breaking news
-
ఆచరణ సాధ్యం కాని బడ్జెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్పై మేధావులు పెదవివిరుస్తున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న ఈ బడ్జెట్ వల్ల ఆకాంక్షలు తప్ప ఆచరణ సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. ఆ కోవలోనే సీనియర్ ఐఏఎస్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర బడ్జెట్పై సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం రూ.2.34 లక్షల కోట్లు అని ప్రభుత్వం అంచనా వేసింది గానీ, ఆ మేరకు కచ్చితంగా ఆదాయం రాదని ఆయన స్పష్టంచేశారు. 2025–26లో వచ్చింది రూ.1.96 లక్షల కోట్లు అయితే, అంతకుముందు ఏడాది కూడా రూ.1.67 లక్షల కోట్లే వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఎంత ఎక్కువ లెక్కేసుకున్నా రూ.2.15 లక్షల కోట్లకు మించదన్నారు. ఈ లెక్కన రూ.20 వేల కోట్లు ఇక్కడే తగ్గిపోతుంటే, దానిని కూడా ఆదాయంగా భావించి పథకాలు రూపొందించడం వల్ల వాటి అమలుపై ప్రభావం పడుతుందని ఆయన స్పష్టంచేశారు. ఇలా రాని ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పడం వల్ల బడ్జెట్లో చెప్పిన చాలా పథకాలు కాగితాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఐవైఆర్ వివరించారు. మసిపూసి మారేడు..రెవెన్యూ లోటు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఊహాజనితంగా మాట్లాడుతోందని ఐవైఆర్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ నాటికే రూ.60 వేల కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందని తెలిపారు. అలాంటిది వచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాది మొత్తానికి గాను రూ.41 వేల కోట్ల దగ్గర రెవెన్యూ లోటును నియంత్రిస్తామని ప్రభుత్వం ఎలా చెబుతోందని ఆయన ప్రశ్నించారు. ఈ లోటు ప్రభుత్వం చెబుతున్న దానికి రెట్టింపు అయ్యి రూ.80 వేల కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్కు తగ్గట్టుగానే బడ్జెట్ ఉండాలని, లేదంటే బడ్జెట్కు ఉన్న విశ్వసనీయత తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.మూలధన వ్యయం 2024–25లో రూ.16 వేల కోట్లు ఉంటే, 2025–26లో బడ్జెట్లో రూ.40 వేల కోట్లుగా చూపించి, సవరించిన పద్దుల్లో రూ.33 వేల కోట్లు ఉంటుందని చెప్పారన్నారు. అంచనాలకే బడ్జెట్ పరిమితమయ్యే అవకాశం ఉందా... ఆచరణ సాధ్యం కాదా... అంటే సాధ్యం కాదనే అనిపిస్తోందని ఐవైఆర్ తన విశ్లేషణలో స్పష్టంచేశారు. అప్పులు తీర్చడానికి బడ్జెట్లో ఎంత పోతుంది? పెండింగ్ బిల్లులకు ఎంత వెళుతుందనేది చెప్పాలి. ఈ బడ్జెట్ను చూస్తే మసిపూసి మారేడు చేసినట్లుగా ఉందని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. -
లెక్కలకు రెక్కలు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి పచ్చముఠాల దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఊహాజనిత లెక్కలతో వరుసగా మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత రెండు బడ్జెట్లలోనూ అంచనాల మేరకు రాష్ట్ర పన్నుల ఆదాయం రాకపోవడంతో సవరించిన అంచనాల్లో భారీ కోతలు విధించడమే దీనికి నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. తద్వారా బడ్జెట్ కేటాయింపుల మేరకు వ్యయం చేయకుండా కోతలు పెడుతోందని, ఇది అంకెల గారడీతో ప్రజలను మోసగించడమేనని తప్పుబడుతున్నారు.చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక నుంచి మద్యం వరకూ.. చివరకు ప్రకృతి సంపదను సైతం వదలకుండా విచ్చలవిడిగా సిలికా, క్వార్ట్జ్, లేటరైట్, గనుల దోపిడీకి తెర తీసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం అంతా టీడీపీ పెద్దల జేబుల్లోకి చేరిపోతోంది. సంపద సృష్టించకుండా... సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా.. అంతులేని అప్పులతో రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపుతున్నారు.హామీలు విస్మరించి.. పరిమాణం పెంచిచట్టసభలో ప్రవేశపెట్టే బడ్జెట్ను అపహాస్యం చేస్తూ, వాస్తవాలకు దూరంగా, ఊహాజనిత గణాంకాలతో 2026–27 వార్షిక బడ్జెట్ను చంద్రబాబు సర్కారు రూపొందించింది. బడ్జెట్ కేటాయింపుల మేరకు నిధులను వ్యయం చేయకుండా ఆయా వర్గాలను వంచిస్తోంది. ఆదాయం, రాబడులు రావని తెలిసి కూడా ప్రజలను ఏమార్చేందుకు రూ.3,32,205 కోట్లతో 2026–27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత రెండు బడ్జెట్లలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసినట్లుగానే వచ్చే ఆర్థికఏడాదిలో కూడా వంచించడమే లక్ష్యంగా ఊహాజనిత గణాంకాలతో బడ్జెట్ పరిమాణాన్ని భారీగా పెంచారని, ఈ బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించడం లేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఉత్త కేటాయింపులే.. అంతా కోతలే2024–25, 2025–26 బడ్జెట్ కేటాయింపుల మేరకు నిధులను వ్యయం చేయడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. 2024–25లో రూ.2,94,427 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టగా ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో సవరించిన అంచనాలంటూ రూ.19,820 కోట్ల మేర కోత విధించారు. చివరకు కోత విధించిన మేరకు కూడా బడ్జెట్ను అమలు చేయలేకపోయారు. వాస్తవ లెక్కల ప్రకారం 2024–25 బడ్జెట్ అంచనాల్లో రూ.22,141 కోట్ల మేర కోత పడింది. అంటే బడ్జెట్ రూ.2,72,286 కోట్లకే పరిమితమైంది. ఇక 2025–26లో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది.తీరా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో సవరించిన అంచనాలంటూ బడ్జెట్లో రూ.21,825 కోట్ల మేర కోత విధించింది. వాస్తవ లెక్కలు వెల్లడైతే ఎంత మేర కోత విధించారో స్పష్టం కానుంది. ఇదే రీతిలో ఈదఫా కూడా పేదలను మోసం చేయడానికి 2026–27 బడ్జెట్లో ఇళ్ల నిర్మాణాలకు రూ.6,357 కోట్ల కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. ఇవి కాగితాలకే పరిమితమని, వాస్తవంగా వ్యయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని గత రెండు బడ్జెట్లు నిరూపిస్తున్నాయి. పన్నుల ఆదాయం పతనం..రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం అంచనాల మేరకు లేదని తెలిసి కూడా వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్ను ఊహాజనిత లెక్కలతో, భారీ పరిమాణంతో ప్రవేశపెట్టారని ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు. 2024–25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.1,09,789 కోట్లు వస్తుందని అంచనా వేయగా వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.89,435 కోట్లు మాత్రమే. రూ.20,354 కోట్ల మేర సొంత పన్ను ఆదాయంలో కోత పడింది.2025–26లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.1,09,006 కోట్లు వస్తుందని బడ్జెట్ను ప్రవేశపెట్టగా సవరించిన అంచనాల్లో రూ.98,025 కోట్లుగా చూపించారు. అంటే రూ.10,981 కోట్ల మేర సొంత పన్ను ఆదాయంలో కోత పడుతుందని పేర్కొన్నారు. సొంత పన్ను ఆదాయం లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో సవరణల్లో తగ్గించారు. 2026–27 బడ్జెట్లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం ఏకంగా రూ.1,25,845 కోట్లు వస్తుందని చూపారు. 2025–26 సవరించిన అంచనాలను మించి ఏకంగా రూ.27,820 కోట్లు రాబడి వస్తుందని పేర్కొనడం గమనార్హం.కాగితాల్లోనే పేదల ఇళ్లు..పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో చంద్రబాబు సర్కారు గత రెండు బడ్జెట్లలో ఎంత మోసం చేసిందో చెప్పేందుకు సవరించిన అంచనాలే నిదర్శనం. పేదల ఇళ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైనట్లు సవరించిన బడ్జెట్ అంచనాల్లో తేలింది. 2024–25లో పేదల ఇళ్ల నిర్మాణాలకు బడ్జెట్లో రూ.4,012 కోట్లు కేటాయించి చివరకు కేవలం రూ.1,611 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఇక 2025–26 బడ్జెట్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,317 కోట్లను కేటాయించగా సవరించిన అంచనాల్లో వ్యయం కేవలం రూ.2,017 కోట్లుగా స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ మేరకు కూడా వ్యయం చేయడం లేదు. -
బాండ్లు పంచి బాబు బురిడీ
సాక్షి, అమరావతి: ⇒ నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.3 వేలు..⇒ 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా ఏడాదికి రూ.18 వేలు..⇒ 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్..⇒ సున్నా వడ్డీతో మహిళా పొదుపు సంఘానికి రూ.10 లక్షలు, ఒక్కో రైతుకు రూ.3 లక్షలు చొప్పున రుణాలు..⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్.. మెరుగైన పీఆర్సీ..!!⇒ టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీలివీ! చంద్రబాబు ఎన్నికల మోసాలు.. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి మరీ వంచించడం.. మూడు బడ్జెట్లలోనూ సూపర్ సిక్స్ల ఊసే లేకపోవడం.. ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలకే దిక్కులేకుండా పోవడంపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల హామీలను అమలు చేస్తామని ప్రతి ఇంటికీ గ్యారంటీతో బాండ్లు పంచి మరీ మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. ఇదో క్లాసిక్ కేస్ స్టడీ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్తోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రధాన పాత్ర పోషించాయని కూటమి నేతలు కూడా పలు సందర్భాల్లో అంగీకరించారు. అలాంటిది.. కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి దారితీసిన ఆ హామీలను అమలు చేయకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, రాజకీయాల్లో నైతికతకు తిలోదకాలు ఇవ్వడమేనని స్పష్టం చేస్తున్నారు.మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం.. వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారనేందుకు చంద్రబాబు సర్కార్ అత్యుత్తమ ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మేనిఫెస్టోను ‘మోసఫెస్టో’గా మార్చేసి ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు అపహాస్యం చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చంద్రబాబు నేతృత్వంలో 2024–25, 2025–26, తాజాగా ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లోనూ సూపర్ సిక్స్ హామీల అమలుకు కేటాయింపులు చేయలేదు. దీన్ని బట్టి ఆ హామీలకు ఇక మంగళం పాడేశామని మూడో బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు సర్కార్ తేల్చి చెప్పినట్లైందని పేర్కొంటున్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు సామూహికంగా వెన్నుపోటు పొడిచారన్నది స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా అడ్డగోలుగా హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీలు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంపై ఇటీవల దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మేనిఫెస్టోకు చట్టబద్ధత ఉంటేనే ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతోపాటు ఎన్నికల కమిషన్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాలని కోరుతున్నారు. హామీలకు గ్యారంటీ ఇస్తూ ఇంటింటికీ బాబు బాండ్లు..సార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్.. సెవెన్.. అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి.. వాటి ద్వారా ఆ కుటుంబానికి ఐదేళ్లలో చేకూరే ప్రయోజనంపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం కూడా చేశారు. మహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్సైట్లో నమోదు చేశారు. కుటుంబ యజమాని ఫోన్ నెంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీ నెంబరును వెబ్సైట్లో నమోదు చేసుకుని సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఏటా చేకూరే లబ్ధి.. ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనంపై ప్రచారం చేశారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు వెబ్సైట్కు మిస్డ్ కాల్ ఇప్పించారు. వారి ఫోన్ నెంబర్కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. వాటిని కుటుంబ సభ్యుల ముందే డౌన్లోడ్ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఆ హామీలను అమలు చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో తేల్చి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ తనదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అప్పట్లో నమ్మబలికారు. బాండ్లు ఇచ్చి మోసగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి...టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చి 20 నెలలు పూర్తయింది. మూడు బడ్జెట్లను ఇప్పటికే ప్రవేశపెట్టారు. వాటిలో సూపర్ సిక్స్ ప్రధాన హామీల అమలు ప్రస్తావనే లేదు. అంటే.. ఆ హామీలను అమలు చేయబోమని చంద్రబాబు సర్కార్ తెగేసి చెప్పిందన్నమాట! హామీల అమలుకు ఇంటింటా గ్యారంటీ బాండ్లు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా మోసం చేయడం దేశంలో ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో రెండో మూడో అమలు చేయకపోవడం సాధారణం. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సింహభాగం తుంగలో తొక్కడం ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొంటున్నారు.సామూహికంగా వెన్నుపోటు..సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు 2024 జూన్ నుంచే ప్రారంభమవుతుందంటూ ప్రతి ఇంటికీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా ఇచ్చిన బాండ్ల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో సర్వత్రా మండిపడుతున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లను పరిశీలించి సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల కింద చంద్రబాబు ప్రభుత్వం తమ కుటుంబానికి ఎంత ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. ఆ బాండు ప్రకారం తమ ఇంటికి ఏడాదిలో రావాల్సిన మొత్తాన్ని లెక్కించి.. వడ్డీతో సహా చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.భృతి ఇవ్వకుండా ఎగ్గొట్టింది రూ.21,600 కోట్లుసూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిరుద్యోగ భృతి మాటే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా హామీ ప్రకారం ఏడాదికి మొత్తం రూ.7,200 కోట్లు చెల్లించాలి. మూడు బడ్జెట్లలోనూ పైసా ఇవ్వకుండా నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు మొత్తం రూ.21,600 కోట్లు ఎగ్గొట్టారు.ఆడబిడ్డలకు రూ.97,200 కోట్ల ఎగనామం!సూపర్ సిక్స్ హామీల్లో మరో ప్రధాన హామీ ఆడబిడ్డ నిధి పథకం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది ఉంటారు. వీరికి ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకానికి ఏటా రూ.32,400 కోట్లు అవసరం. కానీ.. మూడు బడ్జెట్లలోనూ ఒక్క పైసా కేటాయించలేదు. 2026–27 బడ్జెట్లోనూ కనీసం ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు చంద్రబాబు ఇప్పటికే రూ.97,200 కోట్లు ఎగ్గొట్టారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.28,800 కోట్లు బురిడీ!50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఈ పథకానికి ఒక్క పైసా ఇవ్వకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చంద్రబాబు రూ.28,800 కోట్ల మేర ఎగ్గొట్టారు.సున్నా వడ్డీకి సున్నా.. సున్నా వడ్డీ పథకం కింద స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఒక్కో సంఘానికి రూ.పది లక్షలు.. ఒక్కో రైతుకైతే రూ.3 లక్షలు చొప్పున రుణాలు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి మందికిపైగా పొదుపు మహిళలు గతంలో ఏటా సున్నా వడ్డీ కింద లబ్ధి పొందారు. పొదుపు మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని వర్తింప చేయాలంటే ఏడాదికి రూ.5 వేల కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించాలి. మూడు బడ్జెట్లలో నిధులు కేటాయించకుండా మహిళలకు చంద్రబాబు రూ.15 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు! ఇక సున్నా వడ్డీ కింద ఒక్కో రైతుకు రూ.3 లక్షల రుణాన్ని ఇవ్వాలంటే ఏడాదికి కనీసం రూ.వెయ్యి కోట్లు అవసరం. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిధులు కేటాయించకుండా రైతులకు రూ.3 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు. మొత్తంగా సున్నా వడ్డీ పథకానికి సున్నా చుట్టి మహిళలు, రైతులకు రూ.18 వేల కోట్ల మేర చంద్రబాబు ఎగనామం పెట్టారు!ఉద్యోగుల బకాయిలు రూ.40 వేల కోట్లు!తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్, మెరుగైన పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంతవరకూ ఐఆర్ ప్రకటించకపోగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ను రద్దు చేశారు. కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరుకున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.తల్లులకు బాబు వంచన..తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. రెండేళ్లలో ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. ఇక ఇప్పుడు బడ్జెట్లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్లను ఎగ్గొట్టారు!రైతులకు వెన్నుపోటు..పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు రెండేళ్లలో రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు. తాజా బడ్జెట్లోనూ (2026–27) అరకొరగా కేటాయింపులు చేసి రైతులకు మొత్తంగా మూడేళ్లలో దాదాపు రూ.21 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు.బడ్జెట్ సాక్షిగా సూపర్ సిక్స్లు ఔట్..!ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్, పొదుపు మహిళలు, రైతులకు సున్నా వడ్డీ పథకాలకు పైసా కూడా కేటాయింపులు చేయకుండా బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు పూర్తిగా ఎగరగొట్టారు. ఎన్నికల హామీ మేరకు ఈ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు రూ.1.62 లక్షల కోట్లకుపైగా మహిళలు, నిరుద్యోగులు, రైతులకు ఎగ్గొట్టారు. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం, ఉచిత బస్సు పథకాలకు అరకొరగా విదిలించి, తగినన్ని నిధులు ఇవ్వకుండా దాదాపు మరో రూ.60 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు. ఇలా ఎన్నికల ప్రధాన హామీలను నెరవేర్చకుండా మూడేళ్లలో సుమారు రూ.2.22 లక్షల కోట్ల మేర అన్ని వర్గాలకు చంద్రబాబు ఎగ్గొట్టారు. -
హంగు.. కొత్త రాజకీయ రంగు
రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖచిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొన్నిచోట్ల కాంగ్రెస్–బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్–బీజేపీ, ఒక్కోచోట కాంగ్రెస్–బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళుతుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత రెండు రోజులుగా మారిన రాజకీయ సమీకరణలను బట్టి సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా, మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన వాటితోపాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే చాన్స్ ఉంది. హంగ్ పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు నాలుగైదు, బీజేపీకి ఒకట్రెండు మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్⇒ మహబూబాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్కు 19 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్ నుంచి 13, బీఆర్ఎస్ నుంచి 12 మంది గెలిచారు. కాంగ్రెస్కు ముగ్గురు సీపీఎం, బీఆర్ఎస్కు ముగ్గురు సీపీఐ సభ్యులు మద్దతిస్తున్నారు. వీరు కాకుండానే ఇంకా మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన మరో ముగ్గురి కోసం స్వతంత్రులకు అధికార కాంగ్రెస్ గాలం వేసింది. ఈ ప్రయత్నాలు సఫలం కావడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే పీఠం దక్కించుకోనుంది. అయితే, చైర్మన్గా కాంగ్రెస్లో చేరిన ఇండిపెండెంట్ అయ్యే అవకాశం ఉంది. ⇒ తొర్రూరు: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన 9 మంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఆ పార్టీకే మున్సిపల్ పీఠం దక్కే మెజారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిలను రంగంలోకి దింపుతోంది. ఇద్దరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించింది. దీంతో ఇరు పార్టీల బలం తొమ్మిదికి చేరనుంది. ఇక్కడ కూడా టాస్ అనివార్యం కానుంది. ⇒ ఆసిఫాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిర్ ఫిగర్ 11. ఇక్కడ కాంగ్రెస్కు ఏడుగురు, బీఆర్ఎస్కు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్లో చేరగా ఈ మున్సిపాలిటీ ఆ పార్టీ పరం కానుంది. ⇒ ఖానాపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లకు 4 చొప్పున రాగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. ఒక స్వతంత్రుడు కాంగ్రెస్లో చేరడంతో వారి బలం 4కు చేరింది. ఇప్పుడు మూడు పార్టీల బలం సమంగా ఉంది. అయితే, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (కాంగ్రెస్) నమోదు కావడం, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి ఒక్కో స్వతంత్రుడు కాంగ్రెస్ వైపునకు వచ్చారన్న ప్రచారంతో ఈ మున్సిపాలిటీ హస్తగతం కావొచ్చు.లేదంటే 3 పార్టీలు అధికారాన్ని పంచుకునే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ⇒ ఆదిలాబాద్: మ్యాజిక్ ఫిగర్కు నాలుగు తక్కువగా 21 వార్డుల్లో విజయం సాధించిన బీజేపీని నిలువరించడమే కర్తవ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కూటమి కట్టాయి. తమ పార్టీల నుంచి కాకుండా స్వతంత్రుడిని చైర్మన్ చేయాలని నిర్ణయించాయి. దీంతో కాంగ్రెస్ (11), బీఆర్ఎస్ (6), ఎంఐఎం (6)తో పాటు స్వతంత్రుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ పీఠంపై ఇండిపెండెంట్ కూర్చునే అవకాశాలున్నాయి. ⇒ భైంసా: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14. ఇక్కడ ఎంఐఎం 12 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ నుంచి ఒకరు కలిపితే ఆ పార్టీ బలం 13కు చేరనుంది. బీజేపీ నుంచి ఆరుగురు గెలిచారు. ఆ పార్టీకి ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో బీజేపీ బలం కూడా 13కు చేరింది. మరో ఇద్దరు స్వతంత్రులు ఎంఐఎం వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వీరు ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ ఇద్దరు స్వతంత్రుల మనసు మారకపోతే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. ⇒ కాగజ్నగర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ కాంగ్రెస్కు 9 మంది, బీఆర్ఎస్కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు, స్వతంత్రులు కలిపి కాంగ్రెస్కు మద్దతివ్వనుండడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనుంది. ⇒ క్యాతనపల్లి: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 12 స్థానాలకుగాను ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. బీఆర్ఎస్(10), సీపీఐ(4)ల మద్దతుతో ఈ స్థానం బీఆర్ఎస్ పరం కానుంది. ⇒ బెల్లంపల్లి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, ఇక్కడ పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 14 మందిలో ఇద్దరు బీఆర్ఎస్ పక్షం చేరడంతో ఆ పార్టీ బలం 12కు తగ్గింది. అయితే, నలుగురు ఇండిపెండెంట్లతో మళ్లీ 16కు పెరిగింది. ఇక, 14 మంది కౌన్సిలర్లు గెలిచిన బీఆర్ఎస్ పక్షాన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరడంతో ఆ పార్టీ బలం కూడా 16కు చేరింది. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్లు ఈ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్ జెండానే ఎగురవేయాలనే వ్యూహంతో ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కూడా వారు టచ్లో ఉన్నట్టు సమాచారం. ⇒ బోధన్ : ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 20. కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం నుంచి గెలిచిన 12 మంది మద్దతుతో ఇక్కడ కాంగ్రెస్ పాగా వేయనుంది. మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎంఐఎం కొంత విభేదించినా చివరకు కాంగ్రెస్ ఇష్టానికే చైర్మన్ అభ్యరి్థత్వాన్ని వదిలేయడంతో కథ సుఖాంతమైంది. ⇒ కామారెడ్డి: ఈ మున్సిపాలిటీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు పావులు కదుపుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 25 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా, బీజేపీకి 16 మందితో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్కు 19, బీఆర్ఎస్ 11 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. కాంగ్రెస్కు చైర్మన్, బీఆర్ఎస్కు వైస్చైర్మన్ దక్కే అవకాశాలున్నాయి. ⇒ అలంపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు ఆరుగురి బలం కావాలి. బీఆర్ఎస్కు ఐదు, కాంగ్రెస్కు ఐదు వచ్చాయి. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటుతో గులాబీ జెండా ఎగరనుంది.⇒ జనగామ: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. కాంగ్రెస్కు 12, బీఆర్ఎస్కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సీపీఎం కూడా కాంగ్రెస్కు మద్దతిస్తోంది. దీంతో ఆ పార్టీ బలం 13కు చేరుతుంది. నలుగురు స్వతంత్రులు గెలవగా.. ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. జనగామలోనే ఉన్న మరో కౌన్సిలర్ కాంగ్రెస్కు మద్దతిస్తారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ చామల కిరణ్ (కాంగ్రెస్), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(బీఆర్ఎస్) నమోదు చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలం 16కు చేరుతుంది. ఈ నేపథ్యంలో జనగామ టాస్ వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ⇒ అలియాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 11. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 7 కౌన్సిలర్లు గెలిచారు. ఇక్కడ బీఎస్పీతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. ముగ్గురు బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఎవరికీ మద్దతివ్వడం లేదు. చైర్మన్ పదవి అడుగుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చీల్చే పనిలో కాంగ్రెస్ ఉంది. ఏం జరుగుతుందో సోమవారమే స్పష్టత రానుంది. ⇒ ఎల్లంపేట: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్కు 8 మంది, బీఆర్ఎస్కు 12 మంది బలం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి (బీఆర్ఎస్) ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 13కు చేరనుంది. ఈ మేరకు స్పష్టత ఉన్నా, బీఆర్ఎస్లో చీలిక తెస్తున్నామని కాంగ్రెస్ అంటోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపేట పీఠం ఎవరికి దక్కుతుందో సోమవారమే తేలనుంది. ⇒ పరిగి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్కు 10 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 8 మంది బలం ఉంది. ఇద్దరు స్వతంత్రులు చెరో పక్షం చేరారు. దీంతో ఇరు పార్టీలకు బలం చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఆర్ (కాంగ్రెస్) ఎక్స్ అఫీషియో నమోదు చేసుకోవడంతో ఆయన ఓటుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరనుంది. ⇒ మొయినాబాద్ : ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 14. ఇందులో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7 గెల్చుకున్నాయి. ఇక్కడ స్వతంత్రులు ఐదుగురు గెలిచారు. వీరిలో మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనంత మంది స్వతంత్రులు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరి సహకారంతో మొయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరం కానుంది. ⇒ వికారాబాద్: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, కాంగ్రెస్ నుంచి 17 మంది గెలిచారు. స్వతంత్రుల మద్దతులో ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండానే కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వర్ధన్నపేట: ఈ మున్సిపల్ పీఠం కోసం 7గురు సభ్యుల బలం అవసరం. ఇందులో కాంగ్రెస్ గెలిచిన ఐదింటితోపాటు మరో స్వతంత్రుడు కలిపితే అధికార పార్టీ పక్షాన ఆరుగురు అయ్యారు. బీఆర్ఎస్ ఆరుగురు కౌన్సిలర్లను గెలిచింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఓటుతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరం కానుంది. ⇒ కేసముద్రం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 9 మంది బలం కావాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు 8 చొప్పున స్థానాలు వచ్చాయి. ఇక్కడి నుంచి మహబూబాబాద్ లోక్సభ సభ్యుడు బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈయన ఓటుతో కేసముద్రం పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ జహీరాబాద్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 కాగా, బీఆర్ఎస్ 15, బీజేపీ 3 కలిసినా మ్యాజిక్ ఫిగర్ రాదు. 14 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు. వీరికి ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతివ్వనుండడంతో పాటు ఎంపీ సురేశ్ షెట్కార్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రానుండడంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలున్నాయి. ⇒ గద్వాల: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 19. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్ 11, బీజేపీ నుంచి 7గురు, ఎంఐఎం నుంచి ఒక్కరు, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలం 19కి చేరుతోంది. అయితే, ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లు అవగాహన కుదర్చుకున్నారు. రెండు పార్టీల బలం 18కి చేరుతోంది. కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఇద్దరు స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎంపీ మల్లురవిలు ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే... ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన 11 మందిలో పలువురు సరిత వర్గీయులే. దీంతో గద్వాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ⇒ నారాయణపేట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్ 7, ఎంఐఎం రెండు కలిపితే 9 మంది అవుతున్నారు. బీజేపీకి 11తోపాటు ఎంపీ అరుణ ఎక్స్ అఫీషియో ఓటు, స్వతంత్రుడితో ఆ పార్టీ బలం 13కి చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్ (2), ఏఐఎఫ్బీ (1)తో పాటు ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కాంగ్రెస్కు వస్తే ఆ పార్టీ బలం కూడా 13కు చేరనుంది. కానీ, గద్వాలతో ముడిపెట్టిన బీజేపీ.. బీఆర్ఎస్ను కాంగ్రెస్ వైపునకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలను విరమించలేదు. అనూహ్యం జరగకపోతే ఈ మున్సిపాలిటీ బీజేపీ పరమయ్యే అవకాశాలే ఎక్కువ. ⇒ అమరచింత: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఆరు కాగా, మూడు ప్రధాన పార్టీలు మూడు చొప్పున గెలుపొందాయి. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. సీపీఎం కాంగ్రెస్కు మద్దతివ్వడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పీఠం పంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఎవరు చైర్మన్ కావాలన్న పీఠముడి వీడితే అమరచింత బీజేపీ, బీఆర్ఎస్ కూటమిదే. ⇒ జమ్మికుంట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓటుతో ఆ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయతి్నంచింది. కానీ, 10 మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్ పక్షానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు చేరడంతో బీఆర్ఎస్ బలం తగ్గింది. ఆ కౌన్సిలర్తోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్బీ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ బలం 15కు చేరనుంది. మ్యాజిక్ ఫిగర్కు రెండు పక్షాలకు ఒక ఓటు తగ్గుతుండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ⇒ ఇస్నాపూర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 14 కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన 12 మంది, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి (ఎక్స్ అఫీషియో), ఒక ఇండిపెండెంట్తో కలిసి మ్యాజిక్ ఫిగర్ వస్తోంది. కానీ, ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా ఎంపీ రఘనందన్రావు ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ⇒ మెదక్, నర్సాపూర్ : హంగ్ ఏర్పడిన ఈ రెండు మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవగాహన కుదుర్చుకుంటున్నారు. మెదక్లో కాంగ్రెస్, నర్సాపూర్లో బీజేపీకి చైర్మన్ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ⇒ రాయికల్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 7 కాగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి గెలిచిన ఆరుగురికి తోడు స్వతంత్ర అభ్యర్థి జట్టుకట్టి ఈ మున్సిపాలిటీని దక్కించుకునేలా అవగాహన కుదిరింది. ⇒ దేవరకద్ర: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏడు కాగా, కాంగ్రెస్ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు గెలిచారు. అదే పార్టీ రెబెల్ ఒకరు పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి మరొకరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండా ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ ఇంద్రేశం: ఈ మున్సిపాలిటీలో మేజిక్ ఫిగర్ 10 కాగా, ఎన్నికల్లో గెలిచిన 9 మందితోపాటు స్వతంత్ర కౌన్సిలర్ కూడా ఒకరు మద్దతివ్వనుండడంతో అక్కడ గులాబీ జెండా ఎగరనుంది. ⇒ కోహిర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 9 కాగా, గెలిచిన 8 మంది కౌన్సిలర్లతోపాటు మరో ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం కౌన్సిలర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని దక్కించుకోనుంది. ⇒ జిన్నారం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11 కాగా, బీఆర్ఎస్ (8), బీజేపీ (4) మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ⇒ మెట్పల్లి: ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్లు కలిసి బీజేపీకి చెక్ పెడుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 14కుగాను బీఆర్ఎస్(6), కాంగ్రెస్ (6)తో పాటు నలుగురు స్వతంత్రులు కలిసి పాలకమండలి ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో 10 చోట్ల గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ⇒ జగిత్యాల: మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 26 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 23 గెలిచింది. ఇక్కడ స్వతంత్రులుగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబెల్స్ 15 మంది గెలుపొందారు. వీరికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డితో ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు ఫలించడంతో జగిత్యాల పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వేములవాడ: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 15. 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకుతోడు స్వతంత్రులు, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా తోడయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానుంది.ఆమనగల్లులో ఏమవుతుందో?బీఆర్ఎస్కు చెక్పెట్టే యోచనలో కాంగ్రెస్, బీజేపీఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పావులుఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, వీటిలో అధికార కాంగ్రెస్ కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలుచుకుంది. ఆరు వార్డుల్లో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మద్దతు పలికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చైర్మన్ పదవిని కాంగ్రెస్కు అప్పగించి, వైస్ చైర్మన్ పదవితో సర్దుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూలు ఎంపీ మల్లురవి ఎక్స్ అఫీషియో ఓట్లతో ఈ పీఠాన్ని ఆ రెండు పార్టీలు కైవసం చేసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. -
శివ్ కైలాశోం కే వాసి
సింగర్గా హీరోయిన్ రాశీ ఖన్నా ‘జోరు, జవాన్, ప్రతిరోజూ పండగే’ వంటి సినిమాల్లో పాటలు పాడారు. తాజాగా ‘శివ్ కైలాశోం కే వాసి’ అనే భక్తి పాటను పాడారు రాశీ. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పాటను తన ఇన్స్టా ఖాతాలో ఆమె షేర్ చేయగా, వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ– ‘‘శివ్ కైలాశోం కే వాసి’ అనేది అహంకారాన్ని నాశనం చేయడం, అంతరంగాన్ని మేల్కొల్పడం, అతీంద్రియ శక్తి అయిన మహాదేవుడి మీద భక్తిని చాటే ప్రార్థనగా నిలుస్తుంది. ‘మహా శివరాత్రి’ అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇలాంటి విశిష్టమైన రోజున పాడటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
డాక్టర్ కాదు!
నవీన్ చంద్ర హీరోగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్పై ‘మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి బలమైన కథా చిత్రాలను నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ‘నాట్ ఎ డాక్టర్’ టైటిల్ని ప్రకటించి,పోస్టర్ని విడుదల చేశారు. ‘రాయని ఓ నవల ఆధారంగా’ అనేది ట్యాగ్లైన్. ‘‘ఓ వినూత్న కథతో ఈ చిత్రన్ని రూపొందిస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. -
ఘోరంగా ఓడిపోయా! మీకు దండం పెడతా నేనిచ్చిన గిఫ్ట్లను తిరిగి ఇచ్చేస్తే గిఫ్ట్ల షాపు పెట్టుకొని బతుకుతాను!!
ఘోరంగా ఓడిపోయా! మీకు దండం పెడతా నేనిచ్చిన గిఫ్ట్లను తిరిగి ఇచ్చేస్తే గిఫ్ట్ల షాపు పెట్టుకొని బతుకుతాను!! -
గజేంద్ర ‘మోక్షం’
‘ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపలనుండు లీనమై’ అనే పోతన గారి పద్యం సుప్రసిద్ధం. ఇప్పటి సంగతేమో కానీ, ఇటీవలి వరకూ ఈ పద్యం విననివారు ఉండరు. దాని వెనక కథేమిటంటే, ఓ ఏనుగు మడుగులోకి దిగింది. ఓ మొసలి దాని కాలు పట్టు కుంది. విడిపించుకోడానికి ఏనుగు హోరాహోరీ పోరాడింది. ఆ పోరాటం ఏళ్ళ తరబడి సాగింది. ప్రాణం కడతేరే దశలో ఏనుగు ఈశ్వరునికి మొర పెట్టుకుంది. ఆ క్రమంలో ఏకంగా విశ్వమూలాల్లోకి వెళ్ళిపోయింది; ఈ జగత్తు ఎవరివల్ల పుట్టిందో, ఎవరిలో ఉంటుందో, ఎవరిలో లయమైపోతుందో, పరమేశ్వరుడెవరో, అనాది మధ్య లయుడెవరో, అంతా తనే అయినవాడెవరో– అతని నుంచి పుట్టిన ఈశ్వరుని శరణువేడుకుంటు న్నానంటుంది. అప్పుడు ఈశ్వరుడు వచ్చి మొసలిని చంపి ఏనుగును రక్షిస్తాడు! ఈ క్షణాన ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏనుగులు ఇలాగే మొరపెట్టుకుంటున్నాయి; ఈసారి అక్కడి అటవీ గ్రామాల వాళ్ళు కూడా ఆ మొరలో గొంతు కలుపుతున్నారు. మనుషులకీ, ఏనుగులకీ మధ్య అక్కడ పతాక స్థాయిలో జీవన సమరం జరుగుతోంది. ఉభయులనూ రక్షించగల ఈశ్వరుడే కనుచూపు మేరలో కానరావడం లేదు. గత పన్నెండేళ్ళలోనే 68 ఏనుగులతోపాటు, 698 మంది మనుషులు మరణించారు. కొద్దిరోజుల క్రితమే ఓ 70 ఏళ్ళ వృద్ధుని ఏనుగులు తొక్కి చంపేశాయి. భారత వన్యప్రాణి సంస్థవారూ, జంతు సంక్షేమ సంఘం వారూ రంగంలోకి దిగి చేస్తున్న రోదనలు అక్షరాలా అరణ్యరోదనే అయి నట్టు కనిపిస్తున్నాయి. మరీ క్రూర జంతువులను మినహాయిస్తే, ఏనుగులు సహా వన్యప్రాణులతో మనిషి సహజీవనం చేయని దశ చరిత్రలో కనిపించదు. ఇప్పుడు సహజీవనం చేయలేని దశకు చేరుకున్నాడు. అందుకు తనే బాధ్యుడు తప్ప వన్యప్రాణులు కావు. ఈ భూమండలం మీద జీవించే హక్కు అన్ని ప్రాణులకూ ఉన్న సంగతి మరచిపోయి తన సర్వం సహాధిప త్యాన్ని స్థాపించుకోడానికి పూనుకున్నాడు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నరికేసి జనావాసాలను సృష్టిస్తున్నాడు, గనులు తవ్వేస్తున్నాడు, అడవుల్లో ఎక్కడబడితే అక్కడ విద్యుత్తంత్రులను వేలాడదీస్తున్నాడు. దాంతో వన్యప్రాణులకు సంచార భూమి కుదించుకుపోయి ఊళ్ళమీద పడుతున్నాయి. ఇటీవలి వరకూ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏనుగుల సంఖ్య నామమాత్రం. ఇప్పుడు మూడు వంతుల మేరకు, అంటే దాదాపు 400కు వాటి సంఖ్య పెరిగిపోయింది. అభివృద్ధి పేరిట జరుగుతున్న తవ్వకాల వల్ల అలవాటుపడిన దారులు మరచిపోయి అవి జనావాసాల్లోకి వచ్చిపడుతున్నాయి. 90 శాతం ఏనుగుల మరణానికి విద్యుదాఘాతాలే కారణమంటున్నారు. ఆ పైన గోతులు, బురద నేలలు వాటి ప్రాణాలు హరిస్తున్నాయి. అడవి జంతువులను మచ్చిక చేసుకుని వాడుకోవడంలో ఎంతో తెలివి కనబరచిన మనిషి, చివరికి వాటితోనే పోరాడి ప్రాణాల మీదికి తెచ్చుకునే తెలివి హీనతకు దిగ జారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వార్థం వికటించి ప్రకృతి విధించిన అన్ని రకాల హద్దులనూ, సహజీవన ధర్మాన్నీ ఉల్లంఘించడమే అందుకు కారణం. పురాణ, ఇతిహాస కాలంతో మొదలుపెట్టి, చరిత్ర కాలం వరకూ మనిషికీ, ఏనుగుకీ ఉన్న అనుబంధం అనేక రూపాల్లో అక్షరబద్ధమైంది. ఏనుగు ముఖంతో ఉన్న గణపతిని కొలవడం సరేసరి; ‘ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవు’డని పిల్లలు పాడుకోవడం మనకు తెలుసు. ధర్మరాజు వాకిట్లో ఏనుగుల నుంచి స్రవించే మదం బురద కట్టగా, కిక్కిరిసిన సామంత రాజులు ధరించిన ఆభరణాల నుంచి జారిన రజం ఆ బురదను కప్పేసిందంటూ ధర్మరాజు గజ సంపదనూ, సామంత రాజుల బలగాన్నీ కూడా – ‘ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు’ అనే పద్యంలో అద్భుతంగా వర్ణిస్తాడు తిక్కన. యుద్ధంలో ఓడిన తర్వాత, ఏనుగునెక్కి, రెండు వైపులా అనేక ఏనుగులు వెంట రాగా పురవీథుల్లో ఎలా విహరించగలవంటూ, చక్కని మరో తిక్కన పద్యంలో అర్జునుడు దుర్యోధనుని ఆక్షేపిస్తాడు. ‘ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము’ అంటూ తిరుపతి వెంకటకవులు సగర్వంగా చెప్పుకుంటారు. ఏనుగునెక్కి యుద్ధాలు చేసిన మనిషి ఏనుగుతో యుద్ధం చేయవలసి రావడమే అతని వివేక భ్రష్టతకు పరాకాష్ఠ. ఛత్తీస్గఢ్ అడవులు ఘోషిస్తున్న సత్యం అదే! -
జీవన చిత్రం
భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఆఫీస్లో అలసిపోయిన వారిద్దరూ ఓ సాయంత్రం ఇంటికి వచ్చారు. అప్పటికే వారి ఆరేళ్ళ కొడుకు బడినుంచి ఇంటికి వచ్చి ఉన్నాడు.తమ పుత్రరత్నం, చుట్టుప్రక్కల ఉన్న స్నేహితులనంతా ఇంటికి పిలిచి ఉన్నాడు. వారందరూ చేరి ఇల్లంతా పీకి పందిరి వేసి ఉన్నారు. భార్యాభార్తలిద్దరికీ కోపమొచ్చింది. ఇరుగు΄÷రుగు పిల్లల్ని గట్టిగా అరిచారు. తమ పుత్రరత్నాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.అమ్మనాన్నల తిట్లకు వాడు బుంగ మూతి పెట్టి సోఫాలో కూర్చుండిపోయాడు. వారిలో కోపం తగ్గలేదు. అలా బయటికి వెళ్ళి వస్తే మామూలు స్థితికి వస్తామనిపించింది. ఇద్దరూ ఇంటి బయటికి వచ్చారు. దగ్గరలోనే ఓ కళ్యాణ మంటపం ఉంది. ఆ రోజు ఆ కళ్యాణ మంటపంలో ఓ ఉత్తర భారత దేశ చిత్రకారుడు తన చిత్రాల్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. వాటిని చూద్దామని అక్కడికి వెళ్ళారు.మొత్తం చిత్రాలన్నీ పిల్లల చిత్రాలే. అందంగా అమాయకంగా ఉన్నాయి. మరికొన్ని కొంటె చూపుల్తో, పెద్దపెద్ద కళ్ళతో, కవ్వింపు ముఖంతో చూడముచ్చటగా ఉన్నాయి. మూడు వందలకి పైగా ఉన్న ఆ పిల్లల చిత్రాలన్నీ ఆ చిత్రకారుడు గీసినవే. కన్నార్పకుండా చూశారు. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించసాగాయి ఆ చిత్రాలు. చిత్రకారుడిని అభినందించాలని అతడి దగ్గరకు వెళ్ళారు.‘మీకు మీ పిల్లలంటే చాలా ఇష్టం కాబోలు, వారు చిన్నప్పుడు ఇంత అందంగా ఉండేవారేమో. అందుకే జీవం ఉట్టిపడేట్లు గీయగలిగారు’ అన్నారు. అతడు ఏమీ మాట్లాడలేదు. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.చిత్రపటాలను సర్దుతున్న చిత్రకారుడి సహాయకుడు వీరిని పక్కకి పిలిచాడు. చిన్న గొంతుతో ‘ఆయనకు పెళ్లై పాతికేళ్ళయ్యింది కానీ, పిల్లలు లేరు. పుట్టే అవకాశం కూడా లేదు. పుట్టి ఉంటే ఇలా ఉంటారన్న ఊహే అతడిలోని చిత్రకారుడిని నిద్ర లేపింది. పెళ్లి అయ్యేంతవరకు అతడు చిత్రకారుడు కాదు. పిచ్చి గీతలు గీసే మనిషి మాత్రమే. పిల్లలు పుట్టరన్న విషయం తెలిసాకే అతడిలోని చిత్రకారుడు మేల్కొన్నాడు’ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.నీరు లేని నాడే కదా నీటి విలువ తెలుస్తుందన్న విషయం గుర్తుకొచ్చింది భార్యాభర్తలకి. ‘పిల్లలన్నాక గొడవ చేయడం సహజం, మనకి పిల్లలున్నారు కాబట్టి మనకి వారి విలువ తెలియడం లేదు. పిల్లలు లేని వారి బాధ వర్ణనాతీతం కదా’ అని ఆలోచించారు. పరుగుపరుగున ఇంటికి వెళ్ళారు. కొడుకుతో పాటు వాడి మిత్రులకంతా తీపి మిఠాయిలు పంచారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
వృద్ధాప్యం ఆధ్యాత్మిక సాధనకు వరం
వృద్ధాప్యం అనేది జీవితమనే పుస్తకంలో చివరి అధ్యాయం కావచ్చు, కానీ అది అత్యంత విలువైన గౌరవప్రదమైన దశ. దీనిని కేవలం శారీరక క్షీణతగా కాకుండా, ‘అనుభవాల పండగ’గా చూడాలి. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గొచ్చు కానీ, జీవితాన్ని చూసే దృష్టి పెరుగుతుంది. ఏది ముఖ్యం, ఏది అనవసరం అనే విచక్షణ వారికి ఉన్నంతగా మరెవరికీ ఉండదు. అందుకే వారిని జ్ఞాన నిధులు అంటారు.వృద్ధాప్యంలో ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు, పునస్కారాలకే పరిమితం కాదు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి., జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన పెంచుకోవడానికి చేసే ప్రయాణం. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గడం వల్ల కలిగే అసహనాన్ని ఆధ్యాత్మికత తగ్గిస్తుంది. రోజుకు కొద్దిసేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసు నియంత్రణలోకి వస్తుంది. జీవితంలో జరిగిన మంచి చెడులను సమానంగా స్వీకరించే గుణం అలవడుతుంది. వృద్ధాప్యం అనేది కేవలం శారీరక శక్తిని కోల్పోయే దశ కాదు, అది ఆధ్యాత్మిక పురోగతికి అత్యంత అనుకూలమైన సమయం. జీవితంలో బాధ్యతలన్నీ తీరిన తర్వాత, మనసును బయటి ప్రపంచం నుండి మళ్లించి లోపలికి (అంతర్ముఖం) పంపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. యవ్వనంలో ఉన్నప్పుడు ధనం, పదవి, పిల్లల భవిష్యత్తుపై ఉండే విపరీతమైన వ్యామోహం వృద్ధాప్యంలో క్రమంగా తగ్గుతుంది. కుటుంబంలో జరిగే విషయాలను ఒక సాక్షిలా గమనించడం అలవడుతుందిఅంతా ‘దైవేచ్ఛ’ అని భావించడం ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు.వృద్ధాప్యంలో శారీరక కదలికలు తగ్గినప్పుడు, మనసు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ జీవిత పరమార్థం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం వెతకడం మొదలవుతుంది. అనవసరమైన మాటలు తగ్గించి, మౌనంగా ఉండటం వల్ల ప్రాణశక్తి వృధా కాకుండా ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో అహంకారం సహజంగానే తగ్గుతుంది. నా వల్ల ఏమీ కాదు అని తెలిసినప్పుడు, భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది. ‘‘నేను నీ వాడిని, నీవే నన్ను నడిపించు’’ అని భగవంతుడికి పూర్తిగాఅప్పగించుకోవడం (శరణాగతి ) వల్ల కలిగే ప్రశాంతత అద్భుతమైనది. ఇది మరణం పట్ల భయాన్ని పోగొట్టి, ప్రశాంతమైన చిరనిద్రకు (మరణానికి) సిద్ధం చేస్తుంది. తమకున్న అనుభవాన్ని యువతరానికి పంచడం, నిస్వార్థంగా సలహాలు ఇవ్వడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే.అందరికీ వృద్ధాప్య దశ వరకు చేరుకునే అదృష్టం కలగదు. ఉన్న పెద్దలను గౌరవించడం అంటే మన భవిష్యత్తును మనం గౌరవించుకోవడమే. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అనుభవాలను గడించి, ఒక తరాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులు వృద్ధులు. దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో లేదా కొన్ని కుటుంబాలలో వారిని ఒక భారంలా చూడటం కనిపిస్తుంది, కానీ అది సరైన దృక్పథం కాదు. ఈరోజు మనం వృద్ధులను ఎలా చూస్తామో, రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు.వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే ఒక సహజ ప్రక్రియ. వారిని అనాథ శరణాలయాలకు పంపడం లేదా ఇంట్లో ఒక మూలకు పరిమితం చేయడం వంటివి కాకుండా, వారిని గౌరవప్రదంగా చూసుకోవడం మన సంస్కృతి.వృద్ధాప్యం అనేది ఒక పండు పక్వానికి వచ్చినట్లు. పండు పండితే తీపి పెరుగుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ మనిషిలో శాంతి, క్షమ, ప్రేమ అనే ఆధ్యాత్మిక గుణాలు పెరగాలి. అదే నిజమైన పురోగతి. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే మనలోని అశాంతిని వదిలి, శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కోవడం. వృద్ధాప్యంలో ఈ సాధన మరింత సులభం, ఎందుకంటే లోకజ్ఞానం మనకు అప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది.వృద్ధులను వేధించే ప్రధాన సమస్య ఒంటరితనం. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే భజనలు, ప్రవచనాలు లేదా ఆధ్యాత్మిక చర్చల (సత్సంగం ) ద్వారా సమాజంతో సంబంధం ఏర్పడుతుంది. పరమాత్మ ఎప్పుడూ నాతోనే ఉన్నాడు (భగవంతునితో అనుసంధానం) అనే నమ్మకం వారిలో ధైర్యాన్ని నింపుతుంది. జీవితం ఒక నిరంతర ప్రక్రియ అని, మరణం కేవలం ఒక మార్పు మాత్రమే అనే సత్యాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు బోధిస్తాయి. భగవద్గీత వంటి గ్రంథాల పఠనం ద్వారా మరణం పట్ల ఉండే భయం పోయి, చిత్తశుద్ధి కలుగుతుంది. గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఉన్నదానితో తృప్తి చెందడం (సంతోషం) అనేది గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. బాధ్యతలు తీరిపోయాయి, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాననే భావన వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.– రామలక్ష్మీ సదానందమ్ -
దిద్దుబాటుకు 'ఇస్రో' ఉపక్రమించాలి!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఈ ఏడాది ఆదిలోనే హంస పాదు ఎదురైంది. శ్రీహరికోట నుంచి జనవరి 12న ప్రయోగించిన పోలార్ ఉప గ్రహ వాహక నౌక (పీఎస్ఎల్వీ) విఫలమైంది. ఈ వాహక నౌక వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలతోపాటు, మన దేశానికి చెందిన ఒక వ్యూహాత్మక ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలో ప్రవేశపెట్టవలసి ఉంది. మిగిలిన అంతరిక్ష పరిశోధనా సంస్థల మాదిరిగానే ఇస్రో కూడా గతంలో కొన్ని వైఫల్యాలను చవి చూసింది. కానీ, కొన్ని సందర్భాల్లో అంతరిక్ష ప్రయోగాలు ఆందోళనను రేకెత్తిస్తాయి. లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన, నిశితంగా సమీక్షించుకోవలసిన అవసరాన్ని చాటుతాయి. తాజా వైఫల్యం పలు కారణాల రీత్యా ఆ కోవకు చెందినదే!పరుగెత్తని పంచకల్యాణిపీఎస్ఎల్వీకి 63 సార్లు విజయం సాధించిన ఘన చరిత్ర ఉంది. చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయాలు దాని ఖాతాలోకే వస్తాయి. దాన్ని తమ పంచకల్యాణి గుర్రంగా ఇస్రో చెప్పుకొంటుంది. ఒకటి రెండు వైఫల్యాలు లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేనివిగానే కనిపించవచ్చు. కానీ, పీఎస్ఎల్వీకి ఇది వరుసగా రెండో వైఫల్యం. గతేడాది మే 18న ప్రయోగించిన దానికి కూడా ఇదే గతి పట్టింది. ఈ రెండు సందర్భాలలోనూ రాకెట్ మూడవ దశలోనే లోపం తలెత్తింది. గత (2025) ప్రహసనం ఆధారంగా ఈసారి ఏమైనా మార్పులు చేసిందీ లేనిదీ ఇస్రో వెల్లడించలేదు. వైఫల్యాలను కూలంకషంగా విశ్లేషించుకునే బలమైన వ్యవస్థ ఇస్రోకు ఉంది. దీనికి 2021లో జియో ఉపగ్రహ వాహక నౌక (జీఎస్ఎల్వీ) వైఫల్యంపై వెల్లడైన నివేదికే ఉదాహరణ. క్రయోజనిక్ దశ జ్వలన సమయంలో దిగువ లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంకులో పీడనం, ఫ్యూయల్ బూస్టర్ టర్బో పంప్ సక్రమంగా పనిచేయక పోవడానికి కారణమైందనీ, ఫలితంగా మొత్తం మిషన్ విఫలమైందనీ ఆ ఉదంతంలో తేల్చారు. కానీ, 2025 మే నాటి వైఫల్యం గురించి ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు. పారదర్శకంగా వ్యవహరించడంలో ఇస్రోకు మంచి చరిత్రే ఉంది. అది ఆ బాట నుంచి వైదొలగుతున్న ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలకమైన ఉపగ్రహాలకే ఎదురుదెబ్బవరుసగా రెండు పీఎస్ఎల్వీ వైఫల్యాలతోపాటు, గతేడాది కాలంలో, ఇస్రో మరో వైఫల్యపు అపఖ్యాతిని కూడా మూట గట్టుకుంది. కానీ, అది రాకెట్ వైఫల్యం కాదు. ఉపగ్రహ వైఫల్యం! ఇస్రో 2025 జనవరి 29న చేపట్టిన జీఎస్ఎల్వీ ప్రయోగంతో శ్రీహరికోట నుంచి వంద సార్లు ఉపగ్రహాలను ప్రయోగించిన రికార్డును సృష్టించింది. ఆ వాహక నౌక ప్రయోగానంతరం, అది ఎన్విఎస్–02 నావిగేషన్ ఉపగ్రహాన్ని దానికి ఉద్దేశించిన ట్రాన్స్ఫర్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని ప్రకటించింది. అయితే, ఆన్బోర్డ్ థ్రస్టర్లను జ్వలింప జేసేందుకు ఆక్సిడైజర్కు వీలు కల్పించే కవాటాలు తెరుచుకోని కారణంగా, నిర్ణయించిన స్లాట్లో ఉపగ్రహం కుదురుకోలేక పోయిందని చెప్పింది. ఏడాది కాలంలో మూడు వైఫల్యాలు ఎదురవడం అటు ఇస్రోకు గానీ, ఇటు దాని దేశ, విదేశీ కస్టమర్లకు గానీ తీవ్ర పర్యవసానాలనే కలుగ జేస్తోంది. పైగా, ఈ వైఫల్యాల కారణంగా కోల్పోయిన మూడు భారతీయ ఉపగ్రహాలు కీలకమైన సైనిక ఉపగ్రహాలు. ఆశించిన కక్ష్యలో కుదురు కోలేకపోయిన ఎన్విఎస్–02 ఒక నేవి గేషన్ ఉపగ్రహం. అది స్టాండర్డ్ పొజి షనింగ్ సర్వీసులతో పాటు, ‘రిస్ట్రిక్ టెడ్ సర్వీసులను’ కూడా సమకూరు స్తుంది. గతేడాది వైఫల్యంతో ఇఓఎస్– 09 ఉపగ్రహాన్ని కోల్పోయాం. ఆపరేషనల్ అప్లికేషన్లలో ఉన్న ఏజన్సీలకు రిమోట్ సెన్సింగ్ డేటాను అందించేట్లుగా దాన్ని డిజైన్ చేశారు. దానిలో సింథటిక్ అపెర్చర్ రాడార్ ఉంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా ఇమేజ్లను సమకూర్చగల సామర్థ్యం ఆ పేలోడ్కు ఉంది. రక్షణ పరిశోధన ఏజన్సీలు అభివృద్ధి చేసిన ఇఓఎస్ –ఎన్1 (అన్వేషగా పిలుస్తున్నారు) భూ పరిశీలనా ఉపగ్రహాన్ని ఈ జనవరిలో ప్రయోగించిన పోలార్ వాహక నౌకలో అమర్చారు. అంతరిక్షం నుంచి సైన్యానికి ఉపయోగపడగలిగిన మూడు వ్యూహాత్మక ఆస్తులను కోల్పోవడం అంతరిక్ష, రక్షణ ఏజన్సీలకు మేలుకొలుపు కావాలి. అంతరిక్షం నుంచి సైన్యం ప్రయోజనాలను తీర్చగలిగిన దాదాపు 52 ఉపగ్రహాలను వచ్చే ఐదేళ్ళలో ప్రయోగించాలని బెంగళూరులోని డిఫెన్స్ స్పేస్ ఏజన్సీ ప్రణాళికలతో ఉంది. అంతరిక్ష ఆధారిత నిఘా (ఎస్బిఎస్) ప్రాజెక్టు 3వ దశ కింద వాటిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఉపగ్రహాలను తయారు చేసినా, ప్రైవేటు కంపెనీల ద్వారా పొందినా, వాటిని అంతరిక్షంలోకి చేర్చవలసిన బాధ్యత ఇస్రోపైనే ఉంటుంది. వాణిజ్య నష్టం అపారంఈ నెలలో వెళ్ళిన వాహక నౌక ఇఓఎస్–ఎన్1తో పాటు దేశ, విదేశీ కస్ట మర్లకు చెందిన 15 ఉపగ్రహాలను మోసు కెళ్ళింది. వాటిలో ‘ధ్రువ స్పేస్’కు చెందిన ఐదు ఉపగ్రహాలున్నాయి. ఆ ఐదింటిలో నేపాల్ది ఒకటి. బ్రెజిల్కు చెందిన ఆల్టో స్పేస్కు చెందిన మరో ఐదు ఉపగ్రహాలున్నాయి. బ్రిటన్–థాయి లాండ్ సంయుక్త ఉపగ్రహంతోపాటు, భారతీయ కస్టమర్లకు చెందిన మరో రెండు చిన్న ఇతర ఉపగ్రహాలు, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ చేయూతతో స్పెయిన్ కంపెనీ తయారు చేసిన ‘కిడ్’ ఉపగ్రహం కూడా ఉంది. ధ్రువతోపాటు ఇతర భారతీయ అంకుర సంస్థలు పీఎస్ఎల్వీ పైనే ఆశ పెట్టుకున్నాయి. అవి పెద్ద మొత్తంలో నగదుతోపాటు విలువైన కాలాన్ని, అవ కాశాన్ని కూడా కోల్పోయినట్లు లెక్క. ఉప గ్రహాల సైజును బట్టి వాటిని తయారు చేసేందుకు కంపెనీలకు కొద్ది నెలల నుంచి కొద్ది ఏళ్ళు పట్టవచ్చు. కోల్పో యినవాటి స్థానంలో అవి కొత్త వాటిని వేగంగా తయారు చేసుకున్నా, పీఎస్ ఎల్వీలో చోటు కోసం అవి చాలాకాలం ఎదురుచూడక తప్పదు. దీనికితోడు, రాకెట్ విశ్వసనీయత దెబ్బ తినడం వల్ల బీమా ఖర్చులు పెరుగుతాయి. అది తిరిగి మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుంది. వరుసగా రెండు వైఫల్యాల నేపథ్యంలో, భవిష్యత్ పీఎస్ఎల్వీ ప్రయోగాలను సమీక్షించుకోవడం ఇస్రోకు తక్షణ కర్తవ్యంగా మారు తోంది. ఈ ఏడాది మరికొన్ని ఇతర ప్రయోగాలు నిర్వహించవలసి ఉంది. ముఖ్యంగా గగన్యాన్ కార్యక్రమం కింద సిబ్బంది లేకుండా ఒక అంతరిక్ష నౌకను కక్ష్యలో తిప్పనున్నారు. మానవ సహిత అంతరిక్ష నౌకను పంపడంపై జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పడంపై దృష్టి పెట్టాం. ఈ స్థితిలో ఇస్రోపై బృహత్తర బాధ్యత పడుతోంది. అది టెక్నికల్, క్వాలిటీ, మేనేజీరియల్ ప్రక్రియలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాలి. విశ్వసనీయమైనదని ఉన్న పేరును కాపాడుకునేందుకు అదొక్కటే మార్గం! దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్కు బ్రేక్?
ఒకప్పుడు సినిమా చివర్లో పార్ట్-2 త్వరలో అనే టైటిల్ కార్డు పడితే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్కు బ్రేక్ పడుతున్నట్టుంది. కొన్ని సినిమాలకు రెండో భాగం ప్రకటించినా, ఆ స్థాయిలో వర్కవుట్ కాలేదు. తల బొప్పికట్టే రేంజ్లో కొన్ని సినిమాలు చుక్కలుచూపించడంలో పార్ట్-2 అనేది దండగ అనే ఫీలింగ్కు వచ్చారు మేకర్స్. కథ డిమాండ్ లేకుండా సీక్వెల్స్ తీయడం అనవసరమని నిర్మాతలు భావిస్తున్నారు. బడ్జెట్ పెంచడం లేదా హైప్ క్రియేట్ చేయడం కోసం పార్ట్-2లు తీయడం సరైన పద్ధతి కాదని స్పష్టంగా చెబుతున్నారు. అసలు సీక్వెల్ ట్రెండ్ను మొదలుపెట్టిన రాజమౌళి కూడా ఇప్పుడు దానికి దూరమయ్యాడు. తను మహేష్బాబుతో చేస్తున్న తాజా చిత్రం “వారణాసి” ఒక్క భాగమే అని స్పష్టం చేశాడు. అంతేకాక సినిమా చివర్లో పార్ట్-2 కార్డులు పడవని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర యూనిట్ కూడా సీక్వెల్ ఉండదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, జూ.ఎన్టీఆర్తో చేస్తున్న “డ్రాగన్” సినిమాను సింగిల్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఇప్పుడు వచ్చే ఏ సినిమాకైనా పార్ట్-2 ఉందని ప్రకటిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్ట్-2 ఉంది అనగానే దానికి వచ్చే హైప్ కంటే ట్రోలింగ్నే ఎక్కువగా జరుగుతోంది. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు కూడా ఒక్క భాగంలోనే కథను ముగించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. చూస్తుంటే రానున్న కాలంలో వచ్చే చిత్రాలకు ఈ పార్ట్-2 గోల తగ్గేలానే కనిపిస్తోంది. -
పాక్ను చిత్తు చేసిన భారత్.. సూపర్-8కు సూర్య సేన
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్పై తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్లో పాకిస్తాన్ను 61 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఓపెనర్ అభిషేక్ శర్మ (0) త్వరగానే అవుట్ అయినప్పటికీ.. ఇషాన్ కిషన్ మాత్రం సంచలన ప్రదర్శన కనబరిచాడు. కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. అయితే ఇషాన్ ఔటయ్యాక తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (32) నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. కానీ చివరిలో శివం దూబే (27)., రింకూ సింగ్(4 బంతుల్లో 11) మెరుపులు మెరిపించారు. ఫలితంగా 170 పైగా భారత్ స్కోర్ సాధించగల్గింది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగట్టగా.. సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన భారత బౌలర్లుఅనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. టీమిండియా బౌలర్ల ధాటికి దాయాది జట్టు 18 ఓవర్లలో కేవలం ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(44) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్పై భారత్కు ఇది 8వ విజయం కావడం విశేషం. -
కోటప్పకొండ ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్
పల్నాడు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండకు భక్తులు పోటెత్తడంతో ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండ కిందకి గాని పైకి గాని కదలకుండా వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా గంటల తరబడి అవస్థలు తప్పడం లేదు. ప్రధానంగా కోటప్పకొండ నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో నరసరావుపేట వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు భక్తులు. కొండ దిగుభాగంలో పూర్తిగా వాహనాలు ప్యాక్ అయిపోవడంతో ట్రాఫిక్ను కంట్రోల్లో తీసుకురావడం కష్టతరంగా మారింది. ఇది క్లియర్ కావడానికి మరికొన్నిగంటలు సమయం పట్టే అవకాశం కనబడుతోంది. -
తిలక్ వర్మపై గంభీర్ సీరియస్
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ వర్మ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన తిలక్ తన జిడ్డు బ్యాటింగ్తో విసిగించాడు. ఓ వైపు ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతుంటే తిలక్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ హెడ్కోచ్ గంభీర్ అగ్రహానికి గురయ్యాడు.డ్రింక్స్ బ్రేక్ సమయంలో డగౌట్ నుంచి బయటకు వచ్చిన గంభీర్, తిలక్ వర్మతో చాలా సీరియస్గా మాట్లాడాడు. వేగంగా ఆడాలని, టార్గెట్ 170 దాటాలని గంభీర్ గట్టిగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా 24 బంతుల్లో 104.17 స్ట్రైక్ రేటుతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు.pic.twitter.com/1MeAVMJPtQ— crictalk (@crictalk7) February 15, 2026 -
మంత్రులు, పీసీసీ చీఫ్తో సీఎం జూమ్ మీటింగ్
హైదరాబాద్: మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికపై సీఎం రేవంత్రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) మున్సిపల్, కార్పొరేషన్లకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే వీటిపై కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ.. రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం కూడా దృష్టి సారించింది. ఏమాత్రం ఏమరపాటుకు లోనుకాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా హంగ్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూమ్ మీటింగ్లో చర్చించారు. దీనిలో భాగంగా నేతలకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో 64 మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. -
గ్రహంతర వాసులపై.. ఒబామా సంచలన కామెంట్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పాడ్కాస్ట్లో గ్రహాంతర వాసులపై తన అభిప్రాయం పంచుకున్నారు. గ్రహాంతర వాసుల ఉనికిని తాను నమ్ముతానన్నారు. అయితే వారు ఎక్కడున్నారనేది మాత్రం తనకు తెలియదన్నారు.ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రముఖ యూట్యూబర్ బ్రియాన్ టైలర్ కోవెన్ పాడ్కాస్ట్ విడుదలైంది. అందులో ఏలియన్స్ గురించి కీలక సమాచారాన్ని ఒబామా పంచుకున్నారు. గ్రహాంతర వాసుల ఉనికిని తాను నమ్ముతారన్నారు. ఆయన మాట్లాడుతూ" గ్రహాంతర వాసులు ఉండడం నిజం. అయితే వారి ఉనికి నాకు తెలియదు. వారిని ఏరియా 51లో ఉంచలేదు. అక్కడ భూగర్భ సౌకర్యం లేదు. అయితే ఏదైనా కుట్ర జరిగి అమెరికా అధ్యక్షుడికే తెలియకుండా దాడిపెడితే అది వేరే విషయం" అన్నారు.ఏరియా 51 అనేది నెవాడాలోని గ్రూమ్ లేక్లో ఉన్న అత్యంత రహస్యమైన US వైమానిక దళ స్థావరం, ఇది చాలా కాలంగా ప్రభుత్వం గ్రహాంతర వాసుల సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా అవశేషాలను దాచిపెడుతుందనే ఊహాగానాలు రేగుతున్నాయి. అయితే ఒబామా UFOలు మరియు గ్రహాంతర జీవుల గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ "గ్రహాంతరవాసుల విషయానికి వస్తే, నేను మీకు ప్రసారంలో చెప్పలేని కొన్ని విషయాలు ఉన్నాయి" అని ఒబామా అనడం అప్పట్లో సంచలనం రేపింది. -
ప్రభాస్, బన్నీతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుపట్టారా? ఇప్పుడేం చేస్తోంది?
తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నోళ్లు మెల్లమెల్లగా సైడ్ అవుతూనే ఉంటారు. కాకపోతే కొందరు మాత్రం స్టార్స్ అవుతారనుకుంటే పట్టుమని పది మూవీస్ కూడా చేయకుండా తెరమరుగైపోతుంటారు. అలాంటి బ్యూటీనే ఈమె. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్తో చేసినప్పటికీ మాయమైపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దీక్షా సేథ్. ఢిల్లీలో పుట్టిన ఈమె.. తండ్రి ఉద్యోగరీత్యా ముంబై, చెన్నై, కోల్కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో పెరిగింది. మంచి పొడగరి కావడంతో 2009లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మోడలింగ్ అనుభవం లేనప్పటికీ టాప్-10లో ఒకరిగా నిలిచింది. ఓ మోడలింగ్ పనిమీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఈమెని చూసిన దర్శకుడు క్రిష్.. 'వేదం'లో అవకాశమిచ్చాడు. ఇందులో పూజగా అల్లు అర్జున్ సరసన నటించింది. అలా టాలీవుడ్ దృష్టిలో పడింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)తర్వాత రవితేజ 'మిరపకాయ్', నిప్పు, గోపిచంద్ 'వాంటెడ్', మంచు మనోజ్ 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ప్రభాస్ 'రెబల్' సినిమాలు చేసింది. వీటిలో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ ఉండేసరికి తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. అనంతరం హిందీలో రెండు, కన్నడలో ఓ మూవీ చేసింది. అయినా సరే పెద్దగా ఉపయోగం లేకపోయేసరికి పూర్తిగా నటనకు దూరమైపోయింది.రీసెంట్ టైంలో ఈమె ఫొటోలు కొన్ని వైరల్ కావడంతో అసలు ఇప్పుడేం చేస్తుందా అని వెతకగా.. స్పెయిన్లో ఎంబీఏ పూర్తి చేసిన దీక్షా, అక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటోందట. అలానే ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయిపోవడంతో జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. అయితే హీరోయిన్గా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే క్యూట్, గ్లామర్గా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) -
భారీగా పెరిగిన ఎగుమతులు.. జాబితాలో మారుతి టాప్!
ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ అమ్మకాల్లో తన హవా కొనసాగిస్తూనే.. ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ ఎక్స్పోర్ట్స్ వార్షిక ప్రాతిపదికన 89 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో 26,781 యూనిట్లుగా ఉండగా తాజాగా 50,716 యూనిట్లకు చేరాయి.హ్యుందాయ్ ఎగుమతులు 21 శాతం పెరిగినప్పటికీ మొత్తం ఎగుమతుల మార్కెట్లో వాటా 20 శాతం నుంచి 18 శాతానికి పడిపోవడం గమనార్హం. అటు నిస్సాన్, ఫోక్స్వ్యాగన్ ఎగుమతులు కూడా 36 శాతం, 78 శాతం క్షీణించినట్లు సియామ్ గణాంకాల్లో వెల్లడైంది. భారత్ నుంచి మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతుల్లో తమ సంస్థ వాటా 66 శాతంగా ఉన్నట్లు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో కంపెనీ దాదాపు 3.6 లక్షల ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. ఇవి మొత్తం పీవీల ఎగుమతుల్లో 48 శాతమని రాహుల్ చెప్పారు. పరిశ్రమ ఎక్స్పోర్ట్స్ 7 శాతం పెరగ్గా, తమ ఎగుమతులు 32 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. తమ తొలి బీఈవీ అయిన ఈ–విటారా ఎగుమతులు గతేడాది ఆగస్టు నుంచి ప్రారంభం కావడం ఎక్స్పోర్ట్స్కి ఊతమిస్తోందని రాహుల్ తెలిపారు.ఇప్పటివరకు ప్రధానంగా యూరప్లోని 36 దేశాలకు దాదాపు 16,000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించారు. 2030 నాటికి ఎగుమతుల్లో 30 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు హ్యుందాయ్ మోటర్స్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో కొత్త అవకాశాలు లభించగలవని తెలిపారు. -
‘ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూలో 71 నౌకలు’
విశాఖ: ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూలో 71 నౌకలు భాగస్వామ్యం అవుతున్నాయని ఈఎన్సీ(Eastern Naval Command) చీఫ్ సంజయ్ భల్లా స్పష్టం చేశారు. 71 నౌకలతో పాటు 19 విదేశీ యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయన్నారు. ఆరు వరుసల్లో నౌకలను మోహరిస్తారన్నారు ఈఎస్సీ చీఫ్. ‘రాష్ట్రపతి ఫ్లిట్ రివ్యూ ను సమీక్షిస్తారు. ఐఎఫ్ఆర్లో 50 ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొంటున్నాయి. 1995 లో నాలుగు దేశాలతో ప్రారంభమైన మిలన్ లో ఇప్పుడు 65 దేశాలు భాగం పంచుకుంటున్నాయి. అయాన్స్ కాంక్లేవ్ 2008 లో ప్రారంభమైంది. 19న జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ లో 45 దేశాల నేవీ కంటెంజెంట్స్ భాగస్వామ్యం అవుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ సహా 17యుద్ధ నౌకలు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి’ అని స్పష్టం చేశారు. -
మెరుపుతీగలా అనుపమ.. మస్తు క్యూట్గా మృణాల్!
మెరుపుతీగలా సన్నని గ్లామర్తో అనుపమముద్దుముద్దుగా పోజులిచ్చేసిన మృణాల్అందాల జాతర చేస్తున్న డింపుల్ హయాతిపట్టుచీరలో మెరిసిపోతున్న కీర్తి సురేశ్స్టేజీపై పాడుతూ దుమ్ములేపిన నోరా ఫతేహిచుడీదార్లో క్యూట్ 'కపుల్ ఫ్రెండ్లీ' వారణాసి View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. యువరాజ్ రికార్డు బ్రేక్
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న హైవోల్టేజ్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికి.. ఇషాన్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.తిలక్ వర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇషాన్ కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 40 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన కిషన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్పై టీ20ల్లో అత్యంతవేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో అహ్మదాబాద్లో పాక్పై యువరాజ్ సింగ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్లో 27 బంతుల్లోనే ఆర్ధ శతకం బాదిన ఇషాన్.. 14 ఏళ్ల నాటి యువీ రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు.కాగా ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కిషన్తో పాటు సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ అఘా, ఉస్మాన్ తరీఖ్, అఫ్రిది తలా వికెట్ సాధించారు. -
T20 WC 2026: అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్న అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పలు అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్నాడు. పాక్తో ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన హైవోల్టేజీ మ్యాచ్లో డకౌటైన అతను.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మొదటి రెండు మ్యాచ్ల్లో డకౌటైన మూడో ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు ఇమ్రుల్ కయేస్ ఈ అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. నెహ్రా, కయేస్ తమ వరల్డ్కప్ కెరీర్లలో ఒక్క పరుగు కూడా చేయకపోవడం మరో విశేషం.ప్రస్తుత ప్రపంచకప్లో యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన (తొలి బంతికే) అభిషేక్.. ఇవాళ పాక్తో జరిగిన మ్యాచ్లో నాలుగు బంతులు ఎదుర్కొని కూడా ఖాతా తెరవలేకపోయాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా రచించిన వూహ్యంలో చిక్కుకున్న అభిషేక్ అవాంఛిత ఈ రికార్డును మూటగట్టుకున్నాడు. అభిషేక్కు గత ఆరు ఇన్నింగ్స్ల్లో ఇది నాలుగో డకౌట్ కావడం మరో విశేషం.కోహ్లి రికార్డు సమంపాక్పై డకౌట్ కావడంతో అభిషేక్ మరో చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ తరఫున రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే సరసన చేరాడు. వీరంతా మెగా టోర్నీలో తలో రెండు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో ఆశిష్ నెహ్రా (3) టాప్ ప్లేస్లో ఉన్నాడు.సంజూతో సమానంగా..!తాజా డకౌట్తో అభిషేక్ మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నాడు. టీ20ల్లో భారత ఓపెనర్లలో రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా సంజూ శాంసన్ సరసన చేరాడు. అభిషేక్, సంజూ తమ టీ20 కెరీర్లలో తలో ఐదు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (10) అగ్రస్థానంలో ఉన్నాడు.భారీ స్కోర్ దిశగా టీమిండియాపాక్తో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు తొలి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్ బౌలర్లను ఊచకోత కోసి ఔటయ్యాడు. అంతకుముందు అభిషేక్ డకౌటయ్యాడు. ప్రస్తుతం సూర్యకుమార్ (21), తిలక్ వర్మ (25) క్రీజ్లో ఉన్నారు. -
డ్యాన్స్తో దుమ్మురేపిన సునీల్.. 'కూలీ' మోనికాని మించి
లోకేష్ కనగరాజ్ తీసిన 'కూలీ' చూసినవారెవ్వరూ అందులోని మోనికా పాటని మర్చిపోలేరు. నిజానికి చూడనివారినీ వదలకుండా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కవర్ సాంగ్గా ఆ పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటికి ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపును ఆ ఒక్క పాటతో దక్కించుకున్నాడు మళయాళ నటుడు సౌబిన్ షాహిర్. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేడుకల్లో ఆ పాట సందడి చేస్తూనే ఉంది.ఈ నేపధ్యంలో మన టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ ఆ పాట క్రేజ్కి చెక్ పెట్టేలా ఉన్నాడు. త్వరలో విడుదల కానున్న 'కాటలన్' అనే మళయాళ చిత్రంలో మోనికా పాటని మించేలా డ్యాన్స్ ఊపేశారు. ఈ విషయం తాజాగా ఆ సినిమా టీజర్ లాంచ్తో వెల్లడైంది. పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్ పెపే, దుసర విజయన్, కబీర్ సింగ్లతో పాటు సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే చిత్ర నిర్మాతలు తమ చిత్రం మొదటి లిరికల్ వీడియోని విడుదల చేశారు. 'మజాకో మల్లికా' అంటూ సాగే ఈ పాట విడుదలైన కాసేపట్లోనే వైరల్గా మారింది. ముఖ్యంగా సునీల్ స్టెప్స్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)'మజాకో మల్లికా'లో సునీల్ డ్యాన్స్లో ఈజ్ని అనేక మంది ప్రశంసిస్తున్నారు. అంతేకాక ఈ పాటను చాలామంది మోనికా పాటతో పోలుస్తున్నారు. ఓ చేత్తో సిగిరెట్ పట్టుకుని స్మోక్ చేస్తూ ఒకే కాలితో సునీల్ వేసిన స్టెప్స్ని చూసి ఒక నెటిజన్.. 'నటుడు సునీల్ డ్యాన్స్ నెక్ట్స్ లెవల్' అని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్షకులకు సునీల్ డ్యాన్స్ బాగా పరిచయం అయినప్పటికీ... దక్షిణాది మొత్తానికి ఇప్పుడు పరిచయం అయిందని చెప్పొచ్చు.ఈ పాటకు సంగీతాన్ని ప్రముఖ కన్నడ సంగీతకారుడు అజనీష్ లోక్నాథ్ స్వరపరిచారు, ఇతను 'కాంతారా చాప్టర్ 2' కు వర్క్ చేయడం విశేషం. ఈ పాటను ఆనంద్ శ్రీరాజ్ భద్ర పాడారు, వినాయక్ శశికుమార్ సాహిత్యం రాశారు. కూలీ సినిమాలో సౌబిన్ లాగే ఈ సినిమాలో కూడా సునీల్ విలన్గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాటలన్ చిత్రం విడుదల తర్వాత సునీల్ సాంగ్.. మోనికా రేంజ్లో హిట్ కొడితే ఇక దక్షిణాది సినిమాల్లో హీరోలతో పాటుగా విలన్ పాటల ట్రెండ్ మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అత్యంత హింసాత్మక చిత్రంగా పేరొందిన మార్కో సినిమాను అందించిన క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అందిస్తున్న ఈ యాక్షన్ సినిమా మే నెలలో విడుదల కానుంది.(ఇదీ చదవండి: పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?) -
IND vs PAK: అరెరే అభిషేక్.. ఇలా చేశావేంటి?
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో డకౌటైన అభిషేక్.. ఇప్పుడు కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో అదే తీరును కనబరిచాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బౌలింగ్లో చెత్త షాట్ ఆడి అభిషేక్ ఔటయ్యాడు.అమెరికాతో మ్యాచ్ తర్వాత అభిషేక్ కడుపు ఇన్ఫెక్షన్ గురయ్యాడు. దీంతో నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే పూర్తి ఫిట్నెస్ పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. దాయాది జట్టుకు అభిషేక్ చుక్కలు చూపిస్తాడు అని భారత అభిమానులు భావించారు.కానీ ఈ పంజాబీ బ్యాటర్ తన చెత్త బ్యాటింగ్తో అందరిని నిరాశపరిచాడు. ఈ మ్యాచ్కు ముందు అభిషేక్ను ఉద్దేశించి పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ త్వరగా కోలుకోవాలని, మ్యాచ్లో ఆడాలని కోరుకుంటున్నట్లు సల్మాన్ పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టే తొలి ఓవర్ వేసిన సల్మాన్.. అభిషేక్పై పైచేయి సాధించాడు. దీంతో అభిషేక్ను ఔట్ చేసిన అనంతరం సల్మాన్ సంబరాల్లో మునిగితేలిపోయాడు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రాపాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్ -
గూగుల్ పే, ఫోన్పే ట్రాన్సాక్షన్.. రూ.1000 దాటితే ఫీజులా?
దేశంలో యూపీఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజూ లెక్కకు మించిన నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రూ. 1000 కంటే ఎక్కువ మొత్తం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.రూ.1000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే.. సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖండించింది. ప్రస్తుతం వ్యక్తుల మధ్య లేదా వ్యక్తులు - వ్యాపారాలు మధ్య జరిగే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించింది. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని దెబ్బతీసే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. 2026–27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం UPI & RuPay డెబిట్ కార్డ్ లావాదేవీలకు మద్దతు ఇవ్వడానికి రూ. 2,000 కోట్లు కేటాయించింది. చిరు వ్యాపారులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) భారం పడకుండా ఉండటానికి ఈ నిధులను కేటాయించనున్నారు. దీని ద్వారానే బ్యాంకులకు, పేమెంట్ అగ్రిగేటర్లకు ప్రోత్సాహకాలు ఇస్తోంది.ఇదీ చదవండి: ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?ప్రస్తుతం భారతదేశంలో చాలావరకు యూపీఐ లావాదేవీలే జరుగుతున్నాయి. నేడు చిన్న బట్టి కొట్టు నుంచి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వరకు దాదాపు అందరూ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రోజుకు ఒక లక్ష రూపాయల వరకు పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. బిజినెస్ అకౌంట్ అయితే రోజుకి రూ. 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. -
బంగ్లాదేశ్కు లోక్సభ స్పీకర్.. రీజన్ అదే..!
బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకార వేడుకకు భారత్ హాజరుకానుంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇండియా తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు విదేశాంగశాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ హాజరుకానున్నారు.ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా బీఎన్పీ చీఫ్ తారిఖ్ రహ్మాన్ బాధ్యతలు తీసుకోనున్నారు. మంగళవారం అక్కడి పార్లమెంటులోని సౌత్ప్లాజాలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, మన దేశంలో సహా 13 దేశాలకు ఆహ్వానం పంపింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు భారత్ ప్రకటించింది.ఈ మేరకు భారత విదేశాంగశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో "బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి గౌరవనీయులైన లోక్సభ స్పీకర్ హాజరుకావడం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేస్తుంది." అని తెలిపింది. అయితే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆ దేశంలో రెండు దశాబ్ధాల తర్వాత తిరిగి అధికారం సాధించింది. 297 స్థానాల్లో జరిగిన ఎన్నికలు జరుగగా 209 సీట్లు సాధించింది.అయితే బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడుల దృష్ట్యా భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల బీఎన్పీ నేత మాజీ ప్రధాని ఖలీదా జియా మరణించినప్పుడు సైతం భారత్ సంఘీభావం ప్రకటించింది. ఆమె అంతిమ యాత్రకు భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. అయితే బీఎన్పీ విజయం సాధించిన తర్వాత కూడా ప్రధాని మోదీ బీఎన్పీ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు. అందుకు ఆ పార్టీ సైతం ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది.అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ దేశంలోని మైనార్టీలపై దాడులు చేసి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్తో సత్సంబంధాల దిశగా ప్రయత్నిస్తుంది. -
‘పాకిస్తాన్ మనకు శత్రువే.. అది క్రికెటైనా, ఇంకేదైనా..’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ సుఖిందర్ సింగ్ రంధావా. పాకిస్తాన్తో టీ20 వరల్డ్కప్లో భారత్ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటూ అభివర్ణించారు. ఇది భారత్-పాకిస్తాన్ల మ్యాచ్ కాదని, కేవలం జై షా-పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్ మాత్రమేనన్నారు. యావత్ భారతావని.. పాకిస్తాన్తో సంబంధాలను వద్దనుకుంటుంటే, వారితో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. ‘ పాకిస్తాన్ అనేది మనకు దాయాది దేశం. వారిని శత్రువులుగానే చూడాలి. వారితో ఎటువంటి సంబంధాలు ఉండొద్దు. సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు పాకిస్తాన్ దుశ్చర్యలు బాగా తెలుసని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది భారతావని కోరుకునే మ్యాచ్ మాత్రం కాదు. జై షా-పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ మాత్రమే. భారతీయులు ఎవరూ పాక్తో మ్యాచ్ను కోరుకోవడం లేదు. ఐసీసీ చీఫ్గా ఉన్న జై షా ప్రోద్బలంతోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత్కు రెండో నరేంద్ర మోదీగా పేర్కొంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షానే.. పాకిస్తాన్తో మ్యాచ్ జరగడానికి కారణమయ్యాడు’ అంటూ విమర్శించారు.#WATCH | Jaipur, Rajasthan: On India vs Pakistan #ICCT20WorldCup, Congress MP Sukhjinder Singh Randhawa says, "... Pakistan is the enemy of our country, and it should be treated like that only. We have no dealings with them. Those who are on the border know how Pakistan is… pic.twitter.com/3FlPP06UIX— ANI (@ANI) February 15, 2026 -
రూ.10 కోట్లు పెట్టినా రాదు: మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలే. వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) నాడు మృణాల్.. హీరో ధనుష్ను పెళ్లాడబోతుందని తెగ ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు వాలంటైన్స్ డేరోజు చడీచప్పుడు లేకపోయేసరికి ఇదంతా గాలిప్రచారమే అని తేలిపోయింది.లైఫ్లో సెటిలవాలిప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన దో దీవానే షెహర్ మే సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ యాంకర్.. పెళ్లి గురించి ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా మృణాల్ ఇలా స్పందించింది. మా ఇంట్లో వాళ్లు ముందు లైఫ్లో సెటిలవమంటున్నారు. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లోవాళ్లకు తెలుసు.సన్యాసి జీవితమే..యాక్టర్గా ఉండటం అంటే సన్యాసిగా ఉండటంలాంటిదే! తిండి, నిద్ర.. ఇలా అన్నింటినీ వదులుకోవాలి. ఎప్పుడూ ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. కాకపోతే నా ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ఒక టీమ్ పని చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు నా సేఫ్టీ కోసం ఇంకో టీమ్ ఉంది. కానీ నాపై రూమర్స్ నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. అందులో డౌటే లేదురూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. కాకపోతే నా జీవితంలో ఏది జరిగినా అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అందులో డౌటే లేదు. నాపై వచ్చే రూమర్స్ను పట్టించుకుంటూ పోతే కెరీర్పై ఫోకస్ చేయలేను అని మృణాల్ చెప్పుకొచ్చింది. 'దో దీవానే షెహర్మే' మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.చదవండి: మెగా ఫ్యామిలీకి తొలి పెళ్లి పత్రిక.. చిరంజీవికి ఏమైంది? -
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా) -
T20 WC 2026: యూఎస్ఏకు మరో విజయం.. అదే జరిగితే పాక్ ఇంటికే..!
టీ20 ప్రపంచకప్ 2026లో యూఎస్ఏ మరో విజయం సాధించింది. ఇప్పటికే నెదర్లాండ్స్పై గెలుపొందిన అమెరికా.. తాజాగా (ఫిబ్రవరి 15) నమీబియాను కూడా మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. యూఎస్ఏకు సూపర్-8కు చేరే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ.. ఈ రెండు విజయాలు భారీ ఊరట కలిగిస్తాయి. ఎందుకంటే ఈ జట్టు ఆడుతున్నది రెండో ప్రపంచకప్పే అయినా, పలు చిరస్మరణీయ విజయాలు సాధించి, చిన్న జట్లలో మేటి జట్టుగా పేరు తెచ్చుకుంది. తమ కంటే ముందు నుంచే ప్రపంచకప్ ఆడుతున్న నెదర్లాండ్స్, నమీబియా లాంటి జట్లను ఓడించడం యూఎస్ఏను ప్రత్యేకంగా నిలుపుతుంది. గత ఎడిషన్లో (2024) ఈ జట్టు, వారి కంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్ను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎడిషన్లోనూ యూఎస్ఏ నుంచి ఆ స్థాయి ప్రదర్శన ఆశించినప్పటికీ వీలు పడలేదు. అయితే పాక్తో పాటు భారత్కు కూడా టఫ్ ఫైట్ ఇచ్చి అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ ఎడిషన్లోనూ యూఎస్ఏకు సూపర్-8కు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. పాక్.. భారత్, నమీబియా చేతుల్లో ఓడితే యూఎస్ఏకు సూపర్-8 బెర్త్ దక్కే అవకాశం ఉంది. ఇది జరిగితే పాక్, యూఎస్ఏ ఖాతాల్లో తలో నాలుగు పాయింట్లు ఉంటాయి. అప్పుడు పాక్ కంటే మెరుగైన రన్రేట్ కలిగి ఉంటే, యూఎస్ఏ సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ఇలా జరగడం కష్టమైనా, అవకాశాలను మాత్రం తీసి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే భారత్, నమీబియాకు పాక్ను ఓడించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. నమీబియాకు గతంలో వారి కంటే మెరుగైన జట్లకు షాకిచ్చిన అనుభవం ఉంది. ఇది మరోసారి రిపీటైతే మాత్రం యూఎస్ఏ సూపర్-8కు, పాక్ ఇంటికి చేరతాయి.యూఎస్ఏ-నమీబియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో యూఎస్ఏ 31 పరుగుల తేఆతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (199-4) చేసిన యూఎస్ఏ.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. యూఎస్ఏ తరఫున బ్యాటింగ్లో కెప్టెన్ మోనాంక్ పటేల్ (52), సంజయ్ కృష్ణమూర్తి (68 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో మైబుర్గ్, కెప్టెన్ ఎరాస్మస్ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం నమీబియా యూఎస్ఏ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఎస్ఏ బౌలర్లు నమీబియా బ్యాటర్లను కట్టడి చేశారు. స్కాల్విక్ 2, శుభమ్ రంజనే, నేత్రావల్కర్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు. నమీబియా ఇన్నింగ్స్లో ఓపెనర్ స్టీన్కాంప్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. -
పాకిస్తాన్పై భారత్ ఘన విజయం
India vs pakistan Match live Updates: పాకిస్తాన్పై భారత్ ఘన విజయంకొలంబో వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. భారత బౌలర్ల దాటికి 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(44) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలా రెండు వికెట్లు సాధించారు. 👉16వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో పాక్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 17 ఓవర్లకు పాక్ స్కోర్: 109/7విజయానికి చేరువలో భారత్79 పరుగుల వద్ద పాక్ ఏడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన షాదాబ్ ఖాన్ తిలక్ వర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.పీకల్లోతు కష్టాల్లో పాక్78 పరుగుల వద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.👉ఉస్మాన్ ఖాన్(44) రూపంలో పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది.ఉస్మాన్ ఖాన్ దూకుడు..9 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ 40 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు.పాక్ నాలుగో వికెట్ డౌన్34 పరుగుల వద్ద పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన బాబర్ ఆజం.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 6 ఓవర్లకు పాక్ స్కోర్: 38/4పాక్ మూడో వికెట్ డౌన్13 పరుగుల వద్ద పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సల్మాన్ అలీ అఘా.. బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.పాకిస్తాన్కు భారీ షాక్176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు తొలి ఓవర్లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సాహిబ్జాదా ఫర్హాన్ డకౌటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్లో సైమ్ అయూబ్(6) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 6 పరుగులకే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది.పాక్ టార్గెట్ ఎంతంటే?కొలంబో వేదికగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. 40 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ అఘా, ఉస్మాన్ తరీఖ్, అఫ్రిది తలా వికెట్ సాధించారు.సూర్య కుమార్ ఔట్159 పరుగుల వద్ద కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ను టీమిండియా కోల్పోయింది. 32 పరుగులు చేసిన సూర్య.. ఉస్మాన్ తరీఖ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 159/5ఒకే ఓవర్లో రెండు వికెట్లుటీమిండియా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్ వేసిన సైమ్ అయూబ్ బౌలింగ్లో తిలక్ వర్మ(25) రెండో బంతికి వికెట్లు ముందు దొరికిపోగా.. నాలుగో బంతికి హార్దిక్ పాండ్యా డకౌట్గా వెనుదిరిగాడు.నిలకడగా ఆడుతున్న సూర్య, తిలక్ఇషాన్ కిషన్ ఔటైన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(25) ఆచితూచి ఆడుతున్నారు. 14 ఓవర్లకు భారత్ స్కోర్: 125/2ఇషాన్ కిషన్ ఔట్ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్కు తెరపడింది. 40 బంతుల్లో 77 పరుగులు చేసిన కిషన్.. సైమ్ అయూబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 9 ఓవర్లకు భారత్ స్కోర్: 89/2చెలరేగి ఆడుతున్న ఇషాన్పాక్తో మ్యాచ్లో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడుతున్నాడు. కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇషాన్ 72 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 8 ఓవర్లకు భారత్ స్కోర్: 82/1దూకుడుగా ఆడుతున్న ఇషాన్5 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. అభిషేక్ తొలి ఓవర్లోనే వెనుదిరిగినప్పటికి కిషన్ మాత్రం(36) దూకుడుగా ఆడుతున్నాడు.అభిషేక్ శర్మ డకౌట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. సల్మాన్ అలీ బౌలింగ్లో షాహిన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఇషాన్ కిషన్(12) మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 16/1బౌలింగ్ ఎంచుకున్న పాక్కొలంబో వేదికగా భారత్తో జరుగుతున్న గ్రూపు-ఎ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ బ్లాక్బాస్టర్ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో సంజూ శాంసన్పై వేటు పడింది. అదేవిధంగా అర్ష్దీప్ సింగ్ స్ధానంలో కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కింది. పాక్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రాపాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్కాసేపటిలో టాస్టీ20 ప్రపంచకప్-2026లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మెగా పోరుకు సర్వం సిద్దమైంది. మరి కాసేపటిలో కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ షూరూ కానుంది. ఇప్పటికే మైదానానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు వార్మాప్ అవుతున్నారు. -
జగిత్యాల ఎపిసోడ్కు ఫుల్స్టాప్..!
హైదరాబాద్: జగిత్యాల మున్సిపల్ పీఠంపై నెలకొన్న సందిగ్థతకు ఫుల్స్టాప్ పడినట్ల కనిపిస్తోంది. జగిత్యాల మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికే ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జీవన్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లతో సంధి కుదిర్చిన తర్వాత పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వీరిద్దరితో మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ చర్చలు జరపగా, అవి ఫలించాయనేది ప్రాథమిక సమాచారం. ఇరు వర్గాలకు నేతలు నచ్చచెప్పడంతో వారు మెట్టుదిగి వచ్చారని, ఈ క్రమంలోనే జెండా మోసిన వ్యక్తికు చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిలో భాగంగా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఇరు వర్గాల నేతలకు నచ్చచెప్పారు.ఈ చైర్మన్ పీఠంపై జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు చెరో వర్గంగా విడిపోయారు వార తమ పంతాన్ని నెగ్గించుకోవాలని పట్టుబట్టుకుని కూర్చున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికి మేయర్ పీఠం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది అధి నాయకత్వం. ప్రత్యేకంగా ఎమ్మెల్యే సంజయ్ను ప్రజాభవన్కు పిలుపించుకుని మరీ చర్చలు జరిపారు. ఇది ఫలించడంతో జగిత్యాల ఎపిసోడ్కు దాదాపు ముగింపు పడినట్లే కనబడుతోంది. -
భారత్-పాక్ హైవోల్టేజీ మ్యాచ్.. చరిత్ర ఏం చెబుతుందంటే..?
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడూ మహాసంగ్రామాలను తలపిస్తాయి. ప్రత్యేకించి ప్రపంచకప్లో ఈ రెండు జట్ల పోరాటాలు అంతకుమించిన అనుభూతిని కలిగిస్తాయి. మరీ ప్రత్యేకించి, టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల పోటీ ప్రళయ వాతావరణాన్ని సూచిస్తుంది.గెలుపోటములు ఎలా ఉన్నా, మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే ఇరు దేశాల అభిమానుల మధ్య వార్ మొదలవుతుంది. ఈ పరిస్థితి దాయాదుల సమరానికి మరింత హైప్ తెచ్చిపెడుతుంది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, అభిమానుల భావోద్వేగాలు ఈ మ్యాచ్లను మరింత ప్రత్యేకం చేస్తాయి. ఈ హైప్ భారత్, పాక్ అభిమానులనే కాక, విశ్వవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.భారీ అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు ఉండేవి. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయానికి నిరసనగా పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్ తిరిగి కార్యరూపం దాల్చడం ఈ మ్యాచ్ హైప్ను పీక్స్కు చేర్చింది. ఈ భారీ అంచనాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ హెడ్ టు హెడ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో భారత్కు పాక్పై స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్ ఏకంగా ఏడు సార్లు జయకేతనం ఎగురవేసింది. పాక్ ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే గెలుపొందింది. టీమిండియా ఇవాళ జరుగబోయే మ్యాచ్లోనూ గెలిచి పొట్టి ప్రపంచకప్లో తమ రికార్డును (8-1 మరింత మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది.భారత జట్టు ప్రస్తుతమున్న ఫామ్ను బట్టి చూస్తే, ఇది అంత కష్టమేమీ కాకపోవచ్చు. గత కొంతకాలంగా టీమిండియా పొట్టి ఫార్మాట్లో తిరుగులేని విజయాలు సాధిస్తూ నంబర్ వన్ స్థానంలో ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు భీకర ఫామ్లో ఉన్నారు. ప్రస్తుత పాక్ జట్టును టీమిండియా ఆడుతూపాడుతూ చిత్తు చేయవచ్చు. అలాగని ఉదాసీనంగా వ్యవహరిస్తే, 2021 ఎడిషన్లో ఎదురైన పరాభవం పునరావృతమయేక్య ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి టీమిండియా చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే లాజిక్ను అమలు చేస్తే బాగుంటుంది. మరో గంటలో (రాత్రి 7 గంటలకు) ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటి నుంచే టీవీలకు అతుక్కుపోయారు.వరుణుడి భయంఓ పక్క అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్ని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు.ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్, పాక్కు చెరో పాయింట్ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్ సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన భారత్-పాక్ సమరాలు..తొలి ఘట్టం – 2007 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో భారత్-పాక్ రెండు సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ టై అయ్యింది, కానీ బౌలౌట్లో భారత్ గెలిచింది. అదే టోర్నమెంట్ ఫైనల్లో మళ్లీ తలపడగా, ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. ఇది భారత్-పాక్ టీ20 వరల్డ్కప్ పోరాటాలకు ఆరంభం. భారత్ ఆధిపత్యం అనంతరం 2012, 2014, 2016 వరల్డ్కప్లలో భారత్ వరుస విజయాలు సాధించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు అద్భుత ప్రదర్శనలతో భారత్ పాక్పై ఆధిపత్యం కొనసాగించింది. పాక్ చరిత్రాత్మక విజయం – 2021 దుబాయ్లో జరిగిన 2021 వరల్డ్కప్లో పాక్ భారత్ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది పాక్కి వరల్డ్కప్ చరిత్రలో భారత్పై తొలి విజయం. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అద్భుత బ్యాటింగ్తో ఆ మ్యాచ్ పాక్ అభిమానులకు మరపురాని జ్ఞాపకం అయ్యింది. తిరిగి భారత్ ఆధిపత్యం 2022, 2024 వరల్డ్కప్లలో భారత్ మళ్లీ పాక్ను ఓడించింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఈ గెలుపుల్లో కీలక పాత్ర పోషించారు. -
నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్.. కుదిరిన పొత్తు..!
సాక్షి నిజామాబాద్ : నిజామాబాద్ మేయర్ పీఠంపై చిక్కుముడి వీడింది. కాంగ్రెస్కు మేయర్ పదవి, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవి షేర్ చేసుకునేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. నగరపాలక సంస్థకు మెుత్తం 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్కు ఒక స్థానం లభించింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.అయితే ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో నిజామాబాద్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఇందూరులో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. బీజేపీ అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ మేయర్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో కాంగ్రెస్ పావులు కదిపింది. అయితే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఉన్న కాటిపల్లి శమంత 19వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకిలోనే మరికొందరు మేయర్ స్థానానికి పోటీపడుతున్నారు. 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ నుంచి గెలిచిన కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్ నుంచి గెలిచిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్ నుంచి గెలిచిన దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్ నుంచి గెలిచిన కేతావత్ సురేఖలు మేయర్ రేసులో ఉన్నారు. మొత్తం ఐదుగురు మహిళలు పోటీలో ఉండగా నలుగురు బీసీలు, ఒకరు ఎస్టీ ఉన్నాట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇక్కడ హంగ్ వచ్చింది. ఈ కార్పొరేషన్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరి్వంద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నా రు. దీంతో బీజేపీకి మూడు, కాంగ్రెస్కు రెండు ఓట్లు పెరిగినట్లైంది. బీఆర్ఎస్ అభ్యరి్థ ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్–ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేయర్ పీఠం చేజిక్కించుకుంది. -
బ్యాంకులకు వరుస సెలవులు!
దేశంలోని వివిధ ప్రాంతాలలోని.. బ్యాంకు శాఖలు వచ్చే వారం మూడు రోజులు క్లోజ్లో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 18, 19, 20 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.ఫిబ్రవరి 18 (బుధవారం): టిబెటన్ నూతన సంవత్సరమైన లోసర్ను జరుపుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు. ఫిబ్రవరి 19 (గురువారం): ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు.ఫిబ్రవరి 20 (శుక్రవారం): రాష్ట్ర దినోత్సవం/రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణాచల్ ప్రదేశ్ & మిజోరాంలలో బ్యాంకులకు సెలవు.అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
అదరగొట్టిన అరుంధతి.. ఆసీస్పై భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్పై డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల దాటికి 18 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది.కంగారూ జట్టు బ్యాటర్లలో జార్జియా వేర్హామ్(30) టాప్ స్కోరర్గా నిలవగా, లిచ్ఫీల్డ్(26), పెర్రీ(20) రాణించారు. భారత పేసర్ అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించింది. అరుధతితో పాటు మరో తెలుగు అమ్మాయి శ్రీ చరణి, పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు సాధించారు.అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ షఫాలీ వర్మ తన మెరుపు బ్యాటింగ్తో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. షఫాలీ కేవలం 11 బంతుల్లోనే 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి ఔటైంది. అయితే భారత్ స్కోర్ 50/1 (5.1 ఓవర్లలో) వద్ద ఉండగా వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. ఆట నిలిచిపోయే సమయానికి 21 పరుగులు ముందుంజలో ఉండడంతో భారత్ను విజేతగా నిర్ణయించారు. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి హర్మన్ సేన దూసుకెళ్లింది. రెండో టీ20 కాన్బెర్రా వేదికగా ఫిబ్రవరి 19న జరగనుంది. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ప్రతి వీకెండ్ ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలా మన శంకరవరప్రసాద్, అనగనగా ఒక రాజు, వనవీర తదితర తెలుగు మూవీస్ స్ట్రీమింగ్లోకి వచ్చాయి. అలానే తలైవర్ తంబి తలైమయిల్, ద కంజూరింగ్, బ్యాండ్ వాలే లాంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా డిజిటల్ ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైపోయాయి. పెద్దగా హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇంతకీ అవేంటి? వేటిలో ఉన్నాయి?సాయిచరణ్, ఉషశ్రీ హీరోహీరోయిన్లుగా చేసిన తెలుగు సినిమా 'ఇట్స్ ఓకే గురు'. గత డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు కాకపోవడంతో ఇదెప్పుడు వచ్చివెళ్లిందనే విషయం కూడా తెలీదు. ఇప్పడీ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్న ఓ వ్యక్తి.. జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎలా వెళ్లాడు? ఈ ఎదుగులలో ప్రేమ ఎలాంటి పాత్ర పోషించింది అనేదే మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)ఇక డిసెంబరులోనే థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'పతంగ్'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఆహా లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ అంతా పతంగుల పోటీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ప్రేమకథ సినిమాలు ఏమైనా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా పర్లేదు బాగానే ఉందనిపించేలా ఉంటుంది.గతేడాది తమిళంలో వచ్చిన హిట్ అయిన సినిమా 'గెవి'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి కూడా వచ్చేసింది. అటవీ ప్రాంతంలోని ఓ ఊరిలో కొండచరియలు విరిగిపడటం, సరైన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. దీంతో అక్కడి ప్రజలు.. పోలీసులు, రాజకీయ నాయకులపై తిరగబడతారు. ఉద్యమం చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. షీలా, జాక్విలిన్ లిడియా ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. దయాలన్ దర్శకుడు.(ఇదీ చదవండి: సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం) -
కరీంనగర్ మేయర్పై వీడిన సస్పెన్స్?.. చక్రం తిప్పిన నేతలు
సాక్షి, కరీంనగర్: నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలో సంచలనం జరగుబోతుందా అంటే దాదాపు అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరీంనగర్ మేయర్ స్థానం చేజిక్కించుకోవడం కోసం సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీనికోసం తమ ప్రధాన ప్రత్యర్థైన బీఆర్ఎస్ కార్పోరేటర్ల మద్ధతు మంత్రి కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో సహా పలువురు ఇండిపెండెంట్ల తో కలిసి మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మెుత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు కోఆఫ్షన్ మెంబర్స్తో కలిసి మెుత్తం ఆసంఖ్య 69 స్థానాలకు చేరుకుంది. అయితే మేయర్ పీఠానికి మ్యాజిక్ ఫిగర్ 35 స్థానాలు. ఇందులో బీజేపీ 30 స్థానాలు గెలువగా, కాంగ్రెస్ 14 సీట్లు సాధించింది. దీంతో బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ అందుకునేలా ప్లాన్ వేసింది. దీనికి గానూ ఒక్కో కార్పోరేటర్ సీటుకు రూ.1.5 కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకూ బేరసారాలు జరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా మేయర్ పదవికోసం కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు ఆశావాహులుగా ఉండగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేయర్ పీఠం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు డిప్యూటీ మేయర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపు ఫిబ్రవరి 16న జరగనుంది. దీంతో మేయర్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి:ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’ -
ఆసీస్ గడ్డపై జూలు విదిల్చిన టీమిండియా.. తొలి టీ20లో ఘన విజయం
2026 ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి టీ20లో టీమిండియా 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ వద్దతిలో) గెలుపొందింది.ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు జూలు విదిల్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చారు. పేసర్లు రేణుకా సింగ్ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ప్లేయర్ల భరతం పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.ఆసీస్ ఇన్నింగ్స్లో జార్జియా వేర్హమ్ (30) టాప్ స్కోరర్ కాగా.. ఫోబ్ లిచ్ఫీల్డ్ (26), ఎల్లిస్ పెర్రీ (20), జార్జియా వాల్ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్ మూనీ (5), ఆష్లే గార్డ్నర్ (4), అన్నాబెల్ సదర్ల్యాండ్ (3), కిమ్ గార్త్ (2), డార్సీ బ్రౌన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్ సోఫీ మోలినెక్స్ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.అనంతరం భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో వరుణుడు పలు మార్పులు ఆటంకం కలిగించాడు. జట్టు స్కోర్ 50-1 (5.1 ఓవర్లలో) వద్ద ఉండగా.. భారీ వర్షం ప్రారంభమై, ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన భారత్ను విజేతగా ప్రకటించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ (11 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) సహజ శైలిలో విరుచుకుపడింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి స్మృతి మంధన (16), జెమీమా రోడ్రిగ్స్ (9) క్రీజ్లో ఉన్నారు. షఫాలీ వికెట్ మోలినెక్స్కు దక్కింది. ఈ సిరీస్లో రెండో టీ20 ఫిబ్రవరి 19న కాన్బెర్రా వేదికగా జరుగనుంది. -
మెగా ఫ్యామిలీకే తొలి శుభలేఖ.. చిరంజీవికి ఏమైంది?
అల్లు ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్.. నయనిక మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మార్చి 6న ఈ వివాహ కార్యక్రమం జరగనుంది. శిరీష్ అన్నవదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కూడా ఇదే కావడం విశేషం!పత్రికల పంపిణీఇప్పటికే దుబాయ్లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. రెండు రోజుల క్రితం పసుపు దంచే కార్యక్రమం జరిగింది. తాజాగా పెళ్లిపత్రికల పంపిణీని మొదలుపెట్టారు. మొదటి పత్రికను చిరంజీవి- సురేఖ దంపతులకు ఇచ్చారు. ఆ ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మెగాస్టార్కు గాయం?మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాం అంటూ ఫోటో షేర్ చేశాడు. అందులో చిరంజీవి దంపతులతో పాటు అల్లు అరవింద్- నిర్మల, శిరీష్ ఉన్నారు. అయితే ఫోటోలో మెగాస్టార్ షోల్డర్ బ్యాగ్ వేసుకుని కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైంది? సర్జరీ జరిగిందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.చదవండి: తిట్ల దండకం ఆపలేదు.. లాగిపెట్టి కొట్టా: బాలీవుడ్ హీరో -
ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?
కొన్ని రోజులకు ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. రేట్లు పెరుగుతున్నప్పుడు.. ఏ ధరకైనా కొనేయాలని ఎగబడిన కొంతమంది జనం.. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా అని వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తున్నారని ప్రముఖ ఇన్వెస్టర్, మార్కెట్ మాస్ట్రోలో డైరెక్టర్ 'అంకిత్ యాదవ్' తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.ధరలు పెరిగినప్పుడు ఉత్సాహం చూపించారని, రేటు తగ్గుతున్నప్పుడు ప్రజలు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఇది మార్కెట్లో సహజమైన అంశం. అయితే ఇది పూర్తి స్థాయి క్రాష్ అని నిర్దారించలేము. ఇదొక స్లోడౌన్ దశ మాత్రమే.వెండి ధర భవిష్యత్తులో 100 డాలర్లు లేదా 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రధాన కారణమవుతాయి.ప్రపంచం మొత్తం.. ప్రస్తుతం భారీ రుణభారంతో ఉంది. ముఖ్యంగా అమెరికా అప్పులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్కు (Fed) అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో వారు ఎక్కువ లిక్విడిటీ అందించడం, అంటే మరింత డబ్బు ముద్రించడానికి సిద్దపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంటుంది.డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే బంగారం లేదా వెండి కలిగి ఉన్నవాళ్లు దాన్ని నిల్వ చేసుకోండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కొత్తగా గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటే.. తప్పకుండా ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ధరలు చౌకగా లేవు. ఎప్పుడైనా ఎక్కువ ధర వద్ద పెట్టుబడి పెట్టడం వల్ల మూలధన నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి త్వరగా ధనవంతులు కావాలని తొందరపడకూడదు. కొంత ఓపిగ్గా ఎదురు చూడండి అని.. అంకిత్ యాదవ్ వివరించారు.🚨 Big update: Gold & Silver 🩶💛✅Globally, gold and silver are slowly coming out of the high‑volatility phase. The craze to buy silver at any price is clearly cooling off – one small slowdown or mini‑crash and people’s attention has already shifted.While prices were rising…— Ankit Yadav (@ankit_investing) February 14, 2026 -
మా బౌలర్ను చూసి టీమిండియా భయపడుతోంది: పాక్ మాజీ కెప్టెన్
క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ హాట్ టాపిక్గా నిలిచాడు.అతడి బౌలింగ్ శైలి భిన్నంగా అందుకు కారణం. బౌలింగ్ చేసే సమయంలో కొన్ని సెకన్లు ఆగి బంతిని విడుదల చేయడం అతడి స్పెషాలిటి. ఇప్పటివరకు భారత బ్యాటర్లు ఒక్కరు కూడా అతడి బౌలింగ్ను ఒక్కసారి కూడా ఎదుర్కొలేదు. దీంతో ఈ వరల్డ్కప్ మ్యాచ్లో అతడిని భారత బ్యాటర్లు ఎలా ఆడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఉస్మాన్ కోసం టీమిండియా బ్యాటర్లు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే తారిక్ భారత్పై పైచేయి సాధించాడని హఫీజ్ అన్నాడు."ఉస్మాన్ తారిక్ ఇప్పటికే భారత్పై సైకిలాజికల్గా విజయం సాధించాడు. ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం, బాబర్ అజామ్ లేదా మరెవరి గురించి ఎవరూ చర్చించడం లేదు. మీడియా, ఫ్యాన్స్ అంతా తారిఖ్ గురించే మాట్లాడుతున్నారు. భారత డ్రెస్సింగ్ రూమ్లో కూడా తారిఖ్ పట్ల ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.అతడు పాకిస్తాన్ తరపున నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయినప్పటికి అతడిని ఎదుర్కొవడానికి భారత్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ను కెప్టెన్ సల్మాన్ అఘా ఎలా ఉపయోగిస్తాడో చూడాలనుకుంటున్నాను. అతడిని 6వ ఓవర్లోనే రంగంలోకి దించితే బ్యాటర్లను కట్టడి చేయవచ్చు" అని తప్మాడ్ అనే ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్ పేర్కొన్నాడు. -
T20 WC 2026: పాక్తో మ్యాచ్.. టీమిండియాలో రెండు మార్పులు..?
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరుగనుంది. కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొని ఉండేవి. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్ తిరిగి కార్యరూపం దాల్చడం ఈ మ్యాచ్ హైప్ను మరింత పెంచింది. ఓ పక్క క్రికెట్ అభిమానులు ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్, పాక్కు చెరో పాయింట్ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్ను సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు (8-1).ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. కడుపు నొప్పితో బాధపడుతూ, నమీబియాతో జరిగిన మ్యాచ్కు దూరంగా ఉన్న అభిషేక్ శర్మ జట్టులో తిరిగి రానున్నాడని సమాచారం. అభిషేక్ రాకతో సంజూ శాంసన్ తిరిగి బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. ప్రేమదాస స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందన్న సమాచారం ఉండటంతో ఈ మ్యాచ్లో భారత్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అప్పుడు అర్షదీప్ సింగ్పై వేటు పడవచ్చు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తాడు. ఈ రెండు మార్పులు మినహా మిగతా జట్టు యధాతథంగా కొనసాగుతుంది.అభిషేక్, ఇషాన్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. వన్డౌన్లో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్, ఐదో ప్లేస్లో హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంలో శివమ్ దూబే, ఏడో ప్లేస్లో రింకూ సింగ్, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, ఏకైక స్పెషలిస్ట్ పేసర్గా బుమ్రా బరిలోకి దిగవచ్చు. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. -
91 ఏళ్ల వయసులో ఇంత ఫిట్గానా..!
ఏడుపదుల వయసుకు చేరుకోగానే ఎంతటి ఫిట్నెస్ కోచ్లు అయినా లేదా క్రమం తప్రకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహ ఉన్నా కూడా..యువకుల మాదిరిగా చురుకుగా ఫిట్గా ఉండటం కష్టమే. కానీ ఈ బామ్మ తొమ్మిది పదుల వయసులో యువతే విస్తుపోయాలే యాక్టివ్గా ఉండటమే కాదు..ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేస్తూ భళా అనిపించుకుంటోంది. ఎవరా ఆ సూపర్ బామ్మ అంటే..ఆ బామ్మే ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల జిల్. ఆమె కఠినమైన క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పేరుగాంచింది. ఆమె రోజుకు సగటున 12 వేల అడుగులు నడుస్తుందట. అంతేగాదు తరుచుగా సిడ్నీ హార్బర్ వంతెన మీదుగా ఒపెరా హౌస్కు వెళ్లే ఐకానిక్ ట్రెక్కు వెళ్తుందట. ఇది నిటారుగా ఉన్న కొండలు, అంతులేని మెట్లకు ప్రసిద్ధి చెందిన మార్గం. అలాగే వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, బలాన్ని కాపాడుకునేలా యోగ, పైలేట్స్ వంటి సెషన్లు తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. అలాగే అందరితోనూ సన్నిహితంగా ఉండేలా టచ్లో ఉంటానని, అది శారీరక వ్యాయామం వలే మనసుకోక ఆహ్లాదకరమైన వ్యాయామం అని అంటోంది. అంతేగాదు ఈ జిల్ బామ్మ దీర్ఘాయువు కోసం చురుగ్గా ఉండటమే మంచిదనేది తన అభిప్రాయామని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోని ఫిట్నెస్ కోచ్ థెరిసా మోలోనీ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. కాగా, శారీరక వ్యాయామం వలే దీర్ఘాయవు కోసం సామాజిక అనుసంధానం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నాయి అధ్యయనాలు. పైగా చురుకైన జీవనశైలి మంచి మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమను స్థిరంగా ఉంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది కూడా. నిజంగా ఈ బామ్మ సూపరో సూపర్ కదూ..!. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!) -
ఇరాన్, అమెరికా టెన్షన్.. మంత్రి కీలక వ్యాఖ్యలు
అమెరికా- ఇరాన్ అణుచర్చల విషయంపై ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అణుచర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే ఆ విషయంలో బంతి ఇంకా అమెరికా కోర్టులోనే ఉందని అంతర్జాతీయ మీడియాకు తెలిపారు.ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అణుచర్చల విషయంలో తగ్గకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో పాటు ఇరాన్ సైతం వెనక్కితగ్గేలా కనిపించకపోవడంతో ఏం జరుగుతుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ ఉప ముఖ్యమంత్రి మజీద్ తాక్త్ రావంచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. బంతి ఇంకా అమెరికా కోర్టులోనే ఉందని తెలిపారు. విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ" అణు కార్యక్రమంపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే అమెరికా దానికి సంబంధించిన ఆంక్షల విషయంపై చర్చ జరపాలి. ఆ చర్చలు టేబుల్పై ఉండాలి. అదే విధంగా తన వంతు బాధ్యతను నిర్వర్తించకుండానే కొన్ని పనులు చేయాలనే భావనను ఎవరూ అంగీకరించరు" అని ఆయన అన్నారు.అయితే ఈ అంశంపై ఫిబ్రవరి 6న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరఘ్ఛి అమెరికా రాయభారి స్టీవ్ విట్కాఫ్ చర్చలు జరిపారు. ఈ చర్చలు పరోక్షంగా జరిగాయి, దీనికి ఒమన్లు మధ్యవర్తులుగా వ్యవహరించారు. కాగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా భారీ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్’ తోపాటు మరికొన్ని యుద్ధ నౌకలను మధ్య ప్రాచ్యానికి తరలిస్తోంది. ఇప్పటికే ‘యూఎస్ఎస్ అబ్రహాం లింకన్’ నౌకను అరేబియా సముద్రంలో మోహరించింది. ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్’ ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమానాల వాహక నౌకగా పేరుగాంచింది. -
తిట్లదండకం ఆపలేదు.. కోపంతో లాగిపెట్టి కొట్టా: హీరో
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.. ప్రత్యర్థులను మట్టి కరిపించడంలోనే కాదు, వారిపై పంచులు విసరడంలోనూ దిట్ట! ఇతడు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ షోలోని లేటెస్ట్ ఎపిసోడ్కు షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 5 జడ్జిలు హాజరయ్యారు. వారిలో ఒకరైన అమన్ గుప్తా.. మీరు జీవితంలో బాగా ఇబ్బందిపడ్డ సంఘటన ఏది? అని అడిగాడు.ఎంత చెప్పినా వినడే..అందుకు అక్షయ్ ఏదైనా ఫన్నీ సంఘటన చెప్తాడనుకుంటే ఏకంగా ఒకరిని లాగి పెట్టి కొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. నా క్లోజ్ ఫ్రెండ్తో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి నా స్నేహితుడిని తిడుతున్నాడు. ఆపమని వారించినా సరే వినకుండా దుర్భాషలాడుతున్నాడు. మొదట మంచిగా చెప్పి చూశా.. తర్వాత వార్నింగ్ ఇచ్చా.. అయినా వినలేదు. ఇక ఆరోసారి మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇచ్చాను.ఆవేశం పట్టలేక..అందరిముందు అలా తిడుతుండేసరికి నా ఫ్రెండ్ ఏడుస్తున్నాడు. అది చూసి భరించలేకపోయిన నేను అతడి చెంప చెళ్లుమనిపించాను. ఒక్క దెబ్బకే అతడు కిందపడిపోయి స్పృహ కోల్పోయాడు. అయిపోయింది, నా కెరీర్ ఖతం అని భయపడ్డా.. అతడికి మెలకువ రావాలని దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాను. ముఖంపై నీళ్లు చల్లిన కొద్ది క్షణాలకే అతడు లేచి కూర్చో వడంతో ఊపిరి పీల్చుకున్నా..ఈరోజు అయితే..అదే సంఘటన ఈరోజు జరిగి ఉంటే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని కానీ అలా కొట్టేవాడిని కాదు. అదే నాకు ఇబ్బందిగా అనిపించిన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ చివరగా జాలీ ఎల్ఎల్బీ 3 సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ సినిమా భూత్ బంగ్లా ఏప్రిల్ 10న విడుదల కానుంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న నటి -
‘ఏపీలో నిరంకుశ పాలన సాగుతోంది’
విజయవాడ: ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి ప్రభుత్వ పాలనలో విఫలమైందన్నారు. తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ‘ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ పాలన అమలవుతోంది. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పింది. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని కోరినందుకు అంబటి రాంబాబుపై దాడి చేశారు. చంద్రబాబు తమ వారికి ప్రభుత్వ భూములను అన్యాయంగా తక్కువ ధరకు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ విమర్శించారు. -
రూ.125 కోట్ల డీల్.. ఇక్సిగోకి మెజారిటీ వాటాలు
స్పెయిన్కి చెందిన ట్రెయిన్ బుకింగ్ ప్లాట్ఫాం అయిన ఆన్లైన్ ట్రావెల్ సొల్యూషన్స్ (ట్రెనెస్)లో మెజారిటీ వాటాలను ట్రావెల్ అగ్రిగేటర్ ఇక్సిగో కొనుగోలు చేయనుంది. 60 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు సంస్థ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 125 కోట్లుగా (11.70 మిలియన్ యూరోలు) ఉంటుంది.యూరోపియన్ ఓటీఏ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు స్క్వాడ్ యాజ్ సరీ్వస్ అనే ఇంకో స్పానిష్ సంస్థలో కూడా 45.02 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కూడా ఇక్సిగో బోర్డు ఆమోదం తెలిపింది. దీని విలువ రూ. 4.83 కోట్లుగా ఉంటుంది. ఎస్క్యూఏఏఎస్ సంస్థ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సంబంధ సేవలను అందిస్తోంది. -
సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం
సూపర్స్టార్ రజనీకాంత్ చేసిన సినిమాల్లో 'బాషా'కి ప్రత్యేక స్థానముంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత మరణించారు. వృద్ధాప్య సమస్యలతో నిర్మాత తమిళగన్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల.. రజనీ సంతాపం వ్యక్తం చేశారు. బాధపడుతూ ట్వీట్ చేశారు.(ఇదీ చదవండి: హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్)'సోదరుడు లాంటి అళగన్ మృతి నాకు అత్యంత బాధాకరమైన విషయం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి నా సానుభూతి' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. నేటి సాయంత్రం (ఫిబ్రవరి 15) తమిళగన్ అంత్యక్రియలు జరగనున్నాయి. రజనీ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'బాషా' చిత్రాన్ని తమిళగన్, తన తల్ల రాజమ్మాళ్తో కలిసి నిర్మించారు. ఇతడి తండ్రి ఆర్ఎం వీరప్పన్ సమర్పకుడిగా వ్యవహరించారు. దీనితోపాటే మూండ్రు ముగం, పణక్కారన్, రాణువ వీరన్ కూడా తమిళగన్ నిర్మించారు. మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు దర్శకుడిగానూ వ్యవహరించారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)மதிப்பிற்குரிய அமரர் ஆர்.எம். வீரப்பன் அவர்களின் புதல்வர், எனது அன்புத் தம்பி தமிழழகன் அருமையான மனிதர். அவரது திடீர் மறைவு எனக்கு மிகுந்த வேதனையளிக்கிறது. அவருடைய ஆத்மா சாந்தியடையட்டும். குடும்பத்தாருக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள்.— Rajinikanth (@rajinikanth) February 15, 2026 -
పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్.. 593 కిమీ రేంజ్!
టాటా మోటార్స్ ఫిబ్రవరి 20న.. భారతదేశంలో పంచ్ ఫేస్లిఫ్టెడ్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనుంది. అయితే ఈ కారు లాంచ్ కావడానికి ముందే.. టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది ఎంత రేంజ్ ఇస్తుందనే విషయం కూడా లీక్ అయింది. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్టెడ్ మోడల్ ఒక ఫుల్ ఛార్జ్పై 593.6కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. కారు చిన్నదే అయినా.. మంచి పర్ఫామెన్స్ ఇస్తుందని తెలుస్తోంది. దీని ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది.టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్టెడ్ మోడల్ 25 కిలోవాట్, 35 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్లను పొందుతుంది. చిన్న బ్యాటరీ 82 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. పెద్ద బ్యాటరీ 122 హార్స్ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 45 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలో కూడా లభించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీటాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్.. బంపర్ క్లీనర్ లేఅవుట్తో రీడిజైన్ చేయబడి ఉండటం చూడవచ్చు. వై షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఛార్జింగ్ స్లాట్ అదే విధంగా ఉంటుంది. ఎయిర్ డ్యామ్ & స్కిడ్ ప్లేట్ కూడా కొంత అప్డేట్ అయ్యాయి. వెనుక వైపు.. ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్ కనిపిస్తుంది. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా గడ్డపై తొలి మ్యాచ్లోనే భారత మహిళా బౌలర్లు చెలరేగిపోయారు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆసీస్ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చింది.పేసర్లు రేణుకా సింగ్ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ప్లేయర్ల భరతం పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.ఆసీస్ ఇన్నింగ్స్లో జార్జియా వేర్హమ్ (30) టాప్ స్కోరర్ కాగా.. ఫోబ్ లిచ్ఫీల్డ్ (26), ఎల్లిస్ పెర్రీ (20), జార్జియా వాల్ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్ మూనీ (5), ఆష్లే గార్డ్నర్ (4), అన్నాబెల్ సదర్ల్యాండ్ (3), కిమ్ గార్త్ (2), డార్సీ బ్రౌన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్ సోఫీ మోలినెక్స్ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.కాగా, మల్లీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో తొలుత మూడు టీ20లు, ఆతర్వాత మూడు వన్డేలో, చివరిగా ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో భారత పర్యటన షెడ్యూల్ఫిబ్రవరి 15- తొలి టీ20 (సిడ్నీ)ఫిబ్రవరి 19- రెండో టీ20 (కాన్బెర్రా)ఫిబ్రవరి 21- మూడో టీ20 (అడిలైడ్)ఫిబ్రవరి 24- తొలి వన్డే (బ్రిస్బేన్)ఫిబ్రవరి 27- రెండో వన్డే (హోబర్ట్)మార్చి 1- మూడో వన్డే (హోబర్ట్)మార్చి 6- ఏకైక టెస్ట్ (పెర్త్) -
ఐలాపురం వెంకయ్య మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య మృతపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఐలాపురం వెంకయ్య ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటన్నారు. వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కోరుకుంటూ, వెంకయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇలాపురం వెంకయ్య.. ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, శనివారం (ఫిబ్రవరి 14)న మరణించారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలో ఆయన వ్యాపార, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. -
హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'ఏఐ' అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తమ చిత్రాల్లో ఎలాంటి సీన్లు.. ఈ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించాలేదని హీరోలు దర్శకనిర్మాతలు చెప్పుకొంటున్నారు. కష్టపడి విజువల్ ఎఫెక్ట్స్ చేయించామని అంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. యువహీరో నిఖిల్ మాత్రం ఏఐ గురించి చెబుతూనే మరో మూవీ గురించి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'స్వయంభు'. నాలుగు రోజుల క్రితం టీజర్ రిలీజ్ చేశారు. ఏమంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు. కంటెంట్ పర్లేదు అన్నప్పటికీ ఎక్కువమంది 'బాహుబలి'తో పోల్చి చూస్తున్నారు. హీరోహీరోయిన్ పాత్రలు అలానే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అలానే టీజర్ క్వాలిటీపైనా కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో హెచ్డీఆర్ క్వాలిటీతో ఇప్పుడు మరోసారి టీజర్ అప్లోడ్ చేశారు. ఇదే విషయాన్ని ట్విటర్లో చెప్పిన నిఖిల్.. రీసెంట్గా వచ్చిన ఓ సినిమాలా మా దానిలో ఎలాంటి ఏఐ ఉపయోగించలేదు అని అన్నాడు.మరి నిఖిల్ ఏ సినిమా గురించి అన్నాడా? అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. సరిగ్గా నిఖిల్ ట్వీట్ చేసే సమయానికి 'నాగబంధనం' మూవీ టీజర్ రిలీజైంది. మరి ఈ చిత్రంపైనే నిఖిల్ కౌంటర్ వేశాడా అనిపిస్తోంది. ఎందుకంటే రెండు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలే. ఈ వేసవిలోనే థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్.. కావాలనే నెగిటివ్ అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడా అనిపిస్తుంది. బహుశా ఇదో రకం పబ్లిసిటీ టెక్నిక్ కావొచ్చేమో? చూడాలి మరి దీని గురించి నిఖిల్ ఏమని క్లారిటీ ఇస్తాడో?(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా) -
ప్రియుడిని పెళ్లాడిన 'సార్ మేడమ్' నటి
తమిళ నటి రోషిణి హరిప్రియణ్ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు కేఎస్ సుందర మూర్తిని ఆదివారం (ఫిబ్రవరి 15న) వివాహం చేసుకుంది. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సినిమాకాగా రోషిణి హరిప్రియణ్ భారతి కన్నమ్మ సీరియల్తో పాపులర్ అయింది. ఆ తర్వాత 'కూకు విత్ కోమలి' రియాలిటీ షో మూడో సీజన్లోనూ పాల్గొంది. అనంతరం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. గరుడన్, మద్రాస్ మ్యాట్నీ మూవీస్ చేసింది. చివరగా 'తలైవా తలైవి' సినిమాలో నటించింది. ఈ చిత్రం తెలుగులో 'సార్ మేడమ్' పేరిట రిలీజైంది. Bharathi Kannama serieal fame #RoshniHariPriyan getting married. pic.twitter.com/MRKxSFH4NG— CineFriday (@Cine_Friday) February 15, 2026 చదవండి: అది నా దురదృష్టం: రణ్బీర్ కపూర్ -
పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టీ20 టోర్నీలో భారత్ పాక్పై ఘన విజయం సాధించింది. బ్యాంకాక్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్లో టీమిండియా పాక్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను భారత బౌలర్లు 93 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా (10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి) ఛేదించారు. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరింది. దీనికి ముందు మ్యాచ్లో భారత అమ్మాయిలకు యూఏఈ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది.తాజా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. సైమా ఠాకోర్ (4-0-14-2), కెప్టెన్ రాధా యాదవ్ (3-0-11-2), ప్రేమా రావత్ (3-0-16-2), జింటిమణి కలిట (3-0-18-1), మిన్నూ మణి (2.5-0-10-1), తనూజా కన్వర్ (3-0-19-0) పాక్ ప్లేయర్ల భరతం పట్టారు. పాక్ ఇన్నింగ్స్లో షావల్ జుల్ఫికర్ (23), గుల్ రుఖ్ (21), అనోశా నాసిర్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ తొలి బంతికే వికెట్ (హుమైరా ఖాజీ డకౌట్) కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ వ్రింద దినేశ్ (55) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి భారత్ను విజయతీరాలకు చేరింది. వ్రిందకు అనుష్క శర్మ (24), తేజల్ హసబ్నిస్ (12 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో వహీదా అక్తర్, మొమినా రియాసత్కు తలో వికెట్ దక్కింది. భారత్ గ్రూప్ దశలో తమ తదుపరి మ్యాచ్లో నేపాల్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 17న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్, యూఏఈ, నేపాల్ గ్రూప్-ఏలో ఉండగా.. థాయ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్-బిలో ఉన్నాయి. -
కుష్బూ వారసురాలిద్దరూ రెడీ..
ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన నటి కుష్బూ హిందీలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ సంచలన నటి ఆ తరువాత తెలుగులో వెంకటేష్కు జంటగా కలియుగ పాండవులు చిత్రంలో కథానాయికిగా పరిచయమయ్యారు. ఆ తరువాత వరుషం– 16 చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. విశేషం ఏమిటంటే ఈమె తెలుగు, తమిళం భాషల్లో నటించిన రెండు చిత్రాలు విజయం సాధించాయి. ఆ తరువాత ఈ రెండు భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్ వంటి నటులతో జంటగా నటించారు. కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు సుందర్.సి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరో పక్క నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సుందర్.సి, కుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు వారు కూడా సినీ రంగప్రవేశం చేయడం విశేషమేమీ కాదు. చిన్న కూతురు ఆనందిత దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా చేరారు. పొన్నియిన్ సెల్వన్ 1, 2, థగ్లైఫ్ చిత్రాలకు పని చేశారు. పెద్ద కూతురు అవంతిక హీరోయిన్గా రంగప్రవేశం చేశారు. ఈమె లండన్లో నటనలో శిక్షణ పొందారన్నది గమనార్హం. ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించి తల్లి కుష్బూ ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆరంభం అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సరిత మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. సురేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. అవంతిక త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ అవుతారని ఆశించవచ్చు. -
పాక్ కోరిక నెరవేరుస్తాం: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. దాయాదులు భారత్- పాకిస్తాన్ కొలంబో వేదికగా ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఆర్.ప్రేమదాస స్టేడియం వేదిక కాగా.. వర్షం పడే ప్రమాదం పొంచి ఉంది.ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మ్యాచ్ నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) శనివారం నాటి ప్రెస్ కాన్ఫరెన్స్లో సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత్ తొలుత అమెరికాతో తలపడిన సంగతి తెలిసిందే.అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచినా.. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక నమీబియాతో రెండో మ్యాచ్కు ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అందుబాటులో లేకుండా పోయాడు. కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన అభిషేక్.. కోలుకున్నప్పటికీ యాజమాన్యం అతడికి విశ్రాంతినిచ్చింది.ఇక నమీబియాను చిత్తుగా ఓడించి సూపర్-8కు చేరువైన భారత్.. దాయాదిపై ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పాక్తో ఆడే భారత తుదిజట్టు ఎలా ఉండబోతున్న చర్చ జరుగుతోంది.అతడు ఆడాలని కోరుకుంటున్నాంఇదిలా ఉంటే.. భారత్తో మ్యాచ్కు ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) మాట్లాడుతూ.. “అతడు మంచి ప్లేయర్. అభిషేక్ రేపు ఆడతాడనే అనుకుంటున్నాం. మేము అత్యుత్తమ జట్టుతో పోటీ పడాలి అని అనుకుంటున్నాం. కాబట్టి అతడు కోలుకుని తిరిగి వస్తే బాగుంటుంది’’ అని అభిషేక్ శర్మను ఉద్దేశించి పేర్కొన్నాడు.పాక్ కోరిక నెరవేరుస్తాంఇదే విషయాన్ని సూర్య వద్ద విలేకరులు ప్రస్తావించగా.. “ఒకవేళ పాకిస్తాన్ మేము అభిషేక్ శర్మను ఆడించాలని కోరుకుంటే.. వారి కోరిక నెరవేరుతుంది. అతడు రేపు ఆడతాడు’’ అని సమాధానమిచ్చాడు. తద్వారా సంజూ శాంసన్పై వేటు వేయడం ఖాయమని చెప్పకనే చెప్పాడు సూర్య.అతడికీ చోటుఇక కొలంబో స్పిన్కు అనుకూలించే పిచ్ కాబట్టి లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తుదిజట్టులో ఉంటాడని సూర్య సంకేతాలు ఇచ్చాడు. “అతడి అవసరం ఉందనుకుంటే కచ్చితంగా ఆడిస్తాము’’ అని కుల్దీప్ను ఉద్దేశించి పేర్కొన్నాడు. కాగా అర్ష్దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ వచ్చే అవకాశం ఉంది.కాగా గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్లతో పాటు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి. అయితే, ఇప్పటికే చెరో రెండు విజయాలతో భారత్- పాక్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. అమెరికా సైతం సూపర్-8 రేసులో నిలిచే ప్రయత్నంలో ఉంది.భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుది జట్లు (అంచనా): భారత్సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాGuess who's back... back again! 💪😈#TeamIndia's Mr.Maximum, #AbhishekSharma, was spotted launching sixes during the training session in Colombo! Watch him next 👉 ICC Men's #T20WorldCup 👉 #INDvPAK | SUN, 15th FEB, 6 PM pic.twitter.com/CEkut5QxpP— Star Sports (@StarSportsIndia) February 14, 2026పాకిస్తాన్సల్మాన్ ఆఘా (కెప్టెన్ ), సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహిన్ అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్. చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
రాహుల్, పడిక్కల్ అద్భుత శతకాలు
ఉత్తరాఖండ్తో ఇవాళ (ఫిబ్రవరి 15) మొదలైన రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీఫైనల్లో కర్ణాటక జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (125 నాటౌట్), కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (111 నాటౌట్) అద్భుత సెంచరీలతో చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ఱాటక టీ విరామం సమయానికి వికెట్ నష్టానికి 263 పరుగులు చేసింది. రాహుల్, పడిక్కల్ సెంచరీల తర్వాత కూడా నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీల దిశగా సాగుతున్నారు.టాస్ ఓడి ఉత్తరాఖండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కర్ణాటక 18 పరుగుల వద్దనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) వికెట్ కోల్పోయింది. అయితే రాహుల్, పడిక్కల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్కు అజేయమైన 245 పరుగులు జోడించారు. మయాంక్ అగర్వాల్ వికెట్ ఆదిత్య రావత్కు దక్కింది.భీకర ఫామ్లో రాహుల్, పడిక్కల్కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నారు. టీమిండియా షెడ్యూల్ లేకపోవడంతో రంజీ బాట పట్టిన రాహుల్ ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లోనూ (130) అద్భుత శతకంతో మెరిశాడు. రాహుల్ అద్భుత శతకం కారణంగానే కర్ణాటక ముంబైపై గెలిచి సెమీస్కు చేరింది. అంతకుముందు పంజాబ్తో జరిగిన లీగ్ మ్యాచ్లోనూ రాహుల్ అర్ద సెంచరీతో రాణించాడు. దీనికి ముందు న్యూజిలాండ్తో జరిగిన రాజ్కోట్ వన్డేలోనూ (112) రాహుల్ అజేయ శతకంతో సత్తా చాటాడు. అంతకుముందు సౌతాఫ్రికాపై వరుసగా రెండు వన్డేల్లో అర్ద సెంచరీలతో రాణించాడు.పడిక్కల్ విషయానికొస్తే.. ఇతను కూడా ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. ఈ సెంచరీకి ముందు పంజాబ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన పడిక్కల్.. దానికి ముందు లిస్ట్-ఏ ఫార్మాట్లో పరుగుల వరద పారించాడు. పుదుచ్చేరి, త్రిపురపై వరుస శతకాలు, ఆతర్వాత రాజస్థాన్పై 91, ముంబైపై 81 (నాటౌట్) పరుగులు చేశాడు. రాహుల్, పడిక్కల్ ఇదే భీకర ఫామ్ను కొనసాగిస్తే.. కర్ణాటక మరోసారి రంజీ టైటిల్ గెలవడం ఖాయం. -
దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం
అస్సాంలో గోహ్పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ విలువ ఏకంగా రూ. 18,662 కోట్లు. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం నిర్మించనున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్గా నిలవనుంది.ప్రస్తుతం.. NH715లోని నుమాలిఘర్ & NH-15లోని గోహ్పూర్ మధ్య దూరం 240 కి.మీ. ఇది NH-52లోని సిల్ఘాట్ సమీపంలోని కాలియాభంభోరా మీదుగా వెళుతుంది. ఈ ప్రయాణం నుమాలీగఢ్, కాజిరంగ నేషనల్ పార్క్, బిస్వనాథ్ టౌన్ వంటి ప్రాంతాల గుండా సాగుతుంది. కొత్త గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణంతో దూరం & ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీనిని ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (EPC) మోడల్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదికి కింద నిర్మించే ఈ రోడ్డు - రైలు టన్నెల్ ద్వారా.. అస్సాం మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ & ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీఈ కారిడార్ 11 ఆర్థిక కేంద్రాలు, మూడు సామాజిక కేంద్రాలు, రెండు పర్యాటక కేంద్రాలు & ఎనిమిది లాజిస్టిక్ కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అంతే కాకుండా నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు, రెండు విమానాశ్రయాలు, రెండు అంతర్గత జలమార్గాలతో కూడిన మల్టీ మోడల్ కనెక్టివిటీని ఇది బలోపేతం చేస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యం పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. -
అది నా దురదృష్టం: రణ్బీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్కు సొంతంగా బట్టల బిజినెస్ ఉంది. అదే ఆర్క్స్. గతేడాది ఫిబ్రవరి 14న ఈ బిజినెస్ మొదలుపెట్టాడు. ఈ వ్యాపారం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆర్క్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లైవ్లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించాడు. ప్రస్తుతం రణ్బీర్ లవ్ అండ్ వార్తో పాటు రామాయణ సినిమాలు చేస్తున్నాడు. అయితే లవ్ అండ్ వార్ రిలీజ్ పోస్ట్పోన్ అయినట్లు తెలిపాడు.ఎదురుచూపులకు తగ్గ ఫలితంఅదేంటో మరి దురదృష్టం. నేనెప్పుడు సినిమా మొదలుపెట్టినా త్వరగా పూర్తవవు. అందరూ ఐదారు నెలల్లో సినిమా పూర్తి చేస్తారు. కానీ, నావి మాత్రం చాలా సమయం పడుతున్నాయి. అయితే అది రిలీజైనప్పుడు మాత్రం మీ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించాలన్నదే నా కోరిక. రెండుమూడేళ్లుగా చాలా కష్టపడుతున్నాను. కొన్నింటికి సమయం తప్పదు. రామాయణ రిలీజ్ తర్వాతే లవ్ అండ్ వార్ వస్తుంది అని పేర్కొన్నాడు.అనుకోకుండా అలా..రామాయణ ఈ ఏడాది నవంబర్లో విడుదల కానుంది. తన కూతురు రాహా పుట్టిన నెల అయిన నవంబర్లోనే రామాయణ రిలీజ్ అవుతుండటం యాదృచ్ఛికమైనప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన ఫేవరెట్ సినిమా ధురంధర్ అని చెప్పాడు. అందులో అందరూ అద్భుతంగా నటించారని రణ్బీర్ ప్రశంసించాడు.చదవండి: తెరపై శివుడిగా మెప్పించిన హీరోలు -
రాష్ట్ర పునర్నిర్మాణంలో మీపాత్ర మరవలేనిది: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంజారాభవన్లోసంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మానవ జాతి శాంతి మార్గం లో నడవాలని సంత్ సేవాలాల్ అందరిలో స్ఫూర్తి ని నిప్పారని రేవంత్ రెడ్డి కొనియాడారు. అందుకే దేశంలోని 15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా ఆయన నిలిచారన్నారు. సేవాలాల్ జయంతి అధికారికం గా జరపడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో లంబాడీలు కీలక పాత్ర పోషించారని రాష్ట్రం కోసం సురేష్ నాయక్, కవిత నాయక్ ఆత్మ బలిదానం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో లంబాడీల పాత్ర మరవలేనిదన్నారు. అందుకే తండాలలో రోడ్డు లేకుండా ఏ తండా ఉండకూడదని అన్ని తండాలకు బీటీ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.అదే విధంగా ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్, సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తాను zptc అభ్యర్థి గా పోటీ చేసినప్పుడు తండా ల్లో ఉన్న యువకులు తన విజయం లో క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం తెలిపారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో ప్రతి సందర్భంలో లంబాడా సోదరులు తనకు అండగా నిలిచారన్నారు. పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం రేషన్ కార్డని సీఎం తెలిపారు. కార్డు ఉన్నవారందరికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్ళకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని 50 లక్షల పేదల ఇళ్ల లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం అన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం రూ.9,000 కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టిందన్నారు.ఇటీవల జరిగిన గ్రూప్-1పై అక్రమ కేసులు వేస్తే పోరాడి ఉద్యోగాలు ప్రకటించామన్నారు. గ్రూప్-1లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. దీనిపైన ఎవరికైనా అనుమానం ఉంటే లెక్కపెట్టుకోవాలని సీఎం సవాల్ విసిరారు. దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎస్టీ లకు రిజర్వేషన్లు ఇచ్చారని, అసైన్డ్ పట్టాల రూపం లో గిరిజనులకు భూములు పంచారన్నారు. తమ ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని అందుకే నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి గొప్పస్థానాలకు ఎదగాలన్నారు. -
ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!
ఏడేళ్ల చిన్నారి..తన వయసుకు అనితరసాధ్యమైన దాన్ని అవలీలగా చేధించింది. పెద్దపెద్ద ఈతగాళ్ల డ్రీమ్ ఎలిఫెంటా ద్వీపం నుంచి ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఈదడం. కానీ ఈ చిన్నారి చాలా అవలీలగా చేసి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అత్యంత సవాలుతో కూడిన సముద్ర మార్గంలో ఈదడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..?..అస్సాంకి చెందిన ఏడేళ్ల కియుచెంఘన్ ఫుకాన్ ఈ ఘనత సాధించింది. ఆ చిన్నారి ఎలిఫెంటా ద్వీపం నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకు 3 గంటల 29 నిమిషాల్లో ఈదింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆ ఘనతను పూర్తి చేసింది. కియుచెంఘన్ ఎలిఫెంటా ద్వీపం నుంచి మధ్యాహ్నం 2:36 గంటలకు తన ఈత ప్రారంభించి సాయంత్రం 6:05 గంటలకు గేట్వే ఆఫ్ ఇండియాకు చేరుకుంది. ఈ ప్రదేశం బలమైన ప్రవాహాలు, మారుతున్న సముద్ర పరిస్థితులకు ప్రసిద్ధిచెందింది. ఇది అరేబియా సముద్రంలో అత్యంత కష్టతరమైన సముద్ర మార్గాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి కఠినతరమైన సముద్ర మార్గాన్ని ఏడేళ్ల ప్రాయంలో అవలీలగా జయించి.. ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కాగా, కియుచెన్ఘాన్ ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. హేమంగా ఫుకాన్ రిమ్లి, హజారికా ఫుకాన్ దంపతుల కుమార్తె. ఆ చిన్నారి కుటుంబం గౌహతిలోని సిక్స్ మైల్లో నివసిస్తుంది. ఈ చిన్నారి గౌహతిలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ అక్వాటిక్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇక అస్సాం స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ దాస్ ఈ విజయాన్ని అస్సాంకే గర్వకారణంగా పేర్కొన్నారు. అస్సాం క్రీడా మంత్రి నందితా గార్లోసా ఈ చిన్నారి స్విమ్మర్ని అభినందించారు. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయి కూడా ఈ చిన్నారినే. View this post on Instagram A post shared by OPEN WATER SWIMMING ACADEMY, INDIA (@owsaindia) (చదవండి: డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..) -
T20 WC 2026: విండీస్ మరోసారి.. తొలి జట్టు..!
రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ మూడో టైటిల్ దిశగా తొలి అడుగు వేసింది. 2026 ఎడిషన్లో ఆ జట్టు సూపర్-8కు అర్హత సాధించింది. ప్రస్తుత ఎడిషన్లో సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టు వెస్టిండీసే. నేపాల్పై విజయం సాధించడంతో విండీస్ సూపర్-8 బెర్త్ ఖరారైంది.ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన మ్యాచ్లో విండీస్ 9 వికెట్ల తేడాతో పసికూనను చిత్తు చేసింది. తొలుత బౌలింగ్లో నేపాల్ను 133 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసిన కరీబియన్ జట్టు.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జేసన్ హోల్డర్ బౌలింగ్లో (4-0-27-4) ఇరగదీసి నేపాల్ను దెబ్బేశాడు. మాథ్యూ ఫోర్డ్ (4-1-10-1) పొదుపుగా బౌలింగ్ చేసి నేపాల్ను కట్టడి చేశాడు. అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, రోస్టన్ ఛేజ్ కూడా తలో వికెట్ తీసి నేపాల్ను ఇబ్బంది పెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్లో దీపేంద్ర సింగ్ ఎయిరీ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఆఖర్లో సోమ్పాల్ కామీ (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నేపాల్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని విండీస్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. కెప్టెన్ షాయ్ హోప్ (61) అజేయమైన అర్ద సెంచరీతో విండీస్ను విజయతీరాలకు చేర్చాడు. హోప్కు హెట్మైర్ (46 నాటౌట్), బ్రాండన్ కింగ్ (22) సహకరించారు. ఈ ఓటమితో నేపాల్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. మెగా టోర్నీలో ఈ జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లో పరాజయంపాలైంది. అయితే తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను మాత్రం ఓడించినంత పని చేసింది. ఇదొక్కటే ఈ ఎడిషన్లో నేపాల్కు ఊరట కలిగించే విషయం. ఫిబ్రవరి 17న ఈ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్ (స్కాట్లాండ్) ఆడనుంది. -
దేశంలోనే టాప్ 5 టోల్ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు
భారతదేశంలో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై గత ఐదేళ్లలో (2020-21 నుంచి 2024-25 వరకు) సుమారు రూ. 2.27 లక్షల కోట్ల టోల్ వసూళ్లు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. అయితే టాప్ టోల్ ప్లాజాల వివరాలు 2019-20 నుంచి 2023-24 వరకే అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాప్ 5 టోల్ ప్లాజాల గురించి తెలుసుకుందాం. -
బీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేస్తున్నారు: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ వచ్చిన ప్రతిచోటా కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్. సీపీఐ అలయెన్స్లో ఉన్నాయని సింగరేణిలో కొన్నిచోట్ల బీజేపీ, సీపీఐ సైతం కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడిని అరికట్టడానికే కొన్నిచోట్ల సీపీఐకి మద్ధతిచ్చామన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. -
IND vs PAK: పాకిస్తాన్ 93 పరుగులకే ఆలౌట్
పాకిస్తాన్తో మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. దాయాదిని 93 పరుగులకే ఆలౌట్ చేశారు. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్-2026 టోర్నమెంట్లో ఆదివారం నాటి మ్యాచ్లో భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి.తొలుత బ్యాటింగ్బ్యాంకాక్లోని టెర్థాయ్ క్రికెట్ మైదానంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆది నుంచే భారత బౌలర్లు పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. చుక్కలు చూపించిన భారత బౌలర్లుఓపెనర్లలో యుస్రా ఆమిర్ (1)ను సైమా ఠాకూర్ అవుట్ చేయగా.. వన్డౌన్ బ్యాటర్ ఒమైమా సొహైల్ (1)ను జింతిమణి కలిత, కెప్టెన్ హఫ్సా ఖలీద్ (1)ను ఐమా, హురైనా సజ్జద్ (2)ను కెప్టెన్ రాధా యాదవ్ పెవిలియన్కు పంపించారు.Captain Radha Yadav steps up and shows the way! 💙 Watch the Girls in Blue in action vs Pakistan A, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising | DP World Women’s Asia Cup Rising Stars 2026 pic.twitter.com/kjeq0xl5i8— Sony Sports Network (@SonySportsNetwk) February 15, 2026ఎమాన్ నాజర్ (4)ను అనుష్క శర్మ రనౌట్ చేయగా.. వహీదా అక్తర్ (7)ను ప్రేమా రావత్, మొమినా రియాసత్ (4)ను మిన్ను మణి సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశారు. ఇలాంటి తరుణంలో ఓపెనర్ షవాల్ జుల్ఫికర్ (23)తో పాటు గల్ రుఖ్ (21) పోరాడే ప్రయత్నం చేయగా.. షవాల్కు రాధా యాదవ్, గుల్కు ప్రేమా రావత్ చెక్ పెట్టారు.𝐓𝐡𝐫𝐨𝐰 𝐢𝐭 𝐥𝐢𝐤𝐞 𝐀𝐧𝐮𝐬𝐡𝐤𝐚 🎯🔥A direct-hit special sends Eman Naseer back to the pavilion in style 💙Watch the Girls in Blue in action vs Pakistan A, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising | DP World Women’s… pic.twitter.com/XmUJMqOQIR— Sony Sports Network (@SonySportsNetwk) February 15, 2026 93 పరుగులకే ఆలౌట్ఫలితంగా 18.5 ఓవర్లలో కేవలం 93 పరుగులే చేసి పాక్-ఎ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సైమా ఠాకూర్, రాధా యాదవ్, ప్రేమా రావత్ తలా రెండు వికెట్లు తీయగా.. జింతిమణి కలిత, మిన్ను మణి చెరో వికెట్ పడగొట్టారు.కాగా ఆసియా కప్ రైజింగ్ టీ20 టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్- పాక్లతో పాటు యూఏఈ, నేపాల్ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్లో నేపాల్ను ఓడించి పాక్ అగ్రస్థానానికి చేరగా.. యూఏఈ చేతిలో ఓడిన భారత్ మూడో స్థానంలో ఉంది. తాజా మ్యాచ్లో పాక్ను ఓడించి గెలుపు బోణీ కొట్టాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. చదవండి: వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం! -
‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
కంటతడిపై ‘కన్నే’యండి!కొందరిలో కళ్లనిండా నీళ్లు ఉండటం... కళ్లు చెమ్మగిల్లినట్టుగా ఉండటం కనిపిస్తుండేదే. ఇందుకు చాలా అంశాలు కారణమవుతాయి. ఇలా కళ్లలో నీరు ఉన్నట్లు కనిపిస్తుండటం, చెమ్మగిల్లుతూ ఉండటానికికారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలు...కళ్లలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్తో కళ్లుమండుతూ ఉన్నప్పుడు దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి అంశాలతో అలర్జీ వల్ల కళ్లకలక (కంజంక్టివైటిస్) వంటి ఇన్ఫెక్షన్లతో కళ్లలో నీళ్లూరేందుకు ఉండే డక్ట్స్ మూసుకుపోవడంతో కన్నీళ్లు బలవంతంగా రావడానికి ప్రయత్నించడం ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ ఉన్నవాళ్లలో. ఇక్కడ ఒక సందేహం కలగడం సాధారణం. అంటే డ్రై ఐస్ సిండ్రోమ్లో కళ్లు పొడిబారాలి కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి ఈ సిండ్రోమ్లో కళ్లుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీన్నే ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కళ్లలో నీరు ఎక్కువగా ఊరుతుంది.నివారణ, చికిత్స...∙చిన్నపిల్లల కళ్లల్లో ఇలా నీరూరుతున్నప్పుడు లేదా కళ్లలోకి దుమ్మువెళ్లినప్పుడు పాతకాలపు పెద్దవాళ్లు ఓ మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను ఉండగా చేసి, దానిపై నోటితో గాలి ఊది దాన్ని కొద్దిగా వెచ్చబడేలా చేసి కంటిపై అద్దడం అన్నది కాస్తంత మధ్యవయస్కులకూ, పెద్దవాళ్లకు తెలిసిందే. అలా కాస్తంత గోరువెచ్చని ఆవిరితో గుడ్డను ఉండగా చేసి కళ్లపై అద్దడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది అలర్జీ వల్ల ఇలా జరిగినప్పుడు డాక్టర్ల సూచన మేరకు యాంటిహిస్టమైన్చుక్కల మందు వాడాలి. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరిగితే డాక్టర్లు యాంటీబయాటిక్ చుక్కల మందును సూచిస్తారు మాటిమాటికీ కళ్లను తాకకుండా ఉండాలి ∙ఇంతకు మించి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కళ్ల డాక్టర్ను సంప్రదించాలి.ఉబ్బు కళ్లు...కొందరిలో ఉబ్బుకళ్లు కనిపిస్తుంటాయి. పొద్దున్నే నిద్రలేవగానే కొద్దిసేపటి వరకు ఉబ్బుకళ్లు కనిపించడం మామూలే. కానీ కొందరిలో ఇవి చాలాసేపు అలాగే ఉండి΄ోతాయి. ఈ సమస్యను ఇంగ్లిష్లో ‘పఫ్ఫీ ఐస్’ అంటుంటారు. సాధారణంగా చాలామందిలో ఇది తాత్కాలిక సమస్యే. కళ్లు బాగా అలసి΄ోవడం (ఫెటీగ్) వల్ల కూడా ఇలా జరగవచ్చు.కారణాలు...∙రాత్రి ఎక్కువసేపు నిద్ర΄ోకుండా ఉండటం లేదా నిద్రలేమి కారణంగా ∙క్రితం రాత్రి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కొందరిలో ఉప్పుకారాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత ∙ఇక చాలామందిలో ఇలా కళ్లు ఉబ్బినట్టుగా ఉండటం లేదా కళ్ల కింద చర్మం జారినట్టుగా ఉండటమన్నది వయసు పెరుగుతుండటం (ఏజింగ్) వల్ల జరగవచ్చు ∙మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలోనూ, రక్తంలో ్ర΄ోటీన్ తక్కువగా ఉండటం వల్ల, అలాగే రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లలోనూ ఇలా ఉబ్బుకళ్లు కనిపిస్తాయి.నివారణ / చికిత్స...మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై అద్దడం (కోల్డ్ కంప్రెస్)ఆహారంలో ఉప్పుకారాల మోతాదును తగ్గించడం కంటినిండా గాఢంగా నిద్ర΄ోవడం.డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు ఈ సూచనలు పాటించండికళ్ల జాగ్రత్తల్లో 20 – 20 – 20 అనేది ఓ మంచి సూచన. అంటే... ప్రతి 20 నిమిషాలకోసారి మనం దృష్టిని కేంద్రీకరించి ఉన్న అంశంపైనుంచి (కంప్యూటర్ / ఫోన్) దృష్టి మరల్చి 20 ఫీట్ల దూరంలో ఉన్న మరో వస్తువును 20 సెకన్ల పాటు చూస్తుండటం. ఏకాగ్రతతో ఏదైనా పనిచేస్తున్నా లేదా వృత్తిరీత్యా కంప్యూటర్ స్క్రీన్ గానీ, టీవీ స్క్రీన్నుగానీ తదేకంగా చూస్తున్నప్పుడు ఇలా చేయడం మంచిది. టీవీ, కంప్యూటర్ లేదా మొబైల్ ఇలా ఏదైనప్పటికీ ఆ స్క్రీన్ టైమ్ను గణనీయంగా తగ్గించడం ∙తరచూ కన్రెప్పలను కదిలిస్తూ / మూస్తూ ఉండాలి. (అంటే బ్లింకింగ్ చేస్తూ ఉండాలి). ఫలితంగా కన్నీరు కంటిపైన సమంగా అలముకుని కంటిని పొడిబారకుండా కాపాడుతుంది ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీ చాలాసేపు నడుస్తుంటే అక్కడి వాతావరణంలోని గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇలా చాలాసేపు ఏసీలో ఉన్నవారు కాసేపు మామూలు వాతావరణంలోనూ కిసేపు గడపాలి కళ్లజోడు తాలూకు గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్సులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. పవర్ మారిందని తెలుసుకోగానే తగిన పవర్ ఉన్న అద్దాలను మార్చుకోవాలి. ఈ కొద్ది΄ాటి జాగ్రత్తల తర్వాత కూడా కంటికి సంబంధించిన అసౌకర్యం తగ్గక΄ోతే వెంటనే కంటి డాక్టర్ను తప్పక సంప్రదించాలి. నిర్వహణ యాసీన్ (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
మహాశివరాత్రికి సాత్విక వంటకాలు..! హెల్దీగా ఉపవాసం చేద్దాం ఇలా
మహాశివరాత్రికి సాత్వికంగా ఉండే వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి రహిత ఆహారాలు తీసుకుంటుంటారు. ఎలాగో మహాశివరాత్రి అంటేనే ఉపవాసం. అయితే చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం ఉంటారు. అయితే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు అంతలా కఠిన ఉపవాసాలు ఉండటం కష్టమే. ఒక పక్క అత్యంత పవిత్రమైన రోజు, మరోవైపు శరీరం సహకరించక అవస్థలు పడే వాళ్లు..ఇలాంటి సాత్విక వంటకాలను తీసుకుంటూ..హెల్దీగా ఉపవాసం చేయొచ్చని పెద్దలు చెబుతున్నారు. అంతేగాదు పురాణాలు సైతం శరీరాన్ని కష్టించేలా భక్తి అవసరం లేదని, చక్కగా తింటూనే పూజలు చేయండనే చెబుతున్నారు. పైగా ముందు భుక్తి తర్వాతే భక్తి అన్నారు. అయినా పొట్టలో కాసింత ఆహారం ఉంటేనే ఆధ్యాత్మికతవైపు, భక్తివైపుకి మనసు మళ్లేది. కాబట్టి ఈ పుణ్యప్రదమైన శివరాత్రి రోజున హాయిగా చేసుకుని తిసే సాత్విక వంటకాలేంటంటే..మిల్లెట్లు, దగ్గరన నుంచి సుబుదాను, కుట్టు అట్ట, సింఘార పిండి, పాలు, పండ్లు, నట్స్ తదితరాలను హాయిగా తీసుకోవచ్చట. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి ఎక్కువసేపు ఉపవాసం ఉండేలా, పూజలు చేసుకునేందుకు సౌకర్యవంతగాను ఉంటుంది కూడా. ఆరోగ్యకరమైన సాత్విక వంటకాలు..సబుదాన ఖిచ్డి కాస్త ఓదార్పునిచ్చి..ఆకలిని నియంత్రణలో ఉంచుకునే శక్తిని అందిస్తుంది. పైగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది కూడా. ఎలా చేస్తారంటే..కావలసినవి..సబుదాన – 1 కప్పుఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 మీడియంవేయించిన వేరుశనగలు (తురిమినవి) – ¼ కప్పుజీలకర్ర – ½ స్పూన్పచ్చిమిర్చి (తరిగినవి) – 1సెంధా నమక్ – రుచికి సరిపడానెయ్యి – 1 టేబుల్ స్పూన్తయారీ..ముందుగా సబుదానా(సగ్గుబియ్యం) కడిగి 4–5 గంటలు నానబెట్టండి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర పచ్చిమిర్చి,బంగాళాదుంపలు బాగా వేయించాలి. అవి ఉడికాక నానబెట్టిన సబుదాన, వేరుశెనగ పొడి, ఉప్పు జల్లి, ఓ రెండు నిమిషాలు ఉడికించండి. అంతే సబుదాన ఖిచ్డి రెడీ..!.సామా కే చావల్ ఖిచ్డిసామా కే చావల్ అని పిలువబడే బార్న్యార్డ్ మిల్లెట్ ఉపవాస భోజనాన్ని తేలికగా, పోషకంగా చేస్తుంది. ఈ సాత్విక్ ఖిచ్డి సరళంగా అనిపిస్తుంది కానీ ఓదార్పునిస్తుంది, మహాశివరాత్రి సమయంలో ఎక్కువసేపు ఉపవాసం ఉండటానికి సరైనది.కావలసినవి సమా కే చావల్ – 1 కప్పుఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 చిన్నవిజీలకర్ర – ½ స్పూన్అల్లం (తురిమినది) – 1 స్పూన్ఉప్పు: తగినంతనెయ్యి – 1 టేబుల్ స్పూన్నీళ్ళు – 2 కప్పులుతయారీ: ముందుగా మిల్లెట్లు బాగా కడగాలి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయించాలి, ఆ తర్వాత అల్లం, బంగాళ దుంప, మిల్లెట్, నీరు కలపాలి. మిల్లెట్ మెత్తగా ఉడికిపోతే..రెడీ అయిపోయినట్లే.కుట్టు అట్ట చీలాకుట్టు అట్ట చీలా వ్రత భోజనాలకు వెచ్చదనం తోపాటు తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఎలా చేస్తారంటే..కావల్సినవి..కుట్టు అట్ట – 1 కప్పుఉడికించిన బంగాళాదుంప (గుజ్జు) – 1 చిన్నవిపచ్చిమిర్చి (ఐచ్ఛికం) – ½ స్పూన్ఉప్పు: తగినంతనీరు – ¾ కప్పునెయ్యి – 1 స్పూన్తయారీ విధానం..కుట్టు అట్ట, బంగాళాదుంప, కారం, ఉప్పు, నీరు కలపండి.నునుపైన పిండిలా కలపాలి. వాటి చిన్నసైజు బజ్జీల్లా పాన్లో వేయించాలి. రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయిస్తే చాలు. పెరుగుతో వడ్డించి తింటే రుచి అదుర్స్.వ్రత్ వాలే ఆలూసంక్లిష్టమైన మసాలా దినుసులు లేకుండా సింపుల్గా చేసే వ్రత్ వాలే ఆలూ శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.కావలసినవి :ఉడికించిన బంగాళాదుంపలు – 2 మీడియంజీలకర్ర – ½ స్పూన్పచ్చిమిర్చి – 1ఉప్పు: తగినంతనల్ల మిరియాలు – ¼ స్పూన్నెయ్యి – 1 టేబుల్ స్పూన్తయారీ: నెయ్యి వేడిచేసి జీలకర్ర, తరిగిన బంగాళ దుంపలు బాగా వేయించి. దించేముందు కారం, ఉప్పు, నల్లమిరియాలు, చల్లుకోవాలి. ఇవి కరకరలాడుతూ ఉంటాయి.లౌకి ఖీర్లౌకి ఖీర్ మహాశివరాత్రి ఉపవాసానికి తీపి వంటకం ఇచ్చే శక్తి అమోఘమైంది. మరి ఇదేలా చేస్తారంటే..ఇక్కడ లౌకి అంటే అనపకాయ అని అర్థం.కావలసినవి:తురిమిన లౌకి(అనపకాయ ముక్కలు)- 1 కప్పుపాలు - 2 కప్పులుబెల్లం - 3 టేబుల్ స్పూన్లుఏలకుల పొడి - ¼ స్పూన్తరిగిన గింజలు - 1 టేబుల్ స్పూన్తయారీ..తురిమిన లౌకిని పాలలో తక్కువ మంట మీద ఉడికించాలి.మెత్తగా, కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మరిగించండి.బెల్లం వేసి బాగా కలపండి. ఏలకులు పొడి వేసి సర్వ్ చేయండి. ఇది మహాశివరాత్రి ఉపవాసానికి బెస్ట్ డెజర్జ్.(చదవండి: పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..!) -
పెళ్లి బంధం ఫెయిల్..నటుడి మోసం.. మానసికంగా కుంగిపోయా..!
జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించారు. అంతేకాకుండా రాఖీ మూవీలో తన గాత్రంలో అభిమానులను అలరించింది. అయితే కొన్నాళ్లకే క్యాన్సర్ బారిన మమతా మోహన్ దాస్ చాలా ఇబ్బందులు పడింది. ఓసారి క్యాన్సర్ జయించినా మమతకు మళ్లీ తిరగబెట్టడంతో తన కెరీర్ ముగిసిపోయిందనుకుంది. కానీ చాలా ఏళ్ల తర్వాత మహారాజా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది. అంతేకాకుండా రుద్రంగి సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.అయితే సినిమా రంగంలో ఎంతటి విజయాలు అందుకున్నా..పర్సనల్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటోంది ముద్దుగుమ్మ. తాజాగా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ఒక స్టార్ యాక్టర్ తనను ఎలా మోసం చేశాడని తెలిపింది. క్యాన్సర్, బొల్లి వ్యాధి సమస్యలతో సమస్యలతో పోరాడుతున్న సమయంలోనే ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఎంతో మానసిక వేదనను అనుభవించానని అంటోంది.అదే సమయంలో మలయాళంలో ఒక ప్రముఖ నటుడితో డేటింగ్ చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం అమ్మ కూడా తెలుసని.. కానీ అతనికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందనే నిజాన్ని దాచిపెట్టి నను మోసం చేశాడని తెలిపింది. అయితే మమతా మోహన్ దాస్ మొదట తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్ను ఇష్టపడి 2011లో వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఆరు నెలలకే ముగిసిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెళ్లి బంధంలో విడాకులు తనను మానసికంగా కుంగదీశాయని మమతా ఆవేదన వ్యక్తం చేసింది. -
ఎర్రబస్సు ఎక్కా.. ఒక్కరు గుర్తుపట్టలేదు : జగపతి బాబు
సింపుల్ లైఫ్ని లీడ్ చేసే అదికొద్ది మంది నటుల్లో ఒకరు జగపతి బాబు. ఒప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. అలాగే పలు చిత్రాల్లో సహయ నటుడిగా కొనసాగుతున్నారు. అయితే హీరోగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. షూటింగ్ అయితేపోతే చాలు.. సాధారణ వ్యక్తిలాగే జీవిస్తాడు. సమయం దొరికితే ఒక్కడే రోడ్డుపై నడచుకుంటూ వెళ్తాడు. చుట్టూ ఉన్నవాళ్లతో సరదాగా మాట్లాడతాడు. అంతేకాదు సెట్లో కూడా చాలా అల్లరి చేస్తాడని తోటి నటీనటులు చెబుతుంటారు. మెమోరీస్గా ఉండాలంటూ కొన్ని అల్లరి పనులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన అల్లరి పనుల గురించి చెప్పాడు జగపతి బాబు. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక అల్లరి పని చేసి పోలీసు స్టేషన్కి వెళ్లి వచ్చేవారట. సెట్లో ఉన్నవాళ్లకు కచ్చితంగా మద్యం అందించేవాడట. అలా ఓసారి అమెరికాకి వెళ్లి.. మద్యం మత్తులో గ్యాంబ్లింగ్ ఆడారట. అక్కడ డబ్బులు వచ్చిన ప్రతిసారి గట్టిగా అరుస్తూ డాన్స్ చేస్తే.. చివరకు పొగపెట్టి గదిలో నుంచి బయటకు పంపేశారని, అది తనకో స్వీట్ మెమోరీ అని అంటున్నాడు జగపతి బాబు.బస్సు ఎక్కితే గుర్తుపట్టలేదుసాధారణ మనిషిలాగానే బతకడం నాకు ఇష్టం. అందుకే వీలు దొరికనప్పుడల్లా సరదాగా బయటకు వెళ్తుంటాను. ‘కబడ్డీ కబడ్డీ’సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు ఎర్రబస్సు ఎక్కితే..ఒక్కరు కూడా గుర్తుపట్టలేదు. రాజోలులో షూటింగ్ జరుగుతున్న సమయంలో.. నా షూట్ అయిపోగానే నడుచుకుంటూ వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కా. నా వెనక సిబ్బంది కూడా ఎక్కింది. నన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. కాసేపయ్యాక గుసగుసలు మొదలయ్యాయి. జగపతి బానేనా.. జగపతి బానేనా అని ఒకరినొకరు అడుక్కుంటున్నారు. నేను మాత్రం సైలెంట్గా ఉన్నా. ఒకరు చూసి.. ‘నువ్వు జగపతి బాబువే కదా’ అని అన్నారు. నేను వెంటనే కాదని చెప్పా. వాళ్లు సైలెంట్ అయిపోయారు. మా హోటల్ దగ్గర బస్సు ఆగగానే.. దిగేసి ‘నేను జగపతి బాబునే’ అంటూ గట్టిగా నవ్వుకుంటూ హోటల్లోకి వెళ్లిపోయా. ఇలాంటి అల్లరి పనులు చాలానే చేశా’ అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. -
చంద్రబాబు సర్కార్ బడ్జెట్ ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది: సీపీఎం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలిపిస్తోందంటూ సీపీఎం ఎద్దేవా చేసింది. కూటమి బడ్జెట్ను నిరసిస్తూ.. విజయవాడలో సీపీఎం ఆందోళనకు దిగింది. నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు , పరిశ్రమలు వచ్చినట్లు, యువతకు ఉపాధి కల్పించేసినట్లు చెబుతున్నారు. దేశం మొత్తంలో 25 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చేశాయని చెబుతున్నారు ..కానీ బడ్జెట్ అందుకు విరుద్ధంగా ఉందంటూ మండిపడ్డారు.‘‘కోతల మీద వాతలు పెట్టినట్లే ఉంది ఈ బడ్జెట్. రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. గత రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని తేలిపోయింది. బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదు. కౌలు రైతుల గురించి కనీసం ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ..ఊసే లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు.. అదీ లేదు...సూపర్ సిక్స్లో భాగమైనవి ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామంటున్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ సిటీ నిధులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. బెజవాడలో ఎటు చూసినా మురికి వీధులు, దోమల మయం. విజయవాడే ఇలా ఉంటి మిగిలిన పట్టణాల సంగతి చెప్పనక్కర్లేదు. రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి ప్రజల తిరోగమనానికి కారణమైన బడ్జెట్ ఇది’’ అంటూ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆసీస్కు షాకిచ్చిన ముజరబానీకి బంపరాఫర్!
ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జింబాబ్వే బౌలర్ బ్లెసింగ్ ముజరబానీకి బంపరాఫర్ వచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో వెస్టిండీస్ స్టార్ పేసర్ షమార్ జోసెఫ్ స్థానాన్ని ముజరబానీ భర్తీ చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. షమార్ జోసెఫ్పై వేటుకాగా మార్చి 26న పాక్ సూపర్ లీగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. రూ. 1.1 కోట్లకు (పాక్ కరెన్సీలో) కొనుగోలు చేసి షమార్ జోసెఫ్పై వేటు వేసింది. ఈ విండీస్ పేసర్ స్థానంలో జింబాబ్వే స్టార్ ముజరబానీని చేర్చుకుంది. అయితే, టెక్నికల్ కమిటీ నుంచి ఇందుకు ఆమోదం లభించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. షమార్ జోసెఫ్ను జట్టు నుంచి తొలగించడం పట్ల ఇస్లామాబాద్ యునైటెడ్ నోరు విప్పలేదు. అటు జోసెఫ్ సైతం మౌనంగానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల పరస్పర అంగీకారంతోనే అతడు తప్పుకొన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది.కారణం అదేనా?కాగా 2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టెస్టుల్లో అరంగేట్రం చేసి.. సత్తా చాటిన షమార్ జోసెఫ్ వ్యక్తిగత ప్రవర్తనతో చిక్కుల్లో పడ్డాడు. అతడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్కు షమార్ ఆడటాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ అతడితో బంధం తెంచుకోవడం గమనార్హం.ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించిన ముజరబానీఇక జింబాబ్వే రైటార్మ్ పేసర్ బ్లెసింగ్ ముజరబానీకి పాకిస్తాన్ సూపర్ లీగ్ కొత్తేమీ కాదు. 2021లో టైటిల్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. అయితే, గత కొంతకాలంగా అతడు పేలవ ప్రదర్శనతో సతమతమయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో ముజరబానీ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నాటి మ్యాచ్లో ముజరబానీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి.. నాలుగు వికెట్లు కూల్చాడు. జోష్ ఇంగ్లిస్ (8), టిమ్ డేవిడ్ (0), మ్యాట్ రెన్షా (65), ఆడం జంపా (2) వికెట్లు తన ఖాతాలో వేసుకుని జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఆసీస్పై గెలిచిన జింబాబ్వే.. 2007 తర్వాత టీ20 వరల్డ్కప్ తర్వాత రెండోసారి కంగారూ జట్టును ఓడించింది.చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
ప్రపంచంలోనే అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!
అందమైన ప్రకృతిలో అనేక రకాల వన్యప్రాణులు, పక్షులు మనల్ని అలరిస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతికి, మానవ సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తాయి తప్ప కీడు చేయవు. కానీ ప్రపంచంలోని ఏకైక విషపూరిత పక్షి ఒకటి ఉంది తెలుసా. పైకి రంగు రంగుల్లో అందిస్తూ కనిపిస్తూ మానవులకు కీడు చేస్తుంది. అదేంటో? దానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలేంటో తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విషపూరితమైన పక్షి. హుడెడ్ పిటోహుయ్ (Hooded Pitohui) న్యూ గినియా (New Guinea) లోని అడవుల్లో కనిపిస్తాయి. ఇవి చూడటానికి నారింజ మరియు నలుపు రంగుల కలయికతో చాలా అందంగా ఉంటాయి. కానీ దీని ఈకలను తాకినా, లేదా దాని మాంసాన్ని ఆహారంగా తీసుకున్నాతీవ్రమైన నాడీ సంబంధిత ప్రభావాలు ఏర్పడవచ్చు. సాధారణంగా వీటిని వండుకుని తినడానికి వీలుండదు (వండితే ఘాటైన వాసన , విషం వల్ల అనారోగ్యం కలుగుతుంది)ముఖ్యంగా జలదరింపు, తిమ్మిరి లేదా తేలికపాటి పక్షవాతం వంటివి సంభవించవచ్చు. విషపూరితమైన పక్షి ఎలా అయ్యింది?సాధారణంగా పాములు లేదా కప్పలు విషపూరితంగా ఉండటం చూస్తుంటాం, కానీ ఈ పక్షి ఈకలు, చర్మం , మాంసంలో కూడా విషం ఉంటుంది. పిటోహుయిస్ తమ సొంత విషాన్ని తయారు చేసుకోవు. హుడెడ్ పిటోహుయిస్ గురించి అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఇదొకటి. వాటి ఆహారం నుండి సీక్వెస్ట్రేషన్ అనే ప్రక్రియ ద్వారా పాయిజన్ఉత్పత్తి అవుతుంది. అంటే అవితీసుకున్న ఆహారంనుంచి విషాన్ని వారి శరీరంలో నిల్వ ఉంటుంది.ఇవి తినే ఒక రకమైన 'మెలైరిడ్' (Melyrid) బీటిల్స్ (పురుగులు) వల్ల వీటి శరీరంలోకి విషం చేరుతుందని జాక్ డంబాచర్తో సహా శాస్త్రవేత్తలు గుర్తించారు. హుడెడ్ పిటోహుయి కలిగి ఉన్న ఈ పురుగుల్లో విషాన్ని బాట్రాకోటాక్సిన్ (Batrachotoxin) అంటారు. ఇదే విషం కొలంబియాలోని 'పాయిజన్ డార్ట్' కప్పలలో కూడా కనిపిస్తుంది.అందుకే స్థానిక ప్రజలు వీటిని "చెత్త పక్షులు" అని పిలుస్తారు. ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యంమనుషులపై ప్రభావంఒకవేళ ఎవరైనా ఈ పక్షిని పట్టుకుంటే, ఆ విషం వల్ల చేతులు మొద్దుబారిపోవడం, మంట పుట్టడం లేదా తీవ్రమైన తుమ్ములు రావడం వంటివి జరుగుతాయి. ఈ విషపదార్థాలు పక్షి తనను తాను వేటాడే జంతువులు ,పరాన్నజీవుల నుండి రక్షించుకోవడానికి సహాయపడతాయి.పాములు లేదా ఇతర జంతువులు ఈ పక్షిని వేటాడకుండా ఈ విషం కాపాడుతుంది. అంతేకాదు వీటి ఈ ఈకల్లోని విషం వల్ల పేలు, బ్యాక్టీరియా వంటివి పక్షికి సోకవు.ఇది విషపూరితమని ఎపుడు గుర్తించారుశాస్త్రవేత్త జాక్ డంబాచర్ 1980ల చివరలో న్యూ గినియాలో ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి సారిగా ఈ విషపూరిత పక్షిని కనుగొన్నాడు. అతన ఈ పక్షులను తాకినప్పుడు, తన నోటిని లేదా కళ్ళను తాకిన తర్వాత, జలదరింపు, తిమ్మిరి, మండుతున్న అనుభూతిని అనుభవించాడని డిస్కవర్ వైల్డ్లైఫ్ తెలిపింది. తరువాత, పక్షి ఈకలు , చర్మం విషపూరితమైనవని కూడా గ్రహించాడు. 1992లో డంబాచర్, అతని బృందం హుడెడ్ పిటోహుయ్ చర్మం, ఈకలలో బాట్రాచోటాక్సిన్ అనే శక్తివంతమైన విషం, విషపూరిత సమ్మేళనాలు ఉన్నాయని చూపించే ఒక అధ్యయనాన్ని కూడా ప్రచురించింది. ఇదీ చదవండి: బోట్ రైడ్లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్ -
ఐఎంగా ఏఆర్సీఎఫ్!
ఢిల్లీలోని తీహార్ జైలులో మసూద్ అజర్, ఒమర్ షేక్, అహ్మద్ జర్గర్లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్ అన్సారీ, ఆసిఫ్ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ సహా పలువురిని కిడ్నాప్ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్గా చేరింది. 2001లో ఆసిఫ్ రజా ఎన్కౌంటర్ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్సీఎఫ్... ఐఎంగా ఎలా మారిందంటే..!కోల్కతాకు చెందిన కన్స్ట్రక్షన్ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆసిఫ్ రజా ఖాన్ కోల్కతాలోని మౌలానా ఆజాద్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన ముజాహిద్ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్ సలీం కూడా హాజరయ్యాడు. ఉత్తరప్రదేశ్లో ఆజమ్గఢ్ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ (2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్లో డెస్క్టాప్ ఇంజనీర్గా పని చేసేవాడు. ముజాహిద్ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్ సలీంతో సాదిక్ ఇష్రార్ షేక్కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. సాదిక్ను చితాక్యాంప్లోని ఓ సైబర్కేఫ్కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్ మెయిల్ ఐడీని ఆసిఫ్ రజా ఖాన్కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్కు తొలి మెయిల్ పంపిన ఆసిఫ్– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. చీతా క్యాంప్లోని మదీనా హోటల్ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్... ఆసిఫ్తో కలిసి పని చేయడం ప్రారంభించాడు. ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్ చేరిన మసూద్ అజర్ జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్గా మారింది. 2001 అక్టోబర్ 29న ఢిల్లీ స్పెషల్ సెల్తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్ పరేఖ్, పరేష్ షా కిడ్నాప్ ఒకటి. 2000 నవంబర్లో 11 గుజరాత్లోని రాజ్కోట్లో సిమ్లా మిర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్స్టర్ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్ రజా ఖాన్ బెయిల్పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్కోట్ కోర్టు నాన్–బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆసిఫ్ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్కోట్ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లే రాజ్కోట్ పోలీసులు ఆసిఫ్ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్ ఔట్ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్ రజా ఖాన్ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించాడు.ఆసిఫ్ మృతితో అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్సీఏఫ్ కోల్కతాలోని అమెరికన్ కాన్సులేట్ సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్పై (యూఎస్ఐఎస్) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. ఇలాంటి దాడులతో మోస్ట్ వాంటెడ్గా మారిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్సీఎఫ్ను అమీర్ రజా ఖాన్ 2003లో ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్ ఇష్రార్ షేక్ కో–ఫౌండర్గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని గోకుల్చాట్–లుంబినీ పార్క్ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్–4 ‘అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!’ వచ్చేవారం.∙ -
తెరపై శివతాండవం చేసిన హీరోలు వీళ్లే..
హిందువుల పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. భోళా శంకరుడు పార్వతీదేవిని పెళ్లాడిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈరోజు (ఫిబ్రవరి 15న) చాలామంది ఉపవాసం, జాగరణ ఉంటారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడి సినిమాలు చూస్తారు. పలువురు నటీనటులు వెండితెరపై మహాశివుడిగా మెప్పించారు. శివుడి వేషం వేసిన ఆ నటులెవరో చూసేద్దాం..ముందు గుర్తొచ్చేది ఆయనే..ఇప్పుడంటే భక్తి సినిమాలు తక్కువయ్యాయి.. కానీ ఒకప్పుడు పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చాయి. పురాణ కథలను వెండితెరపై చక్కగా చూపేవారు. వెంకటేశ్వరస్వామి, రాముడు, శివుడు, కృష్ణుడు.. ఇలా అందరి దేవుళ్ల వేషం కట్టేవారు. ఇక శివుడి పాత్ర వేసిన నటులు అనగానే ముందుగా గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ, దక్షయజ్ఞం వంటి సినిమాల్లో ఆయన భోళాశంకరుడిగా ఆకట్టుకున్నారు.ఏఎన్నార్, శోభన్బాబు కూడా..మూగ మనసులు మూవీలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో అక్కినేని నాగేశ్వరరావు శివుడి రూపంలో కనిపించాడు. శ్రీ వినాయక విజయంలో కృష్ణంరాజు, పరమానందయ్య శిష్యుల కథలో శోభన్బాబు, మగరాయుడు సినిమాలో కమెడియన్ మల్లికార్జునరావు, మావూర్లో మహాశివుడు మూవీలో రావు గోపాలరావు.., భూకైలాస్, నాగుల చవితి సినిమాల్లో నాగభూషణం, శ్రీ సత్యనారాయణస్వామి మూవీలో సుమన్ శివుడిగా మెప్పించారు.దేవుడిగా అద్భుతాలుశ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి, ఢమరుకంలో ప్రకాశ్ రాజ్, కన్నప్ప మూవీలో అక్షయ్ కుమార్ శివయ్యగా ఆకట్టుకున్నారు. సీతారామ కల్యాణం సినిమాలో ఎంత నేర్చినా ఎంత చూసినా పాటలో బాలకృష్ణ కాసేపు శివుడిగా కనిపించాడు. ఇలా ఎందరో యాక్టర్స్ యాక్షన్, ఎమోషన్స్తోపాటు పాటు భక్తిరస చిత్రాల్లోనూ నటించగలమని నిరూపించారు. తెరపై శివతాండవం చేసి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. -
అమెరికా-ఇరాన్ యుద్ధం?.. స్టాక్ మార్కెట్లలో టెన్షన్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సంభవించే అవకాశంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం ‘మిడ్ నైట్ హామర్ ఆపరేషన్’తో పోలిస్తే, ఈసారి అమెరికా మరింత వ్యూహాత్మక సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో యూ.ఎస్. విమాన వాహక నౌక బృందాన్ని మోహరించినప్పటి నుంచి, స్థానిక యూఎస్ శిబిరాల్లో కూడా సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి.అమెరికా దళాలు వారాలపాటు సైనిక కార్యకలాపాలకు సన్నద్ధమవుతున్నాయని సైనిక వర్గాలు అంతర్జాతీయ మీడియాకు అనామకంగా తెలియజేశాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊ అనడమే ఆలస్యం.. రంగంలోకి దిగి ఇరాన్పై దాడులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.శాంతి చర్చలు ఫలించేనా?ఇక ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలు జెనీవాలో జరగనుండగా, ఈ నెల 17న ఈ చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతాయని భావిస్తున్నారు. ఇరాన్ తన అణు పరీక్షలను ఆపకపోతే “సైనిక చర్యలు తప్పవు” అని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే, ఇరాన్ తన అణు, క్షిపణి కార్యక్రమాలను ఆపే ఎటువంటి ప్రణాళికలు లేవని ప్రకటించింది. అంతే కాకుండా, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడి జరిగితే, ప్రతీకారం తప్పనిసరిగా జరిగుతుందని హెచ్చరిస్తోంది. ఇలా పరిస్థితులు తీవ్రమైతే, ఈ ప్రాంతంలో యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచం అంతటా ముడి చమురు, బంగారం, స్టాక్ మార్కెట్లు ప్రభావితమవుతాయి.చమురు ధరలు పెరిగే అవకాశంఇదిలా ఉండగా, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయించాయి. ఇరాన్-చైనా చమురు అమ్మకాలపై అమెరికా దృష్టి సారించింది. ప్రస్తుతం ఇరాన్ చమురు అమ్మకాలలో 80 శాతం చైనాకు జరుగుతున్నాయి. దీన్ని నివారించగలిగితే ఇరాన్ ఆర్థికంగా మరింత నాశనం అవుతుందని ఇరు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. చైనాపై మరిన్ని సుంకాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదే జరిగితే, అరుదైన లోహాల ఎగుమతిపై చైనా మళ్లీ ఆంక్షలు విధిస్తుంది. ఇది యూఎస్-చైనా సంబంధాలను మరింత దిగజార్చుతుంది. ప్రధాన చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్ నుంచి ముడి చమురు ఆగిపోతే మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.బంగారం, వెండి ధరలపై ప్రభావంగత వారం హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి ధరలకు రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు కీలకం. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కావడంతో బంగారానికి కొత్త డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 5,041 డాలర్ల వద్ద ముగిసింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల భయాల మధ్య ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. -
మహాశివరాత్రి వేళ.. ఆసక్తికర ఆచారాలివే..
మహాశివరాత్రి.. కోట్లాది మంది భక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ పవిత్ర సమయంలో భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, మహా శివునికి అభిషేకాలు చేస్తారు. జాగరణ చేస్తూ ఆ పరమశివుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. ఆధ్యాత్మిక రాజధాని కాశీలో విశ్వేశ్వరునికి గంగాజలం, బిల్వపత్రాలతో విశేష పూజలు నిర్వహిస్తారు.హిమాచల్ ప్రదేశ్లోని మండిలో జరిగే ‘శివరాత్రి మేళా’లో దేవతలు పల్లకీల్లో భూత్ నాథ్ ఆలయానికి తరలిరావడం ఒక అద్భుత ఘట్టం. ఇక కశ్మీరీ పండిట్లు ‘హేరత్’ పేరుతో శివరాత్రిని పండుగను జరుపుకుంటారు, అక్కడ నిర్వహించే ‘వటుక్ పూజ’ ప్రత్యేక వంటకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కర్ణాటకలోని జోగ్ ఫాల్స్ వద్ద ‘వీరగాసె’ నృత్య ప్రదర్శనలు, తమిళనాడులోని తిరువణ్ణామలైలో 14 కిలోమీటర్ల మేర సాగే గిరిప్రదక్షిణ భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తాయి.శివారాధన కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నేపాల్లోని ప్రసిద్ధ పశుపతినాథ్ దేవాలయం వేలాది సాధువుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. మారిషస్లో హిందూ భక్తులు ‘గంగా తలావ్’ అనే పవిత్ర సరస్సు వరకు పాదయాత్ర చేస్తారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ‘మెలుకత్’ అనే ఆత్మశుద్ధి ప్రక్రియ ద్వారా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, ధ్యానముద్రలో శివరాత్రిని గడుపుతారు. కరీబియన్ దేశమైన ట్రినిడాడ్, టొబాగోలో కూడా భారతీయ సంతతి వారు రాత్రంతా శివ నామస్మరణతో ఆలయాల్లో జాగరణ చేస్తారు. -
మా కన్నీళ్లతో డబ్బు సంపాదించుకుంటున్నారు: సుప్రిత
సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత అమరావతికి ఆహ్వానం సినిమాతో వెండితెరపైకి వచ్చింది. తాజాగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన కెరీర్ ఆరంభంలోనే అనేక వివాదాలతో పాటు ట్రోలింగ్ను దాటుకుని వచ్చింది. అయితే, తమ వ్యక్తిగత జీవితం గురించి సుప్రిత పంచుకుంది.'కొన్ని సో కాల్డ్ మీడియా వారు మా కన్నీళ్లతో డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రతిదానికి మా గురించి తప్పుడు కథనాలు రాసేస్తున్నారు. వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా వెళ్లాం. అయితే, ఇప్పుడు బలంగా తయారయ్యాము. ఎంతటి నెగటివిటీ చేసినా సరే పట్టించుకనేది ఉండదు. గతంలో తెలిసోతెలీకనో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం. ఇప్పుడు అది కూడా లేదు. బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాల గురించి తెలిసిన తర్వాత మేము కూడా చాలా బాధపడ్డాం. నిర్మాత కేపీ చౌదరితో ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా సరే.. పదేపదే డ్రగ్స్తో లింక్లు అంటూ మాపై కొన్ని మీడియా ఛానల్స్లలో ప్రచారం చేశారు. కేపీ చౌదరిపై వచ్చిన వార్తా కథనాల వల్ల ఆయన కూడా కుంగిపోయారు. డ్రగ్స్తో సంబంధాలు పెట్టుకుని ఆయన తప్పు చేశాడు. కానీ, మరణించిన తర్వాత కూడా తప్పుడు థంబ్నైల్స్ పెట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ డబ్బు సంపాధించేకునేందుకు ప్లాన్ చేశాయి. అతను ఒక మంచి వ్యక్తిగా మాకు తెలుసు. కానీ, లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేశారు.' అని చెప్పింది.తన తల్లి సురేఖ వాణి రెండో పెళ్లి గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. రెండో పెళ్లి చేయాలనేది కేవలం తన కోరిక మాత్రమేనని ఆమె చెప్పింది. తన మదర్కు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. -
దురంధర్ మరో రికార్డ్.. ఏకంగా 59 రోజుల పాటు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే వసూళ్లపరంగా పలు రికార్డులు బద్దలు కొట్టిన దురంధర్.. రెండు నెలలు పూర్తయినా తగ్గేలేదే అంటోంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న ఈ చిత్రం బుక్ మై షోలో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక రోజులు ట్రెండింగ్లో ఉన్న చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, స్త్రీ-2, ప్రేమలు, పుష్ప-2 సినిమాలను దాటేసింది. ఈ మూవీ అత్యధికంగా 59 రోజులు బుక్ మై షోలో ట్రెండింగ్లో కొనసాగింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా సాధించని అతి పెద్ద ఘనతను దక్కించుకుంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన దురంధర్.. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. దీంతో బుక్ మై షోలో ఆల్టైమ్ రికార్డ్ సృష్టించింది.కాగా.. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన దురంధర్లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ సీక్వెల్గా ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న విడుదల కానుంది.బుక్ మై షోలో ట్రెండింగ్ సినిమాలు..1. ధురంధర్- 59 రోజులు2. ఛావా -58 రోజులు3. స్ట్రీ 2 -57 రోజులు4. ప్రేమలు- 53 రోజులు5. పుష్ప 2: ది రూల్- 53 రోజులు6. మంజుమ్మెల్ బాయ్స్- 50 రోజులు7. కల్కి 2898 ఏడీ- 49 రోజులు8. జవాన్- 48 రోజులు9. లోకా చాప్టర్- 1- 46 రోజులు10. మహావతార నరసింహ- 42 రోజులు -
వీడియో వైరల్: జర్మనీలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు అవమానం
జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు చేదు అనుభవం ఎదురైంది. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ గుర్తింపు కార్డు విషయంలో ఆయన్ని దాదాపుగా అడ్డుకున్నంత పని చేశారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్కు హాజరైన అసిమ్ మునీర్ను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు.తన బృందంతో కలిసి జర్మనీ నగరానికి అసిమ్ మునీర్ చేరుకున్నారు. కాన్ఫరెన్స్ ప్రవేశ ద్వారానికి కొద్ది అడుగుల దూరంలో ఉండగా, సెక్యూరిటీ సిబ్బంది.. ఆయన మెడలో వేలాడుతున్న ఐడీ కార్డును చూపించాలని కోరింది. ‘‘మీ ఐడీ కార్డును తిప్పి చూపగలరా?(ముందుకి కనిపించేలా)’’ అంటూ సెక్యూరిటీ కోరడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు, జర్మనీలోని సింధీ రాజకీయ సంస్థ జై సింధ్ ముత్తాహిదా మహాజ్(JSMM) అసిమ్ మునీర్ను ఆహ్వానించడంపై తీవ్రంగా వ్యతిరేకించింది. కార్యక్రమ వేదిక వద్ద జెఎస్ఎంఎం సభ్యులు నిరసన చేపట్టారు. పాకిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఈ సమావేశంలో మునీర్ పాల్గొనడం పట్ల అభ్యంతరం తెలిపారు.UPDATE!!Field Marshal Army Chief Asim Munir arrives for Munich Security Conference in Germany pic.twitter.com/v4PQpW4z77— HTN World (@htnworld) February 14, 2026 -
ఈ వారం కథ: సోల్మేట్
‘‘అమ్మా, నాకేం తెలీదు.. నువ్వు రేపు నాన్నతో కలిసి లిటరరీ ఫెస్టివల్కు వెళ్తున్నావంతే’’ అంటూ స్వర తన అంతిమ తీర్పును చెప్పేసింది. ఆ ఇంట్లో ఆమె చిన్నదైనా, తల్లిదండ్రుల ఏకైక గారాలపట్టి కావడంతో, తన మాట ఎలాగైనా నెగ్గేలా చేసుకోవడం ఆమెకు కొట్టిన పిండి! ‘‘స్వరా, ప్లీజ్! ఈ విషయంలో నువ్వు నన్ను బలవంతం చెయ్యొద్దు. నేనెందుకు పానకంలో పుడకలా? అదంతా మీ నాన్న ఫ్రెండ్ ఒకరి పుస్తకావిష్కరణ వేడుక. ఆ రచనకు మీ నాన్న ముందుమాట రాశారు. ఆ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. దాంతో పాటు ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, కథాగోష్ఠులు ఉన్నాయి. అక్కడ మీ నాన్నలాగే గొప్ప గొప్ప కవులు వచ్చుంటారు. ఇంకా కొంతమంది సాహిత్యాభిమానులు ఉపన్యాసం వినడానికి, కవితలు ఆస్వాదించడానికి వచ్చి ఉంటారు. నేను ఆ రెండు గుంపుల్లోనూ చేరని దాన్ని. అలాంటప్పుడు నేనెందుకు ఆ కార్యక్రమానికి వెళ్లి నా టైమ్ వేస్ట్ చేసుకోవాలి చెప్పు? నాకక్కడ చాలా అసౌకర్యంగా ఉంటుంది. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్’’ అంటూ అరగంట నుంచి తనను బతిమాలుతున్న కూతురి ఒత్తిడికి లొంగడానికి ఇష్టపడని సౌదామిని తన మనసులో మాటను కూతురికి చెప్పింది.‘‘అమ్మా, కొన్నిసార్లు మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం తప్పనిసరి అవుతుంది. ఇది కూడా అలాగే అనుకో.’’కూతురి మాటల ధోరణి సౌదామినికి వింతగా అనిపించింది! ఈ అమ్మాయి ఎందుకింత మొండిగా పట్టుబట్టి కూర్చుంది? ‘అమ్మను కవి సమ్మేళనానికి రమ్మని ఒప్పించు’ అని తన భర్తేమైనా దీనికి చెప్పి ఉంటారా అనే చిన్న అనుమానం ఆమెను వేధించినా, ఆయనకు తాను రావాలని ఉంటే, ఆయనే స్వయంగా చెప్పేవారు. కూతురి ద్వారా ఎందుకు చెప్పిస్తారు అనుకుని, తన ఆలోచనకు నవ్వుకుంది సౌదామిని.‘‘నాకు చాలా పని ఉంది. ఇటు చూడు, ఎవరో మీ నాన్న ఫ్రెండ్ ఇంత పెద్ద పనసపండు ఇచ్చి వెళ్లారు. దాని తొనలు తీసి సాయంత్రం కొంచెం పాఠోళీ చేయాలి. మిగిలిన దానిలో రేపు ఉదయం పనసపండు ఆవిరి కుడుములు చేయాలి. మీ నాన్నకు పనసపండు, ఇంకా దాని వంటకాలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. రేపు మీ నాన్న పుస్తకావిష్కరణ వేడుకకు వెళ్లేటప్పుడు ఆయనతో పాటు కారులో ఆయన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. అందుకే దారిలో తినడానికి ఏవైనా చిరుతిళ్లు చేయాలి. పోయినసారి చక్కిలాలు చేసిచ్చాను. అందరూ చాలా రుచిగా ఉందని ఇష్టపడి తిన్నారట. ఈసారి కొంచెం కారప్పూస చేస్తాను. ఇన్ని పనుల టెన్షన్లో నేనుంటే నువ్వు నాకు నక్షత్రకుడిలాగా తగులుకున్నావేమిటే?’’ అని విసుక్కుంది సౌదామిని.‘‘అమ్మా, కొంచెం నీ వంటగది ప్రపంచం నుంచి బయటికి రా. నువ్వు రేపు ఉదయం కుడుములు, గిడుములు అంటూ లేనిపోని పనులన్నీ నెత్తిన వేసుకుని కూర్చోకు. నాన్న తొందరగా బయలుదేరతారు. అందుకే నువ్వు ఆయనతో పాటు త్వరగా సిద్ధమై బయలుదేరు. రేపొక్క రోజుకు నేనే మ్యాగీ చేస్తాను. దట్స్ ఆల్!’’ అని స్వర చిరాకుగా చెప్పింది.‘‘స్వరా, నేను వెళ్ళను. నువ్వు నన్ను బలవంతం చేయకు. కొన్నిసార్లు నువ్వు కూడా, నేను ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్దాం పద అంటే ‘నేను రాను, నాకు అక్కడ డిస్కంఫర్టబుల్గా ఉంటుంది’ అంటూ తప్పించుకుంటావు కదా. నాకూ అలాగే ఉంటుంది. ఈ కవి సమ్మేళనం, సాహిత్య సంబరం, పుస్తకావిష్కరణ అంటూ నన్ను లాగొద్దు. మీ నాన్నతో ఇరవై ఐదు సంవత్సరాలు సంసారం చేశాను. మా ఇంట్లో జరిగిన గోష్ఠి తప్ప ఇప్పటివరకు ఆయనతో ఒక్క కవి సమ్మేళనంలోగాని, ఆయన పుస్తకావిష్కరణ వేడుకలోగాని నేను పాల్గొనలేదు. ఆయనా దాన్ని ఎక్స్పెక్ట్ చేయరు కూడా’’ సౌదామిని తల అడ్డంగా తిప్పుతూ, పనసతొనలు తీయడంలో లీనమైంది.‘‘అమ్మా, ఇన్నాళ్లు నువ్వు వెళ్లకపోయి ఉండవచ్చు. కాని, ఇక నువ్వు ఇలాగే కిచెన్ క్వీన్ అంటూ ఇంట్లోనే కూర్చుంటే, ఆ తర్వాత అంతే... నేను నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.’’‘‘ఏంటది, ఏదో చెప్పాలనుకుంటున్నావు. దాన్ని చెప్పడానికి ఇంతలా కష్టపడుతున్నావు? టెల్ మీ వాట్స్ ద మ్యాటర్?’’ ఇప్పుడు సౌదామినికీ ఏదో అనుమానం మొదలైంది.‘‘అమ్మా, విషయం ఇంకా చిన్నగానే ఉంది. కాని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అంటారే, ఇదీ కొంచెం అలాగే. నువ్వు ఏడ్చి గోల చేయనంటే చెబుతాను.’’ స్వర మరింత చిక్కుగా చెప్పింది.‘‘నువ్వు ఇంత సస్పెన్స్లో పెడితే ఎలా? నా గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది చూడు,’’ అని కొంచెం కలవరపడినట్లు పలికింది సౌదామిని.‘‘అమ్మా, అదీ నేను ఈ రోజు నాన్న స్నానానికి వెళ్ళినప్పుడు, నా మొబైల్లో చార్జ్ లేదని గూగుల్లో ఏదో సెర్చ్ చేయడానికి అని నాన్న మొబైల్ తీసుకున్నాను. సరిగ్గా అప్పుడే ఆయన వాట్సప్కి మానసగంగ అనే వారి నుంచి మెసేజ్ వచ్చింది. కుతూహలం ఆపుకోలేక చెక్ చేశాను... నీకు తెలుసా మానసగంగ ఎవరో?’’‘‘ఊ, ఎప్పుడో ఒకసారి మన ఇంటికి వచ్చినట్లుంది. హా! ఆ రోజు మీ నాన్న బర్త్డేకి మన ఇంట్లోనే కవి సమ్మేళనం ఉన్నప్పుడు చూశాను. నువ్వు అప్పుడు బెంగళూరులో ఇంజినీరింగ్ చేస్తున్నావు. యాక్చువల్గా ఆమె పేరు మానసగంగ కాదు, ఆమె పేరు సావిత్రి అంట. ఆ పేరు ఆమెకి ఇష్టం లేదంట, ఓల్డ్ ఫ్యాషన్డ్ అంట. ఆ పేరుతో కవిత రాస్తే ఎవరూ మెచ్చుకోరంట... అందుకే మానసగంగ అని కలంపేరు పెట్టుకున్నానని ఆ రోజే చెప్పింది. మీ నాన్నే తనకు కవిత రాయడానికి గురువు, స్ఫూర్తి అని కూడా చెప్పింది. ఆమె మీ నాన్నకు ఏం మెసేజ్ చేసింది?’’ సౌదామిని కనుబొమ్మలు ముడిచి అడిగింది.‘‘నాన్న మొబైల్లో ఆమె ఫోటో చూశాను. చాలా పిచ్చిగా ఉంది. ఎదురుగా ఎలా ఉంది?’’ స్వర కుతూహలంతో అడిగింది.‘‘చాలా ముద్దుగా ఉంది. అంతే బాగా మేకప్ వేసుకుని, స్టైల్గా చీర కట్టుకుని ఉంది. ఏదో కాలేజీలో తెలుగు లెక్చరర్గా వర్క్ చేస్తోందంట. ఎమ్మే చదివేటప్పుడే తన లెక్చరర్ ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకుందంట. ఆ పెళ్లి రెండు సంవత్సరాలు కూడా నిలవలేదంట... అదంతా ఆ రోజు కవి సమ్మేళనానికి వచ్చిన ఆడవాళ్లలో కొంతమంది గుసగుస లాడుకున్నారు. ఆ రోజు ఆమెనే కార్యక్రమం యాంకరింగ్ చేసింది. ఆమె యాంకరింగ్ స్టైల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అక్కడ సభలో కూర్చున్న ఎవరో ‘ఆహా, వగలాడి. అదేం స్టైలో, అదేం మేకప్పో, ఎవరినైనా మాటలతో లోబరచుకునే కళ ఈమెకు ఎంత బాగా అబ్బిందో చూడు’ అని తన పక్కన కూర్చున్న వారికి చెబుతున్నారు. దానికి పక్కనున్న ఆవిడ ‘ఏం చేస్తే ఏం లాభం? తన సంసారాన్ని నిలబెట్టుకోలేకపోయింది పాపం! ఈమె పంచవన్నెల చిలక అని తెలియగానే అతను ఈమెను వదిలేసి ఉంటాడు’ అని కిసుక్కున నవ్వింది. నాకు అయ్యో అనిపించింది. ఒక ఆడది ముందుకు వస్తే జనం ఎలా ఆమె గురించి లేనిపోనివన్నీ ఆడుకుంటారే అని చాలా చిరాకు కలిగింది. అదంతా సరే, నువ్వెందుకు ఆమె గురించి అడుగుతున్నావు? అలాంటిదేం మెసేజ్ పంపింది మానసగంగ, ఐ మీన్ సావిత్రి...’’‘‘అమ్మా, ఆమె నాన్నతో ఫ్లర్ట్ చేస్తోంది. నాన్నకు ఏవేవో మెసేజ్లు పంపింది. నాన్న కూడా దానికి అంతే రసికత్వంతో సమాధానమిచ్చారు. ఆమె పాత మెసేజ్లను కూడా నాన్న డిలీట్ చేయలేదు. నేను అదంతా స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్కు ఫార్వర్డ్ చేసుకుని ఆ తర్వాత నిదానంగా చదివాను. ఐ వాస్ ఇన్ ఎ షాక్. ఇద్దరూ కొంచెం ఎక్కువే క్లోజ్ అయినట్లుంది.’’ స్వర తన గొంతు తగ్గించి పలికింది. నాన్న గురించి తన తల్లి ముందు ఇలా చెప్పడానికి ఆమె మనసు కాస్త వెనుకంజ వేస్తోంది.‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి ఉందా నీకు? కేవలం సెక్స్, క్రైమ్, అనైతిక సంబంధాల చుట్టూనే అల్లిన సినిమాలను ఓటీటీల్లో చూడటం తగ్గించు. అప్పుడు ఇలా అందరిపై అనుమానం రావడం తగ్గుతుంది. ఆయన మీ నాన్న అన్న విషయం మర్చిపోయావా ఏంటి? ఈ మాట నీ బదులు వేరే ఎవరైనా చెప్పి ఉంటే, వాళ్ల నాలుకను కోసి ఇంటి గుమ్మానికి తోరణం కట్టి ఉండేదాన్ని!’’ సౌదామిని పనస తొనలు తీసే పనిని అక్కడితో ఆపి, చెంగున కత్తిపీట మీది నుంచి లేచి కోపంతో కూతురి వైపు చూసింది.‘‘ఆయన కేవలం నీకు భర్త మాత్రమే కాదు. నాకు నాన్న కూడా. అందుకే ఆయన గురించి చెప్పడానికి ముందు వందసార్లు ఆలోచించాను. వాళ్లిద్దరి చాటింగ్ల స్క్రీన్ షాట్ నీ మొబైల్కు పంపిస్తాను. నిదానంగా కూర్చుని చదువు.’’ అంటూ ఒక పనస తొనను నోట్లో వేసుకున్నది. కాని, ఎందుకో అది చేదుగా అనిపించి, దాన్ని ఊయడానికి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది.∙∙ సౌదామిని భర్త శేషగిరి ఒక పెద్ద కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్. అనేక విషయాలపై ఆసక్తి, జీవితం పట్ల అనురక్తి కలిగిన వ్యక్తి అతను. విమర్శకుడు, కవి, కథకుడు, అనేక మంది వర్ధమాన రచయితలకు మార్గదర్శకుడు. ఏ విషయం గురించి అయినా సభికులకు విసుగు రాకుండా రసవత్తరంగా ఉపన్యాసం ఇవ్వగలిగే వాక్చతురుడు! అతనితో పాటు పనిచేసే సై లెక్చరర్లందరూ కాలేజీ ముగిసిన తర్వాత, అలాగే వేసవి సెలవుల్లో కోచింగ్ సెంటర్కు వెళ్లి పాఠం చెప్పి జీతంతో పాటు ఎక్స్ట్రా ఇ¯Œ కమ్ సంపాదించడంలో మునిగి ఉన్నా, ఇతనికి కూడా చాలామంది అలాంటి సలహా ఇచ్చినా, శేషగిరికి లక్ష్మి కంటే సరస్వతియే ఎక్కువ ప్రియమైనదై, కథలు, కవితలు, వ్యాసాలు రాసి పుస్తకాలు ప్రచురించడంలోనే ఎక్కువ ఆసక్తి చూపించాడు. సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. ఏ లాబీయింగూ లేకుండానే కొన్ని అవార్డులు కూడా గెలుచుకున్నాడు. కాని, తానే మెచ్చి పెళ్లి చేసుకున్న సౌదామిని మాత్రం దానికి పూర్తి విరుద్ధం! ఎక్కువగా మాట్లాడని మౌనగౌరి ఆమె! కథలైనా కొంచెం చదివేదేమో కాని, కవితలంటే ఆమెకు అలర్జీ! పెళ్లైన కొత్తల్లో భార్యకు తన కవితలను చదివి వినిపించే అలవాటు శేషగిరికి ఉండేది. కాని, తాను కవితలు చదివి వినిపించేటప్పుడు భార్య మౌనంగా కళ్లు పెద్దవి చేసి చూసి, చివరకు ‘బాగుంది’ అని భావరహితంగా చెప్పడం చూసి, ఆమెకు దానిపై ఆసక్తి లేదని అర్థం చేసుకోవడానికి అతనికి ఎక్కువ కాలం పట్టలేదు. అందుకే నెమ్మదిగా అతను తన రచన గురించి భార్య ముందు చెప్పడమే మానేశాడు.సౌదామిని కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, తన పనిలో తాను నిమగ్నమై తన పతివ్రతా ధర్మాన్ని ఏమాత్రం తప్పకుండా పాటిస్తూ పోయింది. విపరీతమైన జిహ్వచాపల్యం ఉన్న భర్త అవసరాలన్నీ అర్థం చేసుకుని, అతని కోరిక తీర్చడంలోనే తన జీవితానికి ఒక సార్థకత ఉందని ఆమె భావించింది.శేషగిరి కాలేజీ ముగించి ఇంటికి వచ్చి భార్య చేసి ఇచ్చిన అల్పాహారం తిని, కాఫీ తాగి తన లైబ్రరీ గదిలోకి వెళితే అంతే. చదవడం, రాయడంలోనే లీనమైపోయేవాడు. గోడపై ఉన్న పాతకాలం పెండ్యూలమ్ గడియారం తొమ్మిదిసార్లు కొట్టినప్పుడే బయటికి వచ్చేవాడు! భోజనం తర్వాత కూడా ఏవైనా సగం చదివిన పుస్తకాలు ఉంటే, పూర్తి చేసే పడుకునేవాడు.ఎన్ని పుస్తకాలు చదివి, విమర్శలు రాశాడో అతనికే లెక్క లేదు. ఆ విమర్శాత్మక వ్యాసాలన్నింటినీ సేకరించి కొన్ని విమర్శా గ్రంథాలను వెలువరించాడు. అనేక కథా సంకలనాలు, కొన్ని కవితా సంకలనాలు, మూడు జీవిత చరిత్రలు ఇలా శేషగిరి ఒకటి రెండు రచనలైనా ప్రతి సంవత్సరం విడుదల అవుతూనే ఉండేవి. ఈ మధ్య స్మార్ట్ఫోన్ వచ్చాక కవులతో అతని స్నేహం మరింత పెరిగింది. వేరే వేరే ఊర్లలో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలకు అతిథిగా కూడా వెళ్లేవాడు. కాని, కవితల లోకంలో మునిగి ఉన్న తన భర్త, మానసగంగ అనే కవయిత్రితో రహస్యంగా చాటింగ్ చేస్తున్నాడనే చిన్న అనుమానం కూడా సౌదామినికి రాలేదు. దానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న వయస్సు అంతరం! మానసగంగకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు, శేషగిరికి యాభై రెండు!∙∙ కూతురు తన మొబైల్కు పంపిన అన్ని మెసేజ్లను చదివిన తర్వాత, సౌదామినికి భర్తపై అంతులేని కోపం వచ్చింది. తానేం తక్కువ చేశానని తన భర్త ఇలా ఆమెతో సరస సల్లాపాలు మొదలుపెట్టాడో ఆమెకు అర్థం కాలేదు. తనకు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా జాబ్ చేసే ఇరవై మూడు సంవత్సరాల కూతురు ఉన్నా, తాను ఇంకా అందాన్ని కోల్పోలేదు. ఇప్పటికీ నాజూకైన తీగలా సన్నగా, తెల్లగా, లక్షణంగా ఉన్న తాను తన భర్త దృష్టిలో పాతబడిపోయానా? లేదా ఆ మానసగంగ అంతలా మార్చివేసిందా? చాటింగ్ మొదలుపెట్టింది ఆమెనే. తన కవితలను కొన్ని పంపి ‘ఎలా ఉన్నాయో చూడండి సర్’ అని పెట్టింది. శేషగిరి వాటి లోటుపాట్లను సరిచేసి పంపినప్పుడు, దాన్ని పత్రికలకు పంపి పేరు సంపాదించుకుంది. అలా ప్రచురించబడిన కవితలను మళ్లీ శేషగిరికి పంపి ‘దీని క్రెడిట్ మీకే చెందాలి’ అని ఒక హృదయం ఎమోజీ పెట్టింది.శేషగిరికి మరో అలవాటు ఉండేది. ఇంటర్నెట్లో దొరికే అందమైన అమ్మాయిల ఫొటోలకు, ప్రకృతి ఫొటోలకు తగిన కవిత రాసి దాన్ని తన స్టేటస్లో, వాట్సప్ గ్రూప్లో పెట్టే అలవాటు! కాని, ఈ మానసగంగ అతని కవిత్వానికి సవాలు విసిరినట్లు, మరులుగొలిపే అందమైన చీర కట్టుకున్న, జుట్టు వదిలేసిన, పెదవులకు రంగు అద్దుకున్న, ఆకర్షణీయమైన భంగిమల్లో తన ఫోటోలు పంపి ‘దీనిపై ఒక కవిత రాయండి చూద్దాం’ అని మెసేజ్ చేసినప్పుడు, శేషగిరి బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఆ ఫొటోలన్నింటికీ ఆమె సౌందర్యాన్ని కొంచెం ఎక్కువే అనిపించేంతగా పొగిడి, శృంగారమయంగా కవితలు రాసి ఆమెకు పంపాడు. ఆ కవితలను చదివిన సౌదామిని గుండెలో అగ్నిపర్వతం బద్దలయ్యింది.సౌదామిని కన్నీళ్లు కారుస్తూ, స్వర రూమ్కు వచ్చి మంచంపై కుప్పకూలి కూర్చుంది. ‘‘నేను మీ నాన్నను దేవుడి లాంటి మనిషి అని నమ్మడం పెద్ద పొరపాటైంది. ఈ రోజు ఆయన ఇంటికి రానివ్వు. చెప్తాను. ఆయనకు. ఇరవై ఐదు సంవత్సరాలు నిష్ఠతో ఆయనతో సంసారం చేసినందుకు ఆయన నాకు మంచి బహుమతినే ఇచ్చారు. కవి సమ్మేళనం పేరుతో ఆమెతో సరసాలాడటానికి వెళ్తున్నారని నాకు ఈ రోజు తెలిసింది. అదీ నువ్వు చెప్పిన తర్వాత...’’ అని వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది.‘‘ఏడవొద్దమ్మా, అలాంటిదేం జరగలేదు...’’‘‘ఇంకేం జరగాలి...? ఆమె ఫొటోలన్నింటికీ అంత శృంగారమయమైన కవితలు రాశారు మీ నాన్న... ఇంకొన్ని రోజులు పోతే నన్ను కూడా ఇంటి నుంచి బయటికి తరిమేస్తుందేమో వగలాడి. ఆ రోజు ఆ ఆడవాళ్లు ఈమె గురించి ఆడిన మాటలు అబద్ధం కాదు...’’ సౌదామిని పళ్లు కొరుకుతూ చెప్పింది.‘‘అమ్మా, వాళ్లిద్దరి మధ్య అలాంటిదేం జరగలేదు. డోంట్ వర్రీ. నువ్వు నాన్న హృదయంలో ఖాళీగా వదిలిన స్థలాన్ని ఆమె ఆక్రమించింది అంతే. ప్రతి మనిషికి తన భావాలకు స్పందించే, తనను మెచ్చుకునే ఒక సోల్ మేట్ అవసరం ఉంటుంది. కళాకారులకు, కవులకు అలాంటి ఒక ఆత్మసఖుడు లేదా ఆత్మసఖి అవసరం ఎక్కువగా ఉంటుంది. కాని నువ్వు నాన్న కవితలను మెచ్చుకోలేదు, ఆయనలోని భావాలకు విలువ ఇవ్వలేదు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో దాని గురించి లోలోపల బాధపడి ఉండాలి. అలాంటి సమయంలో మానసగంగ ఆయన కవితలను మెచ్చి, అప్పుడప్పుడు గిలిగింతలు పెట్టే మెసేజ్లు చేస్తూ ఆయనకు దగ్గరైంది. కాని ఒక మాట మాత్రం నిజం. ఆమెతో చాటింగ్ చేసినప్పుడు బహుశా నాన్న మనసుకు ఏదో రిలాక్స్ ఫీల్ అవుతూ ఉండవచ్చు. అది తప్ప నాన్న ఆమెకు ఎక్కడా అశ్లీలంగా మెసేజ్ చేయలేదు... దాన్ని నువ్వు మర్చిపోవద్దు.’’‘‘ఊ, అదీ నిజమే. నేను ఆయనను అర్థం చేసుకోవాల్సింది. ఇప్పటికైనా నేను ఆయనకు ఒక ఫ్రెండ్గా అయ్యే, ఆయన తమ ఫీలింగ్స్ను పంచుకోవాలనుకునే ఆత్మసఖిగా అయ్యే ప్రయత్నం చేస్తాను. రేపు మీ నాన్నతో సాహిత్య కార్యక్రమానికి వెళ్తాను. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ నాన్న కవితలను, కథలను చదువుతాను. పాపం, ఊరంతా పొగిడే ఆయనను నేను ఒక్క రోజు కూడా మెచ్చుకోలేదు, పొగడలేదు...’’ సౌదామిని మనస్ఫూర్తిగా బాధపడుతూ పలికింది.‘‘నాన్నా, మీకు ఒక సర్ప్రైజ్. రేపు విజయవాడ లిటరరీ ఫెస్టివల్కు మీతో పాటు అమ్మ కూడా వస్తుందంట...’’ భోజనం చేస్తూ స్వర చెప్పినప్పుడు శేషగిరి నవ్వుతూ, ‘‘మీ అమ్మ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి వస్తుండాలి. ఆమెకు నా కవితల గురించి ఆసక్తి ఎక్కడుంది?’’ అన్నాడు.‘‘అయ్యో లేదులెండి, ఈ రోజు మీ బుక్ షెల్ఫ్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మీదొక కవితా సంకలనం దొరికింది. కొన్ని కవితలు చదివినప్పుడు చాలా ఇష్టమైంది... అందుకే నేను రేపు వద్దాం అని...’’ చెప్పింది సౌదామిని.శేషగిరి తనతో పాటు వచ్చే మరో ఇద్దరు కవులకు, మానసగంగకు తాను భార్య, కూతురితో కలిసి విజయవాడకు వస్తున్నానని, వారు వేరే కారు ఏర్పాటు చేసుకోవాలని మెసేజ్ చేశాడు.కారు వెనుక సీట్లో కూర్చున్న స్వర, ల్యాప్టాప్లో ఏదో వెబ్ సిరీస్ చూడటంలో లీనమైంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న శేషగిరి తన పక్కన కూర్చున్న సౌదామిని మిరుమిట్లుగొలిపే సౌందర్యాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఈ రోజు సౌదామిని, తాను కట్టుకున్న ఆకాశనీలం రంగు డిజైనర్ చీరలో, కూతురు ఆసక్తిగా చేసిన మేకప్లో శేషగిరి కళ్లకు అతిలోక సుందరిగా కనిపించింది.పుస్తకావిష్కరణ, ఉపన్యాసం ముగిసిన తర్వాత, కవి సమ్మేళనంలో శేషగిరి భార్యపై ఒక అందమైన ఆశుకవిత వినిపించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కార్యక్రమం చివర్లో ‘మేడమ్, శేషగిరిగారు ప్రణయ కవులు. మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది, ఇంత అందమైన భార్య ఉన్నప్పుడు ఆయన ప్రేమ కవితలు రాయకుండా ఉంటారా’ అని ఒకరిద్దరు పొగిడినప్పుడు సౌదామిని సిగ్గుపడింది. అయితే శేషగిరి ‘నిజం. నేను పెళ్లైన కొత్తల్లో ప్రచురించిన మూడు కవితా సంకలనాలు నా భార్య గురించే’ అన్నప్పుడు అవాక్కవడం సౌదామిని వంతు అయ్యింది.∙∙ ఇప్పుడు సౌదామినికి తీరికే లేదు. ఆమె ఇప్పుడు భర్తతో పాటు సాహిత్యానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ వెళ్తుంది. ఆసక్తిగా ఫొటోలు తీస్తుంది, అతని ఉపన్యాసం వీడియో చేసి తన ఫ్యామిలీ గ్రూప్కు షేర్ చేస్తుంది. నెమ్మదిగా ఆమెకు కూడా ఇప్పుడు సాహిత్యంపై ఆసక్తి మొదలైంది. భార్యలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పు శేషగిరిలో మరింత హుషారును నింపింది.మొన్న మొన్ననే తెనాలిలో జరిగిన నెలనెలా వెన్నెల కార్యక్రమానికి వెళ్లిన సౌదామిని కళ్లు మానసగంగ కోసం వెతికాయి. ఊహూ! ఆమె రాలేదు. అంతేకాదు, సౌదామిని భర్తకు తెలియకుండా ఆయన మొబైల్ కూడా చెక్ చేసి చూసింది. విజయవాడ కవి సమ్మేళనం తర్వాత మానసగంగ శేషగిరికి మళ్లీ మెసేజ్ చేయలేదు. ‘కవిత రాయండి’ అని తన అందమైన ఫోటో కూడా పంపడం మానేసింది. -
కథాకళి: నాతిచరామి
నా మిత్రుడు లీలాచరణ్ మందు మానేశాడని విని నేను నమ్మలేదు. అదే నిజమైతే అది ప్రపంచంలో ఎనిమిదో వింత అవుతుంది. లీలాచరణ్ భార్య, తల్లిదండ్రులు, స్నేహితులు, వాడితో పరిచయం ఉన్న ఎవరికైనా అది నమ్మలేని నిజమే. లీలాచరణ్ వయసు డెబ్బె ఏడు. వాడిని వాడు అంటున్నానంటే నా వయసుని మీరు ఊహించొచ్చు.నా కో–స్టూడెంట్గా పరిచయమయ్యే నాటికే లీలాచరణ్కి ఆల్కహాల్ అలవాటు ఉంది. అప్పుడే కొత్తగా ఆంధ్రాలో ప్రొహిబిషన్ తీసేశారు. ఓసారి మేథ్స్ టీచర్ వాడి నుంచి వాసన వస్తూంటే పట్టుకున్నప్పుడు మాకా సంగతి తెలిసింది. వాడి తండ్రి విద్యుత్ శాఖలో ఏదో కీలకమైన పోస్ట్లో ఉండడంతో పైసంపాదన చాలా వచ్చేది. పిల్లల మీద ప్రేమతో ఆయన వాళ్ళు అడిగినంత కాదనకుండా ఇస్తూండేవారు. లీలాచరణ్ తను తాగడమే కాక, కంపెనీకి మమ్మల్ని తన వెంట తీసుకెళ్ళి మా డ్రింక్ ఖర్చు కూడా తనే భరించేవాడు. నేను, మా క్లాస్లో చాలామంది మొదటిసారి మందు తాగింది లీలాచరణ్తోనే. ఆ కారణంగా లీలాచరణ్ మిత్రబృందం ఓ మందలా ఉండేది. కాలేజ్లో కూడా లీలాచరణ్ నా క్లాస్మేట్. వయసు పెరిగే కొద్దీ వాడిలో మందు అలవాటు కూడా పెరగసాగింది. లీలాచరణ్ తాగుడికి పరాకాష్ట గురించి చెప్పడానికి రెండు మూడు సంఘటనలని ఉదహరిస్తే చాలు. పెళ్ళిరోజున వాడు ఇంట్లోంచి మాయమయ్యాడు. మా మిత్రబృందం రైలు పట్టాల దగ్గర కూర్చుని తాగుతున్నవాడిని వెతికి తెచ్చాం.‘‘ఒరేయ్. బార్లో ఉంటే నన్ను పట్టుకుంటారని ఇక్కడికి వస్తే ఇక్కడా తగలడ్డారా మిత్రద్రోహుల్లారా!’’ దారిలో వాపోయాడు.ఈ కాలం పెళ్ళికూతుళ్లయితే ‘వాడికి నాకంటే మందు ముఖ్యమా? ఆ సీసాకి తాళి కట్టమనండి’ అని కోపంగా అరిచి వెళ్ళిపోయేవాళ్ళు. కాని 1970లలోని ఆడపిల్లల పరిస్థితి వేరు.వాడి తాగుబోతుతనాన్ని ఉదహరించదగ్గ రెండో సంఘటన. లీలాచరణ్ ఆ రాత్రి పన్నెండున్నరైనా ఇంటికి రాలేదని, వెతకమని మా ఇంటివారికి ఫోన్ చేసి నాకు చెప్పమని అతని భార్య చెప్పింది. నేను వెంటనే చెప్పులు తొడుక్కుని వెతకడానికి బయలుదేరాను. వాడు వెళ్ళే అన్ని బార్లకి వెళ్ళాను. ఓ బార్లోని వాళ్ళు చెప్పారు.‘‘మీవాడు చాలా తాగాడండి. ఎంత తాగాడంటే ఒంటి మీది లుంగీ ఊడిపోయిందని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాడు.’’నేను రోడ్లన్నీ తిరుగుతూంటే ఒంటి మీద కేవలం చొక్కా మాత్రమే ఉన్న, అండర్వేర్ కూడా లేని లీలాచరణ్ ఓచోట లైట్ స్తంభంతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు.మరో సంఘటన, స్కూటర్ని నడుపుతూ దాన్ని ఓ లారీ కిందకి పోనించాడు. వాడి అదృష్టం, స్కూటర్ పిప్పి పిప్పి అయింది కాని వాడికి ఏం కాలేదు. వాడు ఇంటికి శంషాద్ బేగం పాట ‘తుమ్హారీ యాద్ సతాతీ హై’ అని పాడుతూ చేరుకున్నాడు.అతని భార్య సాధ్వి అనే పదానికి సరైన నిర్వచనం. నాతిచరామి అనే వాగ్దానానికి వాడు కట్టుబడి లేడు. వాడిని తాగద్దు అంటే మండిపడతాడని గ్రహించిన ఆవిడ పెళ్ళైన మూడో నెల నించే ఆ మాటని మానుకుంది. ‘‘మిత్రమా. నాకు రమ్మంటే ప్రాణమా లేక నా భార్యంటే ప్రేమా అన్నది తెలుసుకోలేకపోతున్నాను. ఆ రెంటిలో ఏది లేకపోయినా జీవించలేను.’’ తాగనప్పుడు ఓసారి నాకు చెప్పాడు.అలాంటి లీలాచరణ్ మందు మానేశాడని, అది నిజమని తెలిశాక నేను వాడి ఇంటికి వెళ్ళాను.‘‘నా నుంచి ఎప్పటిలా ఏ సువాసనలు రానందుకు మన్నించు మిత్రమా.’’ నన్ను చూసి నవ్వుతూ చెప్పాడు.‘‘నిజమేనన్న మాట?’’ అడిగాను.‘‘చిత్తం. నా చిత్తాన్ని కత్తితో నరికి పారేశాను.’’‘‘ఇంత కాలానికి ఆ కత్తి ఎలా దొరికింది?’’ ప్రశ్నించాను.‘‘ఓసారి అన్నా గుర్తుందా, నాకు ఆ రెంటిలో దేని మీద ఎక్కువ ప్రేమో తెలీడం లేదని? ఇప్పుడు తెలిసింది. నా భార్య అంటేనే ప్రేమ.’’ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.‘‘నీ తాగుడు ఆమెకి ఇష్టం లేదని ఇంత కాలానికి గ్రహించి మానేశావంటే నమ్మను. డాక్టర్ ఇంకా ఎన్ని రోజులని చెప్పారు?’’ నవ్వుతూ అడిగాను.‘‘ఆరోగ్యం చెడింది నాకు కాదు. మా ఆవిడకి. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో నేను తాగిన మత్తులో ఉండడంతో గోల్డెన్ అవర్లో కాక, ఆలస్యంగా మర్నాడు మధ్యాహ్నం హాస్పిటల్కి తీసుకెళ్ళబట్టి కాళ్ళు చచ్చుపడ్డాయి. వెంటనే తేవాల్సిందని డాక్టర్ మందలించాడు. ప్రతి రాత్రి మూడు దాటాక ఆవిడని బాత్రూంకి తీసుకువెళ్ళాలి. మనిషి సహాయం లేకుండా నడవలేదు. కాబట్టి మేలుకుని ఉండాలని మందు మానేశాను.’’‘అయ్యో’ అనకుండా ఉండలేకపోయాను.‘‘దేవదాసు, రోమియోలని మించిన ప్రేమ నీది.’’ మనస్ఫూర్తిగా చెప్పాను.‘‘నాది కాదురా పిచ్చి వెధవా. పార్వతీ, జూలియట్లని మించిన ప్రేమ మా ఆవిడది. చాలాకాలం క్రితం ఆవిడకి అనారోగ్యం వచ్చినప్పుడు, డాక్టర్ ప్రతి రాత్రి తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పిన మాత్రని నా మీద ప్రేమతో వేసుకోవడం మానేసింది. ఆ మాత్రలో నిద్రని కలిగించే లక్షణం ఉంది. నేను తాగినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఇంటికి వస్తానో, అసలు వస్తానో, రానో ఆ సమయంలో తను మెలకువగా ఉండాలని దాన్ని వేసుకోవడం మానేసింది. దాంతో డాక్టర్ హెచ్చరించినట్లుగానే ఆవిడ రోగం ఇంత దూరం వచ్చింది. ఆ సంగతి నాకు చెప్పి ఉంటేనా...’’నవ్వుతూ చెప్పినా లీలాచరణ్ కళ్ళల్లో తడిని స్పష్టంగా చూశాను. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..!
దేవతలందరిలోకీ పరమ బోళా వాడు పరమేశ్వరుడొక్కడే. అవతలి వాడు అసురుడని, వాడు కోరుతున్న వరం లోకాలకే కాదు, తనకు కూడా ముప్పు కలిగిస్తుందని తెలిసి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదెప్పుడూ. ‘అదిన్నీ నీ పతిప్రాణంబు దక్క..’ అని సతీ సావిత్రికి యముడు పెట్టినట్టు మెలిక పెట్టలేదు. కోరిన వరాన్ని కోరిన విధంగానే అనుగ్రహించేశాడు ఆనక తానెన్ని తిప్పలైనా పడనీ... అందుకు ఉదాహరణే గజాసురుడు, భస్మాసురుడు, బాణాసురుడు. వారు కోరిన వరాలను ముందు వెనకలు ఆలోచించకుండా నెరవేర్చేశాడు. గజాసురుడు తన గర్భంలో వసించమని కోరితే ‘వస్తున్నాను పో΄ అనుకుంటూ అమాంతం అతడి పొట్టలోకి దూరిపోయాడు. ఇక భస్మాసురుడు తాను ఎవరి నెత్తిన చేయి పెడితే వారు భస్మం అయి΄ోయేలా వరం అడిగితే ‘ఇచ్చితిని పో’ అన్నాడు. ఆనక అతడి నుంచి తప్పించుకోలేక పరుగులు తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత బాణాసురుడు తన నగరానికి కాపలా కాయమంటే ‘చిత్తం మహాప్రభో’ అనేశాడు. రావణాసురుడు తన ఆత్మలింగాన్ని అడిగితే అరక్షణంలో అనుగ్రహించేశాడు. అది అతడికి దక్కితే ఆపై వాడి ఆగడాలకు ఇక పట్టపగ్గాలుండవని తెలిసి తక్కిన దేవతలందరూ కలిసి ఆత్మలింగాన్ని దక్కనీయకుండా చేయడం ఆ తర్వాత సంగతనుకోండి... అంతేనా! అనుగ్రహించడంలోనే కాదు... ఆయనకు ఆగ్రహం వచ్చినా కూడా పట్టలేరెవరూ... భయంతో తనను కాపాడమంటూ శరణుజొచ్చిన మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి పాశం విసిరినందుకు యముడి మీద కోపంతో ఎడం కాలితో ఒక్క తన్ను తన్ని అంతకుణ్ణే అంతం చేసిన కాలాంతకుడాయన! తపోదీక్షలో ఉన్న తన మనసును మథించిన మన్మథుణ్ణి ఒక్క కంటి చూపుతో కాల్చి బూడిద చేశాడు. ఒక్క హుంకారంతో అసురుణ్ణి, అతడి సైన్యాలనూ అంతం చేసిన మహాకాలే శ్వరుడాయన. ఆ పరమ శివుడు... ఆ ఆదిభిక్షువు.. ఆ పరమ దయాళువు... ఆ ఉమా మహేశ్వరుడు పట్టరాని సంతోషంతో ఆనంద తాండవం చేసే మహా పర్వదినమే మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఇలా అర్పించాలిపరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన మహాశివరాత్రి పర్వదినాన చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ అర్చనలు, అభిషేకాలు, ఆరాధనలు, పంచాక్షరీ పారాయణలతో పరవశించిపోతుంటాయి. జన్మానికో శివరాత్రి అన్నట్టు... ఈ పర్వదినాన ఆ ముక్కంటిని ఏ విధంగా మొక్కాలో పెద్దలు చెప్పిన విధం తెలుసుకుందాం... శివరాత్రి వేళ సూర్యోదయం కంటె ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి శివపూజలు, అభిషేకాలు చేయాలి. పగలంతా ఉపవాస వ్రతాన్ని పాటించడంతోపాటు రాత్రంతా జాగరణ చేయాలి. మొదటిజాములో పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించి, పుష్పాలతో పూజించి, పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండోజాములో పెరుగుతో అభిషేకించి, తులసీదళాలతో పూజించి, పాయసాన్ని నివేదించాలి. మూడవ జాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో పూజించి, నువ్వులతో వండినపదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. నాలుగవ జాములో తేనెతో అభిషేకించి పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీటితోపాటు లింగోద్భవ సమయంలో పూజలు చేయడంతోపాటు శివనామస్మరణంతో రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటిరోజు తిరిగి శివపూజలు చేసి నైవేద్యం సమర్పించి, భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. ఈ మహాపర్వదినాన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిపించడం ఆచారం. ఏకబిల్వం శివార్పణం... శివరాత్రినాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని, కనుక శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైనా శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది.శివరాత్రిదానం మహాపుణ్యఫలంసంపద కలిగిన వారు ఈరోజు శక్తిని అనుసరించి బంగారం లేదా వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందని, లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా... అంతులేనన్ని సంపదలు కలుగుతాయని శాస్త్రోక్తి.– డి.వి.ఆర్. (చదవండి: ఆయన జగం ..ఆమె సగం) -
వణికించిన పసికూన!.. పట్టలేనంత ఆనందం: హ్యారీ బ్రూక్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇప్పటికే రెండు సంచలనాలు నమోదయ్యాయి. టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన ఇటలీ.. మూడోసారి వరల్డ్కప్ ఆడుతున్న నేపాల్ను ఓడించింది. ఇక మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే షాకిచ్చింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో చాంపియన్ జట్టును ఓడించింది.ఇక తాజాగా గ్రూప్-సిలో భాగంగా ఇంగ్లండ్కు పసికూన స్కాట్లాండ్ చెమటలు పట్టించింది. నేపాల్తో మ్యాచ్లో ఎలాగోలా గట్టెక్కిన బ్రూక్ బృందం.. స్కాటిష్ జట్టుపైనా అదే రీతిలో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.ఈరోజు కూడా గెలుపు గీత దాటేశాముఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టామ్ బాంటన్ (Tom Banton)ను ప్రశంసించాడు. అదే విధంగా జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) సైతం మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. "ఈరోజు కూడా మేము గెలుపు గీతను దాటేశాము. పట్టలేనంత సంతోషం.మా స్పిన్ బౌలింగ్లో స్కాట్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఆ సమయంలో వారు మాకంటే ముందంజలో నిలిచారు. అయితే, మేము తిరిగి పుంజుకున్నాం. ఆర్చర్ తన మ్యాజిక్ చూపించాడు.జాగ్రత్తగానే ఉంటాముఇక లక్ష్య ఛేదనలో బాంటన్ అద్భుతం చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి గొప్పగా ఆడాడు. కోల్కతా వికెట్ బాగుంది. సామ్ కర్రాన్ సైతం కాసేపు మెరుపులు మెరిపించాడు. మా చివరి మ్యాచ్లో ఇటలీతో తలపడతాం. వాళ్లతో జాగ్రత్తగానే ఉంటాము’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. కాగా కోల్కతా వేదికగా శనివారం ఇంగ్లండ్- స్కాట్లాండ్ తలపడ్డాయి.వణికించిన పసికూనఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (32 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మైకేల్ జోన్స్ (20 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లు రషీద్ (3/36), ఆర్చర్ (2/24), డాసన్ (2/34) స్కాట్లాండ్ బ్యాటర్ల పనిపట్టారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి గెలిచింది. ఆరంభమైన తొలి ఓవర్లో సాల్ట్ (2), రెండో ఓవర్లో బట్లర్ (3)... ఇలా ఇద్దరు మేటి హిట్టర్లను 13 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో బెథెల్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ ఇంగ్లండ్ను ఆదుకున్నారు.గెలిపించిన బాంటన్అయితే జట్టు స్కోరు 79 వద్ద బెథెల్, కాసేపటికే కెప్టెన్ బ్రూక్ (4) వికెట్లు పారేసుకోవడంతో మళ్లీ 86/4 స్కోరు వద్ద ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. దీంతో జట్టును గెలిపించే బాధ్యతను పూర్తిగా తన భుజాన వేసుకున్న టామ్ బాంటన్ (41 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధసెంచరీతో గెలిపించాడు.బాంటన్కు తోడు సామ్ కరన్ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్లు), జాక్స్ (16 నాటౌట్)లు రాణించారు. ఫలితంగా ఇంకో 10 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మెక్ములెన్, క్యూరి, వీల్, లీస్క్ తలా ఒక వికెట్ తీశారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తమ రెండోమ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. History made! ✍️England register their first-ever T20 World Cup win over a European side with a solid five-wicket victory over Scotland. 👏Up next ➡️ ICC Men’s #T20WorldCup | #NZvSA | LIVE NOW 👉 https://t.co/QWNvn10eTj pic.twitter.com/mscD1rxSmH— Star Sports (@StarSportsIndia) February 14, 2026చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
శివయ్య భక్తులకు శుభవార్త
కేదార్నాథ్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్ ఆలయ ద్వారాలు ఈ ఏడాది(2026) ఏప్రిల్ 22న భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. హిమాలయ పర్వత శ్రేణులలో కొలువై ఉన్న పరమశివుని ఈ దివ్య క్షేత్రానికి ప్రతి ఏటా దేశం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. శీతాకాలం విరామం తర్వాత బాబా కేదార్నాథ్ దర్శనం పునఃప్రారంభం కానుండటంతో ఉత్తరాఖండ్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.ఆలయ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 22 ఉదయం 8:00 గంటలకు వృషభ లగ్నంలో కేదార్నాథ్ ఆలయ తలుపులు శాస్త్రోక్తంగా తెరుచుకోనున్నాయి. ఉఖిమఠ్లోని శీతాకాల నివాసమైన ఓంకారేశ్వరాలయంలో ఈ ప్రారంభ తేదీ , సమయాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారిగా టీ గంగాధర్ లింగ్ను నియమించారు. ఆలయంలో జరిగే పవిత్ర పూజా కార్యక్రమాలను, ఆచారాలను ఈయన పర్యవేక్షించనున్నారు.కేదార్నాథ్తో పాటు ఉత్తరాఖండ్లోని ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల (చార్ ధామ్) ప్రారంభ తేదీలను కూడా అధికారులు వెల్లడించారు. బద్రీనాథ్ ఆలయ ద్వారాలు 2023, ఏప్రిల్ 23న ఉదయం 6:15 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో తెరుచుకుంటాయి. అంతకుముందే ఏప్రిల్ 7 నుండి వార్షిక యాత్ర ప్రారంభం కానుంది. అలాగే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని 2026, ఏప్రిల్ 19న భక్తుల కోసం తెరుచుకోనున్నాయి.కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం కానుండటంతో హిమాలయాల ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులు తమ ప్రయాణం, వసతి, ఆరోగ్యానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎత్తయిన ప్రాంతాలలో ఉండే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలతో ఆధ్యాత్మిక యాత్రను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.ఇది కూడా చదవండి: Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా.. -
ఇది మోసపూరిత బడ్జెట్: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే ప్రజలకు నిరాశ, నిస్పృహ కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బడ్జెట్ మోసపూరిత బడ్జెట్.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్లో కేటాయింపులు లేవు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక అవస్థలు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు...నాడు-నేడు స్కీమ్ను సమాధి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ ఉంటే వైఎస్సార్, జగన్కు పేరొస్తుందని భయం. ఆరోగ్యశ్రీని రద్దు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిని ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాబోయే రోజుల్లో లక్ష కోట్లు అప్పులు చేస్తామని చెబుతున్నారు...బడ్జెట్లో మహిళా సాధికారత వెతికినా కనిపించదు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి హామీలిచ్చారు. ఆడబిడ్డ నిధి అన్నారు ఏమైంది?. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు ఏమైంది?. జాబ్ క్యాలండర్ ఇస్తామన్నారు ఏమైపోయింది?. ప్రజలను మభ్యపెట్టి బడ్జెట్ రూపొందించారు. గత బడ్జెట్లో కేటాయింపులెంత?. ఎంత ఖర్చుచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వివిధ రంగాలకు చేయూతనివ్వాల్సింది పోయి దుబారా ఖర్చులు చేస్తున్నారు. హెలీకాప్టర్లకు, లూద్రా వంటి లాయర్లకు ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. -
ఉద్యోగం మారాలా? ఈ బారుకెళ్లండి!
కొందరు మనసు బాగా లేకుంటే బారుకెళతారు. ఇంకొందరు సంతోషాన్ని పట్టలేక బారుకెళతారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకోవడానికి సురశాలలు సురక్షితమైన వేదికలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల బార్లు ఉన్నాయి. ఏ బారుకు ఎవరు వెళ్లినా, అక్కడ చేసేదొక్కటే! కాస్త మందు పుచ్చుకుని, మనసును సేదదీర్చుకోవడమే! జపాన్లోని యోకోహామాలో ఉన్న ‘తెన్షొకు సొడాన్’ బారు మాత్రం ఇంకొంచెం ప్రయోజనాత్మకమైన బారు. ఉన్న ఉద్యోగాల్లో విసిగిపోయిన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారు ఇది. చాలాకాలంగా ఉద్యోగం చేస్తున్నా, ఎదుగూ బొదుగూ లేనివారు ఉద్యోగం మారాలనుకుంటున్నట్లయితే, అలాంటి ఉద్యోగులకు ఈ బారు సరైన వేదిక. ఉన్న ఉద్యోగం వదిలేసి మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. అలాంటి వారికి ఈ బారులో కెరీర్ కౌన్సెలర్లతో ప్రత్యేకమైన గదుల్లో ప్రైవేటు సిటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. గంట నుంచి గంటన్నర సేపు కొనసాగే ఈ సిటింగ్లలో కెరీర్ కౌన్సెలర్లతో కలసి మందేస్తూ, మారబోయే ఉద్యోగాల గురించి మనసు విప్పి చర్చించుకోవచ్చు. అర్హతలు, అదృష్టం బాగుంటే మంచి ఆఫర్ అక్కడికక్కడే పొందవచ్చు కూడా! ఈ విలక్షణమైన బారు ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభమైంది. -
"హల్దిరామ్ వివాహం": వేదికగా ప్యాలెస్ సెట్, భారీ కేక్..
అత్యంత విలావంతసమైన వివాహా వేడుక. చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నంత రేంజ్లో హంగుఆర్భాటంగా జరుగుతోంది. ఓ పక్క బాణసంచాతో దద్దర్లిపోతున్న ఆకాశం, మరోవైపు ప్యాలెస్ రేంజ్ వేదిక సెట్, బారీ కేక్లు, మంచు విగ్రహాలు..ఎన్నో అబ్బురపరిచే...దృశ్యాలతో మిరుమిట్లు గొలిపేలా పెళ్లి వేడుక జరుగుతుంది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదంటే..అది బిలియనీర్ శివకిషన్ అగర్వాల్ వివాహ వేడుక. నాగపూర్లో అట్టహాసంగా జరిగింది. అత్యంత విలాసవంతమైన వివాహ వేడుకలో ఒకటిగా నిలిచింది కూడా. ప్యాలెస్లాంటి వివాహ సెట్, ఎత్తైన పూల అలంకరణలు, మెరిసే మంచు శిల్పాలు, ప్రతిది కనుతిప్పుకోనివ్వతంగా అందంగా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. ఈ వేడుకలో సంగీత్లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ డ్యాన్స్ హైలెట్గా నిలిచింది. View this post on Instagram A post shared by The Cake Affair Ⓡ | Custom Cake Boutique (@thecakeaffair.nagpur) అంతేగాదు బారీ కేక్, అడుగడుగున రాజదర్పం ఉట్టిపడేలే అత్యంత గ్రాండ్గా జరిగింది ఆ వివాహ తంతు. ఈ వివాహానికి బిజెపి నాయకుడు హన్స్రాజ్ అహిర్ హాజరై నూతన వధువరులకు పూలబొకేని బహుకరించారు. అంతేగాదు ఆయన వారి వైవాహిక జీవితం అత్యంత సంతోషభరితంగా సాగిపోవాలంటూ ఆ జంటను దీవించారు కూడా View this post on Instagram A post shared by Harsh Ekonkar | FOOD & TRAVELLER 🇮🇳 (@harsh_storiess) ఎవరీ శివకిషన్..?హల్దిరామ్ వ్యవస్థాపక కుటుంబంలోని మూడవ తరం శివకిషన్ అగర్వాల్. ఆయన నాగ్పూర్ ఆధారిత వ్యాపార విభాగానికి నాయకత్వం వహిస్తారు. హల్దిరామ్ బ్రాండ్ రాజస్థాన్లోని బికనీర్లోని ఒక చిన్న దుకాణంలో మూలాలు ఉన్నాయి. దీనిని శివకిషన్ అగర్వాల్ తాత గంగా బిషన్ అగర్వాల్ ప్రారంభించారు. కాగా ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ స్నాక్స్, మిఠాయి బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ఏప్రిల్ 2023లో ఢిల్లీ, నాగ్పూర్కు చెందిన కుటుంబంలోని రెండు విభాగాలు కలిసి హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ లిమిటెడ్ను సృష్టించాయి. ఈ వ్యాపారంలో ఆయన వాటా ఏకంగా రూ. 27 వేల కోట్లు. (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
ధురంధర్లో ఆఫర్.. క్లారిటీ ఇచ్చిన నాగార్జున
గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమా ధురంధర్. మౌత్ టాక్తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోనూ దుమ్ము దులుపుతోంది.అక్షయ్పై సర్వత్రా ప్రశంసలురణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. సినిమా రిలీజయ్యాక అందరికన్నా ఎక్కువగా అక్షయ్ పేరే మారుమోగిపోయింది. అతడి స్వాగ్, డ్యాన్స్, లుక్స్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. రెహ్మాన్ డకాయిట్గా అక్షయ్ అదరగొట్టేశాడని ప్రశంసలు లభించాయి.స్పందించిన నాగ్అయితే రెహ్మాన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు నాగార్జునను సంప్రదించారని ఓ వార్త ఫిల్మీదునియాలో వైరలవుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని కింగ్ నాగ్ కొట్టిపారేశాడు. ధురంధర్ సినిమా కోసం తనను సంప్రదించలేదని కుండ బద్ధలు కొట్టాడు. ఒకవేళ తనకు అవకాశం ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ధురంధర్ మూవీ చాలా బాగుందన్నాడు. సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం అదిరిపోయిందని, అతడి ముందు సినిమా ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ కూడా తనకు ఎంతగానో నచ్చిందని ప్రశంసించాడు. సినిమాలో అందరూ బాగా నటించారని, అక్షయ్ ఖన్నా అద్భుతంగా యాక్ట్ చేశాడని మెచ్చుకున్నాడు. ధురంధర్ సీక్వెల్ కూడా మరింత బ్లాక్బస్టర్ అవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ధురంధర్ 2 మూవీ మార్చి 19న విడుదలవుతోంది.చదవండి: కపుల్ ఫ్రెండ్లీకి హిట్ టాక్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే? -
బోట్ రైడ్లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్
అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటాక్రూజ్ సమీపంలో సముద్రంలో బోటు ప్రమాదంనుంచి ఒక కుటుంబం తృటిలో తప్పించుకుంది. బోటింగ్ చేస్తున్న సమయంలో భారీ అలలు విరుచుకుపడటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలా? తెలుసు కుందాం.సముద్రం తీరానికి వెళ్లినపుడు బోటింగ్కి వెళ్లడం సర్వ సాధారణం. అలా నలుగురు పిల్లలతో ఒక జంట కూడా బోటింగ్కు వెళ్లింది. చాలా ఉత్కంఠ భరితంగా రైడ్ను ఆస్వాదిస్తున్నారు వారంతా. పడవ నెమ్మదిగా ఒడ్డు వైపు కదులుతోంది. ఇంతలో అకస్మాత్తుగా రాకాసి అలలు విరుచుకు పడ్డాయి. అలల ధాటికి పడవ తిరగపడింది. అనేక మంది సర్ఫర్లను దాటి దూసుకెళ్లి, పడవ పల్టీలు కొట్టడంతో మొత్తం ఆరుగురూ నీటిలో మునిగి పోయారు. ఈ దృశ్యాలు సర్ఫర్లను రికార్డు చేస్తున్న వారి దృష్టిలోపడింది. వెంటనే వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. సర్ఫర్లు, విరోస్ట్కో,అతని స్నేహితుడు ట్రైక్, ఇతర సర్ఫర్లు తక్షణమే స్పందించారు. సమయస్ఫూర్తితో వారిని ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ, సర్ఫర్లలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటన ఫిబ్రవరి 13, 2026న శాంటా క్రజ్ వెస్ట్ క్లిఫ్ డ్రైవ్ సమీపంలో జరిగింది. మూడుసార్లు మావెరిక్స్ విజేత డారిల్ 'ఫ్లీ' విరోస్ట్కోతో సహా సర్ఫర్ల బృందం ఈ కుటుంబాన్ని రక్షించేందుకు చొరవ చూసి అనేక ప్రశంసలందుకుంది. శాంటా క్రజ్ అగ్నిమాపక విభాగండిపార్ట్మెంట్ వాటర్ రెస్క్యూ విభాగం దీనిపై స్పందించింది. ఆరుగురు బాధితులను విజయవంతంగా రక్షించిన స్థానిక సర్ఫింగ్ కమ్యూనిటీ, ఇతర ఏజెన్సీలను అభినందించింది. ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రోటోకాల్స్ పాటించారా? లేదా అనేదానిపై దర్యాప్తు చేస్తోంది.ఇదీ చదవండి: FASTag వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్హెచ్ఏఐ తాజా హెచ్చరిక!బిగ్ వేవ్ సర్ఫర్ డారిల్ 'ఫ్లీ' విరోస్ట్కో మాట్లాడుతూ నమ్మలేకపోతున్నా.. కానీ చిన్న పిల్లలతో అందరూ ఈ పడవ ప్రమాదం నుండి బయటపడ్డారంటూ ఆనందాన్ని ప్రకటించారు. మరోవైపు బోటింగ్ సమయంలో లైఫ్ జాకెట్లు ధరించడం తప్పనిసరి. ఈ ప్రమాదంలో వీరంతా లైఫ్ జాకెట్లను ధరించలేదని తెలుస్తోంది. -
చంద్రబాబు మోసాలకు అద్దంపట్టే బడ్జెట్: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ఐదు బడ్జెట్లు ప్రజా ఆమోదయోగ్యమైనవని.. కరోనా లాంటి పరిస్థితుల్లో సైతం సంక్షేమం ఎక్కడా ఆగలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దారుణంగా ఉందని.. ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కేటాయింపు లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు సైతం అంతంతమాత్రమే కేటాయింపులు జరిపారన్నారు.‘‘అన్నదాత సుఖీభవ పథకానికి 6 లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో వున్నాయి. రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్. ఉద్యోగులను, కార్మికులను ఇలా అన్ని రంగాల వారిని మోసం చేశాడు. అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన బడ్జెట్గా చూడాలి. చంద్రబాబు మోసాలకు అద్దం పట్టే బడ్జెట్’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. -
రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టి.. ఇప్పుడు ప్రముఖ నటి..!
బాలీవుడ్ తారలకు ఇటీవల బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలైన రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు బెదిరింపులొచ్చాయి. తాజాగా మరో నటికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ నటి హిమాన్షీ ఖురానాకు బెదిరింపులొచ్చాయి. పది కోట్లు ఇవ్వాలని ఓ దుండగుడు డిమాండ్ చేశాడు. దీంతో నటి పంజాబ్లోని మొహాలీ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఈ మెయిల్ ద్వారా వాయిస్ నోట్ వచ్చిందని.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని హిమాన్షీ తన ఫిర్యాదులో పేర్కొంది. జీషన్ అక్తర్ అనే పేరుతో మెయిల్ వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. నటి హిమాన్షీ ఖురానీ పంజాబీ మూవీ సద్దా హక్తో ఫేమ్ తెచ్చుకున్నారు. జోడీ బిగ్డే పార్టీ, నా.. నా.. నా లాంటి ఆల్బమ్స్తో అలరించారు. అంతేకాకుండా హిందీ బిగ్బాస్ సీజన్- 13లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. -
‘ఏఐ సాంకేతికత అందరిదీ’: ‘సమితి’ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాల్లో విస్తరిస్తున్న భారత్ ప్రభావంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రశంసలు కురిపించారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి కీలక అంశాలపై ప్రపంచ స్థాయి చర్చలు నిర్వహించడానికి భారత్ అత్యంత అనువైన దేశమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధి పథంలో ఉందని, ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఏఐ సాంకేతికత మానవాళి అందరికీ ఉపయోగపడాలని ఆంటోనియో గుటెర్రెస్ ఆకాంక్షించారు.ఏఐ సాంకేతికత కేవలం ధనిక దేశాలకో లేదా రెండు అగ్రరాజ్యాలకే (అమెరికా, చైనా) పరిమితం కాకూడదని గుటెర్రెస్ పేర్కొన్నారు. ఈ శక్తివంతమైన సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందాలని, ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ దేశాలకు ఇందులో సమాన వాటా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఈ అధికారం ఉంటే అది ఆమోదయోగ్యం కాదని, అభివృద్ధి, ఆవిష్కరణలు, ప్రపంచ ప్రగతికి ఏఐ ఒక సార్వత్రిక సాధనంగా మారాలని ఆయన అన్నారు.ఫిబ్రవరి 16 నుండి 20 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఈ సదస్సు, గ్లోబల్ సౌత్లో జరుగుతున్న మొట్టమొదటి భారీ ఏఐ సదస్సుగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ తదితర దిగ్గజాలు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకు గుటెర్రెస్ స్వయంగా భారత్కు రానున్నారు.కాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పులు రావాలని, నేటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలని ఆయన కోరారు. భారత ప్రాచీన నాగరికత, ప్రజాస్వామ్య విలువలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని కొనియాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీతో జరగబోయే భేటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా.. -
14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..
వెయిట్లాస్ జర్నీలో అనేది శారీరక, భావోద్వేగ ఇబ్బందులతో ముడిపడి ఉన్న అంశం అని అంటోంది ఓ డాక్టర్. తాను ప్రెగ్నెన్సీ అనతరం ఎంతలా బరువు పెరిగిందో సవివరంగా తెలిపింది. ఆ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఎంతలా శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కుందో తెలిపింది. ఆఖరికి వెయిట్లాస్ మందులు సైతం పెద్దగా ఫలితం ఇవ్వకపోగా..చివరికి దుష్ప్రభావాల బారినపడి ఎంతలా ఇబ్బందిపడిందో పేర్కొంది. అయితే బరువు తగ్గాలంటే అచంచలమైన ఓపిక, స్థిరత్వం అత్యంత ముఖ్యమని అంటున్నారామె. అలా అన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ..ఒకటిన్న ఏడాదిలోపు చాలా బరువు తగ్గగలిగానని అంటోంది. ఎవరా డాక్టర్..? ఆమె వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..చెన్నైకి చెందిన వైద్యురాలు ప్రీతి మృణాళిని తన వెయిట్లాస్ జర్నీ గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన లాపరోస్కోపిక్ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళినికి వైద్యురాలిగా 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె ప్రసవం తర్వాత తన బాడీ ఎలా మారిపోయిందో వివరించారు. 2021లో గర్భందాల్చినప్పుడు తన బరువు 78 కిలోలని పేర్కొంది. అయితే 2022లో ప్రసవం అనంతరం 79 కిలోలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులోనూ సీ సెక్షన్ కారణంగా ఒక నెలపాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడంతో విపరీతమైన ఆకలి విపరీతంగే వేసేదని, దాంతో 92 కిలోలు దాక పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ప్రతి ఉయం మేల్కొని వ్యాయామాలు చేస్తూ ఉండేదాన్ని..అయితే బరువులో మార్పు లేకపోగా..మరింత అధికమైంది. ఈ అధిక బరువు తన రూపంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని అంటోంది. అప్పుడే జీఎల్పీ 1 అనే బరువు తగ్గించే మందులను వాడినట్లు తెలిపారు. దాంతో మార్పు కనబడటం మొదలైది కానీ ఒక కిలోనే తగ్గానని అన్నారు. అయితే ఈ డ్రగ్ కారణంగా జుట్టు రాలిపోవడం, నోరు పొడిబారడం, వ్యాయమం సమయలో కండరాల అలసట తదితర సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే చాలా ఓపికతో తన జీవనశైలిని మార్చుకుని..బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టి సుమారు 14 కిలోలు తగ్గినట్టు తెలిపారు. సమారు ఏడాదిన్నరకి మంచి ఫలితాన్ని అందుకోగలిగానని అన్నారు. డాక్టర్ మృణాలిని చెబుతోంది ఒకటే..బరువు తగ్గడంలో కావాల్సింది, ఓపిక, భావోద్వేగాన్ని నియంత్రించేలా స్థిరతత్వం అత్యంత ప్రధానమని అంటోంది. కాగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..జీఎల్పీ 1 మందులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, కడుపు నిండిపోయిన అనుభూతిని, జీర్ణక్రియను నెమ్మదింపచేసేలా సహజ హర్మోన్లా అనుకరించే మందు. కానీ ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో సలహాలు సూచనలతో వాడాల్సి ఉందనేది గ్రహించాలి. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం!
విధ్వంసకర ఆట తీరుతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన ఈ బిహారీ పిల్లాడు.. భారత్ తరఫునా అదరగొడుతున్నాడు. పద్నాలుగేళ్ల వయసులోనే అండర్-19 స్థాయిలో అదరగొడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వరల్డ్కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు.జింబాబ్వే వేదికగా ఇంగ్లండ్పై భారీ శతకం (80 బంతుల్లో 175) బాదిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ ఆరోసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు భారత్ అండర్-19 జట్టు తరఫున ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డ మీద ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.అంతేకాదు.. దక్షిణాఫ్రికాలో ఏకంగా కెప్టెన్గా వ్యవహరించిన వైభవ్.. యూత్ వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడం విశేషం. ఇలా టీనేజ్లోనే క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ఆటతో బిజీగా ఉన్న కారణంగా చదువు విషయంలో ఏడాది వెనుకపడనున్నాడు.బిహార్లోని తేజ్పూర్కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. అక్కడి మాడెస్టీ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17- మార్చి 11 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ క్లాస్ 10 బోర్డు ఎగ్జామ్కు వైభవ్ సూర్యవంశీ హాజరు కావాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలు రాస్తాడని వార్తలు వచ్చాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది పరీక్షలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మాడెస్టీ స్కూల్ డైరెక్టర్ ఆదర్శ్ కుమార పింటూ నిర్ధారించారు. వైభవ్కు అడ్మిట్ కార్డు కూడా జారీ చేశామని.. అయితే, ఆఖరి నిమిషంలో అతడు మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలిపినట్లు పింటూ పేర్కొన్నారు. కాగా వరుస సిరీస్లు, వరల్డ్కప్ టోర్నీతో బిజీగా గడిపిన వైభవ్.. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ క్యాంపుతో ఐపీఎల్కు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. దీంతో పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాడని.. అందుకే ఈసారి పరీక్షలు రాయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆటతో పాటు వైభవ్ చదువును కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దిగ్గజాల క్వాలిఫికేషన్ తెలుసా?ఇక వైభవ్ పరీక్షలు స్కిప్ చేసిన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాల విద్యార్హతల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఈ ముంబైకర్ ఆట మీద మాత్రమే దృష్టి పెట్టి అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్గా ప్రసిద్ధికెక్కాడు.మరోవైపు.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఇంటర్ చదివాడు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ టీమిండియాలోకి వచ్చి జట్టు గతినే మార్చివేశాడు ఈ జార్ఖండ్ డైనమైట్. ఇక ఢిల్లీకి చెందిన రన్మెషీన్ విరాట్ కోహ్లి కూడా పన్నెండో తరగతి వరకే చదివాడు. అదే విధంగా.. భారత్కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి, ముంబైకర్ రోహిత్ శర్మ సైతం ఇంటర్తోనే ఆపివేసినట్లు తెలుస్తోంది.చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య -
విజయవాడ: అంతిమ యాత్రలో రౌడీషీటర్ల బీభత్సం
సాక్షి, విజయవాడ: నగరంలో 100 మందికి పైగా రౌడీషీటర్ల గ్యాంగ్ హల్చల్ చేశారు. రౌడీషీటర్ పండు అలియాస్ పావురం అంతిమయాత్రలో బైక్ ర్యాలీలు, డీజేలతో బీభత్సం సృష్టించారు. భవానీపురంలో నివాసముంటున్న రౌడీషీటర్ పండు ఆటో నడుపుతూ.. యాక్సిడెంట్లో మృతిచెందగా.. మార్చురీ నుంచి ర్యాలీగా వస్తున్న సమయంలో రౌడీషీటర్లు రచ్చరచ్చ చేశారు. రౌడీషీటర్ల బీభత్సంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
'ఓం శంభో శివ శంభో' ఈ సాంగ్ విన్నారా..?
మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా పరమేశ్వరుడి భక్తి పాటను హోంబలే ఫిల్మ్స్ సంస్థ విడుదల చేసింది. 'ఓం శంభో శివ శంభో స్వయంభో..' అంటూ సాగే ఈ పాటను స్వామి దయానంద సరస్వతి రచించగా నారాయణ్ శర్మ ఆలపించారు. వీఎఫ్ఎక్స్ విజువల్స్తో క్రియేట్ చేసిన ఈ సాంగ్ భక్తులను మెప్పస్తుంది. ఈ పాటలో శివుడు అత్యంత శక్తివంతమైన రూపంలో కనిపిస్తారు. గతేడాది మహావతార నరసింహ సినిమాతో భారీ విజయం అందుకున్న హోంబలే ఫిల్మ్స్ తాజాగా శివయ్యపై భక్తితో రూపొందిన ఈ పాటకు అద్భుతమైన విజువల్స్ను జోడించి విడుదల చేశారు. -
‘కపుల్ ఫ్రెండ్లీ’కి హిట్ టాక్.. ఫస్ట్డే కలెక్షన్ ఎంతంటే..
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో హిట్ టాక్ సంపాదించుకున్న చిత్రం‘కపుల్ ఫ్రెండ్లీ’. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ లవ్స్టోరీనే అయినా..తెరపై చాలా మెచ్యూర్డ్గా ప్రజెంట్ చేశాడంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంతోష్, మానసల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం సినిమాకు కలిసొచ్చింది.పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ చిత్రం..బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బరిలో పెద్ద చిత్రాలేవి లేకపోవడం.. ఈ వారం రిలీజైన మిగతా చిత్రాలకు ఫ్లాప్ టాక్ రావడంతో వారాంతంలో కపుల్ ప్రెండ్లీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. -
సేవాలాల్ మహారాజ్కి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: సేవాలాల్ మహారాజ్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/Ri9SX9FW7V— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2026 -
కాపర్ మరో సిల్వర్ కానుందా?.. సంక్షోభం ఆసన్నమైందా?
దేశీయంగా, అంతర్జాతీయంగా రాగి మార్కెట్పై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. 2025లో వెండి ధరలు 150 శాతం వరకు ఎగసిన నేపథ్యంలో, రాగి కూడా అదే బాట పట్టే అవకాశముందా అన్న ప్రశ్న ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది.ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు2026 ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, రాగి ఉత్పత్తిలో స్థిరత్వం కనిపించడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక దేశీయ రాగి ఉత్పత్తి 3.33 మిలియన్ టన్నులు. 2023–24లో ఇది 3.78 మిలియన్ టన్నులకు పెరిగింది. అయితే 2024–25లో మళ్లీ 3.56 మిలియన్ టన్నులకు పడిపోయింది.రాగి సాంద్రత (కాన్సన్ట్రేట్) ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. 2022–23లో 1,12,745 టన్నులు ఉండగా 2023–24లో 1,25,230 టన్నులకు పెరిగింది. కానీ, 2024–25లో 1,05,012 టన్నులకు క్షీణించింది.తగ్గుతున్న ధాతు గ్రేడ్లురాగి గనుల్లో సగటు ధాతు గ్రేడ్లు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అనేక గనులు 0.4–0.6 శాతం మాత్రమే దిగుబడితో పనిచేస్తున్నాయి. అంటే ఒక టన్ను రాగి కోసం వందల టన్నుల రాతిని తవ్వి ప్రాసెస్ చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి.ఆర్థిక సర్వే ఉదాహరణగా 1 గిగావాట్ విండ్ టర్బైన్ ప్రాజెక్ట్ను పేర్కొంది. దీనికి సుమారు 2,866 టన్నుల రాగి అవసరం. 0.6 శాతం దిగుబడి వద్ద దాదాపు 4.7 లక్షల టన్నుల రాగి ధాతువును ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని అంచనా. వ్యర్థ రాయి కలుపుకుంటే మొత్తం తరలింపు 10 లక్షల నుంచి 20 లక్షల టన్నుల వరకు ఉండొచ్చని నివేదిక చెబుతోంది.పెరుగుతున్న డిమాండ్రాగి వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. వైర్లు, మోటార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, డేటా సెంటర్ల శీతలీకరణ వ్యవస్థలు ఇలా.. ప్రతి రంగంలో రాగి కీలక పాత్ర పోషిస్తోంది.ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల విస్తరణతో రాగిపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. పవర్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్గేర్, జీపీయూలు, సర్వర్లను నడిపే పవర్ డెలివరీ వ్యవస్థలకు విస్తృతంగా రాగి అవసరమవుతోంది.ధరల దిశ2025లో కీలక లోహాల్లో రాగి ధరలు గణనీయంగా పుంజుకున్నాయి. మెటల్ ధరల సూచీలో ఇది సంవత్సరానికి 32 శాతం పెరుగుదల నమోదు చేసింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాబోయే కాలంలో ధరలపై మరింత ఒత్తిడి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భవిష్యత్తు ఎలా?వెండి లాగా 150 శాతం పెరుగుతుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోయినా, రాగి మార్కెట్లో బుల్లిష్ సంకేతాలు కనిపిస్తున్నాయి. శక్తి పరివర్తన, విద్యుతీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ.. ఈ మూడు ధోరణులు కొనసాగితే రాగి ధరలు మధ్యకాలంలో మరింత ఎగిసే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు.మొత్తంగా, రాగి ఇక సాధారణ పారిశ్రామిక లోహం మాత్రమే కాదు.. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు కీలక మౌలిక వనరుగా మారుతోంది. సరఫరా-డిమాండ్ అసమతౌల్యం కొనసాగితే మార్కెట్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది!. -
కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదరిన ఒప్పందం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా కాంగ్రెస్, సీపీఐలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదటి రెండున్నరేళ్లు మేయర్ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాంగ్రెస్ మేయర్ పదవి, సీపీఐ డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 9న ఎన్నికలు జరగ్గా, 11న ఫలితాల్లు వెల్లడయ్యాయి. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్కు 22, సీపీఐకి 22 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 31 సీట్లు ఏ ఒక్క పార్టీకీ రాలేదు. మరోవైపు సీపీఐకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఫలితంగా సీపీఐ 22, బీఆర్ఎస్ 8 కార్పొరేటర్ల బలం కలుపుకుంటే మేజిక్ ఫిగర్ చేరేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇదే సమయంలో స్వతంత్రులతో పాటు కొందరు తిరుగుబాటు కార్పొరేటర్లతో కాంగ్రెస్ సైతం మేయర్ పదవి కోసం ఆరంభంలో ప్రయత్నాలు చేసినా, ఆ తర్వాత అర్ధంతరంగా ఆ ప్రక్రియకు బ్రేక్ వేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్, సీపీఐలకు చెందిన అగ్రనాయకులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. చివరకు పవర్ షేరింగ్పై ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. కాగా, పవర్ షేరింగ్పై ఇటు కాంగ్రెస్, అటు సీపీఐలో కొత్తగూడేనికి సంబంధించిన నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ విషయం ఇక్కడితో సమసి పోతుందా లేక సోమవారం వరకు కొనసాగుతుందా అనేది చూడాలి. సీపీఐలో మేయర్ పదవి ఎవరిని వరించేనో... సీపీఐ నుంచి 22 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఇందులో మేయర్ పదవి రిజర్వ్ చేయబడిన ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు కార్పొరేటర్లు గెలిచారు. వీరిలో ఒకరు మేయర్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. సీపీఐ తరఫున గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు సైతం కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ల నుంచి గెలుపొందారు. వేర్వేరు ప్రాంతాలుగా ఉన్న ఈ మూడింటిని ఒక్కటిగా చేస్తూ కార్పొరేషన్గా మార్చారు. ఇప్పుడు మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు అభ్యర్థులు గెలవడం, వారంతా మేయర్ పదవికి అర్హులై ఉండటం విశేషం. సుజాతనగర్ పరిధిలోకి వచ్చే 20వ డివిజన్ నుంచి మూడు గణేశ్ 277 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పాల్వంచ పరిధిలోకి వచ్చే 31వ డివిజన్ నుంచి నూనావత్ శ్యామల 73 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కొత్తగూడెం పరిధిలో 52వ డివిజన్ నుంచి బానోతు కళావతి 224 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించింది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు.ఆది నుంచీ ఆసక్తికొత్తగూడెం మేయర్ కుర్చీలో తొలిసారిగా కూ ర్చునేది ఎవరనే అంశంపై ఆది నుంచీ ఆసక్తి నెలకొంది. కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. మొత్తం 60 డివిజన్లలో 11 డివిజన్లు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో మేయర్ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుని చాలా మంది అశావహులు ఎన్నికల బరిలో దిగారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే వైద్యులు సైతం ఖద్దరు బట్టలు తొడిగి రాజకీయ కదనరంగంలోకి దూకారు. వైద్యుడు భూక్యా శ్రీనివాసరావు జనరల్గా ఉన్న 6 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలిచారు. రికార్డు స్థాయిలో 608 ఓట్ల మెజార్టీ సాధించారు. కొత్తగూడెంలో ఇది రెండో అత్యధిక మెజారిటీ. సీనియర్ రాజకీయనేత శంకర్నాయక్ సతీమణి స్వప్నా నాయక్ 19వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచారు. వీరు కాకుండా మూడో డివిజన్ నుంచి గుగులోతు శ్రీను, 23 డివిజన్ నుంచి బానోతు అనిత, 33 డివిజన్ నుంచి బానోతు బాలు ఉన్నారు. -
మహేశ్బాబు చేతులమీదుగా టీజర్.. అదిరిపోయేలా విజువల్స్
పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ టీజర్ వచ్చేసింది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా తాజాగా మహేష్బాబు చేతులమీదు టీజర్ను రిలీజ్ చేశారు.భారతదేశ చరిరత్రలో ఎన్నో పురాతనమైన రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని నాగబంధం సంప్రదాయంతో ముడిపడి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇదే కథను ఒక అద్భుతంలా తెరపై ఆవిష్కరించారు. 1750 నేపథ్యంలో భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. -
FASTag వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్హెచ్ఏఐ తాజా హెచ్చరిక!
ఫాస్టాగ్ FASTag యాన్యువల్ పాస్కు భారీ ఆదరణ లభించింది. దీన్ని ప్రారంభించిన ఆరు నెలల్లోనే 50లక్షలకుపైగా వినియోగదారులను అధిగమించింది. దీంతో ఇక్కడ కూడా నకిలీల బెడద తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే FASTag వార్షిక పాస్ సేవకు సంబంధించిన పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్ గురించి పౌరులను హెచ్చరిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక హెచ్చరిక జారీ చేసింది. నకిలీల బారిన పడకుండా కేవలం అధికారిక FASTag పోర్టల్లను మాత్రమే ఉపయోగించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఒకసారి చూద్దాం.నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతున్న FASTag మోసాల పట్ల NHAI వాహనదారులను హెచ్చరించింది. మోసగాళ్లు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను నిలువునా ముంచు తున్నారని వెల్లడించింది. అధికారిక NHAI ప్లాట్ఫారమ్లలాగానే నటించి, నకిలీ వార్షిక పాస్ల కోసం చెల్లింపులు చేయడానికి వినియోగదారులను మోసగిస్తున్న అనేక ఘటనల నేపథ్యంలో ఎన్హెచ్ఆర్ఐ ఈ హెచ్చరిక జారీ చేసింది.ఇదీ చదవండి: బోట్ రైడ్లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్వినియోగదారులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలుఈ మోసపూరిత పోర్టల్లలో చెల్లింపులు చేసిన తర్వాత అనేక మంది బాధితులు తక్షణ ఆర్థిక నష్టాలను నివేదించారు. కొంతమంది వినియోగదారులు కస్టమర్ సపోర్ట్గా నటిస్తూ, నకిలీ పాస్ను "యాక్టివేట్" చేయడానికి OTPలు లేదా అదనపు ఛార్జీలను అడుగుతూ ఫాలో-అప్ స్కామ్ కాల్స్ కూడా చేస్తారు.ఈ స్కామ్లు అధికారిక బ్రాండింగ్, లోగోలు , లేఅవుట్లను కాపీ చేయడం వలన వినియోగదారులు చూడగానే తేడాను గుర్తించడం కష్టతరం చేస్తాయని సైబర్ అధికారులు గుర్తించారు.ఈ మోసం ఎలా జరుగుతుంది?సెర్చ్ ఇంజన్లలో (Google వంటివి) ప్రకటనల ద్వారా మోసపూరిత లింకులు పైన కనిపించేలా చేస్తారు.వినియోగదారులు ఆ లింక్ క్లిక్ చేయగానే మొబైల్ నంబర్, వాహన వివరాలు మరియు పేమెంట్ వివరాలను అడుగుతారు.మీరు చేసే పేమెంట్ నేరుగా నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్తుంది. చెల్లింపు తర్వాత ఎలాంటి పాస్ రాదు, పైగా మీ బ్యాంక్ వివరాలు కూడా వారి చేతికి చిక్కుతాయి.సేఫ్టీ టిప్స్FASTag-సంబంధిత సేవలను ఆన్లైన్లో యాక్సెస్ చేస్తున్నప్పుడు రహదారి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఈ సలహాను పంచుకున్నారు.వినియోగదారులు వెబ్సైట్ URLలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి .ఆన్లైన్లో శోధించేటప్పుడు స్పాన్సర్ చేసిన లింక్లు లేదా తెలియని ప్రకటనలపై క్లిక్ చేయకూడదు.మోసగాళ్ళు చట్టబద్ధమైన NHAI చెల్లింపు పేజీలను పోలి ఉండేలా వెబ్సైట్లను సృష్టిస్తారు. వినియోగదారులు ఈ లింక్లపై క్లిక్ చేసిన తర్వాత, మొబైల్ నంబర్లు, వాహన సమాచారం , చెల్లింపు ఆధారాలు వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయమని కోరతారు.చెల్లింపు ఇంటర్ఫేస్ ప్రామాణికమైనదిగా కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మనఖాతాలోని సొమ్మును డిజిటల్ నేరగాళ్లు కొట్టేసే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడూ అధికారిక NHAI వెబ్సైట్ లేదా మీ బ్యాంక్ యాప్ ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలి.వెబ్సైట్ అడ్రస్ సరిగ్గా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోండి. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు.కస్టమర్ కేర్ అని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి OTP లేదా పిన్ అడిగితే చెప్పకండి.ఒకవేళ మీరు మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి.డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అవగాహన అనేది బలమైన రక్షణ అని అధికారులు నొక్కిచెప్పారు, భారతదేశం అంతటా ఆన్లైన్ ఆర్థిక మోసాలు పెరుతున్నందున వినియోగ దారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యంకాగా 2025 ఆగస్టు 15న ప్రారంభించినప్పటి నుండి యాన్యువల్ పాస్కు భారీ స్పందన లభిస్తోంది. దీనికి తోడు జాతీయ రహదారులపై ప్రయాణించే, ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇందూర్ మేయర్ ఎవరో?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు నగరపా లక సంస్థ (కార్పొరేషన్) మేయర్ ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఇందూ రు నగరంలో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ బీజేపీకి అవకాశాలు లేకపోవడంతో ఎంఐఎంతో కలిసి మే యర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంటోంది. మేయర్ అభ్యర్థిగా ఉన్న కాటిపల్లి శమంత 19వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకిలోనే మరికొందరు మేయర్ స్థానానికి పోటీపడుతున్నారు. 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ నుంచి గెలిచిన కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్ నుంచి గెలిచిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్ నుంచి గెలిచిన దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్ నుంచి గెలిచిన కేతావత్ సురేఖలు మే యర్ రేసులో ఉన్నారు. మొత్తం ఐదురుగురు మహిళలు పోటీలో ఉండగా నలుగురు బీసీలు, ఒకరు ఎస్టీ ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీ పెద్దల టచ్లోకి వెళ్లి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదుగురిలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో ఉత్కంఠగా మారింది. దీంతో ఇందూరు నగరపాలకలో రాజకీ యం రసకందాయంలో పడింది. 60 డివి జన్లు ఉండగా.. బీజేపీకి 28, కాంగ్రెస్కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్కు ఒక సీటు వ చ్చింది. ఇక్కడ గతసారి మాదిరిగానే హంగ్ ఏర్పడింది. ఎంఐఎం మద్దతుతో మేయర్ చేజిక్కుంచుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ తన క్యాంపునకు తరలించింది. ఈ కార్పొరేషన్లో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరి్వంద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నా రు. దీంతో బీజేపీకి మూడు, కాంగ్రెస్కు రెండు ఓట్లు పెరిగినట్లైంది. బీఆర్ఎస్ అభ్యరి్థ ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్–ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి సైతం కాంగ్రెస్ ఆ«దీనంలోనే ఉండడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థి ఓటు కలిపితే కాంగ్రెస్ వద్ద 34 ఓట్లు ఉన్నట్లే. ఇక బీజేపీకి ఎక్స్ అఫీషియోతో 31 ఓట్లు అవుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంత ఓటమి నేపథ్యంలో పీఠం కోసం పలువురు పలువురు పోటీ పడుతున్నారు. మేయర్ ఆశిస్తున్నవారు ఆ పదవి దక్కదనుకుంటే ఏమైనా తేడా చేస్తారా అనే ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మేయర్ కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ ఖాయమైతే సహకరించిన ఎంఐఎం పారీ్టకి గెలిచిన అభ్యర్థుల్లో ఒకరికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.బోధన్లో రసవత్తరంబోధన్టౌన్: ఎన్నికల ఫలితాల అనంతరం బోధన్ మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. మొత్తం 38 వార్డులకు గాను కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 5, ఎంఐఎం 12, బీజేపీ 3 సీట్లు సాధించగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు. 17 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. స్వతంత్ర కౌన్సిలర్తోపాటు బీఆర్ఎస్కు చెందిన మరో కౌన్సిలర్ను సైతం కాంగ్రెస్ నాయకులు క్యాంప్నకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ లెక్కన కాంగ్రెస్ బలం 19కి చేరగా, ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా..
ప్రయాగ్రాజ్: శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ భక్తజన సంద్రమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర త్రివేణి సంగమ ఘాట్లకు పోటెత్తారు. వార్షిక మాఘమేళాలో భాగంగా జరిగిన చివరి ‘స్నాన పర్వం’లో దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు ఇప్పటివరకూ పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ‘హర హర మహాదేవ శంభో’ అంటూ భక్తులు చేసిన శివనామస్మరణతో గంగా తీరం మార్మోగిపోయింది. భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతూనే ఉందని మాఘమేళా అధికారి రిషి రాజ్ మీడియాకు తెలిపారు. #WATCH | Prayagraj, UP | Magh Mela officer Rishi Raj says, "Today is the last 'snan parv' of the Magh Mela and devotees are coming in large numbers to take a holy dip on the occasion of #Mahashivratri2026...10 lakh devotees have already taken a holy dip so far...The… https://t.co/fM1jArups0 pic.twitter.com/tYKQJis8yW— ANI (@ANI) February 15, 2026భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ (ఏటీఎస్) మొబైల్ పెట్రోలింగ్ బృందాలు మేళా ప్రాంతంలో నిరంతరం పహారా కాస్తున్నాయి. ఘాట్ల వద్ద తొక్కిసలాట జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ బృందాలను రంగంలోకి దించారు. నెల రోజుల పాటు సాగిన మాఘమేళా వేడుక ప్రశాంతంగా ముగిసేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. #WATCH | Belagavi, Karnataka: Devotees throng the Dakshina Kashi Kapileswara Temple and offer prayers on the occasion of #Mahashivratri2026. pic.twitter.com/FMnrZWGctj— ANI (@ANI) February 15, 2026శివరాత్రి సందడి కేవలం ప్రయాగ్రాజ్కే పరిమితం కాలేదు. ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం వెలుపల భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. అలాగే అహ్మదాబాద్లోని మినీ సోమనాథ్ ఆలయం, రియాసీలోని ఆప్ శంభు మహాదేవ్ గుడి, అయోధ్యలోని నాగేశ్వరనాథ్ ఆలయాల్లో ప్రత్యేక హారతులు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు చేపట్టి, రాత్రంతా జాగరణ చేస్తూ శివయ్యను కొలుస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి అంటే శివ-పార్వతుల కళ్యాణం జరిగిన రోజని భక్తుల నమ్మకం. దేవతలు, గంధర్వులు, పశుపక్షాదులు, భూతగణాల సాక్షిగా పార్వతీ దేవిని శివుడు వివాహం చేసుకున్నాడని చెబుతారు.ఇది కూడా చదవండి: మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే.. -
రవితేజ ఇరుముడి.. మహా శివరాత్రి అప్డేట్
మాస్ మహారాజా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఇరుముడి(Irumudi). ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 26న రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో అయ్యప్పమాల ధరించిన రవితేజ.. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని చాలా కొత్తగా కనిపించారు.ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు. ఈ సినిమాలో కావేరి అనే పాత్రలో ప్రియా భవాని శంకర్ కనిపించనుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రవితేజ భార్యగా అభిమానులను మెప్పించనుంది. తాజాగా రిలీజైన ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో హిట్స్ కొట్టారు. రవితేజతో తీస్తోన్న పాన్ ఇండియా రేంజ్ మూవీ 2026లోనే ఈ విడుదల కానుంది. Presenting the talented @priya_Bshankar as 'Kaveri' from #IRUMUDI / #ఇరుముడి - a caring wife and a doting mother ❤️Starring MASS MAHARAJA @RaviTeja_offl 🤩A @gvprakash musical 🎺🎼@ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/e9puiTkwrS— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2026 -
రష్యా చమురు కొనుగోలుపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా చెప్పిన సంగతి తెలిసిందే.. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. అయితే, ఈ క్రమంలో చమురు కోనుగోలుపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవన్నారు. దేశ ప్రయోజనాలు, ధర, నష్టభయాలను పరిగణనలోకి కుంటామని ఈ విషయంలో భారత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు.జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొన్న జై శంకర్.. భారత్ తన ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ విధానాన్నే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇంధన సమస్యల ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి సంక్లిష్టంగా ఉందన్నారు. చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొనడం విశేషం.‘‘ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి. కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసిన మీదట తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయి’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు టారిఫ్లు విధించారు.మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడ్డ నేపథ్యంలో వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
IND vs PAK: ‘వర్షం పడాలని కోరుకుంటున్నా’
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. దాయాదులు భారత్- పాకిస్తాన్ పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడి భయం అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది.వాన పడొద్దు దేవుడా!కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-ఎలో ఉన్న భారత్- పాక్ మధ్య మ్యాచ్కు శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్. ప్రేమదాస స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, ఆదివారం కొలంబోలో వాన పడే అవకాశాలు 93 శాతం ఉన్నట్లు ఆక్యూవెదర్ పేర్కొంది. సాయంత్రానికి వర్షం ముప్పు తగ్గినా అవుట్ ఫీల్డ్ తడిగా ఉంటే మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు సన్నగిల్లుతాయి.ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా వర్షం ప్రభావం ఈ మ్యాచ్పై పడకుండా చూడాలంటూ దేవుడిని వేడుకుంటున్నారు. క్రేజీ మ్యాచ్ కోసం తామంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని.. తమ ఆశలపై నీళ్లు చల్లవద్దని వరుణుడిని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ (Basit Ali) వింత వ్యాఖ్యలు చేశాడు.వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాఓ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. "ఆ సర్వాంతర్యామి (దేవుడు) నా ప్రార్థన విని వర్షం పడేలా చేయాలి’’ అని బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. ఇందుకు హోస్ట్.. "మీరు మ్యాచ్ మొత్తం చూడాలని అనుకోవడం లేదా?" అని అడుగగా.. "నేను వర్షం పడాలని కోరుకుంటున్నాను (I Want Rain)" అని పునరుద్ఘాటించాడు.అదే జరిగితే మ్యాచ్ రద్దుకాగా వరల్డ్కప్ గ్రూప్ దశ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉండదు. ఫలితం కోసం ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదీ కుదరని పక్షంలో మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటిస్తారు. ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.ప్రస్తుతం టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత్.. అమెరికా, నమీబియాలపై గెలిచి నాలుగు పాయింట్లు సాధించగా.. పాకిస్తాన్ సైతం నెదర్లాండ్స్, అమెరికా జట్లను ఓడించి నాలుగు పాయింట్లతో ఉంది. అయితే, నెట్రన్రేటు పరంగా టీమిండియా (+3.050) పాకిస్తాన్ (+0.932) అత్యంత మెరుగ్గా ఉండి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.ఇదేం కోరిక?ఒకవేళ దాయాదుల పోరు వర్షం వల్ల రద్దు అయిపోతే.. భారత్- పాక్ ఐదు పాయింట్లతో సూపర్-8 దశకు దాదాపుగా అర్హత సాధించినట్లే. గ్రూప్ దశలో అమెరికా, నెదర్లాండ్స్లకు చెరో మ్యాచ్ మిగిలి ఉండగా.. నమీబియా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే, నెదర్లాండ్స్ (-1.352), నమీబియా (-2.884) నెట్రన్రేటు మైనస్లలో ఉండటం గమనార్హం.ఇక గత వరల్డ్కప్ ఎడిషన్లో అనూహ్య రీతిలో పాకిస్తాన్ను ఓడించి టీమిండియాతో పాటు అమెరికా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాక్ టోర్నీ నుంచి అవమాన భారంతో నిష్క్రమించింది. ఇక ఇప్పుడు భారత్ చేతిలో పాక్ గనుక భారీ తేడాతో ఓడితే మళ్లీ అమెరికాతో ప్రమాదం పొంచి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్- పాక్ మ్యాచ్ వాన వల్ల చెడిపోవాలని బసిత్ అలీ కోరుకుంటున్నాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.చదవండి: IND vs PAK: పాక్తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే! -
లుంగీ ధరించి రమ్మన్నారు.. నో చెబితే..: యాంకర్
సుహాస్ హీరోగా నటిస్తున్న హే భగవాన్ చిత్రంలో యాంకర్, బిగ్బాస్ ఫేమ్ స్రవంతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో స్రవంతి ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటూ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా దూసుకెళ్తెంది. హీరోయిన్ల డ్రెస్ల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ డ్రెస్లు ఎవరు సెలక్ట్ చేస్తారనేది స్రవంతి క్లారిటీ ఇచ్చింది.' ఏదైనా ఒక సినిమా ఈవెంట్కు వెళ్లితే మా కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అనేది వాళ్లే డిసైడ్ చేస్తారు. ఎలాంటి దుస్తులు ధరించాలనేది మా చాయిస్ కాదు. శ్రీవిష్ణు నటించిన సింగల్ మూవీ ఈవెంట్ కోసం లుంగీ కట్టుకుని రమ్మని చెప్పారు. అప్పుడు అదే పనిగా కళ్లజోడు, లుంగీ కొనుగోలు చేసి వాటిని ధరించి యాంకరింగ్ చేశాను.నో చెబితే అవకాశాలు రావు. అందుకే ఈ విషయంలో మాకు ఆప్షన్ ఉండదు. దుస్తుల విషయంలో మాకు ఆప్షన్ ఇస్తే నేను ట్రెడిషనల్ డ్రెస్నే ఎంపిక చేసుకుంటాను. కొన్ని సినిమాలకు చీరలు కట్టుకునే ప్రమోషన్స్ కార్యక్రమాలకు పాల్గొన్నాను. నా వద్ద సుమారు వెయ్యికి పైగా చీరలు ఉన్నాయి.' అని స్రవంతి చెప్పింది.హీరోయిన్ల దుస్తుల గురించి నటుడు శివాజీ వ్యాఖ్యలు సబబుగానే ఉన్నాయని స్రవంతి పేర్కొంది. కానీ, మహిళల గురించి మాట్లాడుతూ ఆయన నుంచి రెండు పదాలు తప్పుగా దొర్లాయి.. వాటిని తాను కూడా సమర్ధించను. తర్వాత శివాజీ కూడా క్షమించాలని బహిరంగంగానే చెప్పారని ఆమె గుర్తు చేసింది. -
ప్రియురాలి హత్య.. సెప్టిక్ ట్యాంక్లో మృతదేహం
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకున్న దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ అలియాస్ సియాకు, భోపాల్కు చెందిన సమీర్ అనే వ్యక్తితో ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరు పిల్లలున్న సమీర్తో ఏర్పడిన ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సమీర్పై ఉన్న నమ్మకంతో మూడు నెలల క్రితం సియా తన ఇంటిని విడిచిపెట్టి, భోపాల్లోని కమలా నగర్లో ఉన్న అతని ఇంటికి వచ్చేసింది.సమీర్ ఇంట్లోనే సియా నివాసం ఉంటుండటంతో, అతని భార్యకు, సియాకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సమీర్ భార్య.. జబల్పూర్లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇసే సమయంలో సియా.. తనను వివాహం చేసుకోవాలని లేదా తనకు 5 లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సమీర్పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన సమీర్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.ఈ నేరంలో అతడి తల్లి, సోదరులు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. సియాను హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు నిందితుడు సమీర్ తన కుటుంబ సభ్యుల సహాయంతో సియా మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కాడు. తరువాత ఆ పెట్టెను ఇంటి సమీపంలోని నిషాత్పురా ప్రాంతంలోని ఒక సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. అయితే గురువారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న పిల్లలు అక్కడి సెప్టిక్ ట్యాంక్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో పాటు, లోపల ఏదో ఇనుప పెట్టె తేలుతున్నట్లు గమనించారు.వెంటనేవారు స్థానికులకు సమాచారం అందించారు. దీంతో విషయం పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్యాంక్ నుండి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సమీర్ పరారీలో ఉండగా, అతడికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సమీర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు -
నాగబంధం టీజర్ రిలీజ్.. దర్శకుడు ఎమోషనల్ నోట్
‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా నేడు(ఫిబ్రవరి 15) ఉదయం 11:11 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శకుడు అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేశాడు. ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపామని.. టీజర్ నచ్చితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే అవుతుందంటూ ఓ సుదీర్ఘమైన లేఖను విడుదల చేశాడు. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుని ఆశీస్సులతో మా చిత్రానికి సంబంధించిన వరల్డ్ ఆఫ్ నాగబంధం ఫస్ట్ టీజర్ను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ చిత్రం కేవలం రాసుకున్న కథ కాదు, ఏ చరిత్ర పుస్తకాల్లోనూ రాయని గాథ. ఈ కథను పూర్తిగా తెలుసుకొని రాయడానికి ఏన్నో నెలలు పట్టింది. ఈ కథ పూర్తిగా రాసిన తరువాతే ఊపిరిపీల్చుకోగలిగాము. ఈ కథను తెరపై ఎక్కించడానికి ఎన్నో నిశ్చబ్దాలను ఎదుర్కొంటూ, ఎన్నో నిద్రలేని రాతుల్రను గడిపాము.ఒక దర్శకుడిగా చెప్పాలంటే..ఈ టీజర్ అనేది విజువల్ మాత్రమే కాదు. అది మా ఊపిరిలో దాగిఉన్న శ్వాస. చాలాకాలం మా అంతరాత్మలో దాచుకొని మీ ముందుకు నిజంలా తీసుకొస్తున్న తొలి దృశ్యరూపం. మీరు చూసే ప్రతీ ఫ్రేమ్లోనూ మా కష్టం ఉంది. అది మీకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మాకు ఈ కథపై నమ్మకం, సనాతన ధర్మంపై విశ్వాసం, సినిమాపై ఉన్న ప్రేమే మా మార్గానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది.అలసిపోయిన రాత్రులు గడిపాము, ప్రశ్నలతో నిండిన రోజులు చూశాం. అయినా మేము ఆ ప్రశ్నల లోతులోకి తొంగి చూసి, వాటిని ఛేదిస్తూ ముందుకు సాగాము. కథను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దామో, అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని నమ్ముతున్నాము. ఆ మహాదేవునిపై ఉన్న దైవభక్తి మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించింది.మా ప్రయాణానికి వెన్నంటే ఉంటూ వెన్నెముకగా నిలిచిన మా నిర్మాతలు నిషిత, కిషోర్ గ్లారకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారు చూపించిన స్నేహపూర్వకమైన నమ్మకమే నా ధైర్యం. వారు నాకు చ్చిన ప్రోత్సాహమే నా బలం. ఇక మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, రానా దగ్గుబాటి గారి ప్రోత్సాహం, ఆశీర్వాదాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను. రాతల్లో రాయలేను. మేము కోరుకునేది ఒక్కటే స్వచ్ఛమైన మనస్సుతో ఈ టీజర్ను వీక్షించండి. మీ మనస్సును తాకితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే. చివరిగా మీరు చూపించే ఆదరణే మా ఆయుధం. ఆ ఆయుధమే ఈ చిత్ర విజయానికి బాటలు వేసేలా చేస్తుందని భావిస్తున్నా’ అని అభిషేక్ నామా రాసుకొచ్చాడు. "#NAGABANDHAM IS NOT JUST ANOTHER MOVIE."With a heart filled with the deepest gratitude to everyone who supported me on this unforgettable journey,I am bringing the WORLD OF NAGABANDHAM before you at 11:11 AM.Let’s celebrate our history.Let’s celebrate our Sanatana Dharma.… pic.twitter.com/s0q3Lil6TJ— ABHISHEK PICTURES (@AbhishekPicture) February 15, 2026 -
'మరిన్ని మ్యాజికల్ చేద్దాం'.. పెద్ది కెప్టెన్కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇటీవలే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా రామ్ చరణ్ తన డైరెక్టర్కు విషెస్ తెలిపారు. ఈ రోజు బుచ్చిబాబు బర్త్ డే కావడంతో పెద్ది మూవీ షూటింగ్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. పెద్ది కెప్టెన్ బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సెట్లో మీ అభిరుచి, వివరణాత్మక కథనం, పాతుకుపోయిన కథ చెప్పడం ప్రతిరోజూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని రాసుకొచ్చారు. మనిద్దరం కలిసి మరిన్ని మాయా కథలను సృష్టిద్దామని చెర్రీ తన టీట్లో రాసుకొచ్చారు. ఈ సంవత్సరం మీ కృషికి తగిన గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కూడా బుచ్చిబాబుకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. Wishing my #Peddi captain @BuchiBabuSana Garu a very happy birthday! ❤️ ❤️ Your passion, detailing and rooted storytelling are inspiring every single day on set. Let’s create many more magical stories together.May this year bring you all the recognition your hard work truly… pic.twitter.com/NokRPm2HXV— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2026 -
T20 WC 2026: ధోని ప్రపంచ రికార్డు బద్దలు
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ వికెట్ కీపర్ బ్యాటర్ బద్దలు కొట్టాడు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా శనివారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా న్యూజిలాండ్తో తలపడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన సఫారీ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.యాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రొటిస్ బౌలర్లలో మార్కో యాన్సెన్ (Marco Jansen) నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఎంగిడి, కేశవ్ మహరాజ్, బాష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. మరోవైపు.. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (13) ఇచ్చిన క్యాచ్ను అందుకున్నాడు.ధోని వరల్డ్ రికార్డు బద్దలుఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్గా డికాక్ చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ధోని 32 ఇన్నింగ్స్లో 32 డిస్మిసల్స్లో భాగం కాగా.. డికాక్ 30 ఇన్నింగ్స్లోనే 33 సార్లు ప్రత్యర్థి బ్యాటర్ అవుట్ కావడంలో తన వంతు పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. కివీస్ విధించిన నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు సాధించింది. తద్వారా న్యూజిలాండ్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ మెరుపు, అజేయ అర్ధ శతకం (44 బంతుల్లో 86)తో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక మరో ఓపెనర్ డికాక్ మాత్రం (14 బంతుల్లో 20) నిరాశపరిచాడు.Aiden Markram goes big over long-on for his third six of the innings! 💥The Proteas have started strong, racing past the 50-run mark in under 4 overs.ICC Men’s #T20WorldCup | #NZvSA | LIVE NOW 👉https://t.co/QWNvn10eTj pic.twitter.com/Fz1rZvafPE— Star Sports (@StarSportsIndia) February 14, 2026టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లు👉క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా)- 33 డిస్మిసల్స్👉ఎంఎస్ ధోని (ఇండియా)- 32 డిస్మిసల్స్👉కమ్రాన్ అక్మల్ (పాకిస్తాన్)- 30 డిస్మిసల్స్👉దినేశ్ రామ్దిన్ (వెస్టిండీస్)- 27 డిస్మిసల్స్.చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య -
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది. -
ఇంటి విలువను పెంచే కొత్త రకం కిచెన్..
ఇంట్లో వంట గది స్థానం ప్రత్యేకం.. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి, శ్రేయస్సుకు, సానుకూల శక్తికి బీజం పడేది ఇక్కడే. అందుకే వాస్తుశాస్త్రంలోనూ వంట గదికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. అలాంటి కిచెన్ రూమ్ అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉండాలి కదా.. అందుకే మార్కెట్లో రకరకాల మాడ్యులర్ కిచెన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ, కలప, వెదురుతో కిచెన్ వార్డ్ రోబ్స్ తయారు చేస్తుండటంతో కొంతకాలం తర్వాత మన్నిక తగ్గి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారమే ‘స్టెయిన్ లెస్ స్టీల్ మాడ్యులర్ కిచెన్స్’! సంప్రదాయ వంట గదులకు కాలం చెల్లింది. ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, బార్లు, కాఫీ షాప్స్లో వినియోగించిన స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్స్ను ఇప్పుడు ఇళ్లలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్లో స్టెయిన్లెస్ స్టీల్ భాగమైపోయింది. ఇవి సాటిలేని మన్నిక, పరిశుభ్రత, సొగసైన, ఆధునిక సౌందర్యాన్ని అందిస్తాయి. నివాస, వాణిజ్య సముదాయాలు రెండింటిలోనూ అనువైనవి.నిర్వహణ సులువు.. స్టెయిన్లెస్ స్టీల్ వంట గదుల వేడిని గ్రహించవు. తుప్పు నిరోధక గుణాన్ని కలిగి ఉంటాయి. పైగా వీటి ఉపరితలాలపై రంధ్రాలు ఉండకపోవడంతో ద్రవాలు, రసాయనాలు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వంటివి లోపలికి వెళ్లవు. దీంతో ఎప్పుడూ మరకలు లేకండా పరిశుభ్రంగా ఉంటుంది. వీటి నిర్వహణ చాలా సులువు. ప్రత్యేకమైన క్లీనర్లు అవసరం లేకుండా తేలికపాటి సబ్బు, నీటితో శుభ్రం చేయవచ్చు. ఇవి అగ్ని నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అన్ని రకాల వాతావరణాలకు అనుకూలమైనవి. నీరు పడితే ఉబ్బడం, అధిక వేడికి కాలిపోవడం, కరగడం జరగదు. ఈ స్టీల్కు రంధ్రాలు ఉండవు కాబట్టి తెగుళ్లు, చెదపురుగులు పట్టవు.పర్యావరణ అనుకూలమైనవి.. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఉండే ఇంటి విలువ కొంత మెరుగ్గా ఉంటుంది. ఉన్నతశైలి అనుభూతిని కలిగిస్తుంది. ఇది పర్యావరణ అనుకూలమైనది. స్టయిన్లెస్ స్టీల్తో తరుచూ కిచెన్ కౌంటర్ టాప్లు, క్యాబినెట్ల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే వీటి ఎంపికలో జాగ్రత్తలు అత్యవసరం. కేవలం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్, ఇండియన్ స్టాండర్డ్ ఇనిస్టిట్యూషన్(ఐఎస్ఐ) మార్క్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. -
పాక్తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే!
క్రికెట్ ప్రపంచంలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లకు ఉన్న ఆదరణ వేరు. ఏ స్థాయిలోనైనా చిరకాల ప్రత్యర్థుల పోరుకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వీరాభిమానులకు ఆదివారం (ఫిబ్రవరి 15) పండుగే. వారి కోసం భారత్- పాక్ మ్యాచ్ డబుల్ ధమాకా ఎదురుచూస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోఓ వైపు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ శ్రీలంక వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్- సల్మాన్ ఆఘా బృందంతో అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు మహిళల ‘ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (ACC Women's Asia Cup Rising Stars 2026)’ టోర్నీలో కూడా ఈ రెండు జట్ల మధ్య నేడు (ఆదివారం) పోరు జరగనుంది.మధ్యాహ్నం 12.30 గంటలకు ఆరంభంభారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు దాయాది మహిళా జట్ల మధ్య మ్యాచ్ మొదలు అవుతుంది. బ్యాంకాక్లోని టెర్థాయ్ క్రికెట్ మైదానం ఇందుకు వేదిక. కాగా మహిళ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లతో పాటు యూఏఈ, నేపాల్ తలపడుతున్నాయి.అగ్రస్థానంలో పాక్ఇక గ్రూప్-బి నుంచి ఆతిథ్య థాయ్లాండ్, బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ, మలేషియా జట్లు పోటీలో ఉన్నాయి. గ్రూప్-లో తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ నేపాల్పై 30 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు.. భారత్-ఎ జట్టు మాత్రం అనూహ్య రీతిలో పసికూన యూఏఈ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.రాధ యాదవ్ కెప్టెన్సీలోఫలితంగా గ్రూప్-ఎలో ప్రస్తుతానికి పాక్, యూఏఈ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్, నేపాల్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాగా భారత మహిళల సీనియర్ జట్టు సభ్యురాలైన రాధ యాదవ్ కెప్టెన్సీలో భారత్-ఎ జట్టు ఈ టీ20 టోర్నీ బరిలో దిగింది. మన మహిళల బృందంలో అనుష్క శర్మ, తేజల్ హసబ్నిస్, మిన్ను మణి, నందిని శర్మవంటి ఉమెన్ ప్రీమియర్ లీగ్ స్టార్లు కూడా ఉన్నారు.ఎక్కడ చూడాలంటే?ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత్- పాక్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియోహాట్స్టార్లో ప్రసారం కానుండగా.. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో దాయాదుల పోరును సోనీ స్పోర్ట్స్ టీవీ నెట్వర్క్, సోనీ లివ్ ఇండియాలో వీక్షించవచ్చు.చదవండి: T20 WC 2026: పాక్తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు -
‘కపుల్ ప్రెండ్లీ’పై ప్రభాస్ రివ్యూ
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. తనకు వర్షం సినిమాలా, సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ గుర్తుండిపోయే మూవీ అవుతుందని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదొక లవ్ లీ బ్యూటిఫుల్ ఫిలిం అని, ఈ చిత్రాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేశానంటూ ప్రభాస్ తెలిపారు. సంతోష్, మానస జోడీ అద్భుతంగా ఉందని, అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారని ప్రభాస్ ప్రశంసించారు. ఇలాంటి మంచి కథలను తెరపైకి తీసుకొచ్చిన కో ప్రొడ్యూసర్ అజయ్, యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు.కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించారు. -
ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ప్రేమికుల రోజున విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారులో యువతీ యువకుల జంట విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, లోపల నుండి లాక్ చేసి ఉన్న కారులో బుల్లెట్ గాయాలతో ఉన్న ఇద్దరిని గుర్తించారు. వెంటనే కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ బృందం సాయంతో ఆధారాలు సేకరించారు.ఈ ఘటనలో మృతిచెందిన వారిని నోయిడా సెక్టార్ 58కి చెందిన రేఖ (26), ఢిల్లీ త్రిలోక్పురికి చెందిన సుమిత్ (32)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, వీరి సంబంధం గురించి ఇరు కుటుంబాలకు ముందే తెలుసని సమాచారం. అయితే, ఈ ఘటనకు ముందు రోజు నుండే వీరు ఎవరికీ కనిపించకుండా పోవడంతో, కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో సుమిత్ చేతిలో ఒక పిస్టల్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం సుమిత్ తన ప్రియురాలు రేఖను కాల్చి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలమైన సాక్ష్యంగా సుమిత్ పంపిన ఒక వాట్సాప్ సందేశం లభించింది. ‘నేను, సుమిత్.. ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి రేఖే కారణం. ఆమె 15 ఏళ్లుగా నాతో ప్రేమలో ఉండి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు మరొకరిని వివాహం చేసుకోబోతోంది. ఆమె నన్ను మోసం చేసినందునే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం.పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, సుమిత్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. కులం పేరుతో రేఖ కుటుంబం తమను అవమానించిందని, తమకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని వారు పోలీసులకు తెలిపారు. కారు దొరికిన ప్రాంతం రేఖ ఉండే గ్రామానికి అతి సమీపంలో ఉండటంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుల వివక్ష కారణంగానే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని వారు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం -
డేట్ ఛేంజ్
ఎస్... ఫలానా డేట్కి థియేటర్స్కి వచ్చేస్తాం అంటూ యూనిట్ ఒక డేట్ ఫిక్స్ చేసి, ప్రకటిస్తుంది. అయితే కొన్నిసార్లు సెట్ చేసిన డేట్కి ఆ సినిమా రాదు... వాయిదా పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వాయిదా వేస్తుంటారు. కొన్ని సినిమాల షూటింగ్ పూర్తి కాదు... కొన్ని పూర్తయినా గ్రాఫిక్స్ పూర్తి కావు... కొన్నయితే అన్నీ పూర్తయినా వేరే సినిమాలతో క్లాష్ అయ్యే పరిస్థితిలో తప్పక వాయిదా పడతాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ మధ్య కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ చిత్రాల పోస్ట్ పోన్ స్టోరీ తెలుసుకుందాం. వేసవిలో విశ్వంభర చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇందుకు కారణం... చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా. తనయుడి ‘గేమ్ చేంజర్’ కోసం తన ‘విశ్వంభర’ మూవీ విడుదలని చిరంజీవి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ 2025 జనవరి 10న రిలీజ్ అయింది. 2025 సంక్రాంతికి వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని భావించినప్పటికీ కాలేదు. ఇందుకు కారణం వీఎఫ్ఎక్స్ పనులు. ఈ కారణంగా చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్గారు’ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర పోషించారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఇక 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి... విడుదల తేదీపై స్పష్టత రావాలి. మార్చి టు ఏప్రిల్ రామ్చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీని రామ్చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ‘‘రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా ‘పెద్ది’. హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం రామ్చరణ్ ఫుల్మాస్ లుక్లోకి మారిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. అయితే వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చాం. మా సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి...’ పాట అన్ని ΄్లాట్ఫామ్లలో అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ పాట 200 మిలియన్ల వ్యూస్ దాటి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్లో విడుదల కావాల్సిన పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్సింగ్’ ముందుకు వచ్చి, మార్చి 26న రిలీజ్ కానుంది. మార్చి నుంచి ఆగస్టుకి... ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘కిల్, గ్యారా గ్యారా’ వంటి హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ‘ది ΄్యారడైజ్’లో భాగమయ్యారు. ఓ కీలక పాత్రను సంపూర్ణేష్ బాబు చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. నానిపై ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కుతున్న ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మాస్ ట్యూన్ అందించారు. కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ భారీ విజువల్స్తో ఈ సాంగ్ని పూర్తి స్థాయి క్రౌడ్ ప్లీజర్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్పోస్ చేసి, ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ‘‘మ్యాసివ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ హాటెస్ట్ పాన్ ఇండియన్ రిలీజెస్లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. మా సినిమాని ముందుగా మార్చి 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే తాజాగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రిలీజ్ డేట్కి మా సినిమాకు వరుసగా మూడు వారాల పండగలు కలిసి రానున్నాయి. మొదటి వారంలో ఓనం, మిలాద్–ఉన్–నబీ పండగలు, రెండో వీకెండ్లో రాఖీ, మూడో వారంలో జన్మాష్టమి ఉండటం వల్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘ది ΄్యారడైస్’కి బాక్సాఫీస్ వద్ద బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ΄్లానింగ్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాని... ఈ నిర్ణయంతో మరోసారి తన మార్కెటింగ్ సెన్స్ని చూపించారు’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి టు ఏప్రిల్... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో ఈ నెల 13న రిలీజ్ చేస్తామని యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే ఆ తేదీకి విడుదల వాయిదా పడి, ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు... ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న యూనిట్... కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్లు టాక్. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల కానుంది. 1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ్రపాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవాడు. అల్లరిగా తిరిగే అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ‘సలార్’ మూవీ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచింది. అదే విధంగా సెంథిల్ కుమార్ విజువల్స్ ఈ మూవీకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. మే 1న లెనిన్ వస్తాడా? అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్ ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు. ‘లెనిన్’ని మే 1న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే... ఆ తేదీకి రిలీజ్ కాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం రామ్చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా అని ఫిల్మ్నగర్ టాక్. మార్చి 27న ‘పెద్ది’ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ‘లెనిన్’ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి... ముందుగా అనుకున్నట్లు ‘లెనిన్’ మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తాడా? లేదా? లేకుంటే మరో కొత్త రిలీజ్ డేట్ని ప్రకటిస్తారా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘లెనిన్’ పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ మూవీ తప్పకుండా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మార్చి నుంచి ఏప్రిల్కి? అడివి శేష్ హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి రిలీజ్ని పోస్ట్పోన్ చేసి, ఉగాది కానుకగా ఈ ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్లో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేశారు. అయితే ఈ మూవీ మరోసారి విడుదల వాయిదా పడనుందని ఫిల్మ్నగర్ టాక్. మార్చి నెలలో యశ్ ‘టాక్సిక్’, రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకి వస్తుండటంతో ‘డెకాయిట్’ విడుదల వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందనే చర్చ నడుస్తోంది. అయితే మార్చి 19న విడుదల వాయిదా గురించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘‘ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘డెకాయిట్’. ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్లోని ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్కి పాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారు. ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం మాదే. అంతర్జాతీయ స్థాయిలో తీసిన ‘డెకాయిట్’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... యూనిట్ ముందుగా ప్రకటించినట్లు మార్చి 19న ‘డెకాయిట్’ సినిమా విడుదలవుతుందా? లేదా అనేది వేచి చూడాలి. ∙సంబరాలు ఎప్పుడు? సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). ఐశ్వర్యా లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ పోస్ట్పోన్ అయింది. అయితే ఆ తర్వాత విడుదల తేదీపై యూనిట్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మార్చి 14న థియేటర్లలోకి రానుందని టాక్. ‘‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం రూ. 125 కోట్లకు పైగా బడ్జెట్తో భారీ స్థాయిలో రూపొందింది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ ్రపాజెక్ట్గా ఈ మూవీ నిలుస్తుంది. మా సినిమాలోని సీజీ వర్క్ ఆడియన్స్కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వెట్రి పళనిసామి విజువల్స్, బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని యూనిట్ తెలిపింది. నాయకుడు వచ్చేదెప్పుడు? తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా పొంగల్ కానుకగా ఈ ఏడాది జనవరి 9 విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కొత్త విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్ ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ కారణంగా ఆయన సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారు. అందుకే విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి అద్భుతమైన స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల్లో ఉంది. మరి... అడ్డంకులు దాటుకుని ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడు? అన్నది వేచి చూడాలి. -
'ఈ బిడ్డ నా జీవితకాల కోరిక'.. బిగ్బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్
బిగ్బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 12న బిడ్డ పుట్టగా.. శివజ్యోతి బర్త్డే సందర్భంగా ఈనెల 14 శుభవార్తను పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలిపారు.తాజాగా బిగ్బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్ చేసింది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని రాసుకొచ్చింది. నా వెంకటేశ్వర స్వామి ప్రసాదం...నా స్వామి ఇచ్చిన మహా లక్ష్మి... వెంకటేశ్వర స్వామి నా జీవితంలో అత్యంత విలువైన పుట్టినరోజు బహుమతని ఇదేనని భావోద్వేగ పోస్ట్ చేసింది. కుమార్తెను కనడం నా జీవితకాల కోరికని శివజ్యోతి వెల్లడించింది.శివజ్యోతి తన ఇన్స్టాలో రాస్తూ..' బిడ్డను కనడం నాకు ఒక పెద్ద కల. అందులో ఒక కుమార్తెను కనడం నా జీవితకాల కోరిక. బహుశా దేవుడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడని నేను ఎప్పుడూ భావించా. అత్యంత సరైన సమయంలో ఆయన నాకు ఆశీర్వాదాన్ని కొంచెం ఆలస్యంగా ఇస్తాడు. కానీ.. మొదటి నెల నుంచే నా హృదయం ఆడపిల్ల కోసం బలంగా కోరుకుంది. కానీ నా మనస్సు అబ్బాయి కావచ్చని చెబుతూనే ఉంది. ఆ తర్వాత నా డెలివరీ గడువు తేదీకి కేవలం రెండు రోజుల ముందు అకస్మాత్తుగా నా హృదయంలో ఆ భావన మారిపోయింది. మనకు ఆడపిల్ల పుట్టబోతోందని భావించా. ఈ రోజు, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు, ప్రకృతి దయతో మాకు అందమైన ఆడపిల్ల పుట్టిందని' రాసుకొచ్చింది.ప్రస్తుతం నా భర్త గంగూలీ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన, అదృష్టవంతుల్లో ఒకరని తెలిపింది. ఆ జెంటిల్మెన్ స్వభావం, స్వచ్ఛమైన, దయగల హృదయం కారణంగానే మాకు ఆడపిల్ల పుట్టిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని తెలిపింది. మీ అందరి ఆశీర్వాదాలతో నేను, నా బిడ్డ క్షేమంగా ఉన్నామని పోస్ట్ చేసింది. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయని ఆనందం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
ప్రముఖ నటుడి కుమారుడి కారు బోల్తా..
తమిళ సినీ ప్రపంచంలో మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ విలన్గా, సహనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. లియో మూవీ విడుదల తర్వాత నటి త్రిషపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు. అయితే, ఆయన కుమారుడు తుగ్లక్ తన కారులో చెన్నై హాడోస్ రోడ్డు నుండి ఉత్తమర్ గాంధీ రోడ్డు వైపు వెళ్తుండగా..అకస్మాత్తుగా అదుపు తప్పి శాస్త్రి భవన్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా, కారులో ఉన్న తుగ్లక్ స్వల్ప గాయాలతో కిందపడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని రక్షించి, ఘటన స్థలంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మైలాపూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రమాదం జరిగినప్పుడు తుగ్లక్ మద్యం సేవించలేదని తెలిసింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గత సంవత్సరం మాదకద్రవ్యాలు ఉపయోగించినందుకు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు తుగ్లక్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం గమనార్హం. -
IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య
పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు వైవిధ్యమైన బౌలర్ అన్న మాట వాస్తవమేనని.. అయితే, తాము మాత్రం అతడి ఆటకు లొంగమని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ ఆదివారం ముఖాముఖి తలపడనున్న విషయం తెలిసిందే. శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్.ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.అపుడే చూస్తారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పలు విషయాలపై స్పందించాడు. ముఖ్యంగా పాక్ ఆటగాళ్లతో ఈసారి కరచాలనం చేస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘మేం చక్కటి క్రికెట్ ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. అది మాత్రమే అత్యంత ముఖ్యం. మిగతావన్నీ అనవసర విషయాలు.షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పను. మ్యాచ్ ప్రారంభమైనప్పుడే మీరు చూస్తారు’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. సున్నా నుంచి మొదలుఇక టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో పాక్పై 7-1తో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తున్న అంశం ప్రస్తావనకు రాగా.. ‘‘పాక్పై పాత రికార్డు ఇక్కడ పనికి రాదు. మళ్లీ సున్నా నుంచి స్కోరు మొదలు పెట్టాల్సిందే’’ అని సూర్య నిజాయితీగా సమాధానం ఇచ్చాడు.అదే విధంగా ఉస్మాన్ తారిఖ్ (Usman Tariq)నైపుణ్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘పరీక్షలో సెలబస్ నుంచి కాకుండా ఇతర అంశాల గురించి ప్రశ్నలు వచ్చినంత మాత్రాన దానిని వదిలివేయలేము కదా!.. అతడి ఆటకు మేము లొంగిపోముఅతడొక వైవిధ్యమైన బౌలర్. అయినంత మాత్రాన మేము అతడి ఆట ముందు లొంగిపోము. అతడి బౌలింగ్లో ఆడేందుకు మా వాళ్లు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు’’ అని సూర్య పేర్కొన్నాడు.చకింగ్ ఆరోపణలుకాగా తన వైవిధ్యమైన బౌలింగ్ శైలితో పాక్ ఆఫ్స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ వార్తల్లో నిలుస్తున్నాడు. ‘చకింగ్ (సందేహాస్పద బౌలింగ్)’ చేస్తున్నాడంటూ ఆరోపణలు వినిపించినా...రెండు సార్లు అతడి యాక్షన్కు ఐసీసీ అనుమతి ఇచ్చింది. కాబట్టి నిబంధనల ప్రకారం తప్పు లేకపోవచ్చు. ఈ విషయం గురించి పలువురు మాజీ అంపైర్లు కూడా ఇదే చెప్పారు.అయితే బంతి విసిరే ముందు అతను కాస్త ఆగినట్లుగా ఉంటూ (పాజ్) వేయడం చర్చకు దారి తీసింది. ఇది బ్యాటర్ను గందరగోళంలో పడేయవచ్చని... బ్యాటర్ కూడా కాస్త జరిగి షాట్ ఆడటమే దీనికి ఉపాయమని అశ్విన్ విశ్లేషించాడు. అంత సీన్ లేదుఅయితే తారిఖ్ యాక్షన్ ఎలా ఉన్నా... అతడు సాధారణ ఆఫ్స్పిన్నర్ మాత్రమేనని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయ పడ్డాడు. భారత బ్యాటర్లు అతడి బౌలింగ్లో చెలరేగుతారని ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: T20 WC 2026: పాక్తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు -
సరిహద్దుల్లో పాక్ డ్రోన్.. పార్సిల్ జారవిడిచి..
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దుల వెంట పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను దేశంలోకి దొంగచాటుగా తరలించేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్మీ విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఆర్ఎస్పురా సెక్టార్లో శనివారం రూ.40 కోట్లకు పైగా విలువ చేసే 6.5 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13వ తేదీ రాత్రి వేళ అనుమానాస్పద డ్రోన్ కదలికలపై ఆ ప్రాంత పోలీసులకు సమాచారం అందింది.అదేవిధంగా, పాక్ భూభాగం వైపు నుంచి వచ్చిన డ్రోన్ ఒకటి ఏదో వస్తువును జార విడిచిపెట్టిందంటూ అందిన సమాచారంతో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అప్రమత్తమైంది. ఈ మేరకు బస్పూర్ ప్రాంతంలోని నయీ బస్తీ కరోతానా గ్రామం వద్ద పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలోని పంట పొలాల్లో 6.582 కిలోల బరువున్న హెరాయిన్ ప్యాకెట్లను జవాన్లు కనుగొన్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. సరిహద్దులకు సమీపంలోని కథువా జిల్లాలో పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా హెరాయిన్ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన రెండు రోజుల్లోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. -
వాలెంటైన్స్ డే స్పెషల్.. పవిత్రా లోకేశ్కు నరేశ్ స్వీట్ విషెస్..!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా సుహాస్ హీరోగా వస్తోన్న హే భగవాన్ మూవీతో ఆడియన్స్ను పలకరించనున్నారు. శివానీ నాగారం హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే నరేశ్ మూవీ ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా పవిత్రా లోకేశ్తో సరదా ఇంటర్వ్యూ జరిగింది. హే భగవాన్ మూవీ గురించి పవిత్రా లోకేశ్ ప్రశ్నలు అడగ్గా.. నరేశ్ సమాధానాలిచ్చారు. ఈ మూవీలో నా క్యారెక్టర్ నేను మరిచిపోలేని పది సినిమాల్లో పాత్రల్లో ఇది ఒకటని అన్నారు. నాతో ఇంటర్వ్యూ ఎలా ఫీలవుతున్నారని పవిత్రా అడగ్గా.. నువ్వు చాలా బాగా మాట్లాడావ్.. మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. మంచి యాంకర్ అవుతావని నేను నమ్ముతున్నా అంటూ పంచులు వేశారు.అంతేకాకుండా వాలెంటైన్స్ డే కావడంతో పవిత్రకు స్పెషల్గా విషెస్ తెలిపారు. కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే.. ప్రియతమ నువ్వు అచట కుశలమా.. నేను ఇచట కుశలమే అంటూ లవ్ సాంగ్ పాడుతూ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రేమికుల రోజున మూవీ ప్రమోషన్తో పాటు వీరిద్దరి ప్రేమబంధం చూసిన ఆడియన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పవిత్రకే బిజినెస్ ఏంటో చెప్పలేదు...మీరు చెబితే 20K,#Guess Cheyyandi#HeyBhagawan pic.twitter.com/hwOA60mRVh— Taraq(Tarak Ram) (@tarakviews) February 14, 2026 -
రిలయన్స్కి వెనెజులా చమురు
న్యూఢిల్లీ: వెనెజులా నుంచి ముడి చమురు నేరుగా దిగుమతి చేసుకునేందుకు దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కి అమెరికా నుంచి లైసెన్సు లభించింది. కంపెనీకి చెందిన జామ్నగర్ రిఫైనరీకి అనువైన ఈ క్రూడాయిల్ని డిస్కౌంటు రేటుకు పొందడం వల్ల రిలయన్స్ రిఫైనింగ్ మార్జిన్లు మరింత మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇప్పటివరకు ట్రేడర్ల ద్వారా మాత్రమే విక్రయించడానికి అమెరికా అనుమతిస్తూ వస్తోంది. తాజాగా జనరల్ లైసెన్సు ఇవ్వడం వల్ల ఇప్పటికే ఆయిల్ని వెలికితీసిన సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. వాస్తవానికి 2019–20 వరకు వెనెజులా నుంచి రిలయన్స్ క్రూడాయిల్ని కొనుగోలు చేసింది. ఆ దేశంపై అమెరికా ఆంక్షలతో కొన్నాళ్లు నిలిపివేసి, వాటిని సడలించాక 2024లో కొనుగోలు చేసింది.మళ్లీ ఈ ఏడాది ట్రేడర్ల ద్వారా వెనెజులా ఆయిల్ అమ్మకాలు ప్రారంభమయ్యాక 2 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించిన తర్వాత ఆ దేశ ఇంధన రంగంపై ఆంక్షలను అమెరికా సడలించింది. -
ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి : వంశీ నందిపాటి
‘‘హే భగవాన్’ ఎంటర్టైన్మెంట్ మూవీ. స్టోరీ లెవల్ నుంచే ఈ ప్రాజెక్టులో ఉన్నాను. ఇప్పుడు సమర్పకుడిగా ఉన్నాను. ఈ సినిమాలో బిజినెస్ అనే అంశం ఉంటుంది. ఒక కొడుకు తన తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ అంశం ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో వినోదంతో పాటు భావోద్వేగాలు ఉన్నాయి. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హృదయానికి హత్తుకునే సినిమా ఇది’’ అని వంశీ నందిపాటి అన్నారు. సుహాస్, శివానీ నాగారం జోడీగా గోపీ అచ్చర దర్శకత్వం వహించిన చిత్రం ‘హే భగవాన్’. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కానుంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ నందిపాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పేరు భగవాన్.. అందుకే ‘హే భగవాన్’ టైటిల్ పెట్టాం. కొంతకాలం నుంచి సుహాస్ ఎదురు చూస్తున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో సాధించబోతున్నాడు. కథ పరంగా ఏవైనా మార్పులుంటే కన్విన్సింగ్గా చెబితే దర్శకులు కూడా ఒప్పుకుంటారు. అయితే కంటెంట్లో బలం ఉంటేనే మనం కూడా ఏమైనా చేయగలం.దర్శకుడు హ్యాపీ అయితే సినిమా బాగుంటుందనేది నా నమ్మకం. ఇక ‘లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ మూవీస్ తర్వాత చిన్న సినిమాలు పెరిగాయి. ఇటీవల ఫిల్మ్ఛాంబర్లో ఒక నెలలోనే 300 సినిమాల టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఓటీటీ బిజినెస్లు కావడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే కేవలం ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి. నిర్మాతగా మంచి చిత్రాలు అందించాలనేది నా లక్ష్యం. బన్నీ వాసుగారు నాకు బ్రదర్లాంటి వారు. మా ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయి. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్గా మార్చి 6న రిలీజ్ చేస్తున్నాను. సత్యదేవ్తో పాటు శ్రీవిష్ణుతో సినిమాలు చేస్తున్నాను. ‘పొలిమేర–3’ షూట్ని ఏప్రిల్ లేదా మేలో ప్రారంభిస్తాం. ఈ మూవీని అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈటీవీ విన్తో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
పవన్ అభిమానుల నుంచి ముప్పు.. బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి
కూసుమంచి (ఖమ్మం): తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (45) అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం 7–30 సమయంలో కారు నీళ్లలో కొంతమేర మునగగా.. వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందడం.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారవడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు శ్రీనివాస్ కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందినవారు. సాహిత్య పరిశోధకుడిగా, యూట్యూబర్గానూ గుర్తింపు పొందారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తిచేసిన ఆయన పలు పుస్తకాలు రచించగా.. 2014లో పవన్కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశంపై ‘పవన్కళ్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో’ పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకం 8 లక్షలకుపైగా కాపీలు అమ్ముడుపోయిందని సమాచారం. పవన్కళ్యాణ్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఆయనకు రక్షణ కూడా కల్పించింది. ఏం జరిగిందంటే.. పాలేరు రిజర్వాయర్లోకి శనివారం ఉదయం ఏపీ 16 డీపీ 2345 నంబరు కారు దూసుకెళ్లింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి స్థానికులకు సమాచారం ఇవ్వగా.. ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు లాగారు. కారు నీళ్లలో కొంతమేర మునగగా, వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెంది ఉన్నాడు. అయితే, కారు నీటిలో పడిన సమయాన డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి నాయకన్గూడెం వైపు వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ ఘటనాస్థలిని పరిశీలించారు.బయటపడిన వ్యక్తి ఏమైనట్టు? కారులో ఇద్దరు ఉండగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. వెనుకాల సీటులో కూర్చున్న వ్యక్తిని కాపాడకుండా హడావుడిగా వెళ్లిపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క మృతుడి నుదురు, ముఖంపై గాయాలు ఉండగా కారు నీటిలో పడిన సమయాన తగిలాయా, ఎక్కడైనా హత్య చేసి కారులో తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్కళ్యాణ్పై పుస్తకం రాసిన దృష్ట్యా శ్రీనివాస్కు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం రక్షణ కలి్పంచిందని శ్రీనివాస్ స్నేహితులు ‘సాక్షి’కి తెలిపారు. ఈనేపథ్యంలో శ్రీనివాస్ది ముమ్మాటికీ హత్యేనని, పోలీసులు విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. కారు రిజర్వాయర్లో పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం చేరేందుకు హైవే ఉన్నప్పటికీ పాత సర్వీస్ రోడ్డును ఎంచుకోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు రిజర్వాయర్లో పడిపోయి ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా అని పోలీసులు, మృతుడి స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు నీట మునిగాక ఒడ్డుకు చేరి వెళ్లిపోయిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తూనే నాయకన్గూడెం వద్ద ఉన్న టోల్ప్లాజా సీసీ ఫుటేజీల ద్వారా కారు నంబర్ సేకరించి ఎవరిదనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, శ్రీనివాస్ మృతదేహం ప్రస్తుతం నేలకొండపల్లి ఆస్పత్రి మార్చురీలో ఉండగా, ఆయన సోదరులు శనివారం అర్ధరాత్రి వరకు ఇక్కడకు చేరే అవకాశముందని సమాచారం. -
మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే..
వారణాసి: నేడు(ఆదివారం) మహాశివరాత్రి సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఈ ఏడాది మహాదేవుని సన్నిధిలో 26 గంటల పాటు నిరంతర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పండితులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు కాశీకి తరలివస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారణాసి జిల్లా యంత్రాంగం ఆలయ కమిటీ హై అలర్ట్ ప్రకటించాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన లైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు, భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. గంగా ఘాట్ల వద్ద ప్రత్యేక నిఘాను పెంచిన అధికారులు.. వేడుకలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు. आज दिनांक 14.2.2026 को महाशिवरात्रि की पूर्व संध्या पर श्री काशी विश्वनाथ धाम की अद्भुत छटा । #banaras #kashivishwanath #HarHarMahadev #bholenath pic.twitter.com/TdOntP4VU5— Shri Kashi Vishwanath Temple Trust (@ShriVishwanath) February 14, 2026గంగా నది తీరాన కొలువై ఉన్న పురాతన కాశీ నగరాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసంగా, మోక్ష ప్రాప్తికి ప్రధాన కేంద్రంగా భక్తులు విశ్వసిస్తారు. హిందూ సంస్కృతిలో మహాశివరాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర దినమే సృష్టి ఆరంభమైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పౌరాణిక కథల ప్రకారం పరమశివుడు ఇదే రోజున మహాగ్నిలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే లోక కళ్యాణం కోసం శివపార్వతుల వివాహం జరిగిన అద్భుత ఘట్టం కూడా ఈ రోజేనని చెబుతుంటారు. అందుకే శివభక్తులు ఈ రాత్రంతా జాగరణ చేస్తూ, అభిషేకాలతో భోళాశంకరుడిని కొలుస్తారు.ఉజ్జయినిలో వైభవంగా భస్మ హారతిమధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుజామున 3 గంటలకే అర్చకులు పవిత్ర పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనెతో స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం, గంధం, సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. ఆపై మహాకాళుడికి తెల్లని వస్త్రాలను ధరింపజేసి, అత్యంత ప్రీతిపాత్రమైన ‘విజయ’ అలంకారం చేశారు. శంఖారావాల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ‘భస్మ హారతి’ని కళ్లారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ తలుపులను 44 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. ఈ పర్వదినం సందర్భంగా సుమారు 10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, భద్రత, క్యూ లైన్ల నిర్వహణ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉజ్జయినిలో మహాశివరాత్రికి ముందు తొమ్మిది రోజుల పాటు ‘శివ నవరాత్రి మహోత్సవాలు’ అత్యంత వైభవంగా నిర్వహిస్తునన్నారు. శివరాత్రి మరుసటి రోజున స్వామివారికి ‘సెహ్రా’ అలంకరించి భస్మ హారతిని నిర్వహిస్తారు. ఇది కూడా చదవండి: Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం -
లెన్స్కార్ట్కు భారీ లాభాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో కళ్లద్దాల కంపెనీ లెన్స్కార్ట్ సొల్యూషన్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 133 కోట్లకు చేరింది.కొత్త కస్టమర్లు జత కలవడం, మార్జిన్లు మెరుగుపడటం, అంతర్జాతీయ బిజినెస్ పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 38 శాతం జంప్చేసి రూ. 2,308 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 1,669 కోట్ల టర్నోవర్ అందుకుంది. దేశీ ఆదాయం 40 శాతం, విదేశీ ఆదాయం 33 శాతం చొప్పున ఎగసినట్లు కంపెనీ పేర్కొంది.ఈ కాలంలో పన్నుకు ముందు లాభం(పీబీటీ) రూ. 48 కోట్ల నుంచి మూడు రెట్లు బలపడి రూ. 161 కోట్లకు చేరింది. విదేశీ మార్కెట్ల నుంచి రూ. 33 కోట్ల పీబీటీ ఆర్జించగా.. గత క్యూ3లో ఇది రూ. 42 కోట్ల నష్టంగా నమోదైంది. -
ఒట్టేసి చెప్పు ఓటేశావో లేదో..
మంచిర్యాల జిల్లా: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ డబ్బులు పంచి.. ఓటమి తర్వాత తిరిగి ఇవ్వాలంటూ వసూలు చేస్తున్న వీడియో శనివారం వైరల్గా మారింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ బీజేపీ అభ్యర్థి పోటీ చేసి ఓటమి పాలైంది. శనివారం డివిజన్ పరిధిలోని సీతారాంపల్లిలో ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి.. ‘ఓటు వేసావో లేదో ఒట్టేసి చెప్పు’.. అంటూ చేతిలో చేయి వేయించుకుంది. సదరు వృద్ధు రాలు తమ ఇంట్లో రెండు ఓట్లు ఉన్నాయని, ఒకటి వేశామని, మరొకటి వేయలేదని చేతిలో చేయి వేసి చెప్పింది. అనంతరం రూ.3000 తిరిగి ఇచ్చేసింది. డబ్బులు ఎవరు పంపిణీ చేయమన్నారు?.. ఎందుకు తిరిగి ఇవ్వమంటున్నారని పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం వీడియోలో కనిపిస్తోంది. SWEAR ON GOD THAT YOU VOTED…OR PAY BACK! BJP candidate Jadi Tirupati, who lost in Mancherial Municipal Corporation Division 9, in the recently concluded Telangana Municipal polls decided that it is “pay back” time quite literally. His wife Roopa went to every house and… pic.twitter.com/N3Uqgml75D— Revathi (@revathitweets) February 14, 2026 -
రుణాలపై టాటా క్యాపిటల్ అవగాహన కార్యక్రమాలు
ముంబై: ‘సవాల్ కరో, ఫిర్ లోన్ లో’ పే రిట రుణాలపై అవగాహనను పెంచేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిట ల్ వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రుణాల ప్రక్రియ సరళతరంగా మారి లోన్స్ మరింత అందుబాటులోకి వచ్చాయని టాటా క్యాపిటల్ ఎండీ రాజీవ్ సబర్వాల్ తెలిపారు.ఈ నేపథ్యంలో పూర్తి సమాచారంతో రుణం విషయంలో హడావిడి పడకుండా, సరై న ప్రశ్నలు వేసుకుని, తమ ఆర్థిక బాధ్య తలను పూర్తిగా అర్థం చేసుకుని ముందడుగు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. దీనితో దేశీయంగా రుణ వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు. -
ధనుశ్ వల్లే భారీ నష్టం.. రూ.20 కోట్లు చెల్సించాల్సిందే..!
కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి చిత్రాల తరువాత ధనుష్ నటిస్తోన్న తాజా చిత్రం కర. ఈ మూవీ టైటిల్ను పొంగల్ సందర్భంగా ప్రకటించారు. ఆయన కెరీర్లో ఇది 54వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాలో మమతా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే తాజాగా ధనుశ్ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 2016లో ప్రకటించిన ఓ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంతో నిర్మాణ సంస్థ ఆయనపై లీగల్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆగిపోవడం వల్ల రూ.20 కోట్ల పరిహారం కోరుతూ ధనుశ్కు.. తేనాండల్ ఫిల్మ్స్ లీగల్ నోటీసు పంపినట్లు తెలుస్తోంది.2016లో నాన్ రుద్రన్ అనే సినిమాను దర్శకత్వం వహించడంతో పాటు నటించడానికి ధనుష్ అంగీకరించారని తేనాండల్ ఫిల్మ్స్ తెలిపింది. అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే ఈ సినిమా ఆగిపోవడంతో.. తమకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారని తేనాండల్ ఫిల్మ్స్ ఆరోపిస్తోంది. చివరికీ ఆ సినిమా నుంచి కూడా ధనుశ్ తప్పుకున్నారని అంటోంది.ఈ మూవీ కోసం ముందస్తు చెల్లింపులు, ప్రీ-ప్రొడక్షన్ ఖర్చులకు గానూ దాదాపు రూ.20 కోట్ల నష్టాలు వచ్చాయని తేనాండల్ ఫిల్మ్స్ తెలిపింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టులో భాగమైన టాలీవుడ్ హీరో నాగార్జున, ఎస్జే సూర్య లాంటి స్టార్ నటులకు చెల్లించిన పారితోషికం కూడా ఇందులో భాగమని తెలుస్తోంది. ముఖ్యంగా ధనుష్ పూర్తి స్క్రిప్ట్ సమర్పించడంలో విఫలమవడం.. ఇతర ప్రొఫెషనల్ కమిట్మెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే మా సినిమా ఆగిపోయిందని.. దీనివల్ల తమకు తీవ్ర నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. అందువల్లే చట్టపరమైన చర్యలకు దిగినట్లు తేనాండల్ ఫిల్మ్స్ ప్రకటించింది. -
కారుతో ఢీకొట్టి.. అతనిపైనే నడిపి..
హైదరాబాద్: ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి అరకిలోమీటరు వరకు లాక్కెళ్లడంతోపాటు అతనిపైనే కారును పోనిచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన మేరకు.. రాంపల్లి నీలగిరి హోమ్స్లో నివాసముంటున్న సతీష్(45), విజయ్కుమార్, రాజులు ఈ నెల 9న కారులో వెళుతుండగా మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద వెనుక నుంచి అతి వేగంగా దూసుకువచ్చిన కారు వీరి కారును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో వీరు వేగంగా వెళ్లి ఆ కారును అడ్డుకున్నారు. సతీష్ ఆ కారుకు ఎదురుగా నిలబడ్డాడు. అయితే నిందితులు వేగంగా వచ్చి సతీష్ను ఢీకొట్టడంతో అతను బానెట్ను గట్టిగా పట్టుకున్నాడు. అయినా అలాగే సుమారు అర కిలోమీటరు వరకు లాక్కెళ్లారు. అదుపుతప్పి సతీష్ పడిపోవడంతో నిర్దాక్షిణ్యంగా అతనిపైనే కారుపోనిచ్చారు. ఈ సంఘటనలో సతీష్ తీవ్రంగా గాయడ్డాడు. గమనించిన స్థానికులు కారును అడ్డుకొని అందులో ఉన్న మహేష్ తరుణ్లకు దేహశుద్ధి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను శనివారం రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఓటీటీ రివ్యూ: మలయాళ ఆణిముత్యం.. గుండె లోతుల్లో నిలిచిపోయే సినిమా
మలయాళ సినిమాలు అనగానే చాలామందికి థ్రిల్లర్సే గుర్తొస్తాయి. కానీ అంతకు మించినవి చాలానే ఉన్నాయి. అలాంటి ఓ మూవీనే 'కుంబలంగి నైట్స్'. కేరళలోని ఓ మత్స్యకార పల్లెలో జరిగే స్టోరీ ఇది. చూస్తున్నంతసేపు జీవితం కళ్లముందు కనిపిస్తుంది. గుండెని మెలిపెట్టేస్తుంది. ప్రేమలో పడేలా చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఆణిముత్యం. అంతకంటే పెద్ద పదమే ఉన్నా దానితోనూ పోల్చొచ్చు. అంతటి అద్భుతమైన ఈ మూవీ సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కేరళలోని కుంబలంగి గ్రామం. ఊరి చివరన ఓ సగం కట్టిన ఇల్లు. అందులో షాజీ, బోనీ, బాబీ, ఫ్రాంకీ అనే నలుగురు అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి పడదు. ఎవరూ ఏ పని చేయరు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోతే ఎలా ఉంటుందో వీళ్ల జీవితం అలానే తయారవుతుంది. పెద్దవాడైన షాజీ(సౌబిన్ షాహిర్).. తన స్నేహితుడు ఓ రోజు చనిపోవడంతో బిడ్డతల్లి అయిన అతడి భార్యకు తన ఇంట్లో ఆశ్రయమిస్తాడు. రెండో వాడైన బోనీ(శ్రీనాథ్ బసి) ఓ విదేశీయురాలితో ప్రేమలో పడతాడు. మూడో వాడైన బాబీ(షేన్ నిగమ్).. అదే ఊరికి చెందిన బేబీ(అన్నా బెన్)ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతాడు. ఇలా అన్నదమ్ముల జీవితాల్లోకి వచ్చిన మహిళల కారణంగా ఈ కుటుంబంలో ఎలాంటి మార్పులొచ్చాయి? అన్నదమ్ములు చివరకు ఎలా ఒక్కటయ్యారు? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఏదో ఓ విషయంలో అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ 'కుంబలంగి నైట్స్' చూసిన తర్వాక కంప్లీట్ మూవీ చూశాం అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు అద్భుతమైన దృశ్యకావ్యంలా అనిపిస్తుంది. మనం కూడా కుంబలంగి అనే ఊరిలో వాళ్లతో పాటు ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. మూవీ చూస్తున్నంతసేపు నవ్వుతాం, ప్రేమిస్తాం, ఏడుస్తాం, బాధపడతాం, భావోద్వేగానికి గురవుతాం. అంతలా మిమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తుంది.సినిమా ఫస్టాప్ అంతా కూడా పాత్రలు, వాటి స్వభావాలే చూపిస్తారు. సెకండాఫ్కి వచ్చేసరికి అసలు కథ మొదలవుతుంది. పాత్రల మధ్య సంఘర్షణ పీక్ స్టేజీకి వెళ్తుంది. అన్నదమ్ములంతా ఒక్కడవడంతో ముగుస్తుంది. అయితే ఈ మూవీలో స్టోరీగా చూస్తే.. ఏముందా అనిపిస్తుంది. కానీ కథనం(స్క్రీన్ ప్లే) చూస్తే మాత్రం వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సాధారణ సన్నివేశాలకు కూడా ముగింపు ఇచ్చిన తీరు కట్టిపడేసేలా ఉంటుంది.స్టోరీ మధ్యలో వచ్చే షమ్మి పాత్ర అయితే హైలైట్. చాలా ఇళ్లలో పురుషాధిక్యత చూపించే మగాళ్లకు ఇది ప్రతీక. వెకిలిగా నవ్వుతూ అందరిని చులకనగా చూసే ఈ పాత్రని సైకోలా చూపించారు. తన పంతం నెగ్గించుకోవడానికి ఇంట్లోని మహిళల్ని కట్టిపడేసి, బాబీ అన్నదమ్ములతో కలబడతాడు. వాళ్లందరూ షమ్మిని బంధించి.. ఆడవాళ్లని విడిపిస్తారు. అయితే షమ్మికున్న మానసిక జాడ్యం ఆ పాత్రదా? సమాజంలో కొనసాగుతున్న పురుషాహంకారాన్ని ప్రతిబింబిస్తుందా? అనేది అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత.షమ్మి.. తనని తాను మగాడు అనుకుంటాడు. తను చెప్పిందే అందరూ వినాలి అన్నట్లు పవర్తిస్తుంటాడు. ఇతడికి పూర్తి వ్యతిరేకంగా షజీ పాత్ర ఉంటుంది. ఆడదిక్కు లేని ఇంటి బాధ్యతల్ని తన భుజానేసుకుని, తమ్ముళ్లకు తల్లి లేని లోటు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఎలాంటి అహంకారం ఉండదు. తప్పు జరిగిందని తెలిసి ఆడదాన్ని కాళ్లమీద పడతాడు. తన వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకునేందుకు చేయాల్సిందంతా చేస్తాడు. కానీ ఎప్పుడూ నేను మగాడిని అనే అహంకారం ప్రదర్శించడు. తనలో బాధని బయటపెట్టలేక కనీసం ఏడుపు కూడా రాకపోయేసరికి.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని తమ్ముడిని అడుగుతాడు. చివరకు సైకియాట్రిస్ట్ దగ్గరకెళ్లి తనివితీరా ఏడ్చి బాధనంతా పోగట్టుకుంటాడు. తెరపై షజీ పాత్ర కన్నీళ్లు పెట్టుకోవడం ఏమో గానీ మన కళ్లు కూడా చెమ్మగిల్లుతాయి.ఈ సినిమాలో కథ బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఇంకా బాగుంటుంది. సంగీతం హృద్యంగా ఉంటుంది. క్లైమాక్స్ కడుపు నింపేస్తుంది. కేరళ అందాల దగ్గర నుంచి చేపల పట్టడం వరకు అన్నీ నచ్చేస్తాయి. అర్జెంట్గా మనం కూడా కుంబలంగి గ్రామానికి వెళ్లిపోవాలి అనిపించేంతలా నచ్చేస్తుంది. అలానే షజీగా చేసన సౌబిన్ షాహిర్, బోనీగా చేసిన శ్రీనాథ్ బసి, బాబీగా చేసిన షేన్ నిగమ్, ఫ్రాంకీగా చేసిన మ్యాథ్యూ థామస్, బేబీగా చేసిన అన్నా బెన్.. ఇలా ప్రతి పాత్ర మనకు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. వీళ్లందరి కంటే షమ్మిగా చేసిన ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ పిచ్చిపిచ్చిగా నచ్చేయడం గ్యారంటీ.ఏదైనా సినిమా చూస్తే బలంగా గుర్తుండిపోవాలి. మానవ సంబంధాలు ప్రతిబింబించేలా ఉండాలి. ప్రేమకున్న గొప్పతనం తెలియాలంటే మాత్రం ఈ మలయాళ ఆణిముత్యాన్ని అస్సలు మిస్ చేయొద్దు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో, యూట్యూబ్లో ఇది అందుబాటులో ఉంది. మలయాళ భాషలో మాత్రమే ఉందని చూడటం మానేయొద్దు. ఓ మంచి మూవీ మిస్ అవుతారు. కుటుంబంతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన -
Mahashivratri 2026: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి
తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు కూలైన్లలో బారులు తీరారు. మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.ఉమ్మడి తూర్పుగోదావరి: గోదావరి తీరంలో భక్తులతో ఘాట్లు కళకళలాడుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామకు కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. మురమళ్ళలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా: మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో ద్రాక్షారామ,కోటిపల్లి శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. శివనామ స్మరణతో ద్రాక్షారామ శ్రీభీమేశ్వర స్వామి ఆలయం, కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర వారి ఆలయాలు మార్మోగుతున్నాయి. కోటిపల్లి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే కోటిపల్లి గౌతమి గోదావరి నిధులు పుణ్యా స్నానాలు ఆచరించిన భక్తులు.. సోమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.నంద్యాల జిల్లా: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జాముముండి 4 గంటల నుండే సర్వ దర్శనాలు ప్రారంభమయ్యాయి. దర్శనానికి నాలుగు క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, వృద్దులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఆది దంపతులకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ నిర్వహించనున్నారు. రాత్రి 12 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరగనుంది.రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోలాహలం నెలకొంది. ఓం నమశ్శివాయ మంత్రాక్షరితో దక్షిణకాశీ వేములవాడ పులకిస్తోంది. కోడె మొక్కులకు కొలువైన క్షేత్రంగా వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. నిన్న సాయంత్రం టీటీడీ పట్టువస్త్రాల సమర్పించింది. ఇవాళ ఉదయం 8 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పించనున్నారు. సాయంత్రం లింగార్చన జరుగనుంది. రాత్రి ప్రారంభమయ్యే లిగోద్భవ పూజకు భక్తులు తరలిరానున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్ పాల్గొనున్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం శైవక్షేత్రం మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. విద్యుత్ కాంతులతో కాళేశ్వరం క్షేత్రం ముస్తాబైంది. తెలంగాణతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు కాళేశ్వరం తరలివస్తున్నారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 4 గంటలకు .వైభవంగా శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు త్రివేణి సంగంలో హంస వాహన సేవ తెప్పోత్సవ కార్యక్రమం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.ఉమ్మడి వరంగల్ జిల్లా: ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కొమురవెల్లి మల్లన్న, అయినవోలు మల్లన్న ఆలయాలతో సహా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చరిత్ర ప్రసిద్ధిగాంచిన రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆగమానుసారంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ మంగళవాయిద్య సేవ ఉత్తిష్ఠగణపతికి హరిద్ర కుంకుమ లేపణ అభిషేకం, రుద్రేశ్వరస్వామికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వర్తించి రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామివార్లను నంది వాహనంపై మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో ఎదురుకోలు నిర్వర్తించి రుద్రేశ్వరునికి ఎదురుగా సూర్యాలయంలో ఆది దంపతులను ప్రతిష్టించి గణపతి నవగ్రహ అష్టదిత్పాలక పూజలు నిర్వహించారు. -
అల్లు అర్జున్- అట్లీ కాంబో.. మరో హీరోయిన్గా క్రేజీ బ్యూటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం బిగ్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా షూటింగ్కు సంబంధించిన సింగిల్ వీడియో కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇది చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణెను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. లేటేస్ట్గా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బిగ్ ప్రాజెక్ట్లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ను మరో హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ- అట్లీ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. -
శివ శివా.. ఇవేం ఏర్పాట్లు?
శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లను చూసి భక్తులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. లింగాలగట్టులో ప్రణాళిక లేకుండా లో లెవల్, హై లెవల్ ఘాట్ల వద్ద మౌలిక సదుపాయాలను తూతూమంత్రంగా ఏర్పాట్లు చేయడంతో స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు కృష్ణా నది నీటిలో మునిగాయి. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు గత్యంతరం లేక చీరలను అడ్డుగా కట్టి దుస్తులు మార్చుకుంటున్నారు. అరకొరగా ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు కూడా నీటిలో మునిగిపోయాయి.ఈ పరిస్థితులను అక్కడ విధులు నిర్వర్తిస్తున్న జిల్లా పంచాయతీ అధికారిణి కె.లలితాబాయి దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. -
Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఈ నెల 17వ తేదీన ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ ఈ వేడుకను అంతర్జాతీయ వేదికగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, యూఏఈ సహా మొత్తం 13 దేశాల ప్రభుత్వాధినేతలకు అధికారికంగా ఆహ్వానాలు పంపారు.భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యేక దౌత్య సంబంధాల దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అందిన ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఫిబ్రవరి 17న ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ప్రధాని ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులుగా భారత ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బంగ్లాదేశ్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.బంగ్లాదేశ్లో బీఎన్పీ పార్టీ అధికారికంగా మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించబోతోంది. బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్లోని సదరన్ ప్లాజాలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. అదే రోజు ఉదయం నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేయనుండగా, అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దీన్.. తారిఖ్ రెహమాన్ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.దక్షిణాసియాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమానికి శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ తదితర పొరుగు దేశాల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. కాగా బంగ్లాదేశ్లో బీఎన్పీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ, భారత్తో ఆ దేశ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బీఎన్పీ హయాంలో భారత్తో సంబంధాలు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, ప్రస్తుత నాయకత్వం ప్రాంతీయ సహకారం, వాణిజ్యం, స్థిరత్వంపై సానుకూల ప్రకటనలు చేసింది. -
రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి దుర్మరణం
వల్లూరు (చెన్నూరు): కడప పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి రిషిక(23) దుర్మరణం చెందింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన రిషిక, ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్యతో పాటు విశాఖ పట్టణానికి చెందిన ఠాగూర్ రెడ్డి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) కళాశాలలో బీఎస్ఎమ్ఎస్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో వీరు రెండు ద్విచక్ర వాహనాల్లో శనివారం ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు విహారయాత్రకు బయలుదేరారు. కడప పట్టణం సమీపంలోని ఆలంఖాన్ పల్లె వద్ద ఉన్న ఇర్కాన్ సర్కిల్ వద్ద ఠాగూర్రెడ్డి నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. వెనుక కూర్చొన్న రిషిక రోడ్డుపై పడిపోగా ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూరు పోలీసులు తెలిపారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్ జగన్ అన్నారు.ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.‘‘నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. ‘‘ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ!’’ అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.ఓం నమః శివాయ !#Mahashivratri— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2026 -
మెగాస్టార్ కొత్త సినిమా.. ఛాంపియన్ బ్యూటీకే ఆ ఛాన్స్..!
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన మనశంకర వరప్రసాద్గారు సూపర్ హిట్గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మెగా అభిమానులను మెప్పించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్స్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టాలీవుడ్లో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రకు ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్గా కాదు.. చిరంజీవి కూతురిగా కనిపించనుందని సమాచారం. ఈ కథలో పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో దర్శకుడు బాబీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. భావోద్వేగాలకు ప్రధాన్యత ఉన్న పాత్ర కావడంతో అనస్వర నటన సినిమాకు మరింత బలం చేకూర్చనుందని ఇండస్ట్రీ లేటేస్ట్ టాక్. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
నింగి నుంచి నేల గురించి..
బెంగళూరు: భారత్, అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థలు ఇస్రో, నాసాల మానసపుత్రికగా తయారై గగనతలంలో చక్కర్లు కొడుతున్న నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్(నైసర్) ఉపగ్రహం నుంచి ప్రతి 12 రోజులకు ఒకసారి యావత్ భారతదేశ పర్యావరణ, జీవావరణ, హిమానీ నదాలు, జలరాశులకు సంబంధించిన సమస్త తాజా సమాచారం అందనుంది. ఈ వివరాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ఎస్–బ్యాండ్, ఎల్–బ్యాండ్ల మేలు కలయికగా జంట ఫ్రీక్వెన్సీల సింథటిక్ అపర్చర్ రాడార్లను నైసర్ ఉపగ్రహంలో అమర్చారు. వీటి సాయంతో నేలలో తేమ వంటి అత్యంత కీలక వివరాలు సైతం 100 గీ 100 మీటర్ల అత్యధిక రెజల్యూషన్తో ఛాయాచిత్రాల రూపంలో అందనుంది. 100 మీటర్ల రెజల్యూషన్ చిత్రపటం అంటే అందులోని ఒక్కో పిక్సెల్ లేదా డేటా అనేది భూమిపై 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని నేల సమాచారాన్ని పట్టిచూపుతుంది. నేలలో తేమ అనేది నీటిపారుదల, కరువుల సమస్యకు పరిష్కారాలు చూపిస్తూ భారత సాగు, నీటి నిర్వహణ విధానంలో కీలకభూమిక పోషిస్తోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షం, పొగమంచు, మేఘాల వంటి పరిస్థితుల్లోనూ నేల ఫొటోలను అత్యంత స్పష్టంగా తీసి పంపుతుంది. దీంతో నీటిపారుదల సదుపాయం ఉన్న ప్రాంతాలతోపాటు వర్షాధార నేలలు, వర్షాభావ ప్రాంతాలు, అత్యధిక వర్షపాతమున్న ప్రాంతాల్లో ప్రతి రోజూ నేలలో తేమ ఎంతశాతముందనే వివరాలు తెలుస్తాయి. దీంతో సాగునేలకు ఎంత మేర నీరు అవసరం, ఏస్థాయిలో నీటిని సరఫరా చేయాలి? అనే వివరాలపై రైతలకు ఒక స్పష్టత వస్తుంది’’అని ఇస్రో తన ప్రకటనలో పేర్కొంది. నేల సమస్త సమాచారం అందుబాటులోకి.. ‘‘నేలపై సెంటీమీటర్ పరిధిలో కూడా నిశితమైన ఫొటోలను తీసి పంపుతాయి. నైసార్కు ఉన్న రెండు రాడార్లలో ఒకటి ఎల్–బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో, మరోటి ఎస్–బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తాయి. నేలతేమను పట్టిచూసే భౌతికశాస్త ఆధారిత అల్గారిథమ్ను స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎస్ఏసీ–ఇస్రో)లో అభివృద్ధిచేశారు. ఇది శాస్త్రీయంగా నేల ఆరోగ్యాన్ని కనిపెడుతూ అత్యంత ఖచ్చిత్వంతో నిర్ణయాలు తీసుకోవడానికి సాయపడుతుంది. రెండు బ్యాండ్ల కారణంగా 12 రోజులకు ఒకసారి రాడార్లు భూమిని చుట్టేస్తూ నేల స్వభావ, స్వరూపాల సమస్త సమాచారాన్ని మనకు అందిస్తాయి. ఈ సమాచారాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఐఎంజీఈఓఎస్/ఎన్ఆర్ఎస్సీ) సేకరిస్తుంది. ఈ డేటాను భూనిధి పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెస్తుంది. ప్రతి 12 రోజులకు ఒకసారి మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమాచారం అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ సమాచారంతో రైతులు, విధాన రూపకర్తలు, పరిశోధకులు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వేతర కంపనీలు తమ పరిధి మేర నిర్ణయాలు తీసుకునే సువర్ణావకాశం దక్కుతుంది’’అని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. మధ్య భారతదేశం మొదలు సింధూ–గంగా మైదాన ప్రాంతాల్లోని పంటభూముల దాకా ప్రతిచోటా నేలలో తేమ శాతం ఎంత ఉంది? ఎంత ఉండాలి? ఏంత మేర అదనంగా నీటి సరఫరా అవసరం? అనే వివరాలు అందటంతో ఆ మేరకు విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం చిక్కుతుంది. ఎల్–బ్యాండ్ రాడార్ అనేది అడవీప్రాంతాలు, ఎడారులు, మంచుమయ ప్రాంతాల్లోని నేల స్వభావాన్ని విశ్లేíÙస్తుంది. భూగర్భంలో మార్పులనూ పసిగట్టగలదు. ఎస్–బ్యాండ్ రాడార్ అనేది పంట పొలాలు, నీటి వనరుల తాజా స్థితిని తెలియజెప్తుంది. సమిష్టిగా ఈ రెండు బ్యాండ్లు కలిసి భారతీయ నేలల ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ నీటి వనరుల లభ్యతపై పరిశోధకులకూ స్పష్టమైన అవగాహన పెంపొందిస్తాయి. భారతదేశం అంతటా ఒకేలా వర్షాలు పడవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వాతావరణం ఉంది. ఒక్కోసారి జిల్లా జిల్లాకు మధ్య వాతావరణ వ్యత్యాసం ఉంది. దీంతో చిన్న చిన్న క్లస్టర్లుగా విభజిస్తూ వేర్వేరుగా డేటాను సమీకరించాల్సి వస్తోంది. అందుకోసమే నైసర్ను నింగిలోకి పంపారు. నీటి నిర్వహణతోపాటు వాతావరణ మార్పుల వంటి అంశాలూ స్పష్టంగా తెలియనున్నాయి. గత ఏడాది జీఎస్ఎల్వీ 16 ప్రయోగం ద్వారా నైసర్ను నింగిలోకి పంపిన విషయం విదితమే. -
మీరు అలసిపోయారా? విసిగిపోయారా?
"ఉదయం నిద్ర లేవగానే ఒళ్లంతా భారంగా ఉంటుంది.. ఆఫీసుకి వెళ్లాలనే ఉత్సాహం అస్సలు ఉండదు.. చేసే పని మీద ఏకాగ్రత కుదరదు.." ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా? అయితే మీరు కేవలం 'అలసిపోలేదు', మీరు 'బర్న్ అవుట్' (Burnout) కి గురవుతున్నారు. సాధారణ అలసట ఒక రాత్రి నిద్రతో పోతుంది, కానీ బర్న్ అవుట్ అనేది నిద్రపోయినా తగ్గని ఒక దీర్ఘకాలిక మానసిక నిస్సత్తువ.బర్న్ అవుట్ అంటే ఏమిటి?యంత్రం అతిగా వాడితే ఎలా వేడెక్కి ఆగిపోతుందో, మనిషి కూడా తన శక్తికి మించిన మానసిక ఒత్తిడిని నిరంతరం భరిస్తే 'బర్న్ అవుట్' అవుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని ఒక 'వృత్తిపరమైన రుగ్మత'గా గుర్తించింది. ఇది పని పట్ల విరక్తిని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది.4 ముఖ్య సంకేతాలు...1. Emotional Exhaustion ( నిరంతర అలసట): రాత్రి 8 గంటలు పడుకున్నా, ఉదయం లేవగానే ఇంకా నిద్ర చాలలేదన్నట్టు, శక్తి లేనట్టు అనిపించడం. ఇది శారీరక అలసట కాదు, మానసిక శ్రమ వల్ల కలిగే నీరసం.2. Cynicism (నిరాశావాదం): ఒకప్పుడు ఇష్టంగా చేసిన పని ఇప్పుడు భారంగా అనిపించడం. సహోద్యోగుల మీద, క్లయింట్స్ మీద కారణం లేకుండా కోపం రావడం. "నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల ఉపయోగం ఏంటి?" అనే నైరాశ్యం.3. Reduced Productivity (తగ్గిన పనితీరు): ఎంత ప్రయత్నించినా పాత వేగంతో పని చేయలేకపోవడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గంటల తరబడి సమయం పట్టడం.4. శారీరక సమస్యలు: కారణం లేని తలనొప్పి, కడుపులో అసౌకర్యం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం. మనసు పడే ఒత్తిడిని శరీరం ఇలా బయటపెడుతుంది.నా వద్దకు వచ్చిన ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాధ (పేరు మార్చాను) కథ ఇక్కడ చెప్పుకోవాలి. ఆమె 15 ఏళ్లుగా అద్భుతంగా పని చేస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా ఆమె ఆఫీసులో అందరితో గొడవ పడుతోంది. "నాకు ఈ జాబ్ వద్దు, నేను రాజీనామా చేస్తాను" అని ఏడుస్తూ చెప్పింది. వాస్తవానికి ఆమెకు పని చేతకాక కాదు, గత మూడేళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేయడం వల్ల ఆమె మెదడు 'బర్న్ అవుట్' స్టేజ్ కి చేరుకుంది. ఆమెకు కావాల్సింది రాజీనామా కాదు, ఒక సుదీర్ఘమైన 'మెంటల్ బ్రేక్'.బయటపడటం ఇలా...* మీ శక్తికి మించిన బాధ్యతలను స్వీకరించడం ఆపండి. ప్రయారిటీలను సెట్ చేసుకోండి. 'నో' చెప్పడం నేర్చుకోండి.* ఆఫీస్ సమయం తర్వాత ల్యాప్టాప్, ఆఫీస్ వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి. డిజిటల్ కనెక్షన్ కట్ చేయండి. మీ మెదడుకు 'ఆఫ్ టైమ్' ఇవ్వండి. * మీకు ఇష్టమైన పని (సంగీతం, పెయింటింగ్, లేదా నడక) కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి. హాబీలను పునరుద్ధరించండి. ఇది మీ మెదడుకు రీఛార్జ్ లా పనిచేస్తుంది.* విశ్రాంతిని ప్లాన్ చేయండి. సెలవు తీసుకోవడం అంటే సోమరితనం కాదు. అది మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి తీసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్.ఈ వారం మీ కోసం పరీక్ష...* మీకు ఇష్టమైన పనులు చేయడానికి కూడా ఇప్పుడు ఉత్సాహం ఉండటం లేదా?* ఆఫీసులో చిన్న పొరపాటు జరిగినా అతిగా స్పందిస్తున్నారా (Overreacting)?* ఒంటరిగా ఉండాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని అనిపిస్తోందా?పై మూడింటికి 'అవును' అని సమాధానం వస్తే, మీరు బర్న్ అవుట్ వైపు వెళ్తున్నారని అర్థం చేసుకోండి.గుర్తుంచుకోండి.. కాలిపోయిన కొవ్వొత్తి వెలుగునివ్వలేదు. మీరు ఇతరులకు, మీ కంపెనీకి ఉపయోగపడాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీలోని ఉత్సాహం ఆవిరి కాకముందే మేల్కొనండి. బర్న్ అవుట్ లేదా కెరీర్ ఒత్తిడి నుండి బయటపడటానికి కౌన్సెలింగ్ లేదా కోచింగ్ తీసుకోండి.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
విష ప్రయోగంతో నవాల్నీ హత్య
లండన్: రష్యా ప్రతిపక్ష నాయకుడు, దేశాధినేత పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని ఐదు యూరప్ దేశాల విదేశాంగ మంత్రులు ఆరోపించారు. విష ప్రయోగంతో ఆయనను హత్య చేశారని వెల్లడించారు. ఇది ముమ్మాటికీ పుతిన్ ప్రభుత్వం చేయించిన హత్యేనని తేల్చిచెప్పారు. నవాల్నీ 2024 ఫిబ్రవరి 16న జైలులో శిక్ష అనుభవిస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అధిక రక్తపోటు కారణంగానే అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, నవాల్నీ మృతదేహం నుంచి సేకరించిన నమూనాల విశ్లేషణపై యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రులు శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుల చేశారు. ఎపిబాటిడైన్ అనే విషం కారణంగా నవాల్నీ మరణించినట్లు ఈ విశ్లేషణలో తేలిందని పేర్కొన్నారు. దక్షిణ అమెరికాలో కనిపించే డార్ట్ కప్పల చర్మంలో ఈ విషం ఉంటుందని తెలిపారు. ఇలాంటి కప్పలు సాధారణంగా రష్యాలో కనిపించవని వెల్లడించారు. అంటే దక్షిణ అమెరికా కప్పల నుంచి సేకరించిన విషాన్ని నవాల్నీపై ప్రయోగించి హత్య చేశారని ఆరోపించారు. ఇదంతా రష్యా ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరిగినట్లు మండిపడ్డారు. రసాయన ఆయుధాల ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని స్పష్టంచేశారు. దీనిపై రసాయన ఆయుధాల నియంత్రణ సంస్థకు ఫిర్యాదు చేస్తామన్నారు.పుతిన్లో నవాల్నీ భయం రష్యాలో పుతిన్ ప్రభుత్వం అలెక్సీ నవాల్నీని ఒక ముప్పుగా గుర్తించిందని, ఆయనను అడ్డు తొలగించుకోవాలని ఎప్పుడో నిర్ణయించిందని యూకే విదేశాంగ మంత్రి యెవిట్ కూపర్ పేర్కొన్నారు. అందుకే విష ప్రయోగంతో అంతం చేసిందని వెల్లడించారు. నవాల్నీ జీవించి ఉంటే ఎప్పటికైనా అధికారం నుంచి కూలదోస్తాడన్న భయంలో పుతిన్లో ఉండేదన్నారు. రష్యాలో ప్రభుత్వ అవినీతిపై నవాల్నీ గళమెత్తారు. పుతిన్కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆయనకు ప్రజాదరణ లభించింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు సాగిస్తున్నారని ప్రభుత్వం అభియోగాలు మోపింది. న్యాయస్థానం 19 ఏళ్ల జైలుశిక్ష విధించింది. మరణానికి ముందు తన భర్తపై విష ప్రయోగం జరిగినట్లు రెండు స్వతంత్ర ప్రయోగశాలలు నిర్ధారించాయని ఆయన భార్య యూలియా నవాల్నీ గతేడాది వెల్లడించారు. నవాల్నీ మృతి వెనుక పుతిన్ హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలను రష్యా ప్రభుత్వం ఖండిస్తోంది. ఇందులో ఎలాంటి కుట్ర లేదని, అనారోగ్యం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారని చెబుతోంది. -
సినిగళంలో నీల కంఠుడు
‘కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం’ అని రాశారు వేటూరి ‘సాగర సంగమం’లో.తెలుగు సినిమాల్లో శివుడి ప్రస్తావన ఆది నుంచి ఉన్నా అనేక పాటల్లో శివుని ప్రస్తావనను, ప్రభావాన్ని ప్రేక్షకులకు అందించినవారిలో కె.విశ్వనాథ్, వేటూరి ఉంటారు.‘నటరాజ శత సహస్ర రవితేజా... నట గాయక వైతాళిక మునిజనభోజా’ అని వేటూరి తాను కె.విశ్వనాథ్తో పని చేసిన తొలి హిట్ ‘సిరిసిరిమువ్వ’లో శివుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత ‘శంకరాభరణం’లో ‘ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము’ అని సకల కళలకూ మూలమైన నటరాజ స్వరూపం పరమశివుడిని పల్లవిగా చేశారు.భగవంతుడ్ని చేరుకోడానికి సంగీతం కూడా ఒక అనుసంధాన మార్గమే కదా. అందుకే ‘అద్వైత సిద్దికి అమరత్వ లబ్దికి గానమే సోపానమూ’ అని కూడా అన్నారు వేటూరి.శివతత్వాన్ని పూర్తిగా తెలిసి రాసిన సాహిత్యం ‘సాగరసంగమం’లోనూ వినిపిస్తారు వేటూరి, విశ్వనాథ్లు. శివుడు లయకారుడు. సంగీతంలోనూ... సాహిత్యంలోనూ... గానంలోనూ కూడా లయే ప్రధానం. శివుడు మాట్లాడితే సాహిత్యం. మాట్లాడకపోతే వేదాంతం. అన్నీ శివుడే అని చెప్పటానికి వేటూరి, విశ్వనాథ్ కలసి చేసిన ప్రయోగం సాగరసంగమంలోని ‘ఓం నమఃశివాయ’ పాట. అందులో ‘నీ లయలే ఈ కాలగమనమై’ అంటారు. ‘ప్రకృతి పార్వతి శివునితో కలిసి అడుగులు వేస్తాయి’ అని కూడా అంటారు. ‘జీవితమే చిర నర్తనమాయే’ అనడం వేటూరి మాస్టర్స్ట్రోక్. ఇక బాపు ‘భక్త కన్నప్ప’లో వేటూరి రాసిన ‘కిరాతార్జునీయం’ మరో కవికి సాధ్యం కానిది.వెనక్కు వెళ్లి చూస్తే తెలుగు సినిమా సాహిత్యంలో పరమ శివుడికి ప్రత్యేక స్థానమే ఉంది. రావణ విరచిత ‘శివ దండకాన్ని’ సంపాదించి దాన్ని రావణ పాత్రతోనే పాడించేలా పరిశోధన చేసి సాధించారు సముద్రాల రాఘవాచార్యులు ‘భూకైలాస్’లో. దాన్ని గాలి పెంచెల నరసింహా రావు స్వరసారధ్యంలో నిజంగానే రావణుడే పాడుతున్నారా అన్నంత ఎక్స్ప్రెసివ్గా గానం చేసి రక్తి కట్టించారు ఘంటసాల. తెరమీద రావణపాత్రలో ఎన్టీఆర్ అయితే ఇక చెప్పడానికేముంది. ‘భూకైలాస్’లోనే శివుణ్ణి ‘లోక శుభంకరుడు’గా వర్ణించారు సముద్రాల. ‘అన్య దైవము గొలువ నీదు పాదము విడువ’ అంటాడు రావణుడు శివభక్తితో ‘నీలకంధరా దేవ’ పాటలో. ఇక పింగళి గారు ‘సత్య హరిశ్చంద్ర’లోని ‘నమో భూతనాథ’ పాటలో శివుణ్ణి ‘సదా సుప్రకాశ’ అన్నారు.‘అర్ధనారీశ్వర’ తత్వాన్ని అర్ధం చేసుకున్న వారెవరైనా శివపార్వతులను ఒకటిగానే చూస్తారు. అందుకే భయం కలిగినప్పుడు అభయం కోసం అమ్మవారైన పార్వతిని స్తుతిస్తుంది ద్రౌపది ‘నర్తనశాల’లో. సముద్రాల రాసిన ‘జననీ శివకామినీ’ పాటను భక్తిరసస్ఫోరకంగా స్వరపరిచారు సుసర్ల దక్షిణామ్మూర్తి. అంతే గొప్పగా గానం చేశారు సుశీల. ఆరుద్రకు ఏం తక్కువ. ‘మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’ అని రాశారు ‘భక్త కన్నప్ప’లో. ‘గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని’ అనే పంక్తి ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది. ‘ఏకలవ్య’లో మల్లెమాల రాసిన ‘మ్రోగింది ఢమరుకం మేల్కొంది హిమనగం’ కూడా గుర్తు చేసుకోదగ్గది. ‘అమెరికా అమ్మాయిలో’నూ ఓ శివభక్తి గీతం వినిపిస్తుంది. నారాయణరెడ్డి రాసిన సాహిత్యం చిదంబర నిలయుడి మూర్తిని మన కళ్లెదుట నిలుపుతుంది. ‘వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితై వినిపించగా’ అంటూ ‘ఇంద్ర’ కోసం రాసిన ‘భంభం భోలే’ లో ‘గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే’ అని సిరివెన్నెల మాత్రమే రాయగలరు.‘భరత వేదముగ నిరత నాట్యముగ కదలిన పదమిది పరమేశా’ అని పౌర్ణమి’లోని పాట తరచూ వినిపించే సిరివెన్నెల మరో రచన. ఆపదల్లో ఉన్న వారికి అభయం ఇచ్చి తన వారినిగా చేసుకునే సువిశాల శివతత్వ దర్శనమే ‘ఖలేజా’లో వినిపించే రామజోగయ్యశాస్త్రి గీతం ‘సదాశివ సన్యాసి’. శివతత్త్వమే అత్యంత శుభకరము, భవహరము, హృదయంగమము. మరి ఈశ్వర సాయుజ్యం ΄÷ందేందుకు ప్రయత్నోన్ముఖులైన వారికి ఆనందం కాక మరేమిటి? ఇంక ఇహలోక బంధాలనూ... జంజాటాలనూ పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? విభూతిని ధరించని ఫాలభాగం, శివాలయం లేని గ్రామం, ఈశ్వరుని ధ్యానించని మానవ జన్మం వ్యర్థములు అంటారు. శివ అంటే సంస్కృతంలో శుభము, సౌమ్యము అని అర్థాలున్నాయి. ఈ ప్రపంచమూ అందరి జీవనమూ శుభ సౌమ్యాలతో గడవాలని కోరుకుందాం.– భరద్వాజ -
నిత్యం అబద్ధాలేనా?
కారైకల్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిత్యం అబద్ధాలు చెప్పడం అనే కొత్త సంప్రదాయాన్ని రాహుల్ ప్రారంభించాడని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. గొంతు చించుకొని గట్టిగా అబద్ధం చెప్పడం, దాన్ని పునరావృతం చేయడం, అబద్ధాన్ని నిజంగా నమ్మించాలని చూడడం రాహుల్ విధానంగా మారిపోయిందని విమర్శించారు. రాహుల్ అబద్ధాల ఫ్యాక్టరీ వెనకున్న అసలు బాగోతాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. యూకే, ఈయూ, అమెరికాలతో కుదుర్చున్న వాణిజ్య ఒప్పందాలతో మన రైతులకు, మత్స్యకారులకు, పాడి పరిశ్రమకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదన్నారు. అయినప్పటికీ రాహుల్ తప్పుడు ప్రచారంతో వారిని భయోత్పాతానికి గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం తప్పనిసరిగా కాపాడుందన్నారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల గురించి క్షుణ్నంగా తెలుసుకొని మాట్లాడాలని రాహుల్ గాం«దీకి హితవు పలికారు. శనివారం పుదుచ్చేరిలోని కారైకల్లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చిచెప్పారు. మన ప్రయోజనాలు 100 శాతం కాపాడుకొనేలా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని వివరించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని అమిత్ షా ఉద్ఘాటించారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన ఘనత మోదీ నిర్ణయాత్మక నాయకత్వానిదేనని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్తో ముష్కర మూకలకు గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు. పుదుచ్చేరి అభివృద్ధి జరగాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఆయన ‘నరేంద్ర సరెండర్ మోదీ’
న్యూఢిల్లీ: దేశంలో పత్తి రైతులు, జౌళి ఎగుమతిదారులను మోదీ ప్రభుత్వం నిలువునా దగా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల ఆయా రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఒప్పందాన్ని తప్పుపట్టారు. ఇది అమల్లోకి వస్తే మనదేశంలో పత్తి సాగు పూర్తిగా నిలిచిపోతుందని, ఎగుమతులు ఆగిపోతాయని, కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా ప్రభుత్వం మన ఉత్పత్తులపై 18 శాతం టారిఫ్లు ప్రకటించిందని, మోదీ సర్కార్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సున్నా టారిఫ్లకు అంగీకరించిందని వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన రైతులు, ఎగుమతిదారులు కచి్చతంగా నష్టపోతారని తేలి్చచెప్పారు. అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలన్న షరతుతో బంగ్లాదేశ్ వ్రస్తాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సున్నా టారిఫ్లు ప్రకటించిందని గుర్తుచేశారు. భారతీయ వ్రస్తాలపై 18 శాతం టారిఫ్లను ఖరారు చేసిందని పేర్కొన్నారు. మన వ్రస్తాలపై కూడా సున్నా టారిఫ్లు కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం దాచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మన వ్రస్తాలపై సున్నా టారిఫ్లు కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలని, దానివల్ల మన రైతులు నష్టపోతారని తెలిపారు. అమెరికా ఎదుట ప్రధాని మోదీ లొంగిపోయారని రాహుల్ విమర్శించారు. ప్రధానమంత్రిని ‘నరేంద్ర సరెండర్ మోదీ’గా అభివరి్ణంచారు. -
రష్యా చమురు కొనబోమని భారత్ హామీ: రూబియో
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా పునరుద్ఘాటించింది. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. శనివారం మ్యూనిక్లో సెక్యూరిటీ సదస్సు సందర్భంగా ఆయన ఈ మేరకు పేర్కొన్నట్టు రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది. అయితే, చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొనడం విశేషం. ‘‘ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి. కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసిన మీదట తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయి’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు టారిఫ్లు విధించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడ్డ నేపథ్యంలో వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
పట్టణాలకు మహర్దశ
సాక్షి, న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాలను ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్లుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, వాటి అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం శనివారం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి కేంద్ర సాయంగా ఏకంగా రూ.లక్ష కోట్లను కేటాయించింది! ఈ పథకం 2025–26 నుంచి 2030–31 ఆరి్ధక సంవత్సరం దాకా ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అనంతరం అవసరాన్ని బట్టి మరింతకాలం పొడిగిస్తారు. అప్పు తెస్తే కేంద్రం సాయం! నగరాలు తమ కాళ్లపై తాము నిలబడేలా, మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకునేలా యూసీఎఫ్ను కేంద్రం రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టే పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో 25% నిధులను యూసీఎఫ్ కింద కేంద్రం ఇస్తుంది. ఇందుకోసం ప్రాజెక్టు నిధుల్లో కనీసం 50 శాతాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి సమీకరించాల్సి ఉంటుంది. మున్సిపల్ బాండ్లు, బ్యాంక్ రుణాలు లేదా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) వాటిని సమకూర్చుకోవాలి. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, లేదా స్థానిక సంస్థలు భరించాలి. యూసీఎఫ్తో రాబోయే ఐదేళ్లలో దేశ పట్టణాభివృద్ధి రంగంలో ఏకంగా రూ.4 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. పట్టణాభివృద్ధిలో గ్రాంట్ ఆధారిత విధానం స్థానంలో మార్కెట్, సంస్కరణల ఆధారిత విధానానికి ఇది నాంది పలుకుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. చిన్న పట్టణాలకు రూ.5,000 కోట్ల నిధి యూసీఎఫ్ పథకంలో భాగంగా పోటీతత్వానికి కేంద్రం తెర తీసింది. పారదర్శకంగా, సంస్కరణలు అమలు చేసే నగరాలకే ప్రాధాన్యమిస్తారు. పాలనలో డిజిటల్ విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, అర్బన్ ప్లానింగ్ సంస్కరణలు అమలు చేసే నగరాలు రేసులో ముందుంటాయి. అంతేగాక టైర్2, టైర్3 నగరాలు, ముఖ్యంగా లక్ష లోపు జనాభా ఉన్న చిన్న పట్టణాల కోసం రూ.5,000 కోట్లతో ప్రత్యేక కార్పస్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాలు మార్కెట్ రుణాలు పొందడానికి కేంద్రం ‘క్రెడిట్ రీపేమెంట్ గ్యారంటీ’ఇస్తుంది. దీనికింద తొలిసారి రుణాలకు రూ.7 కోట్లు లేదా రుణ మొత్తంలో 70% దాకా కేంద్రమే గ్యారంటీగా ఉంటుంది.మూడు రంగాలపై ఫోకస్ యూసీఎఫ్ ద్వారా మూడు రకాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తారు... → నగరాల విస్తరణ, ఆర్థిక కారిడార్లు, రవాణా వ్యవస్థ మెరుగుదల → పాత బస్తీలు, హెరిటేజ్ ప్రాంతాల ఆధునీకరణ, బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టులు, విపత్తుల నుంచి రక్షణ → తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త నిర్వహణ (స్వచ్ఛత), నీటి వనరుల రక్షణ ఎవరికి వర్తిస్తుంది? → 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు → రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు → లక్ష జనాభా దాటిన పారిశ్రామిక నగరాలు → చిన్న పట్టణాలు (గ్యారెంటీ స్కీమ్ కింద)కేబినెట్ ఇతర నిర్ణయాలుప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వేల కోట్ల రూపాయలతో కూడిన పలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వాటిని మీడియాకు వెల్లడించారు... → తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో రూ.11 వేల కోట్ల రోడ్డు ప్రాజెక్టులకు అనుమతి → అస్సాంలో రూ.18,662 కోట్లతో బ్రహ్మపుత్ర నది కింద దేశంలోనే తొలి అండర్ వాటర్ రైల్, రోడ్డు ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు. దీన్ని గోహ్పూర్–నుమాలిగఢ్ నడుమ 34 కి.మీ. పొడవున నిర్మించనున్నారు → కసారా–మన్మాడ్, ఢిల్లీ–అంబాలా, బళ్లారి–హోస్పేట నడుమ మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం నిమిత్తం రూ.18,509 కోట్లతో మూడు భారీ ప్రాజెక్టులు → రూ.10 వేల కోట్లతో తలపెట్టిన స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు ఆమోదం → నోయిడా మెట్రో రైల్ ప్రాజెక్టు 11.56 కి.మీ. మేరకు విస్తరణ. → ప్రధాని కార్యాలయాన్ని రైసినా హిల్స్లోని సౌత్ బ్లాక్ నుంచి నూతనంగా నిర్మించిన సేవా తీర్్థలోకి మార్చడం పట్ల కేంద్ర మంత్రివర్గం హర్షం వెలిబుచి్చంది. శుక్రవారం సౌత్బ్లాక్ కార్యాలయంలో జరిగిన చివరి మంత్రివర్గ భేటీలో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. ‘‘సేవా తీర్థ్ చరిత్ర, భవిష్యత్తుల కూడలి. గతకాలపు బానిసత్వం నుంచి భవిష్యత్ వికసిత భారత్ దిశగా వేసిన ముందడుగు’’అని అభివరి్ణంచింది. -
ఇండియా ఏఐ సదస్సు రేపటి నుంచే
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ సదస్సు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, ముఖ్య నేతలతో పాటు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు పాల్గొంటున్నారు. సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 40 మందికి పైగా సీఈఓలతో భేటీ కానున్నారు. వీరిలో శామ్ ఆల్టమన్ (ఓపెన్ఏఐ), బిల్ గేట్స్, డేరియో అమొదెయ్ (ఆంత్రోపిక్) తదితరులున్నారు. భారత్లో పెట్టుబడి ప్రణాళికలను గురించి వీరంతా తమ ఆలోచనలను ప్రధానితో పంచుకోనున్నారు. ఈ సదస్సు సందర్భంగా పలు రంగాల్లో ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు ఏఐ పెట్టుబడులకు ఒప్పందాలు కుదురతాయని అంచనా. వచ్చే నాలుగేళ్లలో భారత్లో ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి ప్రణాళికలను మైక్రోసాఫ్ట్ గత డిసెంబర్లో ప్రకటించడం తెలిసిందే. ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ సామర్థ్య పెంపు, అత్యాధునిక డిజిటల్ నైపుణ్యాల్లో లక్షలాది మంది యువతకు శిక్షణ తదితరాలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. గత ఏఐ సదస్సులు పారిస్, సియోల్ తదితర నగరాల్లో జరిగాయి. -
ఈశాన్యంలో చొరబాట్లు... కాంగ్రెస్ పుణ్యమే!
గువాహటి: కాంగ్రెస్ పారీ్టపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈశాన్య భారతదేశంలో అభివృద్ధిని దశాబ్దాలుగా కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతేగాక ఈ ప్రాంతంలో చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహించింది’’అంటూ దుయ్యబట్టారు. చొరబాటుదారులను కాపాడిన, కాపాడుతున్న చరిత్ర ఆ పార్టీదేనని ఆక్షేపించారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని చెప్పారు. అస్సాంలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం గువాహటిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ తన హయాంలో దేశ భద్రతను నిత్యం ప్రమాదంలో నెట్టిందంటూ మండిపడ్డారు. ఆ పార్టీ పాలనలో అస్సాంలో నిత్యం భయం, అభద్రతలే రాజ్యమేలాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ నిత్యం సమాజంలో విభజనను ప్రోత్సహించింది. ఓటుబ్యాంకు రాజకీయాల్లో మునిగి తేలింది. దేశ భద్రతను గాలికొదిలేసింది. చివరికి ఆయుధాల కొనుగోళ్లలో కూడా భారీ కుంభకోణాలకు పాల్పడింది. గతంలో ముస్లిం లీగ్ వల్ల దేశ విభజన జరిగింది. కానీ ఇప్పుడు మావోయిస్టులు, ముస్లిం లీగ్, కాంగ్రెస్ (ఎంఎంసీ)లతో దేశానికి ముప్పు పొంచి ఉంది. వీటిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’’అని ప్రధాని సూచించారు. ‘డబుల్ ఇంజన్’కే ఓటెయ్యండి వచ్చే ఐదేళ్ల కాలం అస్సాంకు చాలా కీలకమని మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కారును కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం ఒక్కటే బీజేపీ లక్ష్యం కాదని, ప్రజల హృదయాలు గెలవడం తమకు ముఖ్యమని చెప్పారు. ‘‘70 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై కాంగ్రెస్ కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేం పదేళ్లలోనే ఐదు బ్రిడ్జిలు కట్టి చూపించాం. మా ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతోంది. అస్సాంను వేగంగా అభివృద్ధి చేసేందుకు, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర అస్తిత్వాన్ని, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. 2014 నుంచి ఈశాన్యానికి చెందిన 125 మంది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు’’అని మోదీ చెప్పారు. బీజేపీకి కార్యకర్తలే ప్రాణవాయువని, పార్టీకి ఎనలేని బలమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ ప్రతి పౌరునికీ చేరువ కావాలని కార్యకర్తలకు సూచించారు. ‘‘మేం విశ్వసించేది వ్యవస్థాగతమైన బలాన్నే. నేను బీజేపీ కార్యకర్తను. అది నాకు గర్వకారణం. అదే నా అతి పెద్ద అర్హత. అస్సాం ప్రజలు నన్నెంతగానో ప్రేమిస్తున్నారు. దానికి అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా బదులు చెల్లించుకుంటాను’’అని ప్రకటించారు. పలు ప్రాజెక్టులు ప్రారంభంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో రూ.5,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వీటిపై బ్రహ్మపుత్రా నదిపై భారీ వంతెన, ఐఐఎం, డేటా సెంటర్ తదితరాలున్నాయి. ఐఐఎం–గువాహటిని గువాహటి సమీపంలోని పలాస్బరిలో, హైటెక్ డేటా సెంటర్ను కామరూప్ జిల్లాలోని అమీన్గావ్లో నిర్మించారు. వీటితో పాటు పీఎం–ఇబస్ సేవా పథకం కింద మంజూరైన 225 ఎలక్ట్రిక్ బస్సులను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. బ్రహ్మపుత్రపై భారీ బ్రిడ్జి బ్రహ్మపుత్రా నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభించారు. అనంతరం బ్రిడ్జిపై నడుస్తూ దాన్ని పరిశీలించారు. అప్రోచ్ రోడ్లు, ఫ్లై ఓవర్లతో కలిపి ఇది 7.75 కి.మీ. పొడవుంటుంది. సువిశాలమైన ఈ ఆరు లేన్ల బ్రిడ్జి వల్ల గువాహటి, ఉత్తర గువాహటి నడుమ ప్రయాణ సమయం ఇకపై కేవలం ఏడు నిమిషాలకు తగ్గనుంది. ప్రస్తుతం సరాయ్ఘాట్ బ్రిడ్జి మాత్రమే వాటిని అనుసంధానిస్తోంది. దానిపై బ్రహ్మపుత్రను దాటేందుకు కనీసం 30 నిమిషాలు పడుతుంది. కొత్త బ్రిడ్జిని భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా ఎక్స్ట్రా డోస్డ్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్తో నిర్మించారు. ఈశాన్య భారతదేశంలో ఈ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే. దీని నిర్మాణానికి 2019లో మోదీయే శంకుస్థాపన చేశారు. 2020 లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. -
ఈఎల్ఎఫ్పై ల్యాండైన మోదీ
గువాహటి/మోరాన్: ఈశాన్య భారతదేశంలో నిర్మితమైన తొలి హైవే–రన్వేను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో మోరాన్ సమీపంలో నేషనల్ హైవే 37పై సిద్ధం చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)పై వాయుసేనకు చెందిన సీ–130జె రవాణా విమానంలో ప్రధాని దిగారు. అనంతరం దాన్ని లాంఛనంగా జాతికి అంకితం చేశారు. ఈశాన్య భారతదేశానికి తొలి ఈఎల్ఎఫ్ సదుపాయం అందుబాటులోకి రావడం నిజంగా గరి్వంచదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రాకృతిక విపత్తులు తదితర సమయాల్లో ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వెలిబుచ్చారు.అబ్బురపరిచిన ఏరియల్ షో మోదీ ఒక రోజు పర్యటన నిమిత్తం శనివారం అస్సాం చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి ఆయన చబువా ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్, రాష్ట్ర మంత్రులు తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం సీ–130జె హెర్క్యులస్ విమానంలో ఆయన ఈఎల్ఎఫ్కు చేరుకున్నారు. రన్వేపై దిగాక సమీపంలో సిద్ధం చేసిన వేదికకు చేరుకున్నారు. అనంతరం ఈఎల్ఎఫ్పై వాయుసేన నిర్వహించిన ప్రత్యేక ఏరియల్ షోను వీక్షించారు. 20 నిమిషాలకు పైగా సాగిన ఈ షో ఆహూతులకు కనువిందు చేసింది. యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పైలట్లు ఈఎల్ఎఫ్పై కచి్చతత్వంతో ల్యాండింగ్, టేకాఫ్తో పాటు పలు విన్యాసాలు నిర్వహించారు. స్థానికులు భారీ సంఖ్యలో వాటిని వీక్షించారు. తొలుత సుఖోయ్ –30 ఎంకేఐ, దాని వెనకే రఫేల్ ఈఎల్ఎఫ్ నుంచి టేకాఫ్ అయ్యాయి. తర్వాత ఏఎన్–32 హెలికాప్టర్ టచ్ అండ్ గో విన్యాసాలు ప్రదర్శించింది. తర్వాత మూడేసి చొప్పున తొలుత సుఖోయ్, తర్వాత రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేక విన్యాసాలతో అలరించాయి. విపత్తుల వేళ చేపట్టే సహాయక చర్యల సన్నద్ధతను ప్రత్యేకంగా తయారు చేసిన అధునాతన దేశీయ హెలికాప్టర్లు (ఏఎల్హెచ్) కళ్లకు కట్టాయి. అనంతరం ప్రధాని గువాహటి చేరుకున్నారు.ఎన్నోవిధాలుగా కీలకం అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో నిర్మించిన ఈఎల్ఎఫ్ వ్యూహాత్మకంగా ఎన్నోవిధాలుగా అత్యంత కీలకమైనది. ఈ ఈఎల్ఎఫ్ చైనాకు 300 కి.మీ., మయన్మార్కు కేవలం 200 కి.మీ. దూరంలో ఉంటుంది. 4.2 కి.మీ. పొడవైన ఈ హైవే–రన్వేను రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించారు. సైనిక, పౌర అవసరాలు రెండింటికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా వాయుసేన సహకారంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పొరుగు దేశాలతో ఘర్షణల వేళ ప్రత్యర్థులు సమీపంలోని వైమానిక స్థావరాలపై దాడులు చేస్తే బలగాల తరలింపు తదితరాలకు తక్షణ సదుపాయంగా ఈఎల్ఎఫ్ కీలకపాత్ర పోషిస్తుంది. విపత్తులు, ఎమర్జెన్సీ సమయాల్లో దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా కూడా పని చేస్తుంది. దిబ్రూగఢ్–మోరాన్ జాతీయ రహదారి–37పై నిర్మించిన ఈఎల్ఎఫ్పై అన్నిరకాల యుద్ధ, రవాణా విమానాలనూ సులువుగా దించవచ్చు. రఫేల్, సుఖోయ్తో పాటు పలు భారీ రవాణా విమానాలు కూడా దీనిపై విజయవంతంగా ట్రయల్ రన్స్ నిర్వహించాయి. 40 టన్నుల బరువైన యుద్ధ విమానాలతో పాటు ఏకంగా 74 టన్నుల రవాణా విమానాలు కూడా దీనిపై సునాయాసంగా దిగవచ్చు. భారత్లో తొలి ఈఎల్ఎఫ్ రాజస్తాన్లోని బార్మేర్ జిల్లాలో 2021లో నిర్మితమైంది. అనంతరం మధ్య, ఉత్తర భారతంలో కూడా పలు ఈఎల్ఎఫ్లు అందుబాటులోకి వచ్చాయి. -
శాంతిభద్రతలను పరిరక్షిస్తా
ఢాకా: దాదాపు 18 నెలలుగా కొనసాగుతున్న అరాచకత్వ, అనిశ్చితికి చరమగీతం పాడుతూ ఇకపై తమ పరిపాలనలో శాంతిభద్రతకు పెద్దపీట వేస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ ప్రకటించారు. తాజాగా జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను కైవసంచేసుకుని ఘనవిజయం సాధించిన బీఎన్పీ పార్టీ త్వరలోనే అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెహ్మాన్ శనివారం ఢాకాలో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో శాంతిభద్రతల స్థాపన కోసం ఎందాకైనా వెళ్తాం. ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం మాకు కావాలి. అప్పుడే మేం సురక్షితమైన, మానవీయ బంగ్లాదేశ్ను సాకారంచేయగలం. ఎంతటి భారీమూల్యం చెల్లించైనాసరే శాంతిభద్రతలను పరిరక్షిస్తాం. అందరి భాగస్వామ్యంతో ఫాసిజంరహిత దేశ ప్రగతి ప్రయాణం ఆరంభమైంది. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువనిస్తాం. సుస్థిర బంగ్లాదేశ్ను నిర్మిస్తాం’’అని అన్నారు.4 రోజుల్లో ప్రమాణస్వీకారంప్రధానిగా తారిఖ్తో పాటు కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం మరో నాలుగు రోజుల్లో జరగే అవకాశం ఉందని బీఎన్పీ నేత మొహమ్మద్ షాహబుద్దీన్ చెప్పారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్(బంగభవన్)లో తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని కేబినెట్ కార్యదర్శి షేక్ అబ్దుర్ రషీద్ చెప్పారు. ఫిబ్రవరి 16 లేదా 17వ తేదీన ప్రమాణస్వీకారం ఉండొచ్చని బీఎన్పీ సీనియర్ నేత ఒకరు అన్నారు. భారత్తో బంధంపై.. తారిఖ్ తల్లి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కాలంలో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ఈ నేపథ్యంలో త్వరలో ప్రధాని హోదాలో ఆయన భారత్లో ఎలా మెలగాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించింది. ‘‘మా దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూనే భారత్తో విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తాం. దక్షిణాసియాలో అతిపెద్ద శక్తులైన భారత్, చైనా, పాకిస్తాన్లతో సమస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తాం. వీటిల్లో ఏ ఒక్క దేశాన్ని మాకు గురువుగా పరిగణించబోం. దేశ అత్యుత్తమ ప్రయోజనాలు, దేశ ప్రజల మార్గదర్శకత్వంలోనే మా విదేశాంగ విధానం రూపుదిద్దుకోబోతోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఢిల్లీలో తలదాచుకున్న మా దేశ మాజీ మహిళా ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించడం అనేది చట్టపరమైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సార్క్ పునరుజ్జీవానికి కృషి చేస్తా’’ అని అన్నారు. ప్రధాని మోదీకి ఆహ్వానం!భారత్, బంగ్లా సంబంధాల మెరుగుదల కోసం బీఎన్పీ ప్రయత్నిస్తోంది. ఇందుకు తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవ సందర్భాన్ని సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రధానిగా తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని బీఎన్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా, పాకిస్తాన్ అగ్రనేతలకూ ఆహ్వానాలు పంపాలని పార్టీ ఉన్నత వర్గాలు యోచిస్తున్నాయి. షేక్ హసీనా కాలంలో భారత్–బంగ్లాదేశ్ బంధం బలంగా ఉండేది. ఆ బంధం చిరకాలం పటిష్టంగా కొనసాగాలంటే తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కావడమే ఉత్తమమనే మాటా వినవస్తోంది. -
‘మున్సిపోల్స్’లో కాంగ్రెస్కు 40% ఓట్లు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు వచ్చాయనే లెక్క తేలిపోయింది. ఈనెల 11న జరిగిన పోలింగ్లో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు, ఎంత శాతం ఓట్లు వచ్చాయన్న వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ ఎన్నికల్లో మొత్తం 37,81,232 ఓట్లు పోల్ కాగా, అందులో అత్యధికంగా కాంగ్రెస్కు పోలయ్యాయి. ఈ పార్టీకి మొత్తం 39.8 (దాదాపు 40 శాతం)తో 15,05,006 ఓట్లు వచ్చాయి. గత (2020) మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 7లక్షల ఓట్లు ఆ పార్టీ కి పెరగడం గమనార్హం. బీఆర్ఎస్కు గత ఎన్నికలతో పోలిస్తే 5 లక్షల ఓట్లు తగ్గాయి. గత ఎన్నికల్లో 15.90 లక్షల ఓట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి 10,87,347 (దాదాపు 29 శాతం) ఓట్లకు పరిమితమైంది.ఈసారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ల మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపు 11 శాతంగా నమోదైంది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు 4,17,659 ఓట్లు అదనంగా వచ్చాయి. మరో ప్రతిపక్షమైన బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికలతో పోలిస్తే తగ్గలేదు. గత ఎన్నికల్లో వచ్చిన 15 శాతం ఓట్లను మళ్లీ నిలబెట్టుకుంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో 5.5 లక్షల ఓట్లు పొందిన బీజేపీకి ఈసారి మరో 42 వేల ఓట్లు పెరిగి మొత్తం 5,92,823 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం కూడా తన 3% ఓట్లను పదిలపర్చుకుంది.2020 ఎన్నికల కంటే ఆ పార్టీ కి 3 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. కాగా, ఈసారి మూడు ప్రధాన పార్టీ ల తర్వాత అత్యధికంగా ఓట్లు తెచ్చుకుంది స్వతంత్రులే. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లలో 8.3 శాతం ఓట్లు అంటే 3,14,096 ఓట్లు వచ్చా యని ఈసీ ప్రకటించింది. ఎంఐఎంతో సహా సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫా ర్వర్డ్ బ్లాక్, జేఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఎంబీటీ, ఐయూఎంఎల్.. ఇలా అన్ని పార్టీ ల ఓట్లు కలిపినా ఇండిపెండెంట్ల కంటే తక్కువే కావడం గమనార్హం. -
నెలాఖరులో విష్ణు విన్యాసం
విష్ణు, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో హేమ అండ్ షాలినిల సమర్పణలో సుమంత్ నాయుడు .జి నిర్మించారు.ఈ సినిమాను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్ నటించిన ఈ సినిమాకు సంగీతం: రథన్. -
టాప్ గేర్లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయంగా జనవరిలో ప్యాసింజర్ వాహనాలు (పీవీ), టూ–వీలర్లు, త్రీ–వీలర్ల టోకు అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. భారతీయ ఆటోమోబైల్స్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం పీవీల టోకు అమ్మకాలు 12.6 శాతం వృద్ధితో 4,49,616 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో ఇవి 3,99,386 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం డీలర్లకు ద్విచక్ర వాహనాల డిస్పాచ్లు 26.2 శాతం వృద్ధితో 15,26,218 యూనిట్ల నుంచి 19,25,603 యూనిట్లకు పెరిగాయి. మొత్తం త్రీ–వీలర్ల అమ్మకాలు కూడా 30.2 శాతం పెరిగి 58,167 యూనిట్ల నుంచి 75,725 యూనిట్లకు చేరాయి. వివిధ కేటగిరీలన్నీ కలిపి మొత్తం టోకు విక్రయాలు వార్షికంగా 23.5 శాతం వృద్ధితో 24,50,944 యూనిట్లకు చేరాయి. గతేడా ఈ వ్యవధిలో వీటి పరిమాణం 19,83,771 యూనిట్లు. కొత్త సంవత్సరం సానుకూలంగా ప్రారంభమైందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో గత త్రైమాసికంలో నమోదైన అమ్మకాల జోరు తాజాగా జనవరిలో కూడా కొనసాగిందని ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన చర్యలు దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయనుందని, ప్రస్తుత పాలసీలోని సానుకూలాంశాలు కూడా తోడైతే మధ్యకాలికంగా ఆటోపరిశ్రమ వృద్ధికి తోడ్పడతాయని, అలాగే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కూడా లభించగలవని మీనన్ చెప్పారు. ఎగుమతులు జోరు మూడు కేటగిరీల్లోనూ ఎగుమతులు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. మొత్తం పీవీల ఎగుమతులు 33.4 శాతం వృద్ధితో 57,585 యూనిట్ల నుంచి 76,822 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల ఎక్స్పోర్ట్స్ 3,80,528 యూనిట్ల నుంచి 20 శాతం పెరిగి 4,56,435 యూనిట్లకు పెరిగాయి. అదే విధంగా మొత్తం త్రీ–వీలర్ల ఎగుమతులు 54.6 శాతం పెరిగాయి. 23,859 యూనిట్ల నుంచి 36,879 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవ్యాప్తంగా మొత్తం వాహనాల ఎగుమతులు 4,62,500 యూనిట్ల నుంచి 23.5 శాతం వృద్ధి చెంది 5,71,066 యూనిట్లకు పెరిగాయి. -
సరస్వతి సాహసం
వరలక్ష్మీ శరత్కుమార్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘సరస్వతి’. ఈ హై కాన్సెప్ట్ థ్రిల్లర్ సినిమాను దోస డైరీస్ పతాకంపై వరలక్ష్మీ శరత్కుమార్, ఆమె సోదరి పూజా శరత్కుమార్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను హీరోయిన్ సమంత లాంచ్ చేశారు. ‘‘సరస్వతి’ జర్నీ నాకు ఎంతో ముఖ్యమైంది. ప్రతి కథకు ఓ లక్ష్యం ఉంటుంది.క్రూరమైన ప్రపంచానికి వ్యతిరేకంగా సరస్వతి ఎదురు నిలిచే సాహసం చేసిందే కానీ, లొంగిపోవాలనుకోలేదు’’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఉద్దేశించి, పేర్కొన్నారు వరలక్ష్మి. జీవా, ప్రకాశ్రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక, కిషోర్కుమార్, శ్రీకాంత్ అయ్యర్, రావు రమేష్, సప్తగిరి నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
బ్రయాన్స్టన్తో బొండాడ ఇంజినీరింగ్ ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హరిత విద్యుత్ ఆధారిత డేటా సెంటర్ ప్యాకేజీలను సంయుక్తంగా అభివృద్ధి చేసే దిశగా బొండాడ ఇంజినీరింగ్ (బీఈఎల్), దుబాయ్కి చెందిన బ్రయాన్స్టన్ రెన్యువబుల్స్ ఎఫ్జెడ్సీవో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్తో పాటు నిర్దిష్ట అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడులో 69.51 ఎండబ్ల్యూపీ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టులను జనవరిలో విజయవంతంగా వినియోగంలోకి తెచి్చనట్లు కంపెనీ తెలిపింది. పారడైమ్ ఐటీ, మహాజెన్కో, ఎన్ఎల్సీ ఇండియా తదితర క్లయింట్ల కోసం ఈ ప్రాజెక్టులను నిర్మించినట్లు వివరించింది. -
డేట్ ఛేంజ్
ఎస్... ఫలానా డేట్కి థియేటర్స్కి వచ్చేస్తాం అంటూ యూనిట్ ఒక డేట్ ఫిక్స్ చేసి, ప్రకటిస్తుంది. అయితే కొన్నిసార్లు సెట్ చేసిన డేట్కి ఆ సినిమా రాదు... వాయిదా పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వాయిదా వేస్తుంటారు. కొన్ని సినిమాల షూటింగ్ పూర్తి కాదు... కొన్ని పూర్తయినా గ్రాఫిక్స్ పూర్తి కావు... కొన్నయితే అన్నీ పూర్తయినా వేరే సినిమాలతో క్లాష్ అయ్యే పరిస్థితిలో తప్పక వాయిదా పడతాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ మధ్య కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ చిత్రాల పోస్ట్పోన్ స్టోరీ తెలుసుకుందాం.వేసవిలో విశ్వంభర చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.ఇందుకు కారణం... చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా. తనయుడి ‘గేమ్ చేంజర్’ కోసం తన ‘విశ్వంభర’ మూవీ విడుదలని చిరంజీవి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ 2025 జనవరి 10న రిలీజ్ అయింది. 2025 సంక్రాంతికి వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని భావించినప్పటికీ కాలేదు. ఇందుకు కారణం వీఎఫ్ఎక్స్ పనులు. ఈ కారణంగా చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్గారు’ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలైంది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర పోషించారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఇక 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి... విడుదల తేదీపై స్పష్టత రావాలి. మార్చి టు ఏప్రిల్ రామ్చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీని రామ్చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ‘‘రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా ‘పెద్ది’. హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం రామ్చరణ్ ఫుల్æమాస్ లుక్లోకి మారిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. అయితే వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చాం. మా సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి...’ పాట అన్ని ప్లాట్ఫామ్లలో అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ పాట 200 మిలియన్ల వ్యూస్ దాటి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్లో విడుదల కావాల్సిన పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్సింగ్’ ముందుకు వచ్చి, మార్చి 26న రిలీజ్ కానుంది. మార్చి నుంచి ఆగస్టుకి... ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘కిల్, గ్యారా గ్యారా’ వంటి హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ‘ది ప్యారడైజ్’లో భాగమయ్యారు. ఓ కీలక పాత్రను సంపూర్ణేష్ బాబు చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. నానిపై ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కుతున్న ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మాస్ ట్యూన్ అందించారు. కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ భారీ విజువల్స్తో ఈ సాంగ్ని పూర్తి స్థాయి క్రౌడ్ ప్లీజర్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్పోస్ చేసి, ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ‘‘మ్యాసివ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ హాటెస్ట్ పాన్ ఇండియన్ రిలీజెస్లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. మా సినిమాని ముందుగా మార్చి 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే తాజాగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రిలీజ్ డేట్కి మా సినిమాకు వరుసగా మూడు వారాల పండగలు కలిసి రానున్నాయి. మొదటి వారంలో ఓనం, మిలాద్–ఉన్–నబీ పండగలు, రెండో వీకెండ్లో రాఖీ, మూడో వారంలో జన్మాష్టమి ఉండటం వల్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైస్’కి బాక్సాఫీస్ వద్ద బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్లానింగ్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాని... ఈ నిర్ణయంతో మరోసారి తన మార్కెటింగ్ సెన్స్ని చూపించారు’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి టు ఏప్రిల్... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో ఈ నెల 13న రిలీజ్ చేస్తామని యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే ఆ తేదీకి విడుదల వాయిదా పడి, ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ప్రోడక్షన్ పనులు... ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న యూనిట్... కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్లు టాక్. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల కానుంది.1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవాడు. అల్లరిగా తిరిగే అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ‘సలార్’ మూవీ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచింది. అదే విధంగా సెంథిల్ కుమార్ విజువల్స్ ఈ మూవీకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. మే 1న లెనిన్ వస్తాడా? అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్ ఫుల్ మాస్ లుక్లో కనిపించనున్నారు. ‘లెనిన్’ని మే 1న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే... ఆ తేదీకి రిలీజ్ కాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం రామ్చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా అని ఫిల్మ్నగర్ టాక్.మార్చి 27న ‘పెద్ది’ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ‘లెనిన్’ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి... ముందుగా అనుకున్నట్లు ‘లెనిన్’ మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తాడా? లేదా? లేకుంటే మరో కొత్త రిలీజ్ డేట్ని ప్రకటిస్తారా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘లెనిన్’ పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ మూవీ తప్పకుండా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మార్చి నుంచి ఏప్రిల్కి? అడివి శేష్ హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి రిలీజ్ని పోస్ట్పోన్ చేసి, ఉగాది కానుకగా ఈ ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్లో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేశారు. అయితే ఈ మూవీ మరోసారి విడుదల వాయిదా పడనుందని ఫిల్మ్నగర్ టాక్. మార్చి నెలలో యశ్ ‘టాక్సిక్’, రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకి వస్తుండటంతో ‘డెకాయిట్’ విడుదల వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందనే చర్చ నడుస్తోంది. అయితే మార్చి 19న విడుదల వాయిదా గురించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.‘‘ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘డెకాయిట్’. ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్లోని ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్కి పాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారు. ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం మాదే. అంతర్జాతీయ స్థాయిలో తీసిన ‘డెకాయిట్’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... యూనిట్ ముందుగా ప్రకటించినట్లు మార్చి 19న ‘డెకాయిట్’ సినిమా విడుదలవుతుందా? లేదా అనేది వేచి చూడాలి. సంబరాలు ఎప్పుడు? సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). ఐశ్వర్యా లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ పోస్ట్పోన్ అయింది.అయితే ఆ తర్వాత విడుదల తేదీపై యూనిట్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మార్చి 14న థియేటర్లలోకి రానుందని టాక్. ‘‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం రూ. 125 కోట్లకు పైగా బడ్జెట్తో భారీ స్థాయిలో రూపొందింది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా ఈ మూవీ నిలుస్తుంది. మా సినిమాలోని సీజీ వర్క్ ఆడియన్స్కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వెట్రి పళనిసామి విజువల్స్, బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని యూనిట్ తెలిపింది. నాయకుడు వచ్చేదెప్పుడు? తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా పొంగల్ కానుకగా ఈ ఏడాది జనవరి 9 విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కొత్త విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు.విజయ్ ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ కారణంగా ఆయన సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారు. అందుకే విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి అద్భుతమైన స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల్లో ఉంది. మరి... అడ్డంకులు దాటుకుని ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడు? అన్నది వేచి చూడాలి.– డేరంగుల జగన్ మోహన్ -
‘బంగారం బాట’లో యువ భారతం
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా... యువ భారతం బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా 18–39 ఏళ్ల మధ్య వయసు కలిగిన 5,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో ‘స్మిట్టెన్ పల్స్ఏఐ’ ఒక నివేదిక విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది పెట్టుబడుల్లో తొలి ప్రాధాన్యతం బంగారానికి ఇచ్చారు. గతంలో బంగారం కొనాలంటే ఇంటి పెద్దల సలహా తీసుకునేవారు. కానీ ఇప్పుడు 66.7% మంది యువత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయిదు గ్రాముల లోపే పసిడి కొన్నామని 62% మంది వెల్లడించారు. 2 గ్రాముల లోపు కొనుగోలు చేసిన వాళ్లు 27.5% మంది కాగా.. 2–5 గ్రాముల మధ్య కొనుగోలు చేసిన వాళ్లు 34.4% మంది ఉన్నారు. → తమ మొదటి జీతం/సంపాదనతో తొలిసారి 24% మంది పసిడిని కొనుగోలు చేశారు. కేవలం పెట్టుబడిగా పసిడిని కొనుగోలు చేసినట్లు 23.9% మంది వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితి సందర్భాల్లో, బ్యాంకు సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలతో పోలిస్తే 65.7% మంది బంగారమే అత్యంత సురక్షితమైన సాధనంగా భావిస్తున్నామని తెలిపారు. సుమారు 65.7% మంది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్) కంటే పసిడినే అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారని సర్వేలో తేలింది. → ఒకవేళ రూ.25,000 నగదు రూపంలో ఉంటే.., పసిడి కొంటామని 61.9% మంది పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్లకు 16.6%, డిపాజిట్లు 13%, షేర్లు 6.6%, క్రిప్టో 1.9% మంది ఆసక్తి చూపారు. రత్నాలు, ఆభరణ ఎగుమతులు డీలా గత నెల(జనవరి)లో రత్నాలు, బంగారు ఆభరణ ఎగుమతులు డీలా పడ్డాయి. 2025 జనవరితో పోలిస్తే 6% క్షీణించి 2,239 మిలి యన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2025 జనవరిలో ఇవి 2,376 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణ ఎగుమతుల ప్రో త్సాహక సమితి(జీజేఈపీసీ) వివరాలివి. ప్రపంచ వాణిజ్య సవాళ్లు, కీలక మార్కెట్లలో టారిఫ్ ఒత్తిళ్లు ప్రభావం చూపాయి. ఈ బాటలో ప్రస్తు త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి 10 నెల ల(ఏప్రిల్ 2025–జనవరి 2026)నూ ఇవి నామమాత్ర వెనకడుగు వేశాయి. 0.6% తగ్గి 23,186 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతే డాది(2024–25) ఇదే కాలంలో ఇవి 23,335 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధా నంగా దేశీ ఆభరణ ఎగుమతులకు ప్రధాన మార్కెట్గా నిలిచే యూఎస్కు షిప్మెంట్స్ 45% నీరసించడం ప్రభావం చూపింది. -
డిజిటల్ పారదర్శకతకు అంతర్జాతీయ కూటమి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయ సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలకు చెందిన 15 ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ‘ట్రస్టెడ్ టెక్ అలయన్స్ (టీటీఏ)’ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. జర్మనీలో జరిగిన మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అలయన్స్ను ప్రకటించాయి. డిజిటల్ వ్యవస్థకు ఆధారమైన కనెక్టివిటీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్లు, సాఫ్ట్వేర్, కృత్రిమ మేధ (ఏఐ) తదితర అన్ని విభాగాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఈ విభాగాల్లో పారదర్శకత, భద్రత, గవర్నెన్స్కు సంబంధించిన ఉమ్మడి ప్రమాణాలు రూపొందించడమే ప్రధాన ఉద్దేశమని అలయన్స్ సంయుక్త ప్రకటనలో పేర్కొంది. అమెజాన్ వెబ్ సరీ్వసెస్, ఆంథ్రోపిక్, కసావా టెక్నాలజీస్, కోహిర్, ఎరిక్సన్, గూగుల్ క్లౌడ్, హాన్వా గ్రూప్, జియో ప్లాట్ఫామ్స్, మైక్రోసాఫ్ట్, నోకియా, ఎన్స్కేల్, ఎన్టీటీ, రాపిడస్, సాబ్, సాప్ తదితర సంస్థలు ఈ అలయన్స్కు స్థాపక సభ్యులుగాఉన్నాయి. డిజిటల్ విశ్వసనీయతకు అంతర్జాతీయ కృషిప్రపంచ దేశాల మధ్య భౌగోళిక–రాజకీయ విభజన పెరుగుతున్న నేపథ్యంలో ‘ట్రస్టెడ్ టెక్ అలయన్స్’ను ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్న పరిస్థితుల్లో డిజిటల్ విశ్వసనీయతను బలోపేతం చేయడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా, డిజిటల్ మౌలిక సదుపాయాలు జాతీయ భద్రత, ఆర్థిక పోటీ సామర్థ్యాలతో మరింత అనుసంధానం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ సప్లయిదారుల విషయంలో అధిక స్థాయి విశ్వసనీయత అవసరమని ప్రభుత్వాలు కంపెనీలు కోరుకుంటున్నాయని అలయన్స్ వెల్లడించింది. టెక్నాలజీ ఏ దేశానికి చెందినదన్న అంశం కంటే, ఉమ్మడి ఆపరేటింగ్ ప్రమాణాల ఆధారంగానే నమ్మకాన్ని నిర్మించవచ్చని చూపించేందుకే టీటీఏ ఫ్రేమ్వర్క్ను రూపొందించినట్లు పేర్కొంది. అయిదు నిర్దిష్ట సూత్రాలకు అంగీకారం అలయన్స్ సభ్య సంస్థలు ఐదు కీలక సూత్రాలకు అంగీకారం తెలిపాయి. (1). పారదర్శక కార్పొరేట్ పాలన, నైతిక ప్రవర్తన(2). కార్యకలాపాల్లో స్పష్టత, సురక్షిత డెవలప్మెంట్, స్వతంత్ర అసెస్మెంట్ (3). బలమైన సప్లై చైన్, భద్రతా పర్యవేక్షణ (4). ఓపెన్, సహకారాత్మక, సమగ్ర, స్థిరమైన డిజిటల్ ఎకోసిస్టమ్ (5). చట్టపాలనకు, డేటా పరిరక్షణకు గౌరవం. ఈ అయిదు సూత్రాల ప్రకారం టెక్నాలజీ అభివృద్ధి నుంచి వినియోగం వరకు ప్రతి దశలోనూ భద్రత అమలు చేయాల్సి ఉంటుంది.అలయన్స్లో జియో ప్లాట్ఫామ్స్ భాగస్వామ్యంఅలయన్స్లో భారతీయ సంస్థ జియో ప్లాట్ఫామ్స్ భాగస్వామ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలకు అనుగుణంగా కనెక్టివిటీ, క్లౌడ్, సెమీకండక్టర్లు, ఏఐ వంటి కీలక రంగాల్లో గ్లోబల్ స్థాయి ఉమ్మడి ప్రమాణాల రూపకల్పనలో భారత్ పాత్రను ఇది మరింత బలోపేతం చేయనుంది. టెక్నాలజీ ఏ దేశానికి చెందినదన్న అంశం కంటే, పారదర్శకత–భద్రత ఆధారిత ప్రమాణాలే విశ్వాసానికి పునాది కావాలన్న దృక్పథం భారత్కు వ్యూహాత్మకంగా అనుకూలంగా మారనుందని జియో ప్లాట్ఫామ్స్ సీఈవో కిరణ్ థామస్ తెలిపారు. -
ఇక మలేసియాలోనూ యూపీఐ పేమెంట్స్
న్యూఢిల్లీ: ఇకపై భారత్, మలేసియా మధ్య క్యూఆర్ మర్చంట్ చెల్లింపులకు తెరలేవనుంది. ఇందుకు అనుగుణంగా ఎన్పీసీఐ అంతర్జాతీయ విభాగం ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్(ఎన్ఐపీఎల్) తాజాగా పేమెంట్స్ నెట్వర్క్ మలేసియా ఎస్డీఎన్ బీహెచ్డీ(పేనెట్)తో చేతులు కలిపింది. పేనెట్.. మలేసియావ్యాప్త పేమెంట్స్ నెట్వర్క్ సంస్థకావడంతో రెండు దేశాల మధ్య క్యూఆర్ ఆధారిత చెల్లింపులకు వీలు చిక్కనుంది. అయితే దశలవారీగా ఇందుకు తెరతీయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలి దశలో భాగంగా మలేసియా సందర్శించే దేశీ ప్రయాణికులు తమ యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు చేపట్టేందుకు వీలు కలి్పంచనున్నట్లు తెలియజేసింది. డూయిట్నౌ క్యూఆర్ అనుమతించే టచ్పాయింట్ల ద్వారా ఇందుకు వీలుంటుందని పేర్కొంది. పేనెట్ నిర్వహించే డూయిట్నౌ మలేసియాలో ప్రామాణిక క్యూఆర్గా తెలియజేసింది. తదుపరి దశలో మలేసియన్లు సైతం భారత్ సందర్శనలో డూయిట్నౌ యాప్స్ ద్వారా యూపీఐ క్యూఆర్ కోడ్ సేవలను వినియోగించుకోవచ్చని వివరించింది. -
జండర్ బడ్జెట్ తుస్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం జండర్ (లింగ ఆధారిత) బడ్జెట్ కేటాయింపుల్లోనూ దగా చేసింది. మహిళల సాధికారతకు దోహదం చేసే పటిష్టమైన పథకాలు, కార్యక్రమాల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. ప్రధానంగా ఎన్నికల హామీల అమలులో చిత్తశుద్ధి కొరవడిందని జండర్ బడ్జెట్తో తేలిపోయింది. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టకుండానే అంకెల్లో గారడీ చేసి మభ్యపెట్టారు. నూరు శాతం మహిళలు, బాలికలు లబ్ధి పొందే పథకాలకు (పార్ట్ – ఏ) రూ.19,496.47 కోట్లు కేటాయించగా, 30 నుంచి 99 శాతం వరకు మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.71,363.07 కోట్లు కేటాయించారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ల పంపిణీని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అమలును మాత్రం పట్టించుకోలేదు. బాలికల విద్య, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, పోషణ పథకాలు, గర్భిణులకు ఆర్థిక సహాయం వంటి పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడి కేటాయింపులు జరపడం గమనార్హం. డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీ, గ్రామీణ మహిళల స్వయం ఉపాధి ప్రోత్సాహం, మహిళా రైతులకు ప్రత్యేక పథకాలు, స్వయం సహాయక సంఘాలకు కేటాయింపులు సైతం నామమాత్రమే. మహిళల సాధికారత, లింగ సమానత్వం, భద్రత, ఆరోగ్యం, ఉపాధి లక్ష్యాలుగా జండర్ బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్టు గొప్పలు చెప్పుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు అనుగుణంగా లేదన్నది స్పష్టమవుతోంది. నామమాత్రంగానే పిల్లల బడ్జెట్.. రాష్ట్రంలో బాలల కేంద్రీకృత విధానాలు, వారి భరోసా కోసం ఉద్దేశించిన పథకాలకు (ఛైల్డ్) బడ్జెట్ కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. నూరు శాతం పిల్లలే లబ్దిదారులుగా అమలు చేసే కార్యక్రమాలకు రూ.16,168.33 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్తో పోల్చితే కేవలం రూ.2,400 కోట్లు మాత్రమే అధికం. మరోవైపు 30 నుంచి 99 శాతం వరకు పిల్లలే లబ్ధి పొందే కార్యక్రమాలకు ఈ ఏడాది రూ.8,517.34 కోట్లు కేటాయించారు. వీటిలోనూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులపైనే ఆధారపడడం గమనార్హం. బాలల్లో పోషకాహార లోపం, బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, స్కూల్ డ్రాపౌట్స్, బాల్య వివాహాలు, లింగ వివక్ష నిర్మూలనకు చైల్డ్ బడ్జెట్లో దృష్టి సారించలేదు. జండర్ బడ్జెట్కు శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్ జగన్దే వాస్తవానికి జండర్ బడ్జెట్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2021 – 22 నుంచి ప్రారంభించింది. ప్రత్యేకంగా మహిళల కోసం జండర్ బడ్జెట్ పెట్టి వారిని ఆర్థిక, రాజకీయ, సామాజికంగా సాధికారతవైపు నడిపిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. రాష్ట్రంలో కోవిడ్ కష్టకాలాన్ని తట్టుకుని మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా బడ్జెట్కు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయింపుల తరహాలో మహిళలు, బాలికల (జండర్ బేస్డ్) బడ్జెట్కు ప్రత్యేకంగా శ్రీకారం చుట్టడం గమనార్హం. మహిళలు, బాలికల ఆరోగ్యం, విద్య, ఆర్థిక భాగస్వామ్యం, రక్షణ, సామాజిక భద్రత వంటి కీలక రంగాల్లో ప్రాధాన్యమిచ్చేలా జండర్ బడ్జెట్ రూపొందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. వైఎస్ జగన్ దార్శనికతతో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 90 శాతం మహిళలకు సంక్షేమ ఫలాలు అందాయి. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), పరోక్ష లబ్ధి (నాన్ డీబీటీ) పద్ధతిలో రాష్ట్రంలోని దాదాపు 31 పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిన వైఎస్ జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగమని వారు గుర్తు చేసుకుంటున్నారు. -
మేడిగడ్డ పునరుద్ధరణ ఖర్చు మీదే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టడంతోపాటు పునరుద్ధరణ చర్యల విషయంలో నీటిపారుదల శాఖ, సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్), డిజైన్ కన్సల్టెంట్కు పూర్తి సహకారం అందించాలని బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ–పీఈఎస్ జాయింట్ వెంచర్’ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. సిబ్బంది, సామగ్రి, యంత్రాలను బరాజ్ వద్దకు తరలించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇటీవల లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేసింది. పరస్పర అంగీకారంతో రూపొందించే నిబంధనల ప్రకారమే బరాజ్ పునరుద్ధరణ పనులు చేపట్టాలంటూ ‘ఎల్ అండ్ టీ’ప్రత్యుత్తరం రాయడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. పరస్పర అంగీకారమనే ప్రశ్న ఉత్పన్నం కాదని.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని తేలి్చచెప్పింది. కేవలం నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతో ఒప్పంద కాలంలోనే బరాజ్కు నష్టం జరిగిందని.. బరాజ్ పునరుద్ధరణను పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టాలని ‘ఎల్ అండ్ టీ’కి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ రామగుండం సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ నెల 3న ‘ఎల్ అండ్ టీ’కి మరో లేఖ రాశారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో నిర్మాణ సంస్థ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు తమ నివేదికల్లో తేల్చడాన్ని గుర్తుచేశారు. పునరుద్ధరణ చర్యల్లో ఈ సంస్థల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం లేఖలో ఆదేశించింది. నీటిపారుదల శాఖ నియమించే డిజైన్ కన్సల్టెంట్ నుంచి అవసరమైన ఇన్పుట్స్ అందిన వెంటనే బరాజ్ పునరుద్ధరణకు సహకరిస్తామని నిర్మాణ సంస్థ పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. పునరుద్ధరణ పనుల డిజైన్ల తయారీ కోసం ఆఫ్రీ ఇండియా లిమిటెడ్ సంస్థను కన్సల్టెంట్గా ఎంపిక చేశామని.. త్వరలో ఒప్పందం చేసుకోనున్నామని తెలియజేసింది. -
ఆయన జగం ..ఆమె సగం
బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడు, నిత్యమూ శమాది గుణ సంపత్తి కలవాడు కనుక శివుడు అని ‘శివ’ పదానికి వ్యుత్పత్తి.‘శివ’ అంటే పరమేశ్వరుడు.‘శివా’ అంటే పార్వతి. పేర్లలో కూడా ఏక రూపత కలిగిన ఆది దంపతులు వారు స్త్రీ పురుషులు కలిస్తేనే పరిపూర్ణత. వారిలో ఎక్కువ తక్కువలు లేవు. ఇరువురూ సమానమేనని వేదకాలం నుంచే నిరూపించిన స్వరూపం అర్ధనారీశ్వర రూపం.‘గౌరి సగం – శివుడు సగం – అర్ధ నారీశ్వరమే అఖిల జగం’ అంటూ అవినాభావమైన ఆ ఆదర్శ దంపతుల అద్వైత రూపాన్ని మహాకవి ఆరుద్ర కీర్తించారు. వాగర్థాలవలె కలిసిపోయిన వారని కాళిదాసు ప్రస్తుతించారు. ప్రకృతి – పురుషులే సృష్టికి మూలమని, అయితే ఇందులో ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ పోషించే పాత్ర మరింత కీలకమైనదని చెప్పడానికి జగద్గురు ఆది శంకరులు తమ ‘సౌందర్యలహరి‘ లోని తొలి శ్లోకంలోనే ఇలా చెప్పారు:‘శివః శక్త్యా యుక్తో యది భవ తి శక్తః ప్రభవితుమ్ / నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి ‘.శక్తి స్వరూపిణి అయిన జగదంబతో కూడినప్పుడే పరమేశ్వరుడు సమస్త సృష్టిని నిర్వహించడానికి సమర్థుడై ఉంటాడు. పార్వతితో కూడనినాడు అంతటి శివుడూ కాస్తంత కదలడానికి కూడా శక్తిలేనివాడే అవుతాడు. అంతేకాదు. ఆదిశంకరాచార్యులవారు మరొక అడుగు ముందుకు వేసి ‘చితాభస్మమును దేహమంతా పులుముకొని, కంఠంలో గరళాన్ని ధరించి, దిగంబరుడై, జటాధారిగా, మెడలో పాములను వేసుకొని, పుర్రెను చేతిలో పట్టుకొని, యాచక వృత్తితో జీవిస్తూ, శ్మశానవాసిగా ఉన్న ఈశ్వరుడు ముజ్జగాలకే అధిపతి కావడం కేవలం పార్వతీదేవిని పెండ్లి చేసుకోవడం వలన లభించిన ఫలితమేనంటూ తమ ‘దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం’లో నొక్కి వక్కాణించారు. ఇలా భర్త ఔన్నత్యానికి కారణభూతురాలు అతని ఇల్లాలే అని ఆదిశంకరులు జగతికి చాటి చె΄్పారు. ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడానికే పరమేశ్వరుడు జగన్మాత పార్వతిని తన దేహంలో సగభాగంగా స్వీకరించాడు. శివుడంటేనే శక్తిమయుడు. శక్తి అంటేనే శివుని అభివ్యక్తి. శివశక్తులు రెండూ విశ్వానికి ఆధారమైన మూల పదార్థాలు. ఆ అర్ధనారీశ్వరుని స్వరూపాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఆవిష్కరించుకొందాం.అర్ధనారీశ్వరత్త్వంఅర్ధనారీశ్వర స్వరూపంలో కుడిభాగం శివునిది. ఎడమభాగం పార్వతిది. శివుని మేని ఛాయ బంగారు వర్ణం కాగా, పార్వతీదేవిది కర్పూర సమ ధవళ వర్ణం. శివునిది జటలు కట్టిన రాగిరంగు కేశపాశం కాగా, అమ్మవారిది అందంగా అలంకరింపబడిన నల్లని కేశపాశం. విశాలమైన, పోడవైన, నీలోత్పలం వంటి నయనం జగన్మాతదైతే, వికసించిన ఎర్ర కమలం వంటి నేత్రం ఈశ్వరునిది. తన చెవికి ఆ తల్లి రత్నపు చెవిపోగు ధరించగా, సర్పాలనే ఆయన తన చెవికి ధరిస్తాడు. పార్వతి దివ్యాభరణాలను ధరించి ఉండగా, ఆయన నాగాభరణ శోభితుడు. అమ్మవారు దివ్యమైన పట్టువస్త్రాలను అలంకరించుకొంటే, ఆయన దిగంబరుడై దర్శనమిస్తాడు. కస్తూరి, కుంకుమ వంటి సౌభాగ్య ద్రవ్యాలను ఆమె అలదుకొంటే, దేహమంతా చితాభస్మాన్ని శివుడు పులుముకొని ఉంటాడు. ఆమె పాదం అందెలతోను, ఆయన పాదం నాగ కంకణాలతోనూ కనిపిస్తాయి.ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయైసమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమశ్శివా యైచ నమః శివాయఅమ్మవారి ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వుతో విశ్వసృష్టి ప్రారంభమవుతుంది. అయ్యవారి తాండవ నృత్యంతో విశ్వం మొత్తం శివునిలో కలిసిపోతుంది. జగత్తుకే మాతా పితరులైన శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంగా కలిసి ఉన్న తత్త్వానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకభావం.రెండు విభిన్నమైన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు పరస్పర సమన్వయాన్ని సాధించిన వైనానికి సాకార రూపమే అర్ధనారీశ్వరం. విభిన్న లక్షణాలున్నప్పటికీ అన్యోన్యానురాగంతో దాంపత్య బంధాన్ని కొనసాగించాలన్నది అర్ధనారీశ్వరుడు ఇచ్చే సందేశం. ఈ తత్త్వాన్ని ఆకళింపు చేసుకోగలిగితే భూమిపై ప్రతి జంటా ఆ ఆదిదంపతుల లాగా అన్యోన్యతకు సాకార రూపమై నిలుస్తుంది. అలా ఉండే ప్రయత్నం మనమందరం చేయగలిగితే మన సంస్కృతిలో భాగమయిన వివాహధర్మం కలకాలం మనగలుగుతుంది !– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
విద్యుత్ వెలుగుల్లేవు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగానికి మరోసారి మొండిచేయి చూపించింది. అధికారంలోకి వచి్చన తరువాత 18 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై రూ.20,135.50 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపి వసూలు చేస్తున్న చంద్రబాబు ఇంధన రంగానికి బడ్జెట్లో కేవలం రూ.13,934 కోట్లు మాత్రమే కేటాయించారు. అదికూడా వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్, వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీల కోసం. కనీసం చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నంత కూడా బడ్జెట్లో ఇవ్వలేకపోయారు. ఆధునిక అభివృద్ధికి ఎనర్జీ ప్రాణాధారమని, ఎనర్జీ భద్రత అంటే ఆర్థిక భద్రతని, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, విద్య, ఆరోగ్యం ఇలా ప్రతి రంగం అభివృద్ధి విద్యుత్పై ఆధారపడి ఉందని చెప్పిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విద్యుత్ రంగం అప్పులు తీర్చడానికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో విదల్చలేదు. గత ప్రభుత్వ పాలనలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) అస్తవ్యస్తంగా రద్దుచేయడం వల్ల అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని కేశవ్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ట్రూ–అప్ చార్జీల రూపంలో ప్రజలపై భారం పడిందని మంత్రి అంగీకరించారు. నిజానికి గత టీడీపీ పాలనతో జరిగిన అనవసర, అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల కారణంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రూ.2,600 కోట్లు తక్కువే.. ప్రస్తుత సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా రూ.11 వేలకోట్లకు పైగా విడుదల చేసి 22.5 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూర్చామని, అలాగే ఆక్వాటారిఫ్ సబ్సిడీగా రూ.890 కోట్లు విడుదల చేసి 48,500 మంది ఆక్వా వినియోగదారులకు మద్దతు ఇచ్చామని, బీపీఎల్ వృత్తిదారులకు సబ్సిడీ టారిఫ్లు కొనసాగిస్తున్నామని ఆర్థికమంత్రి చెప్పారు. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,600 కోట్లు కేటాయించారు. కానీ మంత్రి చెప్పినదాని ప్రకారం చూస్తే రూ.2,600 కోట్లు తక్కువే వెచ్చించారు. అంటే ఆ మేరకు అర్హులకు ఉచిత, రాయితీ విద్యుత్ను దూరం చేశారు. ఇక సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం కింద 2024 జూన్ నుంచి రూ.2.88 లక్షలకోట్ల విలువైన 55 ప్రాజెక్టులను మంజూరు చేశామని మంత్రి చెప్పారు. ఇందులో 15.56 గిగావాట్ల సౌరశక్తి, 4.86 గిగావాట్ల వాయుశక్తి, 17.7 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, 1 ఎంఎంఏటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రాజెక్టులున్నాయని తెలిపారు. అడిగింది ఎంత.. ఇచ్చింది ఎంత? వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలకు, ఆర్థికమంత్రి చెప్పిన లెక్కలకు పొంతన లేదు. ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటలపాటు నిరంతర పగటి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ 31 నాటికి ఈ పథకానికి రూ.13,241.17 కోట్ల సబ్సిడీ వ్యయం జరిగిందని చెప్పారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11 వేలకోట్లు ఖర్చుచేసినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఈ ఇద్దరు మంత్రులు చెప్పినదాని ప్రకారం చూస్తే ఆ మేరకు నిధులు ఖర్చు చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే 2026–27లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అవసరాలకే రూ.13,722 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి వెల్లడించారు. కానీ ప్రభుత్వం మొత్తం ఇంధన రంగానికి బడ్జెట్లో రూ.13,934 కోట్లు కేటాయించింది. -
నీటిపై రాతలు.. నీటి మూటలు!
సాక్షి, అమరావతి : సాగు నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సర్కార్ చెబుతున్న మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతనే ఉండదన్నది మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాదే వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల తొలి దశ, వంశధార స్టేజ్–2 ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని.. హంద్రీ–నీవా ఆయకట్టులో ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. గోదావరి పుష్కరాలకు ముందే అంటే 2027 జూన్ నాటికే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ.. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించడాన్ని మాత్రం విస్మరించారు. దీన్ని బట్టి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై చంద్రబాబు సర్కార్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జల వనరుల శాఖకు 2024–25 బడ్జెట్లో 16,705.32 కోట్లు కేటాయించి.. రూ.11,197.17 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. తొలి ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధుల కంటే రూ.5,508.15 కోట్లను తక్కువగా ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. 2025–26 బడ్జెట్లో రూ.18,019.66 కోట్లు కేటాయించి, తర్వాత రూ.14,751.67 కోట్లకు సవరించారు. అంటే.. గతేడాది బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో రూ.3,267.99 కోట్లను కోత వేసినట్లు స్పష్టమవుతోంది. సవరించిన కేటాయింపుల్లో ఏమాత్రం ఖర్చు చేశారన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుత (2026–27) బడ్జెట్లో జల వనరుల శాఖకు రూ.18,223.67 కోట్లు కేటాయించారు.ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.17,352.91 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.870.76 కోట్లు కేటాయించారు. 2024–25, 2025–26 బడ్జెట్లలో కేటాయింపులు, చేసిన వ్యయాన్ని బట్టి చూస్తే.. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన మేరకు సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయడం అనుమానమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. అంతా అంకెల గారడీయే.. చిత్తశుద్ధి ఏదీ? » పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ.. 2024–25లో కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన రూ.5,052.71 కోట్లను సది్వనియోగం చేసుకుని పోలవరం పనులను పరుగులెత్తించడంలో సర్కార్ విఫలమైంది. ఆ నిధులకు సంబంధించిన యూసీలను పంపక పోవడంతో 2025–26 బడ్జెట్లో పోలవరానికి కేటాయించిన రూ.5,936 కోట్లలో కేంద్రం కోత వేసి రూ.3,017.20 కోట్లను మాత్రమే కేటాయిస్తూ సవరించింది. » ఆ నిధులను ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 45 రోజుల సమయం మాత్రమే మిగిలింది. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.3,745.95 కోట్లను ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. » 2026–27 బడ్జెట్లో పోలవరానికి కేంద్రం రూ.3,320.39 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వాటిని రూ.5,139.35 కోట్లుగా చూపడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే పోలవరానికి నిధుల కేటాయింపులో అంకెల గారడీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఆ ప్రాజెక్టులో గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల (194.6 టీఎంసీల నిల్వ)తో కాకుండా 41.15 మీటర్ల (119.4 టీఎంసీలు) ఎత్తుతోనే నిల్వ చేసేలా పూర్తి చేస్తామని కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తే.. దాన్ని చంద్రబాబు సర్కార్ ఆమోదించడం గమనార్హం. » తద్వారా పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేయడమే కాదు.. ఆ ప్రాజెక్టును కేంద్రం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించక పోవడంపై సాగు నీటి రంగ నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రపై శీత కన్ను » వెనుకబడిన ఉత్తరాంధ్రపై చంద్రబాబు సర్కార్ యధా ప్రకారం శీత కన్ను వేసింది. వంశధార స్టేజ్–2 ప్రాజెక్టే కాదు.. మహేంద్ర తనయ, తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టులను పూర్తి చేసేలా నిధులను కేటాయించలేదు. తోటపల్లి ప్రాజెక్టు, మడ్డువలస, జంఝావతి ప్రాజెక్టుల కింద మిగిలిన ఆయకట్టుకు నీళ్లందించడానికి అవసరమైన పనులు చేపట్టేందుకు సరిపడా నిధులు కేటాయించలేదు. వాటికి కేటాయించిన అరకొర నిధులు కూడా కాడ్వామ్, స్పర్శ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వస్తాయని చెప్పి చేతులు దులిపేసుకుంది. » ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.605.75 కోట్లు కేటాయించి, వాటిని రూ.99.66 కోట్లకు సవరించింది. కానీ.. ఆ కాస్త నిధులను కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఈ బడ్జెట్లోనూ గత బడ్జెట్లో కేటాయించినట్లే రూ.605.75 కోట్లే ఆ ప్రాజెక్టుకు కేటాయించడం గమనార్హం. దీన్ని బట్టి ఆ ప్రాజెక్టుకు ఈ ఏడాదీ నిధులను ఖర్చు చేసే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. కాగితాల్లోనే ప్రాధాన్యత» ప్రాధాన్యత క్రమంలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని.. ఈ ఏడాది వెలిగొండ, చింతలపూడి తొలి దశ, వంశధార స్టేజ్–2, హంద్రీ–నీవాను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. » వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.992 కోట్లు, ఫీడర్ ఛానల్ లైనింగ్ పనులకు రూ.456 కోట్లు (మొత్తం రూ.1,448) అవసరం. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు కేవలం రూ.492.90 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. » తద్వారా ఈ ఏడాది జూన్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు నీటి విడుదల జరగదని స్పష్టమవుతోంది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయాలనే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన టన్నెళ్ల పనులను 2023 నాటికే వైఎస్ జగన్ సర్కార్ పూర్తి చేసింది. 2024 జూన్లోగా నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2024 ఆగస్టులో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వెలిగొండ ప్రాజెక్టు ద్వారా దుర్భిక్ష ప్రాంతాలకు అందించడానికి ప్రణాళిక రూపొందించింది. కానీ.. వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితో ఆ ప్రణాళికను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కి, వెలిగొండ ఆయకట్టు రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని సాగు నీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. » ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించేలా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జలయజ్ఞంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. కానీ.. 2016లో ఎలాంటి పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోకుండానే ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచి.. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా చంద్రబాబు సర్కార్ పనులు చేపట్టింది. పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన చింతలపూడి పనులను ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించింది. రూ.73.63 కోట్లు జరిమానా విధించింది. 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో పర్యావరణ అనుమతి తీసుకుని చింతలపూడి పనులు ప్రారంభించవచ్చు. కానీ.. ఇప్పటిదాకా పర్యావరణ అనుమతిపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించకపోవడం గమనార్హం. ఈ ఎత్తిపోతలకు కేటాయించిన రూ.430 కోట్లు తొలి దశ పనులు పూర్తి చేయడానికి ఏమూలకు సరిపోవు. పర్యావరణ అనుమతి వచ్చేదెన్నడు.. ఎత్తిపోతల పూర్తయ్యేదెన్నడు?.. తొలి దశ కింద రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించేదెన్నడు? అని రైతాంగం ప్రశ్నిస్తోంది. » వంశధార స్టేజ్–2 పనులను జలయజ్ఞంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. వెనుకబడి ఉత్తరాంధ్రలో 2.50 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పనులు పూర్తయ్యాయి. కాట్రగడ్డ సైడ్ వియర్తో ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందవు. వంశధార ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చినా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్ ససేమిరా అంటోంది. ఆ వివాదం సుప్రీంకోర్టులో ఉండటంతో వంశధార ట్రిబ్యునల్ అవార్డును కేంద్రం ఇప్పటిదాకా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో గొట్టా బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి హీరమండలం రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి.. వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేలా హీర మండలం ఎత్తిపోతలను 2023లో వైఎస్ జగన్ చేపట్టారు. అప్పట్లోనే సింహభాగం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్ 20 నెలలుగా విఫలమైంది. గత బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.182.52 కోట్లు కేటాయించి.. ఆ తర్వాత రూ.వంద కోట్లకు సవరించింది. వాటిని కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుత బడ్జెట్లో 182.14 కోట్లు కేటాయించింది. వాటిని ఏమాత్రం ఖర్చు చేస్తుందన్నది వేచి చూడాల్సిందే. » హంద్రీ–నీవాకు ప్రస్తుత బడ్జెట్లో రూ.2,621.70 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు విద్యుత్ చార్జీలకు కేటాయించారు. అంటే.. పనులు, భూ సేకరణకు కేటాయించింది రూ.1,721.7 కోట్లే. హంద్రీ–నీవాలో అంతర్భాగంగా జీడిపల్లి–భైరవానితిప్ప ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యాంకు నీటిని తరలించేలా ఎత్తిపోతలకు ఎన్ని నిధులు ఇస్తారు.. 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డి్రస్టిబ్యూటరీల (పిల్ల కాలువలు) పనులకు ఏమాత్రం నిధులు కేటాయిస్తారు.. అన్నది స్పష్టంగా లేదు. దీన్ని బట్టి, ఆయకట్టుకు నీళ్లందించడంపై ఈ సర్కార్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నది స్పష్టమవుతోంది. రాయలసీమను హార్టి కల్చర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు రూ.300 కోట్ల విదేశీ రుణంతో ప్రాజెక్టులను చేపడతామని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. అయితే ఆ రుణం ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి తెస్తుందన్నది స్పష్టత లేదు. -
టార్గెట్ 90
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 16న జరిగే మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికల్లో కనీసం 90కి తగ్గకుండా పురపాలి కల్లో కాంగ్రెస్ కొలువు తీరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులకు లక్ష్యం నిర్దేశించారు. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి, హంగ్ మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గ సభ్యులతో శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో ప్రత్యే కంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ కూడా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిపై చర్చించిన మంత్రులు.. ప్రజాతీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితమే ఈ విజయమని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన పార్లమెంట్ ఇన్చార్జి మంత్రులను సీఎం రేవంత్రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. అలాగే పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు నడిపిన మహేశ్కుమార్గౌడ్, రేవంత్రెడ్డిని మంత్రులు అభినందించారు. ఫలితాలు మనకు బూస్టప్ మంత్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ అందరం కలసికట్టుగా పనిచేయడం వల్లే సత్ఫలితాలు సాధించామన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు పార్టీకి బూస్టప్ ఇచ్చాయని చెప్పారు. మొత్తం 70కిపైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన విజయం సాధించిందని.. హంగ్ ఏర్పాటైన చోట్ల కూడా స్వతంత్రులు, కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీల్లో పార్టీ జెండా ఎగరేసేలా మంత్రులు పనిచేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను పార్లమెంటు ఇన్చార్జి మంత్రులకే అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఫలితాలపై పార్టీ అగ్ర నాయకత్వం కూడా సంతృప్తి వ్యక్తం చేసిందన్న సీఎం.. త్వరలోనే పరిషత్ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ను నమ్మలేదు.. బీజేపీ బలపడలేదు ప్రజలు బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో లేరని.. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందన్న వాదనలో నిజం లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజాప్రభుత్వం రెండేళ్లలోనే చేసి చూపిందని.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తిని చాటాలని మంత్రులకు సూచించారు.సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ ముఖ్య నేతలు వేం నరేందర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, చిన్నారెడ్డి హాజరవగా ఆన్లైన్ ద్వారా మంత్రులు ఉత్తమ్, దామోదర, తుమ్మల, మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. మంత్రులకు పని విభజన పార్టీపరంగా సమస్యలున్న మున్సిపాలిటీల్లో అందరితో మాట్లాడే బాధ్యతను మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు.జగిత్యాల పంచాయతీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కు అప్పగించిన సీఎం.. కొత్తగూడెం బాధ్యతను పొంగులేటికి, కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతను శ్రీధర్బాబు, పొన్నం, నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యత మహేశ్గౌడ్, ఉత్తమ్కు అప్పగించారు. -
గుట్టుగా గ్యారెంటీ అప్పులు!
సాక్షి, అమరావతి: అప్పులపై వాస్తవాలను చంద్రబాబు సర్కారు మరోసారి కప్పిపుచ్చింది. కూటమి సర్కారు గ్యారెంటీతో చేసిన అప్పులను బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో చూపకుండా దాచేసింది. ఇలా అసంపూర్తి లెక్కలతో బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఇవ్వడం చంద్రబాబు సర్కారుకు ఇది రెండోసారి కావడం గమనార్హం. గత బడ్జెట్లోనూ ఐదేళ్ల అప్పుల వివరాలు ఇవ్వకుండా ఎగరగొట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో కేవలం బడ్జెట్ అప్పులను మాత్రమే చంద్రబాబు సర్కారు పేర్కొంది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. ఓపెన్ మార్కెట్, కేంద్రం ఇచ్చినవి, చిన్న మొత్తాలతో పాటు ప్రభుత్వ గ్యారెంటీ అప్పులను బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో వెల్లడించడం సర్వ సాధారణం. అయితే చంద్రబాబు సర్కారు గ్యారెంటీ అప్పులు, చిన్న మొత్తాలు తదితరాల అప్పులను బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో చూపకుండా దాచి పెట్టింది. ఇందుకు ప్రధాన కారణం.. బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీలతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడమే. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో రంగాల వారీగా ఆదాయ వివరాలు, వ్యయాలను చూపిస్తారు. ఈసారి వాటిని కూడా కూటమి సర్కారు ఎగరగొట్టింది. దాని స్థానంలో ప్రజా రుణం జీఎస్డీపీలో శాతం పేరుతో గ్రాఫిక్స్తో సరిపుచ్చింది. అప్పుల లెక్కలపై వాస్తవాలు బయట పడతాయనే భయంతోనే ఇలా చేసినట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. » ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అప్పులపై కూడా తప్పుడు గణాంకాలతో చంద్రబాబు సర్కారు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3వతేదీ నాటికే బడ్జెట్ అప్పులు రూ.97,456 కోట్లు కాగా.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2025–26 అప్పులు రూ.79,456 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. మరో పక్క బడ్జెట్ను పూర్తిగా అమలు చేయలేక చంద్రబాబు సర్కారు చతికిల పడింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్ సవరించిన అంచనాల్లో భారీగా కోత పెట్టారు. 2025–26 బడ్జెట్ను రూ.3,22,359 కోట్లుగా ప్రతిపాదించగా ఇప్పుడు సవరించిన అంచనాల్లో రూ.3,00,534 కోట్లకు కుదించారు. అంటే ఏకంగా రూ.21,825 కోట్లు కోత విధించారు. » ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.14,182 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.13,081 కోట్లకు తగ్గించారు. గ్రామీణాభివృద్ధి రంగానికి రూ.18,890 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.15,244 కోట్లకు కుదించారు. సాధారణ విద్యకు రూ.34,825 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.32,694 కోట్లకు తగ్గించారు. ఆరోగ్య రంగానికి రూ.19,264 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.17,637 కోట్లకు తగ్గించారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్లో రూ.13,862 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో రూ.11,252 కోట్లకు తగ్గించారు. ఇలా తగ్గించిన గణాంకాలతో, 2026–27లో అధికంగా కేటాయింపులు చేశామంటూ బాబు సర్కారు జబ్బలు చరుచుకోవడం గమనార్హం. » మూలధన వ్యయంపై కూడా తప్పుడు గణాంకాలతో సవరణ అంచనాలను ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2025–26లో మూలధన వ్యయం రూ.40,635 కోట్లు ఉండగా సవరించిన అంచనాల్లో రూ.33,134 కోట్లుగా పేర్కొన్నారు. అయితే కాగ్ గణాంకాల మేరకు వాస్తవ మూలధన వ్యయం డిసెంబర్ నాటికి కేవలం రూ.19,224 కోట్లే. మూడు నెలల్లో ఏకంగా మరో రూ.13 వేల కోట్లకుపైగా వ్యయం చేస్తామనడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. » కూటమి సర్కారు పాలనలో జీఎస్డీపీలో బడ్జెట్ అప్పులు 35 నుంచి 36 శాతానికి పెరిగాయి. జీఎస్డీపీలో అప్పులు 2023–24లో 35 శాతం ఉండగా చంద్రబాబు ప్రభుత్వం వచి్చన నాటి నుంచి మూడు బడ్జెట్లలో జీఎస్డీపీలో అప్పులు 36 శాతానికి ఎగబాకాయి. » 2023–24 నాటికి బడ్జెట్ అప్పులు రూ.4.91 లక్షల కోట్లు ఉండగా 2026–27 మార్చి నాటికి ఏకంగా రూ.7.11 లక్షల కోట్లకు పెరగనున్నాయి. అంటే వచ్చే మార్చి నాటికి కూటమి సర్కారు బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.2.20 లక్షల కోట్లు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. » ఇక బడ్జెట్ బయట అప్పులకు కూటమి సర్కారు భారీగా గ్యారెంటీలు ఇచ్చింది. బడ్జెట్ డాక్యుమెంట్ వాల్యూమ్ 5 ప్రకారం వివిధ సంస్థల ద్వారా 2025 డిసెంబర్ నాటికి రూ.3.11 లక్షల కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చింది. ఇందులో పౌరసరఫరాల సంస్థ, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ జెన్కో తదితర సంస్థలున్నాయి. బడ్జెట్ బయట అప్పులపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆధారపడుతోందని దీన్నిబట్టి స్పష్టం అవుతోంది. -
ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిల ఊసేది?
సాక్షి, అమరావతి: మాయమాటలతో ఊరడించడం తప్ప ఉద్యోగులకు వాస్తవంలో చేసేదేమీ లేదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చేసింది. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల సమస్యల ప్రస్తావనే లేకపోవడాన్ని బట్టి వారి ఆందోళనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. ఎన్నికల్లో తమకు ఇచ్చి న హామీల్లో ఒక్కదానినైనా నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు నిత్యం చేస్తున్న విజ్ఞాపనలను సైతం ప్రభుత్వ పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరిపోయినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. జగన్ హయాంలో అందిన 11 డీఏలు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 11 డీఏలు ఇవ్వగా, చంద్రబాబు 2014–19 మధ్య ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులను చిన్నచూపు చూస్తారనడానికి ఇదే ఉదాహరణని చెబుతున్నారు. మరోవైపు ‘జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ’ అనే కారణంతో గ్రామ స్థాయిలో తలలో నాలుకలా పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు హీనాతిహీనంగా చూస్తూ బానిసలుగా మార్చివేయడం వారిని కలచివేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా అసలు ఉద్యోగులను భయపెట్టి, బెదిరించేలా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గారడీ ప్రకటనలు.. » గత సంక్రాంతికి ఒక డీఏ ఇచ్చినట్లు ప్రకటించినా, అందులోనూ ప్రభుత్వం గారడీ చేసింది. వేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం రూ.1,100 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవి కూడా అందరు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. » ఏడాది క్రితం పోలీసులకు ఇస్తానన్న రెండు సరెండర్ లీవులను విడతల వారీగా ఇస్తామన్నా, అది కూడా సరిగా ఇవ్వలేదు. » ఎన్నికల్లో చెప్పిన మేరకు ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వడానికి కూటమి ముందుకు రావడం లేదు. » డీఏ ఇచ్చేందుకు నిరాకరించడం, 12వ పీఆర్సీ నియమించేందుకే ముందుకు రాకపోవడాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి తమను పట్టించుకునే ఆలోచన లేదని వారు వాపోతున్నారు. » తాజా బడ్జెట్ను చూస్తే ఉద్యోగులకు ఈ ఏడాది కూడా ఇచ్చేది ఏమీ ఉండదని తేలింది. -
మూడు ముక్కలాట!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల విలక్షణ తీర్పు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను సంకటంలో పడేసింది. 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు రావడంతో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అంశం ఆయా పార్టీల మధ్య మూడు ముక్కలాటగా మారింది. పరస్పరం కత్తులు దూసుకొనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించుకుంటేనే కనీసం 15 మున్సిపాలిటీల్లో పాలకమండళ్లు కొలువుతీరే పరిస్థితి నెలకొనడం పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది.ఒకవేళ ప్రధాన రాజకీయ పక్షాలు సహకరించుకోకుంటే ‘గోడ దూకుళ్లు’ మాత్రమే ఆయా మున్సిపాలిటీల్లో పీటముడి వీడేందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. మరో 12 మున్సిపాలిటీల్లో స్వతంత్రుల సాయంతో, ఇంకో 5 మున్సిపాలిటీల్లో స్వతంత్రులతోపాటు ఎంఐఎం, ‘లెఫ్ట్’పార్టీల సాయంతో పాగా వేసేందుకు అధికార పార్టీకి అవకాశం ఉండటంతో ఆ దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ముడిపడిన మున్సిపాలిటీలివే.. హంగ్ ఫలితాలు వచి్చన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేయాలంటే 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ మద్దతు తప్పనిసరి కానుంది. ఈ జాబితాలో మెట్పల్లి, రాయికల్, అలంపూర్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్నగర్, మెదక్, నర్సాపూర్, ఎల్లంపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత, వర్ధన్నపేట, కేతనపల్లి ఉన్నాయి. కేతనపల్లిలో ఇరు పార్టీలు చైర్మన్, వైస్చైర్మన్ల పంపకాలపై అవగాహనకు వచ్చేందుకు అవకాశాలు ఉండగా మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్నగర్, మెదక్, నర్సాపేర్, ఎల్లంపేట, నారాయణపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్తో బీజేపీ కలిస్తే సులువుగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు చేజిక్కించుకొనే అవకాశం ఉంది. మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్లలో బీజేపీకి ఎక్కువ స్థానాలు రాగా మిగిలిన చోట్ల బీజేపీ కంటే బీఆర్ఎస్కు ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. కానీ రాజకీయంగా ఏ రెండు పార్టీలు కలిసినా మూడో పార్టీకి లబ్ధి కలుగుతుందనే అంచనాతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వెనుకంజ వేస్తున్నాయి. గైర్హాజరు... గోడ దూకుళ్లు ప్రధాన పార్టీలు మూడు దిక్కులుగా ఉన్న పరిస్థితుల్లో మిగిలిన ప్రత్యామ్నాయాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారికంగా అవగాహన కుదుర్చుకోకపోయినా స్థానిక నేతల మధ్య జరిగే చర్చలను బట్టి ఒక పార్టీ గెలుపు కోసం మరో పార్టీ గైర్హాజరైతే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చలు జరుగుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అయితే అలా గైర్హాజరు కావడం ద్వారా మేజిక్ ఫిగర్లో మార్పులు వస్తే ఇబ్బందులు వస్తాయని.. నేరుగా మద్దతివ్వడమే పరిష్కారమని అంటున్నాయి. ఈ రెండు మార్గాలు కుదరని పక్షంలో మరో పార్టీకి చెందిన కౌన్సిలర్లను లాక్కోవడమే మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పలు చోట్ల స్వతంత్రులు కాంగ్రెస్లో చేరడమో లేదా మద్దతు ప్రకటించడమో జరిగిపోయింది. అయితే ఇందుకోసం రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. స్వతంత్రుల సాయం తీసుకుంటే.. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ 12 మున్సిపాలిటీలను గెలిచే అవకాశం ఉందని ఫలితాలు చెబుతున్నాయి. జనగామ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మొయినాబాద్, ఇస్నాపూర్, కోహిర్, పరిగి, పోచంపల్లి, జగిత్యాల, వేములవాడ, దేవరకద్ర, వికారాబాద్ మున్సిపాలిటీల్లో స్వతంత్రులుగా గెలిచిన వారు కాంగ్రెస్ వైపు వస్తే ఆ స్థానాలు అధికార పార్టీ వశం అవుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఒక్క ఎక్స్ అఫీషియో ఓటుతో కేసముద్రం మున్సిపాలిటీని కూడా గెలుచుకోవచ్చు. దీంతో అధికార పార్టీ ఖాతాలో ఈ 13 మున్సిపాలిటీలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితోపాటు గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, జహీరాబాద్, బోధన్లలో స్వతంత్రులతోపాటు లెఫ్ట్, ఎంఐఎంలు సహకరిస్తే ఆయా పీఠాలు కూడా అధికార పార్టీకి లభిస్తాయి. ఇక ఆలియాబాద్లో మ్యాజిక్ ఫిగర్కు మూడు స్థానాలు తక్కువ పడగా ఒక స్వతంత్ర, ఒక బీఎస్పీ కౌన్సిలర్ను కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో మరొకరు అవసరం కాగా బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్కు వైస్చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. సీఎం వద్దకు వడ్డేపల్లి కౌన్సిలర్లు వడ్డేపల్లి మున్సిపాలిటీలో సంచలన విజయం సాధించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కు చెందిన 8 మంది కౌన్సిలర్లు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరినట్టయింది. స్థానిక నేత వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిసిన వారిలో కౌన్సిలర్లు కుర్వ పావని, శారద, మంజుల, యుగేందర్రెడ్డి, దేవమ్మ, విజయభాస్కర్, జయశ్రీ, ఎరుకల తిమ్మప్ప ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళికా కమిషన్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్. సంపత్కుమార్ పాల్గొన్నారు. -
తల్లికి 'వంచన'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల తల్లులను చంద్రబాబు సర్కారు మరోసారి మోసం చేసింది. బడ్జెట్లో ‘తల్లికి వందనం’ అంటూనే వారిని వంచన చేస్తూ అంకెల గారడీని ప్రదర్శించింది. ఎన్నికల్లో అధికారం కోసం అడ్డగోలుగా అబద్ధపు హామీలిచ్చిన చంద్రబాబు ఇలా ఏటా బడ్జెట్లో మోసాన్ని పునరావృతం చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది 87,41,885 మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతుంటే కేవలం 67.27 లక్షల మందికి మాత్రమే ‘తల్లికి వందనం’ అమలుచేసి నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకున్నారు. మరోవైపు శనివారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలోనూ ‘తల్లికి వంచన’ ప్రస్ఫుటంగా బయటపడింది. 2026–27 బడ్జెట్లోనూ ఎంతమంది పిల్లలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారో చెప్పకుండా రూ.9,668 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే.. మంత్రి ప్రకటనకు, బడ్జెట్లో కేటాయింపులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి రూ.9,668 కోట్లు పలికితే.. బడ్జెట్ ప్రతుల్లో రూ.8,457.07 కోట్లని పేర్కొన్నారు. మళ్లీ కొందరికే ‘వందనం’.. తల్లికి వందనం పథకంపై చంద్రబాబు సర్కారు కాకిలెక్కలు చెబుతోంది. ఎన్నికలప్పుడు అధికారమే పరమావధిగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్లందరికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచి్చన తొలి ఏడాది ముఖం చాటేశారు. 2024–25లో రూ.5,387 కోట్లు కేటాయిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే, 2025–26 బడ్జెట్లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ఇచ్చింది మాత్రం కేవలం రూ.6,377 కోట్లే. అంటే.. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు చొప్పున మాత్రమే ఇష్టానుసారం ఖాతాల్లో వేసి మమ అనిపించింది. ఈ అరకొర సొమ్మును కూడా దాదాపు 21 లక్షల మందికి ఎగ్గొట్టింది. ఇప్పుడు కూడా మళ్లీ పాత సీన్నే పునరావృతం చేస్తూ తాజా బడ్జెట్లో రూ.9,668 కోట్లను కేటాయించింది. వాస్తవ వ్యయానికి దూరంగా.. నిజానికి.. 87.41 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలంటే రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ, చంద్రబాబు సర్కారు ఎప్పటిలాగే అరకొరగా కేటాయించడం చూస్తుంటే ఈసారి కూడా తల్లులకు వంచన తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ను ఉన్నది ఉన్నట్లు అమలుచేస్తే 65 లక్షల మంది పిల్లలకు మాత్రమే సరిపోతుంది. మిగిలిన విద్యార్థులకు కోత ఖాయం. ఇప్పటికే చంద్రబాబు తొలి ఏడాది తల్లికి వందనం పథకం ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. రెండో ఏడాది అరకొరగా పంపిణీ చేశారు. ఇక ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన మేరకు పూర్తిస్థాయిలో ఇచ్చినా రూ.3,444.82 కోట్లు ఎగ్గొట్టినట్లు అవుతుంది. మొత్తం మీద మూడేళ్లకు కలిపి రూ.24,504.39 కోట్లు తల్లికి వందనం రూపంలో తల్లులకు ఎగ్గొట్టారు. పాఠశాల విద్యకు వ్యయంలోనూ వెనకడుగే.. 2026–27 బడ్జెట్లో పాఠశాల విద్యా రంగానికి కూటమి ప్రభుత్వం రూ.32,308.31 కోట్లు కేటాయించింది. ఇవన్నీ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతాయి. అయితే, 2025–26 బడ్జెట్లో రూ.31,805.65 కోట్లు ప్రతిపాదించగా... సవరించిన అంచనా తర్వాత ఖర్చు దగ్గరకు వచ్చేసరికి ఆ మొత్తం రూ.30,175.13 కోట్లకు తగ్గిపోయింది. అంటే.. పాఠశాల విద్యకు కేటాయింపులే తక్కువ అనుకుంటే ఈ ప్రభుత్వం అందులో చేస్తున్న ఖర్చు ఇంకా తక్కువగా ఉండటం విస్తుగొలుపుతోంది.‘మనబడి–మన భవిష్యత్తు’ గాలికి.. ‘నాడు–నేడు’ వంటి బృహత్తర కార్యక్రమంతో గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. రెండు విడతల్లో దాదాపు రూ.8 వేల కోట్ల బడ్జెట్తో 23 వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీలను అత్యాధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. గత ప్రభుత్వంలోనే రూ.4 వేల కోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తవ్వాలంటే మరో రూ.4 వేల కోట్లు అవసరం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అక్కసుతో ఆ పథకం పేరును ‘మనబడి–మన భవిష్యత్తు’గా మార్చింది తప్ప పైసా ఖర్చు చేయలేదు. 2024–25 బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది గానీ ఆ డబ్బులతో ఒక్క ఇటుక కూడా వేయలేదు. అలాగే, 2025–26 బడ్జెట్లో రూ.1,500 కోట్లు చూపించినా ఆ తర్వాత దానిని రూ.772 కోట్లకు కుదించింది. ఇప్పుడు మళ్లీ రూ.1,500 కోట్లు కేటాయించినా దానితో పాఠశాలల రూపరేఖలు పెద్దగా మారే పరిస్థితిలేదు. మరోవైపు.. గతంలో పూర్తయిన పనులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులే సుమారు రూ.1,200 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక ప్రభుత్వ బడులకు ‘స్టార్ రేటింగ్’ పేరుతో చంద్రబాబు హడావుడి చేయడం తప్ప అక్కడ మౌలిక వసతులు క్షీణిస్తున్నాయి. చంద్రబాబు తీసుకొచి్చన స్టార్ నిబంధనల ప్రకారం పాఠశాలలు ఉండాలంటే సుమారు రూ.12 వేల కోట్ల బడ్జెట్ అవసరమని తెలుస్తోంది. బడ్జెట్ తగ్గిపోతోంది.. ఇదిలా ఉంటే.. గత మూడు బడ్జెట్లు చూస్తే చంద్రబాబు పాలనలో పాఠశాల విద్య కేటాయింపులు కుచించికుపోతున్నాయి. 2024–25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లతో ఉంటే.. ఇందులో పాఠశాల విద్యకు రూ.29,909.31 (10.15 శాతం) నిధులు కేటాయించారు. ఖర్చు పెట్టింది మాత్రం రూ.28,560.64 కోట్లే. అలాగే, 2025–26లో రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రకటించినా పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు (9.86 శాతం) కేటాయించారు. ఇక 2026–27కి వచ్చేసరికి 3.32 లక్షల కోట్ల బడ్జెట్లో పాఠశాల విద్య వాటా రూ.32,308.31 (9.75 శాతం) కోట్లకు పరిమితమైంది. -
బడ్జెట్కు సుస్తీ ఆరోగ్యానికి అంతంతే
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించింది. 2025–26 బడ్జెట్లో రూ.19,264 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్టు చూపిన టీడీపీ కూటమి సర్కారు.. ఖర్చుల్లో రూ.1,626 కోట్ల మేర కోత పెట్టింది. ఈ విషయాన్ని సవరించిన గత ఏడాది బడ్జెట్ స్పష్టం చేసింది. 2026–27 బడ్జెట్లో రూ.20 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులు అవసరమని వైద్య శాఖ ప్రతిపాదించగా.. ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో రూ.19,306 కోట్లు కేటాయిస్తున్నట్టు చూపింది. గత ఏడాది కేటాయించిన మొత్తంలో రూ.1,626 కోట్లు కోత పెట్టిన దృష్ట్యా.. ఈ ఏడాది బడ్జెట్లో మరింత ఎక్కువ మొత్తం కోత పెడతారనే భయాందోళన వ్యక్తమవుతోంది. మందుల కొనుగోళ్లకు రూ.820 కోట్లకు పైగా అవసరమని.. సర్జికల్స్కు రూ.320 కోట్లు కావాలని ప్రతిపాదించగా.. మందుల బడ్జెట్లో రూ.220 కోట్లు, సర్జికల్స్కు రూ.100 కోట్ల పైగానే కోత విధించి అరకొర నిధులనే విదిల్చింది. ఆసరా సాయానికి ‘సున్నా’ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య ఆసరా సాయానికి ఈ బడ్జెట్లో కేటాయింపులే లేకుండా చేశారు. అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు కోలుకునే సమయంలో ఆరి్థకంగా చేదోడుగా నిలిచేలా ‘ఆరోగ్య ఆసరా’ పథకాన్ని గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే ఆరోగ్యశ్రీ స్థానంలో బీమాను ప్రవేశపెడతామని ప్రకటించారు. అప్పుడే ఆరోగ్య ఆసరాకు ఉద్వాసన పలకాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2024 నుంచే ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులకు ఆసరా చెల్లింపులను నిలిపివేశారు. ఈ పథకానికి 2025–26 బడ్జెట్లో కేవలం రూ.లక్ష మాత్రమే కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో ఏకంగా కేటాయింపులే లేకుండా ఇకపై ఆసరా అమలు చేసే ఉద్దేశమే లేదని, తాను పేదల వ్యతిరేకినని మరోమారు చంద్రబాబు రుజువు చేసుకున్నారు. వాస్తవానికి ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా రూ.450 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పథకానికి ఉద్వాసన పలికి పేదలకు రెండేళ్లలో రూ.900 కోట్లకు పైగా సాయాన్ని చంద్రబాబు ఎగ్గొట్టారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి నెలకు గరిష్టంగా రూ.5 వేల చొప్పున ఆసరా సాయం అందించాల్సి ఉంది. ఇప్పుడు ఆసరాతో పాటు ఆరోగ్యశ్రీకి కూడా చంద్ర గ్రహణం పట్టుకుంది. గతంలో రోగి/బంధువు ఖాతాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో ఆసరా సాయాన్ని జమ చేసేవారు. ఇలా 2019–24 మధ్య వైఎస్ జగన్ పాలన ఐదేళ్లలో 24,59,090 మందికి రూ.1,465.67 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు. కానీ బీమా రాగం అందుకున్న బాబు నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. ఆరోగ్యశ్రీ చికిత్స అందించిన ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బకాయి పడింది. బకాయిలను చెల్లించేలా బడ్జెట్లో అదనపు నిధులను కేటాయించకపోవడం గమనార్హం. కొత్త వైద్య కళాశాలల ఊసేదీ..? 2026–27 బడ్జెట్లో కొత్త వైద్య కళాశాలల ఊసే లేకుండా చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన 10 వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 4 కళాశాలలకు టెండర్లు పిలవగా సరైన స్పందన రాలేదు. కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టాలన్న ప్రభుత్వ కుట్రలతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1,450 చొప్పున రెండేళ్లలో 2450 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో 10 వైద్య కళాశాలల ప్రారంభంపై ఈ బడ్జెట్లోనైనా స్పష్టత వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. అయితే.. బడ్జెట్లో కొత్త వైద్య కళాశాలల ప్రస్తావనే లేకుండాపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.8,480 కోట్ల అంచనాలతో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2024 ఎన్నికల నాటికి వైద్య కళాశాలల్లో రూ.3 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అప్పటికే కొన్ని కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ రంగంలోనే కళాశాలలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈవెంట్లు, మంత్రులు, సీఎం విలాసాలు, ఇతర కార్యక్రమాలకు రూ.కోట్ల ప్రజాధనాన్ని దురి్వనియోగం చేస్తున్న ప్రభుత్వం వైద్య కళాశాలలకు మాత్రం నిధులు లేవంటూ ప్రైవేట్కు కట్టబెడుతోంది. పేదలను వంచించడమే.. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి నిధులు 10 శాతానికి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం నిధులు తగ్గిస్తోంది. ప్రస్తుత బడ్జెట్లో కేవలం 5.8 శాతం నిధులు మాత్రమే ఆరోగ్య రంగానికి కేటాయించారు. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందనడానికి ఈ కేటాయింపులే నిదర్శనం. వైద్య రంగానికి నిధులు తగ్గించడం పేద ప్రజలను వంచించడమే. – డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్, విజయవాడఆరోగ్యశ్రీ బకాయిల మాటేమిటి?ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలే రూ.3 వేల కోట్లు ఉంటే.. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయించడంపై ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఏపీ ఆశా) ఆందోళన వ్యక్తం చేసింది. తమ బకాయిలు చెల్లించడానికి ఎటువంటి నిర్దిష్ట, దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని శనివారం ఒక ప్రకటనలో మండిపడింది. దీనివల్ల రాష్ట్రంలోని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని తెలిపింది. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని ఇటీవలే హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసింది. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ప్రజలకు సేవలు అందించడం అసాధ్యమని పేర్కొంది. బకాయిలను దశల వారీగా, నిర్ణీత సమయంలో విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
'భృతి' లేదు.. గతి లేదు
దేశానికి ఆయువుపట్టు యువశక్తి. ఏపీలో ఉండే యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తా. పరిశ్రమలు తెస్తా. ఉద్యోగాలు ఇస్తా. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏదీ? మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏదీ?.. – మే 28, 2023న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడులో చంద్రబాబు దగాకోరు మాటలుటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తికావస్తోంది. ముచ్చటగా మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పరిశ్రమలూ తేలేదు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. జాబ్ క్యాలెండర్ అడ్రస్సే లేదు. నోటిఫికేషన్లకు అసలే దిక్కులేదు. ‘‘ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను.’’ – 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో మంత్రి నారా లోకేశ్ బీరాలుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు మరోసారి నిరుద్యోగ యువతను నిండా ముంచేసింది. ముచ్చటగా మూడో బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. ఎన్నికల సమయంలో అధికార పీఠం కోసం నిరుద్యోగ యువతను నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు నయ వంచనకు గురి చేశారు. ఆయువుపట్టుపై దెబ్బకొట్టారు. తాజాగా 2026–27 బడ్జెట్లోనూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ‘సూపర్ సిక్స్లో.. బాబుమార్క్’ దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మూడు వార్షిక బడ్జెట్లలోనూ నిరుద్యోగుల ఊసే లేకుండా చేశారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని అటకెక్కించేశారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు ఒక్కో నిరుద్యోగికి ఏడాదికి రూ.36 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు ఇవ్వకుండా మోసం చేసింది. ఇలా 20 లక్షల మందికి చూస్తే దాదాపు రెండేళ్లలో రూ.14,400 కోట్లు బకాయిపడింది. ఈ ఏడాది బడ్జెట్లో అసలు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడంతో మరో రూ.7,200 కోట్ల చెల్లింపులకు ఎగనామం పెట్టింది. అంటే, చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది.ఇంకెంతకాలం ఈ మోసం బాబూ!2014 ఎన్నికల ముందు నిరుద్యోగులను బుట్టలో వేసుకుని రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లకుపైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా.. పైసా కూడా ఖర్చు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను తొలుత 12 లక్షలు అని చెప్పి, చివరికి 2.10 లక్షల మందే అర్హులన్నారు. తీరా 1.62 లక్షల మందికే ఇస్తామని, ఈ–కెవైసీ లింక్ పెట్టారు. చివరకు అందులోనూ కొంత మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మొత్తానికి బరితెగించి ఇవ్వను పొమ్మని నిరుద్యోగులను బెదిరిస్తున్నారు. బాబు పాలనలో ఉద్యోగాల భర్తీ ఊసే లేదుబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై వివాదాలు సృష్టించడం, వాటిని అడ్డంపెట్టుకుని భర్తీ నిలిపివేయడం పరిపాటి. ఈసారీ అదే సూత్రాన్ని సర్కారు పాటిస్తోంది. గతంలో జారీ అయిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న దాదాపు 10 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది. దాదాపు 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2024 డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇచ్చిన నోటఫికేషన్లలో 19 నోటిఫికేషన్ల ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇప్పటికే ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్లో పోస్టులు భర్తీ చేయకుండా, ఆయా శాఖల్లో కేడర్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోకుండా 150 పోస్టులు, మరో 4,300 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగాల విప్లవం » వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల విప్లవం సృష్టించారు. » గ్రామ/వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టి 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు కొత్తగా కల్పించారు. 2.66 లక్షల వలంటీర్లను గత ప్రభుత్వంలో నియమించారు. » ఆప్కాస్ ద్వారా 96వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. » ఆర్టీసీ విలీనం ద్వారా 58వేల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేశారు. » మొత్తం ఐదేళ్లలో 6,31,310 ఉద్యోగాలిచ్చారు. » చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్న ప్రకారమే.. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1.02 లక్షల మందికి , ఎంఎస్ఎంఈ రంగంలో 32,79,970 మందికి వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టంగా ఉంది. » గవర్నమెంట్, లార్డ్ అండ్ మెగా, ఎంఎంఎస్ఈ సెక్టార్లో 40,13,552 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.త్రయోదశి సా.4.39 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.7.43 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.11.55 నుండి 1.34 వరకు, దుర్ముహూర్తం: సా.4.23 నుండి 5.11 వరకు, అమృత ఘడియలు: ప.12.51 నుండి 2.34 వరకు; రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు, యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు, సూర్యోదయం: 6.32, సూర్యాస్తమయం: 5.57.మేషం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయ దర్శనాలు. విద్యావకాశాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.వృషభం: మిత్రులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. బంధువుల కలయిక. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు.మిథునం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు.సింహం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. యత్నకార్యసిద్ధి. విందువినోదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. ఆదాయానికి మించి ఖర్చులు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.తుల: పనులు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాల్లో మార్పులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. సోదరులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.మకరం: పలుకుబడి పెరుగుతుంది. కార్యజయం. బంధువుల నుంచి సహాయం. ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.కుంభం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. దైవచింతన. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.మీనం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. కీలక నిర్ణయాలు. కార్యజయం. కొన్ని వివాదాల పరిష్కారం. సోదరులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. -
పెట్టుబడి సాయం.. 'మాయాజాలం'!
ఇదీ హామీవైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 మాత్రమే ఇస్తోంది. ఇందులో రూ.6 వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తాం. – ఎన్నికల మేనిఫెస్టోలో, ఊరూరా చంద్రబాబు అండ్ కో ప్రచారంఆచరణలో వాస్తవంఅధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా రూ.20 వేలు ఎగ్గొట్టారు. రెండో ఏడాది కేంద్రం ఇచ్చే సాయంతో కలుపుకుని రూ.10 వేలు మాత్రమే అందించారు. అదీ కొంత మంది రైతులకే. కౌలు రైతులకైతే పైసా ఇవ్వలేదు. కానీ రైతులకు రూ.20 వేలు సాయం అందించామని బడ్జెట్ సాక్షిగా నిస్సిగ్గుగా ప్రచారం. మొత్తంగా రూ.30 వేలు బకాయి. సాక్షి, అమరావతి : తమకు అధికారం ఇస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి ఏడాది నుంచే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామంటూ ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు.. తీరా అందలం ఎక్కాక అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు. తొలి ఏడాది నిస్సిగ్గుగా పెట్టుబడి సాయానికి పూర్తిగా ఎగనామం పెట్టిందేకాక, రెండో ఏడాది అరకొరగా విదిల్చారు. కనీసం 2026–27లో అయినా పూర్తిగా ఇస్తారనుకుంటే అదీ లేదు. ఈ బడ్జెట్లో కూడా ఈ పథకానికి అరకొర కేటాయింపులతోనే సరిపెట్టి అన్నదాత నోట్లో మట్టికొట్టారు. కౌలు రైతుల ఊసే ఎత్తలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన 53,58,366 మంది రైతుల వరకు లెక్కలోకి తీసుకున్నా.. ఏటా రూ.20 వేల చొప్పున తొలి రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఈ లెక్కన రైతుల ఖాతాలకు రూ.21,433.46 కోట్లు జమ చేయాలి. తొలి ఏడాది (2024–25) బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించి, పైసా ఖర్చు చేయలేదు. నిస్సిగ్గుగా 53.58 లక్షల మందికి రూ.10,717 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది (2025–26) బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించి, రెండు విడతల్లో కలిపి రూ.10 వేల చొప్పున మాత్రమే 46,85,838 మంది రైతులకు రూ.4,685.54 కోట్లు జమ చేసి చేతులు దులుపుకున్నారు. అంటే దాదాపు 7 లక్షల మందికి ఎగనామం పెట్టారు. రూ.16,746 కోట్లు ఎగవేతపీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న సాయాన్ని తన ఖాతాలో వేసుకొని, రెండు విడతల్లో రూ.14 వేలు జమ చేశామని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అంటే రెండేళ్లలో రైతులకు ఎగ్గొట్టిన మొత్తం రూ.16,746 కోట్లు. పైగా అర్హుల్లోనే లక్షలాది మంది రైతులు ఇంకా తమకు జమ కాలేదంటూ అర్జీలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. కానీ బడ్జెట్ ప్రసంగంలో మాత్రం 46.86 లక్షల మంది రైతులకు రూ.6,309.44 కోట్లు జమ చేసేశామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం విస్మయ పరుస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలోనైనా బకాయిలతో సహా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరుపుతారనుకుంటే ఈసారీ అరకొరగానే విదిల్చారు. సూపర్ సిక్స్ హామీ మేరకు చూస్తేæ వాస్తవానికి ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున 53.58 లక్షల మందికి ఏటా రూ.10,717 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.32,151 కోట్లు కేటాయింపులు జరపాలి. కానీ తొలి ఏడాది బడ్జెట్లో వెయ్యి కోట్లు, రెండో ఏడాది బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించగా.. రెండో ఏడాది జమ చేసిన రూ.4,685.84 కోట్లు మినహాయిస్తే అన్నదాతలకు చెల్లించాల్సిన పెట్టుబడి సాయం ఇంకా రూ.27,465 కోట్లకు పైమాటే. కానీ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే.కౌలు రైతుల ఊసెత్తని ప్రభుత్వంరాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా భూ యజమానులతో పాటు ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్లో చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చింది. అయితే 2024–25లో భూ యజమానులతో పాటు కౌలు రైతులకూ ఎగ్గొట్టారు. రెండో ఏడాది 2025–26లో రెండు విడతల్లో రూ.10 వేలు అదీ భూ యజమానులకు మాత్రమే జమ చేశారు. రెండో విడత సాయం ఇచ్చేటప్పుడు కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం అందిస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత సీసీఆర్సీ కార్డుల జారీ ప్రక్రియ పూర్తికాగానే నవంబర్లో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ రబీ సీజన్ చివరి దశకు చేరుకున్నా, ఒక్క విడత సాయం కూడా కౌలు రైతులకు జమ చేసిన పాపాన పోలేదు. జారీ చేసిన సీసీఆర్సీ కార్డుల ప్రకారం చూసుకున్నా 2024–25లో 9.13 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున.. మొత్తంగా రూ.40 వేలు పెట్టుబడి సాయం అందించాలి. అంటే రెండేళ్లలో కలిపి కౌలు రైతులకు రూ.3,474 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27లో చెల్లించాల్సింది కూడా కలుపుకుంటే రూ.6 వేల కోట్లకు పైమాటే. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా మంత్రి అచ్చెన్నాయుడు కౌలు రైతుల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. -
పట్నం కోతి సలహాలు
ఒక పట్నం కోతి కొత్తగా అడవిలోకి వచ్చింది. వస్తూ వస్తూ అది ఒక ఇంట్లో నుంచి చిన్న అద్దం, పౌడర్ డబ్బా, పెదాలకు వేసుకునే ఎర్రరంగు దొంగిలించి తన వెంట తెచ్చుకుంది. అది ఒక చింత చెట్టు మీద తన నివాసం ఏర్పరచుకుంది. ఆ చెట్టు మీదనే తిమ్మమ్మ అనే కోతి తన కవల పిల్లలు చిట్టి, చిన్నిలతో కాపురం వుంది.పట్నం కోతి అద్దంలో మొహం చూసుకుంటూ పౌడర్ రాసుకోవడం, పెదాలకు ఎర్రరంగు వేసుకోవడం ఆసక్తిగా చూసేవి చిట్టి, చిన్ని.వాటిని చూసి పట్నం కోతి, ‘‘ఇలా రండి, మీకు కూడా పౌడర్ రాస్తాను’’ అంటూ పిలిచింది.చిట్టి, చిన్ని పనస తొనలు తింటూ మొహాలకు పౌడర్ రాయించుకున్నాయి.‘‘పనస తొనలను గింజలు తీసి తినాలి. అలా తినకూడదు. పట్నంలో గింజలు తినరు. పారేస్తారు’’ అంది పట్నం కోతి.చిట్టి, చిన్ని పనస గింజలన్నీ తీసి పారేసి, గుజ్జు మాత్రమే తిన్నాయి.అది మొదలు పట్నం కోతి వాటికి ఎలా నాజూకుగా నడవాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అంటూ కొత్త విషయాలు చెప్పడం మొదలు పెట్టింది.చిట్టి, చిన్ని రోజంతా ఆ పట్నం కోతి మాటలు ఆసక్తిగా వింటూ, అది చెప్పినట్లుగా నడుచుకునేవి.‘‘అలా రోజంతా కూర్చుని కబుర్లు వింటూ ఉంటే సోమరిపోతుల్లా తయారవుతారు. మిగతా పిల్లలను చూడండి, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో! మీరు కూడా చక్కగా వెళ్ళి వాటితో ఆడుకోండి.’’ అంటూ మొత్తుకునేది తిమ్మమ్మ. అయితే చిట్టి, చిన్ని తల్లి మాటలు లెక్క చేసేవి కావు. పట్నం కోతి దగ్గరకే పోయి కూర్చునేవి!పట్నం కోతి దాని మాటలతో చిట్టి, చిన్నీల ఆహారపు అలవాట్లు మార్చేసింది!‘‘దానిమ్మ తొక్కతో తినకూడదు, గింజలు వొలుచుకుని తినాలి. మొక్కజొన్న పొత్తి గింజలు తిని, కంకి పారేయాలి. మామిడి పండు రసం పీల్చుకుని తొక్క పారేయాలి. అరటి పండు తొక్క కూడా తినకూడదు. వీటితో పాటు ఆకుపచ్చని ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది!’’ అంటూ వాటికి నూరిపోస్తూ ఉండేది. అయితే నెల తిరిగేసరికి చిట్టి, చిన్ని నీరసపడ్డాయి. కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలు పెట్టాయి .హడలిపోయిన తిమ్మమ్మ పిల్లలనిద్దరినీ తీసుకుని వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళింది. సంగతి తెలుసుకున్న ఎలుగు చిట్టి, చిన్ని నోట్లో పసరు మందు పోసి, ‘‘చూడండి పిల్లలూ! మనం పుట్టినప్పటి నుంచి ఏం తిని పెరుగుతున్నామో అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. వాళ్లూ వీళ్ళూ చెప్పారని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఇలాగే అనారోగ్యం పాలవుతారు. పళ్ళ మీద తొక్క, గింజలు ఇవే మనకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అవి తినకే మీరు నీరసపడ్డారు. ఆకులు, గడ్డి తింటే జీర్ణం కాదు. అది మీ ఆహారం కాదు. అందుకే ఈ కడుపు నొప్పి. ఈ వయసులో తిన్నది అరిగేదాకా ఆడుతూ ఉంటేనే, తిన్నది వంట పడుతుంది. ఇక ఆ పట్నం కోతి సలహాలు వినడం మానేసి, ఇన్నాళ్ళూ మీరు ఎలా ఉన్నారో, ఎలా తిన్నారో అలాగే ఉండండి. ఎటువంటి జబ్బు చేయదు!’’ అని చెప్పింది.ఆ తరువాత చిట్టి, చిన్ని పట్నం కోతి సలహాలు పాటించక పోగా, క్రమంగా దానిని కూడా తమ దారిలోకి తెచ్చుకున్నాయి. -
బాబువన్నీ 'గ్యాస్' కబుర్లే
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల వేళ ఊదరగొట్టిన చంద్రబాబు ఆ హామీనీ మెల్లగా అటకెక్కించేస్తున్నారు. మహిళలకు కుచ్చుటోపీ పెట్టేందుకు టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తూ బడ్జెట్లో తూతూమంత్రంగా నిధులు కేటాయించారు. ఎన్నికలప్పుడు అక్కచెల్లె్లమ్మల ఓట్ల కోసం ఇష్టారాజ్యంగా హామీలిచ్చి... అధికారంలోకి వచ్చాక వాటికి అడ్డగోలుగా కోతలు పెడుతున్నారు. లబ్దిదారులను ఏరిపారేస్తున్నారు. వాస్తవానికి ఏపీలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే సుమారు రూ.4,083 కోట్లు అవసరం. కానీ, చంద్రబాబు 2026–27 బడ్జెట్లో మాత్రం దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్కు కేటాయించింది కేవలం రూ.2601 కోట్లు మాత్రమే!. ఈ బడ్జెట్ కేటాయింపులను బట్టి 98 లక్షల సిలిండర్లు మాత్రమే ఉచితంగా అందించడానికి వీలుంటుంది. మిగిలిన 60 లక్షల కనెక్షన్లకు ఉచిత గ్యాస్ సిలిండర్లు లేనట్టే. గడిచిన ఏడాదిన్నర కాలంలో దీపం 2.0 పథకం కొందరి ఇళ్లకే పరిమితమై ‘గుడ్డి దీపం’గా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.6,183 కోట్లకు చంద్రబాబు ఎగనామం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్లో దీపం 2.0ను చంద్రబాబు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తొలి ఏడాది ఒక్కో సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చారు. ఇందుకు రూ.865 కోట్లు విడుదల చేశారు. మిగిలిన రెండు సిలిండర్లకు రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఆ తర్వాత ఏడాది (2025–26) మూడు సిలిండర్లకు రూ.2601 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక్కడ కూడా 1,482.48 కోట్లు ఎగ్గొట్టారు. తాజాగా 2026–27 బడ్జెట్లోనూ రూ.2601 కోట్లు కేటాయించడంతో వచ్చే ఆర్థి క సంవత్సరానికి కూడా 1,482.48 కోట్లు ఎగ్గొట్టారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు రూ.6183 కోట్లు ఎగ్గొట్టి మహిళలకు టోకరా పెట్టారు. ప్రభుత్వ కేటాయింపులు సుమారు 90 లక్షల లబ్ధిదారులకే సరిపోగా... 60 లక్షలకుపైగా లబ్దిదారులకు మొండి చేయి చూపుతున్నారు. ఫలితంగా లక్షలాది మంది లబ్దిదారులు సబ్సిడీ కోసం గ్యాస్ ఏజెన్సీలు, గ్రామ–వార్డు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. -
‘గ్రామీణాభివృద్ధి’ అంతంతమాత్రం
సాక్షి, అమరావతి: బడ్జెట్ రోజున కేటాయింపులు ఘనంగా ఉన్నా అమలుకు వచ్చేసరికి అథమం అన్నట్టు ఉంది ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిస్థితి. 2026–27 బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.21,624 కోట్లు కేటాయింపులు చేసినా.. అవి కార్యరూపం దాల్చుతాయా లేదా అనేదానిపై అధికారులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పెట్టిన రోజున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.18,890 కోట్లు కేటాయింపులు చేసినట్టు ప్రకటించి.. వెంటనే రూ.15,244 కోట్లకు పరిమితం చేస్తూ రివైజ్డు కేటాయింపులను ప్రకటించడం ఆ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. రివైజ్డు బడ్జెట్లో భారీ కోత గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్మాణంతో పాటు ఇంటింటికీ కొళాయిల ఏర్పాటుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్ కార్యక్రమానికి 2025–26 బడ్జెట్లో మొదట ఘనంగా రూ.2,800 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించి, తీరా రివైజ్డ్ బడ్జెట్లో ఆ కేటాయింపులు రూ.524.41 కోట్లకు పరిమితం చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే బడ్జెట్కూ, రివైజ్డు బడ్జెట్కూ మధ్యనే భారీ కోతలు పెట్టిన ఆ జలజీవన్ మిషన్ పథకానికే 2026–27 బడ్జెట్లో ఏకంగా రూ.4,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ రోడ్లకు గతం కన్నా తక్కువే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి గత 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.2,239 కోట్లు కేటాయించి.. రివైజ్డ్ బడ్జెట్లో ఆ మొత్తాలను రూ.2,076 కోట్లకు పరిమితం చేశారు. మరోవైపు 2026–27 బడ్జెట్లో ఆయా కార్యక్రమాల ద్వారా రోడ్ల నిర్మాణానికి కేవలం రూ.1,883.57 కోట్లే కేటాయించారు. కొత్త ‘ఉపాధి’ పథకానికీ రూ.8,365 కోట్లే ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచి్చన వీబీ జీ రామ్జీ పథకానికి 2026–27 బడ్జెట్లో రూ.8,365 కోట్లు కేటాయింపులు చేశారు. అయితే ఈ పథకంలో పని చేసే ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన అడ్మిన్ కేటగిరికి గత బడ్జెట్లో రూ.372 కోట్లు పెట్టి, రివైజ్డు బడ్జెట్లో రూ.357 కోట్లకు సవరించగా.. 2026–27 బడ్జెట్లో ఆ కేటాయింపుల మొత్తం రూ.100 కోట్లకే పరిమితం చేయడం గమనార్హం. -
శాంతిభద్రతలపై శీతకన్ను
సాక్షి, అమరావతి: రెడ్బుక్ అమలుకు పోలీసువ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి–భద్రతలపై శీతకన్ను వేసింది. మహిళల భద్రత, పోలీసుశాఖ ఆధునికీకరణ, డ్రగ్స్ మాఫియా కట్టడి వంటి అంశాలను గాలికివదిలేసింది. 2026–27 వార్షిక బడ్జెట్లోహోంశాఖకు కేవలం రూ.9,165 కోట్లు మాత్రమే కేటాయించింది. అందులో సింహభాగం పోలీసుశాఖ జీతభత్యాలు, సాధారణ నిర్వహణ ఖర్చులకే సరిపోనుంది. కేటాయింపుల్లో ప్రధానమైనవి ఇలా.. మహిళాభద్రత కోసం గత బడ్జెట్లో రూ.10.01 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.3.20 కోట్లే వెచ్చించింది. ఈ ఏడాది కేటాయింపు కేవలం రూ.3.20కోట్లు కావడం గమనార్హం. n రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ దందాను కట్టడి చేయడంపై ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. నార్కోటిక్స్ ఆపరేషన్లకు అవసరమైన వ్యవస్థ బలోపేతం కోసం గత బడ్జెట్లో రూ.61 కోట్లు కేటాయించి కేవలం రూ.22కోట్లే ఖర్చు చేసింది. » ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులే రూ.30 కోట్లకు పరిమితం చేసింది. » కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్రం కేటాయించాల్సిన నిధులపై ముఖం చాటేసింది. ఫోరెన్సిక్ విభాగానికి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నిధులు కేటాయించలేదు. బడ్జెట్ ప్రసంగంలో క్రెడిట్ చోరీ మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం విస్మయపరిచింది. రాష్ట్రంలో 5,757మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమినరీ పరీక్షలు కూడా నిర్వహించింది. అప్పట్లో టీడీపీ ఆ నియామక ప్రక్రియకు వ్యతిరేకంగా తమ సానుభూతిపరులతో కోర్టుల్లో కేసులు వేయించింది. టీడీపీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను ఉపసంహరించారు. దాంతో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. అవి కూడా తామే భర్తీ చేసినట్టు పయ్యావుల కేశవ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. » శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొత్తగా 4 ఏపీఎస్పీ బెటాలియన్ల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ ఘనత కూడా చంద్రబాబు ప్రభుత్వానిదేనని పయ్యావుల కేశవ్ క్రెడిట్ చోరీకి యతి్నంచారు. -
నేడు కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం
నరసరావుపేట రూరల్: తిరునాళ్ల మహోత్సవానికి పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండ సిద్ధమైంది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం నిర్వహించే ఈ తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు జాగరణకు తరలిరానున్నారు. త్రికోటేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పట్టువ్రస్తాలు సమర్పించనున్నారు. భక్తులకు ఉచిత, ప్రత్యేక, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, అభిషేక దర్శనం కల్పించే విధంగా క్యూలైన్లు సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. క్యూలైన్లలో భక్తులకు అందజేసేందుకు ఆరు లక్షల వాటర్ బాటిళ్లు, లక్ష మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. తిరునాళ్ల జాగరణకు ఈ ఏడాది 5 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి సౌకర్యార్థం ఆర్టీసీ కోటప్పకొండకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి 618 బస్సులను నడపనుంది. కొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవేసేందుకు తిరుమలకు చెందిన 120 బస్సులను అందుబాటులో ఉంచారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో మూడు వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొలువుదీరనున్న భారీ విద్యుత్ ప్రభలు ప్రభల పండుగగా పేరుగాంచిన కోటప్పకొండ తిరునాళ్లలో ఈ ఏడాది 26 భారీ విద్యుత్ ప్రభలు కొలువుదీరనున్నాయి. వీటితో పాటు 50 చిన్న ప్రభలు, వందకు పైగా మొక్కుబడి ప్రభలు కొండకు తరలిరానున్నాయి. భక్తులకు విక్రయించేందుకు రెండు లక్షల లడ్డూలు, లక్ష అరిసె ప్రసాదాలను సిద్ధంగా ఉంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది భక్తులకు చిన్న లడ్డూలను ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రజలందరిపై పరమశివుడి అనుగ్రహం ఉండాలి
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్ జగన్ అన్నారు. 'ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. -
‘సూపర్ సిక్స్’లు ఔట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.80 లక్షల మంది మహిళలకు చంద్రబాబు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికీ ఏటా రూ.18 వేలు చొప్పున మూడేళ్లలో దాదాపు రూ.లక్ష కోట్లు ఇవ్వాలి. కానీ.. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇచ్చింది మాత్రం సున్నా. 20 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు. నెలకు రూ.3 వేలు చొప్పున మూడేళ్లలో నిరుద్యోగ యువతకు రూ.21,600 కోట్లు ఇవ్వాలి. కానీ.. ఇచ్చింది గుండు సున్నా. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మందికి పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో రూ.28,800 కోట్లు ఎగనామం పెట్టారు.సున్నా వడ్డీ పథకానికి తూట్లు పొడిచి దాదాపు కోటి మంది పొదుపు మహిళలతోపాటు రైతులనూ దగా చేశారు. సూపర్ సిక్స్, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మూడు కోట్ల మందికిపైగా మహిళలు, రైతులు, యువతకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మూడో బడ్జెట్లోనూ వాటి ప్రస్తావనే లేకుండా చేసి ఇక ఆ పథకాలను అమలు చేయబోమని విస్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్లైంది. తల్లికి వందనం పథకానికి రూ.13,112 కోట్లు కావాల్సి ఉంటే ఈ బడ్జెట్లో ఇచ్చింది రూ.8,457 కోట్లే! మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది కోతలతో సరిపుచ్చారు. అన్నదాతా సుఖీభవ కింద పాత బకాయిలతో కలిపి రూ.27,455 కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో చేసిన కేటాయింపులు రూ.6,600 కోట్లు మాత్రమే. దీపం పథకం అమలుకు ఏటా రూ.4,200 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో ప్రతిపాదించింది కేవలం రూ.2,601 కోట్లే! ‘దీపం’ పథకం కింద బకాయిలతో కలిపి రూ.6,183 కోట్లు ఎగనామం పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు హామీని తొలి ఏడాది నెరవేర్చకుండా రూ.3,200 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది నుంచి అనేక ఆంక్షలతో అరకొరగా అమలు చేస్తున్నారు. ఇక ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లు ఉండగా పెండింగ్లో ఉన్న 4 డీఏలు ఎప్పుడు అందుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇలా అన్ని వర్గాలను మోసం చేస్తూ రూ.3.32 లక్షల కోట్లతో 2026–27 వార్షిక బడ్జెట్ను టీడీపీ కూటమి సర్కారు బడ్జెట్ను శనివారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది బడ్జెట్లో ఎక్కడా లేకపోగా ప్రభుత్వ గ్యారెంటీ రుణాలను దాచి పెట్టింది. భారీ అప్పులు, పన్నులు, పన్నేతర వాతలు మాత్రం బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనిపించాయి. పది సూత్రాల సూక్తులు మినహా కార్యాచరణ బడ్జెట్లో కానరాలేదు. పేదల ఇళ్లపై కక్ష..పేదల ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు సర్కారు కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. కాగితాలపై కేటాయింపులు మినహా ఖర్చు చేయడం లేదు. గత రెండు బడ్జెట్లలో కేటాయింపులు, వాస్తవ వ్యయం తీరే దీనికి నిదర్శనం. 2024–25లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.4,012 కోట్లు కేటాయించగా రూ.1,611 కోట్లు మాత్రమే వెచ్చించారు. 2025–26లో రూ.6,317 కోట్లను కేటాయించగా సవరించిన అంచనాల్లో వ్యయం కేవలం రూ.2,017 కోట్లుగా పేర్కొన్నారు. ఈసారి రూ.6,357 కోట్లు కేటాయించినట్లు చూపిస్తున్నా ఈ ప్రభుత్వానికి వ్యయం చేసే ఉద్దేశం లేదని గత రెండు బడ్జెట్ల ద్వారా స్పష్టమవుతోంది.అదనంగా రూ.27,820 కోట్ల పన్నుల భారం ఒకవైపు ప్రైవేట్కు సంపద సృష్టిస్తూ వేగంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు సర్కారు మరోవైపు పన్నేతర, పన్ను ఆదాయాల ద్వారా రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపింది. పన్నుల ఆదాయం అదనంగా రూ.27,820 కోట్లు వస్తుందని అంచనా వేయడం గమనార్హం. అంటే పన్నుల రూపంలో ప్రజలపై భారీగా వడ్డించనున్నట్లు స్పష్టమవుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ద్వారా ప్రజలపై భారం మోపనున్నారు. పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చుకోవాలని ప్రతిపాదించినా సూపర్ సిక్స్ హామీలకు మాత్రం పూర్తి స్థాయిలో కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. 2025–26లో సవరించిన రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.98,025 కోట్లు కాగా, 2026–27లో సొంత పన్ను ఆదాయం రూ.1,25,845 కోట్లుగా అంచనా వేశారు. ఇక పన్నేతర ఆదాయంపై బాబు సర్కారు తిమ్మిని బమ్మిని చేసింది. 2025–26 బడ్జెట్ అంచనాల్లో పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లు కాగా సవరించిన అంచనాల్లో రూ.14,324 కోట్లకు తగ్గించారు. అయితే వాస్తవంగా కాగ్ డిసెంబర్ వరకు విడుదల చేసిన గణాంకాల మేరకు పన్నేతర ఆదాయం కేవలం రూ.4,142 కోట్లు వచ్చింది. ఇక 2026–27 బడ్జెట్లో పన్నేతర ఆదాయం రూ.11,473 కోట్లుగా అంచనా వేశారు. అంటే పన్నేతర రూపంలో కూడా ప్రజలపై బాదనున్నారు. సంపద సృష్టి శూన్యం.. ప్రైవేట్కు ఫండింగ్సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు. పీపీపీలో విధానంలో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు బడా సంస్ధలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద బడ్జెట్లో ఏకంగా రూ.1,500 కోట్లు కేటాయింపులు చేశారు. మరో రూ.లక్ష కోట్ల అప్పులు..వచ్చే ఏడాది మరో రూ.లక్ష కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో చంద్రబాబు సర్కారు వెల్లడించింది. ప్రజా రుణం పేరుతో రూ.98,065 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం కింద రూ.78,182 కోట్లు, కేంద్రం నుంచి రూ.19,133.41 కోట్లు అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. జనంపై బాదుడు.. భారీ అప్పులే లక్ష్యం..పన్నుల రూపంలో ప్రజలపై భారీగా బాదుడు, భారీ అప్పులే లక్ష్యంగా రూ.3.32 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2.56 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.48,697 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 1.11 శాతమని వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.75,868 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 3.84 శాతంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తగ్గుతున్నట్లు అంకెల గారడీతో మోసపుచ్చేందుకు బడ్జెట్లో బాబు సర్కారు ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది.తల్లులకు బాబు వంచన..తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. ఇలా రెండేళ్లలో ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. ఇక ఇప్పుడు బడ్జెట్లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్లను ఎగ్గొట్టారు!రైతులకు వెన్నుపోటు..పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండేళ్లలో రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు. తాజా బడ్జెట్లోనూ అరకొరగా కేటాయింపులు చేసి రైతులకు దాదాపు రూ.21 వేల కోట్ల మేర ఎగ్గొట్టారు.తుస్సుమన్న గ్యాస్..దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. గత బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. దీపం పథకం కింద రెండేళ్లలో మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు. బకాయిలతో కలిపి తాజాగా రూ.6,183 కోట్లు ఎగనామం పెట్టారు.మహిళలకు మరో మోసం..రాష్ట్రమంతటా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26 ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. తొమ్మిది రకాల సర్వీసులకు ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. -
ఎనిమిది లక్షల పింఛన్లకు కోత?
సాక్షి, అమరావతి: బాబు సర్కార్ బడ్జెట్ ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది లక్షల పింఛన్లకు కోత పడే పరిస్థితి నెలకొంది. గత 20 నెలలుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పింఛన్ల పథకానికీ ప్రభుత్వం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం దీనికి కారణం. 2026 ఫిబ్రవరిలో ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు రూ.2,632.04 కోట్లు (రూ. 2,724.09 కోట్లు పంపిణీ చేస్తామని ముందు ప్రకటించింది) పంపిణీ చేసింది. ఈ లెక్కన ఏడాదికి రూ. 31,584 కోట్లు నిధుల అవసరం ఉంటుంది. తాజా బడ్జెట్లో కేవలం 27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే అవసరానికన్నా 4 వేల కోట్లు తక్కువ. దీంతో ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య ఇకపై 8 లక్షలు తగ్గితేనే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 50 ఏళ్లకే పింఛన్.. ‘హామీకే సరి’ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన ‘50 ఏళ్లకే పింఛన్’ హామీ.. కేవలం ప్రకటనలకే పరిమితమని బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 60 ఏళ్లు దాటిన వారు వృద్ధాప్య పింఛన్లకు అర్హులు. అయితే చంద్రబాబు ఎన్నికల ముందు ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు అన్న హమీని ప్రకటించారు. తాజా కేటాయింపులు చూస్తే ఈ హామీ అమలు లేనట్లేనని తేలిపోయింది. కొత్త పింఛన్లకు ఆన్లైన్ ప్రక్రియ నిలిపివేత» చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 20 నెలల్లో 60 ఏళ్లు నిండిన నిరుపేదలకు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు కాకపోగా, కనీసం పింఛన్కు దరఖాస్తు చేసుకునే అవకాశమూ లేకుండా పోయింది.» కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నిలిచిపోయింది. » గత జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. » ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆ సేవలు నిలిచిపోయాయి. సచివాలయాల్లో గానీ, మండల కార్యాలయాల్లో గానీ నేరుగా దరఖాస్తు అందజేయాలన్నా వీలుకాని పరిస్థితి. » 2024 జనవరి ఆరంభంలోనూ అప్పటి ప్రభుత్వం అర్హులైన అవ్వాతాతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. » ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వరకు సైతం ఆన్లైన్ వెబ్పోర్టల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్ల మంజూరు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. » అప్పట్లో ప్రభుత్వానికి అందిన రెండున్నర లక్షల మంది పింఛన్ దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికే ఐదున్నర లక్షల పింఛన్లు కోతవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం వాటిలో ఇప్పటికే ఐదున్నర లక్షలకు పైగా కోతవేసింది. జగన్ ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులు పింఛన్ పొందారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఈ సంఖ్య ప్రతి నెలా తగ్గుతూనే ఉంది. ఈ ఫిబ్రవరిలో పంపిణీ జరిగిన 60.19 లక్షలు చూస్తే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏకంగా ఐదున్నర లక్షల దాకా పింఛన్ల సంఖ్య తగ్గిపోయినట్టు అర్థమవుతోంది. లక్ష వరకు దివ్యాంగుల పింఛన్లు కోత పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘రీ వెరిఫికేషన్’ నిర్వహిస్తోందన్న విమర్శలున్నాయి. -
రూ.53వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్
సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో భాగంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రీ టెక్, ఫుడ్ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే పంచ సూత్రాల అమలుతో వ్యవసాయ రంగానికి ఊపిరి పోస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. శనివారం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.53,752.12 కోట్లతో ప్రతిపాదించిన వ్యవసాయ బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర జీఎస్డీపీ రూ.17.62 లక్షల కోట్లుగా నమోదు కాగా, అందులో వ్యవసాయ రంగం వాటా 33.2 శాతం (రూ.5.39 లక్షల కోట్లు)గా ఉందన్నారు. దేశ వ్యవసాయ రంగం వృద్ధిరేటు 0.80 శాతం కాగా, ఏపీలో 7.83 శాతంగా నమోదైందన్నారు. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో ఏపీ వాటా 10 శాతంగా ఉందన్నారు. ఈ రంగం వృద్ధిరేటు పరంగా 3.91 శాతంగా నమోదైందని, 15 శాతం వార్షిక వృద్ధిరేటు సాధించే లక్ష్యంతో 11 పంటలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించామన్నారు. ‘అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు, విత్తన రాయితీకి రూ.240 కోట్లు, ప్రకృతి సాగుకు రూ.208 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.139.65 కోట్లు, వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.250 కోట్లు, స్వచ్ఛంద పంటల బీమాకు రూ.250 కోట్లు, ఎన్ఎంఈఓ–ఓపీ(ఆయిల్పామ్)కు రూ.204 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, ఎన్పీడీడీ (డెయిరీ డెవలప్మెంట్)కి రూ.202.62 కోట్లు, వేట నిషేధ భృతికి రూ.260 కోట్లు, పీఎంఎంఎస్వైకి రూ.398 కోట్లు, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం కోసం రూ.500 కోట్లు, వ్యవసాయ.. ఉద్యాన, పశువైద్య, మత్స్య వర్సిటీలకు రూ.804.31 కోట్లు కేటాయించాం’అని తెలిపారు. రంగాల వారీగా తీసుకుంటే వ్యవసాయ రంగానికి రూ.12,152.32 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.1,123.86 కోట్లు, పట్టు పరిశ్రమ రంగానికి రూ.95.87 కోట్లు, మార్కెటింగ్ శాఖకు రూ.515.39 కోట్లు, సహకార శాఖకు రూ.209.30 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,121.26 కోట్లు, మత్స్య శాఖకు రూ.523.52 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.13,722 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.14,276.89 కోట్లు కేటాయించామని వెల్లడించారు. -
నిజంగా జరిగి ఉంటే ఇంకెంత ఊహించేవారో!!
నిజంగా జరిగి ఉంటే ఇంకెంత ఊహించేవారో!! -
అసలు సమరానికి సమయం
ఫిబ్రవరి 1...టి20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్... ఫిబ్రవరి 5...మాకు అవన్నీ తెలీదు...మా కొలంబో ఫ్లయిట్ బుక్ అయిపోయిందన్న సూర్యకుమార్... ఫిబ్రవరి 9...భారత్తో మ్యాచ్ ఆడేందుకు మేం సిద్ధమంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన... ఫిబ్రవరి 15...భారత్, పాక్ మధ్య కొలంబోలో మ్యాచ్కు రంగం సిద్ధం...ప్రపంచకప్లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు...1992 నుంచి అభిమానులు ఇది చూస్తూనే వచ్చారు...ఫలితం ఎలా ఉన్నా, ఏకపక్షంగా సాగినా ఈ మ్యాచ్కు ఉండే ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై సాగే సుదీర్ఘ వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ లేదంటే సహజంగానే పెద్ద చర్చే జరిగింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది...కొలంబో వెళ్లే ఫ్లయిట్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటే హోటళ్లలో ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనా ఖాళీ లేదనే సమాధానం వచ్చేస్తోంది. మైదానంలోనే ఉండి జట్టుకు మద్దతుగా నిలవాలనుకునే వేలాది మంది మాత్రమే కాదు...తమ ఇళ్లనుంచి కన్నార్పకుండా ప్రతీ బంతిని చూసే ఫ్యాన్స్ సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మరో వరల్డ్ కప్ పోరుకు ఇరు జట్లు సై అంటున్నాయి. ఇటీవల ఆసియా కప్లో 3–0తో పాక్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో చెలరేగుతుందో చూడాలి. కొలంబో: టి20 వరల్డ్ కప్లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్, పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతీ టి20 వరల్డ్ కప్లో తలపడుతున్న ఇరు జట్లు ఈ సారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో నేడు (ఆదివారం) జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో పాకిస్తాన్ను భారత్ ఎదుర్కొంటుంది. రెండు జట్లూ తమ తొలి రెండు మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా...ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈ సారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కుల్దీప్కు అవకాశం... భారత బ్యాటింగ్ లైనప్కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకూ సింగ్కు తగిన అవకాశం రాకపోగా, తిలక్ వర్మ కూడా రెండు సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా గత మ్యాచ్ తరహాలో భారీ స్కోరు ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న సామ్సన్ మాత్రం విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే సామ్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్ అయిన అభిషేక్ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో అతను అందించే ఆరంభం భారత్ భారీ స్కోరుకు పునాది అవుతుంది. బౌలింగ్కు సంబంధించి తుది జట్టులో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే భారత్ మూడో రెగ్యులర్ స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు ‘మిస్టరీ’గానే ఉన్న వరుణ్ చక్రవర్తి, అక్షర్లతో పాటు కుల్దీప్ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అర్ష్ దీప్ స్థానంలో అతను ఆడతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్ భారం పంచుకుంటారు కాబట్టి రెగ్యులర్ పేసర్గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవలి ఫామ్, బలాబలాలను చూస్తే పాక్కంటే టీమిండియా ఎంతో ముందుంది. బాబర్ ఆజమ్ రాణించేనా... అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. పాక్ ఇప్పటికే ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు అబ్రార్, తారిఖ్లతో పాటు స్పిన్ ఆల్రౌండర్లు నవాజ్, షాదాబ్లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. వీరిలో తారిఖ్ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా, చర్చనీయాంశమైన యాక్షన్తో ఆడే ఆఫ్స్పిన్నర్ తారిఖ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరం. భారత్ తమ సన్నాహకాల్లో దీనిపై కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు. పేసర్ షాహిన్ అఫ్రిది చాలా కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్లో టాప్–4 మాత్రమే రెగ్యులర్ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్ ఆగా ఆసియా కప్లో భారత్పై వరుసగా విఫలమవగా, ఫర్హాన్ ఒక్కడే రాణించాడు. కెప్టెన్ అయిన తర్వాత సల్మాన్ ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తమ జట్టుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా స్టార్ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న బాబర్ ఆజమ్ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇంతకంటే సమయం, వేదిక ఉండవని పాక్ అభిమానులు భావిస్తున్నారు. 13 భారత్, పాక్ మధ్య ఓవరాల్గా 16 మ్యాచ్లు జరగ్గా...13 గెలిచిన భారత్ 3 ఓడింది.7-1 టి20 ప్రపంచ కప్లో భారత్, పాక్ మధ్య 8 మ్యాచ్లు జరగ్గా... భారత్ 7 గెలిచి ఒకటే ఓడింది.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. అయితే బౌలర్లూ ప్రభావం చూపించగలరు. మ్యాచ్కు ముందు రోజు మాత్రమే భారత్ ఇక్కడ సాధన చేసింది. పాక్ జట్టు కొలంబోలోనే ఉన్నా... తమ రెండు మ్యాచ్లను ఎస్ఎస్సీ మైదానంలో ఆడింది కాబట్టి తేడా ఉండకపోవచ్చు. అయితే మ్యాచ్ను వాన గండం వెంటాడుతోంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్ ), ఫర్హాన్, అయూబ్, బాబర్ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్, నవాజ్, ఫహీమ్, షాహిన్ అఫ్రిది, తారిఖ్, అబ్రార్ టి20 ప్రపంచకప్లో నేడువెస్టిండీస్ X నేపాల్వేదిక: ముంబై; ఉదయం 11 గంటల నుంచిఅమెరికా X నమీబియావేదిక: చెన్నై; మధ్యాహ్నం 3 గంటల నుంచి -
మహిళల పోరులో పైచేయి ఎవరిదో!
సిడ్నీ: భారత మహిళల క్రికెట్ జట్టు కూడా కీలకమైన టి20 పోరుకు సిద్ధమైంది. భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు తొలి సమరం జరుగుతుంది. వన్డే వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టి20 సిరీస్ ఆడి క్లీన్స్వీప్ చేసిన హర్మన్ప్రీత్ సేన ఇప్పుడు ఒక పెద్ద జట్టుతో ప్రత్యర్థి గడ్డపై తలపడుతోంది. కెపె్టన్ హర్మన్తో పాటు రెగ్యులర్ ఆటగాళ్లు స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్లో చెలరేగితే భారత్ పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్ల్యూపీఎల్లో టాప్స్కోరర్గా నిలిచి అద్భుతమైన ఫామ్తో స్మృతి ఈ సిరీస్కు సిద్ధమైంది. గత టి20 వరల్డ్ కప్ తర్వాతి నుంచి 143.54 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధిస్తున్న స్మృతికి ఆసీస్ గడ్డపై కూడా మంచి రికార్డు ఉంది. క్రాంతి, అరుంధతి, శ్రీచరణి, శ్రేయాంక, రేణుకా సింగ్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటారు. మరో వైపు కొత్త కెప్టెన్ సోఫీ మోలినే నాయకత్వంలో ఆసీస్ బరిలోకి దిగుతోంది. గత 19 టి20 సిరీస్లలో ఆ్రస్టేలియా ఒక్కటి మాత్రమే ఓడింది. అలీసా హీలీ ఈ ఫార్మాట్నుంచి రిటైరైనా... ఇతర స్టార్లు ఎలైస్ పెరీ, సదర్లాండ్, మూనీ, లిచ్ఫీల్డ్, వోల్, వేర్హామ్లకు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉంది. ఆ్రస్టేలియాలో భారత పర్యటనను ప్రతీ ఫార్మాట్కు వేర్వేరుగా కాకుండా తొలిసారి మూడు ఫార్మాట్లలో ప్రదర్శనను బట్టి సిరీస్ విజేతను నిర్ణయిస్తారు. 3 టి20, 3 వన్డేలు, ఒక టెస్టు తర్వాత ఇది తేలుతుంది. పరిమిత ఓవర్లలో ఒక విజయానికి 2 పాయింట్లు, టెస్టులో విజయానికి 4 పాయింట్లు...టెస్టు డ్రా అయితే చెరో 2 పాయింట్లు కేటాయిస్తారు. -
మార్క్రమ్, యాన్సెన్ జోరు
అహ్మదాబాద్: బౌలింగ్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కో యాన్సెన్ జోరు (4/40), బ్యాటింగ్లో కెప్టెన్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (44 బంతుల్లో 86 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుతో దక్షిణాఫ్రికా ఖాతాలో మరో విజయం చేరింది. గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్లో సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన మార్క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్ (26 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలిచింది. ఫెర్గూసన్, నీషమ్, రచిన్ రవీంద్రలకు తలా ఒక వికెట్ దక్కింది. టాపార్డర్ టపటపా... ఇన్గిడి మూడో ఓవర్లో అలెన్ 3 ఫోర్లు, 1 సిక్స్తో కివీస్ శిబిరానికి జోష్ తెచ్చాడు. యాన్సెన్ తర్వాతి ఓవల్లో సీఫెర్ట్ (13) అవుటైనా... అలెన్ 4, 6తో జోరు కొనసాగించే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఆరో ఓవర్ వేసిన యాన్సెన్ ఈ సారి రచిన్ రవీంద్ర (13), అలెన్ (17 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుకు చెక్పెట్టాడు. కివీస్ పవర్ ప్లే కష్టాల నుంచి కోలుకోకముందే కేశవ్ మహరాజ్... ఫిలిప్స్ (1)ను బౌల్డ్ చేయడంతో 64 పరుగుల వద్ద కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.ఈ దశలో చాప్మన్ ధాటిగా ఆడి న్యూజిలాండ్ స్కోరు పెంచాడు. డారిల్ మిచెల్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో నీషమ్ (15 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో న్యూజిలాండ్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యాన్సెన్ సగటున ఓవర్కు 10 చొప్పున పరుగులిచ్చినా కీలక వికెట్లు తీశాడు. రఫాడించిన మార్క్రమ్ కివీస్ చేసిందేమీ తక్కువ స్కోరు కాదు. దీంతో ఈ గ్రూప్లో రెండు పోటీ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందనుకుంటే మార్క్రమ్ ఏకపక్షంగా మార్చేశాడు. అతను ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా మూడో ఓవర్లోనే 50 స్కోరుకు చేరుకుంది. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద డికాక్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. కాసేపటికే మార్క్రమ్ 19 బంతుల్లోనే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా తరఫున వేగవంతమైన అర్ధశతకాన్ని సాధించాడు. రికెల్టన్ (11 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా కెప్టెన్లాగే కివీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 7.2 ఓవర్లలోనే వంద పరుగులు దాటింది. తర్వాత వచ్చిన బ్రెవిస్ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), మిల్లర్ (17 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ఇంకో 2.5 ఓవర్లముందే సఫారీ లక్ష్యాన్ని దాటేసింది. -
బెల్జియం చేతిలో భారత్ ఓటమి
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భారత జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో బెల్జియం 4–2 గోల్స్ తేడాతో భారత్ను ఓడించింది. బెల్జియం తరఫున హ్యూగో లబుషేర్ (11వ నిమిషం), అలెగ్జాండర్ హెన్డ్రిక్ (14వ ని., 17వ ని.), ఆర్థర్ స్లూవర్ (15వ ని.) గోల్స్ నమోదు చేశారు. భారత ఆటగాళ్లలో ఆదిత్య అర్జున్ (24వ ని.), హర్మన్ప్రీత్ సింగ్ (37వ ని.) గోల్స్ సాధించారు. తొలి క్వార్టర్లో 3 గోల్స్ సాధించి బెల్జియం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్లో ఇరు జట్లు చెరో గోల్ చేయగా, మూడో క్వార్టర్లో భారత్ ఖాతాలో మరో గోల్ చేరింది. అయితే చివరి క్వార్టర్లో రాణించి ఓటమినుంచి తప్పించుకోవాలని భారత్ చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. శనివారం జరిగిన మరో మ్యాచ్లో జర్మనీ 6–1 గోల్స్ తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. నేడు జరిగే పోరులో అర్జెంటీనాతో భారత్ తలపడుతుంది. -
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు -
అప్పులే ఆధారమా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 2026 –27 బడ్జెట్లో రెవెన్యూ – వ్యయం మధ్య అధిక వ్యత్యాసం, మూలధన కల్పన తక్కువగా ఉండటం; ఆరోగ్యం, సామాజిక సేవలకు వనరుల కేటా యింపు తక్కువగా ఉండటం; రుణాలు, కేంద్ర సహాయంపై అధి కంగా ఆధారపడటం; సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనకు అవసరమయిన చర్యలు లోపించడం కారణంగా సంతులనం లోపించింది. రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడిలో వృద్ధి ఆశించినంతగా లేకపోవడం, మరోవైపు రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు కారణంగా ప్రాధాన్యతా రంగా లపై పెట్టుబడి తగ్గుతుంది. తద్వారా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి క్షీణించడంతో పాటు ప్రభుత్వానికి రుణ భారం పెరిగి అభివృద్ధి ప్రాజెక్టులపై వ్యయం తగ్గుతుంది. కొరవడిన ఆర్థిక క్రమశిక్షణ2024 జూన్ తర్వాతి కాలంలో ప్రభుత్వం రుణాలపై అధికంగా ఆధార పడటం, రెవెన్యూ సమీకరణలో నిర్మాణా త్మక బలహీనతలు, వ్యయ యాజమాన్యంలో విఫలమవ డాన్ని సూచిస్తున్నది. పన్నేతర రాబడిలో తగ్గుదల, మూలధన వ్యయం తగ్గుదల, కమిటెడ్ వ్యయం (వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు)లో పెరుగుదలను ఇటీవలి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టపరుస్తున్నది. కాగ్ గణాంకాల ప్రకారం, 2025 –26 ఆర్థిక సంవత్సరంలో 2025 నవంబర్ నాటికి రెవెన్యూ లోటు రూ. 54,355 కోట్లకు చేరు కుంది. 2026–27 బడ్జెట్లో మొత్తం వ్యయం రూ. 3,32,205 కోట్లుగా ప్రతిపాదించగా, ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయం 77.1 శాతం కాగా, మూలధన వ్యయం 16.2 శాతం. మూలధన వ్యయాన్ని 2025–26 బడ్జెట్లో రూ. 40,636 కోట్లుగా అంచనా వేయగా, ప్రస్తుత 2026–27 బడ్జె ట్లో రూ. 53,915 కోట్లుగా ప్రతిపాదించారు. మూలధన వ్యయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికంగా రుణా లపై ఆధారపడినట్లయితే భవిష్యత్తు బడ్జెట్లలో అధిక మొత్తాన్ని వడ్డీ చెల్లింపులపై వెచ్చించవలసి ఉంటుంది. తద్వారా నూతన మూలధన ప్రాజెక్టులు, సంక్షేమంపై వ్యయం తగ్గుతుంది. రాష్ట్ర మొత్తం రుణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019–24 మధ్య కాలంలో రూ. 2,61,302 కోట్ల నుండి రూ. 4,85,491 కోట్లకు చేరు కోగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలల కాలం నాటికి (మార్చి 2025) ఈ మొత్తం రూ. 6,62,557 కోట్లకు చేరుకుందని ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు పార్ల మెంటులో ప్రస్తావనకు రావడం జరిగింది. 2019–24 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో సగటున రూ. 31,000 కోట్లను మూల ధన వ్యయానికి కేటాయించింది. కోవిడ్–19 సమయంలో రెవెన్యూ రాబడి తగ్గినప్పటికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచు కొని ఒకవైపు సంక్షేమంపై వ్యయాన్ని పెంచుతూ మరోవైపు దీర్ఘకాల ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మూలధన పెట్టు బడులను పెంచగలిగి, ఆర్థిక క్రమశిక్షణను పాటించడాన్ని గమనించాలి. మానవాభివృద్ధి, రైతుల సంక్షేమం, హౌసింగ్, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాలకు 2019–24లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిన క్రమంలో జీఎస్ డీపీ వృద్ధిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది.మరోవైపు రుణాలవృద్ధిలోనూ తగ్గుదలను గమనించవచ్చు. వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతల క్రమంలో పేదరిక స్థాయి 2015–16లో 11.77 శాతం నుండి 2023 నాటికి 4.2 శాతానికి తగ్గింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంతో పోల్చినప్పుడు 2026 –27లో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటులో తగ్గుదలను ప్రతిపాదించినప్పటికీ రెవెన్యూ రాబడిలో తగ్గుదల కారణంగా తిరిగి బడ్జెట్ లోటులు పెరిగే అవకాశం ఉంది. రుణాలపై, కేంద్ర గ్రాంట్లపై అధికంగా ఆధారపడటం వలన స్వయం నిరంతర ఆదాయ వృద్ధి ప్రశార్థకంగా కన్పిస్తున్నది.ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం, వివిధ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ, ‘ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం’ నియమావళిని పాటిస్తూ, పన్నేతర రాబడిని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ పథకాల అమలు లక్ష్యాన్ని సాధించడం, తప్పనిసరి వ్యయానికి సంబంధించి కాలానుగుణంగా సమీక్ష, అధిక వడ్డీతో కూడిన స్వల్పకాల రుణాల తగ్గింపు ద్వారా ఆర్థిక క్రమశిక్షణ సాధనకు కృషి చేయాలి.-వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జి), ఇక్ఫాయ్ -ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
రాజులు వారే... తరాజులు వారే!
తెలంగాణకు సంబంధించినంతవరకు ‘నేనే రాజును, నేనే మంత్రిన’ని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించుకున్నారు. మునిసిపాలి టీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించ డానికి సరిగ్గా ఒకరోజు ముందు ఢిల్లీలో ఆయనీ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలే రాజులనేది ఒక ప్రాథమిక అవగాహన. భారత రాజ్యాంగాన్ని ప్రకటించుకున్నది కూడా ప్రజల పేరుతోనే కదా! ఈ కోణం నుంచి చూసినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనలో స్వాతిశయం మోతాదు మించినట్టే కనిపిస్తుంది. మరుసటి రోజు ప్రకటించబోయే ఎన్నికల ఫలితాల్లో భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నామనే జోష్ ఇందుకు కారణం కావచ్చు.ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే భారీ విజయం దక్కినట్టు ఎలా భావిస్తారు? అదంతే! మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ తలచుకుంటే స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగానే ఉంటున్నాయి. అర్థబలం, అంగబలం అధికార పార్టీకి దండిగా ఉండడం ఒక కారణం. అధికార యంత్రాంగం పూర్తిగా చెప్పుచేతల్లోఉంటుంది. అంకితభావంతో ఒక పార్టీకి జెండా మోసే కార్య కర్తల ప్రభావం ఇప్పుడు అన్ని పార్టీల్లో తగ్గుముఖం పట్టింది. వారి స్థానాన్ని నాలుగురాళ్లు వెనకేసుకున్నవారు, పైరవీకార్లు ఆక్రమిస్తున్నారు. అంకితభావంతో ఉండే కార్యకర్తల మాదిరిగా తెగించి పోరాడే తత్వం ఈ నయా శ్రేణులకు తక్కువ. లెఫ్ట్, బీజేపీల్లో ఈ జాడ్యం కొంత తక్కువ కావచ్చు కానీ, మిగిలిన పార్టీలేవీ మినహాయింపు కాదు. దానికితోడు ఇంకో రెండు మూడేళ్లు అధికారంలో ఉండే పార్టీనే గెలిపిస్తే కొద్దోగొప్పో అభివృద్ధి జరుగుతుందనే ఆశాభావం కూడా ఓటర్లలో ఉండే అవకాశం ఉన్నది.ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఓట్ల లెక్కింపునకు ముందే భారీ విజయాన్ని ముఖ్యమంత్రి ఊహించడం, 90 శాతం మునిసిపాలిటీలు గెలవబోతున్నామని ప్రకటనలు చేయడం అసహజమేమీ కాకపోవచ్చు. ఇంతకుముందు 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి పాలక పార్టీ 93 శాతం మునిసిపాలిటీలను గెలుచుకున్న ఉదాహరణ కూడా ఉన్నది. కాకపోతే ఆ స్థాయి ఫలితాల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించిందా అనేదే ప్రశ్న. 116 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత 66 చోట్ల లభించింది. అంటే 57 శాతం. 36 మునిసిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ 36 త్రిశంకు కౌన్సిళ్లలో 13 చోట్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది. ఇవి కూడా పార్టీ ఖాతాలో పడితే సంఖ్య 79కి, శాతం 68కి చేరుతుంది.ఇంకో ఆరు మునిసిపాలిటీల్లో రెండు పార్టీలకు చెరి సమానంగా సీట్లు వచ్చాయి. ఐదుచోట్ల కాంగ్రెస్ – బీఆర్ఎస్కు మధ్య, ఒకచోట బీఆర్ఎస్ – బీజేపీకి నడుమ ఈ టై ఏర్పడింది. 12 హంగ్ మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ పెద్దపార్టీగా గెలిచింది. నాలుగు మునిసిపాలిటీల్లో బీజేపీ, ఒకచోట ఎమ్ఐఎమ్లు పెద్దన్నలుగా ఉన్నాయి. ఈ మొత్తం 23 చోట్ల అధికార దన్నుతో సగానికి సగం కాంగ్రెస్ లాక్కోగలిగినా గరిష్ఠంగా దాని బలం 90 మునిసిపాలిటీలకు చేరుతుంది.స్ట్రయిక్ రేట్ 80 శాతాన్ని దాటే అవకాశం లేదు. అయినా, ఇదేమీ చిన్న విజయం కాదు. ఐదింట నాలుగొంతుల మునిసిపాలిటీలను కాంగ్రెస్ స్వాధీనం చేసుకుంటుంది. కాకపోతే ఐదేళ్ల కింద అప్పటి అధికార బీఆర్ఎస్ ఇంతకంటే పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ గుణపాఠాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని ‘నేనే రాజు, నేనే మంత్రి’ ప్రకటన స్పష్టం చేసినట్లయింది. 2020లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు మునిసిపాలిటీలే దక్కాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 13 మునిసి పాలిటీలను స్పష్టమైన మెజారిటీతో గెలుచుకున్నది. ఇంకో పన్నెండు హంగ్ పట్టణాల్లో పెద్ద పార్టీగా గెలిచింది. ఐదుచోట్ల కాంగ్రెస్తో, ఒకచోట బీజేపీతో సమాన వార్డులు గెలవడంతో అక్కడ టై ఏర్పడింది. మొత్తంగా 31 మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ తన బలాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ తన ‘దర్బార్ సంస్కృతి’ నుంచి బయటపడి ఉన్నట్లయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని క్షేత్రస్థాయి రిపోర్టులు సూచిస్తు న్నాయి. పార్టీకి కేంద్రంలో మాదిరిగానే నియోజకవర్గాల స్థాయిలో కూడా దర్బార్ సంస్కృతి అలవాటైంది. అక్కడ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్ఛార్జిలే పార్టీకి కేరాఫ్ అడ్రస్!పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేలకు సమాంతరంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బీఆర్ఎస్ చేపట్టలేక పోయింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో తెగించి పోరాడే కార్యకర్తలు కరువయ్యారు. ఈ పరిణామం నగర కార్పొ రేషన్లలో, పెద్ద పట్టణాల్లో స్పష్టంగా కనిపించింది. పార్టీ అధినేత మీద జనసామాన్యంలో ఉండే అభిమానం ఇక్కడ పోలైన ఓట్లలో ప్రతిఫలించలేదు. ఎన్నికలు జరిగిన ఏడు నగర కార్పొ రేషన్లలో పెద్దవైన నిజామాబాద్, కరీంనగర్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని అదిదక్కించుకోవచ్చు. నిజామాబాద్లో బీజేపీ గణనీయంగా 28 డివిజన్లు దక్కించుకున్నప్పటికీ, కాంగ్రెస్ – ఎమ్ఐఎమ్ కలిసి ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే అవకాశాలున్నాయి. ఈ రెండు పట్టణాల్లోనూ బీజేపీకి గట్టి పునాదే ఉన్నది. రెండు పార్లమెంట్ స్థానాలు కూడా ఆ పార్టీవే. బీజేపీ విస్తృత ప్రచార వ్యూహాలతో వోటర్లలో పోలరైజేషన్ సృష్టించి లాభపడింది. ఈ ట్రెండ్కు ఎదురీదేంత సంస్థాగత బలం, నాయకత్వం లేక బీఆర్ఎస్ ఆ మేరకు నష్టపోయింది.కొత్తగూడెం ఫలితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. కాంగ్రెస్తో పొత్తులో కొత్తగూడెం శాసనసభ్యునిగా ఎన్నికైన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తన నాయకత్వ ప్రతిభను ఈ ఎన్నికల్లో చాటుకున్నారు. కాంగ్రెస్తో సమానంగా 22 సీట్లను సీపీఐ గెలిచింది. ఆ పార్టీ మేయర్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికార చాతుర్యం ప్రదర్శించి అడ్డుపుల్లలు వేయకపోతే సీపీఐకి మేయర్ పీఠం ఖాయం. అదే జరిగితే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అదొక శుభసూచకం. ఎందుకంటే, అన్యాయాన్ని ఎదిరించే శక్తులకూ, ప్రశ్నించే గొంతులకూ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కమ్యూనిస్టు పార్టీలు ఆదర్శమే కనుక! మిగిలిన నాలుగు కార్పొరేషన్లు నల్లగొండ, మహబూబ్నగర్, రామగుండం,మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై విజయం సాధించింది.మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఎవరికెన్ని, ఎంత శాతం అనేదానికన్నా వార్డులు, డివిజన్ల సంఖ్య కీలకం. ఎందుకంటే, జనం ప్రత్యక్షంగా ఓటేసి గెలిపించేది వార్డు/ డివిజన్ సభ్యులనే! మునిసిపల్ వార్డుల్లో కాంగ్రెస్కు 1,347, బీఆర్ఎస్కు 716, బీజేపీకి 261, ఇతరులకు 257 లభించాయి. కార్పొరేషన్ల డివిజన్లలో కాంగ్రెస్ 191, బీఆర్ఎస్ 63, బీజేపీ 76, ఇతరులు (సీపీఐ సహా) 83 చోట్ల గెలిచారు. ఇక ఓట్ల శాతానికి వస్తే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపిన లెక్క అందుబాటులో ఉన్నది. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సుమారు 40 శాతం ఓట్లు, బీఆర్ఎస్కు 29 శాతం, బీజేపీకి 16 శాతం, ఇండిపెండెంట్లకు 8 శాతం, ఎంఐఎంకు 3 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం లభించినట్టు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలు ఏకపక్షంగా గెలవడం రివాజుగా మారిన ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రభావం కాంగ్రెస్ చెబుతున్నంత బలహీనంగా ఏమీ లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగతమైన బలహీనతలను అధిగమించగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎంపీపీ, జడ్పీపీ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలనే సాధించే అవకాశాలను కొట్టి పారేయలేము. కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ మంచి విజయాన్ని సాధించినప్పటికీ రెండు కమ్యూ నిస్టు పార్టీలకూ కలిపి రాష్ట్రవ్యాప్తంగా రెండు శాతం ఓట్లుకూడా రాకపోవడం ఒక విషాదం. ఒకప్పుడు మిలిటెంట్ పోరాటాలకు పెట్టింది పేరైన సీపీఎం పార్టీ కేవలం అరశాతం ఓట్లకు మాత్రమే పరిమితం కావడం దాని స్వయంకృతాపరాధమే! ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మాత్రంకాంగ్రెస్ పార్టీ వృద్ధ సింహం తాటిపర్తి జీవన్రెడ్డి గురించే! జగిత్యాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసి ఆయన అనుచరులకే ఎక్కువ భాగం టిక్కెట్లను కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ, జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఆయన దృఢంగా నిలబడిన తీరు రాష్ట్రవ్యాప్తంగా అందరిదృష్టిని ఆకర్షించింది. డబ్బూ, అధికారం తోడు లేకున్నా జీవన్ రెడ్డి చేసిన ఒంటరి పోరాటానికి జగిత్యాల జనం జైకొట్టారు. టికెట్ దొరికిన కార్యకర్తలతో పాటు ఇండిపెండెంట్లుగా నిల బెట్టిన వారితో సహా మొత్తం 18 మందిని గెలిపించుకొని రేస్లో నంబర్ వన్గా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ జీవన్రెడ్డి అనుచ రునికి ఛైర్మన్ పదవిని ఇస్తుందా? లేక అధికారం అండతో మేనేజ్ చేసి ఎమ్మెల్యే మనిషినే ఛైర్మన్ చేస్తుందా అనేది వేరే సంగతి. కానీ జగిత్యాల విన్నర్ మాత్రం జీవన్రెడ్డే!‘నేనే రాజు, నేనే మంత్రి’ అని ముఖ్యమంత్రి ప్రకటించు కోవడం దర్బార్ సంస్కృతి ప్రవేశిస్తుందనడానికి ఒక సూచికే! ఈ ప్రకటనతో ఎంతమంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏకీభవిస్తు న్నారో, ఎంతమంది విభేదిస్తున్నారో తెలియదు. భిన్నాభిప్రా యాలు ఇప్పటికైతే పెదవులు దాటడం లేదు. నాలుగు దశాబ్దాలకాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డున్న జీవన్రెడ్డి తరఫున ఒక్క గొంతు కూడా వినిపించకపోవడం నిజంగా విచిత్రమే. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సరికొత్త సామరస్యమో, తుపాను ముందరి ప్రశాంతతో కొంతకాలం ఆగితే తప్ప తెలియదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా ప్రజలే రాజులన్న సత్యాన్ని గ్రహించక పోతే 2023లో బీఆర్ఎస్కు ఎదురైన అనుభవమే ఎవరికైనా తప్పదు. రాజులూ ప్రజలే! వాళ్లు ఓటేసి కుర్చీలో కూర్చోబెట్టిన ప్రభుత్వ పనితీరును తూకం వేసే తరాజులూ వారే!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బెర్ముడా ట్రయాంగిల్..ముక్కోణపు సుడిగుండం!
ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒకవేళ ఆ బెర్ముడా ట్రయాంగిల్ నిజంగానే వేరే లోకానికి తీసుకెళ్లే ఒక ‘ఆకలిగొన్న ద్వారం’ అయితే, మీరు వెళ్లే క్రూజ్ షిప్పుల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశంలో ఉండేవి. మీ జర్నీ టికెట్ వెనుక ‘మనుషులు మిస్ అయితే మాకు సంబంధం లేదు’ అని బోలెడన్ని కండిషన్లు పెట్టేవారు. కానీ అలాంటిదేం లేదు! అక్కడ ట్రాఫిక్ ఎక్కువ, వాతావరణం అప్పుడప్పుడు కల్లోలంగా ఉంటుంది. దానికి తోడు చిన్న చిన్న మానవ తప్పిదాలు. ఇవన్నీ కలిసి ఆ ఏరియాని ఒక మిస్టరీలా మార్చేశాయి అంతే!... నిజంగా అంతేనా! ఇలా పైపైన చెప్పేస్తే మిస్టరీ కాకుండా పోతుందా? అక్కడేమీ మర్మం లేదని చెప్పేవాళ్లు, మరి ఆ స్పాట్లోకి రాగానే నౌకలు ఎందుకు మునిగిపోతున్నాయో, విమానాలు పిట్టల్లా ఎందుకు రాలిపోతున్నాయో కూడా చెప్పొద్దా?! అవును చెప్పాలి. ‘వాట్ ఇఫ్ సైన్స్’ అనే సంస్థకు చెందిన పరిశోధకుడు రోనాల్ట్ కాపర్ తాజాగా అదే చెబుతున్నారు.మీథేన్ తప్ప మిస్టరీ కాదు!బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఓడలు, విమానాలు మాయమైపోతుంటే ఇన్నాళ్లూ ఏ అతీంద్రియ శక్తులో, లేకుంటే ఏలియన్లో వాటిని మింగేస్తున్నాయని అనుకున్నాం. కాని, అందుకు కారణం మిథేన్ గ్యాస్ అని రోనాల్డ్ కాపర్ బృందం చేసిన పరిశోధన తేల్చేసింది! సముద్రం అడుగుభాగం నుండి అప్పుడప్పుడు మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా బయటికి తన్నుకొస్తుందనీ, ఆ గ్యాస్ ధాటికి ఆ ప్రాంతం మీదుగా వెళ్లే ఓడలు బ్యాలెన్స్ తప్పి మునిగిపోవటం, విమానాల ఇంజన్లు మొరాయించి కూలిపోవటం జరిగి ఉండొచ్చని రోనాల్డ్ బృందం చెబుతోంది. అయితే ఆ గ్యాస్ అప్పట్లో ఎందుచేతనో ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ఉండే అవకాశం చాలా తక్కువని కూడా అంటోంది! లోకం అంతా ఇన్నాళ్లూ దయ్యాల ట్రయాంగిల్ అని భయపడితే, చివరికి అది సముద్రానికి వచ్చిన ‘గ్యాస్ట్రిక్ ట్రబుల్’ అని తేలిపోయిందన్న మాట!త్రిభుజాకార ప్రమాద స్థలిసినిమా భాషల్లో చెప్పాలంటే, ఇది ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉండే ఒక ‘మాయా బజార్’ లాంటి ప్రదేశం. ఫ్లోరిడాలోని మయామీ, బ్రిటన్లోని బెర్ముడా దీవి, ప్యూయెర్టోరికోలోని సాన్జువాన్.. ఈ మూడు పాయింట్లను కలిపితే ప్రత్యక్షమయ్యే పెద్ద ‘ముక్కోణపు సుడిగుండమే’ బెర్ముడా ట్రయాంగిల్. సుమారు 5 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని ఈ అదృశ్య జల అగాధ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించటానికి 500 ఏళ్లుగా మానవాళి సంశయిస్తూనే ఉంది. ఓడల కెప్టెన్ల దగ్గర నుండి, విమాన పైలట్లు, కథలు రాసే రైటర్లు, రీసెర్చ్ చేసే మేధావుల వరకు... అందరూ తలా ఒక థియరీతో, ఎవరి ఊహకు అందినట్లు వారు ఏదో చెప్పారు కాని, ఆనాటి బెర్ముడా ట్రయాంగిల్ ప్రమాదాలకు అసలు కారణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సముద్రం మధ్యలో ఉన్న ఈ ‘నో ఎంట్రీ’ త్రిభుజస్థలి చుట్లూ కోకొల్లలుగా ఎన్నో కథలున్నాయి. అలాగైతే ఇప్పుడీ మీథేన్ గ్యాస్ కూడా ఒక కథే అనుకోవాలా?ఎందుకు మునుగుతున్నాయి!‘డైలీ మెయిల్’ తాజా వార్తా కథనం ప్రకారం, ఈ సరికొత్త మీథేన్ గ్యాస్ సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చినవారే.. రోనాల్డ్ కాపర్. సముద్రం అడుగున గడ్డకట్టుకుపోయిన మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా పెద్ద త్రేన్పుగా బద్దలై బయటకు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే నీటి సాంద్రత తగ్గిపోతుంది. అలా నీరు పల్చబడిపోతే, దాని మీద గంభీరంగా తేలుతూ వెళ్లే ఓడలకి ‘బ్యాలెన్స్’ తప్పుతుంది. ఇంకేముంది, ఏ సంకేతం, హెచ్చరిక లేకుండానే ఓడలు సముద్రం గర్భంలోకి జారిపోతాయి. పోనీ ఆకాశంలో వెళ్లే విమానాలైనా అక్కడ సురక్షితమా అంటే, అదీ లేదట! సముద్రం నుండి విడుదలైన గ్యాస్ గాలిలోకి చేరితే, అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఫలితంగా బాగా దిగువగా విమానం వెళితే కనుక ఇంజన్లు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే, అక్కడ ఏదో శక్తి వచ్చి వాటిని లాగేయడం లేదు. సముద్రం వదిలిన గ్యాస్ వల్ల ఓడలకు, విమానాలకు హఠాత్తుగా, ‘తట్టుకునే శక్తి’ తగ్గి, మునిగిపోతున్నాయి అంటున్నారు రోనాల్డ్, ఆయన బృందం. ఇప్పుడెందుకు అలా లేదు?! అదొక బ్యాడ్ టైమ్ అంటారు రోనాల్డ్. అప్పట్లో బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఈ మీథేన్ గ్యాస్ విస్ఫోటాలు చాలా చురుగ్గా ఉండేవట. కాలక్రమేణా సముద్రం అడుగున ఉండే పరిస్థితులు స్థిమితపడి, ఆ గ్యాస్ లీకేజీలు, అక్కడి వింత వాతావరణం ఇప్పుడు తగ్గిపోయాయని ఆయన చెబుతున్నారు. ‘‘ఇంతకాలం మనం అనుమానిస్తూ వస్తున్నట్లు అక్కడ ఏ ఏలియన్లు లేరు, వేరే లోకానికి వెళ్లే దారులూ లేవు. అదంతా కేవలం ప్రకృతి చేసిన ఒక వింత విన్యాసం’’ అని అంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఓడలు హాయిగా షికార్లు చేయటం లేదు, విమానాలు దర్జాగా ఎగరటం లేదు. కొంత భయమైతే ఉంది. మీథేన్ కథ కూడా గ్యాసేనా?సోషల్ మీడియాలో ఇప్పుడీ రోనాల్డ్ కాపర్ మీథేన్ గ్యాస్ థియరీ వైరల్ అవుతోంది కాని, వాస్తవం అయితే వేరేలా ఉంది. బెర్ముడా ట్రయాంగిల్లో అప్పట్లో నిజంగానే అన్ని గ్యాస్ పేలుళ్లు సంభవించాయా? అని అడిగితే... గట్టిగా సమాధానం చెప్పే సాక్ష్యాలు మాత్రం దాదాపుగా లేవు. అంటే ఇది కూడా ఒక అంచనానేనా?! అమెరికన్ కోస్ట్ గార్డ్లు మొదట్నుంచీ బెర్ముడా ట్రయాంగిల్ ఉనికిని నమ్మటం లేదు. అసలు మ్యాప్లో అలాంటి డేంజర్ జోనే లేదు’’ అని కూడా వారు ఏనాడో తేల్చి చెప్పారు. నేటికీ వీడని ‘సైక్లోప్స్’ మిస్టరీ1918లో అమెరికా నేవీకి చెందిన ‘సైక్లోప్స్’ అనే ఒక భారీ సరుకు రవాణా ఓడ హఠాత్తుగా మాయమైపోయింది. ఆ ఓడలో ఉన్న 306 మంది సిబ్బంది గాలిలో కలిసిపోయినట్లుగా, జాడ లేకుండా పోయారు. కనీసం ఓడ అవశేషాలు కూడా దొరకలేదు. దాంతో ఎవరికి తోచిన కారణం వారు చెప్పుకున్నారు. ఓడ ఓవర్ లోడ్ అయి మునిగిపోయిందని, అందులో ఉన్న మాంగనీసు పేలిపోయిందని, ఓడలో పెద్ద గొడవ జరిగి ఒకర్నొకరు చంపుకున్నారని.. ఇలా రకరకాల కారణాలు వెతుక్కున్నారు. కొందరైతే సముద్రం అడుగున ఉన్న ఏదో ఒక పెద్ద రాక్షస జంతువు వచ్చి ఓడను నమిలేసిందని కూడా ప్రచారం చేశారు. అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది కాబట్టి, జర్మనీ వాళ్లే తమ ఓడను ముంచేశారేమో కూడా అనుమానాలు వచ్చాయి. జర్మనీ మాత్రం ‘‘ఆ ఘటనతో మాకు సంబంధం లేదు’’ అని స్పష్టంగా చెప్పేసింది. మరోవైపు సైంటిస్టులు దాన్నొక సహజ ప్రమాదంగా కొట్టిపడేశారు. అయితే అసలేం జరిగింది అనే దానికి సమాధానం మాత్రం ఎవరి దగ్గరా లేదు. ఆ ఓడ ఏమైందో ఇప్పటికీ ఒక పెద్ద ‘మిస్టరీ’!ఏమైనా, టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇప్పుడు శాటిలైట్లు, సూపర్ వెదర్ రిపోర్టులు అందుబాటులోకి వచ్చాక బెర్ముడా ట్రయాంగిల్లో ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంటే, టెక్నాలజీ ముందు ఈ మిస్టరీలు తోక ముడిచాయని అనుకోవచ్చా?! ఐదు శతాబ్దాల మిస్టరీ!బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ, క్రిస్టోఫర్ కొలంబస్ సముద్రాలపై షికారు చేస్తున్నప్పటి నుంచీ ఉంది. 1492లోనే కొలంబస్ ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఆకాశంలో ఏవో వింత వెలుగులు చూశానని తన డైరీలో రాసుకున్నారు. బహుశా ఆ వెలుగులనే మనం ఏలియన్స్ (గ్రహాంతర జీవులు) అనుకుంటున్నామా? శతాబ్దాల తరబడి ఆ రూట్లో వెళ్లే నావికులు, ‘‘అయ్యా! మా దిక్సూచి ఇక్కడికి రాగానే పిచ్చిపిచ్చిగా తిరుగుతోంది, సడన్ గా తుపానులు వస్తున్నాయి’’ అని చెబుతుండేవారు. అందువల్ల కూడా మెల్లమెల్లగా ఆ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చేసింది. అసలు కథ మాత్రం 1974లో మొదలైంది. చార్లెస్ బెర్లిట్జ్ అనే ఆయన ‘ది బెర్ముడా ట్రయాంగిల్’ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన, ‘‘ఇప్పటి వరకు అక్కడ వెయ్యి మందికి పైగా మనుషులు మాయమైపోయారు!’’ అని ఒక బాంబు పేల్చారు. దాంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది, అప్పటి నుండి ఈ ట్రయాంగిల్ అంటేనే గజగజ వణికిపోవడం మొదలుపెట్టింది. కొలంబస్ చూసిన ఆ ‘లైట్లు’, బెర్లిట్జ్ రాసిన ఆ ‘కథలు’ కలిపి ఈ బెర్ముడా ట్రయాంగిల్ని ఒక గ్లోబల్ సెలబ్రిటీ విలన్ని చేసేశాయి.లాయిడ్స్ ఆఫ్ లండన్ పరిశోధనప్రపంచంలోనే పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ‘లాయిడ్స్ ఆఫ్ లండన్’ వాళ్లు కూడా కొంత పరిశోధన జరిపించి, ‘‘మిగతా సముద్ర ప్రాంతాల్లో ఎంత రిస్క్ ఉందో, అక్కడ కూడా అంతే ఉంది. అక్కడేదో అయిపోతుందని ఊహించకండి, మా పరిశీలన ప్రకారం అక్కడ అంతా మామూలు పరిస్థితులే ఉన్నాయి..’’ అని చాలాకాలం క్రిందటే ప్రకటించారు. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం కొంతమంది రీసెర్చర్లు, మేధావులు, ‘‘ఏంటి బ్రదర్.. అంతా గ్యాస్ అని ఎలా తేల్చేస్తారు, గ్యాస్ కాకపోతే’’ అని రోనాల్డ్ థియరీని వి¿ే దిస్తూ, అది కచ్చితంగా మిస్టరీనే అంటున్నారు. ముఖ్యంగా ఏలియన్స్ గురించి పుస్తకాలు రాసే నైజెల్ వాట్సన్, ‘‘ఎవరి సిద్ధాంతం వారిదే అయితే, అసలు కారణం ఒకటేదో ఉండి ఉంటుంది’’ అంటున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భాగం గ్యాస్ థియరీ నిజమా లేక ఏలియన్స్ నిజమా అన్నది పక్కన పెడితే, జనం ఎప్పుడూ ఏదో ఒక వింతను కోరుకుంటూనే ఉంటారు. అందుకే ఈ ట్రయాంగిల్ కథలు ఇంకా బతికున్నాయి. అయినా ప్రపంచంలో ఇదొక్కటే కాదు కదా ట్రయాంగిల్, మరి మిగతా ట్రయాంగిళ్ల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం లేదు?’’ అని వాట్సన్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బెర్ముడా ట్రయాంగిల్ స్టోరీ ఒక పక్క గ్యాస్, మరో పక్క బాస్ (ఏలియన్స్), ఇంకో పక్క మాస్ (పుకార్లు)ల మధ్య సజీవంగా ఉంటూ వస్తోంది.సాక్షి, స్పెషల్ డెస్క్ -
పరమశివుడి భిక్షు పర్యావతారం
పూర్వం విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు పరిపాలించేవాడు. సత్యరథుడు పేరుకు తగినట్లే సత్యధర్మ పరాయణుడు. మహా శివభక్తుడు. విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు సుభిక్షంగా పాలిస్తుండటం చూసి, సాల్వరాజుకు కన్నుకుట్టింది. ఒకనాడు అతడు విదర్భ రాజ్యంపై దండెత్తాడు. విదర్భ సాల్వ సేనలకు భీకర పోరాటం జరిగింది. సత్యరథుడు కూడా స్వయంగా యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో విదర్భ సేనలు ఓడిపోయాయి. సత్యరథుడు సాల్వరాజు చేతిలో నేలకూలాడు.శత్రుసైన్యం అంతఃపురాన్ని ముట్టడించడానికి వస్తున్నట్లు సత్యరథుడి పట్టపురాణికి సమాచారం తెలిసింది. అప్పటికి ఆమె గర్భవతి. నమ్మకస్తులైన దాసీల సాయంతో ఆమె రహస్యమార్గం గుండా అంతఃపురాన్ని వీడి, అటవీ మార్గంలోకి చేరింది. అడవిలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయంలో తలదాచుకోసాగింది. కొన్నాళ్లకు నెలలు నిండి, ఆమెకు సర్వశుభలక్షణాలు కలిగిన కొడుకు పుట్టాడు. ఆమె ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచుకోసాగింది.ఒకనాడు ఆమె కొడుకును ఆలయంలోనే వదిలి, స్నానం చేయడానికి చేరువలోనే ఉన్న నదికి వెళ్లింది. స్నానం చేస్తుండగా ఆమె మొసలి నోటికి చిక్కింది. మొసలి ఆమెను అమాంతం తినేసింది. ఆలయంలో ఉన్న పసిబాలుడు తల్లి కోసం రోదించసాగాడు. అంతలో కొడుకుని చంకనెత్తుకుని అటుగా వెళుతున్న బ్రాహ్మణ వితంతువు ఆలయం నుంచి వినిపిస్తున్న శిశువు రోదనను గమనించి, ఆలయంలోకి వెళ్లింది. ఏడుస్తున్న బాలుడిని ఎత్తుకుని, అతడికి పాలిచ్చి ఓదార్చింది. అతడు ఎవరి బాలుడో తెలియక, ఆ బాలుడి కోసం ఎవరైనా వస్తారేమోనని ఆమె దిక్కులు చూడసాగింది. అప్పుడు పరమశివుడు భిక్షుక రూపంలో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘తరుణీ! మనసులో శంకలు వీడి ఈ శిశువును కూడా నీ కుమారుడితో పాటే పెంచు. ఇతడి వల్ల నీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది’ అని చెప్పాడు.‘భిక్షుకా! ఇంతకీ ఈ బాలుడెవరు? ఇతడి జన్మవృత్తాంతం ఏమిటి?ఈ పిల్లవాణ్ణి నేను తీసుకువెళితే, రాజభటులు నాపై అపహరణ నేరం మోపి, ఉరితీస్తారేమో! అదే జరిగితే ఈ బాలుడితో పాటు నా శిశువు కూడా అనాథ అవుతాడు’ అని భయంగా పలికిందా బ్రాహ్మణ వనిత.‘తరుణీ! భయపడకు. నేను శంకరుడిని. నా సంకల్పం ప్రకారమే నువ్వు ఇక్కడకు వచ్చావు. నిస్సందేహంగా ఈ బాలుడిని తీసుకువెళ్లి పెంచు’ అని పలికి, ఆ బాలుడి వృత్తాంతమంతా వివరించి తన నిజరూపాన్ని ప్రదర్శించాడు.ఆమె వెంటనే శంకరుడికి పాదాభివందనం చేసింది. ‘పరమేశ్వరా! ఈ పసిబాలుడికి ఇంతటి దుర్గతి కలగడానికి కారణమేమిటి? అలాగే నా కుమారుడు నిరుపేద వితంతువునైనా నా కడపున పుట్టడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించింది.‘తరుణీ! మానవుల జనన మరణాలకు, వారి సుఖదుఃఖాలకు వారు చేసుకున్న కర్మలే కారణం. ఈశ్వరుడిని అయిన నేను ఈ విషయంలో నిమిత్తమాత్రుడను. ఈ రాకుమారుడి తండ్రి సత్యరథుడు గత జన్మలో రాజుగా పాలిస్తూ, ముందు వెనుకలు విచారించకుండా తన సామంతరాజును ఉరితీయించాడు. ఈ జన్మలో అదే సామంతరాజు చేతిలో హతమయ్యాడు. ఇతడి తల్లి గత జన్మలో తన సవతిని విషప్రయోగంతో చంపించింది. ఇక నీ కుమారుడు గత జన్మలో బ్రాహ్మణుడై, ఆశ్రమధర్మాలను విడనాడి నీచులైన వారి వద్ద నీచ ద్రవ్యాన్ని దానాలుగా స్వీకరించి, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోకుండా జీవించాడు. అందుకే ఇప్పుడిలా జన్మించాడు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.ఆ తర్వాత బ్రాహ్మణ స్త్రీ ఇద్దరు బాలకులను తీసుకుని ఏకచక్రపురానికి చేరుకుంది. అక్కడ నివాసం ఉంటూ ఇద్దరు బాలురను అల్లారుముద్దుగా పెంచసాగింది. తగిన వయసు రాగానే ఇద్దరికీ ఉపనయనాది సంస్కారాలను జరిపించింది. వారికి నిత్యం శివలీలలను వినిపిస్తూ, వారిచేత శివలీలలను గానం చేయిస్తూ, ఇద్దరినీ శివభక్తులుగా తీర్చిదిద్దింది. కొన్నాళ్లకు ఇద్దరు బాలకులను ఒక గురువు వద్ద గురుకులంలో చేర్చింది. బ్రాహ్మణ బాలకుడికి బ్రాహ్మణోచిత విద్యలలోను, క్షత్రియ బాలకుడికి క్షత్రియోచిత విద్యలలోను శిక్షణ ఇప్పించింది. ఇద్దరు బాలకులూ గురువు వద్ద వినయ విధేయతలతో మెసలుకొంటూ శీఘ్రంగానే సమస్త విద్యలనూ నేర్చుకున్నారు. యుక్తవయసు రాగానే బ్రాహ్మణ బాలకుడు తగిన కన్యను వివాహం చేసుకుని, ఏకచక్రపురం రాజు వద్దనే రాజ పురోహితుడిగా కుదురుకున్నాడు.క్షత్రియ కుమారుడు ఆ బ్రాహ్మణ కుమారుడి సాయంతో రాజాశ్రయం సంపాదించాడు. తన వృత్తాంతం చెప్పి, రాజును సైనిక సహాయం అర్థించాడు. రాజు సమకూర్చిన సైన్యంతో తన తండ్రిని హతమార్చిన సాల్వరాజుపై యుద్ధం ప్రకటించాడు.యుద్ధంలో సాల్వరాజును అంతం చేసి, తన తండ్రి పరిపాలించిన విదర్భ దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. విదర్భ రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత «సత్య ధర్మాలను తప్పకుండా జనరంజకంగా పరిపాలన కొనసాగించాడు.∙సాంఖ్యాయన -
అదే నా ఐడేంటిటీ
సింపుల్గా కనిపిస్తుంది. కాని, సీరియస్ డెసిషన్స్ తీసుకోవడం బాగా తెలుసు ఈ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకి. అందుకే, గ్లామర్ ట్యాగ్స్కి దూరంగా, పెర్ఫార్మెన్స్ రోల్స్కి దగ్గరగా ఉంటూ, చాలా జాగ్రత్తగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే.. ⇒ నేను వరంగల్లో పుట్టాను. హైదరాబాద్లో పెరిగాను. ఎంబీఏ చేశాను. కాలేజీలో ఉండగానే మోడలింగ్ చేసేదాన్ని. ఫేస్బుక్లో నా ఫోటోలు చూసిన ఇంద్రగంటి మోహనకృష్ణ నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు.⇒ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ నా మొదటి సినిమా. కాని, ‘అంతకు ముందు ఆ తరువాత’ నన్ను హీరోయిన్ గా గుర్తింపునిచ్చిన సినిమా. గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ ముఖ్యమని అప్పుడే అర్థమైంది.⇒ హీరోయిన్ అవ్వకముందు నా రోజు చాలా బిజీగా ఉండేది. ఉదయం కాలేజీ, మధ్యాహ్నం సాఫ్ట్వేర్ జాబ్, సాయంత్రం ఇంకో పని. అప్పుడే హార్డ్ వర్క్ అలవాటు అయిపోయింది.⇒ ‘అ!’ సినిమాలో లెస్బియన్ పాత్ర చేశాను. చాలామంది షాక్ అయ్యారు. కాని, నేను మాత్రం కొత్తగా ట్రై చేయాలనే ఫీలింగ్తో ఎంతో ఎంజాయ్ చేశాను. రిస్క్ తీసుకోకపోతే గ్రోత్ ఉండదు కదా.⇒ నేను తెలంగాణ అమ్మాయినే. కాని, ‘ఓం శాంతి శాంతిః’ సినిమా కోసం తూర్పు గోదావరి యాసలో మాట్లాడాను. యాస మారడం నాకు సరదానే. అదే సినిమాలోని ఒక సీన్ కోసం నిజంగానే హీరో నా చెంపపై కొట్టారు. ఆ సీన్ లో కనిపించే కన్నీళ్లు యాక్టింగ్ కాదు. నా ప్యూర్ రియాక్షన్.⇒ కెరీర్ మొదట్లో నా రంగు గురించి, లుక్స్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. అప్పట్లో చాలా బాధపడ్డాను. ఇప్పుడు మాత్రం నా రంగుపై నాకు పూర్తి గౌరవం ఉంది. అదే నా ఐడెంటిటీ.⇒ రిలేషన్ షిప్ రూమర్స్ వస్తూనే ఉంటాయి. నేను ఒక వ్యక్తికి దగ్గరగా ఉన్న మాట నిజమే. పెళ్లి గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. సరైన సమయం వస్తే నేనే చెప్తాను.⇒ కాఫీ లేకుండా నా రోజు ప్రారంభం కాదు. ఖాళీ దొరికితే ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లడం నాకు చాలా ఇష్టం.⇒ ఫిట్నెస్ నాకు సీరియస్ విషయం. యోగా, జిమ్, కిక్బాక్సింగ్ రెగ్యులర్. స్ట్రాంగ్గా ఉండాలంటే కష్టపడాల్సిందే అని నమ్ముతాను.⇒ ఎప్పటికైనా సరే మహిళా ప్రాధాన్యం ఉన్న చరిత్రాత్మక పాత్ర ఒకటి చేయాలన్న కల నన్ను వెంటాడుతోంది. -
విదేశాల్లో విశ్వనాథుడు
త్రిమూర్తులలో ఒకడైన శివుడు త్రినేత్రుడు. శంకరుడైన శివుడు భక్తవశంకరుడు. అతడే విశ్వనాథుడు. శివారాధన భారత భూభాగానికి మాత్రమే పరిమితం కాదు. పురాతన కాలం నుంచి కొన్ని ఇతర దేశాల్లోనూ శివారాధన ఉండేది. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఆ దేశాల్లో ఆనాటి శివాలయాలు ఉన్నాయి.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విదేశాల్లో ఉన్న కొన్ని పురాతన శివాలయాల గురించి తెలుసుకుందాం.పశుపతినాథ్ ఆలయంమన పొరుగు దేశమైన నేపాల్ రాజధాని కఠ్మాండు శివార్లలో బాగ్మతి నదీతీరంలో ఈ ఆలయం ఉంది. పురాతన శైవక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం గురించిన ప్రస్తావన పలు పురాణ, చరిత్ర గ్రంథాలలో కూడా ఉంది. ‘గోపాలరాజ వంశావళి’ ప్రకారం దీనిని ప్రచండ దేవ కట్టించాడు. పురాణ గ్రంథాల్లోని ఆధారాల ప్రకారం క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. వనవాస కాలంలో పాండవులు ఇక్కడ వెలసిన పశుపతినాథుడిని దర్శించుకున్నట్లు ‘కోటి రుద్రసంహిత’ కథనం. నేవారీ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ఏటా మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి.ప్రాంబనన్ ఆలయ సముదాయంపురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం ఇండోనేసియా రాజధాని యోగ్యకర్తా ప్రత్యేక ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంగణంలో త్రిమూర్తుల ఆలయాలు ఉన్నాయి. వీటిలో అతి ఎత్తయిన గోపురం ఉన్నది శివాలయం. ఈ ప్రాంగణంలో శివాలయమే ప్రధానమైనది. ఈ ఆలయాలు క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్ది నాటివి. ఇప్పటి జావా ద్వీపం కేంద్రంగా ఏర్పడిన మాతరం రాజ్యాన్ని ఏలిన రాజులు ఈ ఆలయాలను నిర్మించారు. రాజు రాకాయి పికాతన్ క్రీస్తుశకం 850 ప్రాంతంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పాలించిన రాజులు లోకపాల, బలితుంగ మహాశంభు దీనిని విస్తరించారు. ఇందులోని శివాలయాన్ని 856లో ప్రారంభించినట్లు శాసనాధారాలు ఉన్నాయి.మై సన్ సాంక్చుయరీఇది వియత్నాంలో ఉంది. పురాతన చంపా నాగరికతకు చెందిన చామ్ రాజవంశీకులు శివారాధకులు. వారు క్వాన్ నామ్ ప్రావిన్స్లో దాదాపు డెబ్బయి శివాలయాలను నిర్మించారు. ఈ ఆలయాలు క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నుంచి పదమూడో శతాబ్ది మధ్యకాలంలో నిర్మించినవి. వీటిలో చంపా రాజు భద్ర వర్మ నిర్మించిన భద్రేశ్వర ఆలయం ప్రధానమైనదిగా పరిగణిస్తారు. ఆనాటి చంపా రాజ్య రాజధాని ట్రా కీయు నుంచి దక్షిణాన హోయి అన్ వరకు దాదాపు ముప్పయ్యారు కిలోమీటర్ల మార్గంలో ఈ పురాతన ఆలయాలను నిర్మించారు. వీటిని ఇటుకలతో నిర్మించడం విశేషం. ఈ ఆలయాలను చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.మున్నేశ్వరం ఆలయంపురాతనమైన ఈ శివాలయం శ్రీలంకలోని పుట్టాళం జిల్లా మున్నేశ్వరం గ్రామంలో ఉంది. వెయ్యేళ్లకు పైబడిన ఈ ఆలయానికి రామాయణంతో ముడిపెట్టే గాథలు స్థలపురాణాలుగా ప్రచారంలో ఉన్నాయి. శ్రీలంకలోని ఐదు పురాతన శైవక్షేత్రాలైన ‘పంచ ఈశ్వరం’ క్షేత్రాలలో మున్నేశ్వరం ఒకటి. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై సరైన ఆధారాలు లేవు. అయితే, క్రీస్తుశకం 1412లో కొట్టె రాజ్యాన్ని పాలించిన పరాక్రమ బాహు ఈ ఆలయాన్ని తొలిసారి పునరుద్ధరించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. పదహారో శతాబ్దిలో పోర్చుగీసు సేనల దాడిలో ఈ ఆలయం దెబ్బతింది. ఆ తర్వాత కాండ్యన్ రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహ పద్దెనిమిదో శతాబ్దిలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.ప్రీహ విహార్పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం కాంబోడియాలో ఉంది. కాంబోడియా– థాయ్లండ్ సరిహద్దుల్లోని డాంగ్రేక్ పర్వతశ్రేణులలోని నిటారుగా ఉన్న కొండ మీద దాదాపు ఎనిమిది వందల మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రీహ విహార్ ఆలయ సముదాయం క్రీస్తుశకం పదకొండో శతాబ్ది నాటిది. ‘ప్రీహ విహార్’ అంటే దేవతల విహార స్థలం అని అర్థం. ఖ్మేర్ రాజులు మొదటి సూర్యవర్మ, రెండో సూర్యవర్మ ఇక్కడ శిఖరేశ్వర, భద్రేశ్వర అనే శివాలయాలను నిర్మించారు. వీటి చుట్టూ అనేక ఉపాలయాలను కూడా నిర్మించారు. నిటారుగా ఉన్న కొండ మీద గల ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 163 ఎత్తయిన మెట్లతో కూడిన మార్గం ఒక్కటే శరణ్యం. పర్యాటకులు పెద్దసంఖ్యలో ఈ ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు. -
నలుపు మెరుపు
స్ట్రాబెర్రీలు సాధారణంగా ఎర్రగా ఉంటాయి. జపాన్లో పండించే అరుదైన తెల్లని స్ట్రాబెర్రీలు కూడా కొందరికి తెలుసు. తాజాగా చైనాలో పండే ఈ నల్లని స్ట్రాబెర్రీలు జనాలకు నోరూరిస్తున్నాయి. ఇవి సాధారణ స్ట్రాబెర్రీల కంటే చాలా గాఢమైన రంగులో ఉంటాయి. వీటి పైనుండే తొక్క దాదాపు నల్లగా ఉంటుంది. లోపలి గుజ్జు కూడా గాఢమైన ఎరుపు, ఊదా రంగుల్లో ఉంటుంది. మిగిలిన రకాలకు చెందిన స్ట్రాబెర్రీల కంటే ఇవి చాలా తియ్యగా ఉంటాయి. సాధారణ స్ట్రాబెర్రీల కంటే వీటిలో దాదాపు ఇరవై శాతం చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఏమాత్రం పులుపు లేకుండా చాలా తీపిగా ఉంటాయి. చైనాలో వీటిని పదేళ్ల కిందట ప్రయోగాత్మకంగా పండించారు. ఇటీవల ఇవి అంతర్జాతీయ మార్కెట్కు చేరి, రుచులూరిస్తున్నాయి. ‘బ్లాక్ పర్ల్’ పేరుతో విక్రయిస్తున్న ఈ నల్లని స్ట్రాబెర్రీల ధర తెలుసుకుంటే మాత్రం కళ్లు తిరగడం ఖాయం. ఈ రకం స్ట్రాబెర్రీ ఒక్కో పండు ధర 6 డాలర్లు (రూ.550) మాత్రమే! సాధారణ స్ట్రాబెర్రీల కంటే భిన్నమైన రంగులో ఉన్నందున వీటిపై అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు.వీటిని పండించడంలో జన్యుమార్పిడి పద్ధతులేవీ ప్రయోగించలేదని చైనీస్ వ్యవసాయ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ‘యాంథోసైనైన్’ అనే పదార్థం ఎక్కువగా చేరడం వల్లనే ఈ పండ్లకు గాఢమైన రంగు ఏర్పడుతోందని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఉద్యాన విభాగం ప్రొఫెసర్ లి బింగ్బింగ్ చెబుతున్నారు. చైనాలో వీటిని ముద్దుగా ‘బిజిన్ హిమె’ (అందాల యువరాణి) అని పిలుచుకుంటున్నారు. -
అవి ఉంటే చాలు రెడీ!
హీల్స్ లేకపోయినా స్టయిల్ తగ్గదు, హెవీ మేకప్ లేకపోయినా గ్లామర్ మిస్ కాదు! అదే నటి సయామీ ఖేర్ మ్యాజిక్. ఫ్యాషన్ రూల్స్ కంటే కంఫర్ట్ని సీరియస్గా తీసుకునే ఆమె స్టయిలింగ్ సీక్రెట్స్ ఇప్పుడు మీకోసం..డ్రెస్.. బ్రాండ్: పునీత్ బలానా ధర రూ. 47,700జ్యూలరీ బ్రాండ్: అమ్రపాలీ జ్యూయెల్స్ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.ఫ్యాషన్ అంటే కాపీ కాదు, కంఫర్ట్. సంప్రదాయ, పాత ఫ్యాషన్ రూల్స్కు నేను బానిసను కాదు. నచ్చిన రంగు, నచ్చిన దుస్తులను ఆత్మవిశ్వాసంతో వేసుకోవడమే నా స్టయిల్. ఒక బ్లాక్ డ్రెస్, మంచి జీన్స్, సింపుల్ డైమండ్ ఇయర్రింగ్స్ ఉంటే చాలు, నేను ఎక్కడికైనా వెళ్లిపోతాను. – సయామీ ఖేర్
