండబోమని సీజేపీ స్పష్టం చేసింది.What if all legal cockroaches come together? https://t.co/mzqrL2a904— Abhijeet Dipke (@abhijeet_dipke) August 13, 2026 Time for Manan Mishra isteefa do?— Abhijeet Dipke (@abhijeet_dipke) August 13, 2026 -
ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్ట్
న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఎయిర్ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు కీలక నిర్ణయాన్ని అమలుచేయనున్నాయి. ఇకపై దేశీయ, అంతర్జాతీయ విమానాలు నడిపి ల్యాండ్ అయ్యాక నిర్దేశిత స్థావరాల్లో పైలట్లకు మత్తుపదార్థాల నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు రెండు సంస్థలు గురువారం ప్రకటించాయి. పది రోజుల క్రితం ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ఇండియా విమానం మార్గమధ్యంలో హఠాత్తుగా 300 అడుగుల దిగువకు దూసుకురావడంతో విమానంలోని ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. ఈ ఘటనలో ఆ విమానంలో ‘పైలట్–ఇన్–కమాండ్’గా విధుల్లో ఉన్న పైలట్కు మత్తుపదార్థాల నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్గా వచ్చింది. గంజాయి సేవించినట్లు పరీక్షలో తేలడంతో విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. టాటా గ్రూప్కు చెందిన ఈ రెండు సంస్థల్లో మొత్తంగా 5,000 మంది పైలట్లు ఉన్నారు. వీరందరికీ విమానం నడిపాక ప్రతిసారీ డ్రగ్ టెస్ట్ చేయనున్నారు. గురుగ్రామ్లోని ఎయిర్ఇండియా అకాడమీతోపాటు పైలట్లకు బ్రీఫింగ్ సెంటర్లు, ఎయిర్లైన్ ఆఫీస్లు, పైలట్ల హోమ్ బేస్లలో కుదిరిన చోట వీళ్లకు టెస్ట్లు చేయనున్నారు. గత నిబంధనల ప్రకారం ఏదైనా విమానయాన సంస్థలోని పైలట్లకు ఏడాదికి ర్యాండమ్గా 10 శాతం మందికి చొప్పున డ్రగ్ టెస్ట్ చేసేవాళ్లు. ఇకపై అందరికీ టెస్ట్ నిర్వహిస్తారు. ఫుకెట్–ఢిల్లీ విమాన ఘటనతో పైలట్ల మానసిక, శారీరక దృఢత్వంపై మరోసారి చర్చ మొదలైంది. వీటికి చెక్పెట్టేందుకు సైకోయాక్టివ్ సబ్స్టాన్సెస్ టెస్ట్లు ఎప్పటికప్పుడు చేసేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు సిద్ధపడ్డాయి. తమ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఈ సందర్భంగా ఎయిర్ఇండియా పేర్కొంది. -
చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు - టీడీపీ నేత జేసీ
చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు - టీడీపీ నేత జేసీ -
పది నిమిషాల్లో చేరుకోవాలి!
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల బాధితులకు సత్వర చికిత్స అందించే లక్ష్యంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పది నిమిషాల్లోపు ప్రమాద స్థలానికి చేరుకోవాలని, లేదంటే రూ.పదివేల జరిమానా విధిస్తామని అంబులెన్సు సరీ్వసులను హెచ్చరించింది. ఈ నిబంధన ప్రమాద స్థలికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని అంబులెన్సులకు వర్తిస్తుందని తెలిపింది. అంతేకాకుండా... అంబులెన్సులు టికెట్ను అంగీకరించిన గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రులకు తీసుకు రావాలని స్పష్టం చేసింది. ఈ గడువును ఉల్లంఘించినా ఒక్కో ఘటనకు రూ.పదివేల జరిమానా తప్పదని తెలిపింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రమాద స్థలం పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే దూరాన్ని బట్టి చేరుకోవాల్సిన సమయాన్ని పెంచుతామని జీపీఎస్ డేటా/ఐఎంఎస్ కేర్ డ్యాష్బోర్డ్ ద్వారా ధ్రువీకరిస్తామని ఎన్హెచ్ఏఐ వివరించింది. ఎన్హెచ్ఏఐ పరిధిలో సుమారు 50,000 కిలోమీటర్ల రహదారులను కవర్ చేస్తూ దాదాపు 3,000 అంబులెన్స్లు, 1,000 పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు టికెట్ తిరస్కరించినా రూ.10 వేల జరిమానా విధిస్తామని తెలిపింది. ఎన్హెచ్ఏఐతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం అంబులెన్సులు అన్ని పరికరాలు, మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపింది. లేకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తామని పేర్కొంది. -
వాయిదాల సమావేశాలు ముగిశాయి!
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయ విరాళాల చోరీపై నిరసనలు, నినాదాలు, అధికార, విపక్షాల మధ్య వాగ్వాదాలు, సవాళ్లతో దద్దరిల్లిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈసారి వర్షాకాల సమావేశాలు దాదాపు నిష్ఫలంగా మిగిలిపోయాయి. రాజ్యసభ, లోక్సభల్లో ఉత్పాదకత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను నిమిషాల వ్యవధిలోనే ఆమోదించడం గమనార్హం. నిత్యం పార్లమెంట్లో ప్రతిష్టంభన నెలకొనడం, సభలు పదేపదే వాయిదా పడడం పరిపాటిగా మారింది. ఇందుకు ప్రతిపక్షాలే బాధ్యత వహించాలని అధికార పక్షం తేలి్చచెప్పింది. అధికార పక్ష వైఖరి వల్లే వర్షాకాల సమావేశాలు స్తంభించిపోయాయని ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. ప్రధానమంత్రి గానీ, హోంమంత్రి గానీ ఒక్కసారి కూడా సభా కార్యకలాపాలకు హాజరుకాకపోవడం ‘అపూర్వం’ అని ఎద్దేవా చేశారు. ఒక్క బిల్లుపైనే ఉభయ సభల్లో చర్చ పార్లమెంట్ 25 రోజులపాటు సమావేశం కాగా, లోక్సభ 19 శాతం పనితీరును నమోదు చేసింది. రాజ్యసభలో అది 39 శాతంగా నమోదైంది. వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో 12, రాజ్యసభలో 12 బిల్లులు ఆమోదం పొందాయి. అయితే, కేవలం ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు–2026’పై మాత్రమే ఉభయ సభల్లోనూ చర్చలు జరిగాయి. ఇతర బిల్లులు పెద్దగా చర్చకు నోచుకోలేదు. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసుల దమనకాండ, అయోధ్య రామమందిర విరాళాల అపహరణపై ఉభయ సభల్లో తీవ్రస్థాయిలో రగడ జరిగింది. విద్యార్థులపై పోలీసుల దాడి పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నిలదీశాయి. ప్రతిపక్షాల నినాదాలు, వాదోపవాదాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ సభల కార్యకలాపాలకు ప్రతిరోజూ అంతరాయం కలిగింది. పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం వద్ద ప్రతిపక్షాలు నిత్యం నిరసన వ్యక్తంచేశాయి. అదే ప్రదేశంలో అధికార ఎన్డీఏ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. కనీసం రెండు సందర్భాల్లో ఇరు వర్గాలు ముఖాముఖి తలపడ్డాయి. నీట్ పేపర్ లీక్ విషయంలో విద్యార్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. స్పీకర్ తేనీటి విందుకు విపక్షాల గైర్హాజరు లోక్సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన సాంప్రదాయ తేనీటి విందును కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పారీ్టలు బహిష్కరించాయి. ఈ కార్యక్రమానికి విపక్షాల నుంచి డీఎంకే నాయకురాలు కనిమొళి హాజరయ్యారు. స్పీకర్ చాంబర్లో జరిగిన తేనీటి విందులో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర సీనియర్ నాయకులు, మంత్రులు పాల్గొన్నారు. రాజ్యసభలో చైర్మన్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈసారి కీలక బిల్లులపై విస్తృత చర్చలు జరగకపోవడంతో ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల వైఖరిలో మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.సభ గౌరవాన్ని నిలబెట్టాలి: రాధాకృష్ణన్ రాజ్యసభలో చివరి రోజు జీరో అవర్, ప్రశ్నోత్తరాలను రద్దుచేశారు. గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ మాట్లాడారు. ఈ సమావేశాల సమయంలో సభా కార్యకలాపాలకు అంతరా యం కలిగిన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులు ఈ మహోన్నత సభ గౌరవాన్ని నిలబెట్టాలని, భారత ప్రజాస్వామ్య అత్యున్నత సంప్రదాయాలకు అనుగుణంగా తమ పార్లమెంటరీ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. జూలై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో, అంతరాయాల కారణంగా ఉత్పాదకత కేవలం 39 శాతంగా ఉన్నప్పటికీ, 12 బిల్లులు ఆమోదం పొందడం లేదా వెనక్కి పంపడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశాలు నిరంతర గందరగోళం, తరచూ అంతరాయాలతో నిండిపోయి, సభా కార్యకలాపాల ను పదేపదే పట్టాలు తప్పించడం విచారకరమని అన్నారు. విలువైన సభా సమయం వృథా కావడం వల్ల జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చ, వాదోపవాదాలు జరగలేదని వెల్లడించారు. మనమందరం సమష్టిగా సభా కార్యకలాపాల్లో పాల్గొని, విలువైన సూచనలు ఇచ్చి, అర్థవంతమైన చర్చలు జరిపి ఉంటే పరిస్థితులు కచి్చతంగా భిన్నంగా ఉండేవని వ్యాఖ్యానించారు. వందేమాతరం అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. లోక్సభలో వందేమాతరం ఆరు చరణాల ఆలాపన లోక్సభ గురువారం ఉదయం ప్రారంభమైన వెంటనే జాతీయ గీతం వందేమాతరంలోనిమొత్తం ఆరు చరణాలను వినిపించారు. లోక్సభ చరిత్రలో జాతీయ గీతాన్ని పూర్తిగా వినిపించడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. సభ పనితీరు, ఉత్పాదకతను వివరిస్తూ సాధారణంగా చేసే ముగింపు ప్రసంగాన్ని స్పీకర్ చదివి వినిపించలేదు. చివరి రోజు కూడా సభలో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ, మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. అంకెల్లో సభ→ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 37 గంటల 49 నిమిషాలు మాత్రమే పనిచేసింది. 39.17 శాతం ఉత్పాదకత నమోదయ్యింది. → మొత్తం 285 స్టార్డ్ ప్రశ్నలను లేవనెత్తారు. 380 జీరో అవర్ సమర్పణలు, 380 ప్రత్యేక ప్రస్తావనలు ఉన్నాయి. వాటిలో 16 ప్రశ్నలు, 52 జీరో అవర్ సమర్పణలు, 93 ప్రత్యేక ప్రస్తావనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోగలిగారు. → లోక్సభ 19 రోజులు సమావేశమైంది. కేవలం 15 గంటల 36 నిమిషాలపాటు పని చేసింది. ఉత్పాదకత గత రెండు దశాబ్దాల్లో అత్యల్పంగా 19 శాతమే నమోదు కావడం గమనార్హం. -
లాకప్ డెత్పై సీబీఐతో దర్యాప్తు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇటీవల వెలుగుచూసిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మాదిరిగానే ఛత్తీస్గఢ్లో సంచలనం సృష్టించిన శ్రవణ్ (28) అనే యువకుడి మృతి కేసును సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. ఏవైనా ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఒకవేళ కస్టడీలో మృతి చెందితే, చట్టం ఎంత కఠినంగా ఉంటుందో స్పష్టం చేసింది. శ్రవణ్ అనే యువకుడి మృతి వెనుక జరిగిన కుట్రను, పోలీసుల కప్పిపుచ్చే ధోరణిని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత ధర్మాసనం.. డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం ఘటనపై సీబీఐతో దర్యాప్తుకు ఆదేశించింది. మధ్యంతర నష్టపరిహారంగా బాధితుడి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోస్టుమార్టంతో వెలుగులోకి నేరం ఆరు లీటర్ల మహువా (నాటు సారాయి) కలిగి ఉన్నాడనే అభియోగంతో ఎక్సైజ్ చట్టం కింద శ్రవణ్ అనే యువకుడిని 2024 జనవరి 18న ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బిలాస్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ శ్రవణ్ ఆరోగ్యం క్షీణించడంతో జనవరి 21న సిమ్స్ (సీఐఎంఎస్) ఆçసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు ఉదయం శ్రవణ్ ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. తల వెనుక భాగంలో బలమైన గాయం, మెడ, తొడ భాగాలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గట్టి వస్తువుతో తలపై కొట్టడం వల్ల తలెత్తిన సమస్యల కారణంగా గుండెపోటు (కార్డియో – రెస్పిరేటరీ) వచ్చి చనిపోయాడని ఆ నివేదికలో స్పష్టమైంది. కుటుంబ సభ్యుల న్యాయ పోరాటం శ్రవణ్ మృతిపై సీఆర్పీసీ సెక్షన్ 176 కింద జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేతృత్వంలో విచారణ జరిగింది. తలకు బలమైన గాయం వల్లే శ్రవణ్ మరణించాడని నిర్ధారిస్తూ బిలాస్పూర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 2024 జూలైలో నివేదిక సమర్పించారు. అయినప్పటికీ ఈ కేసులో బాధ్యులైన అధికారులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శ్రవణ్ భార్య, కుమార్తెలు ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇంటి యజమానిని కోల్పోయిన తమకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అయితే, కస్టడీలోనే శ్రవణ్ను హింసించారని తేలినప్పటికీ అందుకు బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, హైకోర్టు కేవలం రూ.లక్ష మాత్రమే నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించడంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోలీసుల వాదనలపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం శ్రవణ్ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే జ్యుడీషియల్ ఎంక్వైరీ నివేదిక తమకు అందకపోవడం వల్లే క్రిమినల్ కేసు నమోదు చేయలేదని ఛత్తీస్గఢ్ డీజీపీ కోర్టులో వాదించారు. దీన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. హైకోర్టు విచారణ సమయంలోనే జ్యుడీషియల్ ఎంక్వైరీ జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని, నివేదిక కూడా రికార్డుల్లో ఉందని గుర్తు చేసింది. డీజీపీ వాదన ‘పచ్చి అబద్ధం, అత్యంత హేయమైనది’ అని మండిపడింది. కోర్టుల కళ్లలో మట్టికొట్టే ప్రయత్నం ‘న్యాయ విచారణ నివేదిక వచ్చినా రాష్ట్ర అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, దాన్ని దాచి పెట్టాలని చూడటం ముమ్మాటికీ అదొక కప్పిపుచ్చే కథ కిందకే వస్తుంది. కోర్టుల కళ్లలో మట్టి కొట్టే ప్రయత్నం ఇది’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రవణ్ అకాల మరణంతో ఏకైక ఆధారం కోల్పోయిన బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని ఆదేశించింది. అధికారుల పాత్రపైనా సీబీఐ దర్యాప్తు నిజాలు నిగ్గు తేల్చడానికి శ్రవణ్ మృతి ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడీషియల్ నివేదిక వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా దోషులను కాపాడేందుకు ప్రయత్నించిన రాష్ట్ర స్థాయి అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని సీబీఐకి స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులను వారం రోజుల్లో సీబీఐ డైరెక్టర్కు అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు నివేదికను అక్టోబర్ 13న జరిగే తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. -
కోత లేకుండానే.. కేవలం 10 నిమిషాల్లో మెదడులో చిప్ అమరిక!
బీజింగ్: టెక్నాలజీ రంగంలో చైనా మరో సంచలనానికి తెరతీసింది. ఎలన్ మస్క్కు చెందిన 'న్యూరాలింక్' వంటి సంస్థలు పుర్రెను తెరిచి మెదడులో చిప్లను అమర్చే సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, అత్యంత సులభమైన, తక్కువ రిస్క్ ఉన్న సరికొత్త బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి.షాంఘైకి చెందిన ‘స్టైర్మెడ్ టెక్నాలజీ’ అనే స్టార్టప్ సంస్థ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులతో కలిసి పుర్రెను తెరవకుండానే మెదడులో చిప్ను అమర్చే సరికొత్త విధానంపై పరిశోధనలు చేస్తోంది.ఈ పద్ధతిలో మెదడుపై నేరుగా సర్జరీ చేయడం లాంటి పెద్ద ప్రమాదాలకు తావు ఉండదు. వైద్యులు మెడలోని రక్తనాళం ద్వారా ఈ చిన్న పరికరాన్ని లోపలికి పంపి, రక్తనాళాల వ్యవస్థ గుండా దానిని నేరుగా మెదడులోని నిర్దేశిత ప్రాంతానికి చేరుస్తారు. ఆ తర్వాత ఆ డివైస్ను రక్తనాళం గోడ వెలుపల సురక్షితంగా ఉంచుతారు.బీజింగ్ క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన జ్సువాన్వు హాస్పిటల్ వైద్యుడు దువాన్ వాన్ రు మాట్లాడుతూ.. తగిన అనుభవమున్న సర్జన్ ఈ పరికరాన్ని కేవలం 10 నిమిషాల్లోనే సరైన స్థానంలో అమర్చగలరని తెలిపారు.ఈ సరికొత్త విధానాన్ని ఇప్పటివరకు గొర్రెలపై విజయవంతంగా పరీక్షించారు. త్వరలోనే మానవులపై కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తితే నెల రోజుల్లోపు ఆ ఇంప్లాంట్ను సులభంగా వెనక్కి తీసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.పక్షవాతం, వెన్నుముక గాయాలు లేదా ఇతర తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ తమ అవయవాలను కదిలించలేని వారికి ఈ టెక్నాలజీ ఒక వరంలా మారనుంది. మెదడు ఇచ్చే సంకేతాలను ఈ చిప్ ద్వారా కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు చేరవేయడం ద్వారా వారు తమ ఆలోచనల ద్వారానే డివైయర్లను కంట్రోల్ చేయవచ్చు.అలీబాబా, టెన్సెంట్ వంటి దిగ్గజ కంపెనీల పెట్టుబడులతో ముందుకు వెళ్తున్న ఈ టెక్నాలజీ, రాబోయే రోజుల్లో న్యూరో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. -
జయహో జగన్
జగన్ రాకే ఒక ప్రభంజనం... జన సందోహాలు, జనసంద్రాలే నిదర్శనం.. పరామర్శకెళ్లినా..పలకరింపునకు వచ్చినా ప్రజా సమూహాలకు పరమానందం.. ఆయన్ను చూడాలని, ఆయన మాట వినాలని పరితపించే హృదయాలకు హృద్యమమే.. సంద్రంలా కదిలివచ్చే తీరు ఉత్తుంగ తరంగమేహృదయ సంగమమే వీడని బంధంలా.. వదులుకోలేని అనుబంధంలా పెనవేసుకున్న ప్రేమానురాగాల్లా కళ్లను కట్టిపడేసే జన‘సిత్రాలు’ఎన్నో ఎన్నెన్నో... మా మనవడే వచ్చాడంటూ అవ్వృతాతలు.. నా బిడ్డే కదిలి వచ్చాడని అమ్మలు..మా తమ్ముడే తరలివస్తున్నాడని అక్కలు మా అన్నే వచ్చాడంటూ విద్యార్థులు..మా మార్గదర్శి వెంటేనంటూ జెన్ జీ తరం... పోటెత్తే సింధువులో బిందువుల్లా...రేపటి ఉద్యమానికి వారధుల్లా... జయ జయహో జగన్ అంటూ ప్రణమిల్లిన తీరుతో కర్నూలు పర్యటన యావత్తూ మురిసి మెరిసే.. కర్నూలులో ‘జెన్ జీ’ జోష్.. జగన్ వెంట కదం తొక్కిన యువత... వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో పెద్ద సంఖ్యలో యువత కనిపించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జగన్ కాన్వాయ్ వెంట వేలాదిగా యువకులు బైకులపై కదం తొక్కారు. నన్నూరు, నన్నూరు టోల్ప్లాజా, గుత్తి పెట్రోల్ బంక్ జంక్షన్, చెన్నమ్మ సర్కిల్, సంతోష్ నగర్ కూడళ్లు యువత సందడితో హోరెత్తాయి. కేరింతలు, జై జగన్.. జై జై జగన్ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. ఓ వైపు చేతుల్లో ప్లకార్డులు.. మరోవైపు బైక్లపై జగన్ కాన్వాయ్ వెంట ఉత్సాహంగా యువకులు సాగారు.. ‘ఇంటికో ఉద్యోగం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి’ హామీల అమలుపై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కొందరు యువకులు ప్లకార్డులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. అదే సమయంలో ‘జగన్ నువ్వే మా దిక్కు.. నువ్వే మాకు భరోసా’ అంటూ మరికొందరు ప్లకార్డులను ప్రదర్శించారు. సోషల్మీడియాలో చురుగ్గా కనిపించే నేటి ‘జెన్ జీ’ తరం భారీగా రోడ్డెక్కడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. జగన్ పర్యటనలో యువత చూపిన ఉత్సాహం.. వారిలో ఆయనకు ఉన్న ఆదరణను చాటిందని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ధైర్యంగా ఉండండి.. పార్టీ అండగా ఉంటుందిములాఖత్లో ఎమ్మెల్యే విరూపాక్షికి వైఎస్ జగన్ భరోసాఎమ్మెల్యే భార్య, చిన్న కుమారుడికి ధైర్యం చెప్పిన జననేత కర్నూలు (సెంట్రల్): అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి నేనున్నానంటూ వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. గురువారం జిల్లా జైలులో ములాఖత్లో విరూపాక్షి, ఇతర నాయకులను వైఎస్ జగన్, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, విరూపాక్షి భార్య రామాంజనమ్మలతో సహా కలిశారు. వైఎస్ జగన్ విరూపాక్షితో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ఇతర నాయకులకు అండగా నిలవాలని సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం జైలు వెలుపల విరూపాక్షి భార్య రామాంజనమ్మ, చిన్నకుమారుడు లక్ష్మీనారాయణలతో కూడా వైఎస్ జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. విరూపాక్షి కుటుంబానికి అన్ని విధాలా అండదండలు అందించాలని పార్టీ నాయకులను జగన్ ఆదేశించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధైర్య పడవద్దని, అక్రమ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పారు. అడుగడుగునా ఆంక్షలు.. బారికేడ్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు: జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అడుగడుగునా చెక్పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి జనం వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు. అయినా ఖాతరు చేయకుండా జనం తండోపతండాలుగా తరలివచ్చారు. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద జనాన్ని అడ్డుకున్నారు. దాదాపు 200 వాహనాలను నిలిపివేశారు. కోడుమూరు, నాగలాపురం రేడియో స్టేషన్ల వద్ద చెక్పోస్టులు పెట్టి జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదోని, ఆలూరు నుంచి రాకుండా అడ్డుపడ్డారు. తనిఖీల పేరుతో జనాన్ని నిలిపివేశారు. దేవనకొండ, వెల్దుర్తిల వద్ద చెక్పోస్టులు పెట్టి నిలిపివేశారు. కోడుమూరు, నాగలాపురం, కర్నూలు టౌన్, రిలయన్స్ మార్ట్ ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి నిలిపివేశారు. కోడుమూరు దగ్గర చెక్పోస్టు పెట్టి నిలువరించారు. నంద్యాల ప్రాంతం నుంచి రాకుండా ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి జిల్లా జైలు వరకు వేలాదిమంది పోలీసులను మోహరించారు. బెంగళూరు–హైదరాబాద్ హైవే పైకి ఎక్కే ప్రాంతంలో చెక్పోస్టులను పెట్టారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో జగన్ను చూసేందుకు తరలివచ్చారు. -
ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ సర్వీస్ టీచర్లకు ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే 30 ఏళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి మళ్లీ టెట్ నిర్వహించడం సరికాదని కేంద్రం దృష్టికి తెచ్చింది. టెట్ నిబంధన వల్ల ఆంధ్రప్రదేశ్లో సుమారు లక్ష మంది, దేశవ్యాప్తంగా దాదాపు 28 లక్షల మంది ఇన్సర్వీస్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాశ్రెడ్డి, గురుమూర్తి, గొల్ల బాబూరావు నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ(టీచర్) ఎమ్మెల్సీలు టి.కల్పలతారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై ఈమేరకు వినతిపత్రం అందచేశారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్రం దృష్టికి సమస్యను తెచ్చినట్లు చెప్పారు. అనంతరం వారంతా ఆంధ్రప్రదేశ్ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తాం సంబంధిత సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులను అన్ని సబ్జెక్టులతో టెట్ పరీక్ష రాయాలనడం ఎంతవరకు సమంజసమని ఎంపీలు ప్రశ్నించారు. టెట్ నుంచి సీనియర్, ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఉపాధ్యాయుల సమస్యపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు. టీచర్ల ఓట్లతో గెలిచిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమస్యను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు అన్ని పార్లమెంటరీ మార్గాలను ఉపయోగించి ఉపాధ్యాయుల తరఫున పోరాడతామని ప్రకటించారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న టీడీపీ కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారిపై టెట్ బలవంతంగా రుద్దడం వారి వృత్తిని అవమానించడమేనని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన సమయంలో ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టెట్ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపు కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని టీచర్ ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడితేవాలని వినతి ఇన్సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ఏపీ వైఎస్సార్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ జంషీద్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటనాథరెడ్డి, గౌరవ అధ్యక్షుడు అశోక్కుమార్రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమరనాథరెడ్డి, కడప, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.సంగమేశ్వరరెడ్డి ఢిల్లీలో ఎంపీలు గొల్ల బాబూరావు, డాక్టర్ మద్దిల గురుమూర్తి, టీచర్ ఎమ్మెల్సీలకు వినతిపత్రాన్ని అందచేశారు. సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్నామని, కొన్ని వేల మంది రెండు మూడేళ్లలో రిటైర్ కాబోతున్న విషయాన్ని ఎంపీల దృష్టికి తెచ్చారు. -
రాజశేఖర్రెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్ అక్రమం
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ రవాణా కేసులో చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు అరెస్టులే లక్ష్యంగా దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం అక్రమ రవాణా కేసులో నిందితులు కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వారి అరెస్ట్ను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. వీరి అరెస్ట్ విషయంలో చట్టం నిర్దేశించిన విధి విధానాలను సిట్ అధికారులు తుంగలో తొక్కారని ఆక్షేపించింది. సిట్ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోవడం లేదంది. సిట్ దర్యాప్తునకు సహకరించాలని రాజశేఖర్రెడ్డి, వాసుదేవరెడ్డిలను ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు వారి ముందు హాజరు కావాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో తమకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాజశేఖర్రెడ్డి, వాసుదేవరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమ అరెస్ట్ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ తుహిన్కుమార్ గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో పూర్తి పాఠం తెలియరాలేదు. -
ఓటు సరి చేసుకోవడానికి ప్రత్యేక శిబిరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్ఐఆర్)లో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సవరణలపై ఓటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆయన గురువారం వీడియా కాన్ఫెరెన్స్ ద్వారా క్లెయిమ్స్, అభ్యంతరాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ప్రచారం కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి ఆఫీసర్లు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు హాజరై ఓటరు జాబితా ధ్రువీకరణ, ఫారాలు, మార్గనిర్దేశాలతో పౌరులకు సహాయం చేయాలని కోరారు. ఇప్పటికే 44.10 లక్షల మంది తొలగించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అభ్యంతరాల పరిశీలనకు 45 రోజుల సమయం ఉందని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం విస్తృత ప్రచారం చేయాలని, కళాశాలలు, విద్యా సంస్థల వద్ద శిబిరాలను ఏర్పాటు చేసి, కొత్త ఓటర్ల నమోదు చేపట్టాలని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6 సమర్పించేలా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రోత్సహించాలన్నారు. ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లలో అక్షర దోషాల సవరణకు ఈసీఐ నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరపాలని చెప్పారు. 48 గంటలకు పైబడి పెండింగ్లో ఉన్న బీఎల్ఓ కాల్స్ నాన్–రెస్పాన్స్ కేసులను, ఎన్జీపీఎస్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. -
దొంగతనం చేసిన ఇంట్లోనే కునుకు తీశాడు.. తెల్లారే సరికి
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఇంట్లోకి చొరబడి బంగారం తస్కరించిన ఓ దొంగ, అక్కడే గాఢ నిద్రలోకి జారుకున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి దొంగతనం చేసేందుకు పక్కా ప్రణాళికతో ఒక ఇంటిలోకి ప్రవేశించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి, ఇంట్లోని బీరువాను తెరిచి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. అపై అక్కడి నుంచి పలాయనం చిత్తగించాల్సింది పోయి అలసట, మత్తు కారణంగా అక్కడే నేలపై నిద్రపోయాడు.ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన యజమానులు ఇల్లంతా గందరగోళంగా ఉండటాన్ని, ఒక వ్యక్తి నేలపై గాఢ నిద్రలో ఉండటాన్ని చూసి ఖంగుతిన్నారు. వారు వెంటనే ఆ వ్యక్తిని పరిశీలించగా, తాము పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అతని జేబులోనే దర్శనమిచ్చాయి.దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాఢ నిద్రలో ఉన్న దొంగను లేపి అదుపులోకి తీసుకున్నారు. అతని జేబులో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
డీఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చేందుకే గ్రూప్–1పై విషం
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు కూటమి 2018లో జరిగిన గ్రూప్ –1 నియామకాలపై విషం చిమ్ముతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్, పార్టీ స్టేట్ యూత్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ సలాంబాబు ధ్వజమెత్తారు. వారు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని చంద్రబాబు కూటమి యువత ఆశలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని నాగార్జున యాదవ్ అన్నారు. ‘డిజిటల్ మూల్యాంకనం నిబంధనలకు విరుద్ధమని ఎవరు చెప్పారు? ఈ విధానాన్ని భవిష్యత్తులో కూడా ఏపీపీఎస్సీ అనుసరించవచ్చని కోర్టు స్పష్టంగా చెప్పింది. కేవలం నోటిఫికేషన్లో పేర్కొనలేదనే కారణంతోనే ఆ నియామకానికి వర్తింపజేయొద్దని కోర్టు చెప్పింది. హాయ్ల్యాండ్లో జరిగిన ప్రక్రియ రెండోసారి మూల్యాంకనం కాదని సిట్ స్పష్టంగా చెప్పింది. కేవలం డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను ఓఎంఆర్ షీట్లలో నమోదు చేశారు. హాయ్ల్యాండ్లో జవాబు పత్రాలను మార్చలేదని, ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్లలో నమోదైన మార్కుల్లో ఎలాంటి తేడా లేదని సిట్ స్పష్టంగా చెప్పింది. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, 84 రోజుల పాటు హాయ్ల్యాండ్లో ఉన్నప్పటికీ అవి చెక్కుచెదరలేదని దేశంలోని ఏడు సీఎఫ్ఎస్ఎల్ కేంద్రాలు స్పష్టంగా చెప్పాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లోనూ అభ్యర్థుల మార్కుల నమోదులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్లలో కరెక్షన్స్ సహజమే. ఎగ్జామినర్ తర్వాత చీఫ్ ఎగ్జామినర్, స్రూ్కటినైజర్ స్థాయిలోనూ జవాబు పత్రాలను పరిశీలిస్తారు. మానవ తప్పిదాలను నివారించేందుకే పలు దశల్లో పరిశీలించి అవసరమైన సవరణలు చేస్తారు. జవాబు పత్రాలను బండిల్గా చేసి అందులో జరిగిన కరెక్షన్స్ సంఖ్యను నమోదు చేసే విధానం కూడా ఉంది. 2016, 2018, 2022, 2024లో జరిగిన పరీక్షల్లోనూ ఇదే విధానం అమలైంది. ఎగ్జామినర్లే కరెక్షన్స్ చేసినట్లు స్పష్టంగా చెప్పారు’ అని నాగార్జున యాదవ్ చెప్పారు. లోకేశ్ కోసం గ్రూప్–1అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు డీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం, లోకేశ్ రాజకీయ భవిష్యత్తు కోసమే 163 మంది గ్రూప్ – 1 అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారని సలాంబాబు ధ్వజమెత్తారు. సిట్ నివేదికలోని వాస్తవాలను పక్కనపెట్టి, వారికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారన్నారు. సాధారణ మూల్యాంకన ప్రక్రియలో జరిగే కరెక్షన్స్ను అవకతవకలుగా చిత్రీకరించడం సరికాదని చెప్పారు. ‘జవాబు పత్రాల్లో కరెక్షన్స్ చేసింది తామేనని ఎగ్జామినర్లే సిట్ విచారణలో స్పష్టం చేశారు. కరెక్షన్స్ మూల్యాంకన ప్రక్రియలో భాగమే తప్ప అక్రమం కాదు. 2018 గ్రూప్–1లో ఎంపికైన అభ్యర్థుల్లో అత్యున్నత విద్యా సంస్థల్లో చదివిన ప్రతిభావంతులు ఉన్నారు. అర్హత లేని వారిని ఎంపిక చేశామని ఆరోపించడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఎంపికైన వారిలో 19 మంది ఐఐటీ, 17 మంది ఎన్ఐటీ, 6 మంది ఐఐఎం నుంచి వచ్చారు. ఎంబీబీఎస్, బీడీఎస్ చేసిన 18 మంది కూడా ఎంపికయ్యారు. 39 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూకు వెళ్లిన వారు. వారిలో 16 మంది యూపీఎస్సీలో ఎంపికై ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లోకి వెళ్లారు. గ్రూప్ – 1 ఇంటర్వ్యూకు ఎంపికైన 325 మందిలో 103 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. బ్యాంకింగ్, ఐటీ తదితర రంగాల్లో పనిచేస్తున్న 101 మంది కూడా ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులు కూడా గ్రూప్ – 1కు ఎంపికయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ మూల్యాంకన కేంద్రాలు, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. పరీక్షల్లో ఇంపర్సనేషన్ను అరికట్టేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది. గ్రూప్ – 1 ఇంటర్వ్యూల్లో 24 మంది సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూ బోర్డుల్లో ఏపీపీఎస్సీ సభ్యులు, సీనియర్ అధికారులు, అకడమిషియన్లతో పారదర్శకమైన విధానం అమలు చేశారు. ఇంటర్వ్యూ మార్కుల్లో నిర్దేశిత గ్రేడింగ్ విధానంలో ఎలాంటి వ్యత్యాసం గుర్తించలేదని సిట్ నివేదికే చెబుతోంది. అంటే గ్రూప్–1లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నది సుస్పష్టం. అక్రమాలే జరిగితే అదే అభ్యర్థులను ఇప్పుడు మీరే ఎందుకు నియమించుకున్నారు? కుప్పం డెవలప్మెంట్ అథారిటీలో 2018 గ్రూప్ – 1 అభ్యరి్థని చంద్రబాబు ప్రభుత్వం నియమించలేదా? డీఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్న భయంతోనే గ్రూప్ – 1 అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్గా తెరపైకి తెచ్చారు’ అని సలాంబాబు చెప్పారు. -
‘కూటమి’ క్రైమ్ కథాచిత్రం!
మధురవాడ: విశాఖలో మైనార్టీ వర్గానికి చెందిన ఓ యువతిని పెళ్లి పెరుతో లొంగదీసుకొని మోసం చేసిన కేసు అధికార కూటమి నేతల మెడకు చుట్టుకుంటోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకోవడం, గర్భస్రావానికి ఒత్తిడి చేయడం, ఆపై బ్లాక్మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో కార్పురపు రాహుల్రెడ్డి, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సహా 11మందిపై మైనార్టీ యువతి కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు టీడీపీ కూటమి నేతలు రంగంలోకి దిగారు. బాధితురాలిని పలు విధాలుగా బెదిరింపులకు గురి చేస్తున్నారు. తనను బెదిరించి, లొంగదీసుకునేందుకు ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలతో పాటు నేరుగా సీఎం కార్యాలయం నుంచి కూడా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారని బాధితురాలు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇవన్నీ నిందితుడు రాహుల్రెడ్డికి అధికార కూటమి నేతలతో ఉన్న బలమైన సంబంధాలను వెల్లడిస్తున్నాయని బాధితురాలి వర్గం చెబుతోంది వైరల్ అవుతున్న ఆడియో నిందితుడు రాహుల్రెడ్డికి విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్యాదవ్తో సన్నిహిత సంబం«దాలు ఉన్నాయని, కూటమికి చెందిన మరో ఎమ్మెల్యే అతనికి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి బాధితురాలి తరపు న్యాయవాదికి సంబంధించినదిగా ప్రచారంలో ఉన్న ఒక ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ పేరు అందులో ప్రస్తావనకు రావడం పెద్ద దుమారానికే దారితీసింది. నిందితుడు రాహుల్రెడ్డికి ఆ ఎమ్మెల్యేతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన పేరును అడ్డుపెట్టుకుని తనను బెదిరించారని బాధితురాలు కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఎమ్మెల్యేకు చెందిన కీలక వ్యాపార వ్యవహారాలను కూడా రాహుల్రెడ్డి చూస్తున్నారనే విషయం ఆడియోలో ఉన్నట్లు బాధితురాలి వర్గాలు వెల్లడిస్తున్నాయి. రూ.20 కోట్ల బెదిరింపుల వెనుక ఎవరు? ఈ ఏడాది చివరికి రూ.20 కోట్లు సంపాదించి బాధితురాలి అంతం చూస్తానని రాహుల్రెడ్డి బెదిరింపులకు దిగడం కేసు తీవ్రతను వెల్లడిస్తోంది. ఒక వ్యక్తిగత వివాదం వెనుక ఇంత పెద్దమొత్తంలో ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయా? రాహుల్రెడ్డికి రూ.20 కోట్లు సంపాదిస్తాననే ధీమా ఇచ్చిన నాయకులు ఎవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కక్షపూరిత వేధింపులు పలువురు తనను బెదిరించారని, బ్లాక్మెయిల్ చేశారని, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ఉపయోగించి ఒత్తిడికి గురిచేశారని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించారు. తాను హనీట్రాప్ అని, వ్యభిచారం చేస్తున్నట్లు.. హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఇంతటి స్థాయిలో వేధింపులు కొనసాగుతున్నాయంటే.. రాహుల్రెడ్డి వెనుక రాజకీయంగా, అధికారికంగా ఎవరు అండగా ఉన్నారని ఆమె ప్రశ్నిస్తోంది. -
ప్రైవేటు భూ వివాదంలో కలెక్టర్కు ఏం పని..?
సాక్షి, అమరావతి: తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై చంద్రబాబు ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను హైకోర్టు గురువారం తీవ్రంగా ఆక్షేపించింది. తిరుపతి రూరల్ మండలం, తణపల్లి పరిధిలోని సర్వే నంబర్ 478లోని అప్రూవ్డ్ ప్రైవేట్ లేఔట్లోకి భూమన కరుణాకర్రెడ్డి, ఆయన అనుచరులు అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ కలెక్టర్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో భూమన, ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ప్రైవేట్ లేఔట్లోకి అక్రమంగా చొరబడి ఉంటే, దాని యజమాని కింది కోర్టులో సూట్ దాఖలు చేసుకునే వారని పేర్కొంటూ, దీంట్లో కలెక్టర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశి్నంచింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని పోలీసులకు సూచించిన హైకోర్టు, దర్యాప్తునకు సహకరించాలని భూమన, ఆయన కుటుంబ సభ్యులను ఆదేశించింది.ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ప్రొసీడింగ్స్పై హైకోర్టును ఆశ్రయించిన భూమన భూమన కరుణాకర్రెడ్డి, ఆయన అనుచరులు అప్రూవ్డ్ లేఔట్లోకి అక్రమంగా ప్రవేశించి యంత్రాల సహాయంతో మామిడి తోటల మొక్కలను ధ్వంసం చేశారని, అలాగే తన సొంత పొలానికి రోడ్డు వేసుకుని అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారని, దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ గత నెల 22న జిల్లా ఎస్పీని లిఖితపూర్వకంగా ఆదేశించారు. ఈ ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ భూమన కరుణాకర్రెడ్డి, ఆయన సతీమణి రేవతి, కుమారుడు అభినయ్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. భూమన తరఫున సీనియర్ న్యాయవాది చిత్తర్వు నాగేశ్వరరావు, న్యాయవాది యుగంధర్రెడ్డి వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా భూమన, ఆయన కుటుంబ సభ్యులపై ప్రభుత్వం విషం చిమ్ముతోందన్నారు. లేఔట్ యజమాని ఫిర్యాదు చేయనప్పుడు కలెక్టర్ ఎలా జోక్యం చేసుకుంటారు? ‘‘ఓ ప్రైవేట్ అప్రూవ్డ్ లేఔట్ వివాదంలో కలెక్టర్కు ఏ సంబంధం ఉంది? ప్రైవేటు భూ వివాదంలో జోక్యం చేసుకునే అధికార పరిధి కలెక్టర్కు ఎక్కడ ఉంది? భూమన కరుణాకర్రెడ్డి, ఆయన అనుచరులను గూండాలని కలెక్టర్ తన ప్రొసీడింగ్స్లో పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరం. ఏ ఆధారంతో కలెక్టర్ వారిని గూండాలని సంబోధిస్తారు? కలెక్టర్ చాలా దారుణమైన భాష ఉపయోగించారు. ప్రైవేటు అప్రూవ్డ్ లేఔట్ యజమాని ఫిర్యాదు చేయనప్పుడు ఆ వ్యవహారంలో కలెక్టర్ ఎలా జోక్యం చేసుకుంటారు?’’ అని తిరుపతి జిల్లా కలెక్టర్ను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.ఫిర్యాదుదారుగా కలెక్టర్ని పేర్కొనడంపై కూడా విస్మయం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ కోరితే, ఫిర్యాదుదారుగా కలెక్టర్ను ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. బహుశా కలెక్టర్ మన శాఖకు చెందిన వారు కాదు కదా అన్న ఉద్దేశంతో, ఎస్పీని కాకుండా కలెక్టర్ను ఫిర్యాదుదారుగా పోలీసులు పేర్కొని ఉంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఎస్పీని ఫిర్యాదుదారుగా చేర్చేంత ధైర్యం కింది స్థాయి పోలీసులకు ఎక్కడ ఉంటుందని వ్యాఖ్యానించింది. -
ఈ రాశి వారు వాహనాలు, ఆభరణాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.విదియ రా.8.31 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: మఖ ఉ.6.55 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.2.45 నుండి 4.19 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.08 వరకు తదుపరి ప.12.30 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: రా.12.10 నుండి 1.42 వరకు.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.24రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం..... శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.వృషభం.... దూరప్రయాణాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.మిథునం... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు.కర్కాటకం....... కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.సింహం... శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అదనపు రాబడి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం.కన్య..... మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.తుల..... ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.వృశ్చికం...... కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.ధనుస్సు... ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.మకరం... అనుకున్న పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో స్వల్ప వివాదాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.కుంభం... దూరపు బంధువులు సహాయపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మీనం.. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలోఅంచనాలు నిజమవుతాయి. -
తీరంలో అలజడి
అల్లవరం/పెదగంట్యాడ: సముద్రం అలకల్లోలం సృష్టించింది. అమావాస్య కావడంతో బుధవారం రాత్రి, గురువారం వేకువన భారీ అలలు ఉప్పొంగాయి. కడలి ముందుకు చొచ్చుకొచ్చింది. ఫలితంగా గ్రామాల్లో ప్రజలు భీతిల్లారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరంలోభారీ కెరటాల తాకిడికి 50 అడుగుల మేర తీరం కోతకు గురైంది. తీరానికి రక్షణ వలయంగా ఉన్న తాడిచెట్లూ కడలిలో కలసిపోయాయి. పర్యాటకుల కోసం నిర్మించిన సముద్ర రిసార్ట్స్ భవనం ప్రహరీ కుప్ప కూలింది. రిసార్ట్స్కు ఆనుకుని ఉన్న రొయ్యల చెరువుకు భారీ గండి ఏర్పడింది. రిసార్ట్స్కు తాడిచెట్లు రక్షణగా ఉండటంతో ప్రస్తుతం తాత్కాలికంగా ముప్పు తప్పింది. అయితే, ఇదే తరహాలో అలలు ఎగసిపడితే మాత్రం సముద్ర రిసార్ట్స్ ఏ సమయంలోనైనా కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఓడలరేవు తీరం వద్ద ఏటా జూలై, ఆగస్టు నెలల్లో సముద్ర అలల భారీగా ఎగసిపడుతున్నాయి. తీరాన్ని కోతకు గురిచేస్తున్నాయి. 2019 సెప్టెంబర్ 12న ఇక్కడ సముద్రం మహోగ్రరూపం దాల్చింది. రెండు రోజుల పాటు భారీ కెరటాలతో సుమారు వంద మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. దీంతో, తీరం పొడవునా ఉన్న రోడ్డు కడలిలో కలసిపోయింది. సరుగుడు తోటలు, తాడిచెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదే తరహాలో గురువారం తెల్లవారుజామున సముద్రం తీరంపై విరుచుకుపడింది. ఓడలరేవు తీరంలో చమురు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ ఆన్షోర్ టెర్మినల్ రక్షణకు తీరం పొడవునా వైనతేయ గోదావరి నదీ ముఖద్వారం నుంచి కొమరగిరిపట్నం యడ్లరేవు వరకూ గ్రోయిన్ల నిర్మాణం చేపట్టింది. ఇవి సముద్ర రిసార్ట్స్కు ఇరువైపులా ఉన్నాయి. అయినప్పటికీ భారీ అలలు విరుచుకుపడ్డాయి. తీరం పొడవునా సాగు చేస్తున్న ఆక్వా చెరువుల కట్టలు వలయం ధ్వంసమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. » యారాడ తీరంలోనూ సముద్రం ఉప్పొంగింది. యారాడ గ్రామానికి వెళ్లే రహదారిపైకి నీరు చేరింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు లోనయ్యారు.. జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. స్పందించిన జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్తో పాటు జాయింట్ కలెక్టర్ గురువారం ఉదయం కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు.. రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, ఇసుక తిన్నెలను జేసీబీ సాయంతో శుభ్రం చేయించారు. అలాగే పర్యాటకులు ఎవరూ యారాడ తీరానికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. -
వెలిగొండ నిర్వాసితుల నిరీక్షణ
మార్కాపురం టౌన్: జిల్లా కేంద్రం మార్కాపురం కలెక్టరేట్ వద్ద గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐదుగంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెలిగొండ ప్రాజెక్టుపై సమీక్షకు వచ్చిన మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయం లోపలకు వెళ్లారు. ఇది తెలుసుకున్న గొట్టిపడియ, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల తదితర ముంపు గ్రామాల నిర్వాసితులు భారీ సంఖ్యలో కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరీక్షించారు. దీంతో పెద్దసంఖ్యలో పోలీసులు...నిర్వాసితులను లోపలకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. పలుమార్లు పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. రాత్రి ఏడు గంటల సమయంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బయటకు రాగా, నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ డిమాండ్లను పరిçష్కరించకుండా ఇళ్లు ఖాళీ చేయాలని చెబితే తామెక్కడ ఉండాలని, దీంతోపాటు నీళ్లొదిలే తేదీని కటాఫ్ తేదీగా తీసుకుని 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, పునరావాస కాలనీలో సౌకర్యాలు కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు రాత్రి 8 గంటలు దాటిన తర్వాత బయటకు వచ్చిన మంత్రులకు నిర్వాసితులు తమ కష్టాలు చెప్పుకున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి రామానాయుడు నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చే వారంలో రూ.300 కోట్లు, నెలాఖరులోపు మరో రూ.300 కోట్లు నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ నెలాఖరులోపు గ్రామాలను ఖాళీ చేయాలని, ఏమైనా సమస్యలుంటే స్పెషల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. -
క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.98,073 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలో ఖాతాదారులు, వారి కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము బ్యాంకుల్లో ఏడాదికేడాదికి పెరిగిపోతోంది. ఈ ఏడాది జనవరి నెలాఖరునాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము దాదాపు రూ.లక్ష కోట్లకు చేరింది. గత ఏడాది జూన్ నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము రూ.90,545 కోట్లు ఉండగా అదే ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి రూ.98,073 కోట్లకు చేరింది. క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఎటువంటి లావాదేవీలూ లేని ఖాతాలు, మరణించిన బంధువుల నిధుల గురించి కుటుంబాలకు తెలియకపోవడమేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. క్లెయిమ్ చేయని డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేశారని తెలిపింది. ఖాతాదారు మరణిస్తే నామినీలకు ఆ ఖాతా గురించి తెలియకపోవడం, చిరునామా, ఫోన్ నంబర్, ఇ–మెయిల్ ఐడీ అసంపూర్ణంగా ఉండటం, లేదా చట్టపరమైన వారసులకు నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలు లేకపోవడంతో క్లెయిమ్ చేయలేకపోతున్నారని పేర్కొంది. క్లెయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించి అర్హులైన చట్టపరమైన వారసులను సకాలంలో గుర్తించేందుకు ఆర్బీఐ అనేక చర్యలను తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్లెయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించి చట్టపరమైన వారసులను గుర్తించి ఆ డిపాజిట్లను చెల్లించేందుకు బ్యాంకులను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ చర్యలను చేపట్టిందని తెలిపింది. ప్రత్యేక శిబిరాల ద్వారా క్లెయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించి వినియోగదారులు, వారి నామినీలు లేదా చట్టపరమైన వారసుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలను చేపడుతున్నట్లు పేర్కొంది.. దేశ వ్యాప్తంగా 748 జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడంతోపాటు ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి రూ. 7,320 కోట్ల విలువైన క్లెయిమ్ చేయని డిపాజిట్లను నిజమైన యజమానులకు తిరిగి అప్పగించినట్లు తెలిపింది. క్లెయిమ్ చేయని డిపాజిట్లలో 90 శాతం 30 బ్యాంకుల్లోనే ఉన్నాయని, ఆ వివరాలన్నింటినీ ప్రత్యేక పోర్టల్లో అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
డీఎస్సీ స్కామ్పై నిలదీస్తే అక్రమ కేసులా?
సాక్షి, అమరావతి / నెట్వర్క్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు ప్రజాస్వామ్య హక్కులను పాశవికంగా అణచివేస్తోంది. కక్ష సాధింపు చర్యల కోసం పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగిస్తోంది. మెగా డీఎస్సీ స్కామ్ 2025పై వెల్లువెత్తుతున్న నిరసనలకు సమాధానం చెప్పలేక అక్రమ కేసులు బనాయిస్తోంది. డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, దీనిపై సీబీఐతో విచారణ నిర్వహించాలనే డిమాండ్లతో మూడు రోజుల పాటు రిలే దీక్షలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీలు విజయవంతం కావడంతో చంద్రబాబు సర్కారు బెంబేలెత్తుతోంది. నిరసన ర్యాలీలపై ఉక్కుపాదం మోపుతోంది. వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులకు దిగింది. రోడ్లపై బారికేడ్లు పెట్టి వైఎస్సార్ సీపీ శ్రేణులను నిరోధించేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు, జెన్ జీ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలీసు అడ్డంకులను అధిగమించి ర్యాలీలను విజయవంతం చేశారు. జాతీయ స్థాయిలో చర్చ.. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్సార్సీపీ ర్యాలీలతో దద్దరిల్లాయి. ఈ నిరసనల్లో ప్రధానంగా జెన్ జీ యువత, పెద్ద ఎత్తున పాల్గొనడం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. దీంతో తన తనయుడు లోకేశ్ రాజకీయ భవితపై కలవరపాటుకు గురైన సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో అణచివేత చర్యలకు దిగారు. రిలే దీక్షలు, ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డినప్పటికీ వారి ప్రయత్నాలు విఫలమవడంతో అక్రమ కేసులు బనాయించే ఎత్తుగడ పన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు డైరెక్షన్లో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి కార్యకర్తలపై వేధింపులకు దిగారు. పలుచోట్ల అక్రమ కేసులు నమోదయ్యాయి. యువతను మోసం చేసిన చంద్రబాబును ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే నారా లోకేశ్తో రాజీనామా చేయించి డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణకు అంగీకరించాలని, యువతకు నిరుద్యోగ భృతి, ఫీజులు, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొడాలి నానిని కలిసిన ఎస్ఐ వీఆర్కు.. ఈ నెల 10న గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని కలిసిన గుడివాడ ఒకటో పట్టణ ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ నిరసన ర్యాలీకి అనుమతిలేదని నోటీసు అందించారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, జెన్ జీ యువత, ప్రజలతో కలిసి మాజీ మంత్రి కొడాలి నాని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఎస్ఐ సత్యనారాయణను వీఆర్కు పంపిస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. » కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 53 మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. » వినుకొండలో హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతోపాటు పలువురు నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 10న వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉండగానే ర్యాలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. » అమలాపురంలో నిరసన ర్యాలీ చేపట్టినందుకు మాజీ మంత్రి విశ్వరూప్, మాజీ ఎంపి చింతా అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ సహా 15 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30ను ఉల్లంఘించారంటూ కేసు పెట్టారు. » గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, నూరి ఫాతిమా తదితర 17 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో పాటు పోలీస్ యాక్టు అమలులో ఉన్నా ర్యాలీ నిర్వహించినట్లు కేసు నమోదు చేశారు. » ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించినందుకు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. » అనకాపల్లి జిల్లాలో ఈనెల 10న నిరసన ర్యాలీకి పిలుపునిచ్చినందుకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మరో 27 మందిపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదయ్యాయి. » అనంతపురం జిల్లాలో అక్రమ కేసుల పరంపరం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలపై తాడిపత్రి పోలీస్స్టేషన్లో అక్రమ కేసులు నమోదయ్యాయి. -
చేపా..చేపా.. మా బకాయిలెక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఉచిత చేప పిల్లల పంపిణీకి ముందుకు వెళ్తున్న సమయంలో పాత బకాయిల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం నిధులు కేటాయించినా..మీనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో మాత్రం బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం సుమారు రూ.120 కోట్ల మేర నిధులు కేటాయించగా అందులో సగం మేరకే ఖర్చు చేశారు. మిగిలిన నిధులు సంబంధిత శాఖ వద్ద ఉన్నప్పటికీ తమకు రావాల్సిన బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది టెండర్లు ఆసల్యంగా వేయడం, ధర పెంపు కోసం కాంట్రాక్టర్లు పట్టుపట్టడతో చేపల పంపిణీ కూడా డిసెంబర్ వరకు సాగింది. దీంతో ఉచిత చేప పిల్లల పంపిణీ మధ్యలోనే ఆపేసి మమ అనిపించారు. ఈ ఏడాది రూ.116 కోట్లతో చేప, రొయ్య పిల్లల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో పాత బకాయిల అంశం కొత్త టెండర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందా? అనే చర్చ మొదలైంది. గత ఏడాది కేటాయించిన నిధుల్లో గణనీయమైన మొత్తం ఖర్చు కాకుండా మిగిలి ఉన్న నేపథ్యంలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిధులు శాఖ వద్ద అందుబాటులో ఉన్నప్పుడు.. సరఫరా పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని వారు నిలదీస్తున్నారు. మరో వైపు బిల్లుల చెల్లింపులో జాప్యం కొనసాగితే భవిష్యత్తులో చేప పిల్లల సరఫరా ప్రక్రియపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే బిల్లుల చెల్లింపునకు ముందు గతంలో చేప పిల్లల పంపిణీపై పూర్తి స్థాయి లెక్కలు తేల్చాలని మత్స్యశాఖ భావిస్తోంది. గతంలో కాంట్రాక్టర్లు సరఫరా చేసిన చేప పిల్లలు ఎన్ని? ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాస్తవంగా చెరువుల్లో ఎన్ని చేప పిల్లలను విడుదల చేశారు? వాటిలో ఎన్ని పిల్లలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి? అనే అంశాలపై శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చేప పిల్లల నాణ్యతపై గతంలో వచ్చిన ఆరోపణలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సరఫరా చేసిన పరిమాణం, చెరువుల్లో విడుదల చేసిన సంఖ్య, సంబంధిత రికార్డులు, అధికారుల ధ్రువీకరణ తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇక ‘స్మార్ట్’గా రేషన్ కార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్దిదారుల గుర్తింపును మరింత పటిష్టం చేయడంతోపాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డు (స్మార్ట్ రేషన్కార్డు)లో పలు భద్రతా ఫీచర్లను పొందుపరిచింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం సంగారెడ్డిలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా కొత్త స్మార్ట్ రేషన్కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్డులో కనిపించే భద్రతా అంశాలతోపాటు సాధారణంగా గుర్తించలేని రహస్య భద్రతా గుర్తులు, స్పర్శ ద్వారా గుర్తించే సాంకేతికత, డిజిటల్ ధ్రువీకరణ వంటి పద్ధతులను కార్డులో వినియోగించారు. కార్డుపై తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన హోలోగ్రామ్ను ముద్రించారు. అలాగే జారీ చేసే అధికారి అయిన పౌరసరఫరాల కమిషనర్ అధికారిక సంతకాన్ని కూడా కార్డులో పొందుపరిచారు. దీంతో కార్డు ప్రామాణికతను నిర్ధారించడం, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్దిదారుల గుర్తింపును బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చేతితో తడిమితే తెలిసే అక్షరాలు ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’అనే పదాలను ఉబ్బెత్తుగా ముద్రించారు. చేతితో తడిమినప్పుడు ఈ అక్షరాలు స్పష్టంగా తెలుస్తాయి. అలాగే కార్డులో మైక్రో ప్రింటెడ్ టెక్సŠట్ను కూడా ఉపయోగించారు. అతి చిన్న పరిమాణంలో ఉండే ఈ అక్షరాలు సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించవు. పెద్దదిగా పరిశీలించినప్పుడు మాత్రమే చదవగలిగేలా ఉంటాయి. సాధారణ ప్రింటర్లతో నకిలీ చేయడం కష్టంగా ఉండటంతో ఇది యాంటీ–కాపీ భద్రతా అంశంగా పనిచేస్తుంది.‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’, ‘ఒరిజినల్’వంటి అక్షరాలతో ద్వంద్వ రహస్య చిత్రాలను పొందుపరిచారు. నిర్దిష్ట కోణంలో చూసినప్పుడు లేదా పెద్దదిగా పరిశీలించినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయి. కార్డు అసలైనదో కాదో నిర్ధారించేందుకు నిపుణులకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో వాటర్మార్క్ను కార్డులో పొందుపరిచారు. కార్డును వెలుతురుకు ఎదురుగా ఉంచినప్పుడు ఈ గుర్తు కనిపిస్తుంది. ప్రభుత్వ పత్రాల్లో సాధారణంగా ఉపయోగించే బలమైన ధ్రువీకరణ భద్రతా విధానాల్లో ఇది ఒకటి. అలాగే సాధారణ వెలుతురులో కనిపించని తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని అతినీలలోహిత (యూవీ) కాంతిలో కనిపించేలా ప్రత్యేక సిరాతో ముద్రించారు. యూవీ కాంతి కింద ఈ గుర్తు వెలుగుతుంది. దీంతో రహస్యంగా కార్డును తనిఖీ చేయడంతోపాటు యంత్రాల ద్వారా కూడా వేగంగా ధ్రువీకరించవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ కార్డులో లబ్దిదారుల వివరాలను భద్రంగా ధ్రువీకరించేలా ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. అదీకృత సాఫ్ట్వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా మాత్రమే ఇందులోని సమాచారాన్ని ధ్రువీకరించేలా రూపొందించారు. కార్డుకు సంబంధించిన సీరియల్ నంబర్ తదితర డిజిటల్ సమాచారాన్ని ఇందులో భద్రపరచవచ్చు. అ«దీకృత వ్యవస్థ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినప్పుడు మాత్రమే వివరాలను ధ్రువీకరించే అవకాశం ఉంటుంది. -
రేణుకాస్వామి కేసులో దర్శన్కు దెబ్బ మీద దెబ్బ
సాక్షి,బెంగళూరు: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ప్రదూష్ ఎస్. రావు అప్రూవర్గా మారడానికి బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. 2024 జూన్ 8న బాధితుడిని చిత్రహింసలు పెట్టి దాడి చేస్తున్నప్పుడు తాను అక్కడే ఉన్నానని, రేణుకాస్వామిని దర్శన్ ఏవిధంగా చిత్ర హింసలకు గురి చేశాడు. ఆయన ప్రాణాలు తీశాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఫేక్ కేసు ఎలా సృష్టించారనే విషయాల్ని కోర్టుకు వివరించారు. అయితే, ప్రదోష్ రావు ‘అప్రూవర్’గా మారి క్షమాభిక్ష కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తుపై అభ్యంతరాలు తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దర్శన్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చగా, ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.దర్శన్కు అత్యంత సన్నిహితుడైన ప్రదూష్ కోర్టులో క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేరానికి సంబంధించిన పూర్తి నిజాలను, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ తూగుదీప పాత్రను వెల్లడించారు. రేణుకాస్వామిపై దాడి జరిగే సమయంలో దర్శన్ బాధితుడి ఛాతిపై నిలబడి పదే పదే తన్నాడు. ఆ తర్వాత తాను చేసిన హత్యను కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు కథను సృష్టించాడు. దర్శన్ స్నేహితురాలు,సహనటి పవిత్ర గౌడ సోషల్ మీడియా పోస్టులపై అసభ్యకరమైన కామెంట్లు చేశారనే కోపంతో 2024 జూన్ 8న బెంగళూరులోని కామాక్షిపాళ్యలోని ఒక షెడ్డులో దర్శన్, ఇతరులు కలిసి రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ప్రదూష్ రావు తన వాంగ్మూలంలో.. నేను షెడ్డుకు చేరుకునేసరికి రేణుకాస్వామి నేలపై కూర్చున్నారు. అతని చుట్టూ పలువురు వ్యక్తులు ఉన్నారు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపాడంటూ దర్శన్ అతన్ని దూషిస్తున్నాడు. పవిత్రను తన చెప్పుతో రేణుకాస్వామిని కొట్టమని కోరాడు. ఆ తర్వాత ఇతరులు వంతులవారీగా కర్రలతో కొట్టారు. అనంతరం, దర్శన్ నైలాన్ తాటితో రేణుకాస్వామిపై దాడి చేశాడు. దర్శన్ రేణుకాస్వామి మెడపై, ఛాతిపై తన్నాడు. అతని గుండెలపై నిలబడ్డాడు. రేణుకాస్వామి ఫోన్ను నాకు ఇచ్చాడు. ఇతర మహిళలకు కూడా అలాంటి మెసేజ్లు ఏమైనా పంపాడో లేదో తనిఖీ చేయమని చెప్పాడు. ఈ దాడి ఇలాగే కొనసాగితే బాధితుడు చనిపోతాడని దర్శన్ను హెచ్చరించా. అయినప్పటికీ దర్శన్ రేణుకా స్వామిపై దాడిని ఆపలేదు. ఆ తర్వాత రేణుకాస్వామి మరణించినట్లు నటుడి డ్రైవర్ లక్ష్మణ్ నాకు చెప్పాడు. ఈ మరణం గురించి చెప్పడానికి నేను దర్శన్ ఇంటికి వెళ్లా. ఆ తర్వాతే తప్పును కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారు. నేను సహకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ బెదిరించాడు. ఆర్థిక వివాదానికి సంబంధించిన ఒక నకిలీ హత్య కథను దర్శన్ సృష్టించాడని, ఈ హత్య కేసులో లొంగిపోవడానికి నిందితులను వెతకమని ఇద్దరు వ్యక్తులకు రూ. 15 లక్షల నగదును బ్యాగ్లో పెట్టి ఇచ్చాడు. రేణుకాస్వామి మృతదేహాన్ని ఒక తెల్లటి స్కార్పియోలో ఉంచి పారవేసేందుకు అనువైన ప్రాంతం కోసం వెతికారు. చివరికి దానిని ఒక డ్రైనేజీ సమీపంలో పడేశారు. ఘటన జరిగి రెండు రోజుల తర్వాత పలువురు వ్యక్తులు పోలీసు స్టేషన్లో లొంగిపోగా, తాను మరికొందరితో కలిసి పోలీసులకు పట్టుబడ్డానని రావు తెలిపారు. -
స్నేహితుడిగా వచ్చి.. హంతకుడిగా మారి!
వెల్దండ: ఆరేళ్లుగా అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితంలోకి ఓ స్నేహితుడి ప్రవేశం చిచ్చురేపింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసి.. చివరకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కొట్ర గ్రామానికి చెందిన నారమల్ల చెన్నయ్య, కావటి అనూష(25) ఆరేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అనూష కల్వకుర్తిలోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో చెన్నయ్యకు సన్నిహితుడైన శ్యాంపూరి రాములు ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత అనూషతో రాములుకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. బుధవారం సాయంత్రం పని ముగించుకున్న అనూష గ్రామానికి వెళ్లేందుకు కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాకు వచ్చింది. భర్తకు ఫోన్ చేసి ఆటో కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. రాత్రి 7 గంటల సమయంలో గ్రామానికి వెళ్తున్నానంటూ వచ్చిన రాములు తన బైక్పై ఆమెను తీసుకెళ్లాడు. భార్య ఎంతకూ ఇంటికి రాకపోవడంతో చెన్నయ్య ఆమెకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ రావడంతో కల్వకుర్తి వెళ్లి అనూష పనిచేసే దుకాణంలో ఆరా తీశాడు. అప్పటికే ఆమె వెళ్లిపోయిందని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించాడు. హతమార్చేందుకు ముందుగానే పథకం అనూష కొంతకాలంగా తనను దూరం పెడుతోందని రాములు భావించాడు. తనతో మాట్లాడాలని, కలవాలని కోరినా ఆమె నిరాకరించడంతో అతడిలో కక్ష పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను హతమార్చేందుకు పథకం వేశాడు. ఇందుకోసం ఆదివారం రోజే కట్టెలను సమకూర్చుకుని.. పట్టణ శివారులోని వడ్డోనీరాళ్ల వద్ద చితిని సైతం సిద్ధం చేసుకున్నాడు. హత్య చేసిన తర్వాత అక్కడే తగలబెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు.బుధవారం రాత్రి ఆటో కోసం ఎదురుచూస్తున్న అనూషను రాములు బైక్పై తీసుకెళ్లి కొట్రగేట్–హైదరాబాద్ రోడ్డులోని ఓ మామిడితోట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన అల్లుడు వరుసయ్యే నాయిని శ్రీనుకు సమాచారం ఇచ్చి సంఘటనా స్థలానికి పిలిపించుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని వడ్డోనిరాళ్ల వద్ద ఏర్పాటు చేసుకున్న చితివద్దకు తీసుకెళ్లి డీజిల్ పోసి తగలబెట్టి తిరిగి వచ్చేశారు. హత్య అనంతరం రాములు గ్రామంలో కొంతసేపు తిరిగాడు. చెన్నయ్య భార్య కోసం వెతుకుతున్న విషయం తెలిసి.. భయాందోళనకు గురైన రాములు బుధవారం అర్ధరాత్రి వెల్దండ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. తానే అనూషను హత్య చేసినట్లు చెప్పడంతో నిందితుడు ఇచ్చిన సమాచారంతో వెల్దండ సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ యుగంధర్రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు సమక్షంలో ఘటనాస్థలంలోనే మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేపట్టారు. అక్కడ లభించిన ఎముకలు, ఇతర వస్తువులను మృతురాలి భర్త చెన్నయ్యకు అప్పగించారు. -
చాట్బాట్ల 'వలపు' వల
సాక్షి, హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంమానవ జీవితాన్ని ఎంతగా సులభతరం చేస్తోందో, అంతేస్థాయిలో నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్లో జరిగే మోసాలు ఇప్పుడు మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగాయి. ఇప్పటివరకు కేవలం మనుషులు మాత్రమే చేసే ఆన్లైన్ ప్రేమ మోసాల్లోకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశించింది. చాట్జీపీటీ, జెమినై, క్లాడ్ వంటి ఆధునిక చాట్బాట్లు మనుషుల కంటే అత్యంత ప్రభావవంతంగా బాధితుల నమ్మకాన్ని చూరగొంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏఐకే రేటింగ్స్భారత్కు చెందిన అమృత విశ్వవిద్యాపీఠం, ఇటలీకి చెందిన ఫోస్కారి విశ్వవిద్యాలయం, ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్ వర్సిటీ, ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. సాధారణ మనుషులకు, కృత్రిమ మేధ చాట్బాట్లకు మధ్య ఒక నియంత్రిత పోటీని ఏర్పాటు చేశారు. ఈ సంభాషణల్లో పాల్గొన్న బాధితులకు తాము ఒక యంత్రంతో మాట్లాడుతున్నామా లేదా మనిషితో మాట్లాడుతున్నామా అనే విషయం తెలియదు.చివరకు ఫలితాలను విశ్లేషించగా మానవ నేరగాళ్ల కంటే ఏఐ చాట్బాట్లు అత్యంత ప్రతిభావంతంగా మనుషులను అనుకరిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకున్నట్లు తేలింది. సాధారణంగా ఒక మానవ నేరగాడు చాట్ చేసిన తర్వాత ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని కోరితే 18 శాతం మంది మాత్రమే అంగీకరించారు. కానీ అదే అభ్యర్థన ఏఐ చాట్బాట్ నుంచి వచ్చినప్పుడు 50 శాతం మంది అంగీకరించి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిని బట్టి మనుషుల కంటే ఎక్కువగా కృత్రిమ మేధకే ప్రజలు నమ్మకపు రేటింగులు ఇచ్చారని పరిశోధకులు గుర్తించారు. విస్తరిస్తున్న మోసాల నెట్వర్క్ సాధారణంగా ప్రేమ మోసాలు అనేవి చాలాకాలం నుంచి సాగుతున్న నేరాలు. నేరగాళ్లు నకిలీ ఖాతాలను సృష్టించి, వారాలు లేదా నెలల తరబడి రోజూ బాధితులతో మాట్లాడుతూ నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితి అని చెప్పి లేదా నకిలీ డిజిటల్ కరెన్సీ పెట్టుబడుల పేరుతో డబ్బులు గుంజుతారు. అయితే మానవ నేరగాళ్లకు సమయం, శ్రమ పరిమితులు ఉంటాయి. కానీ ఏఐకి అటువంటి పరిమితులు ఏవీ లేవు. ఏఐ సహాయంతో నేరగాళ్ల నెట్వర్క్లు ఒకే సమయంలో వేలాది మంది బాధితులతో సంభాషణలు సాగించగలవు. ఇవి ఏమాత్రం అలసట లేకుండా, నిరంతరాయంగా స్పందించగలవు. సంభాషణల శైలి చాలా సహజంగా ఉండటం వల్ల ప్రస్తుత భద్రతా వ్యవస్థలు కూడా వీటిని గుర్తించలేకపోతున్నాయి. కేవలం చివరి దశలో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసే సమయంలో మాత్రమే మానవ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఇది నేరగాళ్లకు తమ మోసాలను ప్రపంచవ్యాప్తంగా భారీగా విస్తరించడానికి వీలు కల్పిస్తోంది.మానవ అక్రమ రవాణా.. ఈ సాంకేతికత కేవలం ఆర్థిక మోసాలకే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా జరిగే మానవ అక్రమ రవాణాకు కూడా సాధనంగా మారుతోంది. విదేశాల్లో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ ప్రకటనల వెనుక పెద్ద ముఠాలు ఉంటున్నాయి. ఇవి కూడా కృత్రిమ మేధను ఉపయోగించి వివిధ భాషల్లో ఆకర్షణీయ సందేశాలను తయారు చేస్తున్నాయి. ఈ మాయలో పడి ఏటా లక్షలాది మంది మోసపోతున్నారు.జాగ్రత్త పడటం ఎలా? తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలకు అసాధారణ రీతిలో భారీ జీతాలు ఆఫర్ చేయడం, ఉద్యోగ వివరాలు స్పష్టంగా లేకపోవడం, వెంటనే చేరాలని ఒత్తిడి చేయడం వంటివి మోసాలకు ప్రధాన సంకేతాలు. తెలియని వ్యక్తులతో ఆన్లైన్ సంభాషణలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా తక్కువ సమయంలోనే ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తూ, ఆ తర్వాత ఆర్థిక సహాయం, పెట్టుబడుల గురించి మాట్లాడితే అనుమానించాలి. -
వాట్సాప్లో ఆర్డర్.. డెడ్డ్రాప్లో గాంజా!
సాక్షి, హైదరాబాద్ : వాట్సాప్లో ఆర్డర్ తీసుకుంటారు. మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు నిర్ధారణ అయిన తర్వాత కస్టమర్కు ‘సరుకు’అన్న ప్రాంతం లొకేషన్, ఫొటో షేర్ చేస్తారు..ఇలా వాట్సాప్లో గ్రూపులు కట్టి అందులోనే ఆర్డర్స్ తీసుకుని డెడ్డ్రాప్ (ఎవరూ చూడకుండా ఒక ప్రదేశంలో ప్యాకెట్ పడేసి ఆ లొకేషన్ కస్టమర్కు ఇస్తారు) విధానంలో గంజాయి సప్లయ్ చేస్తున్న ఒక డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. గతంలో ఇతర నగరాలకే పరిమితమైన ఈ కొత్త తరహా గంజాయి సరఫరా ముఠాను నగరంలోనూ ఈగల్ ఫోర్స్ ఛేదించింది. బాలానగర్ రాజీవ్ కాలనీ కేంద్రంగా నిర్వహిస్తున్న గంజాయి స్థావరంపై ఈగల్ ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు చేశారు. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా గంజాయి సప్లయ్ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. సోదాల సమయంలో ఈ ముఠా పోలీసులపై కుక్కలను వదిలి భయపెట్టేందుకు ప్రయత్నించింది. అయినా ఈగల్ఫోర్స్ అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో స్క్రూడ్రైవర్తో ఓ ఎస్ఐపై దాడి చేశారు. చివరకు ఈగల్ నుంచి తప్పించుకోలేమని తెలిసి ఈ గ్యాంగ్లో ఒకరు బిల్డింగ్లోని నాలుగో అంతస్తుపై నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతా సినిమా సీన్ తలపించేలా ఉన్న ఈ స్పెషల్ ఆపరేషన్లో ఈగల్ అధికారులు 14 కిలోల గంజాయి, ఎయిర్ గన్, కారు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వాట్సాప్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఈ ముఠా వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్న 203 మంది గంజాయి వినియోగదారులను ఈగల్ అధికారులు గుర్తించారు. వీరిలో 100 మంది కోసం దాదాపు 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి టెస్టులు నిర్వహించారు. అందులో 81 మందికి పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ భారీ ఆపరేషన్ వివరాలను ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ గురువారం మీడియాకు వెల్లడించారు. అదుపులోకి అనుమానిత వ్యక్తి... వాట్సాప్ గ్రూప్ ద్వారా నగరంలో గంజాయి సరఫరా జరుగుతుందన్న సమాచారంతో అప్రమత్తమైనట్టు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. ‘బేగంపేట్ ఓల్డ్ ఎయిర్ పోర్ట్ వద్ద ఒక అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. అతని వద్ద 50 గ్రాముల గంజాయి దొరికింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కిరణ్, దుర్గా ప్రసాద్, కమలాకర్ అనే నిందితులు ఈ సప్లై వెనుక ఉన్నట్లు తెలిసింది. బాలానగర్ రాజీవ్ కాలనీలో నిందితులు నివాసం ఉంటున్నట్టు సమాచారం అందింది. నార్కోటీమ్స్, మల్కాజ్గిరి నార్కోటిక్ టీమ్స్ దాడులు చేశాయి. అధికారులపై కుక్కలను వదలడంతోపాటు నిందితుడు బొల్లా కిరణ్ .. మల్లేష్ అనే ఇన్స్పెక్టర్ పైన స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడు. కిరణ్ అనే నిందితుడు నాలుగో ఫ్లోర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య డ్రామా ఆడాడు. దుర్గా ప్రసాద్, కమలాకర్, కిరణ్, మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశాం. స్పాట్లో 14 కేజీల గంజాయి సీజ్ చేశాం. వీరంతా ఒడిశా నుంచి గాంజా సప్లై చేస్తున్నారు. 2022 నుంచి ఇప్పటివరకు 203 మందికి గంజాయి సరఫరా చేశారు. హెచ్న్యూ, బాలానగర్ పోలీసుల సహకారంతో నిందితులను త్వరగా పట్టుకోగలిగాం’ అని తెలిపారు. నిందితుల సమాచారంతో ఒడిశా గంజాయి సరఫరా గ్యాంగ్కు చెందిన మరో ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. -
‘సర్’ పేరిట సైబర్ మోసాలు
సాక్షి, హైదరాబాద్ : ఓటర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఫారం పేరుతో నకిలీ సందేశాలు పంపుతూ ఓటర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారుల పేరుతో వాట్సాప్, ఇతర డిజిటల్ వేదికల ద్వారా సందేశాలు పంపుతూ.. ఓటరు వివరాల్లో తప్పులున్నాయని, ఎస్ఐఆర్ ఫారం తిరస్కరణకు గురైందని నమ్మిస్తున్నారు. అనంతరం వివరాలను సరిచేసుకోవాలంటూ హానికర లింకులు పంపి సైబర్ వలలోకి లాగుతున్నారు. ఇలాంటి మెసేజ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) హెచ్చరించింది. ఈ మేరకు టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. కాగా, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు వస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి వచ్చినట్టు సీఈఓ కార్యాలయం సైతం గురువారం మరో ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) లేదా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం ఎటువంటి సందేశాలను పంపబోరని పేర్కొంది. మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలి: సైబర్ మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని టీజీసీఎస్బీ అధికారులు సూచించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే లావాదేవీలను నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.ఈ సందేశాల విషయంలో జాగ్రత్త.. » ‘మీ ఎస్ఐఆర్ ఫారం తిరస్కరణకు గురైంది’అంటూ వచ్చే సందేశాలు. » ఓటరు వివరాలను అప్డేట్ చేయాలంటూ పంపే వాట్సాప్ లింకులు. » ఫారం ధ్రువీకరణ లేదా సవరణ కోసం రూ.5 లేదా ఇతర స్వల్ప మొత్తం చెల్లించాలనే అభ్యర్థనలు. » ఎన్నికల సంఘం అధికారుల పేరుతో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారం కోరే సందేశాలు. » వెంటనే స్పందించకపోతేఓటరు హక్కు కోల్పోతారని భయపెట్టే సందేశాలు. » ఇలాంటి వాటిపై ప్రత్యేక అప్రమత్తత అవసరమని సైబర్ పోలీసులుసూచిస్తున్నారు. -
కొట్టేసిన ఇంట్లోనే కునుకు!
పహాడీషరీఫ్ (హైదరాబాద్): మద్యం మత్తులో ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగ, అక్కడే నిద్రపోయాడు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనపై ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వాదే ముస్తఫా బస్తీకి చెందిన మహ్మద్ షోయబ్ అలియాస్ ఫుర్కాన్ (18) ఇళ్లలో చోరీలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున 5 గంటలకు పొరుగునున్న మహ్మద్ ఎజాజుద్దీన్ ఇంట్లోకి చొరబడి, రెండు సెల్ఫోన్లు, ఆరిఫిషియల్ వస్తువులను చోరీ చేసి జేబులో పెట్టుకున్నాడు. అప్పటికే మద్యం తాగిన అతడు మత్తులో అక్కడే నిద్రపోయాడు. అతని జేబులో వస్తువులను గుర్తించిన ఎజాజుద్దీన్.. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను రిమాండ్కు తరలించారు. ఇతనిపై గతంలోనూ రెండు కేసులు నమోదై ఉన్నాయి. -
నామి'లేట్'డ్ పదవులు
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడనేది అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా గత నెలలో పదవీకాలం పూర్తయిన కార్పొరేషన్ చైర్మన్లు, ఇప్పటి వరకు భర్తీ చేయని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంలో కంగాళీ ఏర్పడింది. అసలు ఈ పోస్టుల భర్తీ ఉంటుందా ? ఉంటే ఎప్పుడు? ప్రాతిపదికలేమిటి? గతంలో పనిచేసిన వారికి మళ్లీ అవకాశమిస్తారా? పూర్తిగా కొత్త వారిని నియమిస్తారా? తదితర ప్రశ్నలు కాంగ్రెస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల అనంతరం ఆగస్టులో పార్టీ పదవులు భర్తీ చేసి, సెప్టెంబర్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించినా, ఆశావహుల్లో మాత్రం సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. అసలు ఇప్పట్లో కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసేది లేదని ఓ ముఖ్య నేత ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించడం ఈ కంగాళీకి కారణమవుతోంది. అయితే, సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 19నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈలోపే కొన్ని నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తారనే చర్చ ఆశావహులకు కొంత ఊరటనిస్తున్నా అది జరుగుతుందా లేదా అనే మీమాంస మాత్రం వారిని వెంటాడుతుండడం గమనార్హం. పెద్ద ఎత్తున ఆశావహులు అవకాశం ఎదురుచూస్తున్న వారి జాబితా చాంతాడంత కనిపిస్తోంది. కొత్తగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేతలే ఉమ్మడి జిల్లాకు ఓ 20 మందికి తగ్గకుండా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పిడమర్తి రవి, నాగా సీతారాములు, సాధు రమేశ్రెడ్డి, వక్కలగడ్డ చంద్రశేఖర్, కమర్థపు మురళి (ఖమ్మం), గౌరి సతీష్, అయిళ్ల శ్రీనివాస్గౌడ్ (రంగారెడ్డి), సీఎన్రెడ్డి, పల్లె లక్ష్మణ్కుమార్, బొల్లు కిషన్ (హైదరాబాద్), కొక్కిరాల విశ్వప్రసాద్ , దుర్గం భాస్కర్, రేఖానాయక్, పురాణం సతీశ్కుమార్ (ఆదిలాబాద్), వినయ్రెడ్డి, మార చంద్రమోహన్రెడ్డి, ఏబీ శ్రీనివాస్, మునిపల్లి సాయారెడ్డి, అరికెల నర్సారెడ్డి (నిజామాబాద్), కర్ల సత్యప్రసన్నరెడ్డి, ఆకారపు భాస్కర్రెడ్డి, ఊట్కూరు నరేందర్రెడ్డి (కరీంనగర్), పున్నా కైలాష్ నేత, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్రెడ్డి, లక్ష్మి నారాయణరెడ్డి, చనగాని దయాకర్ (నల్లగొండ), ఇనగాల వెంకట్రామ్రెడ్డి, ఈవీ శ్రీనివాస్, ఐత ప్రకాశ్రెడ్డి, కొనగాల మహేశ్ (కరీంనగర్)ల పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గతంలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారు కలిపి ప్రతి జిల్లాలో 20 మందికి తగ్గకుండా ఆశావహులు కనిపిస్తున్నారు. ఎవరి మాట నెగ్గుతుందో..? ఇటీవల ఢిల్లీలో జరిగిన తెలంగాణ ముఖ్య నేతల భేటీ అనంతరం గాం«దీభవన్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. గతంలో నామినేటెడ్ పదవులతో సహా ఎలాంటి కీలక విషయంలోనైనా సీఎం, టీపీసీసీ చీఫ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జులు నిర్ణయం తీసుకునే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే, ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో టీపీసీసీ సమన్వయ కమిటీలో చర్చించిన తర్వాతే పదవుల భర్తీపై తుది నిర్ణయానికి రావాలని రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అధిష్టానం స్పష్టం చేసిందని తెలుస్తోంది. మరో విశేషమేమిటంటే... హస్తినలో భేటీలు ముగిసిన అనంతరం రాష్ట్రానికి వచ్చిన పార్టీ నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని, గతంలో లాగా రాజకీయ చర్చలు జరగడం లేదన్న చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతుండడం నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో మరింత గుబులు రేపుతోంది. -
10 రోజులు.. 10 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలో వానాకాలం (ఖరీఫ్) సాగు ఊపందుకుంది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత పది రోజుల్లోనే దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 41.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 65.96 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 63 శాతం పూర్తయింది. మొత్తం పంటల విషయానికొస్తే.. 132.38 లక్షల ఎకరాల సాధారణ సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 107.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. అంటే 81 శాతం సాగు పూర్తయింది. నిజానికి వర్షాలు ఆలస్యం కావడంతో జూన్, జూలైలో సాగుపై కొంత సందిగ్ధత నెలకొంది. ఎల్నినో ఆందోళనకు గురిచేసింది. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో పరిస్థితి మారింది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో పాటు ప్రాజెక్టుల కింద సాగునీటి లభ్యత, భూముల్లో తేమ పెరగడంతో రైతులు పంటల సాగు, వరి నాట్లు ముమ్మరం చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి 30 లక్షల లోపు ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెపుతుండగా..తర్వాత 10 రోజుల వ్యవధిలోనే ఈ విస్తీర్ణం సుమారు 10 లక్షల ఎకరాలు పెరిగింది. మరో వారం రోజుల్లో 50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ విస్తీర్ణం కన్నా అధికంగా పత్తి సాగు ఇతర పంటల సాగులోనూ మంచి పురోగతి కనిపిస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 47.41 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 47.72 లక్షల ఎకరాల్లో (101 శాతం) సాగైంది. పప్పుధాన్యాల సాగు 6.38 లక్షల ఎకరాలకు చేరి 98 శాతం పూర్తయింది. సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే కంది 93 శాతం, పెసర 149 శాతం, మినుము 95 శాతం సాగయ్యాయి. మొక్కజొన్న 5.31 లక్షల ఎకరాల్లో (86 శాతం), నూనెగింజలు 3.79 లక్షల ఎకరాల్లో (85 శాతం) సాగయ్యాయి. సోయాబీన్ 3.72 లక్షల ఎకరాల్లో వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్లో 100% మించి.. జిల్లాల వారీగా చూస్తే ఉత్తర తెలంగాణలో పంటల సాగు వేగంగా సాగుతోంది. ఆదిలాబాద్లో సాధారణ సాగులో 101 శాతం, కుమురంభీం ఆసిఫాబాద్లో 102 శాతం, నిర్మల్లో 102 శాతం నమోదైంది. నిజామాబాద్లో 98 శాతం, కామారెడ్డిలో 96, పెద్దపల్లిలో 92, సంగారెడ్డిలో 96 శాతం చొప్పున సాగు పూర్తయింది. తద్వారా ఈ జిల్లాల్లో సాధారణ సాగు లక్ష్యం దాదాపుగా పూర్తయింది. మరోవైపు ఉమ్మడి వరంగల్, దక్షిణ తెలంగాణలో సాగు ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదు. వరంగల్లో 61 శాతం, హనుమకొండలో 73, మహబూబాబాద్లో 62, ములుగులో 60, జనగామలో 79, సిద్దిపేటలో 75, మెదక్లో 84 శాతం చొప్పున సాగు నమోదు అయ్యింది. దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్ 66 శాతం, వనపర్తి 66, జోగుళాంబ గద్వాల 63, వికారాబాద్ 72, రంగారెడ్డి 74 శాతంతో వెనుకబడి ఉన్నాయి. సూ ర్యాపేటలో అత్యల్పంగా 59 శాతం సాగైంది. వెంటాడుతున్న ఎల్నినో భయం ఇప్పటివరకు కురిసిన వర్షాలతో రైతులు భారీగా పంటలు సాగు చేసినా.. ముందున్న వా తావరణ పరిస్థితులపై ఆందోళన కొనసాగుతోంది. ఎల్నినో ప్రభావంతో మళ్లీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పరిస్థితి ఏమిటన్నది రైతు లను, ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. పంట లు కీలక దశకు చేరుకునే సమయంలో వర్షాలు ముఖం చాటేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న భయం నెలకొంది. ముఖ్యంగా వరి సాగుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎల్నినో ప్రభావా న్ని అంచనా వేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. -
ఎన్రోల్మెంట్పై నిషేధం.. ఆపై సవరణ
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్రోల్మెంట్పై తొలుత నిషేధం విధించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆ తర్వాత వెనక్కి తగ్గింది. వర్సిటీ స్నాతకోత్స వానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ప్రచారంలో ఈ బ్యాచ్ విద్యార్థుల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో గురువారం ఉదయం విధించిన ఎన్రోల్మెంట్ నిషేధాన్ని రాత్రికి ఉపసంహరించుకుంది. తాజా నిర్ణయంతో 2026లో లా డిగ్రీ పూర్తి చేసిన నల్సార్ విద్యార్థులందరూ తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకునేందుకు మార్గం సుగమమైంది. అంతలోనే వెనక్కి... సీజేఐకి వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో ఈ బ్యాచ్కు చెందిన అధిక శాతం విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదని, వారు అమాయకులని బీసీఐ తాజా విచారణ నివేదికల ఆధారంగా నిర్ధారించింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించిన బీసీఐ సభ్యులు నిషేధాన్ని ఎత్తివేస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. అత్యధిక విద్యార్థులకు సీజేఐని అగౌరవపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కొద్దిమంది చేసిన తప్పునకు బ్యాచ్లోని విద్యార్థులందరినీ బాధ్యులను చేసి, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేయడం సరికాదన్న నిర్ణయానికి బీసీఐ వచ్చింది. అనంతరం బీసీఐ చైర్మన్ గురువారం ఉదయం ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ రాత్రి మరో ప్రకటన విడుదల చేసింది. అసలేం జరిగిందంటే... ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు విద్యార్థులు క్యాంపస్లో ఆందోళనకు దిగారు. దీనిపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా.. 2026లో నల్సార్ నుంచి లా డిగ్రీ పొందిన ఏ ఒక్క విద్యారి్థని కూడా అడ్వొకేట్గా ఎన్రోల్ చేయకూడదని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఈ ఆందోళనల వెనుక ఉన్న వారిని గుర్తించి, పక్కా ఆధారాలతో మూడు రోజుల్లోగా వాస్తవ నివేదికను సమరి్పంచాలని నల్సార్ వీసీని తొలుత ఆ ఉత్తర్వుల్లో బీసీఐ ఆదేశించింది. ఆయా విద్యార్థుల పూర్తి జాబితాను అధికారిక రికార్డుల నుంచి తీసి పంపాలని ఆదేశించింది. క్యాంపెయిన్ను డ్రాఫ్ట్ చేసిన వారు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన వారు, పత్రికలకు సమాచారం ఇచ్చిన వారు, అధికారిక గ్రూపులను అడ్మినిస్ట్రేట్ చేసిన వారిని గుర్తించాలని కోరింది. స్నాతకోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చిన వారి వివరాలను నివేదికలో పొందుపరచాలని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలించిన అనంతరం అమాయకులైన మెజారిటీ విద్యార్థులకు న్యాయం చేస్తూ బీసీఐ నిషేధాన్ని ఎత్తివేసింది. 31న తుది ఉత్తర్వులు తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మధ్యంతర ఎన్రోల్మెంట్ కమిటీ ద్వారా చేపట్టిన న్యాయవాదుల ఎన్రోల్మెంట్ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. కమిటీ ఏర్పాటు చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లో ఇటీవల ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31న దీనిపై తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. -
‘ఓటుకు నోటు’ విచారణ 5కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన విచారణను రద్దు చేసి, మళ్లీ మొదటి నుంచి వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చాయి. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. గతంలో ఈ కేసు వాదనలు పాక్షికంగా జరిగాయని వారు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ధర్మాసనం స్పందిస్తూ.. గతంలో ఈ కేసు విచారణ చేపట్టిన బెంచ్లోని ఒక న్యాయమూర్తి ఇప్పటికే పదవీ విరమణ చేసినందున, కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాల్సి ఉందని స్పష్టం చేసింది. తదుపరి వాదనలు వినేందుకు విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. -
UK: రైలు ప్రమాదం.. బోల్తా పడిన మూడు బోగీలు
లండన్ : దక్షిణ ఇంగ్లాండ్లో రైలు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి మూడు భోగీలు బోల్తా పడ్డాయి. లండన్లోని విక్టోరియా స్టేషన్ నుండి ఈస్ట్బోర్న్ వెళ్తున్న సదరన్ రైలు పర్యాటక ప్రాంతమైన లూయిస్ సమీపంలో ఈ ప్రమాదానికి గురైంది.రైలు వేగం పుంజుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుదుపులకు గురైందని, తాము ప్రయాణిస్తున్న బోగీ పైకి లేచి ఆకస్మికంగా బ్రేకులు పడ్డాయని ప్రయాణికుడు రాబ్ బ్రాడ్లీ తెలిపారు. ల్యాప్టాప్లు, లగేజీతోపాటు అందరూ ముందుకు పడిపోయారని, రైలు కొంతదూరం అలాగే జారిన తర్వాత ఆగిపోయిందని వివరించారు.ఆ తర్వాత తాము వెనక్కి తిరిగి చూసేసరికి వెనుక ఉన్న బోగీలు పూర్తిగా తెరుచుకుని, దట్టమైన పొగ, ధూళి కమ్ముకున్నాయని, ఒక బోగీ పక్కకు తిరిగి ఎంబ్యాంక్మెంట్ నుంచి కింది పొలంలోకి పడిపోయిందని ఆయన చెప్పారు.ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పారామెడిక్స్, ఆంబులెన్స్లతో పాటు మూడు హెలికాప్టర్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై రవాణా మంత్రి హీడీ అలెగ్జాండర్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
తీర్థయాత్రలో విషాదం
ఆర్మూర్ టౌన్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్పేట్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీ సులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించడానికి రెండు టూరిస్ట్ బస్సులలో బయలు దేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్పేట్ బ్రిడ్జి సమీపంలో జాతీయ రహ దారిపై ఓ బస్సు టైర్ పంక్చర్ కావడంతో దానిని డివైడర్ పక్కనే నిలిపివేశారు. ఆ బస్సు నలుపు రంగులో ఉండటంతో వెనకనుంచి వచ్చే వాహనాలకు కనిపించదన్న ఉద్దేశంతో రెండో బస్సును దాని వెనకాలే నిలిపారు.కొందరు టూరిస్ట్లు కిందికి దిగి డివైడర్పై కూర్చున్నారు. ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ.. ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు ముందుకు కదిలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత (54), మాధవి (47) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
పిలుపు ఊహించాం
గాలె: నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తే ఏదో ఒక రోజు భారత జట్టు నుంచి పిలుపు వస్తుందని ఆశించినట్లు... జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ పేర్కొన్నాడు. దేశవాళీల్లో దుమ్మురేపిన ఆకిబ్ గత రెండు రంజీ సీజన్లలో ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్లో జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గడంలో నబీ కీలకపాత్ర పోషించాడు. అతడి నిలకడైన పేస్ బౌలింగ్ వల్లే ఆ జట్టు సుదీర్ఘ చరిత్ర గల టోర్నమెంట్లో మొదటిసారి చాంపియన్గా అవతరించింది. దీంతో చాన్నాళ్లుగా అతడికి భారత జట్టులో చోటు దక్కుతుందని భావించగా... తాజాగా శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు అతడు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కావడంతో అతడి స్థానంలో ఆకిబ్కు జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘దేశవాళీల్లో నిలకడగా రాణించడంతో ఏదో ఒక రోజు టీమిండియాకు ఎంపికవుతానని బలంగా విశ్వసించాను. నా కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నమ్మకంగా ఉన్నా. మొత్తానికి ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. సరైన స్థానంలో బంతులు వేస్తూ వికెట్లు పడగొట్టడమే నా కర్తవ్యం. జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో లేని పని. తొలిసారి భారత జట్టుకు ఎంపికైనట్లు తెలియగానే చాలా సంతోషించా. కుటుంబ సభ్యులు ఎంతో గర్వించారు. దీని కన్నా గొప్పది మరొకటి ఉండదు’ అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఆకిబ్ పేర్కొన్నాడు. శ్రీలంకతో పర్యటనకు తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో నబీకి చోటు దక్కలేదు. దీంతో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ప్రత్యేక శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఆకిబ్కు టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఈ సమాచారం అందింది. ‘బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్లో ఉన్న సమయంలో నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావు అని అడిగారు... ప్రాక్టీస్ కోసం బెంగళూరు వెళ్తున్నానని సమాధానమిచ్చా... ఆ అవసరం లేదు నేరుగా శ్రీలంకకు వచ్చేయ్. నువ్వు భారత జట్టుకు ఎంపికయ్యావు’ అని చెప్పారు. దీంతో మొదట నమ్మలేకపోయా. కానీ బుమ్రా స్థానంలో తీసుకున్నారని ఆ తర్వాత తెలిసిందని నబీ వివరించాడు.సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం మరోవైపు 33 ఏళ్ల వయసులో టీమిండియాకు ఎంపికైన స్పిన్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ కూడా తన ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. 2021–22 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సభ్యుడైన సారాంశ్... దశాబ్దానికి పైగా దేశవాళీల్లో రాణిస్తున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో శ్రీలంకతో తొలి టెస్టుకు దూరం కాగా... అతడి స్థానంలో సారాంశ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ‘టెస్టు క్రికెట్ ఆడాలంటే ఓపిక కావాలి. అందులోనూ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలంటే అది మరింత ఎక్కువ ఉండాలి. నేను 2014–15 సీజన్లో రంజీ ట్రోపీలో అరంగేట్రం చేశాను. ఎన్నో త్యాగాలు, మరెంతో శ్రమతో ఇన్నాళ్లుగా ఆటలో కొనసాగుతున్నా. ఏదో ఒక రోజు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాననే నమ్మకం మాత్రం కోల్పోలేదు. మా నాన్న కూడా రంజీ ఆటగాడే. ఓపికతో ఎదురుచూస్తే తప్పక అవకాశం వస్తుందని చెప్పారు. అదే నిజమైంది. గుడికి వెళ్తున్న సమయంలో భారత జట్టుకు ఎంపికయ్యాననే వార్త తెలిసి చాలా సంతోషించా’ అని సారాంశ్ చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టులోని ఆటగాళ్లతో గతంలో దేశవాళీ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండటంతో అందరితో త్వరగానే కలిసిపోయానని సారాంశ్ వెల్లడించాడు. -
ప్రజలపై చేతబడులా?
సాక్షి, హైదరాబాద్: ‘పదేళ్లు అధికారంలో ఉన్న వారు, పాతికేళ్లు తెలంగాణలో రాజకీయం చేసినవారు ప్రభుత్వం, ప్రజలపై పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చేతబడులు, అఘోరా పూజలు చేయించడం అత్యంత దుర్మార్గం. బుద్ధి సరిగ్గా లేకపోతే ఆ క్షుద్ర పూజలే తిరగబడతాయి. అదే గనుక జరిగితే మిమ్మల్ని ఫామ్హౌస్ల నుంచి బయటికి రాకుండా అష్ట దిగ్బంధనం చేస్తాయి..’ అని సీఎం ఎ.రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గురువారం కూకట్పల్లిలో తొలి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘ఎల్నినో ప్రభావంతో రాష్ట్రం ఎండిపోవాలని, కరువు వచ్చి జనాలు అల్లాడిపోవాలని, ప్రభుత్వం బద్నాం కావాలని ప్రతిపక్ష నాయకులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అఘోరా పూజలు, చేతబడులు చేశారు. ఎంత ఘోరమైన పూజలు చేసినా దేవుడు, అదృష్టం మా వైపే ఉన్నాయి. మా సంకల్పం మంచిది కాబట్టే ఎల్ నినో సమయంలోనూ వర్షాలు కురిసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్లు నిండాయి. హైదరాబాద్కు తాగునీటి ఎద్దడి లేకుండా పోయింది. చిత్తశుద్ధి, మంచి ఆలోచన ఉన్న మా ప్రభుత్వాన్ని ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ ఎల్లప్పుడూ కాపాడతాయి..’ అని సీఎం అన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు ‘గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను ఊరించి, నగరం నుంచి 40–50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో కట్టి ఇబ్బందులకు గురిచేసింది. నగరంలో పనిచేసుకునే పేదలు అర్ధరాత్రి వేళ అంత దూరం వెళ్లి ఎలా జీవిస్తారు? అందుకే కూకట్పల్లిలో రూ.వందల కోట్ల విలువైన 11 ఎకరాల స్థలాన్ని కేటాయించి, పేదలు నివసించే ప్రాంతంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఐటీ కంపెనీల నడుమ, శిల్పారామం పక్కన రూ.1,000 కోట్ల విలువైన 3.5 ఎకరాల స్థలాన్ని ’ఇందిరమ్మ మహిళా శక్తి’ స్టాళ్లకు కేటాయించి, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను, పిండి వంటలను విక్రయించుకునేలా అమెజాన్ లాంటి ఈ–కామర్స్ సంస్థలతో సైతం అనుసంధానం చేశాం. పేదల కోసం నిర్మించే ఇళ్లకు సంబంధించి స్థలాన్ని పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. పేదల ఇళ్లకయ్యే రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్న పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం..’ అని రేవంత్ చెప్పారు. 22ఏ భూములపై ఆందోళన వద్దు ‘నిషేధిత జాబితా (22 ఏ)ల్లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 22 ఏలో చేరిన భూముల సర్వే నంబర్లకు బై నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తాం. కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలం అంగుళం కూడా ఎక్కడికీ పోదు. కోర్టు కేసులున్న స్థలాల వరకు పక్కనపెట్టి మిగతా వాటికి బై నంబర్లు ఇచ్చి సమస్య పరిష్కరిస్తాం. భూములు, కట్టుకున్న ఇళ్లు 100% రిజిస్ట్రేషన్ అయ్యేలా చేస్తాం. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసే సంఘాలను, వ్యక్తులను నమ్మొద్దు..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. రూ.8.11 లక్షల కోట్ల అప్పులున్నా సంక్షేమం ఆగదు ‘గత పాలకులు మాపై రూ.8.11 లక్షల కోట్ల భారీ అప్పుల భారం మోపారు. నడుము వంగిపోయే అప్పుల భారం ఉన్నప్పటికీ, రూపాయి రూపాయి కూడబెట్టి ప్రజా సంక్షేమాన్ని నడిపిస్తున్నాం. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే కోళ్లకు, బర్రెలకు వేసే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.25 కోట్ల మంది ప్రజలకు ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నాం. 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. గ్యాస్ సిలిండర్ను రూ.500కే ఇస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. కూకట్పల్లి రుణం తీర్చుకుంటా.. ‘మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గం నా రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించింది. నాడు నిధులు మంజూరు చేసే అధికారం లేకపోయినా బస్తీల్లో ప్రజలు నా వెన్నంటి నిలిచారు. ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చింది. కూకట్పల్లి అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబుకు ఆదేశాలు ఇచ్చా. నియోజకవర్గంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, పాఠశాలలు, కళాశాలల నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే ఏడాది ఇందిరమ్మ టవర్స్ నుంచి బోనాలు: పొంగులేటి ‘ఇందిరమ్మ టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆనాటి ప్రభుత్వం కమీషన్లు రావనే కారణంతో పేదలకు ఇళ్ళు కట్టలేదని, కమీషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించిందని ఆరోపించారు. దీనికి భిన్నంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం.. ఎకరా రూ.200 కోట్ల వరకు ఉన్నప్పటికీ హైదరాబాద్ మహానగరంలో పెద్ద పెద్ద టవర్స్ పక్కనే పేదలకు కూడా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి ఆచరణలోకి తెచ్చిందని తెలిపారు. తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి సంకల్పించామని దీనికి సంబంధించి ఇప్పటివరకు 51 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందరి సమక్షంలో ఎటువంటి లాలూచీలు లేకుండా, మంత్రుల సిఫారసులు సైతం లేకుండా అందరి ముందు లక్కీ డిప్ తీసి ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ముందే ఇళ్ల వివరాలను అందిస్తాం కాబట్టి వారు దగ్గరుండి కాంట్రాక్టర్తో నాణ్యంగా తమ ఇళ్ళను కట్టించుకోవచ్చునని సూచించారు. మూడింతల ఇళ్లు నిర్మించకుంటే మళ్లీ పోటీ చేయను గత ప్రభుత్వం పదేళ్లలో నిర్మించిన ఇళ్ల కంటే మరో రెండున్నరేళ్లలో మూడింతలు ఎక్కువగా ఇళ్లు నిర్మిస్తామని, ఒకవేళ అది చేయకపోతే తాను మరోసారి శాసనసభకు పోటీ చేయనని పొంగులేటి ప్రకటించారు. రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాంతంలో కొన్ని భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చారని, అవి ప్రభుత్వ భూములు కాకపోతే రెండు రోజుల్లోనే ఆ భూములపై నిషేధం తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పతకంతో తిరిగొస్తాం!
భారత పురుషుల హాకీ జట్టుతో పోలిస్తే ప్రపంచకప్లో భారత మహిళల హాకీ జట్టుకు ఘనమైన రికార్డు లేదు. ఇప్పటి వరకు జరిగిన 15 ప్రపంచకప్లలో భారత పురుషుల జట్టు బరిలోకి దిగగా... భారత మహిళల జట్టు మాత్రం ఎనిమిదిసార్లు మాత్రమే పోటీపడింది. ఆ ఎనిమిది పర్యాయాల్లో ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఏడుసార్లు ఈ మెగా ఈవెంట్కు అర్హత కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలో గత ప్రదర్శనతో సంబంధం లేకుండా ఈసారి భారత మహిళల జట్టుకు పతకంతో తిరిగి వచ్చే సత్తా ఉందని టీమిండియా సీనియర్ గోల్కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా ధీమా వ్యక్తం చేసింది.‘ఇటీవల నేషన్స్ కప్ టైటిల్ సాధించాం. ఆ టోర్నీలో మేటి జట్లు పాల్గొన్నాయి. చాలా రోజుల తర్వాత విదేశీగడ్డపై భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయం స్ఫూర్తితో ప్రపంచకప్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని 36 ఏళ్ల సవిత వ్యాఖ్యానించింది. ‘అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో అర్జెంటీనా, నెదర్లాండ్స్, జర్మనీ లాంటి పటిష్ట జట్లకు మేము గట్టిపోటీనిచ్చాం. ఈ లీగ్లో కనబరిచిన ప్రదర్శనతో మేము అత్యున్నతస్థాయిలో మేటి జట్లకు దీటుగా రాణించగలమని నిరూపించాం. ఫిట్నెస్పరంగా, ఆలోచనపరంగా ప్రస్తుత జట్టు భేషుగ్గా ఉంది’ అని సవిత వివరించింది. వరుసగా మూడు సీజన్లపాటు (2021–22, 2022–23, 2023–24) అంతర్జాతీయ ఉత్తమ గోల్కీపర్గా ఎంపికైన సవిత భారత జట్టుకు 313 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించింది. ‘గతంతో పోలిస్తే ఇప్పుడు క్రీడాకారిణుల దృక్పథం మారింది. ఒకప్పుడు కోచ్ చెప్పిందే చేసేవారు. ప్రస్తుతం అందరూ మరింత బాధ్యత తీసుకుంటున్నారు. ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. గాయాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదనంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వరుసగా మూడో ప్రపంచకప్ ఆడనుండటం నాకెంతో గర్వకారణం. ప్రతి హాకీ ప్లేయర్ కెరీర్లో ప్రపంచకప్, ఒలింపిక్స్కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అంతర్జాతీయ అత్యుత్తమ టోర్నీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అందరూ కలలు కంటారు. ఈసారి మరింత అనుభవంతో ప్రపంచకప్లో ఆడుతున్నాను. ఒత్తిడిలో తడబడకుండా నిలకడగా రాణించి భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తా’ అని సవిత వ్యాఖ్యానించింది. సవితాతోపాటు నిక్కీ ప్రధాన్, లాల్రెమ్సియామి, నవ్నీత్ కౌర్, నేహా వరుసగా మూడో ప్రపంచకప్ ఆడనున్నారు. సలీమా టెటె సారథ్యంలో నేషన్స్ కప్ టైటిల్ గెలిచిన భారత జట్టు అదే జోరును ప్రపంచకప్లో పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. శనివారం ప్రపంచకప్ మొదలుకానుండగా... భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ను ఆగస్టు 16న చైనాతో ఆడుతుంది. అనంతరం 18న దక్షిణాఫ్రికాతో, 20న ఇంగ్లండ్తో భారత్ పోటీపడుతుంది. రెండో దశకు అర్హత సాధించాలంటే భారత్ తమ గ్రూప్ ‘డి’లో టాప్–2లో నిలవాలి. రెండో దశకు చేరుకున్నాకే భారత జట్టు పతకం రేసులోకి వస్తుంది.8 భారత మహిళల జట్టు ఆడిన ప్రపంచకప్లు (1974, 1978, 1983, 1998, 2006, 2010, 2018, 2022). ఈ మెగా ఈవెంట్లో టీమిండియా మొత్తం 50 మ్యాచ్లు ఆడింది. 11 మ్యాచ్ల్లో గెలిచింది. 9 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. 30 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 62 గోల్స్ సాధించి, ప్రత్యర్థి జట్లకు 98 గోల్స్ సమర్పించుకుంది. 4 ఇప్పటి వరకు ఆసియా నుంచి నాలుగు దేశాలు (భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్) మాత్రమే మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పాల్గొన్నాయి. చైనా, జపాన్ జట్లు తొమ్మిదిసార్లు చొప్పున, భారత్, కొరియా ఎనిమిదిసార్లు చొప్పున బరిలోకి దిగాయి. చైనా (2002లో), కొరియా (1990లో) జట్లు మూడో స్థానాన్ని సంపాదించి ఆసియా నుంచి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాయి. భారత్ 1974లో నాలుగో స్థానం పొందింది. -
జురేల్కు పరీక్ష!
గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో భారత తుది జట్టు విషయంలో దాదాపుగా అన్ని పేర్లు ఖాయమైనా...ఆరో స్థానం విషయంలోనే కాస్త చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ధ్రువ్ జురేల్ ఆడుతుండగా, ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ నుంచి అతడికి పోటీ ఎదురవుతోంది. రెగ్యులర్ వికెట్ కీపర్గా రిషభ్ పంత్ ఇప్పటికే టీమ్లో ఉండగా, జురేల్ స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడుతున్నాడు. అయితే ఇటీవలి తన ప్రదర్శనతో అతను తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. వెస్టిండీస్పై సెంచరీ తర్వాత ఆడిన 7 ఇన్నింగ్స్లలో జురేల్ వరుసగా 44, 6 నాటౌట్, 14, 13, 0, 2, 19 పరుగులు చేశాడు. వీటిలో ఐదుసార్లు అతను స్పిన్నర్ల బౌలింగ్లో అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్కు స్పిన్ను అద్భుతంగా ఆడగలడనే పేరుంది. లంక గడ్డపై స్పిన్నర్లు తీవ్రంగా ప్రభావం చూపనున్న నేపథ్యంలో జురేల్ తన ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాడు. అందుకోసం అతను కేఎల్ రాహుల్ వద్ద తగిన సూచనలు తీసుకున్నాడు. రాహుల్తో కలిసి ప్రాక్టీస్ చేస్తూ మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. భారత బ్యాటర్లలో శ్రీలంకలో టెస్టులు ఆడిన అనుభవం ఒక్క రాహుల్కే ఉంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ‘కేఎల్ రాహుల్ ఆట గురించి అందరికీ బాగా తెలుసు. అతని అనుభవం జట్టుకు ఎంతో కీలకం. గత రెండేళ్లుగా అతను ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టీమ్లోని ఇతర సభ్యులకు సన్నాహకాల్లో అతను సహకరించాలనే మేం కోరుకుంటున్నాం. నెట్స్లో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేయడం చాలా అవసరం’ అని మోర్కెల్ అన్నాడు. జురేల్ కూడా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోవాలంటే మరింత శ్రమించాల్సిందేనని అతను చెప్పాడు.కొన్నాళ్ల క్రితం ‘ఎ’ జట్టు తరఫున జురేల్ ఇక్కడ రాణించాడు ‘పది రోజుల ముందే ఇక్కడికి వచ్చి మేం సిరీస్ కోసం సిద్ధమవుతున్నాం. గాలేలాంటి చోట ఎలా పరుగులు చేయాలనేది స్వయంగా బ్యాటర్లే గుర్తించాలి’ అని మాజీ పేసర్ అభిప్రాయ పడ్డాడు. ఇలాంటి స్థితిలో జురేల్కు అవకాశం దక్కుతుందా...ఒక వేళ చాన్స్ లభిస్తే దానిని అతను వాడుకోగలడా అనేది చూడాలి. -
‘చాంపియన్ మనస్తత్వం ముఖ్యం’
అమ్స్టర్డామ్: హాకీ ప్రపంచకప్ ప్రారంభానికి ముందే భారత జట్టు చాంపియన్ల మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రముఖ మానసిక శిక్షకుడు ప్యాడీ ఆప్టన్ అభిప్రాయపడ్డాడు. 2011లో భారత క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న సమయంలో జట్టు మెంటల్ కండీషనింగ్ కోచ్గా వ్యవహరించిన ఆప్టన్ ఇప్పుడు భారత హాకీ జట్టుకు అదే సేవలు అందిస్తున్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలుచుకున్న సమయంలోనూ ఆప్టన్ జట్టుతో పాటే ఉన్నాడు. బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా శనివారం పురుషుల హాకీ ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆప్టన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.‘చాంపియన్ జట్టు తాము విజేతలమని నిరూపించుకోడానికి ఫైనల్ వరకు వేచి ఉండదు. టోర్నీలో అడుగుపెట్టేటప్పుడే విజేతగా వస్తుంది. మనం ఇతర జట్ల స్థాయిలో శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రధాన టోర్నమెంట్ల సమయంలో శరీరానికి తగినంత విశ్రాంతి, నిద్ర కూడా అవసరం. క్రికెట్, హాకీలో కాస్త తేడా ఉంటుంది. క్రికెట్లో వ్యక్తిగత ప్రదర్శనపై ఎక్కువ దృష్టి ఉంటుంది. అదే హాకీలో జట్టు ప్రదర్శనకే ప్రాధాన్యత దక్కుతుంది. ఒక వ్యక్తి మానసిక స్థితి తన చుట్టూ ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చాలా ముఖ్యం. క్రికెట్లో ఇద్దరు ఆటగాళ్లే క్రీజులో జట్టు భారాన్ని మోస్తూ ఉంటారు. కానీ హాకీలో అలాకాదు. జట్టు సభ్యులంతా సమూహంగా మైదానంలో చెమటోడుస్తారు’ అని ఆప్టన్ వెల్లడించాడు. క్రికెట్లో ఒక సమయంలో కేవలం బంతి వేస్తున్న బౌలర్ ప్రదర్శనపైనే జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుందని... అలాంటి పద్ధతి హాకీలో ఉండదని అతడు పేర్కొన్నాడు. సవాళ్లకు సిద్ధంగా ఉండాలి... ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఫైనల్ గెలవడంపై దృష్టి పెట్టడం లేదని ఆప్టన్ అన్నాడు. పారిస్ ఒలింపిక్స్ సమయంలో భారత హాకీ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిందని ఆప్టన్ గుర్తు చేశాడు. ‘తుది పోరుకు చేరేందుకు సహకరించే ప్రతి అంశంపై దృష్టి పెడుతున్నాం. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఇంగ్లండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ అద్భుతం చేసింది. మరే జట్టు విజయం సాధించలేని స్థితిలో టీమిండియా గెలుపొందింది. ఒక ప్లేయర్ తక్కువ ఉన్నప్పటికీ మనవాళ్ల పోరాటం మాత్రం జట్టును విజయ తీరాలకు చేర్చింది’ అని ఆప్టన్ గుర్తుచేశాడు. స్విట్జర్లాండ్లోని ఆల్ఫŠస్ పర్వత శ్రేణుల్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం... ప్రతికూల పరిస్థితుల్లో ఆటగాళ్ల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని అతడు పేర్కొన్నాడు. ‘ఆటగాళ్లలో ఐక్యత, దృక్పథాన్ని పెంపొందిచడమే దీని ఉద్దేశం. సాధారణంగా అన్నీ జట్లు ప్రపంచకప్ గెలవడానికి మైదానంలో ప్రాక్టీస్ చేస్తాయి. కానీ మేము మాత్రం భిన్నమైన పరిస్థితులను ఎంపిక చేసుకున్నాం. ఎత్తైన ప్రదేశాల్లో అలిసిపోయినప్పుడు మరో మార్గం అంటూ ఉండదు... ముందుకు సాగాల్సిందే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కలిసికట్టుగా సాగకుంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అచ్చం అలాగే మైదానంలో అందరూ కలిసి పనిచేయకపోతే ఓటమి భయం పొంచి ఉంటుంది. ఏ ఆటలో అయినా నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడి అత్యధికంగా ఉంటుంది. అలాంటి సమయంలోనూ గేమ్ ప్లాన్కు కట్టుబడి ఉన్నప్పుడే విజయం సాధ్యమవుతుంది’ అని ఆప్టన్ వివరించాడు. ఓవరాల్ చాంపియన్ భారత్ న్యూఢిల్లీ: కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో భారత్ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. నైజీరియా వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో భారత ఫెన్సర్లు మొత్తం 35 పతకాలు సాధించారు. అందులో 13 స్వర్ణాలు, 8 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. సీనియర్ విభాగంతో పాటు అండర్–23 విభాగంలోనూ మనవాళ్లు సత్తాచాటారు. పోటీల చివరి రోజు భారత ఫెన్సర్లు 5 పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. పురుషుల సాబ్రే, మహిళల సాబ్రే, పురుషుల ఇపీ, మహిళల ఇపీ, మహిళల ఫాయిల్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. ఈ ప్రదర్శనతో కామన్వెల్త్ ఫెన్సింగ్ సమాఖ్య భారత్కు విల్కిన్సన్ ట్రోఫీ అందించింది. ‘కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇది మన ఫెన్సర్ల నిరంతర కృషి, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనం’ అని భారత ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి రాజీవ్ మెహతా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ముగ్గురు స్పిన్నర్లతో..!
గాలే: శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైనట్లే. టీమ్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గురువారం ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. మనకు ముగ్గురు వైవిధ్యభరితమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఎంత సమర్థంగా వాడుకోవాలనేది ముఖ్యమని అతను వ్యాఖ్యానించాడు. సీనియర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాతో పాటు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, మరో యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆడే అవకాశం ఉంది. అఫ్గానిస్తాన్తో టెస్టులో అరంగేట్రం చేసిన సుతార్ 7 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ‘మా ముగ్గురు స్పిన్నర్లది భిన్నమైన శైలి. కుల్దీప్ ప్రధానంగా అటాకింగ్ బౌలర్. అతని అనుభవం, బౌలింగ్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుతార్ బంతిని ఎక్కువగా టర్న్ చేస్తే కచ్చితత్వంలో జడేజాను మించినవాడు లేడు. ముగ్గురూ ఎడంచేతి వాటం బౌలర్లే కావడంతో ఎలాంటి సమస్యా లేదు. 20 వికెట్లు తీయగల సామర్థ్యం వీరికి ఉంది. కెప్టెన్ గిల్ మ్యాచ్లో ఎలాంటి సమయాల్లో వీరిని ఎలా వాడుకుంటాడనేది మనం చూడాలి.మ్యాచ్ వేదిక గాలేలో గత రికార్డు చూసినా ముగ్గురు స్పిన్నర్లు ఉండటం సరైన నిర్ణయమే అవుతుంది. ఆట సాగుతున్నకొద్దీ పిచ్ మారే అవకాశం ఉంది’ అని మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఈ టెస్టులో పేస్ బౌలర్లకు కూడా తగిన ప్రాధాన్యత ఉందని అతను అన్నాడు. అయితే ఆరంభంలోనే వారు ప్రభావం చూపించడం అవసరమని మోర్కెల్ పేర్కొన్నాడు. ప్రధాన పేసర్గా సిరాజ్ బరిలోకి దిగనుండగా, రెండో పేసర్గా ప్రసిధ్ లేదా గుర్నూర్కు చాన్స్ లభించవచ్చు. ‘మన దగ్గర పేస్ బౌలింగ్లో కూడా మంచి పదును ఉంది. ప్రణాళికలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడి వాతావరణంలో కూకాబుర్రా బంతి తొందరగా 25–30 ఓవర్లకే మెత్తబడుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత బంతిని ఎలా వాడాలనేది పేసర్ల మానసిక దృఢత్వానికి పరీక్ష. చిన్న చిన్న స్పెల్స్ వేస్తూ పూర్తి స్థాయిలో తమ శక్తి సామర్థ్యాలను వాడుతూ అదే తీవ్రతను కొనసాగించడం ముఖ్యం. క్రీజ్ను, లెంగ్త్ను సమర్థంగా వాడుకుంటూ ప్రభావం చూపించాల్సి ఉంటుంది’ అని మోర్కెల్ విశ్లేషించాడు. -
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుపై ఆంక్షలు ఎత్తివేత
లండన్: ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టుపై విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూను కొత్త సారథి జో రూట్ ఎత్తివేశాడు. దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదనే ఉద్దేశంతో రూట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ క్రికెటర్లు మ్యాచ్ల సమయాల్లో తప్పతాగి వార్తల్లోకి ఎక్కుతుండటంతో... ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ఈ ఆంక్షలు విధించారు. న్యూజిలాండ్తో సిరీస్ సందర్భంగా ఆ జట్టు మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ కర్ఫ్యూ సమయం దాటి నైట్ క్లబ్లో గడపడం వల్ల ఒక మ్యాచ్ సస్పెన్షన్కు గురయ్యాడు. ఆ తర్వాత స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించగా... అతడి స్థానంలో తిరిగి స్టార్ బ్యాటర్ జో రూట్ మరోసారి జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రూట్ మాట్లాడుతూ... ‘ఇకపై ఆటగాళ్లపై ఎలాంటి కర్ఫ్యూ ఉండదు. నిజంగా చెప్పాలంటే దీన్ని పెద్ద విషయంగా భావించాల్సిన అవసరమే లేదు. మైదానంలో ప్లేయర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటే... మైదానం బయట కూడా పరిణతి చెందని వ్యక్తులుగా సరైన నిర్ణయాలు తీసుకోగలమనే భావన వారికి కలగాలి. అంతే కానీ ఇలాంటి కర్ఫ్యూలతో ఫలితం ఉండదు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్గా స్వీయ నియంత్రణ పాటించడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఈ అంశంపై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, నేను ఏకాభిప్రాయంతో ఉన్నాం. ఇంగ్లండ్ తరఫున ఆడుతున్నప్పుడు ఎలా వ్యవహరించాలో ప్లేయర్లకు తెలుసు. మైదానం బయట ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలి. విజయాలను ఆస్వాదించడం తప్పనిసరి. అయితే దానికి అనువైన సమయం అంటూఉంటుందని గుర్తించాలి’ అని రూట్ చెప్పాడు. -
‘వాయిదాల’ పార్లమెంటు!
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారైనప్పుడు నీట్ ప్రశ్నపత్రం లీక్ ఉదంతం ఈ స్థాయిలో సభను ముంచెత్తుతుందనీ, వరస గందరగోళ దృశ్యాలతో మొత్తం కార్యకలాపాలే స్తంభించిపోతాయనీ, వాయిదాలతోనే గడిచిపోతుందనీ ఎవరూ ఊహించి వుండరు. నిరవధిక వాయిదా అనంతరం సమావేశాల తీరుతెన్నులెలా ఉన్నాయో చెప్పటం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వంతు. ఆ శాఖను నిర్వహిస్తున్న కిరణ్ రిజిజు లోక్సభ 19 శాతం, రాజ్యసభ 39 శాతం కాలాన్ని వినియోగించుకో గలిగాయని ప్రకటించారు. ఇలా జరగటం కొత్తేమీ కాదు. చట్టసభలు నిర్దేశించుకున్న లక్ష్యానికీ, సాధించిన ఫలితానికీ పొంతన లేకపోవటం మనకు రివాజే. దీనికి భిన్నంగా మన పార్లమెంటు సక్రమంగా పనిచేసిందంటే, సంతృప్తికరంగా చర్చలు సాగాయంటే ఆశ్చర్యపడాలి. యూపీఏ హయాంలో 2010లో పార్లమెంటు శీతాకాల సమావేశాల వ్యవధిలో కేవలం 5 శాతం మాత్రమే పనిచేసింది. రాజ్యసభ అయితే కేవలం 2 శాతం! ఆ రికార్డును అధిగమించిన సమావేశాలు ఇంతవరకూ లేకపోవటం జనం అదృష్టం. సమావేశాల కాలానికి ఎప్పుడూ ఏదో సమస్య ఊడిపడటం, అధికార విపక్షాలు పరస్పర కలహాలు తప్పడంలేదు. ఇలా వాయిదాల పరంపరతో ప్రభుత్వ పక్షం కీలకమని భావించిన బిల్లుల్ని మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకోవటం అసలు సమస్య. యూపీఏ హయాంలో లోక్సభలో 20 బిల్లులపై కేవలం అయిదంటే అయిదే నిమిషాలు చర్చ జరిగింది. ప్రజల తలరాతల్ని నిర్ణయించే అనేక నిర్ణయాలు ఈ తోవన చట్టాలుగా మారుతున్నాయి. ఇందులో లక్షల కోట్ల విలువైన ఆర్థిక బిల్లులు కూడా ఉంటున్నాయి. ప్రశ్నోత్తర సమయం, జీరో అవర్ వంటివి కొట్టుకుపోతున్నాయి. క్రమశిక్షణాయుత ప్రవర్తనతో ప్రజల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పెంచాల్సినవారే అందుకు విరుద్ధమైన సందేశం పంపుతున్నారు. విపక్షంలో ఉండగా బీజేపీ ఏం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేయాలనుకుంది. ఈ క్రమంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నది. సమావేశాల ఆరంభం రోజున కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన ‘ఛలో పార్లమెంటు’ ఊహించని పరిణామాలకు దారితీసింది. అసలు సమావేశాల్లో సగభాగం దాని చుట్టూనే తిరిగింది. ఆవిర్భవించిన కొన్ని నెలలకే సీజేపీ ఒక అసాధారణ పరిణామానికి కారణం కావటం దాని ప్రత్యేకత. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవినుంచి తప్పుకోవాల్సివచ్చింది. బీజేపీ అధికారంలోకొచ్చిన ఈ పన్నెండేళ్లలోనూ విపక్షాలన్నీ కట్టగట్టుకుని ఒక్కటైనా ఇలా కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాయి. టీఎంసీ ఎంపీలు కొందరు బీజేపీలోకి ఫిరాయించటం, ఇండియా కూటమినుంచి డీఎంకే వైదొలగటం విపక్షాలను నైతికంగా దెబ్బతీసే పరిణామాలు. రంగంలో సీజేపీ లేనట్టయితే విపక్షాలు నిస్తేజంగా, నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో పడివుండేవి. తమ ఉద్యమా నికి ప్రధాన విపక్షంగా కాంగ్రెస్ తోడ్పాటు అందించకపోయినా జెన్ జీ ఆ పార్టీకి చేసిన ఉపకారమిది. సమావేశాల రెండో భాగంలో కాంగ్రెస్ కాస్త మేల్కొని ప్రధాని నివాసం ఎదుట ధర్నాకు దిగింది. జెన్ జీ ప్రస్తావించని పెల్లెట్ల అంశాన్ని ప్రధాన సమస్యగా మార్చింది. కోల్పోయిన ప్రతిష్ఠను కొద్దో గొప్పో కాపాడుకునే ప్రయత్నం చేసింది. రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తే తప్ప చట్టసభలకు తమ సమస్యలు పట్టబోవన్న అభిప్రాయం జనంలో కలగటం మంచి పరిణామమేనా అన్నది పార్టీలు ఆలోచించుకోవాలి. అది శాంతియుత ఆందోళనా, హింసాత్మకమా అన్న విచక్షణలేకుండా ప్రతి సమస్యనూ పోలీసులే పరిష్కరిస్తారన్న అభిప్రాయంతో ఉంటే ఏమవుతుందో జంతర్ మంతర్ నిరూపించింది. సమస్యల్ని చూసే కోణంలోనూ పార్టీల ద్వంద్వప్రవృత్తి వెల్లడవుతోంది. ఢిల్లీలో జెన్ జీ ఉద్యమంపై మొదట్లో అభాండాలేసిన బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు తమ తప్పిదాన్ని గుర్తించాయి. జార్ఖండ్ ఆందోళనలో చురుగ్గా పాల్గొంటున్నాయి. మంచిదే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ అవకతవకలపై మాత్రం ఈ సంస్థలు నోరెత్తవు. సాక్షాత్తూ అభ్యర్థులే గోడు వినిపిస్తున్నా బుకాయింపులే. ఇలాంటి వైఖరులే పార్టీల నిజాయితీని ప్రశ్నార్థకం చేస్తాయి. మొత్తానికి వర్షాకాల సమావేశాల తీరుతెన్నులపై అన్ని పక్షాలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ పరిస్థితి తలెత్తకుండా ఏం చేయవచ్చునో ఆలోచించుకోవాలి. -
టన్నెల్లో ప్రమాదం.. పలువురు కార్మికులు దుర్మరణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. టెన్నెల్లో ప్రమాదం చోటు చేసుకొని పలువురు కార్మికులు మృత్యువాత పడ్డారు. చమోలీ జిల్లాలో పిపాల్కోటి సమీపంలోని మాయాపూర్లో నిర్మిస్తున్న టీహెచ్డీసీ టన్నెల్లోకి అకస్మాత్తుగా నీరు, బురద చేరడంతో 19 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన వారి కోసం సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. చమోలీలో సుమారు 2 కిలోమీటర్ల పొడవైన ‘టెయిల్ రేస్ టన్నెల్’లో సుమారు 1.4 కిలోమీటర్ల లోతులో భూమి కుంగి రంధ్రం ఏర్పడింది. దీంతో అకస్మాత్తుగా నీరు, బురద లోపలికి రావడంతో అప్పటికే విధులు నిర్వహిస్తున్న 22 మంది కార్మికులలో 19 మంది చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ , ఐటీబీపీ, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ఇప్పటికే 16 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన కార్మికులను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు ప్రత్యేక పంపులను ఏర్పాటు చేశారు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని పేర్కొంటూ, సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
