breaking news
-
బీఆర్ఎస్ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతోందో తెలుసుకో కేటీఆర్: పొంగులేటి
సాక్షి, ఖమ్మం జిల్లా: జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సంగతి తెలుస్తుందంటూ కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతుందో కేటీఆర్ తెలుసుకోవాలన్న పొంగులేటి.. రెండుసార్లు బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు‘‘మీ కుటుంబ సమస్యలను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇటీవల ఒక మహిళ ఎమ్మెల్యే ప్రమాదంలో మృతి చెందినప్పుడు జరిగిన ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నో స్థానంలో ఉందొ లెక్క పెట్టుకో....త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ పార్టీ స్థానం ఎక్కడ వుంటుందో ఆలోచించుకో. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఏంటో చూసుకో.. నీ దయా దాక్షిణ్యాలతో బీ ఫామ్ తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కేసీఆర్.. పాలేరు వచ్చి ముక్కు నేలకు రాసినా ఏం చేయలేక పోయాడు నువ్వెంత’’ అంటూ కేటీఆర్పై పొంగులేటి మండిపడ్డారు. -
ఆ హీరోను ఇష్టపడ్డా.. చెల్లి అని పిలిచాడు: హీరోయిన్
హీరోయిన్ మహేశ్వరి (Actress Maheswari) గుర్తుందా? ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించింది. ఇటీవల ఆమె జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి హాజరైంది. ఈ సందర్భంగా ఓ హీరోపై తనకున్న క్రష్ను బయటపెట్టింది. మహేశ్వరి మాట్లాడుతూ.. 'హీరో అజిత్ కుమార్ అంటే నాకు క్రష్. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. తనతో రెండు సినిమాలు చేశాను. షూటింగ్ చివరి రోజు..ఓ మూవీ షూటింగ్ సాగదీయడం వల్ల ఏడాదిన్నర పాటు తనతో కలిసి పని చేశాను. అంతా అయ్యాక షూటింగ్ చివరి రోజు ఊహించనిది జరిగింది. అసలే ఆయన్ను మళ్లీ కలవలేనని బాధపడుతూ కూర్చున్నాను. ఇంతలో అజిత్ నా దగ్గరకు వచ్చి మహి, నువ్వు నా చెల్లెలిలాంటిదానివి. నీ జీవితంలో ఎప్పుడు, ఏం అవసరమొచ్చినా దయచేసి నన్ను అడుగు.. నేను నీకోసం ఉన్నాను అని చెప్పాడు. అలా నా క్రష్ నన్ను చెల్లి అని పిలిచాడు' అని గుర్తు చేసుకుంది.సినిమామహేశ్వరి.. 1994లో కరుత్తమ్మ సినిమాతో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి కాపురం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. గులాబి సినిమాతో సెన్సేషన్ అయింది. దెయ్యం, పెళ్లి, ప్రియరాగాలు, మా బాలాజీ, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ.. ఇలా అనేక సినిమాలు చేసింది. అజిత్తో ఉల్లాసం, నేశం సినిమాల్లో నటించింది. రెండున్నర దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కొంతకాలం పాటు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన ఆమె ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తోంది.చదవండి: ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి -
ఆ ఆరోపణలు తప్పు.. అదానీకి సెబీ క్లీన్ చిట్
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్నకు, దాని చైర్మన్ గౌతమ్ అదానీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై వివరణాత్మక దర్యాప్తు తర్వాత అవి పూర్తీగా నిరాధారమైనవని సెబీ రెండు వేర్వేరు వివరణాత్మక ఉత్తర్వులలో తెలిపింది.హిండెన్ బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలతో ఒక నివేదికను వెల్లడించింది. అడికార్ప్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మైల్ స్టోన్ ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వార్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను వాడుకుని పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలైన అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లకు నిధులు సమకూర్చడానికి వివిధ అదానీ గ్రూప్ కంపెనీల నుండి నిధులను మళ్లించారని ఆరోపించింది.అయితే అదానీ గ్రూపుపై ఈ అభియోగాలను సెబీ కొట్టేసింది. అదానీ గ్రూప్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన గౌతమ్ అదానీ.. పడిన ప్రతిసారి మరింత గట్టిగా పైకి లేస్తామన్నారు. తమ సంస్థను నష్టపరిచేందుకు కొన్ని వర్గాల మీడియా స్వార్థ ప్రయోజనం కోసం ఆరోపణలు చేసిందని వెల్లడించారు. -
పైరసీ భూతం.. జియోస్టార్ కొత్త ప్రయత్నం!
పైరసీ.. చిత్ర పరిశ్రమను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న చీడపురుగు. వేల మంది కష్టాన్ని మింగేస్తూ.. కోట్ల రూపాయాల వ్యాపారానికి నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా విడుదలైన ఒకటి, రెండు రోజుల్లోనే సోషల్ మీడియాలో పైరసీ కాపీలు ప్రత్యక్షమవుతున్నాయి. కరోనా తర్వాత ఓటీటీ వాడకం పెరగడంతో కొన్నాళ్ల పాటు నివురు గప్పిన నిప్పులా ఉన్న పైరసీ భూతం ఇప్పుడు మళ్లీ జడలు విప్పింది. వందల కోట్లతో నిర్మించిన చిత్రాలు.. రిలీజైన రోజే పైరసీ వెబ్సైట్లలో ప్రత్యేక్షం అవుతున్నాయి. దీని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. టాలీవుడ్లో ఇటీవల రిలీజైన మిరాయ్ చిత్రాన్ని సైతం ఈ పైరసీ బూతం వదల్లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థ జియోస్టార్ పైరసీ అడ్డుకట్టకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. స్ట్రీమింగ్ రైట్స్తో పాటు అన్ని హక్కులను కొనుగోలు చేసిన ఓ బాలీవుడ్ మూవీని పైరసీ నుంచి కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ధర్మాసనం.. 72 గంటల్లోగా పైరసీ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.రిలీజ్కు ముందే..బాలీవుడ్లో కామెడీ ఆధారంగా రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా జాలీ ఎల్ఎల్బీ, జాలీ ఎల్ఎల్బీ 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ తర్వా త ఈ సిరీస్లో మూడో చిత్రంగా వస్తున్న చిత్రం జాలీ ఎల్ఎల్బీ 3. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సీనియర్ నటుడు అర్హద్ వార్సీ, సౌరబ్ శుక్లా, అమృత రావు, హ్యుమా ఖురేషి, బోమన్ ఇరానీ, సీమా బిశ్వాస్, గజరాజ్ రావు, రామ్ కపూర్, అన్ను కపూర్ కీలక పాత్రలు పోషించారు. అలోక్ జైన్, అజిత్ అంధారి నిర్మించిన ఈ కామెడీ లీగల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన జియోస్టార్..ఈ సినిమాని అక్రమంగా స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. పైరసీ చేస్తున్న సుమారు 20 వెబ్సైట్లకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ..వాటిని బ్లాక్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.72 గంటల్లోగా బ్లాక్ చేయాలివిచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆ 20 వెబ్సైట్లకు సంబంధించినడొమైన్ రిజిస్ట్రేషన్లను 72 గంటల్లోపు నిలిపివేయాలని డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లు (DNRలు), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికమ్యూనికేషన్స్ విభాగంతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. అంతేకాదు సినిమా విడుదలకు ముందు లేదా విడుదల సమయంలో కనుగొనబడిన అదనపు పైరసీ వెబ్సైట్ల వివరాలను తెలియజేయడానికి జియోస్టార్కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, వాటిని కోర్టు ఆదేశాలు లేకుండానే బ్లాక్ చేయొచ్చని తీర్పులో వెల్లడించింది. తప్పుగా బ్లాక్ చేస్తే..కోర్టును సంప్రదించి, సవరించుకోవచ్చుననని ఆదేశాలు జారీ చేసింది. పైరసీ వెబ్సైట్లలనో సినిమాను ప్రసారం చేయడం వల్ల నిర్మాతల ఆదాయం గణనీయంగా తగ్గుతుందని, కోలుకోలేని నష్టాన్ని నివారించడానికి త్వరిత జోక్యం అవసరమని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. తదుపరి విచారణనను వచ్చే ఏడాది జనవరి 20కి వాయిదా వేసింది. -
గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్.. ఇదే ప్రధాన లక్ష్యం
మహిషి సంహారం కోసం ఈ లోకంలో ఉద్భవించిన హరిహర పుత్రుడు అయ్యప్పకు కేరళ సర్కారు ప్రపంచ వ్యాప్త పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గల్ఫ్లోని అబుధాబి సహా.. వేర్వేరు దేశాల్లో ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయాలున్నా.. అమెరికా నుంచి ఆచంట వరకు అయ్యప్ప భక్తులు ఏటా శబరిగిరీశుడిని దర్శించుకుంటున్నా.. కేరళలోని శబరి కొండపై కొలువుదీరిన అయ్యప్పను విశ్వవ్యాప్తం చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)తో కలిసి సంకల్పించింది. ప్రభుత్వాలు శబరిమలను ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారంటూ ఇంతకాలం కొనసాగుతున్న అపవాదులను తుడిచిపెట్టేందుకు కేరళ సర్కారు ప్రపంచ అయ్యప్ప భక్తులను ఏకం చేస్తోంది. ఏటా మండల, మకరవిళక్కు సీజన్లలో శబరిమలకు వచ్చే భక్తుల సాధకబాధకాలను వినేందుకు తొలిసారి ‘గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్’ (global ayyappa conclave) పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తోంది. దేవుడు అంటే నమ్మకం లేని, కరడుగట్టిన కమ్యూనిస్టుగా పేరున్న కేరళ సీఎం పినరయి విజయన్ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపడం గమనార్హం..!ఎన్నారైలు మొదలు.. సామాన్యులకూ ఆహ్వానం3 వేల మంది అయ్యప్ప భక్తులకు సరిపడేలా పంపానది తీరంలో టీడీబీ, కేరళ సర్కారు భారీ కాన్క్లేవ్కు ఏర్పాట్లు చేశాయి. భారతీయులు స్థిరపడ్డ దాదాపు అన్ని దేశాలకు చెందిన అయ్యప్ప భక్తులను ఈ వేడుకకు ఆహ్వానించాయి. ఇక సామాన్య భక్తులకు కూడా చాలా సులభంగా అవకాశం కల్పించి, పాసులను జారీ చేశాయి. శబరిమల వర్చువల్ క్యూ వెబ్సైట్ ద్వారా ఏటా ఏదో ఒక సీజన్లో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకైతే.. సెల్ఫోన్లకు సందేశాలు పంపి మరీ ఆహ్వానించాయి. ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి, ఐడీకార్డులను జారీ చేశాయి. అలా ఐడీకార్డులు డౌన్లోడ్ చేసుకున్న వారికి పేరుపేరునా ఫోన్ చేసి.. ‘‘మీరు తప్పకుండా వస్తున్నారు కదా? సెప్టెంబరు 20వ తేదీన మీరు ఉండాల్సిందే.. ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరిచిపోవొద్దు’’ అని కాన్క్లేవ్ తేదీని గుర్తుచేస్తున్నాయి. అయ్యప్ప ముందు అందరూ సమానమే అన్నట్లుగా.. సామాన్య భక్తులకు కూడా సభాస్థలి వద్ద ముందు వరసలో చోటు కల్పించాయి.ఇప్పుడే ఎందుకు?ఇప్పుడే ప్రభుత్వం, టీడీబీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తులను కేటగిరీలుగా విభజించి, ఆదాయమార్గంగా మలచుకోవాలనేదే పినరయి సర్కారు ప్లాన్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ‘‘ఇది ఆరంభమే. సెక్యూలరిజాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మాకు అంతా సమానమే. త్వరలో మైనారిటీలకూ గ్లోబల్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తాం’’ అని చెబుతోంది.ఇదే ప్రధాన లక్ష్యంశబరిమల అయ్యప్ప స్వామి కీర్తిని ప్రపంచానికి చాటడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీబీ, ప్రభుత్వం చెబుతున్నాయి. అదే సమయంలో ఏటా మాసపూజలు, ఓనం, మండల, మకరవిళక్కు(మకరజ్యోతి) సీజన్లో అయ్యప్ప కొండకు వచ్చే భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే ధ్యేయమని వివరిస్తున్నాయి. అయ్యప్ప భక్త సంఘాల ప్రతినిధులు చెప్పే సమస్యలను శ్రద్ధగా విని, రాబోయే సీజన్ నుంచే వాటిని పరిష్కరించనున్నట్లు పేర్కొంటున్నాయి. శబరిమల అభివృద్ధికి ఇటీవలి బడ్జెట్లో రూ.1,300 కోట్ల కేటాయింపు మొదలు.. కేంద్రం ఆమోదించిన రోప్వే ప్రాజెక్టు, పథనంతిట్టలో కొత్త విమానాశ్రయానికి, రైల్వే మార్గానికి చేస్తున్న ఏర్పాట్లు, త్వరలో పరిచయం చేయనున్న హెలిట్యాక్సీలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు వివరించనున్నట్లు కేరళ పర్యాటక శాఖ చెబుతోంది.స్వాగతం ఇలా..ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తులకు పథనంతిట్ట జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం స్వాగతం పలుకుతుంది. శబరిమలకు దారితీసే మార్గాలు- సీతాథోడ్, పెరునాడ్, పంపా ప్రాంతాల్లో స్వాగత వేదికలను ఏర్పాటు చేసింది. కేఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో భక్తులకు వసతి సదుపాయాలను సిద్ధం చేసింది. ఆహూతులందరికీ సెప్టెంబరు 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అయ్యప్ప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి హిల్ టాప్ వద్ద పార్కింగ్ సదుపాయం ఉంటుంది. పంపా వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ప్రారంభించింది. ఇక పారిశుద్ధ్యం మొదలు.. తాగునీటి సదుపాయం, భోజనాలు వంటి ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తును సిద్ధం చేసింది.బాలారిష్టాలెన్నెన్నో..గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్ అనే భావన తెరపైకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. అయితే.. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఉంటుందని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సుకుమారన్ నాయర్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ కోర్టు మెట్లెక్కారు. దీని వల్ల రాణి ఫారెస్ట్, పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్లలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలతో కేరళ హైకోర్టు ఏకీభవించడంతో.. ఓ దశలో కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. కేరళ సర్కారు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.చదవండి: రూ.కోటి వ్యయంతో అతి పురాతన వైష్ణవాలయానికి పూర్వవైభవంపందళ రాజకుటుంబం దూరంగ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్కు తాము దూరంగా ఉంటున్నట్లు పందళం రాజకుటుంబం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో పందళ రాజమాత మృతి చెందిన నేపథ్యంలో.. ఈ నెల 27 వరకు తాము దైవదర్శనానికి రాకూడదని పందళం ప్యాలెస్ మేనేజ్మెంట్ కమిటీ వెల్లడించింది. తాము కార్యక్రమాన్ని వారం రోజులు వాయిదా వేయాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది. దీంతో.. నీలక్కల్ను దాటి తాము పంపావైపు రాలేమని తెలిపింది.శబరిమల అభివృద్ధికి దోహదం: ఎస్.శ్రీజిత్, అదనపు డీజీపీ''గ్లోబల్ కాన్క్లేవ్ ద్వారా శబరిమల అభివృద్ధికి కీలక ముందడుగు పడుతుంది. ఇది భవిష్యత్ని ఉద్దేశించి చేపట్టిన ఓ ప్రాజెక్టు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్రంగా చర్చిస్తాం. మున్ముందు అయ్యప్ప కీర్తిని ప్రపంచానికి చాటేలా కృషి చేస్తున్నాం.''అయ్యప్ప అందరివాడు: నాగ మల్లారెడ్డి, గురుస్వామి''అయ్యప్ప ముందు అందరూ సమానమే. స్వామి దగ్గర తరతమబేధభావాలుండవు. ఆయన అందరివాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలవాడు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.''స్వామి మహిమలెన్నెన్నో: వైవి సుబ్బారెడ్డి, గురుస్వామి(కడప)''అయ్యప్ప మహిమలు ఎన్నో.. ఎన్నెన్నో..! నమ్మినవారి కొంగు బంగారం ఆ మణికంఠుడు. ఉదాహరణకు ఎరుమేలి నుంచి పంపాకు పెద్దపాదం మార్గం(45 కిలోమీటర్లు) ఎత్తైన కొండల మీదుగా ఉంటుంది. కఠిన దీక్షలు చేసి, భక్తిప్రపత్తులతో వస్తున్న వారికి ఈ దూరం ఒక లెక్కే కాదు. అలాంటి వారు ఏ మాత్రం అలసట లేకుండా వనయాత్రను పూర్తిచేసుకుంటారు. భక్తితో కాకుండా.. బలముందనే అహంకారంతో వచ్చేవారు 2 కిలోమీటర్లు నడిచినా.. 15 కిలోమీటర్ల దూరం నడిచామా? అనే భావన కలుగుతుంది. భక్తులకు కరిమల కొండ కఠిన పరీక్షలు పెడుతుంది. వాటిని అధిగమించి, స్వామిని చేరేవారి జన్మ ధన్యం.'' -
మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ.. పవర్ఫుల్ టీజర్ వచ్చేసింది
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫుల్ యాక్షన్ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వృషభ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.టీజర్ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా టీజర్ను మరో రేంజ్కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు. కత్తితో ఫైట్ చేస్తున్న సీన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్ల నిర్మించారు. ఇంకెందుకు ఆలస్యం వృషభ టీజర్ చూసేయండి. -
దుబాయ్ లాంటి దేశం.. చాలా తక్కువ ఖర్చుతో వీసా
దుబాయ్ అంటే చాలా మంది భారతీయ పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానం. అయితే దుబాయ్ కు ప్రత్యామ్నాయంగా బహ్రెయిన్ దేశాన్ని చూస్తారు. ఇక్కడి వాతావరణం నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉంటుంది. మనామాలో శతాబ్దాల నాటి కోటల పక్కన మెరిసే గాజు టవర్లను చూడవచ్చు. ఉదయం పూట సూక్ లో విక్రయించే ముత్యాలను బేరమాడి కొనుక్కోవచ్చు. మధ్యాహ్నం బీచ్ ఐలండ్లో సేద తీరవచ్చు. సూర్యాస్తమయం సమయంలో అరేబియన్ గల్ఫ్ మెరుపులను చూడవచ్చు. కుటుంబాలతో వచ్చినా, జంటగా వచ్చినా లేదా వ్యాపార పనుల మీద వచ్చినా ఇక్కడి అందాలను ఆస్వాదించవచ్చు.బహ్రెయిన్కు వీసా అవసరమా?అవును.. బహ్రెయిన్ సందర్శనకు వీసా అవసరం. భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా బహ్రయిన్లోకి ప్రవేశించలేరు. వీసా పొందడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి ఈ-వీసా (ముందస్తుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి). మరొకటి వీసా ఆన్ అరైవల్ (అర్హత ఉన్నట్లయితే విమానాశ్రయం వద్ద పొందవచ్చు). రెండింటికీ చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్, రిటర్న్ ఫ్లైట్ టికెట్, తగినంత నిధులు ఉండాలి. అయితే ఈ వీసాలపై అక్కడ పనిచేసుకోవడానికి మాత్రం అనుమతి ఉండదు.ఆన్ లైన్ వీసా ఫీజులు• 2 వారాల సింగిల్ ఎంట్రీ — 10.000 బెహ్రెయినీ దినార్లు (రూ.2,336)• 3 నెలల మల్టిపుల్ ఎంట్రీ — 17.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 3,972)• 1 సంవత్సరం మల్టిపుల్ ఎంట్రీ — 45.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 10,515)ఆన్ అరైవల్ వీసా ఫీజులు• 2 వారాల సింగిల్ ఎంట్రీ - 5.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 1,168)• 3 నెలల మల్టిపుల్ ఎంట్రీ — 12.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 2,804)ఈవీసాకు దరఖాస్తు ఇలా..బహ్రెయిన్ అధికారిక వీసా పోర్టల్ (జాతీయత, పాస్ పోర్ట్ లు, నివాస వ్యవహారాలు)లో అర్హతను సరిచూసుకోండిఆన్ లైన్ దరఖాస్తును పూరించి పత్రాలను అప్ లోడ్ చేయండి. తగిన రుసుము చెల్లించండి.ఆమోదం పొందాక కొన్ని రోజుల్లోనే ఈమెయిల్ ద్వారా అప్రూవల్ వస్తుంది.వీసా ఆన్ అరైవల్అన్ని పత్రాలతో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోండి.వీసా కౌంటర్ వద్దకు వెళ్లి ఫీజు చెల్లించండి.వేలిముద్రలు లేదా ఫోటో వంటి బయోమెట్రిక్ తనిఖీలు చేయించుకోండి.కస్టమ్స్ క్లియర్ చేసి లగేజీని తీసుకోండి.చాలా ఈవీసాలు ౩ నుండి 5 రోజుల్లో ప్రాసెస్ చేస్తారు. ఆన్-అరైవల్ వీసాలు మాత్రం అదే రోజు మంజూరు చేస్తారు.బహ్రయిన్ సందర్శించడానికి మంచి సమయంబహ్రయిన్ ఎడారి దేశం కాబట్టి ఇక్కడ సమయం ముఖ్యమైనది.డిసెంబర్ నుండి మార్చి వరకు ఉత్తమ సీజన్. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.జూలై, ఆగస్టు నెలల్లో, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వెళ్లకపోవడం మంచిది.రంజాన్, ఈద్ వ్యాపార సమయాలు హోటల్ రేట్లు, రెస్టారెంట్ షెడ్యూల్ ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. -
నిరాశపరిచిన నీరజ్ చోప్రా.. స్వర్ణం గెలిచిన చోట కనీసం కాంస్యం కూడా లేకుండా..!
టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2025లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దారుణంగా విఫలమయ్యాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన నీరజ్.. అంచనాలు తలకిందులు చేస్తూ ఎనిమిదో స్థానంతో (84.03 మీటర్లు) ముగించాడు. 2021 ఒలింపిక్స్లో ఇదే ప్లేస్లో (టోక్యో) స్వర్ణం గెలిచిన నీరజ్.. ఈసారి కనీసం కాంస్యం కూడా సాధించలేక ఉసూరుమనిపించాడు. 26 పోటీల తర్వాత నీరజ్ పతక రహితుడిగా మిగలడం ఇదే మొదటిసారి. ఈ పోటీలకు ముందు పాల్గొన్న డైమండ్ లీగ్లో నీరజ్ రెండో స్థానంలో (85.01) నిలిచాడు. ఈ పోటీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్కు స్వర్ణం దక్కింది. 2012 ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన వాల్కాట్ బల్లాన్ని (జావలిన్) 88.16 మీటర్ల దూరం విసిరాడు. బల్లాన్ని 87.38 మీటర్ల దూరం విసిరిన ఆండర్సన్ పీటర్స్కు (గ్రెనడా) రజతం దక్కింది. కర్టిస్ థామ్సన్కు (యూఎస్ఏ, 86.67) కాంస్యం లభించింది.ఈ పోటీల క్వాలిఫికేషన్లోనే బల్లాన్ని 84.85 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. ఫైనల్స్లో అంతకంటే హీన ప్రదర్శన చేసి 84.03 మీటర్ల దూరంతో సరిపెట్టుకున్నాడు.మొదటి ప్రయత్నంలో 83.65 మీటర్లు నమోదు చేసిన నీరజ్.. రెండో ప్రయత్నంలో 84.03 మీటర్లతో స్వల్ప మెరుగుదల చూపించాడు. మూడో త్రో ఫౌల్ అయ్యింది. నాలుగో త్రోలో 82.86 మీటర్లు మాత్రమే వచ్చాయి. ఐదో త్రోలో తడబడి మరోసారి ఫౌల్ చేసిన నీరజ్, పోటీ నుంచి నిష్క్రమించాడు.ఇదే పోటీల్లో భారత్కే చెందిన సచిన్ యాదవ్ నీరజ్ కంటే మెరుగైన ప్రదర్శన చేసి మెప్పించాడు. బల్లాన్ని 86.27 మీటర్ల దూరం విసిరి తృటిలో కాంస్యం (నాలుగో స్థానం) మిస్ అయ్యాడు. ఇదే పోటీలో పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీమ్ నీరజ్ కంటే దారుణమైన ప్రదర్శన (82.75 మీటర్లు) చేసి పదో స్థానంలో నిలిచాడు. -
ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి
మగరాయుడి గెటప్తోనే పాపులర్ అయింది తెలుగింటి అమ్మాయి స్నిగ్ధ (Actress Snigdha Nayani). 'అలా మొదలైంది' సినిమాతో తన కెరీర్ మొదలైంది. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, చందమామ కథలు, టైగర్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ ఇలా అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం స్నిగ్ధ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.. కానీ సింగర్గా పలు షోలు చేస్తోంది. ఈ నటి రీల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా మగరాయుడిలాగే ఉంటుంది. ఆ కారణం వల్లే ముఖంపై..పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండిపోతానని చెప్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. ముఖంపై గడ్డాలు, మీసాలు రావడానికి గల కారణమేంటని యాంకర్ అడిగాడు. అందుకు స్నిగ్ధ స్పందిస్తూ.. షూటింగ్స్కు వెళ్తున్న సమయంలోనే పీసీఓడీ వచ్చింది. దీని వల్ల అవాంచిత రోమాలు వస్తుంటాయి. అలాగే చాలామంది అమ్మాయిలకు ఫేషియల్ హెయిర్ ఉంటుంది. గుండు గీయించుకున్నా..నెలకోసారి థ్రెడింగ్ చేసుకుంటారు. ఇది చాలా మామూలు విషయం. అయితే నేను షూటింగ్స్కు వెళ్లినప్పుడు నా ముఖంపై హెయిర్ కనిపిస్తుందనగానే వెంటనే మేకప్మ్యాన్ లేజర్తో గీకేసేవారు. దానివల్ల అదింకా ఎక్కువైంది. మరో విషయమేంటంటే.. ఎంబీఏ అయిపోగానే నేను గుండు చేయించుకున్నాను. అప్పుడతడు నా తలపై నుంచి ముఖం మీది దవడ వరకు బ్లేడుతో గీకాడు. అప్పటినుంచే అవాంచిత రోమాలు రావడం చిన్నగా మొదలైంది. మా అమ్మక్కూడా ఫేషియల్ హెయిర్ ఉంది అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.చదవండి: సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ దర్శకుడిని చితకబాదిన స్టార్ హీరో -
భారత్కు గుడ్న్యూస్.. టారిఫ్పై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్?!
న్యూఢిల్లీ: భారత్పై 50శాతం టారిఫ్ విధింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నవంబర్ 30 తర్వాత భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై అందుబాటులోకి రానున్న 50శాతం టారిఫ్లో 25 శాతం పెనాల్టీ టారిఫ్ను రద్దు చేయనున్నట్లు సమాచారంరష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని.. ఫలితంగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోందంటూ భారత్పై ట్రంప్ టారిఫ్తో పాటు పెనాల్టీ టారిఫ్ 25శాతం విధించారు. ఆ పెనాల్టీ టారిఫ్ విషయంలో భారత్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చలు సఫలమై.. పెనాల్టీ టారిఫ్ను తొలగించే అవకాశం ఉందంటూ కేంద్ర చీఫ్ ఎకనమిక్స్ అడ్వైజర్ (సీఈఏ)వీ అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు.గురువారం కోల్కతా మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎంసీసీఐ)సమావేశంలో వీ. అనంత నాగేశ్వరన్ మాట్లాడారు. మనదేశం నుంచి ఎగుమతయ్యే పలు ఉత్పత్తులపై 25శాతం ప్రతీకార సుంకం చెల్లించడంతో పాటు పెనాల్టీ కింద మరో 25శాతం.. మొత్తంగా 50శాతం టారిఫ్ చెల్లించేందుకు సిద్ధపడ్డాం. కానీ ఇకపై మనకు ఆ అవసరం ఉండదని నేను భావిస్తున్నాను.25 శాతం పెనాల్టీ సుంకానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులు కారణం. కానీ గత రెండు వారాలలో జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ 30 తర్వాత 25శాతం జరిమానా సుంకం ఉండదని నేను నమ్ముతున్నాను. రాబోయే రెండు నెలల్లో ప్రతీకార సుంకంతో పాటు జరిమానా పరస్పర సుంకాలపై పరిష్కారం లభిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో భారత్పై టారిఫ్ల విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటూ ఆర్ధిక నిపుణుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1977లో రూపొందించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్ యాక్ట్ (ఐఈఈపీఏ) చట్టాన్ని ప్రస్తావిస్తూ, విదేశీ అత్యవసర పరిస్థితుల సమయంలో ఆర్థిక నియంత్రణలు, శిక్షలు విధించేందుకు ఈ చట్టాన్ని ఉపయోగించారు. ఈ చట్టం ఆధారంగా మనదేశంపై మొదట 25శాతం టారిఫ్లు విధించగా, ఇప్పుడు వాటిని 50శాతానికి పెంచారు. -
శబరిమలలో గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్.. షెడ్యూల్ ఇదే
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం అభివృద్ధిపై సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా తీరంలో ప్రపంచ అయ్యప్ప భక్తుల సంగమాన్ని ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. శనివారం (సెప్టెంబర్ 20) జరగనున్న ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని కేరళ దేవాదాయశాఖ మంత్రి వి.ఎన్. వాసవన్ తెలిపారు. ఈ మహా సంగమంలో వివిధ దేశాల నుంచి సుమారు 3000 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. విరాళాలుగా వచ్చిన రూ.7కోట్లతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వాసవన్ చెప్పారు. ఈ కాంక్లేవ్లో కేరళ ప్రభుత్వం శబరిమల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ. 1300 కోట్ల మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు (KIIFB) ద్వారా నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు ప్రపంచ అయ్యప్ప భక్తుల సంగమం శబరిమల అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణ,భక్తుల సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. -
ఓటీటీకి రూ.340 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ రివీల్
ఎలాంటి అంచనాలు లేకుండా యానిమేషన్ చిత్రం మహావతార్ నరసంహా. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం 200 థియేటర్స్కు పైగా 50 రోజులు పూర్తి చేసుకుందని ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. రిలీజైన రోజు నుంచి ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ డేట్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ శుక్రవారం(సెప్టెంబర్ 19న) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ మహావతార్ నరసింహ పోస్టర్ను పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచి ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
విధ్వంసం సృష్టించిన అనామక ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
అంతర్జాతీయ టీ20ల్లో నమీబియాకు చెందిన జాన్ ఫ్రైలింక్ అనే అనామక ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వేతో ఇవాళ (సెప్టెంబర్ 18) జరుగుతున్న మ్యాచ్లో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో నమీబియా తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఫ్రైలింక్ తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు.తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు.. రెండో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదిన అతను.. మూడో ఓవర్ గ్యాప్ ఇచ్చి, నాలుగో ఓవర్లో విశ్వరూపం ప్రదర్శించాడు. ట్రెవర్ గ్వాండు వేసిన ఆ ఓవర్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు సహా 26 పరుగులు రాబట్టాడు. ఫ్రైలింక్ ఊచకోత ధాటికి నమీబియా 4 ఓవర్లలో ఏకంగా 70 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ తర్వాత కూడా కాసేపు మెరుపులు కొనసాగించిన ఫ్రైలింక్.. 31 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి 9వ ఓవర్లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఫ్రైలింక్ చేసిన 13 బంతుల హాఫ్ సెంచరీ, టీ20ల్లో నమీబియా తరఫున అత్యంత వేగవంతమైందిగా రికార్డైంది. ఓవరాల్గా చూస్తే అంతర్జాతీయ టీ20ల్లో ఇది మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచింది.అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నేపాల్కు చెందిన దీపేంద్ర సింగ్ ఏరీ పేరిట ఉంది. ఏరీ 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఏరీ తర్వాత అత్యంత వేగవంతమైన అర్ద శతకం టీమిండియా సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. యువీ 2007 వరల్డ్కప్లో ఇంగ్లండ్పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఫ్రైలింక్కు ముందు మరో ముగ్గురు 13 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. 2019లో ఆస్ట్రియాకు చెందిన మీర్జా ఎహసాన్, 2024లో జింబాబ్వేకు చెందిన మరుమణి, ఇదే ఏడాది టర్కీకి చెందిన ముహమ్మద్ ఫహాద్ 13 బంతుల్లో హాఫ్ సెంచరీలు ఫినిష్ చేశారు.ఫ్రైలింక్కు ముందు నమీబియా తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు లాఫ్టీ ఈటన్ పేరిట ఉంది. గతేడాది లాఫ్టీ నేపాల్పై 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.కాగా, ఫ్రైలింక్ సుడిగాలి అర్ద సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్లో నమీబియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఫ్రైలింక్ ఔటయ్యాక నెమ్మదించిన నమీబియా స్కోర్ ఆఖర్లో మళ్లీ పుంజుకుంది. రూబెన్ ట్రంపల్మన్ (46), అలెగ్జాండర్ (20) జింబాబ్వే బౌలర్లను ఎడాపెడా వాయించారు.ఫ్రైలింక్ను ఔట్ చేయడమే కాకుండా మరో రెండు వికెట్లు (4-0-25-3) తీసిన సికందర్ రజా నమీబియాను కాస్త ఇబ్బంది పెట్టాడు. మపోసా, మసకద్జ, ముజరబానీ తలో వికెట్ తీశారు.కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం నమీబియా జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో జింబాబ్వే 33 పరుగుల తేడాతో గెలుపొందింది. -
శిథిలావస్థ నుంచి సర్వాంగ సుందరంగా..
వంద ఆలయాలు నిర్మించడం కంటే.. శిథిలమైన ఒక పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడం వంద జన్మల పుణ్యఫలమని పండితులు చెబుతుంటారు. ఆ మాటలు విన్న కొంతమంది భక్తులు కలిసికట్టుగా కృషిచేసి అత్యంత పురాతనమైన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి సరికొత్త చరిత్ర లిఖించారు. తమిళనాడులోని శ్రీరంగంలో కొలువైన శ్రీరంగనాథస్వామిని దర్శించుకోలేని భక్తులకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి అత్యంత చేరువలో ఉన్న శ్రీపురం శ్రీరంగనాథస్వామి కొంగు బంగారంగా మారారు. అత్యంత మహిమాన్వితమైన శ్రీపురం శ్రీరంగనాథస్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ జిల్లాలోనే ప్రముఖ ఆలయంగా మారింది. జిల్లాలోనే పురాతన వైష్ణవాలయాల్లో ఒకటైన శ్రీపురం రంగనాథస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.శ్రీరంగం నుంచి తలపై విగ్రహంతో.. శ్రీపురంలోని రంగనాథస్వామి ఆలయ నిర్మాణంతోపాటు ఆలయ చారిత్రక వైభవంపై చరిత్రకారులు రాసిన పుస్తకాల ద్వారా పలు విశేషాలు తెలుస్తున్నాయి. సుమారు 500 ఏళ్ల కిందట తిరుమల వింజమూరి వంశానికి చెందిన నాలుగో నర్సింహాచార్యులు శ్రీపురంలో శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించారు. రంగనాథుడికి పరమ భక్తుడైన నర్సింహాచార్యుడికి కలలో స్వామివారు కనిపించి, తమకు శ్రీపురంలో ఆలయం నిర్మించాలని ఆదేశించారని, దీంతో ఆయన కాలినడకన శ్రీరంగం వెళ్లి అక్కడే రంగనాథస్వామి విగ్రహాన్ని తయారు చేయించారని.. అక్కడి నుంచి తలపై విగ్రహాన్ని పెట్టుకొని శ్రీపురం దాకా కాలినడకన వచ్చి ప్రతిష్టించారని చరిత్రకారులు చెబుతున్నారు.కాలక్రమేణా రంగనాథస్వామి మహిమల కారణంగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దీంతో సమీపంలోని పలు సంస్థానాదీశులు కూడా శ్రీపురం రంగనాథస్వామికి భక్తులుగా మారడంతోపాటు ఆలయ నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూములను ఇనామ్గా ఇచ్చారని ఆధారాలున్నాయి. ఆత్మకూరు ప్రాంతంతోపాటు గద్వాల, నాగర్కర్నూల్ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో రంగనాథస్వామి ఆలయానికి భూములు ఉండేవని, కాలక్రమంలో చాలా భూములు అన్యాక్రాంతమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం నాగర్కర్నూల్ చుట్టుపక్కల మాత్రమే రంగనాథస్వామికి 120 ఎకరాల దాకా భూములున్నాయి. కాగా, రంగనాథస్వామి ఆలయం 450 ఏళ్లపాటు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏకంగా అగ్రహారం వెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. సుమారు వందకుపైగా బ్రాహ్మణ కుటుంబాలు శ్రీపురంలో (Sripuram) ఉండేవని.. మారిన కాలంతోపాటు వారిలో ఎక్కువ భాగం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని స్థానికులు చెబుతున్నారు.శిథిలావస్థ నుంచి పునరుజ్జీవం వైపు.. ఎంతో ఘన చరిత్ర కలిగిన శ్రీరంగనాథస్వామి (Ranganatha Swamy Temple) ఆలయం 50 ఏళ్ల నుంచి క్రమంగా శిథిలావస్థకు చేరింది. ఆలయ నిర్వహణ కోసం కేటాయించిన భూములపై కౌలు సక్రమంగా రాకపోవడంతో ధూప, దీప, నైవేద్యాలకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్వహణ కొరవడి ఆలయం శిథిలావస్థకు చేరింది. 2012లో కొంతమంది భక్తులు, ఆలయ ధర్మకర్తల కుటుంబ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారు. గ్రామస్తులు, దాతల సహకారంతో రూ.కోటి వ్యయంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పురాతన శైలి దెబ్బతినకుండా గతంలో ఉన్న శిల్పకళను పోలిన రీతిలో ఆలయాన్ని పునరుద్ధరించారు. దీంతోపాటు ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, కోనేరు, 25 అడుగుల ఎత్తయిన భారీ రథం సమకూర్చుకున్నారు.2014 జూన్లో పునఃప్రతిష్ట ఒకప్పుడు కూలిన గోడలు.. విరిగిన విగ్రహాలు, పిచ్చి మొక్కలతో నిర్మానుష్యంగా కనిపించే ఆలయ ప్రాంగణం ప్రస్తుతం అత్యంత శోభాయమానంగా మారింది. 2014 జూన్లో ఆలయాన్ని పునఃప్రతిష్టించగా.. భక్తులు స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నారు. అచెంచలమైన భక్తి స్వామివారి వైభవాన్ని నలువైపులా చాటుతోంది. ఏటా వైకుంఠ ఏకాదశితోపాటు ధనుర్మాస ఉత్సవాలు, గోదా కల్యాణం, విజయదశమి, సంక్రాంతి (Sankranti) వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.జ్యేష్ట మాసంలో.. ఏటా జ్యేష్ట మాసంలో నాలుగు రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం, తిరుమంజనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, గరుడ ముద్ద, భేరీ పూజ, దేవతాహ్వానం, శ్రీగోదా రంగనాథస్వామి తిరు కల్యాణం, రథోత్సవం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, దేవతోద్వాసన, ద్వాదశారాధన, ధ్వజారోహణ, కుంభ సంప్రోక్షణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్రముఖ వైష్ణవాలయం.. పదేళ్ల కాలంలో జిల్లాలోనే అత్యంత ప్రముఖ వైష్ణవాలయంగా మారింది. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ఆలయ పునఃప్రతిష్టలో ప్రతిఒక్కరి సహకారం మరువలేనిది. కలిసికట్టుగా ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. – నర్సింహారెడ్డి, ఆలయ పాలక మండలి ఉపాధ్యక్షుడుఅందరూ సహకరించారు.. రంగనాథస్వామి ఆలయ పునర్నిర్మాణంలో అందరూ విశేషంగా సహకరించారు. 2012లో కొంతమంది గ్రామ యువకులతో కలిసి మా కుమారుడు శ్రీధరాచార్యులు ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి వైభవాన్ని రంగనాథస్వామి ఆలయం మళ్లీ సంతరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఏటా ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతాయి. – తిరుమల వింజమూరి రంగాచార్యులు, ఆలయ ధర్మకర్తగతంలో జాతర జరిగేది..నా చిన్నప్పుడు ఇక్కడ జాతర జరిగేది. చుట్టుపక్కల ఊళ్ల నుంచి భక్తులు ఎడ్ల బండ్లపై వచ్చేవారు. పదిరోజులపాటు జాతర ఉండేది. గుడి చుట్టూ అగ్రహారం ఉండేదని.. దాదాపు 30 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవని మా అమ్మ చెప్పేది. ఇక్కడ ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. తర్వాత రోజుల్లో ఆలయ నిర్వహణ కష్టం కావడంతో బ్రాహ్మణ కుటుంబాలు వలస వెళ్లాయి. 12 ఏళ్ల కిందట గ్రామస్తులు, ధర్మకర్తలు భక్తులతో కలిసి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. – నారాయణరెడ్డి, శ్రీపురంచదవండి: కొలిచిన వారికి బంగారు తల్లి -
ఈ స్కూటర్ల ఓనర్లకు గుడ్న్యూస్ చెప్పిన కంపెనీ
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ తమ కస్టమర్లకు మంచి కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా 500 ఎక్స్ పీరియన్స్ సెంటర్ (ఈసీ)లను అధిగమించింది. ఇది దాని రిటైల్ విస్తరణలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. గత మూడు నెలల్లో (జూన్-ఆగస్టు 2025), ఏథర్ 101 కొత్త ఈసీలను జోడించింది."మా వృద్ధి భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీకి పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుంది" అని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ సింగ్ ఫోకెలా అన్నారు. "దక్షిణ భారతదేశం మా కంచుకోటగా నిలిచినప్పటికీ, రిజ్తా విజయం టైర్-2, 3 నగరాల్లో మా విస్తరణను వేగవంతం చేసింది" అన్నారు.ఆగ్రా, జబల్పూర్, బిలాస్పూర్, వడోదర, సుందర్గఢ్ వంటి నగరాల్లో ఏథెర్ ఇప్పుడు ఈసీలను కలిగి ఉంది. అలాగే కాలికట్, గుంటూరు, హల్ద్వానీ, కోటా వంటి పట్టణాల్లోకి చొచ్చుకుపోయింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒక్కో చోట 50కి పైగా ఈసీలు ఉన్నాయి. బెంగళూరులో ఏకంగా 18 కేంద్రాలు ఉన్నాయి.దేశవ్యాప్తంగా ఏథర్ మార్కెట్ వాటా 2026 తొలి త్రైమాసికంలో 14.3 శాతానికి పెరిగింది. గత సంవత్సరం ఇది 7.6% ఉండగా రెట్టింపు అయింది. మధ్య భారతదేశంలో వాటా 10.7 శాతానికి పెరిగగా, దక్షిణ భారతదేశంలో 22.8 శాతంతో ఆధిపత్యాన్ని చాటింది.ఏథర్ పోర్ట్ ఫోలియోలో పనితీరు-ఆధారిత 450 సిరీస్, ఫ్యామిలీ-ఫోకస్డ్ రిజ్టా ఉన్నాయి. అథెర్ కమ్యూనిటీ డే 2025లో ఇది తన నెక్స్ట్-జెన్ ఈఎల్ ప్లాట్ ఫామ్, ఏథర్ స్టాక్ 7.0, ఇన్ఫినిట్ క్రూయిజ్, పోథోల్ అలర్ట్స్ వంటి కొత్త ఫీచర్లను ఆవిష్కరించింది.తమిళనాడులోని హోసూర్ లో ఏథర్ రెండు ప్లాంట్ లను నిర్వహిస్తోంది. మహారాష్ట్రలోని బిడ్కిన్ లో మూడవ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది మొత్తం సామర్థ్యాన్ని సంవత్సరానికి 1.42 మిలియన్ యూనిట్లకు పెంచుతుంది. భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఈసీలను 700లకు పైగా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
బీజాపూర్ జిల్లా మంకేలీ అడవుల్లో భీకర ఎన్కౌంటర్
బీజాపూర్ జిల్లా నైరుతి ప్రాంతంలోని మంకేలి అడవుల్లో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతిచెందారు. వీరిపై రూ.7 లక్షల రివార్డు ఉంది. డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా-202, 205 బెటాలియన్ సంయుక్త బృందం ఈ సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించినట్లు బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.గురువారం మధ్యాహ్నం ౩ గంటల సమయంలో బలగాలు కూంబింగ్లో ఉండగా.. నక్సల్స్ తారసపడ్డారని, ఆ వెంటనే కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఆత్మ రక్షణ కోసం బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరికొందరు అడవుల్లోకి పారిపోయినట్లు వివరించారు. వారికోసం కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. మృతిచెందిన నక్సల్స్ వద్ద ఒక 303 రైఫిల్, ఒక బీజీఎల్ లాంఛర్, మూడు బీజీఎల్, నాలుగు లైవ్ రౌండ్లు, బ్యాటరీ కార్డెక్స్ వైర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ స్టార్ హీరో దర్శకుడిని చితకబాదాడు!
బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ హిందీ చలనచిత్ర పరిశ్రమకు గుడ్బై చెప్పేసి సౌత్కు షిఫ్ట్ అయిపోయాడు. అనురాగ్ సోదరుడు అభినవ్ కశ్యప్ (Abhinav Kashyap) కూడా దర్శకుడిగా హిందీలో రెండే రెండు సినిమాలు చేసి సైలెంట్ అయిపోయాడు. అవి దబాంగ్, బేషరం. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ మూవీ బ్లాక్బస్టర్ విజయం సాధించింది. దీనికి దబాంగ్ 2, 3 అంటూ రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి.ధర్మేంద్రను తీసుకోవాలంటే భయంవాటిలో సల్మాన్ (Salman Khan) హీరోయే కానీ దర్శకుడు మాత్రం మారిపోయాడు. అందుకు గల కారణాన్ని దర్శకుడు అభినవ్ తాజాగా బయటపెట్టాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. దబాంగ్ సినిమా ప్రారంభంలో అంతా బానే ఉంది. అందరం అనుకున్నట్లుగా అనుపమ్ ఖేర్, ఓం పురిని తీసుకున్నాం. కానీ, ధర్మేంద్రను సెలక్ట్ చేసుకోవాలంటే భయమేసింది. అందుకే ఆయనకు బదులుగా వినోద్ ఖన్నాను తీసుకున్నాను.దర్శకుడిని చితకబాదిన హీరోనిజానికి దబాంగ్ మూవీ చేయమని ధర్మేంద్రను కలిశాను. అందుకాయన.. బేటా, ముఖ్యమైన పాత్ర ఉంటేనే ఇవ్వు, లేదంటే వద్దు అని చెప్పాడు. దాంతో నాకు భయమేసింది. ఆయన ఎలాంటి పాత్ర ఆశిస్తున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే ధర్మేంద్రతో అసభ్య సన్నివేశం చిత్రీకరించినందుకుగానూ దర్శకుడు కాంతిషాపై హీరో సన్నీడియోల్ (Sunny Deol) చేయి చేసుకున్నాడని రూమర్లున్నాయి. ఏదైనా తేడా వస్తే గొడవ ఖాయం అని అర్థమై ధర్మేంద్రను పక్కనపెట్టాను. ఇక నేను ఏ నటుడితో మంతనాలు జరిపినా సల్మాన్ సోదరుడు సోహైల్ నా వెంటే వచ్చేవాడు.తండ్రి ధర్మేంద్రతో బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్సల్మాన్ ఓ గూండాతనే అందరి పారితోషికం గురించి చర్చలు జరిపాడు. వాళ్ల సూచనల ప్రకారమే యాక్టర్స్ను సెలక్ట్ చేసుకున్నా.. కానీ వారికి వ్యతిరేకంగా సోనూసూద్ను సినిమాలో తీసుకున్నా.. సోనూ ఫిజిక్ చూసి సల్మాన్ ఈర్ష్య పడేవాడు. అయినా సరే, వాళ్ల మాటను కాదని సోనూసూద్ను ఎంపిక చేసుకున్నాను. దబాంగ్ సినిమా ముందువరకు సల్మాన్ ఏంటో నాకు తెలీదు. కానీ, తర్వాత అర్థమైంది అతడో పెద్ద గూండా అని! అతడికి యాక్టింగ్ అంటే ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదాను మాత్రం ఇష్టపడేవాడు. అతడో నీచుడు, చెడ్డ వ్యక్తి అని అభినవ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.డైరెక్టర్పై సన్నీడియోల్ ఆవేశం.. అసలు కథ2017లో మిడ్డేలో వచ్చిన వార్తా కథనం ప్రకారం.. ధర్మేంద్ర స్టార్డమ్ కోల్పోయిన సమయంలో బీ గ్రేడ్, సీ గ్రేడ్ (తక్కువ బడ్జెట్, తక్కువ క్వాలిటీతో) సినిమాలు చేశారు. అందులో కొన్ని దర్శకనిర్మాత కాంతి షా తెరకెక్కించారు. అందులో ఓ సినిమాలో ధర్మేంద్రకు గుండెపోటు వచ్చినట్లుగా నటించమన్నాడు. కానీ దాన్ని ఎడిటింగ్లో పూర్తిగా మార్చేశాడు. బెడ్రూమ్ సన్నివేశాల్లో నటించినట్లుగా అశ్లీలంగా రీఎడిట్ చేశాడు. అశ్లీల సీన్లో ధర్మేంద్ర!మొదటగా ఈ సినిమాను పంజాబ్లో రిలీజ్ చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ధర్మేంద్ర ముసలితనంలో ఇలా ఓ అమ్మాయితో బెడ్పై కనిపించడం చూసి అభిమానులు షాకయ్యారు. దీంతో ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ ఆ దర్శకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఓ కథ గురించి చర్చించుకుందాం రమ్మని దర్శకుడు కాంతిని ఆఫీస్కు పిలిపించాడు. ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టాడు.చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా.. ఎక్కడంటే? -
థియేటర్లలో దక్ష, బ్యూటీ.. మరి ఓటీటీలో ఏయే సినిమాలో తెలుసా?
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ థియేటర్ల రిలీజ్ కావడం లేదు. మంచు లక్ష్మీ లీడ్ రోల్లో వస్తోన్న దక్ష, అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర నటించిన లవ్ స్టోరీ ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటితో పాటు విజయ్ ఆంటోని భద్రకాళి, కన్నడ సినిమా వీర చంద్రహాస కూడా థియేటర్లలో రిలీజవుతున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం కొత్త సినిమాలు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. కాజోల్ వెబ్ సిరీస్ ద ట్రయల్ సీజన్- 2, వాటిలో శ్రీలీల, కిరిటీ నటించిన జూనియర్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అయితే జూనియర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. రేపటి నుంచి సడన్ స్ట్రీమింగ్కు వస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.నెట్ఫ్లిక్స్సీ సెయిడ్ మేబీ- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 19హంటెడ్ హోటల్-(యానిమేషన్ హారర్ సిరీస్)- సెప్టెంబర్ 19బిలియనీర్స్ బంకర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 1928 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 20అమెజాన్ ప్రైమ్జూనియర్ (కన్నడ డబ్బింగ్ సినిమా)- సెప్టెంబర్ 19(రూమర్ డేట్)కాన్పిడెన్స్ క్వీన్ సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 20జియో హాట్స్టార్పోలీస్ పోలీస్ (తమిళ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19ద ట్రయల్ సీజన్ -2 (హిందీ వెబ్ సిరీస్) - సెప్టెంబరు 19స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్ఇంద్ర (తమిళ సినిమా) - సెప్టెంబరు 19మాటొండ హెలువే (కన్నడ మూవీ) - సెప్టెంబరు 19ఆహాష్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 19జూనియర్- (కన్నడ సినిమా)- సెప్టెంబరు 19(రూమర్ డేట్)జీ5హౌస్మేట్స్ (తమిళ సినిమా) - సెప్టెంబరు 19లయన్స్ గేట్ ప్లేద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19మనోరమ మ్యాక్స్రండం.. యామం(మలయాళ మూవీ)- సెప్టెంబరు 19 -
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: పైలట్ అప్రమత్తతతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్కు విమానం బయల్దేరగా.. కొంతదూరం వెళ్లాక విమానం రెక్కలో పక్షి ఇరుక్కుంది. పక్షి ఇరుక్కోవడంతో ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి.పైలెట్.. చాకచక్యంగా మార్గమధ్యలోనే వెనుతిరిగి విశాఖలో విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఉసేన్ బోల్ట్ నెట్వర్త్ ఎంతో తెలుసా?.. వందల కోట్లు ఉన్నా..
జమైకా ‘చిరుత’ ఉసేన్ బోల్ట్ (Usain Bolt) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒలింపిక్స్లో తొమ్మిది పసిడి పతకాలు కైవసం చేసుకున్న చరిత్ర అతడిది. 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్లో ఈ అథ్లెట్.. 100 మీ., 200 మీ.. 4*100 మీ. రిలేలలో ఈ మేరకు మెడల్స్ సాధించాడు.క్రికెటర్ కావాలని కలనిజానికి ఉసేన్ బోల్ట్ చిన్ననాటి నుంచి క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. ఫాస్ట్ బౌలర్గా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేశాడు. అయితే, పాఠశాల స్థాయిలో క్రికెట్ టోర్నీలో ఆడుతున్నపుడు బోల్ట్ను చూసిన ఓ కోచ్.. నీకున్న మెరుపు వేగం అథ్లెట్గా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.దీంతో ఆ దిశగా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈ జమైకన్.. ప్రపంచంలోని అత్యుత్తమ స్ప్రింటర్లలో ఒకడిగా ఎదిగాడు. అంతేకాదు.. కొంతమంది క్రికెటర్లకూ సాధ్యం కాని విధంగా వందల కోట్లు సంపాదించాడు.అయితే, ఒకప్పటి ఈ ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసం వస్తోందంటూ తన ఫిట్నెస్ సమస్యల గురించి చెప్పి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అంతేకాదు.. తాను ఇంట్లోనే ఎక్కువగా ఉంటానని.. పిల్లలతో ఆడుకోవడం, సినిమాలు చూడటం ఇవే తన హాబీలు అని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఉసేస్ బోల్ట్ నెట్వర్త్ ఎంత అన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఒక్క బ్రాండ్ ద్వారానే ఏడాదికి రూ. 75 కోట్లు!రిటైర్మెంట్ తర్వాత కూడా ఉసేన్ బోల్ట్ క్రేజ్ తగ్గలేదు. విశ్వ క్రీడల్లో తన విజయ ప్రస్థానాన్ని అతడు.. వ్యాపార సామ్రాజ్యానికి పునాదిగా మార్చుకున్నాడు. ప్రముఖ బ్రాండ్ పూమా ప్రమోషన్ ద్వారా ఏడాదికే బోల్ట్ రూ. 75 కోట్ల మేర ఆర్జిస్తున్నట్లు సమాచారం.అంతేకాదు.. వీసా, గాటొరేడ్, నిసాన్లకు కూడా అతడు అంబాసిడర్గా ఉన్నాడు. అదే విధంగా.. వివిధ కార్యక్రమాలకు హాజరుకావడం, బ్రాండ్ టై-అప్ల ద్వారా బోల్ట్ బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.వ్యాపార రంగంలో..రిటైర్మెంట్ తర్వాత బోల్ట్ వ్యాపార రంగంపై దృష్టి సారించాడు. తనకున్న రెస్టారెంట్ చైన్ ‘ట్రాక్స్ అండ్ రికార్డ్స్’ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. అంతేకాదు.. బోల్ట్ మొబిలిటీ పేరిట మొదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీకి అతడు సహ వ్యవస్థాపకుడు కూడా!మొత్తానికి ఇలా రెండు చేతులా సంపాదన పోగేస్తున్న బోల్ట్ నెట్వర్త్.. అక్షరాలా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు (రూ. 750 కోట్లు) అని వివిధ నివేదికల ద్వారా వెల్లడవుతోంది.నిరాడంబర జీవితంజమైకాలోని షేర్వుడ్ కంటెంట్లో 1986లో జన్మించిన ఉసేన్ బోల్ట్.. ప్రస్తుతం కింగ్స్టన్లో జీవిస్తున్నాడు. తన సహచరి కేసీ బెనెట్, తమ కుమార్తె ఒలింపియా, కవల కుమారులు థండర్- సెయింట్లతో కలిసి నిరాడంబర జీవితం గడుపుతున్నాడు.చదవండి: రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం.. ఇంకా.. -
IND VS AUS: శతక్కొట్టిన ధృవ్ జురెల్.. టీమిండియా భారీ స్కోర్
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. వికెట్కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మెరుపు శతకంతో చెలరేగాడు. 115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన జురెల్.. 113 పరుగుల వద్ద (132 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.మరో ఎండ్లో జురెల్కు జోడీగా ఉన్న దేవ్దత్ పడిక్కల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. పడిక్కల్ 178 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (73), ఎన్ జగదీసన్ (64) అర్ద సెంచరీలతో రాణించగా.. అభిమన్యు ఈశ్వరన్ (44) పర్వాలేదనిపించాడు. భారత-ఏ ఇన్నింగ్స్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) ఒక్కడే విఫలమయ్యాడు.మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత-ఏ స్కోర్ 103 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 403 పరుగులుగా ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఏ 532 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సామ్ కొన్స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు.కాగా, రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. -
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబర్ 18) నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో విరుచుకుపడ్డ వాన ధాటికి నగర జీవనం కకావికలమైంది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసుఫ్గూడ, ఫిల్మ్నగర్, మాదాపూర్, సరూర్నగర్, మారేడ్పల్లి, ఉప్పల్, సుల్తాన్బజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, రాణిగంజ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, మణికొండ, షేక్పేట, రాయదుర్గంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఫలితంగా రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి..నగర రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆఫీస్ల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది.భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. మోకాళ్లలోతులో నీరు నిలిచిపోయింది. పలు కాలనీల్లో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. ఇళ్లలోని వస్తువులు, నిత్యావసరాలు తడిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఒక్కసారే రీఛార్జ్.. ఏడాదంతా ఫ్రీ!: బెస్ట్ యాన్యువల్ ప్లాన్స్ ఇవే..
చాలామంది యూజర్లు మంత్లీ ప్లాన్స్ (28 రోజులు) రీఛార్జ్ చేసుకుంటారు. ఈ ప్యాక్ ధరలు, యాన్యువల్ ప్లాన్తో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఏడాది ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఈ కథనంలో బెస్ట్ యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.ఎయిర్టెల్ఎయిర్టెల్ తన యూజర్ల కోసం రూ.3599, రూ.2249 ప్లాన్స్ అందిస్తోంది. రూ.3599 రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటివాటితో పాటు.. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్ వంటివి లభిస్తాయి. కాగా రూ.2249 ప్లాన్ ద్వారా 365 రోజుల అపరిమిత కాలింగ్స్.. 30 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇందులో డైలీ డేటా.. ఇతర సబ్స్క్రిప్షన్ ఉండవు.రిలయన్స్ జియోజియో యూజర్లకు రూ.3599, రూ.999, రూ.234, రూ.895 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 3599 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్లు అపరిమిత కాలింగ్స్ పొందటమే కాకుండా.. రోజుకి 2.5 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. పైగా జియో టీవీ, హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.3999 ప్లాన్ ద్వారా అదనంగా జియో ప్యాక్ కోడ్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అయితే రూ.1234 ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 0.5 జీబీ డేటా లభిస్తుంది. జియో ఫోన్ ప్రైమా యూజర్లు 336 రోజుల వాలిడిటీ కోసం రూ.895 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి 28 రోజులకు 2 జీబీ డేటా లభిస్తుంది.వోడాఫోన్ ఐడియావోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే.. ఇది తన యూజర్ల కోసం రూ. 3599తో రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకి 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ పొందవచ్చు. అంతే కాకుండా ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే.. రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫ్రీ డేటా పొందవచ్చు. రూ.3799తో రీఛార్జ్ చేస్తే.. అదనంగా ఆమెర్జన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజుకి 1.5 జీబీ చాలనుకుంటే.. రూ.3499తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ డేటా వద్దనుకుంటే.. రూ.1999తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ప్యాక్ మొత్తానికి 24 జీబీ డేటా లభిస్తుంది.ఇదీ చదవండి: ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!బీఎస్ఎన్ఎల్బీఎస్ఎన్ఎల్ విషయానికి.. రూ.2399, రూ.1999, రూ. 1515 అనే ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.2399 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 600 రోజులు అపరిమిత కాల్స్, రోజుకి 2 జీబీ డేటా వంటివి లభిస్తాయి. రూ.1999 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు 600 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. అయితే రూ.1515 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. -
రెమ్యునరేషన్ కాదు.. ఆ ఒక్క కండీషనే దీపిక కొంప ముంచింది?
ఎంత పెద్ద స్టార్ అయినా హిట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేరు. అందుకే సూపర్ స్టార్స్ సైతం ఫ్లాప్ వస్తే కాస్త భయపడతారు. తర్వాత సినిమా విషయంలో ఆచి తూచి ఆడుగేస్తారు. అల్రేడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ని ఎంచుకుంటారు. లేదా హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీస్తానంటే కళ్లుమూసుకొని పచ్చ జెండా ఊపుతారు. కానీ దీపికా పదుకొణె మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. అనవసరమైన కండీషన్లతో భారీ ప్రాజెక్టులను వదులుకుంటుంది. మొన్నటికి మొన్న ప్రభాస్- సందీప్రెడ్డి క్రేజీ కాంబో ‘స్పిరిట్’ని మిస్ చేసుకుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ నుంచి తప్పుకుంది. కాదు కాదు.. నిర్మాతలే ఆమెను తప్పించారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. 'కల్కి 2898AD సినిమాకు రాబోయే సీక్వెల్లో దీపికా పదుకొణె నటించడం లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ, మా మధ్య భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి చిత్రానికి నిబద్ధత చాలా అవసరం. ఆమె భవిష్యత్లో మరెన్నో సినిమాలు చేయాలని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము' అని వైజయంతీ సంస్థ ఎక్స్లో పేర్కొంది. అసలు కారణం ఇదేనా?దీపిక పెట్టిన కండీషన్లే తొలగింపుకు దారి తీశాయని అటు బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ టాక్ నడుస్తోంది. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని దీపికా పదుకొణె కరాఖండిగా చెబుతోందట. అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలోనూ తగ్గడం లేదట. ఇబ్బందికరమైన సీన్లను చేయలేనని చెబుతోందట. కల్కి సీక్వెల్ విషయంలోనూ దీపిక ఇలాంటి కండీషన్లే పెట్టిందట. ఆ ఒక్కటే నచ్చలేదు!అయితే పారితోషికం విషయంలో వైజయంతీ సంస్థ వెనకడుగు అయితే వేయదు. కల్కి 2898 భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అలాంది సినిమాకు సీక్వెల్ అంటే.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నిర్మాణ సంస్థ పెద్దగా ఆలోచించదు. అడిగినంత ఇచ్చేందుకు రెడీగానే ఉందట. కానీ దీపిక పెట్టిన పని గంటల కండీషనే నచ్చలేదట. భారీ ప్రాజెక్ట్ విషయంలో పని గంటల కండీషన్ పని చేయదు. అందుకే నిర్మాతలు ‘పూర్తి నిబద్ధత’ అవసరం అని ప్రకటించారు. పెద్ద సినిమాల షూటింగ్ చెప్పిన సమయానికి పూర్తికాదు. నెలల తరబడి షూటింగ్ చేయాల్సి వస్తుంది. దీపిక పదుకొణె లాంటి స్టార్స్కి ఈ విషయం తెలుసు. అయినా కూడా తలకు మించిన కండీషన్లు పెట్టి.. సినిమాలను దూరం చేసుకుంటున్నారు. ఇలాంటి కండీషన్లు నచ్చకనే సందీప్రెడ్డి వంగా ‘స్పిరిట్’ నుంచి తప్పించాడు. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కూడా చేజారిపోయింది. దీపికా వైఖరి మారకపోతే.. మున్ముందు సినిమా చాన్స్లు రావడమే కష్టమవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD. After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership. And a film like…— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025 -
ఐటీ ఉద్యోగుల జీతాల పెరుగుదల అంతా ఫేక్..
సాధారణంగా ఐటీ ఉద్యోగులకు అధిక జీతాలు ఉంటాయని, ఏటా జీతాల పెరుగుదల కూడా భారీగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ అదంతా ఫేక్ అంటున్నారు చార్టెడ్ అకౌంటెంట్ (సీఎ), క్రియేట్ హెచ్క్యూ ఫౌండర్ మీనాల్ గోయెల్. 8 శాతం జీతం పెరుగుతోందంటే మంచి పెంపు అనుకుంటారని, కానీ ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) మీ ఖర్చులను 12% పెంచిందని మీరు గ్రహించాక అసలు సంగతి అర్థమవుతుందంటున్నారు.జీతాలు, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య అధికమవుతున్న అసమతుల్యతను గోయెల్ ఇటీవలి తన లింక్డ్ఇన్ పోస్టులో హైలైట్ చేశారు. ఆమె ఐటీ రంగాన్ని ఉదాహరణగా తీసుకుని ఆ అసమతుల్యతను ఎత్తి చూపారు. ఇక్కడ ఎంట్రీ లెవల్ వేతనం 2012లో రూ. 3 లక్షల నుండి 2022 నాటికి కేవలం 3.6 లక్షల రూపాయలు అయింది. అంటే ఒక దశాబ్ద కాలంలో ఏ మేరకు కదిలిందో అర్థం చేసుకోవచ్చు. అదే కంపెనీల సీఈవోల జీతాలు మాత్రం అనేక రెట్లు ఎగిశాయి."నేటికి, చాలా మంది ఐటీ ఉద్యోగులు సింగిల్-డిజిట్ పెంపు గురించి మాట్లాడుతుండగా, వారి అద్దె, కిరాణా సామగ్రి, జీవనశైలి ఖర్చులు రెండంకెలలో పెరుగుతున్నాయి" అని గోయెల్ రాసుకొచ్చారు. ఆదాయాలు, ఖర్చుల కంటే వెనుకబడి ఉండటంతో, చాలా మంది స్థిరత్వం కోసం బంగారం వంటి ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.చారిత్రాత్మకంగా, బంగారం ద్రవ్యోల్బణాన్ని ఓడించడమే కాకుండా అనిశ్చితి సమయాల్లో రక్షణను కూడా అందించింది. భారతదేశంలో, దాని ధర గత దశాబ్దంలో దాదాపు రెట్టింపు అయింది. ఓ మధ్య-స్థాయి ఐటీ ఉద్యోగి జీతం పెరుగుదలను అధిగమించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడి ఇకపై లగ్జరీ కాదని గోయెల్ నొక్కి చెప్పారు. "మీరు సంపాదించే ఆదాయం, ఖర్చుల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడానికి పెట్టుబడులు మాత్రమే మార్గం" అని ఆమె చెప్పారు.ఇదీ చదవండి: ఫోన్పే, పేటీఎంలో ఇక రెంటు కట్టడం కష్టం! -
చేతితో తినడం వల్ల వెయిట్లాస్ కూడా..
ఆహారాన్ని చేతితో నోటికి అందించడం అనేది తరతరాల సంప్రదాయం. అయితే ఆధునిక అలవాట్లు చేతితో ఆహారాన్ని తీసుకునే అలవాటును రానురాను తగ్గించేస్తున్నాయి. పురాతన, అనాగరిక జీవనశైలిగా దానిని పరిగణిస్తున్నాయి. అయితే చేతివేళ్లతో నేరుగా తీసుకుని ఆహారాన్ని ఆస్వాదించడం ఓ సంతృప్తి కరమైన విషయం. ఇది సంస్కృతీ, సంప్రదాయంకి మించిన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని ప్రసిద్ధ వైద్య నిపుణుడు విద్యావేత్త అయిన డాక్టర్ కరణ్ రాజన్ చెబుతున్నారు. చేతులతో తినడం అనే పురాతనదేశీ ఆచారం అర్థవంతమైనది మాత్రమే కాకుండా మనం ఊహించలేని ఎన్నో ఆరోగ్యలాభాలను అందిస్తుంది అంటున్న ఆయన ఆ లాభాలను ఇలా వివరిస్తున్నారు. ఇదీ చదవండి: ఎయిరిండియా విమాన ప్రమాదం, కీలక పరిణామం : అమెరికా కోర్టులో జీర్ణక్రియకు మేలు...ఫోర్క్ లేదా స్పూన్కు బదులుగా వేళ్లను ఉపయోగించి భోజనం చేసినప్పుడు, సహజంగానే తినే వేగం మందగిస్తుంది. చేతుల ద్వారా అందుకున్న ఆహారం నమలడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శ్రద్ధగా నమలడాన్ని ప్రోత్సహిస్తుంది, లాలాజలం నుంచి జీర్ణ ఎంజైమ్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఈ స్రావాలు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించి పోషకాలను గ్రహించడానికి సిద్ధం చేస్తాయి, కడుపు ప్రేగులకు అవసరమైన సున్నితమైన ప్రక్రియను సృష్టిస్తాయి.అతిని నివారిస్తుంది..వెయిట్లాస్ కోసం డైట్లో ఉంటున్నవారు తక్కువ తినాలని అనుకుంటారు. అలా అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహజమైన మార్గం చేతులతో తినడం. దీని వల్ల మెదడు మరింత అవగాహనతో తినేందుకు సహాయపడుతుంది. ఆహారాన్ని తాకడం వల్ల కలిగే స్పర్శ అనుభూతి సంతృప్తి భావనను బలోపేతం చేసే సంకేతాలను చురుకుగా పంపుతుంది. త్వరిత, అధిక సంతృప్తి కలగడం తినే అవసరాన్ని తగ్గిస్తుంది.రోగ నిరోధక వ్యవస్థకు మేలు..మరో ఆకర్షణీయమైన ప్రయోజనం ఈ శరీరపు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన. శుభ్రం చేసిన చేతులతో ఆహారం తిన్నప్పుడు, అది హానిచేయని సూక్ష్మజీవులను ప్రోత్సహిస్తుంది. ఈ జీవులు సురక్షితమైన, హానికరమైన బ్యాక్టీరియా మధ్య తేడాను గుర్తించడానికి రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. ఒక విధంగా, ఇది ప్రేవుల రోగనిరోధక రక్షణకు వ్యాయామం ఇస్తుంది, శరీరంలోని సహజ సమతుల్యతను బలోపేతం చేస్తుంది.ఉష్ణోగ్రత మార్గదర్శిగా వేళ్ల చిట్కాలుబుద్ధిపూర్వకంగా తినడంలో వేళ్ల పాత్ర ఎంతో ఉంటుంది. వేళ్ల కొనల వద్ద ఉన్న చర్మం నోటి లోపల సున్నితమైన లైనింగ్ కంటే థృఢంగా, నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది వేళ్లను సహజ థర్మామీటర్గా చేస్తుంది. ఇది వ్యక్తులు తినడానికి ముందు ఆహార ఉష్ణోగ్రతను పరీక్షించడానికి వీలు కలిగిస్తుంది. ఇటువంటి అవగాహన అసౌకర్యాన్ని నివారించడమే కాకుండా మరింత ఆలోచనాత్మకంగా, ఏకాగ్రతతో తినే అనుభవాన్ని ప్రోత్సహిస్తుంది. మీ వేళ్లు డైజెషన్ జాయ్స్టిక్లు అంటూ డాక్టర్ కరణ్ రాజన్ అభివర్ణిస్తారు. అయితే ముందుగా మీ చేతులను కడుక్కోండి అని మాత్రం సూచిస్తున్నారు. డాక్టర్ కరణ్ రాజన్ గురించిడాక్టర్ కరణ్ రాజన్ ప్రముఖ వైద్యుడు, రచయిత ప్రముఖ ఆరోగ్య సంభాషణకర్త. ఆయన సండే టైమ్స్ నంబర్ 1 బెస్ట్ సెల్లర్గా నిలిచిన‘‘ దిస్ బుక్ మే సేవ్ యువర్ లైఫ్’’ను రాశారు. ఆరోగ్య–కేంద్రీకృత స్టార్టప్ అయిన లోమ్ సైన్స్ ను కూడా ఆయన స్థాపించారు. ఇన్ స్టాగ్రామ్ లో రెండు మిలియన్లకు పైగా ఫాలోయర్స్ను కలిగి ఉన్నారు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
మోస్ట్ వయొలెంట్ చిత్రం.. సీక్వెల్ నుంచి తప్పుకున్న హీరో!
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన మోస్ట్ వయోలెన్స్ చిత్రం మార్కో. గతేడాది రిలీజైన ఈ సినిమా మలయాళంలో సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కేవలం మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది.మార్కో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో మేకర్స్ పుల్ బిజీ అయిపోయారు. తాజాగా లార్డ్ మార్కో టైటిల్ను మలయాళ ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా నమోదు చేశారు. దర్శకుడు హనీఫ్, నిర్మాత షరీఫ్ ఈ టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో మార్కో హీరో ఉన్ని ముకుందన్ పేరు లేకపోవడం మాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఉన్ని ప్లేస్లో మరో హీరోను తీసుకొస్తున్నారా? అనే చర్చ మొదలైంది. దీంతో ఈ మూవీలో మమ్ముట్టి, యశ్, పృథ్వీరాజ్, హృతిక్ రోషన్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. లేదంటే మలయాళంలో ఎవరైనా స్టార్ హీరోతో ప్లాన్ చేయనున్నారని టాక్.అయితే ఇప్పటికే మార్కో సీక్వెల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఉన్ని ముకుందన్ ప్రకటించారు. ఈ మూవీపై విపరీతమైన నెగెటివిటీ రావడంతో ఈ ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలిపారు. మార్కో సిరీస్ను కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. మార్కో కంటే మంచి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని వెల్లడింతారు. అందుకే ఉన్ని ముకుందన్ను సీక్వెల్ నుంచి మేకర్స్ తప్పించినట్లు తెలుస్తోంది.కాగా.. 2024 డిసెంబర్లో విడుదలైన ‘మార్కో చిత్రంలో వయొలెన్స్ విపరీతంగా ఉన్నట్లు టాక్ వినిపించింది. దీంతో కొందరు మార్కో చిత్రంపై విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాగా.. తెలుగు వెర్షన్ జనవరి 1న, తమిళ వెర్షన్ జనవరి 3న థియేటర్లలోకి వచ్చింది.Director Haneef Adeni and Producer Shareef Muhammed have registered the title '#LordMarco' at the Film Chamber. #UnniMukundan is not part of the project. Who do you think will lead in #Marco2? Any guesses? pic.twitter.com/va4OpaACf8— AB George (@AbGeorge_) September 17, 2025 -
ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా.. ఎక్కడంటే?
ఓటీటీలో మలయాళ సినిమాలకున్న క్రేజే వేరు. అయితే ఈసారి లవ్స్టోరీకి బదులుగా ఓ కామెడీ హారర్ మూవీ ఓటీటీ (OTT)లోకి రానుంది. ఆ సినిమాయే సుమతి వలవు (Sumathi Valavu Movie). ఇందులో అర్జున్ అశోకన్, సైజు కురుప్, గోకుల్ సురేశ్, మాళవిక మనోజ్, బాలు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది.ఓటీటీలో హారర్ మూవీతాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 26 నుంచి జీ5లో ప్రసారం కానుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సుమతి వలవు అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో హారర్, కామెడీతో పాటు మిస్టరీ, ఎమోషన్స్, థ్రిల్ కూడా ఉందని చిత్రయూనిట్ చెప్తోంది. ఐఎమ్డీబీలో ఈ సినిమా 7.7 రేటింగ్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. വരുന്നു, "സുമതി വളവ്". സെപ്റ്റംബർ 26 മുതൽ നമ്മുടെ ZEE5 മലയാളത്തിൽ#SumathiValavu Premieres 26th September on ZEE5#ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada pic.twitter.com/NGNr99ihOA— ZEE5 Malayalam (@zee5malayalam) September 18, 2025చదవండి: అమ్మ పేరుతో పేదలకు రుచికరమైన భోజనం: రాఘవ లారెన్స్ -
మోటీ మాయాజాలం.. ఫైనల్లో గయానా అమెజాన్ వారియర్స్
ఇమ్రాన్ తాహిర్ నేతృత్వంలోని గయానా అమెజాన్ వారియర్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ ఫైనల్స్కు చేరింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (సెప్టెంబర్ 18) ఉదయం జరిగిన తొలి క్వాలిఫయర్లో ఆ జట్టు సెయింట్ లూసియా కింగ్స్పై 14 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. తబ్రేజ్ షంషి (4-0-33-3), డేవిడ్ వీస్ (3-0-14-2), అల్జరీ జోసఫ్ (3-0-34-2), తైమాల్ మిల్స్ (3.5-0-38-2), రోస్టన్ ఛేజ్ (2-0-15-1) ధాటికి 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గయానా ఇన్నింగ్స్లో బెన్ మెక్డెర్మాట్ (34), షాయ్ హెప్ (32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్), ప్రిటోరియస్ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో గయానా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.మోటీ మాయాజాలంఅనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. గుడకేశ్ మోటీ మాయాజాలం (4-0-30-4) దెబ్బకు 19.1 ఓవర్లలో 143 పరుగులకే చాపచుట్టేసింది. ఇమ్రాన్ తాహిర్ (4-0-22-2), ప్రిటోరియస్ (4-0-24-2), రొమారియో షెపర్డ్ (4-0-36-1), హస్సన్ ఖాన్ (2.1-0-21-1) కూడా లూసియా కింగ్స్ను డ్యామేజ్ చేశారు.గయానా బౌలర్ల ధాటికి ఓ దశలో లూసియా కింగ్స్ ఇన్నింగ్స్ 100లోపే ముగుస్తుందని అనుకున్నారు. అయితే ఖారీ పియెర్ (29 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), తైమాల్ మిల్స్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) వీరోచితంగా పోరాడి గాయానా శిబిరంలో ఓటమి భయం పుట్టించారు. మోటీ పియెర్ను.. హస్సన్ ఖాన్ మిల్స్ను ఔట్ చేయడంతో లూసియా కింగ్స్ పోరాటం ముగిసింది.ఈ మ్యాచ్లో ఓడినా లూసియా కింగ్స్కు టైటిల్ రేసులో ఉండేందుకు మరో అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 20న జరిగే క్వాలిఫయర్-2లో ట్రిన్బాగో నైట్రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్లో గయానాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
బతుకమ్మ, దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడువేల పైచీలుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను నడిపేందుకు సిద్ధం కాగా.. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది.ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ .. బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సంసిద్ధంగా ఉంది. గత దసరా కంటే ఈ సారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, సంతోష్ నగర్, తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు. పోలీస్, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోంది.” అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. -
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్
నేపాల్తో టీ20 సిరీస్కు వెస్టిండీస్ (WI vs NEP) క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయీ హోప్నకు విశ్రాంతినిచ్చిన విండీస్ బోర్డు.. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్ అకీల్ హొసేన్ (Akeal Hosein)కు బాధ్యతలు అప్పగించింది.కాగా షార్జా వేదికగా వెస్టిండీస్ జట్టు నేపాల్తో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబరు 27, 28, 30 తేదీల్లో మ్యాచ్ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు గురువారం తమ జట్టును ప్రకటించింది.ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుకెప్టెన్ షాయి హోప్ (Shai Hope)తో పాటు పేసర్ అల్జారీ జోసెఫ్, బ్యాటర్ జాన్సన్ చార్లెస్ వంటి కీలక ప్లేయర్లకు కూడా సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. అయితే, ఈ సిరీస్లో అకీల్ హొసేన్ సారథ్యంలో జేసన్ హోల్డర్, ఫాబియాన్ అలెన్, కైల్ మేయర్స్ వంటి వారు ప్రధాన భూమిక పోషించేందుకు సిద్ధమయ్యారు.ఇక ఏకంగా ఐదుగురు వెస్టిండీస్ ఆటగాళ్లు నేపాల్తో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటర్ అకీమ్ ఆగస్టీ, ఆల్రౌండర్ నవీన్ బిడైసీ, స్పిన్నర్ జీషన్ మొతారా, పేసర్ రామోన్ సైమండ్స్, కీపర్ అమీర్ జాంగూ (టీ20 అరంగేట్రం)లకు తొలిసారి ఈ జట్టులో చోటు దక్కింది.నేపాల్తో టీ20 సిరీస్కు వెస్టిండీస్ జట్టుఅకీల్ హొసేన్ (కెప్టెన్), ఫాబియాన్ అలెన్, జువెల్ ఆండ్రూ, అకీమ్ ఆగస్టీ, నవీన్ బిడైసీ, జెడియా బ్లేడ్, కేసీ కార్టీ, కరీమా గోరె, జేసన్ హోల్డర్, అమీర్ జాంగూ, కైల్ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, జీషన్ మొతారా, రామోన్ సైమండ్స్, షమార్ స్ప్రింగర్.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ తర్వాత.. సీనియర్లతో కూడిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా టీమిండియాతో రెండు మ్యాచ్లు ఆడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విండీస్ తమ జట్టు వివరాలను వెల్లడించింది.టీమిండియాతో టెస్టులకు విండీస్ జట్టు వివరాలురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), తేజ్ నారాయణ్ చందర్పాల్, బ్రెండన్ కింగ్, కెవ్లాన్ అండర్సన్, షై హోప్, జాన్ క్యాంప్బెల్, అతనాజ్, ఇమ్లాక్, గ్రీవ్స్, అండర్సన్ ఫిలిప్, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, ఖారీ పైర్, జోమెల్ వారికాన్. చదవండి: ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు! -
ఎలిమినేషన్: కామనర్ల ఓవరాక్షన్.. ఆ కంటెస్టెంట్కు మూడినట్లే!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కెప్టెన్సీ కోసం పోరు మొదలైంది. ఓనర్స్లో ఏ నలుగురికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో టెనెంట్స్ చెప్పాలన్నాడు. దీంతో సెలబ్రిటీలందరూ చర్చించుకుని ప్రియ, శ్రీజ, హరీశ్, పవన్ కల్యాణ్లను పక్కన పెట్టేశారు. భరణి, డిమాన్ పవన్, మర్యాద మనీష్లను కెప్టెన్సీ కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. రేసులో లేకుండా పోయిన కామనర్లు సెలబ్రిటీలపై విరుచుకుపడ్డారు. మీరు కావాలనే చేశారు, ఫేవరిటిజం చూపించారంటూ నోరేసుకుని పడిపోయారు. వీళ్ల ఓవరాక్షన్ వల్ల వారికే చేటు రానుంది. ఈ వారం కామనర్స్లో ఒకరు ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.నామినేషన్స్లో ఏడుగురుఈ వారం మనీష్, హరీశ్, సుమన్ శెట్టి, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, భరణి నామినేషన్స్లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా భరణి, సుమన్ శెట్టి (Suman Shetty)కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. హరీశ్, ఫ్లోరా సైనీకి పర్వాలేదనిపించేలా ఓట్లు పడుతున్నాయి. ఫ్లోరాకు ఓట్లు పడటానికి బలమైన కారణమే ఉంది. కామనర్స్ ఓవరాక్షన్తో ప్రేక్షకుల తల బొప్పి కడుతోంది. దీంతో వారిలో ఒకరిని పంపిస్తే కానీ వీళ్ల నోటికి తాళం పడేలా లేదని జనం ఫీలవుతున్నారు. అందుకే కామనర్స్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలన్న కసితో ఫ్లోరాకు ఓట్లేసి మరీ ఆమెను సేవ్ చేస్తున్నారు. డేంజర్ జోన్లో ముగ్గురుదీంతో మనీష్, ప్రియ, డిమాన్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నారు. డిమాన్ పవన్.. తన గేమ్ కన్నా రీతూ చుట్టూ తిరగడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ప్రియ.. తను చెప్పిందే రైట్ అంటూ వాగుతూనే ఉంటుంది. మనీష్.. వరస్ట్ కామనర్స్ అంటూ తన టీమ్నే తిడతాడు, మళ్లీ వాళ్లనే సపోర్ట్ చేస్తాడు. ఒక మాట మీద నిలబడడు. అందుకే వీళ్లలో ఒకర్ని బయటకు పంపించాలన్నది బుల్లితెర ప్రేక్షకుల ఆలోచన. ముఖ్యంగా మనీష్, పవన్లపైనే ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి! చదవండి: ఓనర్స్ ఆర్ టెనెంట్స్.. కెప్టెన్సీ ఎవరికీ దక్కింది..! -
393 బైకులు వెనక్కి!.. డుకాటి కీలక ప్రకటన
డ్యూకాటీ తన పానిగేల్ వీ4, స్ట్రీట్ఫైటర్ వీ4 బైకులకు రీకాల్ ప్రకటించింది. వెనుక చక్రాల ఇరుసులో లోపం ఉన్నందున డుకాటి ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్య భారతదేశంలోని 393 యూనిట్లను ప్రభావితం చేస్తుంది. దీనిని పరిష్కరించడానికి సంస్థ సిద్ధమైంది.భారతదేశంలో 2018 నుంచి 2024 మధ్య తయారైన పానిగేల్ వీ4, 2018 నుంచి 2025 మధ్య తయారైన స్ట్రీట్ఫైటర్ వీ4 ఈ రీకాల్ ద్వారా ప్రభావితమయ్యాయి. ఈ రీకాల్ ద్వారా లోపభూయిష్ట వెనుక ఆక్సిల్ను చెక్ చేయడంతో పాటు.. ఉచితంగా సమస్యను పరిష్కరించనుంది.ఇదీ చదవండి: సిద్ధమవుతున్న డబ్ల్యూఎన్7 బైక్: ధర రూ.15.5 లక్షలు!ఒక మోటార్ సైకిల్ కదులుతున్నప్పుడు వెనుక ఇరుసు విరిగిపోయిన ఒక సంఘటన తర్వాత డుకాటి విస్తృత ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. దీనికి ప్రతిస్పందనగా.. బైక్ తయారీదారు యునైటెడ్ స్టేట్స్లో అమ్ముడైన 10,000 కంటే ఎక్కువ మోటార్సైకిళ్లను రీకాల్ జారీ చేసింది. -
అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. బొత్స సత్యనారాయణ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, కీలకాంశాలపై చర్చించారు. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై వైఎస్ జగన్ మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదని మండిపడ్డారు. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది సలహా ఇచ్చారు. కానీ మేం అలా చేయలేదు.. వారి అభిప్రాయాలూ విన్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరి గొంతూ విప్పకూడదనేది వారి అభిప్రాయం’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు...మొన్న ప్రెస్మీట్లో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మోసాలు, మెడికల్ కాలేజీలు, యూరియా సహా రైతుల కష్టాల మీద మాట్లాడాను. ఈ మూడింటి గురించి ఆధారాల సహా మాట్లాడ్డానికి కనీసం గంటకుపైనే పట్టింది. ఈ మాత్రం అవకాశం ఇస్తే నిశితంగా సభలో చెప్పగలుగుతాం.. లేదు, ఇవ్వం, రెండే రెండు నిమిషాలు ఇస్తామంటే.. ఇక మాట్లాడేది ఏముంటుంది?. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం ఇస్తానంటే.. ఇంకేం మాట్లాడగలం. అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలే. అందులో డు పార్టీలు అధికార పార్టీలోనే ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నది ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేమీరు ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే.. సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుంది అప్పుడు ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేందుకు అవకాశం ఉటుంది. కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడంలేదు. అందుకనే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మేం మాట్లాడుతున్నాం. కానీ మండలిలో మనకు మంచి బలం ఉంది. మండలిలో మనం ప్రజల తరఫును గొంతు విప్పడానికి అవకాశం ఉంది. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. పార్టీకి చెందిన మండలి సభ్యులు కూడా రాజకీయంగా బాగా ఎదగడానికి మంచి అవకాశం. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.ప్రభుత్వం అన్నది ఉందా? లేదా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలనూ పట్టించుకోవడంలేదు. లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అందుకనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ప్రతి చోటా దోపిడీ చేస్తున్నారు. అసెంబ్లీలో అధికారపక్షం డబుల్యాక్షన్ చేయాలనుకుంటోంది. నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా.. అన్నరీతిలో వారు వ్యవహరిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.ప్రతి అంశంపై మీరు మీడియా ద్వారా మాట్లాడండి. నేను కూడా ఆ అంశాలను ప్రస్తావిస్తా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలి. తన అత్తగారి సొత్తు అన్నట్టుగా అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. బాబు తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడు’’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
CPL విజేత బార్బడోస్ రాయల్స్.. కీలకపాత్ర పోషించిన టీమిండియా ప్లేయర్
2025 మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను బార్బడోస్ రాయల్స్ ఎగరేసుకుపోయింది. నిన్న (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో ఆ జట్టు గయానా అమెజాన్ వారియర్స్ను 3 వికెట్ల తేడాతో ఓడించి, వరుసగా మూడో టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది. యామీ హంటర్ (29), కెప్టెన్ షెమెయిన్ క్యాంప్బెల్ (28 నాటౌట్), వాన్ నికెర్క్ (27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బార్బడోస్ బౌలర్లలో షమీలియా కాన్నెల్, అఫీ ఫ్లెచర్, ఆలియా అల్లెన్ తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన బార్బడోస్.. 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోట్నీ వెబ్ (31), కైసియా నైట్ (31), చమారీ ఆటపట్టు (25) గెలుపుకు తమవంతు సహకారాన్ని అందించగా.. ఆఖర్లో టీమిండియా ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ (6 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు), ఆలియా అల్లెన్ (9 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి బార్బడోస్ను విజయతీరాలకు చేర్చారు.స్వల్ప స్కోర్ను కాపాడుకునేందుకు గయానా బౌలర్లు చాలా కష్టపడినప్పటికీ.. ఆఖర్లో ఆలియా, శ్రేయాంక వారి నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. 18 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన తరుణంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోగా.. శ్రేయాంక వరుసగా రెండు బౌండరీలు బాది బార్బడోస్ గెలుపును ఖరారు చేసింది.ఆతర్వాతి ఓవర్లో ఆలియా వరుసగా సిక్సర్, బౌండరీ బాది బార్బడోస్ గెలుపును లాంఛనం చేసింది. ఈ టోర్నీలో తొలిసారి బ్యాటింగ్కు దిగిన శ్రేయాంక, బంతితోనూ (2-0-15-0) పర్వాలేదనిపించింది. 21 ఏళ్ల శ్రేయాంక గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ భారత వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయింది. -
నాలాలో మామ, అల్లుడు గల్లంతు.. 85 కి.మీ కొట్టుకుపోయిన మృతదేహం..!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షానికి హబీబ్నగర్ అఫ్జల్ సాగర్ నాలా పొంగి ప్రవహించడంతో ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి మామా అల్లుళ్లు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ నాలాలో మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్ (26), రాము (25) అనే యువకులు కొట్టుకుపోయారు. నాటి నుంచి మృతదేహాల ఆచూకీ కోసం జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు గాలింపు చేపట్టాయి. ఐదు రోజుల తర్వాత వలిగొండ వద్ద అర్జున్ మృతదేహం లభ్యమైంది. ఎనబై ఐదు కిలోమీటర్లు వరదనీటిలో మృతదేహం కొట్టుకుపోయింది. రాము మృతదేహం ఇంకా లభించలేదు.కాగా, అర్జున్, రాము ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు అఫ్జల్సాగర్ నాలా ప్రక్కనే ఉండటంతో ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. ఇంట్లోని సామాన్లు బయటకు తెచ్చే క్రమంలో రాము అదుపు తప్పి నాలాలో పడ్డాడు. అతడిని కాపాడే క్రమంలో అర్జున్ కూడా నాలాలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయారు. కాగా, నగరం మరోసారి తడిసిముద్దయింది. బుధవారం రాత్రి కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో నగర జన జీవనం అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లుగా వర్ష ఉద్ధృతితో నగర వాసులు బెంబేలెత్తిపోయారు.వర్షం దాటికి నిమిషాల వ్యవధిలోనే రోడన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అపార్ట్మెంట్లతోపాటు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరగా, డైనేజీ, ఓపెన్ నాలాలు పొంగిపొర్లాయి. మెట్రో స్టేషన్లు, బ్రిడ్జిల కింద భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి.భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాిఫిక్ జామ్ అయింది. మాదాపూర్–హైటెక్ సిటీ చౌరస్తా, రాయదుర్గం, అమీర్పేట బంజారాహిల్స్ ఐకియా మార్గంలో, మియాపూర్– చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై వాహనాలు ముందుకు కదల్లేదు. దీంతో ముంబై జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 12 గంటల వరకు అత్యధికంగా ముషీరాబాద్ తాళ్లబస్తీలో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. -
ఎయిరిండియా విమాన ప్రమాదం, కీలక పరిణామం : అమెరికా కోర్టులో
తీవ్ర విషాదాన్ని నింపిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్కు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏఐ171 డ్రీమ్లైనర్విమానం కుప్పకూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు బాధిత కుటుంబాలు బోయింగ్, హనీవెల్పై దావా వేశాయి. కంపెనీ తీవ్ర నిర్లక్ష్య కారణంగానే విమానం కూలిపోయిందని ఆరోపిస్తూ అమెరికాలోని కోర్టులో ఫిర్యాదు నమోదు చేశాయి. తమకు జరిగిన పూడ్చలేని నష్టానికి పరిహారం చెల్లించాలని కోరాయి. ఈ ప్రమాదంపై అమెరికా కోర్టులో దావా వేయడం ఇదే తొలిసారి.డెలావేర్ సుపీరియర్ కోర్టులో మంగళవారం ఈ నాలుగు కుటుంబాలు ఫిర్యాదును దాఖలు చేశాయి. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్లోని స్విచ్ను ఇన్స్టాల్ చేసి తయారు చేసిన బోయింగ్ మరియు విడిభాగాల తయారీ సంస్థ హనీవెల్లకు ఆ ప్రమాదం గురించి తెలుసునని, ముఖ్యంగా 2018లో US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేక బోయింగ్ విమానాలలో డిసేబుల్డ్ లాకింగ్ మెకానిజమ్ల గురించి హెచ్చరించిన తర్వాత, స్విచ్ను ఇన్స్టాల్ చేసి తయారు చేసిన బోయింగ్ మరియు హనీవెల్లకు ఆ ప్రమాదం గురించి తెలుసునని పేర్కొన్నారు. ఈ స్విచ్ లాకింగ్ మెకానిజం అనుకోకుండా ఆగిపోవచ్చు, లేదా కనిపించకుండా పోవచ్చు. దీనివల్ల ఇంధన సరఫరా ఆగిపోవచ్చు, టేకాఫ్కు అవసరమైన థ్రస్ట్ కోల్పోవచ్చు అని వాదులు తెలిపారు. థ్రస్ట్ లివర్ల వెనుక నేరుగా స్విచ్ను ఉంచడం ద్వారా, "సాధారణ కాక్పిట్ కార్యకలాపాలు అనుకోకుండా ఇంధన కటాఫ్కు దారితీయవచ్చని బోయింగ్ సమర్థవంతంగా హామీ ఇచ్చింది" అయినా, ఈ విపత్తును నివారించడానికి హనీవెల్ , బోయింగ్ చేసిందేమీలేదని ఫిర్యాదులో మండిపడ్డాయి.ఈ ప్రమాదంలో కోల్పోయిన తమ బంధువులు కాంతాబెన్ ధీరూభాయ్ పఘడల్, నవ్య చిరాగ్ పఘడల్, కుబేర్భాయ్ పటేల్, బాబిబెన్ పటేల్ మరణాలకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేశాయి. అయితే వర్జీనియాలోని ఆర్లింగ్టన్లో ఉన్న బోయింగ్ బుధవారం దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో ఉన్న హనీవెల్ కూడా ఇంకా స్పందించలేదు. రెండు కంపెనీలు డెలావేర్లో విలీనమైనాయి.కాగాఅహ్మదాబాద్లోనిమెడికల్ కాలేజీపై ఎయిరిండియా విమానం కుప్పకూలిన ప్రమాదంలో 12 మంది సిబ్బంది, మరో 19మందితో229 మంది మరణించారు. ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ప్రాథమిక నివేదిక ప్రమాదానికి ముందు కాక్పిట్లో గందరగోళం నెలకొందని, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని జూలైలో నివేదించింది. భారత్, యూకే, అమెరికన్ పరిశోధకులు ప్రమాదానికి కారణం ఇదీ అని నిర్ణయించ లేదు. మరోవైపు బోయింగ్ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్లు సక్రమంగానే ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) దీనిపై క్లారిటీ ఇచ్చింది. US FAA నిర్వాహకుడు బ్రయాన్ బెడ్ఫోర్డ్, యాంత్రిక సమస్య లేదా ఇంధన నియంత్రణ భాగాల అనుకోకుండా కదలికలు కారణం కాదనే గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
నువ్వు ఎంపీవా? కేంద్రం నుంచి రూపాయి తెచ్చావా??.. కేశినేని చిన్నిపై పేర్ని నాని సెటైర్లు
సాక్షి,విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. ఎంపీ చిన్ని అక్కసు, ఆక్రోశం, బాధ అన్ని వెళ్లగక్కారు. ఆయనకు ప్రజాసేవ పట్టదు.. ప్రజలు పట్టదు.. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టరు. రోజూ క్లోజింగ్ లెక్కలు చూసుకోవడం సరిపోతుంది. అందుకని రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మాట్లాడితే ఎలా.2007లో ఎండోమెంట్ కమిషన్ వాళ్ళు 130 మంది 2 లక్షలు కట్టి దేవుడు భూముల అక్షన్లో పాల్గొన్నారు. 130 మంది అక్షన్లో పాల్గొంటే నేను భూమి ఎలా కొట్టేశానో మరి చిన్ని చెప్పాలి. 130 మందిలో 30వ వ్యక్తి టీడీపీ మంత్రిగారి మనిషి ఉన్నాడు. మరి నేను కూడా ఆయన్ని కొనేసానా?. కుక్క తోక పట్టుకొని కృష్ణా నది పట్టుకొని ఈదడం కుదరదు.బెజవాడ ఎంపీ కూర్చు స్థానాన్ని అదమ స్థానానికి పడేశారు. భారత్ నుండి గొప్పగా క్రికెట్లో కప్పులు తెచ్చారని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పదవి ఇచ్చారు. భూములపై విచారణ చేపించండి.. భూములు లాక్కొండి. ఐదు ఎకరాల 30సెంట్లు వెనక్కి లాక్కోండి. అందరిపై కేసులు పెడుతున్నారు గా.. పెట్టుకోండి..బియ్యం కొట్టేసామని చెపుతున్నారు. నా కేసు ఏ పాటిదో టీడీపీ నేతలను,న్యాయవాదుల్ని అడగండి. నాకు శిక్ష వేయించాలి అనుకొంటే 25ఏళ్ళు, 50 ఏళ్ళు వెయిస్తే వేయించండి. కేజీ రూ.90 రూపాయల చొప్పున నేను కట్టాను. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం వ్యాపారం చేసేది మీరు కదా?. పెద్దిరెడ్డి మీ మేనేజర్ కాబట్టి మీ ఆఫీస్లో కూర్చొని రేషన్ బియ్యం వ్యవహారం నడుపుతున్నారు. నెలకు కోటిన్నర మీకు పెద్దిరెడ్డి ఇస్తున్నారు. ఇది మేం చెప్పింది కాదు.. మీ టీడీపీ నేతలే చెపుతున్నారు. ఇక్కడ డబ్బు కొట్టేసి హైదరాబాద్ పంపిస్తున్నారు. ఆ కొట్టుడు దగ్గరే ఏడుగురు ఎమ్మెల్యేలకు పడడం లేదు. తమ్ముడు కిషోర్ని అడ్డం పెట్టుకొని లోక్సభ నియోజకవర్గాన్ని మొత్తం లూటీ చేస్తున్నారు. ఇసుక మన దగ్గర నుండి ఖమ్మం పోతోంది. బూడిద చెన్నై కంపెనీకి ఇచ్చేశారు. నందిగామలో ఏడు రిచ్లలో ఐదు మూసేసి రెండు మాత్రమే నడుస్తున్నాయి. పదహారు టైర్ల టిప్పర్లు.. 50 టిప్పర్లు నందిగామ నుండి హైదరాబాద్ వెళ్తుంది. ఒక్కో లారీకి రూ. లక్ష 25వేలు వసూళ్లు చేస్తున్నారు.ఢిల్లి నుండి పార్లమెంట్ నుండి ఒక్క రూపాయి అయినా తెచ్చావా?. కంచికచర్ల దగ్గర ఉన్న డంప్ ఎందుకు అధికారులు పట్టుకోరు?. పట్టాబి, మీరు కలిసి గొడుగు పల్లి వెంకటరస్వామి స్థలం వేసేశారు. దేవుడు భూములు, అమ్మిన , అద్దెకు ఇచ్చిన వేలం పాట ద్వారా మాత్రమే నిర్వహించాలి.. నేరుగా ఇవ్వకూడదు. హైకోర్టు ఉత్సవాల పనులు ఆపేయాలి తీర్పు ఇస్తే పనులు అపలేదు. కోర్ట్ మాటలు కూడా లెక్కలేదు. బుడమేరు మునిగినప్పుడు కంగారు పడలేదు. న్యూ ఆర్ఆర్ పేటలో డయేరియా కట్టడికి హడావిడి లేదు. అమ్మవారి ఉత్సవాలకు మాత్రం హడావిడి..దీనివల్ల ఎవరికి లాభం లేదు.. ఎంపీ అంటే మొత్తం పీకేసి లోపల వేసుకోవొచ్చు అనే కొత్త అర్థం చెప్పాడు.కేశినేని నాని ఎంపీ పదవి గర్వంగా, హుందాగా బ్రతికాడు. నువ్వేమో బెడజవాడ ఎంపీ స్థానాన్ని అధమానికి పడేశావు.వచ్చే ఎన్నికల్లో ఏడుగురు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎంపీ సీటు ఇవ్వకుండా అపుతారు. రూ.48 కోట్లు కట్టి సిటిజన్ షిప్ కట్టి డల్లాస్లో ట్రంప్కి పోటీగా పోటీ చేయొచ్చు. ఇప్పటికైనా మంచి పనులు చేస్తే ప్రజలు అయినా అయ్యో పాపం అనుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 320.25 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 83,013.96 వద్ద, నిఫ్టీ 90.75 పాయింట్లు లేదా 0.36 శాతం లాభంతో 25,421.00 వద్ద నిలిచాయి.టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, ఇంటెన్స్ టెక్నాలజీస్, దీపక్ బిల్డర్స్ & ఇంజనీర్స్ ఇండియా, షాలిమార్ పెయింట్స్, జీటీఎల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్, నాగరీకా ఎక్స్పోర్ట్స్, ఎక్స్ప్రో ఇండియా, బ్రాండ్ కాన్సెప్ట్స్, రుషిల్ డెకర్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమ్మ పేరుతో పేదలకు రుచికరమైన భోజనం: రాఘవ లారెన్స్
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ స్టైలే వేరు.. అది సినిమాల్లో మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ ఆయన అంతే. అందరు హీరోలకు భిన్నంగా సమాజ సేవలో చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరు పేదల శ్రేయస్సే లక్ష్యంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రైతులు, విద్యార్థులు, దివ్యాంగులు ఇలా ఎందరినో ఆదుకున్న రాఘవ లారెన్స్.. తాజాగా మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.పేదలకు రుచికరమైన భోజనం అందించేందుకు తన తల్లి పేరు మీద 'కణ్మణి అన్నదాన విందు' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధనవంతులు తినే నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందించనున్నారు. నిరుపేద చిన్నారుల్లో చిరునవ్వులు చిందించడమే తన లక్ష్యమని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు.రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ.. 'కన్మణి అన్నదాన విరుందు ఒక కొత్త ప్రారంభం. ఈ రోజు నా హృదయానికి దగ్గరగా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించా. ఈ కార్యక్రమానికి కన్మణి అన్నదాన విరుందు అని నా తల్లి పేరుతోనే పెట్టాం. ధనవంతులు మాత్రమే ఆస్వాదించే ఆహారాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడని వారికి అందుబాటులో ఉంచడమే తన ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. ఆహారం ఒక ప్రత్యేక హక్కుగా ఉండకూడదు.. అది ప్రతి హృదయానికి చిరునవ్వులు తెచ్చే ఆనందంగా ఉండాలి. పిల్లలు, పెద్దలతో కలిసి నారి కురవర్గల్ సంఘంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదించినప్పుడు వారి కళ్లలో ఆనందాన్ని చూసి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో, అందరి ఆకలిని తీర్చే ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని నేను ఆశిస్తున్నా' అని తన ఆనందాన్ని పంచుకున్నారు.I want to take a moment to express my gratitude to everyone of you for the love and support you’ve shown towards my new video about my initiative, Kanmani Annadhana Virundhu. Your encouragement gives me the strength to continue this journey of service. With all your blessings,… pic.twitter.com/YyJYi1BYpy— Raghava Lawrence (@offl_Lawrence) September 18, 2025 -
ఫోన్పే, పేటీఎంలో ఇక రెంటు కట్టడం కష్టం!
ఫోన్ పే, పేటిఎం లేదా క్రెడ్ వంటి మొబైల్ యాప్లలో క్రెడిట్ కార్డు ద్వారా ప్రతి నెలా రెంటు చెల్లించేవారికి ఇకపై కష్టతరం కానుంది. అనేక ఫిన్ టెక్ ప్లాట్ఫామ్ లు ఇప్పుడు తమ రెంటు పేమెంట్ సేవలను నిలిపివేశాయి. ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించడం ఒక ప్రసిద్ధ ధోరణిగా మారింది. ఎందుకంటే ఈ చెల్లింపులపై వినియోగదారులకు రివార్డ్ పాయింట్లతోపాటు వడ్డీ లేని క్రెడిట్ వ్యవధిని ఆస్వాదించే అవకాశం కలిగేది. అయితే ఆర్బీఐ తాజా నిబంధనలను అనుసరించి ఈ సౌలభ్యం ఇప్పుడు కనుమరుగవుతోంది.చెల్లింపు సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెప్టెంబర్ 15న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ చర్య ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రివార్డులను సంపాదించడానికి లేదా వారి ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడానికి రెంటు చెల్లింపులపై ఆధారపడిన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. వారు ఇప్పుడు ప్రత్యక్ష బ్యాంకు బదిలీలు లేదా చెక్కు చెల్లింపులు వంటి సాంప్రదాయ పద్ధతులకు తిరిగి రావాల్సి ఉంటుంది.ఆర్బీఐ కొత్త నిబంధనలుసవరించిన మార్గదర్శకాల ప్రకారం.. తమతో ప్రత్యక్ష ఒప్పందాలను కలిగి ఉన్న, పూర్తి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన వ్యాపారుల లావాదేవీలను మాత్రమే ప్రాసెస్ చేయడానికి పేమెంట్ అగ్రిగేటర్లు (PA), పేమెంట్ గేట్ వేలకు అనుమతి ఉంటుంది. తత్ఫలితంగా, ఈ యాప్లు ఇకపై తమ ప్లాట్ ఫామ్ లలో అధికారిక వ్యాపారులుగా నమోదు కాని భూస్వాములకు అద్దె చెల్లింపులను సులభతరం చేయలేవు.ఆర్బీఐ ఇటీవలి చర్యకు ముందే బ్యాంకులు ఇలాంటి లావాదేవీలను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జూన్ 2024 నాటికే క్రెడిట్ కార్డు ద్వారా చేసే అద్దె చెల్లింపులపై 1% వరకు రుసుమును ప్రవేశపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డులు కూడా ఈ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందించడం నిలిపివేశాయి. ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పేతో సహా అనేక ప్లాట్ ఫామ్లు మార్చి 2024 నాటికి ఈ సేవను నిలిపివేసినప్పటికీ తర్వాత పాక్షికంగా వెసులుబాటు కల్పిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కేవైసీ ప్రక్రియను కఠినతరం చేయడంతో ఇకపై అనధికార రెంటు చెల్లింపులకు అవకాశం ఉండదు. -
IND VS AUS: దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్
టెస్ట్ రీఎంట్రీపై గంపెడాశలతో స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు తీవ్ర నిరాశ ఎదురైంది. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. 13 బంతుల్లో బౌండరీ సాయంతో 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.గత కొంతకాలంగా టెస్ట్ జట్టులో చోటు ఆశిస్తున్న శ్రేయస్ ఈ సిరీస్లో సత్తా చాటి, త్వరలో స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే సిరీస్కు ఎంపిక కావాలని భావించాడు. అయితే అతని అంచనాలన్నీ తారుమారయ్యేలా ఉన్నాయి. భారత జట్టులో మిడిలార్డర్ బెర్త్ల కోసం శ్రేయస్తో పోటీపడుతున్న మిగతా ఆటగాళ్లందరూ సత్తా చాటుతున్నారు. శ్రేయస్ మాత్రమే వరుసగా విఫలమవుతున్నాడు (దులీప్ ట్రోఫీలోనూ (25, 12) నిరాశపరిచాడు). మరోపక్క టీమిండియా బెర్త్ కోసం శ్రేయస్కు ప్రధాన పోటీదారుడైన సర్ఫరాజ్ ఖాన్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతున్నాడు. సర్ఫారాజ్ ఇటీవల బుచ్చిబాబు టోర్నీలో సెంచరీతో సత్తా చాటాడు.శ్రేయస్కు మరో పోటీదారుడైన సాయి సుదర్శన్ ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో అర్ద సెంచరీతో (73) మెరిశాడు. కొత్తగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ శ్రేయస్ పోటీదారుల జాబితాలో చేరాడు. రజత్ తాజాగా ముగిసిన దులీప్ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు (ఫైనల్లో సెంచరీ, సెమీఫైనల్లో అర్ద సెంచరీ). దులీప్ ట్రోఫీ ఫైనల్లో రజత్ పాటు సెంచరీ చేసిన యశ్ రాథోడ్, సెమీ ఫైనల్లో భారీ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్ కూడా కొత్తగా శ్రేయస్ పోటీదారుల జాబితాలో చేరారు.ఇంత పోటీ మధ్య వరుస వైఫల్యాల బాట పట్టిన శ్రేయస్ భారత టెస్ట్ జట్టులో చోటు ఆశించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో 532 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆసీస్-ఏకు భారత-ఏ జట్టు కూడా ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేస్తుంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (44), ఎన్ జగదీసన్ (64), సాయి సుదర్శన్ (73), శ్రేయస్ అయ్యర్ (8) ఔట్ కాగా.. దేవ్దత్ పడిక్కల్ (39), ధృవ్ జురెల్ (31) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 262 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఆసీస్ తరఫున సామ్ కొన్స్టాస్ (109), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్బెల్ కెల్లావే (88), కూపర్ కన్నోల్లీ (70), లియమ్ స్కాట్ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.కాగా, రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటిస్తుంది. భారత-ఏ టెస్ట్ జట్టుకు శ్రేయస్ అయ్యరే కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ లీగ్ దశలో పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (Saim Ayub) దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్లలోనూ అతడు డకౌట్ అయ్యాడు. ఒమన్, టీమిండియా, యూఏఈ జట్లతో మ్యాచ్లలో పరుగుల ఖాతా తెరవకుండానే 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ వెనుదిరిగాడు.అయితే, బ్యాటర్గా విఫలమైనా.. వికెట్లు తీయడంలో మాత్రం సఫలమయ్యాడు ఈ పార్ట్టైమ్ స్పిన్నర్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. స్పెషలిస్టు బౌలర్ల కంటే అతడే ఓ అడుగు ముందున్నాడు. ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్లో పాక్ తీసిన మూడు వికెట్లు అతడి ఖాతాలోనే ఉండటం ఇందుకు నిదర్శనం.ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ (Rashid Latif) సయీమ్ ఆయుబ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఓ వ్యక్తి ఒంటెపై కూర్చుని ఉన్నా కుక్కకాటు నుంచి మాత్రం తప్పించుకోలేడు’’ అని లతీఫ్ పేర్కొన్నాడు. మేనేజ్మెంట్ నుంచి మద్దతు దక్కుతున్నా ఆయుబ్ను దురదృష్టం వెంటాడుతూనే ఉందన్న అర్థంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ బ్యాటర్ పరుగులు తీయకుండా.. వికెట్లు తీయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు‘‘ప్రతి ఒక్కరి కెరీర్లో గడ్డు దశ అనేది ఒకటి ఉంటుంది. అతడు వైవిధ్యభరితమైన షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నాడు. బ్యాటర్గా కాకుండా.. బౌలింగ్ విభాగంలో రాణిస్తున్నందున అతడికి తుదిజట్టులో చోటు దక్కుతోంది. అయితే, కీలక మ్యాచ్లలో మాత్రం అతడు తప్పక పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు’’ అని రషీద్ లతీఫ్ ధీమా వ్యక్తం చేశాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’లో భాగంగా టీమిండియా చేతిలో ఓడిన పాక్.. యూఏఈ, ఒమన్లపై గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టుతో కలిసి ఈ గ్రూపు నుంచి సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్- పాక్ జట్ల మధ్య సెప్టెంబరు 21న సూపర్-4 మ్యాచ్ జరుగనుంది. సూపర్-4 బెర్తు ఖరారుఇక లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్లను చిత్తుగా ఓడించిన సూర్యకుమార్ సేన.. ముందుగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పాక్తో మ్యాచ్ ఆడినప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ విషయంపై నానాయాగీ చేసిన పాక్ క్రికెట్ బోర్డు బాయ్కాట్ పేరిట డ్రామాకు తెరతీసింది. అయితే, తమ పాచికలు పారకపోవడంతో యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడిన పాక్.. 41 పరుగుల తేడాతో గెలిచి సూపర్-4కు చేరుకుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్UAE strike early vs Pakistan 🤯Watch #PAKvUAE LIVE NOW, on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/gVRGeSYoBv— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025 -
హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
సాక్షి, హైదరాబాద్: నారాయణ జూనియర్ కాలేజీలో దారుణం జరిగింది. ఫ్లోర్ ఇంఛార్జ్ దాడిలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థి సాయి పునీత్ దవడ ఎముక విరిగింది. గడ్డి అన్నారం నారాయణ కాలేజీ బ్రాంచ్లో ఘటన జరిగింది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3:15 గంటలకు ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో జోక్యంచేసుకున్న ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్.. విద్యార్థులను చితకబాదాడు.తిండి తినలేని స్థితిలో విద్యార్థి ఉన్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేట పోలీస్ స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లోర్ ఇంఛార్జ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి రాగా, విద్యార్థుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. తప్పు గురించి పక్కనబెడితే.. గొడవ జరుగుతున్న సమయంలో ఇన్ఛార్జ్ సతీష్.. విద్యార్థులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. -
పవన్ కల్యాణ్ ఓజీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ముంబై బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ను రివీల్ చేశారు.ఓజీ ట్రైలర్ను సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓజీ పోస్టర్ను ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా 1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మిచారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.భారీగా టికెట్ ధరల పెంపు.. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.#OGTrailer on Sept 21st.. pic.twitter.com/2RMr9r1dm5— Sujeeth (@Sujeethsign) September 18, 2025 -
కొత్త జీఎస్టీ శ్లాబులను నోటిఫై చేసిన సీబీఐసీ
జీఎస్టీ శ్లాబుల సవరణకు ఆమోదించిన కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) జీఎస్టీ రేటు నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే సవరించిన రేట్ల నిర్మాణం ఏడు షెడ్యూళ్లలో సుమారు 1,200 వస్తువులపై ప్రభావం చూపుతుందని తెలిపింది.సీబీఐసీ నోటిఫికేషన్లోని ముఖ్యమైన మార్పుల్లో బాల్పాయింట్ పెన్నులు, స్కూల్ బ్యాగులు, ముద్రించిన పుస్తకాలు, మార్కర్లు, ఫౌంటెన్ పెన్నులు, స్టైలోగ్రాఫ్ పెన్నులు వంటి రోజువారీ ఎడ్యుకేషన్ నిత్యావసరాలు 18% జీఎస్టీ శ్లాబ్ కింద ఉంచారు. ఇది కొంతమంది పరిశ్రమ వర్గాల్లో ఆందోళనను రేకెత్తించింది. దీనికి విరుద్ధంగా పెన్సిల్స్, క్రేయాన్లు, పాస్టెల్స్, డ్రాయింగ్ చాక్స్, టైలర్ చాక్స్ను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇవి గతంలో 12% శ్లాబులో ఉండేవి.‘జీఎస్టీ హేతుబద్ధీకరణ విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు, ప్రాథమిక విద్యా సాధనాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది’ అని ఒక ట్యాక్స్ ఎక్స్పర్ట్ అన్నారు.సీబీఐసీ నోటిఫికేషన్ కింది వస్తువులను 18% జీఎస్టీ రేటు కింద వర్గీకరించింది.స్కూలు బ్యాగులుట్రంక్లు, సూట్ కేసులు, వ్యానిటీ కేసులు, ఎగ్జిక్యూటివ్, బ్రీఫ్ కేసులుస్పెక్టాకిల్ కేసులు, బైనాక్యులర్, కెమెరా కేసులుట్రావెల్ బ్యాగులు, కంటైనర్లుఎక్సర్సైజ్ పుస్తకాలు, గ్రాఫ్ పుస్తకాలు, ల్యాబ్ నోట్బుక్లు, సారూప్య వస్తువులపై స్పష్టంగా జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు? -
ప్రపంచ పజిల్ ఛాంపియన్షిప్లో.. తండ్రీ కొడుకులు
సాక్షి, సిటీబ్యూరో: హంగేరీలోని ఎగర్లో జరగనున్న 18వ ప్రపంచ సుడోకు ఛాంపియన్ షిప్, 32వ ప్రపంచ పజిల్ ఛాంపియన్ షిప్లో నగరానికి చెందిన తండ్రి కొడుకులు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. హంగేరియన్ పజిల్లర్స్ అసోసియేషన్నిర్వహించే ఈ కార్యక్రమంలో హైదరాబాద్లోని గ్లోబల్ ఎడ్జ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ జైపాల్రెడ్డి, తన కుమారుడు కార్తీక్రెడ్డితో కలిసి ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనున్న ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 24 గంటల పజిల్ ఛాంపియన్ షిప్ కూడా ఉంటుంది. అనుభవజ్ఞుడైన పజిల్ ఔత్సాహికులు జైపాల్రెడ్డి మొదట 2007లో అధికారిక పజిల్ పోటీల్లో భాగస్వామ్యమయ్యారు. తన పాఠశాల రోజుల నుంచి పజిల్స్ అంటే చాలా ఇష్టమని ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశం అంతటా ప్రాంతీయ రౌండ్లలో పాల్గొన్న తర్వాత 2008 నాటికి జాతీయ జట్టులో స్థానం సంపాదించానని, ప్రస్తుతం అంతర్జాతీయ పజిల్ పోటీలలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని తెలిపారు. ప్రస్తుతం 23 ఏళ్ల కార్తీక్రెడ్డి ఈ అభిరుచిని వారసత్వంగా పొందారని, 2015లో ప్రారంభించిన తన ప్రయాణం త్వరితగతిన అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. వీరు దివంగత కాంగ్రెస్ నాయకుడు ఎం.బాగారెడ్డి వారసులు కావడం విశేషం. -
బోన్ బ్రోత్ బ్రేక్ ఫాస్ట్..! నాజుకైన శరీరాకృతికి బెస్ట్ రెసిపీ..
బాలీవుడ్ నటి బానీ జె. కండలు తేలిన శరీరం, పోతపోసుకున్న టాటూల ఆకృతికి అభినయాన్ని జోడించి ఫాలోయింగ్ను సంపాదించుకుంది.. స్టీరియో టైప్ను బ్రేక్ చేసింది. చండీగఢ్కి చెందిన ఆమె ఎమ్టీవీ వీడియో జాకీగా పనిచేస్తున్నప్పుడు వీజే బానీగా పాపులర్ అయ్యింది. అంతేగాదు బాలీవుడ్ బుల్లి తెర షో బిగ్బాస్ పదవ సీజన్లో రన్నరప్గా నిలిచిందామె. 2007లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి విమర్శకుల మెప్పు పొందింది. అంతేగాదు ఆమె ఫిట్నెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఖాళీ సమయాల్లో ఆమె గడిపేది జిమ్లోనే. ఫిట్నెస్ మోడల్ కూడా. అలాంటి ఆమె అంత అందమైన శరీరాకృతి కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటుందో బయటపెట్టింది. అది ఎవ్వరికైనా మంచి శరీరాకృతిని అందివ్వడమే కాదు, చర్మ సౌందర్యానికి మంచిదని చెబుతున్నారామె. ఇంతకీ అదెంటో తెలుసుకుందామా..!.37 ఏళ బానీ జె కండరాలు, సన్నని శరీరాకృతికి పేరుగాంచిన నటి. కఠిన వ్యాయామ నియమావళి, ఆరోగ్యకరమైన ఆహారానికి పేరుగాంచిన బ్యూటీ ఆమె. ఇటీవల ఓ ఇంటర్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్ని పంచుకుంది. తన గ్లామర్ని ఇనుమడింప చేసే రెసిపీని గురించి వెల్లడించింది. తాను ఎక్కువగా ఇంట్లో వండిన భోజనమే తింటానని, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్గా బోన్ బ్రోత్ తీసుకుంటానని అంటోంది. ఇది చర్మానికి చాలా మంచిదని, కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. బోన్ బ్రోత్ అంటే..ఏంటీ వింత వంటకం అనుకోకండి. అదేనండి బోన్సూప్. చికెన్ లేదా మటన్ బోన్లను సుగంద్రవ్యాలతో కలిపి బాగా ఉడికించిన రసం లాంటి సూప్నే బోన్ బ్రోత్ అనిపిలుస్తారు. బానీ జె ఉపవాసం విరమించడానికి, ప్రతి ఉదయం దీన్ని తప్పనిసరిగా తీసుకుంటానని, అదే తన చర్మాన్ని సంరక్షణలో తోడ్పడుతుందని అంటోంది. అదీగాక తన శరీరాన్ని స్లిమ్గా కనిపించేలా చూపించడంలో దోహదపడుతుందని కూడా అంటోంది. అతాగే రుచి కోసం ఈ సూప్లో కొన్ని ఇతర కూరగాయలు కూడా జోడిస్తామని అంటున్నారామె. ఫలితంగా ఆ సూప్లో వివిధ ఖనిజాలు, కొల్లెజెన్, అమెనో ఆమ్లాల వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతోంది. సేవించేటప్పుడూ పూర్తిగా వడకట్టి తీసుకుంటానని చెబుతోంది ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు బానీ జె. అంతేగాదు ఆమె తరుచుగా తన వ్యాయామా వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. ఆమె దాదాపు 80 కిలల బరువులు ఎత్తడం నుంచి మొదలు పెట్టి 150 కిలోల బరువులు వరకు ఎత్తుతారామె. కొన్ని చిన్న చిన్న ఆరోగ్యకరమైన ఆహారాలు పెద్ద మార్పునే తీసుకొస్తాయనడానికి ఈ నటి తీసుకునే బ్రేక్ఫాస్ట్నే ఉదాహారణ. అందుకే శరీరానికి సరిపడేది ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్లో భాగం చేసుకుని మరింత సురక్షితంగా ఉండండి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి.(చదవండి: హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..) -
చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పోస్టు చేశారు. ‘చంద్రబాబు గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.చంద్రబాబుగారూ మీ హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాని మేము వారి సొంతింటి కలను నిజం చేసేలా “పేదలందరికీ ఇళ్లు’’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. ఇందులో కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చుచేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే రూ.1.5లక్షల కోట్లపైమాటే. ఇంటిపట్టావిలువే ఒక్కోచోట రూ. 2.5 లక్షల నుంచి రూ.10లక్షలు - రూ.15లక్షల వరకూ ఉంది. ఇళ్లపట్టాలకోసం, ఇళ్లకోసం ధర్నాలు, ఆందోళనలు మా ఐదేళ్లకాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి చంద్రబాబుగారూ…, మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోగా, మేం చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు.మా హయాంలో మేం 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి, మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం. అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబుగారూ మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా? మా హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు, వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారునికి రూ.40వేలు మేలు జరగడమే కాకుండా, దీంతోపాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో రూ.15వేలు సహాయం చేశాం. మరో రూ.35వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటికీ కేంద్రం ఇచ్చే రూ.1.8లక్షలు కాక, మొత్తంగా రూ.2.7లక్షల లబ్ధి చేకూర్చడమే కాకుండా, మౌలిక సదుపాయాల కొరకు మరో రూ.1లక్ష కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబుగారూ?చంద్రబాబుగారూ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా…, కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరకు, మురికికూపాలుగా ఉండకూడదని, నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడుగుంతలు, రోడ్లు తదితర సదుపాయాలకోసం దాదాపుగా రూ.3,555 కోట్లు మా హయాంలో ఖర్చుచేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేం చేసిన ఖర్చు దాదాపుగా రూ.35,300 కోట్లు. ఈ 16-17 నెలల కాలంలో మీరెంత ఖర్చుచేశారు?మా హయాంలో “పేదలకు ఇళ్లు’’ కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు చేయని పన్నాగంలేదు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు. అమరావతిలో 50వేల పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇస్తే, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తేవడమే కాకుండా, అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దుచేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేశారు. మరి మీరు చేసింది ద్రోహం కాదా? పేద కుటుంబాలమీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా? ఇది చాలదు అన్నట్టు, ఇక మిగిలిన పట్టాల్లో ఎక్కడైతే ఇంకా ఇళ్లు మీరు బాధ్యతగా శాంక్షన్ చేయించి, కట్టించాల్సింది పోయి, అక్కడ ఇంకా ఇళ్లు కట్టలేదు కాబట్టి, వాటిని, రిజిస్టర్ అయిన ఆ పట్టాలను, మీకు హక్కులేకపోయినా వెనక్కి తీసుకుని, మీ స్కాముల కొరకు, ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కులు కడతాం అంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటుగా లేదా, చంద్రబాబుగారూ..!ఈ 16-17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తే సున్నా. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు. కాని, ఇప్పటివరకూ ఒక్క ఎకరం గుర్తించలేదు, ఒక్క ఎకరం కొనలేదు. ఏ ఒక్కరికీ పట్టాకూడా ఇవ్వలేదు. ఎవ్వరికీ ఇల్లుకూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇచ్చినవాటిని లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదలకొరకు అవసరమైతే దీనిపై న్యాయపోరాటాలు చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్కు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. .@ncbn గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 18, 2025 -
'OG' మూవీలో పవర్ఫుల్ రోల్లో ప్రకాశ్ రాజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన యాక్షన్ మూవీ ఓజీ (OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓజీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్ను పక్కనపెట్టి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వదిలింది చిత్రయూనిట్. ఓజీలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఉన్నట్లు ప్రకటించింది. సత్య దాదాగా ప్రకాశ్ రాజ్ఈమేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో ప్రకాశ్ రాజ్.. శాలువా కప్పుకుని, కళ్లజోడు పెట్టుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర పేరును సత్యదాదాగా ప్రకటించారు. మరి ఆయన క్యారెక్టర్ ఏంటనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఇక ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. Here’s the versatile force Prakash Raj in #OG 🔥#TheyCallHimOG @prakashraaj pic.twitter.com/NiKjAtc1Qv— DVV Entertainment (@DVVMovies) September 18, 2025 చదవండి: దీపికా పదుకొణెకు షాకిచ్చిన 'కల్కి' టీమ్ -
బాయ్ ఫ్రెండైనా ఉండాలి..బ్యాగ్రౌండ్ ఐనా ఉండాలి
చలనచిత్ర రంగంలో తారలుగా రాణించాలని చాలా మందికి ఉంటుంది. అయితే అది అందరి వల్లా సాధ్యపడేది కాదు టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు ఇంకా చాలా చాలా ఉండాలి. అలాంటి వాటిలో ఇటీవల బాగా చర్చనీయాంశం అవుతున్న విషయం సినీ పరిశ్రమలో అప్పటికే స్థిరపడిన కుటుంబాలు, వారికి సంబంధీకులకే తప్ప బయటివారికి అండా దండా లభించవనేది. అందువల్లే బయటివారికి సినిమా రంగంలో అంత త్వరగా అవకాశాలు రావని, ఏదోలా వచ్చినా సక్సెస్ అయినా కూడా స్థిరపడడం కష్టమేనని బయటి నుంచి ఆ రంగంలోకి వచ్చిన వారి ఆరోపణ. అలా ఆరోపిస్తున్నవారిలో తాజాగా సీనియర్ నటి అమీషా పటేల్ కూడా చేరింది. కహోనా ప్యార్ హై సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు తెరంగేట్రం చేసిన ఈ నటి ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ సరసన బద్రి, నాని, నరసింహుడు, పరమవీర చక్ర..సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఆ తర్వాత అకస్మాత్తుగా సినిమాలకు దూరమైన అమీషా ఐదు సంవత్సరాల విరామం తర్వాత 2023లో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మతో కలిసి గదర్ 2 చిత్రంతో తిరిగి తెరపైకి వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత ఆమె చివరిగా 2024లో విడుదలైన తౌబా తేరా జల్వా చిత్రంలో కనిపించింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలు వచ్చాయి, కానీ అమీషా నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత మళ్లీ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అమీషా ఇంతవరకూ ప్రకటించలేదు.ఎన్ని హిట్ సినిమాల్లో చేసినా అమీషాకు రావాల్సినంత స్టార్ డమ్ రాలేదు. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టాప్ హీరోయిన్ కాకపోవడానికి కారణమైన సినిమా పరిశ్రమ పరిస్థితులపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్త పరచింది.తన మనస్తత్వం కారణంగా సినీ పరిశ్రమ లోపలి వ్యక్తులు తనను ఇష్టపడరని అమీషా చెప్పింది, సినీరంగంలో రాణించాలంటే ఏదో ఒక శిబిరానికి చెందిన వారై ఉండాలంది. ‘ నేను శిబిరాలకు చెందినదానిని కాదు, వారితో పంచుకోవడానికి నాకు దురలవాట్లు లేవు. మందు తాగను, సిగిరెట్ త్రాగను లేదా పని కావాలని మస్కా–లగావో (కాకాపట్టడం లాంటివి) చేయను నా అర్హత ప్రకారం నాకు ఏది దొరికితే అది నాకు లభిస్తుంది. ఆ కారణంగా వారు నన్ను ఇష్టపడరు. అయినా సరే నేను లొంగిపోను.‘ అంటూ తేల్చి చెప్పేసింది. తనకు తొలి చిత్రం అవకాశం కూడా అతి కష్టమ్మీద వచ్చిందని అంది. ‘కహో నా... ప్యార్ హై’ సినిమా కోసం తాను మొదటి ఎంపిక కాదని, తొలుత కరీనా కపూర్ ను ఎంచుకున్నారని తెలిపింది. అయితే నిర్మాత రాకేష్ రోషన్ కు కరీనా కపూర్తో విభేదాలు వచ్చాక ఆమె ప్రవర్తన పట్ల అసంతృప్తి వచ్చిన కారణంగా ఆమెను ఆ సినిమా నుంచి తొలగించిన తర్వాత మాత్రమే తనకు ఆ అవకాశం వచ్చిందని ఆమె గుర్తుచేసుకుంది. పరిశ్రమ లో సన్నిహితుడో, భాగస్వామి లేనప్పుడు ఒంటరిగా అందులో ఇమడడం చాలా కష్టం అంటోందామె. ‘సినిమా పరిశ్రమకు చెందిన ఓ బాయ్ఫ్రెండ్ లేదా ఒక భర్త లేనప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మీరు పవర్ ఫుల్ కపుల్గా లో ’సగం’ కానప్పుడు రాణింపు చాలా కష్టం. ఎందుకంటే మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉండరు. మిమ్మల్ని సమర్థించడానికి ఎటువంటి కారణం లేదు కదా ఆఫ్ట్రాల్.. మీరు బయటి వ్యక్తి.’’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది. -
భారీగా పెరిగిన బంగారం అమ్మకాలు..
న్యూఢిల్లీ: జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద పసిడి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి మంగళవారం కొత్త గరిష్ట స్థాయి రూ.1,15,100 స్థాయికి చేరుకోగా.. బుధవారం రూ.1,300 నష్టపోయి రూ.1,13,800కు పరిమితమైంది. ధరలు తగ్గుముఖం పట్టడంతో.. సేల్స్ పెరిగాయి.‘‘యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మెగ్గు చూపించడంతో బంగారం బలహీనంగా ట్రేడయ్యింది. కీలకమైన సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకున్నారు. కేవలం ఫెడ్ రేట్ల కోతపైనే కాకుండా, తదుపరి రేట్ల సవరణ దిశగా ప్రకటించే అంచనాల కోసం మార్కెట్లు వేచి చూస్తున్నాయి.ఇదీ చదవండి: కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటుతటస్థ విధానం లేదా తదుపరి రేట్ల కోతకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ లోపిస్తే బంగారం ధరలు ఇక్కడి నుంచి కొంత శాతం తగ్గొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. మరోవైపు వెండి సైతం అమ్మకాల ఒత్తిడితో కిలోకి రూ.1,670 నష్టపోయి రూ.1,31,200 స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతం తగ్గి 3,665 డాలర్ల వద్ద, కామెక్స్ ఫ్యూచర్స్లో పావు శాతం తగ్గి 3,717 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
రాహుల్ ఆరోపణలపై ఈసీ రియాక్షన్.. పటాకులే పేలాయంటూ సెటైర్లు
న్యూఢిల్లీ: ఓట్ల చోరీ పేరిట కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల స్పందించింది. ఆన్లైన్లో ఓట్లు ఎవరూ తొలగించలేరని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అదే సమయంలో మరోవైపు.. బీజేపీ సైతం ఆయన చేసిన ఆరోపణలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారం.. అవాస్తవం. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం లేదు అని ఈసీ స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలను మాత్రం అంగీకరించింది. ‘‘ ఆ సమయంలో కర్ణాటకలోని ఆలంద్ శాసనసభ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించేందుకు కొన్ని విఫలయత్నాలు జరిగాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్నికల సంఘం స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపింది’’ అని పేర్కొంది.మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం.. నకిలీ ఓట్ల చేర్పు ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆయన బాంబు పేలలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ను బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అని మండిపడ్డారు. ‘‘ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ నిష్పక్షపాతంగా పనిచేస్తోంది. కానీ రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ.. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ సుమారు 90 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ వైరాగ్యంతోనే ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని ఠాకూర్ విమర్శించారు. హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానన్న రాహుల్.. చివరికి పటాకులతోనే సరిపెట్టారు. ఆరోపణలే ఆయన రాజకీయ ఆభరణంగా మారాయి. కోర్టులు క్షమాపణలు కోరడం, మందలించడం ఆయనకు అలవాటైపోయింది అని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: ఓట్ల దొంగలకు రక్షగా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై సంచలన ఆరోపణలు -
అక్కినేని నాగేశ్వరరావు హిట్ సినిమాలు రీరిలీజ్.. ఉచితంగానే టికెట్స్
అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) 101వ జయంతి సందర్భంగా పలు సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం చిత్రాలు మరోసారి వెండితెరపైకి రానున్నాయి. చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వారి కోసం హిట్ సినిమాలు మరోసారి రానున్నాయి. ఉచితంగానే టికెట్లు ఇవ్వనున్నారు.డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం చిత్రాలు సెప్టెంబర్ 20 నుంచి రీ-రిలీజ్ అవుతున్నాయి. బుక్ మై షో లో సెప్టెంబర్ 18 నుంచి ఉచితంగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు లేదా థియేటర్స్ వద్దకు వెళ్లి డైరెక్ట్గానే పొందవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ( కృష్ణ టాకీస్), విశాఖపట్నం (క్రాంతి), ఒంగోలు( స్వర్ణ ప్యాలెస్) వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ థియేటర్లలో ప్రదర్శనలు జరగనున్నాయి. పలు చోట్ల ఇంకా థియేటర్స్ ప్రకటించలేదు. నేడు అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఏఎన్నార్ అభిమానులకు ఫ్రీ టికెట్స్ అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
‘అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. టెస్టుల్లో మాత్రమే ఆడించడం అన్యాయం’
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జైసూ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించగలడని పేర్కొన్నాడు. అయితే, అతడిని కేవలం టెస్టులకే పరిమితం చేయడం సరికాదంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు.టెస్టులలో దుమ్ములేపుతున్న జైసూభారత టెస్టు జట్టు ఓపెనర్గా యశస్వి జైస్వాల్ తన స్థానం సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే. అరంగేట్రం నుంచే శతకాలు, ద్విశతకాలతో దుమ్ములేపుతున్న ఈ ముంబై బ్యాటర్.. ఇప్పటి వరకు 24 టెస్టుల్లో కలిపి 2209 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఆరు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.వన్డే, టీ20లలో మా త్రం నో ఛాన్స్ఇలా సంప్రదాయ ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తున్న జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్లో తగినన్ని అవకాశాలు రావడం లేదు. టీమిండియా తరఫున 23 టీ20లలో 723 పరుగులు చేసిన జైస్వాల్.. ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులు రాబట్టగలిగాడు. టీ20లలో ఓపెనర్గా అభిషేక్ శర్మ, వన్డేల్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా శుబ్మన్ గిల్ ఉండటంతో జైసూకు నిరాశ తప్పడం లేదు.అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ఈ విషయాల గురించి కామెంటేటర్, మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్ను మూడు ఫార్మాట్లలో ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. ‘‘యశస్వి మంచి ఆటగాడు. అతడు మూడు ఫార్మాట్లలో ఆడగలడు. కానీ ఇప్పుడు అతడు కేవలం ఒకే ఫార్మాట్లో ఆడిస్తున్నారు.ఇలా చేయడం సరికాదు. అతడికి అన్యాయం చేసినట్లే. యశస్విని తప్పకుండా మూడు ఫార్మాట్లలో ఆడించాలి. స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులు ఆడించడంతో పాటు.. తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనూ యశస్వికి అవకాశం ఇవ్వాలి. అతడిని ఆసీస్ పర్యటనలో వన్డేల్లో ఆడిస్తారనే అనుకుంటున్నా.అంతేకాదు.. శ్రేయస్ అయ్యర్తో కలిసి యశస్వి కూడా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడతాడని నమ్ముతున్నా. దీనిపై నాకు సమాచారం లేదు. కానీ మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఆసియా కప్ ముగించుకున్న తర్వాత కాగా టీమిండియా ప్రస్తుతం ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో బిజీగా ఉంది. ఈ మెగా టోర్నీ ఆడే జట్టులో యశస్వి జైస్వాల్కు చోటు దక్కలేదు. స్టాండ్ బై ప్లేయర్గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.మరోవైపు.. పొట్టి ఫార్మాట్లో సూపర్ ఫామ్లో ఉన్నా.. శ్రేయస్ అయ్యర్కు కనీసం రిజర్వు ప్లేయర్గానూ స్థానం దక్కలేదు. ఇక ఆసియా కప్ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది. -
'హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..
కొన్ని అద్భుతాలు హృదయానికి హత్తుకునేలా మంత్రముగ్ధల్ని చేస్తుంటాయి. అస్సలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆశ్చర్యమేస్తుంది. చూడటానికి రియలిస్టిక్గా ఉండే ఆర్ట్ల గొప్పదనం మాటల్లో చెప్పలేం. అంత ఓపికగా ఎలా చేస్తున్నారనే అనుమానం కచ్చితంగా వచ్చేస్తుంది. ఓ భారతీయడు ఆ అందమైన క్లాక్ కళకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. అందులో ఏముందంటే..నెదర్లాండ్ ప్రధాన అంతర్జాతీయ కేంద్రమైన ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం షిపోల్లో ప్రత్యేకమైన 'హ్యూమన్ వాచ్'ను చూసి భారతీయ ప్రయాణికుడు ఎస్కే ఆలీ విస్తుపోయాడు. చూడటానికి నిజమైన గడియారాన్ని తలపించే హ్యుమన్ వాచ్ ఇది. ఎంత అద్భుతంగా ఉందంటే రెండు కళ్లు చాలవేమో అన్నంతగా మాయ చేస్తోంది. ఆ గడియారంలో ఒక మనిషి అచ్చం రియల్ గడియారంలో టైం చూపించే ముల్లుల మాదిరిగా క్షణాల్లో టైంని చూపిస్తూ..తుడుస్తూ కనిపిస్తుంది. అదంతా ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఏ మాత్రం ఒంకర టిక్కరి లైన్లు లేకుండా రియల్ గడియారం మాదిరిగా టైంని చూపిస్తున్న విధానం చూస్తే..నోటమాట రాదని అంటున్నాడు అలీ. ఆ గడియారం లోపల వ్యక్తి చేతితో ప్రతి నిమిషాన్ని ఇండికేట్ చేసేలా నిమిషా ముల్లుల గీతలను రిప్రెజెంట్ చేస్తూ చెరిపేయడం చూస్తే..ఇంతలా గీయడం ఎవ్వరికీ సాధ్యం కాదనిపిస్తుంది. చూడటానికీ ఏదో యానిమేటెడ్లా ఉంటుంది. ఒక సాధారణ గడియారాన్ని మిళితం చేసేలా ఉంది ఈ హ్యూమన్ వాచ్ కళ. రియల్ టైమ్గా పిలిచే హ్యుమన్ వాచ్ని డచ్ కళాకారుడు మార్టెన్బాస్ రూపొందించారట. ఇందులో నటుడు టియాగో సాడా కోస్టా పారదర్శక తెరపై గడియారపు ముళ్లను చెరిపివేసి తిరిగి గీస్తున్న 12 గంటల లూప్ చేయబడిన వీడియో ఉంది. ఆ పెయింటింగ్ సయంలో నిమిషానికి కట్టుబడి ఉన్న వ్యక్తి ముద్రను చూపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి ఈ కళారూపం వెనుక ఉన్న క్రియేటివిటీకి జోహార్లు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by S K Ali (@skali85) (చదవండి: పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్తో రోజుకు రూ.లక్ష పైనే..!) -
అబ్బాస్ ఎవరు? వాద్నగర్లో మోదీతో పాటు ఎందుకున్నారు?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు వేడుకలను భారతీయ జనతా పార్టీ 15 రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ పక్షం రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. అటువంటి వాటిలో ఒకటే ప్రధాని మోదీ బాల్య స్నేహితుడు అబ్బాస్ రామ్సదా వృత్తాంతం. అతను చిన్నతనంలో మోదీ కుటుంబంతో కలిసి వాద్నగర్లో ఉన్నారు.2022లో ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరా బెన్ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్లోని వాద్నగర్లోని తన ఇంటికి వెళ్లారు. అప్పుడు ప్రధాని మోదీ బ్లాగ్లో తన తల్లి హీరాబెన్ పోరాట కథను చెప్పారు. ఈ బ్లాగ్లో అబ్బాస్ అనే ముస్లిం స్నేహితుని గురించి ప్రస్తావించారు. తన తండ్రి స్నేహితుడొకరు చనిపోవడంతో అతని కుమారుడు అబ్బాస్ను ఇంటికి తీసుకొచ్చారని మోదీ గుర్తు చేసుకున్నారు. అతను తమ దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేశాడని, అన్నదమ్ములందరినీ అమ్మ ఎలా చూసుకునేదో అబ్బాస్ ని కూడా అలాగే చూసుకునేదన్నారు. ప్రతి సంవత్సరం ఈద్ రోజున అబ్బాస్ కోసం అతనికి ఇష్టమైన ప్రత్యేక వంటకాలు వండేవారని తెలిపారు.అబ్బాస్.. మోదీ కుటుంబంలోనే ఉంటూ మోదీ సోదరుడు పంకజ్ మోడీతో కలిసి ఒకే తరగతిలో చదువుకున్నారు. 1973-74లో అబ్బాస్ తన మెట్రిక్యులేషన్ పరీక్షలలో అద్భుతమైన గ్రేడ్ సాధించారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. అయితే అబ్బాస్ తన మెట్రిక్యులేషన్ పరీక్షకు హాజరయ్యే సమయానికి, మోదీ.. వాద్నగర్ నుండి అహ్మదాబాద్కు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా వెళ్లిపోయారు. ప్రధాని సోదరుడు పంకజ్ మోదీ , అబ్బాస్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ప్రధాని మోదీ సోదరులలో మరొకరైన ప్రహ్లాద్ మోదీ ఒకసారి అబ్బాస్ తమ ఇంట్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.2022లో అబ్బాస్ ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసి, తన చిన్న కుమారునితో పాటు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లారు. అబ్బాస్ పెద్ద కుమారుడు ఇప్పటికీ గుజరాత్లోని మెహ్సానాలో నివసిస్తున్నారు. ప్రధాని మోదీపై అబ్బాస్ రాసిన పుస్తకంలో.. తనకు మోదీ కుటుంబం సుంచి లభించిన మద్దతు, ఆప్యాయత మరువలేనిదన్నారు. ముఖ్యంగా హీరాబెన్ ఎంతో ప్రేమ చూపేవారన్నారు. ఆమె తన సొంత పిల్లల కంటే తనను ఎక్కువగా చూసుకున్నారని ఆయన పేర్కొన్నారు. -
అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబో.. డైరెక్టర్ బాబీ ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ బాబీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిష్కింధపురి సక్సెస్ఫుల్ ఈవెంట్కు హాజరైన ఆయన మెగాస్టార్ చిరంజీవి సినిమాపై మాట్లాడారు. అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబోలో వస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ కొట్టబోతోందని అన్నారు. ఈ మూవీలోని కొన్ని సీన్స్ నేను చూసి ఈ మాట చెబుతున్నానని బాబీ పేర్కొన్నారు. మెగాస్టార్ ఖాతాలో మరో హిట్ ఖాయమని చెప్పారు.అంతకుముందు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్పై ఫన్నీ కామెంట్స్ చేశారు. అనుదీప్, అనిల్ రావిపూడితో కలిసి కిష్కింధపురి సినిమా చూశామని తెలిపారు. అయితే ఈ సినిమాలో చూసినప్పుడు అనుపమ కనిపించగానే అనుదీప్ అరుస్తూనే ఉన్నాడని అన్నారు. ఇదీ చూసి ఏంటి ఇలా అరుస్తున్నాడు.. అదేంటో మాకు అర్థం కాలేదు..మనం హీరో వస్తే కదా అరవాలి.. ఇతనేంటి అనుపమ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ హా ఏంటి అనుకున్నా అంటూ నవ్వులు పూయించాడు. కాగా.. ఇటీవల విడుదలైన కిష్కింధపురి చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. #ManaShankaraVaraPrasadGaru సినిమా పెద్ద హిట్ కొట్టబోతుంది - Director #Bobby#Chiranjeevi #AnilRavipudi #Kishkindhapuri pic.twitter.com/ElqNM3Frwj— Telugu FilmNagar (@telugufilmnagar) September 18, 2025 -
ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!
భారతదేశంలో ఈ20 పెట్రోల్ వినియోగించాలని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. కొందరు నిపుణులు ఇథనాల్ వినియోగం వల్ల వాహనాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. అయితే చండీగఢ్కు చెందిన ఒక వ్యక్తి ఈ20 ఫ్యూయెల్ పెట్రోల్ హై-ఎండ్ వాహనాలపై చూపే ప్రభావాన్ని ఎత్తి చూపాడు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక స్నేహితుడి ఫెరారీ కారుకు ఈ20 పెట్రోల్ ఉపయోగించాడు. అయితే ఆ కారు కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవ్వలేదు. కొందరు నిపుణులు ఈ20 ఇంధనం వల్లనే.. ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు. దీనికి గడ్కరీ బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.నిజం ఏమిటంటే.. సూపర్ కార్లు, హై-ఎండ్ వాహనాలు ఈ ఇంధన మిశ్రమం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయి. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడటానికి ధైర్యం చేయరు. ఇథనాల్ గాలి నుంచి తేమను గ్రహిస్తుంది. ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత ఫ్యూయెల్ ట్యాంక్లో తేమశాతం పెరుగుతుంది. ఫలితంగా కారు స్టార్ట్ అవ్వడంలో సమస్య ఎదురవుతుందని ఆ వ్యక్తి ఎక్స్ ఖాతాలో వివరించారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఫెరారీ కారు స్టార్ట్ అవ్వకపోవడానికి ఖచ్చితంగా ఈ20 ఫ్యూయెల్ కారణమా? లేక ఇంకేమైనా సమస్యా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే E20 ఇంధనం వల్లే ఈ నష్టం జరిగిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారని అతను ట్వీట్లో పేర్కొన్నాడు. అంతే కాకుండా.. ఇప్పటి వరకు ఇథనాల్ కారణంగానే ఇలాంటి సమస్య వచ్చినట్లు ఇదివరకు కంప్లైంట్స్ రాలేదు.ఇదీ చదవండి: నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్ఇప్పటికే బ్రెజిల్, యూఎస్ఏ, చైనా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ20 ఫ్యూయెల్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో దీని వినియోగాన్ని పెంచాలని.. పెట్రోల్ దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో నితిన్ గడ్కరీ.. ఈ20 పెట్రోల్ను ప్రోత్సహిస్తున్నారు. నిజానికి ఇథనాల్-మిశ్రమ ఇంధనం CO2 ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని.. ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం 2023లో భారతదేశంలో ఈ20 పెట్రోల్ను ప్రవేశపెట్టింది.ఈ20 పెట్రోల్ కారణంగా వెహికల్ మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ దెబ్బతింటుందనే ఆందోళనలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. దీనిపై గడ్కరీ స్పందిస్తూ.. E20 పెట్రోల్తో చెప్పుకోదగ్గ సమస్యలు ఉండవని చెబుతూ.. చెరకు, మొక్కజొన్న రైతులు ఆర్థికంగా లాభపడ్డారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన వార్షిక SIAM సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.A friend’s Ferrari was filled with E20 petrol, and just a few days later it refused to start. The technicians say the damage is due to the E20 fuel. Now tell me, will Gadkari take responsibility for this? After spending crores on the car, paying road tax, vehicle GST tax, and… pic.twitter.com/4j9MGBjNGS— Rattan Dhillon (@ShivrattanDhil1) September 17, 2025 -
మండలిలో డొంకతిరుగుడు సమాధానాలు.. వైఎస్సార్సీపీ వాకౌట్
సాక్షి, అమరావతి: శాసన మండలిలో కూటమి ప్రభుత్వం బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించింది. ప్రజల సమస్యలపై విపక్ష వైఎస్సార్సీపీ సంధించిన ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక తడబడింది. చివరకు తిరుపతి, సింహాచలం దుర్ఘటనలపై సంబంధిత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతారాహిత్య సమాధానాలిచ్చారు. దీంతో.. నిరసనగా గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప ఏమీ పట్టవా?. మాకు కావాల్సింది రాజకీయ లబ్ధి కాదు.. ప్రజలకు మంచి జరగడం అని అన్నారాయన. ‘‘ప్రభుత్వం,మంత్రుల నుంచి బాధ్యతారాహిత్యంగా సమాధానం వస్తోంది. ప్రజల సమస్యలపై కనీసం బాధ్యత లేదు. నిస్సిగ్గుగా సమాధానాలు చెబుతున్నారు. 50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే సమాధానం లేదు. ప్రజలకు మంచి జరిగేందుకు పోరాటం చేయడం మా బాధ్యత. కల్తీ మద్యం పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మద్యం ఏరులైపారుతున్నా కనీసం ప్రభుత్వంలో చలనం లేదు. తిరుపతి,సింహాచలం ఘటనలు ప్రభుత్వనిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగితే డొంకతిరుగుడు సమాధానం ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లడాన్ని విమర్శిస్తున్నారు. .. మేం ఎంతో హుందాగా ప్రశ్నలు అడిగాం. కానీ మంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. తిరుపతి,సింహాచలం ఘటనలతో ప్రభుత్వం ,మంత్రికి సంబంధం లేదా?. ఈ ప్రభుత్వానికి.. ప్రజలు.. దేవుడు అంటే లెక్కలేదు. ఎంత సేపూ కుర్చీ కోసమే ఆరాటం. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను వాకౌట్ చేశాం. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే అంశాలనే మేం తీసుకుంటున్నాం. మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని రెండు రోజుల నుంచి పదిరోజులకు మార్చామని విమర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ వైఖరి ఏంటని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి రాజీనామా చేయాలి’’ అని బొత్స డిమాండ్ చేశారు. అంతకు ముందు మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతూ..తిరుపతిలో జరిగింది ఘోరమైన ఘటనేనని, ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రసంగించారు. టీటీడీ పాలకమడలి భక్తులకు ఎందుకు క్షమాపణలు చెప్పలేదని.. బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని వరుదు కళ్యాణి నిలదీశారు. భక్తుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? అని ప్రశ్నించారామె. ప్రభుత్వం, టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని అన్నారామె. -
ఓనర్స్ ఆర్ టెనెంట్స్.. కెప్టెన్సీ ఎవరికీ దక్కింది..!
బిగ్బాస్ రెండో వారం మరింత హాట్హాట్గా కొనసాగుతోంది. నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు ఓ రేంజ్లో రెచ్చిపోయారు. తీరా చూస్తే ఈ వారంలో భరణి, హరీశ్, మనీష్, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, సుమన్ శెట్టి నామినేట్ అయ్యారు. తాజాగా ఇవాళ బిగ్బాస్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో కెప్టెన్సీ కోసం కంటెెస్టెంట్స్ ఎలా పోటీ పడ్డారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: 4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్లో ఏడుగురు)ప్రస్తుతం నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో హౌస్లో కెప్టెన్సీ గోల మొదలైంది. ఇందులో భాగంగా ఓనర్స్, టెనెంట్స్ మధ్య బజర్ నొక్కే టాస్క్ పెట్టాడు బిగ్బాస్. టాస్క్లో భాగంగా ఈ రెండు గ్రూపుల మధ్య ఫోన్ కాల్స్.. మేమంటే మేము అంటూ బజర్ నొక్కలేదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరి చివరికీ కెప్టెన్సీ ఏ గ్రూప్కు దక్కిందన్నది తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. తాజాగా ఇవాళ రిలీజైన ప్రోమో చూస్తే కెప్టెన్సీ కోసం రెండు గ్రూపుల మధ్య పోటీ గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది. The captaincy battlefield is blazing!housemates unleash full power, who will rise as the winner of this challenge? 👁️🔥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/SUMP0IYtuY— JioHotstar Telugu (@JioHotstarTel_) September 18, 2025 -
బీటౌన్ ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నీతా అంబానీ
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. తన తొలి ప్రాజెక్ట్గా "The Bads of Bollywood" అనే సాటిరికల్ యాక్షన్ డ్రామా (సెప్టెంబర్ 18) నుంచి స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన స్టార్-స్టడెడ్ స్క్రీనింగ్ ఈవెంట్లో అనేక మంది ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా ఫ్యాషన్ ఐకాన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ (Nita Ambani) అందరి దృష్టిని ఆకర్షించారు. తన స్టైలిష్ లుక్తో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు.ఈవెంట్కి తగినట్టు డైమండ్ నగలు,అద్భుతమైన చీరలు, అందానికి మించిన హందాతనంతో ప్రతీ ఈవెంట్లోనూ నీతా అంబానీ ప్రత్యేకంగా నిలుస్తారు. తాజాగా ఈవెంట్లో ఆమె దుస్తులుఅందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన పచ్చని అద్భుతమైన హారమే ప్రత్యేకంగా నిలవడం విశేషం.నీతా అద్భుతమైన పరాయిబా, హృదయాకారపు వజ్రాల డబుల్ స్ట్రింగ్, వజ్రాల హారాన్ని ధరించారు. హృదయ ఆకారపు స్టడ్ చెవిపోగులు, సరిపోలే ఉంగరం ,సున్నితమైన డైమండ్ బ్రాస్లెట్తో తన లుక్ను మరింత ఎలివేట్ చేశారు. అలాగే ఈ హారానికి పొదిగిన టైటానియం ఫ్లవర్ పీస్మరింత ఆకర్షణీయంగా నిలిచింది. దీనికి మ్యాచింగ్ కలర్లో ఆమె ధరించిన చీర నీతా అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది.అనన్య పాండే, కరణ్ జోహార్, ఫరా ఖాన్, బాబీ డియోల్, అలియా–రణ్బీర్, విక్కీ కౌశల్ మరియు అనేక మంది స్టార్-స్టడెడ్ సాయంత్రం హాజరయ్యారు. సందడిగా సాగిన ఈ స్క్రీనింగ్ ఈవెంట్లో అంబానీ ఫ్యామిలీ మరో ఎట్రాక్షన్. సెలబ్రిటీలతో పాటు, అంబానీలు కూడాను అందంగా తీర్చిదిద్దారు. నీతా అంబానీ తన భర్త ముఖేష్ అంబానీ చేతిలో చేయి వేసి, రెడ్ కార్పెట్పై పోజులిచ్చారు. ఇంకా ఆకాష్ రాధిక , శ్లోకా, ఇషా అంబానీ మెరిసారు. ఆకాష్ అంబానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) గ్రాండ్ ప్రీమియర్ కోసం, రాధిక బోల్డ్ రెడ్ స్ట్రాప్లెస్ గౌను ధరించి, డైమండ్ నెక్లెస్ మరియు బ్రాస్లెట్తో పాటు చిన్న రెడ్ క్లచ్ బ్యాగ్తో తన లుక్ను అలంకరించింది. శ్లోకా షీర్ కార్సెట్-స్టైల్ బాడీస్ , భారీ ప్యాట్రన్డ్ స్కర్ట్తో కూడిన నేవీ-బ్లూ గౌనును ఎంచుకున్నారు, ఆకాష్ క్లాసిక్ బ్లాక్ వెల్వెట్ టక్సేడోలో చాలా అందంగా కనిపించారు. -
అందుకే ఆసియా కప్లో ఆడుతున్నాం!.. అవునా?.. నిజమా?!
‘నో- షేక్హ్యాండ్’ వివాదంలో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆఖరికి తలవంచకతప్పలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాల్లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. ఫలితంగా ‘బాయ్కాట్’ నాటకాన్ని పక్కనపెట్టిన పాక్ జట్టు.. యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడింది. అంతేకాదు ఈ మ్యాచ్కు రిఫరీ కూడా ఆండీనే కావడం విశేషం. అయితే, ‘సమాచార లోపం కారణంగానే ఇది జరిగిందంటూ పైక్రాఫ్ట్ మాకు క్షమాపణ చెప్పారు. ఆడియో లేని వీడియో.. చీప్ ట్రిక్స్ ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపిస్తామని ఐసీసీ కూడా చెప్పింది’ అంటూ పీసీబీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పైక్రాఫ్ట్తో తమ బృందం చర్చిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అయితే పాక్ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఆడియో లేకుండా పాక్ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ పనికిరావని.. నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు.బాయ్కాట్కు అందరి మద్దతు ఉంది.. కానీఇదిలా ఉంటే.. తాము ఆసియా కప్ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘‘సెప్టెంబరు 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము.కాసేపటి క్రితమే మ్యాచ్ రిఫరీ మా జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్తో మాట్లాడారు. నో- షేక్హ్యాండ్ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం.రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్కాట్ చేస్తే.. అదొక అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మనకు ప్రధాన మంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతు ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు!కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అంటూ నక్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా రిఫరీ విషయంలో తమదే పైచేయి అయినందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.కాగా సెప్టెంబరు 14న పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమానభారంతో రగిలిపోయిన పాక్.. బాయ్కాట్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ఒకవేళ నిజంగానే వాళ్లు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.వారికే నష్టంఇప్పటికే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న పాక్ బోర్డు పరిస్థితి మాత్రం మరింత దిగజారడం ఖాయం. టోర్నీ నుంచి రావాల్సిన ఆదాయం కోసమే కొనసాగినా.. నక్వీ ఇలా సాకులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్లో యూఏఈని ఓడించిన పాక్.. సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంటో సెప్టెంబరు 21న సల్మాన్ ఆఘా బృందం టీమిండియాను ఢీకొట్టనుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు?
బంగారానికి భారత్తోపాటు వివిధ దేశాల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భరోసానిచ్చే సాధనంగా సాధారణ ప్రజలు పసిడిని కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు శుభకార్యాలు, ప్రత్యేక ఈవెంట్ల కోసం ఖరీదు చేస్తారు. వీరితోపాటు భారీ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇండియాతోపాటు చాలా దేశాలు ఎందుకు ఇలా భారీగా పసిడిని కొనుగోలు చేస్తాయో తెలుసుకుందాం.కరెన్సీకి అండగా..ద్రవ్యోల్బణం పెరుగుతూ, దేశ కరెన్సీ విలువ తగ్గుతుంటే దాన్ని కాపాడేందుకు బంగారం హెడ్జింగ్గా పని చేస్తుంది. ముద్రించిన కరెన్సీ(ఫియట్ కరెన్సీ) విలువ తగ్గినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం విలువ బలపడుతుంది. ఇది దిగుమతులకు ఆసరాగా ఉంటుంది. అస్థిరత సమయాల్లో బంగారం జాతీయ కరెన్సీలను కాపాడుతుంది. దేశం ద్రవ్య విధాన చట్రానికి విశ్వసనీయతను అందిస్తుంది.రిస్క్ వైవిధ్యంకేంద్ర బ్యాంకులు రిస్క్ను డైవర్సిఫై చేసేందుకు బంగారం నాన్-కోరిలేటెడ్ ఆస్తిగా ఉపయోగపడుతుంది. దీని విలువ ఈక్విటీలు లేదా బాండ్లతో అనుగుణంగా పడిపోదు. యూఎస్ డాలర్ పడిపోయినప్పుడు ఇది పెరుగుతుంది. ఇది రిజర్వ్ పోర్ట్ ఫోలియోల్లో స్మార్ట్ డైవర్సిఫికేషన్ హెడ్జ్గా మారుతుంది.భౌగోళిక రాజకీయ పరిస్థితులుబంగారం ఏ ఒక్క దేశానికి పరిమితమైంది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడం ఏ ఒక్క దేశంలో వల్లనో సాధ్యం కాదు. దీని విలువపై ఎన్నో అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విదేశీ కరెన్సీ నిల్వల మాదిరిగా కాకుండా, బంగారాన్ని స్తంభింపజేయడం లేదా దానిపై రాజకీయం చేయడం సాధ్యం కాదు. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు బంగారం నిల్వలను పెంచాయి.లిక్విడిటీబంగారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత లిక్విటిటీ ఆస్తుల్లో ఒకటి. దీన్ని దాదాపు ఏ ఆర్థిక మార్కెట్లోనైనా ఆమోదిస్తారు. ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధాల సమయంలో దీన్ని త్వరగా నగదుగా మార్చవచ్చు లేదా అత్యవసర నిధుల కోసం తాకట్టుకు ఉపయోగించవచ్చు.టాప్ 8 దేశాల్లోని బంగారు నిల్వలు..దేశంబంగారం నిల్వలు (టన్నులు)అమెరికా8,133.46జర్మనీ3,350.25ఇటలీ2,451.84ఫ్రాన్స్2,437.00రష్యా2,329.63చైనా2,279.60స్విట్జర్లాండ్1,040.00భారతదేశం880.00 -
జ్యూస్ తాగుతుండగా గుండె ఆగింది!
క్రైమ్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు జ్యూస్ తాగుతూ కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆలోపే అతని ప్రాణం పోయింది. బుధవారం రాత్రి 8గం. ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యూస్ తాగుతూ ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతనికి సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయితే అతని నుంచి స్పందన లేకపోవడంతో వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మృతి చెందాడు. గుండెపోటుతోనే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా పల్లిపాడుగా పోలీసులు తెలిపారు. అతని పేరు, ఇంతకు ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. -
పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్తో రోజుకు రూ.లక్ష పైనే..!
ఒక్కోసారి పెద్దపెద్ద చదవులు చదివినా..ఉద్యోగం సంపాదించడంలో విఫలమవుతుంటారు. టన్నుల కొద్దీ డిగ్రీలు చేసినా అక్కరకు రాకుండా పోతుంటాయి. అలా అని నైరాశ్యంతో కూర్చోకుండా ఏదో ఒక మార్గం ఎంచుకుని ముందుకుపోయి గ్రేట్ అనిపించుకునే వారు ఒకరో, ఇద్దరో ఉంటారు. ఆ కోవకు చెందినవాడే ఈ చైనీస్ వ్యక్తి. ఈ వ్యక్తి చదివినదానికి చేస్తున్న పనికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఓ గొప్ప సందేశం అందించాడు. జియాంగ్సు ప్రావిన్స్ నుంచి పీహెచ్డీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన 37 ఏళ్ల డింగ్ స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆయన బెల్జియంలో భూ సంరక్షణ, పంట ఉత్పత్తిలపై పరిశోధన కూడా చేశారు. దాదాపు 30 పరిశోధనా పత్రాలు సమర్పించి మరి డాక్టోరల్ పట్టాని కూడాపొందారు. ఇంతటి ఉన్నత విద్యావంతుడైనా అవేమి ఆయనకు జీవనాధారం కాలేకపోయాయి. కనీసం అతడి పొట్టని పోషించేకునే సామర్థ్యాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కించెత్తు నిరాశకు చోటివ్వకుండా తన భార్య వాంగ్తో కలిసి స్పైసీ చాంగ్కింగ్ తరహా బఠానీ నూడుల్స్ అమ్మూతూ..ఫుడ్ వ్యాపారంలో మంచి లాభాలను అందుకున్నాడు. అంతేగాదు అనతికాలంలోనే అతడి ఫుడ్స్టాల్ ఫేమస్ అయ్యి ఏకంగా రోజుకి రూ. లక్ష రూపాయల పైనే ఆర్జించే రేంజ్కు చేరకున్నాడు. గత మేనెలలో తన భార్య వాంగ్ స్వస్థలంలోని స్థానిక మార్కెట్లో ఈ ఫుడ్ స్టాల్ని ప్రారంభించారు. ఒక ప్లేట్ స్పైసీ బఠానీ నూడుల్స్ ధర రూ. 600 నుంచి రూ. 700 పై చిలుకు అమ్ముతున్నట్లు వెల్లడించాడు డింగ్. స్థానికుల అభిరుచులకు అనుగుణంగా కాస్త స్పైసీ తగ్గించి విక్రయించి.. కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. నెటిజన్లు సైతం ఆ జంట చాలా తెలివైన వారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. విదేశంలో చైనీస్ నూడుల్స్తనో ఆదాయం సృష్టించుకున్న తెలివైన వ్యవస్థాపక దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ) -
సిద్ధమవుతున్న డబ్ల్యూఎన్7 బైక్: ధర రూ.15.5 లక్షలు!
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. కంపెనీ దీనిని 'డబ్ల్యుఎన్7' పేరుతో మార్కట్లో లాంచ్ చేయనుంది. ఇది ఒక ఛార్జ్పై 130 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.హోండా డబ్ల్యుఎన్7 బైక్.. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 30 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అయితే 6కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 3 గంటలు అని తెలుస్తోంది. ఈ బైకులో 18కేడబ్ల్యు లిక్విడ్ కూల్డ్ మోటార్ ఉంటుంది. కాగా ఈ బైక్ బరువు 217 కేజీలు అని సమాచారం.హోండా డబ్ల్యుఎన్7 బైక్ 5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT స్క్రీన్ పొందుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ రోడ్సింక్ కనెక్టివిటీతో వస్తుంది. ఇందులో ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ముందు భాగంలోని హెడ్లైట్పై పెద్దదిగా కనిపిస్తుంది. కంపెనీ ఈ బైకును యూకేలో 12999 పౌండ్స్కి (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 15.5 లక్షలు) విక్రయించే అవకాశం ఉంది. అయితే ఈ బైక్ భారతీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం లేదని సమాచారం. -
బ్యాంక్ రుణాల్లో వృద్ధి ఎంతంటే..
బ్యాంకుల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతంగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ముఖ్యంగా ద్వితీయ ఆరు నెలల కాలంలో (అక్టోబర్ నుంచి) రుణ వృద్ధి వేగాన్ని అందుకోవచ్చని తెలిపింది. కార్పొరేట్ రుణాలు నిదానిస్తాయంటూ.. రిటైల్ రుణాలు వృద్ధిని నడిపించనున్నట్టు వెల్లడించింది. డిపాజిట్లలో గృహాల వాటా తగ్గుతుండడం ఆందోళనకరమంటూ, డిపాజిట్లలో స్థిరత్వం సమస్యలకు దారితీయొచ్చని పేర్కొంది.‘2025–26 క్యూ1లో (ఏప్రిల్–జూన్) రుణ వృద్ధి 9.5 శాతానికి నిదానించింది. ఆ తర్వాత 10 శాతానికి పెరిగింది. ద్వితీయ ఆరు నెలల్లో రుణాల్లో వృద్ధి వేగవంతమై పూర్తి ఆర్థిక సంవత్సరానికి 11–12 శాతానికి చేరుకోవచ్చు’ అని క్రిసిల్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు ఇందుకు అనుకూలిస్తాయన్నారు. ఆర్బీఐ రెపో రేట్ల తగ్గింపు ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై ఇంకా పూర్తిగా ప్రతిఫలించాల్సి ఉందన్నారు. బ్యాంకు రుణ రేట్లు తగ్గుముఖం పడితే అప్పుడు డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేశారు. ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకోవడానికి కొంత సమయం పట్టొచ్చని చెప్పారు. డిపాజిట్లు కీలకం..బ్యాంక్ డిపాజిట్లలో గృహాల వాటా ఐదేళ్ల క్రితం 64 శాతంగా ఉంటే, అది 60 శాతానికి తగ్గడం పట్ల క్రిసిల్ రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది. స్థిరమైన రుణ వృద్ధికి డిపాజిట్లు కీలకమని పేర్కొంది. వ్యవస్థలో లిక్విడిటీ పెంచే దిశగా ఆర్బీఐ తీసుకున్న చర్యలతో (సీఆర్ఆర్ తగ్గింపు, లిక్విడిటీ కవరేజీ నిబంధనలు) డిపాజిట్లలో వృద్ధి తగినంత ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 2026 మార్చి నాటికి 2.3–2.5 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది.ఇదీ చదవండి: త్వరలో ఈ-ఆధార్ యాప్ ప్రారంభం -
ఈ వేలంవెర్రికి తెర పడదా?
సింపుల్గా.... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్కు సన్నిహితుడూ, కరడు గట్టిన జాతీయవాదీ అయిన చార్లీ కిర్క్ హత్యోదంతంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అమెరికాలో యూటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతుండగా, ఈ నెల 10న ఓ ముష్కరుడు జరిపిన ఆ కాల్పులతో అమెరికాలోని తుపాకీల సంస్కృతిపై మరో మారు చర్చ రేగింది. అలనాటి అబ్రహామ్ లింకన్ నుంచి నేటి కిర్క్ దాకా అనేక హత్యా ఘటనలు, స్కూళ్ళలో కాల్పులు, రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతూనే ఉన్నాయి. తుపాకీ లపై వ్యామోహం, వినియోగాన్ని నియంత్రిస్తూ కట్టుదిట్టమైన చట్టం తీసుకువచ్చేందుకు గతంలో పలు అమెరికన్ ప్రభుత్వాలు ప్రయత్నించినా అడ్డంకులు ఎదురయ్యాయి ఇప్పుడేం జరిగింది?అమెరికాలో తుపాకీల పిచ్చి ఎంతంటే... ఆ దేశ జనాభా కన్నా తుపాకీల సంఖ్యే ఎక్కువ. ప్రపంచ జనాభాలో అక్కడున్నది 5 శాతం కన్నా తక్కువే. కానీ, భూమిపై సామాన్యుల దగ్గరున్న గన్స్లో 45 శాతం పైగా అక్కడే ఉన్నాయి. తుపాకీ లైసెన్సును దేవుడిచ్చిన హక్కుగా సంబోధిస్తూ, ఆ సంస్కృతిని సమర్థిస్తూ వచ్చిన 31 ఏళ్ళ వీర జాతీయవాది చార్లీ కిర్క్. ఆయన తన 18వ ఏటనే టర్నింగ్ పాయింట్ అనే సంస్థను నెలకొల్పి, తన ప్రసంగాలతో ఆకర్షిస్తూ వచ్చారు. ఉదారవాద అమెరికన్ కాలేజీల్లో జాతీయ వాద ఆదర్శాలను విస్తరింపజేసేందుకు ప్రయత్నించారు. గన్స్ నియంత్రణను వ్యతిరేకించిన ఆయన చివరకు ఓ స్నైపర్ దూరం నుంచి గురిచూసి కాల్చిన తూటా మెడకు తగిలి, ప్రాణాలు కోల్పోయారు. చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!నేపథ్యం ఏమిటి?అమెరికా రాజ్యాంగ రెండో సవరణ ప్రకారం గన్స్ హక్కు పౌరులకుంది. అదే ఆ దేశ సంస్కృతినీ తీర్చి దిద్దింది. సాక్షాత్తూ నలుగురు దేశాధ్యక్షుల నుంచి సామాన్యుల దాకా ఎందరో బలయ్యారు. అమెరికన్ రాజకీయాలనూ, నిత్యజీవితాన్నీ ప్రభావితం చేసిన ఈ తుపాకీల సంస్కృతి నియంత్రణకు సంబంధించి ఏళ్ళుగా చర్చ సాగుతూనే ఉంది. అయితే, ఈ అంశం కేవలం విధానపరమైనదే కాదు. రాజ్యాంగంలోని వివిధ అంశాల వ్యాఖ్యానం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, వ్యక్తిగత భద్రతలతోనూ ముడిపడిన విషయం. నియంత్రణ సమర్థకులు, వ్యతిరేకులుగా అమెరికన్ సమాజం నిట్టనిలువునా చీలిపోయింది. కిర్క్ హత్యా ఘటన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.గత చరిత్రఅమెరికాలో మొదట వేట, స్వీయ రక్షణ కోసం గన్స్ వచ్చాయి. 1791లో తెచ్చిన ‘బిల్ ఆఫ్ రైట్స్’లో ఆయుధాలను కలిగివుండే రాజ్యాంగ రెండో సవరణ కూడా చోటుచేసుకుంది. క్రమంగా తుపాకీలను స్వేచ్ఛకు ప్రతీక అనుకోవడం మొదలైంది. అయితే, గన్స్ వినియోగం దోవ తప్పి నేరాలకు దారితీసింది. 1934లో ప్రధానమైన తొలి ఫెడరల్ ఆయుధ చట్టం తెచ్చారు. దశాబ్దాల అనంతరం జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ల హత్యల తర్వాత అమెరికన్ కాంగ్రెస్ తుపాకీ నియంత్రణ చట్టం 1968 చేసింది. అయినా దుర్వినియోగం ఆగలేదు. తర్వాతా సంస్కరణలు తేవాలని పలు వురు అమెరికన్ అధ్యక్షులు యత్నించి, విఫలమయ్యారు. ఒబామా అలాంటి చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని 17 సార్లు ప్రయత్నించారు.వర్తమానం... భవిష్యత్తు...అమెరికాలో ప్రతి 10 మందిలో నలుగురి ఇంటి వద్ద తుపాకీలు ఉన్నాయట. యుద్ధ పీడిత యెమెన్తో పోలిస్తే ఇక్కడే రెట్టింపు కన్నా ఎక్కువగా తలసరి 1.2 గన్నులున్నాయి. సగటున రోజూ 128 గన్ డెత్స్ సంభవిస్తున్నాయి. అంటే, సగటున ప్రతి 11 నిమిషా లకూ ఒకరు ప్రాణాలు వదులుతున్నారు. ఇంత జరుగుతున్నా గన్ రైట్స్పై అమెరికా ఒక్క తాటి మీద లేదు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ లాంటి బలమైన లాబీలూ దీని వెనుక పనిచేస్తున్నాయి. మునుపు 1980, 90లలో ఆస్ట్రేలియాలో ఇలానే తుపాకీలు రాజ్యమేలుతుంటే, కఠినమైన నియంత్రణతోఅదుపు చేశారు. అమెరికాలోనేమో అలాంటిది కనుచూపు మేరలో కనిపించడం లేదు. -
అంపైర్పైకి బంతిని విసిరిన పాక్ ఫీల్డర్.. తర్వాత ఏమైందంటే?
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు- మ్యాచ్ అధికారులకు అస్సలు పడటం లేదనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియాతో ‘నో-షేక్హ్యాండ్’ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్న పాక్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)తో మ్యాచ్ సందర్భంగా అనూహ్య రీతిలో ఫీల్డ్ అంపైర్ను గాయపరిచింది.ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. పాక్ ఫీల్డర్ చేసిన పని కారణంగా సదరు అంపైర్ నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడటం కనిపించింది. యూఏఈ ఆరో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ధ్రువ్ పరాశర్ (Dhruv Parashar) ఆరో ఓవర్లో సయీమ్ ఆయుబ్ బౌలింగ్ను ఎదుర్కొన్నాడు.అంపైర్పైకి పాక్ ఫీల్డర్ త్రో.. బలంగా తాకిన బంతిఓవర్ ఐదో బంతిని థర్డ్మ్యాన్ రీజర్ దిశగా తరలించిన పరాశర్.. సింగిల్ కోసం పరుగు తీశాడు. ఇంతలో ఫీల్డర్ బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. అయితే, నేరుగా అది ఫీల్డ్ అంపైర్ రుచిర పల్లియాగురుగే (Ruchira Palliyaguruge) తలకు తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడగా.. సయీమ్ ఆయుబ్ వచ్చి ఆరా తీశాడు. మిగతా ఆటగాళ్లు కూడా వచ్చి అతడిని పరామర్శించారు.తర్వాత ఏమైందంటే?అదే విధంగా పాక్ ఫిజియో వచ్చి అంపైర్కు కంకషన్ టెస్టు చేశాడు. ఈ క్రమంలో రుచిరా (శ్రీలంక) మైదానం వీడగా.. రిజర్వ్ అంపైర్ గాజీ సోహెల్ (బంగ్లాదేశ్) అతడి స్థానంలో బాధ్యతలు నిర్వర్తించాడు. Andy Pycroft- just missedRuchira - successRevenge from the previous game against India.. #Uaevpak pic.twitter.com/CY1hb7N8KM— Nibraz Ramzan (@nibraz88cricket) September 17, 2025 ఆండీ పైక్రాఫ్ట్పై ఫిర్యాదుకాగా భారత ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదనే సాకుతో ఆదివారం నుంచి అసహనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్ జట్టు చివరకు ఏమీ సాధించకుండానే యూఏఈతో మ్యాచ్ బరిలోకి దిగింది.భారత క్రికెటర్లు తమతో కరచాలనం చేయకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిలువరించారని, ఆయనను ఆసియా కప్ రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన డిమాండ్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏమాత్రం పట్టించుకోలేదు. టోర్నీ సంగతి తర్వాత... యూఏఈతో బుధవారం పాక్ ఆడిన మ్యాచ్కు కూడా పైక్రాఫ్ట్నే రిఫరీగా ఎంపిక చేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.‘క్షమాపణ’ చెప్పారంటూ...ఈ మ్యాచ్ తాము ఆడబోమని, టోర్నీనే బహిష్కరిస్తామంటూ పాక్ మేనేజ్మెంట్ నుంచి ముందుగా సందేశాలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే నిర్ణీత సమయానికి పాక్ ఆటగాళ్లు మైదానానికి బయలుదేరకుండా హోటల్లోనే ఉండిపోయారు కూడా. అయితే చివరకు తమకు పైక్రాఫ్ట్ ‘క్షమాపణ’ చెప్పారంటూ పాక్ ఆటగాళ్లు స్టేడియానికి వచ్చారు.ఈ క్రమంలో పసికూన యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించిన పాక్ జట్టు.. సూపర్-4కు అర్హత సాధించింది. తదుపరి.. ఆదివారం నాటి మ్యాచ్లో మరోసారి టీమిండియాను ఢీకొట్టనుంది. కాగా గ్రూప్-ఎ టేబుల్ టాపర్గా టీమిండియా ముందుగానే సూపర్-4కు చేరగా.. పాక్ రెండో స్థానంతో బెర్తును ఖరారు చేసుకుంది. యూఏఈ, ఒమన్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే? Not textbook, but definitely effective 💥Watch the #DPWorldAsiaCup, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork pic.twitter.com/n31XKIwlah— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025 -
యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే భారీ వితరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నదే. అయితే తన నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Batthula Laxma Reddy), ఆయన కుటుంబసభ్యులు భారీ విరాళం అందించారు. ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ రిసెప్షన్ను రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ (Revanth Reddy)ను లక్ష్మారెడ్డి కలిసి రూ.2కోట్ల చెక్ అందజేశారు. తాను అందించిన వితరణతో లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని సీఎంను ఆయన కోరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను సీఎం రేవంత్ అభినందించారు. -
దీపికా పదుకొణెకు షాకిచ్చిన 'కల్కి' టీమ్
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కల్కి 2లో నటించడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే దీపికాకు ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు సడెన్గా కల్కి సీక్వెల్లో ఆమె భాగం కావడం లేదని నిర్మాణ సంస్థ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.కల్కి సీక్వెల్లో దీపికా పదుకొణె నటించడం లేదంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఇలా చెప్పుకొచ్చింది. 'కల్కి 2898AD సినిమాకు రాబోయే సీక్వెల్లో దీపికా పదుకొణె నటించడం లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ, మా మధ్య భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి చిత్రానికి నిబద్ధత చాలా అవసరం. ఆమె భవిష్యత్లో మరెన్నో సినిమాలు చేయాలని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము' అని సోషల్మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది.దీపిక డిమాండ్లు ప్రభాస్- సందీప్రెడ్డి సినిమా స్పిరిట్ మూవీలో హీరోయిన్గా దీపికా పదుకొణె అనుకున్నారు. అయితే, సడెన్గా ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నారు. ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైజయంతీ మూవీస్ వారు అందుకు నో చెప్పినట్లు సమాచారం. వారి మధ్య ఢీల్ సెట్ కాకపోవడంతో దీపికా పదుకొణెను తప్పించారని తెలుస్తోంది.This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD. After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership. And a film like…— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025 -
ఉగ్రవాదుల గౌరవం కోసం మునీర్ పట్టు .. జెఈఎం కమాండర్ వెల్లడి
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని, వారికి తగిన గౌరవం అందించాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాక్ సైనిక అధికారులను ఆదేశించారని జెఈఎం కమాండర్ ఇలియాస్ కశ్మీరీ వెల్లడించారు.‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్లోని బహవల్పూర్లో జరిగిన నష్టాన్ని జైష్ ఎ మొహమ్మద్ (జెఈఎం) కమాండర్ అంగీకరించిన రెండు రోజుల తర్వాత, అదే కమాండర్ షేర్ చేసిన మరొక క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. దీనిలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ భారత ఆపరేషన్లో మరణించిన పాక్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని ఉన్నతాధికారులకు సూచించారని చెప్పడం వినవచ్చు. 🚨🚨🚨 Exclusive:DG ISPR asked for linkage between Bhawalpur and Jaish-e-Muhammad His partner in terror Jaish commander Ilyas Kashmiri confirms: "GHQ (Pakistan Army chief) ordered his Generals to attend funerals of terrorists eliminated in Bahawalpur Jaish camp during… pic.twitter.com/MzA4KmYKxu— OsintTV 📺 (@OsintTV) September 16, 2025ఈ వీడియోలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హతమైన ఉగ్రవాదులకు నివాళులు అర్పించే దేశ నేతలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో జైష్ ఎ మొహమ్మద్ పాత్ర ఉందని భారత్ ఇంకా ఆధారాలు సమర్పించలేదని ఆయన చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. కాగా మే 7న బహవల్పూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారత క్షిపణి దాడుల్లో ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం నాశనమయ్యిదని కశ్మీరీ అంగీకరించారు. కాగా అసిమ్ మునీర్ ఆదేశాల దరిమిలా పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్, పోలీసు సీనియర్ అధికారులు ఉన్నత అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు. -
గయ మహిమ : ఆయన శరీరమే క్షేత్రంగా
‘త్రిమూర్తుల్లో భేదం లేదు, ముగ్గురూ ఒకటే’ అనటానికి గయ క్షేత్రం నిదర్శనం. చనిపోయిన ఆత్మీయ బంధు మిత్రుల పేర ఈ చోట కర్మకాండలా చరిస్తే మరణించిన వారికి ఉత్తమ గతులు కల్గుతాయి. ఈ కర్మనే ‘గయా శ్రాద్ధ’ మంటారు. మన ఇంటిలో పితృకార్యం జరిగినప్పుడు కూడా ‘గయా శ్రాద్ధ ఫలితమస్తు’ అని మంత్రం చదువుతారు. పిండ ప్రదానం చేస్తూ ‘గయా పిండ సదృశా భవంతు’ అని అంటారు. మన దేశంలో గయ, కాశీ, ప్రయాగ... ఈ మూడు ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన క్షేత్రాలు, తీర్థాలున్నూ! వీటినే క్షేత్ర త్రయమంటారు. ఈ గయా క్షేత్రానికి పెద్ద చరిత్ర ఉంది. వేల సంవత్సరాలకు పూర్వం గయుడనే రాక్షసుడుండేవాడు. విష్ణువును గురించి ఘోరంగా తపస్సు చేసి, వందల మైళ్ళ దీర్ఘమైన భారీ శరీరం కావాలని వరం కోరుకున్నాడు. క్షణంలో అంత పెద్ద భయంకర శరీరం గయునికి వచ్చింది. గర్వం నెత్తికెక్కినప్పుడు ఎవరికైనా తిక్క మాటలు వస్తాయి. ఏకంగా బ్రహ్మదేవుడినే ఉద్దేశించి, ‘నీకేమైనా వరం కావాలంటే కోరుకో’ అన్నాడు. ఎంత కండకావరమో చూడండి! ‘అయితే గయుడా! ఈ శరీర భాగాల్లో ఒక చోట నాకు యజ్ఞం చేయాలని ఉంది’ అంటాడు బ్రహ్మ. ‘అలాగే యజ్ఞం చేయి కానీ, ఒక షరతు! అప్పుడు నా శరీరం కదలటానికి వీలులేనంత బరువు నాపై పెట్టాలి’ అన్నాడు. బ్రహ్మ ముందు శివ పార్వతులను ప్రార్థించాడు. ‘శివ శిల’ అనే పెద్ద రాయిని గయుడి మీద పెట్టారు. వెంటనే రాక్షసుని రొమ్ము మీద నిలబడ్డాడు విష్ణువు. ఎంత గింజుకున్నా గయుడింక కదలలేడు. బ్రహ్మ సంకల్పం కదా! శివుని శిల, విష్ణు పాదం... ఈ ముగ్గురి స్పర్శాదుల వల్ల వాడిలో మార్పు వచ్చింది. ‘త్రిమూర్తులు నా వల్ల జగత్తుకు ఏ మాత్రం బాధ కలగకూడదని సంకల్పించి యుక్తిగా నా లోని చెడును ఈ విధంగా తొక్కిపెట్టారు’ అని తప్పు తెలుసుకున్నాడు. ‘నా చివరి కోరిక ఒక్కటే. ఈ ప్రాంతానికి నా పేరు పెట్టాలి. నా మీద పడిన పవిత్ర పాదముద్రలకు అభిషేకం చేసినా, పితృశ్రాద్ధం చేసినా, నివేదనం పెట్టినా భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థించాడు.తమాషా ఏమిటంటే ఇంతవరకూ బ్రహ్మ గయుని దేహం మీద యజ్ఞం చేయలేదు. గయుని పైకి లెమ్మని కూడా అనలేదు. గయుని శరీరమే గయా క్షేత్రంగా ఉండిపోయింది. త్రిమూర్తుల సమష్టి కృషి ఫలితంగా లోక కల్యాణం కలుగుతున్నది.శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
నాకు సాయం చేసేందుకు ఎవ్వరూ లేరు : విజయ్ ఆంటోని
తమిళ నటుడు విజయ్ ఆంటోని ‘‘భద్రకాళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రీసెంట్గా మార్గాన్ సినిమాతో మెప్పించిన ఆయన మరోసారి సత్తా చాటేందుకు బలమైన కథతో రానున్నారు. ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, తృప్తి రవీంద్ర, రియా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భద్రకాళి’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. తెలుగులో సురేశ్బాబు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో పలు విషయాలను విజయ్ ఆంటోని పంచుకున్నారు.25వ సినిమాగా భ్రదకాళి రానుంది. నంబర్ మాత్రమే మారింది. కానీ, నేను ప్రతి సినిమాకు ఒకే విధంగా పనిచేశాను. అయితే, ఈ సినిమాకు నిర్మాతకు నా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మించాను. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. ఒక నిర్మాతగా ఈ మూవీ కోసం చాలా ఇబ్బందులు పడ్డాను. నా వెనకాల ఎవ్వరూ లేరు. ప్రతి రూపాయి నేను మాత్రమే ఖర్చు పెట్టాలి. సుమారు 15 నెలల పాటు ఎంతగానో శ్రమించాను. సినిమా విడుదలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, వడ్డీలు వంటి విషయాలను చూసుకునే క్రమంలో కొన్ని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ, వాటిని అధిగమించి సినిమా కోసం పనిచేశాను. అయితే నిర్మాత సురేశ్బాబుతో మంచి స్నేహం ఉంది. మార్గన్ మూవీని తెలుగులో ఆయనే విడుదల చేశారు. మరోసారి వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాను. సుమారు 300కు పైగా థియేటర్స్లో భద్రకాళి విడుదల చేస్తున్నారు. అని ఆయన అన్నారు. -
అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సూపర్-4 దశకు అర్హత సాధించింది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను 41 పరుగుల తేడాతో ఓడించి.. లీగ్ దశను విజయవంతంగా ముగించింది. యూఏఈ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి ఎట్టకేలకు గట్టెక్కిన పాక్.. మరోసారి టీమిండియతో తలపడేందుకు సిద్ధమైంది.దుబాయ్ వేదికగా సెప్టెంబరు 21న పాకిస్తాన్.. టీమిండియా (Ind vs Pak)ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో యూఏఈపై విజయానంతరం పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha).. తాము ఏ జట్టునైనా ఓడించగలమంటూ కాస్త అతిగా మాట్లాడాడు. ‘‘మేము ఈ మ్యాచ్లో మెరుగ్గా ఆడాము. అయితే, మధ్య ఓవర్లలో ఇంకాస్త శ్రమించాల్సింది.అబ్రార్ అహ్మద్ అత్యద్భుతంఏదైమైనా మా బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. కానీ బ్యాటింగ్ పరంగానే మేము నిరాశకు లోనయ్యాం. ఇప్పటి వరకు మా అత్యుత్తమ స్థాయి ప్రదర్శనను కనబరచలేకపోయాం. ఒకవేళ ఈరోజు మేము మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. 170-180 పరుగులు సాధించేవాళ్లం.షాహిన్ ఆఫ్రిది మ్యాచ్ విన్నర్. అతడి బ్యాటింగ్ కూడా మెరుగుపడింది. ఇక అబ్రార్ అహ్మద్ (2/13) అత్యద్భుతంగా రాణించాడు. చేజారే మ్యాచ్లను మావైపు తిప్పడంలో అతడు ఎల్లప్పుడూ ముందే ఉంటాడు.ఎలాంటి జట్టునైనా ఓడించగలముమున్ముందు ఎదురయ్యే ఎలాంటి సవాలుకైనా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇలాగే గొప్పగా ఆడితే.. ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. పరోక్షంగా టీమిండియాను ఉద్దేశించి.. తాము సూపర్-4 పోరుకు సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశాడు.నాటకీయ పరిణామాల నడుమకాగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడ్డాయి. ఈ క్రమంలో యూఏఈ, పాక్లను ఓడించి టీమిండియా తొలుత సూపర్ ఫోర్కు అర్హత సాధించగా.. ఒమన్ ఎలిమినేట్ అయింది. అయితే, గ్రూప్-ఎ నుంచి మరో బెర్తు కోసం పాక్- యూఏఈ బుధవారం రాత్రి తలపడ్డాయి. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో గెలిచి.. తమ బెర్తును ఖరారు చేసుకోగా.. యూఏఈ ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే.. టీమిండియా చేతిలో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోని భారత జట్టు.. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా కరచాలనానికి నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో పాటు తాము బాయ్కాట్ చేస్తామంటూ రచ్చచేసింది. అయితే, ఆఖరికి పాక్ తలొగ్గక తప్పలేదు. యూఏఈతో మ్యాచ్కు గంట కావాలనే ఆలస్యం చేసినా.. చివరకు మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది.పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ స్కోర్లుటాస్: యూఏఈ.. తొలుత బౌలింగ్పాక్ స్కోరు: 146/9 (20)యూఏఈ స్కోరు: (17.4)ఫలితం: యూఏఈపై 41 పరుగుల తేడాతో పాక్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాహిన్ ఆఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్.. మూడు ఓవర్ల బౌలింగ్లో 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు).చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే! -
త్వరలో ఈ-ఆధార్ యాప్ ప్రారంభం
భారత ప్రభుత్వం ఆధార్ వినియోగదారుల కోసం మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తోంది. ప్రాథమిక అవసరాల కోసం ఆధార్ సేవా కేంద్రాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ‘ఈ-ఆధార్’యాప్ను ఉపయోగించి సులువుగా ఆన్లైన్లోనే వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ యాప్ను నవంబర్లో ప్రారంభించబోతున్నట్లు అంచనాలున్నాయి.ఈ మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్డేట్ చేయగల వ్యక్తిగత వివరాలు కింది విధంగా ఉన్నాయి.పేరుచిరునామాపుట్టిన తేదీమొబైల్ నంబర్బయోమెట్రిక్ మార్పులు (వేలిముద్ర / కనుపాపలు) మినహా, ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించకుండా అన్ని అప్డేట్లను డిజిటల్గా చేయవచ్చు.ముఖ్య లక్షణాలుఏఐ ఫేస్ ఐడీ ఇంటిగ్రేషన్: సురక్షితమైన రిమోట్ యాక్సెస్, ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం అనుమతిస్తుంది.క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్: భౌతిక ఆధార్ ఫొటోకాపీల అవసరాన్ని తొలగిస్తుంది.ఆటో డాక్యుమెంట్ పొందడం: పాన్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పీడీఎస్, ఎంఎన్ఆర్ఈజీఏ, యుటిలిటీ రికార్డుల నుంచి వెరిఫై చేసిన డేటాను తీసుకుంటుంది.ఇది ఎందుకు ముఖ్యం?పేపర్ వర్క్, క్యూలు, మోసపూరిత నమోదులను తగ్గిస్తుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో 130 కోట్ల మందికి పైగా ఆధార్ హోల్డర్లకు సాధికారత లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ కింద భారతదేశ డిజిటల్ గవర్నెన్స్ ప్రోత్సాహానికి అనుగుణంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఈ-పాస్పోర్ట్ అర్హులు, దరఖాస్తు వివరాలు.. -
డొనాల్డ్ ట్రంప్ బంగారం విగ్రహం!
అమెరికా కాపిటల్ వెలుపల అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' బిట్కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల నిధులతో.. ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.డొనాల్డ్ ట్రంప్ బిట్కాయిన్ చేతపట్టుకున్న విగ్రహం.. డిజిటల్ కరెన్సీ, మనీటరీ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలలో వడ్డీ పాత్ర వంటి విషయాల మీద ప్రజలలో చర్చ మొదలవ్వాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్, క్రిప్టో మద్దతుదారుల మధ్య సంబంధాలను ప్రతీక అని చెబుతున్నారు. ఈ విగ్రహంపై తీవ్రమైన విమర్శలు కూడా కురిపిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని బంగారంతో చేసారా? లేక బంగారం పూత పూశారా?.. లేదా ఇతర మెటల్స్ ఉపయోగించి రూపొందించారా? అనేది తెలియాల్సి ఉంది.25 శాతం తగ్గిన ఫెడ్ వడ్డీ రేటుయూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపుకే సుముఖత చూపింది. గత ఐదు పాలసీ సమీక్షలలో వడ్డీ రేటును యథాతథ ఉంచడానికి మొగ్గుచూపారు. అయితే 9 నెలల తరువాత వడ్డీ రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు.A crypto group installed a 12-foot golden statue of President Trump 🇺🇸 holding a #Bitcoin placed outside the US capital.This is gold 😂 pic.twitter.com/K3i69PeHCU— CryptoMalaysia (@CryptoMYsia) September 18, 2025 -
పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్రూమ్లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్ఆర్ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ
ఇంటి పెద్దనే కొల్పోతే ఆ కుటుంబం ఓ పెద్ద కుదుపుకులోనై కోలుకోవడం అంత సులభం కాదు. ఆదుకునే వాళ్లు ఉంటే పర్లేదు, బరువు అనుకుంటే ఆ కుటుంబ ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతూ నరకం చవిచూస్తుంది. అలాంటి సమయంలో స్థిరమైన తెగువతో పోరాడే వాళ్లే..యావత్తు ప్రపంచం తమవైపుకి తిప్పుకునేలా సక్సెస్ని అందుకుంటారు. అలాంటి విజయాన్నే అందుకుంది ఈ సాఫ్ట్వేర్ ఇంజీనర్. ఆమె సక్సెస్స్టోరీ ఆర్థిక ఇబ్బందులతో గెలుపుని అందుకోలేకపోతున్నామని సతమతమై యువతకు ఆదర్శం. నెట్టింట ఈ టెక్కీ స్టోరీ వైరల్గా మారింది. రెడ్ఇట్లో వ్యవసాయ కుటుంబ నేపథ్యానికి చెందని ఓ యువతి తాను టెక్నాలజీ రంగంవైపు అడుగులు వేసి ఎలా గొప్ప సక్సెస్ని అందుకుందో నెట్టింట షేర్చేసుకుంది. సుమారు వంద కుటుంబాలు ఉండే ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన తాను టీనేజ్ వయసులోనే తండ్రిని కోల్పోయానంటూ మర్చిపోలేని నాటి ఆవేదనను గుర్తుచేసుకుంది. తన తండ్రి ఒక రైతుగా అవిశ్రాంతంగా పనిచేసేవాడని, ఉన్నటుండి వచ్చి పడిన అనారోగ్యం ఆయన్ను మింగేసిందంటూ తనకు కన్నీళ్లు మిగిల్చిన నాటి విషాదం గురించి చెప్పుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా ఆర్థిక సమస్యలు చుట్టుమట్టాయని, మరోవైపు బంధువులు తమను దూరం పెడుతూ ఎంత మానసిక ఆవేదన కలిగించారో చెప్పుకొచ్చింది. డబ్బుంటేనే బాంధవ్యాలని గ్రహించేలోపే కళ్లముందు అంతా చీకటి, ఈ సమస్య నుంచి గట్టేక్కుతామో లేదో తెలియని పరిస్థితి..ఆ సమయంలో తనకు చదువే వీటన్నింటికి పరిష్కారమని ప్రగాఢంగా నమ్మింది. ఎంతటి ఆర్థిక పరస్థితుల్లోనూ కూడా చదవడం ఆపలేదు, పైగా పాఠశాల నుంచి కాలేజీ వరకు అన్నింట్లోనూ టాపర్గా నిలింది. అలా ఆమె కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేరయ్యి వందలోపు ర్యాంక్ సాధించింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు బెంగళూరులోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందే ఛాన్స్ అందుకుంది. అదే ఆమె జీవితాన్ని పెద్ద యూటర్న్ తీసుకునేలాచేసింది. ఓ పక్క పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు తన లక్ష్యాన్ని మరింతగా పెంచేశాయి.పట్టుదలతో ఈ ఆర్థికకష్టాలకు చెక్పెట్టేలా మంచి కెరీర్ని ఏర్పరచుకునేలా సన్నద్ధమైంది. అలా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టి..సుమారు ఆరు ఏళ్ల నిర్విరామ కృషితో..దాదాపు రూ. 80 లక్షల వార్షిక ప్యాకేజ్ని అందుకుని అందరినీ విస్తుపోయేఆల చేసింది. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకునే స్థాయికి చేరుకోవడం గురించి ఆలోచిస్తే చాలా గర్వంగా అనిపిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేసింది. అమూల్యమైన మాటలు..తండ్రి లేకపోవడం అనేది పూడ్చుకోలేని బాధ అయినా..తాను సాధించిన ఈ విజయాన్ని తన తండ్రి ఎక్కడ నుంచే చూస్తూనే ఉంటాడని, ఆనందపడతానని నమ్ముతానని అంటోందామె. అలాగే తనలాంటి కష్టాలు అనుభవించే వాళ్లేందరో ఉన్నారని, వారందరూ కష్టాలను దురదృష్టంగా చూడకపోతే కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని అంటోంది. ఎప్పుడైనా చుట్టుముట్టే కష్టాలు, కన్నీళ్లు ఎన్నింటినో నేర్పించడమే కాదు.. లక్ష్యంపై ఫోకస్ని చెదరిపోనీవ్వకుండా చేసే సోపానాలని అంటుంది. చూసే దృక్పథం మీదే సక్సెస్ అదృష్టం ఆధారపడి ఉంటుందని చెబుతోంది. బాధలు ఎప్పుడు బరువు కాదు బాధ్యతగా వ్యవహరించడం నేర్పిస్తాయి, బలోపేతంగా ఉండటం ఎలానో తెలియజేస్తాయని చెబుతోంది. అందుకు కావాల్సింది ఓర్చుకునే సహనం, పట్టుదల అని, అవే అసలైన ఐశ్వర్యాలని మరవకండి అంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు సైతం అద్భుతం మీ విజయం అంటూ ఆ టెక్కీని ప్రశంసించారు. అంతేగాదు మరోనెటిజన్ తాను కూడా అలానే కష్టపడి చదివి పైకొచ్చానని, మీ సక్సెని ఇక్కడితో ఆపోద్దు, ఈ ప్రపంచం నీదే అని ప్రోత్సహిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: 'రిచ్'..రుచి! ఇడ్లీ రూ.1200, చాక్లెట్ రూ.1800) -
ఏం మంత్రులయ్యా మీరు?: స్పీకర్ అయ్యన్న చురకలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి మళ్లీ కోపమొచ్చింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో ఆయన మంత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏం మంత్రులయ్యా మీరు అన్నరీతిలో చురకలంటించారాయన.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే.. మంత్రుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. జీరో అవర్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేస్తున్న సమయంలో.. మంత్రులు ఏం పట్టనట్లు చూస్తూ ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యేల ప్రశ్నలను నమోదు చెయ్యని మంత్రులు, అధికారులపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక్క మంత్రి కూడా నోట్ చేసుకోరా?. గతంలో ఉన్న సంప్రదాయం ఇప్పుడెందుకు లేదు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. జీరో అవర్ లో మాట్లాడిన ప్రశ్నలకు కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇలా అసహనం.. ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్తేం కాదు. గతంలో కూటమి ఎమ్మెల్యేలు తమ అనుచరుల్ని అసెంబ్లీకి తోలుకుని రావడంపై, అలాగే మంత్రులు ఆలస్యంగా రావడం.. క్వశ్చన్ అవర్ను సీరియస్గా తీసుకోకపోవడంపైనా ఆయన మందలింపు వ్యాఖ్యలు చేశారు. -
కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటు
బంగారం ధరలు చాన్నాళ్ల తరువాత తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు గరిష్టంగా.. రూ.550 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో.. గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. పసిడి ధరలు మాదిరిగానే.. వెండి రేటు కూడా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు కొంత ఉపశమనం కలిగించింది. కాగా ఈ రోజు (సెప్టెంబర్ 18) పసిడి ధరలు ఏ నగరంలో ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ స్పందన ఇదే..
న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదరడంపై భారత్ స్పందించింది. ఆ ఇరు దేశాల ఒప్పందంలో వివరాల ప్రకారం.. ఇరు దేశాలలోని ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇరు పక్షాలపైన జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అప్పుడు ఆ ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయని పేర్కొన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ ఒప్పందపు పరిణామాలను అర్థం చేసుకునేందుకు అధ్యయనం చేస్తామని వెల్లడించింది. ‘సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య కుదిరిన పరస్పర వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేసినట్లు వచ్చిన నివేదికలను చూశాం. రెండు దేశాల మధ్య కుదిరిన దీర్ఘకాలిక ఒప్పందాన్ని అధికారికం చేసే పరిణామ ప్రక్రియ పరిశీలనలో ఉందని భారత ప్రభుత్వానికి తెలుసు. మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ పరిణామం వలన వచ్చే చిక్కులపై అధ్యయనం చేస్తాం. భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు, అన్ని రంగాలలో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ ప్రధాని.. రియాద్ను సందర్శించారు అక్కడి అల్-యమామా ప్యాలెస్లో సౌదీ యువరాజు షరీఫ్ను కలిశారు. సౌదీ అరేబియా - పాకిస్తాన్ మధ్య పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం, రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని అభివృద్ధి చేయడం, ఏదైనా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఒప్పందపు ప్రకటన వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి.. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాక్- సౌదీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం కీలకమైనదిగా భావిస్తున్నారు. -
25,400 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:23 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు పెరిగి 25,407కు చేరింది. సెన్సెక్స్(Sensex) 288 పాయింట్లు పుంజుకొని 82,981 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 96.98బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.07 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.1 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.33 శాతం పడిపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇది అత్యవసర చర్చ.. సిద్ధంగా ఉంటే రేపటిదాకా ఎందుకు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రైతుల సమస్యలపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. రైతుల సమస్య, యూరియా అంశాలపై చర్చించాలంటూ వైఎ్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత సమస్య తీర్చాలని, పంటకు గిట్టుబాటు ధర సమస్య పరిష్కరించాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులతో అధికార సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ ఆందోళనల నడుమ మండలిని కాసేపు చైర్మన్ వాయిదా వేశారు. అయితే.. రైతాంగం సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని, ఆ చర్చ రేపు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో.. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రైతులకు అత్యవసరమైన చర్చ. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఈరోజు చర్చించవచ్చు కదా. రేపటిదాకా వాయిదా వేయడం ఎందుకు?. రైతాంగం తరఫున వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. గత ఐదేళ్లుగా ఎప్పుడైనా రైతులు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేశారా?. మా హయాంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. యూరియా కోసం ఎన్నడూ ఆందోళనలు జరగలేదు. రైతులు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అందుకే రైతుల సమస్యలపై చర్చించాలని మేం కోరుతున్నాం. రైతాంగం తరపున చర్చించడానికి రేపటిదాకా ఎందుకు?. ఈరోజే చర్చిస్తే తప్పేముంది. ఇప్పుడే సమస్య వచ్చింది కాబట్టే చర్చించమని కోరుతున్నాం అని బొత్స డిమాండ్ చేశారు. -
ఆటిట్యూడ్ స్టార్ 'కాయిన్' మూవీ గ్లింప్స్ విడుదల
వరుస చిత్రాలతో ఆడియెన్స్ను ఆకట్టుకునేందుకు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నిరంతరం పని చేస్తున్నారు. హీరోగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్తో శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాయిన్’. చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు.దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘‘కాయిన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్తో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా? అని కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. ట్రైలర్ వచ్చిన తరువాత చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతాయని నమ్మకంగా ఉన్నాను. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ .. ‘యథార్థ సంఘటనల ఆధారంగా మా దర్శకుడు జైరామ్ ఈ ‘కాయిన్’ మూవీని తీస్తున్నారు. పాత ఐదు రూపాయల కాయిన్స్ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో అద్భుతంగా కథను రాసుకున్నారు. జైరామ్ పనితనం నాకు చాలా నచ్చింది. జైరామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతారు. ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్ను లాంచ్ చేసేందుకు వచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. నిమిషి మ్యూజిక్ డైరెక్టర్గా పెద్ద స్థాయికి వెళ్తారు. శ్రీకాంత్ రాజా రత్నం ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత. ఆయనకు కథపై చాలా నమ్మకం ఉంది. నేను కథ నచ్చితే ఏ జానర్ అన్నది ఆలోచించను. అన్ని రకాల చిత్రాలను చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి, నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పేందుకు నేను ఎప్పుడూ కష్ట పడుతూనే ఉంటాను’ అని అన్నారు. -
ఈ-పాస్పోర్ట్ అర్హులు, దరఖాస్తు వివరాలు..
దేశంలో అన్ని వ్యవస్థలూ డిజిటల్ వైపు పయనిస్తున్నాయి. ఇదే ఒరవడిలో ఇప్పటికే కొత్త పాస్పోర్ట్లు వచ్చేశాయి. పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 కింద ఈ-పాస్పోర్ట్లను జూన్ 24, 2025 నుంచి ప్రవేశపెడుతున్నారు. ఈ-పాస్పోర్ట్లకు సంబంధించిన కొన్ని అంశాలను కింద తెలుసుకుందాం.ఇంటిగ్రేటెడ్ చిప్ఈ-పాస్పోర్ట్ ఇంటిగ్రేటెడ్ చిప్తో వస్తుంది. సంబంధిత వ్యక్తికి చెందిన బయోమెట్రిక్ డేటా (ఫొటోగ్రాఫ్, వేలిముద్రలు) ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. దీని వల్ల భద్రత మెరుగుపడుతుందని, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాస్పోర్టులను నకిలీ చేయడం కష్టతరం అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఎవరు అర్హులుకొత్త పాస్పోర్ట్ లేదా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ పౌరులందరూ అర్హులు. చెన్నై, హైదరాబాద్, సూరత్, జైపూర్.. వంటి ఎన్నో నగరాల్లో ఎంపిక చేయబడిన పాస్పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్కే)ల్లో ప్రాథమికంగా జారీ చేస్తారు.దరఖాస్తు ప్రక్రియఆన్లైన్ ద్వారా పాస్పోర్ట్ సేవా అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి.వ్యక్తిగత వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకొని, లాగిన్ అవ్వాలి.కొత్త ఈ-పాస్పోర్ట్ దరఖాస్తు ఫారమ్ను నింపాలి.డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అపాయింట్మెంట్ నిమిత్తం ఆన్లైన్లోనే మీ దగ్గరల్లో ఉన్న పీఎస్కే లేదా పీఓఎస్కేని ఎంచుకోవాలి.ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి.అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి.తదుపరి బయోమెట్రిక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పీఎస్కేను సందర్శించాలి.ప్రయోజనాలుఈ-గేట్ల ద్వారా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ వేగవంతం అవుతుంది.ట్యాంపరింగ్, ఐడెంటిఫికేషన్ థెఫ్ట్ ఉండదు. మెరుగైన భద్రతను నిర్ధారిస్తుంది.ఎన్క్రిప్టెడ్ చిప్ యాక్సెస్తో కాంటాక్ట్ లెస్ వెరిఫికేషన్.డూప్లికేషన్ లేదా మోసాలని తగ్గిస్తుంది.మొదట ఫిన్లాండ్లో..అవాంతరాలు లేని అంతర్జాతీయ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి డిజిటల్ పాస్పోర్ట్లను ప్రారంభించిన మొదటి దేశం ఫిన్లాండ్. ఆ దేశ ప్రయాణికులు భౌతిక పాస్పోర్ట్లకు బదులుగా ఈ-పాస్పోర్ట్లను ఉపయోగించి యూకేకి ప్రయాణించవచ్చు. ఫిన్లాండ్ మాదిరిగానే యూకే, యూఎస్, దక్షిణ కొరియా, పోలాండ్ కూడా డిజిటల్ పాస్పోర్ట్ ప్రాజెక్ట్లపై పని చేస్తున్నాయని ఒక నివేదిక తెలిపింది.ఇదీ చదవండి: మరో నాలుగు రోజులు ఇంతే.. -
ఓట్ల దొంగలకు రక్షగా.. సీఈసీపై రాహుల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. ఓట్ల దొంగతనం ఒక పథకం ప్రకారమే జరుగుతోందని.. ఆ దొంగలను రక్షించే ప్రయత్నంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని.. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్వేర్ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. 100 శాతం ఆధారాలున్నాయ్ఓట్ల చోరీ గురించి ఈసీ నుంచి మాకు సమాచారం వస్తోంది. చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగానే లక్షల ఓట్లను తొలగించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. కర్ణాటక ఓటర్లకు లింక్ చేసిన ఫోన్ నెంబర్లన్నీ తప్పుడువే. కాంగ్రెస్కు బలమున్న ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపు జరిగింది. ఓట్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు. ఫేక్ లాగిన్తో కాంగ్రెస్ సానుభూతి ఓట్లను తొలగించారు. ఇవన్నీ ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతో చెబుతున్నా.. సీఈసీపై సంచలన ఆరోపణలుఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని కాపాడుతోంది. అధికారులకు తెలియకుండా జాబితా నుంచి ఓట్లు ఎలా పోతాయి?. కేవలం కాంగ్రెస్ ఓటర్లే టార్గెట్గా ఇదంతా నడుస్తోంది. కర్ణాటక సీఐడీ ఓట్ల తొలగింపు వివరాలు 18సార్లు అడిగినా ఈసీ స్పందించడం లేదు. మాకు ఓట్ల తొలగింపు ఐడీల వివరాలు, ఓటీపీలు కావాలి. వారం లోగా సీఐడీ అడిగిన వివరాలు అందించాలి. ఓట్ల దొంగలను రక్షిస్తూ.. కర్ణాటక అలంద్లో గోదాబాయ్ పేరుతో 18 ఓట్లు తొలగించారు . మహారాష్ట్ర రాజురా నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారు. కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో ఒకే రీతిలో ఓట్ల తొలగింపు జరిగింది. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు డిలీట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థ ఆ పని చేయడం లేదు. ఓట్ల దొంగలను సీఈసీ రక్షిస్తోంది. అందుకే ప్రతిపక్ష నేతగా నేను ప్రజల ముందు ఉంచుతున్నాఓటు చోరీ అనేది ప్రజాస్వామ్యంపై అణుబాంబ్ లాంటిది. కానీ ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ పేలబోతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవాళ్లను ఈసీ కాపాడుతోంది. ఓట్లు చోరీ చేస్తున్న వారిని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రక్షిస్తున్నారు. అన్నింటికీ మా దగ్గర ఆధారాలన్నాయ్. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలను కోర్టులు పరిశీలించాలి. ఓట్ల చోరీపై న్యాయ వ్యవస్థ దృష్టి సారించాలి అని రాహుల్ గాంధీ కోరారు. ఈ క్రమంలో ఆధారాల పేరిట పలువురు ఓటర్లతో మాట్లాడించిన ఆయన, ఓట్ల అవకతవకల పేరిట జరిగిన అంశాలనూ మీడియా ముందు ప్రవేశపెట్టారు. VIDEO | Delhi: During a press conference, Congress MP Rahul Gandhi (@RahulGandhi) shows 'evidence' of alleged vote theft in Karnataka, claiming that the theft happened specifically on the booths where Congress was winning.He further claimed that a fake login was created in the… pic.twitter.com/k9uSw4boLG— Press Trust of India (@PTI_News) September 18, 2025 LIVE: Special press briefing by LoP Shri @RahulGandhi at Indira Bhawan | New Delhi. https://t.co/BfcSQU0LTd— Congress (@INCIndia) September 18, 2025 -
అస్తవ్యస్తంగా కూటమి పాలన: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఏ ఒక్క వర్గానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. కడపలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. గ్రామ సచివాల వ్యవస్థను పూర్తిగా నిర్వీరం చేశారు. రైతు భరోస కేంద్రాల ద్వారా రైతుకు అందాల్సిన యూరియాను అందించడం లేదు. సకాలంలో యూరియా ఎరువులు అందగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది..మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. గ్యాంబ్లింగ్ పేకాట జూదం కూటమి నాయకులు దగ్గరుండి నడిపిస్తున్నారు అని అన్నారాయన. -
ఎవరీ జిమ్మీ కిమ్మెల్?.. ట్రంప్కు కోపం ఎందుకొచ్చింది?
ప్రముఖ మీడియా సంస్థ ఏబీసీ తన లేట్-నైట్ టాక్ షో ‘జిమ్మీ కిమ్మెల్ లైవ్’ను నిరవధికంగా నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్పై వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ (Jimmy Kimmel) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్లు ఈ హత్యపై దర్యాప్తులో నిర్వహించిన తీరుపై జిమ్మీ కిమ్మెల్ విమర్శలు గుప్పించారు. కాగా జిమ్మీ లేట్ నైట్ షోను రద్దు చేయాలన్న ఏబీసీ నిర్ణయంపై అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాకు ఇది గొప్ప వార్త అని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో తుపాకీ కాల్పులకు బలయ్యాడు. అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో చార్లీ కిర్క్ మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. అతనిని ఈవెన్ లెజెండరీ అంటూ ప్రశంసించారు. కాగా సోమవారం కిమ్మెల్ తన ప్రముఖ లేట్ నైట్ షో లో మోనోలాగ్లో జరిగిన కాల్పుల గురించి మాట్లాడారు. చార్లీ కిర్క్ను హత్య చేసిన టైలర్ రాబిన్సన్ ను వలసవాదిగా చిత్రీకరించేందుకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మెగా) గ్యాంగ్ తీవ్రంగా ప్రయత్నించిందని, తద్వారా రాజకీయ లబ్ధకోసం తాపత్రయపడిందని కిమ్మెల్ ఆరోపించారు. ట్రంప్కు అందుకే కోపం..అధ్యక్షుడు ట్రంప్ తన స్నేహితుడు చార్లీని కోల్పోయినందుకు ఎలా బాధపడ్డారనేదానిపై కిమ్మెల్ వ్యంగ్యంగా మాట్లాడారు. ట్రంప్ దుఃఖించే విధానాన్ని ఎగతాళి చేస్తూ ఆయన దుఃఖంలో నాల్గవ దశలో ఉన్నారన్నారు. తన స్నేహితుని హత్యపై అతను బాధపడటం లేదని, నాలుగేళ్ల పిల్లవాడు గోల్డ్ ఫిష్ పోతే ఎలా బాధపడతాడో అలా దుఃఖించారని కిమ్మెల్ వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ షోలో ట్రంప్.. కిర్క్ మరణంపై మాట్లాడిన క్లిప్పింగ్ను కిమ్మెల్ ప్లే చేశారు.ఈ షోలో ట్రంప్ వైట్ హౌస్లో అత్యంత ఖరీదైన బాల్రూమ్ను నిర్మించడంలోని ఉద్దేశ్యాన్ని కూడా ప్రశ్నించారు.అయితే ఇంతలో నెక్స్స్టార్ బ్రాడ్కాస్టింగ్ ప్రెసిడెంట్ ఆండ్రూ ఆల్ఫోర్డ్ ఒక ప్రకటనలో కిమ్మెల్ వ్యాఖ్యలను కంపెనీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కిర్క్ మరణంపై కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి తాము భావిస్తున్నామన్నామని ప్రకటించారు. కిమ్మెల్కు ప్రసార వేదికను అందించడం ప్రస్తుత సమయంలో ప్రజా ప్రయోజనం కోసం కాదని భావిస్తూ, జిమ్మీ షో ప్రసారం నిరవధికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. కాగా జిమ్మీ కిమ్మెల్ లేట్-నైట్ షో రద్దును అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ఇందుకు ధైర్యం చూపినందుకు ఏబీసీని అభినందించారు.జిమ్మీ కిమ్మెల్ ఒక ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్, హాస్యనటుడు.. ప్రొడ్యూసర్ కూడా. ఆయన "Jimmy Kimmel Live!" అనే లేట్ నైట్ టాక్ షోను 2003 నుండి ABC ఛానల్లో హోస్ట్ చేస్తున్నారు. రాజకీయ వ్యంగ్యం.. సెలబ్రిటీలతో చేసే చమత్కార సంభాషణలతో టీవీ రంగంలో ఎంతో ప్రసిద్ధి పొందారీయ. తాజాగా చార్లీ కిర్క్ హత్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఆపై షో నిలిచిపోవడం.. అమెరికాలో భావ స్వేచ్ఛ ప్రకటపై చర్చకు దారితీసింది. అయితే వ్యంగ్యంగా రాజకీయ విమర్శలు గుప్పించే జిమ్మి కిమ్మెల్తో పాటు జిమ్మీ ఫాలోన్, సెత్ మేయర్స్లాంటి హోస్టులనూ కూడా ట్రంప్ ఇంతకు ముందు తిట్టిపోశారు. -
ఈవీ స్కూటర్లో మొదటిసారి స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్
టీవీఎస్ తన వినియోగదారులకు కనెక్టివిటీ సర్వీసులు అందించేందుకు నాయిస్ కంపెనీతో జతకట్టినట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి ఈవీ-స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్ను ఐక్యూబ్ మోడల్లో లాంచ్ చేసినట్లు పేర్కొంది. ఈ స్మార్ట్ వాచ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లోని కొన్ని అంశాలను లైవ్టైమ్లో ట్రాక్ చేయవచ్చని తెలిపింది.బ్యాటరీ స్టేటస్, దాని రేంజ్ను మానిటర్ చేయవచ్చు.టైర్ ప్రజర్ మానిటరింగ్వాహన భద్రతా హెచ్చరికలురైడ్ గణాంకాలను తెలుసుకోవచ్చు.ఈ ఫీచర్లను ప్రామాణిక కనెక్టివిటీ ఫంక్షన్లతోపాటు విలీనం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ‘కొత్త టీవీఎస్ ఐక్యూబ్ను స్మార్ట్ వాచ్తో అనుసంధానించడం ద్వారా వినియోగదారులకు సురక్షితమైన, మరింత సహజమైన ప్రయాణాలు సాగించేందుకు వీలుంటుంది’ అని టీవీఎస్ మోటార్ కంపెనీలో హెడ్ కమ్యూటర్ & ఈవీ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ కార్పొరేట్ బ్రాండ్ అండ్ మీడియా అనిరుద్ధ హల్దార్ అన్నారు.ఇదీ చదవండి: మరో నాలుగు రోజులు ఇంతే.. -
మరో నాలుగు రోజులు ఇంతే..
భారతదేశం అంతటా ద్విచక్ర వాహన డీలర్షిప్ల్లో షోరూమ్ బుకింగ్లు దాదాపు స్తంభించాయి. సెప్టెంబర్ 4న సవరించిన పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ అధికారికంగా ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు దేశవ్యాప్తంగా వినియోగదారులు ధరల తగ్గింపునకు వేచిచూస్తున్నారు.ఏదేమైనా, ఈ ప్రకటన విస్తృతంగా కొనుగోలుదారులను కట్టిపడేసింది. వినియోగదారులు తాము కొనాలనుకునే ఉత్పత్తులపై త్వరలో ధరల రాయితీ ఉంటుందని నమ్మి ఇలా కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ‘జీఎస్టీ రేటు తగ్గింపును ప్రధాని ప్రకటించినప్పటి నుంచి అమ్మకాలు తగ్గాయి. సెప్టెంబర్ 4న చేసిన కొత్త రేట్లను అధికారికంగా ఆమోదం తెలపడంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు’ అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) డీలర్ ఆశిష్ పాండే చెప్పారు.‘సెప్టెంబర్ 22 కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు తర్వాతే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇది భవిష్యత్తులో సాధారణ ప్రక్రియగానే మారుతుందని, పరిమిత సమయ పథకం కాదని వినియోగదారులకు తెలుసు’ అన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే షోరూమ్ బుకింగ్స్ దాదాపు 50% పడిపోయాయని దేశవ్యాప్తంగా డీలర్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు -
మెడికల్ కాలేజీలు.. అన్నంత పని చేసిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: ప్రజల ఆందోళనను, రాజకీయ పార్టీల అభ్యంతరాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు. అన్నంత పని చేసేశారు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ఇవాళ జారీ అయ్యింది. తొలివిడత నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ(Public-Private Partnership)లో అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మెడికల్ కాలేజీలు.. 625 పథకాల సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల పీపీపీకి టెండర్ ప్రకటన ఏపీ ఎంఎస్ఐడీసీ రిలీజ్ చేసింది.చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, అలాగే వైద్య విద్యపై తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ, ఎమ్మార్పీఎస్, ఇతర సామాజిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటు ప్రజలలోనూ ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా ఇన్నేళ్ల తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని చంద్రబాబు.. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలనే లక్ష్యంతో తాము నిర్మించిన కాలేజీలను ప్రైవేట్ చేతుల్లో పెడుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేపు తాము అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి తీరతామని హెచ్చరించారు కూడా. -
క్లౌడ్బరస్ట్ దెబ్బకు పలు ఇళ్లు ధ్వంసం.. ఐదుగురు గల్లంతు
చమోలి: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో పెను విపత్తు సంభవించింది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న నందనగర్లో గురువారం తెల్లవారుజామున సంభవించిన క్లౌడ్ బరస్ట్ పలు ఇళ్లను ధ్వంసం చేసింది. ఐదుగురు అదృశ్యమయ్యారు. జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, నందనగర్లోని కుంత్రి వార్డులో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. VIDEO | Chamoli, Uttarakhand: Cloudburst in Nandanagar results in massive destruction. More details are awaited.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LMiM4SuTPQ— Press Trust of India (@PTI_News) September 18, 2025క్లౌడ్ బరస్త్ దరిమిలా ఆ ప్రాంతంలో భయాందోళనలు అలుముకున్నాయి. ఇళ్ల శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలో ఏడుగురు ఇళ్లలో ఉండగా, వారిలో ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతైన మరో ఐదుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ బుధవారం రాత్రి చమోలి జిల్లాలోని నందనగర్ ఘాట్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ సంభవించి, భారీ నష్టం జరిగిందన్నారు. నందనగర్లోని కుంత్రి లంగాఫలి వార్డులో ఆరు ఇళ్ల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇంతలో వాతావరణ శాఖ ఉత్తరాఖండ్లో 20 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. VIDEO | Chamoli, Uttarakhand: Cloudburst in Nandanagar results in massive destruction. More details are awaited.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LMiM4SuTPQ— Press Trust of India (@PTI_News) September 18, 2025 -
డిజిటల్ మార్కెట్ల నియంత్రణ తక్షణావసరం
డిజిటల్ మార్కెట్లలో బడా టెక్ కంపెనీలు, పోటీ సంస్థలను దెబ్బతీసే విధానాలను ఉపయోగించకుండా ముందస్తుగా నివారించేలా ప్రత్యేక విధానాన్ని (ఎక్స్–యాంటీ) రూపొందించడం తక్షణావసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను దేశీ అంకుర సంస్థల వ్యవస్థాపకులు కోరారు. డిజిటల్ పోటీపై తలపెట్టిన మార్కెట్ అధ్యయనం పారదర్శకంగా, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే విధంగా ఉండేలా చూడాలని కోరారు. ఎక్స్–యాంటీ నిబంధనలను వ్యతిరేకిస్తూ గ్లోబల్ టెక్ దిగ్గజాలు దు్రష్పచారం సాగిస్తున్నాయని వివరించారు.పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్, మ్యాట్రిమోనీడాట్కామ్ ఫౌండర్ మురుగవేల్ జానకిరామన్, ట్రూలీమ్యాడ్లీ సహ వ్యవస్థాపకులు స్నేహిల్ ఖనోర్, అమిత్ గుప్తా తదితరులు ఈ మేరకు నిర్మలా సీతారామన్కి లేఖ రాశారు. డిజిటల్ మార్కెట్లలో పోటీని అణగదొక్కేలా వ్యవహరిస్తున్న బిగ్ టెక్ సంస్థల వల్ల స్టార్ట్ వ్యవస్థ నిరంతరం సవాళ్లు ఎదుర్కొంటోందని అందులో పేర్కొన్నారు. ఎక్స్–యాంటీ నిబంధనలను పునఃసమీక్షించడానికి ముందుగా ప్రస్తుత డిజిటల్ కాంపిటీషన్ బిల్లు ముసాయిదాను ఉపసంహరించి, మార్కెట్ను సవివరంగా అధ్యయనం చేయాలన్న ప్రభుత్వ యోచనను తాము స్వాగతిస్తున్నామని స్టార్టప్ల ఫౌండర్లు తెలిపారు. అయితే, ఇది స్వతంత్రంగా, పారదర్శకమైన విధంగా జరిగేలా చూడాలని కోరారు.ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు -
అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు
రోజువారీ జీవనంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని నైతికంగా ఉపయోగించడానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలను రూపొందించడంపై కసరత్తు జరుగుతోందని వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ఆయా కమిటీల్లో భారతీయ నిపుణులు కూడా ఉన్నారని వివరించారు. గ్లోబల్ ప్రమాణాలు ఖరారైన తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు వాటిని అమలు చేస్తాయని పీహెచ్డీసీసీఐ సదస్సులో చెప్పారు. ఇప్పటికే 39 ఉండగా, మరో 45 గ్లోబల్ ఏఐ ప్రమాణాలను రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఏఐ టెక్నాలజీకి రెండు పార్శ్వాలు ఉన్నాయని చెప్పారు. రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడనుండగా, అదే సమయంలో అనైతికంగా ఉపయోగిస్తే ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలూ ఉన్నాయని నిధి చెప్పారు. ‘ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ పెద్ద సవాలుగా మారింది. దీనితో ఎంతగా దుష్ప్రచారం జరుగుతోందో మనం చూస్తున్నాం. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వాలు తప్పనిసరిగా చట్టాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అలాగని ఏఐ వల్ల ప్రయోజనాలు లేవని చెప్పడానికి లేదు. సోషల్ మీడియా, ప్లాట్ఫాంలు, నవకల్పనలకు సంబంధించి ఇదొక సానుకూల, సృజనాత్మక ఆవిష్కరణ’ అని తెలిపారు.ఇదీ చదవండి: పండుగ సీజన్పై ‘సోనీ’ ఆశలు..! -
నా భర్త మరణం.. మోహన్లాల్ తన బుద్ధి చూపించాడు: నటి
మలయాళ సీనియర్ నటి శాంతి విలియమ్స్ మోహన్లాల్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె తమిళ, మలయాళంలో వందకు పైగా సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో సహాయక పాత్రలు పోషించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్కు తల్లిగా కూడా నటించారు. తనకు 12 ఏళ్ల వయసు ఉండగానే చిత్రపరిశ్రమలో ఆమె అడుగుపెట్టారు. ఆమె 1979లో మలయాళీ కెమెరామెన్ జె. విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. తన భర్త మరణం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండగా దానిని మోహన్లాల్ తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించారు.మలయాళ సినిమాల్లో ఒకప్పుడు సుపరిచితుడైన సినిమాటోగ్రాఫర్ జె విలియమ్స్ను వివాహం చేసుకున్న శాంతి, తన భర్త అనారోగ్యానికి గురైనప్పుడు కుటుంబం తీవ్ర పేదరికంలోకి నెట్టబడిందని, కానీ పరిశ్రమ నుండి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విలియమ్స్ 2005లో అనారోగ్యంతో మరణించారు. అయితే, ఆ సమయంలో మోహన్ లాల్తో జరిగిన ఒక సంఘటన గురించి శాంతి ఇలా అన్నారు, “ఒకప్పుడు నాకు తెలిసిన లాల్ నేటి సూపర్ స్టార్ కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అప్పట్లో, అతనికి చిన్నపిల్లవాడి అమాయకత్వం ఉండేది. అతను మా ఇంటికి వచ్చి, మాతో ఎప్పుడూ మాట్లాడేవాడు. నవ్వుతూ అన్ని విషయాలు పంచుకునే మంచి వ్యక్తి. కానీ, అతను పాపులర్ అయిన తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. చాలా మంది ఇతరులు కూడా అదే చెప్తారు.లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లాడుతన ఇంట్లో ఉండే కృష్ణుడి విగ్రహాన్ని మోహన్లాల్ ఎలా తీసుకెళ్లాడో శాంతి ఇలా చెప్పింది. "మా ఇంట్లో పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తున్న కృష్ణుడి విగ్రహం ఉండేది. నేడు ఆ విగ్రహం మోహన్లాల్ ఇంట్లో ఉంది. నా భర్తకు ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాం. ఆ సమయంలో కృష్ణుడి విగ్రహాన్ని మేము సరిగ్గా నిర్వహించగలమో లేదోనని నా భర్తకు అనిపించింది. మా ఇంట్లో ఎయిర్ కండిషనర్ లేదని, పిల్లలకు ఇబ్బందిగా ఉందని మోహన్లాల్తో నా భర్త విలియమ్స్ చెప్పాడు. మా ఆర్థిక పరిస్థితిని లాల్ సద్వినియోగం చేసుకున్నాడు. లక్షల విలువైన కృష్ణుడి విగ్రహాన్ని తీసుకెళ్లి, బదులుగా తన ఆఫీసు నుండి పాత ఎయిర్ కండిషనర్ను మాకు ఇచ్చాడు. కేవలం పదిరోజుల తర్వాత అది రిపేయర్కు వచ్చింది. దీంతో మేము దానిని అమ్మినప్పుడు, మాకు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చాయి. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే.., మేము మోహన్లాల్ కోసం చాలా చేసినప్పటికీ, నా భర్త మరణించినప్పుడు అతను రాలేదు. నేను దాని గురించి మాట్లాడే ప్రతిసారీ, నాలో కోపం ఉప్పొంగుతుంది. ఆకలితోనే నా పిల్లలు నిద్రపోయేవారునాకు నలుగురు పిల్లలు ఉన్నారనే విషయం మోహన్లాల్కు తెలుసు. విలియమ్స్ మంచం పట్టిన తర్వాత, కుటుంబాన్ని పోషించడానికి నేను డబ్బింగ్, నటన అంటూ తిరగాల్సి వచ్చింది. పిల్లలకు కడుపు నిండా ఆహారం లేని రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు వారు ఆకలితోనే నిద్రపోయేవారు. ఇప్పటివరకు నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే, దర్శకుడు శంకర్ సార్ నా భర్త మరణించారని తెలుసుకొని రూ. 25వేలు సాయం చేశారు. ఏదైనా సాయం అవసరమైతే కాల్ చేయమని కూడా చెప్పారు. అయితే, మలయాళ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా సాయం చేయలేదు. కానీ, తమిళ పరిశ్రమ నుంచి కొందరు చేశారు. నా మాతృభూమి కేరళ, నేను మలయాళీని. అయినప్పటికీ నన్ను నేను అలా పిలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మా దగ్గర డబ్బున్న సమయంలో ఎందరికో సాయం చేశాం. కానీ, నా భర్త మరణించిన సమయంలో ఎవరూ కూడా పలకరించలేదు.' అని ఆమె అన్నారు. ప్రస్తుతం శాంతి పిల్లలు పెద్దవారయ్యరు. ఉద్యోగాలు చేస్తూ జీవితంలో సెటిల్ అయ్యారు. భర్త మరణం తర్వాత తనకు చిన్న పాత్ర వచ్చినా సరే చేస్తూ పిల్లలను చదివించారని అక్కడి పరిశ్రమ గురించి తెలిసిన వారు చెప్తారు. -
హైదరాబాద్లో ఈడీ అధికారుల సోదాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థల వరుస సోదాలు, తనిఖీలతో నగరం మరొకసారి ఉలిక్కిపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) నగరంలోని ప్రముఖ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో గురువారం ఉదయం ఈడీ అధికారుల తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బూరుగు రమేష్తో పాటు ఆయన తనయుడు విక్రాంత్ ఇంట్లోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ఆల్వాల్, మారేడుపల్లిలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
'రిచ్'..రుచి! ఇడ్లీ రూ.1200, చాక్లెట్ రూ.1800
ఇరానీ చాయ్, కబాబ్లు, బిర్యానీలకు సిటీ ప్రసిద్ధి చెంది ఉండవచ్చు.. కానీ ఇప్పుడు ఖరీదైన రుచులకూ కేరాఫ్గా మారుతోంది. తమ దగ్గర ఉన్న విలాస విందు గురించి రెస్టారెంట్స్, తాము రుచిచేసిన కాస్ట్లీ ఫుడ్ గురించి నగరవాసులు సోషల్ వేదికలపై పంచుకుంటూ రిచ్ రుచుల వెల్లువకు కారణమవుతున్నారు. ఫలితంగా బంగారంతో చుట్టిన ఇడ్లీలు, రాజకుటుంబానికి సరిపోయేంత పెద్ద పళ్లెంలో విందులకు కూడా నగరం పేరొందుతోంది. అనేక మందికి ఇదో ఖరీదైన రుచికరమైన యాత్ర. ఈ వంటకాలు కేవలం భోజనం మాత్రమే కాదు, అవి జ్ఞాపకాల్లో ఒదిగిపోయే అనుభవాలు కూడా అంటున్నారు ఫుడ్ లవర్స్. ఒకప్పుడు ఆకలి తీర్చుకోవడానికి తినడం.. ఇప్పుడు అభిరుచులు నెరవేర్చుకోవడానికి తినడం దాకా పరిణామం చెందింది. ఆకలికి హద్దు ఉంటుందేమో కానీ అభిరుచులకు ఉండదు కదా.. అలాగే ఇప్పుడు ఆహార అభిరుచులు కూడా కొత్త పుంతలు కాస్ట్లీ వింతలుగా మారుతున్నాయి. ఈ సోషల్ మీడియా యుగంలో తినడం మాత్రమే కాదు ఆనందించడం.. ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకోవడం కూడా అలవాటైంది. ఇన్స్టాలో పోస్ట్ చేయాలంటే ఇరానీ చాయ్ సరిపోదు.. ఇడ్లీ రూ.1200 ఉండాల్సిందే అనేది సిటీ సోషల్‘ఇçషు్టల’ మాట బాట. అలాంటి వారి కోసం నగరంలోని పలు రెస్టారెంట్స్, కేఫ్స్, ఐస్క్రీమ్ పార్లర్స్.. వైవిధ్య భరితంగా అదే సమయంలో అత్యంత విలాసవంతమైన రుచులను అందిస్తున్నాయి. అలాంటి కాస్ట్లీ వంటకాల్లో కొన్నింటి విశేషాలు.. బంజారాహిల్స్లోని లెవాంట్ రెస్టారెంట్లో ఉన్న మషావి ముషాకల్ ప్లేట్ ధర: రూ.3,300.. నగరంలో ఫైవ్స్టార్ హోటల్స్ను మినహాయిస్తే.. రెస్టారెంట్స్లోని ఖరీదైన ప్లేట్ ఇదే. దీనిలో వడ్డించే మిడిల్ ఈస్టర్న్ విందు మాంసం ప్రియులను చవులూరిస్తుంది. బాషా షీష్, అదానా కబాబ్, లాంబ్ చుకాఫ్, బాల్కా షీష్, లెవాంట్ జాయేనా.. గ్రిల్ చేసి స్టైల్గా వడ్డిస్తారు. ఇది రోజంతా తినాల్సిన భోజనాన్ని సులభంగా భర్తీ చేయగలదు. ఐటీసీ కోహినూర్లో అందించే హైదరాబాదీ బిర్యానీ దమ్ పుఖ్త్ బేగం ధర రూ.2500. ప్రీమియం కుంకుమ పువ్వు, సువాసనగల బాస్మతి బియ్యం లేత మాంసంతో మేళవించి వండుతారు. ఈ బిర్యానీ ఒక హ్యాండిలో అందంగా కనిపిస్తుంది. బంజారాహిల్స్ లోని కృష్ణ ఇడ్లీని 24–క్యారెట్ గోల్డ్ ఇడ్లీగా పేర్కొంటారు. ఈ ఇడ్లీ ప్లేట్ ధర: రూ.1200 ఇది దక్షిణ భారతదేశంలోని పేరొందిన అల్పాహారం.. రెండు మృదువైన ఇడ్లీలు తినదగిన బంగారు ఆకులతో కప్పబడి, గులాబీ రేకులను చల్లి, సాంబార్ చట్నీలతో వడ్డిస్తారు. బహుశా ఇడ్లీని ఇంత అందంగా ఎప్పుడూ చూసి ఉండరు. బంజారాహిల్స్, హిమాయత్నగర్లలోని హుబెర్ – హోలీ అందించే మైటీ మిడాస్ గోల్డ్ ఐస్ క్రీం ధర: రూ.1200. ఇది కేవలం డెజర్ట్ కాదు, ట్రెజర్ అని చెప్పొచ్చు. బెల్జియన్ చాక్లెట్, ప్రాలైన్ బాదం, మాకరూన్లు, చాక్లెట్ నిండిన బాల్స్. 24 క్యారెట్ తినదగిన బంగారు ఆకులో చుట్టబడిన చాక్లెట్ బార్తో తయారైంది. ఇది ఆర్డర్ ఇచ్చాక స్వీకరించడానికి గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. బంజారాహిల్స్లోని రోస్ట్ సిసిఎక్స్లో యానిమేటెడ్ చాక్లెట్ అందుబాటులో ఉంది. దీని ధర: రూ.1800 ప్లస్ పన్నులు అదనం. ఈ షోటాపర్ డెజర్ట్, అందమైన జంతువులు లేదా కార్టూన్ పాత్రలుగా మలిచారు. నగరంలోని అత్యంత అందమైన అత్యంత ప్రీమియం డెజర్ట్లలో ఒకటిగా పేరొందింది.నగరంలోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్, ది వెస్టిన్లోని ప్రీగో అత్యంత ఖరీదైన బిర్యానీలను అందిస్తాయని సమాచారం. ధరలపై స్పష్టత లేనప్పటికీ అక్కడ బిర్యానీల ధర రూ.6వేల వరకూ ఉంటుందని తెలుస్తోంది బంజారాహిల్స్లోని హౌస్ ఆఫ్ దోసె, నగరంలోనే అత్యంత ఖరీదైన దోసెను అందుబాటులోకి తెచి్చంది. దీని ధర సుమారు రూ.1000 పైనే ఉంది. అయితే ఇది ఆర్డర్పై మాత్రమే అందిస్తారు. దీని తయారీలో తినదగిన బంగారు పూత, వేయించిన జీడిపప్పు, బాదం, స్వచ్ఛమైన నెయ్యి చట్నీలు లభ్యత: కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే తయారు చేస్తారు. గింజలు నెయ్యితో వస్తుంది. ఈ బంగారు దోసె ఆహార ప్రియులకు, వారాంతాల్లో ఆకర్షణగా మారింది. (చదవండి: ప్లాంట్స్.. దోమలకు చెక్..!) -
యస్ బ్యాంక్లో ఎస్ఎంబీసీ వాటా జూమ్
పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) నుంచి యస్ బ్యాంక్కు చెందిన 13.18 శాతం వాటాను జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) చేజిక్కింకుకుంది. దీంతో ఎస్ఎంబీసీ నుంచి రూ. 8,889 కోట్లు అందుకున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఫలితంగా యస్ బ్యాంక్లో ఎస్బీఐ వాటా 10.8 శాతానికి దిగివచ్చింది. ఈ డీల్లో భాగంగా ఇతర 7 ప్రయివేట్ బ్యాంకింగ్ సంస్థల నుంచి సైతం మరో 6.82 శాతం వాటాను ఎస్ఎంబీసీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా యస్ బ్యాంక్లో పీఈ దిగ్గజం కార్లయిల్ నుంచి మరో 4.2 శాతం వాటాను ఎస్ఎంబీసీ సొంతం చేసుకోనుంది. ఇందుకు షేరుకి రూ. 21.5 ధరలో(ఎస్బీఐ వాటా విక్రయ ధర)నే కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం(17న) తెలియజేసింది. ఇందుకు రూ. 2,800 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. వెరసి యస్ బ్యాంక్లో వాటాను జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్(ఎస్ఎంఎఫ్జీ)కు చెందిన ఎస్ఎంబీసీ 24.2 శాతానికి పెంచుకోనుంది. తద్వారా యస్ బ్యాంక్లో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ప్రస్తుతం యస్ బ్యాంక్లో కార్లయిల్ గ్రూప్ 4.22 శాతం వాటా కలిగి ఉంది.ఇదీ చదవండి: పండుగ సీజన్పై ‘సోనీ’ ఆశలు..! -
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నేడు జరగనుంది. గురువారం మధ్యాహ్నా ప్రాంతంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై, కీలకాంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
పండుగ సీజన్పై ‘సోనీ’ ఆశలు..!
కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ సోనీ ఇండియా ప్రస్తుత పండుగల సీజన్ పట్ల ఆశావహంగా ఉన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పెద్ద తెరల టీవీల ధరలు తగ్గుతాయని.. దీంతో విక్రయాలు రెండంకెల మేర వృద్ధి చెందుతాయని (గతేడాది ఇదే సీజన్తో పోల్చి చూస్తే) అంచనా వేస్తున్నట్టు సంస్థ ఎండీ సునీల్ నయ్యర్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి టీవీల అమ్మకాలు ఫ్లాట్గా, ఎలాంటి వృద్ధి లేకుండా ఉన్నట్టు చెప్పారు.జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల వల్ల వీటి ధరలు 7.5–8 శాతం మేర తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. దీంతో కొనుగోళ్ల సెంటిమెంట్ మెరుగుపడుతుందన్నారు. పెద్ద సైజు తెరల టీవీల మార్కెట్లో (ప్రీమియం మార్కెట్) సోనీ ప్రముఖ సంస్థగా ఉండడం తెలిసిందే. ఈ విభాగంలో టీవీల ధరలు మోడల్ ఆధారంగా రూ.8,000 నుంచి రూ.70,000 మధ్య తగ్గుతాయని నయ్యర్ ప్రకటించారు. ధరలు తగ్గడంతో కస్టమర్లు పెద్ద సైజు టీవీలు, మెరుగైన టెక్నాలజీ ఫీచర్లతో ఉన్న వాటికి మారతారన్న (అప్గ్రేడ్) ఆశాభావం వ్యక్తం చేశారు. విక్రయాలు 10–15 శాతం వరకు పెరగొచ్చన్నారు. మాకు ప్రయోజనం..జీఎస్టీలో 32 అంగుళాలకు మించిన టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం గమనార్హం. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. 55 అంగుళాలు, అంతకుమించిన సైజు టీవీల మార్కెట్లో కీలకంగా ఉన్న సోనీ ఈ రేటు తగ్గింపుతో ప్రయోజనం పొందుతుందని నయ్యర్ చెప్పారు. ‘‘55, 65, 75, 85, 98 అంగుళాల టీవీలను పెద్ద సంఖ్యలో విక్రయిస్తుంటాం. ఈ టీవీలన్నీ ప్రీమియం, పెద్ద సైజు విభాగం కిందకు వస్తాయి’’అని తెలిపారు. 55 అంగుళాల టీవీ ధర రూ.8,000 వరకు తగ్గుతుందని.. 75 అంగుళాలు అంతకుమించిన సైజు టీవీలపై రూ.19,000–51,000 వరకు, 85 అంగుళాల టీవీలపై రూ.47,000–70,000 వరకు రేట్లు తగ్గుతాయని చెప్పారు. బడ్జెట్లో ప్రకటించిన ఆదాయపన్ను ప్రయోజనాలతో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుందని.. దీని ఫలితంగా కెమెరాలు, సౌండ్బార్లు, పార్టీ స్పీకర్లు, హెడ్ఫోన్లు, ప్లే స్టేషన్ ఉత్పత్తుల అమ్మకాలు సైతం పెరుగుతాయని నయ్యర్ అంచనా వేశారు. విక్రయాల్లో సగం వాటా కలిగిన చిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లలో సోనీ స్థానం మరింత బలపడుతుందన్నారు. నిలిచిన కొనుగోళ్లుప్రభుత్వం జీఎస్టీపై నిర్ణయాలు ప్రకటించిన తర్వాత వినియోగదారులు టీవీల కొనుగోళ్లను నిలిపివేసినట్టు నయ్యర్ తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నట్టు చెప్పారు. అందరూ సెప్టెంబర్ 22 కోసం వేచి చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత కొనుగోళ్లు ఒక్కసారిగా పెరుగుతాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: 5 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లు -
5 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లు
మధ్య, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సాధించేందుకు అత్యుత్తమ అవకాశాలున్నట్లు గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ తాజాగా అభిప్రాయపడింది. దీంతో రానున్న ఐదేళ్లలో ప్రయివేట్ రంగం నుంచి 800 బిలియన్ డాలర్ల(రూ. 70 లక్షల కోట్లు) పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రయివేట్ పెట్టుబడులు ఊపందుకునే చాన్స్ లేనట్లు పేర్కొంది.ప్రయివేట్ రంగంలో భారీస్థాయి సామర్థ్య విస్తరణలో అప్రమత్తత కనిపిస్తున్నట్లు సంస్థ అధికారి గీతా చుగ్ తెలియజేశారు. కాగా.. ప్రయివేట్ రంగంలో పెట్టుబడులు కనిపిస్తున్నప్పటికీ నామినల్ జీడీపీ వృద్ధి రేటుకంటే తక్కువ స్థాయిలో నమోదవుతున్నట్లు ఎస్అండ్పీ దేశీ రేటింగ్స్ యూనిట్ క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషీ పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాలు, టారిఫ్లలో మార్పులు, తదితర తీవ్ర అనిశ్చితులు కార్పొరేట్ సంస్థల పెట్టుబడి నిర్ణయాలలో ఆలస్యానికి కారణమవుతున్నట్లు వివరించారు.పలు కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకోవడంలో బ్యాంకులకు బదులుగా సొంత అంతర్గత వనరులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. బ్యాంక్ రుణాలు లేదా క్యాపిటల్ మార్కెట్ల నుంచి రుణ సమీకరణ ద్వారా కనీసస్థాయిలోనే నిధులను సమీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి పరిస్థితులు మెరుగుపడనుండటంతో బ్యాంకింగ్ వ్యవస్థలో 12–13 శాతం రుణ వృద్ధికి వీలున్నట్లు అంచనా వేశారు.ఇదీ చదవండి: దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్? -
ప్లాంట్స్.. దోమలకు చెక్..!
విష జ్వరాలు, డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికెన్గున్యా వంటి ఎన్నో రకాల వ్యాధులు దోమ కాటుతో వస్తాయి. దోమ కాటు వేసిందా ఎంతటి వారైనా మంచాన పడాల్సిందే. మరి అలాంటి దోమల నివారణకు ఎవరో వచ్చి దోమల మందు పిచికారీ చేస్తారని ఎదురు చూడకుండా ఇంటి పెరట్లోనో, బాల్కనీల్లోనో చిన్న కుండీల్లో ఈ మొక్కలను పెంచుకుంటే దోమలు రాకుండా ఉంటాయని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవి ఒక్క దోమల నివారణకే కాకుండా వంటింటికీ ఉపయోగపడతాయని అంటున్నారు. రసాయన లిక్విడ్లకు బదులుగా సహజ సిద్ధంగా దోమల నివారణ ఆరోగ్యం, పర్యావరణానికి మంచిదని బోటనీ ప్రొఫెసర్ దిలీప్ చెబుతున్నారు. మొక్కలు పెంచే సమయంలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. పాత కాలంలో ఇంటి ఆవరణలో తులసి మొక్కకు పూజలు చేసేవారు. ఉదయం లేచి స్నానం చేసి, తులసి గుండం వద్ద దీపం వెలిగించేవాళ్లు. అది ఆధ్యాత్మికంగా, అందులో ఔషధ గుణాలు ఆరోగ్యపరంగానూ ఉపయోగకరంగా ఉంటాయి. ఈ మొక్కల ఆకుల వాసనతో దోమలు దూరమవుతాయట. వంటింట్లో మనకు నిత్యం కనిపించే పుదీనా ఆకు ఘాటైన వాసనలకు దోమలు దూరమవుతాయట. పుదీనా పెంచుకుంటే ఒక వైపు దోమల నివారణ, మరో వైపు వంటకు అవసరమైన పుదీనా ఆకు సొంతంగా పెంచుకున్నట్లు అవుతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ లీవ్స్ అందుబాటులో ఉంటాయి. నిమ్మ గడ్డి వాసనకు దోమలు దూరం కావడంతో పాటు వంటల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. సిట్రోనెల్లా గడ్డిలో సిట్రోనెల్లాల్, సిట్రోనెల్లోల్, జెరానియోల్ కలిసి ఉంటాయి. ఇది ఘాటైన వాసనలను వెదజల్లుతుంది. ఈ వాసనకు దోమలు తరలిపోతాయి. రోజ్మెరీ కొమ్మలను కాల్చినా, నూనె వాడినా దోమలు దూరమవుతాయి. కుప్ప చెట్టు రసాయనాల కంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది.ఇంట్లో లావెండర్, బంతి మొక్కలు పెంచుకుంటే వాటి పువ్వులు సువాసనలు వెదజల్లుతాయి. కలర్ఫుల్గా ఉండే పువ్వులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రిలాక్స్గా అనిపిస్తుంది. వీటిలో లినాలూల్, కర్పూరం సమ్మేళనాలు ఉంటాయి. వీటి సువాసన, నూనె దోమలను తరిమేస్తుంది. (చదవండి: మాన్సున్ ఎండ్..ట్రెక్కింగ్ ట్రెండ్..! సై అంటున్న యువత..) -
‘‘ఆ దేవుడినే అడగండి..’’ సీజేఐ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: ధ్వంసమైన ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.మధ్యప్రదేశ్లోని ఛాతర్పూర్జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని(Khajuraho Vishnu idol case) రాకేశ్ దలాల్ అనే వ్యక్తి ఈ పిల్ వేశారు. ఈ పిల్ స్వీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రనల్ ధర్మాసనం పరిశీలించింది. ‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం. ఇందులో మేం చేసేది ఏం లేదు. భారత పురతత్వ విభాగం(ఏఎస్ఐ) పరిధిలో ఆలయం ఉంది. వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమభక్తుడిని అని చెబుతున్నారుగా. ఆయననే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతిపెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీరు విన్నవించుకోవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్నిర్మాణంపై ఏఎస్ఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే తీర్పు సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఆయన మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వినీత్ జిందాల్ అనే న్యాయవాది సీజేఐ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతికి, సుప్రీం కోర్ట్కు ఆయన ఓ లేఖ రాశారు. ప్రతి మత విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సత్యం సింగ్ రాజ్పుత్ అనే మరో న్యాయవాది జస్టిస్ బీఆర్ గవాయ్కు బహిరంగ లేఖ రాశారు. విష్ణుమూర్తి భక్తుడిగా ఆయన వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధించాయి. కాబట్టి వెంటనే ఆయన వాటిని ఉపసంహరించుకోవాలి అని లేఖలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీజేఐ వ్యాఖ్యలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. -
Pak-Saudi Deal: ‘ఒకరిపై దాడి.. ఇరువురి పోరాటం’
న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి జరిపిన కొద్దిరోజులకే ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరుపక్షాలలో ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇద్దరిపైన జరిగిన దాడిగానే గుర్తిస్తారు. అప్పుడు ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయి.సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్- పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ రక్షణ ఒప్పందంపై సంతకం చేశాక, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. యువరాజు ఆహ్వానం మేరకు పాక్ ప్రదాని షరీఫ్ సౌదీ అరేబియాకు వెళ్లారని పాక్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడం, ఏదైనా దురాక్రమణ ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది’ అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.ఒక దేశంపై ఏదైనా దాడి జరిగితే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో గత ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించాయి. ఇది జరిగిన తరువాత సౌదీ-పాక్ల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరడం గమనార్హం. మరోవైపు ఖతార్- యునైటెడ్ స్టేట్స్ మెరుగైన రక్షణ సహకార ఒప్పందాన్ని ఖరారు చేసే దశలో ఉన్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. -
ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటం ఏదంటే..
శ్రీరామ పట్టాభిషేకం మూర్తి ప్రతి ఇంటిలోనూ ఉండాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు. కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం. పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు – సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ. రాముడు అకారానికి ప్రతినిధి,యో వేదాదౌ స్వరప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!.అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ. ’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ. అకార ఉకార మకార నాద స్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది. ఆయనకి పూజ చేయడానికి వాళ్ళు చేయవచ్చా? వీళ్ళు చేయవచ్చా? అని అభ్యంతరం ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది. (చదవండి: కొలిచిన వారికి 'బంగారు తల్లి'! పులి రూపంలో తిరుగుతూ..) -
Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే?
ఆసియాకప్-2025లో చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్లో యూఏఈను 41 పరుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూపర్ 4కు ఆర్హత సాధించిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.ఈ క్రమంలో సెప్టెంబర్ 21(ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనున్న సూపర్-4 మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్ను చిత్తు చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గత ఆదివారం(సెప్టెంబర్ 14) జరిగిన మ్యాచ్లో పాక్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్ షేక్ వివాదమే ఎక్కువగా హైలెట్ అయింది. ఈ మ్యాచ్లో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరాచాలనాన్ని తిరష్కరించారు.దీంతో ఘోర అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్ ఆటగాళ్లతో పాటు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాప్ట్పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్లో ప్రత్యర్ధి ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడం తప్పనిసారి అని లేకపోవడంతో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సూపర్-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భారత్ కొనసాగించనుంది.చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి -
కొలిచిన వారికి 'బంగారు తల్లి'
‘పెద్దమ్మతల్లి అంటేనే అందరికీ పెద్దదిక్కు.. ఆ తల్లి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా ఇట్టే జరిగిపోతుంది. భక్తులపాలిట కొంగుబంగారమై విలసిల్లుతున్న ఆ తల్లి నేనున్నానంటూ అందరికీ దీవెనలందిస్తోంది’ ఇదీ భక్తుల నమ్మకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆదివారం అయితే వేల సంఖ్యలోనే వస్తారు. కొత్తగూడెం–భద్రాచలం ప్రధాన రహదారిపై పెద్దమ్మతల్లి(కనకదుర్గమ్మ) ఆలయం ఉంటుంది. ఆ రహదారి పై వెళ్లే ప్రతి ఒక్కరూ అమ్మవారికి నమస్కరించనిదే వెళ్లరంటే అతిశయోక్తి కాదు. ఇంతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం స్థలపురాణంలోకి వెళితే...పూర్వం ఇక్కడి భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం–జగన్నాథపురం గ్రామాల మధ్యలో ఖమ్మం–భద్రాచలం వెళ్లే రాజమార్గం సమీపంలో ఒక పెద్దపులి సంచరిస్తూ ఉండేది. ఆ పెద్దపులి రాజమార్గం సమీపంలో గల ఒక చింతచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ సమీప గ్రామ ప్రజలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా సాధు జంతువులా సంచరిస్తూ ఉండేది. ఈ పెద్దపులిని గ్రామ ప్రజలు, బాటసారులు రాజమార్గాన ప్రయాణించే వాహనదారులు వనదేవతగా, శ్రీకనకదుర్గ అమ్మవారి వాహనంగా భావించి భక్తితో పూజించేవారు. అలా ప్రణమిల్లిన వారి మనోభావాలు, వాంఛలు నెరవేరుస్తూ కాలక్రమంలో ఆ పులి అదృశ్యం కావడంతో చింతచెట్టు కింద అమ్మవారి ఫొటోను పెట్టి గ్రామప్రజలు పూజించేవారు. 1961–62లో శ్రావణపు వెంకటనర్సయ్య అమ్మవారి దేవాలయం నిర్మించేందుకు కొంత స్థలం దానం ఇవ్వగా.. కంచర్ల జగ్గారెడ్డి భక్తుల ఆర్థిక సహాయ సహకారాలతో శ్రీ పెద్దమ్మతల్లికి దేవాలయం నిర్మించి శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నాటినుంచి స్మార్త సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా వనదేవత అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆది, గురువారాలలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివాహాది శుభకార్యాలు ఏవైనా ఇక్కడే..శ్రీ కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మగుడి)లో భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాలను ప్రతినిత్యం నిర్వహిస్తుంటారు. అంతేకాక ప్రతియేటా అమ్మవారి ఆలయంలో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. పిల్లలకు బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, పుట్టినరోజు, పెళ్లిరోజు, పదవీ విరమణ కార్యక్రమాలు... ఇలా ఏ శుభకార్యమైనా అమ్మవారి సన్నిధిలో నిర్వహిస్తుండడం ఆనవాయితీ. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన ప్రత్యేక ‘పొంగల్ షెడ్’తోపాటు ప్రైవేటు వారి నిర్వహణలో ఉన్న వివిధ ఫంక్షన్ హాళ్లలో నిత్యం ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి.నవరాత్రులు ప్రత్యేకం..పెద్దమ్మతల్లి దేవాలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల΄ాటు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి.. అన్ని రకాల పూజలు చేస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి, శ్రీ లలితాదేవి, శ్రీ గాయత్రి దేవి, శ్రీ మహాలక్ష్మి దేవి, శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ మంగళ గౌరీదేవి, శ్రీ మహిషాసుర మర్థనీదేవి అలంకారాలు నిర్వహించి.. విజయదశమి రోజు అమ్మవారికి గ్రామసేవ, శమీపూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎవరు వాహనం కొనుగోలు చేసినా ముందు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకపూజ చేయించాల్సిందే. నవరాత్రుల సమయంలో ఆయుధపూజ రోజున ప్రత్యేకంగా వేలాది వాహనాలకు పూజలు చేయించడం విశేషం. ఇక్కడ పూజలు చేయిస్తే ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా ప్రయాణం సాగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సమీప ప్రాంత రైతులు అమ్మవారికి పూజ చేసిన తర్వాతే వ్యవసాయ పనులను ప్రారంభిస్తుంటారు.ఆలయ విశేషాలు..అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు, వేపచెట్టు కలిసి ఉంటాయి. ఈ మహావృక్షాన్ని శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాలుగా భక్తులు భావిస్తారు. ఈ వృక్షానికి ఊయలకట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం లేని మహిళలు గర్భం దాలుస్తారని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. బస్సు మార్గం..హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, వరంగల్ నుంచి భద్రాచలం, మణుగూరు వెళ్లే ప్రతి బస్సు అమ్మవారి ఆలయం ముందు నుంచే వెళ్తాయి. భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, మణుగూరు డి΄ోలకు చెందిన బస్సులు ప్రతినిత్యం ఈ రహదారిలో ప్రయాణిస్తూ ఉంటాయి. రైలు మార్గం..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కొత్తగూడెం(భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్) వరకు రైలు సౌకర్యం ఉంది. ఖమ్మం వరకు రైలు మార్గం ఉంది. ఖమ్మం నుంచి 100 కి.మీ., కొత్తగూడెం నుంచి నుంచి 20 కి.మీ. దూరంలోగల అమ్మవారి ఆలయం మీదుగా నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.– గగనం శ్రీనివాస్, సాక్షి, పాల్వంచ రూరల్(చదవండి: ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..! ఏకంగా పదకొండు అలంకరాలు..) -
Antifa: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వామపక్ష భావజాలమున్న ఎంటిఫా సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటిక్ ఉద్యమకారుడు చార్లీ కిర్క్ హత్య నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో స్వయంగా ఆయన ప్రకటన చేశారు.ఎంటిఫాను ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ప్రకటన చేశారు. దానిని అత్యంత ప్రమాదకరమైన సంస్థగా.. రాడికల్ లెఫ్ట్ విపత్తుగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు దీనికి నిధులు సమకూర్చే వారిపై కఠిన విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలకు సూచించారాయన. The United States of America will be designating ANTIFA as a Terrorist Organization.— Donald J. Trump (@realDonaldTrump) May 31, 2020ఏంటీ ఎంటిఫా.. Antifa అంటే ఫాసిస్ట్ వ్యతిరేక (anti-fascist) పదానికి సంక్షిప్త రూపం. ఇదేం ఒక అధికార, కేంద్రీకృత సంస్థ కాదు. ఫార్-లెఫ్ట్ కార్యకర్తల గ్రూప్. ఫాసిజం, రేసిజం, అన్నింటికంటే ముఖ్యంగా కన్జర్వేటివ్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఉద్యమం అని చెప్పొచ్చు. ఈ సభ్యులు తరచూ ఫార్-రైట్ ర్యాలీలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. బెల్లా సియావో(Bella Ciao) వంటి పాటలు, 1917 రష్యా విప్లవానికి సంబంధించిన గుర్తులను, నినాదాలను తమ నిరసనలకు ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో సిగ్నల్, ఇతర ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే.. ట్రంప్ గత టర్మ్లోనే ఈ గ్రూప్ను ఉగ్రసంస్థగా గుర్తించాలని అనుకున్నారు. కానీ అది వీలుపడలేదు. ఇప్పుడు తనకు సన్నిహితుడైన చార్లీ కిర్క్ హత్యతో ఆ పని చేశారు. అయితే Antifa అనేది ఒక సిద్ధాంతం మాత్రమేనని, దానిని సంస్థగా గుర్తించి నిషేధించడం అసాధ్యమని, పైగా చట్టపరంగా ఇబ్బందులూ ఎదురుకావొచ్చని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభిప్రాయపడుతున్నారు. కిర్క్ మరణంకన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ మరణం.. అమెరికాలో రాజకీయ దుమారం రేపింది. సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని రైఫిల్తో కాల్చి చంపారు. ఒకే భావజాలం ఉన్న ట్రంప్ కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కిర్క్ ప్రచారం కూడా చేశారు. దీంతో తన ఆప్తుడి మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారాయన. ఈ క్రమంలో.. వామపక్ష భావజాలం ఉన్న 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తిని ఎఫ్బీఐ అరెస్ట్ చేసింది. ఘటనా స్థలంలో "Hey fascist! Catch!" వంటి రాతలున్న బుల్లెట్ కేసింగ్లపై కనిపించడం గమనార్హం. అయితే రాబిన్సన్ Antifa సభ్యుడా అనే విషయాన్ని ఎఫ్బీఐ ఇంకా నిర్ధారించలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను ‘‘ఇంటర్నెట్ ద్వారా రాడికలైజ్ అయ్యాడు’’ అని చెబుతుండడం గమనార్హం. -
‘మెదడును తినే అమీబా’ కలకలం.. ఈ ఏడాదిలోనే 19 మంది మృతి!
న్యూఢిల్లీ: కేరళలో ‘మెదడును తినే అమీబా’ కేసులు కలకలం రేపుతున్నాయి. అధిక మరణాల రేటు కలిగిన మెదడు ఇన్ఫెక్షన్ అయిన ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పామ్) కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి వల్ల వస్తుంది. దీనిని సాధారణ బాషలో ‘మెదడును తినే అమీబా’ అని పిలుస్తారు. ఈ ఏడాది కేరళలో ఈ తరహాలో 61 పామ్ కేసులు నమోదయ్యాయి. 19 మరణాలు సంభవించాయి. వీటిలో పలు మరణాలు గత కొన్ని వారాలలోనే నమోదయ్యాయి.కేరళ ప్రస్తుతం తీవ్రమైన ప్రజారోగ్య సవాలుతో పోరాడుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. గతంలో కోజికోడ్, మలప్పురం తదితర జిల్లాల్లోని క్లస్టర్లతో ముడిపడి ఉన్న ఈ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. బాధితుల జాబితాలో మూడు నెలల శిశువు నుండి 91 ఏళ్ల వయస్సు వారి వరకు ఉన్నారని తెలిపారు. కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ‘పామ్’ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పలు సందర్భాలలో ఇది తీవ్రమైన మెదడు వాపు, మరణానికి దారి తీస్తుంది. ఇది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, టీనేజర్లు, యువకులకు సోకుతుంది.మెదడును తినే అమీబా అనేది నిలిచిపోయిన నీరులో కనిపిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ అమీబాతో కలుషితమైన నీటి వనరులలో ఈత కొట్టడం, డైవింగ్ చేయడం లేదా స్నానం చేసేవారికి ఈ అమిబీ సోకే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. పామ్ కేసులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని నిర్ధారించడం కష్టమని నిపుణుల చెబుతున్నారు. అయితే దీని లక్షణాలు బాక్టీరియల్ మెనింజైటిస్ లాంటివి.. అంటే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు. ‘పామ్’ సోకినప్పుడు ఈ లక్షణాలు ఒకటి నుండి తొమ్మిది రోజుల మధ్య కనిపించే అవకాశాలున్నాయి. కేరళలో 2016లో తొలి ‘పామ్’ కేసు నమోదయ్యింది. గత ఏడాది నుంచి ఈ కేసులలో పెరుగుదల కనిపించింది . కొత్త ఇన్ఫెక్షన్లను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు చెరువులు, సరస్సులు వంటి శుద్ధి చేయని లేదా నిలిచిపోయిన నీటి వనరులలో ఈత కొట్టటం లాంటి పనులు చేయవద్దని కేరళ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. -
దర్శకుడు రాంగోపాల్ వర్మపై క్రిమినల్ కేసు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(ఆర్జీవీ)పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘దహనం’.. 2022లో ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీని దర్శకుడు అగస్త్య మంజు తెరకెక్కించారు. అయితే, ఇందులో ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటాన్ని తెరకెక్కించారు. ఓ కమ్యూనిస్ట్ నేత రాములును ఏ విధంగా హత్య చేశారు.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్ సిరీస్ను నిర్మించారు. అయితే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందించినట్లు ఆర్జీవీ చెప్పారని, ఇది అవాస్తవమని రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా రెండు రోజుల క్రితం రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేశారు. తాను ఎవరితోనూ వాస్తవ ఘటనలంటూ చెప్పలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండానే చిత్రంలో ఆమె పేరును ఉపయోగించుకోవడం విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన ప్రతిష్టకు భంగం కలిగించడమేనంటూ ఆమె పేర్కొన్నారు. -
కండక్టర్ కమ్ బుక్ కలెక్టర్ స్టోరీ..!
‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో’ అన్న కందుకూరి వీరేశలింగం మాటను నిజం చేశాడు కర్ణాటక, హరెలహళ్లికి చెందిన అంకే గౌడ. ఇప్పుడతని వయసు 75 ఏళ్లు. పుస్తకాలను కొని చదివి, భద్రం చేసే పనిని తన 20వ ఏట మొదలుపెట్టాడు. ఇప్పటివరకు పోగైన రెండు కోట్ల పుస్తకాలతో ‘బుక్ మానే (బుక్ హౌజ్)’ పేరుతో ఓ గ్రంథాలయాన్నే ఏర్పాటు చేసి.. దాన్నే తన నివాసంగా మలుచుకున్నాడు. కండక్టర్.. బుక్ కలెక్టర్అంకే గౌడ్ ఓ వైపు కన్నడ సాహిత్యంలో పీజీ చదువుతూనే మరో వైపు బస్ కండక్టర్గా ఉద్యోగంలో చేరాడు. చిన్నప్పటి నుంచీ పుస్తకం పఠనం మీద ఆసక్తి మెండు. దానికి కాలేజీలో తన ప్రొఫెసర్ అనంతరాము ప్రభావం, స్ఫూర్తీ తోడవడంతో పుస్తకాలను కొనడమూ మొదలుపెట్టాడు. కండక్టర్గా తనకొచ్చే జీతంలో ముప్పావుభాగం పుస్తకాల కొనుగోలు మీదే వెచ్చించేవాడు. పెళ్లయి, పిల్లాడు పుట్టి బాధ్యతలు పెరిగినా ఇంటి ఖర్చులను తగ్గించుకునేవాడు కానీ పుస్తకాల బడ్జెట్లో కోత పెట్టేవాడు కాదు. అతని ఆ ఆసక్తిని, అలవాటును సహధర్మచారిణి విజయలక్ష్మి గౌరవించి.. ఉన్నదాంట్లోనే పొదుపుగా సంసారం చేయసాగింది. చివరకు తనకు నచ్చిన, లోకం మెచ్చిన పుస్తకాలను కొనడానికి అంకే గౌడ .. మైసూరులోని తమ ఇంటిని అమ్మినా మారుమాట్లాడకుండా భర్తను అనుసరించింది ఆమె. ప్రస్తుతం ‘బుక్ మానే’లోనే ఓ మూల ఆ కుటుంబం నివాసముంటోంది. అందరికీ ఉచితం1832 నాటి రాతప్రతులు సహా దేశ, విదేశీ భాషలన్నిటిలోని అరుదైన సాహిత్యం అంకే గౌడ ‘బుక్ మానే’లో కనిపిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, మైథాలజీ, ఫిలాసఫీలకు సంబంధించిన పుస్తకాలూ దొరుకుతాయి. ఈ లైబ్రరీకి ఎవరైనా వెళ్లి కావల్సిన పుస్తకాలను ప్రశాంతంగా చదువుకోవచ్చు. ప్రవేశ రుసుము కానీ, పుస్తకానికి అద్దె కానీ లేదు. పూర్తిగా ఉచితం. బడి పిల్లలు, రీసెర్చ్ స్కాలర్స్, సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నవాళ్లు, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ఈ లైబ్రరీకి రెగ్యులర్ విజిటర్స్. పర్యాటకుల గురించైతే విడిగా చెప్పక్కర్లేదు. ఎక్కడెక్కడి నుంచో ‘బుక్ మానే’ను చూడ్డానికి వస్తూంటారు. ‘పుస్తక పఠనం మీద ఆసక్తి, జ్ఞానతృష్ణ ఉన్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వచ్చి తమకు కావల్సింది చదువుకోగలిగేలా ఈ లైబ్రరీని మలచాలి.. ఓ నాలెడ్జ్ హబ్గా మార్చాలన్నదే నా కల, భవిష్యత్ లక్ష్యం’ అంటాడు అంకే గౌడ. (చదవండి: సరదా సరదా దొంగతనాలు: క్లెప్టోమేనియా!) -
క్లౌడ్బరస్ట్తో హైదరాబాద్ కకావికలం
నగరం మరోసారి తడిసిముద్దయింది. బుధవారం రాత్రి కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వరకు ఏకధాటిగా ఐదు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో నగర జన జీవనం అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లుగా కురిసిన వర్ష ఉద్ధృతితో నగర వాసులు బెంబేలెత్తిపోయారు. వర్షం దాటికి నిమిషాల వ్యవధిలోనే రోడన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అపార్ట్మెంట్లతోపాటు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరగా, డైనేజీ, ఓపెన్ నాలాలు పొంగిపొర్లాయి. మెట్రో స్టేషన్లు, బ్రిడ్జిల కింద భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాíఫిక్ జామ్ అయింది. మాదాపూర్–హైటెక్ సిటీ చౌరస్తా, రాయదుర్గం, అమీర్పేట బంజారాహిల్స్ ఐకియా మార్గంలో, మియాపూర్– చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై వాహనాలు ముందుకు కదల్లేదు. దీంతో ముంబై జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 12 గంటల వరకు అత్యధికంగా ముషీరాబాద్ తాళ్లబస్తీలో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఒకరు మృతిహైదరాబాద్లో ఐదు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో.. విషాదం నెలకొంది. బల్కంపేట రైల్వే బ్రిడ్జి కింద వరద నీటిలో పడి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడిని ముషీరాబాద్ భోలక్పూర్కు చెందిన షర్పుద్దీన్గా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. :::సాక్షి, సిటీబ్యూరో -
సర్.. నా భార్య చిలిపి దొంగతనాలు చేస్తోంది!
నా భార్య వయసు 45 ఏళ్ళు. మాకు ఒక సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మంచి ఉన్నతమైన కుటుంబం. మా ఆవిడకు మొదటి నుంచి ఒక వింత అలవాటు ఉంది. షాపింగ్కు వెళ్లినపుడు అవసరం లేకపోయినా, కొనగలిగిన స్థోమత ఉన్నా, ఏదో ఒక వస్తువు దొంగిలిస్తుంది. ఆమె దొంగిలించే వాటిలో కాస్మెటిక్స్ లాంటి చిన్న వస్తువుల నుంచి, ఒక్కోసారి చీరలు, చిన్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. అలా దొంగిలించినవి కొన్ని ఇంట్లో దాచిపెడుతుంది. కొన్నేమో ఇతరులకు తాను గొప్ప అనిపించుకోవడానికి అన్నట్లు పంచిపెడుతుంది. ఆమెకు 300లకు పైగా చీరలు,కోట్లు విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. ఒక్కోసారి నా జేబులోంచి కూడా, నాకు చెప్పకుండా డబ్బులు తీసి దాస్తుంది. ఇన్ని చేసినా ఏమి తెలియనట్లు ఉంటుంది. ఏమాత్రం గిల్టీగా ఫీలవదు. ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా, ఆమె ఎందుకు ఇలా చీప్గా దొంగతనాలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఇలా చేసి కొన్నిసార్లు షాప్స్లో పట్టుబడితే, పొరపాటయిందని సారీ చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. బయట ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. సాక్షిలో మీ కాలమ్ చూసి, మీరే ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఉన్నాను!– కామేశ్వరరావు, హైదరాబాద్రావుగారూ! మీరెంతో ఆవేదనతో మీ సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లుగా ఇది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అన్నీ ఉన్నా, అవసరం లేకున్నా ఇలా దొంగతనాలు చేయడాన్ని ‘క్లెప్టోమెనియా’ అంటారు. ఇది చాలా అరుదైన ఒక వింత మానసిక సమస్య. ఈ సమస్య ఉన్న వారికి, ఎలాగైనా ఏదో ఒకటి దొంగిలించాలనే ‘తహ తహ’ ఉంటుంది. వాస్తవానికి ఆ దొంగిలించిన వస్తువు వల్ల వారికి ఎలాంటి అవసరం ఉండదు. ఆ వస్తువు విలువ కూడా చాలా స్వల్పమై ఉండవచ్చు. మామూలు దొంగతనాల లాగా వీరు ఏదీ ప్లాన్ చేసుకుని, దొంగతనాలు చేయరు. ఏదైనా షాపింగ్కి అని వెళ్లినపుడు అలా సడన్గా చేతికందిన ఏదో ఒక వస్తువును వారికవసరం లేకపోయినా ఎత్తేస్తుంటారు. బాగా స్థోమత కలిగి, డబ్బులు పెట్టి కొనగలిగిన వారిలోనే ఈ అలవాటు ఎక్కువ. బహిష్టు సమయంలో ఇలాంటి కోరిక, కొందరిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కనబడిన వస్తువు ఎత్తేయకుంటే విపరీతమైన టెన్షన్కు గురయి, తీసిన తర్వాత చాలా మానసిక ప్రశాంతతకు లోనవుతారు. దీనిని ‘ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్’ అని కూడా అంటారు. ఈ అలవాటు యుక్తవయసులో మొదలై పెద్దయ్యే కొద్ది తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొందరిలో మాత్రం శాశ్వతంగా ఉండి΄ోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే ఆ వ్యక్తి సహకరించాలి. కొన్నిరకాల మందులతో పాటు ‘కాగ్నిటివ్ బిహేవియర్ మాడిఫికేషన్’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని ఈ అలవాటు నుండి బయటపడేసే అవకాశముంది. మొదట్లోనే ఈ అలవాటు గుర్తించి మానసిక వైద్యుడిని కలిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి. ఇప్పటికైనా మీ భార్యను మంచి నిపుణులైన సైకియాట్రిస్ట్ క్లినికల్ సైకాలజిస్టుల పర్యవేక్షణలో తగిన థెరపీ చేయించండి. ఆల్దిబెస్ట్!డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) -
ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.. అర్థమైతే మంచింది: సమంత
సామాజిక మాధ్యమాలను బాగా వాడుకునే నటీమణుల్లో సమంత ఒకరు. తమిళం, తెలుగు భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా ఏలిన ఈ అమ్మడు ఆ మధ్య మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో అది కెరీర్కు బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఆ వ్యాధి నుంచి కోలుకున్నా, కథానాయకిగా మాత్రం బిజీ కాలేకపోతున్నారు. ఇటీవల నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించి అతిథి పాత్రలో నటించారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయినా తర్వాత చిత్రం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. అదేవిధంగా ఈమె మళ్లీ తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ దాని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సమంత మాత్రం ఏదో ఒక వార్తతో నిత్యం ప్రైమ్ టైమ్లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా సమస్యల కారణంగా తాను చాలా విషయాలను నేర్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అదేవిధంగా ఇక్కడ కథానాయకి కెరీర్గానీ, గ్లామర్, అభిమానులు, పాపులారిటీ ఏదీ శాశ్వతం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా కొంత కాలమేనని అన్నారు. ఒక నటిగా ఎదగడానికి చాలా అదృష్టానికి మించి చాలా కావాలన్నారు. తాను తన జీవితంలో నటిగా కంటే పెద్ద ప్రభావాన్ని చూపాలని కోరుకున్నానన్నారు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలిసిందన్నారు. ఇలా వేదాంతం పలుకుతున్న సమంత గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం సమంతకు ఫుల్ సపోర్ట్గా నిలుస్తున్నారు. ఏదేమైనా సమంత మళ్లీ తెరపై ఎప్పుడు మెరుస్తుందో అని ఆమె అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు. -
Amaravati: మీటరు రోడ్డుకు రూ.10 లక్షలు!
సాక్షి, అమరావతి: రాజధానిలో రోడ్ల నిర్మాణ పనుల అంచనాల్లో ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) తన రికార్డులను తానే బద్ధలుకొడుతోంది. ఈ–13 రహదారిని 6 వరుస (లేన్)లతో ఎన్హెచ్–16 వరకూ పొడిగించే పనులను కి.మీకు రూ.66.18 కోట్ల చొప్పున కాంట్రాక్టరుకు అప్పగించిన ఏడీసీఎల్, తాజాగా.. సీడ్ యాక్స్స్ రోడ్డును మూడో దశలో 6 వరుసలతో 755 మీటర్ల పొడవు (ఇందులో కృష్ణా వెస్ట్రన్ డెల్టా కాలువపై 130 మీటర్ల పొడవుతో నిర్మించే స్టీలు బ్రిడ్జితో కలిపి)తో నిర్మించి, పాత మంగళగిరి హైవేతో కలిపే పనులకు రూ.61.67 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.13.15 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. 755 మీటర్ల రోడ్డు కాంట్రాక్టు విలువ రూ.74.82 కోట్లన్న మాట. అంటే.. మీటరు రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఆ రోడ్డును మట్టి, రాళ్లు, తారుతో నిరి్మస్తున్నారా లేక బంగారం పూతతో వేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారులను మీటరు రూ.2 లక్షల నుంచి రూ.2.2 లక్షలతోనే ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) నిరి్మస్తోందని ఇంజినీరింగ్ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ముడుపుల కోసమే రోడ్డు పనుల అంచనాలను పెంచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.పనుల పూర్తికి 4 నెలలు గడువు.. రాజధానిలో ప్రధాన ప్రాంతానికి (సీడ్ కేపిటల్) కోల్కత–చెన్నై జాతీయ రహదారిని అనుసంధానించేందుకు సీడ్ యాక్సిస్ రోడ్డు (ఈ3)ను ఏడీసీఎల్ నిరి్మస్తోంది. అందులో భాగంగా ఈ రోడ్డును పాత మంగళగిరి హైవేతో అనుసంధానం చేసే పనులను మూడో దశలో టెండరు పిలిచింది. మూడో దశలో 755 మీటర్ల పొడవున 6 వరుసల (స్ట్రీట్లైట్లు, ఫుట్పాత్, యుటిలిటీ డక్ట్లు, వరద నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు)తో నిర్మించే పనులకు టెండర్లు పిలిచింది. ఇందులో.. కృష్ణా డెల్టా పశ్చిమ కాలువపై 130 మీటర్ల పొడవున స్టీలుబ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ పనుల పూర్తికి 4 నెలలు గడువుగా నిర్దేశించి ఈనెల 3న టెండరు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ టెండరులో బిడ్ దాఖలు గడువు గురువారం సా.5 గంటలతో ముగియనుంది. ఆర్థిక బిడ్ శుక్రవారం తెరిచి.. తక్కువ ధరకు కోట్చేసిన కాంట్రాక్టు సంస్థను ఎల్–1గా తేల్చి.. ఆ సంస్థకే పనులు అప్పగించాలని సీఆర్డీఏకి ఏడీసీఎల్ సీఈ ప్రతిపాదన పంపనున్నారు. -
అలెక్సీ నవాల్నీపై విష ప్రయోగం
మాస్కో: రష్యా అధినేత పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ మృతివెనుక ముమ్మాటికీ కుట్ర ఉందని ఆయన భార్య యూలియా నవాల్నీ ఆరోపించారు. తన భర్తపై విష ప్రయోగం జరిగినట్లు పరీక్షల్లో తేలిందని బుధవారం చెప్పారు. రెండు ల్యాబ్ రిపోర్టులు ఇదే విషయం నిర్ధారిస్తున్నాయ ని పేర్కొన్నారు. తన భర్త మృతదేహం నుంచి నమూనాలు సేకరించి, విదేశాలకు తరలించినట్లు చెప్పారు. అక్కడే పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 2024 ఫిబ్రవరిలో రష్యాలోని ఆర్కిటిక్ పెనాల్ కాలనీ జైలులో అలెక్సీ నవాల్నీ(47) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనారోగ్యంతో ఆయన చనిపోయినట్లు అప్పట్లో అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించాయి. పుతిన్ అవినీతిపై అలెక్సీ గళమెత్తారు. పుతిన్కు వ్యతిరేకంగా పలు ప్రదర్శనలు నిర్వహించారు. పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని పుతిన్ సర్కార్ ఆయనపై అభియోగాలు మోపింది. 19 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది. -
పాక్ నకిలీ ఫుట్బాల్ జట్టు వెనక్కి
లాహోర్: చిట్టడవులు, కొండ ప్రాంతాలు, సరిహద్దు గుండా ఉగ్రవాదులను పాకిస్తాన్ అక్రమంగా భారత్లోకి పంపిస్తుంటే.. ఇదే స్ఫూర్తితో ఒక పాకిస్తానీయుడు తోటి పాకిస్తానీయులను మోసం చేసి జపాన్కు పంపించాడు. ‘గోల్డెన్ ఫుట్బాల్ ట్రయల్’ పేరిట ఫుట్బాల్ క్లబ్ బృంద సభ్యులుగా జపాన్లోకి అడుగుపెట్టిన ఈ నకిలీ ఆటగాళ్లను జపాన్ అధికారులు ఎయిర్పోర్ట్లోనే అనుమానంతో ఆపేశారు. అట్నుంచి అటే మళ్లీ పాకిస్తాన్కు తిరుగుటపా చేశారు. 15 రోజుల తాత్కాలిక పాక్ వీసాతో జపాన్కు వచి్చన 22 మందిని వెనువెంటనే తిరిగి పంపించిన ఘటన జూన్లో జరగ్గా చాలా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఫుట్బాల్ టీమ్ అంశాన్ని పాకిస్తాన్ దర్యాప్తు సంస్థ.. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీరియస్గా తీసుకుంది. 22 మందిని జపాన్కు పంపిన మానవ అక్రమ రవాణా కేసులో మాలిక్ వకాస్ను ఎఫ్ఐఏ అధికారులు అరెస్ట్చేశారు. ఫుట్బాల్ ఆటగాళ్లలాగే ఫుట్బాల్ ఆటగాళ్లమాదిరే నిజమైన టీమ్ జెర్సీ దుస్తుల్లో జపాన్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే తర్వాత వీళ్ల ధోరణి చూసి జపాన్ ఇమిగ్రేషన్ అధికారులకు అనుమానమొచ్చి వీళ్లను లోతుగా ప్రశ్నించి అసలు విషయంరాబట్టారు. పాక్ ఎయిర్పోర్ట్ అధికారుల కళ్లుగప్పి ఇక్కడిదాకా ఎలా రాగలిగారనే ప్రశ్న జపాన్ అధికారులను తొలచేస్తోంది. పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అధికారులతో మాలిక్ వక్రాస్కు సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జపాన్కు పంపేందుకు ఈ ఒక్కో అక్రమ వలసదారుడి నుంచి కనీసం 45 లక్షల పాక్ రూపాయలను వసూలుచేసినట్లు తెలుస్తోంది. మాలిక్ జపాన్కు ఇలా గతంలోనూ కొందరిని తరలించాడని సమాచారం. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 17 మందిని జపాన్కు తరలించాడు. ఈ విషయంలో గత ఏడాది జనవరిలో వెలుగులోకి వచి్చంది. అప్పుడు వెళ్లిన వాళ్లెవరూ తిరిగి పాక్కు రాలేదు. -
ఫారోల అమూల్య బ్రాస్లెట్ అదృశ్యం
కైరో: ఈజిప్ట్ నాగరికతతో ఫారో చక్రవర్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఫారో చక్రవర్తుల కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ల నిర్మాణం జరిగింది. అద్భుతమైన పాలనతో మంచి పేరు తెచ్చుకున్న ఫారో చక్రవర్తులకు చెందిన ఒక ముంజేతి కంకణం ఇప్పుడు కనబడకుండాపోయింది. ఈజిప్ట్ రాజధాని కైరో నగరంలోని తహ్రీర్ స్క్వేర్లోని ప్రఖ్యాత మూజియంలో చివరిసారిగా ఇది బహిరంగంగా కనిపించింది. మధ్యలో లాపిస్ లజూలీ మణిపూస పొదిగిన ఈ కంకణాన్ని స్వచ్ఛమైన స్వర్ణంతో తయారుచేశారు. మ్యూజియంకు చెందిన పునరుద్ధరణ లే»ొరేటరీకి తీసుకురాగా ఆ తర్వాత ఇది కనిపించకుండాపోయిందని ఈజిప్ట్ పర్యాటకం, పురాతత్వ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. దీనిని దొంగలించిన వ్యక్తులు విదేశాలకు అక్రమ రవాణా చేయొచ్చని ఈజిప్ట్ ప్రభుత్వం అనుమానిస్తోంది. అనుకున్నదే తడవుగా వెంటనే దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయలు, సరిహద్దుల వద్ద తనిఖీలను ముమ్మరంచేసింది. బ్రాస్లెట్ ఫొటోలను ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్, వాట్సాప్ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్చేస్తోంది. వేల ఏళ్ల పాత కంకణం క్రీస్తు పూర్వం 1,076 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 723 సంవత్సరాల కాలంలో ఈజిప్ట్ను పరిపాలించిన రాజవంశానికి చెందిన అమేనీమోప్ రాజుకు చెందిన కంకణంగా దీనిని గుర్తించారు. తూర్పు నైలు నదీతీర ప్రాంతంలోని టానిస్లో ఖననంచేసిన అమేనీమోప్ ఆన్ఆర్టీ–4 ఛాంబర్లో ఈ కంకణాన్ని గతంలో కనుగొన్నారు. తొలుత వేరే చోట అమేనీమోప్ పారి్థవదేహాన్ని ఖననంచేసి కొన్నాళ్లకు సుసేన్నెస్ రాజు సమీప ఛాంబర్కు మార్చారు. ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన రాజుల్లో ఒకడిగా సుసేన్నెస్ వెలుగొందారు. అమేనీమోప్ సమాధాని 1940లో కనుగొన్నారు. ‘‘వేల ఏళ్ల చరిత్ర గల ఇలాంటి కంకణం కనబడకుండా పోవడం వింతేమీ కాదు. వీటికి బహిరంగ మార్కెట్లో చాలా విలువ ఉంది. స్మగ్లర్లు వీటిని దొంగించి విదేశాలకు తరలిస్తారు’’అని బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఫోరెన్సిక్ పురాతత్వవేత్త క్రిస్టోస్ సిరోగియాన్నిస్ చెప్పారు. ‘‘త్వరలోనే ఇది ఎక్కడో, ఏ దేశంలోనో ప్రఖ్యాత వేలం సంస్థ వేలంపాటలోనే, ఆన్లైన్లోనే ప్రత్యక్షమవుతుంది. ఫారో చక్రవర్తుల వస్తువులను సొంతం చేసుకునే సంపన్నులకూ కొదువలేదు. వాళ్లు వీటిని బ్లాక్మార్కెట్లో కొని దాచుకుంటారు’’అని ఆయన అన్నారు. ‘‘చోరీకి గురై తమ దేశంలోకి వచి్చన పురాతన వస్తువులను కొన్ని అరబ్ దేశాలు తిరిగి ఈజిప్ట్కు అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని అయితే అధికారికంగా అప్పగించే ఉద్దేశంలేక మ్యూజియం తోటలోనే, ప్రాంగణాల్లోనూ తర్వాత పడేసి వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయి’’అని ఆయన గుర్తుచేశారు. ‘‘కంకణంలోని బంగారం కరిగించి సొమ్ముచేసుకునే అవకాశం చాలా తక్కువ. కరిగిస్తే వచ్చే బంగారం విలువ కన్నా అలాగే కంకణం రూపంలోనే అమ్మితే లెక్కలేనంత సొమ్ము సంపాదించొచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర ఆఫ్రికా దేశమైన ఈజిప్ట్కు దశాబ్దాలుగా పురాతన వస్తువుల స్మగ్లింగ్ అనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. శక్తిమేరకు కాపాడుతున్నా ప్రతి ఏటా ఎక్కడో ఓ చోట ఇలా విలువైన వస్తువులు అదృశ్యమవుతూనే ఉన్నాయి. -
హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చీఫ్ అబ్దుల్ గనీ భట్ కన్నుమూత
శ్రీనగర్: చాన్నాళ్లపాటు కశ్మీర్లోయలో వేర్పాటు వాద ఉద్యమానికి సారథ్యంవహించిన హురియల్ కాన్ఫెరెన్స్ మాజీ ఛైర్మన్, మితవాద వేర్పాటువాది అబ్దుల్ గనీ భట్ వృద్ధాప్యంకారణంగా బుధవారం కన్ను మూశారు. 90 ఏళ్ల గనీ గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ బారాముల్లాలోని సోపో ర్లో సొంతింటికే పరిమితమయ్యారని ప్రస్తు త హురియత్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ చెప్పారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంతో, తర్వాత మ న్మోహన్ హయాంలో కేంద్రంతో హురియత్ కాన్ఫరెన్స్ చర్చలు జరపడంలో భట్ కీలక భూమిక పోషించారు. -
దోస్త్ అంటూనే డ్రగ్స్ జాబితాలోకి భారత్ను చేర్చిన ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: మంచి మిత్రదేశం అంటూనే వివాదాస్పద, అపఖ్యాతి పాల్జేసే జాబితాలో భారత్ను అమెరికా చేర్చింది. మాదకద్రవ్యాల కట్ట డిపై ఉక్కుపాదం మోపే భారత్ను ప్రధాన డ్రగ్స్ రవాణా, ఉత్పత్తి దేశాల జాబితాలో అమెరికా అధ్య క్షుడు ట్రంప్ చేర్చారు. ఈ మేరకు ‘అధ్యక్షుడి సంకల్పం’ పత్రాన్ని సోమవారం అమెరికా కాంగ్రెస్కు ట్రంప్ సమర్పించారు. భారత్, బహమాస్, బెలీజ్, బొలివియా, బర్మా, చైనా, కొలంబియా, కోస్టారికా, డొమినికా రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, హైతీ, హోండురాస్, జమైకా, లా వోస్, మెక్సికో, నికరాగ్వా, పాకిస్తాన్, పనామా, పె రూ, వెనెజువెలా సహా 23 దేశాలతో జాబితాను సిద్ధంచేసి కాంగ్రెస్కు ట్రంప్ సమర్పించారు. ‘‘విదే శాల్లో ఉత్పత్తయి ఈ దేశాల గుండా అమెరికాకు డ్రగ్స్ రావడం, లేదంటే ఈ 23 దేశాలు ఆ జాబితా లో ఉన్నాయి. -
అత్యధికులు ఎస్ఐఆర్లో డాక్యుమెంట్లు ఇవ్వక్కర్లేదు
న్యూఢిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాల్లో సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు ఓటర్ల జాబితా సవరణ వేళ కొత్తగా ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం రాకపోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) 2002 నుంచి 2004 ఏడాది మధ్యలో జరిగింది. తదుపరి ఎస్ఐఆర్కు ఈ సంవత్సరాలనే కటాఫ్ తేదీగా పరిగణించబోతున్నారు. దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహణపై ఈసీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాదిలోపే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తిచేసే అవకాశముంది. రాష్ట్రాలవారీగా చివరి ఎస్ఐఆర్ తర్వాత అక్కడి ఓటర్ల జాబితాను ముద్రించే సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ)లకు ఆదేశాలు వెళ్లాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్ సహా కొన్ని రాష్ట్రాల సీఈఓలు ఇప్పటికే ముద్రిత జాబితాను తమ వెబ్సైట్లలో అందుబాటులోకి తెచ్చారు. కటాఫ్ ఏడాది తర్వాత వచ్చి చేరిన కొత్త ఓటర్లను ఓటు గుర్తింపు రుజువు పత్రాలు అడగనున్నారు. చాలా రాష్ట్రాల్లో మెజారిటీ ఓటర్లపై ఈసీ అభిప్రాయం -
ఆడబిడ్డకు మరణశాసనం!
శ్రీకాళహస్తికి చెందిన ఓ జంటకు గతేడాది వివాహం జరిగింది. గర్భం దాల్చడంతో కుటుంబ పెద్దల లింగ నిర్ధారణ పరీక్షల కోసం స్థాకంగా ఉన్న ఓ డాక్టర్ను సంప్రదించారు. తమకు తొలి సంతానం పురుషుడు కావాలని చెప్పారు. వెంటనే ఆ వైద్యుడు ఆమెకు పరీక్షలు నిర్వహించి కడుపులో పెరుగుతోంది బాలిక ఆనవాళ్లు అని నిర్ధారించి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో లింగ నిర్ధారణకు రూ. 45 వేలు, గర్భస్రావానికి సుమారు రూ. 35 వేలు దండుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు ఆ డాక్టర్పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నాయుడుపేటకు చెందిన ఓ జంటకు ఇప్పటికే ఇద్దరు బాలికలు పుట్టారు. తమకు వంశోద్ధారకుడు కావలంటూ మూడవసారి ప్రెగ్నెన్సీ కావడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. దీంతో మూడవ సారి సైతం బాలిక పుట్టే ఆనవాళ్లు ఉన్నాయంటూ సంబంధిత పరీక్షా కేంద్రాలకు చెందిన డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమెకు గర్భస్రావం చేయాలని బంధువులు కోరారు. దీంతో పరీక్షించి డాక్టర్లు ఆ మాతృమూర్తి బంధువుల నుంచి వేలకు వేలు దండుకుని పని పూర్తి చేశారు.అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..అర్ధాంగిగా.. చెయ్యిపట్టి నడిపించే ఆడబిడ్డకు కడుపులోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ఆడపిల్ల భారమనుకునే రోజుల నుంచి ఆడబిడ్డ కోసం ఎదురుచూసే రోజులు వచ్చినా తిరుపతి జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆడపిల్లల లింగ నిష్పత్తి గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భ్రూణ హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లింగ నిర్ధారణ మాఫియా రెచ్చిపోతున్నా వైద్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులోనే జోగుతుండడం విస్మయానికి గురిచేస్తోంది.సాక్షి ప్రతినిధి తిరుపతి : అయ్యో.. మాతృమూర్తుల కడుపులు చిదిమేస్తున్నారే... ప్రెగ్నెస్సీ అయిన నవ వధువులను సైతం వదలకుండా తొలి ప్రసవంలోనే మగబిడ్డ పుట్టాలంటూ స్కానింగ్ చేయించి రక్త ముద్దలపై దాడిచేసి హత్య చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో రోజు రోజుకు విచ్చలవిడిగా బ్రూణ హత్యలకు పాల్పడుతున్నా మామూళ్లకు అలవాటు పడ్డ ప్రభుత్వాధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు, దేశంలోనే పేరొందిన శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో సైతం బాలికల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. లింగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు ధనార్జనే ధ్యేయంగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో విచ్చల విడిగా ఏర్పాటు చేసుకుని కోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులకు ముడుపులు ముట్టచెప్పి లింగనిర్ధారణ పరీక్షల మాఫియా రెచ్చిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో బ్రూణ హత్యలు రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయంపై వైద్య శాఖలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సైతం చర్చించుకుంటున్నారు. పడిపోతున్న బాలికల జనన రేటు జనగణన 2018 ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెయ్యి మంది బాలురకు 922 మంది బాలికలు ఉన్నారు. అదే 2021 లెక్కలకొచ్చేసరికి ఈ సంఖ్య 901కి పడిపోయింది. జిల్లాల విభజన అనంతరం 2024లో జరిగిన జనగణన లెక్కల ప్రకారం తిరుపతి జిల్లాలో బాలికల సంఖ్య స్వల్పంగా పెరిగి 916కు చేరింది. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం జిల్లా నిష్పత్తికి వ్యతిరేకంగా నానాటికీ బాలికల నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. బాలురు – బాలికల నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం నమోదైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తేనే బాలికల నిష్పత్తి పడిపోకుండా ఆపగలమని మేధావులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో తొలి సంతానం మగబిడ్డ పుట్టగానే కుటుంబ నియంత్రణ పాటిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మొద్దునిద్రలో వైద్యాధికారులు తిరుపతి జిల్లాలో బాలురు– బాలికల నిష్ఫత్తి దారుణంగా ఉందన్న విషయాన్ని కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఈ అంశాన్ని బహిర్గతం చేయడం గమనార్హం. ఆరేళ్లలోపు బాలల్లో బాలికలు అతి తక్కువగా ఉన్న మండలాల్లో తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు ఉన్నట్లు సమాచారం. మూడు నెలల కిందట స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సైతం ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి ఇదే అంశాన్ని లేవనెత్తారు. అయినా వైద్యాధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో పెద్ద ఎత్తున బ్రూణ హత్యలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న నిబంధనను అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టకపోవడంతో ఆడ నలుసు అమ్మ గర్భంలోనే అంతమైపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆడ–మగ నిష్పత్తి వెయ్యికి తొమ్మిది వందలు ఉండగా శ్రీకాళహస్తిలో మాత్రం వెయ్యికి 629 మందే ఆడ బిడ్డలే ఉండటం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.వంశోద్ధారకుడు కావాలనే మూఢనమ్మకం.. ముందు మగబిడ్డ పుడితే చాలు.. ఆ తర్వాత ఎవరూ పుట్టినా పర్వాలేదు. మళ్లీ మగ బిడ్డ పుడితే ఇంకా మేలే.. ఒకవేళ ఆడ బిడ్డ పుట్టినా.. కొడుకూ, కూతురు పుట్టిందని సంబర పడిపోతాం.. ఇదీ ప్రస్తుత సమాజంలో పిల్లలు కావాలంకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి. ముందు కొడుకు పుట్టి మరో సంతానంగా కూతురు పుడితే అక్కడితో ఆపేస్తున్నారు. అలా కాకుండా ముందు ఎంత మంది కూతుళ్లు పుట్టినా కొడుకు కోసం కొందరు ఆరాటపడుతున్నారు. ఇంకొందరు కొడుకుల కోసం ఆడ నలుసులను గర్భంలోనే నులిమేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాళహస్తి ప్రాంతంలో వీధికో గాథ బయటపడుతోంది. ఇలా ఆడ నలుసు పురిటిలో కళ్లు కూడా తెరవకముందే బ్రూణ హత్యలకు గురవుతుంటే మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత అంటూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా వైద్య శాఖ నిద్ర మేల్కొని లింగ నిర్ధారణ, గర్భ స్రావాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.విచ్ఛలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు పేదల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో.. లింగ నిర్ధారణ పరీక్షల నిర్వాహకులు బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాలికల నిష్పత్తి లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే గణనీయంగా తగ్గిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని కొన్ని స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు రూ. 15 నుంచి రూ. 20 వేలు ఫీజులు తీసుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నాయుడుపేట, గూడూరు కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. గూడూరు పట్టణంలోని పేరుగాంచిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు, స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షల పేరుతో కోట్లు గడిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ ఫలితమే బ్రూణ హత్యలకు కారణమవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమై ప్రైవేటు నర్సింగు హోముల్లో, స్కానింగ్ సెంటర్లలో విరివిగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.రూ.కోట్లలో వ్యాపారం లింగ నిర్ధారణ పరీక్షలు అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. దళారులు గర్భిణులను, సంబం«దీకులను గుట్టుగా తిరుపతి, గూడూరు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లాక ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రికి సమాచారం అందిస్తారు. గర్భిణితో ఎక్కువ మంది రాకుండా, ఆమెతోపాటు మరొకరిని వెంటబెట్టుకుని ప్రత్యేక వాహనంలో తరలిస్తారు. ఆస్పత్రి పేరుగానీ, చిరునామాగానీ ఎలాంటివి చెప్పకుండానే తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఆడ.. మగ చెప్పి రిపోర్టులు చేతికి ఇవ్వకుండా పంపేస్తున్నారు. గర్భస్రావాలకు ప్రత్యేక ధర లింగ నిర్ధారణ స్కానింగ్ కోసం సుమారు రూ.25 నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తుండగా గర్భస్రావం చేయించేందుకు మరో రేటు తీసుకుంటున్నారు. తిరుపతిలో అయితే రూ.25 వేలు, గూడూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట ఇతర ఆసుపత్రుల్లో రూ.20 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని ఆసుపత్రులు ఈ దందాను గుట్టుగా సాగిస్తున్నాయి. గర్భం దాల్చిన 20 వారాల తర్వాత గర్భ విచ్ఛిత్తి చేయడం అత్యంత ప్రమాదకరం.అందుకే ప్రభుత్వాలు కఠిన నిబంధనలు, చట్టాలు తీసుకొచ్చాయి. కొందరు ధనార్జన కోసం ఇష్టారీతిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలతో గర్భస్రావాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ ప్రభావం లింగ నిష్పత్తిపై పడుతోంది. ముఖ్యంగా గూడూరు, తిరుపతి నగరాల్లో ప్రసూతి ప్రైవేటు ఆసుపత్రుల కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కేసులు నమోదు చేస్తాం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దీనిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో స్పెషలిస్ట్ డాక్టర్లు జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి వైద్యాధికారి ఈ కమిటీలో ఉంటారు. సమగ్రంగా దీనిపైన విచారించి ఒక నెల రోజుల్లో కలెక్టర్ కు నివేదిక సమర్పిస్తాం. గతంలో ఈ విధంగా స్కానింగ్ చేస్తూ దొరికిన ఓ ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేసి మిషన్లు కూడా స్వా«దీనం చేసుకున్నాం. వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. తప్పు చేసినట్టు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లింగనిర్ధార ణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్ఓ, తిరుపతి -
చొరబాటుదారుల కోసం కాంగ్రెస్ యాత్రలా?
న్యూఢిల్లీ: విపక్ష కాంగ్రెస్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. చొరబాటుదారులను రక్షించడమే లక్ష్యంగా ఆ పార్టీ యాత్రలు చేస్తోందని మండిపడ్డారు. చొరబాటుదారుల ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 ప్రజా సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. దేశ పౌరులపై కాంగ్రెస్కు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాం«దీకి ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు. అందుకే చొరబాటుదారులకు అండగా నిలుస్తున్నారని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితాల్లో చొరబాటుదారులు ఎప్పటికీ ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆక్షేపించారు. మనదేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి ఓట్లు హక్కు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో నెగ్గడానికి అక్రమ వలసదారులకు అండగా నిలుస్తారా? ఇదెక్కడి చోద్యం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ విజయాలను ప్రజలు మర్చిపోలేరుదేశంలో ఓటర్ల జాబితాల ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియకు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు అమిత్ షా స్పష్టంచేశారు. బిహార్లో కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రపై విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగిస్తే తప్పేమిటని అన్నారు. దేశ సరిహద్దులను మోదీ ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు. మన సరిహద్దులను అతిక్రమించాలని చూసిన శత్రువులపై సర్జికల్, వైమానిక దాడులు చేసినట్లు గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్కు తగిన గుణపాఠం నేర్పామని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో 2027 నాటికి మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్వవస్థగా మారడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ఇకపై స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్నో విజయాలు సాధించిందని, దేశ ప్రజలు వాటిని ఎప్పటికీ మర్చిపోలేరని వెల్లడించారు. మోదీ పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి లభించిందని గుర్తుచేశారు. -
‘కూటమి’కి కాసులు..పోతున్న ప్రాణాలు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఉచిత ఇసుక ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీ కూటమి పార్టీల నేతల జేబులు నింపుతూ సంతోషాన్నిస్తుండగా, ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. రాత్రి పగలు తేడా లేకుండా, అడ్డూ అదుపు లేకుండా, నిబంధనలు పట్టించుకోకుండా విచ్చలవిడిగా జరుగుతున్న ఈ దోపిడీతో జనం అల్లాడిపోతున్నారు. అక్రమ రవాణా అదుపు తప్పుతుండటంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. నదులు, వాగులు, పొలాలను ఇష్టానుసారం కొల్లగొట్టి అధిక లోడుతో రోడ్లపై ఎలా పడితే అలా ఇసుకను రవాణా చేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం వందలాది ఇసుక లారీలు గ్రామ స్థాయి రహదారుల నుంచి జాతీయ రహదారుల వరకు యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయి. అనుమతి లేని రీచ్ల్లో తవ్వకాలు జరిపి, పర్మిట్లు కూడా సరిగా లేకుండా ఇసుక రవాణా చేస్తూ, అది కూడా రాంగ్ రూట్లో, ఎటు పడితే అటు ఈ వాహనాలు తిరుగుతున్నాయి. అక్రమ ఇసుకను టీడీపీ ప్రజాప్రతినిధులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వందలాది లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇంటికి సమీపంలో లింగాయపాలెం వద్ద నావిగేషన్ ఛానల్ ముసుగులో ఇసుకను అడ్డగోలుగా తవ్వి అక్రమంగా రవాణా చేస్తుండటం విస్తుగొలుపుతోంది. అధికారంలోకి రావడంతోనే అక్రమాలు మొదలు » 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా రీచ్ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై పడిన టీడీపీ నేతలు యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. » అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి రీచ్లు, స్టాక్ యార్డుల్లో ధరల పట్టిక పెట్టి మరీ అమ్మారు. తవ్వకం ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. పొరుగు రాష్ట్రాలకూ తరలిస్తున్నారు. » ఎక్కడా ఇసుక ఉచితం అన్నదే లేదు. డబ్బు కడితేనే ఇసుక ఇస్తామని చెబుతున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో సైతం ఉచితంగా తీసుకెళ్లనివ్వడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలు కన్నా ఇప్పుడు అధికంగా అమ్ముతుండడం విశేషం. బెజవాడలో 22 టన్నుల లారీ ఇసుక రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు అమ్ముతున్నారు.» గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఇష్టానుసారం చేస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు సూచనలను లెక్కే చేయడం లేదు. కార్మికులతో తవ్వకాలు చేయాల్సివుండగా భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. » అన్నిచోట్లా అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఇసుక దందా సాగుతోంది. కమీషన్లు చినబాబుకు ఠంచనుగా చేరిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక విధానం వల్ల ఏటా రూ.750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆ ఆదాయం లేదు.. ప్రజలకు ఇసుక ఉచితమూ లేదు. పైగా గత ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.ఇసుకాసురుల ధన దాహానికి నాడు 16 మంది రైతులు బలి అది 2017.. టీడీపీ నాయకులు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని స్వర్ణముఖి నదిలో ఇసుకను రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వేసి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. అయితే నదిలోని ఇసుక తోడేస్తుండటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటకు సేద్యపు నీరు కొరత ఏర్పడుతోందని భావించి ఏర్పేడు మండలం మునగలపాళెం నుంచి సుమారు 50 మంది రైతులు, మహిళలు ఏర్పేడు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే ఏర్పేడు పోలీస్ స్టేషన్కు అప్పటి జిల్లా ఎస్పీ జయలక్ష్మి వచ్చారని తెలుసుకుని ఆమెకు తమ గోడు విన్నవించుకునేందుకు వెళ్లారు. ఆమె కనీసం రైతులను కలవకుండా అక్కడే వారిని రోడ్డుపైనే నిరీక్షించేలా చేసి, బయటకు వచి్చ, వారితో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఓ ఇసుక లారీ రైతుల పైకి దూసుకొచ్చింది. ఈ ఘోరంలో 16 మంది రైతులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ దినపత్రిక రిపోర్టర్ ఆరాసి బాలమురళి కూడా ఉన్నారు. మరి కొంతమంది చేతులు, కాళ్లు కోల్పోయి జీవచ్ఛవాలుగా మారారు. అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మునగలపాళెం చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అయితే ఈ దురాగతానికి కారణమైన ప్రధాన సూత్రధారులు టీడీపీకి చెందిన ఏర్పేడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పేరం ధనంజయులునాయుడు, పేరం నాగరాజునాయుడు, చిరంజీవులు నాయుడు. ప్రస్తుతమూ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు.గోదాట్లో కలిసిపోతోన్న ప్రాణాలు» టీడీపీ ఇసుకాసురుల దెబ్బకు గోదారమ్మ విలవిల్లాడుతోంది. అధికార కూటమి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ధనార్జనతో గోదావరి నదిని గుల్ల చేస్తున్నారు. పి.గన్నవరం, అయినవిల్లి మండలాల్లో దోపిడీ పరాకాష్టకు చేరింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, కోటిపల్లి సరిహద్దులలో మాన్సాస్ ట్రస్టు భూముల్లోనూ ఇసుకదోపిడీ సాగుతోంది. » టీడీపీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సోదరుడు పృధ్వీరాజ్, మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అనుచరులు, జనసేన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అనుచరగణం ఇసుక అక్రమాలకు తెగబడుతున్నారు. » ఇసుక తవ్వకాల వల్ల గోదావరిలో గుంతలు పడి పలువురు మృత్యువాత పడుతున్నారు. ముమ్మిడివరం మండలం శేరిల్లంక–సలాదివారిపాలెం మధ్య వృద్ద గౌతమిలో మే 26న ఒక శుభ కార్యక్రమానికి వచి్చన ఎనిమిది మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగి మృత్యువాత పడ్డారు. » తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాల–2, గాయిత్రి, కడియపులంక, తీపర్రు, పందలపర్రు,‡ పెండ్యాల, కొవ్వూరు ఇసుక ర్యాంపుల్లో నిషేధిత డ్రెడ్జింగ్ అడ్డగోలుగా సాగుతోంది. రోజుకు 600 లారీల ఇసుక తరలుతోంది.అంతటా అదే దందా» ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా ఉచిత ఇసుక పేరుతో అక్రమార్కులు తెలంగాణాకు తరలిస్తున్నారు. లారీకి రూ.60 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ర్యాంపులకు వెళ్లే దారులు అధ్వానంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. » ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో రోజుకు వెయ్యికి పైగా ట్రాక్టర్లు, 100కు పైగా టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. రేయింబవళ్లు జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నా అధికారులు అటు వైపు తొంగి చూడడం లేదు. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది. » శ్రీకాకుళం జిల్లాలో అక్రమార్కులకు ప్రభుత్వమే లైసెన్సు ఇచ్చినట్టుగా దందా నడుస్తోంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ బాగోతం కొనసాగుతోంది. ఆమదాలవలస మండలం కొత్తవలసలో ఇసుక తవ్వకాలు అడ్డుకున్నారని ఏకంగా గ్రామస్తులపైనే దాడి చేసి కొట్టారు. పొందూరు మండలంలో ఇసుక అక్రమాలు అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై టీడీపీ నాయకులు దాడికి యత్నించారు. » రాయలసీమ జిల్లాలో అధికార కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది. అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్నారు. చిత్రావతి, పెన్నా, పాపాఘ్ని, తుంగభద్ర తీరాల్లో కూటమి నేతలు అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. టీడీపీ తోడేళ్ల దెబ్బకు పెన్నాకు గర్భశోకంయథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణాడీసిల్టేషన్ పాయింట్ల వద్ద మాయాజాలం ఇసుక మాఫియాకు టీడీపీ నేతలు సోమిరెడ్డి, ఆనం, ప్రశాంతి అండదండలుసాక్షి ప్రతినిధి, నెల్లూరు: పెన్నమ్మ శోకిస్తోంది. అయినా జిల్లా అధికార యంత్రాంగానికి వినపడటం లేదు.. కనపడటం లేదు. ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నేతలు అక్రమంగా సాగిస్తున్న ఇసుక తవ్వకాలతో భవిష్యత్లో ప్రమాద ఘంటికలు మూగబోతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో పెన్నా నదిపై నిర్మించిన నెల్లూరు, సంగం బ్యారేజీల భద్రత గాలిలో దీపంలా మారతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పెన్నా నదిని కుళ్ల»ొడిచి పగటి సమయాల్లో బహిరంగంగానే తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొంది ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పేదల ప్రాణాలు తీస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సంగం, సూరాయపాళెం, పోతిరెడ్డిపాళెం.. మూడు డీసిల్టేషన్ పాయింట్లతో పాటు పల్లిపాడు, అప్పారావుపాళెంలో రెండు ఓపెన్ రీచ్లకు అనుమతులు ఇచ్చారు. పర్యావరణ అనుమతులు లేనందున నదుల్లో యంత్రాల ద్వారా ఇసుక లోడింగ్ విధానానికి అనుమతులు రాలేదు. డీసిల్టేషన్ పాయింట్లలో దగ్గర నుంచి స్టాక్ పాయింట్ వద్దకు తెచి్చన ఇసుకను మాత్రమే లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. టన్నుకు రూ.250 వరకు ఖర్చవుతోంది. ఓపెన్ రీచ్ల్లో మాత్రం సెమీ మెకనైజ్డ్ పేరుతో తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. కానీ పెన్నా నదిలోనే భారీ యంత్రాలు పెట్టి నదిని తోడేస్తూ ఇసుక దోపిడీ చేశారు. జిల్లాలో ఎన్జీటీ ఆదేశాల మేరకు అక్టోబర్ 15 వరకు పెన్నానదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నప్పటికీ అడ్డగోలుగా తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు.అడుగడుగునా అక్రమాలు » డీసిల్టేషన్ పాయింట్ల వద్ద మాయాజాలం చేస్తున్నారు. పగటి సమయాల్లో మాత్రం డంపింగ్ యార్డు వద్ద లోడింగ్ చూపుతారు. కొండల్లా ఇసుక దిబ్బలు పేరుకుపోతుంటాయి. కానీ లెక్కల్లో మాత్రం రోజువారీ 100 టన్నులే పోతోందని చూపుతారు. రాత్రి వేళల్లో లోడింగ్ చార్జీలు రూ.7 వేలు వంతున తీసుకుని నది నుంచే లోడింగ్ చేస్తున్నారు. » సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అండతో సూరాయపాళెం, విరువూరులో.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండతో పీకేపాడు, సంగం.. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అండతో పోతిరెడ్డిపాళెంలో ఇసుక మాఫియా రెచి్చపోతోంది. » పెన్నా పరీవాహక ప్రాంతంలో దాదాపు 18 ప్రాంతాల్లో పొర్లుకట్టలు ఉన్నాయి. వాటిని ధ్వంసం చేసి ఇసుక రవాణా సాగిస్తున్నారు..» ప్రస్తుతం సోమశిల జలాలు విడుదల చేయడంతో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. వచ్చే మాసం నుంచి వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉంది. సోమశిలకు వరదనీరు ప్రవాహం పెరిగితే నీరు నదిలోకి వదలాల్సి ఉంది. ఈ క్రమంలో పొర్లు కట్టలు తెగిపోవడంతో పలు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. » అక్రమ రవాణా ద్వారా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. టీడీపీకి చెందిన ఇసుక మాఫియా నేతలు సొంతంగా పెద్ద సంఖ్యలో టిప్పర్లు కొనుగోలు చేసి పోలీసు, విజిలెన్స్, మైనింగ్ అధికారుల అండదండలతో రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. » సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం విరువూరు ఓపెన్ ఇసుక రీచ్పై ఆంక్షలు ఉన్నప్పటికీ బిల్లులు ఇచ్చి మరీ ఇసుకను తరలిస్తుండటం విస్తుగొలుపుతోంది. -
కొందరు రైతులనైనా జైలుకు పంపండి
సాక్షి, న్యూఢిల్లీ: పంట వ్యర్థాలను తగలబెడుతూ వాయుకాలుష్యానికి కారణమవుతున్న రైతులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. కొందరు రైతులను కటకటాల వెనక్కి నెడితేనే ఇతర రైతుల్లో భయం ఉంటుందని, వ్యర్థాలను తగలబెట్టే రైతులకు గట్టి సందేశం ఇచ్చిన వాళ్లమవుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్, పంజాబ్లలో రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం పై విధంగా స్పందించింది. ‘రైతులు నిజంగా ప్రత్యేకమైనవాళ్లే. వాళ్ల కారణంగానే మనం ఆహారం తినగల్గుతున్నాం. అంతమాత్రాన మనం పర్యావరణాన్ని కాపాడకుండా మౌనంగా కూర్చోలేం కదా. పంట వ్యర్థాలను తగలబెడుతున్న రైతులను శిక్షించే సెక్షన్లు ఉన్నాయి కదా? వాయుకాలుష్యంతో పర్యావరణానికి హాని తలపెడుతున్న కొందరు రైతులను అరెస్ట్చేస్తేనే మిగతా వాళ్లకు గట్టి సందేశం వెళుతుంది. తప్పు చేసిన రైతులను శిక్షించేందుకు చట్టంలో నిబంధనలు ఉన్నాయని మీకు తెలియదా? పర్యావ రణాన్ని కాపాడాలనే సత్సంకల్పం మీకు ఉంటే రైతులను అరెస్ట్చేయడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని న్యాయస్థానం నిలదీసింది. ‘‘పంట వ్యర్థ్యాలను జీవఇంధనంగా ఉపయోగంచవచ్చన్న వార్తలను మేం కూడా వార్తాపత్రికల్లో చదివాం. ఇలా సద్వినియోగం చేసుకోండి అని మేం పదేపదే చెప్పలేం’’ అని సీజేఐ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ‘సీఏక్యూఎం, సీపీసీబీల్లో పోస్ట్లను మూడు నెలల్లోపు భర్తీచేయండి. పదోన్నతి పోస్ట్లను ఆరు నెలల్లోపు భర్తీచేయండి’ అని కోర్టు ఆదేశించింది. రైతులు కథలు చెబుతున్నారుఈ కేసులో పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా, అమికస్ క్యూరీ(కోర్టు సహాయకురాలు)గా అపరంజిత హాజరయ్యారు. గతేడాదితో పోల్చితే పంట వ్యర్థాల దహనం తగ్గుముఖం పట్టిందని మెహ్రా న్యాయస్థానానికి తెలిపారు. ఈ ఏడాది వ్యర్థాల దహనాలను మరింతగా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ వాదనలతో అమికస్ క్యూరీ అపరంజిత విభేదించారు. రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండటానికి ప్రభుత్వం రైతులకు నగదు ప్రోత్సాహకాలు, ఇతర పరికరాలు అందిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు లేదని ఆమె న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఉపగ్రహాలు తమ పంటపొలాల మీదుగా వెళ్లిన సమయాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని వ్యవసాయశాఖ అధికారులే తమకు ఉప్పందించారని రైతులు అవే కథలు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె కోర్టుకు వివరించారు. పంట వ్యర్థాల దహనంపై 2018లోనే సుప్రీంకోర్టు విస్తృతమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో కోర్టు ముందు నిలిచాయని వ్యాఖ్యానించారు.లేదంటే మేమే నిర్ణయం తీసుకుంటాం‘పర్యావరణానికి నష్టం కలిగించే రైతులపై చర్యలు తీసుకోవాలి. ఒక వేళ కఠిన చర్యలు తీసుకోవడానికి మీకు మనసురాకపోతే ఆ విషయాన్ని అయినా లిఖితపూర్వకంగా మాకు తెలపండి. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేకుంటే మేమే తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ముందుగా అరెస్టులు, చర్యలు తీసుకున్నాం. కానీ వీరిలో హెక్టార్ సాగుభూమి ఉన్న రైతులే ఎక్కువ. వీళ్లను జైల్లో పెడితే, వీళ్లపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటి? గడిచిన సంవత్సరాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన ఘటనలు 77,000 జరిగితే అవి ఏకంగా 10,000 స్థాయికి దిగొచ్చాయి’ అని రాహుల్ మెహ్రా కోర్టుకు నివేదించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ‘ఎప్పట్లాగా రోటీన్గా రైతులకు సూచనలు చేయడం మానేసి ఈసారి అరెస్టులు, జైలుకు పంపడానికి కూడా మేం వెనకాడము అనే గట్టి సందేశాన్ని ఇవ్వండి. వచ్చే పంటకాలంలోపు పొలాల్లో వ్యర్థాలు పర్యావరణహితంగా తొలగించాలి’ అని ఆయా రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. -
హైకోర్టు అంటే లెక్కేలేదు
సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పయినా తమకు లెక్కేలేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోది. డీఎస్సీ దరఖాస్తు సమయంలో తీసుకున్న పోస్టుల ప్రాదాన్యం చెల్లదని, అభ్యర్థులు సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దీనిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళుతోంది. సోమవారం హడావుడిగా డీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర సచివాలయం సమీపంలో ప్రత్యేక వేదిక సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎంఈవోలు, హెచ్ఎంలు, ఇతర ఉపాధ్యాయులతో కోర్ కమిటీలను నియమించి ఎంపిక చేసిన 15,941 మంది అభ్యర్థులతో పాటు అదేస్థాయిలో బంధువులను అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా.. పోస్టుల ఎంపికపై అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చినా అమలు చేయలేదని బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లినా సింగిల్ జడ్జి తీర్పునే అమలు చేయాలని చెప్పడంతో పాటు మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఓ పక్క హైకోర్టు ఆదేశాలు ఉండగా.. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ నియామక పత్రాల పంపిణీ చేపడుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ మైలేజీ కోసం.. డీఎస్సీ ఎంపిక జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించారు. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 16,347 పోస్టులు ప్రకటించగా.. 15,941 మంది ఎంపికైనట్టు ప్రకటించారు. గతంలో డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాల్లోనే కౌన్సెలింగ్ నిర్వహించి ఎంపికైన వారికి డీఈవో నియామక పత్రాలు అందించేవారు. కానీ, అందుకు భిన్నంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన ఎంపిక జాబితాలోని అభ్యర్థులకు అమరావతిలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకెళుతోంది. 15,941 మంది అభ్యర్థులతో పాటు వారి కుటుంబంలోని ఒకరు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సమాచారం పంపించారు. అంటే మొత్తం 32 వేల మందిని ఈనెల 19న అమరావతికి తరలించనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల సంఖ్యను బట్టి 65 నుంచి 134 వరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. అభ్యర్థులు ఎక్కడ ఉన్నా గురువారం సాయంత్రానికి సంబంధిత జిల్లా కేంద్రానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరంతా జిల్లా కేంద్రం నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లోనే బయలుదేరాలని స్పష్టం చేసింది. వీరిని సమన్వయం చేసేందుకు ఒక్కో బస్సుకు ఒక్కొక్క ఎంఈవో, ఒక్కో హెచ్ఎం, ఇద్దరు ఉపాధ్యాయులను నియమించింది. అంటే జిల్లాకు సరాసరిన 350 మంది సిబ్బందిని ఇందుకోసం సిద్ధం చేసింది. కాగా.. హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ అమలుపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదు డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం అమరావతిలో నియామక పత్రాల ప్రదాన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదని విద్యాశాఖ తెలిపింది. బంధువులు, సన్నిహితులు, స్నేహితులను కూడా తీసుకురావొచ్చని ప్రకటించింది. కుటుంబ సభ్యుల్లో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి బదులు మరొకరి పేరు సూచించవచ్చని చెప్పింది. ఈ అవకాశం లేని అభ్యర్థులు ఒక్కరే వచ్చేలా ఉంటే ఆ విషయం స్థానిక డీఈవోలకు తెలియజేయాలంది. -
ఇసుక మాఫియాకు.. ఏడుగురు బలి
రాష్ట్రంలో కూటమి నేతల అరాచకంలో మరో కోణమిది.. 15 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దందా ప్రజల ప్రాణాలు తీస్తోంది.. నదులు, వాగులు, వంకలను చెరబట్టి రేయింబవళ్లు నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక.. ఇష్టానుసారం అక్రమ రవాణాతో పట్టపగలే ప్రమాదాలకు కారణమవుతూ అమాయకులను చంపేసే స్థాయికి చేరింది.. 30–40 టన్నుల లోడ్తో అతి వేగంగా వెళ్తున్న టిప్పర్లు మృత్యు శకటాలుగా మారాయి.. ఇసుక గుంతల్లో పడి కొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు.. అయినా ఏమాత్రం స్పందించని సర్కారు పెద్దలు మీకింత–మాకింత అంటూ బేరసారాల్లో బిజీగా ఉండటం విషాదకరం. సంగం: సగం జీవితం కూడా చూడని ఆ ఏడుగురికీ అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి.. సాయంత్రానికల్లా ఇంటికొస్తామని పిల్లలకు చెప్పి వెళ్లిన వారు అటునుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. ఇసుక మాఫియా తప్పునకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ నేత ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో అతివేగంగా ఎదురుగా వచ్చి కారును ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. అనధికారికంగా పడమటి కంభంపాడు వద్ద నిర్వహిస్తున్న క్వారీ నుంచి సంగం మండలానికి చెందిన టీడీపీ నేతకు చెందిన టిప్పర్ ఇసుక లోడ్తో నెల్లూరు వైపు రాంగ్ రూట్లో బయలు దేరింది. అదే సమయంలో నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వస్తున్న కారును పెరమన వద్ద అతివేగంతో ఎదురుగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తాళ్లూరి శ్రీనివాసులు (40), తాళ్లూరి రాధ (36), ఇందుకూరుపేటకు చెందిన చల్లగుండ శ్రీనివాసులు (40), చల్లగుండ్ల లక్ష్మి (34), శేషం సారమ్మ (40), శేషం వెంగయ్య (38), కారు డ్రైవర్ కత్తి బ్రహ్మయ్య (24) కారులోనే మృతి చెందారు. టిప్పర్ అతి వేగంగా కారును ఢీకొనడంతో వీరి శరీరాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఘటనలో మృతి చెందిన వారంతా బంధువులే. తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రాధ భార్యాభర్తలు. వీరు నెల్లూరులోని స్టోన్హౌస్పేటలో సాయి ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. వీరి వద్ద కత్తి బ్రహ్మయ్య పని చేస్తున్నారు. చల్లగుండ్ల శ్రీనివాసులు, చల్లగుండ్ల లక్ష్మి భార్యాభర్తలు. శేషం సారమ్మ, శేషం వెంగయ్య వదినా మరుదులు. మృతి చెందిన తాళ్లూరు రాధ.. చల్లగుండ్ల లక్ష్మికి, శేషం వెంగయ్యకు చెల్లెలు. పరామర్శకు వెళ్తూ.. తాళ్లూరు రాధ, చల్లగుండ్ల లక్ష్మి, శేషం వెంగయ్యల చిన్న చెల్లెలు భర్త ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆత్మకూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరామర్శించేందుకు తాళ్లూరు శ్రీనివాసులు తన కారులో వీరందరినీ తీసుకుని వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. తన వద్ద పనిచేసే కత్తి బ్రహ్మయ్యను కారు డ్రైవింగ్ కోసం తీసుకు రావడంతో అతడు కూడా మత్యువాత పడ్డాడు. అతి కష్టం మీద మృతదేహాల వెలికితీత సుమారు 40 టన్నుల ఇసుక ఉన్న 12 టైర్ల టిప్పర్.. రాంగ్ రూట్లో అతివేగంగా దూసుకు రావడంతో కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురూ క్షణాల్లో చనిపోయారు. వారి మృతదేహాలు సైతం చిద్రమయ్యాయి. వెలికి తీసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద విషయం తెలుసుకుని సంగం సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య, ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్, సంగం సర్కిల్లోని పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు సగ భాగం పూర్తిగా టిప్పర్ ఇంజిన్లోకి వెళ్లడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు రెండు క్రేన్లు, ఒక జేసీబీ, కట్టర్ను వినియోగించాల్సి వచ్చింది. ఘటన స్థలాన్ని ఆర్డీఓ భూమిరెడ్డి పావని, ఎంవీఐ రాములు పరిశీలించారు. బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ అజిత ఏజెండ్ల ఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ లొంగిపోయాడని మీడియాకు వెల్లడించారు. ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నదీ, లేనిదీ విచారిస్తామని చెప్పారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్నది ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కాదని, నకిలీ అని విశ్వసనీయ సమాచారం.మృతుల్లో తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రాధ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఇటీవల మృతి చెందడంతో ఆ బాధను దిగమింగుతూ కుమారుడిపై ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. తల్లిదండ్రుల మృతితో కుమారుడు ఏకాకిగా మిగిలిపోయాడు. చల్లగొండ్ల శ్రీనివాసులు, చల్లగొండ్ల లక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయారు. శేషం సారమ్మ, శేషం బాలవెంగయ్యల కుటుంబాల్లో తీవ్ర విషాధం నెలకొంది. శేషం బాలవెంగయ్య బేల్దారి పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరా కరువైంది.ఇసుక మాఫియా తీరుపై వైఎస్ జగన్ మండిపాటు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సాక్షి, అమరావతి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఇసుక మాఫియా వల్ల చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉచిత ఇసుక ముసుగులో సాగిస్తున్న దందాను ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ‘నెల్లూరు’లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.టిప్పర్ ఓనర్ మంత్రి ఆనం అనుచరుడేఏడుగురు మరణానికి కారణమైన టిప్పర్ (ఏపీ39డబ్ల్యూహెచ్1695) మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏఎస్ పేట మండలం చిరమనకు చెందిన కాటం రెడ్డి రవీంద్రారెడ్డిదిగా గుర్తించారు. ఇసుక టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. అతివేగంతో వస్తూ అదుపు చేయలేక కారును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారును ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ టిప్పర్ దిగి పారిపోయాడు. తెలుగుదేశం పార్టీ నేత టిప్పర్ కావడంతో కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. -
కూటమి సర్కారు మద్యం విధానంలో భారీ అవినీతి
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడంలో భారీగా అవినీతి జరిగిందని.. ఈ ప్రభావం రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంపై తీవ్రంగా పడిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఈ కారణంగా రాబడి పెరుగుదల కేవలం 3.10 శాతానికే పరిమితం అయిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ఎక్సైజ్ శాఖ ఆదాయం 6,782.21 కోట్లుగా ఉంటే... ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రాబడి రూ.6,992.77 కోట్లు మాత్రమేనని రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ బుధవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. మద్యం అమ్మకాల్లో సాగుతున్న దోపిడీని కడిగిపారేస్తూ.. సీబీఎన్ ఫెయిల్డ్ సీఎం హ్యాష్ ట్యాగ్తో జాతీయ మీడియాను జత చేస్తూ ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఏమన్నదంటే... ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడం, దుకాణాల సంఖ్యను పెంచడం, అక్రమ బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, అక్రమ పర్మిట్ రూమ్లను తిరిగి ప్రవేశపెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. సహజంగా ఈ విధానపరమైన మార్పులు మద్యం వినియోగం భారీ పెరుగుదలకు దారితీసి... ఆ మేరకు ఎక్సైజ్ శాఖ ఆదాయాలు పెరగాలి. ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి ఐదు నెలల్లో ఈ విధానపరమైన మార్పులన్నీ పూర్తిగా అమల్లో ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఈ మార్పులేవీ లేవు. కాబట్టి.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి ఎక్సైజ్ ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కంటే గణనీయంగా ఎక్కువగా ఉండాలి. కానీ, గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లుగా ఉంటే... ఈ ఆర్థిక సంవత్సరంలో అదే వ్యవధిలో రాబడి రూ.6,992.77 కోట్లు అని కాగ్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్నిబట్టి గత ఏడాదితో పోల్చితే ఎక్సైజ్ ఆదాయం కేవలం 3.10 శాతం మాత్రమే పెరిగింది. విధానపరమైన మార్పులు లేనప్పటికీ... సాధారణ సమయంలో సగటున పది శాతం ఆదాయాలు పెరగాలి. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడం వల్ల ఎక్సైజ్ ఆదాయం తగ్గి, ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇది మద్యం విధానంలో అవినీతిని ప్రస్ఫుటితం చేస్తోంది’’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది. -
సిబ్బందిని కట్టేసి రూ. 21 కోట్లు లూటీ
విజయ్పురా (కర్ణాటక): ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు తుపాకులు, కత్తులతో సిబ్బందిని బెదిరించి ఓ బ్యాంకును లూటీ చేసి రూ.20 కోట్లకు పైగా దోచుకున్నారు. ఈ ఘటన కర్ణాటక విజయ్పురా జిల్లాలోని ఎస్బీఐకి చెందిన చాడ్చాన్ బ్రాంచ్లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దుండగులు దోచుకున్న నగదు, బంగారు ఆభరణాల విలువ రూ. 21 కోట్లకుపైగా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు కరెంటు ఖాతా తెరవాలంటూ బ్యాంకుకు వచ్చి మేనేజర్, క్యాషియర్, ఇతర సిబ్బందిని తుపాకులు, కత్తులతో బెదిరించారని పోలీసులు చెప్పారు. దుండగులు బ్యాంకు సిబ్బంది కాళ్లు, చేతులను కట్టేసి రూ.కోటికిపైగా నగదు, రూ.20 కోట్ల విలువైన 20 కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు నకిలీ నంబర్ ప్లేటు ఉన్న సుజుకీ ఎవా అనే కారులో వచ్చారని విజయ్పురా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి చెప్పారు. చోరీ అనంతరం దుండగులు మహారాష్ట్రలోని పండర్పూర్ వైపు పారిపోయినట్లు తెలిపారు. -
బాకీలు.. బడాయిలే!
సాక్షి, అమరావతి: అప్పుల వృద్ధిలో చంద్రబాబు సర్కారు దూసుకుపోతోంది. 15 నెలలుగా రాష్ట్ర సంపద పెరగకపోగా గత ప్రభుత్వంలో వచ్చిన సంపద కూడా రాకుండా పోతోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి అమ్మకం పన్ను తిరోగమనమే గానీ పెరగడం లేదు. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే. మరోవైపు సామాజిక రంగం, మూలధన వ్యయం భారీగా తగ్గిపోయింది. ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల (2025–26 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) బడ్జెట్ కీలక సూచికలతో గణాంకాలను కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించింది. అప్పులు చేయడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కాగ్ విడుదల చేసిన గణాంకాల మేరకు తొలి ఐదు నెలల్లోనే కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ను మించి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా అప్పులు చేసింది. సాధారణంగా రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయం అంతకు ముందు సంవత్సరాలతో పోల్చితే పెరగాలి. అందుకు భిన్నంగా 2023–24 ఆగస్టు వరకు రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయంతో పోల్చితే 2025–26లో ఆగస్టు నాటికి బాబు పాలనలో రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయం తగ్గిపోవడం గమనార్హం. రెవెన్యూ రాబడులు ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల్లో రూ.8,752.11 కోట్లు తగ్గాయి. రాబడుల్లో 12.44 శాతం క్షీణత నెలకొంది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోంది. అస్తవ్యస్త పాలనతో రెవెన్యూ రాబడులు క్షీణిస్తున్నాయి. 2023–24 తొలి ఐదు నెలల కంటే బడ్జెట్ వ్యయం ఈ ఆర్థిక ఏడాదిలో రూ.10,663.43 కోట్లు తగ్గిపోయింది. » టీడీపీ కూటమి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రావాల్సిన గ్రాంట్లు కూడా తగ్గిపోయాయి. 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే కేంద్ర గ్రాంట్లు ఏకంగా రూ.16,055.44 కోట్లు తగ్గాయి. అంటే ఏకంగా 83.70 శాతం క్షీణించాయి. 2023–24లో వచి్చనవి కూడా ఇప్పుడు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో వెల్లడవుతోంది. » 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది అమ్మకం పన్ను రాబడి రూ.460 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను రాబడి 5.88 శాతం క్షీణించింది. » 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే ఇప్పుడు సామాజిక రంగ వ్యయం రూ.10,953.60 కోట్లు తగ్గిపోయింది. అంటే ఏకంగా 16.11 శాతం తగ్గింది. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై చేసే వ్యయాన్ని సామాజిక రంగ వ్యయంగా పరిగణిస్తారు. మూలధన వ్యయం రూ.6,220.24 కోట్లు తగ్గుదల..అప్పుల్లో మాత్రం చంద్రబాబు సర్కారు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ ఆరి్ధక ఏడాది తొలి ఐదు నెలల్లోనే బడ్జెట్లో ఏకంగా రూ.55,932.68 కోట్ల అప్పులు చేసింది. నెలకు సగటున రూ.పది వేల కోట్లకు పైగా అప్పులు తీసుకుంటుండగా మూలధన వ్యయం కేవలం రూ.9,663.70 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. అదే 2023–24 తొలి ఐదు నెలల్లో వైఎస్సార్సీపీ హయాంలో మూలధన వ్యయం రూ.15,883.94 కోట్లుగా ఉండటం గమనార్హం. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి సర్కారు మూలధన వ్యయం రూ.6,220.24 కోట్లు తక్కువగా చేసినట్లు స్పష్టమవుతోంది. అది కూడా అటు ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా.. ఇటు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా రాష్ట్రంపై అంతులేని రుణభారం మోపుతుండటంపై ఆర్థిక వేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఎగబాకిన లోటురెవెన్యూ లోటు ఐదు నెలల్లోనే అదుపు తప్పింది. ఈ ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు రూ.33,185.97 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా తొలి ఐదు నెలల్లోనే ఏకంగా రూ.41,635.63 కోట్లకు ఎగబాకింది. ఎడాపెడా అప్పులు చేస్తుండటంతో ద్రవ్యలోటు పెరిగిపోతోంది. రెవెన్యూ రాబడులు కోల్పోవడం, బడ్జెట్ వ్యయం కూడా తగ్గిపోవడం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందనేందుకు సంకేతమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మసూదే సూత్రధారి
ఇస్లామాబాద్: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబం ముక్కలైపోయిందని స్వయంగా వెల్లడించిన ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ మరో సంచలన విషయం బయటపెట్టాడు. భారత్లోని ఢిల్లీ, ముంబైలో జరిగిన భీకర ఉగ్రవాద దాడుల్లో మసూద్ అజార్దే కీలక పాత్ర అని స్పష్టంచేశాడు. ఆయా దాడులకు ప్రణాళిక రూపొందించి, అమలు చేసింది అతడేనని పేర్కొన్నాడు. ఢిల్లీ, ముంబై ఉగ్రవాద దాడుల వెనుక తమ పౌరుల హస్తం లేదంటూ నమ్మబలుకుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం అసలు రంగు దీనితో తేలిపోయింది. పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థలే భారత్లో మారణహోమం సృష్టించినట్లు స్పష్టంగా బహిర్గతమయ్యింది. బాలాకోట్ నుంచే కుట్ర భారత నిఘా వర్గాలు గాలిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అమీర్–ఉల్–ముజాహిదీన్ మౌలానా మసూద్ అజార్కు మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందాడు. అతడు ఇటీవల మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో 1999లో విమానం హైజాక్ ఉదంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల డిమాండ్ మేరకు భారత ప్రభుత్వం మసూద్ అజార్ను విడుదల చేసింది. అలా పాకిస్తాన్కు చేరుకున్న మసూద్ అజార్ ఇక్కడి నుంచే భారత్లో ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేశాడని మసూద్ ఇల్యాస్ కశ్మీరీ చెప్పాడు. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ను అడ్డాగా మార్చుకొని, అనుచరుల సంఖ్యను పెంచుకొని, వారికి శిక్షణ ఇచ్చి, భారత్పైకి ఉసిగొల్పాడని వెల్లడించాడు. బాలాకోట్ అతడికి సురక్షిత ప్రాంతంగా మారిందని అన్నాడు. 2001 డిసెంబర్ 13న ఢిల్లీలోని భారత పార్లమెంట్పై ఆత్మాహుతి దాడి, 2008 నవంబర్ 26న ముంబైలో దాడులకు బాలాకోట్ నుంచే కుట్ర సాగించాడని తేల్చిచెప్పాడు. రెండు భీకర దాడులు జైషే మొహమ్మద్ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే గుర్తించింది. భారత పార్లమెంట్పై 2001లో ఐదుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడికి దిగారు. హోంశాఖ స్టిక్కర్ ఉన్న కారులో లోపలికి దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది, ఒక తోటమాలి మరణించారు. ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. 2008లో ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. 12 ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. 166 మందిని బలి తీసుకున్నారు. -
నవ భారత్ బెదరదు!
ధార్: అణ్వాయుధాలను బూచిగా చూపించి భారత్ను బెదిరిస్తామంటే ఎంతమాత్రం కుదరదని పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా పాకిస్తాన్కు తేల్చిచెప్పారు. అణ్వ్రస్తాలకు నవ భారతదేశం(న్యూ ఇండియా) భయపడదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కోలుకోలేని నష్టం జరిగిందని తెలిపారు. నష్టం జరిగినట్లు జైషే మొహమ్మద్ కమాండర్ స్వయంగా అంగీకరించాడని గుర్తుచేశారు. 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో పర్యటించారు. పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలకు శ్రీకారం చుట్టారు. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే... మన సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది ‘‘పాకిస్తాన్ ఉగ్రవాదులు మన అక్కచెల్లెమ్మలు, కుమార్తెల సిందూరం తుడిచేశారు. ముష్కరులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం. వారి స్థావరాలను ధ్వంసం చేశాం. అపూర్వమైన ధైర్య సాహసాలు కలిగిన మన సైనిక దళాలు కేవలం రెప్పపాటు కాలంలో పాకిస్తాన్ను మోకాళ్లపై నిల్చోబెట్టాయి. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ఉగ్రవాద ముఠా నాయకులకు జరిగిన నష్టాన్ని నిన్ననే ఓ ముష్కరుడు రోదిస్తూ బయటపెట్టడం ప్రపంచమంతా చూసింది. ఇది నవ భారత్. అణు బాంబులతో మనల్ని ఎవరూ భయపెట్టలేరు. ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి మరీ వారిని మట్టుబెట్టగలం. మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన మంత్రం స్వదేశీ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలని మరోసారి కోరుతున్నా. పండుగల సీజన్ రాబోతోంది. స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెంచుకోవాలి. మీరు కొనేది, విక్రయించేది ఏదైనా సరే అది ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తి కావాలి. స్వాతంత్య్రం సాధించడానికి జాతిపిత మహాత్మా గాంధీ స్వదేశీని ఒక ఆయుధంగా ప్రయోగించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కు స్వదేశీ ఉత్పత్తుల వాడకమే పునాది అని మర్చిపోవద్దు. మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులు ఉపయోగిస్తేనే దేశానికి లబ్ధి చేకూరుతుంది. ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ప్రజలు స్వదేశీ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. మన ఉత్పత్తుల పట్ల మనం గరి్వంచాలి. అది చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా మన దేశంలో తయారైన వస్తువునే కొనండి. పిల్లల బొమ్మలు, దీపావళి విగ్రహాలు, ఇంట్లో అలంకరణ సామగ్రి, మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు మన దగ్గర తయారవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోండి. ఏదైనా కొనుగోలు చేసే ముందు అది ‘మేడ్ ఇన్ ఇండియా’ అవునో కాదో తనిఖీ చేసుకోండి. స్వదేశీ ఉత్పత్తులు కొంటే మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది. అది నేరుగా దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ సొమ్ముతో రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించవచ్చు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. స్వదేశీ వస్తువుల విక్రయాలు పెరిగితే కంపెనీల్లో వాటి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. తద్వారా మన దగ్గర ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తాయి. తగ్గించిన జీఎస్టీ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. స్వదేశీ వస్తువులు కొని ఈ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందండి. విక్రయదారులు తమ దుకాణాల వల్ల ‘స్వదేశీ’ బోర్డులు గర్వంగా ఏర్పాటు చేసుకోండి. కోటికి చేరిన సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డులు ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. దీనివల్ల దేశంలో వస్త్ర పరిశ్రమకు నూతన బలం చేకూరుతుంది. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఔషధాలు సైతం ఉచితంగా అందజేస్తారు. ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అవగాహన, వనరులు లేవన్న కారణంతో మహిళలు నష్టపోవడానికి వీల్లేదు. అందుకే ఈ కార్యక్రమం ప్రారంభించాం. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా వ్యాధిని అరికట్టడానికి 2023లో నేషనల్ మిషన్ను మధ్యప్రదేశ్లోనే ప్రారంభించాం. అప్పట్లో మొట్టమొదటి సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డు అందజేశాం. ఈరోజు కార్డుల సంఖ్య కోటికి చేరింది. దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికిపైగా ప్రజలు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలితాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు’’ అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. పీఎం మిత్రా పార్కు దేశంలో మొట్టమొదటి ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైట్ రీజియన్, అప్పారెల్(పీఎం మిత్రా)’ పార్కు నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్ను, రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం మిత్రా పార్కులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ప్రపంచ స్థాయి టెక్స్టైల్ తయారీ కేంద్రాలను స్థాపించబోతున్నారు. రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమం కింద శిశు సంరక్షణ, విద్యతోపాటు స్థానికంగా లభించే పౌష్టికాహారాన్ని ప్రోత్సహిస్తారు. చక్కెర, వంటనూనెల వినియోగం తగ్గించుకోవాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. సుమన్ సఖి చాట్బాట్ను సైతం మోదీ ప్రారంభించారు. తల్లి, శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంచబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు తగిన సమాచారం అందజేస్తారు. తన జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ స్వయం సహాయక సంఘం సభ్యురాలికి ఒక మొక్కను బహూకరించారు. -
'ఏఐ' ముద్ర..పడాల్సిందే
డీప్ఫేక్ వీడియోలు, చిత్రాలు ప్రపంచాన్ని కలవర పెడుతున్న అతిపెద్ద సమస్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి రూపొందించే ఈ కంటెంట్ విషయంలో మన దేశం కఠిన నియమాలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో పార్లమెంటరీ కమిటీ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వీడియోలను రూపొందించే కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్ తోపాటు.. వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వెల్లడించే లేబులింగ్ వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి.. లోక్సభ సభ్యుడు నిషికాంత్ దూబే నేతృత్వంలో ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవలే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక ముసాయిదా నివేదికను సమర్పించింది. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ఏఐని ఉపయోగించే వ్యక్తులు లేదా కంపెనీలను గుర్తించి, విచారించడానికి కఠినమైన సాంకేతిక, చట్టపరమైన నియ మాలను అమలు చేయాలని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే.. భారత్లో కంటెంట్ క్రియేటర్స్ ఏఐని ఉపయోగించే విధా నం పెద్ద ఎత్తున మారుతుందని, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందన్నది నిపుణుల మాట.బాధ్యులను పట్టుకోవచ్చుఏఐతో రూపొందిన తప్పుడు సమాచారం విషయంలో శిక్షా నిబంధనలను సవరించాలని, జరిమానాలను పెంచాలని కమిటీ తన నివేదికలో కోరింది. ‘ఏఐతో అభివృద్ధి చేసినట్టు తెలిపే సమాచారంతో వీడియోలు, చిత్రాలు, ఇతర అంశాలను ప్రజలు సులభంగా గుర్తించగలుగుతారు. అంతేకాకుండా నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన బాధ్యులను సులభంగా పట్టుకోవచ్చు’ అని కమిటీ తెలిపింది. మీడియాకు విన్నపంనకిలీ వార్తలను కట్టడి చేసేందుకు బలమైన అంతర్గత రక్షణ చర్యలను చేపట్టాలని మీడియా సంస్థలను కూడా పార్లమెంటరీ కమిటీ కోరింది. సమాచారం నిజమేనా కాదా అన్నది తెలుసుకునే కఠిన తనిఖీ వ్యవస్థ, వార్తా ప్రసారంలో నాణ్యత, కచ్చితత్వం ప్రమాణాలను కాపాడే అంబుడ్స్మన్ ను నియమించాలని సూచించింది. మోసపూరిత కంటెంట్ సులభంగా వైరల్ అయ్యే యుగంలో ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడానికి ఇలాంటి చర్యలు చాలా అవసరమని అభిప్రాయపడింది.ఇప్పటికే కొన్ని..డీప్ఫేక్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నకిలీ ప్రసంగాలను అడ్డుకోగల; డీప్ఫేక్ వీడియోలు, చిత్రాలను గుర్తించగల సాధనాలను అభివృద్ధి చేయడానికి రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. నమ్మదగినవిగా మారతాయికంటెంట్ అభివృద్ధి విషయానికొస్తే ప్రతిపాదిత నిబంధనలు.. క్రియేటర్లను అడ్డుకునే ప్రయత్నం ఎంత మాత్రమూ కాదనీ, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట. క్రియేటర్లు చేయాల్సిందల్లా తమ వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వీక్షకులకు కనిపించేలా వెల్లడించాలి. ఏఐతో రూపొందిన కంటెంట్తో నకిలీ వార్తలను వ్యాప్తి చేసే, పెట్టుబడి పెట్టే సృష్టికర్తలు, కంపెనీలను అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యం. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అందరికీ మరింత పారదర్శకంగా, నమ్మదగినవిగా మారతాయి. 10 కోట్లకు పైగా చానళ్లుభారత్లో 10 కోట్లకు పైచిలుకు యూట్యూబ్ చానళ్లు ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో 7 లక్షల మంది క్రియేటర్లు మాత్రమే ఆదాయార్జన చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. ఈ సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుని కోట్లాది మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. రోజూ కోట్లాది వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తుంటారు. ఇంతటి విశాలమైన సామాజిక మాధ్యమాల ప్రపంచంలో తప్పుడు సమాచారం కట్టడి ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ పార్లమెంటరీ కమిటీ నిబంధనలు కఠినంగా అమలైతే కొంతైనా మార్పు రావడం ఖాయం అన్నది నిపుణుల మాట. భారత్లో కట్టడి చేస్తాం సరే.. అంతర్జాతీయంగా వచ్చి పడే కంటెంట్ను ఎలా నియంత్రిస్తారన్నది ముందున్న సవాల్. » సాధారణంగా సినిమా ప్రారంభంలో ‘చిత్ర నిర్మాణంలో జంతువులకు, పక్షులకు ఎలాంటి హానీ చేయలేదని, గ్రాఫిక్స్ ఉపయోగించాం’ అని ఓ ప్రకటన ఇస్తారు. అదే తరహాలో ఇప్పుడు.. కంటెంట్ ఏఐతో సృష్టించినట్టు వెల్లడించాల్సి ఉంటుంది. » ఏఐతో కంటెంట్ సృష్టించినట్టుగా వెల్లడించాలన్న తప్పనిసరి నిబంధన చైనాలో ఉంది.» యూరోపియన్ యూనియన్ గతేడాది ఏఐ యాక్ట్ను అందుబాటులోకి తెచ్చి దశలవారీగా అమలు చేస్తోంది. -
గుంటూరులో ప్రబలిన డయేరియా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తురకపాలెంలో వరుస మరణాలతో బెంబేలెత్తుతున్న గుంటూరు జిల్లా ప్రజలపై ఇప్పుడు డయేరియా పడగ విప్పింది. కలుషిత నీటి సరఫరా వల్ల వాంతులు, విరేచనాలతో ప్రజలు అల్లాడుతున్నారు. మూడు రోజులుగా గుంటూరు జీజీహెచ్లో 33 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 53 ఏళ్ల రమణారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. పాత గుంటూరుకు చెందిన ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రెండు రోజులుగా గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్, రెడ్లబజారు, మంగళదాస్నగర్, రాజగోపాల్నగర్, రామిరెడ్డితోట, సంపత్నగర్, నల్లచెరువు, భాగ్యనగర్, ఆర్టీసీ కాలనీ, బుచ్చయ్యతోటకు చెందిన వారు కూడా డయేరియా బారినపడ్డారు. అలాగే తాడేపల్లి, తెనాలి, ఓబులనాయుడుపాలెం, రెడ్డిపాలెంకు చెందిన పలువురు సైతం డయేరియాతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీటి సరఫరా వల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు వాసన వస్తున్నాయని వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. కాగా, డయేరియా బాధితులు పెరుగుతుండడంతో గుంటూరు జీజీహెచ్లోని ఇన్పేషెంట్ విభాగం జనరల్ సర్జరీ డిపార్టుమెంట్లో ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. -
పదోన్నతుల్లో సర్కారు వక్రబుద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల్లో చంద్రబాబు కూటమి సర్కారు వక్రబుద్ధిని ప్రదర్శించింది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డిపై కక్షసాధింపు చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా వెంకటరామిరెడ్డిని పక్కనపెట్టి మిగతా వారికి పదోన్నతులు కల్పించింది. అదీ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిన నాలుగు నెలలు తరువాత. వివరాల్లోకి వెళ్తే..రాష్ట్ర సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు చాలా ఆలస్యమవుతున్నాయని గ్రహించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయంలో సాధారణ పరిపాలనశాఖ పరిధిలో వివిధ హోదాల్లో 85 అదనపు పోస్టులు సృష్టించింది. ఈ అదనపు పోస్టుల వల్ల 2023 సంక్రాంతి రోజు ఒకేసారి 192 మంది సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు తీసుకున్నారు. అందులో 50 మంది విభాగాధికారులు (సెక్షన్ ఆఫీసర్లు) సహాయ కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. సహాయ కార్యదర్శి పదోన్నతి పొందినవారిలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కూడా ఉన్నారు. ఈ సహాయ కార్యదర్శుల పదోన్నతులపై కొందరు హైకోర్టులో ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు వేయడంతో.. ప్రభుత్వం ఆ పదోన్నతుల ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. తర్వాత కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు పదోన్నతులు ఇచ్చుకోవచ్చని ఈ ఏడాది జూన్ 5వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు పదోన్నతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చి నాలుగునెలలు అవుతున్నా పదోన్నతులు ఇస్తే వెంకటరామిరెడ్డికి కూడా ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఎవరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తనను పక్కన పెట్టి మిగతా ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని, తనకోసం మిగతా ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని వెంకటరామిరెడ్డి లేఖ ఇచ్చాక.. వెంకటరామిరెడ్డిని పక్కనపెట్టి మిగతావారికి పదోన్నతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సహాయ కార్యదర్శుల పదోన్నతులు ఇచ్చే తేదీ నాటికి అంటే 2023 జనవరి 13వ తేదీ నాటికి వెంకటరామిరెడ్డిపై కేసులు లేవు. నిబంధనల మేరకు.. 2024 ఎన్నికల సమయంలో పెట్టిన కేసులు 2023 నుంచే ఇచ్చే ప్రమోషన్లకు అడ్డంకి కాదు. కానీ ప్రభుత్వం కేవలం కక్షసాధింపు కోసమే పదోన్నతి ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఒక ఉద్యోగిపై ఇంతలా కక్షసాధించడం గతంలో ఎప్పుడూ చూడలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. కె.వెంకటరామిరెడ్డి సస్పెన్షన్లో ఉన్నారని, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్నారని, ఆయనకు మినహా మిగతా 49 మందికి ప్రభుత్వ సహాయ కార్యదర్శులుగా పదోన్నతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. క్రమశిక్షణ చర్యలు ముగిసిన తరువాత ఆయన కేసును విడిగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. -
ఏపీఈఆర్సీ చైర్మన్ను నియమించరా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పూర్తిస్థాయి చైర్మన్ను నియమించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) వంటి సంస్థలకు అధిపతులు లేకుండా (హెడ్లెస్) ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ పోస్టులను భర్తీచేయడానికి వచ్చిన ఇబ్బందేమిటని నిలదీసింది. నిర్దిష్ట గడువులోపు ఈఆర్సీ చైర్మన్ నియామకాన్ని పూర్తిచేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈఆర్సీ చైర్మన్ పోస్టును ఎప్పటిలోగా భర్తీచేస్తారో స్పష్టంగా చెప్పాలంది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న ఏపీఈఆర్సీ చైర్మన్ పోస్టును భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ డాక్టర్ దొంతి నరసింహారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈఆర్సీ చైర్మన్ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉందని తెలిపారు. సభ్యుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. సభ్యుడే ఇన్చార్జి చైర్మన్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఓ సభ్యుడి నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ల సమావేశంలో బిజీగా ఉండటంతో పూర్తి వివరాలు తెప్పించుకోలేకపోయినట్లు చెప్పారు. దీంతో ధర్మాసనం గడువులోపు ఈ ఖాళీలను భర్తీచేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎప్పటిలోపు భర్తీచేస్తారో స్పష్టంగా చెప్పాలంటూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. -
ఫెడ్ వడ్డీ రేటు పావు శాతం కోత
వాషింగ్టన్ డీసీ: యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గించేందుకు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) తాజాగా వడ్డీ రేటులో 0.25 శాతం కోతకు ఓటు వేసింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 4–4.25%కి దిగివచ్చింది. గత ఐదు పాలసీ సమీక్షలలో యథాతథ వడ్డీ రేటు (4.25–4.5%) అమలుకే మొగ్గు చూపిన ఫెడ్ 9 నెలల తదుపరి రేట్ల కోతకు నిర్ణయించింది. తదుపరి నిర్వహించే విలేకరుల సమావేశంలో వచ్చే ఏడాది జూన్కల్లా మరో రెండుసార్లు రేట్లను తగ్గించే సంకేతాలివ్వనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడానికితోడు ఉపాధి మార్కెట్ క్షీణించడం రేట్ల కోతకు కారణమైనట్లు విశ్లేíÙంచారు. కాగా.. గత కేలండర్ ఏడాది (2024)లో ఫెడ్ 3 సార్లు వడ్డీ రేటులో కోత పెట్టిన సంగతి తెలిసిందే. -
కొత్త జీఎస్టీ రేట్లపై కేంద్రం నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఈ నెల 22 నుంచి వివిధ ఉత్పత్తులపై కొత్తగా అమల్లోకి వచ్చే సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్జీఎస్టీ రేట్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లు, సెపె్టంబర్ 22 నుంచి రెండు శ్లాబులుగా ఉంటాయి. మెజారిటీ ఉత్పత్తులకు 5 శాతం, 18 శాతం ట్యాక్స్ రేట్లే వర్తిస్తాయి. విలాసవంతమైన ఉత్పత్తులపై మాత్రం 40 శాతం శ్లాబు ఉంటుంది. చాలా మటుకు ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉంటుందని నిపుణులు తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా వివిధ ఉత్పత్తులకు వర్తించే రేట్లపై ప్రభుత్వం స్పష్టతనిచి్చందని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. -
కస్టమర్లకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు బదిలీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటుపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రయోజనాలను కస్టమర్లు, వ్యాపార భాగస్వాములకు పూర్తిగా బదలాయిస్తామని భారతి సిమెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్) రవీందర్ రెడ్డి తెలిపారు. సెపె్టంబర్ 22 నుంచి ఎంఆర్పీ తగ్గింపు ధరలు .. తమ ఇన్వాయిస్లలో, సిమెంటు బ్యాగ్లపై ప్రతిఫలిస్తాయని వివరించారు. సిమెంటు ధరలను తగ్గించి, ప్రయోజనాలను బదిలీ చేయాలని ఇప్పటికే తమ డీలర్లకు సూచించినట్లు రవీందర్ రెడ్డి చెప్పారు. లక్షల కొద్దీ గృహ నిర్మాణదారులు, మౌలిక సదుపాయాల డెవలపర్లు, సామాన్యులకు నేరుగా లబ్ధి చేకూర్చేలా జీఎస్టీ సంస్కరణలు చేపట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా భారత్ ఆవిర్భవించేందుకు తోడ్పడుతుందని రవీందర్ రెడ్డి చెప్పారు. వికాట్ ఫ్రాన్స్ అనుబంధ సంస్థగా భారతి సిమెంట్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
ఏఎంసీ షేర్ల హవా
దేశీ స్టాక్ మార్కెట్లను మించుతూ గత ఆరు నెలలుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)లు లాభాల దౌడు తీస్తున్నాయి. ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 10 శాతం పుంజుకోగా.. లిస్టెడ్ కంపెనీల షేర్లు 50–30 శాతం మధ్య పురోగమించాయి. ప్రధానంగా దేశీ పెట్టుబడులు జోరందుకోవడం ఇందుకు సహకరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. కుటుంబ ఆదాయాలు బలపడటం, పెట్టుబడి అవకాశాలపట్ల పెరుగుతున్న అవగాహన, డిజిటలైజేషన్తోపాటు.. మార్కెట్లో సరళతర లావాదేవీలకు వీలు ఏర్పడటం వంటి అంశాలు కొద్ది నెలలుగా రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఇటీవల కొంతకాలంగా పొదుపునకు వెచ్చించగల ఆదాయాలు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు వివిధ పెట్టుబడి విభాగాలపై దృష్టిపెడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా బంగారం, రియల్టీ తదితర ఫిజికల్ ఆస్తుల నుంచి పొదుపు ఆలోచన ఆర్థిక మార్గాలవైపు మళ్లుతున్నట్లు తెలియజేశారు. దీనికితోడు దేశీయంగా రిటైలర్లు ఈక్విటీ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్త్మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బత్తిని పేర్కొన్నారు. ఫలితంగా విభిన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. వెరసి మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)కు చెందిన క్రమానుగత పెట్టుబడి(సిప్) పథకాలు, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు), రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్లు) తదితరాలకు పెట్టుబడులు తరలివస్తున్నట్లు వివరించారు. సిప్ల దన్నుబీఎస్ఈ గణాంకాల ప్రకారం ఆస్తుల నిర్వహణా పరిశ్రమలోని లిస్టెడ్ దిగ్గజాలలో అత్యధికంగా నిప్పన్ లైఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ స్టాక్స్ గత ఆరు నెలల్లో 53 శాతానికిపైగా దూసుకెళ్లాయి. ఈ బాటలో యూటీఐ ఏఎంసీ 48 శాతం, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 40 శాతం జంప్చేయగా.. శ్రీరామ్ ఏఎంసీ 23 శాతం, కేఫిన్ టెక్నాలజీస్ 22 శాతం చొప్పున ఎగశాయి. ప్రధానంగా పసిడి, వెండిపై ఇన్వెస్ట్ చేసే కుటుంబ ఆదాయాలు విభిన్న పెట్టుబడి పథకాలవైపు ప్రయాణిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంఎఫ్లకు తరలి వస్తున్న పెట్టుబడులు, నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) విలువ భారీగా మెరుగుపడటం, సిప్ల ద్వారా రిటైలర్ల నిరవధిక పెట్టుబడులు ఏఎంసీ కంపెనీల షేర్లకు జోష్నిస్తున్నట్లు తెలియజేశారు.పెట్టుబడుల తీరిలా నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం గత నెల(ఆగస్ట్)లో ఈక్విటీలలోకి నికర పెట్టుబడులు నెలవారీగా చూస్తే 25 శాతం క్షీణించి రూ. 42,360 కోట్లకు పరిమితమయ్యాయి. ఇందుకు ప్రపంచస్థాయిలో భౌగోళిక, రాజకీయ అస్థిరతలు కొంతమేర ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే సిప్ పథకాలకు నిలకడగా రూ. 28,270 కోట్లు ప్రవహించడం రిటైల్ ఇన్వెస్టర్ల కట్టుబాటును సూచిస్తున్నట్లు ప్రస్తావించారు! ఇక ఈ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి–జూన్)లో ఎంఎఫ్ల ఏయూఎం 11 శాతం బలపడి రూ. 74.41 లక్షల కోట్లను తాకాయి. ఇందుకు ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్స్ దన్నునిచ్చాయి. ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ వివరాల ప్రకారం ఈ కాలంలో ఏయూఎం రూ. 7 లక్షల కోట్లమేర పుంజుకుంది. నికరంగా రూ. 4.18 లక్షల కోట్ల పెట్టుబడులు జమయ్యాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అసంతృప్త యువతరం
యువతరం అనగానే ఉరిమే ఉత్సాహం, నిత్య చైతన్యం నిండిన ముఖాలే గుర్తుకొస్తాయి. సాధారణంగా జీవితంలో అసంతృప్తి దశ అంటే మధ్య వయసు అని ఎన్నాళ్లుగానో ఒక నమ్మకం బలపడిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. మధ్య వయస్కులకంటే జనరేషన్–జెడ్ (1996–2010 మధ్య పుట్టిన వారు)గా పిలుస్తున్న యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. భవిష్యత్తుపై అనిశ్చితి, సోషల్ మీడియా ప్రభావం, కోవిడ్–19 తర్వాత వచ్చిన మార్పులు తదితర పరిణామాలతో యువతలో అసంతృప్తి అధికంగా ఉందని 44 దేశాల్లో దీర్ఘకాలంపాటు నిర్వహించిన గ్లోబల్ సర్వేలో తేలింది. డేవిడ్ జి.బ్లాంచ్ఫ్లవర్, అలెక్స్ బ్రైసన్, జియావోయ్ జు అనే శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయన నిర్వహించింది. 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వంటి పరిశోధనలను బట్టి చూస్తే మధ్య వయస్కులలోనే అసంతృప్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ, ఈ సంప్రదాయ సూత్రీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పు అని ఈ శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి. దశాబ్దాలుగా పరిశోధకులు ‘మిడ్ లైఫ్ అన్హ్యాపినెస్ హంప్’ను ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు యువతలో.. అదీ కూడా 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిలో ఈ ధోరణి అధికంగా ఉందని గుర్తించారు. ఇందుకు సోషల్ మీడియా, ఆర్థిక అస్థిరత, కోవిడ్–19 దీర్ఘకాలిక ప్రభావాలు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిర పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం వంటివి కారణమని తేల్చారు. స్కీ స్లోప్లోకిజెన్ జెడ్అధిక ఆదాయ దేశాల్లోని (హై ఇన్కమ్ కంట్రీస్)యువతలో అసంతృప్తి స్థాయి అధికంగా ఉంది. విభిన్న నేపథ్యాలున్న దేశాల్లోనూ ఈ పరిస్థితి పెరుగుతోంది.జెన్– జెడ్ అసంతృప్తిలో ‘స్కీ స్లోప్’ను అంటే.. పల్లంలోకి జారుకునే స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇతర అధ్యయనాల్లోని డేటా కూడా ఈ ధోరణిని సమరి్థస్తోంది. మానసికఆందోళన, ఒత్తిళ్లు, కుంగుబాటు అనేవి 16–19 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లు, 20–24 ఏళ్ల మధ్య వయసులోని యువతలో అధికంగా ఉన్నట్టు తేలింది. గత పదేళ్లుగా యువతరం మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఈ బృందం ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సీడీసీ నివేదికలోని అంశాలు..» యువకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు 1993లో 2.5% ఉండగా, 2024లో 6.6%కి పెరిగాయి. » యువతుల్లో ఇదే కాలంలో 3.2% నుంచి 9.3%కి చేరింది. » 2023 గ్యాలప్ సర్వేలో జెన్ జెడ్లో 15% మంది తమ మానసిక ఆరోగ్యం బాగా ఉందని తెలిపారు. » 1981–1996ల మధ్య జని్మంచిన 52% మిలీనియల్స్ (మధ్య వయసువారు) మానసిక ఆరోగ్యం మాత్రం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.సమస్యలకు కారణాలు.. » సోషల్ మీడియా అధిక వినియోగంతో అవాస్తవిక సామాజిక పోలికలు ఏర్పడి ఆందోళన, అసంతప్తి పెరుగుతోంది. జెన్ జెడ్ ఎక్కువగా ఆర్థిక ఆందోళన, అస్థిరతను ఎదుర్కొంటున్నారు. » కోవిడ్–19 వల్ల సామాజిక, విద్యా జీవితానికి ఏర్పడిన అంతరాయాలు యువత మానసిక ఆరోగ్యంపై శాశ్వత ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. » రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పులపై అవగాహన పెరగడం యువతలో నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితి భావాలకు దారితీస్తోంది.పరిష్కారాలు..» యువతలో సంతోషాలు నింపేందుకు వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని మెరుగుపర్చాలి. పాఠశాలల్లో ఫోన్ వాడకాన్ని నిషేధించాలి. » మెంటల్ హెల్త్ సర్వీసెస్ను పెంచాలి. » కౌమార దశ నుంచి వయోజనులుగా మారుతున్న క్రమంలో యువతకు సంబంధించి స్కూళ్ల విధానాలను నవీకరించడంతోపాటు డిజిటల్–సేఫ్టీ చర్యలు చేపట్టాలి. » సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి, చుట్టూ ఉన్నవారితో ప్రత్యక్ష సంబంధాలను ప్రోత్సహించాలి. » స్నేహితులతో అధిక సమయం గడపడం ద్వారా యువతలో ఆనందాన్ని మెరుగుపర్చవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.- సాక్షి, హైదరాబాద్ -
సింగిల్ జడ్జి తీర్పు చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను మళ్లీ దిద్దాల్సిందేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ).. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. టీజీపీఎస్సీ తరఫున అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి (లీగల్) ఆర్.సుమతి బుధవారం అప్పీల్ దాఖలు చేశారు. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్ఎల్)ను రద్దు చేస్తూ ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరారు. తీర్పు అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిట్ పిటిషన్ దాఖలు చేసిన గ్రూప్–1 అభ్యర్థులు 222 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ అప్పీల్పై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒకట్రెండు రోజుల్లో విచారణ చేపట్టనుంది. కేసు పూర్వాపరాలు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. మెయిన్స్ తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. అన్ని సమాధాన పత్రాలను మాన్యువల్గా తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని కమిషన్ను ఆదేశించారు. ఇది సాధ్యం కాని పక్షంలో మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ వేసింది. ఊహలతో తీర్పు సమ్మతం కాదు..: ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులు చట్టబద్ధంగా లేవు. టీజీపీఎస్సీ సమర్పించిన వివరాలు, ఆధారాలను పరిగణనలోకి తీసు కోలేదు. మున్సిపల్ కమిటీ, హోషి యార్పూర్ వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. ఊహలు, నమ్మదగిన సాక్ష్యాలు లేనప్పుడు తీర్పు ఇవ్వడం సముచితం కాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం సూచన పరంగా చూస్తే ఈ తీర్పు ‘విపరీత ధోరణి’తో ఉంది. మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని చెబుతూనే మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని చెప్పడం పరస్పర విరుద్ధం. కమిషన్ ఉద్యోగ నియమావళి ప్రకారం.. ఫలితాలిచ్చిన 15 రోజుల్లోగా మాత్రమే పునః మూల్యాంకనానికి వీలుంటుంది. మళ్లీ దిద్దాలనడం కూడా చెల్లదు. మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసం ఉందని సింగిల్ జడ్జి పేర్కొనడం సబబు కాదు. గత ఏడాది అక్టోబర్ 27న స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు 18 మందితో కలిపి 21,093 మంది ఉన్నారని ప్రాథమిక సమాచారం ఇచ్చాం. తర్వాత తుది సమాచారం ఆధారంగా ఆ సంఖ్య 21,110 మందికి పెరిగింది. కోర్టు ఆదేశాల కారణంగా వీరిలో 25 మందిని పక్కకు పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆ సంఖ్య 21,085కు తగ్గినట్లు మార్చి 30న వెల్లడించాం. ఆంగ్లంలో 924 మంది అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో ఆ సంఖ్య 20,161కి తగ్గింది. ఈ వ్యత్యాసాన్ని శాస్త్రీయంగా వివరించినా సింగిల్ జడ్జి పట్టించుకోలేదు’అని టీజీపీఎస్సీ పేర్కొంది. వేర్వేరు హాల్టికెట్లు సమర్థనీయమే‘ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్టికెట్లు ఇవ్వడం సమర్థనీయమే. అలా ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చాం. యూపీఎస్సీ విధానాన్ని అనుసరించాలని ఎక్కడా లేదు. పరీక్షా కేంద్రాల సంఖ్య 45 నుంచి 46కి పెరగడంపై పిటిషనర్ల ఆందోళనకు అర్థం లేదు. తొలుత 45 కేంద్రాలుగా నిర్ణయించినా క్షేత్రస్థాయిలో ఒక కేంద్రం ఎత్తైన చోట ఉంది. దీంతో 87 మంది దివ్యాంగుల సౌలభ్యం కోసం సర్దుబాటు చేసే క్రమంలో ఒక పరీక్షా కేంద్రం పెరిగింది’ అని కమిషన్ తెలిపింది. అనుభవమున్న వారినే ఎంపిక చేశాం: ‘ఫలితాల గణాంకాలను సింగిల్ జడ్జి తప్పుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఒకటోసారి, రెండోసారి మూల్యాంకనం చేశాక 15% కంటే ఎక్కవగా మార్కుల తేడా ఉంటే మూడోసారి మూల్యాంకనం చేసిన విషయాన్ని పట్టించుకోలేదు. ఎవరి పేపరు మూల్యాంకనం చేస్తున్నామనేది దిద్దేవాళ్లెవరికీ తెలియదు. అనుభవమున్న, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో నిపుణులైన అధ్యాపకులనే మూల్యాంకనం కోసం ఎంపిక చేశాం. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరైనప్పుడు ఒకే తరహా మార్కులు పలువురికి రావడం సర్వసాధారణం. 719 మంది ఒకే రకమైన మార్కులు సాధించడంపై కమిషన్ ఇచ్చిన వివరణను న్యాయమూర్తి పట్టించుకోలేదు’అని టీజీపీఎస్సీ పేర్కొంది. -
‘జీఎస్టీ’ దెబ్బ గట్టిగానే!
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల శ్లాబ్ల తగ్గింపు కారణంగా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రమారమి రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఆయా వస్తువుల అమ్మకాలను బట్టి సుమారు రూ.5–7 వేల కోట్లు నష్టం వస్తుందని వాణిజ్య శాఖ వర్గాలు తమ ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. జీఎస్టీ శ్లాబ్ల హేతుబద్దీకరణ కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లుతుందనే వివరాలను తెలియజేయాలని ప్రభుత్వం కోరిన మేరకు అన్ని రంగాల్లో వస్తువుల అమ్మకాలకు సంబంధించిన గణాంకాలను తెప్పించిన వాణిజ్య పన్నుల శాఖ ఈ మేరకు నష్ట నిర్ధారణ చేసినట్టు సమాచారం. ఎక్కువగా ఈ రంగాల్లోనే.. కాగా, జీఎస్టీ రేట్ల శ్లాబ్లను హేతుబద్దీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని పలు ప్రధాన రంగాల అమ్మకాలపై ప్రభావం చూపనుంది. రాష్ట్రం నుంచి ఎక్కువగా అమ్ముడయ్యే ఐరన్న్అండ్ స్టీల్, ఆటో మొబైల్స్ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పన్నుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రంగాలతో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాలపై వచ్చే పన్నులు కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయి భారీ గండి పడుతుందని ఆ శాఖ వర్గాలంటున్నాయి. అలాగే టెక్స్టైల్స్, సిమెంట్ లాంటి కీలక రంగాల ద్వారా వచ్చే ఆదాయం కూడా కుదుపునకు గురవుతుందని, కొన్ని రంగాల్లో కొంత మేర అమ్మకాలు పెరిగినప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో గండి పడటం ఖాయమని ఆ వర్గాలంటున్నాయి. అయితే, జీఎస్టీ శ్లాబ్ల తగ్గింపుతో ధరలు పెంచాలని ఐరన్ అండ్ స్టీల్, సిమెంట్ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఈ రెండింటి ధరలు పెరిగే అవకాశముందని కూడా వారు అంటున్నారు. వివరాల సేకరణకు తంటాలు జీఎస్టీ ద్వారా ఏ డీలర్ ఏయే సరుకులు, ఎంత మేర అమ్ముతున్నారన్న వివరాలను సేకరించి అంచనాలను రూపొందించడం కష్టతరంగా మారిందని పన్నుల శాఖ వర్గాలు చెపుతున్నాయి. గతంలో వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు డీలర్ కోడ్ నమోదు చేస్తే అన్ని సరుకుల వివరాలు వచ్చేవని, ఇప్పుడు జీఎస్టీలో ఆ వివరాలు అందుబాటులోకి రావడం లేదని, ఈ నేపథ్యంలో ప్రతి డీలర్ ఏ సరుకులు అమ్ముతున్నాడనే వివరాలను క్షేత్రస్థాయి నుంచి తెప్పించి మదింపు చేయాల్సి వస్తోందని పన్నుల శాఖ వర్గాలు అంటున్నాయి. -
మేం రెడీ
‘‘ఒకప్పుడు మాకు అర బిస్కెట్ (ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి) దొరికింది. హ్యాపీగా చేశాం. అప్పుడు చాన్స్ రావడమే గొప్ప... అందుకే అర బిస్కెట్టేనా? అనుకోలేదు. ఆ తర్వాత ఫుల్ బిస్కెట్ (సోలో హీరోలుగా చేయడం గురించి) దొరికింది. ఇద్దరం ఫుల్ బిస్కెట్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం’’ అని గతంలో తాను, రజనీకాంత్ కలిసి నటించిన విషయం గురించి పేర్కొని, ‘‘ఇప్పుడు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ’’ అంటూ ఇటీవల కమల్హాసన్ పేర్కొన్నారు. తాజాగా తమ కాంబినేషన్ గురించి రజనీకాంత్ కూడా స్పందించారు. బుధవారం చెన్నై ఎయిర్పోర్టులో మీడియాతో రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (కమల్హాసన్ బేనర్), రెడ్ జెయింట్ మూవీస్ మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా నిర్మిస్తాయి. అయితే డైరెక్టర్, కథ ఫైనలైజ్ కాలేదు. మళ్లీ కలిసి సినిమా చేయడానికి నేను, కమల్ రెడీ. కానీ మాకు తగ్గ కథ, పాత్రలు దొరికితే చేస్తాం. డైరెక్టర్ కూడా కుదరాలి’’ అని పేర్కొన్నారు. ఇక కెరీర్ ఆరంభంలో ‘అపూర్వ రాగంగళ్, మూండ్రు ముడిచ్చు, అంతు లేని కథ’ వంటి పలు చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రజనీ–కమల్. ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ (1979) తర్వాత మళ్లీ కలిసి నటించలేదు. సో... రజనీ–కమల్ ఆశిస్తున్నట్లు కథ, పాత్రలు, డైరెక్టర్ సెట్ అయితే దాదాపు 45 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. -
మోదీ జీవితంతో మా వందే
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ వెండితెరకు రానుంది. ‘మా వందే’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించనున్నారు. క్రాంతికుమార్ సీహెచ్. రచన, దర్శకత్వంలో వీర్ రెడ్డి .ఎం నిర్మించనున్నారు. బుధవారం (సెప్టెంబరు 17) మోదీ పుట్టినరోజు సందర్భంగా ‘మా వందే’ప్రాజెక్ట్ని ప్రకటించారు. వీర్ రెడ్డి .ఎం మాట్లాడుతూ– ‘‘మోదీగారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఘటనలు, విశేషాలను ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నాం. సమాజం కోసం ఎన్నో ఆకాంక్షలు గల బాలుడి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమాన్ని చూపిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలు, సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్తో ‘మా వందే’ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లిష్లోనూ నిర్మిస్తాం. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఈ కథలో కీలకం. మోదీ ప్రపంచనాయకుడిగా ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ప్రేరణ ఎంతో ఉంది’’ అని చె΄్పారు. ఈ చిత్రానికి కెమెరా: కేకే సెంథిల్ కుమార్, సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గంగాధర్ .ఎన్ ఎస్, వాణిశ్రీ .బి, లైన్ ప్రొడ్యూసర్: టీవీఎన్ రాజేశ్. -
మార్పు అవసరమే..అసాధ్యమేమీ కాదు..
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు అవసరమని భారతీయులు భావిస్తున్నట్లు ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మొత్తం 25 దేశాల్లో ఒక్క భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే.. ఆ మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ప్రజలు రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళనను కోరుకుంటున్నారని, అయితే ప్రక్షాళన జరగటంపై సందేహాలు వ్యక్తం చేశారని ‘ప్యూ’ తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రపంచ వ్యాప్తంగా భారత్, అమెరికా, కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ వంటి 25 దేశాలలో ‘ప్యూ’ నిర్వహించిన ఈ సర్వేలో 50 శాతానికిపైగా ప్రజలు తమ దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు లేదా పూర్తి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 70 శాతానికిపైగా వ్యక్తం చేశారు. 2025 జనవరి 8 – ఏప్రిల్ 26 మధ్య ‘ప్యూ’ ఈ సర్వేను నిర్వహించింది. సర్వే కోసం 28,333 మంది అభిప్రాయాలు సేకరించింది.మార్పుపై మనవాళ్లుభారీ మార్పు అవసరం అన్న భారతీయులు 37 శాతం మంది కాగా, మొత్తం అంతా మారిపోవాలి అన్నవాళ్లు 34 శాతం మంది. అసలు మార్పే అవసరం లేదన్నవారు 9 శాతం మంది, చిన్నచిన్న మార్పులు అవసరం అన్నవారు 16 శాతం మంది. రాజకీయ వ్యవస్థ మారుతుందని 59 శాతం మంది భారతీయులు నమ్ముతుండగా, 10 శాతం మంది తమకు అలాంటి నమ్మకం లేదని తెలిపారు. 25 శాతం మంది కొద్దిపాటి మార్పులు చేస్తే బాగుంటుందని / అసలు మార్పులే అవసరం లేదని అన్నారు.కొన్ని దేశాల్లో పెదవి విరుపు రాజకీయ వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు వివిధ దేశాల ప్రజలు వేర్వేరుగా సమాధానాలు ఇచ్చారు. ఉదాహరణకు, దక్షిణ కొరియా వాసుల్లో 87 శాతం మంది రాజకీయ సంస్కరణలు అవసరమని చెప్పినప్పటికీ, అవి జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని అన్నారు. మొత్తం 25 దేశాల్లో ఒక్క భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే, ఆ మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. నాయకులపై సానుకూలతప్రపంచ దేశాలన్నిటిలోనూ నాయకులపై సానుకూల భావనే కనిపించింది. భారతీయులు కూడా – తమ దేశ రాజకీయాల్లో వ్యవస్థాగత మార్పులు అవసరం అంటూనే, తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వాల పట్ల ఎక్కువగా సదభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన ఐదు రకాల గుణగణాలు (నిజాయితీ, ప్రజావసరాలను అర్థం చేసుకోవటం, సమస్యలపై దృష్టి పెట్టటం, నైతిక ప్రవర్తన, యోగ్యతలు).. తమ నాయకులలో అవి ఉన్నదీ లేనిదీ గుర్తించమని ‘ప్యూ’ సర్వే అడిగినప్పుడు ఎక్కువమంది సానుకూలంగా స్పందించారు. భారతీయులదీ అదే తీరుభారతీయులు తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వంపై పూర్తి వ్యతిరేకంగా లేరు. 33 శాతం మంది తమ నాయకులు నిజాయితీకి, 31 శాతం మంది ప్రజావసరాలను అర్థం చేసుకునే నైజానికి, 27 శాతం మంది ప్రజా సమస్యలపై పెడుతున్న దృష్టికి, 27 శాతం మంది నైతికతకు, 23 శాతం మంది యోగ్యతలకు పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. మనకు నమ్మకం ఎక్కువేరాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని చెప్పిన దేశాల్లో నైజీరియా మొదటి స్థానంలో (51 శాతం)లో ఉండగా, దక్షిణ కొరియా రెండో స్థానంలో (43 శాతం), ఇండియా మూడో స్థానంలో (34) ఉన్నాయి. 7 శాతంతో స్వీడన్ చివరి స్థానంలో ఉంది. ఎప్పటికైనా మార్పులు జరుగుతాయన్న నమ్మకం ఉన్న దేశాల్లో ఇండియా, కెన్యా రెండూ సమానంగా (59 శాతం) ప్రథమ స్థానంలో ఉండగా; మార్పులు జరుగుతాయన్న నమ్మకం లేని దేశాల్లో ఇండియా (10 శాతం) ఆఖర్న, గ్రీసు మొదట (68 శాతం) ఉన్నాయి. ఇక నేతల వ్యక్తిత్వాలు, సామర్థ్యాలపై నమ్మకం ఉన్న ఆసియా–పసిఫిక్ దేశాలలో 28 సగటు శాతంతో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (41 శాతం), దక్షిణ కొరియా (34 శాతం), ఇండోనేషియా (31 శాతం) ఉన్నాయి. -
అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం
సాక్షి, హైదరాబాద్: అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం అని కుల సంఘాలు స్పష్టం చేశాయి. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఈ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా వ్యవహరించే మీడియా.. ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుందని, అలాంటి వాటిని సానుకూలంగా స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించాయి. సాక్షి మీడియా వచ్చిన తర్వాత బీసీలు, బడుగు, బలహీన వర్గాల గొంతు పెద్ద ఎత్తున వినిపిస్తోందని ఆ సంఘాలు తెలిపాయి. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే ఈ వ్యవస్థను బలవంతంగా కేసులు పెట్టి లొంగదీసుకోవాలనుకోవడం ముర్ఖత్వం. సాక్షి మీడియా ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ కేసులను ఉపసంహరించుకోవాలి. – జాజుల శ్రీనివాస్గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పత్రికా స్వేచ్ఛను హరించడమే.. ప్రతిపక్షంతో పాటు విపక్ష అనుకూల మీడియా గొంతు నొక్కుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాల చర్యలను ఎండగట్టడంలో మీ డియా పాత్ర కీలకం. అలాంటి వార్తలను ప్రభుత్వం పాజిటివ్గా తీసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలి. అలాకాకుండా మీడియాపైన అక్రమంగా కేసులు పెట్టడమంటే ప్రతికా స్వేచ్ఛను హరించడమే. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – గవ్వల భరత్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మీడియాపై దాడి మంచిదికాదు ప్రభుత్వాలు ఏ మీడియాపైనా ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయవద్దు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే.. వాటికి వివరణ ఇవ్వడమో, ఖండించడమో జరగాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తామనడం సరికాదు. సాక్షి ఎడిటర్పై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మీడియాలో కేవలం పాలకపక్షం వార్తలే కాకుండా ప్రతిపక్షం వార్తలు కూడా వస్తాయి. ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు సాక్షి మీడియాపై కేసులు నమోదు చేయడమంటే జర్నలిజంపై నేరుగా దాడి చేయడమే. – జి.చెన్నయ్య, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు -
అపూర్వ పంటలు
అక్షయ పాత్ర సొరకాయ గురించి ఎప్పుడైనా విన్నారా? బోతరాసి పండ్ల గురించి బొత్తిగా తెలియదా? ... కొన్ని తరాల వెనక్కి వెళితే అపూర్వమైన కూరగాయలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎన్నో కనుమరుగవుతున్నాయి. అలా కనుమరుగవుతున్న కూరగాయలు, పూలు, పండ్లకు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తోంది స్వరూప.తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన గజవాడ స్వరూప అ‘పూర్వ’మైన కూరగాయలు, పూల మొక్కలను పెంచుతోంది. పూర్వకాలంలో మన పెద్దలు ఇంటి పెరటిలో, ఇంటి ముందు విత్తనాలు నాటి పండించే పంటలను కళ్లముందు ఆవిష్కరిస్తోంది. అక్షయ పాత్ర సొరకాయ నుంచి కాశీ తులసి వరకు కూరగాయల మార్కెట్లో దొరకని పూర్వపు గుమ్మడి సొరకాయ, అక్షయ పాత్ర సొరకాయ, నల్ల సొరకాయ... ఇలా సొరకాయల్లో 40 రకాలు, టమాటాలు పది రకాలు, చిక్కుడు కాయలు ఐదు రకాలు, బుడం కాయలు పది రకాలు, తీగకు కాసే ఆలుగడ్డలు, బోతరాసి పండ్లు, ఐదు రకాల బెండ కాయలు, అడవి కాకర, ΄÷ట్టి కాకర, రుద్రాక్ష కాకర, ఆపిల్ బొ΄్పాయి, నాటు దొండ, గెల చిక్కుడు, అడవి దోస, ముళ్ల వంకాయ, ΄÷ట్టి΄÷ట్లకాయ, సూర్యముఖ మిర్చి, కాశీ తులసీ, ధనియాలు, కొత్తిమీర, నల్ల అల్లం, లక్కడో¯Œ పసుపు, చెమ్మకాయలు, సూదినిమ్మ, చామంతి, జడపత్రి, బచ్చలాకు, నల్లేరు...ఇలా పూర్వపు కూరగాయలను, పూలను, పండ్లను పండిస్తోంది. దశాబ్ద కాల అపూర్వ కృషిచిన్నప్పుడు కరీంనగర్లో, చుట్టాల ఇళ్ల దగ్గర రకరకాల కూరగాయలను చూసింది స్వరూప. కాలక్రమంలో ఎన్నో కూరగాయలు కనుమరుగు కావడాన్ని కూడా చూసింది. ఇలాంటి అరుదైన రకాలను భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో దశాబ్దకాలంగా అపురూపమైన కూరగాయల విత్తనాల సేకరణ మొదలుపెట్టింది.9వ తరగతి వరకు చదువుకున్న స్వరూపకు పూర్వపు కూరగాయల విలువ బాగా తెలుసు. అందుకే ఏ ఊరు వెళ్లినా పాత తరం కూరగాయలు కనిపిస్తే విత్తనాలు సేకరించేది. ఆమె ఆసక్తిని భర్త నాగరాజు ప్రోత్సహించాడు. సిరిసిల్ల శివారులోని భూపతినగర్ లో కొంత భూమిని కొనుగోలు చేసి అక్కడ కూరగాయల క్షేత్రాన్ని ప్రారంభించి తాను పండించిన పంటలను విక్రయిస్తూ దేశీయ విత్తనాలపై ఆసక్తి ఉన్నవారికి సరఫరా చేస్తోంది.ఇల్లంతా పచ్చదనమే!స్వరూప, నాగరాజు దంపతుల ఇల్లు పాత తరం కూరగాయల చెట్లు, విత్తనాల కాయలతో ‘వెజిటెబుల్ మ్యూజియం’ను తలపిస్తుంది. ఇంట్లో అంజీరా, ఆపిల్ బేర్, జామ, బెంగళూర్ చెర్రీ, ద్రాక్ష... ఇలా రకరకాల మొక్కలతో ఇల్లంతా పచ్చదనం కొలువై ఉంటుంది. 2018లో స్వరూప కృషిని గుర్తించిన అప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆమెను సత్కరించారు. రాష్ట్ర ఉద్యానవనాల శాఖ కమిషనర్ వెంకటరామిరెడ్డి మెమెంటోతో అభినందించారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పాతతరం కూరగాయల గురించి ప్రచారం చేస్తోంది స్వరూప.కష్టమే... అయినా ఇష్టమే!మన తాత, ముత్తాతల కాలంనాటి కూరగాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే అవి ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. వాటిని భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో ఎక్కడికి వెళ్లినా పూర్వపు కూరగాయల విత్తనాలను సేకరించాను. నా దగ్గర ఆకుకూరలు, కూరగాయలు, పూలకు సంబంధించి ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి. వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నాను. కొన్నిసార్లు గ్రామీణ ప్రాంతాల్లో నేనే చొరవ తీసుకొని వాటిని నాటుతున్నాను. అవి పెరిగి పెద్దవై అందరికీ ఉపయోగపడతాయని నా ఆలోచన. ఈ పని చేయడం అంత సులభం కాదు. కానీ కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తున్నాను. – స్వరూప– వూరడి మల్లికార్జున్, సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా -
చిలకల పందిరి
చిలకలు వాలిన చెట్టు ఎంత అద్భుతం! అయితే ఇప్పుడు ఆ అద్భుతాలు అరుదైపోయాయి. ఈ నేపథ్యంలో ‘చిలకలను కా పాడుకుందాం’ అంటున్నారు సుదర్శన్, విద్య దంపతులు. చెన్నైలోని చింతాద్రిపేటలో ఉండే ఈ దంపతుల ఇంటి టెర్రస్పై రోజూ చిలకలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. రోజు ఎన్నో చిలకలకు సుదర్శన్, విద్య దంపతులు ఆహారం సమకూరుస్తున్నారు. ఇందుకోసం వారు తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్రలేస్తారు. చిలకలకు రోజూ ఆహారం ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. చిలకలపై ఈ దంపతులకు ఉన్న ప్రేమను హైలెట్ చేస్తూ ఒక తమిళ సినిమాలో సీన్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా వీరి గురించి కథనాలు రావడంతో, చిలకల ఇంటిని చూడడానికి దేశవిదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. -
నియంతలా సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలపై నిరంకుశత్వాన్ని చూపుతోందని మండిపడ్డారు. గ్రూప్ 1 అభ్యర్థులు, విద్యార్థులు కనీసం రౌండ్ టేబుల్సమావేశం నిర్వహించుకునే పరిస్థితి కూడా లేదని అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘సీఎం రేవంత్ బెదిరింపులు, ముడుపుల కోసం వేదింపులు తట్టుకోలేక హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థ వైదొలుగుతోంది. గతంలో ఎల్అండ్టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ను జైల్లో పెడతానని బెదిరించారు. గతంలో వివాదాస్పదమైన ఎమ్మార్ సంస్థ ఆస్తులను కూడా కమీషన్ల కోసం రేవంత్రెడ్డి త్వరలో అమ్మబోతున్నారు. పలు కంపెనీలపై గతంలో ఉన్న కేసులను అడ్డుపెట్టుకుని రేవంత్రెడ్డి సెటిల్మెంట్లు చేసుకోవడంతోపాటు కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటున్నారు’అని కేటీఆర్ ఆరోపించారు. జైపాల్రెడ్డి కుటుంబ సభ్యుల కోసమే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) అలైన్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన మార్చుతుండటంతో వేలాది మంది రైతులు భూములు కోల్పోతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఫోర్త్ సిటీ దగ్గర ఉన్న తమ భూముల కోసం అలైన్మెంట్, ట్రిపుల్ ఆర్ స్వరూపాన్ని మార్చేశారని ఆరోపించారు. ‘ట్రిపుల్ ఆర్కు, ఫోర్త్ సిటీకి మధ్యలో వేస్తున్న రోడ్డు కేవలం రేవంత్ రెడ్డి, జైపాల్రెడ్డి కుటుంబ సభ్యుల భూముల కోసమే. ఈ రోడ్డు వెంబడి అనేక మంది నుంచి భూములు కొనుగోలు చేసి ఇప్పటికే రేవంత్ కుటుంబం ఒప్పందాలు చేసుకుంది. ఆయన హైదరాబాద్లోని భూములన్నింటినీ అమ్ముతున్నారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినా సీఎం, ఈగల్ టీమ్కు సమాచారం లేదు. హైడ్రా మంచి ఫలితాలు ఇస్తే వర్షం వచి్చనప్పుడు హైదరాబాద్ నగరం ఎందుకు మునిగిపోతోంది’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎంపీలను అమ్మేసిన రేవంత్..: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలను రేవంత్రెడ్డి గొర్రెల్లా అమ్మేశారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన ముమ్మాటికీ బీజేపీ మనిషే అని అన్నారు. ‘రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి వెంటనే ఉప ఎన్నికలు పెట్టాలి. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనంత బలహీనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ మాట మార్చి రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవితో ముడిపెడుతున్నాడు. తీన్మార్ మల్లన్నతో సహా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. గ్రూప్ 1 ఉద్యోగాలు రూ.3 కోట్ల చొప్పున అమ్ముకున్నారని అభ్యర్థులే చెప్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలో అవినీతిపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? యువతతో పెట్టుకుంటున్న రేవంత్ రెడ్డికి పతనం తప్పదు’అని కేటీఆర్ హెచ్చరించారు. కాళేశ్వరంపై బీజేపీ, కాంగ్రెస్ రాజకీయంకాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ కలిసికట్టుగా చిల్లర రాజకీయం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత ఏనుగు రాకేశ్రెడ్డి రూపొందించిన కాళేశ్వరం డాక్యుమెంటరీని తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ఎలా సాధ్యమని అసెంబ్లీలో ప్రశ్నిస్తే సర్కారు వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు. ట్రిపుల్ ఆర్లో భూములు కోల్పోతున్న వికారాబాద్ జిల్లా రైతులు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి సమస్యలు విన్నవించారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. -
డిజిటల్ అరెస్టుకు మహిళ బలి
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ మోసగాళ్ల వేధింపులకు ఓ వృద్ధురాలు బలైంది. హైదరాబాద్ మధురానగర్కు చెందిన మహిళ (76) చంచల్గూడ ఆఫీసర్స్ కాలనీలో ఉన్న మామిడిపూడి నాగార్జున ఏరియా ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమెకు ఈ నెల 5న తొలిసారి సైబర్ నేరగాళ్ల నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. బెంగళూరు పోలీసు లోగో, పోలీసు డ్రెస్లో ఉన్న వ్యక్తి ఫొటోతో కూడిన ప్రొఫైల్ పిక్చర్ వినియోగించి సైబర్ నేరగాళ్లు వృద్ధురాలితో మాట్లాడారు. ఆమె ఆధార్ కార్డు వివరాలు దుర్వినియోగం అయ్యాయని, మనుషుల అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి కేసు నమోదైందని బెదిరించారు. సుప్రీంకోర్టు జారీ చేసినట్లు సీల్తో ఉన్న నకిలీ పత్రాలను షేర్ చేశారు. ఈ కేసు సదాకత్ ఖాన్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుకు అనుబంధంగా నమోదైందని, అరెస్టు తప్పదని భయపెట్టారు. అరెస్టు కాకుండా ఉండాలంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధితురాలు సెపె్టంబర్ 6న తన బ్యాంకు ఖాతాలో ఉన్న పెన్షన్ సొమ్ము రూ.6.6 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలోకి బదిలీ చేసింది. ఆ బ్యాంకు ఖాతా మహారాష్ట్రలోని ఓ షెల్ కంపెనీ పేరుతో ఉన్నట్లు తేలింది. ఆపై మరో నంబర్ నుంచి బాధితురాలికి వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు.. న్యాయస్థానం జారీ చేసినట్లు తయారు చేసిన నకిలీ నోటీసులు పంపారు. తమ నుంచి క్లియరెన్స్ వచ్చేవరకు వీడియో కాల్ ఆన్లోనే ఉండాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 8 వరకు ఇలా ‘నిర్బంధం’లో ఉండిపోయిన వృద్ధురాలు విషయం ఇంట్లో వారికి కూడా చెప్పలేదు. ఆ ఒత్తిడితో గుండెపోటుకు గురై కిందపడిపోయారు. కుటుంబీకులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆమె ఫోన్ను కుటుంబ సభ్యులు పరిశీలించగా డిజిటల్ అరెస్టు గురించి తెలిíసింది. దీంతో ఆమె కుమారుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా ఐటీ యాక్ట్తో పాటు బీఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఏమిటీ సదాకత్ ఖాన్ కేసు? ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాకు చెందిన ఘరానా నేరగాడు సదాకత్ ఖాన్. మన దేశం నుంచి అనేకమందిని ఉద్యోగా ల పేరుతో కాంబోడియా తీసుకెళ్లి సైబర్ ముఠాలకు అప్పగించేవాడు. అక్కడ వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయించే వారు. సిరిసిల్లకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది నవంబర్ 6న దుబాయ్ నుంచి వచి్చన సదాకత్ ఖాన్ను ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరు తో ప్రజలను మోసం చేయడానికి ఈ కేసును వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా డిజిటల్ అరెస్టు లేదుదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఓ నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని డిజిటల్ అరెస్టు చేసే విధానం అమలులో లేదు. ఏ పోలీసు అధికారి వీడియో కాల్ చేసి కేసు నమోదైందని చెప్పరు. నిందితుడిగా ఆరోపణలు ఉంటే... ఫోన్ చేసి పోలీసుస్టేషన్కు రమ్మని పిలుస్తారు. ఏ కేసులో అయినా నిర్దోషిత్వం నిరూపించుకోవాలంటే దర్యాప్తు అధికారులను నేరుగా కలిసి తగిన ఆధారాలు సమర్పించాలి. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందాలి. మీ ప్రమేయం లేకుండా ఆధార్, పాన్కార్డు వంటివి దుర్వినియోగమైనా ప్రమాదం ఉండదు. బాధితుల భయమే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి అని గుర్తుంచుకోవాలి. – సైబర్ క్రైమ్ పోలీసులు -
లైఫంత లైబ్రరీ
‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో’ అన్న కందుకూరి వీరేశలింగం మాటను నిజం చేశాడు కర్ణాటక, హరెలహళ్లికి చెందిన అంకే గౌడ. ఇప్పుడతని వయసు 75 ఏళ్లు. పుస్తకాలను కొని చదివి, భద్రం చేసే పనిని తన 20వ ఏట మొదలుపెట్టాడు. ఇప్పటివరకు పోగైన రెండు కోట్ల పుస్తకాలతో ‘బుక్ మానే (బుక్ హౌజ్)’ పేరుతో ఓ గ్రంథాలయాన్నే ఏర్పాటు చేసి.. దాన్నే తన నివాసంగా మలచుకున్నాడు. కండక్టర్.. బుక్ కలెక్టర్అంకే గౌడ్ ఓ వైపు కన్నడ సాహిత్యంలో పీజీ చదువుతూనే మరో వైపు బస్ కండక్టర్గా ఉద్యోగంలో చేరాడు. చిన్నప్పటి నుంచీ పుస్తకం పఠనం మీద ఆసక్తి మెండు. దానికి కాలేజీలో తన ్ర΄÷ఫెసర్ అనంతరాము ప్రభావం, స్ఫూర్తీ తోడవడంతో పుస్తకాలను కొనడమూ మొదలుపెట్టాడు. కండక్టర్గా తనకొచ్చే జీతంలో ము΄్పావుభాగం పుస్తకాల కొనుగోలు మీదే వెచ్చించేవాడు. పెళ్లయి, పిల్లాడు పుట్టి బాధ్యతలు పెరిగినా ఇంటి ఖర్చులను తగ్గించుకునేవాడు కానీ పుస్తకాల బడ్జెట్లో కోత పెట్టేవాడు కాదు. అతని ఆ ఆసక్తిని, అలవాటును సహధర్మచారిణి విజయలక్ష్మి గౌరవించి.. ఉన్నదాంట్లోనే ΄÷దుపుగా సంసారం చేయసాగింది. చివరకు తనకు నచ్చిన, లోకం మెచ్చిన పుస్తకాలను కొనడానికి అంకే గౌడ .. మైసూరులోని తమ ఇంటిని అమ్మినా మారుమాట్లాడకుండా భర్తను అనుసరించింది ఆమె. ప్రస్తుతం ‘బుక్ మానే’లోనే ఓ మూల ఆ కుటుంబం నివాసముంటోంది. అందరికీ ఉచితం1832 నాటి రాతప్రతులు సహా దేశ, విదేశీ భాషలన్నిటిలోని అరుదైన సాహిత్యం అంకే గౌడ ‘బుక్ మానే’లో కనిపిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, మైథాలజీ, ఫిలాసఫీలకు సంబంధించిన పుస్తకాలూ దొరుకుతాయి. ఈ లైబ్రరీకి ఎవరైనా వెళ్లి కావల్సిన పుస్తకాలను ప్రశాంతంగా చదువుకోవచ్చు. ప్రవేశ రుసుము కానీ, పుస్తకానికి అద్దె కానీ లేదు. పూర్తిగా ఉచితం. బడి పిల్లలు, రీసెర్చ్ స్కాలర్స్, సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నవాళ్లు, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ఈ లైబ్రరీకి రెగ్యులర్ విజిటర్స్. పర్యాటకుల గురించైతే విడిగా చెప్పక్కర్లేదు. ఎక్కడెక్కడి నుంచో ‘బుక్ మానే’ను చూడ్డానికి వస్తూంటారు. ‘పుస్తక పఠనం మీద ఆసక్తి, జ్ఞానతృష్ణ ఉన్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వచ్చి తమకు కావల్సింది చదువుకోగలిగేలా ఈ లైబ్రరీని మలచాలి.. ఓ నాలెడ్జ్ హబ్గా మార్చాలన్నదే నా కల, భవిష్యత్ లక్ష్యం’ అంటాడు అంకే గౌడ. -
ఆర్టీసీలో 1,743 ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్యోగ నియామకాలు జరగబోతున్నాయి. వేయి మంది డ్రైవర్లు, 743 మంది శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆర్టీసీలో జరగబోతున్న తొలి నియామక ప్రక్రియ ఇదే కావటం విశేషం. చివరిసారిగా 2012లో డ్రైవర్, కండక్టర్లను నియమించారు. ఆ తర్వాత మళ్లీ నియామకాలు జరగలేదు. ఉద్యోగ విరమణలతో భారీగా ఖాళీలు ఏర్పడినప్పటికీ, ఉన్న సిబ్బందితోనే ఆర్టీసీ నెట్టుకొస్తోంది. 2019లో ఒకేసారి ఏకంగా 2 వేల బస్సులను రద్దు చేయటం, పాత బస్సులను తుక్కుగా మార్చినప్పటికీ.. వాటి స్థానంలో చాలినన్ని కొత్త బస్సులు కొనకపోవటం తదితరాల వల్ల సమస్య తీవ్రత మరింత పెరగకుండా చూస్తూ వచ్చారు. భారీగా పదవీ విరమణలు సమీప భవిష్యత్తులో భారీగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీంతో డబుల్ డ్యూటీలు పెరిగి ఇప్పటికే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఇక మరింత భారం మోపితే పరిస్థితి అదుపు తప్పుతుందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీకి ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గతేడాదే ఇందుకు అనుమతి వచ్చినప్పటికీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. గతంలో తనకు కావల్సిన సిబ్బందిని ఆర్టీసీనే సొంతంగా నియమించుకునేది. కానీ, ప్రభుత్వం దాన్ని మార్చి ప్రభుత్వ ఉద్యోగాల నియామక బోర్డులకు బాధ్యత అప్పగించింది. దీంతో డ్రైవర్లు, శ్రామిక్ల పోస్టుల భర్తీ ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు దక్కింది. వారికే ఎక్కువ అవకాశం... డ్రైవర్ల సంఖ్య భారీగా తగ్గిపోవటంతో ఇటీవల ఆర్టీసీ తాత్కాలిక పద్ధతిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకుంది. దాదాపు 1,100 మంది డ్రైవర్లు తాత్కాలిక పద్ధతిలో గత నాలుగు నెలలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి నియామకాలకు నోటిఫికేషన్ రావటంతో వారు దరఖాస్తు చేయనున్నారు. నాలుగు నెలల నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతున్న అనుభవం సంపాదించినందున వారికే ఎక్కువ అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పదో తరగతి విద్యార్హత ఉండటంతో, ఆ అర్హత లేని వారికి మాత్రం అవకాశం ఉండదు. వీరితోనే సరి... వాస్తవానికి ఆర్టీసీలో ఉన్న డ్రైవర్ ఖాళీలు వేయికి మించి ఉన్నాయి. కానీ భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోబోతున్నారు. ఇప్పటికీ నగరంలో 225 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుండగా, మరో రెండు నెలల్లో ఇంకో 275 బస్సులు రాబోతున్నాయి. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద వచ్చే మార్చి నుంచి క్రమంగా 2,800 బస్సులు హైదరాబాద్కు రానున్నాయి. జిల్లాల్లో కూడా 500 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అద్దె బస్సులకు వాటి యజమానులే డ్రైవర్లను సమకూర్చాల్సి ఉన్నందున, ఆర్టీసీకి డ్రైవర్ల అవసరం తగ్గుతుంది. దీంతో ఇప్పుడు తీసుకునే వేయి మందితోనే ఉన్న బస్సులను తిప్పనున్నారు. ఇక 1500 కండక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ఆర్టీసీ ప్రతిపాదించినప్పటికీ, నోటిఫికేషన్లో వాటి ఊసు లేదు. ఇటీవల 500 మంది తాత్కాలిక కండక్టర్లను ఆర్టీసీ నియమించుకుంది. తదుపరి విడత కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం మెకానిక్లకు కూడా కొరత ఉంది. ఉన్న శ్రామిక్లకు పదోన్నతి ఇవ్వటం ద్వారా మెకానిక్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇప్పుడు 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచి్చనందున, వారు రాగానే ఉన్న శ్రామిక్లకు మెకానిక్లుగా పదోన్నతి ఇవ్వనున్నారు. -
ఆట పాటల శిక్షణ
‘ఆడుతూ పాడుతూ కూడా చదువు హాయిగా నేర్చుకోవచ్చు’ అంటాడు అక్షయ్ మసెల్కర్. ఉత్తర కర్నాటకలోని సిర్సి జిల్లాకు చెందిన అక్షయ్, బడి అంటే దూరంగా పారిపోయే విద్యార్థుల కోసం హ్యుమనాయిడ్ రోబోను తయారు చేశాడు. దానికి ‘శిక్షణ’ అని పేరు పెట్టాడు.ఎంత టీచర్ అయినప్పటికీ ‘శిక్షణ’ రూపం అచ్చం విద్యార్థిలాగే ఉంటుంది. ఒకటి నుంచి నాల్గో తరగతి విద్యార్థుల కోసం రూ΄÷ందించిన ఈ రోబో టీచర్ పిల్లలను నవ్విస్తూనే కన్నడ, ఇంగ్లీష్ భాషలలో పాఠాలు చెబుతుంది. గేయాలు పాడుతుంది. మాథ్స్ సులువుగా నేర్పిస్తుంది. ΄÷డుపు కథలు వేస్తుంది. ఒకటా రెండా... ఎన్నో ఎన్నెన్నో!}ఈ రోబో పుణ్యమా అని బడికి దూరంగా ఉండే పిల్లలు కూడా బడికి ఇష్టంగా రావడం విశేషం. తమ రోబో టీచర్కు సంబంధించిన విషయాలను రోజూ ఇంట్లో తల్లిదండ్రులకు చెబుతుంటారు.}అక్షయ్ తల్లి టీచర్గా పనిచేసేది. తానూ టీచర్ కావాలనుకోవడానికి అమ్మే స్ఫూర్తి. డిగ్రీ పూర్తయిన తరువాత ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేశాడు అక్షయ్. లెక్చరర్గా పనిచేస్తున్న కాలంలో విద్యావిధానం గురించి ఆలోచించేవాడు. ఈ క్రమంలోనే అతడికి కొత్త కొత్త ఐడియాలు వస్తుండేవి. అయితే తనకు వచ్చే వినూత్న ఆలోచనలను సాకారం చేసుకునే సమయం ఉండేది కాదు.కోవిడ్ కల్లోల కాలంలో బోలెడంత తీరిక దొరకడంతో తన ఐడియాలపై పనిచేసే అవకాశం వచ్చింది. పల్లెటూరు బడుల నుంచి పట్నం బడుల వరకు చాలా బడులలో బోధనకు సంబంధించిన శాస్త్రీయ విధానాన్ని అనుసరించడం లేదని, డ్రాయింగ్ చార్ట్లు, బ్లాక్బోర్డ్ తప్ప ఇతరత్రా ఉపకరణాలను ఉ పాధ్యాయులు ఉపయోగించడం లేదని గ్రహించాడు అక్షయ్.‘మొక్కుబడిగా బోధించడం కాకుండా వినూత్నమైన పద్ధతుల్లో విద్యార్థులకు చేరువ కావాలి’ అనుకున్న అక్షయ్ సంవత్సరానికి పైగా పరిశోధనలు చేశాడు. సంప్రదాయ బోధన, ఆధునిక సాంకేతికతను కలిపి రోబో టీచర్ను తయారుచేశాడు. ఈ రోబోను తయారు చేయడానికి రెండు లక్షల రూ పాయలు ఖర్చు అయింది. ఈ ఖర్చును తానే స్వయంగా భరించాడు.ఈ రోబోలో రెండు కార్డులు ఉంటాయి. మాస్టర్కార్డ్ అన్లాక్ కోసం, నార్మల్ కార్డ్ ఇష్టమైన ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. మొదట్లో ఈ రోబ్ను 25 స్కూల్స్లో ఉపయోగించారు. ఆ తరువాత మరిన్ని స్కూల్స్కు విస్తరించారు.‘రోబో టీచర్ను అక్షయ్ మాకు పరిచయం చేశారు. చాలా ఆసక్తిగా అనిపించింది. పిల్లలైతే ఎంతో సంతోషించారు. క్లాసులో కదలకుండా కూర్చుంటున్నారు. వారికి ఇది రోబో కాదు టీచర్, ఫ్రెండ్. పిల్లలకు మాత్రమే కాదు ఉ పాధ్యాయులకు కూడా రోబో ఎంతో ఉపయోగపడుతుంది. వారి భారాన్ని తగ్గిస్తోంది. సైన్స్, టెక్నాలజీ విషయాలపై ఆసక్తి పెంచుతుంది’ అంటుంది సిర్సిలోని మోడల్ హైయర్ ప్రైమరీ స్కూల్ సైన్స్, మ్యాథ్స్ టీచర్ సునైనా హెగ్డే.‘శిక్షణ’ రోబో దగ్గర మాత్రమే ఆగిపోలేదు అక్షయ్. విద్యారంగంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణల కోసం ‘ఎక్స్పిర్మైండ్’ స్టార్టప్ ద్వారా కృషి చేస్తున్నాడు.‘గ్రామీణ్ర పాంత పిల్లలకు టెక్నాలజీని పరిచయం చేయడమే కాదు భవిష్యత్లో వారు కూడా కొత్త ఆవిష్కరణలు చేసేలా స్ఫూర్తి కలిగించడం, ప్రోత్సహించడమే మా లక్ష్యం’ అంటున్నాడు అక్షయ్. -
ప్రధాని మోదీకి మెస్సీ జన్మదిన కానుక
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం (బుధవారం) సందర్భంగా క్రీడాలోకం శుభాకాంక్షలు తెలిపింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా... అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ 2022 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జెర్సీని బహుమతిగా పంపించాడు. రెండు మూడు రోజుల్లో మెస్సీ అందించిన జెర్సీని ప్రధానికి బహుకరించనున్నట్లు ప్రమోటర్ సతాద్రు దత్తా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్లో మెస్సీ భారత్లో పర్యటించనున్నాడు. ఇందులో భాగంగా కోల్కతా, ముంబై, ఢిల్లీలో అతడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ‘మెస్సీని కలిసినప్పుడు ప్రధాని 75వ పుట్టిన రోజు రానుందని చెప్పాను. దీంతో అతడు వరల్డ్కప్ విన్నింగ్ జెర్సీపై తన ఆటోగ్రాఫ్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాల్సిందిగా నాకు చెప్పాడు’ అని సతాద్రు దత్తా తెలిపారు. మెస్సీ పర్యటనలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా–2025’ పేరిట మెస్సీ పర్యటన కోల్కతా నుంచి ప్రారంభం కానుంది. 2011లో చివరిసారిగా మెస్సీ భారత్లో పర్యటించాడు. వెనిజులాతో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు అర్జెంటీనా జట్టు అప్పట్లో కోల్కతాకు వచ్చింది. మరోవైపు ఈ ఏడాది నవంబర్లో అర్జెంటీనా జట్టు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు కేరళాలోపర్యటించనుందని... ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దురెహమాన్ వెల్లడించారు. -
వరల్డ్ కప్ ఫైనల్కు మను, సురుచి, ఇషా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్కప్ ఫైనల్కు భారత్ నుంచి 8 మంది షూటర్లు అర్హత సాధించారు. ఈ ఏడాది డిసెంబర్ 4 నుంచి 9 వరకు ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మన దేశం నుంచి పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మనూ భాకర్తో పాటు మరో ఏడుగురు షూటర్లు బరిలోకి దిగనున్నారు. 12 వ్యక్తిగత ఒలింపిక్ ఈవెంట్లలో ఈ ఏడాది అత్యుత్తమ షూటర్ను నిర్ణయించేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. వీటిలో ఐదింట భారత షూటర్లు పోటీపడుతున్నారు. స్టార్ షూటర్ మనూ భాకర్ రెండు విభాగాల్లో వరల్డ్కప్ ఫైనల్కు ఎంపికైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్తో పాటు, 25 మీటర్ల విభాగంలో మను పోటీపడనుంది. ఇక ఈ సీజన్లో చక్కటి గురితో మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న టీనేజర్ సురుచి సింగ్ కూడా భారత్ నుంచి బరిలోకి దిగనుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో బ్యూనస్ ఎయిర్స్, లిమా, మ్యూనిక్లలో సురుచి పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల నింగ్బో ప్రపంచకప్లో స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ సైతం ఈ టోర్నీలో పాల్గొననుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఇషా పోటీపడనుంది. ప్రపంచ మాజీ చాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూతా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగానికి ఎంపికయ్యారు. రుద్రాంక్ష్ బ్యూనస్ ఎయిర్స్ వరల్డ్కప్లో స్వర్ణంతో మెరవగా... ఒలింపియన్ అర్జున్ లిమా ప్రపంచకప్లో రజతం గెలుచుకున్నాడు. ఆసియా చాంపియన్, ప్రపంచ రికార్డు హోల్డర్ సిఫ్ట్ కౌర్ సమ్రా... మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో, ఒలింపియన్ విజయ్వీర్ సిద్ధూ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో పోటీ పడనున్నారు. సిఫ్ట్ కౌర్ సమ్రా బ్యూనస్ ఎయిర్స్ ప్రపంచకప్లో స్వర్ణం గెలవగా... అదే పోటీలో విజయ్వీర్ పసిడి నెగ్గాడు.మహిళల 25 మీటర్ల విభాగంలో సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రార్ కూడా వరల్డ్కప్ ఫైనల్ అవకాశం దక్కించుకుంది. లిమా ప్రపంచకప్లో రజతం నెగ్గడం ద్వారా సిమ్రన్కు ఈ చాన్స్ దక్కింది. వరల్డ్కప్ ఫైనల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి వరుసగా 5000 యూరోలు (రూ. 5 లక్షల 20 వేలు), 4000 యూరోలు (రూ. 4 లక్షల 16 వేలు), 2000 యూరోలు (రూ. 2 లక్షల 8 వేలు) ప్రైజ్మనీగా లభిస్తాయి. ఈ ఏడాది జరిగిన నాలుగు వరల్డ్కప్ వేర్వేరు విభాగాల్లో కలిసి భారత షూటర్లు 22 పతకాలు సాధించింది. అందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్కు ‘హ్యాట్రిక్’ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన తొలి పోరులో టైటాన్స్ 29–33 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్కు ఇది వరుసగా మూడో పరాజయం కాగా... ఆడిన ఆరో మ్యాచ్లోనూ గెలిచిన దబంగ్ ఢిల్లీ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్లో భాగంగా వైజాగ్లో ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసుకున్న తెలుగు టైటాన్స్ జట్టు... పోటీలు జైపూర్కు తరలిన తర్వాత ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేదు. తాజా పోరులో టైటాన్స్ తరఫున కెప్టెన్ విజయ్ మలిక్ 5 పాయింట్లు సాధించగా... మన్జీత్, అజిత్ పవార్ చెరో 4 పాయింట్లు సాధించారు. మరోవైపు దబంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ 9 పాయింట్లు సాధించగా... సౌరభ్, ఫజల్ ఐదేసి పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో టైటాన్స్ 13 రెయిడ్ పాయింట్లు సాధించగా... ఢిల్లీ 15 ఖాతాలో వేసుకుంది. ట్యాక్లింగ్లో టైటాన్స్కు 12 పాయింట్లు దక్కగా... ఢిల్లీ 15 పాయింట్లతో ముందంజ వేసింది. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడిన టైటాన్స్ 3 విజయాలు, 5 పరాజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 43–32 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై గెలుపొందింది. హర్యానా తరఫున శివమ్ 15 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. పట్నా పైరెట్స్ తరఫున అయాన్ 7 పాయింట్లతో పోరాడాడు. లీగ్లో భాగంగా గురువారం జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగాల్ వారియర్స్, యు ముంబాతో పుణేరి పల్టన్ ఆడతాయి. -
అంధుల T20లో వైజాగ్ అమ్మాయి
‘నాకు బాల్ కనపడదు. కాని నా మైండ్తో, చెవులతో దాని రాకను పసిగట్టి కొడతాను’ అంటోంది విశాఖ అంధబాలిక పాంగి కరుణ కుమారి. పదో తరగతి చదువుతున్న కరుణ బ్యాటింగ్లో దిట్ట. అందుకే నవంబర్ 11న ఢిల్లీలో తొలిసారి నిర్వహించనున్న అంధుల టి20 వరల్డ్ కప్కి భారత జట్టులో ఎంపికైంది. తెలుగువారు సంతోషపడాల్సిన సందర్భం ఇది. స్ఫూర్తినిస్తున్న కరుణ కుమారి పరిచయం.స్కూలు పుస్తకాల్లో అక్షరాలు కనపడటం లేదని చదువు మానేసి ఇంట్లో కూచున్న అమ్మాయి నేడు భారత దేశ అంధ మహిళల క్రికెట్ జట్టులో స్థానం సం పాదించింది. ఆ అమ్మాయి పాంగి కరుణకుమారి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన అరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఢిల్లీలో నవంబర్ 11 నుంచి జరగనున్న అంధ మహిళల టి20 వరల్డ్ కప్లో ఆమె భారత్ తరఫున ఆడనుంది. అంధ మహిళల కోసం టి20 వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే ప్రథమం.ఆమె ఆల్రౌండర్వంట్ల మామిడిలో కూలినాలి చేసుకునే రాంబాబు, సంధ్యల మొదటి కుమార్తె కరుణ పుట్టుకతోనే దృష్టిలోపంతో పుట్టింది. ఒక కన్ను కొద్దిగా మరో కన్ను పూర్తిగా కనిపించేది కాదు. ఏడవ తరగతి వచ్చేసరికి చూపు దాదాపుగా పోవడంతో చదువు మానేసి ఇంట్లో కూచుంది. అయితే చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండేది. ఫోన్లో క్రికెట్ చూసేది. ఈ విషయం తెలిసి అంధ బాలికలను వెతికి చదివించే బాధ్యతతో విశాఖ అంధ బాలిక ఆశ్రమ పాఠశాల వారు కరుణ తల్లిదండ్రులను ఒప్పించి తమ స్కూల్లో చేర్పించారు. రెసిడెన్షియల్ స్కూల్ కావడం వల్ల అక్కడ కరుణ తిరిగి చదువులో, ఆటల్లో పడింది. క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి గమనించిన పీటీ మేడమ్ కరుణనుత్సహించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. మూడింటిలో ప్రతిభ చూపుతూ ఆల్రౌండర్గా ఎదిగింది కరుణ. నేషనల్ సెలక్షన్స్లో భాగంగా 2023లో హైదరాబాద్లో, 2024లో హుగ్లీలో, 2025లో కొచ్చిలో మేచెస్ ఆడింది. సెలెక్టర్ల దృష్టిలో పడింది.60 బాల్స్లో 100 పరుగులుఅంధ మహిళల టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక కోసం ఆగస్టు నెలలో బెంగళూరులో 20 రోజుల క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్లో కరుణ 60 బంతుల్లో 100 పరుగులు చేయడమే కాక 114 నాటౌట్గా నిలిచింది. బౌలింగ్లో, ఫీల్డింగ్లో కూడా ప్రతిభ చూపింది. దాంతో భారత జట్టుకు కరుణను సెలెక్ట్ చేశారు. ‘నాకు బాల్ కనపడదు. కాని దాని రాకను పసిగట్టగలను. బాల్ రాకను అర్థం చేసుకోలేనప్పుడు అది ఒంటికి తగిలి దెబ్బలయ్యేవి’ అని తెలిపింది కరుణ. ఆమె ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. ఇన్ని ప్రతికూలతల్లోనూ ప్రతిభ చూపుతోంది కరుణ.ఆరు దేశాలతో...అంధ మహిళల టి20 వరల్డ్ కప్లో మొత్తం ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ, బెంగళూరుల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, నే పాల్, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కలిసి 21 లీగ్ మేచ్లు, 2 సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ను ఆడనున్నారు. ఈ వరల్డ్ కప్లో మన దేశం కప్పు గెలవాలని, మన కరుణ గొప్ప ప్రతిభ చూ పాలని కోరుకుందాం. -
పతకంపై నీరజ్ గురి
టోక్యో: అంతా అనుకున్నట్లు జరిగితే... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఈరోజు భారత్ పతకాల బోణీ కొట్టనుంది. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత్ నుంచి డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా, రైజింగ్ స్టార్ సచిన్ యాదవ్ ఫైనల్కు అర్హత సాధించారు. భారత్కే చెందిన మరో ఇద్దరు జావెలిన్ త్రోయర్లు యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్ ఫైనల్కు చేరుకోలేకపోయారు. 2022 ప్రపంచ చాంపియన్షిప్లో రజత పతకం... 2023 ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా ‘హ్యాట్రిక్ పతకం’ లక్ష్యంగా నేడు మెడల్ రౌండ్లో బరిలోకి దిగనున్నాడు. బుధవారం జరిగిన జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ ఒక్క ప్రయత్నంలోనే ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్లో ఒక్కో జావెలిన్ త్రోయర్కు మూడు అవకాశాలు ఇస్తారు. జావెలిన్ను కనీసం 84.50 మీటర్ల దూరం విసిరిన వారు లేదా టాప్–12లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత పొందుతారు. గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ నీరజ్ తన మొదటి ప్రయత్నంలోనే జావెలిన్ను 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. గ్రూప్ ‘ఎ’.. గ్రూప్ ‘బి’ నుంచి ఓవరాల్గా ఏడుగురు జావెలిన్ త్రోయర్లు మాత్రమే అర్హత ప్రమాణాన్ని అధిగమించారు. మరో ఐదుగురికి ర్యాంక్ ప్రకారం ఫైనల్ బెర్త్ను కేటాయించారు. అర్హత ప్రమాణాన్ని అధిగమించిన ఏడుగురిలో నీరజ్ చోప్రాతోపాటు ఆండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 89.53 మీటర్లు), జూలియన్ వెబెర్ (జర్మనీ; 87.21 మీటర్లు), జూలియస్ యెగో (కెన్యా; 85.96 మీటర్లు), వెగ్నెర్ (పోలాండ్; 85.67 మీటర్లు), పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 85.28 మీటర్లు), కుర్టిస్ థాంప్సన్ (అమెరికా; 84.72 మీటర్లు) ఉన్నారు. ఓవరాల్గా 8 నుంచి 12 స్థానాల్లో నిలిచిన జాకుబ్ వెద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 84.11 మీటర్లు), కెషార్న్ వాల్కట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 83.93 మీటర్లు), సచిన్ యాదవ్ (భారత్; 83.67 మీటర్లు), కామెరాన్ మెసెన్టైర్ (ఆ్రస్టేలియా; 83.03 మీటర్లు), రుమేశ్ థరంగ (శ్రీలంక; 82.80 మీటర్లు) కూడా ఫైనల్లో చోటు సంపాదించారు.భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 53 నిమిషాల నుంచి పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ జరుగుతుంది. మరోవైపు ట్రిపుల్ జంప్ క్వాలిఫయింగ్లో భారత క్రీడాకారులు ప్రవీణ్ చిత్రవేల్ (16.74 మీటర్లు) 15వ స్థానంలో, అబూబకర్ (16.33 మీటర్లు) 24వ స్థానంలో నిలిచారు. 200 మీటర్లలో జాతీయ చాంపియన్ అనిమేశ్ కుజుర్ హీట్స్లోనే వెనుదిరిగాడు. -
‘సూపర్–4’కు పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో రెండో విజయంతో పాకిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ 41 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలవగా, ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. సయీమ్ అయూబ్ (0) వరుసగా మూడో మ్యాచ్లోనూ డకౌటై అంతర్జాతీయ టి20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు. ఫర్హాన్ (5), కెపె్టన్ సల్మాన్ ఆగా (27 బంతుల్లో 20), హసన్ (3), ఖుష్దిల్ (4), హారిస్ (18) ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షాహిన్ అఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునేద్ సిద్దిఖీ 4 వికెట్లు పడగొట్టగా, సిమ్రన్జీత్ సింగ్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం యూఏఈ 17.4 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా, ధ్రువ్ పరాశర్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, రవూఫ్, అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు చొప్పున తీశారు. నేడు జరిగే మ్యాచ్లో అఫ్గానిస్తాన్తో శ్రీలంక తలపడుతుంది. -
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ఆస్తిలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ద్వాదశి రా.12.18 వరకు, తదుపరి త్రయోదశి,నక్షత్రం: పుష్యమి ఉ.9.02 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.9.45 నుండి 11.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.42 వరకు తదుపరి ప.2.45 నుండి 3.33 వరకు, అమృత ఘడియలు: ఉ.9.54 నుండి 10.41 వరకు.సూర్యోదయం : 5.52సూర్యాస్తమయం : 5.59రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.... కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం.. యత్నకార్యసిద్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ఆస్తిలాభం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.మిథునం... వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.కర్కాటకం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.సింహం.... సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో జాప్యం. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.కన్య... ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కీలక సందేశం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.తుల.... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలో అవాంతరాలు తొలగుతాయి. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.వృశ్చికం... బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.ధనుస్సు.... పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. విలువైన పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.మకరం... కొత్త్త పనులు ప్రారంభిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.కుంభం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. కొన్ని బాకీలు సైతం అందుతాయి. వివాదాలు పరిష్కారం. దైవదర్శనాలు. కార్యసిద్ధి. వృత్తులు, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.మీనం...మిత్రులతో వివాదాలు. అనుకున్న ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. -
సమూలంగా మార్చేద్దాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా విధానంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. సరికొత్త తెలంగాణ విద్యా విధానం తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారిలో జ్ఞానం కొరవడిందని, జ్ఞానం ఉన్న వారికి భాషలో పట్టు లేదని అన్నారు. ఈ రెండూ ఉన్న వారిలో నైపుణ్యం ఉండటం లేదని చెప్పారు. దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, ఆ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగవ్వడం లేదని చెప్పారు. ఈ కారణంగా ఉద్యోగాలను సొంతం చేసుకోవడంలో యువత వెనుకబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో విద్యా బోధన సాగాలని, వచ్చే 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించనున్న ‘తెలంగాణ రైజింగ్–2047’లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు నేతృత్వంలో రాష్ట్ర విద్యా విధానం ఖరారుకు ఏర్పాటు చేసిన కమిటీతో బుధవారం సీఎం భేటీ అయ్యారు. విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు. అన్ని స్థాయిల్లో ప్రక్షాళన ‘విద్యా రంగం అభివృద్ధికి ఇప్పటివరకు జరిగిన కృషిపై ఏమాత్రం సంతృప్తి లేదు. ఈ రంగానికి భారీఎత్తున నిధులు కేటాయిస్తున్నా ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో ప్రారంభిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతున్నాయి. నర్సరీకి ప్రైవేటు పాఠశాలల్లో చేరిన వారు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడటం లేదు. విద్యార్థుల రాకపోకలకు వీలుగా ఉంటుందని, తగిన శ్రద్ధ చూపుతారనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకూ ప్రక్షాళన అవసరం. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. అత్యుత్తమ డాక్యుమెంట్ రూపొందించాలి ‘ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలుగా విభజించుకోవాలి. విద్యావేత్తలు తమ అభిరుచులకు అనుగుణంగా సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్ రూపొందించాలి. రాష్ట్రంలోని నిరుపేదలకు మేలు జరిగేలా కొత్త విద్యా విధానం ఉండేందుకు మేధావులు సలహాలివ్వాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల పేరిట విద్యార్థులను చిన్నతనం నుంచే వేరు చేస్తున్నాం. దానిని రూపుమాపి అంతా ఒకటే అనే భావన కలిగించాలి. విద్యాలయాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమలయ్యేందుకు వివిధ ఫౌండేషన్లు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలి..’ అని సీఎం చెప్పారు. నిధులు ఎంతైనా వెనుకాడం ‘ప్రభుత్వం కూడా ఈ దిశగా కృషి చేస్తోంది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్లు ఉండాలన్న లక్ష్యంతోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం. బదిలీలు, పదోన్నతులు కల్పించాం. యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. దేశంలో ఐటీఐలు ప్రారంభించినప్పుడు ఉన్న డీజిల్ ఇంజిన్ మెకానిక్, ఫిట్టర్ వంటి సంప్రదాయ కోర్సులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మేము అధికారంలోకి వచ్చాక ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులను తెచ్చాం. సరికొత్త విద్యా విధానం ఏర్పాటుకు ఎంత నిధులైనా వెనుకాడబోం. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మౌలిక వసతులు, ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించాం. విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నాం. విద్యా విధానంలో సిలబస్ రూపకల్పన, వనరుల సమీకరణ, విధానం అమలుపై స్పష్టత అవసరం..’ అని రేవంత్ అన్నారు. విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలి ‘విద్యా విధానం కమిటీ చైర్మన్ కె.కేశవరావు మాట్లాడుతూ..విద్యాలయాల్లో విద్యార్థి కేంద్రంగా, నాణ్యతకు పెద్ద పీట వేసేలా బోధన ఉండాలన్నారు. ఏకీకృత బోధన విధానం వల్లే తెలంగాణ విద్యారంగంలో మార్పు సాధ్యమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి చెప్పారు. ధనిక, పేద తారతమ్యం లేని, కులమతాల ప్రస్తావన లేని విద్యాలయాల ఏర్పాటు అవసరమన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని, ప్రతి తరగతికీ గది, ఉపాధ్యాయుడు ఉండాలని మరో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సూచించారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ శాంతాసిన్హా, విద్యావేత్తలు మోహన్ గురుస్వామి, సీఐఐ శేఖర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, అక్షర వనం మాధవరెడ్డి, ఫ్రొపెసర్ గంగాధర్, విశ్రాంత ఐఏఎస్లు మిన్నీ మాథ్యూ, రంజీవ్ ఆచార్య, తదితరులు నూతన విద్యా విధానంపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి, ఉన్నతాధికారులు జయేశ్ రంజన్, దేవసేన, కృష్ణ ఆదిత్య, నవీన్ నికొలస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెతసేపు తయారవుతార్సార్! త్వరగా వచ్చేయండీ!
ఇంకెతసేపు తయారవుతార్సార్! త్వరగా వచ్చేయండీ! -
మళ్లీ అమెరికాతో నెయ్యం
ఇది స్పీడ్ యుగం. కరచాలనాలైనా, కలహాలైనా ఎంత త్వరగా మొదలవుతాయో అంత త్వరగానూ కనుమరుగవుతాయి. భారత్–అమెరికాల సంబంధాల తీరు గమనిస్తే ఇది అర్థమవుతుంది. నెల్లాళ్ల క్రితం దాదాపు ఛిద్రమయ్యాయనుకున్న ఈ సంబంధాల్లో మళ్లీ సుహృద్భావం మొగ్గ తొడుగుతోంది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మంగళవారం న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య దూత బ్రెండాన్ లించ్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గంతో మన వాణిజ్య మంత్రిత్వ బృందం చర్చించాక అంగీకారం కుదిరింది. అంతేకాదు... ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ ఆయనకు ఫోన్చేసి శుభాకాంక్షలు చెప్పటం, దాన్ని ఎక్స్లో మోదీ ప్రస్తావించి రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలకు శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్ చొరవ తీసుకోవటాన్ని ప్రశంసించటం గమనించదగ్గవి. సరిగ్గా నెల్లాళ్ల క్రితం పరిస్థితి వేరు. రష్యా దురాక్రమణ యుద్ధం కొనసాగటానికి భారత్ వైఖరే ప్రధాన కారణమంటూ ట్రంప్ నిందించారు. అంత క్రితం ఆగస్టు మొదటి వారంలో విధించిన 25 శాతం సుంకాలతో పాటు రష్యా ముడిచమురు కొంటున్నందుకు ఆ నెల చివరిలో మరో 25 శాతం అదనంగా వడ్డించి దాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. కేవలం భారత్పై విషం కక్కడం కోసం నియమితులైనట్టుగా వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదలుకొని వాణిజ్యమంత్రి హొవార్డ్ లుత్నిక్ వరకూ ఇష్టానుసారం మాట్లాడారు. వీరిలో నవారో మిగిలినవారికన్నా భిన్నం. ఆయన ఆశువుగా అబద్ధాలాడగలరు. ఆధారాలతోగానీ, ఇరు దేశాల చారిత్రక సంబంధ బాంధవ్యాలతో గానీ ఆయనకు పనిలేదు. ఫలానా కులానికి లబ్ధి చేకూర్చటం కోసం భారత ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతోందని వ్యాఖ్యానించగలరు. ఇరు దేశాల మధ్యా చర్చలు మొదలవుతున్న తరుణంలో కూడా భారత్ను ‘ట్యారిఫ్ల మహారాజు’ అనగలరు. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించగలరు. మన దేశం ఎంతో సంయమనం పాటించబట్టే అయిదో రౌండ్ తర్వాత ఆగిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. మధ్యలో అనవసరంగా పేచీకి దిగి విపరీతాలకు పోయింది అమెరికాయే!భారత్పై అదనపు సుంకాలు విధించటాన్ని సవాల్ చేస్తూ అమెరికా సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణలో భారత్ రష్యా చమురుకొనటాన్ని ట్రంప్ సర్కారు కారణంగా చూపింది. ఇప్పుడు సుంకాలను వెనక్కి తీసుకుంటే ఆ కేసు బలహీనపడుతుంది.ట్రంప్కు దౌత్యపరమైన మర్యాదలు తెలియవు. తన చర్యల వల్ల అవతలి దేశం స్థానికంగా ఎదుర్కొనక తప్పని ఒత్తిళ్లేమిటో అర్థం కావు. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే సుంకాల్లో 95 శాతం కోత పెట్టడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. కానీ 43 శాతం మంది గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న సాగు రంగాన్ని పణంగా పెట్టడానికీ, చిన్న వ్యాపారుల, పాడిపరిశ్రమ రంగ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలకూ తాము వ్యతిరేకమని మన ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. జన్యుపరంగా మార్పిడి చేసిన మొక్కజొన్న మాకొద్దని చెబుతోంది. ఈ విషయంలో భారత్ మనోభావాలను అర్థం చేసుకోకుండా ఒక ధూర్త వ్యాపారిలా ట్రంప్ ప్రవర్తించారు. ఇప్పుడు తామే వెనక్కి తగ్గక స్థితిని సృష్టించుకున్నారు.తమ దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దక్షిణ కొరియా, జపాన్లు సాగిలపడటాన్ని చూసి అందరిపైనా ఆ వ్యూహమే పనికొస్తుందని ట్రంప్ భావించటమే ఇందుకు కారణం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో చెట్టపట్టాలేసుకున్నారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ను నెత్తిన పెట్టుకున్నారు. ఈ పరిణామాలతో భారత్ బెంబేలు పడుతుందని భావించారు. కానీ షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సమావేశానికి మోదీ చైనా వెళ్లటం, అక్కడి పరిణామాలూ గమనించాక జరగబోయేదేమిటో ఆలస్యంగానైనా గ్రహించక తప్పలేదు. భారత్కు తాను తప్ప దిక్కులేదనుకోవటం ఘోర తప్పిదమని గ్రహించారు. పర్యవసానంగానే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో వ్యాపారం తప్ప మరేం లేదన్న వైఖరిని ట్రంప్ విడనాడితేనే ప్రపంచంతో ఆయనకు సామరస్యం కుదురుతుంది. అలా కానట్టయితే నష్టపోయేది అమెరికాయే! -
వార్తలు రాయడమే నేరమా?
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది!’ కోట్లాది హిందు వుల మనోభావాలను గాయపరుస్తూ ఏపీ ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ ఇది. ఆ వెంటనే దానిని అందుకుని సనాతని వేషం కట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ‘ప్రకాశం బ్యారేజీని బోట్లతో ధ్వంసం చేయడానికి యత్నించారు’... ఇది కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చిన బోట్ల గురించి చంద్రబాబు చేసిన మరో విమర్శ. ఇలా అనేక అభియోగాలను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేశారు. వాటన్నిటిలో అత్యధిక భాగం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆపాదించి చేశారు. అలాగైతే ఎన్ని కేసులు పెట్టొచ్చు?అధికారంలోకి వచ్చాకే కాదు, అంతకు ముందు విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ నేతలు జగన్పై పలు తీవ్రమైన అభియో గాలు గుప్పించారు. ‘జగన్ ఏపీలో ప్రజల భూములన్నీ కొట్టేయడా నికి యత్నిస్తున్నారు; జగన్ పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇక పవన్ కల్యాణ్ అయితే 30 వేల మంది అమ్మాయిలు ఏపీలో తప్పిపోయారంటూ వలంటీర్లపై నిందలు వేశారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుంటే అప్పట్లో వారిపై ఎన్ని కేసులు పెట్టి ఉండవచ్చో! అలాంటి అబద్ధపు ఆరోపణలను ప్రచారం చేసిన ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టాలో! కానీ జగన్ టైమ్లో అలా చేయలేదు. వాటిని రాజకీయంగానే చూసి వదలివేశారు. ఇటీవలి కాలంలో ఏపీని పోలీసు రాజ్యంగా మార్చి, విపక్ష వైసీపీ వారిపైనే కాకుండా, తనకు గిట్టని ‘సాక్షి’ మీడియాపైనా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ సంగతులు గుర్తు చేయవలసి వచ్చింది.కేసులతో కొత్త రికార్డులురాజకీయ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ల ఆధారంగా మీడియాపై కేసులు పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అమరావతి వరద ముంపు గురించి మీడియాకు ఒక విషయం చెప్పారు. ఆ వరద నీటి మళ్లింపు వల్ల గుంటూరు చానల్కు గండి పడిందనీ, తత్ఫలితంగా పొన్నూరు ప్రాంతంలో సుమారు 70 వేల ఎకరాల పంట పొలాలు మునిగాయనీ ఆరోపించారు. ఆయన చెప్పిన విషయాలను ‘సాక్షి’ ప్రచురించింది. సాధారణంగా ప్రభుత్వ పక్షాన ఎవరైనా ఏమి చేయాలి? అది వాస్తవమా, కాదా? అన్నదానిని పరిశీలించి మీడియాకు వివరణ ఇచ్చి, వార్తను ప్రజలకు తెలియచేయాలని కోరవచ్చు. అలాకాకుండా సంబంధిత అధికారి ఒకరితో ‘సాక్షి’పై ఏకంగా కేసు పెట్టించారు. తాడేపల్లి పోలీసులు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డికి నోటీసు ఇచ్చి తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరారు. విశేషం ఏమిటంటే, ఇదే సమయంలో టీడీపీ మీడియా ఒక కథనాన్ని ఇస్తూ, అమరావతిలో వరద ముప్పు నివారణ కోసం ప్రభుత్వం ఆరు వేల కోట్లతో మరో రెండు ప్రాజెక్టులను చేపడుతోందని తెలిపింది. కేసులు అక్రమమని తెలిసినా, పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగక తప్పడం లేదు. ఆ మాట కొందరు పోలీసు అధికారులు జర్నలిస్టులకు వ్యక్తిగతంగా చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా రెడ్ బుక్ ఎఫెక్ట్ అనీ, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికీ, ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికీ ఇలాంటి అసంబద్ధ చర్యలకు దిగుతోందని తెలుస్తోంది. ‘సాక్షి’ గొంతు నొక్కివేస్తే తమను ప్రశ్నించేవారు ఉండ రని పెద్దలు భావిస్తున్నారేమో తెలియదు.మరో వార్త చూడండి. అవినీతి కారణంగానే పోలీసు అధికా రుల ప్రమోషన్లను జాప్యం చేస్తున్నారని ‘సాక్షి’ స్టోరీ ఇచ్చింది. దానికి పోలీస్ పెద్దలకు కోపం వచ్చిందట. అది నిజం కాకపోతే వారు ఖండించవచ్చు. కానీ, పోలీసు ఉద్యోగుల సంఘం నేతతో కేసు పెట్టించేశారు. గతంలో ఈ తరహా వార్తలు మీడియాలో వస్తే సదరు సంఘం నేతలు వివరణ ఇచ్చేవారు. పాపం... ఇప్పుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కానీ, మరికొందరు టీడీపీ నేతలు, జనసేన క్యాడర్గానీ కొంతమంది పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈ సంఘం నేతలు నోరు మెదపలేకపోతున్నారు. కానీ ‘సాక్షి’ మీద సంఘం అధ్యక్షుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, అర్ధరాత్రి వేళ ‘సాక్షి’ ఆఫీస్కు పోలీసులు వచ్చి హడావిడి చేయడం జరిగింది. ఈ కేసులో కూడా విచా రణకు నోటీసులు ఇచ్చారు. ఆ విచారణకు ఎడిటర్ ధనంజయ రెడ్డితో పాటు సీనియర్ పాత్రికేయులు హాజర య్యారు. ఆ సందర్భంలో ఏ పోలీసు అధికారులు ఆ సమాచారం ఇచ్చారో చెప్పాలని కోరారట! జర్నలిజం సూత్రాల ప్రకారం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రహస్యంగా ఉంచాలి. అయినా ఆ వివరాలు కోరారు. ఆ పోలీసు అధికారులకు కూడా తమ శాఖలో జరుగుతున్న పరిణామాలు తెలిసే ఉండాలి. ఏ అధికారులు ప్రమోషన్లు పొందలేక పోయారో, దానికి కారణాలు ఏమిటో వారికి తెలిసి ఉండాలి. కానీ పై స్థాయి నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని అర్థం అవుతుంది.ద్వంద్వ ప్రమాణాలుఇంకో ఉదంతం చూద్దాం. రాయలసీమకు చెందిన ఒక పోలీసు అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై ‘సాక్షి’ ఒక వార్తను ఇచ్చింది. ఆ అధికారి పేరు రాయలేదు. తమకు వచ్చిన సమాచారంలో నిజం ఉందని నమ్మితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుని కథనాలు ఇస్తుంటారు. ఈ స్టోరీపై సీనియర్ అధికారికి ఆగ్రహం వచ్చింది. వేరే అధికారిని పిలిచి కేసు పెట్టించారు. ఆ అధికారి తను ఏ తప్పు చేయకపోతే, ఆ కథనం తనను ఉద్దేశించి రాశారన్న అభిప్రాయం కలిగితే ధైర్యంగా మీడియా సమావేశం పెట్టి తన వాదనను వినిపించి ఉండవచ్చు. తన పరువుకు భంగం కలిగించారని నోటీసు ఇచ్చి ఉండవచ్చు. అలా చేయకుండా మరొకరితో కేసు పెట్టించడంలోనే డొల్లతనం ఉందనిపిస్తుంది.ఏపీ పోలీసుల ప్రవర్తనకు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిన వైనమే పెద్ద శాంపుల్. తమ ఓట్లు తమను వేయనివ్వాలని కొందరు ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారంటే అది పోలీస్ వ్యవస్థకు ఎంత అప్రతిష్ఠో ఊహించుకోవచ్చు. కోర్టులలో బెయిల్ రాకుండా ఉండటం కోసం సంబంధం ఉన్నా, లేకపోయినా తోచిన సెక్షన్లు పెట్టి రిమాండ్ ఉత్తర్వులు వచ్చేలా చేయడంలో ఏపీ పోలీసులు స్పెషలైజేషన్ సంపాదించారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ వారిపై వీలైనన్ని కేసులు పెట్టడం... అదే టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ సమక్షంలోనే గూండాయిజానికి పాల్పడినా నిస్సహాయంగా ఉండిపోవడం సమాజానికే ప్రమాదకరమని చెప్పక తప్పదు. రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు చేసిన గూండాయిజం తెలిసిందే! ‘సాక్షి’ టీవీ చర్చలో అభ్యంతర పదం వాడారని అంటూ కూటమి నేతలే కొంతమందిని పురిగొల్పి కృత్రిమ ఆందోళనలు చేయించారు. రాజకీయాలు ఎలా ఉన్నా, పోలీసు వ్యవస్థ ధర్మంగా, నిష్పక్షపాతంగా లేకపోతే అది సమాజానికి హానికరం. పోలీసులకు ప్రామాణికం రెడ్ బుక్ కాదనీ, రాజ్యాంగమనీ ఎప్పటికి గుర్తిస్తారో!కొమ్మినేని శ్రీనివాసరావువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అతడికి 22, ఆమెకు 35.. పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయతీ
పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన ఓ మహిళకు పెద్దపల్లి మండలం అప్పన్న పేటలో నివసించే అరవింద్తో స్నాప్ చాట్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయితే అతడికి 22, ఆమెకు 35 సంవత్సరాలు. అంతే కాదు ఆమె ఓ వివాహిత. తనకు 12 సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు.వీరి ప్రేమ వ్యవహారం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలియడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశాడు ఆ మహిళ భర్త. ఏం చేయాలో పాలుపోక ప్రియుడు అరవింద్ ఇంటి ముందు బైఠాయించి పెళ్లి చేసుకోవాలని వేడుకున్న ప్రియురాలు. 12 సంవత్సరాల వయసు గల పిల్లలున్న మహిళతో పెండ్లి ఎలాగని తలలు పట్టుకుంటున్న అరవింద్ కుటుంబ సభ్యులు. ఇరు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన స్నాప్ చాట్ వ్యవహారం. పోలీస్ స్టేషన్కు చేరిన స్నాప్ చాట్ ప్రేమ పంచాయతీ. ఇరు కుటుంబాలను కౌన్సిలింగ్ కోసం పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు -
జాన్ అలుకాస్ కార్ల కలెక్షన్లో ఈ కొత్త కార్ హైలైట్..
చాలా మందికి కారును సొంతం చేసుకోవడం అంతిమ కల. కానీ జాన్ అలుకాస్కు అలా కాదు.. బెస్ట్ కార్ తన గ్యారేజ్లో ఉండాల్సిందే. కేరళకు చెందిన బిలియనీర్, ప్రఖ్యాత జ్యువెలరీ రిటైల్ గ్రూప్ జోస్ అలుక్కాస్ సీఈవో తన లగ్జరీ కార్ల కలెక్షన్లో భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ఎంజీ సైబర్స్టర్ను జోడించారు.అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్స్టర్ఎంజీ సైబర్స్టర్ ఒక సాధారణ స్పోర్ట్స్ కారు కాదు. ఇది క్లాసిక్ డిజైన్ , మోడరన్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) టెక్నాలజీల అద్భుతమైన కలయిక. ఇది అలుక్కాస్ వంటి ఆటోమొబైల్ ఔత్సాహికులకు సరిగ్గా సరిపోతుంది.ఈ కారు 510 హార్స్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ తో ప్యాక్ అయింది. సైబర్స్టర్ కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్ స్టర్లలో ఒకటిగా నిలిచింది.బటర్ఫ్లై డోర్లు, సొగసైన కన్వర్టిబుల్ రూఫ్, 20-అంగుళాల చక్రాలతో దీని ఫ్యూచరిస్టిక్ లుక్ అబ్బురపరుస్తుంది. 77 కిలోవాట్ల బ్యాటరీతో ఈ కార్ 580 కిలోమీటర్ల రేంజ్ను (వాస్తవ ప్రపంచ పరిస్థితులలో సుమారు 400 కిమీ) ఇస్తుంది. దీని ధరలు రూ.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. సైబర్ స్టర్ ఇప్పటికే ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తరంగాలను సృష్టిస్తోంది.ఆటోమొబైల్స్ పట్ల జాన్ అలుకాస్కు ఉండే ఇష్టం రహస్యమేమీ కాదు. లగ్జరీ కార్లలో అసాధారణమైన అభిరుచికి ఆయన చాలా కాలంగా ప్రసిద్ది చెందారు. ఆయన ఆకట్టుకునే కార్ల కలెక్షన్లో ఇప్పటికే లంబోర్ఘిని హురాకాన్, రోజువారీ డ్రైవ్ ల కోసం పోర్స్చే 911, మహీంద్రా థార్ 3-డోర్, మహీంద్రా బీఈ6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఉన్నాయి. ఇప్పుడు ఎంజీ సైబర్ స్టర్ చేరింది. -
హాలీవుడ్ బ్యూటీకి జాక్పాట్.. ఏకంగా రూ.530 కోట్లా?
సినీ ఇండస్ట్రీలో పారితోషికాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకైతే ఏకంగా వంద కోట్లు ముట్టజెప్పాల్సిందే. కొందరు బిగ్ స్టార్స్ ఏకంగా వంద కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్ల విషయానికొస్తే పారితోషికాలు అంత ఎక్కువగా ఉండవు. హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్లో పదిశాతం కూడా ఉండకపోవచ్చు. అలాంటిది ఒక హీరోయిన్కు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది? అది మన బాలీవుడ్ సినిమాలో ఇంతలా భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ సిడ్నీ స్వీనీ కోసం బాలీవుడ్ మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. 'యుఫోరియా', 'ది వైట్ లోటస్' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న సిడ్నీ త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ బాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఈ బిగ్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.ఓ నివేదిక ప్రకారం 28 ఏళ్ల సిడ్నీ స్వీనికి ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 530 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చేందుకు సంప్రదించిందని టాక్. ఒకవేళ ఆమె ఈ డీల్ అంగీకరిస్తే బాలీవుడ్ సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ జరగనుందని సమాచారం. మొదట ఈ ఆఫర్ చూసి సిడ్నీ స్వీనీ ఆశ్చర్యపోయిందని ఓ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ బిగ్ డీల్కు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సిడ్నీ తరఫున ప్రతినిధులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.ప్రస్తుతం సిడ్నీ స్వీనీ 'క్రిస్టీ' అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో యూఎస్ పోరాట యోధురాలు క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఆ తర్వాత సిడ్నీ నటించిన మరో చిత్రం 'ది హౌస్మెయిడ్' డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Sydney Sweeney (@sydney_sweeney) -
స్వదేశీ రక్షణ రంగ బలోపేతం ద్వారానే దేశ భద్రత
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ (CIA)-చర్లపల్లి నోటిఫైడ్ మునిసిపల్ ఇండస్ట్రియల్ ఏరియాస్ సర్వీస్ సొసైటీ (CNMIASS) సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ (బుధవారం) సాయంత్రం ‘‘ప్రోగ్రెసివ్ డిఫెన్సె ఇండస్ట్రీ-ప్రోగ్రెస్ అఫ్ డిఫెన్సె ఇండస్ట్రీ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ హైదరాబాద్” అనే అంశంపై సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత ప్రాముఖ్యత గురించి వివరించారు. స్వదేశీ రక్షణ రంగ బలోపేతం ద్వారానే దేశ భద్రత, సాంకేతిక స్వావలంబన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భాన్ని స్మరించుకుంటూ, తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమల పాత్రను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీఐఏ అధ్యక్షులు డీఎస్ రెడ్డి, సీఎన్ఎంఐఏఎస్ఎస్ ఛైర్మన్ డా.కే గోవిందరెడ్డి, ప్రొఫెసర్ డా. కాశిరెడ్డి వెంకటరెడ్డి, పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు. -
మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి
అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకాండ కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికాపై సుడిగాలి శతకంతో (60 బంతుల్లో 141 నాటౌట్; 15 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన అతను.. ఇవాళ (సెప్టెంబర్ 17) పసికూన ఐర్లాండ్పై అదే తరహాలో రెచ్చిపోయాడు.మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐర్లాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో ఆది నుంచే బ్యాట్ ఝులిపిస్తూ విధ్వంసం సృష్టించాడు. 46 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి గెలుపు ఖరారయ్యాక ఔటయ్యాడు.సాల్ట్ వీర ఉతుకుడు ధాటికి ఇంగ్లండ్ మరో 14 బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ అంచనాలకు మించి భారీ స్కోర్ చేసింది. హ్యారీ టెక్టార్ (36 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోర్కన్ టక్కర్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగిపోయారు. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (34), రాస్ అదైర్ (26) కూడా సత్తా చాటారు.ఐరిష్ బ్యాటర్ల ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఓవర్టన్, డాసన్, ఆదిల్ రషీద్ మాత్రం తలో వికెట్ తీశారు.197 పరుగుల లక్ష్య ఛేదనలో సాల్ట్ తొలి బంతి నుంచే డ్యూటీకి ఎక్కాడు. అతనికి బట్లర్ (10 బంతుల్లో 28), జేకబ్ బేతెల్ (16 బంతుల్లో 24), సామ్ కర్రన్ (15 బంతుల్లో 27) తోడయ్యారు. మ్యాచ్ను మరింత వేగంగా ముగించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్లు కోల్పోయారు. రెహాన్ అహ్మద్ 8, టామ్ బాంటన్ 11 పరుగులకు ఔటయ్యారు. ఓవర్టన్ బౌండరీతో మ్యాచ్ను ముగించాడు. ఐరిష్ బౌలర్లలో హంఫ్రేస్, హ్యూమ్ తలో 2, హ్యారీ టెక్టార్, గెరాత్ డెలానీ చెరో వికెట్ తీశారు. ఈ సిరీస్లోని రెండో టీ20 సెప్టెంబర్ 19న డబ్లిన్లోనే జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ ఐర్లాండ్లో పర్యటిస్తుంది. -
హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిశాపఠానీ ఇంటిపైకి కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ప్రముఖ అంతర్జాతీయ నేరస్థుల ముఠా సభ్యులైన ఈ ఇద్దరిని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగర సివిల్ లైన్స్ ఏరియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆ రోజు తెల్లవారు జామున సరిగ్గా 3.45 నిమిషాలకు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా ముఠాకు చెందిన రవీంద్ర, అరుణ్లు ఈ కాల్పులు జరిపారు. అయితే, ఈ కాల్పుల ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిందితులు ఎక్కడున్నా వారిని పట్టుకుని తీరుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు.ఆ మరుసటి రోజే ఘాజియాబాద్లోని ట్రోనికా సిటీలో ఎస్టీఎఫ్ నోయిడా యూనిట్, ఢిల్లీ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి తుపాకీ,బుల్లెట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) అమితాబ్ యష్ తెలిపారు. ఇటీవల,దిశా పటానీ సోదరి,మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. -
వస్తున్నాయ్ కొత్త ఐపీవోలు.. కొనుక్కోండి షేర్లు
సోలార్ ఫొటొ వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ. 442–465 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. కంపెనీ లిస్టయితే రూ. 5,910 కోట్ల మార్కెట్ విలువను అందుకునే వీలుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది.ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 477 కోట్లు సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేయనుంది. ఒడిషాలోని గోపాల్పూర్ ఇండ్రస్టియల్ పార్క్లో 4 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. మరో రూ. 166.5 కోట్లు అనుబంధ సంస్థ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. 2025 జూన్30కల్లా 3.8 గిగావాట్ల సోలార్ ఫొటొవోల్టాయిక్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సోలార్ ప్రాజెక్టులకు ఎండ్టుఎండ్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ సంబంధ సర్వీసులను కంపెనీ సమకూర్చుతోంది.జీకే ఎనర్జీ @ రూ. 145–153 సౌర విద్యుత్(సోలార్ పవర్) ఆధారిత వ్యవసాయ నీటి పంప్ సిస్టమ్స్ అందించే జీకే ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ. 145–153 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 65 కోట్ల విలువైన 42 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 465 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను విక్రయించనుంది.ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 323 కోట్లు కంపెనీ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. సోలార్ పవర్ వ్యవసాయ పంప్ సిస్టమ్స్కు కంపెనీ పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కమిషనింగ్(ఈపీసీ) సేవలు సమకూర్చుతోంది. తద్వారా రైతులకు వీటికి సంబంధించిన సర్వే, డిజైన్, సప్లై, అసెంబ్లీ, ఇన్స్టలేషన్, టెస్టింగ్, నిర్వహణ తదితర ఏకీకృత సర్వీసులు అందిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 98 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
మంధన విధ్వంసకర శతకం.. ఆసీస్ను చిత్తుగా ఓడించిన టీమిండియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది.ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. భారత ఇన్నింగ్స్లో మంధన మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29), ప్రతిక రావల్ (25), స్నేహ్ రాణా (24) పర్వాలేదనిపించారు.హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్లో సదర్ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో భారత్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది. -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఏపీలో భారీగా టికెట్ ధరల పెంపు
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
Asia Cup 2025: పాక్ 'బాయ్కాట్' బెదిరింపులకు తలొగ్గని ఐసీసీ
నో హ్యాండ్షేక్ ఉదంతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. పైక్రాఫ్ట్ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్ రూమ్ల నుంచి బయటకు రానివ్వలేదు.దీంతో ఆసియా కప్లో పాక్ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్షేక్ ఉదంతంతో పైక్రాఫ్ట్ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్-యూఏఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్లో భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అలాగే ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది. -
ఆ ఆదాయం ఎక్కడికి పోతోంది.. వైఎస్సార్సీపీ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఎక్సైజ్ ఆదాయం తగ్గటంపై వైఎస్సార్సీపీ ఆశ్చర్య వ్యక్తం చేసింది. మద్యం షాపులు, బెల్టు షాపులు, పర్మిట్ రూముల ఏర్పాటు ద్వారా మద్యం విక్రయాలు భారీగా పెరిగినా ఆదాయం తగ్గటంపై మండిపడింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతోందంటూ ట్వీట్ చేసింది.ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇలా పక్కదారి పట్టడంపై ప్రజలు కూడా ఆలోచించాలి. టీడీపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానంలో అనేక మార్పులు చేసింది. మద్యం షాపులను తమవారి చేతిలో పెట్టారు. మద్యం దుకాణాలను విపరీతంగా పెంచారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించారు. పర్మిట్ రూమ్లను మళ్ళీ ప్రవేశపెట్టారు. ఇవన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లోనే అమల్లోకి తెచ్చారు. ఈ చర్యల వలన సహజంగానే మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఎక్సైజ్ ఆదాయాలు గణనీయంగా పెరగాలి. కానీ కాగ్ నివేదికలో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ పేర్కొంది.ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయని 2024-25 తొలి ఐదు నెలల్లోనే ఎక్సైజ్ ఆదాయం రూ. 6,782.21 కోట్లు. మద్యం పాలసీలో మార్పులు వచ్చాక 2025-26 తొలి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం మాత్రమే ఆదాయ వృద్ధి నమోదైంది. సాధారణ పరిస్థితుల్లో కూడా సహజంగా 10 శాతం వృద్ధి ఉంటుంది. కానీ అన్ని మార్పులు చేసినా ఆదాయ వృద్ధి తగ్గటం ఆశ్చర్యమేస్తోంది. ఇది రాష్ట్ర ఖజానాకు విపరీతమైన నష్టం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భారీ అవినీతి, అక్రమాల వలనే రాష్ట్ర ఆదాయం క్షీణించింది. ప్రజల కష్టార్జితం అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిపోతోంది’’ అంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.With respect to excise revenues, the @JaiTDP alliance Government, privatized retail operations of liquor, increased number of shops, encouraged illegal belt shops and reintroduced illegal permit rooms. All these policy changes should have resulted in huge increase in liquor… pic.twitter.com/A3aKO0eysQ— YSR Congress Party (@YSRCParty) September 17, 2025 -
సరే కొనేసుకోండి.. జేపీ కొనుగోలుకి సీసీఐ ఓకే
రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్ అసోసియేట్స్(జేపీ) కొనుగోలుకి తాజాగా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ను అనుమతించింది. దీంతో దివాలా చట్ట చర్యలలో భాగంగా జేపీని సొంతం చేసుకునేందుకు పీఎన్సీ ఇన్ఫ్రాకు దారి ఏర్పడనుంది. దివాలా పరిష్కారంకింద దాఖలు చేసిన బిడ్ గెలుపొందే వీలుంది.తద్వారా జేపీలో కనీసం 95 శాతం, గరిష్టంగా 100 శాతం వాటా కొనుగోలుకి సీసీఐ.. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లేదా భవిష్యత్లో పూర్తి అనుబంధ సంస్థగా ఎస్పీవీ ఏర్పాటు ద్వారా జేపీలో వాటాను సొంతం చేసుకునేందుకు అనుమతించింది. వెరసి జేప్రకాష్ అసోసియేట్స్ కొనుగోలుకి పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసినట్లు సీసీఐ తాజాగా ఎక్స్లో పోస్ట్ చేసింది.కాగా.. జేపీ రుణ పరిష్కార ప్రణాళికను ప్రతిపాదించే సంస్థకు సీసీఐ అనుమతి తప్పనిసరంటూ ఐబీసీ నిబంధనల సమీక్ష తదుపరి సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో జేపీ రుణ పరిష్కార ప్రణాళికకు బిడ్ దాఖలు చేసే సంస్థ సీసీఐ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. -
బాక్సాఫీస్ మాత్రమే కాదు.. ఓటీటీలోనూ సంచలనమే!
ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ను షేర్ చేసింది. ఈ చిత్రం ద్వారా అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది.ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సైయారా ఓటీటీలోనూ తగ్గేదేలే అంటోంది. ఓటీటీకి వచ్చిన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్గా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో సైయారా కొనసాగుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ చిత్రం 'ఫాల్ ఫర్ మీ', హిందీ మూవీ 'ఇన్స్పెక్టర్ జెండే'లను అధిగమించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే అగ్రస్థానానికి చేరుకుంది, 'ఫాల్ ఫర్ మీ' మూవీతో సహా అనేక చిత్రాలను దాటేసింది.ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో సైయారా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం 3.7 మిలియన్ల వ్యూస్తో పాటు 9.3 మిలియన్ గంటల వీక్షణలతో దూసుకెళ్తోంది. జర్మన్ థ్రిల్లర్ మూవీ 'ఫాల్ ఫర్ మీ' 6.5 మిలియన్ గంటల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మనోజ్ భాజ్పాయ్ నటించిన 'ఇన్స్పెక్టర్ జెండే' 6.2 మిలియన్ గంటల వీక్షణలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' 2.5 మిలియన్ గంటల వ్యూస్తో తొమ్మిదో స్థానంలో ఉంది. -
ఇది ఓ కార్పొరేట్ ఉద్యోగి క(ఖ)ర్మ!
కార్పొరేట్ ప్రపంచం చాలా చిత్రమైంది. ఒక పైసా ఖర్చు మిగిల్చేందుకు వంద రూపాయలు తగలేసేందుకూ సిద్ధం. ఇది కూడా అట్లాంటి వ్యవహారమే. కంపెనీ ఊరూ, పేరు తెలియదు కానీ.. సామాజిక మాధ్యమం రెడిట్లో ప్రచురితమైన వివరాల ప్రకారం...అతడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. గాడిద చాకిరీ చేస్తున్నానని తనే చెప్పుకున్నాడు కూడా. ఈమధ్యే వార్షిక ఇంక్రిమెంట్ల ప్రహసనం ముగిసింది. ఊహించినట్టుగానే జీతం జానెడే పెరిగింది. ‘‘జీతం కనీసం పది శాతమైనా పెంచండి సారూ’’ అంటూ పైవాళ్లకు మెయిల్ పెట్టాడు. పైనున్న మేనేజర్.. ఆ పైనున్న హెచ్ఆర్ వాళ్లు ఏమనుకున్నారో.. ఎలా ఆలోచించారో తెలియదు కానీ.. ‘‘ఠాట్.. పది శాతం పెంచమంటావా’’ అంటూ హూంకరించారు.‘‘నిన్ను ఉద్యోగం లోంచి పీకేశాం. ఫో’’ అనేశారు. కంపెనీ కదా.. ఆమాత్రం పైచేయి చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆఫ్ట్రాల్ ఒక ఉద్యోగి విజ్ఞప్తిని మన్నిస్తే.. అందరూ మీదపడిపోతారు అనుకుని ఉంటుంది. తొలగించనైతే తొలగించారు కానీ.. అప్పటివరకూ ఆ ఇంజినీర్ చేసే పని? అర్జెంటుగా ‘‘సిబ్బంది కావలెను’’ అన్న సందేశం వెళ్లిపోయింది. హడావుడిగా మెయిళ్లు అటు ఇటూ కదిలాయి. బోలెడంత మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరకు ఆరు మందిని సెలెక్ట్ చేశారు. మంచి ప్యాకేజీలతో వారి జీతాలూ ఫిక్స్ చేసేశారు. ఆ ఒక్కడు చేసే పనిని వీరందరూ కలసికట్టుగా చేయడం మొదలుపెట్టారు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల వ్యవహారం ఇలా ఉంటుందన్నమాట.పది శాతం పెంపును నిరాకరించి ఉద్యోగంలోంచి తొలగించిన ఆ ఉద్యోగి ఆరేళ్లపాటు కంపెనీకి సంబంధించిన కీలకమైన బ్యాకెండ్ వ్యవస్థను ఒంటిచేత్తో నడిపిస్తున్నాడట. ముందుగా చెప్పినట్లు గాడిద మాదిరిగా ఆ బాధ్యతంతా తలపై మోసుకుని కష్టపడినా.. సహోద్యోగుల కంటే తక్కువ జీతం వస్తూండటంతో ఉండబట్టలేక జీతం పది శాతం పెంచమని అడిగాడట. ఇక లాభం లేదనుకుని కంపెనీ పనులపై శ్రద్ధ తగ్గించేశాడు. ఇతగాడి ఖర్మానికో, పుణ్యానికో అప్పుడే కంపెనీలో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి చేరాడు. ఆఫీసుకు సక్రమంగా రావడం లేదన్న మిషతో ఉద్యోగంలోంచి తీసేశాడు. ఫలితం.. ఒకరి స్థానంలో ఆరుగురికి జీతాలు సమర్పించుకోవాల్సి రావడం. ‘‘పదిశాతం పెంచేసి ఉంటే గొడవే ఉండకపోవను. అయితే ఒక్కటి. ప్రపంచంలో న్యాయం అనేది ఇంకా ఉంది అనేందుకు ఇదో నిదర్శనం’’ అని ఆ ఉద్యోగి తన రెడిట్ పోస్టులో రాసుకోవడం అక్షర సత్యం అనిపిస్తుంది! ఏమంటారు? -
తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ పేరిట అక్రమాలు
తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ సంఘం అధ్యక్షుడు డి.సాయిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సంబంధం లేని వ్యక్తులు నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో తమ సంఘాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. కోదాడకు చెందిన శ్రుతి అనే మహిళ తమ సంఘం పేరిట అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ సంఘంతో సంబంధమే లేని ఆమె.. నకిలీ వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ను ఏర్పాటు చేసి అక్రమంగా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. గతంలో వేసిన అడ్హక్ కమిటీకి చైర్మన్గా ఉన్న సుబ్రమణ్యం, వెంకటరమణ, హన్మంత్రాజ్తో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.సభ్యత్వమే లేని సంఘాలకు ఓటు హక్కు కల్పించి, సభ్యత్వం ఉన్న సంఘాల గుర్తింపు రద్దు చేశారని అన్నారు. నకిలీ సంఘాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. శ్రుతి నడుపుతున్న సంఘంలో పోలీసు, ఐటీ, పోస్టల్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వీరిలో సగం మందికి వారు సభ్యులుగా ఉన్న విషయమే తెలీదని అన్నారు.జాతీయ వెయిట్లిఫ్టింగ్ సంఘంలోని ఓ పెద్ద మనిషి, శాట్లోని ఓ డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అండదండలతో శ్రుతి పేట్రేగిపోతుందని ఆరోపించారు. ఈ విషయాన్ని క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ వెయిట్లిఫ్టింగ్ సంఘం పేరిట శ్రుతి చేస్తున్న అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. -
బంగారంపై బిగ్ న్యూస్ అంటున్న రిచ్డాడ్ కియోసాకి
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి బిగ్ న్యూస్ అంటూ మరో సమాచారంతో ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ‘401(కె)’ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛనిస్తుందని, తనకు అనుకూలమైన బంగారం, వెండి, బిట్ కాయిన్ల విలువను మరింత పెంచుతుందని ఆనందం వ్యక్తం చేశారు.ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన 401(కె) రైటర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ అద్భుతమంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో రాబర్ట్ కియోసాకి ఓ పోస్ట్ పెట్టారు. తన స్నేహితుడు ఆండీ షెక్ట్మాన్ ప్రకారం.. ఆగస్టు 7న అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (401k)పై సంతకం చేశారని, అది ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛను ఇస్తుందని పేర్కొన్నారు.మ్యూచువల్ ఫండ్స్.. లూసర్లకు‘మీలో చాలా మందికి తెలుసు కదా.. నేను మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టను. నాకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు అనేవి నష్టపోయేవారి కోసం’ అంటూ రాసుకొచ్చారు. ట్రంప్ కొత్త ఉత్తర్వు 401కె.. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ, రుణాలు, క్రిప్టో , విలువైన లోహాలు వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులను ఒకే పన్ను గొడుగు కిందకు తెస్తుందన్నారు. ఇది తెలివైన, అధునిక ఇన్వెస్టర్లకు తలుపులు తెరుస్తుందన్నారు.కొత్త పెట్టుబడి అవకాశాలపై అధ్యయనం చేయలేనివారు, కష్టపడలేనివారు మాత్రం అవే సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ట్రంప్ కొత్త ఉత్తర్వుతో తాను మాత్రం చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఎందుకంటే ఇది తన బంగారం, వెండి, బిట్ కాయిన్ లను మరింత విలువైనదిగా చేస్తుందని వివరించారు.BIG NEWS: According to friend Andy Schectman….on August 7, 2025….President Trump signed an Executive Order “Democratizing Access to Alternative Investments for 401k Investors.”As some of you know I do not invest in mutual funds or ETFS. To me Mutual funds and ETFS are for…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 17, 2025 -
హైదరాబాద్లో కుండపోత.. స్తంభించిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్నగర్, టోలీచౌకీ, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్లాపూర్, హఫీజ్పేట్, సరూర్నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, బండ్లగూడ, మణికొండ, కొండాపూర్, షేక్పేటలో వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది.నగరంలో రోడ్లన్నీ జలమయంగా మారాయి. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్ 9.7 సెం.మీ, లింగంపల్లి 8.2, హెచ్సీయూ 8.1, గచ్చిబౌలి 6.6, చందానగర్ 6.4, హఫీజ్పేట్ 5.6, ఫతేనగర్ 4.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.ఏపీకి అలర్ట్.. విజయవాడలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు తూర్పు విదర్భ, తెలంగాణ మరియు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులో 64.5మిమీ, కె.ఉప్పలపాడులో 53.5మిమీ, వేములపాడు 47మిమీ, చిలకపాడులో 45మిమీ, విజయనగరం జిల్లా రాజాంలో 40.2మిమీ, కాకినాడలో 39మిమీ వర్షపాతం రికార్డు అయిందన్నారు. -
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్డే.. కీరవాణి స్పెషల్ సాంగ్
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ సాంగ్ను రిలీజ్ చేశారు. పలు భాషల్లో రూపొందించిన ఈ పాటకు తెలుగులో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతమందించారు. మోదీ పుట్టిన రోజున విడుదలైన ప్రత్యేక గీతం అందరినీ ఆకట్టుకుంటోంది.నమో నమో ఆర్త బాంధవుడా.. అంటూ సాగే ఈ పాటను ఎం ఎం కీరవాణి, షగున్ సోధి, ఐరా ఉడిపి ఆలపించారు. మోదీ జీ @75 పేరుతో ఈ పాటను టీ సిరీస్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో మోదీ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను ప్రస్తావించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ స్పెషల్ సాంగ్ను చూసేయండి.On the 75th birthday of Shri Narendra Modi Ji, we celebrate his spirit of service and vision for New India with “Modi Ji@75”. 🙏🇮🇳https://t.co/CGQ4AJtH9l#HappyBirthdayModiji @narendramodi@mmkeeravaani #ShagunSodhi #AiraaUdupi #Nadaan #Tseries pic.twitter.com/XimgRvVpR1— T-Series (@TSeries) September 17, 2025 -
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేయనున్న పాకిస్తాన్..?
ఆసియా కప్-2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్షేక్ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్ క్రికెట్ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్ సహా ఆసియా కప్ మొత్తాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్ క్రికెటర్లు ఇంకా హోటల్ రూమ్ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ కాసేపట్లో పాక్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్లో ముందు దశకు (సూపర్-4) వెళ్లాలంటే పాక్ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో పాక్ పసికూన ఒమన్పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్పై విజయం సాధించింది.ప్రస్తుతం పాక్, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్ యూఏఈతో మ్యాచ్ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్తో పాటు సూపర్-4కు చేరుకుంటుంది. -
TG: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త ఉద్యోగాల భర్తీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) మొత్తం 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో డ్రైవర్స్ ,శ్రామిక్లు (Shramiks) పోస్టులు ఉన్నాయి. వాటి వివరాల్ని పరిశీలిస్తే..డ్రైవర్స్ పోస్టులు – 1000 ఖాళీలుఅర్హతలు: రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఎస్ఎస్ఈ లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత.పురుషులు,మహిళలు ఇద్దరూ అర్హులు.వయస్సు పరిమితి: సాధారణంగా 18 నుండి 30 సంవత్సరాలు.వయస్సు సడలింపు:ఎస్సీ,ఎస్సీ,బీసీ,ఈడబ్ల్యూఎస్: 5 సంవత్సరాలుమాజీ సైనికులకు: 3 సంవత్సరాలుఎంపిక విధానం:ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్డ్రైవింగ్ టెస్ట్వెయిటేజ్ మార్కులుకనీస అర్హత మార్కులుశ్రామిక్ పోస్టులు – 743 ఖాళీలుఅర్హతలు: ఐటీఐ ఉత్తీర్ణత పురుషులు,మహిళలు అర్హులు.వయస్సు పరిమితి: 18 నుండి 30 సంవత్సరాలు.వయస్సు సడలింపు:ఎస్సీ,ఎస్సీ,బీసీ,ఈడబ్ల్యూఎస్: 5 సంవత్సరాలుమాజీ సైనికులకు: 3 సంవత్సరాలుఎంపిక విధానం:వెయిటేజ్ మార్కులుకనీస అర్హత మార్కులుదరఖాస్తు వివరాలు: ఆన్లైన్ దరఖాస్తు: టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్దరఖాస్తు ప్రారంభ తేదీ:అక్టోబర్ 8, 2025 ఉదయం 8 గంటలకుదరఖాస్తు ముగింపు తేదీ :అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5 గంటలకుఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. అర్హతలు కలిగిన అభ్యర్ధులు అధికారిక పోర్టల్ను సందర్శించాల్సి ఉంటుంది. -
అనసూయ సోలో ట్రిప్.. సమంత మేకప్ లేకుండా!
సోలోగా ట్రిప్ వేసిన యాంకర్ అనసూయక్యూట్ జ్ఞాపకాల్ని షేర్ చేసిన నివేతా థామస్జిమ్లో కష్టపడుతూ అలా.. మరోవైపు సమంత ఇలాచీరలో వయ్యారాలు పోతున్న అనుపమ పరమేశ్వరన్పొద్దుతిరుగుడు పువ్వుతో గ్లామర్ చూపిస్తున్న రకుల్అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న అనన్య నాగళ్ల View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దారుణం
సాక్షి, హైదరాబాద్: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థిపై మరి కొంతమంది విద్యార్థులు దాడిచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బర్త్డే వేడుకలో విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించారు. విద్యార్థికి రక్తం కారుతున్నా వదలని క్లాస్మేట్స్.. దాడికి పాల్పడ్డారు. ఆగస్టు 29న 9వ తరగతికి చెందిన విద్యార్థి పుట్టినరోజున పాఠశాల వచ్చాడు. తరగతి గదిలో మరో ముగ్గురు స్నేహితులు 'బర్త్ డే బంప్స్' అనే ఆట ఆడారు. దీనిలో భాగంగా ప్రైవేట్ భాగాలను మోకాలితో బలంగా కొట్టారు.కొంతమంది తనపై దాడి చేశారని సదరు విద్యార్థి వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కుటుంబస భ్యులు పలు ఆస్పత్రులలో చిక్సిత నిమిత్తం డాక్టర్ను సంప్రదించారు. పరీక్షించిన వైద్యులు మరో 3 నెలల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
IND VS AUS: మంధన మెరుపు శతకంతో చెలరేగినా..!
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో 49.5 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటైంది.ఓ దశలో భారత్ 350కి పైగా స్కోర్ చేస్తుందేమో అనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29) కాసేపు పోరాడారు. ఆతర్వాత వచ్చిన రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో స్నేహ్ రాణా (24) బ్యాట్ ఝులిపించిడంతో భారత్ 290 పరుగుల మార్కునైనా తాకగలిగింది.అంతకుముందు టాపార్డర్ బ్యాటర్లు (మంధన మినహా) కూడా తడబడ్డారు. ఓపెనర్ ప్రతిక రావల్కు (25) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయింది. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.ఓ పక్క వికెట్లు పడుతున్నా మంధన ఏమాత్రం తగ్గకుండా ధాటిగా ఆడటం కొనసాగించింది. 32.2 ఓవర్లలో 192 పరుగుల వద్ద మంధన ఔట్ కావడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. మంధన ఔటయ్యాక భారత్ చివరి 6 వికెట్లు 53 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మంధన దెబ్బకు తొలుత లయ కోల్పోయిన ఆసీస్ బౌలర్లు, ఆఖర్లో పుంజుకున్నారు. డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. వీరిలో గార్డ్నర్ (10-1-39-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీయగలిగింది. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జార్జియా వాల్ను రేణుకా సింగ్ డకౌట్ చేసింది. రేణుకా బౌలింగ్కు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన వాల్ 5 బంతులు ఎదుర్కొన్న తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యింది. భారత్కు ఐదో ఓవర్ ఐదో బంతికి మరో బ్రేక్ లభించింది. మరో ఓపెనర్ అలైస్సా హీలీని (9) క్రాంతి గౌడ్ బోల్తా కొట్టించింది. దీంతో ఆసీస్ 5 ఓవర్లలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలవాలంటే 45 ఓవర్లలో మరో 281 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్లోని తొలి వన్డేలో గెలిచి ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
సౌర విద్యుత్తో నడిచే రైస్ మిల్లు..!
వరి, చిరుధాన్యాలు పండించే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాలను అయినకాడికి అమ్మేసుకుంటే మిగిలేది అరకొర లాభాలు లేదా నికర నష్టాలే! అవే ధాన్యాలను కొని, మరపట్టించి అమ్ముకునే వ్యాపారులు బాగుపడతారు. రైతే ఈ పని కూడా చేసుకుంటే నికరంగా లాభాలు పొందడానికి అవకాశం ఉందని రుజువు చేసే విజయగాథలు ఎక్కడ వెతికినా కనిపిస్తాయి. అయితే, మన దేశంలో వ్యవసాయం చేసే వారిలో 80–90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు లేదా కౌలు రైతులే. ధాన్యాలను పండించి అలాగే అమ్మేసుకోవటం వల్ల రావాల్సినంత ఆదాయం రావటం లేదు. ఇటువంటి రైతుల నికరాదాయం పెరగాలంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్మాలి. పెద్ద రైస్ మిల్లులు చాలా దూరంలో ఉంటాయి. రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి అంత లాభదాయకం కాదు. వారికి కావాల్సింది చిన్న రైస్ మిల్లు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే చిన్న మిల్లులు కావాలి. విద్యుత్తు కట్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అందుకే వారికి కావాల్సింది సౌర విద్యుత్తుతో నడిచే చిన్న/మధ్య తరహా రైస్ మిల్లు!చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచడానికి ఇదొక్కటే మార్గమని సరిగ్గా గుర్తించిన బెంగళూరుకు చెందిన ‘సెమా ఆల్టో’ అనే వ్యాపార సంస్థ సౌర విద్యుత్తుతో నడిచే చిన్న రైస్ మిల్లును, ఇతర అనుబంధ యంత్రాలను రూపొందించింది. సెల్కో ఫౌండేషన్ సహకారంతో రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 150 సౌర విద్యుత్తుతో నడిచే చిన్న రైస్ మిల్లులను దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొల్పి సత్ఫలితాలు సాధిస్తోంది. సౌరశక్తితో పనిచేసే ఆవిష్కరణలతో వ్యవసాయోత్పత్తుల వ్యాపార చిత్రంలో గుణాత్మక మార్పునకు దోహదం చేస్తోందీ సంస్థ. సోలార్ మినీ రైస్ మిల్లుల ద్వారా రైతులకు (ధాన్యం: బియ్యం నిష్పత్తి) నికర బియ్యం దిగుబడి 30 శాతం పెరిగింది. ఆదాయం రెట్టింపైందని సెమ ఆల్టో చెబుతోంది. ప్రకృతిని కలుషితం చేయని సౌర విద్యుత్తు ద్వారా ఈ సంస్థ గ్రామీణ జీవనోపాధిని విజయవంతంగా పునర్నిర్మిస్తోంది.2017లో ప్రారంభం‘సెమ(ఎస్ఈఎంఏ)’ అంటే ‘సోలార్ పవర్డ్ ఎఫిషియంట్ మెషినరీ ఫర్ అగ్రికల్చర్’. వరి ధాన్యం, చిరుధాన్యాలను మరపట్టటం, బియ్యాన్ని మార్కెట్కు అందించడానికి అవసరమైన అనేక పనులు చెయ్యటం ఒక్క యంత్రంతో అవ్వదు. ధాన్యాలను శుభ్రపరచటం, మర పట్టటం, పాలిష్ చెయ్యటం, గ్రేడింగ్ వరకు మొత్తం 4 వేర్వేరు యంత్రాలు అందుకు కావాలి. వీటన్నిటినీ సెమ ఆల్టో సంస్థ రూపొందించింది. సౌరశక్తితో పనిచేసే మల్టీ–స్టేజ్ మినీ మిల్లు ఎండ్–టు–ఎండ్ బియ్యం ప్రాసెసింగ్ను నిర్వహిస్తోంది. 3.7–5 కిలోవాట్ల విద్యుత్తుతో ఇది నడుస్తుంది. 2017లో బెంగళూరులో అసద్ జాఫర్ ఈ కంపెనీని ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో గ్రామీణులు తమ వ్యవసాయోత్పత్తులను రూపం మార్చి అధిక ధరకు విక్రయించుకునే మార్గాన్ని సుగమం చెయ్యటమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే సెమ రైస్ మిల్లులు 150 యూనిట్ల వరకు ఏర్పాటయ్యాయి.65% రికవరీ రేటుపాతకాలపు డీజిల్తో నడిచే పెద్ద రైస్ మిల్లుల్లో 500 కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 275–300 కిలోల బియ్యం వస్తే, ఇప్పుడు అది 320–350 కిలోలకు పెరిగింది. ఈ సోలార్ మినీ రైస్ మిల్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నికర బియ్యం దిగుబడి 30% పెరిగింది. రవాణా ఖర్చులు తగ్గాయి. ఆదాయం రెట్టింపైంది. పదెకరాల్లో వరి పండించినా అప్పట్లో నా కుటుంబాన్ని పోషించుకోవటానికి కూడా ఆదాయం సరి΄ోయేది కాదు. ఇప్పుడు ఈ మిల్లుతో బియ్యం నాణ్యత, రికవరీ రేటు, ఆదాయం పెరిగింది..’ అని తమిళనాడుకు చెందిన సేంద్రియ వరి రైతు గోపి చెబుతున్నారు. సోలార్ మినీ రైస్ మిల్లులో 100 కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 65 కిలోల బియ్యం రైతుల చేతికి వస్తున్నాయి. మిల్లు సామర్థ్యం మెరుగ్గా ఉండటం వల్ల రైతులకు ఎక్కువ బియ్యం వస్తున్నాయి, వృథా తగ్గింది. ధాన్యాన్ని కిలో రూ. 45–50కి అమ్మే రైతు గోపి ఇప్పుడు సోలార్ రైస్ మిల్లులో మరపట్టి బియ్యాన్ని రూ. 80–100లకు కిలో అమ్ముతున్నారు. తద్వారా ఆదాయం రెట్టింపైందని గోపి తెలిపారు. వరి ధాన్యంతోపాటు చిరుధాన్యాలు, మొక్కజొన్నలు, గోధుమలను కూడా సౌర రైస్ మిల్లుల్లో మరపట్టే అవకాశం ఉండటం విశేషం.సోలార్ రైస్ మిల్లులను రైతుల దగ్గరకు తీసుకెళ్లే కృషిలో సీఈఈడబ్లు్య, విల్గ్రో సంస్థలతో కలసి సెమ ఆల్టో పనిచేస్తోంది. ఆస్తిపాస్తులు లేని పేద రైతులకు రుణ సదుపాయం కల్పించడం ద్వారా అందుబాటు బడ్జెట్లో ఈ మిల్లులను అందిస్తున్నారు. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలతో ఇటువంటి యంత్రాలను అనుసంధానం చేయగలిగితే రుణ సంబంధిత సబ్సిడీలను గ్రామీణ చిరువ్యాపారులకు అందించటం సాధ్యమవుతుందని ఆశిస్తున్నారు.(చదవండి: పొలం పంటల కన్నా ఇంటి పంటలతో ప్రయోజనాలున్నాయా?) -
రూ.80 లక్షల కోట్ల పెట్టుబడులు.. 1.5 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో భారత్లోకి రూ. 80 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. 1.5 కోట్ల పైగా ఉద్యోగాల కల్పన జరగనుందని వివరించారు. దేశీయంగా మారిటైమ్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, భవిష్యత్తులో ప్రపంచ మారిటైమ్ సూపర్పవర్గా భారత్ ఎదగనుందని పేర్కొన్నారు.కేంద్రం తలపెట్టిన సాగరమాల ప్రోగ్రాంతో 2035 నాటికి రూ. 5.8 లక్షల కోట్ల విలువ చేసే 840 ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయని సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ. 1.41 లక్షల కోట్ల విలువ చేసే 272 ప్రాజెక్టులు పూర్తయినట్లు పేర్కొన్నారు. రూ. 76,000 కోట్లతో మహారాష్ట్రలో ఏర్పాటవుతున్న వాధ్వాన్ పోర్టు అంతర్జాతీయంగా టాప్ 10 కంటైనర్ పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుందని సోనోవాల్ వివరించారు. దీనితో 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు. -
జాన్వీ కపూర్ లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే పరమ్ సుందరిగా మెప్పించిన ముద్దుగుమ్మ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలోనూ కనిపించనుంది. అంతే కాకుండా జాన్వీ కపూర్ మరో మూవీలో కనిపించనుంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న హోమ్ బౌండ్లోనూ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్గా వ్యవహిరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.హౌమ్ బౌండ్ కథేంటంటే..నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరిద్దరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్ బౌండ్’ సినిమా కథను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. -
ఆ కారణంతో హీరోయిన్ని మార్చాం.. బడ్జెట్ పెరిగింది: బ్యూటీ నిర్మాత
సినిమా ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు శాతమే సక్సెస్ ఉంటుంది. ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అని అంటే కుదరదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా నిర్మిస్తూనే ఉండాలనే ఉద్దేశం, లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. మంచి కథలు, అన్ని రకాల జానర్లలో డిఫరెంట్ సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాను.అందుకే ‘బార్బరిక్’, ‘బ్యూటీ’ చిత్రాలను నిర్మించాను’ అన్నారు నిర్మాత విజయ్ పాల్ రెరడ్డి అడిదల.ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై ఆయన నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత విజయ్ పాల్రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘బ్యూటీ’ కథలో అందమైన ప్రేమ కథతో పాటుగా మనసుని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన చిత్రంగా మా ‘బ్యూటీ’ నిలుస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరూ కలిసి చూడదగ్గ చిత్రం. నాకు పర్సనల్గా ఎమోషనల్ సీన్స్ అంటే ఇష్టం. ఈ కథలోని ఎమోషన్స్ నచ్చే నిర్మించేందుకు ముందుకు వచ్చాను.→ ఈ కథను విన్న వెంటనే ఈ మూవీని చేద్దామని మారుతికి చెప్పాను. జీ స్టూడియో సహకారం వల్లే మా సినిమాను ప్రతీ ఒక్కరికీ రీచ్ చేయగలిగాం. రిలీజ్ విషయంలో వారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా మూవీని దాదాపు 150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మౌత్ టాక్తో తరువాత మళ్లీ థియేటర్లను పెంచుతాం.→ ‘బ్యూటీ’ని ప్రారంభంలో వేరే హీరోయిన్తో షూటింగ్ చేశాం. ఓ వారం రోజులు అలా షూటింగ్ చేశాం. ముందుగా రైటర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. హీరోయిన్ పక్కింటి అమ్మాయిలా ఉండాలి అనుకున్నాం. ఆ హిరోయిన్ పాత్రకు అంతగా సెట్ అవ్వడం లేదు అని అంతా అనుకున్నాం. ఆ తరువాత నీలఖి ఈ సినిమాలోకి వచ్చారు. అలా సినిమా ఆరంభంలో చేసిన షూటింగ్ అంతా వృథా అయింది. దాని వల్ల బడ్జెట్ కాస్త పెరిగింది.→ ఇప్పటి వరకు ‘బ్యూటీ’ జర్నీ ఎంతో బాగా సాగింది. టైటిల్ ఎంతో క్యాచీగా ఉండటంతో.. జనాల్లోకి ఎక్కువగా వెళ్లింది. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు చూసిన వారంతా కూడా మూవీని మెచ్చుకున్నారు. రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. -
16 నెలల బాబుకు.. 1600 కి.మీ. దూరం నుంచి శస్త్రచికిత్స!
హైదరాబాద్: రోబోటిక్ సర్జరీల గురించి మనకు తెలుసు, టెలి సర్జరీల గురించి కూడా విన్నాం. కానీ ఈ రెండింటినీ కలిపి చేసి, ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న రోగులకు ఊరట కలిగించిన ఘటనలు తాజాగా జరిగాయి. పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసిన ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోటిక్ సిస్టమ్ను ఉపయోగించి ఈ టెలి రోబోటిక్ సర్జరీలు చేయడం విశేషం. నగరానికి చెందిన ప్రీతి కిడ్నీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ వి. చంద్రమోహన్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.‘‘పుట్టుకతోనే కిడ్నీ సంబంధిత జన్యుసమస్య ఉన్న 16 నెలల బాలుడికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. మూత్రపిండాలలో గరాటు ఆకారంలో ఉండే రీనల్ పెల్విస్ అనే భాగం మూత్ర నాళాలను, మూత్రపిండాలను కలుపుతుంది. సరిగ్గా అక్కడ ఆ బాబుకు ఒక అడ్డంకి ఏర్పడింది. దాన్ని యూరేటరోపెల్విక్ అబ్స్ట్రక్షన్ అంటారు. దానివల్ల మూత్రపిండం నుంచి మూత్రకోశంలోకి మూత్రం వెళ్లడం లేదు. దాంతో ఆ బాబుకు శస్త్రచికిత్స చేసి, ఆ అడ్డంకిని తొలగించాల్సి వచ్చింది. అయితే బాబు వయసు కేవలం 16 నెలలే కావడంతో రోబోటిక్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.బాబును కొండాపూర్లోని ప్రీతి కిడ్నీ హాస్పిటల్కు తీసుకురాగా.. డాక్టర్ చంద్రమోహన్ గుర్గ్రామ్లోని ఎస్ఎస్ఐ మంత్ర కార్యాలయంలో ఉన్న కన్సోల్ వద్ద కూర్చుని ఈ శస్త్రచికిత్స చేశారు. రెండు నగరాల మధ్య 1600 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్నా, అక్కడి నుంచి ఇక్కడి రోబోతో శస్త్రచికిత్స చేశాం. ఇందుకు గంట సమయం పట్టింది. ఇదంతా 5జి టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీ వల్ల సాధ్యమైంది. గతంలో చైనాలో 8 ఏళ్ల వయసున్న వారికే ఇలా టెలిసర్జరీ చేశారు. దీంతో దేశంలో, ప్రపంచంలో అతి చిన్న వయసున్న 16 నెలల బాబుకు విజయవంతంగా టెలిసర్జరీ చేసి, మర్నాడే డిశ్చార్జి కూడా చేసినట్లయింది.మరో కేసులో.. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నగరంలో ఒక మహిళకు హిస్టరెక్టమీ (గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేసిన తర్వాత మూత్రం లీకేజి కావడం మొదలైంది. దాంతో ఆమెకు అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా నయం చేయాలని భావించారు. అయితే, అక్కడున్న వైద్యులకు ఓపెన్ శస్త్రచికిత్స అలవాటు ఉంది గానీ రోబోటిక్ శస్త్రచికిత్స చేయలేరు. దాంతో ఇక్కడ మమ్మల్ని సంప్రదించగా, 5జి ఇంటర్నెట్ ప్లాట్ఫాం, ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సిస్టమ్, టెలిసర్జరీ సాయంతో ఆమెకు ఇక్కడినుంచే శస్త్రచికిత్స చేశాం. గంటా 20 నిమిషాల్లో ఇది పూర్తయింది. రెండు రాష్ట్రాల మధ్య జరిగిన తొలి శస్త్రచికిత్స ఇదే అవుతుంది.ఈ శస్త్రచికిత్సలకు ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రూప, సీఈఓ డాక్టర్ రంగప్ప, సీనియర్ సర్జన్ డాక్టర్ రామకృష్ణ, సీనియర్ యూరాలజిస్టులు డాక్టర్ హేమంత్, డాక్టర్ సౌందర్య, పీడియాట్రిక్ ఎనస్థటిస్ట్ డాక్టర్ దేవేందర్, పీడియాట్రీషియన్ డాక్టర్ వంశీ, సమన్వయకర్తలు రాజేందర్, గణేశ్, అనిల్, సీనియర్ టెక్నీషియన్ శ్రీధర్, రోబోటిక్ ఇంజినీర్లు దుర్గేష్, ఇషాన్ ప్రశాంత్, ఎస్ఎస్ఐ మంత్ర డైరెక్టర్ విశ్వ, ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్స్ సీఈఓ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ తదితరుల సహకారం ఎంతగానో ఉపకరించింది. ఈ భారతీయ బృందం అంతా కలిసి శస్త్రచికిత్సలు చేయడానికి దూరం అనేది అడ్డం కాదని నిరూపించారు.భారతదేశం చాలా సువిశాలమైన దేశం. అన్నిచోట్లా ఇంత నిపుణులైన వైద్యులు ఉండడం సాధ్యం కాదు. అందువల్ల నలుగురైదుగురు వైద్యులు కలిసి ఒక సర్జికల్ రోబో కొనుక్కుంటే.. ఇక్కడినుంచి దాంతో సర్జరీ చేయగలం. ఒకే కన్సోల్తో ఒకే సమయంలో పది రోబోలకు కనెక్ట్ చేయొచ్చు. ఈ విధానం అక్కడి వైద్యులకు శస్త్రచికిత్స విధానాలు నేర్పడానికి ఉపయోగపడుతుంది’’ అని డాక్టర్ చంద్రమోహన్ వివరించారు. -
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
లేటెస్ట్ తెలుగు సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వర్తి వాఘని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. మొన్నమొన్ననే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న నారా రోహిత్.. ఈ ఏడాది 'భైరవం' మూవీతో వచ్చాడు. కానీ ఫలితం డిసప్పాయింట్ చేసింది. గత నెల 27న 'సుందరకాండ' అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కామెడీ వర్కౌట్ అయింది అనే టాక్ వచ్చింది గానీ దీన్ని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈనెల 23 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా)'సుందరకాండ' విషయానికొస్తే.. సిద్ధార్థ్ (నారా రోహిత్) 30 ఏళ్లు దాటిపోయి చాన్నాళ్లయినా సరే పెళ్లి చేసుకోడు. స్కూల్లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)ని ప్రేమిస్తాడు. ఆమెలోని కొన్ని లక్షణాలు ఇతడికి నచ్చుతాయి. పెద్దయిన తర్వాత అలాంటి లక్షణాలున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తనకు తానే రూల్ పెట్టుకుంటాడు. సంబంధాలు వస్తుంటాయి, అమ్మాయిల్ని చూస్తుంటాడు కానీ అందరినీ రిజెక్ట్ చేస్తుంటాడు.ఓసారి ఎయిర్పోర్ట్లో ఐరా(వృతి వాఘని) అనే అమ్మాయిలో తను అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయని సిద్దార్థ్ ఆమె వెంటపడతాడు. తనని ప్రేమించేలా చేస్తాడు. మరి ఈ ప్రేమకథ సుఖాంతమైందా? సిద్ధార్థ్ మళ్లీ వైష్ణవిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేది మిగతా స్టోరీ. అయితే ఇందులో హీరో.. తల్లికూతురిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ కాస్త విడ్డూరంగా ఉంటుంది. సత్య కామెడీ వర్కౌట్ అయినప్పటికీ.. ఈ కాన్సెప్ట్ ఓకే అనుకుంటేనే దీన్ని చూడండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే) -
సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్గా..ప్రధాని మోదీ డ్రెస్సింగ్ స్టైల్
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేగాదు ఆ పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేత పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కూడా. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్లోని థార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ మోదీ వేదికపైకి రాగానే ఆ రాష్ట్ర సాంస్కృతికి అద్దం పట్టే గులాబీ రంగు తలపాగా(పగ్డి), జాకెట్ను బహుకరించారు. ఆ పగ్డిపై(తలపాగ) క్లిష్టమైన బంగారం, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయడగా, బంజారా సమాజం శక్తిమంతమైన చేతి పనికి నిదర్శనం జాకెట్పై లంబానీ ఎంబ్రాయిడరీ ఉంది. వీటితోపాటు ధార్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్త్రం పై సహజరంగులతో కూడిన రేఖాగణిత నమునాలు ఉన్న స్కార్ఫ్ను కూడా మోదీకి బహుకరించారు. ఇది ఆయన 75వ పుట్టినరోజు అయినప్పటికీ తన సిగ్నేచర్ శైలికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రజలు ఇచ్చిన అభిమాన బహుమతులు, దుస్తుల కారణంగా మోదీ డ్రెస్సింగ్ స్టైల్ సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ముఖ్యంగా ఆ కానుకలతో మోదీ లుక్లో మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయన ఈ పుట్టినరోజుని పీఎం మిత్ర పార్కుకి పునాది రాయి వేయడం, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ ఆరోగ్య పథకాల ప్రారంభంతో జరుపుకోవడం విశేషం. ఇక ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..స్వావలంబన చర్య తీసుకోవాలనే పిలుపునిస్తూ ప్రసంగించారు. "ఇది పండుగల సమయం. మన స్వదేశీ ఉత్పత్తుల మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండాలి. 140 మంది కోట్ల భారతీయులు ఏది కొనుగోలు చేసినా..అది మేడ్ ఇన్ ఇండియాగానే ఉండాలని అభ్యర్థిస్తున్నా. వికసిత్ భారత్కు మార్గం వేసి, ఆత్మనిర్బర్ భారత్గా ముందుకు సాగాలన్నారు. ఎప్పుడైతే మనం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామో, అప్పుడూ డబ్బు మన దేశంలోనే ఉంటుంది, పైగా ఆ డబ్బుని అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చని అన్నారు. అలాగే మహేశ్వరి చీరలు, పీఎం మిత్రా పార్క్ ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ పట్టు, పత్తి లభ్యత, నాణ్యత తనిఖీలు, సులభమైన మార్కెట్ యాక్సెస్ వంటివి నిర్ధారిస్తారని అన్నారు. దాంతోపాటు స్పిన్నింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి అన్నీ ఒకే చోట జరుగుతాయని చెప్పారు. అదీగాక ఈ చీరలు, వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేస్తూ, దేవి అహల్యాబాయి హోల్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి..మన మాతృభూమిని ప్రపంచ మార్కెట్లో ప్రకాశవంతంగా మెరిసేలా చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. .(చదవండి: ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్ మంత్రి..! ఎందుకోసం అంటే..) -
‘ఎనుముల రేవంత్రెడ్డి కాదు ముడుపుల రేవంత్రెడ్డి’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి సర్కార్ను నడపడం లేదని సర్కస్ నడుపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం కేటీఆర్ మీడియాతో చిట్చాట్ జరిపారు. ఈ చిట్చాట్లో.. త్వరలోనే పాదయాత్ర ఉంటుంది. పబ్లిక్లోకి కేసీఆర్ ఎప్పుడు రావాలో.. అప్పుడే వస్తారు. జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్కు బాగా తెలుసు. సీఎం రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నారు. సుందరయ్య విజ్ఞాన వేదికలో విద్యార్థులు రౌండ్ టేబుల్ పెట్టుకుంటే పెట్టుకొనివ్వని వారు నియంత.సర్కార్ నడపడం లేదు సర్కాస్ నడుపుతున్నారు. మంత్రులది ఓమాట సీఎంది మరో మాట. కోర్ట్ చెప్పిన సీఎం వినరు. సృజన్రెడ్డికి సింగరేణిలో రూ.300 కోట్ల టెండర్లు ఇచ్చారు. గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. కేసీఆర్ చేసిన పనినీ చెప్పలేక పోయాం కాబట్టే ఓడిపోయాం. రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు ఇచ్చాం.. కేటీఆర్ పైన కోపం సిరిసిల్ల పైన చూపిస్తున్నారు. నేతన్నపై జీఎస్టీ వేసీని ఘనత సీఎం రేవంత్దే. పది నియోజక వర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నిలకు పోవాలి. బీసీ బిల్లుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఆర్ఆర్ఆర్ సౌత్ సైడ్ అలైన్ మెంట్ మార్చారు.. సీఎం రేవంత్ బంధువులు 2,500 ఎకరాల భూములు కొన్నారు. అలైన్ మెంట్ మార్చితే ఆర్ఆర్ఆర్కి డబ్బులు ఇవ్వం అని కేంద్రం చెప్పింది.సౌత్ సైడ్ ఆర్ఆర్ఆర్ మేమే కడతామని రేవంత్ కేంద్రానికి చెప్పారు. సౌత్ సైడ్ ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చడం వల్ల మిగతా ప్రాంతాల్లో కూడా అలైన్ మెంట్ మార్చే పరిస్థితి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి బంధువుల భూములు రెట్లు పెంచేందుకు ఆర్ఆర్ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు. ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, వారి బంధువుల డ్రామాలు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ముడుపుల రేవంత్ రెడ్డి. ఎల్అండ్టీ వాళ్ళని ముడుపుల కోసం సీఎం రేవంత్ ప్రయత్నించాడు. అందుకే మెట్రో నడపం అని వెళ్ళిపోతాం అంటున్నారు.ముఖ్యమంత్రి బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి L&T తప్పుకుంటుంది. ముఖ్యమంత్రి ముడుపుల కోసం వేధిస్తున్న వేధింపులు తట్టుకోలేకనే కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోతున్నది. రాష్ట్రంలోని తమ కార్యకలాపాల నుంచి ఎల్అండ్టీ తప్పుకుంటుంది. గతంలో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని జైల్లో పెడతా అన్నారు. వాళ్లని వీళ్ళని జైల్లో పెడతా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలు వస్తాయి.రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఉంటాయి. గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను ముందు పెట్టి ఆయా కంపెనీలతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు. రేవంత్ పీసీసీ పదవి కొన్నాడు.సీఎం సీట్ కొన్నాడు.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులను బీజేపీకి అమ్మారు. రేవంత్ అన్నిట్లో దిట్ట. 8మంది ఎంపీలను అమ్మాడు. హైడ్రా కాస్త హైడ్రామా అయింది. హైడ్రాకు పెద్ద వాళ్ళ ఇళ్ళు కనిపించవు. కాంగ్రెస్ పార్టీ తమ చేతి గుర్తును తీసివేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలిరేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని ఎవరూ అనుకోవడం లేదు, ఆయన ముమ్మాటికీ బీజేపీ మనిషే. రేవంత్ రెడ్డిని పొగుడాలంటే బట్టి విక్రమార్కని తొక్కేయాలా..?ప్రజా పాలనా అంటూ కోటి అప్లికేషన్లు తీసుకున్నారు. ఎంత మందికి ఇండ్లు ఇచ్చారు. రాజీవ్ యువ వికాసం లేదు కానీ ఎనుముల ఫ్యామిలీలో మాత్రం వికాసం ఉంది’ -
ప్రధాని మోదీకి దర్శకధీరుడు విషెస్.. వీడియో రిలీజ్
మనదేశ ప్రధాని నరేంద్రమోదీకి టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విషెస్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్ డే కావడంతో ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల వయసులోనూ మీరు 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. వరల్డ్వైడ్గా బలమైన స్థానంలో నిలబెట్టారని కొనియాడారు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శక్తి, ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నానని వీడియోను పోస్ట్ చేశారు.టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ నిబద్ధత, జీవితం గురించి చూస్తే రాబోయే తరాలకు ఆదర్శమని కొనియాడారు. దేశం కోసం మీరు చేస్తున్న కృషి ప్రతి భారతీయుడని గర్వపడేలా చేసిందన్నారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని.. మీ నాయకత్వంతో మా అందరికీ స్ఫూర్తినిస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాని వీడియో రిలీజ్ చేశారు.కాగా.. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.Happy Birthday to our honourable Prime Minister Shri @narendramodi Ji. May you always be blessed with good health, happiness and continue inspiring us all with your leadership. 🇮🇳 pic.twitter.com/hBKEnKGtVx— Mahesh Babu (@urstrulyMahesh) September 17, 2025 Wishing our Honourable Prime Minister Shri @narendramodi ji a very Happy Birthday. May you be blessed with good health, energy and happiness always. pic.twitter.com/fMftlzOeka— rajamouli ss (@ssrajamouli) September 17, 2025 -
తాత, తండ్రి, కొడుకు..‘అక్కినేని’మూడు తరాలతో నటించిన ఏకైక హీరోయిన్ ఈమే!
చిత్రపరిశ్రమలో హీరోలకు వయసుతో సంబంధం ఉండదు కానీ..హీరోయిన్లకు మాత్రం కచ్చితంగా ఉంటుంది. 30-35 ఏళ్లు దాటితే చాలు చాన్స్లు తగ్గుతాయి. అలా పట్టుమని పదేళ్లు కూడా హీరోయిన్గా రాణించలేరు. వయసు ఉన్నా.. ఖాతాలో హిట్ లేకపోతే అంతే సంగతి. వరుసగా 3-4 ఫ్లాపులు పడ్డాయంటే.. ఇక ఆమె వెండితెరపై మర్చిపోవాల్సిందే. ప్రస్తుతం పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్లు చాలా తక్కువే ఉన్నారు. కానీ ఒకప్పుడు హీరోయిన్ స్పాన్ 20 ఏళ్ల వరకు ఉండేది. భారీ హిట్స్ వస్తే..ఆమెను నెత్తినపెట్టుకొని ఆరాధించేవాళ్లు. హీరోలతో సమానంగా వాళ్లకు అభిమానులు ఉండేవాళ్లు. అలాంటి వాళ్లలో రమ్యకృష్ణ(Ramya Krishnan) ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె హీరోయిన్గా నటించింది.13 సంవత్సరాల వయస్సులోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ చిత్ర దర్శకుడు, సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో 1983లో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. . మె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు (1986). చిరంజీవి,నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్..ఇలా అప్పటి స్టార్ హీరోలందరితోనూ ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాదు ‘అక్కినేని’ హీరోలందరితోనూ నటించిన రికార్డు ఆమె పేరిట ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మొదలు అఖిల్ వరకు.. మూడు తరాలతో రమ్యకృష్ణ కలిసి నటించింది.అక్కినేని నాగేశ్వరరావుతో ‘దాగుడు మూతలు దాంపత్యం, ఇద్దరే ఇద్దరు, సూత్రధారులు సినిమాల్లో కలిసి నటించింది. ఇక నాగార్జునతో ఆమె 10కి పైగా సినిమాలు చేసింది. అందులో హల్లో బ్రదర్, సంకీర్తన, చంద్రలేఖ, అన్నమయ్య, అల్లరి అల్లుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి. ఇక అక్కినేని మూడో తరం.. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యతోనూ రమ్యకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకుంది. శైలజా రెడ్డి సినిమాలో చైతుకి అత్తగా, బంగార్రాజు చిత్రంలో నానమ్మగా నటించింది. నాగ్ చిన్న కొడుకు అఖిల్ ‘హలో’ మూవీలోనూ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఇలా అక్కినేని మూడు తరాలతో నటించిన ఏకైన హీరోయిన్గా రమ్యకృష్ణ నిలిచింది. సమంత కూడా ఈ నలుగురితో కలిసి ‘మనం’ సినిమాలో నటించింది. అయితే విడివిడిగా నటించిన ఏకైక నటి మాత్రం రమ్యకృష్ణ అనే చెప్పాలి.