Anakapalle
-
మొక్కల పెంపకం అందరి బాధ్యత
జాతీయ జెండాలతో ర్యాలీ చోడవరం: భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తూ చోడవరంలో అన్నివర్గాల ప్రజలు మెయిన్రోడ్డుపై శనివారం జాతీయజెండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో భారత సైన్యం చేస్తున్న ఎటువంటి యుద్ధానికై నా ప్రజల మద్దతు పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. కె.కోటపాడు : మొక్కలను ప్రతి ఒక్కరూ నాటి పెంచడాన్ని బాధ్యతగా గుర్తించాలని వారాడ సర్పంచ్ గొర్రుపోటు సౌజన్య అన్నారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం హీట్ ది బీట్ కార్యక్రమాన్ని జరిపారు. ఉపాధి కూలీలతో కలిసి గ్రామంలో మొక్కలను నాటారు. పంచాయతీ కార్యదర్శి బి.సరోజిని మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా మంచినీటిని ఎక్కువగా తీసుకోవాల కోరారు.వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ వైసీపీలో క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరిస్తున్న శశి శనివారం మృతి చెందాడు. ఆనారోగ్యం బారిన పడడంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం పొందుతూ మృతి చెందారు. శశి అకాల మరణాన్ని పార్టీ శ్రేణులు, జీర్ణించుకోలేకపోతున్నారు. -
చౌడువాడలో ‘బీట్ ది హీట్’ కార్యక్రమం
కె.కోటపాడు : స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బీట్ ది హీట్ ప్రోగ్రాం నిర్వహించారు. చౌడువాడ పీహెచ్సీ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్సీ ఆవరణలో కమ్యూనిటీ సోప్ పిట్కు శంకుస్థాపన చేశారు. పక్షులు నీరు తాగడానికి, ఆహారం అందించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాన్ని డ్వామా పీడీ పూర్ణిమాదేవి ప్రారంభించారు. గ్రామంలో 20 మందికి పక్షులకు నీళ్లు పెట్టడానికి మట్టి పాత్రలు పంపిణీ చేఽశారు. గ్రామ పరిశుధ్య సిబ్బందిని సత్కరించి బియ్యంతో పాటు కిరాణా సామాగ్రిని అందజేశారు. సర్పంచ్ చలివేంద్రం ప్రారంభించి మజ్జిగను ఉచితంగా అందజేశారు. ఎంపీపీ సూర్యనారాయణ,ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్ రమేష్బాబు, డిప్యుటీ ఎంపీడీవో రమణి, సర్పంచ్ ఎరువునాయడు, ఎంపీటీసీ అప్పలరాజు, పంచాయతీకార్యదర్శి సురేష్బాబు, గుమస్తా అప్పారావు పాల్గొన్నారు. -
ఉపాధి నిధులతో సమృద్ధిగా పనులు
నాతవరం : ఉపాధి హామీ పథకంలో ఉపాధితో పాటు అనేక అభివృద్ధి పనులు చేసుకోవచ్చునని మండల ప్రత్యేకాధికారి నాగశిరీష అన్నారు. మండలంలో శనివారం స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా మర్రిపాలెం పంచాయతీ శివారు పొట్టిపాలెం గిరిజన గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కంపోస్టు గుంతలను ప్రారంభించారు. పచ్చదనం పర్యవరణంలో భాగంగా మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకంలో ఈ గ్రామంలో రైతులు కూలీలు చేస్తున్న కంపోస్టు గుంతలను స్వయంగా పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పొట్టిపాలెం గ్రామంలో రైతులకు కూలీలకు ఉపయోగపడే పనులకు గ్రామసభలో తీర్మానం చేసి అమలు చేసే బాధ్యత తీసుకోవాలని ఏపీవోకు సూచించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ, ఏపీవో దాసరి కొండాజీ, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ, డి.యర్రవరం సర్పంచ్ సత్యవతి, వెర్రిగెడ్డ రిజర్వాయరు కమిటి చైర్మన్ స్వామినాయుడు, మర్రిపాలెం పెద్ద చెరువు నీటి సంఘం చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
పరారీలో ఉన్న నిందితులను పట్టుకోండి
యలమంచిలి రూరల్ : వివిధ కేసుల్లో న్యాయస్థానాలు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకుని,న్యాయస్థానాల ఎదుట హాజరుపర్చాలని జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా ఆదేశించారు. శనివారం ఆయన యలమంచిలి సర్కిల్ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి ఛార్జిషీట్లను దాఖలు చేయాలన్నారు. రౌడీషేటర్లు, నేరచరిత్ర, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిలిపి ఉంచకుండా పర్యవేక్షించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, బాలికల రక్షణకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్ను ఎక్కువమంది ఉపయోగించేలా చైతన్యం తీసుకురావాలన్నారు. అంతకుముందు తనిఖీకి వచ్చిన ఎస్పీకి పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, యలమంచిలి సీఐ ధనుంజయరావు, ఎస్ఐలు సాదరస్వాగతం పలికారు. ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి రూరల్, యలమంచిలి పట్టణం, మునగపాక, యలమంచిలి ట్రాఫిక్ ఎస్ఐలు ఎం. ఉపేంద్ర, కె.సావిత్రి, ప్రసాద్, బి. రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ తుహిన్సిన్హా యలమంచిలి సీఐ కార్యాలయం సందర్శన -
6780 ఎకరాల్లో పీఎండీఎస్ విధానం
చీడికాడ : ప్రతి రైతు తమ పొలంలో కొంతమేరైనా ప్రకృతి సాగువైపు మళ్లితే పురుగు మందులు, రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుందని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్రావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని చెట్టుపల్లి, చీడికాడ, పెదగోగాడలలో పీఎండీఎస్ వేసిన రైతు పొలాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది 6780 ఎకరాల్లో ఈ తొలకరిలో పీఎండీఎస్ విధానాన్ని అనగా ఒకే పొలంలో 30 రకాల విత్తనాలు చల్లి ఎరువుగా వినియోగించడం ద్వారా భూమి సారావంతమై ఆరోగ్యంగా ఉంటుదన్నారు. కార్యక్రమంలో ఏఓ కృష్ణవేణి పాల్గొన్నారు. -
20న సిరివెన్నెల 70వ జయంతి
అనకాపల్లి (కశింకోట): సినీ రంగంలో రచయితగా ఉత్తమ సాహిత్యాన్ని అందించిన మహోన్నత వ్యక్తిత్వం సిరివెన్నెల సీతారామశాస్త్రిదని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. సిరి వెన్నెల కళా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు సీతారామశాస్త్రి 70వ జయంతి వేడుకలు అనకాపల్లి సత్య గ్రౌండ్లో జరగనున్నాయి. దీన్ని పురస్కరించుకొని శనివారం జనసేన కార్యాలయంలో సిరివెన్నెల 70వ జయంతి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి హాజరు కానున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. గవర కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర, నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను, అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రవికుమార్, కొడుకుల శ్రీకాంత్, జోగినాయుడు, చదరం నాగేశ్వరరావు,ఈశ్వర్ పాల్గొన్నారు. -
లైటరైట్ అనుమతులు రద్దు చేయాలి
నాతవరం : లేటరైట్ తవ్వకాల వల్ల గిరిజనులకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు పేర్కొన్నారు. సుందరకోట పంచాయతీ శివారు బమిడికలోద్దు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలు జరిపి లారీలపై తరలిస్తున్న రోడ్డు మార్గాన్ని శనివారం సీపీఐ బృందం సందర్శించారు. కాకినాడ జిల్లా రవతలపూడి మండలం తూళ్లూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన లేటరైట్ మట్టిని నిల్వ చేసే యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. లేటరైట్ తవ్వకాలను సీపీఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. లేటరైట్ ఇతర మైనింగ్ తవ్వకాల కారణంగా చుట్టుపక్కల గిరిజన గ్రామాలు పూర్తిగా నాశనమౌవుతాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లేటరైట్ అనుమతులు రద్దు చేసి తవ్వకాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రాంత గిరిజనులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, జిల్లా నాయుకులు గురుబాబు, క్రాంతి, నాతవరం మండలం సీపీఐ కార్యదర్శి చిన్నయ్యనాయుడు, అప్పారావు, సత్తిబాబు పాల్గొన్నారు. మైనింగ్ మాఫియాకు అధికారులు దాసోహం నర్సీపట్నం : లేటరైట్ తవ్వకాల్లో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయని, మైనింగ్ మాఫియాకు అధికారులు దాసోహమయ్యారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ నాతవరం మండలం, సరుగుడు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల్లో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుందన్నారు. విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్నారు. బమిడికలొద్ది గ్రామంలోని జర్తా లక్ష్మణ్రావు పేరున ఉన్న 121 హెక్టార్లలో అనేక అక్రమాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడలేదన్నారు. లేటరైట్ రవాణా వాహనాల్లో తప్పనిసరిగా జీపీఎస్ పరికరాలు అమర్చాల్సి ఉందన్నారు. సుస్థిర అభివృద్ధి చట్టం(2016) ప్రకారం గనిలో వేంబ్రిడ్జి ఉండాలన్నారు. ఎంఎండీఆర్ చట్టం 1957 సెక్షన్ 21(4) చట్టబద్దమైన పర్మిట్ లేకుండా మినరల్స్ రవాణా చేయడం నిషేధమన్నారు. లేటరైట్ అక్రమ తవ్వకాలకు సహకరిస్తున్న అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘స్థానికులకు’ ఉపాధి కలేనా..!
అచ్యుతాపురం రూరల్ : పరిశ్రమలకు గ్రామాల్లో భూములు సేకరించినప్పుడు నిర్వాసితులకు ఆర్.కార్డులు ఇస్తామని, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో శిక్షణ ఇచ్చి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి కలెక్టర్ సమక్షంలో అగ్రిమెంటు చేసుకున్నారు. కానీ నేటికీ అమలు కాలేదని కార్మిక సంఘాల నాయకులంటున్నారు. మత్స్యకార గ్రామాల యువతీ యువకులను పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించట్లేదని వాపోతున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాల కారణంగా మత్స్య సంపద కోల్పోయి, స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో అవకాశాలు లేక మత్స్యకార యువకుల జీవనం చాలా దుర్భరంగా మారింది. వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి రైతుల నుంచి వేలాది ఎకరాలు తీసుకుని నామ మాత్రంగా పరిశ్రమలు నెలకొల్పి, రాయితీలు పొందాక కుంటి సాకులతో అర్ధంతరంగా మూసేస్తున్నారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని ఎందరో నిరు పేద కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇక నడుస్తున్న పరిశ్రమలూ కార్మికులకు చాలీచాలని వేతనాలు ఇస్తున్నాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనం పెంచాల్సి ఉన్నప్పటికీ, గత 15 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుత ధరలకు అనుగుణంగా కనీసవేతనం రూ.26వేలు ఎక్కడా అమలు కావట్లేదని కార్మికులు వాపోతున్నారు. సెజ్లో భూములు కోల్పోయిన నిర్వాసితులు తమ జీవితాలు బాగుపడతాయన్న ఆలోచనతో వేల ఎకరాలు సెజ్ పరిశ్రమలకు ధారపోశారు. భవిష్యత్తులో తమ పిల్లల జీవితాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సంతోషంగా గడిచిపోతుందని అనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. స్థానికంగా పరిశ్రమలు వస్తే విద్యార్హతను అనుసరించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయనుకున్న నిర్వాసితుల కల కలగానే మిగిలింది. ప్రస్తుతమున్న పరిశ్రమల్లో స్థానికేతరులకు తప్ప స్థానికంగా ఉన్న నిర్వాసిత రైతుల పిల్లలకు ఉద్యోగ,ఉపాధి కల్పనలో పరిశ్రమల యాజమాన్యాలు చొరవ చూపించట్లేదు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 560 ఎకరాల్లో భూమిని సేకరించారు.వీటిలో ఇప్పటివరకూ 208 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఈ రెండు మండలాల్లో 27 గ్రామాలకు చెందిన 5,600 నిర్వాసిత కుటుంబాలను దిబ్బపాలెం, వెదురవాడ ఆర్ అండ్ ఆర్కాలనీలకు తరలించారు. నిర్వాసుతులందరూ కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2000 మంది మహిళలకు ఉపాధి కల్పించారు. నిర్వాసితులకు దక్కని ఉపాధి అవకాశాలు అర్ధంతరంగా మూతపడుతున్న పరిశ్రమలు రోడ్డున పడుతున్న కార్మికులు భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమ యాజమాన్యాలు విధుల్లో ఉన్న కార్మికులకు చాలీ చాలని వేతనాలు -
దేవరాపల్లి వైస్ ఎంపీపీ అభ్యర్థిగా సింహాచలంనాయుడు
దేవరాపల్లి : మండల పరిషత్ వైస్ ఎంపీపీ అభ్యర్ధిగా వైఎస్సార్సీపీ తరుపున మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడును ఎంపిక చేసినట్లు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు తారువలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులంతా శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా పంచాడ సింహాచలంనాయుడును వైస్ ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం బూడి మాట్లాడుతూ 19న జరిగే వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో ఎంపీటీసీ సభ్యులంతా పాల్గొని సింహాచలంనాయుడుకు మద్దతు పలికి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ అభ్యర్థిగా ఎంపికై న పంచాడ సింహాచలంనాయుడును పలువురు అభినందించారు. కాగా గతంలో వైస్ ఎంపీపీ–1 పనిచేసిన చింతల బుల్లిలక్ష్మి ఇటీవల జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఉప ఎన్నికల్లో ఎంపీపీగా గెలుపొందడంతో వైస్ ఎంపీపీ పదవి ఖాళీ ఏర్పడింది. దీంతో వైస్ ఎంపీపీ పదవికి ఈ నెల 19 ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపఽథ్యంలోనే మండల పరిషత్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉండడంతో వైఎస్సార్సీపీ తరపున పంచాడ సింహాచలంనాయుడు వైస్ ఎంపీపీగా గెలుపు అనివార్యం కానుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైస్ ఎంపీపీ–2 ఉర్రూకుల గంగాభవానీ, కోఆప్షన్ మెంబర్ దండే జాన్ విక్టర్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, యువజన విభాగం అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, మండల బిసి సెల్ అధ్యక్షుడు కిల్లాన శ్రీనువాస్ యాదవ్, ఎంపీటీసీ సభ్యులు, పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ విప్ జారీ దేవరాపల్లి మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నికకు సంభందించి వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. ఈ మేరకు వైస్ ఎంపీపీ–1 ఈ నెల 19న ఎన్నిక నిర్వహించనున్న నేపధ్యంలో తమ పార్టీ ఎంపీటీసీలకు వైఎస్సార్సీపీ తరపున ఆ పార్టీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు విప్ జారీ చేశారు. వైఎస్సార్సీపీ తరుపున వైస్ ఎంపీపీ అభ్యర్థి మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడును ప్రతిపాదిస్తూ వైఎస్సార్సీపీ తరుపున బీ ఫారం పత్రాన్ని మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి,, జెడ్పీటీసీ కర్రి సత్యం శనివారం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఎస్.మంజులవాణికి శనివారం అందజేశారు. ప్రకటించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
దేవరాపల్లి : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణి సూచించారు. దేవరాపల్లిలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానహారంగా ఏర్పడి, ప్రతిజ్ఞ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణి, ఎంపీడీవో సువర్ణరాజు చీపర్లతో చెత్త ఊడ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందశారు. సచివాలయం–1 వద్ద జరిగిన సమావేశంలో వేసవి ఎండ తీవ్రత నేపథ్యంలో వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కల్పించారు. బోయిలకింతాడలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, సర్పంచ్ బాబురావు ఆధ్వర్యంలో సచివాలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. మాకవరపాలెం: గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు అన్నారు. మండలంలోని గిడుతూరులో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం వీధుల్లో చెత్తను తొలగించడంతోపాటు ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం : మున్సిపాలిటీలో స్వర్ణాంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్, ఆర్డీవో వి.వి.రమణ, కౌన్సిలర్లు సిహెచ్.పద్మావతి, కమిషనర్ జంపా సురేంద్ర, జిల్లా అదనపు వైద్యాధికారి జ్యోతి, మెప్మా, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. వీరంతా ర్యాలీ నిర్వహించి చెత్తను రోడ్లపై వేయకుండా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని నినాదాలు చేశారు. కౌన్సిలర్ పద్మావతి అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. బుచ్చెయ్యపేట : గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ సిబ్బంది కృషి చేయాలని మండల ప్రత్యేకాధికారి గోపాల్,ఎంపీడీవో విజయలక్మి తెలిపారు. శనివారం గ్రీవెన్స్లో భాగంగా దిబ్బిడిలో పర్యటించారు. అంగన్వాడీ కేంద్రం, సచివాయాలం, సంపద కేంద్రం, నీటి తొట్టెలను,గ్రామ వార్డులను తనిఖీ చేశారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండడమే కాక అపరిశుభ్ర వాతావరణం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. ఎండాకాలం అవడంతో ముఖ్య కూడల్లో చలి వేంద్రాలు, నీటి తొట్టెలో పశువులకు నీళ్లు ఉండేలా చూడాలన్నారు. ఎమ్మార్సీ భవనం వద్ద పారిశుధ్య చర్యలు రోలుగుంట : మండలంలో గ్రామాల్లో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో గల విద్యాశాఖ మండల వనురుల కేంద్రం వద్ద ఎంఈవోలు జాను ప్రసాద్, జాగ్గారావు సిబ్బందితో కలిసి భవన్ చుట్టూ చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను ేతొలగించారు. ఆవరణలో గల పిచ్చి మొక్కలు తొలగించి కార్యాలయాన్ని సుందరంగా తయారు చేశారు. సీఆర్పీలు సతీష్, చిరంజీవి పాల్గొన్నారు. -
మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య
ఎస్.రాయవరం : గ్రామదేవత పండక్కి తన భర్త అత్తవారింటికి రాలేదని మనస్థాపంతో ధోని మాధవి (25) పుట్టింట్లో ఫ్యానుకు ఉరి బిగించుకుని శనివారం మృతి చెందింది. ఎస్ఐ విభీషణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తరేవుపోలవరం గ్రామానికి చెందిన ధోని మాధవికి అదే గ్రామానికి చెందిన నాగార్జునతో 7 నెలల క్రితం వివాహం జరిగింది. ఇటీవల మంగళవారం గ్రామంలో బంగారమ్మతల్లి జాతర జరిగింది. ఆ రోజున భర్త నాగార్జునను ఆహ్వానించగా పండక్కి రాలేదు. అప్పటినుంచి మనస్థాపానికి గురైన మాధవి శనివారం పుట్టింట్లో ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చున్నీతో ఉరి బిగించుకుని మృతి చెందింది. భార్యభర్తల మధ్య ఎటువంఇ వివాదాలు లేవని, అన్యోన్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారని చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బీసీ ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సంఘం ఎన్నిక
అనకాపల్లి టౌన్: బీసీ ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా కొణతాల గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో అసోసియేషన్ ఎన్నికలు శనివారం జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు గత్తుల వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిగా బి.వి.వి.ప్రసాద్, కోశాధికారిగా కె.జోగినాయుడు, అసోసియేషన్ అధ్యక్షునిగా బి.దేముడుబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పి.జగదీష్, ఆర్.అప్పలరాజు, గౌరవ సలహాదారునిగా రిటైర్డ్ ఎమ్మార్వో పి.వీరభద్రరావు ఎన్నికయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూషణరావు, న్యాయ సలహాదారులు పి.రామచంద్రరావు పాల్గొన్నారు. -
ఉద్యోగాలు లేక మత్స్యవేటకు...
పరిశ్రమల వ్యర్థ రసాయనాల కారణంగా సముద్రం కాలుష్యం అవడంతో మత్స్య సంపద కోల్పోతున్నాం. యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో, అలవాటు లేని యువకులు కొంత మంది జీవనోపాధి కోసం మత్స్య వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకోగా, పిల్లలు స్థిరపడలేకపోవడం వారిని ఎంతో బాధిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టి మత్స్యకార యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నాను. –ఉమ్మిడి జగన్, పూడిమడక మత్స్యకార నాయకుడు -
స్థానికులకు ఉద్యోగాలివ్వడం లేదు...
భూములు, ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు, స్థానికులకు, మత్స్యకారులకు చట్ట ప్రకారం ఉపాధి కల్పించాలి. ఏయే పరిశ్రమల్లో స్థానికులకు ఎంత మందికి ఉపాధి కల్పించారో పరిశ్రమ బయట బోర్డు పెట్టాలి. పరిశ్రమలోపల ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికై నా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల అభ్యున్నతికి పాటు పడేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. –రొంగలి రాము, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు -
పెద్దేరు కాలువ వద్ద తప్పిన ప్రమాదం
బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాదిలో ప్రమాదం తప్పింది. శనివారం వడ్డాది ఎస్సీ కాలనీ నుంచి పెద్దేరు నది సిమెంట్ రోడ్డు మీదగా జంక్షన్కు వస్తున్న కారు అదుపు తప్పింది. శివాలయం, సచివాలయానికి వెళ్లే దారి మళ్లింపులో కారు వెనక చక్రం సిమెంటు రోడ్డు అంచు దిగి పెద్దేరు కాలువలోకి ఒరిగింది. ఏ మాత్రం కారు అదుపు తప్పిన పెద్దేరు కస్పా కాలువలోకి కారు పడిపోయి ప్రమాదం జరిగేది. స్థానికులు కారును లేపి సిమెంట్ రోడ్డుపై పెట్టడంతో ప్రమాదం తప్పింది. ఇరుకు రోడ్డులో కార్లు ఇతర వాహనాలు రాకుండా పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
మాడుగుల : స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో పంచాయతీ వారు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కళావతి, మాజీ సర్పంచ్ సూర్యారావు, ఉపసర్పంచ్ వరహాలు, మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలరాజు ఎంపీడీవో అప్పారావు పాల్గొన్నారు. జిల్లా స్థాయి భజన పోటీలు మాడుగుల రూరల్ : కేజేపురం జంక్షన్లో కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా ఈనెల 31న పెళ్లిరాట కార్యక్రమం నిర్వహిస్తారు. వచ్చే నెల 5న పుట్ట మట్టితో పూజలు, 6న కల్యాణోత్సవం, జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. ఉపాధి పనుల్లో నాణ్యత పాటించాలి రోలుగుంట : పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రభుత్వం ఇస్తున్న పూర్తి కూలి పొందాలని ఉపాధి కూలీలకు మండల ప్రత్యేకాధికారి మనోహర్ సూచించారు. మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా పలు గ్రామాల్లో జరుగుతన్న ఉపాధి పనులను ఆయన ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావుతో కలిసి సందర్శించారు. ‘రైతులందరికీ అన్నదాత సుఖీభవ’ నర్సీపట్నం: అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సహాయం కింద అందజేస్తుందని నర్సీపట్నం వ్యవసాయశాఖ ఏడీఏ శ్రీదేవి తెలిపారు. వెబ్ల్యాండ్ ఆర్ఓఎఫ్ఆర్లో ఉన్న రైతుల వివరాలను రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. రైతులు తమ భూమి ఉన్న గ్రామంలో రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించి వీలైనంత తొందరగా వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ప్రకృతి సేద్యంపై దృష్టి సారించండి మాకవరపాలెం : ప్రకృతి సేద్యంపై రైతులు దృష్టి సారించాలని, ఈ విధానాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్రావు సూచించారు. గిడుతూరులో శనివారం రైతులతో వ్యవసాయ, ప్రకృతి సేద్య అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం రైతులతో ర్యాలీ నిర్వహించి, నవధాన్య విత్తనాలను పంపిణీ చేశారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత -
పరిశ్రమల కోసం భూములు కోల్పోయాం..
మాది దుప్పితూరు గ్రామం. నేను అచ్యుతాపురం నుంచి విశాఖలో గల ఒక ప్రైవేట్ పరిశ్రమలో పని చేసుకునేందుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం రాకపోకలు చేస్తున్నాను. బ్రాండిక్స్ పరిశ్రమలో మా భూములు కోల్పోయాం. కంపెనీ వారు వెయ్యి ఎకరాల స్థలం ఏడాదికి కేవలం వెయ్యి రూపాయలు లీజుకి ప్రభుత్వం నుంచి తీసుకుని, 60 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నేటికీ కల్పించలేదు. నా లాంటి అర్హత కలిగిన ఎందరో యువకులు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం చొరవతో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాను. –మాడెం అజయ్, స్థానిక యువకుడు -
పూరిల్లు.. పొదరిల్లు
● తాటాకు ఇంటిపై పెరుగుతున్న మక్కువ ● పల్లెకు వచ్చి సేద దీరుతున్న పట్నవాసులు ● ఫామ్ హౌస్ కల్చర్కు ఆదరణ పక్షుల కువకువలు వినిపించకుండా పోతున్నాయి.. ఆలమందలు కనిపించకుండా పోతున్నాయి.. ప్రకృతి అందాలు కనుమరుగయ్యాయి.. సూర్యుడు కూడా కనిపించనంతటి ఎత్తైన భవనాలు.. ఆ ఇళ్లలో కృత్రిమ బంధాలతో బతుకంటేనే విసుగెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే మళ్లీ పాత రోజుల వైపు కొందరు వెనుదిరిగి చూస్తున్నారు. ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు.ఎన్.గజపతి నగరంలో ఉపాధ్యాయుడు చిరికి శ్రీనివాసరావు కట్టించుకున్న తాటాకు ఇల్లు మాడుగుల: పట్టణాల్లోని రణగొణ ధ్వనులకు దూరంగా ఉంటే ఎంత బాగుంటుంది! వాతావరణ కాలుష్యం సోకని ప్రపంచానికి దగ్గరయ్యే అదృష్టం దక్కితే ఎంత బాగుంటుంది! ఈ ఊహే ఇప్పుడు అందరినీ పల్లెటూరి వైపు నడిపిస్తోంది. తాతల కాలం నాటి పూరి గుడిసెలంటే కొందరు మక్కువ చూపిస్తున్నారు. పెంకుటిళ్లు, డాబాలు రావడంతో పల్లెల్లో కూడా పూరిళ్లు కనుమరుగయ్యాయి. తాటాకు కమ్మలతో నిర్మించిన ఇళ్లలో వేసవి కాలంలో చల్లదనం.. చలికాలంలో వెచ్చదనం ఉంటుంది. ఎటువంటి అనారోగ్యాలు దరి చేరేవి కావు. రైతులకు పండే దినుసులు దాచుకోవడానికి బాగుండేవి. అయితే అగ్ని ప్రమాదాలకు భయపడి గ్రామాల్లో కూడా డాబాలు నిర్మించుకున్నారు. తాటి చెట్లు ఏవీ.. రైతు ఉన్న చోట తాటి చెట్టు ఉంటుందన్న సామెత ఇప్పుడు వినిపించకుండా పోయింది. తాటి చెట్లు లేవు, ఆ చెట్లు ఎక్కి తాటాకులు నరికే వారు కూడా కనుమరుగయ్యారు. అక్కడక్కడ మాత్రమే వీరు దర్శనమిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా పట్టణాలకు వెళ్లి నివాసముండడంతో అలాంటి వారు అరుదుగా కనిపిస్తున్నారు. అంతరించిన ఊర పిచ్చుకలు గ్రామీణ ప్రాంతాల్లో తాటాకు ఇళ్లు ఉండడం వలన తాటాకు పంచ పాలీల్లో ఊర పిచ్చుకలు అధికంగా ఉండేవి. ఇప్పుడు డాబా ఇళ్లు రావడంతో ఆ పిచ్చుకలు అంతరించిపోవడంతో పొలాల్లో చీడపురుగులు పెరిగిపోయి గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు తక్కువ ఖర్చుతో తాటాకు ఇల్లు నిర్మాణం జరిగేది. కానీ ప్రస్తుతం ప్రతి ఏటా తాటాకు నేతకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. తాటి చెట్లు చాలావరకు అంతరించిపోతుండడంతో ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్క తాటాకు 10 రూపాయల ధర పలుకుతోంది. పని దొరకక పట్టణాలకు వలస వెళ్లిపోవడంతో తాటాకు నేసే వారు తక్కువయ్యారు. ట్రెండ్ మారుతోంది.. రానురాను ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు కనిపిస్తోంది. కొంతమంది మళ్లీ తిరిగి వారి స్వగ్రామాలకు వచ్చి తాటాకు ఇల్లు నిర్మించుకుని వేసవి సెలవుల్లో సేద తీరుతున్నారు. ప్రస్తుతం ఈ తరహాలోనే ఫామ్హౌస్లు నిర్మితమవుతున్నాయి. దేవరాపల్లి మండలంలో ఎన్.గజపతినగరం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చిరికి శ్రీనివాసరావు ఇప్పటికీ తాటాకు ఇంట్లోనే నివసిస్తున్నారు. మాడుగుల నియోజకవర్గంలో ఈ తరహా ఇళ్లు సుమారు 300 వరకు ఉన్నాయని అంచనా. తాటాకు ఇల్లంటే ఇష్టం నా చిన్నతనం నుంచి తాటాకు ఇంటిలోనే నివాసం ఉంటున్నాను. ఎందుకో ఈ వాతావరణం అంటే నాకెంతో ఇష్టం. ఇలాంటి చోట్ల స్వచ్ఛత గోచరిస్తుంది. ఎంతో ఆరోగ్యకరం కూడా. పూరింటిలో వేసవిలో కూడా ఏసీ పెట్టనవసరం లేదు. చల్లగా ఉంటుంది. మేడ ఇల్లు కట్టుకోగలిగే స్థోమత ఉన్నా తాటాకు ఇంటిలోనే నివాసం ఉంటాను. ఇప్పుడు నాలాగే చాలామంది ఆలోచిస్తున్నారు. –చిరికి శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, ఎన్.గజపతినగరం తాటాకు ఇంటికి డిమాండ్ గ్రామాల్లో తాటాకు ఇళ్లు ఉండేటప్పుడు ఊర పిచ్చుకలు ఉండేవి. ఇప్పుడు డాబాలు రావడంతో అవి అంతరించిపోయి నేడు జూలో చూడవలసిన పరిస్థితి దాపురించింది. ధాన్యం, అపరాలు బయట ఆరబోసినప్పుడు గింజల్లో పురుగులు లేకుండా ఏరుకునేవి. నేడు మందులు చల్లినా పురుగులు నశించటంలేదు. అందుకే డాబాలున్నా సరే పక్కన చిన్న తాటాకు ఇల్లు నిర్మించుకుంటున్నారు. –పొలమేర విజయలక్ష్మి, ఎంపీటీసీ, మాడుగుల -
కళ్ల ముందే కుమారుడి మరణం
సబ్బవరం: సబ్బవరం మండలం చిన్నపాలెం సమీపంలో అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఆ నిరుపేద కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. నాతవరం మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన నక్కా అప్పలస్వామి, పద్మ దంపతులు ఆనందపురం మండలం గిడిజాల సమీపంలోని నీళ్లకుండీల వద్ద ఓ సిమెంట్ ఇటుక బట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వగ్రామంలో జరిగిన బోడకొండమ్మ పండగలో పాల్గొని, తిరిగి పనికి వెళ్లడానికి తమ తొమ్మిదేళ్ల కుమారుడు మనోజ్తో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. జాతీయ రహదారిపై చిన్నపాలెం సమీపంలో నిలిచి ఉన్న కోళ్లను తరలించే బొలెరో వాహనాన్ని వారి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మనోజ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పలస్వామి, పద్మ తీవ్ర గాయాలతో హాహాకారాలు చేశారు. వారిని హుటాహుటిన 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటాడుతున్న విషాదం: ఈ కుటుంబంలో ఇది రెండో విషాదం. అంతకుముందు వారి చిన్న కుమారుడు శర్వాన్ సత్యనారాయణ గుండె సంబంధిత వ్యాధితో మరణించాడు. ఒక బిడ్డను వ్యాధితో పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు, ఇప్పుడు పెద్ద కొడుకును కూడా రోడ్డు ప్రమాదంలో కోల్పోయారు. మనోజ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మనోజ్ పెదనాన్న అప్పలకొండ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చావుబతుకుల మధ్య తల్లిదండ్రులు జాతీయ రహదారిపై మృత్యుఘోష -
ఒక్కో పోస్టుకు 43 మంది పోటీ
విశాఖ విద్య: మెగా డీఎస్సీకి దరఖాస్తు గడువు ముగిసింది. చాలా కాలం తర్వాత వెలువడిన నోటిఫికేషన్ కావడంతో ఉపాధ్యాయ పోస్టు సాధించేందుకు శిక్షణార్థులు భారీగా పోటీపడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని మేనేజ్మెంట్లలో 1,139 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 29,779 మంది అభ్యర్థులు 49,658 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సారి డీఎస్సీకి పోటీ తీవ్రంగానే ఉండనుంది. అంటే ఒక్కో పోస్టుకు 43 మంది పోటీపడుతున్నారు. ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు అర్హతలను బట్టి ఆయా సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సమయం తక్కువ.. ఒత్తిడి ఎక్కువ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. మరో 20 రోజుల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు డీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ కలిగిస్తోంది. సమయం పెంచి, అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేయింబవళ్లు పుస్తకాలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. భర్తీ కానున్న పోస్టులు ఇవే.. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734(ఓపెన్ 290 + ఇతర కేటగిరీల మొత్తం 444) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్లో 5 ఖాళీలు కలుపుకుని మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉపాధ్యాయ కొలువుకు దరఖాస్తుల వెల్లువ 1,139 పోస్టులకు 49,658 పైగా దరఖాస్తులు కొలువు కొట్టాలంటే కష్టపడాల్సిందే.. -
తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
అనకాపల్లి టౌన్: నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన కుమార్తె కనిపించడంతో ఆ తల్లి ఆనందానికి హద్దులు లేవు. పాపను ఎత్తుకొని ముద్దాడింది. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. కలకలం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తల్లీబిడ్డలను ఒక్కటి చేశారు. అనకాపల్లి లోకవారి వీధిలో నివసిస్తున్న కశింకోట మండలం గవరపేట వీధికి చెందిన కూలీ దంపతులు భీశెట్టి హరీష్, లలిత ఈనెల 14న పనిలోకి వెళ్లాక వారి నాలుగేళ్ల చిన్నారి లోహిత కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. మర్నాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ విజయకుమార్ నేతృత్వంలో ఎస్సైలు సత్యనారాయణ, ఈశ్వర్రావు, వెంకటేశ్వరరావులు, సీసీఎస్ ఎస్ఐలు అశోక్కుమార్, స్వామినాయుడు, అప్పలరాజు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుల కదలికలను కనిపెట్టారు. చాక్లెట్ ఆశ చూపించి.. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. చిన్నారి ఒక మహిళను అనుసరిస్తూ వెళ్లింది. డెయిరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి, మరికొన్ని చాక్లెట్లను చూపించి, నిందితురాలు బాలికను ఆకర్షించింది. పెరుగుబజార్లో బాలికతో కలిసి అనకాపల్లి–విశాఖ 500 నెంబర్ గల ఆర్టీసీ బస్సులో 14వ తేదీ సాయంత్రం 5.50 గంటలకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఫేస్ ఐడెంటిఫికేషన్తో మహిళ ఫోన్ నంబర్ను కూడా పోలీసులు కనుగొన్నారు. వెంటనే మహిళ ఫోటోను స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి ఆమెను గాజువాకలో పెందగంట్యాడ నివాసి టొంటోని లక్ష్మీగా గుర్తించారు. పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో నిందితులు టొంటోని లక్ష్మీ, ఆమె భర్త టొంటోని అప్పలస్వామి బాలికతో కలిసి బొలెరో వాహనంలో అనకాపల్లికి చెందిన బోనాలా దేవిని కలవడానికి అనకాపల్లికి వస్తుండగా.. జలగలమదుం జంక్షన్ వద్ద అనకాపల్లి టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు పిల్లల దొంగల ముఠా అరెస్టు వివరాలు వెల్లడించిన ఎస్పీ సంచలనం సృష్టించిన మిస్సింగ్ కేసు వివరాలను ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనకాపల్లికి చెందిన బోనాల దేవి సూచనలతో గాజువాకకు చెందిన టొంటోని లక్ష్మి అనకాపల్లి వచ్చి పాపను మాయం చేసిన విషయం గుర్తించామన్నారు. నిందితులు ముగ్గురినీ విచారించగా పాపను విక్రయించడానికి ప్రయత్నించినట్లు అంగీకరించారని తెలిపారు. మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితురాలు లక్ష్మి విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కిడ్నీ రాకెట్ కేసులో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుడు టొంటోని అప్పలస్వామి రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఇన్చార్జ్ డీఎస్పీ బి.మోహన్రావు, టౌన్ సీఐ టీవీ విజయ్కుమార్ బృందానికి నగదు రివార్డు, ప్రశంసా పత్రాలు అందజేశారు. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో కిడ్నాప్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ కలకలం రేపుతోంది. అనకాపల్లి టౌన్కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి అదృశ్యం అయినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు.సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన అనకాపల్లి పోలీసులు షాక్కు గురయ్యారు. ఓ మహిళ చాకచక్యంగా చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. గుర్తు తెలియని మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాత కిడ్నాప్ గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
మూడు ముక్కలాట
● జీవీఎంసీలో తారస్థాయికి కూటమి రాజకీయం ● టీడీపీ, జనసేన అధిష్టానం దృష్టికి పంచాయితీ ● తమకే ఇవ్వాలంటూపట్టుబడుతున్న జనసేన ● ససేమిరా అంటున్న టీడీపీ ● ఇరు పార్టీల మధ్య అగ్గిరాజేస్తున్న డిప్యూటీ మేయర్ పోస్ట్ డాబాగార్డెన్స్: జీవీఎంసీలో కూటమి రాజకీయం తారాస్థాయికి చేరింది. అవిశ్వాసం ద్వారా గత మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్లను పదవుల నుంచి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత మేయర్ను తొలగించి, తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాస్ను కూటమి సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయానికి వస్తే, కూటమిలో విభేదాలు మొదలయ్యా యి. మేయర్ పదవిని తీసుకున్నందున, డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ వివాదం తెలుగుదేశం పార్టీ అధిష్టానం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ల దృష్టికి చేరింది. తమకంటే తమకు కావాలంటూ.. మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకున్నందున, పొత్తులో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కార్పొరేటర్లు, పెద్దలు పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే తాను రాజీనామా చేస్తానని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ అధినేతకు బహిరంగంగా లేఖ పంపారు. దీంతో కూటమి రాజకీయం వేడెక్కింది. పొత్తు ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవి తమకు కావాలని జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఆశిస్తోంది. ఇదిలా ఉండగా, జనసేన పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన పెద్దిరెడ్డి ఉష, వంశీరెడ్డి, మాసిపోగు మేరీజోన్స్, ఇండిపెండెంట్గా గెలిచి ఆ పార్టీలో చేరిన మహ్మద్ సాదిక్, కందుల నాగరాజుతో పాటు ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి కూడా పోటీలో ఉన్నారు. తాడోపేడో.. డిప్యూటీ మేయర్ ఒక్క పోస్టు కోసం రెండు పార్టీలు పట్టువిడవకుండా ఉన్నాయి. ఈ విషయంలో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. డిప్యూటీ మేయర్ తమకే ఇవ్వాలని జనసేన గట్టిగా పట్టుబడుతుండగా, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పోస్టును వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఈ నెల 19న ఎన్నిక జరగనుంది. మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడంతో, డిప్యూటీ మేయర్ తమకు కేటాయించాలని జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో రాజీనామా చేస్తామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ శుక్రవారం పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ పంపడంపై కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అంత సీన్ లేదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్కే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలంటూ సాక్షాత్తు నూతనంగా ఎన్నికై న మేయరే అధిష్టానానికి లేఖ పంపినట్టు భోగట్టా. వీరిద్దరి మధ్య నేను అర్హురాలినేనంటూ బీజేపీ కార్పొరేటర్ కూడా రేస్లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కూటమిలో అంతర్గత తగాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ కుమ్ములాటలే నిదర్శనం. నువ్వా..నేనా? డిప్యూటీ మేయర పదవిపై పార్టీల అధినాయకులు తేల్చకపోవడంతో ఇరు పార్టీల్లోనూ ఆశావాహుల సంఖ్య పెరిగింది. టీడీపీలో 10 మంది వరకు ఈ పదవి కోసం పోటీ పడతుండగా, జనసేనలో ఉన్న వారంతా (ఒక్క మూర్తి యాదవ్ తప్పా..ఎందుకంటే మూర్తి యాదవే తనను మినహాయించి ఎవరికై నా ఇవ్వాలని పవన్ కల్యాణ్కు పంపిన లేఖలో పేర్కొన్నారు) రేసులో ఉన్నట్టు తెలిసింది. ఎవరి స్థాయిలో వారు సీనియర్ల ద్వారా అధినాయకుడి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరు పార్టీల నుంచి ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుకు డిప్యూటీ మేయర్ కట్టబెట్టాలని ఆ పార్టీలో పలువురు కార్పొరేటర్లు భావిస్తూ..ఆ పేరు ప్రతిపాదించినట్టు సమాచారం. ఇక జనసేన విషయానికొస్తే..ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మేయర్గా టీడీపీ నేత ఉండడంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పదవిని జనసేన వదులుకునే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు. జనసేన నుంచి ఎందరో ఆశావాహులున్నా..ఎమ్మెల్యేలు మాత్రం ఉషశ్రీ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కూటమిలో డిప్యూటీ మేయర్ పదవి పెద్ద రాద్ధాంతం చేస్తోంది. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
యలమంచిలి రూరల్: మున్సిపాలిటీ పరిధి సోమలింగపాలెంలో విషాదం చోటు చేసుకుంది.సమీప బంధువైన యువకుడి వివాహ వేడుకలో భాగంగా భోజనాల దగ్గర విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అదే గ్రామానికి చెందిన కొయిలాడ చిన అప్పలనాయుడు(27) మృతి చెందాడు.ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.వివరాలు... గురువారం రాత్రి సోమలింగపాలెంలో ఒక వివాహ వేడుకలో భోజనాలు చేసే చోట అదనంగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం కోసం లైటింగ్ వేసే వ్యక్తికి సహాయం చేసే నిమిత్తం చిన అప్పలనాయుడు షామియానాలు వేసే ఇనుపరాడ్డును అక్కడకు తీసుకొస్తుండగా పైన ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి.దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్పృహ కోల్పోయిన యువకుడిని హుటాహుటిన యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యుడు తెలిపారు. అప్పటివరకు ఎంతో ఆనందంగా జరుగుతున్న వివాహ వేడుకలో ఊహించని రీతిలో అపశ్రుతి చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా బంధువులు,గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహమైంది.భార్య గర్భవతి.ఈ ఘటనతో ఆ వివాహాన్ని వధూవరుల కుటుంబ సభ్యులు అన్నవరం దేవస్థానంలో చేయించారు. మృతి చెందిన యువకుడు తండ్రి ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోమలింగపాలెంలో పెళ్లింట విషాదం -
వుషు పోటీల్లో అక్కిరెడ్డిపాలెం క్రీడాకారులకు పతకాలు
అనకాపల్లి టౌన్: మండలంలోని అక్కిరెడ్డి పాలెం ఫిట్నెస్, బాక్సింగ్ క్లబ్కు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి వుషు పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. కర్నూల్లో ఈ నెల 12 నుంచి 14 వరకు సబ్ జూనియర్,జూనియర్ బాలబాలికల చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. సబ్ జూనియర్ కేటగిరీలో జిమ్ నుంచి ఎనిమిది మంది పాల్గొనగా 42 కిలోల విభాగంలో ఎన్.వార్షిక్, 48 కిలోల విభాగంలో గోవర్ధన్, 60 కిలోల విభాగంలో బి.దుర్గాప్రసాద్ బంగారు పతకాలు సాధించారు. జూనియర్ కేటగిరి 48 కిలోల విభాగంలో ఇ.లక్ష్మిత్, 60 కిలోల విభాగంలో ఎ.వరప్రసాద్ బంగారు పతకాలు సాధించగా , 52 కిలోల విభాగంలో ఎన్.తులసీరామ్ రజతం, 56 కిలోల విభాగంలో పి.శశి, 65 కిలోల విభాగంలో వై.వినయ్ కాంస్య పతకాలు సాధించారు. వీరందరూ ఈ నెల 26 నుంచి 31 వరకు తమిళనాడులో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు జిమ్ కోచ్లు అరుణ, హరీష్ తెలిపారు. -
మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు
తుమ్మపాల: జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సర్వే, మాతా, శిశు మరణాలు, వ్యాధి నిరోధక టీకాలు, మలేరియా, డెంగ్యూ వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన దంపతులు, గర్భిణులు, శిశువుల రిజిస్ట్రేషన్ సక్రమంగా జరగాలన్నారు. హైరిస్క్ కేసులు, బరువు తక్కువ గల పిండాల కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి ఆస్పత్రులకు తరలించాలన్నారు. తదుపరి సమీక్షలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో హాజరుకావాలని అధికారులకు ఆమె సూచించారు. అబార్షన్లు అధికంగా చేస్తున్న ఆస్పత్రులపై నిఘా పెట్టాలని, అబార్షన్లకు గల కారణాలపై నివేదిక అందించాలన్నారు. శిశువులకు వ్యాక్సినేషన్ సకాలంలో పూర్తి చేసి, వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. గత సంవత్సరం 19,781 జననాలకు 133 మంది శిశువులు, 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 16 మంది మరణించారని, 15 మాతృ మరణాలు సంభవించాయని కలెక్టర్ వివరించారు. ఇక నుంచి మరణం సంభవించిన ప్రతి కేసు నివేదికను వెంటనే అందజేయాలన్నారు. గ్రామాల్లో ఆశా, ఏఎన్ఎం కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కువగా సిజేరియన్ నిర్వహిస్తున్న ఆస్పత్రుల వివరాలు సేకరించాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను ఆస్పత్రులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, 104 వాహనాల ద్వారా ప్రజలకు సక్రమంగా సేవలు అందేలా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఎం.శాంతిప్రభ, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వి.రమణ, డీఐవో డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, డీపీఎంవో డాక్టర్ ప్రశాంతి, మెడికల్ అధికారులు పాల్గొన్నారు. అబార్షన్ చేస్తున్న ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్ -
హైవే పక్కన గ్యాస్ ట్యాంకర్ బోల్తా
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న టీఎస్ 06 యూసీ0645 నంబరు గల గ్యాస్ ట్యాంకర్ రేగుపాలెం సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ లీకై ంది. తెల్లని గ్యాస్ పక్కనున్న పొలాలు, కాలువ వైపునకు వ్యాపించింది. ఇది చూసిన వాహనచోదకులు, చుట్టు పక్కల వారు భయంతో పరుగులు తీశారు. అయితే లీకై న వాయువు శీతల పానీయాల్లో ఉపయోగించే కార్బన్ డయాకై ్సడ్గా లారీ డ్రైవర్, క్లీనర్ చెప్పడంతో ప్రమాదకరం కాదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలువురు వాహన చోదకులు లీకవుతున్న గ్యాస్కు ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. సంఘటన స్థలానికి వెళ్లిన హైవే పోలీసులు లీకవుతున్న గ్యాస్తో ఎవరికీ ప్రమాదం లేదని, భయపడవద్దని చెప్పారు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్కు ఎటువంటి గాయాలు కాలేదు. భారీగా లీకై న గ్యాస్ పరుగులు తీసిన వాహనచోదకులు, స్థానికులు -
పాలిసెట్, ఏపీఆర్జేసీ ఫలితాల్లో తిమిరాం విద్యార్థి సత్తా
దేవరాపల్లి: మండలంలోని తిమిరాం గ్రామానికి చెందిన ఎలిశెట్టి హేమ చంద్రకుమార్ పాలిసెట్, ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్లు సాధించి సత్తా చాటాడు. ఓ ప్రైవేటు విద్యా సంస్థలో పదో తరగతి చదివిన విద్యార్థి ఇటీవల సీబీఎస్ఈ ఫలితాల్లో 477 మార్కులు సాధించాడు. ఏపీఆర్జేసీలో 132 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంక్ సాధించాడు. పాలిసెట్ ప్రవేశ పరీక్షలో 120కు 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్తో మెరిశాడు. హేమచంద్రకుమార్ తండ్రి సూరిబాబు ఆటో డ్రైవర్ కాగా.. తల్లి బహుమతి గృహిణి. -
ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ సతీష్కుమార్ హఠాన్మరణం
చింతపల్లి/రావికమతం: లంబసింగి గ్రామానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్, స్థానిక వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కంఠా జాహ్నవి భర్త సతీష్కుమార్(46)హఠాన్మరణం చెందారు. కుటుంబీకులు అందించిన వివరాలిలా ఉన్నాయి. సతీష్కుమార్ రావికమతం మండలం కొత్తకోట ఎస్బీఐ ఫీల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ నర్సీపట్నం శారదానగర్లో నివాసముంటున్నారు. గురువారం ఉద్యోగ రీత్యా సతీష్కుమార్, భార్య జాహ్నవి చింతపల్లి వచ్చి విధులు ముగించుకుని స్వగ్రామం చౌడుపల్లిలో బస చేశారు. శుక్రవారం ఉదయం బ్యాంకుకు బయలు దేరే సమయంలో చాతి నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయాడు. వాచ్మన్, స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే సతీష్కుమార్ మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామం లంబసింగికి తరలించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పిన్న వయస్సులో సతీష్ మృతి చెందడంతో ఇటు చౌడుపల్లి, లంబసింగిలో విషాదఛాయలు అలముకున్నాయి. సతీష్కు భార్యతో పాటు కుమారుడు, కుమారై ఉన్నారు. -
దాతలు సహకరించినా దక్కని ప్రాణం
రావికమతం: తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యార్థి మణికంఠ చికిత్స పొందతూ విశాఖలో మృతిచెందాడు. మండలంలో కన్నంపేట గ్రామానికి చెందిన సియాద్రి మణికంఠ కొత్తకోట హైస్కూల్లో పదోతరగతి చదివి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మానవతా వాదులు స్పందించి సహాయం చేసి, విద్యార్థి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. విశాఖలోని కేజీహెచ్ లో చిక్సిత పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో కన్నంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు నాని, అమ్మాజీ గుండెలవిసేలా రోదించారు. స్నేహితులు, పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు
కశింకోట: మండలంలో ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందానికి చెందిన సుమారు 20 మంది గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి విశాఖలోని వేపగుంట వెళుతున్న సింహాచలం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు.. ముందు వెళుతున్న ప్రైవేటు బస్సును వెనుకగా ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సులోని సుమారు 20 మందికి స్వల్పగాయాలయ్యాయి. వారిలో కొంతమందిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అదే బస్సులో తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స పొంది ఇళ్లకు వెళ్లిపోయారు. వారి వివరాలు తెలియరాలేదు. వేపగుంటకు చెందిన యువతి వివాహం అన్నవరంలో జరగడంతో దానికి బంధు మిత్రులు ఆర్టీసీ బస్సును లీజుకు తీసుకొని వెళ్లి, తిరుగు ప్రయాణంలో విశాఖ వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 40 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో బస్సు ముందు అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం -
ఆర్ఏఆర్ఎస్ విద్యార్థులకు ర్యాంకుల పంట
అనకాపల్లి: ఏపీ ఈసెట్–2025 అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ పరీక్షల్లో ఆర్ఏఆర్ఎస్ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తొలి యాభై స్థానాలలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పరిశోధన స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డి.నళిని రాష్ట్రంలో మొదటి ర్యాంక్, జి.భావన 3వ ర్యాంక్, ఇ.సాయి సుదర్శిని 4, ఎం.కీర్తి స్వరూప 5, పి.గురుసాయి 6, కె.సాయి హర్షిణి 7, ఎం.దీపిక 8, జి.మణిరత్నం 9వ ర్యాంక్తోపాటు జాహ్నవిరాణి 12వ ర్యాంక్, ఎం.త్రిషాదేవి 13, కె.గ్లోరియా షెరూన్ 14, జి.రక్షిత 17, ఎం.రాహుల్ 23, ఎస్.ప్రిన్స్ 25, ఎల్.లావణ్య 29, పి.దివ్య 36, పి.రేష్మ 39, సీహెచ్.శ్రీనివాసరావు 40, ఎ.దేవి అమృత 42, వైవిఎస్.ప్రశాంత్ 47వ ర్యాంకులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. -
మట్టి తిని బతకాలా ?
చీడికాడ: ఉపాధి హామీ పథకం బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఉపాధి హామీ పథకం కూలీలు శుక్రవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని అర్జునగిరిలో ఉపాధి వేతనదారులు నోటిలో మట్టిని పెట్టుకుని... దానిని తింటున్నట్టు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న వీరికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉపాధి బకాయిలు చెల్లించలేదన్నారు. వేతనదారులు మట్టితిని బతకాలా అని ప్రశ్నించారు. సకాలంలో వేతనాలు చెల్లించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేదన్నారు. కూలీలకు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి వేతనదారుల వినూత్న నిరసన -
పెళ్లి బృందం కారు బోల్తా
● నవ దంపతులతో సహా ఆరుగురికి గాయాలు నక్కపల్లి: మండల కేంద్రం నక్కపల్లికి సమీపంలో 16 వ నంబర్ జాతీయ రహదారి పై సారిపల్లి పాలెం వద్ద నూతన దంపతులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నూతన దంపతులతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కశింకోట మండలం నూతగుంటపాలెం గ్రామానికి చెందిన యామిని, వినయ్లకు గురువారం వివాహం జరిగింది. శుక్రవారం అన్నవరంలో సత్యదేవుని వ్రతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా సారిపల్లి పాలెం సమీపంలో బస్సును తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీ కొంది. ఈ ఘటనలో నూతన దంపతులు యామిని, వినయ్లతోపాటు వైష్టవి, ఆశ, వీరబాబు, రోషిణిలకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదం పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
చదువులు తిరోగమనం
● అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 స్కూళ్లు రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అక్కడి విద్యార్థులు సమీప హైస్కూళ్లకు తరలింపు ● అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 స్కూళ్ల మూత ● దూరం కానున్న హైస్కూల్ చదువులు ● గ్రామాల్లో డ్రాపౌట్ కానున్న విద్యార్థులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో 46 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ పాఠశాలను రద్దు చేసి విద్యార్థులను 4 కిలోమీటర్ల దూరంలోని వేములపూడి హైస్కూల్కు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు అంత దూరం వెళ్లి చదువుకోగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనివల్లపేద విద్యార్థులు చదువుకు దూరమై, డ్రాపౌట్లుగా మారే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రద్దు చేసిన అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విశాఖ విద్య : కూటమి ప్రభుత్వం విద్యారంగంపై ప్రయోగాల పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది రకాల పాఠశాలల పేరుతో పాఠశాల విద్య పునర్నిర్మాణం చేపట్టడం గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యగా ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలను అప్గ్రేడ్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ కాగా, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలను డీగ్రేడ్ చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయడం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యారంగ నిపుణులు అంటున్నారు. విద్యాశాఖ చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ చూడలేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. గ్రామీణ విద్యకు విఘాతం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించనుంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు. గతంలో దూరం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఐదో తరగతి తర్వాత చదువు మానేసేవారు. అందుకే గత ప్రభుత్వాలు ప్రాథమికోన్నత పాఠశాలలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ప్రస్తుత నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు హైస్కూల్ చదువులు మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని విద్యారంగ నిపుణు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల్లో అసంతృప్తి జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీప హైస్కూళ్లలో విలీనం చేసి, ప్రైమరీ తరగతులకు స్కూల్ అసిస్టెంట్లతో బోధన ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దు చేయడంతో 6, 7, 8 తరగతులను సమీప హైస్కూళ్లకు తరలిస్తున్నారు. ఫలితంగా, ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు (స్కూల్ అసిస్టెంట్లు) వేరే చోటుకు బదిలీ కావలసి వస్తోంది. పాఠశాలల పునర్నిర్మాణం వల్ల ఉపాధ్యాయ పోస్టులకు కోత పడుతోంది. యూపీఎస్లు రద్దు చేయడంతో స్కూల్ అసిస్టెంట్లు వేర్వేరు హైస్కూళ్లకు బదిలీ కానున్నారు. ఈ పరిణామాలతో ఉపాధ్యాయులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 ప్రాథమికోన్నత పాఠశాలలను (యూపీఎస్) రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 27, అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 పాఠశాలలు రద్దు కానున్నాయి. ఇకపై ఈ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రద్దు చేసిన యూపీఎస్లలోని 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలకు తరలించాలని ఆదేశిస్తూ, దీనికి సంబంధించిన మ్యాపింగ్ను కూడా పూర్తి చేశారు. ఈ విధానం 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 82 స్కూళ్ల రద్దు -
అవిశ్వాసం నోటీసు తిరస్కరణ
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్లపై కూటమి నాయకులిచ్చిన అవిశ్వాసం నోటీసును కలెక్టర్ విజయ కృష్ణన్ తిరస్కరించినట్టు మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు శుక్రవారం రాత్రి స్థానిక విలేకరులకు తెలిపారు. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికై న వైస్ చైర్మన్లు బెజవాడ గోవిందరాజు నాగేశ్వరరావు, అర్రెపు నాగ త్రినాథ ఈశ్వర గుప్తాలపై మెజార్టీ లేకపోయినా కూటమి నాయకులు అవి శ్వాసం కోరుతూ జిల్లా కలెక్టరుకు ఈ నెల 8వ తేదీన నోటీసు అందజేశారు. నోటీసులో 16 మంది సంతకా లు ఉన్నాయి. సంతకాల్లో కొన్ని అసంపూర్తిగా, అనుమానాస్పదంగా ఉన్నాయి. నోటీసులో కింద ఇద్దరు వార్డు కౌన్సిలర్ల పూర్తి చిరునామాలు, సంతకాలు ఉండాలి. ఇవేవీ లేకుండానే అవిశ్వాసం కోరుతూ నోటీసు అందజేశారు. అర్రెపు నాగ త్రినాథ గుప్తా పదవీ బా ధ్యతలు చేపట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు పూర్తి కాలేదు. అయినప్పటికీ నోటీసులో గుప్తా పేరు కూడా చేర్చారు. పట్టణంలో 25 వార్డులుండగా వైఎస్సార్సీపీకి 23 మంది, టీడీపీకి ఒకరు, స్వతంత్రులు ఒకరు వార్డు సభ్యులుగా ఉన్నారు. మెజార్టీ లేకపోయినా అవిశ్వాసం కోరుతూ నోటీసు ఇచ్చి ప్రలోభాలతో గెలవాలని కూటమి నాయకులు భావించారు. నోటీసు ఇచ్చిన తర్వాత కూటమికి మద్దతునిస్తున్న వార్డు సభ్యులను ఊటీలో ప్రత్యేక శిబిరానికి సైతం తరలించారు. అయితే వైఎస్సార్సీపీకి చెందిన మెజార్టీ సభ్యులు కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం నిజాయతీగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం వీగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. వేధింపుల పర్వం : వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న కౌన్సిలర్లను పలు రకాలుగా బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈరిగిల గణేష్పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సైతం వెనకాడలేదు. శుక్రవారం పట్టణంలోని ఎస్సీ కాలనీలో గణేష్ కొత్తగా నిర్మించుకుంటున్న ఇల్లు అక్రమ కట్టడమంటూ మున్సిపల్ అధికారులు నోటీ సు అతికించారు. అంతలోనే ఏమనుకున్నారో గోడకు అతికించిన నోటీసును మళ్లీ తొలగించి తమ వెంట తీసుకుపోయినట్టు గణేష్ బంధువులు సాక్షికి చెప్పా రు. శనివారం ఉదయం గణేష్ ఇంటిని కూల్చివేయడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పట్టణ పోలీసులను బందోబస్తు కల్పించాలని కోరినట్టు సమాచారం. ఇలాంటి కుట్రలను ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. పట్టణంలో పదుల సంఖ్యలో ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ తొలగించాలని, ఆ తర్వాతే తమ పార్టీకి చెందిన గణేష్ వార్డు సభ్యుని ఇంటికి రావాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అసంపూర్తిగా ఉందన్న కలెక్టర్ ఓటమి భయంతోనే తప్పుల తడకగా వేశారంటున్న వైఎస్సార్సీపీ -
ఉప్పొంగిన దేశభక్తి
● నక్కపల్లిలో ఘనంగా తిరంగా ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి అనిత నక్కపల్లి: వందేమాతరం.. భారత్ మాతాకీ జై.. నినాదాలతో నక్కపల్లి హోరెత్తింది. శుక్రవారం తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ఉపమాక ఆర్చ్ నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు జరిగిన ఈ ర్యాలీలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ.. ఇటీవల విజయవంతమైన ఆపరేషన్ సిందూర్కు అందరూ జేజేలు పలికారు. ప్రాణత్యాగం చేసిన వీర సైనికుడు మురళీ నాయక్కు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాజీ సైనికులను సన్మానించారు. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, తోట నగేష్, గెడ్డం బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నేడు ఐఐపీఈ స్నాతకోత్సవం 51 మందికి డాక్టరేట్లు ప్రదానం విశాఖ విద్య: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 5వ స్నాతకోత్సవం శనివారం నోవాటెల్లో జరగనుందని ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్య క్షుడు ప్రొఫెసర్ పి.కె.బానిక్, డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ తెలిపారు. ఐఐపీఈలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించా రు. స్నాతకోత్సవానికి హిందుస్థాన్ జింక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైమ్ డైరెక్టర్ అరు ణ్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నా రు. 51 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో అకడమిక్ ప్రోగ్రామ్ నుంచి ఇద్దరు విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ప్ర దానం చేస్తామన్నారు. అకడమిక్ సీజీపీఏ, ఎ క్స్ట్రా కరిక్యులర్ విజయాల ఆధారంగా ఓవరాల్ ఎక్స్లెన్స్ కోసం ఒక ఉత్తమ విద్యార్థికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి బంగారు పతకం లభిస్తుందన్నారు. -
అరెస్టులు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట
సాక్షి, అనకాపల్లి: విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్రెడ్డిల అరెస్టు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. వీరిద్దరి అరెస్ట్లను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. శుక్రవారం అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరగనిది జరిగినట్లు దుష్ప్రచారం చేస్తూ.. ప్రతి అంశంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఎక్కడా ఏ ఆధారాలు లేకపోయినా, లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అందులో అందరి పేర్లు చేరుస్తూ, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తూ, తప్పుడు వాంగ్మూలాలతో కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ అనైతిక పని, మొత్తం వ్యవస్థలపైనే ప్రభావం చూపుతుందన్నారు. మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతున్నట్లుగా, రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతోందన్నారు. ఈ అరెస్ట్లపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం చేస్తుందని, తమకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ -
దళారుల చేతిలో దగా రైతన్నకు కూరగాయాలు
●దేవరాపల్లి: సరకు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలి.. బేరమాడే స్థాయిలో రైతులను నిలబెట్టాలి.. ఇది ప్రభుత్వం బాధ్యత. అధికారుల కర్తవ్యం. కానీ దళారీలు నిర్భయంగా దోపిడీ చేస్తున్నారు. కష్టపడి సాగు చేసిన రైతును దోచుకుంటున్నారు. అయినా పట్టించుకునేవారు లేరు. జిల్లాలో అతి పెద్దదైన దేవరాపల్లి హోల్సేల్ కూరగాయల మార్కెట్కు జిల్లా నలుమూలల నుంచే కాక విశాఖ, విజయనగరం, అల్లూరి జిల్లాల నుంచి వచ్చి సరకు కొనుగోలు చేస్తారు. మార్కెట్కు రోజూ సుమారు 10 టన్నుల కూరగాయలు వస్తాయి. రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఇక్కడి హోల్సేల్ మార్కెట్కు దేవరాపల్లి, వేపాడ, అనంతగిరి మండలాల పరిధిలో 3 వేల ఎకరాల్లో పండించిన కాయగూరలను తీసుకువచ్చి విక్రయిస్తారు. టమాటా, బీర, బెండ, వంగ, ఆనప, కాకర, చిక్కుడు, బరబాటి, దోసకాయలతోపాటు తోటకూర, పాల కూర, గోంగూర, కొత్తిమీర తదితర ఆకుకూరలను ఇక్కడ పండిస్తారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే.. స్థానిక కాయగూరల మార్కెట్పై ఇటు మార్కెట్ కమిటీ అధికారులు, అటు పంచాయతీ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో దళారీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్ ద్వారా ఆదాయం పొందుతున్న పంచాయతీ అధికారులు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. నిలువ నీడ లేకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇక్కడి రైతులకు రైతుబజారు కార్డులు మంజూరు చేయకపోవడం, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. దేవరాపల్లి హోల్సేల్ మార్కెట్లో దళారీల దోపిడీ సిండికేట్గా ఏర్పడి మద్దతు ధర లేకుండా చేస్తున్న వైనం కనీస మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఆవేదనతో రోడ్లపైన కాయగూరలు పారబోస్తున్న దైన్యం దిగుబడి బాగున్నా.. సుమారు ఎకరం విస్తీర్ణంలో వంగ, బీర, ఆనప, దోస కాయలు సాగు చేశాను. దుక్కులు, ఎరువులు, పురుగుల మందులు తదితర పనులకు సుమారు రూ.22 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. దిగుబడి కూడా బాగానే ఉంది. కాని దేవరాపల్లి హోల్సేల్ మార్కెట్లో మద్దతు ధర ఉండటం లేదు. కనీసం కూలి డబ్బులు కూడా రాలేదు. – కొల్లి రమణ, కూరగాయల రైతు, దేవరాపల్లి కనీస ధర దక్కడం లేదు అరవై సెంట్లలో సుమారు రూ.16 వేల వరకు పెట్టుబడి పెట్టాను. కాయ గూరల దిగుబడి బాగానే ఉంది. కొందరు వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలు లేకుండా చేస్తున్నారు. దీంతో బయట మార్కెట్లో కాయగూర ధరలు బాగానే ఉన్నప్పటికీ దేవరాపల్లి మార్కెట్లో కష్టపడి పండించిన రైతుకు కనీస ధర దక్కడం లేదు. – అల్లు రాము, కూరగాయల రైతు, దేవరాపల్లి -
వారి ప్రేమలు, బాధ్యతలను గుర్తు చేస్తాం
ఆవేశంతో అనర్ధాలు కొనితెచ్చుకుంటారు. అంతవరకు ఉన్న ప్రేమానుబంధాలను ఆ క్షణంలో మరచిపోతారు. వారికి కౌన్సిలర్లు చెప్పే మాటలు ఎంతో ఉపయోగపడతాయి. వారిని ఆలోచింపచేస్తాయి. పెళ్లి చేసుకొని ఐదు, పదేళ్లు అయిన జంటలు కూడా మా వద్దకు వస్తుంటారు. వారిని కనీసం ఐదారుసార్లు కూర్చోపెట్టి కౌన్సెలింగ్ చేస్తాం. భార్యా, భర్తల గొడవల్లో పిల్లల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని కూడా చెపుతాం. మా పరిధి దాటిన తర్వాత కూడా కౌన్సెలింగ్ చేసి లోక్ అదాలత్ ద్వారా ఇద్దరినీ కలుపుతాం. – ఇ.శ్రీనివాసులు, డీఎస్పీ, మహిళా పోలీస్ స్టేషన్, అనకాపల్లి -
నైపుణ్యతకు మెరుగు!
ఆర్ట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులుక్రాఫ్ట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులుఉపాధి కోసం.. నా డిగ్రీ చదువు అనివార్య కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. నాకు ముగ్గురు పిల్లలు. క్రాఫ్ట్లో ఇప్పటికే లోయర్, హయ్యర్ కంప్లీట్ చేశాను. టీటీసీ పూర్తి చేస్తే ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నేను నేర్చుకున్న విద్యలో మరింత నైపుణ్యత పొందుతూ.. ఇంటి వద్ద మరి కొంతమందికి శిక్షణ ఇస్తున్నాను. – కర్రి చంద్రిక, గవరపాలెం, అనకాపల్లి జిల్లా విశాఖ విద్య: నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తూనే.. సత్వర ఉపాధి లక్ష్యంగా నైపుణ్యతతో కూడిన స్వల్పకాలిక టెక్నికల్ కోర్సుల వైపు ఆసక్తి కనబరుస్తోంది. ఇటువంటివారి కోసం విద్యాశాఖ ఏటా వేసవిలో ‘టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్’(టీటీసీ) కోర్సులను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. 42 రోజుల వ్యవధి గల ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 42 ఏళ్ల వరకు వయస్సు గల వారు అర్హులు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ కోర్సులను అభ్యసించేందుకు 180 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం నగరంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ హైస్కూల్లో ప్రత్యేక క్యాంప్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఎన్ఈపీ అమలుతో టీటీసీకి డిమాండ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా వేసవిలో టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉండేవి. జాతీయ విద్యావిధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆర్ట్, క్రాఫ్ట్ సబ్జెక్టు టీచర్లను నియమించాలనే నిబంధన పెట్టారు. టీటీసీ కోర్సు చేసిన వారు మాత్రమే ఆయా పోస్టులకు అర్హులు కావటంతో డిమాండ్ పెరిగింది. మానసిక, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే అంశాలతో కూడిన సబ్జెక్టులు కావటంతో వచ్చే ఏడాది నుంచి కోర్సు వ్యవధి 42 రోజులకు బదులుగా 6 నెలలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నైపుణ్యతతో కూడిన శిక్షణ ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైన శిక్షణ తరగతులు జూన్ 11వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్లో శిక్షణ ఇచ్చేందుకు ఆరుగురు టీచర్లు.. సైకాలజీ, స్కూల్ అడ్మిస్ట్రేషన్ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు మరో ఇద్దరు టీచర్లను నియమించారు. వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నైపుణ్యతతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. స్వయం ఉపాధి వైపు అడుగు టీటీసీ కోర్సుపై ఆసక్తి చూపుతున్న యువత ఆర్ట్, క్రాఫ్ట్ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు వేసవిలో 42 రోజుల పాటు శిక్షణా తరగతులు బొమ్మలు వేయడం ఇష్టం నేను బీటెక్ కంప్యూటర్ సైన్సు పూర్తి చేశాను. ఎంటెక్లో చేరేందుకు ఎంట్రన్స్ రాస్తున్నాను. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఇష్టం. నాన్న ప్రోత్సాహంతో ఆర్ట్లో శిక్షణ పొందుతున్నాను. ఆర్ట్ కోర్సులో లోయర్, హయ్యర్ ఇప్పటికే పూర్తి చేశాను. మరింత నైపుణ్యత పొందేందుకు టీటీసీ శిక్షణ ఉపయోగపడుతుంది. –ఎం.పీ.శ్లేఘన, సుజాతనగర్, విశాఖ జిల్లా -
గతుకుల రోడ్డుపై ఆటో బోల్తా
● డ్రైవర్ మృతి ఎస్.రాయవరం: మండలంలోని నీలాద్రిపురం సమీపంలో అడ్డురోడ్డు – నర్సీపట్నం ఆర్అండ్బీ రోడ్డుపై గురువారం ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఎస్ఐ విభీషణరావు వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన శానాపతి లక్ష్మీవరప్రసాద్(32) భార్యాపిల్లలతో తన స్వగ్రామం నుంచి చినగుమ్ములూరు వెళ్తుండగా, రోడ్డుపై గతుకులు కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ క్రమంలో ఆటో కింద పడిపోయిన లక్ష్మీవరప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అడ్డురోడ్డు సన్షైన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతడు నాలుగేళ్లుగా తిమ్మాపురం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో నివాసం ఉంటూ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చినగుమ్ములూరులో వివాహానికి వెళ్లేందుకు వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
కూటమి మాస్టర్ ప్లాన్
● ఈ నెల 22 నుంచి జూన్ 21 వరకు మళ్లీ అభ్యంతరాల స్వీకరణ ● ఇందులో ప్రజాప్రతినిధులప్రయోజనాలకు పెద్దపీట ● వారి స్థిరాస్తి వ్యాపారాలకు అనుగుణంగా సవరణలకు ప్లాన్ ● నేతలు చెప్పినట్లే మార్పులు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు? విశాఖ సిటీ: కూటమి ‘మాస్టర్’ ప్లాన్ వేస్తోంది. తమ వారికి లబ్ధి చేకూరేలా బృహత్తర ప్రణాళికలో సవరణలకు సిద్ధమైంది. ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేందుకు అడుగులు వేస్తోంది. చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అన్నట్లు.. 2021లో పూర్తయిన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. గతంలో అశాసీ్త్రయంగా మాస్టర్ప్లాన్ రూపొందించారన్న నెపంతో అయిపోయిన పెళ్లికి మళ్లీ బాజాలు వాయించడానికి పూనుకుంది. కేవలం కూటమి నేతల స్థిరాస్తి వ్యాపారాలకు మేలు జరిగేలా మార్పులు, చేర్పులకు ఈ నెల 22 నుంచి మళ్లీ మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించనుంది. 2021లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి వీఎంఆర్డీఏ పరిధిలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తర ప్రణాళిక–2041కు ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడిచినా అది పూర్తి కాకపోవడంతో 2016లో ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థ లీ అసోసియేట్స్కు రూ.10 కోట్లకు ఆ బాధ్యతను అప్పగించారు. అయినప్పటికీ 2019కి కూడా అది పూర్తి కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్ప్లాన్పై దృష్టి సారించింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమయంలో వీఎంఆర్డీఏ పరిధిలో 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. ప్రణాళికను రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల స్వీకరణలో మొత్తంగా 17,460 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వీఎంఆర్డీఏ, రెవెన్యూ, ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సంయుక్త తనిఖీలు, సందర్శనలు నిర్వహించి వాటిన్నింటినీ పరిశీలించారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో ఆలోచన చేసి ముసాయిదా మాస్టర్ప్లాన్ను సిద్ధం చేశారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో 2021 నవంబర్ 8న వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్–2041కు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ.. ప్రజాప్రతినిధులకు లబ్ధి చేకూరేలా? ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోనే వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునః పరిశీలనకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల పేరుతో కూటమి నాయకులు సూచించిన మార్పులు, చేర్పులకే పెద్ద పీట వేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వారు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు సమాచారం. వీరి స్థిరాస్తి వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తుల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రణాళికలను మార్పులు చేసుకోడానికి సిద్ధమవుతున్నట్లు కూటమిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మధురవాడ నుంచి ఆనందపురం మధ్యలోను అలాగే అనకాపల్లిలో పలు చోట్ల మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మాస్టర్ ప్లాన్ మొత్తంగా మార్పు చేసే అవకాశం లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. కేవలం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి శాసీ్త్రయంగా ఉన్న వాటిని మాత్రమే మార్పులు, చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మళ్లీ అభ్యంతరాల స్వీకరణ వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాన్లో మార్పులు చేస్తామని అప్పుడే ప్రకటించారు. అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాస్టర్ ప్లాన్–2041ను సమ్రంగా సమీక్షించాలని నిర్ణయించింది. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ప్లాన్ను తీసుకువస్తామని అమాత్యులు సైతం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే బృహత్తర ప్రణాళికను పునః పరిశీలనకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 22 నుంచి జూన్ 21వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించారు. వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రజలు, భాగస్వాములు, సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. మాస్టర్ ప్లాన్–2041లో ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే స్వయంగా గానీ, పోస్టు లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెలపవచ్చని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ ప్రకటించారు. ప్రజలందరూ మొబైల్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. -
జాబ్మేళాలో 450 మంది ఎంపిక
యలమంచిలి రూరల్: యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు నిరుద్యోగులు నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 25 కంపెనీల్లో ఉద్యోగాలకు 1,500 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. వీరిలో 450 మందిని ఆయా కంపెనీల సెలెక్టర్లు ప్రాథమికంగా ఎంపిక చేసుకున్నారు. అంతకుముందు ఉదయం జాబ్ మేళాను నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎ. గోవిందరావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పి. చంద్రశేఖర్, పీడీ పోలిరెడ్డి, వివిధ కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు. -
జనవాణికి అధికారులు ఎలా వెళ్తారు?
మునగపాక: జనసేన పార్టీ కార్యాలయంలో అధికారులు జనవాణి కార్యక్రమం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు. మునగపాకలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలే గాని జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి దరఖాస్తులు ఎలా స్వీకరిస్తారన్నారు. అధికారులకు ఎటువంటి గైడెన్స్ లేకున్నా పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావడం తప్పిదమన్నారు. అధికారులు జనసేనకు తొత్తుగా వ్యవహరించడం విచారకరమన్నారు. పార్టీ నాయకులతో కలిసి అధికారులు ప్రజా వాణిలో పాల్గొంటే భవిష్యత్లో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆళ్ల మహేశ్వరరావు, ఎస్.బ్రహ్మాజీ, టెక్కలి జగ్గారావు, ఎంఎస్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకులు -
రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో చోడవరం క్రీడాకారులకు పతకాలు
చోడవరం : రాష్ట్ర స్థాయి వుషు మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో చోడవరం క్రీడాకారులు పతకాలు సాధించారు. కర్నూల్లో ఈనెల 12నుంచి 14వ తేదీ వరకూ రాష్ట్రస్థాయి ఉషూ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో చోడవరం గణేష్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు పలు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. జూనియర్స్ 45 కేజీల విభాగంలో తేజ స్వరూప్ బంగారు పతకం సాధించారు. ఉమెన్స్ సీనియర్స్ 60 కేజీల విభాగంలో లావణ్య రజత పతకం, 65 కేజీల విభాగంలో సాయి లక్ష్మి కాంస్య పతకం సాధించారు. వీరు త్వరలో రాజస్థాన్లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి పాల్గొంటారని కోచ్ పుల్లేటి గణేష్ తెలిపారు. -
రూ.8.3 లక్షలు ఏ మూలకూ చాలవు
నక్కపల్లి: పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం ప్రకటించిన రూ.8.30 లక్షలు ఏమూలకూ సరిపోవని, ప్యాకేజీ పెంచాల్సిందేనంటూ పలువురు అఖిలపక్ష నాయకులు, నిర్వాసితులు డిమాండ్ చేశారు. గురువారం చందనాడలో నిర్వాసితుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ తరపున కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సీపీఎం తరపున జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, నిర్వాసితుల తరపున గంటా తిరుపతిరావు, తళ్ల భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. వీసం రామకృష్ణ, అప్పలరాజులు మాట్లాడుతూ పరిశ్రమల కోసం ఏపీఐఐసీకి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం పూర్తి న్యాయం చేయలేదన్నారు. డీఫారం రైతులకు కేవలం భూములకు మాత్రమే నష్టపరిహారం చెల్లించి ఫలసాయానికి పరిహారం ఇవ్వలేదన్నారు. ఇక సాగుదార్లకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. నివాస ప్రాంతాలు, పశువుల షెడ్లు కోల్పోయిన వారికి నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు ఇవ్వాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అరకొరగా ప్రకటించారన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.25 లక్షలకు పెంచాలి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.8.30 లక్షలు, ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఈ ఎనిమిది లక్షలు పునాదులు తీయడానికి కూడా సరిపోవన్నారు. రైతులకు 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలన్నారు. ప్యాకేజీ విషయంలో న్యాయం జరగకపోతే నిర్వాసితుల తరపున ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఎన్నికల ముందు నిర్వాసితుల తరపున ఆందోళనలు చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారన్నారని విమర్శించారు. 2014లో టీడీపీ నాయకుల మాటలు నమ్మి రైతులు కోర్టుల్లో కేసులు ఉపసంహరించుకుని ఏపీఐఐసీకి భూములు ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. చందనాడ, డీఎల్పురం, అమలాపురం, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట గ్రామాలకు చెందిన నిర్వాసితులు, రైతులు పాల్గొన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచాల్సిందే ఏపీఐఐసీ నిర్వాసితుల డిమాండ్ చందనాడలో అఖిలపక్ష సమావేశం -
లారీని ఢీకొని ఆటోడ్రైవర్ దుర్మరణం
పీఎంపాలెం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కూరగాయలు రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలివి. ఆనందపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బంగారు రమణ(41) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజూ మాదిరిగానే గురువారం తెల్లవారుజామున ఆనందపురం కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలను తన ఆటోలో వేసుకుని నగరంలోని పెదవాల్తేరుకు బయలుదేరాడు. తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో ఎండాడ కూడలికి సమీపంలోని వరాహగిరి కాలనీ ఎదురుగా జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రమణ నడుపుతున్న ఆటో ముందు అతివేగంగా వెళుతున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. ఊహించని ఈ పరిణామానికి రమణ తన ఆటోను అదుపు చేయలేక లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న నరసింగరావు అనే వ్యక్తి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
కూటమి కుట్ర
సచివాలయాలపై నక్కపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సచివాలయాలను సగానికి సగం తగ్గించి ప్రభుత్వ పాలన ప్రజలకు దూరం చేసి మళ్లీ పాత రోజులను గుర్తుకు తెచ్చే ప్రయత్నాలకు తెరలేపింది. గుట్టుచప్పుడు కాకుండా సచివాలయాల విలీన ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారుల నుంచి సేకరిస్తోంది. ప్రభుత్వం సచివాలయాలను కుదిస్తే ప్రజలు వివిధ పనుల కోసం మళ్లీ 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం అనేక వ్యయ ప్రయాసలు పడి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గత సర్కారు గ్రామాల్లో సచివాలయాలు నెలకొల్పి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 12 మంది సిబ్బందిని నియమించింది. రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కడమే కాక, కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.40 లక్షల చొప్పున నిధులు వెచ్చించారు. ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేసిన 72 గంటల్లోగా మంజూరు చేసేందుకు పక్కా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సేవల కుదింపు జిల్లాలో 522 సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం 3844 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. తాజాగా ఈ సచివాలయాలను సగానికి కుదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు భోగట్టా. అంటే 261 సచివాలయాలే మిగులుతాయి. సిబ్బందిని సర్దుబాటు చేసి ఇతర ప్రభుత్వ శాఖలకు పంపించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సచివాలయాల్లో పనిచేసే సిబ్బందిని మండల కేంద్రాలు, సబ్స్టేషన్లు, వ్యవసాయ వెటర్నరీ ఆస్పత్రులకు పంపించి అక్కడ పనిచేయిస్తోంది. సచివాలయాల విలీన ప్రక్రియ అమలు చేస్తే మూడు నుంచి నాలుగు పంచాయతీలను కలిపి ఒక సచివాలయం కిందకు తీసుకు వచ్చే ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. నక్కపల్లి మండలంలో 32 పంచాయతీలకు 22 సచివాలయాలు ఉండేవి. విలీన ప్రక్రియలో భాగంగా వీటిని 11కు కుదిస్తూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. వేంపాడులో విలీనం కానున్న అమలాపురం సచివాలయం బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిజమైంది. ప్రజల చెంతకే ప్రభుత్వం వచ్చింది. అన్ని రకాల సేవలను అందించింది. అది నిన్నటి మాట. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన స్వర్ణయుగం అది. వైఎస్ జగన్ సర్కారు నెలకొల్పిన సచివాలయ వ్యవస్థ విచ్ఛిన్నం. కార్యాలయాలు సగానికి సగం కుదింపు. చిత్తశుద్ధి శూన్యం. సేవలు బహుదూరం. ఇది నేటి చేదు వార్త. ఈ ప్రతిపాదనలు అమలైతే జనానికి మళ్లీ పాత కష్టాలు మొదలైనట్టే. సగానికి సగం కుదిస్తూ ప్రతిపాదనలు జిల్లాలో ఇంతవరకు 522 సచివాలయాలు ఇక ప్రభుత్వ సేవలు ప్రజలకు దూరమే.. విలీనం అమలయితే 261కి కుదింపు వేంపాడు వెళ్లాలంట.. మా గ్రామం మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయడంతో అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఇక్కడే అందేవి. ఇప్పుడు మా సచివాలయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేంపాడులో విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలా అయితే చాలా ఇబ్బంది పడతాం. ప్రభుత్వ నిర్ణయం సరికాదు. – సూరాకాసుల గోవిందు, అమలాపురం, నక్కపల్లి మండలం కుగ్రామానికి అన్యాయం మా గ్రామంలో సచివాలయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాగితలో విలీనం చేస్తారని తెలిసింది. సరైన రవాణా సదుపాయాలు లేని, ముస్లింలు ఎక్కువగా నివసించే మా గ్రామంలో జగనన్న ప్రభుత్వం సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం సచివాలయాన్ని కాగిత గ్రామానికి తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మా మారుమూల పల్లెకు మళ్లీ కష్టాలు మొదలైనట్టే. –గొర్ల గోవిందు, పెదదొడ్డిగల్లు సచివాలయాల్లో సేవలివీ.. గ్రామ సచివాలయంలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, పశుసంవర్థకశాఖ, వ్యవసాయ, హార్టికల్చర్, ఫిషరీస్ కార్యదర్శులు, మహిళా పోలీస్, వుమెన్ వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వీఆర్ఏ, కంప్యూటర్ ఆపరేటర్ తదితర సిబ్బందిని నియమించింది. సచివాలయాల ద్వారా దాదాపు 350 రకాల సేవలను ప్రభుత్వం అందించింది. కుల, ఆదాయ నివాస ధ్రువపత్రాలు, జనన మరణ ధ్రువపత్రాలు, రైతులకు అవసరమైన పట్టాదారు పాసుపుస్తకాల దరఖాస్తులు, మోతుబరి సర్టిఫికెట్, వన్ బి, అడంగల్, సర్వే సర్టిఫికెట్లు, మ్యారేజ్ సర్టిిఫికెట్లు, వాణిజ్య, వ్యాపారాలకు సంబంధించిన అనుమతులు, లైసెన్స్ల జారీ, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్లు, అమ్మ ఒడి, రైతుభరోసా పథకాలకు దరఖాస్తులు, విద్యాదీవెన, విద్యావసతి, పోస్ట్మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు, కొత్తగా పింఛన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, ప్రధాన దేవాలయాల్లో దర్శనాలు, గదుల బుకింగ్ సదుపాయం, ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం దరఖాస్తులు, గృహ అవసరాలకు, వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తులు, రైతులకు విత్తనాలు, ఎరువుల కోసం దరఖాస్తులు ఇలా ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వ్యక్తిగత, సామాజిక అవసరాల కోసం దరఖాస్తు చేయడానికి, వాటిని మంజూరు చేయడానికి సచివాలయాలు ఉపయోగపడేవి. -
పిడుగుపాటుకుపశువులు మృత్యువాత
రావికమతం: మండలంలో పిడుగుపాటుకు 16 మేకలు, పాడి ఆవు మృత్యువాత పడ్డాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షంతో భారీగా పిడుగులు పడ్డాయి. రావికమతం శెట్టివారి పాకలు వద్ద వర్షానికి చింత చెట్టు కిందకు మేకలు వెళ్లగా ఆ చెట్టుపై పిడుగు పడడంతో సీరా సాంబ, రమణ, దేవర అప్పలనాయుడు, నమ్మి వెంకటస్వామిలకు చెందిన 14 మేకలు, కేబీపీ అగ్రహారంలో దేవర అప్పారావుకు చెందిన 2 మేకలు మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టవానిపాలెం గ్రామ శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు పాడి ఆవు మృతి చెందింది. దీని విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని బాధిత రైతు మైచర్ల విశ్వనాథం తెలిపారు. -
ఏపీఆర్డీసీకి దిమిలి విద్యార్థి ఎంపిక
కోటవురట్ల: స్థానిక ప్రభుత్వ జానియర్ కళాశాలలో చదివిన విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాడు. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షా ఫలితాలలో కళాశాలకు చెందిన దిమిలి భవానీ ప్రసాద్ రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు ఎ.ఆర్.టి.సుజాత, అధ్యాపకులు విద్యార్థిని అభినందించారు. విద్యార్థి దిమిలి ప్రసాద్ మాట్లాడుతూ నాగార్జునసాగర్లో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో బీకాంలో చేరి భవిష్యత్లో మంచి ఉద్యోగం సాధించాలన్నది కోరికగా తెలిపాడు. కళాశాలలో లెక్చరర్లు మంచి సహకారం అందించారని వారికి కృతజ్ఞతలు తెలిపాడు. -
అందమైన బంధం
సామరస్యతతోనే శాశ్వతం భార్యాభర్తల సంబంధాలు చాలా సున్నితమైనవి. అందంగా అల్లుకున్న అనుబంధం చిన్నపాటి కలతలకే ఒక్కోసారి చెదిరిపోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో వారితో మాట్లాడి సమాధానపరిస్తే సమస్య ఇట్టే పరిష్కారం అయిపోతుంది. అలాంటి గురుతర బాధ్యతను నెరవేరుస్తోంది అనకాపల్లిలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్. ఆధునికీకరించిన కౌన్సెలింగ్ సెంటర్ భవనాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం ప్రారంభించారు. ● సత్ఫలితాలను ఇస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ ● మూడు వంతుల కేసులు సుఖాంతం -
చోరీ కేసులో ముగ్గురు అరెస్టు
బుచ్చెయ్యపేట: మండలంలో గల వడ్డాది పోస్టాఫీసులో దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. గత నెల 17వ తేదీన వడ్డాది పోస్టాఫీసు తాళాలు పగలగొట్టి రూ, 67,855 నగదును గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుపోయారన్నారు. దీనిపై పోస్టాఫీసు బీఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు. క్లూస్ టీం, సీసీ పుటేజీ, టెక్నాలజీ ఆధారంగా చోరీకి పాల్పడ్డ వడ్డాది ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నామన్నారు. ఆ ముగ్గురిలో ఒకరు మైనర్ కాగా మిగిలిన ఇద్దరు 18 ఏళ్ల యువకులన్నారు. మైనర్ బాలుడిని జువైనల్కు, ఇద్దరిని రిమాండ్కి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. దొంగలను చౌకచక్యంగా పట్టుకున్న సిబ్బంది అర్జున్, గణేష్, వెంకట్లను ఎస్ఐ అభినందించారు. -
మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడు భార్య మృతి
సాక్షి, పాడేరు: పాడేరు మాజీ ఎమ్మెల్యే, దివంగత కొట్టగుళ్లి చిట్టినాయుడు భార్య గంగాభవానీ (70) మంగళవారం రాత్రి కేజీహెచ్లో వైద్యసేవలు పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి గంగాభవాని మాతృమూర్తి. సమాచారం తెలుసుకున్న అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్సీపీ నేత చెట్టి వినయ్ సంతాపం వ్యక్తం చేశారు. వారంతా పాడేరులోని గుడివాడ గ్రామానికి చేరుకుని గంగాభవానీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తదితరులు సంతాపం తెలిపారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులు, వర్తకులంతా గంగాభవానికి కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. సంతాప సూచకంగా మధ్యాహ్నం వరకు పట్టణంలోని వర్తకులు దుకాణాలను మూసివేశారు. -
చోడవరం టీడీపీలో వర్గ పోరు
● ఎమ్మెల్యే రాజు తీరుపై తాతయ్యబాబు, మల్లునాయుడు గుర్రు ● అసమ్మతి నాయకులకు ఎంపీ సీఎం రమేష్ ప్రోత్సాహం! చోడవరం: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుల మధ్య ఆధిపత్య వర్గపోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర రూరల్ హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మధ్య ఆధిపత్య పోరు బహిరంగంగానే జరుగుతోంది. ఎమ్మెల్యే రాజుకి అత్యంత సన్నిహితుడు, క్లాస్మేట్ అయిన గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు కూడా ఎమ్మెల్యే తీరుపై లోలోపల అసమ్మతితో ఉన్నారు. వాస్తవానికి వీరు ముగ్గురూ గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం రాజుకే టిక్కెట్టు ఇవ్వడంతో తాతయ్యబాబు, మల్లునాయుడు అసమ్మతితోనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాతయ్యబాబు నేరుగా మంత్రి లోకేష్తో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కోటరీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితోపాటు అధికారం వచ్చిన వెంటనే రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా కూడా పదవి దక్కింది. ఈ పరిణామం ఎమ్మెల్యే రాజుకి రుచించలేదు. అధిష్టానం నేరుగా తాతయ్యబాబుకు పదవులు ఇవ్వడంతో ఎమ్మెల్యే అంటీఅంటనట్టుగా ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన తాతయ్యబాబు తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లోనూ చాపకింద నీరులా తన వర్గం మరింత బలపడేలా పావులు కదుపుతున్నారు. దీనిని ఏమాత్రం సహించలేకపోతున్న ఎమ్మెల్యే రాజు చెక్పెట్టేందుకు తాతయ్యబాబు సొంత మండలమైన బుచ్చెయ్యపేటలోనే వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణకు పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో తాతయ్యబాబుకు సమాచారం లేకుండానే గేదెల సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే పాల్గొంటుండడంతో తాతయ్యబాబు వర్గానికి ఏమాత్రం నచ్చడం లేదు. వడ్డాదిలో బయటపడ్డ విభేదాలు ఇటీవల వడ్డాదిలో పార్టీ సమాశానికి జిల్లా అధ్యక్షుడైన తాతయ్యబాబు ఫొటో లేకుండానే ఫ్లెక్సీ వేయించడంతో ఇరువర్గాల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ విషయం లోకేష్, చంద్రబాబు వరకూ కూడా తాతయ్యబాబు తీసుకెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ గొడవ జరిగిన ఈ నెలరోజుల్లో పార్టీ అధిష్టానం ఏమి చెప్పిందో గానీ తాతయ్యబాబు తన వర్గాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఆయనే ముఖ్య అతిథిగా వెళ్లిపోతుండడంపై ఎమ్మెల్యే మరింత గుర్రుగా ఉన్నారు. బుచ్చెయ్యపేటతో పాటు చోడవరం, రావికమతం, రోలుగుంట మండలాల్లో కూడా వీరిద్దరి వర్గాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. ఈ పరిణామం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర అయోమయాన్ని నింపింది. మరో పక్క మల్లునాయుడు కూడా తన వెలమ సామాజిక వర్గంతో పాటు పార్టీలో తన అనుచరుల వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజుకి చోడవరం పట్టణం వరకూ మల్లునాయుడు కుడి భుజంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే పక్కనే ఉంటూనే రెండుసార్లు తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు రాకుండా అడ్డుపడి తన స్వలాభం కోసం రాజు చేస్తున్న రాజకీయ చతురతకు ఈసారి చెక్ పెట్టాలని మల్లునాయుడు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన కూడా బయటకు ఎమ్మెల్యేతో తిరుగుతూ లోలోపల ఎంపీ రమేష్, తాతయ్యబాబులతో సఖ్యతగా ఉంటూ తన వర్గాన్ని బలోపేతం చేసుకునే చర్యలు చేపట్టారు. ఇటీవల పలు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా వెళ్లడం, చోడవరం పట్టణంలో మరిడిమాంబ పండగను ఎంతో ప్రతిష్టాత్మకంగా మల్లునాయుడే తన భుజాలపైనే వేసుకొని చేసినప్పటికీ ఈ రెండు కార్యక్రమాలకు ఎమ్మెల్యే రాకుండా డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇంకా నాలుగేళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అధికార టీడీపీ ప్రధాన నాయకులు మధ్య ఆధిపత్య , వర్గ విభేదాలు మరింత బహిర్గతం కావడంతో తటస్థంగా ఉన్న పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి ఎంపీ సీఎం రమేష్ లోపాయికారిగా ప్రోత్సాహం అందిస్తున్నారంటూ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ వర్గ విభేదాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎస్పీ తుహిన్ సిన్హా
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి మాకవరపాలెం: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ తుహిన్సిన్హా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మాకవరపాలెం పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, నేర నియంత్రణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ర్యాగింగ్, మహిళలపై జరుగుతున్న వేధింపులు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళా చట్టాలపైన, శక్తి యాప్పైన విసృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని, వీటిపై ప్రజలకు వివరించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసిన ఎస్పీ సిబ్బందితో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ పాల్గొన్నారు. -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి
తుమ్మపాల: విద్యాసంస్థలకు వేసవి సెలవుల దృష్ట్యా జిల్లాలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను విద్యార్థులు వినియోగించుకోవాలని ఇన్చార్జి కలెక్టర్, జేసీ ఎం.జాహ్నవి అన్నారు. కలెక్టరేట్లో బుధవారం తన చాంబర్లో వేసవి క్రీడా శిబిరాల క్రీడాకారులకు క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులందరూ క్రీడా శిబిరాలను వినియోగించుకుని ఆటలలో బాగా రాణించాలని, భవిష్యత్తులో పతకాలు సాధించాలన్నారు. ఆటల వల్ల విద్యార్థుల మనో వికాసం పెరుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని, చదువులో రాణిస్తారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రతి క్రీడా శిబిరానికి రూ.5 వేలు విలువచేసే క్రీడా పరికరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎల్.వి.రమణ క్రీడా శిక్షణ శిబిరాల వివరాలు తెలియజేస్తూ జిల్లాలో ఏర్పాటు చేసిన 50 శిక్షణ శిబిరాలకు 982 మంది విద్యార్థుల పేర్లు నమాదు చేసుకున్నారని, వారిలో 612 మంది బాలురు, 370 మంది బాలికలు ఉన్నారన్నారు. వీరికి 20 క్రీడా అంశాలలో శిక్షణ అందిస్తున్నామన్నారు. 8 నుండి 14 ఏళ్ల వయస్సు గల విద్యార్థులలో ప్రతిభావంతులను గుర్తించి వారిని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం క్రీడా శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్ ఆటల పోటీల్లో వెండి పతకం సాధించిన ఖోఖో జాతీయ స్థాయి రజత పతక విజేత శ్యామ్ ప్రసాద్ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్లు కె.త్రిమూర్తులు, రెహమాన్, చిరంజీవి, రమేష్, అచ్చుతాపురం, జిల్లాపరిషత్ పాఠశాల క్రీడా శిబిరం, హరిపాలెం రగ్బీ ఆట శిబిరం, అక్కిరెడ్డిపాలెం క్రీడాశిబిరం విద్యార్థులు పాల్గొన్నారు. -
అచ్యుతాపురం కూడలిలో ట్రాఫిక్ కష్టాలు
● ఫ్లై–ఓవర్ నిర్మాణ పనులతో సమస్యలు ● ప్రత్యామ్నాయ రహదారులు లేక ట్రాఫిక్ ఇక్కట్లు ● అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం అచ్యుతాపురం రూరల్ : సెజ్ కర్మాగారాల నుంచి వచ్చే భారీ వాహనాలను అచ్యుతాపురం పాత సినిమా హాల్ పక్క నుంచి పోలీస్స్టేషన్కి వెళ్లే మార్గంలో మళ్లించడం వల్ల బుధవారం ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అచ్యుతాపురం కూడలిలో ఫ్లై–ఓవర్ నిర్మించడానికి ఏర్పాటు చేసిన భారీ యంత్రం కారణంగా అటువైపు వాహనాలు రాకపోకలు చేయడానికి వీలుకాలేదు. ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిశ్రమలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సరైన ప్రణాళిక లేకుండా... ఫ్లై–ఓవర్ నిర్మాణంలో నిర్వాహకులకు సరైన అవగాహన లేకపోవడం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు అంటున్నారు. ట్రాఫిక్ని మళ్లించకుండా ఫ్లై–ఓవర్ నిర్మాణం పనులు చేపడితే వచ్చే సమస్యలను గ్రహించలేకపోవడం అధికారులు, నాయకుల తెలివితక్కువ తనంగా భావిస్తున్నారు. ఆ మాత్రం అవగాహన లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పిచ్చికి పరాకాష్టగా ఉందని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఎలా...! ఆరంభంలోనే ఇంతటి ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటే మున్ముందు మరెన్ని ఇబ్బందులు పడాలోనని జనం వాపోతున్నారు. ఇటువంటి ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే అత్యవసరంగా పరిశ్రమల్లో కానీ స్థానిక నివాసాల్లో గానీ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ల ద్వారా ఆస్పత్రులకు వెళ్లేందుకు కూడా వీలులేనంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది. ముందస్తు ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే అభివృద్ధి కార్యక్రమాల కారణంగా అనేక మంది అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధికారులకు ఫ్లై–ఓవర్ నిర్మాణంలో ట్రాఫిక్ని మళ్లించే విధానం సరికాదని తెలిసినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో నోరు మెదపలేకున్నామని అంటున్నారు. కొందరి స్వార్థ పూరిత ఆలోచనల కారణంగా సామాన్య పౌరులు సమస్యల పాలౌతున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, నాయకులు మంచి ఆలోచనతో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ముందుగా ఫ్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేసి వాహనాలను మల్లించి అనంతరం అవసరమైతే అప్పుడు ఫై–ఓవర్ నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
రోగి వైద్య సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలి
● జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంటు అధికారి ప్రశాంతి ● జిల్లాలో అన్ని పీహెచ్సీలకు సమాచారం ● నాతవరం పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ నాతవరం: ప్రభుత్వం నుంచి కొత్తగా వచ్చిన ఆదేశాల ప్రకారం పీహెచ్సీలలో వైద్యులు పరీక్షించిన రోగి తాలుకా ఆరోగ్య సమాచారాన్ని విధిగా ఆన్లైన్లో డిజిటల్ రికార్డు నమోదు చేయాలని జిల్లా ప్రోగ్రాం మేనేజమెంట్ అధికారి (డీపీఎంవో)జె.ప్రశాంతి అన్నారు. మండల కేంద్రంలో గల పీహెచ్సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో రోగులకు అందిస్తున్న వైద్య సమాచారం ఆన్లైన్లో నమోదు చేసిన రికార్డులను స్వయంగా పరిశీలించారు. పీహెచ్సీకి రోజు వారీ వస్తున్న రోగుల వివరాలను వైద్యాధికారి ప్రసన్నను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ప్రధాన సమస్యలు, సిబ్బంది వివరాలు అడిగి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నుంచి కొత్తగా వచ్చిన ఆదేశాల ప్రకారం పీహెచ్సీలో రోగికి అందించిన వైద్యం, మందుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆ రోగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పీహెచ్సీలో వైద్యం కోసం వెళ్తే ఆ రోగికి గతంలో ఏవ్యాధి ఉండేది ఏయే మందులు అందజేశారనే పూర్తి సమాచారం ఆధార్ నంబర్ ఆన్లైన్లో చెక్ చేస్తే తెలుస్తుందన్నారు. డీఎంహెచ్వో ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ప్రసన్న , ఫార్మసిస్టు వెంకటరావు , హెల్త్ సూపర్వైజర్లు బైరాగి, వెంకటరమణ పాల్గొన్నారు. -
12 కిలోల గంజాయి స్వాధీనం
నక్కపల్లి: జాతీయరహదారిపై వేంపాడు టోల్ప్లాజా వద్ద తమిళనాడు, బెంగళూరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి నక్కపల్లి పోలీసులు 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీఐ కుమార స్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరుకు చెందిన మునివెంకటప్ప అంజనప్ప, తమిళనాడుకు చెందిన కుప్పా ముత్తులు స్కూలు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోతుండగా ఎస్ఐ సన్నిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది వెంబడించి పట్టుకున్నారన్నారు. వారి వద్ద రూ.50 వేలు విలువగల 12 కిలోల గంజాయి లభించిందన్నారు. గంజాయి స్వాధీనం చేసు కుని ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరి గిందన్నారు. అంజనప్పపై గతంలో హత్య కేసు, కుప్పా ముత్తపై గంజాయి కేసు నమోదయిందని తెలిపారు. -
గోవాడ సుగర్స్ను ప్రభుత్వం ఆదుకోవాలి
చోడవరం : గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్యాక్టరీ కార్మికుల సమావేశం కోరింది. గోవాడ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సుగర్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కార్మిక సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. గుర్తింపు యూనియన్ ప్రధానకార్యదర్శి కె.వి. భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక సమస్యలు, ఫ్యాక్టరీ మనుగడ, రానున్న క్రషింగ్ సీజన్కు చేపట్టవలసిన చర్యలపై కార్మికులు చర్చించారు. 2024–25 క్రషింగ్ సీజన్లో తలెత్తిన అనేక సమస్యలు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వానికి తెలియజేసేందుకు రాజకీయాలకు అతీతంగా ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేసిన కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ను, మంత్రి లోకేష్ను అనేకసార్లు కలిసి వివరించడం జరిగిందని కార్యదర్శి భాస్కరరావు అన్నారు. ఫ్యాక్టరీని, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకూ ఎటువంటి సాయం అందలేదన్నారు. మరలా మరోసారి చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎంలను, అనకాపల్లి ఎంపీని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ ఆస్తులను రీ వాల్యుయేషన్ చేయించి ప్రభుత్వ గ్యారంటీతో వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయాలని, 2025–26 రానున్న క్రషింగ్ సీజన్కు వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం, ప్రస్తుతం రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించుటకు అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని సమావేశంలో తీర్మాణించింది. వచ్చే సీజన్కు ఓవర్హాలింగ్ పనులు పూర్తిగా చేసి కోజనరేషన్ ఉత్పత్తి కూడా పూర్తిగా జరిగేలా ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం సమావేశంలో కోరింది. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు బండి శ్రీను, నూకరాజు, అల్లం రామఅప్పారావు, జగన్నాథరావు, సత్యనారాయణ, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. వచ్చే క్రషింగ్ సీజన్కు అవసరమైన గ్రాంటు ఇవ్వాలి రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి ఫ్యాక్టరీ కార్మిక సంఘం డిమాండ్ -
నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుల్కు రివార్డు
కోటవురట్ల : కె.వెంకటాపురంలో 2010లో సంచలనంగా మారిన హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ నరేష్ను డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించి రివార్డును అందజేశారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలివి. పోలీసు డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్న పాంగి అప్పారావు 2010లో కె.వెంకటాపురంలో తుపాకీతో ఒకరిపై కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముద్దాయి అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చి సమయం ముగిసినా సరెండర్ కాకుండా తప్పించుకు తిరుగుతుండడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేశారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్లో అతని కదలికలు ఉన్నట్టు గుర్తించిన కానిస్టేబుల్ నరేష్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేశాడు. వెంటనే ఎస్ఐ రమేష్ సిబ్బంది కలిసి నిందితుడు పాంగి అప్పారావును పట్టుకుని నర్సీపట్నం కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించడంతో అతనిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నరేష్కు డిపార్ట్మెంట్ తరపున రివార్డును అందజేశారు. నక్కపల్లి సీఐ ఎల్.రామకృష్ణ, ఎస్ఐ రమేష్ అభినందించారు. -
19న దేవరాపల్లి వైస్ ఎంపీపీ ఎన్నిక
దేవరాపల్లి : మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను ఈ నెల 19న పకడ్బందీగా నిర్వహించనున్నట్లు స్థానిక ఎంపీడీవో సువర్ణరాజు తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఈ నెల 12న షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులకు, ఎమ్మెల్యే, ఎంపీకు ఇప్పటికే సమాచారం అందించామన్నారు. 19న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి చేతులు ఎత్తే పద్ధతిలో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించి, ఫలితాన్ని వెంటనే ప్రకటిస్తామన్నారు. గతంలో వైస్ ఎంపీపీ–1గా ఎన్నికై న చింతల బుల్లిలక్ష్మి ఇటీవల నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష ఉప ఎన్నికలో ఎంపీపీగా గెలుపొందారు. దీంతో వైస్ ఎంపీపీ–1 స్థానం ఖాళీ కావడంతో ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. కాగా ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణిని నియమించినట్టు ఎంపీడీవో తెలిపారు. -
రచ్చకెక్కిన విభేదాలు
● దేవరాపల్లి మండల కమిటీ ఎన్నికలో భగ్గుమన్న అసమ్మతి సెగలు ● ఎమ్మెల్యే బండారు ముందే కుమ్ములాటకు దిగిన కార్యకర్తలు ● వలస నేతలపై పార్టీలో పాత కాపుల గుర్రు దేవరాపల్లి: మండల టీడీపీ నేతలు వర్గ విభేదాలతో కుమ్ములాటకు దిగి రచ్చకెక్కారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సాక్షిగా పరస్పర దూషణలతో బాహాబాహీకి దిగారు. దేవరాపల్లిలోని రైవాడ అథితి గృహం వద్ద బుధవారం జరిగిన టీడీపీ సంస్థాగత ఎన్నిక వేదికగా కార్యకర్తలు గొడవ పడ్డారు. దీంతో ఈ సమావేశం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. స్థానిక ఎస్ఐ టి.మల్లేశ్వరరావు, సీఐ పైడపునాయుడు దగ్గరుండి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పాత టీడీపీ నేతలు, సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వలస నేతల మధ్య ఆధిపత్య పోరు ఈ వివాదానికి కారణంగా చెబుతున్నారు. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేదికగా చేసుకొని ఎమ్మెల్యే సమక్షంలో ఇరువర్గాలు వాగ్వివాదానికి దిగారు. తొలి నుంచీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యే ఎదుటే తమ అసంతృప్తిని వెళ్లగెక్కారు. దీంతో ఎమ్మెల్యే సహనం కోల్పోయి కొన్ని గ్రామాల నాయకులపై చిందులు తొక్కారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సహా పార్టీ పరిశీలకుడి ముందు కార్యకర్తలు బాహాబాహీకి దిగడానికి సిద్ధపడగా అక్కడే ఉన్న స్థానిక ఎస్ఐ మల్లేశ్వరరావు, సీఐ పైడపునాయుడు ఇతర పోలీస్ సిబ్బంది అడ్డుకొని సర్దిచెప్పారు. ఎమ్మెల్యేతో కలిగొట్ల నేతల వాగ్వాదం ప్రధాన కార్యదర్శిగా పదవి పేరు ప్రకటన సమయంలో ఒకే వ్యక్తికి పదవులు కట్టబెట్టడంపై ఎమ్మెల్యేతో కలిగొట్ల గ్రామానికి చెందిన కొందరు నేతలు వాదనకు దిగారు. ఈ సమయంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఎదురించే వారిని తాను లెక్క చేయనని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆగ్రహించడంతో పార్టీ శ్రేణులు తీవ్ర విస్మయానికి గురయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగు దేశం జెండాను మోసిన వారిని కాదని, వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నేతలు కొందరు గుర్రుగా ఉన్నారు. కుమ్ములాటలు, దూషణల నడుమ టీడీపీ మండల అధ్యక్షుడిగా ఎ.కొత్తపల్లి పెద్దాడ వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా కలిగొట్ల దొగ్గ దేముడునాయుడు పేర్లను ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు ప్రకటించారు. వర్గ విభేదాల నేపథ్యంలో రైవాడ, బోయిలకింతాడ, మారేపల్లి, కాశీపురం గ్రామ కమిటీ ఎన్నిక ప్రక్రియను వాయిదా వేశారు. -
ప్రజల భద్రతకు కొత్త దిక్సూచి
● హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌసుల్లో అతిథుల వివరాల నమోదు ● నేర చరితులు, అనుమానితులుంటే ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ● ప్రస్తుతం జిల్లాలో 79 చోట్ల యాప్ డౌన్లోడ్ ● దశలవారీగా అన్ని పర్యాటక కేంద్రాల్లోనూ అందుబాటులోకి.. ఇలా గుర్తిస్తారు.. సందర్శకుల వివరాలను ఆధార్ కార్డు ద్వారా ‘సేఫ్ స్టే’ మొబైల్ యాప్లో నమోదు చేయాలి. వారిలో నిందితులు ఎవరైనా ఉన్నట్లయితే పోలీస్ కంట్రోల్ రూమ్కు పూర్తి వివరాలు తెలుస్తాయి. తక్షణమే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తారు. అక్కడకు పోలీసులు వెళ్లి అనుమానితుల పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఇది నేరాలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటి దశగా జిల్లాలో 79 హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌస్లలో యాప్ను డౌన్లోడ్ చేయించారు. దశలవారీగా మిగిలిన చిన్నచిన్న హోటళ్లలోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని పోలీస్ శాఖ చెబుతోంది. అనకాపల్లి: అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులను రక్షించడానికి అనకాపల్లి పోలీసులు ‘సేఫ్ స్టే’ యాప్ను ప్రారంభించారు. హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలలో బస చేసే అతిథుల వివరాలను.. క్రిమినల్స్ వివరాల డేటాబేస్తో సరిపోల్చి నేరస్తులను గుర్తించేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న లాడ్జీలు, హోటళ్లలో ఈ యాప్ను పొందుపరుస్తున్నారు. అక్కడ ఎవరు చెక్ ఇన్ చేసినా వారి వివరాలను ఈ ఆన్లైన్ యాప్లో పొందుపరిస్తే, వెంటనే అవి పోలీసులకు చేరతాయి. నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల వివరాలతో సరిపోలితే తక్షణమే పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఈనెల 8 నుంచి అమల్లోకి.. నేరస్తులను నిలువరించేందుకు సాధారణంగా చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేసి అనుమానముంటే అదుపులోకి తీసుకుంటారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మన ప్రాంతంలో స్టే చేసే వారి వివరాలను సైతం విశ్లేషిస్తే అనుమానితులను ముందే కట్టడి చేయవచ్చు.. లేదా నేరం జరిగాక త్వరగా నిందితులను గుర్తించవచ్చు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే సేఫ్ స్టే యాప్. ఈనెల 8న జిల్లా పోలీస్ శాఖ ఈ మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. ఈ యాప్ను జిల్లాలోని ప్రధానమైన హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌసుల్లో డౌన్లోడ్ చేయించారు. మిగతావారు కూడా ఈ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల భద్రత మరింత పటిష్టం చేసేందుకే.. ‘సేఫ్ స్టే‘ యాప్ ద్వారా నేరస్తులను ముందుగానే గుర్తించవచ్చు. నేరాలను తగ్గించవచ్చు. ప్రజల భద్రతకు పూర్తి భరోసా కల్పించడానికి వీలుంటుంది. ఈ యాప్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుంది. దశలవారీగా జిల్లాలో యాప్ డౌన్లోడ్ చేయిస్తాం. త్వరలో రెండో దశలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. – తుహిన్ సిన్హా, ఎస్పీ ‘సేఫ్ స్టే‘ యాప్ను అందుబాటులోకి తెచ్చిన జిల్లా పోలీసులు -
సైన్స్ రీసెర్చ్ చేస్తా..
పాలిసెట్లో 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాను. ఈ రోజే విడుదలైన ఏపీఆర్జేసీలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. పదో తరగతిలో 595 మార్కులు వచ్చాయి. మా స్వస్థలం గుంటూరు కాగా మా నాన్న రాజేంద్రబాబు దివీస్లో ఉద్యోగం చేస్తున్నారు. సంగివలసలో నివాసం ఉంటున్నాం. మా అమ్మ గృహిణి. ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతాను. ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేస్తాను. అనంతరం సైన్స్ రీసెర్చ్ చేస్తాను. –బాలినేని కల్యాణ్రామ్, 2వ ర్యాంకు -
అల్లూరి పార్కు అభివృద్ధికి ప్రణాళిక
● త్వరలో పనులు ప్రారంభం ● స్పీకర్ అయ్యన్నపాత్రుడు గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆయన బుధవారం పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్కు అభివృద్ధికి సహకరించమని ఇప్పటి వరకు 10 మంది ఎంపీలతో మాట్లాడానని, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు రూ.10 లక్షలు, నెల్లూరి ఎంపీ మస్తాన్రావు రూ.10 లక్షలు ఇవ్వగా మరో 8 మంది ఎంపీలు త్వరలో నిధులు కేటాయించనున్నారని తెలిపారు. పార్కులో సోలార్ సిస్టమ్, భోజనశాల, మరుగుదొడ్లు, పార్కు చుట్టూ లైటింగ్, తాగునీరు ఏర్పాటు చేసి, శిథిలమైన భవనాలకు మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ టూరిజం నుంచి నిధులు కూడా తీసుకువస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం అధికారులు విజయభాస్కరరెడ్డి, సీతారాం, సత్యనారాయణ, టూరిజం మేనేజర్ అప్పలనాయుడు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ పాల్గొన్నారు. -
వుషు స్టేట్ టోర్నమెంట్లో 12 మెడల్స్
నర్సీపట్నం: రాష్ట్ర స్థాయి వుషు టోర్నమెంట్లో నింజాస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు 12 పతకాలు సాధించారు. కర్నూల్ జిల్లా శ్రీవెంకటేశ్వర కల్యాణమండపంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన స్టేట్ వుషు చాంపియన్షిప్ పోటీల్లో వీరు పాల్గొన్నారు. అక్షయ రాణి–సీనియర్ వుమెన్.. శ్రీరామ్ నిహాల్, పి.ప్రణీత–సబ్ జూనియర్.. వై.దివాకర్ మెన్ సీనియర్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. జి.సాయి ఉమెన్ సీనియర్, యు.రవికుమార్ సీనియర్ మెన్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించారు. సబ్ జూనియర్ బాయ్స్ విభాగంలో టి.జగదీష్, వై.సాత్విక్, ఎం.దుర్గాప్రసాద్, ఎం.హర్ష, ఎం.సాయి సందీప్, కె.విజయ్ కుమార్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కోచ్ ప్రియాంక్ ఆధ్వర్యంలో క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులను మోహన్ ముత్యాల, నేషనల్ రిఫరీ వెంకటేష్ అభినందించారు. 600 మందికి పైగా పాల్గొన్న క్రీడాకారుల్లో నింజాస్ క్రీడాకారులు పోటీ పడి మెడల్స్ సాధించారన్నారు. -
సవతి ప్రేమ!
విశాఖ జోన్పై కన్సాలిడేట్ బడ్జెట్లో అరకొర కేటాయింపులు డబ్లింగ్ పనులు.. కొత్త లైన్లకు నిధులు ● జోన్కు అన్యాయం చేస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ మిగిలిన విషయాల్లో కొంతమేర కేటాయింపులు చేయడం ఉపశమనం కలిగించే అంశం. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులకు ఈ బడ్జెట్లో కొంత మేర నిధులు కేటాయించడం శుభపరిణామం. కన్సాలిడేటెడ్ బడ్జెట్లో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో కేటాయింపులిలా ఉన్నాయి. ● ఓర్ ఎక్స్ఛేంజ్ కాంప్లెక్స్(ఓఈసీ) నుంచి ఉత్తర సింహాచలం వరకు 5.22 కి.మీ మేర డబ్లింగ్ పనులకు రూ.81.22 కోట్లు. ● పెందుర్తి నుంచి ఉత్తర సింహాచలం మధ్యలో సింహాచలం వద్ద సర్ఫేస్ క్రాసింగ్ లేకుండా చేసేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.183.65 కోట్లు ● దువ్వాడ నుంచి ఉత్తర సింహాచలం వరకు 20.543 కిలోమీటర్ల మేర 3, 4వ లైన్ల నిర్మాణం కోసం రూ.302.25 కోట్లు. ● వడ్లపూడి జంక్షన్ను అనుసంధానిస్తూ గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం స్టీల్ప్లాంట్ వరకూ టై లైన్ మాదిరిగా 12.04 కి.మీ మేర 3, 4వ లైన్ల నిర్మాణానికి రూ.154.28 కోట్లు. ● విశాఖపట్నం నుంచి గోపాలపట్నం వరకు 15.31 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.159.47 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.64 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.129.45 కోట్లు. ● పలాస–విశాఖపట్నం–దువ్వాడ(బీ రూట్)లో ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.07 కి.మీ మేర బైపాస్ డబ్లింగ్ పనులకు రూ.25.93 కోట్లు. ● విశాఖపట్నం కాంప్లెక్స్ ఏరియాలో ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ కోసం రూ.43.07 కోట్లు. సాక్షి, విశాఖపట్నం : కొబ్బరికాయ కొట్టేశాం.. కార్యాలయాలు కట్టేయండి అన్నట్లుగా మారింది విశాఖ రైల్వే జోన్పై ప్రభుత్వ వైఖరి. ప్రచార ఆర్భాటం.. ఆపై శంకుస్థాపన.. భూమి చదును.. ప్రజెంటేషన్లు.. గ్రాఫిక్స్లోనే హడావుడి కనిపిస్తుందే తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు కూడా కదలడం లేదన్న విషయం నిధుల కేటాయింపులోనే స్పష్టమవుతోంది. 2025–26 బడ్జెట్కు అనుబంధంగా రైల్వే కేటాయింపులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్పై సవతి ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్తో పాటు దానికి అనుబంధంగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్ అంబ్రెల్లా వర్క్స్కు కలిపి కేవలం రూ.170 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. రాయగడ డివిజన్ పనులకు మాత్రం ప్రత్యేకంగా మరో రూ.110 కోట్లు కేటాయించడం మరింత బలాన్ని చేకూర్చుతోంది. కీలకమైన జోన్కు పప్పుబెల్లాలు ఇచ్చి.. రాయగడ డివిజన్కు మాత్రం భారీగా నిధులు అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భూమి చదును పనులకే పరిమితం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును పనులకే పరిమితమైంది. నిధుల మంజూరులో జాప్యం జరుగుతుండటం వల్లనే పనుల ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. 2025–26 బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఒక్క రూపాయి విదిలించని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రైల్వే కన్సాలిడేటెడ్ బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. కూటమిప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..! జోన్కు శంకుస్థాపన చేసేశామంటూ పచ్చపత్రికల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ భారీగా ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం.. జోన్ ప్రధాన కార్యాలయాల నిర్మాణం మాత్రం తమకు అవసరం లేదన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కూడా వైజాగ్ జోన్ కార్యకలాపాలు ఇప్పట్లో ప్రారంభించకపోయినా ఫర్వాలేదన్నట్లుగా భావిస్తోంది. అందుకే దక్షిణ కోస్తా రైల్వే జోన్ను పక్కనపెట్టి రాయగడ డివిజన్ నిర్మాణానికే పెద్దపీట వేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. అయినా కూటమి ఎంపీలు నోరు మెదపకపోవడం దురదృష్టకరం. -
ఉగ్రదాడులను ఎదుర్కొందామిలా..
అనకాపల్లిలో మాక్ డ్రిల్ అనకాపల్లి: ఉగ్రదాడులు, విపత్తులను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లిలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూడిమడక రోడ్డులోని గ్రీన్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో శేషాద్రి బ్లాక్ వద్ద ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖలు పాల్గొన్నాయి. యుద్ధం వల్ల బాంబులు పడి, గ్యాస్ లీక్, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటే ఎలా బయటపడాలో వివరించారు. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే విధానాన్ని కూడా వివరించారు. పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం, క్షతగాత్రులను అక్కడి నుంచి కిందకు దించడం, వారికి వైద్య సహాయాన్ని అందించడం, హుటాహుటిన అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించడం, , సహాయ చర్యలు చేపట్టడం వంటి అంశాలను ప్రత్యక్షంగా డ్రిల్ చేసి చూపించారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు, మానవ ప్రేరేపిత ప్రమాదాలను సైతం ఎదుర్కొనే విధానాన్ని వివరించి, అధికారులు తమ సన్నద్ధతను తెలియజేశారు. అప్రమత్తతే శ్రీరామరక్ష ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అదే మనను విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. మాక్డ్రిల్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద జనాభా గల అపార్ట్మెంట్లలో విపత్తుల నుంచి ఎలా బయటపడాలో వివరించారన్నారు. ఇన్చార్జి ఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో శాంతిప్రభ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్.వెంకటరమణ, ఎన్డీఆర్ఎఫ్. ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ముందుస్తు సమాచారం మేరకు సీఐ జి.గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్వరరావు, సిబ్బంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. చింతపల్లి వైపు నుంచి వస్తూ పోలీసులను గమనించిన స్మగ్లర్లు కారును కొంత దూరంలో ఆపి పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కారు వెనక సీటుకు ప్రత్యేకంగా అర తయారు చేయించి 2 కిలోల చొప్పున ఐదు ప్యాకెట్లలో పది కిలోల గంజాయిని అమర్చారు. తమ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించడంతో గంజాయి బయటపడింది. తమిళనాడు, తిరుపూర్ భారతి నగర్ స్కూల్ వీధికి చెందిన కార్తీక్ అండవర్(34), అదే రాష్ట్రం విజయపురి రోడ్ మేలాతేరు, కోవిలపట్టికి చెందిన కారు డ్రైవర్ దీపన్(34)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కారుతో పాటు వీరి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, రూ.8 వేలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. గంజాయిని కేసును ఛేదించిన సిబ్బందికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో ఎస్సై రమేష్ పాల్గొన్నారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత
పాయకరావుపేట: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ మంగళవారం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ఎన్.సత్యసాయి 483/500, ఎమ్.యశ్వసి 482/500, పి.తరుణ్ 481/500, ఎస్.రఘునందన్ 478/500 మార్కులతో సత్తా చాటారని, ప్లస్ –2 ఫలితాల్లో జి.సాయి అనీష్ 469/500, ధాత్రి నిహారిక 466/500 మార్కులు సాధించారన్నారు. నూటికి నూరు శాతం ఉత్తీర్ణతతో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. మాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో తమ విద్యార్థులు 100/100 మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
భళా... ఆమె నృత్య కళ
● ఉద్యోగం చేస్తూనే శిక్షణ ● ఆసక్తి చూపుతున్న బాలబాలికలు ● శాసీ్త్రయ నృత్యంలో రాణింపు ● నాట్య గురువు ఉమాదేవి స్ఫూర్తిదాయకం నర్సీపట్నం: సంస్కృతీ సంప్రదాయాలను బోధిస్తూనే... మనసుకు ఆహ్లాదం పంచుతోంది నృత్యం. ఈ కళావైభవాన్ని భావితరాలకు పంచేందుకు కృషి చేస్తున్నారు నాట్యగురువు ఉమాదేవి. అభినయం, నృత్యంలో ఎవరూ సాటిరారనేలా తన శిష్య బృందంతో నర్తిస్తూ ప్రశంసలందుకుంటున్నారు. శాసీ్త్రయ నృత్యంలో చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. తొలుత నృత్యంపై ఆసక్తి పెంచుకున్నామె, అందులో పట్టుసాధించి శిక్షకురాలిగా మారారు. ప్రభు త్వ సంస్థలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగిగా స్థిరపడినప్పటికీ నృత్యంపై మక్కువతో పది మందిని తీర్చిదిద్దాలనే తపనతో పెదబొడ్డేపల్లిలో శ్రీమృతేశ్వర నాట్య అకాడమీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 మంది బాలికలు శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తర్ఫీదు ఇస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు... శాశ్వత శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న బాలికలు, శిక్షకురాలు ఉమాదేవి ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. తిరుపతి, అన్నవరం, అప్పనపల్లి పాటు నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు పొందుతున్నారు. అటు చదువులోనూ ఇటు కళల్లోనూ రాణిస్తూ పలువురి మెప్పు అందుకుంటున్నారు. బాలబాలికల్లో దాగి ఉన్న అంతర్గత ప్రతిభకు పదును పెడుతూ శాసీ్త్రయ నృత్యంలో ఎంతో మంది ప్రముఖల మన్ననలు పొందుతున్నారు. సంప్రదాయ నృత్యంతో శ్రీమృతేశ్వర నాట్య అకాడమీ బాలికలు నర్సీపట్నం పేరున నలుదిశలా వ్యాపింపజేస్తున్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలోనూ తర్ఫీదు మరికొంత మంది బాలబాలికలను శాసీ్త్రయ నృత్యంలో తీర్చిదిద్దేందుకు నర్సీపట్నం శారదానగర్లో వేసవి నృత్య శిక్షణ శిబిరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ శిబిరంలో ఆంధ్రనాట్యంలోని అన్నమాచార్యులు, త్యాగరాజు కీర్తనలపై శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శాసీ్త్రయ నృత్యంపై 35 మంది బాలబాలికలకు నేర్పిస్తున్నారు. అటు చదువులోనూ..ఇటు సంప్రదాయ నృత్యంపై చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. -
పింఛన్ల డ్యూటీ నుంచి మినహాయించాలి
అనకాపల్లి: గ్రామాల్లో సామాజిక పింఛన్లు పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు రెండు, మూడు నెలలు పాటు సహకరించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. నాగశేషు తెలిపారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పిల్లల బరువు తీయడం, టీహెచ్ఆర్(టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేయడం, పిల్లలకు వండి పెట్టడం, ప్రీ స్కూల్ నిర్వహించటం, యాప్లో అప్లోడ్ చేయడం ఇలా అనేక పనులతో సతమతమవుతున్న నేపథ్యంలో పెన్షన్ పంపిణీ భారం మోపొద్దన్నారు. అంగన్వాడీ సిబ్బంది తీవ్ర పని ఒత్తిడితో అనార్యోగానికి గురవుతున్నట్లు వాపోయారు. గుంటూరులో రాజకీయ జోక్యం వల్ల ఒక కార్యకర్తను సస్పెండ్ చేశారన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు ఎం. దుర్గరాణి, సభ్యురాలు సిహెచ్ రామలక్ష్మి, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట సాగుకు అనుకూలం
అనకాపల్లి: వర్ష సూచన ఉన్నందున కోత దశలో నువ్వు పైరును వాతావరణ పరిస్థితులు గమనించి కోసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు తెలిపారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోసిన పంటలు వర్షానికి తడవకుండా రైతులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాగల వర్షాన్ని ఉపయోగించుకుని ఖరీఫ్కి ముందు జనుము లేదా జీలుగ లేదా పిల్లిపెసర లేదా పెసర వంటి పచ్చిరొట్ట పైరును వేసుకోవడానికి ఇదే అనువైన సమయమని పేర్కొన్నారు. వర్షాన్ని వినియోగించుకుని చెరకు వేసే రైతులు నేల తయారీ చేసుకోవాలన్నారు. చెరకులో నల్లి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పక్వానికి వచ్చి మామిడి, బొప్పాయి పండ్లను కోసి మార్కెట్కు తరలించాలన్నారు. పక్వానికి రాని గెలలు ఉంటే, కింద పడకుండా ఉండడానికి కర్రలతో ఊతమివ్వాలన్నారు. మామిడిలో పండు ఈగ ఆశించే అవకాశం ఉందని, నివారణకు రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలన్నారు. ప్లాస్టిక్ పళ్లెంలో మిథైల్ యూజినాల్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి తోటలో వేలగట్టాలని లేదా మార్కెట్లో లభ్యమయ్యే పండు ఈగను ఆకర్షించే బుట్టలను ఎకరాకు 5 చొప్పున 5–6 అడుగుల ఎత్తులో కొమ్మలకు కట్టాలని సూచించారు. వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. లోతు దుక్కులు చేయడం వల్ల కలుపు సమస్యను అధిగమించవచ్చని, పంటను నష్టపరిచే కీటకాలు, తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.భవాని, పి.వి.పద్మావతి. ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
నునపర్తిలో అక్రమ గ్రావెల్ దందా
రాత్రిళ్లు భారీగా లారీల్లో తరలింపు అచ్యుతాపురం రూరల్: మండలంలోని నునపర్తి శివారు నడింపల్లి కొండల్ని రాత్రికి రాత్రి గ్రావెల్ దొంగలు దోచేస్తున్నారు. రెండు జేసీబీలతో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి సుమారు 20కుపైగా లారీలతో తరలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికంగా కొందరు యువకులు తెలిపారు. అక్రమ కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. రేయింబవళ్లు అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా చెట్లను నరికేయడం, కొండలను పిండి చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ ధనార్జన చేస్తున్నారు. ఎవరైనా అధికారులు తూతూమంత్రంగా ఆపినా ఒకట్రెండు రోజులు తర్వాత షరామామూలే అన్నట్టుగా గ్రావెల్ దందా చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
నృత్యంలో రాణించడమే లక్ష్యం
శాసీ్త్రయ నృత్యమంటే ఇష్టం. చదువుకుంటూనే సమయాన్ని వృథా చేయకుండా అకాడమీకి వచ్చి ఆంధ్ర న్యాటం నేర్చుకుంటున్నాను. శాసీ్త్రయ నృత్యాల్లో రాణించాలనేది నా కల. –లలితా శాన్విక, పెదబొడ్డేపల్లి నృత్యం నేర్చుకోవటం అదృష్టం... అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలకు నృత్యం నేర్చుకోవటం నా అదృష్టం. నృత్యంలో ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాను. నృత్యంలో రాణిస్తానన్న నమ్మకం ఉంది. టీచర్ ఉమాదేవి ప్రోత్సహంతో నృత్యంలో రాణిస్తాను. –యశ్విత, నర్సీపట్నం -
5 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
రోలుగుంట: హత్యాయత్నం కేసులో అయిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై రామకృష్ణారావు మంగళవారం తెలిపారు. మండలంలోని బీబీపట్నం గ్రామానికి చెందిన బాకూరి రామరాజుపై హత్యాయత్నం కేసు నమోదు కాగా, అప్పటి నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి వచ్చినట్టు సమాచారం అందుకుని మంగళవారం ఇతన్ని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు. ఇద్దరు యువకులపై పోక్సో కేసు అనకాపల్లి టౌన్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై రవికుమార్ మంగళవారం తెలిపారు. ఓ గ్రామానికి చెందిన బాలిక(14)పై తగరంపూడి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడినట్టు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు సాక్షి, విశాఖపట్నం : స్టీల్ప్లాంట్ యాజమాన్యం 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో బ్లాస్ట్ఫర్నేస్–1 విభాగంలో సమ్మె ప్రచారం నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిప్రదేశం వదిలి వెళ్లడాన్ని తప్పు పడుతూ 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరికొందరికి బుధవారం నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం ఉక్కు అడ్మిన్ భవనం కూడలి వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక నాయకులు ప్రకటించారు. -
నృత్యం అంటే మక్కువ...
చిన్నప్పటి నుంచి శాసీ్త్రయ నృత్యం అంటే ఇష్టం. గజముఖ నృత్య అకాడమీ ధనం మాస్టారు దగ్గర శాసీ్త్రయ నృత్యంలో తర్ఫీదు పొందాను. నేను నేర్చుకున్న కలను పలువురికి అందించాలనే తపనతో సొంతంగా శ్రీమృతేశ్వర నృత్య అకాడమీని స్థాపించాను. నా దగ్గర ప్రస్తుతం 47 మంది బాలబాలికలు శిక్షణ పొందుతున్నారు. శిక్షణకే పరిమితం కాకుండా బాలికలతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ఉద్యోగం ఉన్నప్పటికీ కళ మీద మక్కువతో శిక్షణ ఇస్తున్నాను. తల్లిదండ్రులు పిల్లల అభిరుచికి అనుగుణంగా ప్రోత్సహించాలి. –ఉమాదేవి, అకాడమీ శిక్షకురాలు, నర్సీపట్నం -
రూ.31 కోట్లతో తాగునీటి సమస్యకు పరిష్కారం
● ఉపాధి హామీలో ఇంకుడు గుంతల తవ్వకాలు ● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్పర్సన్ సుభద్ర వెల్లడి మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి విశాఖజిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.31 కోట్లు కేటాయించిందని, ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర మంగళవారం తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆమె వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన పలు స్థాయీ సంఘాల సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మూడు ఇంకుడు గుంతల తవ్వకానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న మురుగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇంకుడు గుంతలను నిర్మించనున్నట్టు చైర్పర్సన్ వెల్లడించారు. ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి సుమారు రూ. 74 వేల వరకు ఖర్చు అవుతుందని, ఈ నిధులను పూర్తిగా ఉపాధి హామీ పథకం ద్వారానే వెచ్చిస్తామని ఆమె స్పష్టం చేశారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సభకు సమర్పించగా, సభ్యులు పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీపై స్పందిస్తూ, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఒకవేళ ఎవరికై నా పింఛను అందకపోతే వెంటనే ఎంపీడీవోని సంప్రదించాలని చైర్పర్సన్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం కలిగిన రైతులు తమ భూముల్లో మొక్కలు పెంచడానికి ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు. మన్యంలో దోమల బెడద అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో దోమల బెడద అధికంగా ఉందని, దీని నివారణకు తక్షణమే ఫాగింగ్ చేపట్టాలని కోరారు. దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మట్టి..కొల్లగొట్టి
రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా పోలవరం ఎడమ కాల్వ, అసైన్డ్ భూముల్లో అక్రమ తవ్వకాలు● యథేచ్ఛగా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు ● అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్ యలమంచిలి రూరల్: మండలంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది.అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా నిర్వహిస్తూ రూ.కోట్లు గడిస్తోంది.అధికార టీడీపీ,జనసేన నేతల అండదండలు మట్టి మాఫియాకు ఉండడంతో అధికారులు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్టు,చెరువులు,అసైన్డ్ భూములు,పంట పొలాల్లో మట్టిని యంత్రాలతో యథేచ్ఛగా తవ్వు తూ టిప్పర్లు,ట్రాక్టర్లతో ప్రైవేటు వెంచర్లు,కట్టడాలు, ఇటుక బట్టీలకు తరలించి రూ.లక్షలు గడిస్తున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలను రెవెన్యూ,గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఇంతవరకు కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.మండలంలో నిత్యం కొంతమంది టీడీపీ,జనసేన గ్రామ,మండల స్థాయి నాయకుల కనుసన్నల్లో ప్రతి రోజూ పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లతో మట్టి అక్రమ రవాణా జరుగుతోంది. మంగళవారం యలమంచిలి మండలం ఏటికొప్పాకలో సచివాలయం ఎదురుగా ఉన్న రహదారి మీదుగా వీఆర్వో చూస్తుండగానే పది ట్రాక్టర్లతో మట్టిని ఓ ఇంటి నిర్మాణ పనులకు తరలించడం,ఆ వివరాలను సేకరించేందుకు వెళ్లిన కొందరు మీడియా ప్రతినిధులపై మట్టి మాఫియా దురుసుగా ప్రవర్తించడం, మీ ఇష్టం వచ్చిన పనిచేసుకోండని ప్రవర్తించిన తీరు మండలంలో చర్చనీయాంశమైంది. కల్పతరువు.. పోలవరం కాల్వ గట్లు యలమంచిలి మండలంలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్ల నుంచి గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.కొందరు అక్రమార్కులు అధికార కూటమి నేతల అండదండలతో రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా యంత్రాలతో తవ్వకాలు జరిపి,లారీలు,ట్రాక్టర్లతో అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారు.లారీ సైజును బట్టీ గ్రావెల్ లేదా మట్టి లోడుకు రూ.6 వేల నుంచి రూ.22,500 వేలు,ట్రాక్టరుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. నిరంతరాయంగా ఈ దందా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ముఖ్యంగా ఈ అక్రమ తవ్వకాలపై నిఘా ఉంచి, అడ్డుకోవాల్సిన రెవెన్యూ,గనుల శాఖ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. ఎవరైనా మీడియా ప్రతినిధులు తెలియజేసినప్పుడు లేదా పత్రికల్లో వార్తలు వచ్చిన సందర్భాల్లో ఒకటి రెండ్రోజులు హడావుడి చేయడం తప్ప పకడ్బందీగా మట్టి మాఫియా ఆగడాలు కట్టించడంలో అధికారులు విఫలమవుతున్నారనే చెప్పాలి.మట్టి అక్రమ తవ్వకాలు ఎక్కువగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారే వరకు,ఇతర సెలవు దినాల్లో జరుగుతున్నాయి.ఇక కొన్ని చోట్ల పట్టపగలే దర్జాగా అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలతో ఈ దందా కొనసాగుతోంది. వెంచర్లు,బట్టీలు,నిర్మాణాలకు తరలింపు యలమంచిలి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు,ఇటుక బట్టీలు, నిర్మాణాలకు మట్టిని భారీగా తరలిస్తున్నారు.వెంచర్లు వేసేటప్పుడు మట్టి ఎక్కువగా అవసరమతుంది.వీటికి అవసరమయ్యే మట్టి లేదా గ్రావెల్ను జనసేన,టీడీపీ నేతలు గంపగుత్తగా మాట్లాడుకుని మట్టి తోలుకుని రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ గ్రావెల్,మట్టి తవ్వకాల సమాచారం అందించినా గనుల శాఖ అధికారులు సిబ్బంది కొరత పేరుతో తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు.ఎక్కడైనా మట్టి అక్రమంగా తవ్వకాలు జరుపితే ఎంత మొత్తంలో మట్టి తరలించారో నిర్థారించాల్సిన గనుల శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.ఇక రెవెన్యూ అధికారులు,సిబ్బంది సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తమ కళ్లముందే అక్రమ వ్యవహారం జరుగుతున్నా కళ్లకు గంతలు కట్టుకోవడం మరీ దారుణం. చర్యలు తీసుకుంటాం అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. మట్టి,గ్రావెల్ తవ్వకాలపై ని ఘా ఉంచుతున్నాం.గ్రామ స్థాయిలో వీఆర్వో,ఆపైన ఆర్ఐలు పర్యవేక్షించేలా ఆదేశాలిస్తున్నాం.ఎక్కడైనా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేస్తే మాకు సమాచారం అందించాలి.తక్షణమే మా సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపించి ఆయా వాహనాలను స్వాధీనపర్చుకుని. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. –కె.వరహాలు, తహసీల్దార్, యలమంచిలి మీడియాపై దౌర్జన్యం మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసి కొందరు మీడియా ప్రతినిధులు వాటిని కవర్ చేసేందుకు వెళుతున్నపుడు అక్రమార్కులు వారిపై దురుసుగా ప్రవర్తించడం,కొందరు దుర్భాషలాడుతూ,దౌర్జన్యాలకు దిగడానికి కూడా వెనుకాడడం లేదు. ఫొటోలు,వీడియోలు తీస్తున్న మీడియా ప్రనినిధులను అడ్డుకోవడం,వారిపట్ల దురుసుగా మాట్లాడడం పరిపాటిగా మారింది.ఇటీవల యలమంచిలి సమీపంలో మామిడివాడ,కొత్తూరు ప్రాంతాల్లో ఒక జనసేన నాయకుడు అక్రమంగా చేస్తున్న మట్టి తవ్వకాల వద్దకు వెళ్లిన ఒక మీడియా ప్రతినిధిపై దౌర్జన్యానికి దిగాడు.మంగళవారం యలమంచిలి మండలం ఏటికొప్పాకలో జరుగుతున్న మట్టి అక్రమ రవాణా వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో అక్రమార్కులు మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి..ఏమీ చేయలేరని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం వెనుక అధికార యంత్రాంగం అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి.మీడియా ప్రతినిధులు సమాచారం ఇచ్చినా గ్రామస్థాయిలో వీఆర్వో అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్,మట్టి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను అక్కడి నుంచి తరలించుకుపోయిన తర్వాత అక్కడకు వెళ్తుండడం వెనుక ఆంతర్యం బహిరంగ రహస్యమే. -
ఖాళీ క్యారేజీలతో ఉపాధి వేతనదారుల ఆందోళన
దేవరాపల్లి: ఉపాధి హామీపథకం బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కూలీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని తిమిరాం, వెంకటరాజుపురం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం వేతనదారులు ఖాళీ క్యారేజీలతో ఆందోళన చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న మద్దతు పలికారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఉపాధి వేతనదారులకు కూలి సొమ్ముతో పాటు ఆశాఖలో ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. కూటమి పాలనలో ఉపాధి హామీపథకం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల శ్రామిక కుటుంబాలకు రూ. 800 కోట్లు మేర బకాయిలు ఉండడంతో పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 15 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేసవిలో వ్యవసాయ పనులు లభించక ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవించే పేదల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ పథకంలో రాజకీయ జోక్యం మితిమీరిపోతోందని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఏక పక్షంగా తొలగించి కూటమి సానుభూతి పరులను నియమిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో పార్టీల వారీగా పను లకు కేటాయిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పనులు కల్పించేలా ఒత్తిళ్లు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితులు మునుపెన్నడూ లేవని, ఉపాధి బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న ఉపాధి పనులు బంద్ చేస్తామని, దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వెంకన్న కోరారు. పథకం అమలులోమితిమీరిన రాజకీయ జోక్యం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న -
నేడు మాక్ ఎక్సర్సైజ్
తుమ్మపాల: శత్రువుల దాడులు చేసే సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 14న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్టు ఇన్చార్జి కలెక్టర్, జేసి ఎం.జాహ్నవి తెలిపారు. మన దేశంపై శత్రువులు దాడిచేసే పరిస్థితి సంభవించినప్పుడు ఏర్పడిన అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లి బైపాస్ రోడ్డులోని జయభేరి మారుతీ షోరూం ఎదురుగా గల గ్రీన్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ వద్ద ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించే మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని, జాగ్రత్తలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర సంసిద్ధతపై పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. -
కనుల పండువగా వెంకన్నకు చక్రస్నానం
చోడవరం: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈనెల 13న స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సోమవారం స్వామివారికి శ్రీ చక్ర స్నానం నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరపారు. ప్రత్యేకంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలకు శ్రీ చక్రస్నానం చేశారు. ఎమ్మెల్యే రాజుతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ వింజుమూరి శంకర్, దేవదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉపాధ్యాయుల శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. -
మహిళలకు, దివ్యాంగులకు సత్యసాయి సంస్థల వితరణ
అనకాపల్లి: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక ఆర్టీసీ రహదారి సేవా సంస్థ కార్యాలయంలో దివ్యాంగులకు వీల్ చైర్లు, మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు స్ప్రేయింగ్ యూనిట్లు పంపిణీ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఏపీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ ఉపకరణాలను భగవాన్ బాబా వారి తల్లి ఈశ్వరమ్మ డే సందర్భంగా జిల్లాకు 22 మందికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఏడుగురు మహిళలకు కుట్టు మిషన్లు, ఇద్దరు మహిళలకు జ్యూట్ కుట్టుమిషన్లు, ఏడుగురుకు వ్యవసాయదారులకు స్ప్రేయర్లు, అరుగురు వికలాంగులకు వీల్ చైర్లు అందజేసినట్టు తెలిపారు. సంస్థ సభ్యులు రాజశేఖర్, కామరాజు, అప్పలనాయుడు తదితరులతో పాటు జోనల్ ఇంచార్జిలు రామారావు, ప్రసాదు, లోపరాజు, రవిశంకర్, మహిళా యూత్ కో–ఆర్డినేటర్ భారతి, జాయింట్ సర్వీస్ కో–ఆర్డినేటర్ సరోజ, కన్వీనరు నాగరాజు పాల్గొన్నారు. -
జగ్గప్పారావుకు జ్ఞానీ జైల్సింగ్ పురస్కారం
మునగపాక: మండలంలోని గవర్ల అనకాపల్లికి చెందిన సామాజిక కార్యకర్త బొడ్డేడ జగ్గప్పారావు (జగన్) జ్ఞానీ జైల్సింగ్ అవార్డును దక్కించుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగిన సత్కార కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షరీఫ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే, ఏపీజేయూ 5 వసంతాల వార్షికోత్సవంలో భాగంగా జగన్ను సత్కరించారు. ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ , వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో జగన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సహచట్టం, వినియోగదారుల హక్కు చట్టం తదితర కార్యక్రమాలపై జగ్గప్పారావు విస్తృత ప్రచారం చేస్తూ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
ఎస్పీ కార్యాలయానికి 20 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యలు ఫిర్యాదుల పరిష్కార వేదికకు 20 అర్జీలు వచ్చాయి. తమ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ వంటి అంశాలపై అర్జీలు వచ్చినట్లు చెప్పారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయానికి అందిన ఫిర్యాదుల్లో కొన్ని... బంగారం తాకట్టు విడిపించాలని... తనకు నగదు అవసరమై బాబాయి వరస అయిన నారాయణరావు పేరు మీద అనకాపల్లి అన్నపూర్ణ బ్యాంక్లో 5.5 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టానని, అయితే తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని కోరగా తన సొంత ఖర్చులకు రూ.2 లక్షలు ఇస్తేనే విడిపిస్తానని అంటున్నారని అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన గిసాల కుమారి తెలిపింది. దీనిపై గ్రామ పెద్దల సమక్షంలో పెట్టినప్పటికీ సమస్య పరిష్కరించలేదని, దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు తన కుమారుడికి మెడికల్ డిపార్టుమెంట్లో ఉద్యోగం వేయిస్తామని చెప్పడంతో విశాఖ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తన బంధువు ద్వారా అనకాపల్లి పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్కు 2003 జూలై 1వ తేదీన రూ.5.10 లక్షలు ఇచ్చానని కాకినాడ జిల్లా పిఠాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అల్లం అప్పలనర్సయ్య తెలిపారు. ఆ హెడ్ కానిస్టేబుల్ అమరావతిలో డిప్యూటేషన్లో విధులు నిర్వహిస్తున్నారని, త్వరలో ఉద్యోగం వేయిస్తానని చెప్పి నేటికీ ఉద్యోగం వేయించలేదని, దీంతో ఇచ్చిన నగదును ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసగించిన హెడ్ కానిస్టేబుల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
ఆశా కార్యకర్తపై దాడికి పాల్పడిన నర్స్పై చర్యలు తీసుకోవాలి
అనకాపల్లి: కశింకోట మండలం మూలపేట గ్రామం ఆశా కార్యకర్తపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)జిల్లా నాయకులు ఎల్.శాంతి, ఈ.పార్వతి, కె.వరలక్ష్మి, బి రామలక్ష్మిలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేసి, వైద్యాలయంలో సూపరిటెండెంట్ ఎం.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ ఆస్పత్రికి గర్భిణిని డెలివరీకి తీసుకువచ్చిన కశింకోట మండలం మూలపేట ఆశా కార్యకర్త సిహెచ్ మాధవిపై రాత్రి ఎన్టీఆర్ ఆసప6తిలో ‘మేటి అసిస్టెంట్‘ సరళ మిశ్రా అకారణంగా దాడి చేసిందన్నారు. ఆశాలకు భద్రత కల్పించాలని, ఆశా కార్యకర్తను దుర్భాషలాడిన సరళ మిశ్రాపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సూర్యకళ, లక్ష్మి, రమణమ్మ పాల్గొన్నారు. -
దస్తావేజు ఇవ్వకుండా వీఆర్వో వేధిస్తున్నారు...
ల్యాండ్పూలింగ్ ద్వారా సంపతిపురం గ్రామంలో సర్వే నెం.286/5లో 1.28 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుని బదులుగా సర్వే నెం.284/30లో 378 చదరపు గజాల ప్లాట్ను తమ పేరున దస్తావేజు – 8333/2023 లో రిజిస్ట్రేషన్ చేశారని, కానీ దస్తావేజులు ఇవ్వకుండా అప్పటి వీఆర్వో శ్రీనివాసరావు ఇబ్బందులకు గురి చేశారని అనకాపల్లి మండలం సంపతిపురం గ్రామానికి చెందిన ఈరుగుల పైడిరాజు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. బదిలీపై మరోచోటకు వెళ్లినప్పటికీ తన పేరున గల దస్తావేజులు ఇవ్వడం లేదని, అతని వద్ద ఉన్న దస్తావేజు పత్రాన్ని ఇప్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
వికలాంగుడి భూమి కబ్జాకు యత్నం..
చీడికాడ మండలం చినగోగాడ గ్రామంలో ఉన్న తన భూమి రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూ కబ్జాకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా గాజువాక మండలం నాతయ్యపాలెం గ్రామానికి చెందిన వికలాంగుడు అక్కిరెడ్డి అప్పారావు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. చినగోగాడ గ్రామం సర్వే నెం.10–6లో 35 సెంట్ల భూమిని 2006లో కొనుగోలు ద్వారా వచ్చిందని, సదరు భూమిని తానే సాగుచేసుకుంటున్నానని, తాను వికలాంగుడిని కావడం, విశాఖ జిల్లాలో నివాసముండడంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తనకు తెలియకుండా తన భూమిని వారి పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకుని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వారి నుంచి తమకు రక్షణ కల్పించి తమ భూమిని కాపాడాలని కోరారు. -
పోలీస్ కస్టడీకి గర్నికం హత్యకేసు నిందితులు
రావికమతం: మండలంలో మేడివాడ యువకుడు కొలిపాక పవన్కుమార్ను గత నెల 6 వ తేదీన గర్నికం తిరుమల ఫంక్షన్హాల్ దగ్గర స్నేహితులు వేపాడ నరేంద్ర కుమార్, దుర్గాప్రసాద్, మైనర్ బాలుడితో కలిసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసు, వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి సంబంధించి దుర్గా ప్రసాధ్, నరేంద్రకుమార్లను రెండు రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్నామని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు తెలిపారు. దుర్గాప్రసాద్, నరేంద్రకుమార్ తూర్పుగోదావరి జిల్లాలో మూడు బైక్లు, కాకినాడ జిల్లాలో ఒక్కటి, గాజువాకలో ఒక్కటి, మొత్తం 5 బైకులను చోరీకి పాల్పడ్డారని, నిందితుల సమాచారం మేరకు వాటిని స్వాధీనం చేసుకుని, సంబంధిత పోలీసుస్టేషన్లకు అందజేశామని సీఐ కోటేశ్వరరావు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ రఘువర్మ పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
అక్కిరెడ్డిపాలెం: మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు యువకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. గాజువాకకు చెందిన చింతలపూడి లావణ్య వెంకటసత్యకుమార్, కొండపల్లి తరుణ్ వద్ద 2.4 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాలు ఉన్నాయని, వారు ఆటోనగర్ వద్ద ఉన్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దాడి చేసి, వారి నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి మత్తు పదార్థాలను తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో యువకులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్కు తరలించారు. -
రెవెన్యూ సమస్యలే అధికం
● పీజీఆర్ఎస్లో పరిష్కారం కాని అర్జీలు ● అర్జీని ఎండార్స్మెంట్తో ముగిస్తున్న అధికారులు భూ పంపకాల్లో వివాదం గతంలో కుమారుడితో పాటు కుమార్తెలకు సమానంగా పంచి మూడు భాగాలుగా ఏర్పాటు చేసుకుని సాగుతో పాటు రెవెన్యూ రికార్డుల్లో ముగ్గురి పేరున నమోదు చేయించుకున్న పంపకాలను కాదని కొడుకు ఇబ్బందులు పెడుతున్నాడని చోడవరం మండలం పీఎస్ పేట గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు బండారు దేముడమ్మ కలెక్టరేట్లో జిల్లా అధికారులకు తెలిపింది. నడవలేని ఆమె కుమార్తె సహాయంతో ఆటోలో కలెక్టరేట్కు చేరుకుని తనకు భర్తమూలంగా, స్వార్జితంగాను వచ్చిన భూమి వివరాలతో పీజీఆర్ఎస్లో నమోదు చేసింది. ఆర్వోఆర్ కేసులు, ఎంఎల్సీసీ మీటింగ్లకు కూడా తాము హాజరవుతున్నామని, అయినా పరిష్కారం దొరకడం లేదని ఆమె కుమార్తె బోకం పైడితల్లమ్మ తెలిపింది. తుమ్మపాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రోజురోజుకు ప్రజల మన్ననలు కోల్పోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాకుండానే ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు పీజీఆర్ఎస్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని అధికారులు, పాలకులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని ప్రజలు చేసుకున్న అర్జీలకు పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారి ధ్రువీకరణతో సమస్యపై ఎండార్స్మెంట్ మాత్రం ఇస్తున్నారని తెలిపారు. సోమవారం ఎండ తీవ్రంగా ఉండడంతో కలెక్టరేట్ వద్ద నిరసనల సంఖ్య తగ్గింది. పీజీఆర్ఎస్ వేదిక నుంచి ఇంచార్జి కలెక్టర్ ఎం.జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణరావు, జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి–170, పంచాయతీ రాజ్ –25, పోలీస్–13, ఇతర శాఖల్లోను ఫిర్యాదులు నమోదయ్యాయి. బార్క్ నిర్వాసితుల నిరసన బార్క్ నిర్వాసితుల జాబితాలో కక్షపూరితంగా తమ పేర్లు తొలగించారంటూ అచ్చుతాపురం మండలం తంతడి శివారు యాతపాలేనికి చెందిన 30 మందికి పైగా నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. బార్క్ ఎక్స్టెన్సన్లో ఇల్లు కోల్పోయిన తమకు 2005 ఏడాదిలో నష్టపరిహారం మంజూరు చేసారని, తదుపరి ప్రభుత్వం చేపట్టిన రెండు సర్వేల్లో నిర్వాసితుల జాబితాలో తమ పేర్లు కొనసాగాయని, ఇటీవల చేపట్టిన సర్వేలో తమ పేర్లను తొలగించి ఈ నెల 8న సచివాలయంలో జాబితా ప్రదర్శించారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. కేబుల్ ఆపరేటర్ సంఘాల నిరసన ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ పథకంపై సీఎం చంద్రబాబు కేబుల్ ఆపరేటర్ సంఘాల నేతలతో రివ్యూ మీటింగ్ నిర్వహించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ), ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ (ఎఫ్ఓఎఫ్), మల్టీ సర్వీసెస్ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్, మల్టీ సర్వీసెస్ జిల్లా అధ్యక్షుడు కొణతాల ప్రకాష్, ఎఫ్ఓఎఫ్ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్న ఫైబర్ నెట్ పథకం రానురాను దిగజారి పోతుందని, 2017లో పారంభించి ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ల్యాండ్ ఫోన్ను నాణ్యతతో కూడిన సేవలు తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో కొనసాగుతున్నాయని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఏపి ఫైబర్లో ఉన్నఫలంగా వందలాది మంది సిబ్బందిని తొలగించడంతో సేవలకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెటాప్ బాక్స్లపై రూ. 59 రెంట్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పీజీఆర్ఎస్లో ఇంచార్జి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. మత్స్యాకార భరోసా అందలేదు అచ్యుతాపురం రూరల్: అర్హులైన మత్స్యకారులకు మ త్స్యకార భరోసా అందలేదని మండల వైస్ ఎంపీపీ వాసుపల్లి పద్మావతి శ్రీనివాస్ అన్నారు. అర్హులైన మ త్స్యకారులకు వేట నిషేధ భృతి అందేలా న్యాయం చేయాలంటూ సోమవారం జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. బోటుకు ఇద్దరు చొప్పున మత్స్యకార భరో సా అర్హులకు అందనీయకుండా పక్కదోవ పట్టించారని, సుమారు 200 మంది అర్హులైన మత్స్యకారులకు వే ట నిషేధ భృతి అందలేదని తెలిపారు. అవకతవకలపై విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలన్నారు. చెరకు రైతుకు రవాణా చార్జీలు చెల్లించాలిబుచ్చెయ్యపేట: గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన వారికి రవాణా ఖర్చులు, వెయిటింగ్ చార్జీలు అందించాలని బుచ్చెయ్యపేటకు చెందిన పలువురు చెరకు రైతులు జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్కు చెరకు కాటాల నుంచి లారీల ద్వారా చెరకును తరలించాల్సిన కాంట్రాక్టర్ చెరకును పూర్తిగా తరలించకుండా మధ్యలోనే ఆపేయడంతో రైతులే సొంత ఖర్చుతో తరలించారని, ఫ్యాక్టరీ మరమ్మతులతో క్రషింగ్ నిలిచిపోవడంతో ఫ్యాక్టరీ అధికారులు రవాణా ఖర్చులతో పాటు వెయిటింగ్ ఛార్జీలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ కాంట్రాక్టర్కు రవాణా ఛార్జీలు చెల్లించిన అధికారులు రైతులకు మాత్రం ఇవ్వలేదని రైతులు గోపిశెట్టి శ్రీను, గాడి శ్రీను, రమణబాబు,ఐయితరెడ్డి రమణ తదితరులు తెలిపారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్లో జరిగిన స్పందనలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు వినతి పత్రం అందించారు. -
పంట భూములను ఖాళీగా ఉంచొద్దు
కశింకోట: పంట భూములను ఖాళీ ఉంచకుండా ఏదో పంట వేసి పచ్చగా ఉంచడానికి రైతులు కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ సిహెచ్.లచ్చన్న కోరారు. మండలంలోని సుందరయ్యపేట శివారు లాలంకొత్తూరులో ఉన్న మండల మెగా ప్రకృతి వనరుల కేంద్రం వద్ద మూడో విడత నవ ధాన్యాలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట భూములను పంటలు వేయకుండా వృథాగా ఉంచరాదన్నారు. ప్రకృతి వ్యవసాయం సాగుకు విత్తనాలను రైతుల నుంచి సేకరించి పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది పండించిన నవ ధాన్య పంటల విత్తనాలను కూడా స్థానిక రైతుల నుంచి సేకరించి వచ్చే ఏడాది రైతులకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నవ ధాన్యాలను సకాలంలో నాటుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం సమర్ధంగా చేస్తున్న కూండ్రపు నూకాలమ్మను ఉత్తమ రైతుగా ఎంపిక చేసి దుశ్శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. సర్పంచ్ వాసు, ప్రకృతి వనరుల కేంద్రం నిర్వాహకురాలు అరుణ, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, వీహెచ్ఎ కిషోర్ పాల్గొన్నారు. -
40 మందికి చికిత్సలు, 10 మందికి రక్త పరీక్షలు
పెద గరువులో వైద్య శిబిరం రోలుగుంట: అర్ల పంచాయతీ శివారు పెద గరువులో జ్వరాలపై సోమవారం పత్రికల్లో వచ్చిన వార్తపై వైద్య సిబ్బంది స్పందించారు. బుచ్చింపేట వైద్యుడు ఎస్.శ్రీనివాసరాజు ఫీల్డ్ సిబ్బందితో కలసి పెద గురువు గ్రామంలో సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 62 మంది జనాభా గల ఇక్కడ 40 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. పది మందికి రక్తపు పూతలు తీశారు. వారిలో కిలో ప్రవీణ్కుమార్(8)కి జ్వరమని నిర్ధారించి పీహెచ్సీకి రిఫర్ చేశారు. సిరిడి రాణి(7), కిలో ఆశ(5), కిలో పౌలి (ఏడాదిన్నర వయసు)కి దగ్గు, జలుబుగా గుర్తించి మందులు అందజేశారు. వైద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలో పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. వాతావరణ మార్పులు, వేసవి ఎండలకు వైరల్ జ్వరాలు సాధారణమన్నారు. మరగకాచిన నీరు తాగాలని, నిల్వ ఆహారం తీసుకోకూడదని గ్రామస్తులకు సూచించారు. -
పూటకో మాట.. రోజుకో నిబంధన
● గందరగోళంగా పాఠశాలలపునర్వ్యవస్థీకరణ ● యూటీఎఫ్ ధ్వజం అనకాపల్లి: పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో లోపాలను సవరించాలని, పూటకోక మాట.. రోజుకో నిబంధనలతో విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టడం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొందవి చిన్నబ్బాయ్ అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన డీఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్య వ్యవస్థను గందరగోళంలోకి నెట్టేస్తూ టీచర్ల బదిలీలు, పదోన్నతులను ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలుగా విభజిస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాల పాఠశాలలుగా విభజించి ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జీవో నంబర్ 117 ను రద్దు చేస్తామని ఏడాదిపాటు చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ రద్దు చేయలేదన్నారు, ఆ జీవోలో ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని కొనసాగించడం తగదన్నారు. హై స్కూళ్లలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 గా ఉండాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో 1:20 గా ఉండాలని, యూపీ పాఠశాలలను ఎత్తి వేయడం వల్ల పల్లె విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. 40 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మార్చాలని పేర్కొన్నారు. రేషనలైజేషన్కు ఏప్రిల్ 23 నాటి విద్యార్థుల రోల్ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బదిలీలు, పదోన్నతులకు స్థిరమైన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. సమస్యల సాధన కోసం ఈనెల 15న రాష్ట్ర స్థాయి ధర్నా విజయవాడలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యుటీఎఫ్ గౌరవాధ్యక్షుడు బోయిన వెంకటరావు, సహాధ్యక్షుడు రొంగళి అక్కునాయుడు, కోశాధికారి రాజేష్, కార్యదర్శులు సూర్య ప్రకాష్, రాజునాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
దేవరాపల్లి హైస్కూల్లో నాగుపాము కలకలం
దేవరాపల్లి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం నాగుపాము హడావుడి సృష్టించింది. హైస్కూలు ఆవరణలో చేపడుతున్న బాలికల వసతి గృహ నిర్మాణ పనుల కోసం తీసిన గొయ్యిలో ఎలుకను మింగేసి కదలలేని స్థితిలో ఉన్న నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారుల ద్వారా స్నేక్ క్యాచర్ కృష్ణకు సమాచారం అందించారు. నిచ్చెన సహాయంతో గొయ్యిలోకి దిగిన స్నేక్ క్యాచర్ సుమారు అరగంటపాటు శ్రమించి మూడున్నర అడుగుల పొడవున్న నాగుపామును పట్టుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
అన్న ట్యాబ్లో గేమ్లు ఆడవద్దన్నాడని..
● బాలిక బలవన్మరణం ● కేజిహెచ్లో చికిత్స పొందుతూ మృతి కె.కోటపాడు: ట్యాబ్లో గేమ్లు ఆడుతోందని అన్న మందలించడంతో క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన పాచిల యమున (16) గత నెల 27న ట్యాబ్లో గేమ్లు ఆడడం చూసి అన్న జయంత్ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక.. తల్లిదండ్రులు పాచిల వరలక్ష్మి, శ్రీరామ్మూర్తి, అన్న జయంత్ పొలం పనులపై మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లాక ఉరి వేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి యమున ఫ్యాన్కు వేలాడడం గమనించి భర్తకు తెలపగా కుమార్తెను హుటాహుటిన చౌడువాడ పీహెచ్సీకి తీసుకువెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లిలో గల ఉషా ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 2 వరకూ అక్కడే వైద్యం అందించారు. ఆమె ఆరోగ్య పరిస్ధితిలో మార్పు రాకపోవడంతో ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు యమునను అదే రోజు విశాఖ కేజీహెచ్లో చేర్చారు. ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న యమున ఆరోగ్య పరిస్ధితి మరింత విషమించి ఈనెల 11వ తేదీ ఆదివారం రాత్రి ఆస్పత్రిలో మృతి చెందింది. యమున మృతిపై కె.కోటపాడు పోలీసులకు మేనమామ దొగ్గ కృష్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్ విచారణ జరుపుతున్నారు. కేజీహెచ్లో పోస్టుమార్టం పూర్తయ్యాక శవాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఏడాది పదిలో 531 మార్కులు ఈ ఏడాది పది పబ్లిక్ పరీక్షల్లో మృతురాలు పాచిల యమున 531 మార్కులు సాధించింది. యమున ప్రతి పరీక్షలో మంచి మార్కులు సాధించేందని బంధుమిత్రులు తెలిపారు. యమున 8వ తరగతి నుంచి ప్రస్తుతం 10 వరకు తానాం రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంది. ఇంటర్మీడియట్లో చేరాల్సి ఉన్న ఆ బాలిక అన్నతో జరిగిన ఘర్షణ కారణంగా క్షణికావేశంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. -
అవిశ్వాస తీర్మానంపై సమావేశం మినిట్స్ ఇవ్వండి
మహారాణిపేట (విశాఖ): జీవీఎంసీ ప్రత్యేక సమావేశం మినిట్స్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ఇన్చార్జి రవిరెడ్డి కోరారు. గత నెల 19న జరిగిన ఈ సమావేశం ప్రక్రియల మినిట్స్, వాటి ప్రతిని వెంటనే అందించాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న తాను రాసిన లేఖకు ఈ వినతి అనుసంధానంగా ఇస్తున్నట్లు తైనాల విజయకుమార్ పేర్కొన్నారు. మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంపై చర్చించిన సమావేశం వివరాలు, చేపట్టిన చర్యల మినిట్స్ కాపీని అందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నియమిత పార్టీ విప్గా, తాను కోరిన పత్రాలను వీలైనంత త్వరగా అందజేయాలన్నారు. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలన్నారు.కలెక్టర్కు తైనాల, రవిరెడ్డి వినతి -
గురువులకు సర్దుపోటు!
● ఉపాధ్యాయుల్లో బదిలీల గుబులు ● తుదిదశకు ఖాళీల కసరత్తు ● ఉమ్మడి జిల్లాలో భారీగా సర్ప్లస్ టీచర్లు ● మోడల్ స్కూళ్లకు హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లు ● సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గండం విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్న నేపథ్యంలో స్కూళ్లలో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనే లెక్క తీసే పనిలో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం తలమునకలై ఉంది. మంగళవారం నాటికి వాస్తవ ఖాళీలను ధ్రువీకరించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలోని ఎంఈవోలు, డీఈవో కార్యాలయ సిబ్బంది అంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఎంఈవోలను తన కార్యాలయానికి పిలిపించి.. వారి సమక్షంలోనే వాస్తవ ఖాళీలను లెక్క తీసి, వాటిని ధ్రువీకరించేలా డీఈవో ప్రేమ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో సోమవారం రాత్రి కూడా డీఈవో కార్యాలయంలోనే అధికారులు, సిబ్బంది అంతా క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహించారు. జిల్లాలో ఏడు రకాల బడులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో ఏడు రకాల బడుల ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 3,158 పాఠశాలలు ఉండగా ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా ఏడు రకాలుగా బడులు (ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక, మోడల్ ప్రాథమిక, యూపీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు) కూర్పు చేసి ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. 2024 డిసెంబర్ నాటికి స్కూళ్లలో నమోదైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను లెక్క కట్టి, ఇందుకనుగుణంగానే ఖాళీల జాబితాలను సిద్ధం చేశారు. ఎస్జీటీ పోస్టులకు గండం ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారుగా 596 మోడల్ ప్రాథమిక స్కూళ్లును ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను కేటాయిస్తున్నారు. కాగా వీటిలో ప్రధానోపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్ను నియమించనున్నారు. దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గండిపడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. హైస్కూళ్లలో భారీగా సర్ప్లస్ టీచర్లు కొత్తగా ఏర్పాటు కాబోయే స్కూళ్లకు అనుగుణంగా పోస్టులు రేషనలైజేషన్ చేపట్టగా, హైస్కూళ్లలో భారీగా మిగులు ఉపాధ్యాయులు లెక్క తేలారు. గణితం, ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్ పోస్టుల్లో పనిచేసే వారే ఎక్కువగా మిగులుగా తేలారు. తాజా లెక్కల ప్రకారం సుమారుగా 234 మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్ కాబోతున్నారు. వీరందరినీ మోడల్ ప్రాథమిక స్కూళ్లులో సర్దుబాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు. గుబులు మొదలు రేషనలైజేషన్ ప్రక్రియతో ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. బదిలీలకు అంతా సిద్ధం చేస్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో భారీగా సర్ప్లస్లో ఉపాధ్యాయులు ఉండటంతో.. బదిలీల్లో ఎక్కడికి స్థానభ్రంశం కలుగుతుందోనన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో మొదలైంది. డీఈవో కార్యాలయ అధికారులు ప్రకటించిన ఖాళీల జాబితాలతో తాము ఎక్కడికి బదిలీపై వెళ్లాలనే దానిపై ఉపాధ్యాయులు లెక్కలేసుకుంటున్నారు. రేషనలైజేషన్ మేరకు ఏ పోస్టులు పోతున్నాయి? ఏ పోస్టులు మిగులుతున్నాయనే విషయాన్ని డీఈవో కార్యాలయ అధికారులు ఎప్పుడు ప్రకటిస్తారా అని ఉపాధ్యాయులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. -
ఏయూ వీసీకి ఎక్స్లెన్స్ అవార్డు
విశాఖ విద్య : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్కు ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (హైదరాబాద్) అందించిన ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆదివారం హైదరాబాదులోని ఐఐసీటీలో జరిగిన నేషనల్ టెక్నాలజీ డే కార్యక్రమంలో అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆచార్య రాజశేఖర్ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందించడం పట్ల విశ్వవిద్యాలయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసుల తీరు దారుణం
దేవరాపల్లి: బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, మహిళా నాయకురాలు విడదల రజని పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ మండిపడ్డారు. కూట మి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని, మాజీ మంత్రి రజనిపై పోలీసులు వ్యవహరించి న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. తారువలో సోమ వారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ‘సీఐ గారు ఏమిటి విషయమ’ని మర్యాదపూర్వకంగా అడిగిన మాజీ మంత్రిపై సదరు సీఐ దురుసుగా ప్రవర్తించడంతోపాటు ‘నీపై కూడా కేసులు పెడతామం’టూ బెదిరింపులకు దిగడం అత్యంత దారుణమన్నారు. మాజీ మంత్రి పట్ల పోలీసులు ఇలా వ్యవహరిస్తే.. రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. తమ 11 నెలల పాలనలో వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వం ప్రశ్నించే వారిపై ఇలా కక్ష సాధింపులకు దిగుతూ, అరాచకంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళల ను గౌరవిస్తాం, రక్షణ కల్పిస్తామని చెబుతున్న కూటమి నేతలకు మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన సీఐపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ డిమాండ్ చేశారు. -
సింహగిరికి వైశాఖ పౌర్ణమి శోభ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు కుటుంబసమేతంగా పెద్ద సంఖ్యలో సింహాచలం తరలివచ్చారు. తొలుత కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. వంటలు వండుకుని కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. గరిడీ నృత్యాలు చేశారు. మెట్లమార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. స్నానమాచరించేందుకు తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం కిక్కిరిసింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శన క్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, భక్తులతో నిండిపోయాయి. వరాహ పుష్కరిణి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు. పుష్కరిణి మార్గంలో ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. -
AP: సచివాలయంలో సంసారం
అనకాపల్లి: గ్రామ సచివాలయం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల చెంతకే పౌర సేవలను తీసుకువెళ్లేందుకు ఏర్పరచిన వ్యవస్థ. గ్రామ స్వరాజ్యం కలను నిజం చేసే ఈ సచివాలయాల కోసం నాటి సర్కారు పక్కా భవనాలను నిర్మించింది. అక్కడి నుంచే దేశమంతటికీ ఆదర్శంగా నిలిచిన వ్యవస్థ నడిచింది. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడది తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది.రోలుగుంటలో మరో అడుగు ముందుకేసి ఓ ప్రైవేటు వ్యక్తికి నివాసంగా కూడా మారింది. స్థానిక టీడీపీ నాయకుడి అండదండలతో ఏకంగా ఆ వ్యక్తి సచివాలయంలో సంసారమే నడిపేస్తున్నాడు. సదాశయానికి గండి కొడుతున్నాడు. ఆయన కుటుంబంతో గత 8 నెలలుగా నివాసం ఉంటున్నా.. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా.. అధికారులు ఏం చేస్తున్నారో.. కూటమి నాయకులు ఏం చెబుతారో! -
వీర జవాన్ త్యాగం మరువలేనిది
మురళీ నాయక్కువైఎస్సార్ సీపీ నేతల నివాళి మహరాణిపేట(విశాఖ): పాక్ దాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం మరువదని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటం వద్ద ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మురళీనాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, రవిరెడ్డి, కటుమూరి సతీష్, మొల్లి అప్పారావు, కొండా రాజీవ్ గాంధీ, బానాల శ్రీనివాసరావు, రాజన్న వెంకటరావు, కటారి అనిల్ కుమార్ రాజు, షేక్ మహ్మద్ గౌస్, ఏమండి సత్యనారాయణ, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, రామిరెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, దేవరకొండ మార్కండేయులు, నీలాపు కాళిదాస్రెడ్డి, కె.రామన్నపాత్రుడు, నాగేంద్ర, అప్పన్న, కొట్యడ సూర్యనారాయణ, కనక ఈశ్వరరావు, గంగా మహేష్, పీతల వాసు, బెవర మహేష్, గోబింద్ బోధాపు, శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రంభ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి
అనకాపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహించనున్న సమ్మెకు అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు వస్తోందని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని చెప్పారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలన్నారు. సోలార్ విద్యుత్, విండ్ విద్యుత్, హైదరాబాద్ ప్రాజెక్టులను, స్మార్ట్ మీటర్లను ఇలా అన్నింటినీ అదానీ సంస్థలకు కట్టబెడుతూ ప్రజలపై విపరీతమైన భారాన్ని ప్రభుత్వం మోపుతోందన్నారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని తెలిపారు. సచివాలయ లైన్మన్లను విద్యుత్శాఖలో విలీనం చేసి, వారికి ప్రమోషన్లు కల్పించాలని ఆయన కోరారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ భవిష్యత్తులో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యకతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఆర్.కె.వి.ఎస్. కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కోశాధికారి వి.వి.శ్రీనివాసరావు, సభ్యులు అవతారం, కేదారేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
పెదగరువులో జ్వరాల విజృంభణ
రోలుగుంట: మండలంలోని అర్ట పంచాయతీ శివారు పెదగరువులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మంచం పట్టారు. అందుబాటులో వైద్య సిబ్బంది లేకపోవడంతో చికిత్స అందడం లేదని, జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. ఎక్కువ మంది పిల్లలు జ్వరాలబారిన పడుతున్నారని చెప్పారు. కిలో ప్రేమ్ కుమార్ (15), కిలో పావులు (1), కిలో అక్ష(4), సేదరి రాణి(4)తో పాటు మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వైద్యాధికారులు స్పందించి, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం నాయకుడు కిలో నర్సయ్య, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు కోరారు. -
అప్పన్న సేవలోఒడిశా దాసులు
పది.. ఇరవయ్యేళ్లు కాదు.. ఏకంగా 300 ఏళ్లకు పైనే.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి సేవలో ఓ కుటుంబం తరిస్తోంది. ఏటా మూడు మాసాలు సింహగిరిపైనే ఉంటూ.. స్వామిని పూజిస్తూ, ఆర్జిత సేవలు చేస్తూ.. భక్తులకు ఇతోధికంగా సాయపడుతోంది. వారే ఒడిశాలోని గంజాం జిల్లా పట్టుపురం గ్రామానికి చెందిన దాసుల కుంటుంబం. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన నాలుగో తరం వారైన లక్ష్మీకాంత్నాయక్దాస్ అప్పన్నస్వామి సేవలో తరించేందుకు సింహాచలానికి చేరుకున్నారు. సింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంతో ఒడిశా భక్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. అందులోనూ గంజాంలోని పట్టుపురం గ్రామానికి చెందిన నాయక్దాస్ కుటుంబానిది మరీ ప్రత్యేకం. మూడు వందల ఏళ్లకు పైనుంచే ఈ కుటుంబానికి చెందిన ఒకరు స్వామి సేవకు అంకితమవడం ఆనవాయితీ. ఏటా మూడు నెలలు సింహగిరిపై ఉండి స్వామి సేవతోపాటు, తమ వద్దకు వచ్చే భక్తులకు స్వామివారి విశిష్టతను, సింహాచల క్షేత్ర వైభవాన్ని చాటిచెప్తుంటారు. స్వామి సేవలో నాలుగో తరం నాలుగో తరానికి చెందిన లక్ష్మీకాంత్నాయక్దాస్ ప్రస్తుతం అప్పన్న సేవలో తరిస్తున్నారు. ఈయన తాతగారి పెదనాన్న ముకుంద నాయక్ దాస్ నుంచే స్వామికి వీరి కుటుంబం సేవలందించే కార్యక్రమం ప్రారంభమైంది. స్వామిపై ఉన్న ఎనలేని భక్తి కారణంగా అప్పట్లో ఒడిశా నుంచి ముకుంద నాయక్దాస్ సింహాచలం వచ్చేశారు. సింహగిరిపై ఓ చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ, స్వామి సేవలో తరించేవారు. కొన్నేళ్లకు కంటిచూపు మందగించడంతో తమ్ముడి కొడుకై న రుషికేష్నాయక్దాస్ ఏడేళ్ల వయస్సు నుంచే ఆయన వద్దకు చేరారు. తనకు 9 ఏళ్ల వయసులో పెదనాన్న పరమపదించడంతో ఆ బాధ్యతలను రుషికేష్ నాయక్దాస్ స్వీకరించారు. ఆయన 95 ఏళ్లపాటు స్వామి సేవలో గడిపారు. ఒడిశా భక్తుల ఆశ్రయం దాస సత్రం రుషికేష్నాయక్దాస్ 1947లో సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయ సమీపంలో కొంత స్థలాన్ని తీసుకుని ఒడిశా నుంచి వచ్చే భక్తుల కోసం ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన మృతితో ఆయన కొడుకు బుచ్చికిషోర్ నాయక్దాస్ సింహాద్రి అప్పన్న సేవకు అంకితమయ్యారు. ఆ తర్వాత ఆయన తమ్ముడైన వనమాలిక్ నాయక్దాస్ స్వామి సేవను స్వీకరించారు. ఈయన హయాంలోనే రుషికేశ్నాయక్దాస్ శ్రీకారం చుట్టిన ఆశ్రమం దాస సత్రం నిర్మాణం పూర్తయింది. 2006లో వనమాలిక్ మృతితో ఆయన కొడుకు ప్రస్తుత దాసుడు లక్ష్మీకాంత్నాయక్దాస్ స్వామి సేవకు అంకితమయ్యారు. అంతా స్వామి అనుగ్రహం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఎంతో మహిమాన్వితుడు. నీతి, నియమాలు పాటిస్తూ నిర్మల హృదయంతో ఆరాధిస్తే ఖచ్చితంగా స్వామి అనుగ్రహం లభిస్తుంది. నా తండ్రి పరమపదం వరకు నేను మామూలు వ్యక్తిగానే తిరిగాను. ఆ తర్వాత నాలో భక్తిభావం కలగడం స్వామి కృప. తరతరాల సాంప్రదాయం కొనసాగించే అవకాశం ఆ స్వామి అనుగ్రహంగానే భావిస్తాను. – లక్ష్మీకాంత్ నాయక్ దాస్ 3 తరతరాల కుటుంబ సంప్రదాయం... ఒడిశా దాసుల సొంతం ప్రస్తుతం స్వామి సేవలో 4వ తరానికి చెందిన లక్ష్మీకాంత్నాయక్దాస్ 300 ఏళ్లు.. ఐదుగురు దాసులు ముకుందనాయక్ దాస్ (ప్రారంభకులు) రుషికేష్నాయక్ దాస్ (ముకుందనాయక్ తమ్ముడి కొడుకు) బుచ్చికిశోర్నాయక్ దాస్ (రుషికేష్నాయక్ కొడుకు) వనమాలిక్నాయక్ దాస్ (బుచ్చికిశోర్నాయక్ తమ్ముడు) లక్ష్మీకాంత్నాయక్ దాస్ (వనమాలినాయక్ కొడుకు) -
పెళ్లయిన మూడు రోజులకే..
రావికమతం: మండలంలో టి.అర్జాపురం శివారు పాత కొట్నాబిల్లి గ్రామానికి చెందిన ఆసరి జగదీష్ (26)కు అదే గ్రామానికి చెందిన ఉమ(22)తో గిరిజన సంప్రదాయంలో ఈ నెల 8 న గురువారం రాత్రి వివాహం జరిగింది. స్నేహితులకు పెళ్లి పార్టీ ఇవ్వడానికి వెళ్లిన జగదీష్ అనుకోని రీతిలో మృత్యువాత పడ్డాడు. గ్రానైట్ క్వారీ వద్ద భారీ గొయ్యిలో ఈతకు దిగి దుర్మరణం పొందాడు. ఈ సంఘటన పాత కొట్నాబిల్లిలో చోటు చేసుకొంది. రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాల మేరకు ఐదుగురు మిత్రులకు పెళ్లి పార్టీ శనివారం గ్రామానికి సమీపంలో ఉన్న క్వారీ వద్ద ఇచ్చాడు. అందరూ కలిసి మద్యం తాగారు. జగదీష్ మాత్రం తవ్వకాల వల్ల ఏర్పడిన గోతిలో ఈతకు దిగాడు. మిగిలిన స్నేహితులకు ఓపిక లేక ఒడ్డునే ఉన్నారు. జగదీష్ ఈతకు దిగి మునిగి పోయిన సంగతి స్నేహితులు గమనించలేదు. స్నేహితులకు మద్యం మత్తు వదిలాక జగదీష్ అక్కడ లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడని భావించి ఊర్లోకి వచ్చేశారు. శనివారం రాత్రి జగదీష్ రాకపోవడంతో బంధువుల ఇళ్ల వద్ద విచారించారు. ఆదివారం క్వారీ వద్ద గోతిలో శవమై తేలాడు. ఘటనపై మృతుడి తండ్రి సీతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. స్నేహితులతో స్నానానికి వెళ్లి నవ వరుడు దుర్మరణం -
నేడు రెండో విడత చందనం సమర్పణ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం రెండో విడత చందనం సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు సింహాచలం దేవస్థానం వైదికులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల పచ్చి చందనంలో ఆదివారం పలు సుగంధ ద్రవ్యాలను కలిపారు. సోమవారం తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ అనంతరం చందనాన్ని సమర్పించనున్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, వైదికులు చందనంలో సుగంధ ద్రవ్యాలను కలిపి సమర్పణకు వీలుగా సిద్ధం చేశారు. ఆలయ ఏఈవో ఆనంద్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింహాచలం క్షేత్రంలో సోమవారం వైశాఖ పౌర్ణమి ఉత్సవం కావడంతో ఆదివారం సాయంత్రానికే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు తరలివచ్చారు. -
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన
● మాజీ మంత్రి రజనిపై సీఐ దౌర్జన్యం హేయం ● వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అనకాపల్లి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మన రాష్ట్రంలో అమలు కావడం లేదని, రెడ్బుక్ పాలన మాత్రమే సాగుతుందని ప్రభుత్వ మాజీ విప్, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. స్థానిక రింగ్రోడ్డులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ధర్మశ్రీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. మాజీ మంత్రి విడదల రజనిపై సీఐ సుబ్బారాయుడు దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అతడిని డీజీపీ, గుంటూరు ఎస్పీ తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాల మహిళలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపెట వేశారని, చంద్రబాబు పాలనలో దాడులు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీని అర్ధరాత్రి అరెస్టు చేయడమే నిదర్శనమన్నారు. అధికారులు రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా కాకుండా హుందాగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. సోషల్ మీడియోలో ఐదారేళ్ల క్రితం పెట్టిన పోస్టులపై ఇప్పుడు కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అల్లూరి జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల రక్షణకు అండగా ఉండే సీఐ గుంటూరులో మాజీ మంత్రి రజనీపై అనుచితంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. కూటమి పాలనలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ మహిళలపై దాడులకు నిరసనగా త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు పెతకంశెట్టి శివసత్యనారాయణ, పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు మలసాల కుమార్ రాజా, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, 80, 83 వార్డుల ఇన్చార్జులు కె.ఎం.నాయుడు, జాజుల రమేష్, సీనియర్ నాయకులు బొడ్డేడ శివ, ఉగ్గిన అప్పారావు, అనకాపల్లి, కశింకోట మండలాల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద, మలసాల కిశోర్, పార్టీ నాయకురాలు నదియా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కాన్పు
కొంతమంది వైద్య సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి ధర్మాసుపత్రి అర్థాన్నే మార్చేస్తున్నారు. ఇక్కడ ఉచితంగా ప్రసవం చేయాల్సి ఉండగా, గర్భిణులకు ముందుగానే పురిటి కష్టాలు చూపిస్తున్నారు. మూడు నెలల క్రితం డెలివరీ కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు గుంజు కున్న గైనిక్ సివిల్ సర్జన్ డాక్టర్ శోభాదేవిని కలెక్టర్ సస్పెండ్ చేయడం తీవ్ర చర్చనీయాం శమైంది. అయినప్పటికీ ఎన్టీఆర్ ఆస్పత్రిలో గైనిక్ విభాగంలో మార్పు కానరాలేదు. సాధారణ కాన్పుకు రూ.3 వేలు, సిజేరియన్కు రూ.5 వేలు..అంటూ రేటు పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని గర్భిణులు గగ్గోలు పెడుతున్నారు. గైనిక్ విభాగంలో ప్రబలుతున్న సమస్యలివే.. సాక్షి, అనకాపల్లి: పండంటి బిడ్డ కోసం నవమాసాలు మోయడం ఒక కష్టం.. నెలలు నిండాక ఆ బిడ్డ తల్లి పొత్తిళ్లలోకి రావాలంటే అది మరింత కష్టం. కాన్పుల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేని పేదోళ్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇలాంటి వారిని వైద్యులు, సిబ్బంది పీడిస్తున్నారు. కాసులు సమర్పిస్తేనే కాన్పు అంటున్నారు. లేదంటే బిడ్డ అడ్డం తిరిగింది.. ఉమ్మనీరు తాగిందంటూ రకరకాల కారణాలు సాకుగా చెప్పి విశాఖలో కేజీహెచ్కు రిఫర్ చేస్తున్నారు. అక్కడకు వెళ్లలేని వారు అప్పోసప్పో చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల డీఆర్సీ మీటింగ్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి నేరుగా జిల్లా ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ ముందే ఎన్టీఆర్ ఆస్పత్రిలో పేదోళ్ల ప్రసవ వేదన దుస్థితిని ఎండగట్టారు. అయినా ఆస్పత్రి గైనిక్ విభాగంలో అదే తీరు కొనసాగుతోంది. కాసులు గలగలలాడితేనే వైద్యం అందేది.. ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, పాయరావుపేట, చోడవరం నియోజకవర్గాల నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా.. పేదలు ఉండడం వల్ల వారంతా సాధారణ ప్రసవం కోసం వస్తారు. వారిని కొంతమంది డాక్టర్లు కాసులిస్తేనే కాన్పు చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. సాధారణ కాన్పుకు రూ.3 వేలు, సిజేరియన్లకు రూ.5 వేల వరకూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ● అనకాపల్లిలో జిల్లా స్థాయి ఎన్టీఆర్ ఆస్పత్రికి అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి రోగులు వస్తుంటారు. సమీప ప్రాంతాలకు ఇదే పెద్దాసుపత్రి కావడంతో గైనిక్ విభాగంలో ఓపీలు ఎక్కువగా నమోదవుతాయి. ● గైనిక్ వార్డులో ఫ్యాన్లు తిరగక బాలింతలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. జనరేటర్ సదుపాయం ఉన్నా.. అది పది నిమిషాల వరకే పని చేస్తోంది. గైనిక్ వార్డులో ఇన్వెర్టర్ సదుపాయం లేదు. ● స్కానింగ్, ఎక్స్రే గదుల్లో ఏసీ సౌకర్యం లేదు. ● నిరంతరం రద్దీగా ఉండే ఆల్ట్రా స్కానింగ్ రూంలో ఒక్కరే రేడియాలజిస్టు అందుబాటులో ఉన్నారు. నెలవారీ చెకప్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను సైతం మూడు గంటలకు పైగా స్కానింగ్ సెంటర్ల ముందు వెయింటింగ్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ● డిస్టిక్ ఆస్పత్రిలో ముగ్గురే గైనిక్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ● గర్భిణులకు అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తున్నా.. వారికి రిపోర్టు ఇవ్వడం లేదు. తెల్ల పేపర్పై పెన్తో రాసి పంపిస్తున్నారు. రేడియాలజీ విభాగం వైద్యులు ఒక్కరే ఉండడంతో రోజువారీ 30 స్కాన్లు చేయడం కష్టతరమవుతోంది. ● సర్జికల్ గ్లౌజులు లేవు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు చికిత్సలు, ఆపరేషన్ చేసిన సమయంలో కావలసిన కాటన్, ఐవీ క్యానల్, స్కానింగ్ జల్ కొరత ఉంది. కొన్ని రకాల సర్జికల్ వస్తువులు, రోజుకు రూ.3 వేల లోపు సామగ్రి ప్రైవేట్గా కొనుగోలు చేస్తున్నారు. ● ఆపరేషన్ సమయంలో కావాల్సిన మందులను ప్రైవేట్ దుకాణంలో రోగులతో కొనుగోలు చేయిస్తున్నారు. మామూళ్లు తీసుకుంటే విధుల నుంచి తొలగిస్తాం ఆస్పత్రి మాతాశిశు విభాగంలో గర్భిణులకు ఆపరేషన్ సమయంలో కొంత నగదు తీసుకున్నట్టు వచ్చిన అభియోగాలతో వైద్యురాలిని విధుల నుంచి తొలగించాం. ప్రస్తుత వైద్యులు అటువంటి చర్యలకు పాల్పడడం లేదు. ఎక్కడైనా నగదు తీసుకున్నట్లు మా దృష్టికి వచ్చినట్లయితే తక్షణమే విధుల నుంచి తొలగిస్తాం. –ఎస్.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, అనకాపల్లి కాసులిస్తేనేఓపీ ఫుల్.. వైద్యం నిల్ రోజువారీ సగటున ఎన్టీఆర్ ఆస్పత్రికి 600 వరకూ ఓపీ రోగులు వస్తుంటారు. (సోమవారం) 535 ఓపీలు నమోదయ్యాయి. వీరిలో 31 మంది రోగులు అడ్మిట్ అయ్యారు. ఈ ఆస్పత్రిలో 250 నుంచి 300 వరకూ బెడ్స్ సదుపాయం కలదు. వీటిలో కాన్పుల విభాగంలో రోజూ గర్భిణుల ఓపీనే రోజుకు సగటున 200 వరకూ సీ్త్రలకు సంబంధించిన వ్యాధుల ఓపీ ఉంటుంది. రోజూ కాన్పుల కోసం అడ్మిషన్లు 10 నుంచి 20 నమోదవుతున్నాయి. సాధారణ ప్రసవానికి రూ.3 వేలు, సిజేరియన్కు రూ.5 వేలు లేదంటే బిడ్డ అడ్డం తిరిగిందని మెలిక ఇటీవలే లంచం తీసుకున్న గైనికాలజిస్ట్పై వేటు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో దందా గతంలో రోజుకు 300 ఓపీలు, మెటర్నల్ చెకప్లు ఇప్పుడు సగానికి తగ్గిన ఓపీ సంఖ్య 10 నుంచి ముగ్గురికి తగ్గిన గైనిక్ వైద్యులు ప్రసవ వేదనే.. ప్రసవం కోసం ఎన్టీఆర్ ఆస్పత్రికి పురుడు కోసం వస్తే, వారి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. సిజేరియన్కు సరిపడా సర్జికల్ గ్లౌజులు, కాటన్తోపాటు ఇతర వస్తువులను తెచ్చుకోవాలని ప్రైవేట్ మెడికల్ షాపులకు రాస్తున్నారు. వాటి ధర రూ.2 వేల వరకూ ఉంటుంది. డెలివరీ అయి ఇంటికి వెళ్లేసరికి దాదాపుగా రూ.10 వేలు ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇలా ఖర్చయితే పేదోళ్ల పరిస్థితి ఏంటి? తక్షణమే అధికారులు చొరవ తీసుకుని సరిదిద్దాలి. లేదంటే ఆస్పత్రి రావడానికే భయపడాల్సి పరిస్థితి నెలకొంటుంది. –కోన కోటేశ్వరి, సామాజిక కార్యకర్త -
సింహాచలం ఈవోగా సుజాత బాధ్యతల స్వీకరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఈవో(పూర్తి అదనపు బాధ్యతలు)గా దేవదాయ శాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సింహగిరికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం ఈఈ రాంబాబు, ఏఈవో ఆనంద్కుమార్, సూపరింటెండెంట్ కంచెమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతంలో పలుమార్లు దేవస్థానం ఇన్చార్జి ఈవోగా, డిప్యూటీ ఈవోగా ఆమె విధులు నిర్వర్తించారు. -
జూలో ‘సన్’డే సందడి
పోటెత్తిన సందర్శకులు.. రూ.3.62 లక్షల ఆదాయం ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కు ఆదివారం సందడిగా మారింది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు రావడం, అందులోనూ ఆదివారం కావడంతో సందర్శకులు పోటెత్తారు. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ సమయం జూ లోపల చెట్ల కిందే గడిపారు. చిన్నారులు చెట్ల నీడలో గంటల తరబడి ఆటలాడుతూ ఎండ వేడిమి కాస్త తగ్గుముఖం పట్టాక జూలో వన్యప్రాణులను తిలకించారు. వాటికి ఫొటోలు తీస్తూ, ఎన్క్లోజర్ల వద్ద సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఇక్కడ ఏనుగులు, పులులు, కోతులు, జిరాఫీ, జీబ్రాలు, జింకలతో పాటు నెమళ్లు, ఆఫ్రికన్ చిలుకలు, ఆస్ట్రిచ్లు, ఈములు వాటి ఎన్క్లోజర్లలో ఉదయం, సాయంత్రం సమయంలో హుషారుగా తిరుగుతూ జూకు వచ్చిన పిల్లల్ని, పెద్దలను అలరించాయి. మొసళ్ల జోన్ కొలనులో నీరు వేడెక్కడంతో వాటిలో మొసళ్లు సాయంత్రం వరకు బయటకు రాకుండా అడుగు భాగంలోనే ఉండిపోయాయి. ఆదివారం 4,303 మంది సందర్శించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. వారి ద్వారా రూ 3.62 లక్షల ఆదాయం లభించిందన్నారు. -
రాష్ట్ర స్థాయి వుషు పోటీలకు నింజాస్ అకాడమీ క్రీడాకారులు
నర్సీపట్నం: స్టేట్ వుషు చాంపియన్షిప్ పోటీల్లో నర్సీపట్నానికి చెందిన నింజాస్ అకాడమీ నుంచి 17 మంది బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు కర్నూలులో జరగనున్న సబ్ జూనియర్, సీనియర్ బాయ్స్, గర్ల్స్ రాష్ట్ర స్థాయి వుషు టోర్నమెంట్లో వీరు పాల్గొంటున్నారని కోచ్ ప్రియాంక తెలిపారు. పోటీలకు తరలివెళ్తున్న క్రీడాకారులను అకాడమీ డైరెక్టర్స్ సుతాపల్లి శ్రీకాంత్, వెలగా నారాయణరావు, ఎన్ఆర్ఐ అల్లాడ సురేష్, సీనియర్ కోచ్ యర్రా శేఖర్ అభినందించారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని వారు శుభాకాంక్షలు తెలిపారు. -
ఎస్సీలకు అమలు కాని ఉచిత విద్యుత్
బుచ్చెయ్యపేట : ఎస్టీ,ఎస్సీల ఉచిత విద్యుత్ పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 200 యూనిట్ల వరకు ఎస్టీ,ఎస్సీల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందజేశారు. కూటమి నాయకులు కూడా ఎస్టీ,ఎస్సీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. కాని పలు గ్రామాల్లో ఎస్సీలకు విద్యుత్శాఖ అధికార్లు బిల్లులు పంపుతున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. లోపూడి గ్రామంలో బండి అప్పారావు పేరుపై విద్యుత్ కనెక్షన్ ఉంది (సర్వీస్ నంబర్ 115634ఎల్008000095). ఆ సర్వీస్ నంబర్కు ఇటీవల వరకూ ఎటువంటి చార్జీలు పడలేదు. అయితే మార్చి నుంచి విద్యుత్శాఖ అధికారులు బిల్లులు పంపుతూ నగదు చెల్లించాలని వత్తిడి చేస్తున్నట్టు అప్పారావు భార్య బండి బోడమ్మ తెలిపింది. మార్చి నెలలో బిల్లు అందించగా ఉచిత విద్యుత్ కదా అంటే, ఈ సారి బిల్లు వచ్చింది డబ్బులు కట్టేయాలని, ఇక బిల్లు రాదన్నారని ఆమె చెప్పింది. దీంతో మార్చిలో రూ.300 కట్టానని, తరవాత ఏప్రిల్,మే నెలల్లో కూడా డబ్బులు కట్టాలని బిల్లులు అందించారని బోడమ్మ వాపోయింది. ఈ నెలలో రూ. 290 కట్టాలని బిల్లు అందించారని తెలిపింది. రెక్కాడితేనే గాని డొక్క నిండని నాలాంటి పేదల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం తగదని, తనకు బిల్లు రాకుండా న్యాయం చేయాలని ఆమె కోరింది.మూడు నెలలుగా బిల్లులు వసూలు చేస్తున్న అధికారులు -
విద్యుత్ షాక్తో 23 గొర్రెలు మృతి
చోడవరం: మండలంలోని గంధవరంలో విద్యుత్ షాక్తో 23 గొర్రెలు మృతిచెందాయి. వివరాలిలా ఉన్నాయి. గంధవరానికి చెందిన దేవర నారాయణ అనే గొర్రెలు పెంపకందారునికి గ్రామ సమీపంలో కల్లం ఉంది. అక్కడ రేకుల షెడ్లో రోజూలాగే శుక్రవారం రాత్రి తన గొర్రెలను ఉంచి, ఇంటికి వెళ్లిపోయాడు. షెడ్ పక్కనే గల విద్యుత్ స్తంభం నుంచి వచ్చిన విద్యుత్ వైరు.. షెడ్డు చుట్టూ వేసిన ఇనుక కంచెకు తగిలింది.ఆ వైరు ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై షెడ్డులో ఉన్న గొర్రెలన్నీ మృతి చెందాయి. శనివారం ఉదయం వెళ్లి చూసేసరికి అన్ని గొర్రెలు మృతిచెంది ఉండడంతో నారాయణ భోరున విలపించాడు. సుమారు రూ.4లక్షలు విలువైన గొర్రెలు మృతిచెందడంతో జీవనాధారం కోల్పోయానని నారాయణ కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామ సర్పంచ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా నర్సింగరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మొల్లి అప్పలనాయుడు, రాష్ట్ర గొర్రెలు, మేకలు పెంపకందారులు సంఘం అధ్యక్షుడు గంటా శ్రీరామ్ బాధితుడిని పరామర్శించారు. మృతిచెందిన గొర్రెలకు స్థానిక పశువైద్యాధికారి పోస్టుమార్టం చేశారు. విద్యుత్శాఖ ఏఈ, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం వివరాలు తెలుసుకొని, బాధితుడికి న్యాయం చేస్తామని తెలిపారు. -
పెళ్లిలో ప్రతీకారం !
తాళ్లతో బంధించి ఒకరిని హింసించిన బంధువులు తగరపువలస: భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ ఆశిపాలెంలో నల్ల తాతారావు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు తాళ్లతో బంధించి హింసించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తాతారావును ఆసుపత్రికి తరలించారు. చిప్పాడ పంచాయతీలోని కంచేరుపాలేనికి చెందిన అబ్బాయికి, ఆశిపాలెం యువతితో శుక్రవారం రాత్రి ఆశిపాలెంలో వివాహం జరిగింది. ఈ వివాహానికి అమనాంకు చెందిన నల్ల తాతారావు.. అతని అన్నయ్య అప్పన్న, తల్లి తవుడమ్మతో కలిసి వచ్చారు. వివాహం అనంతరం అప్పన్న, తల్లి అమనాంకు తిరిగి వెళ్లగా.. తాతారావు అక్కడే మంచంపై నిద్రించాడు. దీనిని గమనించిన పెళ్లి కుమార్తె బంధువులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తాతారావు కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి బంధించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాతారావు అన్నయ్య అప్పన్నకు ఈ విషయం తెలియడంతో తన తమ్ముడిని విడిచిపెట్టమని బంధువులను కోరాడు. అయితే వారు నిరాకరించారు. గతంలో తాతారావుకు కంచేరుపాలెం యువతితో వివాహం జరిగింది. వారి మధ్య వివాదాల కారణంగా ప్రస్తుతం తాతారావు అమనాంలో, అతని భార్య కంచేరుపాలెంలో ఉంటోంది. గతంలో తాతారావు తన మామ అనుకుని వేరే వ్యక్తిని తీవ్రంగా కొట్టాడని, అందుకు ప్రతీకారంగానే తాము అతన్ని బంధించామని పెళ్లి కుమార్తె బంధువులు ఆరోపించారు. తాతారావు అన్నయ్య ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు శనివారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విడిపించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు తన తమ్ముడికి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పన్న డిమాండ్ చేశాడు. -
ధ్యానోత్సవాలు ప్రారంభం
పెందుర్తి: స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్, ఉత్తరాంధ్ర ధ్యాన మాస్టర్ల సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన బుద్ధ పౌర్ణమి ధ్యానోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్యాన మాస్టర్లు మాట్లాడుతూ నిరంతర ధ్యాన ప్రక్రియ వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ధ్యానాన్ని నిత్య జీవనంలో భాగం చేసుకోవాలని సూచించారు. మనిషి మంచి నడవడిక కోసం గౌతమ బుద్ధుని అడుగుజాడల్లో నడవాలని సూచించారు. తొలిరోజు సంగీత ధ్యానంతో ప్రారంభమైంది. అనంతరం సీతమ్మధారకు చెందిన కృష్ణవేణి ఆధ్వర్యంలో శాసీ్త్రయ సంగీతం, రమణి బృందం ఆధ్వర్యంలో రమణీయ రాగాలు, నోరి గాయిత్రి ఆధ్వర్యంలో వీణా నాద ధ్యానం, మిట్టా మనోహర్ ఆధ్వర్యంలో ఆచార్య సాంగత్యం, కృష్ణవేణి బృందం ఆధ్వర్యంలో నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి ధ్యాన మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
అనకాపల్లి టౌన్: మండలంలోని బవులవాడ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నా యి. చోడవరం నుంచి అనకాపల్లి వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో, అనకాపల్లి నుంచి చోడవరం వైపు వెళుతున్న కారు బవులవాడ సమీపంలో ఎదురెదుగా వస్తూ బలంగా ఢీకొన్నాయి. దీంతో ఆటో పై భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న చోడవరం మండలం అంబేరపురానికి చెందిన ఏడుగురు మహిళల్లో నలుగురికి స్వల్పగాయాలు కాగా, ఆళ్ళ ముత్యాలమ్మ(51) అనే మహిళ తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించి చికిత్స అందజేశారు. -
వివాహం కాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య
కశింకోట: వివాహం కాలేదన్న మనస్తాపంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ అల్లు స్వామినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఉగ్గినపాలెం వద్ద గల బాటిల్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఒడిశాకు చెందిన అర్జు పాంగి (25) కూలీగా పని చేస్తున్నాడు. అతని అన్నదమ్ములకు వివాహం అయింది. అర్జుకు మాత్రం వివాహం కాకపోవడంతో మనస్తాపం చెంది తాను నివాసం ఉంటున్న గదిలో శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శబ్దాలు విని అనుమానించి పక్క గదిలో వారు గ్రామ పెద్దలను తీసుకు వచ్చి తలుపు తెరిచి చూసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ శ్రీనివాస్ సందర్శించి, మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
కార్గిల్ యోధుడు కనకరాజు
● యుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన మునగపాక వాసి ● పాక్ సైనికులతో జరిగిన పోరులో ఛాతీ కింద దూసుకుపోయిన బుల్లెట్ ● ఆర్మీలో సిపాయిగా చేరి.. హవల్దార్గా పదవీ విరమణ మునగపాక: మండల కేంద్రం మునగపాకకు చెందిన కనకరాజు తుపాకీ గుండుకు గుండెను ఎదురొడ్డి కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరుసలిపారు. సరిహద్దులో జరిగిన పోరులో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మునగపాక గ్రామానికి చెందిన బొయిదాపు సాంభమూర్తి–సత్యవతి దంపతుల పెద్ద కుమారుడు కనకరాజ్. ఐటీఐ పూర్తిచేసి, రిజ్మెంటల్ సెంటర్(ఎంఆర్సీ)లో 1994లో శిక్షణలో చేరారు. 1995లో గుజరాత్లో సిపాయిగా ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల పాటు అక్కడే పనిచేసిన ఆయన 1997–99లో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నారు.ఈ పెరేడ్లో తన బ్యాచ్ (144)మందితో కలిసి ప్రథమబహుమతిని కై వసం చేసుకున్నారు. 1999లో కూడా తన బ్యాచ్తో కలిసి ద్వితీయ బహుమతిని అందుకున్నారు. అదే ఏడాదిలో కాశ్మీరులోని కువ్వాడ జిల్లాకు బదిలీపై వెళ్లారు. అదే సమయంలో కనకరాజ్కు లాన్స్ నాయక్గా పదోన్నతి లభించింది.అదే ఏడాదిలో మే నుంచి జూలై వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. 1999 జూలై 31న భారత సరిహద్దులో పాక్ సైనికులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన ఛాతీ దిగువ భాగంలో బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన కనకరాజ్ను 428 ఫీల్డ్ అంబులెన్స్లో ఆపరేషన్ చేశారు.అయినా ఆరోగ్యం కుదటపడక పోవడంతో శ్రీనగర్ ఆస్పత్రిలో మరోసారి శస్త్ర చికిత్స చేశారు.అది కూడా వికటించింది. ఇన్ఫెక్షన్ సోకడంతో గుండె కొట్టుకోవడంలో తేడాలు రావడంతో జమ్మూలోని ఉదంపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స నిర్వహించి ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. జీర్ణాశయంలో రక్తం గడ్డ కట్టడంతో పేగుకు శస్త్ర చికిత్స నిర్వహించారు.దీంతో సిపాయి ఉద్యోగం చేసే పరిస్థితులు లేకపోవడంతో 2001లో కంప్యూటర్ శిక్షణ పొందారు. నాటి నుంచి రికార్డు ఆఫీసర్గా సేవలందించి 2011 అక్టోబర్ 21న హవల్దార్గా పదవీ విరమణ చేశారు. నేటికీ అందని సాయం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన కనకరాజుకు నేటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. దేశం కోసం పనిచేసిన ఉద్యోగులకు ప్రభుత్వం 300 గజాల స్థలాన్ని పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలనే జీవో ఉన్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.దీనికి తోడు మాజీ సైనికుని కోటా కింద 5 ఎకరాల స్థలం కేటాయించాల్సి ఉంది. పదవీ విరమణ నాటి నుంచి ఇంతవరకు పలు మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని కనకరాజ్ వాపోయారు. కాగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ సైనికులకు సాయం అందించేందుకు ఇటీవల జీవో వచ్చింది. అయితే కనకరాజ్ అనకాపల్లి జిల్లా వాసిగా గుర్తింపు ఉండడంతో ఎటువంటి ఫలం దక్కకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాజీ సైనికులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు మాత్రం ఇక్కడ అందకపోవడం విచారకరమన్నారు. -
ఎన్సీసీ శిక్షణ శిబిరంలో విద్యార్థుల ప్రతిభ
పాయకరావుపేట : సూరంపాలెంలో ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు జరిగిన 3వ ఆంధ్రా ఎన్సీసీ బాలికల బెటాలియన్ జూనియర్, సీనియర్ ఉమ్మడి వార్షిక శిక్షణ శిబిరం –1లో నిర్వహించిన వివిధ పోటీల్లో శ్రీ ప్రకాష్ విద్యానికేతన్కు చెందిన జూనియర్ వింగ్, శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాలకు చెందిన సీనియర్ క్యాడెట్లు ప్రతిభ కనబరిచారు. ఈ శిబిరానికి ఎనిమిది జూనియర్, ఐదు సీనియర్ వింగ్లకు చెందిన మొత్తం 456 మంది క్యాడెట్లు హాజరయ్యారు. పలు పోటీల్లో ప్రతిభ చూపారు. జూనియర్ వింగ్ విభాగంలో సోలో సాంగ్లో మొదటి స్థానం, ఖోఖో, చెస్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచి ఒక బంగారు పతకం, పది వెండి పతకాలను, సీనియర్ విభాగంలో బాడ్మింటన్లో మొదటి స్థానం, గ్రూప్ సాంగ్, ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి ఒక బంగారు, 13 వెండి పతకాలను సాధించారు. క్యాంప్ కమాండెంట్ కల్నల్ హెచ్ఎస్ మౌనిక, గ్రూప్ కమాండర్ రితిన్ మోహన్ అగర్వాల్, ఎస్ఎం గులాబ్ సింగ్ చేతుల మీదుగా ఈ పతకాలను అందుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సీహెచ్.వి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్ తదితరులు అభినందించారు. -
చల్లని తల్లి మోదకొండమ్మ
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాలు ఈనెల 11వతేదీ నుంచి 13వతేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో కమిటీల ప్రతినిధులు శ్రమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కలెక్టర్ దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్గౌడ అధ్యక్షతన అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ● అమ్మవారి ఉత్సవాల సందర్భంగా పాడేరు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అన్ని రోడ్లను కలుపుకొని ఐదు కిలోమీటర్ల వరకు ఇరువైపులా లైటింగ్ ఏర్పాటుచేశారు. ప్రధాన జంక్షన్లలో దేవతా మూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ● మోదకొండమ్మతల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మోదకొండమ్మతల్లి మూలవిరాట్ విగ్రహాన్ని బంగారు అభరణాలతో అలంకరించారు. రూ.2లక్షల వ్యయంతో పూల అలంకరణ చేపట్టారు. మెయిన్రోడ్డులోని సతకంపట్టు వద్ద మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ● ఆదివారం ఉదయం 5గంటలకు అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఇతర అధికారులు తొలిపూజలు చేస్తారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఇత్తడి ఘటాలను ఆలయం నుంచి తోడ్కోని మెయిన్రోడ్డు వరకు ఉరేగిస్తారు. ఘటాలను నెత్తిన పెట్టుకుని భక్తిశ్రద్ధలతో సతకంపట్టు వరకు మోయడం ఉత్సవాల ప్రారంభంలో ప్రధాన ఘట్టం. అమ్మవారి పాదాలు, ఇత్తడి ఘటాలను గుడివాడ మహిళలు శనివారం శుద్ధి చేశారు. ● ఉత్సవాల సందర్భంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు,ఇతర సిబ్బంది మొత్తం వెయ్యి మందితో ఎస్పీ అమిత్ బర్దర్ బందోబస్తు ఏర్పాటుచేశారు. బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులు, సిబ్బందితో ఏఎస్పీ అడ్మిన్ ధీరజ్ శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఘనంగా ఏర్పాట్లు: జేసీ అభిషేక్ గౌడమోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్గౌడ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. జెయింట్ వీల్, ఇతర వినోద కార్యక్రమాలకు సంబంధించి భద్రతా చర్యలను అఽధికారులతో సమీక్షించారు. అలాగే మోదకొండమ్మతల్లి ఆలయం, మెయిన్రోడ్డులోని సతకంపట్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు, డీఎల్పీవో కుమార్ పాల్గొన్నారు. బందోబస్తుపై ఎస్పీ సమీక్ష ఉత్సవాల మూడు రోజులు పాడేరు పట్టణంలో పోలీసుశాఖ ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు, ఇతర తనిఖీలు, సీసీ,డ్రోన్ కెమెరాల నిఘాపైె ఎస్పీ అమిత్బర్దర్ ఽశనివారం సమీక్షించారు. మోదకొండమ్మతల్లి ఆలయం, శతకంపట్టు ప్రాంతాలను ఆయన సందర్శించారు. భద్రత ఏర్పాట్ల వివరాలను ఏఎస్పీ (అడ్మిన్) ధీరజ్ తదితర అధికారుల నుంచి తెలుసుకున్నారు. నేటి నుంచి పాడేరులో ఉత్సవాలు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరణ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు -
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
కంచరపాలెం (విశాఖ): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. సీపీఐ విశాఖ జిల్లా మహాసభల సందర్భంగా కంచరపాలెం మెట్టు నేతాజీ కూడలి నుంచి పాత ఐటీఐ జంక్షన్ వరకు శనివారం పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వా రు మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలనే ఇంకా అమలు చేయలేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, నల్లధనాన్ని వెలికితీసి ప్రజలకు పంచుతామన్న హామీలను నెరవేర్చలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అందిస్తే.. సచివాలయ కార్యదర్శుల ద్వారా టీడీపీ నేతలు దరఖాస్తుదారులను బెదిరించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను రైతాంగ పోరాటం స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదని విమర్శించారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడలో రైల్వేస్టేషన్ ఉండగా.. అమరావతిలో మరో విమానాశ్రయం అవసరమేముందని ప్రశ్నించారు. అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదు సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు -
వీర జవాన్ మృతికి ఉపాధి కూలీల నివాళి
నాతవరం: ఆపరేషన్ సిందూర్లో జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందడం పట్ల ఉపాధి కూలీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు నాతవరం మండలం డి.యర్రవరం పంచాయతీలో శనివారం ఉదయం రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వీర జవాన్ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇ.సత్యవతి, నల్లగొండమ్మ తల్లి ఆలయ నిర్మాణ దాత చింతంరెడ్డి బెన్నయ్యనాయుడు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి అంకంరెడ్డి రామకృష్ణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
సరుగుడులో లేటరైట్ తవ్వకాలు
నర్సీపట్నం: నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా లేటరైట్ తవ్వకాలు చేపడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ప్రాంతంలోని 30 వేల ఎకరాల్లో లేటరైట్ తవ్వకాల అనుమతుల కోసం 2013లో బినామీలు పేరున దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో కొయ్యూరు మండలం కాకరపాడుకు చెందిన గిరిజనేతరుడు జర్తా లక్ష్మణరావుకు 121 ఎకరాల్లో అప్పట్లో అనుమతులు ఇవ్వగా, తాము తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. సదరు లీజుదారు గిరిజనుడు కాదని రుజువు కావడంతో మైనింగ్ తవ్వకాలు నిలిచిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం 296,34 హెక్టార్లల్లో మైనింగ్ వ్యాపారులు తవ్వకాలు చేస్తున్నారన్నారు. వీటి వల్ల పోడు వ్యవసాయం, కొండ కింద పండించే వరి, ఇతర ఆహార పంటలకు నీటి వసతి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. తవ్వకాల ప్రాంతంలో వివిధ రకాల చెట్లు, అడవి ధ్వంసమవుతున్నాయన్నారు. కొన్ని వందల అడుగులు మేర లేటరైట్ తవ్వకాలు చేపట్టి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని వాపోయారు. సిమెంట్ తయారీకి, ఇతర నిర్మాణ అవసరాలకు ఉపయోగిస్తున్న లేటరైట్కు డిమాండ్ ఉండడంతో మైనింగ్ మాఫియా అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తుందని ధ్వజమెత్తారు. ఈ తవ్వకాల వల్ల అసనగిరి, సిరిపురం, ముంతమామిడి, భమిడికలొద్ది, తొరడ, ఎరకంపేట, సరుగుడు, సుందరకోట, కిండంగి, తదితర గ్రామాల గిరిజనులకు నష్టం జరుగుతుందన్నారు. వీరిని ప్రలోభ పెట్టేందుకు లేటరైట్ లీజుదారుని వెనుక ఉన్న నర్సీపట్నానికి చెందిన మైనింగ్ వ్యాపారి డబ్బులు ఆశ చూపుతున్నారని ఆరోపించారు. గిరిజనులను వర్గాలుగా చీల్చి అక్రమంగా లేటరైట్ తవ్వకాలు చేస్తున్నారని, వెంటనే మైనింగ్ లీజులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల జీవనోపాధికి దెబ్బ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న -
14వ పోప్గా లియో నియామకంపై హర్షం
డాబాగార్డెన్స్ (విశాఖ): రోమన్ క్యాథలిక్ మిషన్కు 267వ జగద్గురువుగా, పరిశుద్ధ 14వ పోప్గా లియో నియామకంపై విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల హర్షం వ్యక్తం చేశారు. సెయింట్ ఆంథోనీ చర్చి ప్రాంగణం, ఆర్చి బిషప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉడుముల బాల మాట్లాడారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల దైవ సన్నిధికి చేరిన నేపథ్యంలో వాటికన్ అధిపతిగా, పునీత పేతురు వారసుడిగా లియో నియమితులయ్యారన్నారు. నూతనంగా ఎన్నికై న పోప్కు విశాఖ అగ్రపీఠం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. లియో 2015లో పీఠాధిపతిగా, 2023లో కార్డినల్గా వ్యవహరించారన్నారు. నూతన పోప్ భారత్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, ఆయన పాలనలో భారత్ను దర్శిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవోగా సుజాత
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఇన్చార్జి ఈవోగా దేవదాయశాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ సెక్రటరీ వి.వినయ్చంద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా ఇప్పటివరకు ఇన్చార్జి ఈవోగా పనిచేసిన కె.సుబ్బారావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇదిలావుండగా దేవస్థానం పర్మినెంట్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్లేందుకు ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 30 వరకు సెలవు పెట్టారు. దీంతో రెవెన్యూ నుంచి డిప్యుటేషన్పై వచ్చి దేవదాయశాఖ రాజమహేంద్రవరం జోన్–1 ఆర్జేసీగా పనిచేస్తున్న కె.సుబ్బారావుకు 92 రోజులపాటు ఇన్చార్జి ఈవోగా పూర్తి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఆయన మార్చి ఒకటో తేదీన ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు స్వీకరించగా.. ఈనెలాఖరుకు పదవీకాలం పూర్తవుతుంది. గత నెల 30న చందనోత్సవం రోజు గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో ఆయన సస్పెండ్ అయ్యారు. ఈనెలాఖరుతో దేవస్థానం పర్మినెంట్ ఈవో వి.త్రినాథరావు 92 రోజుల సెలవు కూడా పూర్తవుతుంది. ఆయన తిరిగి ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారా..లేదా.. అన్న చర్చ దేవస్థానంలో నడుస్తోంది. -
హైదరాబాద్, కాకినాడలకు కొత్త బస్సులు
నర్సీపట్నం: కాకినాడ, హైదరాబాద్కు వేసిన కొత్త ఆర్టీసీ బస్సులను స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. అనంతరం ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్లోని టాయిలెట్లు, క్యాంటీన్ను పరిశీలించారు. శుభ్రంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్లు శుభ్రం చేసే సిబ్బందికి నెలకు రూ.6 వేల జీతం ఇస్తున్నారని తెలుసుకొని ఆర్టీసీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వారికి చట్ట ప్రకారం రూ.12 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయమై ఆర్టీసీ చైర్మన్, ఎండీకి లెటర్ పెడతానన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో 58 దుకాణాలు ఉన్నాయని, వీటి ద్వారా ప్రతి నెలా అద్దె రూపేణా రూ.7.90 లక్షల ఆదాయం వస్తుందన్నారు. వచ్చే ఆదాయంతో సౌకర్యాలు కల్పించాలని జిల్లా ప్రజారవాణాధికారి పద్మావతి, డిపో మేనేజర్ ధీరజ్ను ఆదేశించారు. రీజనల్ చైర్మన్ ఏం చేస్తున్నారు? రీజినల్ చైర్మన్గా దొన్ను దొరకు సీఎం చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారని, ఆయన సక్రమంగా విధులు నిర్వహించాలని స్పీకర్ అన్నారు. రీజినల్ చైర్మన్ కనీసం రెండు నెలలకొకసారైనా డిపోలను సందర్శిస్తే ఇటువంటి సమస్యలు తెలుస్తాయన్నారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన దొర ఇప్పటి వరకు నర్సీపట్నం, అనకాపల్లి డిపోలను సందర్శించిన సందర్భాలు లేవన్నారు. కార్యాలయంలో కూర్చొని పరిపాలన చేయడం కాదని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. ఆయన వెంట కౌన్సిలర్ సిహెచ్.రాజేష్, పార్టీ నాయకులు ఉన్నారు. నర్సీపట్నం నుంచి నడపనున్న ఆర్టీసీ జెండా ఊపి ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
మాకవరపాలెం: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాకవరపాలేనికి చెందిన లంక గణేష్(26) ఆరేళ్ల క్రితం తూటిపాలకు చెందిన శీరంరెడ్డి సుధారాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గణేష్ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా గణేష్ అత్తగారిల్లు అయిన తూటిపాలలోనే ఉంటున్నాడు. గురువారం మాకవరపాలెం వచ్చి మళ్లీ సాయంత్రం తూటిపాల వెళ్లాడు. శుక్రవారం ఉదయం సమీప జీడితోటలో ఉరివేసుకుని మరణించి కనిపించాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఎస్ఐ దామోదర్నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మృతుడి తల్లి నూకరత్నం ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఐదేళ్ల ఏళ్ల కుమారుడు ఉన్నారు. -
టీడీపీ సర్పంచ్ భర్త వేధింపులపై హోంమంత్రికి ఫిర్యాదు
ఎస్.రాయవరం: జేవీ పాలెం గ్రామంలోని తన భూమిలో మట్టిని ప్రస్తుత టీడీపీ సర్పంచ్ భర్త, మాజీ సర్పంచ్ వజ్రపు శంకరరావు దౌర్జన్యంగా తరలించుకుపోతున్నాడని గ్రామానికి చెందిన అన్నం కాంతం ఓ వీడియో ద్వారా రాష్ట్ర హోంమంత్రి అనితకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 2016 నుంచి తన భూమిలోకి అక్రమంగా చొరబడి గ్రావెల్ తరలించుకుపోయి సొమ్ము చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.50 వేలు వ్యయంతో నిర్మించుకున్న రేకుల షెడ్డును కూడా శంకరరావు కూల్చివేసి తనకు ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చాడని ఆమె ఆరోపించారు. ఈ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తాను పోలీస్ స్టేషన్కు వెళ్లే లోపే ఫిర్యాదు తీసుకోవద్దని అధికారం అండతో అడ్డుపడుతున్నాడని ఆమె వాపోయారు. పోలీసులు కూడా న్యాయ, అన్యాయాలు పరిశీలించకుండా కూటమి పార్టీ నేత అయిన శంకరరావుకే వస్తాసు పలుకుతున్నారన్నారు. ఈ మేరకు హోంమంత్రికి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. హోంమంత్రి అండదండలు తనకు మెండుగా ఉన్నాయని, గ్రామంలో ఏ చేసినా చెల్లిపోతుందని శంకరరావు రెచ్చిపోతున్నాడన్నారు. ఇటీవల గ్రామ సభలో తాను ఫిర్యాదు చేస్తే సర్పంచ్ దురుసుగా ప్రవర్తించాడని, ఆ ఘటనను తన మనవడు వీడియో తీస్తే, రూ.20 విలువ చేసే మొబైల్ లాక్కుని పోయాడని చెప్పారు. ఇప్పటికై నా హోంమంత్రి పరిశీలించి శంకరరావు ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. -
కుక్క దాడిలో ఉపాధి కూలీకి గాయాలు
చీడికాడ: మండలంలోని జె.బి.పురంలో పిచ్చికుక్క దాడిలో ఓ ఉపాధి కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రామిశెట్టి దేముడమ్మ ఓ చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా అటుగా వచ్చిన పిచ్చికుక్క దాడి చేసింది. దేముడమ్మ చేతులు, కాళ్లపై విచక్షణా రహితంగా గాయపరిచింది. పక్కనే ఉన్న తోటి కూలీలు కుక్కను తరమడంతో ప్రమాదం తప్పింది. బాధితురాలిని కుటుంబ సభ్యులు పెదగోగాడ పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సలహా మేరకు చోడవరం సీహెచ్సీ మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు సర్పంచ్ గొల్లవిల్లి చిన్నమ్మలు, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి స్వాతి కొండబాబు తెలిపారు. -
దేశం కోసం..
● యుద్ధ భూమిలో తండ్రీ కొడుకుల సేవలు ● ఇద్దరూ పాకిస్తాన్పై పోరాడినవారే.. మిలటరీ అప్పారావు అగ్గాల అప్పారావును అందరూ మిలటరీ అప్పారావు అని పిలుస్తారు. 1965లో ఆర్మీలో చేరిన వెంటనే పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. 22 సంవత్సరాలు సేవలందించిన ఆయన 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. మద్రాస్ రెజిమెంట్ సెవెంత్ బెటాలియన్లో విధులు నిర్వహించి శత్రువులను తరిమికొట్టారు. ఆనాటి జ్ఞాపకాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.. ప్రస్తుతమున్న టెక్నాలజీ అప్పట్లో లేకపోయినా దేశంపై ఉన్న మక్కువతో ప్రాణాలు తెగించి పోరాడాం. కళ్ల ముందే తోటి సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా అధైర్యపడకుండా ముందుకు దూసుకుపోయేవాళ్లం. ఎక్కువగా ల్యాండ్మైన్స్ ఏర్పరచడంతో యుద్ధం సమయంలో 40 మంది జవాన్లకు అప్పట్లో కేవలం 10మంది మాత్రమే తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకునేవారు. యుద్ధాలు జరగడం వల్ల దేశాలు ఆర్థికంగా కొన్ని సంవత్సరాలు వెనుకబడిపోతాయి. అమాయక దేశ పౌరులపై కాల్పులు జరిపి పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. దేశ సంరక్షణ కోసం ప్రస్తుతం ఎనిమిది పదుల వయస్సులో కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. ఎర్రవరం గ్రామానికి చెందిన అగ్గాల అప్పారావు.. ఆయన కుమారుడు హనుమంతరావు.. ఇద్దరూ ఆర్మీలో సేవలందించారు. పాక్ సైనికులను ఎదుర్కొన్నారు. మళ్లీ యుద్ధానికి సిద్ధమంటున్నారు. – అచ్యుతాపురం రూరల్ అగ్గాల అప్పారావు తనయుడు హనుమంతరావు కూడా అదే మద్రాస్ రెజిమెంట్లో పనిచేసి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. 74 రోజులపాటు పాకిస్తాన్తో పోరాడారు. యుద్ధభూమిలో అడుగు పెడితే దేశమే గానీ కుటుంబం గుర్తుకు రాదని, ప్రాణాలు పణంగా పెట్టడానికై నా సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. తన జ్ఞాపకాలను ఇలా నెమరువేసుకున్నారు.. 1999 కార్గిల్ యుద్ధంలో పనిచేస్తునప్పుడు సోలార్ మిసైల్స్ ఉండేవి. వాటిపై ఎప్పుడైతే సూర్యకాంతి పడుతుందో ఆటోమెటిక్గా టార్గెట్ చేసిన స్థలానికి చేరుకుని పేలిపోయేవి. మేము ముందుగానే గ్రహించి యుద్ధం సమయంలో అతి చాకచక్యంగా అటువంటి ఎన్నో సోలార్ మిసైల్స్ను వెలికితీశాం. ఇంటెలిజెన్స్ ప్రతి సైనికునిపై నిఘా ఉంచుతుంది. సైనికుల విధి విధానాలపై అప్రమత్తత వహిస్తుంది. అచ్యుతాపురం మండలం నుంచి సుమారు 30 మంది మాజీ సైనికులం యుద్ధంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని పై అధికారులకు లేఖ పంపించాం. కార్గిల్ యుద్ధ భూమిలో దాచిపెట్టిన సోలార్ మిసైళ్లను వెలికి తీసిన అగ్గాల హనుమంతరావు బృందం -
ఎన్ఎంయూ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
ఎంవీపీకాలనీ : వాల్తేర్ ఆర్టీసీ డిపో ఎన్ఎంయూ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఆ సంస్థ డిపో చైర్మన్ బండి రవి తెలిపారు. గురువారం రాత్రి డిపో ఆవరణలో ఉన్న తమ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఫర్నిచర్, కార్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కార్యాలయం సిబ్బంది వచ్చి చూడగా పరిసరాలు చిందరవందరగా ఉండటంతో కుర్చీలు, ఇతర ఫర్నీచర్ వస్తువులు ధ్వంసమై ఉన్నాయన్నారు. ఫ్లెక్సీని సైతం చించేశారన్నారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఎన్ఎంయూ డిపో యాజమాన్యంపై అక్కసుతోనే ఈ దాడికి పాల్పడినట్లు సంస్థ డిపో కార్యదర్శి వసంతరావు పేర్కొన్నారు. -
చెరువు..బరువు
కుంటుపడిన రైతు బతుకు తెరువు సాక్షి, అనకాపల్లి: మనవి దాదాపు వర్షాధార భూములు. వానలు పడితేనే పంట పండుతుంది. రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది. తగిన నీటి సదుపాయం ఉంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగేలా చెరువుల అభివృద్ధి, ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. సాగునీటి ఇబ్బందులు తొలగించడానికి ఏపీ సమీకృత సేద్య, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) తీసుకొచ్చింది. ప్రపంచబ్యాంక్ 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు భరించేలా సంయుక్తంగా చెరువుల నిర్మాణం చేపట్టారు. ఇందులో స్వతంత్ర, గొలుసుకట్టు చెరువులు, వంద ఎకరాలకుపైగా ఉన్న పెద్ద చెరువులు, చిన్న చెరువుల నిర్మాణ పనులు ఉన్నాయి. అందులో భాగంగానే జిల్లాలో 98 చెరువులు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఐదు విభాగాల సహకారం.. వాతావరణంలోని మార్పులను తట్టుకుని వ్యవసాయ ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంచే విధంగా రైతులు పంటలను పండించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని విస్తృతం చేశారు. వ్యవసాయ శాఖ, భూగర్భజల శాఖ, నీటిపారుదల శాఖ, ఉద్యావన శాఖ, మత్స్యశాఖ కలిసి సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకంలో చెరువుల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 100 ఎకరాల నుంచి 150 ఎకరాలకు సరిపడా నీరు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా చెరువులను అభివృద్ధి చేస్తారు. నీటి లభ్యతను రైతులు అంచనా వేసుకోవడానికి, బోరుబావులలో నీరు సమృద్ధిగా ఉండేటట్లు ఈ పథకంలో చర్యలు తీసుకుంటారు. పిజో మీటర్ డ్రిల్లింగ్ చేసి నీటి సాంద్రతను నెల నెలా తెలుసుకోవచ్చు. వర్షపు నీటిని ఒడిసి పట్టి వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకోవాలి. చెరువు ఆయకట్టు శివారు పంట పొలాలకు సైతం సాగునీరు అందేలా చెరువులను అభివృద్ధి, ఆధునికీకరణ చేసుకోవాలి. అప్పుడే పల్లెల్లో చెరువులు సైతం వ్యవ‘సాయం’గా మారుతాయి. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో ‘ఏపీ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం’లో భాగంగా చెరువుల అభివృద్ధికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేయాలని శరవేగంగా పనులు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఈ పనులు మందగించాయి. వేసవి కాలంలోనే చెరువులను అభివృద్ధి చేస్తే వచ్చే వర్షాకాలంలో సాగుకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత సర్కారు ఆ దిశగా ఆలోచించడం లేదు. కూటమి ప్రభుత్వంలో చెరువుల ఆధునికీకరణకు గ్రహణం సమీకృత వ్యవసాయ పరివర్తన పథకం ప్రవేశపెట్టిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో 50 సాగునీటి చెరువులను అభివృద్ధి చేయాలన్నది నాటి ప్రతిపాదన ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆధునికీకరణకు నోచుకోని వైనం రూ.33.46 కోట్ల ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నిర్మాణ పనులు ఇవి పూర్తయితే 7,232 ఎకరాల ఆయకట్టుకు అందనున్న సాగునీరు చెరువుల ద్వారా వ్యవ‘సాయం’ గ్రామాలలో వ్యవసాయానికి తోడ్పాటు అందించేవి చెరువులే. వర్షాలు పడేటప్పుడు నీరు నిల్వ ఉండేందుకు గ్రామాల్లో చెరువులు ఉపయోగపడతాయి. ఈ చెరువుల అభివృద్ధి, నిర్మాణ పనులతో పంటల దిగుబడి పెరిగి రైతుకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయనికి నీరందించే బోరు బావులలో వేసవి సమయాల్లో నీరు అడుగంటకుండా సహాయపడుతుంది. భూగర్భజలాలను నిల్వ చేయడానికి, వాటితోపాటు చేపల పెంపకానికి దోహదపడుతుంది. మరింత ఆదాయవనరులను పెంచుతుంది. ప్రధానంగా వ్యవసాయ సాగునీటి విస్తీర్ణం పెంచుకోవచ్చు. 20 శాతం కన్నా పనులు తక్కువైన చెరువుల వివరాలు ప్రభుత్వానికి పంపాం. – రాజేశ్వరరావు, ఈఈ, భూగర్భ జలవనరుల శాఖ ‘కూటమి’ నిర్లక్ష్యం.. రైతులకు శాపం ఏపీ సమీకృత సేద్య, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 50 చెరువుల పునరుద్ధరణ కోసం ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 80:20 నిష్పత్తిలో పనులు చేపట్టింది. వీటి కోసం రూ.33.46 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 33 చెరువులకు గానూ రూ.20.84 కోట్లతో ఒప్పందాలు ఖరారయ్యాయి. పనులు ప్రారంభమయ్యాయి. మరో 17 చెరువులకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఆ టెండర్లు రద్దు చేశారు. వీటిలో ఒక్కో చెరువు నిర్మాణానికి రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు కేటాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7,232 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పనులు కొనసాగించకపోగా పలు టెండర్లను రద్దు చేసింది. 2025 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో 2020లో శ్రీకారం చుట్టారు. అదేవిధంగా జపాన్లోని అంతర్జాతీయ సహకార సంస్థ ఆర్థిక సహాయంతో 20 మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి కోసం రూ.8.43 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో కోటి రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని టెండర్ దశలోనే ఉన్నాయి. -
వెబ్సైట్లో టెన్త్ మార్కుల మెమోలు
అనకాపల్లి టౌన్: టెన్త్ విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలు వెబ్సైట్ లో అందుబాటు లో ఉన్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల మెమోలను ఆయా పాఠశాలల ప్రధానోధ్యాయులు డౌన్లోడ్ చేసి, విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మార్కుల జాబితాలో పుట్టిన తేదీ, ఇంటిపేరు తదితర తప్పులు ఏమైనా ఉన్నట్టయితే అందుకు సంబంధించిన రికార్డులను ఈ నెల 25 లోపు అందజేసి సరిదిద్దుకోవాలన్నారు. ఒక సారి జారీ అయిన మార్కులలిస్టులో తప్పు లను మళ్లీ సవరించే అవకాశం ఉండదని తెలిపారు. -
చెరువు గర్భంలో రోడ్డు తొలగింపు
రోలుగుంట: క్వారీ నుంచి రాయి తరలింపు కోసం మండలంలోని రాజన్నపేట పొలాలకు సాగునీరు అందిస్తున్న చెరువు గర్భంలో నిర్మించిన రహదారిని రోలుగుంట తహసీల్దార్ ఎస్.నాగమ్మ శుక్రవారం తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. రాజన్నపేట గ్రామానికి చెందిన పొలాలకు 57/2 సర్వే నంబరులోని భూపతి చెరువు నుంచి సాగునీరు అందుతుంది. గతేడాది రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని కొండ ప్రాంతంలో క్వారీ నిర్వహణకు అనుమతి పొందారు. అక్కడి నుంచి రాయిని తరలించడానికి మార్గం లేక చెరువు గర్భంలో రహదారి ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా లారీలతో రాయి తరలింపునకు శ్రీకారం చుట్టాడు. భారీ బండ రాళ్లను రాంబల్లి మండలంలో తలపెట్టిన నేవల్ బేస్ నిర్మాణ పనులకు తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ రైతులు తమ భూములకు జరుగుతున్న నష్టాన్ని నిర్వాహకుడికి పలు దఫాలు మొరపెట్టుకున్నారు. చెరువును ఆక్రమించి రోడ్డు వేయడం తగదని అడ్డగించినా ఫలితం లేదు. దీంతో ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, నర్సీపట్నం ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో సైతం రైతులు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో రమణ ఈ ప్రాంతాన్ని గత వారం తహసీల్దార్ నాగమ్మతో కలిసి సందర్శించి వాస్తవాలపై విచారణ చేపట్టారు. ఈ మేరకు ఇక్కడ చెరువును ఆక్రమించి ఏర్పాటు చేసిన రహదారిని తొలగించి, క్వారీ నిర్వహణలో నిబంధనలు పాటించాలని నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగా శుక్రవారం మండల సర్వేయర్ నాయుడు, ఆర్.రామమూర్తి, వీర్వో శ్రీనివాస్తో కలిసి క్వారీ వద్దకు వెళ్లారు. చెరువు గర్భాన్ని ఆక్రమించి మెటల్, రాతి బుగ్గితో ఏర్పాటు చేసిన రోడ్డును పొక్లెయిన్తో తొలగించి, ట్రెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగానే క్వారీ నిర్వహణ ఉండాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వారీ నిర్వహణలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు రోలుగుంట తహసీల్దార్ నాగమ్మ హెచ్చరిక -
విశాఖ డెయిరీ పాల ధరల పెంపు
అక్కిరెడ్డిపాలెం: విశాఖ డెయిరీ పాల ధరలను పెంచుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు(500 మి.లీ) రూ.25 నుంచి రూ.26కు, హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు(లీ) రూ.50 నుంచి రూ.52కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు (500 మి.లీ) రూ.27 నుంచి రూ.28కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు(లీ) రూ.54 నుంచి రూ.56కు, టోన్డ్ పాలు (500 మి.లీ) రూ.27 నుంచి రూ.28కు, స్టాండర్డైజ్డ్ పాలు(500 మి.లీ) రూ.30 నుంచి రూ.31కు, ఫుల్ క్రీమ్ పాలు (500 మి.లీ) రూ.32 నుంచి రూ.33కు, ఫుల్ క్రీమ్ పాలు (లీ) రూ.63 నుంచి రూ.66కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు–గంగ (500 మి.లీ) రూ.28 నుంచి రూ.29కు, హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు–గంగ(500 మి.లీ) రూ.26 నుంచి రూ.27కు, టోన్డ్ పెరుగు (180 గ్రా.) రూ.14 నుంచి రూ.15కు, టోన్డ్ పెరుగు (కిలో) రూ.64 నుంచి రూ.66కు, డబుల్ టోన్డ్ పెరుగు (900 గ్రా.) రూ.54 నుంచి రూ.56కు పెరిగినట్లు యాజమాన్యం తెలిపింది. -
యుద్ధకాలపు అనుభవాలు
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విశాఖపై జపాన్ దాడి తప్పదని ముందుగానే ఊహించారు. 1942 జనవరిలో బర్మా, ఫిబ్రవరిలో సింగపూర్లను జపాన్ ఆక్రమించడంతో, వారి తదుపరి లక్ష్యం భారతదేశ తూర్పు తీరంలోని కీలక నగరమైన విశాఖపట్నం అని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని యూరోపియన్లు రైళ్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ముందు జాగ్రత్త చర్యగా విశాఖపట్నం అంతటా బంకర్లు నిర్మించారు. వీటిలో కొన్ని ఆర్కే బీచ్ పరిసరాలు, దస్పల్లా హిల్స్ ప్రాంతాల్లో ఇప్పటికీ చూడవచ్చు. రేషన్ సరుకులను నిల్వ ఉంచుకోరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆ సమయంలో నెలకొన్న పరిస్థితులను భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంపద(ఇన్టాక్) సంస్థకు చెందిన ఎడ్వర్డ్ పాల్ ‘సాక్షి’కి వివరించారు. ‘దాడిని ఎదుర్కొనేందుకు నగరంలో సరైన ఆయుధ సంపత్తి లేదు. జపాన్ సైన్యం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, పవర్ హౌస్లతో పాటు హార్బర్లోని నౌకలపై బాంబులు వేసింది. ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు. దాడి జరుగుతున్న సమయంలో, నౌకల్లోని పాత తుపాకులతో ఎదురుదాడికి ప్రయత్నించినా.. జపాన్ విమానాలు వాటి పరిధిలో లేకపోవడంతో అవి నిష్ఫలమయ్యాయి. పోర్టు నగరంపై దాడి జరుగుతుందని తెలిసినప్పటికీ తగిన ఆయుధాలను మోహరించలేదని ఇది స్పష్టం చేస్తుంది. ఆనాటి దాడిలో మరణించిన వారి పేర్లతో కూడిన శిలాఫలకాన్ని విశాఖపట్నం మ్యూజియంలో, అలాగే జారవిడిచిన ఒక పేలని బాంబును కూడా మ్యూజియంలో భద్రపరిచారు. ప్రజలు ఎడ్లబళ్లు, సైకిళ్లు, కాలినడకన నగరాన్ని విడిచి వెళ్లారు. అధికారులు మాత్రం తమ కుటుంబ సభ్యులను గ్రామాలకు పంపి.. విధుల్లో కొనసాగారు. ఆంధ్రా యూనివర్సిటీ భవనాలను ఖాళీ చేయించి బ్రిటిష్ సైన్యం వినియోగించుకుంది. యూనివర్సిటీని తాత్కాలికంగా గుంటూరు, విజయవాడలకు తరలించారు.’ అని పాల్ వివరించారు. అయితే 1971 నాటి పాకిస్తాన్తో యుద్ధ సమయంలో విశాఖపట్నంపై పెద్దగా ప్రభావం పడలేదన్నారు. 1942 నాటి ఘటనతో విశాఖపట్నంనకు రెండు ప్రయోజనాలు చేకూరాయని పేర్కొన్నారు. నగరానికి వచ్చిన సైనిక బలగాల నీటి అవసరాలను తీర్చడానికి ఆర్మీ ఇంజినీర్లు గోస్తనీ తాగునీటి పథకాన్ని నిర్మించారు. రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేసే ఈ పథకాన్ని యుద్ధానంతరం మున్సిపాలిటీ వినియోగించుకుంది. అలాగే మేహాద్రి గెడ్డపై ఒక వంతెనను కూడా నిర్మించారని ఆనాటి సంగతులను పంచుకున్నారు. -
భారత సైనికులకు మద్దతుగా సంఘీభావ యాత్ర
విశాఖ లీగల్ : భారత సైనికుల వీరోచిత పోరాటానికి సంఘీభావంగా విశాఖ న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రధాన గేట్ నుంచి జగదాంబ వరకు ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంఘీభావ ప్రదర్శన అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామాంజనేయులు మాట్లాడుతూ భారత సైన్యం శత్రుసేనపై చేస్తున్న పోరాటానికి తాము జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నూకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న సింధూర పోరాటానికి న్యాయవాదులందరూ సంఘీభావం ప్రకటించారన్నారు. కార్యక్రమంలో వందలాదిగా న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే కోర్టు ప్రధాన గేటు దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామాంజనేయరావు, వెంకటేశ్వరరావు, అల్లు సురేష్, మణి, భవాని, శ్రీధర్, చిట్టిబాబు, శ్రీరామ్ముర్తి, ఆనందరెడ్డి, ఎస్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు. -
మూడు యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు
కశింకోట: రోకళ్ల అప్పారావు.. భారత్తో పాకిస్తాన్, చైనా జరిపిన మూడు ప్రధాన యుద్ధాల్లో పాల్గొన్నారు. యుద్ధాలతోపాటు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఆర్మీ నుంచి పతకాలు పొందారు. శేష జీవితాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఆది నుంచి ఆరోగ్యంతో ఆనందమయ జీవనాన్ని గడుపుతున్నారు. కశింకోటలోని స్టేట్ బ్యాంకు వీధి ప్రాంతంలో అప్పారావు కుటుంబంతో స్థిర నివాసం ఉంటున్నారు. 1955లో 14వ ఏట ఇండియన్్ ఆర్మీలో చేరి సిపాయిగా వైర్లెస్ విభాగంలో ఆపరేటర్గా సేవలందించారు. 1962లో చైనాతోను, 1965, 71 సంవత్సరాల్లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో విధులు నిర్వహించారు. తొలుత 1966 వరకు సేవలందించి విధుల నుంచి రిటైర్ అయ్యారు. మళ్లీ యుద్ధం రావడంతో ఇండియన్ ఆర్మీ అధికారుల నుంచి వచ్చిన పిలుపు మేరకు మరోసారి వెళ్లి 1971లో పాకిస్తాన్ యుద్ధంలో సేవలందించారు. జమ్మూ, కశ్మీర్, అస్సాం, రాజస్థాన్, గుజరాత్, జలంధర్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించి సేవలందించారు. మూడు ప్రధాన యుద్ధాలు చవి చూసి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఆయన యుద్ధాల్లోను, సర్వీసులోను అందించిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఆర్మీ పతకాలను అందజేసి గౌరవించింది. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి నిలిపారు. అప్పారావు సొంత గ్రామం ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం. ఆర్మీలో చేరిన తర్వాత ఇక్కడికి వలస వచ్చి స్థిర నివాసం ఉంటున్నారు. పాక్ తుక్కుగా ఓడిపోవడం ఖాయం పాకిస్తాన్తో మళ్లీ యుద్ధం వస్తే భారత్ చేతిలో తుక్కుగా ఓడిపోవడం ఖాయమని అప్పారావు ధీమాగా చెప్పారు. సమృద్ధిగా ఆయుధ సంపత్తి, సాంకేతిక పరిజ్ఞానం భారత్కు ఉన్నాయన్నారు. ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన శేష జీవితాన్ని గడుపుతున్నానన్నారు. -
హెచ్ఎస్ఎల్కు ప్రతిష్టాత్మక అవార్డు
విశాఖ సిటీ : హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) డిజిటల్ దిశగా అడుగులు వేయడంలో అత్యుత్తమ ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన 10వ పీఎస్యూ అవార్డుల ప్రదానోత్సవంలో హెచ్ఎస్ఎల్కు అవార్డు దక్కింది. సంస్థలో ఐటీ అప్లికేషన్లు, సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును సంస్థ డైరెక్టర్(కార్పొరేట్ ప్లానింగ్ అండ్ పర్సనల్) కమడోర్ రాకేష్ ప్రసాద్ అందుకున్నారు. -
ముగిసిన వేంకటాద్రి బ్రహ్మోత్సవాలు
పెందుర్తి: వేంకటాద్రిపై కొలువైన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. ఆఖరి రోజు శుక్రవారం ఉదయం స్వామివారికి చక్రస్నానం, చక్రత్తాళ్వారులతో కలిసి దివ్య స్నానం జరిపారు. సాయంత్రం దేశం, రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించిన వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం జరిపారు. స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ద్వాదశారాధన, స్వామివారికి విశేష అర్చనలు, ఊంజల్ సేవ జరిపారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణలతో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. ఆలయ అర్చకుడు మహర్తి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో ఈవో నీలిమ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఏపీఐఐసీ ప్రాజెక్టు ఏరియాలో ఆర్డీవో పర్యటన
నక్కపల్లి: ఏపీఐఐసీ ప్రాజెక్టు ఏరియాలో గురువా రం నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ పర్యటించా రు. ఏపీఐఐసీ సేకరించిన 4500 ఎకరాల్లో బల్క్డ్రగ్ పార్క్ కోసం 2 వేల ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయినేజీలు, తదితర అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రైతుల నుంచి సేకరించిన భూముల్లో పరిహారం, ప్యాకేజీ చెల్లించిన భూములను ఏపీఐఐసీ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్లో ఉన్న కొబ్బరి, జీడి, మామిడి తోటలను తొలగించారు. బల్క్డ్రగ్ పార్క్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్ అవసరాల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏపీఐఐసీ వారే కల్పిస్తున్నారు. ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో సివిల్ పనులు జరుగుతున్నాయి. వీటిని ఆర్డీవో పరిశీలించారు. ఏయే గ్రామాల్లో ఎంత భూమిని ఏపీఐఐసీ స్వాధీ నం చేసుకుంది.. ఏయే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.. ఏమైనా అడ్డంకులు ఉన్నాయా.. తదితర వివరాలను ఏపీఐఐసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
నకిలీ కరెన్సీ.. రైస్ పుల్లింగ్..
● జనాన్ని దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టు ● ముగ్గురిని అరెస్టు చేసిన నర్సీపట్నం పోలీసులు నర్సీపట్నం: సీతారాముల కల్యాణ ఘట్టాన్ని ముద్రించిన మహిమ గల రాగి నాణెం.. రైస్ పుల్లింగ్ చేస్తుంది.. తెల్ల బియ్యంపై పెడితే నల్లరంగులోకి మారిపోతుంది.. అతి విలువైన, అరుదైన ఇరీడియం లోహంగా రూపాంతరం చెందుతుంది.. ఇది మీ వద్ద ఉంటే కుబేరులు కావడం ఖాయం.. అంటూ ఆశ పెడతారు. మాటలతో మాయ చేస్తారు. కనికట్టుతో కట్టి పడేస్తారు. ఇలా రైస్ పుల్లింగ్ కాయిన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను నర్సీపట్నం రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, నర్సీపట్నం, గొలుగొండ ఎస్సైలు రాజారావు, రామారావు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. సీఐ రేవతమ్మ అందించిన వివరాలు.. నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట జంక్షన్ బుచ్చంపేట వెళ్లే మార్గంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుజుకి సెలెరియో కారు వద్ద ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. పట్టుబడిన ముగ్గురి నుంచి రూ.2.60 లక్షల కరెన్సీ నోట్లను, అమెజాన్ చిల్ట్రెన్ బ్యాంకు నుంచి ఆర్డర్ చేసి తెప్పించిన రూ.10 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి కారు, మూడు సెల్ఫోన్లు సీజ్ చేశారు. విజయనగరానికి చెందిన నిమ్మల మనోహర్, తమ్మినేని సుమంత్ కుమార్, నిమ్మల మన్మధ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించామన్నారు. పరారైన నిందితులపై ఐదు కేసులు ఉన్నాయన్నారు. కాయిన్ల పేరుతో ఎవరైనా వస్తే పోలీసు ఎమర్జెన్సీ నంబర్ 1121001903కు సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. -
కష్టాలు చూడలేని కబోది ప్రభుత్వం
కళ్లకు గంతలతో కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది వినూత్న నిరసన అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా పోయిందని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వి.వి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని గురువారం వినూత్న నిరసన తెలియజేశారు. తమ కష్టాలు చూడలేని కబోది ప్రభుత్వమని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని కోరారు. కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బందికి ఆరేళ్లకే పర్మినెంట్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది భవాని, యమున, లక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్షరంపై కక్షసాధింపా?
అనకాపల్లి: ఎలాంటి అనుమతులు, సమాచారం లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా ప్రవేశించి సోదాలు చేయడాన్ని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని సాక్షి వెలుగులోకి తెస్తుండడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా అంతటా పాత్రికేయులు నిరసన ప్రదర్శనలు చేసి, అధికారులకు వినతి పత్రాలు అందించారు. ముందస్తు సమాచారం లేకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించడం దారుణమని ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో షేక్ ఆయిషాకు యూనియన్ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఒక ప్రముఖ దినపత్రిక ఎడిటర్తో దురుసుగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమాలు, అవినీతిని సాక్షి వెలుగులోకి తీసుకొస్తోందన్న అక్కసు, కక్షతో పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు దిగినట్లు పాత్రికేయ సంఘాలు భావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలను నిలిపివేయాలన్నారు. యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి గణేష్, యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.వెంకట అప్పారావు, పాత్రికేయులు కర్రి గంగాధర్, పెంటకోట సత్యనారాయణ, పి.వీరబాబు, బి.మధుసూదనరావు, వేగి రామచంద్రరావు, పి.సాయి తదితరులు పాల్గొన్నారు. సాక్షిపై ప్రభుత్వం కక్ష సాధింపు నర్సీపట్నం: సాక్షిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు సిహెచ్బిఎల్ స్వామి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ చింతల పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా చొరబడి సోదాలకు పాల్పడటాన్ని నిరసిస్తూ పాత్రికేయులు ఆర్డీవో కార్యాలయం ఇన్చార్జి ఏవో కె.అశోక్కు వినతిపత్రం అంజేశారు. ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ లోవరాజు, పాత్రికేయులు అప్పారావు, నానాజీ, ఎ.డి.బాబు, పాండురంగారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కలం గొంతు నొక్కితే ఉద్యమిస్తాం సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలపై జర్నలిస్టు సంఘాల నిరసన కూటమి సర్కార్ తీరును ఎండగట్టిన పాత్రికేయులు -
సింహాచలం ఈవోని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
సింహాచలం: చందనోత్సవం నాడు సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలైన ఘటనలో దేవస్థానం ఈవో కె.సుబ్బారావును సస్పెండ్ చేస్తూ రెవెన్యూ(విజిలెన్స్) డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఎలాంటి పర్మిషన్ లేకుండా హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లరాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిషన్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా దేవస్థానం ఈవోతో పాటు ఈఈ డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, జేఈ కె.బాబ్జీతో పాటు ఏపీటీడీసీకి చెందిన ఈఈ కె.రమణ, డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్ఆర్ స్వామి, ఏఈ పి.మదన్మోహన్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మిగతా ఆరుగురి సస్పెన్షన్ ఆర్డర్లు గురువారం సాయంత్రానికి వచ్చినట్లు చెబుతున్నా.. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్గా సూర్యప్రకాష్ బాధ్యతలు
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్గా టి.వి.సూర్యప్రకాష్ గురువారం సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1986లో ఏపీఎస్ఈబీ కేటీపీఎస్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరిన ఆయన పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ ఏపీఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ హోదాలో 2021లో పదవీ విరమణ పొందారు. ఆయన తాజాగా ఈపీడీసీఎల్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు 24/7 3–ఫేజ్ విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యప్రకాష్ను సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, డైరెక్టర్లు డి.చంద్రం, టి.వనజ అభినందించారు.