breaking news
Anakapalle
-
వాల్తేరు చుట్టూరాజకీయం!
● జోన్ అభివృద్ధికే గండం● శ్రీకాకుళం జిల్లా మొత్తం కొత్త జోన్లో ఉంచాలంటూ ప్రతిపాదనలు ● ఇచ్ఛాపురం సెక్షన్ని ఇవ్వబోమంటున్న ఈస్ట్కోస్ట్ జోన్ ● తేలే వరకూ గెజిట్ ఇవ్వొద్దంటూ రైల్వే బోర్డుకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి ● ఆదాయం వచ్చే కేకే లైన్ వైజాగ్కు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ తనూజ వినతిగెజిట్కు మోకాలడ్డుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుసాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్లో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కుంపటి రగుల్చుతోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న డివిజన్ని కొనసాగించాలంటూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంటే.. టీడీపీ ఎంపీలు మాత్రం కాలగర్భంలో కలిపేసేందుకు కుట్రపన్నుతున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు పక్క రాష్ట్రానికి అప్పగించి.. ప్రసాదం చేతులో పెడుతుంటే ఆహా ఓహో అంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలు.. తమకు రైల్వేకు అందే ఆదాయ మార్గం వద్దు.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ గెజిట్ రాకుండా అడ్డుపడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇచ్ఛాపురం వరకూ విశాఖ డివిజన్లో ఉంచాలంటూ ఎంపీ రామ్మోహన్రావు పట్టుబడుతుంటే.. ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ అధికారులు దాన్ని వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. మరోవైపు డివిజన్కు, జోన్కు ఆదాయం తీసుకొచ్చే కేకే లైన్ని రాయగడలో కాకుండా విశాఖలో కొనసాగించాలంటూ అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి పట్టుబడుతున్నారు. రామ్మోహన్ రాజకీయ మనుగడ కోసం.. దక్షిణ కోస్తా జోన్లో కీలక ఆదాయ మార్గమైన కేకే లైన్ వాల్తేరు డివిజన్లో ఉండాలని ఉత్తరాంధ్రవాసులు కోరుతున్నారు. దీంతో పాటు పలాస– ఇచ్ఛాపురం సెక్షన్ కూడా ఇక్కడే ఉండాలని అడుగుతున్నారు. కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఈ విషయంలో కేవలం శ్రీకాకుళం ఎంపీగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తన భవిష్యత్తు రాజకీయ మనుగడ కోసం కేవలం పలాస– ఇచ్ఛాపురం సెక్షన్ని మాత్రమే పట్టుకొని వేలాడుతున్నారు. ఇచ్ఛాపురం వరకు దక్షిణ కోస్తా జోన్లో ఉంచాలంటూ పదే పదే కోరుతున్నారు. అది తేలే వరకూ గెజిట్ ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ మాత్రం అంగీకరించడం లేదు. ఇచ్ఛాపురం సెక్షన్ వరకూ ఇవ్వాలంటే రాయగడ–నౌపడ లూప్ సెక్షన్ తమకు ఇవ్వాలంటూ షరతు విధించింది. పలు దఫాల చర్చలు విఫలమవుతూనే ఉన్నా.. రామ్మోహన్ మాత్రం తన రాజకీయ భవిష్యత్తు కోసమే తప్ప.. జోన్ అభివృద్ధి కోసం కాంక్షించకపోవడం గర్హనీయమంటూ పలువురు దుయ్యపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా ఉన్న జోన్ ఏర్పడుతున్నప్పుడు.. ఈ ప్రాంతం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలే తప్ప.. రాజకీయ స్వలాభం కోసం ఆలోచించకూడదు. ఇచ్ఛాపురం సెక్షన్ కూడా విశాఖ డివిజన్లో ఉండాల్సిందే. అదేవిధంగా ఆదాయం తీసుకొచ్చే కేకేలైన్ మొత్తం ఇక్కడే ఉంటే.. భవిష్యత్తులో జోన్ మరింత ముందుకు వెళ్తుందన్న విషయం టీడీపీ ఎంపీలు గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 2న రావాల్సిన గెజిట్.. పరిశీలనల్లో లేని విజ్ఞప్తుల వల్ల ఆగిపోయింది. ఇది బాధాకరం. కేకే లైన్ కోసం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కలిసి పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. త్వరగా జోన్కు సంబంధించిన గెజిట్ విడుదల చెయ్యాలని కోరుతున్నాం. – గుమ్మ తనూజరాణి, అరకు ఎంపీ అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాల్తేరు డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్కు వరంలాంటిది. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.17 వేల కోట్లు కాగా, ఇందులో రూ.10 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. దేశంలోనే సుమారు 300 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఏటా సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయమంతా.. ఇప్పుడు రాయగడ డివిజన్కు సొంతమవుతుంది. జోన్ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా కేకే లైన్ వాల్తేరు పరిధిలో అంటే త్వరలో ఏర్పడే విశాఖ డివిజన్లో ఉండాల్సిందేనని వైఎస్సార్సీపీ ప్రతినిధులు, డివిజన్ అధికారులు చెబుతున్నారు. కేకే లైన్ లేకపోతే.. విశాఖ డివిజన్ ఆదాయం రూ.3 వేల కోట్లు కూడా దాటే అవకాశం లేదు. దీంతో కొత్త జోన్ అభివృద్ధి సక్రమంగా జరిగే సూచనలు లేవని ఆందోళన చెందుతున్నారు. దీనిని కూడా రాజకీయం కోసం చంద్రబాబు ప్రభుత్వం వాడుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బైకు చోరీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
విలేకర్లతో మాట్లాడుతున్న సీఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషణరావు ఎస్.రాయవరం: బైకు దొంగతనాల్లో కీలక నిందితుడిగా ఉంటూ ఏడాదికాలంగా తప్పించుకుని తిరుగుతున్న షబ్బీర్ అలీయాస్ బసీర్ను శనివారం అడ్డురోడ్డు ప్లైవర్ వద్ద పట్టుకున్నట్టు అడ్డురోడ్డు సీఐ ఎల్.రామకృష్ణ తెలిపారు. గత ఏడాది జనవరిలో రేవు పోలవరం గ్రామంలో రెండు బైకులు చోరీకి గురికావడంతో అప్పట్లో నమోదు చేసిన కేసులో ముగ్గురు నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి 8 బైకులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధాన నిందితుడు ఇంతవరకు తప్పించుకుని తిరిగి ఈ రోజు పట్టుబడ్డాడన్నారు. నిందితుడు బసీర్పై 35 దొంగతనం కేసులు, గంజాయి కేసు కూడా నమోదై ఉందన్నారు. ఈ మేరకు అతనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
గొల్లపేటలో కిడ్నీ వ్యాధిపై స్క్రీనింగ్
కోటవురట్ల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గొల్లపేటలో కిడ్నీ వ్యాధిపై స్క్రీనింగ్ నిర్వహించినట్టు డిప్యూటీ డీఎంహెచ్వో వీరజ్యోతి తెలిపారు. కోటవురట్ల శివారు గొల్లపేటలో కె.వెంకటాపురం పీహెచ్సీ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్వో మాట్లాడుతూ ఇక్కడ ఎక్కువగా కిడ్నీ కేసులు ఉన్నట్టు ఫిర్యాదు రావడంతో జిల్లా కలెక్టర్ వైద్య శిబిరం నిర్వహించి స్క్రీనింగ్ చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. గొల్లపేటలోని ప్రతి ఒక్కరి నుంచి రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయనున్నట్టు తెలిపారు. ప్రధానంగా లక్షణాలు ఉన్న వారికి ప్రిలిమినరీ పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేయనున్నట్టు తెలిపారు. గ్రామంలో 5 నుంచి 10 మంది కిడ్నీ వ్యాధి మొదటి స్టేజ్లో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఇది ఎందుకు వచ్చిందనేది పరీక్షల ద్వారా నిర్ధారణ కానుందన్నారు. సాధారణంగా పేదలు పనిలోకి వెళ్లి అలసిపోయి నొప్పులు తగ్గేందుకు మందుల షాపులో మాత్రలు కొని వేసేసుకుంటారని ఇలా ఎక్కువగా వినియోగించడం వల్ల, నీళ్లు ఎక్కువ తాగకపోవడం వల్ల, యూరినల్ వ్యాధులు తదితర కారణాలతో కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందన్నారు. సమస్య వచ్చినపుడు పౌష్టికాహారం తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, నాన్వెజ్కు దూరంగా ఉండడం చేయాలన్నారు. రిపోర్ట్ వచ్చాక తదుపరి ఏం చర్యలు తీసుకోవాలో నిర్ధారణ చేస్తామని తెలిపారు. జెడ్పీటీసీ సిద్ధాబత్తుల ఉమాదేవి మాట్లాడుతూ గొల్లపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి జెడ్పీ సమావేశంలో సమస్యను లేవనెత్తినట్టు తెలిపారు. కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఆమె వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి పరీక్షలు చేశారని, అందులో సమస్య లేనట్టు గుర్తించారన్నారు. కె.వెంకటాపురం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కిషోర్కుమార్ కూడా సిబ్బందితో వైద్య పరీక్షలు చేసి స్థానికులకు అవగాహన కల్పించారన్నారు. ఇంకేదైనా సమస్యపై ఈ వ్యాధి వస్తోందా? అన్న కోణంలో అన్ని పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి డాక్టర్ లక్ష్మీశ్రీనివాస్, ఎంపీడీవో చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నాయకుడు సిద్ధాబత్తుల సత్యనారాయణ, ఉప సర్పంచ్ గవ్వా రాధాకృష్ణ, కార్యదర్శి రఘురాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
బావిలో పడి యువకుడి మృతి
అచ్యుతాపురం రూరల్: ఏఆర్ లైఫ్ సైన్స్ పరిశ్రమ ఉద్యోగి మారం నాగరాజు (23) బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. నూకరాజు శనివారం దుప్పితూరు సచివాలయం దగ్గర్లో ఉన్న చేపల చెరువు పక్కన బావిలో ఈత కొట్టడానికి తన స్నేహితులు తెల్లి శివ ప్రసాద్, పొన్నాడ రమేష్, నెమిరెడ్డి హరిబాబు, గోవిందులతో కలిసి వెళ్లాడు. మూడున్నర గంటల సమయంలో రమేష్ నాగరాజు పనిచేస్తున్న కంపెనీకి ఫోన్ చేసి బావిలో ఈతకు దిగిన నాగరాజు కనిపించట్లేదని చెప్పాడు. దీంతో అతని బంధువు మురళీ ఫణీంద్ర వచ్చి బావి దగ్గర వెతికారు. గేలం సహాయంతో గాలించగా సాయంత్రం 5 గంటల సమయంలో నాగరాజు మృతదేహాన్ని బావిలో నుంచి వెతికి బయటకు తీసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్రశేఖర్రావు, ఎస్ఐ వెంకటరావు తెలిపారు. -
టెండర్లకు ముసుగు.. కొటేషన్లతో దోపిడీ
మహారాణిపేట: కేజీహెచ్లో కంప్యూటర్ల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ నెల 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ–ఫైల్’ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించిన నేపథ్యంలో కేజీహెచ్ యంత్రాంగం హడావుడిగా చేపట్టిన కంప్యూటర్ల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు సహాయ స్థాయి ఉద్యోగులు చక్రం తిప్పి, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలవకుండానే కేవలం కొటేషన్ల ఆధారంగా ఈ కొనుగోళ్లు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో వాస్తవ ధర కంటే రెట్టింపు ధర చెల్లించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా, స్వయంగా కలెక్టర్నే తప్పుదోవ పట్టించారన్న విమర్శలు వినపడుతున్నాయి. బయటపడిన బండారం ఈ–ఆఫీస్ నిర్వహణ కోసం పరిపాలనా విభాగానికి అవసరమైన సుమారు 53 కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రిని మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలకు అంటే ఒక్కొక్క సెట్ను రూ. 60 వేల నుంచి రూ. 90 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఆస్పత్రి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ సొమ్ము వెచ్చించినా, తీరా ఆ కంప్యూటర్లను అమర్చాక ‘ఈ–ఫైల్’ సాఫ్ట్వేర్ వాటిలో సక్రమంగా పనిచేయకపోవడంతో అధికారుల బండారం బయటపడింది. నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇప్పుడు ఈ–ఆఫీస్ అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వైఫల్యంపై ప్రస్తుతం కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీ వర్గాల్లో వేడివేడిగా చర్చ సాగుతోంది. చక్రం తిప్పిన ఇద్దరు ఉద్యోగులు ధరల పెంపు, నాసిరకం కంప్యూటర్ల సరఫరా, ఫైళ్లపై సంతకాలు చేయించడం వంటి వ్యవహారాల వెనుక ఉన్న ఆ ఇద్దరు ఉద్యోగుల పాత్రపై సహచర సిబ్బంది మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పుడు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ తప్పు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం కావడమే కాకుండా, అత్యవసరమైన ఈ–ఆఫీస్ సేవలకు ఆటంకం కలిగించిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. -
వార్డు మెంబర్ కాని వ్యక్తిని ఎమ్మెల్యే చేశాం
● మాజీ ఎంపీ పప్పల ● యలమంచిలి నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సుందరపుపై తీవ్ర వ్యాఖ్యలు, సైటెర్లు సాక్షి, అనకాపల్లి: యలమంచిలి నియోజకవర్గ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. యలమంచిలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన యలమంచిలి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో జరిగిన పరిణామాలు రాజకీయ చర్చలకు దారి తీసింది. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్పై పప్పల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాధారణంగా ఇలాంటి సమన్వయ సమావేశాల్లో పార్టీ బలోపేతం, ప్రభుత్వంలో పార్టీ నాయకుల పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరగాల్సి ఉండగా, ఈ సమావేశం మాత్రం పూర్తిగా ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకున్న చేసిన విమర్శలతో సాగింది. ‘కనీసం వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తిని కూటమి పుణ్యమా అని ఎమ్మెల్యేగా గెలిపించాం. గెలిచిన తర్వాత మాత్రం మన నెత్తినే ఎక్కి కూర్చున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాకుండా టీడీపీ మాజీ మండల అధ్యక్షులను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుంటున్నారని, వారు గ్రామాల్లో ‘మేము ఎమ్మెల్యే మనుషులం’ అంటూ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారంటూ చలపతిరావు ఘాటుగా మాట్లాడినట్లు సమాచారం. అంతేకాకుండా ఎమ్మెల్యే మిమ్మల్ని వాడుకుంటున్నాడు అంటూ మాజీ మండల అధ్యక్షులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సమావేశంలో కలకలం రేపాయి. ఇటీవల యలమంచిలిలో ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన పిక్నిక్ అంశాన్ని కూడా పప్పల ప్రస్తావించారు. ఆ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ హాజరు కాలేదని, వెళ్లిన వారికి మాత్రం ‘రికార్డింగ్ డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్’ లభించిందంటూ సైటెర్లు వేశారు. అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను గుర్తు చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు రేపాయి. ఈ స్థాయిలో పార్టీ వేదికపైనే ఎమ్మెల్యేపై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు చేయడం పట్ల స్థానిక టీడీపీ నాయకులు షాక్కు గురయ్యారు. ఒకవైపు పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడటం, మరోవైపు ఎమ్మెల్యే–సీనియర్ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి, యలమంచిలి నియోజకవర్గంలో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఘనంగా తోడపెద్దు ఉత్సవం
నలభై ఏళ్ల తరువాత నిర్వహణరోలుగుంట: గ్రామశాంతి, పాడిపంటల అభివృద్ధి కోరుతూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ పోతల లక్ష్మీ రమణమ్మ ఆధ్వర్యంలో పూర్వపు సంప్రదాయాలను పాటిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ నేత పోతల లక్ష్మీ శ్రీనివాస్ తోడ పెద్దోత్సవాన్ని సుమారు నలభై ఏళ్ల తరువాత నిర్వహించారు. గతంలో ఈ గ్రామంలో తోడపెద్దు ఉండేది. అది మరణించడంతో అప్పటి నుంచి ఈ ఉత్సవ నిర్వహణ నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ గ్రామస్తుల అభిమతం మేరకు సింహాచలం దేవస్థానం నుంచి అక్కడ ఆలయ కమిటీ అనుమతితో తోడపెద్దును గ్రామానికి గురువారం తీసుకొచ్చారు. శుక్రవారం ఉత్సవరాట వేశారు. భజనలు, కోలాటం నిర్వహించారు. రాత్రంతా జాగరణ చేశారు. శనివారం వేకువ జాము నుంచి మధ్యాహ్నం వరకూ భక్తి కీర్తనలు అలపించారు. భక్తులు గోమాతను దర్శించుకొని పూజించుకున్నారు. అనంతరం నిర్వాహకులు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
నిర్లక్ష్యపు మంటలు
సాక్షి, అనకాపల్లి/ రాంబిల్లి (అచ్యుతాపురం) : రాంబిల్లి సెజ్లో లాలం కోడూరులో గల ఎస్వీఎస్ ఫార్మా సంస్థలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం మరోసారి పరిశ్రమల్లో భద్రతను ప్రశ్నార్థకం చేసింది. భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, యాజమాన్యాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫార్మా కంపెనీలో 8 నెలల క్రితం కూడా అగ్ని ప్రమాదం జరిగి విజయనగరానికి చెందిన ఉమామహేశ్వరరావు అనే కార్మికుడు కాలిపోయి క్షతగాత్రుడిగా మిగిలిపోయాడు. ఇప్పటికీ ఒక కన్ను, కాలు పనిచేయలేదు. ఆనాడే సేప్టీ మెజర్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పై అధికారులు చెప్పడం, పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకూ ఆ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కార్మికులను కాపాడేందుకు తగిన సేప్టీ మెజర్మెంట్స్ లేవు. కనీసం అందులో పనిచేస్తున్న 25 మంది కార్మికుల్లో కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ గానీ లేరు. ఎక్కువగా హెల్పర్లతోనే నడిపిస్తున్నట్టు అందులో పనిచేసే కార్మికులు వాపోతున్నారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ, పరిశ్రమల్లో సేఫ్టీ అంశాలు, పరికరాలపై నిత్యం తనిఖీలు చేయడం వట్టి మాటగానే మారింది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు, నాయకులు తరువాత అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పరిశ్రమలలో భద్రత, ప్రమాదాల నివారణ, రక్షణ అంశాలను జిల్లాకు చెందిన అధికారుల బృందాలు పరిశీలించి, పైఅధికారులకు నివేదికలు ఇచ్చినా వరుసగా ప్రమాదాలు జరగడంతో పారిశ్రామిక రంగ భద్రతలోని డొల్లతనం బయటపడుతుంది. రక్షణ లేని కార్మిక జీవితాలు.. ఫార్మా పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికుల భద్రత గాల్లో దీపంలా మారింది. జిల్లాలో అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలో పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు కూడా లేకపోవడం, సేప్టీ మెజర్స్ పాటించకపోవడం, పరిశ్రమలో శిక్షణ గల ఫైర్ సిబ్బంది లేకపోవడంతోనే అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రమాదాలకు అధిక కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ నిపుణులైన కార్మికులు పనులు చేయాల్సి ఉండగా కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. వారు రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్ రియాక్షన్ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. పరిశ్రమల్లో స్థానికుల కంటే స్థానికేతురులనే ఉద్యోగాలకు తీసుకోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రశ్నించే కార్మికులే లేకుండా పోతున్నారు. చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు సరైన అంబులెన్స్ లాంటి వాహన సౌకర్యాలు, వారి పరిశ్రమల్లోనే వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం జరిగి అక్కడ నుంచి నగరానికి చేరేలోపు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే... ఫార్మా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పలువురు కార్మిక సంఘాల నాయకులు, సీఐటీయూ, సీపీఎం, సీపీఐ నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రమాదాలకు కారణమైన కంపెనీపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత లేకుండా పోతుందని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కమిటీల పేరుతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని ప్రమాదాలు సంభవిస్తున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పరవాడ–అచ్యుతాపురం సెజ్ల్లో జరిగిన ప్రమాదాలపై అధికార యంత్రాంగంతో కమిటీలు వేసి విచారణ నిర్వహించారు. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు బహిర్గతం చేసి కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ఉంటే నేడు ఇలాంటి ప్రమాదాలు మరలా సంభవించేవికాదని చెబుతున్నారు. కార్మికుల ప్రాణాలకేదీ రక్షణ? ఎస్వీఎస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదంతో ఆందోళన ప్రమాదాల నివారణలో ప్రభుత్వం, యాజమాన్యాల అలసత్వం అచ్యుతాపురం, రాంబిల్లి సెజ్లో తరుచూ అగ్ని ప్రమాదాలు -
అతిప్రయాస మీద అదుపులోకి మంటలు
ఎస్వీఎస్ కెమెకల్ ఇండస్ట్రీస్లో శనివారం జరిగిన ప్రమాదంలో కంపెనీలో మొత్తం దాదాపు అన్ని విభాగాలు దగ్ధమైనట్టు అగ్నిమాపక నివారణ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. శనివారం సాయంత్రం 4.25 గంటలకు సెంట్రీప్యూజ్ వద్ద ఉత్ప్రేకంగా ఉపయోగించిన టొయలీన్ పేలడంతో కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ముడిసరుకుగా ఉపయోగించే సోడియం డ్రైఆకై ్సడ్, డై మిథైల్ సల్ఫేట్, టయోలిన్ సాల్వెంట్లు ఇంతటి ప్రమాద తీవ్రతకు కారణమయ్యాయి. ప్రమాద తీవ్రతతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.దీంతో ఎస్ఈజెడ్ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. సెంట్రిప్యూజ్ వద్ద టోలున్ సాల్వెంట్లో స్పిన్నింగ్ జరుగుతున్న సమయంలో నైట్రోజన్ లేకపోవడం కారణంగా స్పార్కింగ్ అయి అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో సంబంధిత పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు కూడా లేకపోవడం, సేప్టీ మెజర్స్ పాటించకపోవడం, పరిశ్రమలో శిక్షణ గల ఫైర్ సిబ్బంది లేకపోవడంతోనే భారీగా మంటలు వ్యాపించాయి. మొత్తం 7 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు ఆర్పినా సుమారుగా 3 గంటలు పట్టాయి. జిల్లా ఫైర్ అధికారి వెంకట రమణతో పాటు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకుడు దేవుడునాయుడు డిమాండ్ చేశారు. -
తాళపత్రాలకు నవ వైభవం
అక్షర సేద్యంలో ‘క్షీర సాగర్’ మథనం సవాళ్లను అధిగమించి సాధించిన అమృతం క్షీర సాగరాన్ని మథిస్తే అమృతం లభించినట్లుగానే, తన మనసును మథించిన క్షీర సాగర్.. తాటాకుపై అక్షరాలను లిఖించే విధానాన్ని నేటి కాలానికి అనుగుణంగా మార్చారు. పూర్వం తాటాకుపై ఘంటంతో రాసేవారు. ఆ విద్య తెలిసిన వారు ఇప్పుడు కరువవడంతో, ఆయన ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించారు. ఢిల్లీలో జరిగిన ప్రింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక లేజర్ మిషన్ను చూసిన ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేమ్ బోర్డుల తయారీకి వాడే ఆ యంత్రాన్ని తాటాకుపై అక్షరాల ముద్రణకు వీలుగా మార్పులు చేశారు. ఎన్నో ప్రయోగాల తర్వాత అత్యంత స్పష్టంగా అక్షరాలను ముద్రించడంలో విజయం సాధించారు. ప్రాచీనతకు ఆధునికత మేళవించి.... విజయనగరం జిల్లా ఎల్.కోట పరిసరాల నుంచి సేకరించిన తాటాకులను శుభ్రం చేసి, నిర్ణీత కొలతల్లో కత్తిరిస్తారు. వాటిపై లేజర్ సాయంతో ఆధ్యాత్మిక స్తోత్రాలు, శ్లోకాలు, దేవతా రూపాలను ముద్రిస్తారు. ఈ తాళపత్రాలు ఏళ్ల తరబడి పాడవకుండా పసుపు, ప్రత్యేకమైన కోటింగ్ వేస్తారు. వీటిని చూడగానే పాతకాలపు జ్ఞాపకాలు గుర్తుకు రావడమే కాకుండా, చదవడానికి ఎంతో సులువుగా ఉంటున్నాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం వంటి వాటిని తాళపత్రాల రూపంలో సిద్ధం చేసి అపురూప బహుమతులుగా అందిస్తున్నారు. నాటి ప్రధాని చేతుల మీదుగా అవార్డు... ప్రధాని చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ క్షీర సాగర్ ప్రతిభ కేవలం ఈ కళకే పరిమితం కాలేదు. గతంలో నేవల్ డాక్యార్డ్లో పనిచేసిన ఆయన.. వృత్తి పట్ల చూపిన అంకితభావానికి 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పాయ్ చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ అవార్డును అందుకున్నారు. అలాగే నావికాదళ అధికారుల నుంచి అనేక ప్రశంసలు పొందారు. సాహస యాత్రలు, ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి అభిరుచులతో పాటు అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. తాటాకుపై ఆహ్వాన పత్రిక మార్పు తన ఇంటి నుంచే మొదలవ్వాలని భావించిన సాగర్, తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రాలను తాటాకుపైనే ముద్రించి అతిథులను ఆశ్చర్యపరిచారు. పెళ్లికి వచ్చిన వారికి మొక్కలను బహుమతిగా ఇచ్చి ప్రకృతిపై తనకు న్న ప్రేమను చాటుకున్నారు. చివరికి తన పదవీ విరమణ రోజున కూడా 500 పండ్ల మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్ర పోషించారు. కనుమరుగవుతున్న తాళపత్ర కళను నేటి తరానికి చేరువ చేస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ ఆయన సాగిస్తున్న ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. నేటి డిజిటల్ యుగంలో అక్షరం కాగితంపై నుంచి తెరపైకి మారిపోయింది. పుస్తకం కంటే స్మార్ట్ఫోనే ప్రాణప్రదంగా మారిన ఈ కాలంలో మన పూర్వీకుల అపార జ్ఞాన నిధులైన తాళపత్రాల (తాటాకు గ్రంథాలు) గురించి నేటి తరానికి అసలు అవగాహనే లేదు. అపారమైన వారసత్వ సంపదగా విరాజిల్లిన ఈ తాళపత్ర కళ కనుమరుగవుతున్న తరుణంలో, దానికి ఆధునిక సొబగులు అద్ది పునర్జీవం పోస్తున్నారు నగరానికి చెందిన కేశవరాజు క్షీర సాగర్. ప్రకృతిపై మమకారం, సంస్కృతిపై గౌరవం ఆయనను ఈ వినూత్న మార్గంలో నడిపించాయి. –ఏయూక్యాంపస్ తాటాకుపై లిఖించిన గోవింద నామాలు నేటి తరానికి తెలియజేయాలని.. శతాబ్దాలుగా మన దేశంలో ఉన్న తాళపత్రాలు నేటి తరానికి తెలియజేయాలనే ప్రయత్నించా. మన సంస్కృతి, ప్రకృతితో ముడిపడిన మన జీవన విధానం నేటి యువతకు పరిచయం చేస్తున్నా.. భవిష్యత్తులో అనేక గ్రంథాలను తాళపత్రాలపై ముద్రించాలనే ఆలోచన ఉంది. మరుగున పడిపోతున్న కళను సంరక్షించడం, ఆధునికతను దానికి జోడించే చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఎంతో ఓపికతో సమయం తీసుకుని వీటిని సిద్ధం చేయాల్సి ఉంటుంది. మా కుటుంబలో జరిగే అన్ని శుభకార్యాలకు తాటాకుతో చేసిన ఆహ్వానాలు అందిస్తున్నాం. వీటిని తీసుకున్నవారు కూడా ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకుంటున్నారు. –కె. క్షీర సాగర్, అక్కయ్యపాలెం -
రికార్డులు కొట్టినా.. జీతాల్లో కోతలే..
స్టీల్ప్లాంట్లో రికార్డు ఉత్పత్తి సాధించినా దక్కని పూర్తి వేతనంఉక్కునగరం: ఉత్పత్తి ఆధారిత వేతనాలు ఎంత కాలం అంటూ స్టీల్ప్లాంట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో అత్యధిక ఉత్పత్తితో అనేక రికార్డులు నమోదు చేసినా పూర్తి జీతం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2024 సెప్టెంబర్ నుంచి యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై కోతలు మొదలు పెట్టింది. తద్వారా గత ఏడాది సెప్టెంబర్ నాటికి 355 శాతం జీతం పెండింగ్లో పెట్టింది. గత ఏడాదిలో అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే నూరు శాతం చెల్లించింది. ఇక నుంచి నూరు శాతం జీతం వస్తుందని ఉద్యోగులు ఊపిరి పీల్చుకునే క్రమంలో యాజమాన్యం మరో రకంగా దాడికి పాల్పడింది. ఇకపై ఆయా విభాగాల ఉత్పత్తి ఆధారంగా మాత్రమే జీతాలు చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు షాక్కు గురయ్యారు. దీంతో కార్మిక సంఘాలు యాజమాన్యం తీరుపై రీజనల్ లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆయన కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వెంటనే ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని ఆదేశించారు. అయినప్పటికి యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ రెండు నెలలు ఉత్పత్తి ఆధారంగా పర్సంటేజి జీతాలు చెల్లించడం వల్ల ఉద్యోగుల పెండింగ్ జీతాలు 380 శాతానికి చేరుకున్నాయి. డీపీఈ చెప్పినా పట్టదా.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన వేతనాలు, అలవెన్సులు, సదుపాయాలపై డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (డీపీఈ) ఆదేశాల మేరకు జరుగుతుంటాయి. గతంలో డీపీఈ ఆదేశాల మేరకే స్టీల్ప్లాంట్ క్వార్టర్ల విద్యుత్ చార్జీలను యాజమాన్యం పెంచింది. ఉత్పత్తి ఆధారిత జీతాలపై ఉక్కు యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలపై ఉక్కు అధికారుల సంఘం (సీ) డీపీఈకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన డీపీఈ ఆ ఉత్తర్వులపై తమకు వివరణ ఇవ్వాలని కోరినప్పటికి ఉక్కు యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు సంస్థలో పనిచేసే ఉద్యోగుల జీతాలు లాభనష్టాలు, ఉత్పత్తితో సంబంధం ఉండదని కార్మిక చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఉత్పత్తి ఆధారంగా ఇచ్చేది ఇన్సెంటివ్, రివార్డులు మాత్రమే అనేది సర్వజనీనం. అయితే కార్మిక చట్టాలు, కార్మిక సంక్షేమంపై ఎటువంటి నమ్మకం లేని స్టీల్ప్లాంట్ యాజమాన్యం నిర్ణయాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ వ్యతిరేకించినప్పటికి డిసెంబర్ నెల జీతాన్ని కూడా ఉత్పత్తి ఆధారంగా చెల్లించడం గమనార్హం. డిసెంబర్లో ఉత్పత్తి రికార్డులు డిసెంబర్ నెలలో బ్లాస్ట్ఫర్నేస్, స్టీల్ మెల్ట్ షాప్లు ఉత్పత్తిలో పలు రికార్డులు సాధించాయి. బ్లాస్ట్ఫర్నేస్లు మూడు అత్యధికంగా హాట్ మెటల్ ఉత్పత్తి చేయగా, స్టీల్ మెల్ట్ షాప్లు అత్యధికంగా 136 హీట్లు ఉత్పత్తి చేసి గత రికార్డులను అధిగమించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ నెలలో ఆ రెండు విభాగాల్లో అత్యధిక ఉత్పత్తి జరిగినప్పటికి యాజమాన్యం కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.విభాగం నవంబర్ %జీతం డిసెంబర్ %జీతం కోక్ఓవెన్స్ 93 శాతం 96 శాతం సింటర్ ప్లాంట్ 80 శాతం 96 శాతం బ్లాస్ట్ఫర్నేస్ 83 శాతం 100 శాతం స్టీల్ మెల్ట్ షాప్ 81 శాతం 94 శాతం రోలింగ్ మిల్స్ 79 శాతం 94 శాతం మార్కెటింగ్ 84 శాతం 96 శాతం ఇతరులు 83 శాతం 96 శాతం ఎం.ఎం 66 శాతం 96 శాతం ఉత్పత్తి ఆధారిత జీతాలు అన్యాయం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత జీతాలు ఇవ్వడం ఉక్కు యాజమాన్యం దుర్మార్గానికి నిదర్శనం. జీతాలకు లాభనష్టాలతో పాటు ఉత్పత్తితో ఎటువంటి సంబంధం ఉండదు. ఆ విషయాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ వ్యతిరేకించినప్పటికి యాజమాన్యం ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించి పెండింగ్ జీతాలతో పాటు పూర్తి జీతాలు చెల్లించాలి. –మంత్రి రాజశేఖర్, స్టీల్ ఐఎన్టీయూసీ ఉత్పత్తి ఆధారిత వేతనాలతో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం 380 శాతానికి చేరిన పెండింగ్ జీతాలు డీపీఈ, లేబర్ కమిషనర్ ఆదేశాలు బేఖాతర్ -
వ్యసనాలకు బానిసలు కావద్దు
ఘటనపై విచారణకు ఆదేశించాం● జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సాక్షి, అనకాపల్లి: రాంబిల్లి సెజ్లో ఎస్వీఎస్ ఫార్మా పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శనివారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభించిందని, వెంటనే చర్యలు తీసుకొని మంటలను అదుపుచేసినట్టు తెలిపారు. ఈ పరిశ్రమ 2023లో స్థాపించడం జరిగిందని, ఈ పరిశ్రమంలో 25 మంది ఆన్–రోల్ ఉద్యోగులు, దాదాపు 8 మంది రోజువారీ కార్మికులు పనిచేస్తారని, ఈ ఘటన జరిగినప్పుడు 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. సెంట్రి ప్యూజ్ చివరి దశ ఆపరేషన్ సమయంలో 4–మిథైల్–2–సైనో బైఫినైల్ ఉత్పత్తిలో రియాక్షన్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని, కాగా ఈ ప్రక్రియలో ఇంటర్మీడియట్ ద్రావకం వలే ఉపయోగించే టోలున్ ద్రావకాన్ని నిర్వహిస్తుండగా మంటలు చెలరేగినట్టు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో, పని ప్రదేశంలో డైరెక్టర్ లోకేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, రసాయన శాస్త్రవేత్త కుమార్లు కంపెనీ ఆవరణలో ఉన్న ఇతర ఉద్యోగులతో కలిసి, ఎటువంటి గాయాలు కాకుండా యూనిట్ను సురక్షితంగా తరలించారని తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. -
హక్కుల అవగాహన.. సామాజిక బాధ్యత
అనకాపల్లి: ఆహార భద్రత కమిషన్ పర్యవేక్షణకే పరిమితం కాదని, ఫిర్యాదుల పరిష్కారానికీ ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ఆహార భద్రత కమిషనన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్రెడ్డి అన్నారు. స్థానిక గవరపాలెం కన్సూమర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం ‘మేలుకో...హక్కులు తెలుసుకో – అందరి చట్టం వినియోగదారుల రక్షణ చట్టం’ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన 2013 నుంచి దేశంలో ఆహార భద్రత చట్టబద్దమైన హక్కుగా దక్కిందన్నారు. రేషన్్ సరుకులు పంపిణీలో అవకతవకలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా అందుతున్న పౌష్టికాహార పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమల్లో లోపాలను ఆహార భద్రత కమిషన్కు లిఖితపూర్వకంగా లేదా వాట్సప్ నెంబర్ 9490551117కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. -
అశ్వవాహనంపై తిరువీధి సేవలు
అశ్వవాహనంపై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తున్న దృశ్యంనక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక పుణ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామికి అశ్వవాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్కు నిత్యార్చనలు అభిషేకాలు పూర్తి చేశారు. కొండ దిగువన ఉత్సవమూర్తుల సన్నిధిలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం సాత్మురై వంటి కార్యక్రమాలు నిర్వహించిన తరువాత శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామిని అశ్వవాహనంపై, పల్లకిలో గోదాదేవి అమ్మవారిని ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో తిరుప్పావై ఇరవై పాశురాన్ని విన్నపం చేశారు. తరువాత ప్రసాద నివేదన, తీర్దగోష్టి ,ప్రసాద వినియోగం జరిగాయి. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా వైష్ణవ స్వామివారితో ద్రవిడ వేద ప్రబంధం కార్యక్రమం జరిగింది. రాత్రి స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. -
అచ్చుతాపురం ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, అనకాపల్లి: అచ్చుతాపురం ఎస్వీఎస్ ఫార్మాలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పొగ దట్టంగా అలుముకుంది. కంపెనీలో సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలడంతో కార్మికులు పరుగలు తీశారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదపు చేశారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.ఎస్వీఎస్ ఫార్మా ప్రమాద సమయంలో బీ-షిఫ్ట్లో 18 మంది కార్మికులు ఉన్నారు. ఎవ్వరికీ గాయాలు కాలేదని ఫార్మా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తొలిత మంటలు వ్యాపించి.. రియాక్టర్ పేలినట్టు సమాచారం. -
ఆదుకుంటామని చెప్పి...
సభ్యరైతుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకుంటామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చి తర్వాత పట్టించుకోలేదు. రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి. –కాండ్రేగుల డేవిడ్, న్యాయవాది, చోడవరం బార్అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు చెరకు రైతులు, కార్మికులు, ఫ్యాక్టరీ ఇంత ఇబ్బందుల్లో ఉంటే కేన్ కమిషనర్ కనీ సం పట్టించుకోలేదు. ఫ్యాక్టరీకి వచ్చి పరిశీలన చేయ లేదు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే, ప్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వం వెంటనే సాయం చేసి, రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలి. ఫ్యాక్టరీని తిరిగి నడిపించాలి. – కె.వి.వి. భాస్కరరావు, గోవాడ సుగర్స్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు. ఫ్యాక్టరీని మూసివేసేందుకు చర్యలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిందే. ఈ ప్రాంత చెర కు రైతులకు జీవనాధారమైన గోవాడ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. రైతులు, రైతుకూలీలు, కార్మికులు, రాజకీయ పార్టీలు అంతా సమష్టిగా పోరాటం చేయా ల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల ఓట్లతో గద్దెక్కి వారి మనుగడనే దెబ్బతీస్తున్న ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. – కోన మోహనరావు, రైతు కూలీ సంఘం జిల్లా ప్రతినిధి -
కుక్కల దాడిలో 11 మందికి గాయాలు
రావికమతం: మండలంలోని కొత్తకోట మేజర్ పంచాయతీలో శుక్రవారం వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. వీటి దాడిలో కొత్తకోట, మర్రివలస, టి,అర్జాపురం గ్రామాలకు చెందిన 11 మంది గాయపడ్డారు. వీరిలో విద్యార్థులు, మహిళలు ఉన్నారు. మోదకొండమ్మ తల్లి గుడి రోడ్డు లైన్ నుంచి వెల్లంకి వారి వీధి వరకూ హల్చల్ చేశాయి. కొత్తకోట గ్రామానికి చెందిన వై.రాజేష్(13), జి.గోవింద్ (56), జి.వీరన్న (60), ఎం రత్నం (45), టి.అర్జాపురం గ్రామానికి చెందిన ఎం రామచందర్ (15)లను, మర్రివలస గ్రామానికి చెందిన బి. జనశ్రీ (9), ఎలిశెట్టి వరలక్ష్మి(45), పి. సునందకుమార్ (16), ఎ. రమణమ్మ (35), అమ్మిరెడ్డి కౌశిక్ (14) తదితరులపై దాడి చేసి గాయపర్చాయి. వీరిని వెంటనే కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. వీరిలో వీరన్న మినహా మిగిలిన వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరిలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గ్రామంలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పంచాయతీ అధికారులు వీటి బెడద లేకుండా నిర్మూలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ట్రూ అప్
అండ్ డౌన్ దోపిడీ కోసం..ట్రూ అప్ పేరుతో రూ.7,790.16 కోట్లు గుంజేందుకు ప్లాన్ ఏపీఈఆర్సీ పరిశీలన అనంతరం తేల్చిన లెక్కలు ● ట్రూఅప్ చార్జీలుగా వసూలు చేయాల్సింది – 0 ● ఇతర ఖర్చులు (బిల్లు బకాయిలు, రుణాలు, డిస్కౌంట్స్) రూ.3,887.28 కోట్లు ● క్యారియింగ్ కాస్ట్ రూ.2,113.24 కోట్లు ● రిటైల్ సప్లయ్ టారిఫ్ వ్యయంపై ట్రాన్స్మిషన్ లిమిటేషన్ రూ.6.49 కోట్లు ● మొత్తం ట్రూఅప్ నుంచి తొలగించాల్సిన ఖర్చులు రూ.6,007.01 కోట్లు ● 4వ కంట్రోల్ పీరియడ్లో వసూలు చేయాల్సిన ట్రూఅప్ చార్జీలు రూ.1,783.15 కోట్లు ● ప్రభుత్వమే భరించాలని చెప్పిన ట్రూ అప్ చార్జీలు రూ.1,783.15 కోట్లుసాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కమ్ల ద్వారా ప్రజల నుంచి భారీగా వసూళ్ల పర్వానికి చంద్రబాబు ప్రభుత్వం వేసిన పాచిక పారలేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో వినియోగదారుల నెత్తిన రూ.వేల కోట్లు వడ్డించేందుకు చేసిన ప్రయత్నాలకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బ్రేక్ వేసింది. ముఖ్యంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ (ఏపీఈపీడీసీఎల్) కాకిలెక్కలతో జనం జేబులకు చిల్లు పెట్టాలని చూసింది. గడిచిన ఐదేళ్లకు సంబంధించిన ఖర్చుల సర్దుబాటు(ట్రూఅప్) పేరుతో వినియోగదారుల నుంచి ఏకంగా రూ.7,790.16 కోట్లు పిండుకోవాలని భావించింది. అయితే ఏపీఈఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు లెక్కల బండారాన్ని బయటపెట్టింది. డిస్కమ్ల అడ్డగోలు ఖర్చులను ట్రూ అప్ పేరుతో జనంపై ఎలా రుద్దుతారని, ఇందులో రూ.6,007.01 కోట్లు అర్హతలేనివంటూ స్పష్టం చేసింది. మిగిలిన డబ్బులు కూడా ప్రభుత్వమే డిస్కమ్లకు చెల్లించాలని తెగేసి చెప్పింది. అంతా లోపభూయిష్ట లెక్కలు ఏపీఈపీడీసీఎల్ చూపిన లెక్కల్లో వసూలు కాని బాకీలు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద చూపిన మొత్తమే రూ.వేల కోట్లలో ఉంది. కేవలం ఇతర ఖర్చులు, వడ్డీల పేరుతో చూపిన రూ.3,887 కోట్లను ఏపీఈఆర్సీ నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. దీన్ని బట్టి సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ ఈపీడీసీఎల్లో ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంస్థ అసమర్థత, నిర్వహణ లోపాలకు అయిన ఖర్చుల్ని ‘ట్రూ–అప్’ పేరుతో జనం జేబులోంచి లాగేయాలని అనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అంచనాలకు, వాస్తవాలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈపీడీసీఎల్ విషయంలో ట్రూఅప్ పేరుతో అడిగిన రూ.7,790 కోట్లకు.. ఏపీఈఆర్సీ ఆమోదించిన రూ.1,783 కోట్లకు మధ్య ఏకంగా రూ. 6,007.01 కోట్ల వ్యత్యాసం ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో అనర్హమైన ఖర్చులను ట్రూ అప్ పేరుతో ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలని ఈపీడీసీఎల్ భావించిందనే దానిపై ఈఆర్సీ మొట్టికాయలు వేసింది. అందులో అర్హత లేని ఖర్చులు రూ.6,007.01 కోట్లుగా గుర్తించిన ఏపీఈఆర్సీ మిగిలిన రూ.1,783.15 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని ఆదేశం ఇంతకీ ఈ తప్పుడు లెక్కల బాధ్యులెవరు? ఈపీడీసీఎల్ చూపించిన గణాంకాలు నాలుగో కంట్రోల్ పీరియడ్(సీపీ)లో ట్రూ అప్ చార్జీలు రూ.5,684.58 కోట్లు క్యారియింగ్ కాస్ట్ రూ.2113.24 కోట్లు మొత్తం రూ.7,797.82 కోట్లు గతంలో ఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా సర్దుబాటు చేసినవి రూ.7.65 కోట్లు మొత్తంగా ట్రూఅప్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేయాలనుకున్నది రూ.7,790.16 కోట్లు వాతలు కప్పిపుచ్చుకునేందుకు కొత్తనాటకం! ట్రూ అప్ పేరుతో జనం నెత్తిన భారం మోపాలని అనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ వాతలు పెట్టింది. రూ.6,007.01 కోట్లు అర్హతలేనివని తేల్చడంతోపాటు రూ.1,783.15 కోట్లు కూడా ప్రభుత్వమే భరించాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రూ అప్ పేరుతో ఏకంగా రూ.7,790 కోట్లను ప్రజల నుంచి వసూలు చేసి సంపద సృష్టించామని చెప్పాలనుకున్నా కుదరకపోవడంతో ఈ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం కొత్త ఎత్తుగడ మొదలు పెట్టింది. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం మొత్తం భరిస్తోందంటూ హడావుడి చేస్తోంది. దీనిపై మంత్రులు కూడా గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఏపీఈఆర్సీ ఆమోదించిన రూ.1,783 కోట్ల ట్రూ అప్ చార్జీలను ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ డబ్బులు తామే చెల్లిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. ఆ చెల్లించేది కూడా పరోక్షంగా ప్రజల పన్నుల డబ్బు నుంచే కదా అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
రైతులను నిండా ముంచారు
చెరకు రైతులను చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు నిండా ముంచారు. రైతులకు గిట్టుబాటుధర ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఫ్యాక్టరీనే మూసేశారు. కూటమి పార్టీలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలిసే గోవాడ ఫ్యాక్టరీని అమ్మేయాలని చూస్తున్నారు. అందుకే క్రషింగ్ చేయకుండా వదిలేశారు. ఉద్యమాన్ని అఖిలపక్షం అంతా కలిసి మరింత ఉధృతం చేస్తాం. –రెడ్డిపల్లి అప్పలరాజు, రైతు సంఘం నాయకుడు, సీపీఐ జిల్లా ప్రతినిధి కూటమికి మద్దతు ఇచ్చి తప్పు చేశాం గత ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చి తప్పుచేశాం. ఫ్యాక్టరీని అభివృద్ధిచేసి, చెరకు రైతులను ఆదుకుంటామని కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంతో మద్దతు ఇచ్చాం. తీరా అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని మూసేసి కార్మికులను, రైతులను రోడ్డు పాలుచేశారు. అఖిలపక్షంలో ఫ్యాక్టరీ కార్మికులంతా ఉండి పోరాటం చేస్తాం. –శరగడం రాము నాయుడు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు పవన్కల్యాణ్ పట్టించుకోలేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాం. ఫ్యాక్టరీ సమస్యపై మా నాయకుడు పవన్కల్యాణ్కు చెప్పాం. మా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏమీ ప్రయోజనం కలగలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలిద్దరూ ఏమీ పట్టించుకోలేదు. చెరకు రైతుగా ఉండి పండిన చెరకు ఎక్కడికి పంపించాలో తెలియలేదు. ఫ్యాక్టరీ, చెరకు రైతుల కోసం ఎంతటి ఉద్యమానికై నా సిద్ధం. –జెర్రిపోతుల నానాజీ, జనసేన, చోడవరం నియోజకవర్గం ప్రతినిధి -
రాష్ట్రంలో అరాచక పాలన
నక్కపల్లి: ఆంధ్రప్రదేశ్లో అరాచకపాలన సాగుతోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ జాతీయప్రధాన కార్యదర్శి వెంకట్ ఆరోపించారు.ఇటీవల పీడీయాక్ట్ కింద అరెస్టయి జైలులో ఉన్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు కుటుంబాన్ని ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలో శుక్రవారం ఆయన పరామర్శించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని చెప్పారు. కంపెనీల పేరుతో ఉత్తరాంధ్రలో లక్షలాది ఎకరాలు దోపిడీ చేసేందుకు చంద్రబాబు, పవన్కల్యాణ్, బీజేపీనాయకులు ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. కంపెనీలకు తాము వ్యతిరేకం కాదని, కానీ కూటమి నాయకులు వాటాల కోసమే కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే మిట్టల్ీస్టీల్ప్లాంట్,బల్క్ డ్రగ్పార్క్లలో చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్లతోపాటు, బీజేపీ అగ్రనేతలకు వాటాలున్నాయన్నారు. ఈ కారణంగానే భూసేకరణ చట్టాలను ఉల్లంఘించి వేలాది ఎకరాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల తరఫున పోరాటం చేస్తున్న సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే కలెక్టర్ ఈ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అప్పలరా జు బయట ఉంటే మిట్టల్ స్టీల్ప్లాంట్ పనులు అడ్డుకుని బాధితులు, రైతులు, నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తారనే ఉద్దేశంతోనే అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు. చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించి వెళ్లిన మరుసటిరోజే అప్పలరాజును అరెస్టు చేశారన్నారు. మత్స్యకారులను సము ద్రంనుంచి వేరు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. సీఎం, హోంమంత్రి బేషరుతుగా క్షమాపణలు చెప్పి అప్పలరాజుపై పెట్టిన కేసు లు ఎత్తివేసి, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలను తెలియజేస్తామన్నారు. రాష్ట్రగవర్నర్ను కూడా కలుస్తామని చెప్పా రు.ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ నేత మిధున్, సీపీఎం మండలకన్వీనర్ రాజేష్ , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తప్పుల తడకగా పట్టాదారు పాసు పుస్తకాలు
కశింకోట: ప్రభుత్వం రైతులకు శుక్రవారం నుంచి పంపిణీ చేస్తున్న భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తప్పుల తడకగా ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా వందేళ్ల తర్వాత భూముల రీసర్వే నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేపట్టారు. అయితే రీసర్వేలో తప్పులు చోటు చేసుకున్నాయని, మళ్లీ సర్వే జరిపించి సవరణ చేసి అందజేయనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఏదో అడపా దడపా ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో మొక్కుబడిగా సర్వే జరిపించి గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సర్వే చేసిన నివేదిక ఆధారంగా ఇచ్చిన పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త పుస్తకాల పంపిణీని శుక్రవారం చేపట్టింది. అవి తప్పుల తడకగా ఉండడంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. జెట్టపురెడ్డితుని రెవెన్యూ పరిధిలోని భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల్లో జెట్టపురెడ్డితుని గ్రామం పేరు తెలుగులో జెత్తపురెడ్డి తునిగా తప్పుగా పడింది. ఆంగ్లంలో మాత్రం సరిగానే ఉంది. కొందరి పేర్లు ఆంగ్లం, తెలుగులో తేడా ఉన్నాయి. గొంతిన వెంకట రమణ అని తెలుగులో సరిగానే పేరు ఉన్నా ఆంగ్లంలో మాత్రం స్పెల్లింగ్ తప్పుగా నమోదైంది. ఇలా చాలామంది రైతుల పేర్లు తప్పుగా నమోదయ్యాయి. దీనివల్ల భవిష్యత్లో రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందడానికి, రిజిస్ట్రేషన్ సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. కొన్ని పుస్తకాలపై ఆధార్, సెల్ఫోను నంబర్లను 9 అంకెలు నమోదు చేశారు. దీంతో వీటి స్థానంలో ఆధార్, సెల్ నంబర్లు సరిగా నమోదు చేసుకోవాలంటే అధికారుల చుట్టూ ఎన్నాళ్లు తిరగాల్సి వస్తుందోనని రైతులు మదన పడుతున్నారు. అలాగే భూమి విస్తీర్ణం తక్కువగా వచ్చిందని కొందరు, పుస్తకంలో చిరునామా లేదని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. వీటిని ఎలా సవరించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. తప్పులను సవరించిన తర్వాతే పాసు పుస్తకాల పంపిణీ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గ్రామ సభల్లో కొంతమందికి మాత్రమే నామ మాత్రంగా పాసు పుస్తకాలు పంపిణీ చేపట్టి మిగిలిన వారికి శనివారం అందజేస్తామని అధికారులు తెలిపారు. పాసు పుస్తకాల కోసం మళ్లీ రావలసి ఉండటంతో పనులు మానుకోవలసి వస్తుందని రైతులు ఆవేదన చెందారు. అందువల్ల గ్రామ సభ పెట్టిన రోజు వచ్చిన రైతులందరికి పాసు పుస్తకాలు అందజేయాలంటున్నారు. ఎ.ఎస్.పేట, గొబ్బూరుపాలెం, నరసాపురం, చింతలపాలెం, జెట్టపురెడ్డితుని రెవెన్యూ గ్రామాల్లో పాసు పుస్తకాలను పంపిణీ ప్రారంభించారు. తహసీల్దార్ తిరుమలరావు, స్థానిక నాయకులు వీటిని పంపిణీ చేశారు. కొంత మందికి పాసు పుస్తకాలు అందజేసి మిగిలిన రైతులకు శనివారం అందజేస్తామని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కారుణ్య నియామక పత్రం అందజేత
చంద్రశేఖర్కు కారుణ్య నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సమాజంలో తగిన గుర్తింపు ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్లో హెచ్సీగా విధులు నిర్వహించిన చీమల చెలయ్య 2021లో అనారోగ్యంతో మృతి చెందాడు. అతడు కుమారుడు చంద్రశేఖర్కు స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేటర్గా నియమించారు. ఈ మేరకు కారుణ్య నియామక పత్రాన్ని శుక్రవారం ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో ఏ.ఓ సిహెచ్.తిలక్బాబు, సీనియర్ అసిస్టెంట్ భీమాబాయి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
గజవాహనంపై వెంకన్న తిరువీధి సేవ
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వర స్వామివారికి శుక్రవారం గజవాహనంపై తిరువీధిసేవలు నిర్వహించారు. ముందుగా కొండపై మూలవిరాట్కు పంచామృతాభిషేకం, నిత్యార్చనలు పూర్తిచేశారు.అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారికి, వేణుగోపాల స్వామివారికి పూజలు నిర్వహించారు. శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని గజవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలకు తీసుకెళ్లారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 17వ పాశురాన్ని విన్నపం చేశారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా వైష్ణవ స్వామి ద్రవిడ వేదపారాయణం నిర్వహించిన అనంతరం రాత్రి తిరువీధి సేవలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు,శేషాచార్యులు, పాల్గొన్నారు. -
హాస్టళ్లు, రేషన్ డిపోల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీలు
అచ్యుతాపురం రూరల్/ఎస్.రాయవరం : జిల్లాలోని పలు మండలాల్లో హాస్టళ్లు, రేషన్ డిపోల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ చిట్టా విజయ్ ప్రతాప్రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అచ్యుతాపురం మండలంలో మోసయ్యపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ చేసి, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెదురువాడ అంగన్వాడీ కేంద్రం, చోడపల్లి, అచ్యుతాపురం రేషన్డిపోలు, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్, మోసయ్యపేట, గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థు లతో మాట్లాడారు. ఎంఈవో దేవరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెంలో పాఠశాలలో సదుపాయాలపై ఆరా తీశారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, రేషన్ డిపోలను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో కొన్ని సరకులు వివరాలు సక్రమంగా లేకపోవడంతో సూపర్వైజర్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
పండగలోగా బకాయిలు చెల్లించాల్సిందే
గోవాడ సుగర్స్ అఖిల పక్షం సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, గుడివాడ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, వైఎస్సార్సీపీ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, రైతు సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతులకు సంక్రాంతి పండగలోగా బకాయిలు చెల్లించాలని అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో దశలవారీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ఈ ఏడాది ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయకపోవడం, చెరకు ప్రైవేటు ఫ్యాక్టరీకి పంపడం, గత ఏడాది చెరకు బకాయిలు రైతులకు చెల్లించకపోవడం, కార్మికులకు బకాయి జీతాలు ఇవ్వడం పోవడం, ప్రభుత్వం పూర్తిగా ఫ్యాక్టరీని, చెరకు రైతులను నిర్లక్ష్యం చేయడంపై ఉద్యమానికి దిగేందుకు రాజకీయ, రైతు,కా ర్మిక సంఘాల నాయకులు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి చెరకు రైతుల కష్టాలు తెలియజేందుకు, అవసరమైతే ఆందోళనలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని చోడవరంలో శుక్రవారం నిర్వహించారు. సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మినహాయించి వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ,రైతు సంఘం, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ప్రతినిధులు, చెరకు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీని పరిరక్షించడంలో చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, ఎంపీ, జిల్లా మంత్రులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సమావేశంలో అఖిలపక్షం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది ఫ్యాక్టరీ మహాజనసభను కూడా నిర్వహించలేదని, గత సీజన్కు సంబంధించిన రైతుల బకాయిలు, కార్మికుల జీతభత్యాలు వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీకి ప్రభుత్వం రూ. 50కోట్లు గ్రాంటు ఇవ్వాలని, వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రైతులు కష్టాలు ఏనాడూ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే గోవాడ ఫ్యాక్టరీకి, చెరకు రైతులకు మేలు జరిగిందని చెప్పారు. ఫ్యాక్టరీని, రైతులను ఆదుకుంటామని చెప్పిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, ఎంపీ పట్టించుకోకపోవడం సిగ్గు చేటని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఫ్యాక్టరీని పరిరక్షించుకుకోవడానికి పూర్తిస్థాయిలో ఆందోళనకు రైతులంతా కలిసి దిగుతామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చెరకు రైతుల జీవనాధారాన్ని తుంచేసిందని, ఫ్యాక్టరీని బాగుచేస్తామని, రూ. 4వేలు గిట్టుబాటు ధర ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. చెరకు బకాయిలు వెంటనే చెల్లించాలని, లేదంటే రైతులకు, కార్మికులతో కలసి చేసే ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ చోడవరం పరిశీలకుడు దంతులూరి దిలీప్కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమానికి మద్దతిస్తాం ఫ్యాక్టరీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 24వేల మంది చెరకు రైతులు, వారిపై ఆధారపడిన 2లక్షల మంది కూలీలు, కుటుంబసభ్యులు ఇప్పుడు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం స్పందించే వరకూ ఉద్యమాన్ని చేయాలి. ఉద్యమానికి తామంతా మద్దతు ఇస్తాం. – దేవరపల్లి చంటి, బీజేపీ మండల అధ్యక్షుడు, చోడవరం ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఉద్యమం చెరకు రైతులను నిర్లక్ష్యంగా వదిలేసిన చంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టాలి. ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులు, కూలీలు ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఎంపీ, ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీని, రైతులను మోసం చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఉద్యమాన్ని చేయడానికి సిద్దం. –కొణతాల హరనాథ్, ఆమ్ఆద్మీపార్టీ జిల్లా అధ్యక్షుడు -
2 కేజీల గంజాయి పట్టివేత
● ముగ్గురు నిందితుల అరెస్టు పట్టుకున్న నిందితులతో పోలీసులు గొలుగొండ: మండలంలోని ఏటిగైరంపేట గ్రామం వద్ద రెండు కిలోల గంజాయితో నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ రామారావు తెలిపారు. ఏజెన్సీ నుంచి రెండు కిలోల గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. చింతపల్లి మండలానికి చెందిన నిందితులు దాసరి శ్రవంత్కుమార్(30), తుపాకుల హరీష్కుమార్(22), కొవ్యూరు సుమంత్(25)లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. కార్యక్రమంలో గొలుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అబ్బురపర్చిన మైరెన్ ఎగ్జిబిషన్
కె.కోటపాడు: సముద్రం అంటే విద్యార్థులకు ఎంతో ఇష్టం.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే వారికి సముద్రంతోపాటు అందులో దొరికే చేపలు, వేట విధానం వంటి విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయాలను వివరించేందుకు విశాఖపట్నంలోని భారతీయ మత్స్య పరిశోధన సంస్థ(ఎఫ్.ఎస్.ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం కె.కోటపాడులోని వేణు విద్యానికేతన్ పాఠశాలలో మైరెన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులకు సంబంధిత సిబ్బంది అవగాహన కల్పించారు. తొలుత మైరెన్ ఎగ్జిబిషన్ను విశాఖపట్నం మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయ ముఖ్య అధికారి సి.ధనుంజయరావు, గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి భవాని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ను ఎ.కోడూరు హైస్కూల్, వేణు పాఠశాలల, సూర్యబాసర పాఠశాలలకు చెందిన 1,200 మంది విద్యార్థులు తిలకించి ఆశ్చర్యపోయారు. మత్స్య శాస్త్రవేత్త జి.వి.ఏ.ప్రసాదరావు పలు విషయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలో వెయ్యి రకాలైన మత్స్య జాతులు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 1053 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంటే, విశాఖపట్నం జిల్లాలో 70 కిలోమీటర్లు ఉందని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నంలో ఉందన్నారు. విశాఖపట్నంలో ఎఫ్.ఎస్.ఐ ద్వారా సముద్రంలో చేపలపై ప్రతి నెలా 20 రోజుల పాటు సర్వే చేస్తున్నట్లు వివరించారు. సముద్రంలో ఎంత లోతులో ఏయే రకాల చేపలు ఉన్నాయో గుర్తిస్తామని వివరించారు. మత్స శిఖరి, మత్స్య దర్శిని అనే రెండు రకాల షిప్ల ద్వారా సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సర్వే సమయంలో దొరికే అరుదైన సముద్రపు చేపల జాతులను తీసుకువచ్చి మ్యూజియంలో భద్రపరుస్తున్నట్లు వివరించారు. షిప్ల్లో వెళ్లే సమయంలో అనుకోకుండా నీరు వచ్చినా, అగ్ని ప్రమాదం వంటి ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా సిబ్బంది లైఫ్ జాకెట్తోపాటు లైఫ్ బాయ్ను ధరించి ఏ విధంగాా ప్రాణాపాయం లేకుండా ఉండగలరో విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. పర్యావరణ చేపల వేట పద్ధతితో పాటు సముద్ర అడుగు భాగపు మత్స్య వనరుల వేట, లాంగ్ లైన్ పద్ధతులను తెలిపారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను పడివేయడం వల్ల తాబేళ్లు మరణించే పరిస్థితులను వివిరించారు. మానవ జీవితం మనుగడకు ఆక్సిజన్ ఎంతో విలువైందన్నారు. ఈ ఆక్సిజన్ సముద్రం ద్వారా 80 శాతం వస్తే, కేవలం చెట్లు ద్వారా 20 శాతం వస్తుందని విద్యార్థులకు వివరించారు. మైరెన్ ఎగ్జిబిషన్లో చేపల వేటకు ఉపయోగించే వలలతో పాటు గేలాలను చూపించారు. కార్యక్రమంలో కెప్టెన్ వి.వి.ఎ.మూర్తి, రాముడు, ఈతా మురళీగణేష్, ఆనంద్, పంకజ్, బెవిన్ ప్రకాష్, వేణు విద్యా నికేతన్ డైరెక్టర్ బి.వి.ఎస్.వేణు, కె.కోటపాడు హైస్కూల్ హెచ్ఎం పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణలో కోల్పోయే వృక్షాలకు పునరుజ్జీవం
● చోడపల్లిలో మిషన్ పునర్వ వనం ప్రారంభించిన కలెక్టరు చోడపల్లిలో మిషన్ పునర్వ వనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ విజయ్కృష్ణన్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ అచ్యుతాపురం రూరల్: రహదారి విస్తరణలో కోల్పోతున్న భారీ వృక్షాలను కాపాడేందుకు మిషన్ పునర్వ వనం కార్యక్రమం భావితరాలకు తెలియజేయాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. మండలంలోని చోడపల్లిలో రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలను తొలగించి మరో సురక్షితమైన ప్రదేశంలో తిరిగి నాటేందుకు శుక్రవారం ఆమె మిషన్ పునర్వ వనం ప్రారంభించారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మాట్లాడుతూ పర్యావరణం కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించాలన్నారు. -
పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వండి
రావికమతం: డి.పట్టాలను రద్దు చేసి సాగులో ఉన్న గిరిజనులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ వేయాలని మండలంలో కవగుంట రెవెన్యూలో గిరిజనులు డిమాండ్ శుక్రవారం చేశారు. కవగుంట రెవెన్యూలో సర్వే నంబర్ 59,61,62,63,64,88,89లలో సుమారు 90 ఎకరాలు బంజర్ భూములకు గతంలో గిరిజనులకు డి.పట్టాలు పంపిణీ చేశారు. వారు ఈ భూముల్లో జీడి,మామిడి తోటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో చేసిన సర్వేలో సాగులో ఉన్న గిరిజనులు పేర్లు తొలిగించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృషికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు చెప్పారు.ఇప్పటికై న అధికారులు స్పందించి పాస్ పుస్తకాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఆందోళన చేశారు. -
కందిపూడిలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ చించివేత
చించేసిన వైఎస్సార్సీపీ నాయకుల ఫ్లెక్సీ బుచ్చెయ్యపేట: మండలంలోని కందిపూడిలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫెక్ల్సీని కూటమి నేతలు చించివేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు కోట్ని అప్పారావు, సర్పంచ్ కొప్పాక గణేష్, మాజీ సర్పంచ్ తాటికొండ కనకయ్య, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు ద్వారపురెడ్డి అచ్చింనాయుడు, సుంకరి గోవింద తదితర్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాఽథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,మండల వైఎస్సార్సీపీ నాయకుల ఫొటోలతో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కశింకోట,బంగారుమెట్ట(కేబీ) రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే జంక్షన్లో ఆంజనేయస్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గ్రామానికి చెందిన కూటమి నేతలే చించివేశారని గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మా నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూటమి నేతలు చూడలేక చించివేశారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని కందిపూడి వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. -
35 మంది వాహన చోదకులకు జరిమానా
ద్విచక్ర వాహన చోదకులకు కౌన్సెలింగ్ ఇస్తున్న ట్రైనీ డీఎస్పీ కృష్ణచైతన్య యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణంలో ట్రైనీ డీఎస్పీ కృష్ణచైతన్య ప్రత్యేక డ్రైవ్ ద్వారా శుక్రవారం వాహనాలు తనిఖీ చేశారు. ప్రధాన రహదారిపై రద్దీగా ఉండే కూడళ్లలో పలు ద్విచక్ర వాహనాలను ఆయన తనిఖీ చేశారు.హెల్మెట్ ధరించకుండా బైకులు నడుపుతున్న 20 మందికి, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఐదుగురికి రూ.1,035 చొప్పున, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న ఇద్దరికి రూ.2,035 చొప్పున, మరో పది మందికి జరిమానా విధించారు. తనిఖీల్లో యలమంచిలి ట్రాఫిక్ ఎస్ఐ బి.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజల ముంగిటకే రెవెన్యూ సేవలు
తుమ్మపాల: రెవెన్యూ సేవలను ప్రజల ముంగిటకే అందజేస్తున్నామని, పట్టాదారు పాసుపుస్తకాలు నేరుగా రైతులకు గ్రామంలోనే పంపిణీ చేస్తున్నామని కలెక్టరు విజయ కృష్ణన్ తెలిపారు. అనకాపల్లి మండలం గోపాలపురంలో శుక్రవారం పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీ సర్వే జరిగిన 373 గ్రామాల్లో రైతులకు జారీ చేసిన 2,01,841 పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో కొత్త వాటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకూ అన్ని మండలాల్లో సచివాలయాల వద్ద షెడ్యూల్ ప్రకారం పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. రీసర్వేలో రికార్డుల తప్పులను సరిచేసి రైతులకు వారి భూములపై వివాదం లేని పూర్తి హక్కులు, భద్రత కల్పించడమే లక్ష్యంగా నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు రూపొందించినట్టు తెలిపారు. పాస్పుస్తకాల కోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని తెలిపారు. రెవెన్యూ సేవలన్నింటినీ గ్రామస్థాయిలోనే అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయేషా, స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
అక్రమ క్వారీపై విజిలెన్సు దాడి
సీజ్ చేసిన కంప్రెసర్ను తహసీల్దారు కార్యాలయంలో అప్పగింత రోలుగుంట: మండలంలో అక్రమ క్వారీలుపై అందిన ఫిర్యాదు మేరకు విజయనగరం జిల్లాకు (మూడు జిల్లాలకు సంబంధించిన) విజిలెన్స్, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సిబ్బంది శుక్రవారం దాడి చేశారు. కంప్రెసర్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా వెదుళ్లవలస, కొవ్వూరు రెవెన్యూలో అక్రమ క్వారీ నిర్వహణపై గత వారంలో కొవ్వూరు గ్రామానికి చెందిన బంటు రాజు ఫిర్యాదు చేశాడు. ఇక్కడ బ్లాస్టింగు వల్ల సమీప గ్రామాల్లో ఇళ్లకు, పశువులకు, పంటలకు జరుగుతున్న నష్టాన్ని వివరించాడు. ఈ విషయాన్ని నిర్వాహకుడికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై అధికారులు స్పందించి దాడి చేశారు. ఆ సమయంలో లీజుదారుడు లేకపోవడం, కాలం చెల్లిన ముందుగుండు, కంప్రెసర్ను గుర్తించారు. ఫిర్యాదుదారుని, మరికొంత మందిని విచారణ చేశారు. సీజ్ చేసిన కంప్రెసర్ను తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. ఈ విచారణలో వీఆర్వో ఎం.నాగమణి ఉన్నారు. తహసీల్దార్ ద్వారా సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తదుపరి చర్యల కోసం నివేదిస్తామని డిప్యూటీ తహసీల్దార్ వి.శివ వివరించారు. -
పుణ్యకోటి వాహనంపై పరంధాముడు
నక్కపల్లి : ఉపమాకలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. ఉదయం స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. తదుపరి కొండదిగువన స్వామివారి ఉత్సవ మూర్తులకు క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, గోదాదేవి అమ్మవారిని నిత్యపూజలు అర్చనలు నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. తిరుప్పావై 16వ పాశురాన్ని విన్నపం చేశారు. అనంతరం శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుణ్యకోటి వాహనంలోను, గోదాదేవి అమ్మవారిని పల్లకిలోను ఉంచి తిరువీధిసేవ నిర్వహించారు. భక్తులు కానుకలు, పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు.కొత్తసంవత్సరం సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం రద్దీగా మారింది. ముక్కోటి ఏకాదశి అనంతరం ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రాత్రిపూట కూడా స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తారు. -
బీ1 కోచ్ లెనిన్ స్టోరేజ్ నుంచే మంటలు వ్యాప్తి
యలమంచిలి రూరల్ : యలమంచిలి రైల్వేస్టేషన్ వద్ద టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలను వెలికితీసేందుకు దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి నిర్వహిస్తున్న విచారణ గురువారం రెండోరోజూ కొనసాగింది. గత నెల 29వ తేదీ అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో రైలు అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదానికి గురైంది. రైలులో బీ1, ఎం2 బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఒకరు సజీవ దహనమైన సంగతి విదితమే. రైలు యలమంచిలి రైల్వేస్టేషన్ ఒకటో నెంబరు ప్లాట్ఫాంపై ఆగినపుడు మంటలు వ్యాపించడంతో 157 మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనిపై ఉలిక్కిపడ్డ రైల్వేశాఖ ప్రమాదానికి మూల కారణాలను తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో శోధిస్తోంది. విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్(ఈటీటీసీ)లో బుధ, గురువారాల్లో సేఫ్టీ కమిషనర్ చేస్తున్న విచారణలో ప్రమాదానికి సంబంధించి పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా యలమంచిలి, నర్శింగబిల్లి రైల్వేస్టేషన్లలో ఆ సమయంలో పనిచేస్తున్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న రైల్వే సిబ్బందిని విజయవాడకు పిలిపించారు. అందుబాటులో ఉన్న కొందరు ప్రయాణికులను కూడా ప్రశ్నించి రాతపూర్వకంగా వివరాలు రాబట్టినట్టు సమాచారం. రైలు బీ1 బోగీలో లెనిన్ స్టోరేజ్ నుంచే మంటలు వ్యాప్తి చెందినట్టు ఇప్పటికే అధికారులు నిర్థారణకు వచ్చారు. అక్కడ్నుంచి ఒక్కసారిగా మంటలు ఎలా వ్యాప్తి చెందాయన్నది అంతు చిక్కడంలేదు. మానవ తప్పిదమా? సాంకేతిక కారణం వల్ల ప్రమాదం సంభవించిందా అన్నది తేల్చేందుకు ఎం1 బోగీలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు పూర్తయితే ప్రమాద కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా రైళ్లలో సగటున ఏడాదికి 8 అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. బ్రేక్ బైండింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి సాంకేతిక లోపాలతో రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగితే రైల్వేశాఖ నిపుణులు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో ప్యానెల్ బోర్డులు సురక్షితంగా ఉన్నట్టు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది. ఇక మండే స్వభావం కలిగిన ప్రమాదకర వస్తువులేవైనా రైలులో ఉన్నాయా?లేక ధూమపానం కారణంగా మంటలు చెలరేగాయా?అన్నది తెలియాల్సి ఉంది. -
కొత్త వసంతం తీపిని పంచేనా..?
సాక్షి, అనకాపల్లి : అనకాపల్లి బెల్లం మార్కెట్ అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో బెల్లం కొనుగోళ్ల విషయంలో వ్యాపారులు పోటీ పడి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేవారు. దేశంలో చాలా రాష్ట్రాలు బెల్లం తయారు చేస్తున్నప్పటికీ అనకాపల్లి బెల్లంకు మిగిలినవి సాటిరావనేది నిత్య సత్యం.. రంగు, రుచిలో ప్రత్యేకత కలిగిన అనకాపల్లి దేశంలో రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్ యార్డుగా అనకాపల్లి బెల్లం మార్కెట్ ప్రసిద్ధి చెందింది. గత పదేళ్లగా చెరకు సాగు తగ్గడం వల్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో సహకార సుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం..సాగు ఖర్చు పెరిగిపోవడం, రైతులు స్థానికంగా అమ్మకాలు సాగిస్తుండడంతో మార్కెట్కు వచ్చే దిమ్మల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రతి ఏటా డిసెంబర్ నుంచి సీజన్లో సుమారు 45 లక్షల వరకూ బెల్లం దిమ్మలు మార్కెట్కు వచ్చేవి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతి అవుతుంది. ప్రస్తుత సీజన్లో ఇందుకు విరుద్ధంగా వరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు బెల్లం దిగుబడి గణనీయంగా పడిపోగా..ధర మరీ దారుణంగా పతనమైంది. తయారు చేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీత్యాలు ఏటా దెబ్బతీస్తున్నాయి. గత సీజన్లో కేవలం 7.33 లక్షల దిమ్మలు మాత్రమే మార్కెట్కు రావడం ఆందోళనకరంగా మారింది. వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అనకాపల్లి మార్కెట్లో ఇంత తక్కువ స్థాయిలో బెల్లం దిమ్మలు రావడం ఇదే తొలిసారి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక నెలలోనే 10 లక్షలు పైగా దిమ్మల అమ్మకాలు జరిగాయి. అటువంటిది ఏడాది పొడవునా 7 లక్షల దిమ్మలు రాలేదంటే మార్కెట్ ఏ విధంగా పతనమౌతుందో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్వింటాలు బెల్లంకు ఐదువేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడమే ఈ బెల్లం సంక్షోభానికి ప్రధాన కారణం అంటున్నారు చెరకు రైతులు. క్వింటాలుకు ఐదువేల రూపాయల మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తే రైతులు మళ్లీ చెరకు పంట సాగు చేసే అవకాశం ఉంది. భారీగా చెరకు సాగు జరిగితే అనకాపల్లి బెల్లం మార్కెట్ కళకళలాడే అవకాశం ఉంది. లేకుంటే అనకాపల్లి బెల్లం అనేది భవిష్యత్తులో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. సేంద్రియ బెల్లంపై దృష్టి సారించాలి.. రెండేళ్లుగా అనకాపల్లి నుంచి ఇతర రాష్ట్రాలకు బెల్లం ఎగుమతి అయ్యే పరిస్థితి నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీంతో బెల్లం రైతులను చైతన్యపర్చేందుకు మార్కెట్ అధికారులు సైతం రంగంలో దిగుతున్నా రైతులు ఆసక్తి చూపడం లేదు. తమకు గిట్టుబాటు ధర లేదంటూ వాపోతున్నారు. అందుకే సేంద్రియ బెల్లం తయారీపై ఎక్కువ దృష్టి సారించాలని చూస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి నుంచి సేంద్రియ బెల్లం, బెల్లం ఉత్త్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ బెల్లంకు గిరాకీ పెరగడంతో ఆ వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పిస్తున్నారు. గిట్టుబాటు లేక... జిల్లాలో అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, మునగపాక, చోడవరం, మాడుగుల, కోటవురట్ల మండలాల్లో బెల్లం తయారు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న నాలుగు చక్కెర కర్మాగారాలు మూతపడడం.. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో చెరకు రైతులు చెరకు సాగుకు దూరంగా ఉంటున్నారు. బెల్లంకు కూడా గిట్టుబాటు ధర లేకపోవంతో పూర్తిగా సాగు తగ్గిపోయింది. జిల్లా వ్యాప్తంగా పదేళ్ల క్రితం సుమారుగా 90 వేల నుంచి 1 లక్ష ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. ఇపుడు 15 వేల ఎకరాలకు పడిపోయింది. అనకాపల్లి మార్కెట్లో నల్లబెల్లంపై ఎకై ్సజ్ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో రైతులలో ఆందోళన రేకెత్తుతోంది. సహజంగా భూసారం వల్ల బెల్లం నల్లరంగులో మారుతుంది. సారా తయారీకి నల్లబెల్లం వాడుతున్నారనే కేసులు నమోదు కావడంతో వ్యాపారులు ఈ బెల్లం కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదు. గిట్టుబాటు ధర లేకపోవడంతో బెల్లం తయారీ కూడా తగ్గుముఖం పడుతూ వచ్చింది. 2023–24 సీజన్లో సగటున 100 కేజీల బెల్లం ధర రూ.3,901 ఉంటే, 2024–25 సీజన్లో రూ.3,811కు పడిపోయింది. ఖర్చులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. గత సీజన్లో 100 కేజీల బెల్లం తయారీకి 1,200 రూపాయలు ఖర్చు కాగా, ముగిసిన సీజన్లో 1,400 రూపాయలకు పెరిగింది. బెల్లం వ్యాపారులు, సిబ్బంది తగ్గారు.. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషర్ ఆగిపోవడంతో రైతులు చెరకు సాగు తగ్గించారు. దీంతో బెల్లం తయారీ కూడా తగ్గింది. గతేడాది 7.5 లక్షల బెల్లం దిమ్మలు వచ్చాయి. ఈ ఏడాది మరింత తగ్గే అవకాశం ఉంది. 2023లో అనకాపల్లి బెల్లం మార్కెట్కు 15 లక్షల దిమ్మలు వచ్చాయి. అనకాపల్లి బెల్లం మార్కెట్లో మూడు యూనియన్లు ఉన్నాయి. ఒక్కో యూనియన్లో 500 మంది కార్మికులు పనిచేసేవారు. ప్రస్తుతం కొలగాలు కళాసిలో సుమారుగా 250 మంది పని చేస్తు న్నారు. మహిళా కార్మికులు 80 నుంచి 30 మందికి తగ్గారు. గతంలో బెల్లం వ్యాపారులు 25 మంది వరకు ఉండేవారు. ప్రస్తుతం 10 మంది మాత్రమే చేస్తున్నారు. 15 మంది ఖాళీగా ఉన్నారు. – పొలిమేర శివ అప్పారావు, కార్మిక సంఘం నాయకుడు, ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ కుదేలవుతున్న బెల్లం పరిశ్రమ భారీగా తగ్గిన చెరకు ఉత్పత్తి రెండేళ్లుగా తగ్గిన బెల్లం విక్రయాలు గత సీజన్లో మార్కెట్లోకి కేవలం 7.33 లక్షలు బెల్లం దిమ్మలు చంద్రబాబు సర్కారులో గిట్టుబాటు ధర లేకపోవడమే కారణం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నెలకు 10 లక్షల బెల్లం దిమ్మల విక్రయాలు ప్రస్తుతం 100 కిలోల బెల్లం ధర రూ.3,811కు తగ్గింపు గణనీయంగా తగ్గుతున్న బెల్లం అమ్మకాలు చంద్రబాబు సర్కార్లో బెల్లం దిమ్మల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. 2014–19లో బెల్లం మార్కెట్కు పతనం ప్రారంభమైంది. ఆ తరువాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రావడంతో కాసింత గిట్టుబాటు ధర కల్పించడం..బెల్లం తయారీ దారులకు, చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నారు. ఆ తరువాత వచ్చిన చంద్రబాబు సర్కార్లో ఇటు బెల్లం మార్కెట్, అటు చెరకు సాగు, చెరకు సాగు చేసే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చంద్రబాబు చేసిన నిర్వాకంతో పూర్తిగా చెరకు సాగు, బెల్లం తయారీ తగ్గుముఖం పట్టాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదికి 16.85 లక్షల దిమ్మలు అమ్ముడుపోగా.. 2024–25లో 7.52 లక్షల బెల్లం దిమ్మల అమ్మకాలు జరిగాయి. -
న్యూ ఇయర్ కిక్కు..!
రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మకాలువిశాఖ సిటీ: విశాఖలో మందుబాబులు విశ్వరూపం చూపించారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో తెగ తాగేశారు. మూడు రోజుల్లో రూ.20 కోట్ల మేర మద్యాన్ని గుటకేసేశారు. 2025కు వీడ్కోలు పలుకుతూ కొందరు.. 2026కు స్వాగతం పలుకుతూ మరికొందరు సంబరాలు చేసుకుంటే.. మందుబాబులు మాత్రం తాగడమే ఉద్యమంలా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక రోజు ముందు నుంచే న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైపోయారు. దీంతో విశాఖలో కొత్త సంవత్సరం కళంతా వైన్షాపులు, బార్ల వద్దే కనిపించింది. దీంతో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క రోజే రూ.9.5 కోట్లు తాగేశారు.. మందుబాబులు 30వ తేదీ నుంచే తమ ఉద్యమానికి సిద్ధమైపోయారు. అందుకు తగ్గట్లుగానే వైన్షాప్, బార్ల నిర్వాహకులు భారీగా స్టాకును విడిపించి గొడౌన్లను నింపేసుకున్నారు. ఈ మద్యం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవాలని ముందుగానే నిర్ణయించింది. ఇందుకోసం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించింది. దీంతో అర్ధరాత్రి సమయాల్లో కూడా వైన్షాపులు, బార్లు మందుబాబులతో కళకళలాడుతూ కనిపించాయి. 30వ తేదీ మధ్యాహ్నం నుంచే మద్యం దుకాణాల వద్ద హడావుడి మొదలైంది. 31వ తేదీకి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగిన్నట్లు తెలుస్తోంది. గతేడాది 31, 1 తేదీల్లో మొత్తంగా రూ.12 కోట్లు మద్యం అమ్మకాలు జరగగా.. ఈసారి 31వ తేదీ ఒక్కరోజే రూ.9.5 కోట్ల మేర మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. 30, 31, 1వ తేదీల్లో మొత్తంగా రూ.20 కోట్ల మేర మద్యాన్ని తాగేశారు. మందుబాబుల హల్చల్.. నూతన సంవత్సరం వేళ నగరంలో మందుబాబులు తప్పతాగి చిందులేశారు. బహిరంగంగానే మద్యం సేవించారు. తాగిన మత్తులో రోడ్లపై బైక్లతో చక్కర్లు కొట్టారు. ఒకవైపు పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో పోలీసులు బహిరంగంగా మద్యం తాగిన 99 మందిపైన, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన 257 మందిపైన కేసులు పెట్టారు. -
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకల్లో కేక్ కట్ చేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా . చిత్రంలో అడిషనల్ ఎస్పీలు దేవప్రసాద్, ఎల్.మోహన్రావు సబ్బవరం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలసి కేక్ కట్ చేస్తున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్ విజయకృష్ణనన్కు జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు. నూతన సంవత్సరంలో జిల్లాకు శాంతి, సుభిక్షం, సమృద్ధి తీసుకురావాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో కీలకమని, శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అనకాపల్లి : జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కేక్ కట్ చేసి, పోలీసు అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా ఎస్పీని జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల అధికారులు డి.విష్ణు స్వరూప్, పి. శ్రీనివాసరావు, ఎం.శ్రావణి, డీఎస్పీలు జి.ఆర్.ఆర్.మోహన్, బి.మోహనరావు, ఈ.శ్రీనివాస్, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్ఐలు కూడా ఉన్నతాధికారులను కలిసి అభినందనలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో జిల్లా పోలీసు యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఐజీకి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, విశాఖ నగర సీపీ శంఖబ్రత భాగ్చీని గురువారం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చోడవరం : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాధ్ తన స్వగృహంలో కేక్ కట్చేసి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. పలువురు పార్టీ నాయకులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గురుకుల పాఠశాలలో కలెక్టర్ సబ్బవరం: విద్యార్థులంతా క్రమశిక్షణ అలవరుచుకుని ఉన్నత విద్యావంతులు కావాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకాంక్షించారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను గురువారం సందర్శించి విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే ప్రభుత్వ ఉద్యోగులంతా తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలన్నారు. గురుకుల పాఠశాలకు వచ్చిన కలెక్టర్కు స్థానిక తహసీల్దార్ బి.చిన్నికృష్ణ, ఎంపీడీవో పద్మజ తదితరులు గురుకుల అధ్యాపకులతో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, స్వాగతం పలికారు. -
అశ్రునయనాలతో రాము మృతదేహం ఊరేగింపు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాము మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తున్న దృశ్యం మునగపాక : రోడ్డు ప్రమాదంలో అశువులు బారిన యువకుడు మొల్లి రాము మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. మునగపాకకు చెందిన మొల్లి రాము అచ్యుతాపురం మండలం కొండకర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గత నెల 31వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం అనకాపల్లి వందపడకల ఆసుపత్రి నుంచి గురువారం బైక్లపై ఊరేగింపుగా మునగపాకకు తీసుకువచ్చారు. అమర్ రహే రాము అంటూ స్నేహితులు, యువకులు నినాదాలు చేసుకుంటూ మృతదేహాన్ని స్థానిక శ్మశాన వాటికకు తరలించారు. అందరితో సరదాగా గడిపే రాము మృతితో మునగపాక శోక సముద్రంలో మునిగిపోయింది. చిన్న వయస్సులో జరగరాని ఘోరం జరిగిపోయిందని రాము కుటుంబానికి పలువురు సంతాపం తెలిపారు. -
విశాఖ రేంజ్ ఐజీగా గోపీనాథ్ జట్టి బాధ్యతల స్వీకరణ
విశాఖ సిటీ: విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ జట్టి పదోన్నతి పొందారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని ఎస్పీలు తుహిన్ సిన్హా (అనకాపల్లి), అమిత్ బర్దర్ (అల్లూరి), కె.వి.మహేశ్వర్రెడ్డి (శ్రీకాకుళం), ఎస్.వి.మాధవరెడ్డి (మన్యం), ఎ.ఆర్.దామోదర్ (విజయనగరం) ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందించి పదోన్నతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారుల సమక్షంలో ఐజీ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఐజీ ఆకాంక్షించారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ చర్చకు వాయిదా అంశాలు
డాబాగార్డెన్స్: తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణల కారణంగా గతంలో వాయిదా పడిన అంశాలనే మళ్లీ ఆమోదం కోసం స్థాయీ సంఘ సమావేశం అజెండాలో చేర్చిన తీరు జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. గత ఏడాది యోగా డే సందర్భంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ల బిల్లుల చెల్లింపు వ్యవహారం ఇందులో ప్రధానంగా ఉంది. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఈ అంశం మరోసారి చర్చకు రానున్నాయి. మళ్లీ తెరపైకి యోగా డే బిల్లులు గత ఏడాది జూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన ఆరు నెలల తర్వాత, గత డిసెంబర్ 6న జరిగిన సమావేశంలో దాదాపు రూ.1.62 కోట్ల బిల్లుల చెల్లింపునకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పెట్టారు. ఒక్కో పోర్టబుల్ వీఐపీ టాయిలెట్ యూనిట్కు రోజుకు రూ.16,200 చొప్పున అద్దె నిర్ణయించడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దీనిపై ‘సాక్షి’దినపత్రికలో ‘మొబైల్ టాయిలెట్ మస్కా’పేరిట కథనం కూడా ప్రచురితమైంది. గత సమావేశంలో ఈ అంశంపై స్థాయీ సంఘం సభ్యులు సాడి పద్మారెడ్డి, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వారు పట్టుబట్టడంతో మేయర్ ఆ అంశాన్ని వాయిదా వేశారు. అయితే.. ఆ విచారణ ఏమైందో, నివేదిక ఏమొచ్చిందో తెలియకుండానే.. శుక్రవారం జరిగే సమావేశంలో అవే బిల్లులను ఆమోదం కోసం అజెండాలో చేర్చడం గమనార్హం. 87 అంశాలతో సమావేశం శుక్రవారం సమావేశంలో మొత్తం 87 అంశాలు సభ్యుల ఆమోదానికి రానున్నాయి. వీటిలో అభివృద్ధి పనులు, రెవెన్యూ, సర్వీస్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరిలో ఆర్.కె.బీచ్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (ఐఎఫ్ఆర్)–2026 కోసం దాదాపు రూ.2.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీవీఎంసీ 29వ వార్డు పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు రూ.36.36 లక్షలతో బ్లాక్ టాప్ రోడ్లు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోస్టల్ బ్యాటరీ తూర్పు వైపు రూ.35.30 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 32వ వార్డు అల్లిపురం రోడ్డు ఉత్తరం వైపు బీటీ రోడ్డుకు రూ.36.40 లక్షలు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఫుట్పాత్లు, సెంట్రల్ డివైడర్ మరమ్మతులు, పెయింటింగ్కు రూ.25.80 లక్షలు, పోలీస్ బ్యారెక్స్ జంక్షన్ నుంచి చౌల్ట్రీ జంక్షన్ వరకు రూ.35.40 లక్షలతో బీటీ రోడ్డు, 37వ వార్డు బీచ్రోడ్డు భారత్ పెట్రోలియం బంక్ నుంచి నేవల్ క్యాంటీన్ వరకు రూ.33.50 లక్షలతో రోడ్డు పనులు, నేవల్ క్యాంటీన్ కొత్త జాలరిపేట జంక్షన్ వద్ద దెబ్బతిన్న కల్వర్టు పునర్నిర్మాణానికి రూ.27.25 లక్షలు తదితర పనులకు పరిపాలనా పరమైన ఆమోదం కోసం కమిటీ ముందుంచనున్నారు. -
పరుగులే..
పట్టించుకోకపోయినా కార్గోలోనూ పురోగతివిశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులుసాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖపట్నం ఎయిర్పోర్టు.. ప్రయాణికుల రాకపోకల్లో ఏటా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2024తో పోలిస్తే, 2025లో ప్రయాణికుల రాకపోకల్లో 9శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు 2022–23తో పోల్చితే 2023–24లో ఏకంగా 22 శాతం వృద్ధి నమోదైంది. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అలసత్వం, ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కారణంగా వృద్ధి రేటులో కొంత తగ్గుదల కనిపించింది. విశాఖకు రావల్సిన అంతర్జాతీయ సర్వీసులు విజయవాడ, ఇతర రాష్ట్రాలకు తరలిపోయినా.. ఎయిర్పోర్టు అధికారులు, ఎయిర్ట్రావెల్స్ అసోసియేషన్ సమన్వయంతో విమానాశ్రయాన్ని ముందుకు నడిపించి మంచి ఫలితాలు సాధించారు. 2025లో గణనీయమైన ప్రగతి 2025లో విశాఖ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీ, మౌలిక వసతులు, భద్రత, సామాజిక బాధ్యత(సీఎస్సార్) వంటి రంగాల్లో మంచి ఫలితాలను రాబట్టింది. ప్రయాణికుల రద్దీలో 9 శాతం వృద్ధి నమోదైంది. నెలకు సగటున 2 లక్షల మంది వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు.. ఇండిగో సంక్షోభ సమస్యను వెంటనే పరిష్కరించి ఉంటే.. ప్రయాణికుల రాకపోకల వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉండేది. ఆ సమయంలో నాలుగైదు రోజుల పాటు పదుల సంఖ్యలో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు ఎయిర్పోర్టు ఘనతలివీ.. ● 2025లో సుమారు 27.55 లక్షల మంది ప్రయాణించారు. 2024లో ఈ సంఖ్య 25.21 లక్షలు ● 2025 జనవరి, నవంబర్లో రద్దీ గరిష్టంగా 2.7 లక్షలకు చేరింది. ● ప్రయాణికుల కోసం ఆధునిక బేబీ కేర్ గదులు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. ● కస్టమర్ సంతప్తి సర్వే (సీఎస్ఐ)లో 4.92/5 స్కోరు సాధించింది. ఈ స్కోరుతో జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఎయిర్పోర్టు నిలవడంగమనార్హం. అంతర్జాతీయ సర్వీసులపై రాజకీయ నిర్లక్ష్యం? అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అన్ని అర్హతలున్నా.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వైజాగ్ ఎయిర్పోర్టుకు శాపంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. 2025 మొదట్లో దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. తర్వాత.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ఎయిర్పోర్టు వర్గాలు వ్యవహరించారు. ఆకాశా ఎయిర్లైన్స్ వైజాగ్ నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నా, కేంద్ర మంత్రి చొరవ లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. చివరకు జూన్లో అబుదాబీకి వారానికి నాలుగు రోజుల సర్వీసు ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే సింగపూర్, అబుదాబీలతో పాటు దుబాయ్, వియత్నాం సర్వీసులు కూడా నడిచేవి. ఇప్పటికై నా కేంద్ర మంత్రి, ఎయిర్పోర్టు అధికారులు స్పందించి సర్వీసుల పెంపుపై దృష్టి సారించాలని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ కోరుతోంది. 2025లో విశాఖ ఎయిర్పోర్ట్ జోరు రాజకీయ సవాళ్ల నడుమ 9 శాతం వృద్ధి విశాఖ నుంచి 27 లక్షల మంది ప్రయాణం కార్గోలోనూ రికార్డులు వైజాగ్ ఎయిర్పోర్టు కార్గో టెర్మినల్లో నవంబర్ 14న సరకు రవాణా పునఃప్రారంభమైంది. సాధారణ రోజుల్లో పౌర విమానాల్లోనూ డొమెస్టిక్ కార్గో రవాణా జరిగింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు మొత్తం 4,902.876 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. ఇందులో ఎగుమతులు 1955.369 మెట్రిక్ టన్నులు కాగా, దిగుమతులు 2947.507 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. మార్చిలో అత్యధికంగా 593.195 మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరిగింది. ప్రతి నెలా సగటున 340 మెట్రిక్ టన్నులకు పైగా సరకు హ్యాండ్లింగ్ జరిగింది. -
పాల్తేరు టీడీపీలో ఫ్లెక్సీ రగడ
కొట్లాటలో గాయపడి తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులు పాయకరావుపేట: మండలంలోని పాల్తేరు గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో టీడీపీ నాయకుల మధ్య గురువారం ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రూపుగా విడిపోయి కొట్లాటకు దిగారు. ఆ పార్టీ రెండు గ్రూపుల వ్యక్తులు ఫ్లెక్సీపై ఫొటోల ముద్రణ విషయంలో ఈ ఘర్షణ జరిగిందని సీఐ జి.అప్పన్న తెలిపారు. ఈ తగదాలో రెండు కుటుంబాల సభ్యులు పరస్పరం కొట్లాటకు దిగడంతో ఇరువర్గాల వ్యక్తులకు గాయాలయ్యాయన్నారు. వారంతా తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సీఐ తెలిపారు. పాల్తేరు గ్రామంలో శాంతి, భద్రతల అదుపు కోసం పెట్రోలింగ్, పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఘర్షణకు పాల్పడిన వారిపై రౌడీషీట్ తెరిచినట్టు సీఐ చెప్పారు. -
చిన్నయ్యపాలెంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు చించివేత
బుచ్చెయ్యపేట : మండలంలో పెదపూడి శివారు చిన్నయ్యపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను కూటమి నేతలు చించివేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి చెందిన మండల సోషల్ మీడియా కన్సీనర్ అయితి రాము, వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు చందక దేముడు, ఉప సర్పంచ్ ఉప్పిలి అప్పలరాజు తదితరులు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగనన్న ఫొటోలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మండల నాయకులు ఇతర నాయకులతో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కూటమి నేతలు కక్ష సాధింపు చర్యగా ఫ్లెక్సీలను చించివేశారని నాయకులు తెలిపారు. తమ అధినాయకుడు జగనన్న కటౌట్లు చూసి ఓర్వలేకపోతున్నారని, ప్రశాంతంగా ఉన్న గ్రామంలో గొడవలు సృష్టించాలని కూటమి నేతలే ఫ్లెక్సీలను చించివేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం చెందారు. పోలీసులు గ్రామంలో ఫ్లెక్సీలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గోకివాడ వరకృష్ణ కోరారు. -
బాల భీముడు
ఎన్టీఆర్ ఆస్పత్రిలో జన్మించిన 4.8 కిలోల మగబిడ్డతో ఆస్పత్రి వైద్యులు అనకాపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట ముత్యాలమ్మ కాలనీకి చెందిన కోసురు రూపవతి అనే మహిళ సాధారణ కాన్పులో బాలభీముడికి జన్మనిచ్చింది. 4.8 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టాడు. రూపవతికి నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కాన్పు కష్టమవ ుతుందని భావించి ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు జరిగింది. రూపవతికి 8వ నెలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్లో శిశువు బరువు 3 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. 9 నెలలు నిండిన అనంతరం శిశువు బరువు మరింత పెరిగినందున సిజేరియన్ తప్పదేమోనని అనుకున్నారు. వుడ్స్ కార్క్ స్క్రూ ’ (మ్యాన్అవర్) విధానంలోని మెళుకువలను పాటించి, సహజ ప్రసవం చేయగా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, వైద్యురాలు సౌజన్య మాట్లాడుతూ ప్రసవ సమయంలో తల్లీబిడ్డలకు రిస్క్ ఎదురయ్యే ప్రమాదం ఉందని ముందుగానే గమనించి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. -
త్యాగాలు మావి... లబ్ధి వాళ్లకా
నక్కపల్లి: అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నక్కపల్లిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాను కంపెనీలకోసం భూములు ఇవ్వాలని హోంమంత్రి వంగలపూడి అనిత పదే పదే చెప్పేవారని, ఆమె మాటలు నమ్మి కంపెనీలు వస్తే మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, రాజకీయంగా, పరిపాలనా పరంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఆశతో భూములు త్యాగం చేశామని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో చివరి నిమిషంలో అన్యాయం చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. నక్కపల్లి మండల కేంద్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. బ్రిటీష్ కాలంనుంచి నక్కపల్లి తాలూకా కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచి రెవెన్యూకు సంబంధించిన ముఖ్యకార్యకలాపాలు జరుగుతుంటాయి. లోక్సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అంతా నక్కపల్లి నుంచే జరుగుతుంది. మండల వ్యవస్థ ఏర్పాటు కాకముందు నక్కపల్లి తాలూకా కేంద్రంగానే పాయకరావుపేట, ఎస్.రాయవరం నక్కపల్లి మండలాల్లో రెవెన్యూ కార్యకలాపాలు జరిగేవి. తాలూకాలకు అనుబంధంగా నక్కపల్లి, గొడిచర్ల ,పాయకరావుపేట, కోటవురట్ల, శ్రీరాంపురం ఎస్.రాయవరం ఫిర్కాలు ఉండేవి. నక్కపల్లిలో సబ్రిజిస్టార్ కార్యాలయం,ఉపఖజానా గ్రామీణ నీటి సరఫరా విభాగం డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఇక్కడే ఉండేవి. 31 పంచాయతీలు, సుమారు 65 వేలకుపైగా జనాభాకలిగిన నక్కపల్లి మండలానికి 2004నుంచి మహర్దశ పట్టింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రోత్సాహంతో నక్కపల్లిలో హెటెరో రసాయన పరిశ్రమ ఏర్పాటైంది. సుమారు 500 ఎకరాల్లో ఈ కంపెనీఏర్పాటవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. అక్కడనుంచి భూముల ధరలకు రెక్కలు రావడంతో రియ ల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అలాగే పాయకరావుపేట మండలంలో కూడా దక్కన్ కంపెనీ రావడంతో అక్కడ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. నక్కపల్లి మండలంలో ఏడు మత్స్యకార గ్రా మాలున్నాయి. కంపెనీలకు అనువైన అన్ని వనరులు ఇక్కడ ఉండటంతో ప్రభుత్వం దృష్టి నక్కపల్లి మండలంపై పడింది. 2010లో ప్రభుత్వం మండలంలో పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణకు సిద్ధమైంది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఎస్ఈజడ్ ఏర్పాటు కోసం ఏపీఐఐసీ ద్వారా 5వేల ఎకరాలను సేకరించింది. నక్కపల్లి మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, ఉపాధి, ఉద్యోగావకాశాలు కలుగుతాయన్న ఆఽశతో రైతులంతా తమ భూములను త్యాగం చేశారు. రాజకీయ, భౌగోళిక పరంగా కూడా నక్కపల్లి మండలం గుర్తింపు పొందుతుందని ప్రజలంతా ఆశపడ్డారు. తాజాగా రూ.67వేల కోట్ల వ్యయంతో ఆర్సిలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకానుంది. స్టీల్ప్లాంట్ కోసం కూడా రైతులు భూములు త్యాగం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నక్కపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూడివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన మండల ప్రజలను ఎంతో ఆనందంగా కలిగింది.ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ రెవెన్యూ డివిజన్ను అడ్డురోడ్డుకేంద్రంగా ఏర్పాటుచేయడం పట్ల మండల ప్రజలు ,రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.కంపెనీలకోసం భూములు మేము త్యాగం చేయాలి. పేరుప్రఖ్యాతలు, రెవెన్యూ డివిజన్ను మా త్రం అడ్డురోడ్డు కేంద్రంగా ఏర్పాటు చేస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడ్డురోడ్డు అనేది రెండు గ్రామాలపరిదిలో ఉంటుందని మండల కేంద్రంగాని,మేజర్ పంచాయతీగాని కాకుండా కేవలం వాణిజ్య కేంద్రంగా ఉన్న ఇక్కడ రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తగదని పలువురువ్యాఖ్యానిస్తున్నారు. వేలా ది ఎకరాలను నక్కపల్లి మండలంనుంచి సేకరించి రైతులకు 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం ఆర్అండ్ ఆర్ప్యాకేజీ చెల్లించకుండా అన్యా యం చేశారని,కనీసం రెవెన్యూడివిజన్ అయినా ఇక్క డ ఏర్పాటు చేస్తే సంతోషించేవాళ్లమని రైతులు చెబుతున్నారు. భూములు త్యాగం చేసేది మేము,డివిజన్ కేంద్రం మాత్రంసెంటుభూమికూడా సేకరించని అడ్డురోడ్డులో ఏర్పాటు చేస్తారా అంటూ వాపోతున్నారు. అడ్డురోడ్డు కేంద్రంగా ఏర్పాటు చేయడం దారుణం నక్కపల్లి మండలంలో రైతులు పరిశ్రమల కోసం వేలాది ఎకరాలు భూములు త్యాగం చేశారు. నష్టపరిహారం విషయంలో అన్యాయం జరిగినప్పటికీ పారిశ్రామికంగా పరిపాలనా పరంగా అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డారు. నక్కపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూడివిజన్ ఏర్పాటు చేస్తున్నామంటే ఆశపడ్డారు. చివరకు నక్కపల్లికాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా రెవె న్యూ డివిజన్ ఏర్పాటు చేయడం దారణం. కంపెనీల కోసం భూములు త్యాగం చేసిన రైతులను ప్రభుత్వం మోసం చేసింది. – వీసం రామకృష్ణ, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి -
ఎస్సీ, ఎసీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
తుమ్మపాల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ త్రైమాసిక సమావేశాన్ని కలెక్టర్, ఎస్పీ తుహిన్ సిన్హా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు నిర్దేశించిన సమయంలోగా చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రాయితీ రుణాలు సత్వరమే అందిస్తున్నట్టు తెలిపారు. వారికి మంజూరైన యూనిట్లను గ్రౌండింగ్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఏప్రిల్ నుంచి ఈ నెల వరకు జిల్లాలో 34 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, ఇందులో 31 కేసులకు సంబంధించి రూ.54.50 లక్షల పరిహారం మంజూరైందని చెప్పారు. త్వరలోనే మిగిలిన 3 కేసులకు సంబంధించి పరిహారం మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై. సత్యనారాయణరావు, ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి.రమణ, జిల్లా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు బి.రామానందం, మంగవేణి, జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.మీనా, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీలు, డీవీఎంసీ ఎన్జీవో కమిటీ సభ్యులు పలకా రవి, టి.జయశ్రీ, ఎం.రాజు, బి.అప్పారావు పాల్గొన్నారు. -
14 మండలాల్లో క్రీడా మైదానాల నిర్మాణాలు ప్రారంభం
నాతవరం: జిల్లాలో 15 మండలాల్లో క్రీడా మైదానాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని, 14 మండలాల్లో పనులు ప్రారంభమయ్యాయని జిల్లా క్రీడలు అధికారి పూజారి శైలజ తెలిపారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల ప్రకారం పోలీస్ మైత్రీ ఆటలు పోటీలు ఎస్ఐ వై.తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ పోటీలను బుధవారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. కోటవురట్ల మండలంలో గ్రౌండ్ స్థలం విషయంలో కోర్టుకు వెళ్లడంతో అక్కడ పనులు చేయలేదన్నారు. విద్యార్థినీవిద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు చాలా కీలకమన్నారు. భారీ స్థాయిలో ఆటలు పోటీలు ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తున్న ఎస్ఐ వై.తారకేశ్వరరావు అభినందించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ ఎంపీడీవో శ్రీనివాస్, నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి అపిరెడ్డి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
దేవరాపల్లి: ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను ప్రణాళిక ప్రకారం సిద్ధం చేస్తున్నట్టు జిల్లా ఇంటర్ బోర్డు విద్యాధికారి ఎం. వినోద్బాబు తెలిపారు. విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పారు. దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం 48వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ బి. రాధ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముఖ్యఅథితిగా వినోద్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 2,862 మంది, ఫస్టియర్ విద్యార్థులు 3, 261 మంది పరీక్షలకు సిద్ధమవుతున్నారన్నారు. 2026 సంకల్పం కార్యక్రమం ద్వారా అదనపు తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. జనవరి 21 నుంచి మానవతా విలుపులపై పరీక్షలు, ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఏ,బీ,సీ గ్రేడింగ్ విధానం అమలు చేసి, సీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధ్యాపకులకు సూచించారు. -
అడ్డురోడ్డులో ఆర్డీవో కార్యాలయం ప్రారంభం
ఎస్.రాయవరం: పాలనా వికేంద్రీకరణలో భాగంగా అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. తిమ్మాపురం సచివాలయ భవనంలో ఏర్పాటు చేసిన అడ్డురోడ్డు ఆర్డీవో కార్యాలయాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఇన్చార్జ్ ఆర్డీవోగా నర్సీనట్నం ఆర్డీవో వి.వి.రమణకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటన చేసిన రెండు రోజుల్లో సర్పంచ్ కర్రి సత్యనారాయణ సచివాలయ భవనం కేటాయించడం అభినందనీయమన్నారు.తాత్కాలికంగా పనులు ప్రారంభించేందుకు సచివాలయ భవనం అనువుగా ఉందన్నారు. ఏడు మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్లో అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఇప్పటికే పరిశ్రమలు ఉన్నాయన్నారు.త్వరలో మిట్టల్ స్టీల్ ప్లాండ్ మరో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కానుందని, అత్యంవేగంగా ఈ డివిజన్ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని చెప్పారు. పరిశ్రమలకు భూములు కేటాయింపులతో పాటు, భూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఆర్డీవో స్థాయి అధికారి అవసరం ఉందన్నారు. అనంతరం తిమ్మాపురంలో పలువురికి కలెక్టర్ పింఛన్ నగదు అందజేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తదితరులు మాట్లాడారు. గ్రోయిన్ మరమ్మతులకు నివేదిక ఇవ్వాలి సోమిదేవ పల్లి గ్రామంలో సుమారు 10 ఏళ్లుగా మరమ్మతులకు గురై ప్రమాదకరంగా మారిన మూలపొలం గ్రోయిన్ను కలెక్టర్ విజయ్కృష్ణన్ పరిశీలించారు.గ్రోయిన్ మరమ్మతులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ రమేష్బాబు, ఎంపీడీవో మీనా కుమారి, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ సచిదేవి, సర్పంచ్ కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి సహకారం అవసరం
రికార్డులను పరిశీలిస్తున్న కుమారరాజు మాడుగుల రూరల్ : గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమారరాజు అన్నారు. కె.జె.పురంలో గల శాఖా గ్రంథాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 64 గ్రంథాలయాలు ఉండగా 70 మంది సిబ్బంది నియామకాలు ఖాళీగా ఉన్నట్టు ఆయన తెలిపారు. జనవరి 2 వాడచీపురపల్లిలో నూతనంగా మంజూరైన గ్రంథాలయానికి శంకుస్థాపన చేయనున్నట్టు ఆయన తెలిపారు. రూ.180 కోట్ల గ్రంథాలయ సంస్థకు సెస్ రూపేణా వసూళ్లు కావలసి ఉందని చెప్పారు. 36 బుక్ డిపో సెంటర్లు ప్రస్తుతం పని చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
మత్తు పదార్థాలతో అనర్థాలపై అవగాహన
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవా రం పోలీసుశాఖ ఆధ్వర్యంలోపదవ తరగతి విద్యార్థులకు ‘గంజాయి ఇతర మాదకద్రవ్యాలు ప్రభావం–సమాజంపై దుష్ఫరిణామాలు, నివారణ చర్యలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని వారి ప్రతిభ చూపించారు. వీరిలో విజేతలుగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థి కార్తీక్(ప్రథమ), మెనూ(ద్వితీయ) తెలుగు మీడియంలో ఎం.శ్రీవాణి(ప్రథమ) ఎంపికయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ రామకృష్ణారావు, హెచ్ఎం శేషగిరిరావుతో కలసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆంగ్ల టీచర్ నాగజ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పాఠశాలకు ఐడీబీఐ బ్యాంకు వితరణ
సత్యవరం రామాలయంలో ఏకాహం రోలుగుంట : మండలంలో నాలుగు పాఠశాలలకు లక్ష రూపాయల విలువ గల నాలుగు కంప్యూటర్లను నర్సీపట్నం ఐడీబీఐ బ్యాంకు వారు పాఠశాల అభివృద్ధి రీత్యా ఇవ్వాలని నిర్ణయించి బుధవారం ఎంఆర్సీ భవన్కి చేరవేశారు. వీటిలో ఒక కంప్యూటర్ను ఎంఈవో జానుప్రసాద్తో కలసి స్థానిక ఎంపీపీ పాఠశాలకు బ్యాంకు మేనేజర్ రాహుల్ పాఠశాల హెచ్ఎం ఫ్రాన్సిస్కు అందజేశారు. దీనిని డేటా అప్రేటర్ పాఠశాలలో ఇన్స్టాల్ చేసి విద్యా సంబంధమైన పాటలు, రెయిమ్స్ యాప్స్ను డౌన్లోడు చేశారు. బ్యాంకు మేనేజర్కు ఎంఈవో, హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు. -
ఎ.కొత్తపల్లిలో ఎల్ఈడీ లైట్లు ప్రారంభోత్సవం
దేవరాపల్లి : మండలంలోని ఎ.కొత్తపల్లిలో సిద్ది వినాయక ఆలయం, కోదండ రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ విద్యుత్ లైట్లను స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, స్థానిక సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్చాన్ చేసి లైట్లు వెలిగించారు. పంచాయతీ పరిధిలోని ఇద్దరు వితంతువులకు స్థానిక సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ చేతుల మీదుగా బుధవారం పింఛన్లు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ సరువునాయుడు, పంచాయతీ వార్డు మెంబర్లు పడాల చెల్లయ్యమ్మ, కంచిపాటి నాగరాజు అమ్మ, సచివాలయం సర్వేయర్ హేమంత్, పెద్దాడ పుచ్చాలు, పెద్దినాయుడు పాల్గొన్నారు. -
ఎస్ఎంఎస్–2లో రికార్డు హీట్ల ఉత్పత్తి
ఉక్కునగరం : స్టీల్ మెల్ట్షాప్–2లో మంగళవారం ఎక్కువ హీట్లు ఉత్పత్తి చేశారు. ఉదయం ఏ షిఫ్ట్లో 20 హీట్లు, బీ షిఫ్ట్లో 26 హీట్లు, సీ షిఫ్ట్లో 30 హీట్లు వెరసి మూడు షిఫ్ట్ల్లో మొత్తం 76 హీట్లుతో గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక హీట్లు సాధించి రికార్డు ఉత్పత్తి సాధించారు. ఇంతకు ముందు 2025 ఆగస్టు 12న అత్యధికంగా 72 హీట్లు సాధించగా డిసెంబర్ 24న 73 హీట్లు సాధించి ఆ రికార్డును అధిగమించింది. ఇప్పుడు 76 హీట్లతో ఆ రికార్డును తిరగరాశారు. ఈ సందర్భంగా విభాగం ఉద్యోగులను విభాగాధిపతి, అధికారులు అభినందించారు. -
దేశ రక్షణ కోసం మరో స్వాతంత్య్ర పోరాటం అవసరం
సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ ఏయూక్యాంపస్ : దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర సమరం సాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ పేర్కొన్నారు. ‘సిటు‘ జాతీయ మహాసభలు సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ ఐదో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ ఉక్కు సహా.. దేశంలోని అన్ని వనరులనూ ఇద్దరు గుజరాతీలు అమ్మకానికి పెట్టగా.. ఇద్దరు గుజరాతీలు కొనుక్కుంటున్నారుని అన్నారు. దేశ రక్షణకు పిలుపు ఇస్తే భగత్ సింగ్లా ఉరికంబం ఎక్కడానికై నా తాను సిద్ధమేనని.. తాను ప్రజానాట్యమండలి బిడ్డనని.. ఎర్ర సినిమా తీయాలనే.. సినీ రంగాన్ని ప్రక్షాళన చేయడానికే సినీ రంగంలోకి వెళ్లానని తెలిపారు. అత్యంత శక్తిమంతమైన మాధ్యమం సినిమా రంగాన్ని కూడా ప్రజాసంఘంగా గుర్తించాలని ఆకాక్షించారు. ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కె.ఎస్.చలం మాట్లాడుతూ అదానీ, అంబానీలు దేశీయ పెట్టుబడిదారులు మాత్రమే కాదని, వారు అంతర్జాతీయ పెట్టుబడిదారులని వివరించారు. పెట్టుబడిదారీ వ్యవస్థే తనకు అవసరమైన వ్యవస్థలను సృష్టించుకుంటుందన్నారు. కార్మిక ధర్మనీతి–2025 చట్టం మనుధర్మ ప్రాతిపదికన చేసినట్లు పాలకవర్గమే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. సమస్యలపై పోరాటాలు మరింత క్రియాశీలకంగా సాగాలని ఆకాంక్షించారు. సిటు రాష్ట్ర నాయకురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ అభివృద్ధి సంక్షేమం, అచ్ఛేదిన్ అంటుంటాయంటూ.. సంపద అతి కొద్ది మంది వద్దే ఉండటమేనా అచ్ఛేదిన్ అని ప్రశ్నించారు. అంగన్వాడీ, ఆశ సిబ్బందిని కార్మికులుగా గుర్తించాలని అంతర్జాతీయ కార్మిక సంఘం సిఫార్సులనూ పట్టించుకోని ప్రభుత్వ తీరును ఖండించారు. తొలుత సిటు రాష్ట్ర నాయకులు కె.అజయ్కుమార్ స్వాగతం పలికారు. సభలో శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీ ఆవరణలో ఆటస్థలంపై విచారణలో వివక్ష
నాతవరం : ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన అధికారులే కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇంకేం న్యాయం చేస్తారని జెడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలనర్స, సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు అన్నారు. మండల కేంద్రంలో గల పీహె హెచ్సీ ప్రాంగణంలో నిబంధనలు ఉల్లంఘించి ఆటస్థలం నిర్మాణ పనులపై కలెక్టర్కు జెడ్పీటీసీ, సర్పంచ్ సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల ప్రకారం బుధవారం జిల్లా క్రీడల అధికారి పూజారి శైలజ నాతవరంలో బహిరంగ విచారణకు విచ్చేశారు. ఆట స్థలంలో నిర్మాణ పనులను పరిశీలించి ఫిర్యాదు దారులను సంఘటన స్థలానికి రప్పించారు. పీహెచ్సీ స్థలంలో ఆటస్థలం నిర్మిస్తే పీహెచ్సీ 30 పడకలు స్థాయికి పెరిగితే స్థల సమస్య వస్తుందని, గ్రౌండ్ నిర్మించేందుకు నాతవరంలో మరో చోట స్థలం ఉందని తాము చెబుతున్నా వారు పట్టించుకుండా కూటమి నేతలు చెప్పిన మాటలు విని అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి వె వెళ్లిపోయారని జెడ్పీటీసీ, సర్పంచ్, ఉపసర్పంచ్ తెలిపారు. కలెక్టర్కు ఫిర్యాదు జరుగుతుందని ఆశిస్తే విచారణకు వచ్చిన అఽఽధికారి ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్ ఇతర అధికారులతో పూజారి శైలజ సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అంశాలను నివేదిక ద్వారా కలెక్టర్కు పంపిస్తామన్నారు. -
అగ్నిమాపక వాహనం, రోడ్ స్వీపింగ్ మెషిన్ ప్రారంభం
విశాఖ సిటీ : విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అగ్నిమాపక కేంద్రంలో నూతనంగా సమకూర్చుకున్న రోడ్ స్వీపింగ్ మెషిన్, మల్టీపర్పస్ ఫైర్ టెండర్ను బుధవారం పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరాంజి కొరాటి ప్రారంభించారు. రూ.3.85 కోట్ల వ్యయంతో సమకూర్చుకున్న మల్టీపర్పస్ ఫైర్ టెండర్లో 6 కిలోలీటర్ల నీటి ట్యాంక్, 200 లీటర్ల ఫోమ్ కంపౌండ్, 100 కిలోల డ్రై కెమికల్ పౌడర్ (డీసీపీ), 45 కిలోల కార్బన్ డయాకై ్సడ్తో పాటు అత్యవసర పరిస్థితుల కోసం అవసరమైన ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. అలాగే రోడ్ స్వీపింగ్ మెషిన్ను పోర్ట్ పరిధిలోని అంతర్గత రహదారులపై ఏర్పడే దుమ్ము, చెత్త, స్పిల్లేజ్ను శుభ్రం చేయడానికి వినియోగించనున్నారు. రూ.4.69 కోట్ల వ్యయంతో ఈ యంత్రాన్ని కొనుగోలు చేశారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ యంత్రం గంటకు 20 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో అన్ని దిశల్లో శుభ్రపరిచే సామర్థ్యం కలిగి ఉంది. పోర్ట్ పరిసర ప్రాంతంలో దుమ్ము, కాలుష్య నియంత్రణకు ఇది మరింత దోహదపడనుంది. కార్యక్రమంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ టి.అరుణ్ ప్రసాద్, పోర్ట్ విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని మృతదేహం
అనకాపల్లి : అనకాపల్లి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం నంబర్ 2లోని రిలేరూమ్ పక్కన గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించడం జరిగిందని దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. మృతుని వయస్సు సుమారుగా 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయని, కుడి, ఏడమ చేతిపై వై.అర్జున, గీతా ప్రసాద్ అని టాటూ ఉందని, ఎత్తు సుమారు 5 అడుగుల 4 అంగుళాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగిందని ఎస్ఐ చెప్పారు. సాధువు/సన్యాసి అయి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 7382058996ను సంప్రదించాలన్నారు. గుర్తుతెలియని మృతదేహం -
విద్యారంగ సమస్యలపై ప్రశ్నిస్తే రౌడీ షీటా?
స్థానిక నెహూచౌక్ వద్ద ధర్న చేస్తున్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణింద్ర కుమార్ అనకాపల్లి : విద్యార్థి, యువజన ఉద్యమాలు అణచివేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై విశాఖపట్నంలో రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని ఖండిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఫణింద్రకుమార్ అన్నారు. స్థానిక నెహూచౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు, యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్న ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై ఉద్యమాలకు సంబంధించిన పాత కేసులు తోడి నేడు విశాఖపట్నంలో ఐదుగురు విద్యార్థి యువజన నాయకులపై రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని ఖండిస్తున్నామని, వారిపై రౌడీషీట్ను తక్షణమే ఎత్తివేయాలని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే నాయకులు ఎవరూ ఉండకూడదనే రాష్ట్రంలో రెడ్బుక్ రా జ్యాంగాన్ని హిట్లర్ పరిపాలనను తలపిస్తూ రౌడీ షీట్లు , పీడీ యాక్ట్లు ద్వారా ఉద్యమాలను అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. దేశ చరిత్రలో విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవీ కూడా నిలిచిన దాఖలాలు లేవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు బాబ్జి, నాయ కులు సంతోష్,అఖిల్,రమేష్,కళ్యాణి,పూజ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పద్మనాభం: మండలంలోని విజయానందరం జంక్షన్లో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా జామి మండలం కొత్త భీమసింగ్కు చెందిన పాండ్రంగి వెంకటేష్ (34) విజయనగరం వై జంక్షన్లో పాన్ షాపు, పార్లర్ షాపు నిర్వహిస్తున్నాడు. షాపుల నుంచి పని ముగించుకుని మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన కొత్త భీమసింగ్ వస్తుండగా మార్గంమధ్యలో విజయానందపురం జంక్షన్లో ఎస్టీ కాలనీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటేష్కు కుడి చేయి విరిగిపోయింది. ముక్కులో నుంచి రక్తం వచ్చింది. స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్సు సంఘటన స్థలానికి చేరుకునేటప్పటికే వెంకటేష్ మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్యలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నూతన సంవత్సర వేళ విషాదం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకుల మృతిఅచ్యుతాపురం రూరల్ : మునగపాక మండలం పల్లవాని వీధికి చెందిన మొల్లి రాము (25) కొండకర్ల కూడలికి సమీపంలో బస్సు బైక్ డీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుదవారం ఇంటి నుండి బయలుదేరి సోలార్ పరిశ్రమకు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో కొండకర్ల కూడలి సమీపంలోకి వచ్చే సరికి కార్మికులను తీసుకువెల్తున్న లారస్ పరిశ్రమ బస్సు, బైక్ డీకొన్న దుర్ఘటనలో మొల్లి రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నట్లు పోలీసుల సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చంధ్రశేఖర్ రావు, ఎస్ఐ వెంకటరావు తెలిపారు. మృతుని కుటుంబాన్ని పరిశ్రమ, బస్సు యాజమాన్యం ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రొంగలి రాము డిమాండ్ చేసారు. మునగపాకలో విషాదం మునగపాక: కుటుంబానికి అందివస్తున్నాడనుకుంటున్న కన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని తల్లితండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నూతన సంవత్సర వేడుకలను స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి ఘనంగా జరుపుకొందామని భావించిన ఆ యువకున్ని బస్సు మింగేసింది. దీంతో మునగపాకలో విషాదం అలముకుంది. వివరాలివి. మునగపాకకు చెందిన మొల్లి నాయుడు, వెంకటి దంపతులకు ఇద్దరు కుమారులు, నాయుడు కూలి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. నాయుడు పెద్దకుమారుడు రాము కొంతకాలంగా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నాడు. అందరితో సఖ్యతగా ఉండే రాము బుధవారం మధ్యాహ్నం షిప్టునకు తన బైక్పై మునగపాక నుంచి బయలుదేరి వెళుతుండగా అచ్యుతాపురం మండలం కొండకర్ల సమీపంలో ప్రధాన రహదారిపై బస్సు ఢీకొని అక్కడి కక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాము తల్లితండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఉదయం అందరితో సరదాగా గడిపిన కొడుకు అర్ధంతరంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న సమాచారం తెలియడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు అంతా సిద్దమవుతున్న తరుణంలో ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కొంపల్లి వద్ద బస్సును తప్పించబోయి... దేవరాపల్లి : దేవరాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే రోడ్డులో కుంపల్లి కూడలి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కేఎంపాలెంకు చెందిన యువకుడు చౌడువాడ దేముడునాయుడు (26) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న అదే గ్రామానికి చెందిన గంధం మహేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణారాయుడుపేట జంక్షన్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 12డి బస్సు కుంపల్లి కూడలి చేరుకునే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తూ రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న దేముడునాయుడు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాలతో బయటపడిన గంధం మహేష్ను కె.కోటపాడు సీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్కు తరలించారు. కాగా కేంపాలెంకు చెందిన సముద్రంనాయుడు, రమణమ్మ దంపతుల రెండో కుమారుడు దేముడునాయుడు ఇంటర్ పూర్తి చేసి తల్లిదండ్రులతో పాటు అన్నయ్య జగ్గారావుకు వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉండేవాడు. స్నేహితుడితో బయటకు వెళ్లి వస్తానని చెప్పి బుధవారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత సమయం తర్వాత తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషాద వార్త తెలియడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కె.ఎం.పాలెంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. దేముడునాయుడు మృతి పట్ల సర్పంచ్ గంధం రామకృష్ణ సంతాపం తెలిపారు. -
బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై ధర్నా
అనకాపల్లి : యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు స్థానిక మొయిన్రోడ్డు ఎస్బీఐ ఎదురుగా బుధవారం బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి ఆడారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల మధ్య డిసెంబర్ 2023లో ఐదురోజుల పనిదినాల ఒప్పందం కుదించారని, కేంద్ర ప్రభుత్వం నేటికి తుది నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాండ్రేగుల హరికృష్ణ మాట్లాడుతూ రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా, స్టాకు మార్కెట్, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వారానికి ఐదురోజులు పనిదినాలు కల్పించారని, మిగిలిన బ్యాంక్ ఉద్యోగులకు కల్పించాలని ఆయన కోరారు. బ్యాంకుల్లో సిబ్బంది నియామకాలు లేక ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని, వివిధ విభాగాల్లో ఖాళీపోస్టులను తక్షణమే భర్తీచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ లోకల్ కార్యదర్శి మహేష్, ఉద్యోగులు డి.ఈశ్వరరావు,శ్రావణి, ప్రసాద్, నాగరాజు, మంగపతి, ఈశ్వరరావు, సతీష్, యూనియన్ బ్యాంకు ఉద్యోగులు ఆడారి గోవిందరావు, తోట శ్రీనివాసరావు, అర్షద్, అప్పారావు, రాజు గోవి, స్రవంతి, శరగడం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్లో అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీకాలనీ: క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం హాస్పటల్లో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ హాస్పటల్ ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు.కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యాన్ని కంట్రోల్ చేయాలి సారూ..
● ఎకై ్సజ్ జిల్లా అధికారికి ఐద్వా వినతి అనకాపల్లి: నూతన సంవత్సర వేడుకలను యువత, అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలంటే డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో మద్యం దుకాణాల్లో విక్రయాలు నిలిపివేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం అన్నారు. జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సుధీర్కు మంగళవారం ఆమేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై తేదీల్లో మద్యం తాగి వాహనాలను దురుసుగా నడపడం, మహిళలను వేధించడం మొదలైన అనర్ధాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మద్యం విక్రయాలు నిలుపుదల చేయాలని తదితర డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి డి.వరలక్ష్మి, సహాయ కార్యదర్శులు ఆర్.లక్ష్మి, అన్నపూర్ణ, బంగారమ్మ పాల్గొన్నారు. -
పోరాడే వారంటే పాలకులకు భయం
ఏయూక్యాంపస్ : సమానత్వం కోసం పోరాడుతున్న వారిని చూసి పాలకవర్గాలు భయపడుతున్నాయని సినీ నటి రోహిణి పేర్కొన్నారు. సీఐటీయూ జాతీయ 18వ మహాసభ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏయూ ఎగ్జిబిషన్ మైదానంలో ‘శ్రామిక ఉత్సవ్‘ నాలుగో రోజు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సీ్త్రల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని, వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవభావముందన్నారు. పెరియార్, అంబేడ్కర్, కమ్యూనిస్టులు తమ భావాలతో తనను తీర్చిదిద్దారని తెలిపారు. సినీ నటిగా నాలుగు మంచి విషయాలు తన వాళ్లకు తెలపాలనేది తన ఉద్దేశమన్నారు. మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. శ్రామిక ఉత్సవ్లో సినీ నటి రోహిణి -
ఘనమైన కీర్తి.... గత చరిత్రే!
నర్సీపట్నం : గతమెంతో..ఘనమైన నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ వైభవం కోల్పోతుంది. కాలనుక్రమంలో చోటు చేసుకుంటున్న మార్పులతో డివిజన్ మరింత కుదించుకుపోతుంది. నూరేళ్ల చరిత్ర కలిగిన ఈ డివిజన్ ముక్కలు, ముక్కలు అవుతుంది. బ్రిటిష్ కాలంలో డివిజన్ పురుడు పోసుకుంది. నాటి కాలంలో ఇక్కడ రెవెన్యూ డివిజన్తో పాటు బ్రిటిష్ అధికారులు అటవీ, రహదారులు, భవనాలు, పోలీసు, వైద్యశాఖల డివిజన్ కార్యాలయాలు ఏర్పడ్డాయి. స్వాతంత్య్రం అనంతరం పంచాయతీరాజ్, తునికలు కొలతలు, విద్యుత్శాఖ డివిజన్లు ఏర్పడ్డాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కారణంగా ఈ శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. 1923లో డివిజన్ ఏర్పాటు... నర్సీపట్నం కేంద్రంగా 1923లో ఈ డివిజన్ ఏర్పాటైంది. ఈ డివిజన్ కోసం పాల్ఘాట్ సెంటర్ వద్ద మెయిన్ రోడ్డును అనుకుని సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆనాడే సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్మించారు. అప్పట్లో ఎందరో ఆంగ్లేయులు సబ్ కలెక్టర్లుగా పని చేశారు. వారిలో స్కాట్ అనే బ్రిటిష్ అధికారి పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించేది. పరిధిలో పూర్వపు నర్సీపట్నం, యలమంచిలి, నక్కపల్లి, మాడుగుల తదితర తాలుకాలు ఉండేవి. 1987లో మండల వ్యవస్థ వచ్చింది. మండల వ్యవస్థ తరువాత నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, పాయకరావుపేట, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాలు ఈ డివిజన్లో ఉండేవి. ఉమ్మడి జిల్లాలో విశాఖపట్నం తరువాత నర్సీపట్నం ప్రాధాన్యత డివిజన్గా ఉండేది. ఇటు ఏజెన్సీ సరిహద్దు నుంచి అటు సముద్రతీరం వరకు అతిపెద్ద డివిజన్గా ఉండేది. నర్సీపట్నంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో పాలనా కార్యక్రమాలు బ్రిటిష్ పాలనలో ఇక్కడ నుంచే జరిగేవి. పునర్వ్యవస్థీకరణతో కుచించుకుపోయి... దశాబ్దంన్నర క్రితం ఏర్పడిన అనకాపల్లి డివిజన్తో ఈ డివిజన్ కొంత కుదించుకుపోయింది. యలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి అనకాపల్లి డివిజన్లోకి వెళ్లిపోయాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డివిజన్ల పునర్వ్యవస్థీకరణతో నర్సీపట్నం డివిజన్ పరిధి మరింత తగ్గిపోయింది. నూతన సంవత్సరం నుంచి అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ జెండా ఊపింది. దీంతో ఇప్పటి వరకు నర్సీపట్నం డివిజన్లో ఉన్న పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలు అడ్డురోడ్డు డివిజన్లోకి వెళ్లనున్నాయి. చీడికాడ మండలాన్ని అనకాపల్లి డివిజన్లో కలుపుతూ మార్పు చేశారు. దీంతో నర్సీపట్నం విడిజన్ పరిధి ఏడు మండలాలకే పరిమితమైంది. కాలక్రమంలో మార్పులు సహజమైనప్పటికీ, ప్రాధాన్యం కోల్పోవడం స్థానికులకు కొంత ఆవేదన కలిగిస్తోంది. గణమైన కీర్తి..గతచరిత్రగానే మిగిలిపోనుంది.ఉన్నత స్థాయికి సోపానం.. ఇక్కడ సబ్ కలెక్టర్లుగా పని చేసిన వారులో కాకి మాధవరావు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ఎన్నికల కమిషనర్గా పని చేశారు.ఎ.శాంతి కుమారి తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. కాశీపాండ్యన్ కేంద్ర ఎన్నికల కమిషనర్గా పని చేశారు. నిమ్మగెడ్డ రమేష్కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పని చేశారు. బ్రిటిష్ కాలంలో ఏర్పడిన నర్సీపట్నం డివిజన్ కాలక్రమంలో తగ్గిన ప్రాభవం అడ్డురోడ్డు డివిజన్ ఏర్పాటుతో 7 మండలాలకే పరిమితం -
రంగనాథుడిగా వెంకన్న అపురూప దర్శనం
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామి రంగనాథుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు శయనిస్తుండగా శ్రీదేవి, భూదేవి కాళ్లు వత్తుతున్నట్లుగా అలంకరించిన రూపాన్ని చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు. ఏ ఆలయంలో లేని విధంగా స్వామివారికి ఎనిమిది అలంకారాలతో, ఎనిమిది వాహనాల్లో తిరువీధి సేవలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో షడ్భుజాలతో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి అర్చక స్వాములు కృష్ణమాచార్యులు ఉదయం 3 గంటలకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం గుండా గరుడాద్రిపై వెలసిన మూలవిరాట్ దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఉపమాక తరలిరావడంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడింది. కింద బేడామండపంలో గర్భాలయంలో ఉన్న స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీవారి పోటు ముందు ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేసి రంగనాథునిగా అలంకరించి భక్తులకు ఉత్తర ముఖంగా దర్శనం కల్పించారు. సాయంకాలారాధనల అనంతరం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామిని రంగనాథునిగా అలంకరించి పుణ్యకోటి వాహనంపైన, రాజాధిరాజ వాహనంలో గోదాదేవి అమ్మవారిని, రుక్మిణీ సహిత వేణుగోపాలస్వామిని పొన్న వాహనంలోను, ఆంజనేయ వాహనంలో సీతారాములను, హంస వాహనంలో శయన పెరుమాళ్లను, లక్కగరుడ వాహనంలో చిన్నికృష్ణుని, గజవాహనంలో ప్రాకార పెరుమాళ్లను, పల్లకిలో బుల్లిరాముడిని వేంచేయింపజేసి ఉపమాక మాఢ వీధుల్లో తిరువీధి సేవలు నిర్వహించారు. ఉపమాక శ్రీనివాస భజన బృందంవారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వాహనాల ముందు కోలాటం, భజన గీతాలు ఆలపించారు. గోదాదేవికి తిరుప్పావై 13వ పాశురాన్ని విన్నపం చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చకులు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, రామగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు పూజల్లో పాల్గొన్నారు. -
రోడ్డుపై దొరికిన రూ.47 వేల నగదు
● సొంతదారుకు క్షేమంగా అప్పగింత ● యువకుడి నిజాయితీని అభినందించిన పోలీసులు యలమంచిలి రూరల్ : మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న పట్టణంలోని శతకంపట్టు ప్రాంతానికి చెందిన యల్లపు సురేష్ తనకు రోడ్డుపై దొరికిన రూ.47వేల నగదు, ఇతర వస్తువులను పోగొట్టుకున్న యువతికి పోలీసుల సమక్షంలో అందజేసి అందరి మన్ననలు పొందారు. అచ్యుతాపురం దిబ్బపాలేనికి చెందిన కూనిశెట్టి రేణుక మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అచ్యుతాపురం గ్రామీణ వికాస బ్యాంకు బ్రాంచి నుంచి రూ.47వేలు డ్రా చేసే పనిపై యలమంచిలి పట్టణానికి వచ్చారు. తిరిగి ఆటోలో వెళ్తుండగా నగదుతో ఉన్న ప్లాస్టిక్ సంచి దిమిలి రోడ్డు పాల అప్పారావు దుకాణానికి సమీపంలో జారిపడింది. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న యల్లపు సురేష్ నగదుతో ఉన్న సంచిని చూడగా అందులో నగదుతో పాటు యువతి ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం ఉన్నాయి. వాటిని అటువైపుగా వస్తున్న యలమంచిలి ట్రాఫిక్ ఏఎస్ఐ నూకరాజుకు యువకుడు అందజేశాడు. చిరునామా, వివరాల ఆధారంగా దొరికిన నగదు రేణుకకు చెందినదిగా నిర్ధారించుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం ఆ నగదును యలమంచిలి సర్కిల్ కార్యాలయంలో ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్ఐ కె.సావిత్రి, యల్లపు సురేష్ల సమక్షంలో అందజేశారు. యువకుడి నిజాయితీని పోలీసు అధికారులు అభినందించారు. -
ప్రొటోకాల్పై గరంగరం
మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రొటోకాల్ అమలుపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరు కావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్(విశాఖ), విజయ కృష్ణన్(అనకాపల్లి), దినేష్ కుమార్(ఏఎస్ఆర్ జిల్లా), సీఈవో నారాయణమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు గౌరవం లేదా? వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులను పిలవడం లేదని, వారిని గౌరవించాల్సిన అవసరం లేదా అని సూరిబాబు(ఎంపీపీ, అనకాపల్లి), ఈర్లె అనురాధ(జెడ్పీటీసీ), సన్యాసి రాజు, నాగమణి, ఉమాదేవి, కర్రి సత్యం, దొండా రాంబాబు తదితరులు ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రొటోకాల్ పక్కాగా ఉండేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తూరులో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు ఆరోపించారు. కె.కోటపాడు జెడ్పీటీసీ ఈర్లె అనురాధ మాట్లాడుతూ ఇటీవల తన మండలంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆహ్వానించలేదన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర ఆదేశించారు. ప్రొటోకాల్ పాటించని ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేస్తామని సీఈవో నారాయణమూర్తి తెలిపారు. పింఛన్ల ఏరివేత ఆపండి ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల ఏరివేత ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని, ఈ ఏరివేతలో అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తున్నారని గొలుగొండ ఎంపీపీ నాగమణి ఆరోపించారు. బుచ్చయ్యపేట జెడ్పీటీసీ దొండపూడి రాంబాబు మాట్లాడుతూ అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారని, అర్హులకు తొలగిస్తున్నారని మండిపడ్డారు. పల్లె రోడ్ల దుస్థితిపై సర్వత్రా గగ్గోలు వడ్డాది, చోడవరం, రోలుగుంట, నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని గ్రామాల్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్ వివరించారు. ఈ మార్గా ల్లో ప్రయాణించడం గగనంగా మారిందని వాపోయారు. దేవరాపల్లి మండలంలో కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం అన్నారు. కోటవురట్ల మండలంలో కూడా రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయని జెడ్పీటీసీ సభ్యురాలు ఉమాదేవి తెలిపారు. అప్పలరాజును విడుదల చేయాలి సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పెట్టిన పీడీ కేసును ఎత్తి వేయాలని పలువురు సభ్యులు కోరారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అప్పలరాజుపై పీడీ యాక్టు నమోదు చేయడం దారుణమని అనంతగిరి జెడ్పీటీసీ డి.గంగరాజు అన్నారు. ఆయనకు మద్దతుగా పలువురు వైఎస్సార్సీపీ సభ్యులు, నక్కపల్లి జెడ్పీటీసీ గోసల కుశలమ్మ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, లాలం రాంబాబు తదితరులు మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలుష్యంపై ఆందోళన పరవాడలో వివిధ పరిశ్రమల కారణంగా కాలుష్యం సమస్య అధికంగా ఉందని జెడ్పీటీసీ పైలా సన్యాసిరాజు అన్నారు. పలు లారీలు ఓవర్ లోడుతో వెళ్తుండడంతో రోడ్లు ఛిద్రమయ్యాయని చెప్పారు. అయినా కాలుష్య నివారణ అధికారులు, ఆర్టీవో, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అచ్యుతాపురంలో కూడా కాలుష్య సమస్య అధికంగా ఉందన్నారు. పలు ప్రాంతాల నుంచి మట్టి అక్రమ తరలింపుపై గనుల శాఖ అధికారులు సమాధానం చెప్పాలని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్ డిమాండ్ చేశారు. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించాలని నియోజకవర్గ జెడ్పీటీసీలు లాలం రాము, ధూళి నాగరాజు, శానాపతి సంధ్య, కో–జెడ్పీటీసీ నర్మాల కుమార్ కోరారు. తొలుత మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోము సత్యనారాయణ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్నందున కొత్త సబ్–డివిజన్ యలమంచిలికి మార్చాలన్నారు. లేకుంటే అనకాపల్లిలోనే రెవెన్యూ డివిజన్ కొససాగించాలన్నారు. అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త సబ్–డివిజన్పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ప్రొటోకాల్ అమలుపై జెడ్పీ చైర్పర్సన్ సుభ్రద, కలెక్టర్ల ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు మండలాల్లో అభివృద్ధి పనులకు ఆహ్వానం లేకపోవడంపై జెడ్పీటీసీల ఆగ్రహం బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా నినాదాలు వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యేలు, ఎంపీల గైర్హాజరుపై గుసగుసలు -
తాళ్లతో కట్టేసి.. నగలు దోచేసి.!
అల్లిపురం: ఇంటి యజమానురాలిని తాళ్లతో కట్టేసి.. 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి వస్తువులను దోచుకుపోయిన కేసులో తల్లీకూతుళ్లు సహా మొత్తం నలుగురు నిందితులను ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కె.లతామాధురి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ రాత్రి 9.50 గంటల సమయంలో ధారపాలెం, బంగారుతల్లి లే–అవుట్లో నివసిస్తున్న మొండు వసంత తన ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. ఆమె లోపల గడియ పెట్టుకుని పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో కాళ్ల వద్ద ఎవరో సంచరిస్తున్నట్లు అలికిడి అయింది. వెంటనే ఆమె లేచేందుకు ప్రయత్నించగా.. ఒక వ్యక్తి ఆమె కాళ్లను గట్టిగా పట్టుకుని తాడుతో కట్టేశాడు. ఆమె అరవకుండా నోటిని అక్కడే ఉన్న లంగాతో కట్టేశారు. అనంతరం ఆమె మెడలోని 5 తులాల బంగారు పలక సరలు, నెమలి బిల్ల గల రెండు పేటల గొలుసు, చేతులకు ఉన్న 4 తులాల బంగారు గాజులు, లాకెట్తో కూడిన మరో గొలుసు, తులం బరువుగల రెండు ఉంగరాలు, 8 తులాల వెండి ఆభరణాలను బలవంతంగా తీసుకున్నారు. అనంతరం నిందితులు బయటకు వెళ్లి, తలుపులకు బయటి నుంచి గడియపెట్టి పారిపోయారు. తర్వాత బాధితురాలు అతికష్టం మీద కట్లు విప్పుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సెల్ఫోన్ టవర్ లోకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దాదాపు వెయ్యి సెల్ఫోన్ల డేటాను విశ్లేషించి నిందితులను గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా రామాయణపురానికి చెందిన నెల్లి నిర్మల కుమారి, ఆమె కుమార్తె నెల్లి లిఖిత, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి (ఇందిరాకాలనీ)కి చెందిన భూపతి అభిరామ్, బి.సావరం గ్రామానికి చెందిన నల్లి మణిరత్నంలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. బంధువుల పరిచయంతో.. ప్రధాన నిందితురాలు నెల్లి నిర్మల కుమారి.. ఆరిలోవలోని బంగారుతల్లి లే–అవుట్లో నివాసం ఉంటున్న తన పెదనాన్న కుమారుడు దుర్గాప్రసాద్ ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేది. ఆ సమయంలో దుర్గాప్రసాద్ ఇంటి యజమానురాలైన వసంత మెడలో ఎక్కువ బంగారు ఆభరణాలు ఉండటం గమనించింది. తనకు ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఆమెను దోచుకోవాలని పథకం వేసింది. భీమవరం కలెక్టర్ ఆఫీస్లో క్యాంటీన్ నడుపుతున్న నిర్మల కుమారి.. తన కుమార్తె లిఖితకు, క్యాంటీన్లో పనిచేస్తున్న అభిరామ్, మణిరత్నంలకు డబ్బు ఆశ చూపించి విశాఖ తీసుకువచ్చింది. 13వ తేదీన దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరుసటి రోజు బాధితురాలికి ‘సెండాఫ్’చెప్పే నెపంతో నిర్మల కుమారి, లిఖిత ఆమెను బయటకు పిలిచారు. ఆ సమయంలోనే అభిరామ్, మణిరత్నం రహస్యంగా ఇంట్లోకి దూరి దాక్కున్నారు. రాత్రి బాధితురాలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని నిద్రపోయాక, లోపల ఉన్న నిందితులు ఆమెను బంధించి చోరీకి పాల్పడ్డారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన ద్వారకా సబ్ డివిజన్ క్రైం సీఐ వి.చక్రధర్, ఆరిలోవ క్రైం ఎస్ఐ ఎ.హరికృష్ణ, ఎంవీపీ క్రైం ఎస్ఐ సి.హెచ్.రామదాసు, ద్వారకా క్రైం ఎస్ఐ ఎల్. శ్రీనివాసరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రామారావు, చంద్రశేఖర్లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు. -
వించ్ ప్రయాణం అమోఘం
● ఒడిశా జలవిద్యుత్ శాఖ ఉన్నతాధికారి ప్రణబ్కుమార్మంచు కొండల్లో వేడివేడి విందు ●హరితా రిసార్ట్లో ప్రత్యేక వంటకాలు ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లే వించ్ ప్రయాణం అమోఘమని ఒడిశా జలవిద్యుత్శాఖ ఆర్థిక సంచాలకుడు ప్రణబ్కుమార్ అన్నారు. ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. వించ్లో ప్రాజెక్ట్కు చేరుకున్నారు. మధురానుభూతి పొందారు. వించ్ వివరాలను ప్రాజెక్టు అధికారుల నుంచి తెలుసుకున్నారు. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ల పనితీరు, విద్యుత్ ఉత్పత్తి వివరాలపై ఆరా తీశారు. శతశాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంపై ఆయన ప్రాజెక్టు అధికారులను,సిబ్బందిని అభినందించారు. పలు రికార్డులను పరిశీలించారు. స్థానిక ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు,సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోవిందరాజులు, ఓహెచ్పీసీ జీఎం నిర్మల్కుమార్ ,మాచ్ఖండ్ ఈఈ సివిల్ కురేషిప్రధాన్, డిప్యూటీ ఈఈలు చంద్ర ఓబుల్రెడ్డి, వెంకటమధు,చిరంజీవి పాల్గొన్నారు. -
ముక్కోటి వైభవం
ముక్కోటి ఏకాదశి పర్వదినాన సింహగిరి భూవైకుంఠాన్ని తలపించింది. సింహాచలం గోవింద నామస్మరణతో మార్మోగింది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠవాసుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆ దివ్య మంగళ రూపాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి ‘గోవిందా.. గోవిందా’ అంటూ తన్మయత్వంతో పరవశించిపోయింది. ‘ఏ జన్మ పుణ్యమో ఈ అపురూప దర్శనం’ అంటూ భక్తులు ఆనందబాష్పాలతో అప్పన్న స్వామిని అర్చించారు. ● వైకుంఠవాసుడిగా సింహాద్రినాథుడు ● కనులపండువగా అప్పన్న ఉత్తరద్వార దర్శనం ● పరవశించిన భక్తజనం సింహాచలం: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఉత్తరద్వార దర్శనం కనులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషతల్పంపై కొలువుదీరిన స్వామి వారు, ఉత్తర రాజగోపురం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాదిలో ఒక్క రోజు, అది కూడా కేవలం కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శన భాగ్యాన్ని పొంది భక్తులు పులకించిపోయారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే వైదికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజ స్వామిని వైకుంఠవాసుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను మేలిముసుగులో ఉంచి శేషతల్పంపై అధిష్టింపజేసి ఆలయ బేడా మండపంలో తిరువీధి నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. తొలుత ఆలయ ఉత్తరద్వారం వద్ద స్వామిని ఉంచి, మేలిముసుగు తొలగించారు. సంప్రదాయం ప్రకారం పూసపాటి వంశీయులకు తొలి దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామిని ఉత్తర రాజగోపురంలో ఏర్పాటుచేసిన వేదికపైకి చేర్చారు. ఉదయం 5.10 గంటల నుంచి 11.15 గంటల వరకు భక్తులకు దర్శనాన్ని అందజేశారు. ఆ తర్వాత సింహగిరి మాడవీధిలో స్వామివారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు సాతులూరి నరసింహాచార్యులు తదితరులు పూజల్లో పాల్గొన్నారు.గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు వడ్డాది వేంకటేశ్వరస్వామి -
ఈ ఏడాది 5,821 కేసులు
సాక్షి, అనకాపల్లి: ఈ ఏడాదిలో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఆస్తి తగాదాలు, సోషల్ మీడియా వేధింపులు గణనీయంగా పెరిగాయి. గతేడాది 61 సైబర్ నేరాలు నమోదు కాగా.. ఈ ఏడాది 76 కేసులకు చేరాయి. సోషల్ మీడియా వేధింపుల కేసులు కూడా గతేడాది 19 కాగా.. ఈ ఏడాది 21 నమోదయ్యాయి. ఆస్తి సంబంధిత, ఆర్థిక నేరాలు గతేడాది 406 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 417 కేసులకు పెరిగాయి. మోసపూరిత కేసులు గతేడాది 131 కాగా.. ఈ ఏడాదిలో 125 నమోదయ్యాయి. నమ్మకద్రోహం కేసులు గతేడాది 18 కాగా.. ఈ ఏడాది 17 కేసులు నమోదయ్యాయి. మంగళవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘జిల్లా వార్షిక నేర నివేదిక–2025’ నేరాల గణాంకాలను, పోలీస్ శాఖ సాధించిన పురోగతిని ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. మొత్తంగా గతేడాది 2024లో 7,573 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,821 కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. 1880 మొబైల్ ఫోన్ల రికవరీ ఈ ఏడాదిలో జరిగిన మూడు మేళాల ద్వారా రూ.3.7 కోట్ల విలువైన 1,880 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామని ఎస్పీ తెలిపారు. 128 మాదకద్రవ్యాల(ఎన్డీపీఎస్) కేసులు, 3,627 ఇతర సాధారణ కేసులు నమోదైనట్టు చెప్పారు. 128 గంజాయి కేసుల్లో 411 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.4.41 కోట్ల విలువైన 8790.88 కిలోల గంజాయిని, 7.39 లీటర్ల హషీష్ ఆయిల్, 115 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆయా కేసుల్లో ఆరుగురు గంజాయి నిందితులపై కేసులు పిట్ ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేశామన్నారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆరుగురు వ్యక్తుల ఆస్తులు రూ.1,25,22,100ను ఫ్రీజ్ చేశామన్నారు. 312 మంది గంజాయి నేరస్తులపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసినట్టు ఎస్పీ వివరించారు. లోక్ అదాలత్ ద్వారా 16,132 కేసులను పరిష్కరించామన్నారు. గంజాయి అక్రమ రవాణా, హత్య, పోక్సో కేసుల్లో 51 శాతం.. ఒక కేసులో మరణశిక్ష, 2 కేసుల్లో జీవిత ఖైదు, మరో 2 కేసుల్లో నిందితులకు 20 ఏళ్లు జైలు శిక్ష, 10 కేసుల్లో పదేళ్ల జైలు శిక్ష, 5 కేసుల్లో ఐదేళ్లు కంటే ఎక్కువగా జైలు శిక్షలు నిందితులకు విధించేలా చార్జ్షీట్ దాఖలు చేశామన్నారు. నేర శోధనలో సాంకేతిక సాయం నేర పరిశోధనలో భాగంగా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద దహనం చేసిన మహిళా మృతదేహాన్ని గుర్తించి, 450 సీసీ కెమెరాల ఫుటేజీల ద్వా రా నిందితులను(మృతురాలి అల్లుడు, తదితరులు) 11 రోజుల్లోనే అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. కశింకోటలో ట్రాన్స్జెండర్ హత్య కేసులో నిందితుడిని కాల్ డేటా, టవర్ లోకేషన్ ఆధారంగా 24 గంటల్లోనే గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. జిల్లాలో కొత్తగా 3,573 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. సాంకేతికత సహాయంతో 41 కేసులు, వేలిముద్రల (ఏఎఫ్ఐఎస్) ద్వారా 58 కేసులు ఛేదించినట్టు చెప్పారు. 11 హత్యలు.. 291 వేధింపులు ఈ ఏడాదిలో 11 హత్యలు జరిగాయి. మహిళలపై వేధింపు కేసులు 291, మిస్సింగ్ కేసులు 316 నమోదయ్యాయి. పోక్సో కేసులు, తీవ్రమైన నేరాలు, ప్రాణహాని కలిగించే నేరాలు 417 నమోదయ్యాయి. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్రావు, డీఎస్పీలు జీఆర్ఆర్ మోహన్, ఈ.శ్రీనివాసులు, బి.మోహనరావు, ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, పరిపాలన అధికారి తిలక్బాబు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఆర్డీవో కార్యాలయప్రారంభం నేడు
ఎస్.రాయవరం: మండలంలో అడ్డురోడ్డు కేంద్రంగా సబ్ డివిజన్(ఆర్డీవో) కార్యాలయాన్ని బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ విజయ్కృష్ణన్ ప్రారంభించనున్నారు. దీనికోసం తాత్కాలికంగా తిమ్మాపురం –1 సచివాలయం భవనాన్ని ఎంపిక చేసి అధికారులు ఏర్పాట్లు చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో తిమ్మాపురం పంచాయతీ భవనంపై అదనపు సచివాలయ భవనాన్ని అన్ని హంగులతో నిర్మించారు. చంద్రబాబు ప్రభుత్వం అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం నుంచి ఇక్కడ ఆర్డీవో అందుబాటులో ఉంటారని తహసీల్దార్ రమేష్బాబు మంగళవారం తెలిపారు. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. -
నిరసన గళంపై ఆంక్షలు
నక్కపల్లి/ఎస్.రాయవరం: బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చి అండగా నిలిచిన సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ సీపీఎం నాయకులు సోమవారం తలపెట్టిన ప్రదర్శనలను పోలీసులు భగ్నం చేశారు. సామాన్యుల పక్షాన నిలిచిన అప్పలరాజుపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకు పంపడం దారుణమని నిరసన తెలపడానికి కూడా ఈ ప్రజాస్వామ్యంలో హక్కు లేదా అని ఆందోళనకారులు మండిపడ్డారు. నక్కపల్లిలో సోమవారం దుకాణాలు, విద్యాసంస్ధలు, వాణిజ్య సంస్ధలు మూసివేసి నిరసన తెలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అయితే సీపీఎం నాయకులు చేస్తున్న ఆందోళనను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలు నిరసనలకు అనుమతి లేదని చెప్పారు. వీరందర్నీ పోలీసు స్టేషన్కి తరలించి 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టినట్లు సీఐ మురళి తెలిపారు. అడ్డురోడ్డులో బంద్ నిర్వహించేందుకు వచ్చిన పలువురు సీపీఎం నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజాము నుంచి పోలీసులు అడ్డురోడ్డులో గస్తీ నిర్వహించి బంద్ జరగకుండా కాపాలా కాశారు. బంద్ నిర్వహించడానికి ముందుగా జంక్షన్కు చేరుకున్న సీపీఎం మండల బాధ్యుడు ఎం.సత్తిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వి.వెంకన్న, జిల్లా కమిటీ సభ్యుడు వి.వి.శ్రీనివాసరావులను అరెస్టు చేసి ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు మరికొంతమంది సీపీఎం నాయకులు, స్థానికులు కలిసి అడ్డురోడ్డు జంక్షన్కు వచ్చి నినాదాలు ప్రారంభించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో వ్యాను తీసుకుని వచ్చి మరికొంతమందిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. -
విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన మంత్రి లోకేష్
అనకాపల్లి : ఎన్నికల సమయంలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల కష్టాలను తీర్చడంలో విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం విద్యార్థుల సమస్యలపై బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 6400 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా నేటికీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన విద్యాశాఖ మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానం చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వరరాజు మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మటిక్ చార్జీలు పెంచాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలు, డిగ్రీ కళాశాలు, విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు రాజన్న దొరబాబు, జిల్లా కార్యదర్శి జి.ఫణీంద్ర కుమార్ పాల్గొన్నారు. -
ఆస్పత్రి ప్రాంగణంలో ఆటస్థలమా..?
నాతవరం : స్ధానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కూటమి నేతలు, అధికారులు కుమ్మకై ్క పీహెచ్సీ ప్రాంగణంలో ఆటస్థలం పనులు చేపట్టడంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని జెడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలనర్స, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు తెలిపారు. పీజీఆర్ఎస్లో సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అర్జీ అందజేసి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాతవరం పీహెచ్సీకి 1960లో దాత మూడు ఎకరాలు జిరాయితీ భూమి ఇచ్చారన్నారు. ఆ భూమిలో ఆస్పత్రి భవనాలు నిర్మించాలని దాతలు కోరారన్నారు. ఇటీవల ప్రభుత్వం ఆట స్థలం నిర్మాణం కోసం రూ.4 లక్షలు మంజూరు చేయడంతో సర్పంచ్కు, పీహెచ్సీ అభివృద్ధి కమిటీకి గానీ సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఆస్పత్రి ప్రాంగణంలో ఆట స్థలం నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు. దీనిపై ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్, మండల ప్రత్యేకాధికారి మంగవేణికి స్వయంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఆస్పత్రి స్థలంలో ఆటస్థలం నిర్మిస్తే పీహెచ్సీ అప్గ్రేడ్కు స్ధల సమస్య వస్తుందన్నారు. దీనిపై పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల శాఖ అద్యక్షుడు చెక్కా జోగిరాజు, నాతవరం మాజీ వైస్ సర్పంచ్రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకులు అపిరెడ్డి మహేష్ పాల్గొన్నారు. -
రెండేళ్ల ప్రాయంలోనే అనాథగా....
దేవరాపల్లి : మండలంలోని ముషిడిపల్లి జంక్షన్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగయ్యపేట పంచాయతీ శివారు సీతంపేట గ్రామానికి చెందిన జంజూరు అర్జున్ (35) మృతి చెందాడు. ఆనందపురం సమీపంలోని ఓ రెస్టారెంట్లో అర్జున్ చెఫ్ (కుక్)గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా వాహనం అదుపు తప్పి సమీపంలో ఉన్న గోతిలో పడిపోయా డు. అటుగా వెళ్తున్న కొందరు ప్రమాదానికి గురైన వాహనాన్ని గుర్తించి, వాహనం నెంబర్ ఆధారంగా ఆన్లైన్ చెక్ చేయగా లభించిన ఫోన్ నెంబర్కు కాల్ చేయడంతో ప్రమాద విషయం వెలుగులోకి వచ్చింది. అతని కుటుంబీకులు వెంటనే అక్కడికి చేరుకొని అర్జున్ను కె.కోటపాడు సీహెచ్సీకి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు జుంజురి అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. అనాథగా మారిన చిన్నారి సీతంపేటకు చెందిన అర్జున్కు దేవరాపల్లికి చెందిన గౌరీతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు యశ్విన్ ఉన్నాడు. ప్రసవ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన గౌరి బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల వ్యవధిలోనే మృతి చెందింది. అప్పటి నుంచి కుమారుడికి తల్లి లేని లోటు తెలియకుండా పెంచుతున్న అర్జున్ ఇపుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని రెండేళ్ల ప్రాయంలోనే భగవంతుడు తల్లిదండ్రులను దూరం చేసి, అనాఽథని చేశాడంటూ కుటుంబ సభ్యులు రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. -
పూడిమడకను విభజించాలని వినతి
అచ్చుతాపురం రూరల్ : అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీని రెండు పంచాయతీలుగా ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. 20 వేల జనాభా ఉన్న గ్రామాన్ని పూడిమడక, కడపాలెం గ్రామ పంచాయతీలుగా విభజించాలని, అత్యధిక జనాభా కారణంగా పరిపాలన భారం పెరిగి అభివృద్ధి జరగడం లేదని తెలిపారు.కడపాలెం, కొండపాలెం, ఎస్సీ కాలనీ, పళ్ళిపేట, పెద్దురు, జాలరిపాలెం గ్రామాలు ఒకే పంచాయతీలో కొనసాగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అధికారులు చొరవ తీసుకుని పుడిమడక ప్రజలకు మెరుగైన సేవల కొసం ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు. ఆర్డీఓ షేక్ ఆయిషాకు రెండు పంచాయితీలు కోరుతూ వినతిపత్రం అందజేస్తున్న పూడిమడక ప్రజలు -
అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు
బుచ్చెయ్యపేట: అంగన్వాడీ కేంద్రాల ద్వారా కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంపై పలువురు లబ్ధిదారులు ఆగ్రహం చెందుతున్నారు. బాలింతలు, గర్భిణిలు, చిన్న పిల్లల్లో రక్తహీనతను తగ్గించి వారి ఆరోగ్యం బాగుండాలని, పోషకాలు పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేస్తోంది. నాణ్యతకు దిలోదకాలిచ్చి కుళ్లిన గుడ్లను సరఫరా చేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. దిబ్బిడి–2 అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేశారు. గ్రామానికి చెందిన బాలింత పెదిరెడ్ల సునీతకు ఈనెలలో అంగన్వాడీ కేంద్రంలో అందించిన కోడిగుడ్లు సగానికిపైగా కుళ్లిపోయాయి. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన కోడిగుడ్లతో సోమవారం ఆమె ఇంట్లో ఆమ్లెట్ వేసుకోవడానికి చూడగా గుడ్లు కుళ్లిపోవడమే కాక పగలగొట్టిన గుడ్ల నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో ఆమె విస్తుపోయింది. గత మూడు దఫాలుగా అందించిన కోడిగుడ్లలో సగానికి పైగా కుళ్లినవే వస్తున్నాయని ఆమె వాపోయింది. ఇటీవల మల్లాం భూపతిపాలెంలో కూడా అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిపోయిన కోడిగుడ్లను పిల్లలకు అందించడంపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం చెందారు. -
ప్రజా సమస్యలపై మాట్లాడితే అక్రమ కేసులు
అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఎస్.రాయవరం : ప్రజా సమస్యలపై మాట్లాడేవారిపై అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిపోయిందని పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.అక్రమంగా అరెస్టు అయిన సీపీఎం అప్పలరాజు కుటుంబసభ్యులను ధర్మవరం అగ్రహారంలో సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో లా ఆర్డర్ అదుపులో లేదని, పోలీసులు, అధికారులు నాయకులు, మంత్రులు ఏం చెబితే అదే చేస్తున్నారని విమర్శించారు. బల్క్డ్రగ్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నందుకు అప్పలరాజును ఆందోళన సద్దుమణిగాక అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ప్రజాప్రయోజనాలపై ప్రశ్నించే వారిని గడిచిన 20 నెలలుగా అరెస్టులు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. తప్పుడు విధానాలతో కూటమి నేతలు ముందుకు వెళితే రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఈ పరామర్శలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు ఎస్ఏఎన్ మధువర్మ, ఉపాధ్యక్షుడు వెదుళ్ల బంగారి, యూత్ అధ్యక్షుడు నల్లపురాజు వెంకటరాజు, నాయకులు కర్రి శ్రీను, చొప్పా రాజు, పోలిశెట్టి శ్రీను, శ్రీపాదుల సూర్యనారాయణమ్మ, సుంకర సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న పాల్గొన్నారు. -
సత్వర పరిష్కారం
భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్తో తుమ్మపాల : భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పిజిఅర్ఎస్. కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి తీసుకున్న అర్జీల గూర్చి వెంటనే సంబంధిత అదికారులను వివరాలు అడిగి తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. అదేవిధంగా డివిజను, మండల, గ్రామస్థాయిలలో నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అందజేసిన ధరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి ధరఖాస్తుదారునికి తెలియజేయాలని, పరిష్కారం కాని ధరఖాస్తుల గూర్చి వారికి అందుకుగల కారణాలు వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, గడువులోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంలో మునుపెన్నడు లేనివిధంగా మొత్తం 410 అర్జీలు నమోదవ్వగా, వాటిలో 222 అర్జీలు రెవెన్యూ శాఖ పనితీరు కారణంగా పరిష్కారం కాని సమస్యలపైనే న మోదయ్యాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అఽధికారులు పాల్గోన్నారు. పంచాయతీల విభజనపై నిరసనలు పంచాయతీల విభజనపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పలు గ్రామాల ప్రజలకు అధిక సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ వద్ద చేసిన నిరసనలు ఇరువర్గాల మధ్య ఆందోళనలకు తెరతీసాయి. కశింకోట మండలం జి.భీమవరం పంచాయతీ పరిధిలో ఉన్న సింగవరం గ్రామాన్ని విభజించి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలంటూ సింగవరం గ్రామస్తులు నిరసనలు చేపట్టగా, విభజనకు వ్యతిరేకంగా పంచాయతీని కలిపే ఉంచాలంటు జి.భీమవరం గ్రామస్తులు నిరసన తెలిపారు. అంతకుముందు సింగవరం గ్రామస్తులకు మద్దతుగా వచ్చిన సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు కోన గురవయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో కూటమి ప్రభుత్వం గడిచిన 20 నెలలుగా ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిందన్నారు. రెవెన్యూ పరిధి ఉన్నప్పటికీ సింగవరం గ్రామాన్ని జి.భీమవరం పంచాయతీలో ఉంచడంతో అక్కడ పాలకులు గ్రామాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచారని, కనీసం గ్రామానికి 40 శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా ఏకపక్షంగా జి.భీమవరం గ్రామాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారని, తక్షణమే అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుచేయాలని కోరారు. గ్రామాలు వేరైన రెండు గ్రామాల ప్రజల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా కలసిమెలసి ఉన్నామని, కొందరు నాయకులు స్వార్ధం కోసం ప్రత్యేక పంచాయతీ నినాదంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఒకే పంచాయతీగా కొనసాగించాలని జి.భీమవరం గ్రామస్తులు తెలిపారు. మౌలిక వసతులు పట్టించుకోరా... రోడ్డు ఏర్పాటుతో పాటు ఇళ్ల మురుగునీరు రాకుండా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు కల్పించాలని కొత్తూరు గ్రామం శారదానగర్ 12వ వీధి వాసులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. 40 ఏళ్లుగా శాశ్వత నివాసాల్లో ఉంటున్నా పాలకులు గాని, అధికారులు గాని పారిశుధ్య నిర్వహణ, మౌలిక సౌకర్యాల కల్పనపై కనీసం పట్టించుకోవడం లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామసభల్లోను కూడా ప్రస్తావించినా పరిష్కారం దొరకడం లేదన్నారు. ఇంటిపన్నులు కట్టించుకోవడంపై ఉన్న శ్రద్ధ మంచినీరు, పారిశుధ్యంపై ఉండకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వికలాంగ పింఛను మంజూరు చేయరూ... తండ్రి శ్రీనుతో కలిసి కలెక్టరేట్కు వచ్చిన వికలాంగుడు కిమిడి శివకుమార్ మతిస్థిమితం కోల్పోయి పూర్తిగా వికలాంగుడిగా ఉన్న తన కుమారుడికి పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ నక్కపల్లి మండలం పెదదొడ్డిగుళ్ల గ్రామానికి చెందిన కిమిడి శ్రీను తన కుమారుడు కిమిడి శివకుమార్ను తీసుకుని కలెక్టరేట్లో వినతి అందించారు. 90 శాతం మాన షిక వికలాంగుడిగా ఉన్న తన కుమారుడి స్ధితిగతులను చూసైన పించన్ అవకాశం కల్పించాలని కోరారు. -
నేడు వడ్డాదిలో గిరి ప్రదక్షిణ
బుచ్చెయ్యపేట : వడ్డాది వెంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణకు తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి గిరి ప్రదక్షిణ చేయడానికి దేవస్ధానం అధికారులు, పాలక వర్గం, ఉత్సవ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. గత ఏడేళ్లుగా వడ్డాదిలో వేంకటేశ్వరస్వామి భక్తులు గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేస్తుండగా పలు గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఏడాది గిరి ప్రదక్షణ విజయవంతం చేయడానికి ముందస్తు ప్రచారం చేశారు. వేంకటేశ్వరస్వామి తొలిమెట్టు నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించి శివాలయం రోడ్డు మరిడిమాంబ పాదాలు,కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ హై స్కూల్,జూనియర్ కాలేజీల మధ్య రోడ్డు, బీఎన్ రోడ్డు, వేంకటేశ్వరస్వామి ఆర్చ్ లోపల నుంచి మూడు కిలోమీటర్లు పొడవునా గిరి ప్రదక్షిణ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. శ్రీదేవి,భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను గజ, గరుడ వాహనంపై ఉంచి ఊరేగించడానికి రథాలను సిద్ధం చేశారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు, ఈవో శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు పేరపు రమేష్,ఆడపా శ్రీనివాస్, ఇంటి గాటీలు,దొండా సాయి,పెంటకోట ప్రసాద్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు, పలువురు యువకులు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పులిహార, పండ్లు, గ్లూకోజ్ ఇతర ప్రసాదాలు అందించనున్నారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులతో పాటు సాధారణ భక్తులకు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. -
ఏపీ ఎన్జీజీవోస్ జిల్లా అధ్యక్షునిగా సూర్యనారాయణ
ఏపీ ఎన్జీజీవోఎస్ నూతన కార్యవర్గం అనకాపల్లి: ఏపీ ఎన్జీజీవోస్ జిల్లా అధ్యక్షునిగా పి.సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థా నిక గాంధీనగరం ఎస్ఆర్ శంకరన్ హాల్లో సోమవారం జరిగిన ఎన్నికల్లో అసోసియేట్ అధ్యక్షునిగా పి.దాలినాయుడు, ఉపాధ్యక్షులుగా ఎ.జె.సత్యనారాయణ, ఎం.శ్రీనివాసరావు, డి.ఆనందరావు, ఎస్.సత్యనారాయణ, రేవతి, కార్యదర్శిగా డి.శేషుకుమార్, సహాయ కార్యదర్శులుగా యు.ఎస్.వి.శ్రీనివాసరావు, సీహెచ్. బాబూరావు, డి.కొండలరావు, ఎస్.శ్రీనివాసరావు, కె. కిరణ్కుమార్రాజు, వి.చిరంజీవి, సి.సంతోష్కుమార్, పి.త్రినాథ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి.వి.రమణబాబు, కోశాధికారిగా పి.త్రినాథ్తోపాటు మరికొంతమంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. కొత్త కమిటీ మూడు సంవత్సరాలు పదవిలో ఉంటుంది. -
హాహాకారాలు
తెల్లారితే నిద్ర లేచి గమ్యం చేరుకోవచ్చు అనుకున్నారు. తమ రైలు ప్రయాణం సాఫీగా సాగిపోతుందనుకుని ధీమాగా నిద్రకు ఉపక్రమించారు. ఒక్కసారిగా పెద్ద కేకలు.. తాము ప్రయాణిస్తున్న రైల్లో మంటలు వ్యాపిస్తున్నాయని తెలుసుకున్నారు. ప్రాణాలను దక్కించుకోవడానికి నిద్రమత్తులోనే రైలు నుంచి దిగేశారు. ఈ క్రమంలో మంటలు పెరిగిపోయాయి. దిగేలోపు ఒక వృద్ధుడు అగ్నికీలలకు బలైపోయాడు. మిగిలిన వారంతా పెను ప్రమాదం నుంచి రెప్పపాటులో బయటపడ్డారు. అర్ధరాత్రి వేళ యలమంచిలి రైల్వేస్టేషన్ ప్రయాణికుల హాహాకారాలతో ప్రతిధ్వనించింది. అర్ధరాత్రి ● టాటానగర్–ఎర్నాకుళం రైలులో అగ్ని ప్రమాదం ● యలమంచిలి స్టేషన్లో దగ్ధమైన రెండు కోచ్లు.. వృద్ధుడు మృతి ● అప్రమత్తతతో తప్పిన భారీ ప్రమాదం ● ఘటనకు కారణాలపై రాని స్పష్టత ● పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న రైల్వే అధికారులు మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మంటల్లో బోగీలు (ఇన్సెట్) కాలిపోయిన ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కోచ్లుయలమంచిలి రూరల్: యలమంచిలి స్టేషన్లో ఆగి ఉండగా మంటలు చెలరేగడం.. లోకో పైలెట్లు వెంటనే అప్రమత్తంగా కావడం.. ఒక ప్రయాణికుడు చెయిన్ లాగడంతో ఘోర రైలు ప్రమాదం తప్పింది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న (18189) ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు క్షణకాలంలో స్పందించడం వల్ల ఒక్కరు తప్ప పెనుప్రమాదం నుంచి ప్రయాణికులంతా బయటపడ్డారు. మంటలు చుట్టుముట్టడంతో ఈ ట్రైన్లోని రెండు కోచ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ట్రైన్ ఆదివారం అర్ధరాత్రి 12–45 గంటలకు యలమంచిలి రైల్వేస్టేషన్కు చేరుకుంది. వాస్తవానికి ఇక్కడ ఆ ట్రైన్కు హాల్టు లేదు. ఈ రైల్వేస్టేషన్లో లోకో పైలట్ల విశ్రాంతి గది వుండడంతో ఒక పైలట్ను దింపడానికి ట్రైన్ ఆపినట్టు రైల్వే సిబ్బంది చెప్పారు. ఆ తరువాత కాసేపటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రైలు ముందుకు కదల్లేదు. ప్రెజర్ డౌన్ అయిపోయి కదల్లేదని గుర్తించారు. ఏమైందోనని డ్యూటీలో ఉన్న లోకో పైలట్ కిందకి దిగి పరిశీలిస్తుండగా బీ1, ఎం2 ఏసీ కోచ్ల నుంచి పొగలు రావడం కన్పించాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెన్సార్లు ఉంటాయని, వాటివల్ల రైలు కదలదని స్టేషన్ సూపరింటెండెంట్ ఆకుల సురేష్ కుమార్ చెప్పారు. ఈ ప్రమాదంలో బీ1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అగ్నికి ఆహుతయ్యారు. ప్రాణభీతితో పరుగులు.. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో మొదట బీ1 ఏసీ కోచ్లో మంటలు చెలరేగినట్టు రైల్వే అధికారులు గుర్తించారు. తర్వాత పక్కనే ఉన్న ఎం2 బోగీకి కూడా మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన బోగీలోని ప్రయాణికులు నిద్రలో ఉన్న మిగతా ప్రయాణికులను అప్రమత్తం చేశారు. లగేజీని తీసుకుని కొందరు, వదిలిపెట్టి మరికొందరు ప్రాణభీతితో బయటకు పరుగులు తీశారు. అనంతరం క్షణాల్లో రెండు బోగీలకు మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. రైల్వే స్టేషన్లో పాయింట్స్మెన్ అగ్ని ప్రమాదాన్ని నివారించే పరికరాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో యలమంచిలి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయలేదని రైల్వేస్టేషన్ సిబ్బంది తెలిపారు. రైల్వే ఎస్ఎస్ ఆకుల సురేష్కుమార్ నేరుగా ఫైర్ స్టేషన్కు వెళ్లి కబురు చెప్పారు. వెంటనే అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పక్కనున్న ఎం1కు మంటలు వ్యాపించకుండా రైల్వే సాంకేతిక సిబ్బంది కోచ్ను వేరు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల బృందం, ఉన్నతాధికారుల పరిశీలన ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని నిర్ధారించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. విశాఖ రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల బృందం ప్రమాదంలో కాలిపోయిన రెండు బోగీలను పరిశీలించింది. ప్రమాద కారణాలకు సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. ప్రమాద స్థలాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ, విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు, రైల్వే ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు. సహాయక చర్యలు, ప్రమాదం జరిగిన తీరు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీ1 బోగీలో 76, ఎం2లో 82 మంది మొత్తం 158 మంది ప్రయాణికులున్నట్టు గుర్తించారు. వీరిలో బీ1 బోగీలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) బెర్త్ వద్ద బెడ్రోల్స్ ఉన్నచోట నుంచే మంటలు మొదట వ్యాపించినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్లనా, మానవ తప్పిదం కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది తేలాల్సివుందని డీఐజీ సత్య ఏసుబాబు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు డీఆర్ఎం వెల్లడించారు. ప్రమాదంపై రైల్వేశాఖ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ట్రైను ఏసీ కోచ్ల్లో సీసీ కెమెరాలు అమర్చారు. సీసీ కెమెరాల ఫుటేజీ లభ్యమైతే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జిల్లా పోలీసు, రైల్వే అధికారుల తక్షణ స్పందనతో టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాద తీవ్రత తగ్గిందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అందరూ సకాలంలో త్వరితగతిన స్పందించడం వలన మంటలు ఇంకా వ్యాప్తి చెందకుండా చూశామని సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ ఆగ్రహం విషయం తెలిసిన వెంటనే సోమవారం ఉదయం కలెక్టర్ విజయ్ కృష్ణన్ యలమంచిలి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన రైలు బోగీలను పరిశీలించారు. ప్రమాద కారణాలను లోకో పైలెట్లను అడిగి తెలుసుకున్నారు. రైలులో మిగతా బోగీల్లో ఉన్న ప్రయాణికులను ఎవరూ పట్టించుకోకపోవడంపై కలెక్టర్ స్థానిక రెవెన్యూ, పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ ఇంతటి ప్రమాదం జరిగి గంటల తరబడి నిరీక్షించిన ప్రయాణికులు, వాళ్లతో ఉన్న పిల్లలకు పాలు, నీరు ఇవ్వడం తెలియదా? అంటూ రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. తమకు సమాచారం ఆలస్యంగా తెలిసిందని వారు చెప్పగా, అక్కడ ఉన్న స్థానిక పోలీస్ అధికారులపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ప్రమాదం జరిగితే మా వాళ్లకి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా.. అని ప్రశ్నించారు. రెవెన్యూకు తెలియకుండా పనిచేసుకుపోతారా? అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేస్తానని హెచ్చరించారు. కేసు నమోదు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాద ఘటనపై తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. యలమంచిలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఆకుల సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తుని ప్రభుత్వ రైల్వేపోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావు చెప్పారు. వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియాకాలి బూడిదైన కోచ్ను పరిశీలిస్తున్న క్లూస్ టీం సభ్యుడుచివరిగా భార్యకు ఫోన్.. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు చంద్రశేఖర్ సుందర్ చనిపోయినట్టు మొదట యలమంచిలి సీఐ ధనుంజయరావు గుర్తించారు. అతను మరణానికి కొద్ది నిమిషాల ముందు తన భార్యకు ఫోన్ చేసి, రైలులో ఏదో ప్రమాదం జరుగుతోందని, భయమేస్తోందని, వెంటనే కుమార్తె, అల్లుడిని పంపించాలని కోరాడు. అంతలోనే ఫోన్ సంభాషణ ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో మంటలు అతన్ని బలి తీసుకున్నాయి. బయటకు రాలేక ప్రయాణిస్తున్న బోగీలోనే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. తాము కారులో వస్తామని చెప్పి తండ్రిని విజయవాడ వెళ్లేందుకు రైలెక్కించామని మృతుని కుమార్తె, అల్లుడు పోలీసులకు చెప్పారు. రైల్వేస్టేషన్లో విగత జీవిగా ఉన్న చంద్రశేఖర్ సుందర్ను చూసి వారు గుండెలవిసేలా రోదించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించామని యలమంచిలి తహసీల్దార్ వరహాలు చెప్పారు. మృతుడు చంద్రశేఖర్ సుందర్ తనతో తీసుకెళ్లిన బ్యాగులో రూ.6.50 లక్షలు నగదు, బంగారం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిలో కొన్ని నోట్లు కాలిపోయినట్టు గుర్తించారు. వాటిని రైల్వే పోలీసులు స్వాధీనపర్చుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ శివయ్యే కాపాడాడు నేను వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ఆదివారం మధ్యాహ్నం టాటాలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఈ ట్రైన్ అర్ధరాత్రి యలమంచిలి రైల్వేస్టేషన్ చేరుకునేసరికి పెద్ద పెద్ద మంటలు, పొగలు వ్యాపించాయి. ఏదో ప్రమాదం జరుగుతుందని భావించి నేను నా లగేజీతో బయటకు వచ్చేశాను. గాఢనిద్రలో వుండగా ఈ ప్రమాదం జరిగినప్పటికీ సురక్షితంగా బయటపడ్డాం. –రామకృష్ణన్, ప్రయాణికుడు చాలా అదృష్టం నేను టాటా–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్లో విశాఖ నుంచి బయల్దేరాను. రైలు ఎక్కిన గంట లోపే మేమున్న ఎం2 కోచ్లో పొగ వ్యాపించింది. నాకు ఇంకా నిద్రపట్టకపోవడంతో చూసే సరికి బీ1 కోచ్లో మంటలు వ్యాపించాయి. దీంతో మా బోగీలో వున్న ప్రయాణికులందరినీ పెద్ద కేకలు పెట్టి నిద్రలేపాను. దీంతో అందరూ సురక్షితంగా బయట పడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడం మా అదృష్టమే. –సూర్యప్రకాష్, దువ్వాడ -
సాంకేతిక ప్రమాదమా? బీడీ కాల్చడం వల్లా?
టాటానగర్–ఎర్నాకుళం రైలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రైల్వే పోలీసులు సమగ్ర దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. ఇది సాంకేతిక లోపంతో జరిగిందా? లేదా మానవ తప్పిదమా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో స్థానిక పాయింట్స్మెన్ ఏసీ కోచ్ల్లో వుండే ప్యానెల్బోర్డుల నుంచి పవర్ సప్లయి రాకుండా ఎంసీపీని ఆపేశారు. సాధారణంగా ప్యానెల్బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని రైల్వేశాఖ సాంకేతిక సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదానికి గురైన ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ బోగీల్లో ప్యానెల్ బోర్డులు భద్రంగానే ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అయితే బీ1 కోచ్లో ప్రయాణికుడు బీడీ కాల్చినట్టు గుర్తించిన రైల్వే పోలీసులు అతడ్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బీడీ లేదా సిగరెట్లు వెలిగించడానికి ఉపయోగించిన అగ్గి పుల్ల పడేయడం వలన అక్కడున్న నైలాన్ దుప్పట్లు, ఉన్ని రగ్గులు, ఇతర వస్త్రాలకు నిప్పంటుకుని అగ్నికీలలు వ్యాపించాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదానికి గురైన బోగీల్లో టాయిలెట్లలో కాల్చిపడేసిన సిగరెట్టు ముక్కలు ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగా ఏమైనా మంటలు వ్యాపించాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ బాలిక ఆత్మహత్య
కోటవురట్ల : రాట్నాలపాలేనికి చెందిన ఇంటర్ విద్యార్థిని మున్నూరు మౌనిక (17) ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తల్లి అచ్చియ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలివి. మౌనిక ఆదివారం ఉదయం పుస్తకాలు కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లింది. కొంత సేపటికి చర్చి దగ్గర ఉన్నాను వచ్చేస్తాను అని తల్లికి ఫోన్లో చెప్పింది. దాంతో కుమారుడు శశికుమార్ను చర్చి దగ్గరకు వెళ్లి చెల్లిని తీసుకురమ్మని పంపించింది. శశికుమార్ వెళ్లే సరికి మౌనిక కోటవురట్లలోని టెంట్ హౌస్ వద్ద అక్కడ పనిచేస్తున్న కుమార్ అనే యువకుడితో గొడవ పడడం చూశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన మౌనిక రాత్రి 6.30 గంటల ప్రాంతంలో తలుపులు వేసుకుంది. అనుమానం వచ్చి శశికుమార్ కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వెంటనే సీహెచ్సీకి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లి అచ్చియ్యమ్మ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఘటనా స్థలం పరిశీలించగా సూసైడ్ నోట్ను గుర్తించారు. అందులో మౌనిక తాను లోకేష్ అనే యువకుడిని ప్రేమించానని, అదే సమయంలో పందూరుకు చెందిన మరో యువకుడు కుమార్తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారడంతో ఈ విషయం తెలిసిన లోకేష్ తనతో మాట్లాడడం మానేశాడని పేర్కొంది. లోకేష్ మాట్లాడకపోవడాన్ని తట్టుకోలేక తన వల్ల తల్లిదండ్రులకు అవమానం జరగకూడదనే ఉద్దేశ్యంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు నోట్లో పేర్కొంది. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
100 రోజుల ప్రణాళికపై ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణ తగదు
అనకాపల్లి : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికను పర్యవేక్షించే పనిని విద్యాశాఖతో సంబంధం లేని ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు అప్పగించడం అభ్యంతరకరమని యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయ వర్గాన్ని అవమానించడమేని అన్నారు. సెలవు రోజుల్లో కూడా పనిచేయాలనే నిబంధన పెట్టి, పండగ సెలవుల్లో ఈ ప్రణాళికను అమలు చేయమనడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రణాళిక అమలు చేస్తున్నప్పటికీ సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో ఒక స్లిప్ టెస్ట్ నిర్వహించి 24 గంటల్లో ఆ పరీక్ష పేపర్లను దిద్ది ఆన్లైన్లో మార్కులు అప్లోడ్ చేయమనడం విద్యార్థులు, ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తుందని తెలిపారు. -
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నికీలలు
సాక్షి, అనకాపల్లి/సామర్లకోట: ఎర్నాకుళం వీక్లీ ఎక్స్ప్రెస్లో ఆదివారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జార్ఖండ్లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ (రైలు నంబర్–18189)లో అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో బీ–1, ఎం–2 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. పొగ విపరీతంగా కమ్ముకోవడంతో బీ–1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ (70) అనే వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయి.. అగ్నికీలల్లో సజీవ దహనమయ్యాడు.ఈ ఘటనతో యలమంచిలి రైల్వేస్టేషన్లో రెండు గంటలపాటు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి నుంచి అగి్నమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈలోపు లోకో పైలట్లు కాలిపోతున్న రెండు బోగీలను వేరుచేసి మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. పరుగులు తీసిన ప్రయాణికులు మంటలు చెలరేగిన రెండు ఏసీ బోగీల్లోని ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి యలమంచిలి రైల్వే స్టేషన్లోకి పరుగులు తీశారు. లగేజీలను కూడా వదిలేసి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సజీవ దహనమైన ఒక్కరు మినహా అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు బోగీలతోపాటు ఎం–2 బోగీని కూడా తప్పించి ఉదయం 7 గంటలకు రైలు బయల్దేరింది. ఆ బోగీల నుంచి దింపేసిన సుమారు 125 మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్కు తరలించారు. అక్కడ మూడు కొత్త బోగీలు అటాచ్ చేసి ప్రయాణికులను అదే రైలులో వారి గమ్యస్థానాలకు పంపించారు. రైలు కదలికలో తేడా రావడంతో.. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో నర్సింగిబిల్లి–యలమంచిలి స్టేషన్ల మధ్య బ్రేకుల్లో తలెత్తిన లోపాల కారణంగా.. ఏసీ బోగీలో అర్ధరాత్రి సమయంలో పొగ రావడం మొదలైంది. ఆ తరువాత కొద్దిసేపట్లోనే యలమంచిలి స్టేషన్కు రైలు చేరుకుంది. వాస్తవానికి ఇక్కడ ఆ ట్రైన్కు హాల్టు లేదు. ఈ రైల్వేస్టేషన్లో లోకో పైలట్ల విశ్రాంతి గది ఉండటంతో ఒక పైలట్ను దించేందుకు రైలును ఆపినట్టు రైల్వే సిబ్బంది చెప్పారు. ముందుగా రైలు వేగాన్ని తగ్గించి.. స్టేషన్కు రాగానే బ్రేక్ వేశారు. ఆ సమయంలో బ్రేకుల్లో లోపాలున్నట్టు అర్థమైంది. బ్రేక్లు పట్టేయడం, రైలు కదలికలో తేడాను పైలట్లు గమనించారు.దిగి చెక్ చేయాలని భావిస్తున్న సమయంలోనే.. ప్రయాణికులు చైన్ లాగిన సంకేతాలు వచ్చాయి. దీంతో లోకో పైలట్లు వేగంగా చైన్ లాగిన బోగీలవైపు పరుగులు తీశారు. బోగీల్లో మంటలు మొదలవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ.. ప్లాట్ఫామ్ పైకి దిగి పరుగులు తీశారు. యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలపడంతో ప్రయాణికులు తొందరగా సులువుగా ప్లాట్ఫామ్పైకి దిగగలిగారు. ఫైర్ ఇంజిన్లు త్వరితగతిన చేరుకోగలిగాయి. అక్కడ రైల్వే పోలీసు సిబ్బంది కూడా ఉండటం వల్ల వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టగలిగారు. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు.మృతుడి బ్యాగ్లో నగదు, బంగారం గుర్తింపు ప్రమాదంలో మృతి చెందిన చంద్రశేఖర్ సుందర్ బ్యాగులో నగదు, బంగారం ఉన్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగును తెరిచి చూడగా.. అందులో రూ.6.50 లక్షల నగదు, బంగారం ఉంది. చాలావరకు నోట్ల కట్టలు కాలిపోయి ఉన్నాయి. మృతుడు విజయవాడలో హోల్సేల్ వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. విజయనగరంలో ఒక వస్త్ర దుకాణం నుంచి డబ్బు వసూలు చేసుకుని విజయవాడ వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. మృతుడి బ్యాగ్లో దొరికిన రూ.6.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలను అతడి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. బ్రేకులు పట్టేయడమే కారణమా? ప్రమాదానికి కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. బ్రేకుల ఫెయిల్యూరే కారణమా లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. ప్రమాద స్థలాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ, విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు, రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు.డీఆర్ఎం మోహిత్ మాట్లాడుతూ.. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని.. బోగీల్లో ఉన్న దుప్పట్లు అంటుకుని మంటలు శరవేగంగా వ్యాపించాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబానికి రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవిని విచారణాధికారిగా నియమించారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి రెండు బోగీలు పూర్తిగా దగ్ధమై ఒక ప్రయాణికుడు మృతిచెందడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. సీట్ల కింద నుంచి మంటలొచ్చాయిఎర్నాకుళం ఎక్స్ప్రెస్ బీ–1 బోగీలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు అనకాపల్లిలో ఎక్కాను. రైలు యలమంచిలి చేరుకుంటున్న సమయంలో పైబెర్తులోని ప్రయాణికుడు టాయిలెట్కు వెళ్లూ బోగీలోని సీట్ల కింద నుంచి మంటలు వస్తున్న విషయాన్ని గమనించి నాకు చెప్పాడు. ఆయన, నేను కేకలు వేస్తూ బోగీలోని ప్రయాణికులను నిద్రలేపి చైన్ లాగాం. అప్పటికే రైలు యలమంచిలి స్టేషన్కు వచ్చి ఆగింది.వెంటనే ప్రయాణికులు రైలులోంచి ప్రాణభయంతో దిగేశారు. అదే సమయంలో సమీపంలోని ఎం–2 బోగీకి కూడా మంటలు వ్యాపించాయి. యలమంచిలి రైల్వేస్టేషన్ ఆవరణ అంతా పొగతో నిండిపోయిది. ప్రమాదం జరిగిన బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట తీసుకు వచ్చారు. చాలామంది తమ లగేజీలను అక్కడే వదిలేసి ఇక్కడకు వచ్చారు. –నాగేంద్ర, ప్రత్యక్ష సాక్షి -
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో విజయవాడకు చెందిన ప్రయాణికుడు మృతి చెందడంపైనా విచారం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడం దిగ్భ్రాంతి కలిగించింది. ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందడం బాధాకరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాదంలో ఎవరైనా గాయపడి ఉంటే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ఒక ప్రకటనలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. టాటానగర్(జార్ఖండ్)-ఎర్నాకుళం(కేరళ) మధ్య నడిచే ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలులోని ఓ బోగీలో మంటలు చెలరేగి.. మరో బోగికి అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రయాణికుల్లో విజయవాడకు చెందిన చంద్రశేఖర్(70) అనే వృద్ధుడు సజీవ దహనం అయ్యారు. లోకో పైలట్ సమయస్ఫూర్తితో మిగతా ప్రయాణికులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. -
అలరించిన నాటికలు
అనకాపల్లి: నేటి యువతరానికి ఆసక్తిపెంచే విధంగా నాటికలను ప్రదర్శించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక జార్జిక్లబ్ ఆవరణలో హైదరాబాద్ మహతి క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకోత్సవాలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. గతంలో గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించే సమయంలో ప్రదర్శించిన నాటకాలను అక్కడ ప్రజలు ఎంతగానో తిలకించేవారని చెప్పారు. యువ తరానికి నాటకాలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మొదటి నాటిక ‘సమయం’ గుంటూరు అభినయ్ ఆర్ట్స్ ప్రదర్శించిన సమయం నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. దానిని అనుకూలంగా మార్చుకుంటే సామాన్యుడు రాజవుతాడు.. రాజు కుబేరుడవుతాడు. కానీ అదే సమయాన్ని మర్చిపోయి పరుగెడితే అందమైన జీవితానికి అర్థం లేకుండా పోతుంది. సమయాన్ని వదిలేస్తే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో దీనిలో వివరించారు. ఈ నాటికను స్నిగ్థ రచించగా, ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. ‘నువ్వో సగం–నేనో సగం’... హైదరాబాద్, మల్లీశ్వరి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘నువ్వోసగనం–నేనోసగం’ నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. నాటిక సారాంశం....సీ్త్రకి ఆర్థిక స్వాతంత్య్రం కావాలి మగవారితో సమాన హక్కులు కల్పించాలి కానీ ఏదైనా సగం..సగం.. నువ్వెంతో నేనూ అంతే అన్న ధోరణిలో ఉండే సంసారం సవ్వంగా నడవదు... కష్టాల్లో సుఖాల్లో, కలిమిలో లేమిలో కలిసిమెలిసి జీవించేదే నిజమైన దాంపత్యం అన్ని తెలియజేసేదే ‘నువ్వో సగం–నేనోసగం’ నాటిక.. దీనికి పొలిమేట్ల సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జార్టీక్లబ్ అధ్యక్షుడు బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు, కార్యదర్శి బుద్ధ కాశీవిశ్వేశ్వరరావు, కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్, నాటకోత్సవాల కన్వీనర్ కె.ఎం.నాయుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మిగిలిన మూడు మండలాలను ‘అనకాపల్లి’లోనే కొనసాగించాలి
వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త ప్రసాద్ మునగపాక: ప్రజల నిరసనకు తలొగ్గి మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని, అయితే నియోజకవర్గంలో మిగతా మూడు మండలాలను కూడా ఈ డివిజన్లోనే ఉంచాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కాకుండా నక్కపల్లి కొత్త డివిజన్లో కలిపేలా జీవో జారీ చేయడంతో రైతులతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో కలిసి పలు ఉద్యమాలు చేపట్టిన ఫలితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మిగిలిన మూడు మండలాలను కూడా అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించేలా చూడాలని కోరారు. -
జిల్లా వీఆర్వోల సంఘం కార్యవర్గం
నూతనంగా ఎన్నికై న గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు అనకాపల్లి టౌన్/కె.కోటపాడు: జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అమిరపు శశిధర్, ఉపాధ్యక్షుడిగా పూడి సురేష్, ప్రధాన కార్యదర్శిగా ఈరెళ్ళ శివ శంకర్, అసోసియేట్ అధ్యక్షుడిగా వేవాడ చిన్నం నాయుడు, కోశాధికారిగా ఆశ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శంకర్, బి.శ్రీనివాసరావు, డి.రాజేష్, పలివెల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
నూతన వేతన సవరణ సంఘాన్ని నియమించాలి
అనకాపల్లి టౌన్: రాష్ట్రప్రభుత్వం నూతన వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను నియమించాలని, ఐఆర్ మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాఽథ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులను టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి మినహాయించాలని, డీఏ, ఇతర బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. సంఘం సీనియర్ నేత బి.వెంకటపతి రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, బోధనేతర పనులు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. విద్యా శాఖపై ఇతర శాఖల అధికారుల పెత్తనం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వి.వి.ఎ. ధర్మారావు, ఎస్.దుర్గా ప్రసాద్, మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, సన్యాసినాయుడు, కొణతాల గణేష్, నూకేష్, బాపునాయుడు, నరసయ్య నాయుడు, కన్నారావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్ బాధితుడికి రూ.1.02 లక్షల సాయం
అచ్యుతాపురం రూరల్: ఆపదలో ఉన్న వారికి అచ్యుతాపురం హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందజేస్తోంది. విద్యుత్షాక్కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇందిరమ్మ కాలనీకి చెందిన నవీన్కు ఆ సంస్థ సభ్యులు అండగా నిలిచారు. ఆదివారం రూ.1.02 లక్షలు అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వీలుగా తమకు విరాళాలు అందజేస్తున్న వారికి సంస్థ అధ్యక్షుడు రెడ్డి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్స్ నాయుడు, రెడ్డి చిరంజీవి, రాజాన అశోక్, డాక్టర్ సుధీర్, డాక్టర్ వెంకట్, సురేష్, గొర్లి వెంకటేష్, కొల్లి నాయుడు, పిడి శివాజీ, ధర్మిరెడ్డి శ్రీనివాస్, లాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
హోం మంత్రి కోసమే అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్
యలమంచిలి రూరల్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల వ్యయప్రయాసలు తగ్గించేలా అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో ఉన్న యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను సమీపంలో ఉన్న అనకాపల్లి డివిజన్లో కలిపారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. ప్రజలెవరి నుంచీ ఎలాంటి అ భ్యంతరాలు లేకుండా ప్రక్రియ చేపట్టామని, కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆదివారం యలమంచిలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నక్కపల్లిలో కాకుండా అడ్డురోడ్డులో కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అడ్డురోడ్డు మండల కేంద్రం గానీ గ్రామ పంచాయతీ గానీ కాదన్నారు. రైల్వేస్టేషన్, న్యాయస్థానాలు, 200 పరిశ్రమలు యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నాయన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న చోట కాదని కొత్త డివిజన్ను అడ్డురోడ్డులో ఏర్పాటు చేయడానికి కారణం హోం మంత్రి అనిత ను సంతృప్తి పరచడం కోసమేనన్నారు. ప్రజల మనోభావాలకు విలువ లేదా? యలమంచిలి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని యలమంచిలి మున్సిపల్ కౌన్సిల్, పలు గ్రామ పంచాయతీల పాలకవర్గాలు తీర్మానాలు చేశాయని, పలు వర్గాల ప్రజలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు ఇచ్చారని ధర్మశ్రీ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్రకు లేఖ ఇచ్చారని, తీర్మా నం చేశారని అయినా చంద్రబాబు ప్రభుత్వం ప్ర జాభీష్టాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మాటకు విలువ లేదని, అనకాపల్లి ఎంపీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియడంలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయ మని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యలమంచిలి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ధర్మ శ్రీ చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రెపు గుప్తా, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దపు ఎర్రయ్యదొర, అచ్యుతాపురం, రాంబిల్లి వైఎస్సార్సీపీ నాయకులు కోన బుజ్జి, గొట్టుముక్కల శ్రీనుబాబు మాట్లాడారు. రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వర్రావు, పిల్లా త్రినాథరావు, వార్డు కౌన్సిలర్లు గొర్లి వెంకట్, దూది నర్శింహమూర్తి, పిట్టా సత్తిబాబు, రాపేటి సంతోష్, ఈరిగిల గణేష్, కోరుమిల్లి శ్రీను, ద్వారపురెడ్డి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాభీష్టాన్ని పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం యలమంచిలి ఎమ్మెల్యే, ఎంపీ ఏం చేస్తున్నారు? అడ్డురోడ్డు కనీసం పంచాయతీ కూడా కాదు ప్రభుత్వ నిర్ణయంపై నిప్పులు చెరిగిన కరణం ధర్మశ్రీ -
నేటి నుంచి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్
మురళీనగర్: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విశాఖ ప్రాంతీయ స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమ వా రం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ తెలిపారు. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు సిద్ధం చేశామన్నారు. కాగా.. ఇండోర్ గేమ్స్(టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్)ను గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తామని తెలిపారు. బాలబాలికలకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, బాలికల విభాగంలో చెస్, ఖోఖో, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాలుర విభాగంలో కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ పోటీలు జరుగుతాయని వివరించారు. -
నాలుగు నెలల పసికందు మృతి
● వైద్యుడి నిర్లక్షమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ ● వైద్య సేవల లోపం లేదని డాక్టర్ వివరణనర్సీపట్నం: వైద్యుడి నిర్లక్ష్యం వల్లనే తమ నాలుగు నెలల బిడ్డ మరణించాడని చింతపల్లి మండలం తాజంగి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు పాంగి చంద్రమ్మ, పూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ రెండు రోజులుగా జ్వరం, వాంతులతో బాధ పడుతుండడంతో నర్సీపట్నంలోని వినాయక చిల్డ్రన్ హాస్పటల్కు తీసుకువచ్చామని వారు తెలిపారు. హాస్పటల్కు తీసుకురాగానే డాక్టర్ అయ్యప్ప ఆదేశాల మేరకు సిబ్బంది బాబుకు ఇంజక్షన్ ఇచ్చారని, టెస్ట్లు చేయించుకురమ్మని దినేష్ మెడికల్ ల్యాబ్కు పంపించారని చెప్పారు. బాబును ల్యాబ్ తీసుకువెళ్లామని, రక్తం తీస్తుండగా ఏడ్చి ఏడ్చి మృతి చెందాడని, సకాలంలో వైద్యం అందక తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డాక్టర్ అయ్యప్పను వివరణ కోరగా వ్యాధి నిర్ధారణ కోసం బాబుకు టెస్టులు చేయించమని దినేష్ మెడికల్ ల్యాబ్కు పంపించామని, వచ్చే లోగానే బాబు మరణించటం బాధాకరమని డాక్డర్ తెలిపారు. బాబు బంధువులు తనపై ఆరోపణలు చేయటం వల్ల పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చేశానని తెలిపారు. -
ముక్కోటి దేవతలు ఒక్కటయ్యేవేళ..
● రేపే వైకుంఠ ఏకాదశి ● ఉపమాకలో ఘనంగా ఏర్పాట్లు విద్యుత్ కాంతులీనుతున్న ఉపమాకలోని స్వామివారి ఆలయంనక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాకలో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని ఈనెల 30వ తేదీ మంగళవారం నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. మూడు కోట్ల మంది దేవతలకు రాక్షస బాధల నుంచి విముక్తి కల్పించిన రోజు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పర్వదినం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు ఇక్కడ ఉదయం 3 గంటలకు తొలి అభిషేకం చేస్తారు. ముక్కోటి ఏకాదశినాడు సాయంత్రం స్వామివారిని రంగనాథుడిగా అలంకరిస్తారు. శ్రీదేవి, భూదేవి కాళ్లు వత్తుతున్నట్లుగా అలంకరించి పుణ్యకోటి వాహనంపై వేంచేయింపజేస్తారు. ఉపమాకలో అనునిత్యం ఉత్తరద్వార దర్శనమే వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. తద్వారా ముక్తికి మార్గం సుగమమయిందని భక్తులు భావిస్తారు. తిరుపతి, సింహాచలనం, అన్నవరం, భద్రాచలం తదితర వైష్ణవ క్షేత్రాల్లో ముక్కోటి ఏకాదశినాడే ఉత్తరద్వార దర్శనం కల్పిస్తే.. ఉపమాకలో అనునిత్యం ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. ఇక్కడ గరుడాద్రి పర్వతంపై స్వామివారు కల్కి అవతారంలో స్వయంవ్యక్తమై షఢ్భుజాలతో అశ్వారూఢుడై వెలిశారు. 8 వాహనాల్లో తిరువీధి సేవలు ముక్కోటి ఏకాదశినాడు ఎక్కడా లేని విధంగా ఉపమాక పుణ్యక్షేత్రంలో ఎనిమిది వాహనాల్లో తిరువీధి సేవలు నిర్వహిస్తారు. రాజాధిరాజ వాహనంలో గోదాదేవి అమ్మవారిని పొన్న వాహనంలో, రుక్మిణి సహిత వేణుగోపాలస్వామిని ఆంజనేయ వాహనంపై, సీతారాములను పల్లకిపై, ఇతర వాహనాలపై బాలరాముడు, తాండవ కృష్ణుడు, ప్రాకార పెరుమాళ్లను ఉంచి తిరువీధి సేవలు నిర్వహిస్తారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని, గోపురాలను సర్వాంగ సుందరంగా పూలమాలలతో అలంకరించారు. విద్యుద్దీపాలంకరణ చేశారు. బేడా మండపం, మహాద్వారం, ధ్వజస్తంభాల వద్ద పూలాలంకరణ చేసి పెంటార్లు, షామియానాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి స్వామివారి దర్శనాలు కల్పిస్తామని, సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవలు జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. సింహగిరి సిద్ధం సింహాచలం: ఆధ్యాత్మిక క్షేత్రం సింహాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుక లకు సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించనున్నారు. పోలీసు, జీవీఎంసీ, వైద్యారోగ్య, విద్యుత్ శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత వెల్లడించారు. వైదిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే ఆలయంలో సుప్రభాత సేవ, ఆరాధ న వంటి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై వేంజేంపు చేస్తారు. తెల్లవారుజాము న 5 గంటలకు ఉత్తర ద్వారం వద్ద మేలిముసుగు తొలగించి దర్శనాలకు అనుమతిస్తారు. -
వరి పంటతో ట్రాక్టర్ దగ్ధం
● రూ.1.20 లక్షల నష్టం బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాదిలో వరి పంటతో ఉన్న ట్రాక్టర్ దగ్ధమైంది. గ్రామానికి చెందిన బొబ్బాది రాజు తన పొలంలో సాగు చేసిన వరి చేనును నాలుగు రోజుల కిందట కోశాడు. ఆదివారం దానిని ట్రాక్టర్లో లోడ్చేసి, పాక దగ్గరకు తీకొస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వరి పంటతో పాటు ట్రాక్టర్ తొట్టె దగ్ధమైంది. సమీపంలో ఉన్న రైతులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో బొబ్బాది రాజుకు చెందిన ఎకరా వరి పంటతో పాటు విజయరామరాజుపేటకు చెందిన కాశీనాయుడు ట్రాక్టర్ తొట్టె కాలిపోయి, రూ.1.20 లక్షల నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటంతా కాలిపోవడంతో ఏడాది తిండి గింజలు దక్కని పరిస్థితి ఏర్పడిందని బాధిత రైతు రాజు వాపోయాడు. -
విగతజీవులుగా సముద్ర జీవరాశులు
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట తీరంలో ఆదివారం విషాదకర దృశ్యం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో సముద్ర జీవరాశులు విగతజీవులుగా మారి అలల తాకిడికి తీరానికి కొట్టుకువచ్చాయి. వీటిలో ప్రధానంగా కటిల్ఫిష్లతో పాటు తాబేళ్లు, ముళ్లకప్ప చేపల కళేబరాలు బీచ్ అంతటా పడి ఉండటం స్థానికులను కలచివేసింది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, సముద్ర జలాల్లో పెరుగుతున్న కాలుష్యం, మత్స్యకారుల బోట్లు బలంగా తగిలినప్పుడు ఇలాంటి మరణాలు సంభవిస్తాయని తీరప్రాంత మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. అరుదైన సముద్ర జీవులు ఇలా ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు చేరుతుండటం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. -
క్లిక్..ఆర్డర్
స్మార్ట్ షాపింగ్లో స్టైల్దే అగ్రస్థానం సాక్షి, విశాఖపట్నం: ఫంక్షన్కి వెళ్లాలి.. శారీకి మ్యాచింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ లేదు.. ఏం పర్లేదు.. వెంటనే ఆర్డర్ పెట్టేయ్! కొత్త హ్యాండ్ బ్యాగ్ కొనాలి.. ఆన్లైన్లో చూసేద్దాం.. జిమ్కు వెళ్లే సమయం లేదు.. ఇంట్లోనే ఫిట్నెస్ పెంచుకోవాలి.. ఇంకేం.. వెంటనే డంబెల్స్, బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్ బుక్ చేసేద్దాం.. ఇది, అది అనే తేడా లేదు.. ఏదైనా సరే.. క్లిక్ కొట్టి ఆర్డర్ పెట్టేయడమే! పది నిమిషాల్లోనే వస్తువు ఇంటి ముందు వాలిపోతుంది. ప్రస్తుతం వైజాగ్లో ఎక్కడ చూసినా.. క్లిక్ ఆర్డర్.. ఇదే ట్రెండ్ నడుస్తోంది. వంద రూపాయల పర్స్ నుంచి.. లక్ష రూపాయల గోల్డ్ కాయిన్ వరకూ.. ఏం కావాలన్నా.. ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా.. అనేదే అందరి ధీమా..! ఒకప్పుడు చాక్లెట్ కావాలంటే వీధి చివర ఉన్న షాప్కి వెళ్లేవాళ్లం. పెరుగు కావాలంటే డెయిరీకి, స్వీట్ల కోసం మిఠాయి దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్విక్ కామర్స్ పుణ్యమా అని, ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే మనకు కావల్సిన వస్తువు ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. విశాఖ నగరంలోనూ క్విక్ డెలివరీ యాప్స్కు ఆదరణ భారీగా పెరిగిందని ప్రముఖ డెలివరీ సంస్థ ఇన్స్టామార్ట్ సర్వేలో వెల్లడైంది. 2025లో వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారో తెలుసా.? బ్యాగ్స్, వ్యాలెట్స్..! రూ.5.84 లక్షల షాపింగ్.. ఐఫోన్లలో టాప్ క్విక్ కామర్స్లో అత్యంత ఖరీదైన ఫోన్లు కూడా ఆర్డర్ చేస్తుండటం విశేషం. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో ప్రీమియం కొనుగోళ్లలో దేశంలోనే వైజాగ్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో నగరానికి చెందిన ఒక వినియోగదారుడు రూ.లక్ష విలువైన 24 క్యారట్ల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఓ వ్యక్తి ఇన్స్టామార్ట్లో ఏకంగా రూ.5.84 లక్షల విలువైన షాపింగ్ చేశారు. 2025లో ఒకే వ్యక్తి చేసిన అత్యధిక షాపింగ్ ఇదే కావడం విశేషం. మరికొంతమంది రూ.3.50 లక్షల మార్కును దాటారు. వైజాగ్ ప్రజలు ఆన్లైన్లో చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 వరకు పెరుగు ప్యాకెట్లే ఉంటున్నాయి. తర్వాత స్థానంలో ఐస్క్రీమ్లు, స్వీట్లు ఉన్నాయి. ఏడాది కాలంలో వీటి ఆర్డర్లలో 112 శాతం వృద్ధి కనిపించింది. సెకనుకు 4 పాల ప్యాకెట్లు దేశవ్యాప్తంగా చూస్తే.. సగటున సెకనుకు 4 పాల ప్యాకెట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి క్విక్ కామర్స్ యాప్స్ నగర జీవనాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకూ విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్ పోటీపడుతున్నాయి. విశాఖ వాసులు ఇల్లు కదలకుండానే తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ.. ‘స్మార్ట్’గా మార్ట్ని ఇంటికి రప్పించుకుంటున్నారు. ● విశాఖలో 434 శాతం పెరిగిన బ్యాగులు, వాలెట్ల విక్రయాలు ● ఐఫోన్ నుంచి గోల్డ్ కాయిన్ దాకా.. ఫాస్ట్ షాపింగ్ ● ఆన్లైన్ కొనుగోళ్లలో కిరాణేతర వస్తువులదే హవా ● ఇన్స్టామార్ట్ సర్వేలో వెల్లడి ఏం ఆర్డర్ చేస్తున్నారంటే? ఇన్స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. 2025లో విశాఖ నగరవాసులు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పలు ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాది వైజాగ్ వాసులు కిరాణా సరుకుల కంటే కిరాణేతర సామగ్రిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హ్యాండ్ బ్యాగులు, వాలెట్ల కొనుగోళ్లు 434 శాతం పెరిగాయి. క్రీడలు, ఫిట్నెస్ పరికరాల ఆర్డర్లు 374 శాతం మేర నమోదయ్యాయి. నగలు, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు 249 శాతం వృద్ధి చెందాయి. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు 161 శాతం, పిల్లల ఆటవస్తువుల కొనుగోళ్లు 166 శాతం పెరిగాయి. స్నాక్స్, చక్కెర, వాటర్ బాటిల్స్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాల కొనుగోళ్లు 100 శాతం వరకు వృద్ధి చెందాయి. నిమిషాల్లో డెలివరీ ఉరుకుల పరుగుల జీవన విధానంలో అంతా ఇప్పుడు వేలికొనల పైనే నడుస్తోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెడితే 10 నుంచి 15 రోజుల సమయం వేచి చూసే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఇన్స్టంట్ జమానా. 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే తెస్తామని మరొకరు.. పోటీ పడి మరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. పైగా షాపుల్లో దొరకని ఆఫర్లతో వస్తువులు ఇంటికి చేరుస్తుండటంతో, శ్రమ తగ్గిందని నగరవాసులు క్విక్ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. -
నాట్య మయూరాలు
కె.కోటపాడు/పాయకరావుపేట: హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో 4,608 మంది కళాకారులు 40 నిమిషాల పాటు నృత్యం చేసి, గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఇందులో జిల్లాకు చెందిన పలువురు పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. కె.కోటపాడు మండలం కింతాడ సర్పంచ్ బండారు ఈశ్వరమ్మ, ఉపసర్పంచ్ ముత్యాలనాయుడుల మనుమరాలు తాన్విశ్రీ , కావ్యశ్రీ నృత్య కళాశాలకు చెందిన బాలికలు పాల్గొన్నారు. వీరికి నిర్వాహకులు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఈ ప్రదర్శనలో తమ పాప తాన్విశ్రీ పాల్గొనడం ఆనందాన్ని ఇచ్చిందని తల్లిదండ్రులు ఈశ్వరరావు, మాధవి తెలిపారు. తాన్విశ్రీ సుజాతనగర్లో శోభిల్లు కళా నిలయంలో శిక్షణ పొందుతున్నట్టు వారు చెప్పారు. తమ విద్యార్థులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొనడం ఆనందంగా ఉందని కావ్య శ్రీ నృత్య కళాశాల శిక్షకురాలు ఏలూరి దీపిక తెలిపారు. పాయకరావుపేటకు చెందిన 32 మంది బాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారని ఆమె చెప్పారు. -
జాతర
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పర్యాటకసందర్శకులతో కిటకిటలాడుతున్న ఉమ్మడి విశాఖ నగరం, అల్లూరి జిల్లాకు పోటెత్తిన పర్యాటకులు గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికంగా రాక బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి అత్యధిక పర్యాటకులు జనవరి రెండో వారం వరకూ హోటల్స్, రిసార్టులు ఫుల్ గత ప్రభుత్వం చేపట్టిన టూరిజం ప్రాజెక్టులతో వెలుగుతున్న విశాఖ పెద్ద పల్లకిలో తిరువీధి సేవలు తిరువీధి సేవలో పాల్గొన్న అర్చకులు, భక్తులు నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాల సందర్భంగా స్వామివారికి పెద్ద పల్లకిలో తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి నిత్యపూజలు, అర్చనల అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి, ఉభయ దేవేరులతో కూడిన స్వామివారిని పెద్దపల్లకిలోను, గోదాదేవి అమ్మవారిని చిన్నపల్లకిలో ఉంచి తిరువీధి సేవలకు తీసుకెళ్లారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై పన్నెండో పాశురాన్ని విన్నపం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, సాయి ఆచార్యులు పాల్గొన్నారు.సాక్షి, విశాఖపట్నం : అల్లంత దూరాన ఎగసిపడే సాగర కెరటాలు ఒకవైపు.. మంచు దుప్పటి కప్పుకుని ఆహ్వానించే మన్యం అందాలు మరొకవైపు.. ఈ ప్రకృతి రమణీయతను చూసేందుకు పర్యాటక లోకం పరుగున వస్తోంది... నీలి సముద్రం పర్యాటకుల జన సంద్రాన్ని చూసి మురిసిపోతోంది. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే తరుణంలో పొరుగు రాష్ట్రాల నుంచి వెల్లువలా వస్తున్న సందర్శకులతో కళకళలాడుతోంది. క్రిస్మస్ సెలవులు.. ఇయర్ ఎండింగ్ కలిసి రావడంతో గత ప్రభుత్వ సమయంలో మొదలైన ప్రాజెక్టులు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో కొత్తందాల్ని చూసేందుకు పర్యాటక లోకం విశాఖ వైపు క్యూ కట్టింది. సాగర తీరంలోని ఇసుక తిన్నెల నుంచి.. మన్యం అడవుల్లోని మంచు కొండల వరకు ఎటు చూసినా సందర్శకుల సందడే కనిపిస్తోంది. చలిని సైతం లెక్కచేయకుండా ప్రకృతి ప్రేమికులు పోటెత్తడంతో.. విశాఖ జిల్లా పర్యాటక కేంద్రాలన్నీ ‘హౌస్ఫుల్’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. మారిపోతున్న క్యాలెండర్ పేజీలు.. మరువలేని జ్ఞాపకాలను మూటగట్టుకునేందుకు పర్యాటకుల పరుగులు.. వెరసి విశాఖలో పర్యాటక జాతర మొదలైంది. క్రిస్మస్ సెలవులు, వారాంతం, నూతన సంవత్సర వేడుకలతో కలిసి.. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ పర్యాటకులతో పోటెత్తింది. సూర్యోదయపు అందాలతో మెరిసే ఆర్కే బీచ్ నుంచి, సాహసాలకు నిలయమైన రుషికొండ వరకు.. ప్రశాంతతను పంచే కై లాసగిరి నుంచి, ప్రకృతి ఒడిలో సేదతీర్చే తెన్నేటి పార్క్ వరకు ఎటు చూసినా కోలాహలమే కనిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగి, ఇటీవల అందుబాటులోకి వచ్చిన కై లాసగిరి ‘గ్లాస్ బ్రిడ్జి’ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ వంతెనపై నడుస్తూ సాగరాన్ని వీక్షించేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరకు, పాడేరు వంటి మన్యం ప్రాంతాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు ఇప్పుడు పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. కై లాసగిరి రోప్వే ఎక్కేందుకు కొండ దిగువన క్యూ కట్టిన సందర్శకులు25 శాతం పెరిగిన పర్యాటకం గత ఏడాదితో పోలిస్తే ఈసారి పర్యాటకుల సంఖ్యలో సుమారు 25 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ తర్వాత విశాఖ చూస్తున్న అతిపెద్ద పర్యాటక సీజన్ ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా అనంతగిరిలోని బొర్రా గుహలను ఒక్క ఆదివారమే ఏకంగా 20 వేల మంది సందర్శించడం విశేషం. జూ పార్క్, కై లాసగిరి వంటి చోట్ల ప్రవేశ టికెట్ల కోసం పర్యాటకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.ఈ సందడి జనవరి రెండో వారంలో ముగిసే సంక్రాంతి సెలవుల వరకు కొనసాగే అవకాశం ఉంది. హోటళ్లు ఫుల్.. ఈ విపరీతమైన రద్దీ కారణంగా నగరంలోని స్టార్ హోటళ్లు, గెస్ట్ హౌస్లు, పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్టులు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ‘నో వెకెన్సీ’ బోర్డులు దర్శనమిస్తుండటంతో, ముందుగా రిజర్వేషన్లు చేసుకోని వారు వసతి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లాలోని లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో సాధారణ గదులే కాదు, చివరికి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన టెంట్లు కూడా నిండిపోయాయంటే పర్యాటకుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రుషికొండ -
పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
‘ఈ ఏడాది విశాఖకు పర్యాటకుల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ 50 వేల మంది కంటే ఎక్కువ మంది విశాఖలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శిస్తున్నారు. విశాఖ నగరంతో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లోని మా పర్యాటక శాఖకు చెందిన అన్ని హోటళ్లు, హరిత రిసార్టులు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంది. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి మెరుగైన ఆతిథ్యం అందించేందుకు మా సిబ్బంది అదనపు సమయం పనిచేస్తూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. – జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ -
వినోదాల వేదిక.. సంక్రాంతి వేడుక
కాలు దువ్వుతున్న పందెం కోళ్లు ఎడ్లు, గుర్రపు పందాలకు సిద్ధం ఖరీదైన ఆహారంతో ప్రత్యేక శిక్షణ మాడుగుల: తెలుగువారి పండగలలో సంక్రాంతి భిన్నమైనది. పాడి పంట ఇంటికి వచ్చే సమయం కావడంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పెద్దలకు పూజలతోపాటు హరిదాసులు, డూడూ బసవన్నలను ఆదరిస్తారు. రంగ వల్లికలతో శోభ చేకూరుస్తారు. అందులో గొబ్బెమ్మలను పెట్టి పాటలు పాడతారు. కనుమ రోజున పశు సంపదకు పూజలు చేస్తారు. ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి సందడే సందడి. వీటన్నింటినీ మించిన కొసమెరుపు ఒకటుంది. భోగీ పండగ నుంచి ప్రారంభమయ్యే తీర్థాలు స్వగ్రామాలకు ఇళ్లకు చేరుకునే బస్తీ జనాలకు వినోదాన్ని పంచుతాయి. కోడి పందాలు, ఎడ్లు, గుర్రపు పరుగు పందాలు ప్రత్యేక ఆకర్షణ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాటిని ఆసక్తిగా వీక్షిస్తారు. తీర్థాలలో పంచదార చిలుకలు, రంగుల రాట్నాలు చిన్నారులను అలరిస్తాయి. నెల రోజుల ముందు నుంచే శిక్షణ పందెంరాయుళ్లు నెల రోజుల ముందు నుంచే ఎడ్లకు శిక్షణ అందిస్తారు. రేసు గుర్రాలకు, పందెం కోళ్లకు కూడా తర్ఫీదు అందిస్తారు. వీటికి ఖరీదైన ఆహారం అందించడంతోపాటు సకల సదుపాయాలు సమకూరుస్తారు. పండగకు రెండు వారాలకు పైగా సమయం ఉండడంతో ప్రస్తుతం పోటీలకు వాటిని సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. గతంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి గ్రామాల్లో వేకువజాము నుంచే హరిదాసులు పదాలు పాడుతూ సంచరించేవారు. గంగిరెద్దులను ప్రదర్శించేవారు సన్నాయి ఊదుతూ సందడి చేసేవారు. రానురాను ఆ సంప్రదాయాలకు ఆదరణ తగ్గుతోందని వారు వాపోతున్నారు. -
నాగులాపల్లి సొసైటీకి ఉత్తమ అవార్డు
అవార్డు అందుకుంటున్న పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి భాస్కరరావు, సీఈవో స్వామి మునగపాక: నాగులాపల్లి పీఏసీఎస్ (సొసైటీ) జాతీయ సహకార అభివృద్ధి సంస్థ అందించే ఉత్తమ ప్రతిభ అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ఆదివారం సంఘ పర్సన్ ఇన్చార్జి యల్లపు వెంకట భాస్కరరావు, సీఈవో మళ్ల స్వామి పురస్కారం అందుకున్నారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సహకార ఉత్సవాల్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. రైతులకు రుణ పంపిణీ, సంక్షేమ పథకాల అమలుతోపాటు సభ్య రైతులకు మెరుగైన సేవలు తదితర అంశాల్లో రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న నాగులాపల్లి సొసైటీని ఉత్తమ సొసైటీగా గుర్తించి అవార్డుతోపాటు రూ.25 వేలను అందజేశారు. రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ జి.వీరాంజనేయులు, సహకార సంఘాల అడిషనల్ రిజిస్ట్రార్ ఆనంద్బాబు, కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు ఎన్.రఘురామ్, రాష్ట్ర సహకార బ్యాంక్ ఎండీ ఆర్వీ రామకృష్ణారావు, ఎన్సీబీసీ రీజనల్ మేనేజర్ గోస్వా చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని భాస్కరరావు, స్వామిలు తెలిపారు. -
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
సాక్షి, అనకాపల్లి: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మరణించారని.. మిగతా ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు ధృవీకరించారు. అలాగే మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో సహాయక చర్యలు పూర్తైనట్లు ప్రకటించారు. టెక్నికల్ క్లియరెన్స్ అనంతరం.. ప్రమాదానికి గురైన రెండు బోగీలతో పాటు మరొక బోగీని(ఎం2 కూడా) మినహాయించడంతో సోమవారం ఉదయం 7గంటలు ఆలస్యంగా రైలు ఎర్నాకుళం బయల్దేరింది.టాటానగర్(జార్ఖండ్) నుంచి ఎర్నాకుళం(కేరళ) వెళ్తున్న ఎక్స్ప్రెస్(18189) రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలుపుదల చేశారు. ప్రయాణికులంతా బయటకు దిగి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈలోపు లోకో పైలట్ కాలిపోతున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లికి చెందిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా.. మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. తొలుత బీ1 కోచ్లోనే మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 3.30గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించి, ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ప్రయత్నాలు చేయబోయారు. కానీ.. దుప్పట్ల వల్లే..ప్రమాద స్థలానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్ఎం మోహిత్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘ప్రమాదం జరిగిన ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బీ1 కోచ్లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నాం. ఆ బోగీలో దుప్పట్లు ఉండడం వల్ల మంటలు శరవేగంగా వ్యాపించాయి. రెండు బోగీలు(బీ1, ఎం2) పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బీ1లో 76 మంది, ఎం2లో 82 మంది ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించారు. బీ1 బోగీలో మృతదేహాన్ని గుర్తించాం. ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని లోకో పైలట్లు చెబుతున్నారు. కానీ, అధికారిక దృవీకరణ జరగాల్సి ఉంది. ఘటనపై విచారణ జరుగుతోంది’’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. మృతుడ్ని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70)గా అధికారులు నిర్ధారించారు. ఆయన కుటుంబానికి రైల్వేశాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రయాణికుల అవస్థలుఈ ఘటన తర్వాత.. చలిలో సుమారు 2వేల మంది ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు పడ్డారు. అనకాపల్లి, తుని, విశాఖ స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పూరి-తిరుపతి, ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, జన్మభూమి ఎక్స్ప్రెస్, బెంగళూర్ హంసఫర్ రైళ్లు వీటిల్లో ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.ఎఫ్ఎస్ఎల్ ఆధారాలే కీలకంప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఉదయం ఘటన స్థలానికి రైల్వే సేఫ్టీ కమిటీ చేరుకుంది. ప్రమాద తీవత్రను సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రెండు ఫోరెన్సిక్ బృందాలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారని ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ ఆధారాలే కీలకమని పోలీసులు చెబుతున్నారాయన. ‘‘ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు జరిపి సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్నాం. ప్రత్యేక బస్సుల్లో రైల్వే స్టేషన్కు తరలించాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఎర్నాకులం చేరేలా చూస్తాం’’ అని తెలిపారు.కలెక్టర్ కామెంట్స్.. రైలు ప్రమాద ఘటనపై కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ.. ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చే సరికి ప్రెషర్ తేడాలను లోకో పైలెట్ గుర్తించారు. అప్పటికే పొగలు వ్యాపించడంతో ప్రయాణీకులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులకు జిల్లా యంత్రాంగం తరపున ప్రయాణీకులకు ఆహారం, మంచినీటి సౌకర్యం కల్పించాం. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ప్రమాద కారణాలు తెలుస్తాయి అన్నారు. -
Anakapalli: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు.. బోగీలు దగ్ధం
సాక్షి,అనకాపల్లి: ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సోమవారం టాటా నగర్ నుండి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లోకోపైలట్ వెంటనే రైలును ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపివేశారు. అగ్నిప్రమాదంపై రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.రైలు నిలిపివేయగానే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. అయితే రైల్వే అధికారులు, సిబ్బంది చాకచక్యంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఒక బోగీలోని ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనలో మొదటగా బీ1 బోగీలో మంటలు చెలరేగగా.. అనంతరం ఎం1,బీ2 కోచ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఇతర కోచ్లకు వ్యాపించకుండా వాటిని వేరు చేసి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. -
స్లో..లార్!
పీఎం సూర్యఘర్కు అంతంతమాత్రంగా స్పందనసాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పీఎం సూర్యఘర్కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సబ్సిడీ, రుణ సదుపాయంతో ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ఏపీఈపీడీసీఎల్ ఆశించిన ప్రగతిని సాధించలేకపోతోంది. మరోవైపు.. ఏదో సాధించేశామని చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం.. సోలార్ రూఫ్టాప్లని వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయించాలంటూ డిస్కమ్లపై పదే పదే ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి.. సోలార్పైనే దృష్టిసారించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 12 శాతం లక్ష్యాన్ని కూడా చేరలేక..! ఈపీడీసీఎల్ పరిధిలో 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారు 3 లక్షల మంది వరకు ఉండగా.. సోలార్ ప్లాంట్లను కేవలం 36 వేల మంది మాత్రమే ఇప్పటి వరకూ అమర్చుకున్నారు. కనీసం 12 శాతం కూడా లక్ష్యాన్ని సాధించలేకపోవడంతో ఉన్నతాధికారులు ఉద్యోగులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ పథకం ప్రకారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 36 వేల గృహాలకు 114 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. విశాఖ పరిధిలోనూ ఇదే పరిస్థితి దాపురించింది. 200 యూనిట్లు పై చిలుకు విద్యుత్ వినియోగదారులు 1.83 లక్షల మంది విశాఖలో ఉండగా 13,500 కిలోవాట్లు సామర్థ్యంతో 3,750 మంది మాత్రమే అమర్చుకున్నారు. అనకాపల్లి సర్కిల్ పరిధిలో 2,841 మందికి 8,712 కిలోవాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 15 మందికి 48 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు మాత్రమే అమర్చారు. దీంతో అనుకున్న స్పందన లేకపోవడంతో కచ్చితంగా పరిధిలోకి వచ్చే వారందరినీ.. పీఎం సూర్యఘర్ పథకం లోకి మార్చాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఈపీడీసీఎల్ ఉద్యోగులు బేజారవుతున్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంశాల కంటే సూర్యఘర్ ఒత్తిడే ఎక్కువగా ఉంటోందని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామనీ.. ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. సోలార్ ప్యానెల్స్ అమర్చిన తర్వాత.. పాడైతే.. దాన్ని బాగుచేసేందుకు అధిక భారం పడుతుందనీ.. అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదనీ.. అయినా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సర్కిల్ పరిధిలో 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగదారులు1.83 లక్షల మంది విశాఖలో సోలార్ ప్లాంట్లు అమర్చుకున్నది3,750 (13,500 కిలోవాట్లు) అనకాపల్లి సర్కిల్ పరిధిలో 2,841 మంది (8,712 కిలోవాట్లు) అల్లూరి సర్కిల్ పరిధిలో15 మంది (48 కిలోవాట్లు)కరెంట్ అమ్మితే మీకే లాభం అని చెప్పండహో..! అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు ఎఫ్పీసీసీఏ చార్జీలంటూ బిల్లు చూస్తే గుండె గుభేల్మనిపించేలా చేస్తున్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసన్న ఆయన ఓవైపు విద్యుత్ బిల్లుల్ని అమాంతం పెంచేసి.. మరోవైపు.. సూర్యఘర్ ప్రాజెక్టు పేరుతో వినియోగదారుల నడ్డి విరించేందుకు యత్నిస్తున్నారు. సోలార్ రూఫ్టాప్ పెట్టుకుంటే బిల్లు కట్టకపోవడంతో పాటు కరెంటు అమ్ముకొని లాభాల్ని పొందొచ్చంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 3 కిలోవాట్లు ఏర్పాటు చేసుకున్న ఇంటికి నెలకు 360 నుంచి 450 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలకు వినియోగించుకోగా.. మిగిలిన విద్యుత్ను ఏపీఈపీడీసీఎల్కు విక్రయించుకోవచ్చనే విషయాన్ని ప్రజలకు వివరించాలంటూ ఉద్యోగుల్ని ఆదేశించారు. అయినా ప్రజలు స్పందించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో సర్కిళ్లలోని జోన్లవారీగా టార్గెట్స్ విధించారు. నిర్దేశించిన సమయంలోగా టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశిస్తుండటంతో.. పీఎం సూర్యఘర్ అధికారుల మెడపై కత్తిగా మారింది. టార్గెట్ పూర్తి చేయలేదని కింది స్థాయి ఉద్యోగులపై అధికారుల చిర్రుబుర్రు తలనొప్పిగా మారిందంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇప్పటివరకు డిస్కమ్ పరిధిలో 36 వేల మంది ఏర్పాటు -
సీపీఎం నేతపై పీడీ యాక్ట్ రద్దు చేయాలి
నర్సీపట్నం: ప్రజల పక్షాన పోరాడుతున్న సీపీఎం నేత అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, అప్పలరాజు భార్య లక్ష్మి శనివారం నర్సీపట్నంలో కలెక్టర్ విజయ్కృష్ణన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రౌడీలు, స్మగ్లర్లు, దేశద్రోహులుపై పెట్టాల్సిన కేసులను అప్పలరాజుపై పెట్టడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రౌడీలు బయట హల్చల్ చేస్తున్నారన్నారు. పీడీ యాక్ట్ పెట్టడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే పీడీ యాక్ట్ రద్దు చేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
చినగోగాడలో భూ వివాద ం
చీడికాడ : ఒకే తల్లికి పుట్టిన వారికి వారసత్వంగా సంక్రమించిన భూమిలో సమాన హక్కులు ఎందుకుండవంటూ మండలంలోని చినగోగాడకు చెందిన బోనుగు మల్లేశ్వరి, నారాయణ దంపతులు రెవెన్యూ, పోలీసు అధికారులను ప్రశ్నించి తమ భూమిలో ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బొనుగు వరహాలమ్మకు ఏడుగురు సంతానం వారిలో ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా నారాయణ అనే మరో వ్యక్తిని వరహాలమ్మ దత్తత తీసుకుంది. నారాయణమ్మ పేరిట సర్వే నెంబర్ 10–6డిలో 57 సెంట్లు భూమి ఉంది. వరహాలమ్మ పెంపుడు కుమారుడు నారాయణకు ఈ 57 సెంట్లు భూమిలో ఏమీ రాయలేదు. మిగిలిన ఐదుగురు కుమార్తైలెన పెదిరెడ్ల సత్యవతి, దొండా శ్రీదేవి, కర్రి సాయిలక్ష్మి, పెదిరెడ్ల సంధ్యారాణి, గనిశెట్టి కృష్ణవేణిలతో పాటు ఇంకో కుమారుడైన బోనుగు శ్రీనివాస్లకు ఒక్కొక్కరికి 0.11.4 సెంట్లు చొప్పున భూమిని పంచి అప్పగించారు. అయితే పెంపుడు కొడుకు నారాయణకు వరహాలమ్మ కుమార్తె పెదిరెడ్ల సత్యవతి కుమార్తె అయిన మల్లేశ్వరినిచ్చి వివాహం జరిపారు. సత్యవతి తనకు తల్లిద్వారా సంక్రమించిన 0.11.4 సెంట్లు భూమిని తన కుమార్తె అయిన మల్లేశ్వరికి రాసింది. ఈ మేరకు మల్లేశ్వరికి సుమారు 12 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 10–6డి పేరిట 0.11 సెంట్లకు ఖాతా నెంబర్ 269తో పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేశారు. అయితే జగనన్న భూ సర్వేలో మల్లేశ్వరికి తెలియకుండా 10–6డి గల 0.55.20 సెంట్ల భూమిని వరహాలమ్మ కుమారుడు శ్రీనివాస్ మృతి చెందడంతో భార్య లక్ష్మి పేరిట దిగువ స్థాయి రివెన్యూ సిబ్బంది రికార్డులో నమోదు చేసినట్టు తెలుసుకున్న మల్లేశ్వరి ఈ ఏడాది ఆగస్టులో పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీనిని పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది ఆ సర్వే నెంబరులో గల మొత్తం భూమి శ్రీనివాస భార్య లక్ష్మికే చెందుతుందని రిపోర్టు ఇచ్చారు. దీంతో లక్ష్మి కుటుంబ సభ్యులు వివాదాస్పద భూమిలో భూమిలో ప్రహరీ నిర్మాణానికి ఐరన్ బీమ్లు వేయడంతో పాటు దానిపై ప్రహరీ నిర్మించేందుకు ప్రయత్నించగా మల్లేశ్వరి అడ్డుకుంది. దీంతో లక్ష్మి వర్గీయులు తహసీల్దార్ లింకన్ను ఆశ్రయించడంతో ఆయన పోలీసు బందోబస్తుతో ప్రహరీ నిర్మాణానికి సహకరించాలని ఎస్ఐకు లేఖ ద్వారా కోరారు. ఈ మేరకు శనివారం ఎస్ఐ సతీష్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు. అయితే మల్లేశ్వరి సర్వే నెంబర్ 10–6డిలో గల తన తల్లి ద్వారా సంక్రమించిన 0.11 సెంట్లు భూమికి సంబంధించి టైటిల్ డీడ్– భూ పాసుపుస్తకాన్ని చూపించి తనకు వాటాగా వచ్చిన భూమి అప్పగించాలని ఆర్ఐ కృష్ణ, వీఆర్వో శ్రీనును డిమాండ్ చేసింది. దీంతో అవాకై ్కన రెవెన్యూ అధికారులు పరిశీలించి వస్తామని చెప్పి మల్వేశ్వరి వద్ద గల పాస్ పుస్తకం నకలు వివరాలు సేకరించి వెనుదిరిగారు. ఎస్ఐ సతీష్ తహసీల్దార్ లింకన్తో ఫోన్లో మాట్లాడి పూర్తి స్థాయి పరిశీలించాలని కోరి అక్కడ నుంచి సిబ్బందితో వెనుదిరిగారు. -
బర్త్ వెయిటింగ్ హాల్కు శంకుస్థాపన
నర్సీపట్నం : నర్సీప ట్నం ఏరియా ఆస్పత్రి అవరణలో ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. రూ. 35 లక్షలతో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2.10 కోట్లతో ఆసుపత్రికి కార్పొరేట్ హంగులు, బర్త్ వెయిటింగ్ హాల్ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. తుని, పాడేరు వంటి సుదూర ప్రాంతాల నుండి గర్భిణులు ప్రసవాల కోసం ఇక్కడకు వస్తున్నారన్నారు. గర్భిణులు డెలివరీ డేట్కు రెండు రోజుల ముందే ఆసుపత్రికి వచ్చి, వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశామన్నారు. కలెక్టర్ చొరవతో డెక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థ వారు సీఎస్ఆర్ గ్రాంటు నుంచి నిధులు ఇచ్చారన్నారు. -
ప్రజా ఉద్యమాలపై కక్ష సాధింపు చర్యలు తగవు
అనకాపల్లి : ప్రజల సమస్యల కోసం ఉద్యమాలు చేసిన సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా పీడీయాక్ట్ కేసు నమోదు చేసి, జైల్లో పెట్టడం అన్యాయమని, బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నివర్గాల ప్రజల సహకారంలో ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ జిల్లా సీనియర్ నాయకుడు ఎన్.భద్రం అన్నారు. స్థానిక మొయిన్రోడ్డు పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కపల్లి మండలంలో విషపూరిత బల్క్ డ్రగ్ పార్కుకు భూములు కోల్పోతున్న రైతులు జరుపుతున్న ఉద్యమానికి అండగా నిలిచారని నెపంతో అనకాపల్లి జిల్లా సీపీఎం నాయకుడు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజును అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేయడం అన్యాయమన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనకాపల్లి సీపీఐ జోనల్ కార్యదర్శి తాకాశి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
పీహెచ్సీ ఆవరణలో ఆటస్థలం వద్దు
నాతవరం : స్థానిక పీహెచ్సీ ఆవరణలో ఆట స్థలం ఏర్పాటు చేయరాదని జెడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలనర్స, వైస్ ఎంపీపీ పైల సునీల్, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు, వైఎస్సార్సీపీ శ్రేణులు మండల ప్రత్యేకాధికారి మంగవేణికి ఫిర్యాదు చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్న నియంత వ్యవహార శైలిపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం కొంతసేపు నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నాతవరంలో పీహెచ్సీ ఏర్పాటుకు ఇదే గ్రామానికి చెందిన దాత 1960లో స్థలం ఉచితంగా ఇచ్చారన్నారు. ఆ స్థలంలో అప్పట్లో నిర్మించిన భవనం శిథిలం కావడంతో గత వైఎస్సార్సీపీ హయాంలో సుమారుగా రూ.2 కోట్లతో నూతన భవనం నిర్మించామన్నారు. ఈ పీహెచ్సీని 30 పడకల స్థాయికి పెంచేందుకు గతంలో ప్రతిపాదనలు చేశామన్నారు. ఇటీవల ప్రభుత్వం నాతవరం గ్రామంలో ఆటలు అడుకునేందుకు గ్రౌండ్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ గ్రౌండ్ నిర్మాణం స్థానిక కూటమి నేతల ప్రోత్సాహంతో పీహెచ్సీ స్థలంలో పనులు చేపట్టారన్నారు. పీహెచ్సీ స్థలంలో ఆటస్థలం నిర్మాణం చేస్తే పీహెచ్సీకి అప్గ్రేడ్కు స్థల సమస్య వస్తుందన్నారు. గ్రౌండ్ నిర్మాణం కోసం స్థలం నాతవరం గ్రామంలో నాలుగు చోట్ల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని అక్కడ గ్రౌండ్ నిర్మిస్తే అందరికి బాగుంటుందన్నారు. నాతవరం గ్రామంలో గ్రౌండ్ నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లుగా గానీ పీహెచ్సీ స్థలంలో ఆట స్థలం నిర్మాణానికి సంబంధించి పంచాయతీ పాలకవర్గానికి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ విషయంపై మండల ప్రత్యేకాధికారి జి, మంగవేణిి మాట్లాడుతూ మీరు చెప్పిన విషయం పరిశీలిస్తానన్నారు. కార్యక్రమంలో గన్నవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి గొర్లె వరహాలబాబు, వైఎస్సార్సీపీ నాతవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు శెట్టి లచ్చబాబు, వైఎస్సార్సీపీ మేధావుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైల పోతురాజు వైఎస్సార్సీపీ మండల మహిళా ఉపాధ్యక్షురాలు రాధ, నాతవరం మాజీ ఉప సర్పంచ్ రాంబాబు, సోషల్ మీడియా అధ్యక్షుడు చింతకాయల సత్యనారాయణ, పార్టీ నాయకుడు అపిరెడ్డి మహేష్, రామకృష్ణ పాల్గొన్నారు. -
ఒకే కాన్పులో ఆవుకు రెండు పెయ్యిలు జననం
తెనుగుపూడి శివారు రొంగలిపేటలో ఒకే కాన్పులో జన్మించిన రెండు పెయ్యిలుతో ఆవు దేవరాపల్లి : తెనుగుపూడి శివారు రొంగలిపేటకు చెందిన రైతు సింగంపల్లి బంగారయ్య ఆవుకు ఒకే ఈతలో రెండు ఆవు పెయ్యిలు శుక్రవారం జన్మించాయి. రెండు పెయ్యిలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నాయని రైతు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై పశువైద్యాధికారి కె.మంజుషారాణి వద్ద ప్రస్తావించగా కృత్రిమ గర్భధారణ సమయంలో ఒక అండాశయాన్ని ఒక వీర్యం కలవడం ద్వారా ఒక పెయ్యి జన్మించడం సాధారణంగా జరుగుతుందని, ఒకేసారి రెండు అండాశయాలు విడుదలై రెండు వీర్యాలతో కలవడం ద్వారా రెండు పెయ్యిలు జన్మించే అవకాశం ఉంటుందన్నారు. ఇలా ఒకే కాన్పులో రెండు పెయ్యిలు జన్మించడం 7 శాతం మేర మాత్రమే అరుదుగా జరుగుతాయన్నారు. -
విద్యార్థులపై కోతి దాడి
రావికమతం: స్థానిక హైస్కూల్లోకి కోతి చొరబడి ఇద్దరు విద్యార్థులను గాయపరిచింది . స్థానిక మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న హైస్కూలోకి శనివారం ఓ కోతి ప్రవేశించి వేపాడ భాగ్యశ్రీ ,తాడి దుర్గా తేజపై దాడి చేయడంతో స్వల్పంగా గాయపడ్డారు. ఉపాధ్యాయులు వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం హరిబాబు ,ఉపాధ్యాయులు వేపాడ సత్యనారాయణ,ధనంజయ్ తదతరులు ఎంపీడీవో మహేష్ కు,తహసీల్దార్ కార్యాలయంలో,ఎంఈవోకు వినతిపత్రాలు అందజేశారు. -
అంగన్వాడీల యాప్సోపాలు
అంగన్వాడీ కార్యకర్తలు యాప్లతో ఆపసోపాలు పడుతున్నారు. యాప్లను నిర్వహించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్ల్లో లబ్ధిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, అనకాపల్లి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార పంపిణీ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో కార్యకర్తలు, లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 1,908 అంగన్వాడీ కేంద్రాలుండగా వీటికి చంద్రబాబు సర్కార్ 1,409 (5జీ)స్మార్ట్ మొబైల్స్ను అందజేసింది. పంపిణీ చేసిన 10 రోజులకే సగానికిపైగా ఫోన్లు పనిచేయడం మానేశాయి. గర్భిణులతో పాటు ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు వయసున్న పిల్లల తల్లులకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో పారదర్శకత కోసం లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపును (ఫేషియల్ రికగ్నేషన్)ను, రోజు వారీ వివరాలను బాల సంజీవని, పోషణ్ ట్రాకర్ యాప్లలో నమోదు చేసిన తర్వాతే సరకులు అందించాలి. సర్వర్ సమస్య కారణంగా ఆయా యాప్లు తరచూ మొరాయిస్తున్నాయి. ఒక్కోసారి రెండు, మూడు గంటల పాటు పనిచేయడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలల పాటు కాలయాపన చేసి..ఇటీవల 5జీ స్మార్ట్ ఫోన్లు అందజేసింది. అవి మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. రెండు వారాలకే సర్వర్ సమస్యతో మొబైల్లో ఉన్న యాప్లు మొరాయిస్తున్నాయి. కొత్తగా ఇచ్చిన ఈ 5జీ మొబైల్స్కు ఒక వైపు నెట్వర్కు సమస్య..మరో వైపు యాప్ వెర్షన్ సమస్య వంటి సాంకేతిక సమస్యలతో అప్లోడింగ్ ఆలస్యమవుతోంది. దీంతో సూపర్ వైజర్లు, ఉన్నతాధికారుల నుంచి అంగన్వాడీ వర్కర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అసలు కంటే యాప్ల పనే ఎక్కువగా ఉండడంపై అంగన్వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళితే వెర్షన్ అప్టుడేట్ అయిన తరువాత ఆ సమస్య ఉండదంటున్నారు. పని పెరిగి.. బోధన తగ్గి.. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహార వినియోగం, పిల్లలు, బాలింతలు, గర్భిణుల నమోదు, ప్రీ స్కూల్ అడ్మిన్ రికార్డులను ప్రతి రోజూ విధిగా నమోదు చేయాలి. మరోవైపు పిల్లల టీకాల రికార్డులు, విటమిన్–ఎ రికార్డు, రిఫరల్ సర్వీసెస్, గృహ సందర్శకుల రికార్డులు, నెలవారీ ప్రాజెక్టులు, హౌస్ హోల్డ్ సర్వే రికార్డు, గ్రోత్ చార్ట్ తదితర అంశాలను యాప్లలో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాప్లలో నమోదు ప్రక్రియ కష్టంగా మారింది. గతంలో లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు నమోదు కాకపోయినా రిజిస్టర్లో సంతకం తీసుకుని, సరుకులు అందజేసేవారు. ఇప్పుడు ముఖ ఆధారిత గుర్తింపును తప్పనిసరి చేశారు. సర్వర్ సమస్యల కారణంగా యాప్లు మొరాయిస్తుండడంతో గంటల కొద్దీ లబ్ధిదారులు కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది నెలలో ఐదారుసార్లు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పనితోనే కార్యకర్తలకు రోజులో ఎక్కువ సమయం గడిచిపోతుడడంతో అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల చదువు అటకెక్కుతోంది. అంగన్వాడీ సూపర్ వైజర్లు, ఉన్నతాధికారులు అధికారులు ఈ వివరాలు నమోదు చేయడంలో ఆలస్యమైతే చాలు..వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేస్తారు. ఫోన్ మీద ఫోన్ చేసి వివరాలు నమోదు చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తారు. దీంతో పిల్లలకు చదువు చెప్పడంపై దృష్టి పెట్టకుండా వీటి నమోదుపైనే అధికంగా దృష్టి సారిస్తున్నారు. వస్తువులున్నా.. లేనట్లు చూపుతూ.. యాప్ పనిచేయకపోవడంతో బాల సంజీవని, పోషణ్ ట్రాకర్ యాప్లలో వివరాలు సక్రమగా నమోదు కావడం లేదు. గర్భిణులు ఆస్పత్రిలో పేషియల్ అంటెడెన్స్ వేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక గర్భిణి పేరు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపు నమోదు కాకపోతే..తరువాత నెలకు వారికిచ్చే పౌష్టికాహారం స్టాక్ రాదు. ఈ యాప్ పనిచేయకపోవడంతో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ‘బాలసంజీవని’ యాప్లో రోజూవారీ గర్భిణులు, బాలింతలు, పిల్లలు హాజరు నమోదు చేసుకోవాలి. లబ్ధిదారులు, పిల్లలు ఫేస్ రికగ్నేషన్ అప్లోడ్ చేయాలి. అంతేకాకుండా ఆ రోజు మెనూ కూడా అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. సరుకులు రాక, పంపిణీకి సంబంధించిన వివరాలను కూడా అప్టుడేట్ చేయాల్సి ఉంటుంది. ‘పోషణ ట్రాకర్ యాప్’లో అంగన్వాడీ కేంద్రాల కార్యకలాపాలు, సేవలు, లబ్ధిదారుల నిర్వహణను పర్యవేక్షణ, పోషకాహార పంపిణీ, పెరుగుదల, ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేయాలి. బాల సంజీవని యాప్లో పోషకాహారం వివరాలు నమోదు చేసి, లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు నమోదుకు ప్రయత్నిస్తే.. ప్లీజ్ కాంటాక్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అని చూపుతూ మొరాయిస్తోంది. కొన్ని సందర్భాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో సరకులు నిల్వ ఉన్నా.. లేవని చూపుతోంది. ఇలా వచ్చినప్పుడు వాటిని లబ్ధిదారులకు ఇవ్వడానికి వీలుపడదు. సర్వర్ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తికావడం లేదు. కొత్త లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకున్న ఆధారిత గుర్తింపు వివరాలు.. వారికి సరకులు అందించేటప్పుడు తీసుకునే ఫేషియల్ రికగ్నేషన్ సరిపోలడం లేదు. పోషణ్ ట్రాకర్ యాప్లో ఈకేవైసీ నమోదులోనూ జాప్యమవుతోంది. తరచూ ‘ఎరర్ర్’ అని చూపుతూ నిలిచిపోతోంది. జిల్లాలో ఇలా... అంగన్వాడీ కేంద్రాలు 1,908 మెయిన్ కేంద్రాలు 1,725 మినీ కేంద్రాలు 183 అంగన్వాడీ వర్కర్లు 1,882 మంది హెల్పర్లు 1,665 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులు 59,890 మంది అందజేసిన స్మార్ట్ మొబైల్స్ 1,409 లబ్ధిదారుల ముఖ హాజరు నమోదులో ఇబ్బందులు సర్వర్ సమస్యతో తరుచూ మొరాయింపు మరోపక్క రికార్డులతో సతమతం రోజు వారీ వివరాలు అప్లోడ్ చేయాలంటూ అధికారుల నుంచి ఒత్తిడి పౌష్టికాహారం పంపిణీలో సాంకేతిక సమస్యలు మున్నాళ్ల ముచ్చటగా మారిన 5జీ స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన పది రోజులకే సగానికి పైగా పనిచేయని ఫోన్లు -
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం
మునగపాక/నక్కపల్లి : వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించనున్నారు. మరో పక్క జిల్లాలో కొత్తరెవెన్యూ డివిజన్ ఏర్పాటులో మార్పులు జరిగాయి. ముందుగా ప్రకటించినట్టు నక్కపల్లి కేంద్రంగా కాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల 27వ తేదీన మునగపాక మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే నక్కపల్లి డివిజన్లో కలుపుతున్నట్లు ప్రభుత్వం జీవో నంబర్ 1491 విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో భాగంగా నక్కపల్లి కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. నక్కపల్లి డివిజన్లో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు విలీనం చేస్తున్నట్లు జీవోలో పొందుపరిచారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతుల సహకారంతో వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రైతులు, ప్రజలతో కలిసి ధర్నాలు, మానవహారాలు నిర్వహించింది. నక్కపల్లి డివిజన్లో కాకుండా అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గం కొనసాగించే చూడాలని కోరుతూ మునగపాకలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీతో కలిసి వారం రోజుల పాటు దీక్షలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజలనుంచి వస్తున్న అభ్యంతరాలకనుగుణంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అఽధికారులను ఆదేశించినట్లు సమాచారం. ముందుగా ప్రకటించినట్టు నక్కపల్లి కేంద్రంగా కాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా నక్కపల్లి రెవెన్యూ డివిజన్కు మోకాలడ్డినట్లు సమాచారం.అడ్డురోడ్డుకేంద్రంగా రెవెన్యూ డివిజన్ఏర్పాటు చేస్తూ అచ్యుతాపురం, యలమంచిలి, రాంబిల్లి మండలాలతోపాటు, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల, మండలాలను ఈ డివిజన్లో చేర్చనున్నారు. మునగపాక మండలాన్ని మాత్రం అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించాలని నిర్ణయించారు.నర్సీపట్నం డివిజన్లో ఉన్న చీడికాడ మండలాన్ని అనకాపల్లి డివిజన్లో కలిపేందుకు నిర్ణయించారు. భిన్నాభిప్రాయాలు ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నక్కపల్లి కేంద్రంగానే కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. బ్రిటీష్ కాలంనుంచి నక్కపల్లి తాలూకా కేంద్రంగా ఉందని, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అంతా నక్కపల్లి తాలూకా కార్యాలయాలనుంచే జరుగుతుందనిపలువురు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి, నక్కపల్లి తాలూకా కేంద్రాలుగా ఉండేవని,తర్వాత మండలాలుగా ఏర్పాటయ్యాయని అంటున్నారు. నక్కపల్లిని కాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా డివిజన్ ఏలా ఏర్పాటు చేస్తారన్న పశ్నలు తలెత్తుతున్నాయి.కనీసం పంచాయతీకూడా కానీ అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం తగదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
జాతీయ రహదారిపై వ్యాన్ దగ్ధం
అనకాపల్లి టౌన్: పట్టణంలోని జాతీయ రహదారిపై ఉమ్మలాడ జంక్షన్ వద్ద శనివారం ఓ వ్యాన్ దగ్ధమైంది. ఖాళీ సిగరెట్ ప్యాకెట్ల లోడ్తో కోల్కతా నుంచి కోయంబత్తూరు వెళుతున్న వ్యాన్ ఉమ్మలాడ జంక్షన్కు వచ్చే సరికి ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో మంటలు వ్యాపించాయి. అదే రూట్లో ప్రయాణిస్తున్న వారు ఈ విషయాన్ని డ్రైవర్కు తెలపడంతో వ్యాన్ను నిలిపివేశాడు. మంటలు తీవ్రంగా వ్యాపించి వాహనం ముందుభాగంతో పాటు ఖాళీ సిగరెట్ పెట్టలు దగ్ధమయ్యాయయి. ఈ ప్రమాదం వల్ల రూ.10 లక్షల నష్టం జరిగినట్టు అగ్నిమాపక అధికారి పి.నాగేశ్వరావు తెలిపారు. -
ఎంఎస్ఎంఈ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్పై చర్యలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పూడి రెవెన్యూ పరిధిలో గల ఎంఎస్ఎంఈ కళాశాలలో విద్యార్థులు, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్కు మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జీఎం రాజశేఖర్ రంగంలోకి దిగి, శనివారం కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థులతో పాటు అధికారులతో చర్చలు జరిపారు. ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసిన విద్యార్థుల వద్ద వివరాలు తెలుసుకొన్నారు. ఐదుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ను రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్ మేరకు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మురళీకృష్ణను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో మరో విభాగాధిపతి వెంకటేశ్వరరావును ప్రిన్సిపాల్గా నియమించాలని సూచన ప్రాయంగా నిర్ణయించారు. ప్రిన్సిపాల్ను మారుస్తున్నట్లు తెలియడంతో విద్యార్థులు శాంతించారు.సోమవారం నుంచి యథావిధిగా తరగతులు నిర్వహించాలని యాజమాన్యం ఆదేశించింది. ఏఐఎస్ఎఫ్ ఆందోళన... ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారని తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అయితే యాజమాన్యం ఏఐఎస్ఎఫ్ సభ్యులను లోనికి అనుమతించలేదు.ఇదే సమయంలో జీఎం రాజశేఖర్ రావడంతో చర్చలు జరిపారు. ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబ్జి,కార్యదర్శి ఫణీంద్రకుమార్,జిల్లా నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
రేబాక–అల్లుమియ్యపాలెం రోడ్డుకు చంద్రగ్రహణం
నక్కపల్లి: రేబాక–అల్లుమియ్యపాలెం రోడ్డు నిర్మాణానికి చంద్రగ్రహణం పట్టింది. నక్కపల్లి , ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలకు అనుసంధానం చేస్తూ పలు గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించేందుకు గత వైఎస్సార్సీసీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.8 కోట్ల వ్యయంతో రేబాక నుంచి సీతం పాలెం, తిరుపతి పాలెం మీదుగా అల్లుమియ్యపాలెం నుంచి కోటవురట్ల, నర్సీపట్నం వెళ్లేందుకు సుమారు 11.6 కిలో మీటర్ల మేర తారు రోడ్డు నిర్మించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. ఈ రోడ్డు నిర్మిస్తే రేబాక , అల్లుమియ్యపాలెం మీదుగా కోటవురట్ల, నర్సీపట్నం చేరుకునేందుకు సుమారు 20 కిలోమీటర్లదూరం తగ్గడంతోపాటు, సమయం ఆదా అవుతుంది. గత ఏడాది ఫిబ్రవరి16న అప్పటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రోడ్డు నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కగ్రామానికి కూడా సరైన రోడ్డు సదుపాయం కల్పించకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను తమ ప్రభుత్వంలోనే మంజూరు చేసినట్టు ప్రచారం చేసుకున్నారు. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలోనే నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయంటూ ఫొటోలు, వీడియోలు తీయించి సోషల్మీడియాలో ప్రచారం చేయించుకున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికే దాదాపు 40 శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగు కల్వర్టులు నిర్మించారు. తర్వాత మధ్యలో ఆగిపోయాయి. 10 నెలలుగా బ్రేక్ రేబాక నుంచి సీతంపాలెం వరకు 3 కిలోమీటర్ల సిమెంట్ వెట్మిక్స్ వేసి రోలింగ్ చేసి వదిలేశారు. సుమారు 10 నెలలనుంచి ఈ పనులను అలాగే వదిలేశారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డుపై బీటీ వేయకపోవడం వల్ల రాళ్లు లేచిపోయి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆయా గ్రామాల వారు చెబుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తిచేయాల్సి ఉంది. కానీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాకపోకలు సాగించేవారు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రేబాక, తిరుపతిపాలెం, అల్లుమియ్యపాలెం గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న మామిడి, జీడితోటల నుంచి సేకరించి పండ్లను ఈమార్గంలోనే రవాణా చేయాలి. రోడ్డు నిర్మాణం పూర్తయితే రైతులకు రవాణా ఖర్చులు కూడా తగ్గుతారయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. రహదారి కష్టాలు తీర్చాలి రోడ్డు పనులు నిలిచిపోయి 10 నెలలు అయింది. రాళ్లు పైకి లేచిపోతున్నాయి. ఈ రోడ్డుపూర్తయితే నక్కపల్లి, కోటవురట్ల మధ్య రహదారి సదుపాయం మెరుగు పడుతుంది. గిరిజనుల రహదారి కష్టాలు తొలగిపోతాయి. కాంట్రాక్టర్ను అడిగితే సంక్రాంతి తర్వాత తిరిగి మొదలు పెడతామంటున్నారు. అధికారులు స్పందించి ఈ రోడ్డుపూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలి. 27ఏడిఆర్06 – సాదిరెడ్డి శ్రీను, సర్పంచ్,రేబాక వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గిరిజన గ్రామాలకు తారు రోడ్డు సదుపాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ద్వారా నాటి సీఎం జగనన్న దృష్టికి తీసుకెళ్లి రూ.8 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. అప్పట్లోనే పనులు సగం పూర్తయ్యాయి. తాజాగా ఈ రోడ్డుకు తమ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందంటూ టీడీపీ నాయకులు సోషల్మీడియాలో ప్రచారం చేసుకున్నప్పటికీ పనులు పూర్తిచేయలేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ పనులు పూర్తిచేయించాలి. – వీసం రామకృష్ణ, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి -
మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి
నర్సీపట్నం: వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు అప్పగించడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. విద్య, వైద్యంను ప్రజలకు అందించడం ప్రభుత్వం కనీస బాధ్యత అని చెప్పారు. విశాఖలో జరిగిన ప్రధాన మంత్రి కార్యక్రమం, పరిశ్రమల సమ్మెట్ల పేరిట రూ.వేల కోట్లు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథాగా ఖర్చు చేసిందన్నారు. దీని వల్ల ఒకరికై నా ఉపాధి కలిగిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆ డబ్బుతో పాడేరు, నర్సీపట్నం మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చని చెప్పారు. పీపీపీ పేరుతో ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పటికీ ఒకరే ముందుకువచ్చారని, ఒక డాక్టర్ వేశారని, మేము కాదని కిమ్స్ యాజమాన్యం ప్రకటించడం చంద్రబాబు ప్రభుత్వంపై వారుకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ అరెస్ట్లకు పాల్పడుతోందని మండిపడ్డారు. బల్క్డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన సీసీఎం నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించటం అన్యాయమన్నారు. జిల్లాలో తీరప్రాంతంలోని భూములని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు.ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజయ్యపేట ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో బల్క్డ్రగ్ పార్కును పెట్టబోమని సీఎం చంద్రబాబునాయుడు నోటి మాటగా చెప్పారని, అలాకాకుండా నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఆ భూములను మిట్టల్ కంపెనీకి అప్పజెప్పేందుకు ప్రభుత్వం నాటకం ఆడుతోందని ఆరోపించారు. సీపీఎం కేంద్ర కమిటీ నాయకులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, అడిగర్ల రాజు, సాపిరెడ్డి నారాయణమూర్తి, గౌరీ, సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తకోట ఏఎస్ఐకు రాష్ట్ర స్థాయి పురస్కారం
అవార్డు అందుకుంటున్న ఏఎస్ఐ అప్పారావు రావికమతం: మండలంలో కొత్తకోట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ అప్పారావు కమెండేషన్ డిస్క్ –2025, బ్రాంజ్ డిస్క్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు జిల్లాలో 14 మందిని ఎంపిక చేస్తూ డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొత్తకోట ఏఎస్ఐ అప్పారావు తన 36 ఏళ్ల సర్వీస్లో ఎటువంటి రిమార్క్ లేకుండా పని చేయడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అమరావతిలో డీజీపీ నుంచి పురస్కారం అందుకున్నారు. 1989లో ఏఆర్ కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. 2005లో సివిల్ కానిస్టేబుల్, 2010లో హెడ్ కానిస్పేబుల్గా, 2014లో ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. రావికమతం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, జి.మాడుగుల, సీలేరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది అభినందించారు. -
ఏడు ద్విచక్రవాహన యజమానులకు జరిమానా
యలమంచిలి రూరల్ : మైనర్లకు వాహనాలిస్తే వాహన యజమానులదే బాధ్యత అని,చట్టప్రకారం మైనర్లకు వాహనాలివ్వడం నేరమని యలమంచిలి ట్రాఫిక్ ఎస్సై బి రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన సిబ్బందితో కలిసి యలమంచిలి పట్టణంలో పలుచోట్ల విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని పలువురు యువకులకు పట్టణ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరు మైనర్లు బైకులు నడుతూ పట్టుబడ్డారు. ఆ వాహనాల యజమానులకు ఒక్కొక్కరికి రూ.5035 చొప్పున, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారికి ఒక్కొక్కరికి రూ.1035 చొప్పున జరిమానాలు విధించారు. ర్యాష్ డ్రైవింగ్,హెల్మెట్ ధరించకుండా బైకులు నడపడం వల్ల వచ్చే అనర్థాలను యువకులకు వివరించారు. రహదారి నిబంధనలు పాటించాలని సూచించారు. వేగం కన్నా ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ప్రయాణించడం ముఖ్యమని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నర్సీపట్నం : మాకవరపాలెం మండలం, పైడిపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బూరుగుపాలెం గ్రామానికి చెందిన వానపల్లి లోవరాజు (23) రాచపల్లి అన్రాక్ పయనీర్ రిఫైనరీ కంపెనీలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి నైట్ డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా బైక్లు ఢీ కొనడంతో లోవరాజు తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. అంబులెన్స్లో విశాఖకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చేతికి అందించి వచ్చిన కొడుకు మృత్యువాత పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి ఎస్ఐ దామోదర్నాయుడు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీ కొండచిలువ హతం
వాకపల్లి మెట్ట సమీపంలో స్థానికుల చేతిలో హతమైన భారీ కొండ చిలువ దేవరాపల్లి: మండలంలోని వాకపల్లి మెట్ట సమీపంలో గురువారం భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. స్థానిక పంట పొలాల్లో సంచరిస్తూ రైతుల కంట పడింది. సుమారు 10 అడుగుల మేర పొడవున్న కొండ చిలువను చూసిన రైతులు ఆందోళనతో ఒక్కసారిగా పరుగులు తీశారు. కొంత సేపటి తర్వాత తేరుకున్న రైతులు పశువులకు ప్రమాదం పొంచి ఉండడంతో అతి కష్టం మీద కర్రలతో కొట్టి హతమార్చారు. గ్రామంలో తొలిసారిగా భారీ కొండ చిలువ రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యంగా వీక్షించారు. -
అనుమానమే ఉసురు తీసింది...
యలమంచిలి రూరల్ : యలమంచిలి ధర్మవరం సీపీ పేటలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి సీఐ ధనుంజయరావు చెప్పారు. యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన వివరాలు చెప్పారు. ఆయన మాటల్లోనే..ఉత్తరప్రదేశ్ కబీర్నగర్ జిల్లా నందాపూర్ గ్రామానికి చెందిన రాకేష్(27), మాయ(32) పదేళ్ల కితం ప్రేమవివాహం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం పరవాడ,యలమంచిలి ప్రాంతాల్లో నివసించేవారు.ఇటీవల రెండు నెలల క్రితం యలమంచిలిలో సొంతంగా తుక్కు దుకాణం అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలతో పాటు 4 నెలల చిన్నారి పరితో కలిసి పట్టణంలో ధర్మవరంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య తరచూ ఎవరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్టు గమనించిన రాకేష్,ఆమెకు ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానపడ్డాడు.ఈ విషయమై పలుమార్లు ఆమెను మందలించాడు. నెలరోజులుగా భార్యాభర్తల మధ్య ఈ విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కుమార్తె పరికి డైపర్లు అవసరమై కొని తెచ్చేందుకు తుక్కు దుకాణంలో భార్యను ఉంచి బయటకు వెళ్లాడు రాకేష్. పని పూర్తి చేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చేసరికి భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం పసిగట్టి ఆమెను నిలదీశాడు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కోపంతో రగిలిపోయిన రాకేష్ నియంత్రణ కోల్పోయి ఆమెను గోడకు గుద్దించి, విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత కోపంతో అక్కడున్న స్క్రూడ్రైవర్తో ఛాతీ పై పలుమార్లు పొడిచి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన మాయ స్పృహ కోల్పోవడంతో తుక్కు దుకాణం యజమాని సాయంతో తొలుత స్థానిక కమలా ఆస్పత్రికి, అక్కడ్నుంచి యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మాయ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించడంతో నిందితుడు రాకేష్ జరిగిన విషయం చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు స్వయంగా నేరం అంగీకరించినట్టు సీఐ తెలిపారు. మృతురాలు ఎవరితో మాట్లాడుతుందనేది నిందితుడికి కూడా తెలియదని చెబుతున్నాడని, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో తెలుసుకోవాల్సి ఉందన్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో 4 నెలల చిన్నారిని తాత్కాలికంగా జిల్లా పిల్లల సంరక్షణ కమిటీకి అప్పగించామన్నారు.మృతురాలి బంధువులు ఉత్తరప్రదేశ్ నుంచి రావాల్సి ఉందని,వారొచ్చేవరకు మాయ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి శవాగారంలో భధ్రపరిచామన్నారు.వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని,నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
28 నుంచి నాటకోత్సవాలు
అనకాపల్లి: ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకోత్సవాలు స్థానిక జార్జి క్లబ్ ఆవరణలో ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు బీఎస్ఎంకే జోగినాయుడు తెలిపారు. క్లబ్ ఆవరణలో గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంతరించిపోతున్న నాటికలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గతంలో నాటికలకు అనకాపల్లి జిల్లా పుట్టినిల్లన్నారు. హైదరాబాద్ మహతి క్రియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 28 సాయంత్రం 6 గంటలకు గుంటూరు వారిచే ‘సమయం’నాటిక ప్రదర్శన జరుగుతుందని, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభిస్తారన్నారు. అదేరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ మల్లీశ్వరి ఆర్ట్స్ వారిచే ‘నువ్వో సగం–నేనో సగం’నాటిక, 29 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, స్వర్ణసూర్య డ్రామా లవర్స్ వారిచే ‘సీ్త్ర మాత్రే నమః’నాటిక, రాత్రి 8 గంటలకు కాకినాడ, బీవీకే క్రియేషన్స్ వారిచే ‘కన్నీటికి విలువెంత’, ఈనెల 30 సాయంత్రం 6 గంటలకు శ్రీకాకుళం శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం వారిచే ‘మాయాజాలం’, రాత్రి 8 గంటలకు పెందుర్తి నటరాజ డ్రమెటిక్ అసోసియేషన్ వారిచే ‘నీళ్లు–నీళ్లు’నాటికల ప్రదర్శనలు ఉంటాయన్నారు. నాటిక ప్రదర్శనల ప్రతిరోజు లక్కీ డిప్ డ్రా ద్వారా ప్రేక్షకులకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి బుద్ద కాశీ విశ్వేశ్వరరావు, కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్, నాటకోత్సవాల కన్వీనర్ కె.ఎం.నాయుడు, క్లబ్ సభ్యులు డి.రామకోటేశ్వరరావు, కె.బి.ఎం.వెంకటరావు, కాండ్రేగుల వాసు, ఆడారి రమణ, జి.శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు మెగా జాబ్మేళా
అనకాపల్లి: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఈనెల 27న అడ్డురోడ్డు గ్రామం ఎస్.వి.ఎస్ డిగ్రీ కళాశాలలో 17 కంపెనీలతో మెగా జాబ్మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ జిల్లా అధికారి ఎన్.గోవిందరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్మేళాకు హాజరయ్యే నిరుద్యోగ అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ వరకు చదువుకొని, 18 నుంచి 40 సంవత్సరముల కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరైన నిరుద్యోగులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంటర్వ్యూలకు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని, ఆధార్కార్డు, ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్లు జెరాక్స్ను తీసుకుని రావాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు సెల్.8247505171 నంబర్లను సంప్రదించాలని కోరారు.నేడు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు మహారాణిపేట : జెడ్పీ స్థాయీ సంఘం సమావేశాలు శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఆమె చాంబర్ సమీపంలోని వి.సి.హాలులో 1 నుంచి 7 వరకు గల స్థాయీ సంఘ సమావేశాలు వేర్వేరుగా ఉదయం 11 నుంచి 2 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు ప్రగతి నివేదికలతో సమావేశాలకు హాజరుకావాలని తెలిపారు. -
నేటి నుంచి అమల్లోకి కొత్త రైల్వే చార్జీలు
తాటిచెట్లపాలెం: భారతీయ రైల్వే ప్రకటించిన సవరించిన ప్రయాణ చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ అధికారులు కొత్త చార్జీల వివరాలను వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై స్వల్ప భారం పడనుండగా, నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, సామాన్యులకు మాత్రం రైల్వే శాఖ ఊరటనిచ్చింది. సబర్బన్/సీజన్ టికెట్లకు మినహాయింపు: సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారికి, మంత్లీ సీజన్ టికెట్ కలిగిన వారికి చార్జీలలో ఎటువంటి పెంపు లేదు. స్వల్ప దూర ప్రయాణికులకు ఊరట: ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి పాత చార్జీలే వర్తిస్తాయి. వీరిపై ఎటువంటి అదనపు భారం ఉండదు. ఆర్డినరీ క్లాస్: 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్ప్రెస్: 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
ఆర్ఏఆర్ఎస్.... సర్కారు కేర్లెస్
చెరకు, చిరుధాన్యాల రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా గత ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ఆర్ఏఆర్ఎస్లో పీఎంఎఫ్ఎంఈ (ప్రైమ్మినిస్టర్స్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రొసెసింగ్ ఎంటర్ప్రైజెస్) పథకం కింద రూ.3.7 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ను చంద్రబాబు ప్రభుత్వం మూలన పడేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిగా నిధులు విడుదలైనా..నేటి వరకూ అందులో మెషినరీకి టెండర్ ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తి చేయలేదు. శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, అనకాపల్లి : చెరకుపై ఆధారపడి జీవించే రైతులు..ఏజెన్సీ ప్రాంతం, ఆ ప్రాంత సమీపంలో ఉన్న రైతులు పండించే మిల్లెట్స్, పనస పంటల ద్వారా అధిక లాభాలార్జించే విధంగా ఆర్ఏఆర్ఎస్లో ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గత వైఎస్సార్సీపీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి ప్రోత్సాహంతో పీఎంఎఫ్ఎంఈ (ప్రైమ్మినిస్టర్స్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రొసెసింగ్ ఎంటర్ప్రైజెస్) పథకంలో భాగంగా రూ.3.7 కోట్లతో ఈ మోడల్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి వాటిని ఎగుమతి చేసేందుకు, రైతులకు ప్రయోజనం చేకూర్చి, అధిక లాభార్జించేందుకు ఆర్ఏఆర్ఎస్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఉపయోగపడుతుంది. 2023లో అప్పటిఅనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎన్జీరంగా అగ్రి యూనివర్శిటీ వీసీ విష్ణువర్దన్రెడ్డి ఈ ఇంక్యుబేషన్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే ఇంక్యుబేషన్ భవనం నిర్మాణం పూర్తయింది. అలాగే ప్రారంభించడం కూడా జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిగా నిధులు విడుదలైనా..ఆనాటి నుంచి నేటి వరకూ కనీసం అందులో మెషినరీకు టెండర్ ప్రక్రియను కూడా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేదు. నిధులున్నా నిర్మాణం జరగకుండా మూలన పడేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆ ప్రాజెక్టును కాలయాపన చేస్తూ వచ్చారు. ఇంక్యుబేషన్ కేంద్రంలో యంత్రాలు కొనుగోలు చేసి..ఒక థర్డ్పార్టీ ఏజెన్సీకి మార్కెటింగ్ ప్రక్రియను అప్పగిస్తే ఇప్పటికే రైతులకు మేలు చేకూరి ఉండేది. చెరకు, చిరుధాన్యాలు, పనస పండించే రైతులకు అండగా నిలవడంతో పాటు అధిక లాభాలు చేకూరుతాయి. ప్రధానంగా చెరకు ఆధారిత రైతులందరికీ ఇదో మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. వీరితో పాటు పనస, మిల్లెట్స్ పండించే గిరిజన రైతులు కూడా అధిక లాభాలు ఆర్జించవచ్చు.. ఇంక్యుబేషన్ సెంటర్ పూర్తయితే రైతులే అతితక్కువ ధరతో ఉత్త్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్ఏఆర్ఎస్ ద్వారానే ఎగుమతి చేసి లాభాలు ఆర్జించవచ్చు. రైతులకు లాభసాటిగా.. ఇంక్యుబేషన్ సెంటర్లో ఏర్పాటు చేసే సౌకర్యాలను ఎప్పటికప్పుడు రైతులకు వివరించడం, చిన్నపాటి సంస్థలకు వాటి వ్యాపార సరళిలో మెలుకువలు చెబుతారు. బెల్లం ఉత్పత్తులు, బెల్లం పొడి, జొన్న బిస్కెట్లు, ఓట్స్ బిస్కెట్లు, జెల్లీలు, చాక్లెట్లు, పల్లి చెక్కీలు, పనస జామ్, పనస విత్తన పిండి, పనస పట్టు వంటి ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతులు చేస్తారు. ●వీటిలో చెరకు ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఘన బెల్లం, పొడి బెల్లం, బెల్లం విలువ ఆధారిత ఉత్పత్తులు, బెల్లం జొన్న బిస్కెట్లు, బెల్లం ఓట్సు బిస్కెట్లు, బెల్లం జెల్లీలు, బెల్లం చాక్లెట్లు, బెల్లం పల్లి చెక్కీలను తయారు చేస్తారు. ●చిరు ధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ నుంచి చిరు ధాన్యాల పిండి, చిరు ధాన్యాల మాల్ట్, చిరు ధాన్యాల పోషక బార్, మల్టీ మిల్లెట్ దోశ మిక్స్, మల్టీ మిల్లెట్ రొట్టె, పఫ్డ్ చిరుధాన్యాలు, చిరుధాన్యాల అటుకులు తయారు చేస్తారు. ●పనస ప్రాసెసింగ్ యూనిట్ నుంచి పనస జామ్, పనస విత్తన పిండి, ఉడికించడానికి సిద్ధంగా ఉన్న లేత పనసపొట్టు తయారు చేస్తారు. నిధులున్నా మూలన పడేశారు.. రైతులకు ప్రయోజనం చేకూరాలనే ముందు చూపుతో ఆర్ఏఆర్ఎస్కు రూ.3.7కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ను తీసుకొచ్చాం. మా హయాంలో భవనం నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాం. నాలుగు సార్లు కేంద్ర బృందం వచ్చింది. అప్పుడు గ్రాంట్ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ వారు వాస్తవ పరిస్థితులు తెలుసుకునే నిధులు మంజూరు చేస్తారు. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఉపయోగపడుతుంది. బెల్లం, చిరు ధాన్యాలు, పనస ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతులు చేయడం, ఒక వేల రైతులే మార్కెటింగ్ చేసుకుంటారంటే వారికే తక్కువ ధరకే ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తారు. ఇది అతి పెద్ద మోడల్ ప్రాజెక్టు. ఎంఎస్ఎంఈతో అనుసంధానం చేసిన ప్రాజెక్టు ఇది. ఏడాదిన్నరగా నిధులున్నా..ప్రభుత్వం మూలన పడేసింది. అందులో మెషనరీకి టెండర్ కూడా వేయకపోవడం విచారకరం. – భీశెట్టి వెంకట సత్యవతి, మాజీ ఎంపీ, అనకాపల్లిచెరకు, చిరుధాన్యాలు, పనస ఉత్పత్తుల తయారీ..మూడు రకాల చెరకు, చిరుధాన్యాలు, పనస ఉత్పత్తులను తయారు చేసి వాటిని నేరుగా రైతులకు ఇవ్వడం, లేదా ఎగుమతి చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నాణ్యమైన బెల్లం తయారీతో పాటు బెల్లం ఆధారిత ఉత్పత్తులు, చిరు ధాన్యాలు, పనస ఉత్పత్తులను ఇక్కడ నుంచే దేశం నలుమూలల ఎగమతులు చేయవచ్చు. దీంతో చెరకు, చిరుధాన్యాలు, పనస పండించే రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అధిక లాభాల ఆర్జించేందుకు దోహదపడనున్నాయి. నాణ్యమైన బెల్లం తయారీకి బెల్లం పొయ్యి నమూనా, రూ.3.5 కోట్లతో చెరకు, చిరు ధాన్యాలు, పనసల ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తే..వాటిలో రూ.1.37 కోట్లతో చెరకు ప్రాసెసింగ్ లైన్లు, రూ.66 లక్షలతో చిరు ధాన్యాల ప్రోసెసింగ్ లైన్లు, రూ.21 లక్షల పనస ప్రోసెసింగ్ లైన్లు, రూ.25 లక్షలతో ఆహార ప్రయోగశాల ఏర్పాటు చేశారు. -
హైవేపై టిప్పర్ దగ్ధం
యలమంచిలి రూరల్ : షార్ట్ సర్క్యూట్తో టిప్పర్ లారీ దగ్ధమైన ఘటన యలమంచిలి మండలం పులపర్తి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఏపీ39యూవై0459 నంబరు గల టిప్పర్ లారీ అన్నవరంలో బొగ్గు అన్లోడ్ చెసి తిరిగి విశాఖపట్నం వెళ్తుండగా పులపర్తి వద్దకు చేరుకున్న సమయంలో ఇంజన్ నుంచి పొగలు, మంటలు వస్తున్నట్టు గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఆపి కిందకు దిగిపోయాడు. కొద్దిసేపటికే వాహనమంతా మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో సమాచారం అందుకున్న యలమంచిలి విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది అగ్నిమాపక శకటంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. హైవేపై రాకపోకలు సాగించే వాహనాలకు మంటలు వ్యాపించకుండా చేశారు. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక కేంద్రం అధికారి రాంబాబు తెలిపారు. -
ఇంటి స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య కోట్లాట
రావికమతం: మండలంలోని కొత్తకోటలో ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య జరిగిన కోట్లాటలో ముగ్గురు గాయపడ్డారు. కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు కొత్తకోటకు చెందిన అడ్డూరి భూలేక, కలం రాజమోహన్ కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా ఇంటి స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 218–6లో గల 206 గజాల ఇంటి స్థలాన్ని శ్యామల దగ్గర 2016లో కొనుగోలు చేశామని రాజమోహన్ తెలిపారు. 218 సర్వే నంబర్లో 1947లో తమ పూర్వీకులు 780 గజాలు కొనుగోలు చేశారని ఆనంద్ పేర్కొన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. రాజమోహన్ కోర్డుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని గురువారం వివాదాస్పద స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా అడ్డూరి అనంద్, తండ్రి భూలేక అభ్యంతరం తెలిపారు. దీంతో కలం రాజమోహన్, అతడి తల్లి లక్ష్మి, అడ్డూరి భులేక, ఆనంద్ ఘర్షణ పడ్డారు. చేతికి దొరికిన వస్తువులతో పరస్పరం దాడులు చేసుకుని రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. ఆనంద్, భులేక, కలం రాజమోహన్ల తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారికి కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చిక్సిత చేయించి అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరిలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. గాయపడ్డ కలం రాజమోహన్, అడ్డూరి భులేక, అడ్డూరి ఆనంద్ -
● ములకలాపల్లిలో అగ్నిప్రమాదం ● రూ. 25 లక్షల మేర ఆస్తి నష్టం ● రూ.5 లక్షల నగదు, 8 తులాల బంగారు అభరణాలు అగ్నికి ఆహుతి ● కట్టుబట్టలతో బాధితులు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు ఆహుతి దేవరాపల్లి : మండలంలోని ములకలాపల్లిలో ఓ ఇంటిలో గురువారం చోటుచేసుకున్న విద్యుత్ షార్టు సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన షేక్ ఈశ్వరమ్మ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల నగదు, 8 తులాల మేర బంగారు అభరణాలు, వెండి ఆభరణాలు, సర్టిఫికెట్లు, ఇంటిలోని ఇతర సామగ్రితో సహా అగ్నికి ఆహుతయ్యాయి. వెరసి సుమారు రూ. 25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. షేక్ ఈశ్వరమ్మ కుమారుడు అప్పాసాహెబ్ ఇటీవల మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. క్రిస్మస్ సెలవు కావడంతో అప్పాసాహెబ్ బుధవారం రాత్రి ఇంటికి వచ్చాడు. అదే ఇంటిలో ఉంటున్న తన బావ, అక్క కలిసి గురువారం మాంసం దుకాణం వద్దకు వెళ్లగా, అప్పాసాహెబ్ తన పిల్లలతో కలిసి చోడవరం వెళ్లారు. దీంతో అతని తల్లి ఇంటికి తాళం వేసి పొలం పనికి వెళ్లిపోయింది. ఎవరూ లేని సమయంలో ఈశ్వరమ్మ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని స్థానికులు గమనించి కుటుంబ సభ్యులతో పాటు చోడవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధిత కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకొని చూడగా అప్పటికే ఇళ్లంతా కాలి బూడిదయ్యింది. తిండిగింజలతో సహా బూడిద... ఇంటి అవసరాల నిమిత్తం బ్యాంక్లో కొంత బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ. 2 లక్షలు, తన మేనల్లుడు రఫీ వ్యాపారం నిమిత్తం అప్పుగా తెచ్చిన మరో రూ. 2 లక్షలు, తన తల్లి దాచుకున్న రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, వెండి అభరణాలు కాలిబూడిదయ్యాయని బాధిత ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులు భోరున విలపించారు. వీటితో పాటు సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డులు, గృహోపకరణాలు సహా తిండి గింజలు ఇతర సామగ్రి పూర్తిగా కలిబూడిద కావడంతో కట్టుబట్టలతో వారంతా రోడ్డున పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను, ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి... తన కుమారుడికి ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో తన కష్టాలు గట్టెక్కాయని ఆనందపడుతున్న తరుణంలో ఇల్లు, ఇంట్లో సామగ్రి అంతా కాలి బూడిదవ్వడంతో బాధిత ఈశ్వరమ్మ కన్నీటి పర్యంతమయ్యింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. -
క్రషింగ్ చేపట్టకపోతే ఆందోళన ఉధృతం
చోడవరం: ఈ ఏడాది గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఫ్యాక్టరీ మెయిన్గేటు వద్ద గురువారం రైతు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, ఏపీ రైతు సంఘం, సీపీఐ, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఫ్యాక్టరీని కాపాడతామని, చెరకు రైతులకు అండగా నిలుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చోడవరం, మాడుగుల కూటమి ఎమ్మెల్యేలు, అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు రైతులను పూర్తిగా మోసం చేశారని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయంగా తీసురాలేకపోయారని వారు ధ్వజమెత్తారు. తమను గెలిపిస్తే ఫ్యాక్టరీని ఆధునికీకరించి, చెరకు రైతులకు టన్నుకి రూ. 4 వేలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి రైతులు, రైతు కూలీలతో ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేపోయి, రైతులను మోసంచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో ఫ్యాక్టరీకి ప్రభుత్వ సాయం తెచ్చి రైతుల చెరకు బకాయిలు వెంటనే తీర్చాలని, అదే విధంగా ఈ ఏడాది ఫ్యాక్టరీ క్రషింగ్ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని మూసివేసే ఆలోచన చేస్తే రైతులు, కార్మికులు అంతా కలిసి ఐక్యంగా ప్రత్యక్ష ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. చెరకు రైతుల పరిస్థితి ఏంటో ప్రభుత్వం చెప్పాలని, మూసివేసే ఆలోచన విరమించుకుని క్రషింగ్ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు లేక ఆకలితో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, ఏడువాక సత్యారావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, సీపీఎం జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ శానాపతి సత్యారావు, మూడెడ్ల శంకర్రావు, సమితి ప్రతినిధులు దండుపాటి తాతారావు, దొడ్డి అప్పారావు, జెర్రిపోతుల నానాజీ, సుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, సోమిరెడ్డి నాయుడు, ప్రజా సంఘం ప్రతినిధి వరప్రసాద్, వ్యవసాయ కూలీ సంఘం ప్రతినిధి కోన మోహన్రావు, సీఐటీయూ నాయకుడు ఎస్వీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వెలుగురేఖ సమైక్య
అమ్మ కష్టాన్ని చూసి ఆదుకున్నారు! ‘మాది రాజాం. మా అమ్మ ఐస్క్రీం పార్లర్లో పనిచేస్తూ మమ్మల్ని చదివించేది. సత్యనారాయణ సార్ నా ప్రతిభను గుర్తించి ఇంటర్ నుంచి సీఏ పూర్తయ్యే వరకు దాదాపు రూ.65 వేలు ఖర్చు చేసి చదివించారు. నేడు విప్రోలో చార్టెడ్ అకౌంటెంట్గా నెలకు రూ.90 వేలు సంపాదిస్తున్నా. సార్ స్ఫూర్తితో నేను కూడా ఇప్పుడు ఒక విద్యార్థిని చదివిస్తున్నా. – భవిరిశెట్టి కోటేశ్వరరావు, సీఏ, విప్రో ఇద్దరు విద్యార్థులను చదివిస్తున్నా శ్రీకాకుళంలో విద్యనభ్యసించి, విశాఖపట్నంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సత్యనారాయణ సర్ ఆర్థిక సహకారంతో బ్యాంక్ పరీక్షల్లో విజయం సాధించా. 2018లో ఐడీబీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా ఎంపికై , ప్రస్తుతం మధురవాడ బ్రాంచ్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. నాపై చూపిన ఉదారతను స్ఫూర్తిగా తీసుకుని, ప్రస్తుతం మా ఊరిలో ఇద్దరు విద్యార్థుల పూర్తి విద్యా ఖర్చులను నేను భరిస్తున్నాను. – రేగాన సింహాచలం, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ మధురవాడ తాటిచెట్లపాలెం: ఒక చిన్న దీపం వేల జీవితాల్లో వెలుగులు నింపగలదు. ప్రతిభ ఉండి, ఆర్థిక స్థోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తోంది ’సమైక్య’ సంస్థ. విశాఖ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న సూరిశెట్టి సత్యనారాయణ (అనకాపల్లి జిల్లా, రాజుపేట గ్రామం) తన మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ● చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం, కష్టాలే ఆయన్ని ఈ మార్గంలో నడిపించాయి. ‘చదువు ఒక్కటే తరాల తలరాతను మార్చగలదు‘ అని నమ్మే ఆయన, ఇప్పటివరకు 12 మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఆ సంఖ్యను వందకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఆయన వద్ద సాయం పొందిన విద్యార్థులు ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ, తిరిగి మరికొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఈ ’సమైక్య’ సాధించిన అసలైన విజయం. ప్రతిభావంతులకు ఆర్థిక ప్రోత్సాహం నా గత అనుభవాలు, పల్లెటూరి విద్యార్థుల కష్టాలను ప్రత్యక్షంగా చూడటం వల్లే ప్రతిభావంతులకు అండగా నిలవాలనే సంకల్పం భగవంతుడు కలిగించాడు.పేదరికం నుంచి విముక్తి , భావితరాల భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం విద్యకే ఉంది.ఆకలి బాధ తెలిసిన వాడికే అన్నం విలువ తెలిసినట్లు, పేద విద్యార్థులకు మనం ఇచ్చే ప్రతి రూపాయి వారి కలలకు ప్రాణం పోస్తుంది. సరైన ప్రోత్సాహం, భరోసా ఉంటే ఆ విద్యార్థులు తమ లక్ష్యాల వైపు మరింత దృఢంగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఇదే ఆశయంతో, ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వెన్నుముకగా నిలిచేందుకు ‘సమైక్య’ నిరంతరం కృషి చేస్తోంది. – సత్యనారాయణ, ౖరెల్వే అధికారి, విశాఖపట్నం ప్రతి అడుగులో తోడున్నారు! రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను నేడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ME)లో జూనియర్ ఇంజనీర్గా ఉండటానికి సత్యనారాయణ, సమైక్య టీమ్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. పరీక్షలకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి, ఉద్యోగంలో చేరే వరకు ప్రతి దశలో వారు నాకు మార్గనిర్దేశం చేశారు. మాలాంటి ఎంతోమంది యువతకు సమైక్య ఒక వెలుగురేఖ. –దాడి వెంకటేశ్వర స్వామి, జూనియర్ ఇంజనీర్, మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కరపత్రం నా జీవితాన్ని మార్చింది! బిటెక్ చదివే రోజుల్లో గేట్ కోచింగ్కు డబ్బుల్లేక లైబ్రరీలో చదువుకునే వాడిని. అక్కడ నోటీసు బోర్డుపై సత్యనారాయణ గారి నంబర్ చూసి సంప్రదించా. ఆయన నన్ను కోచింగ్లో చేర్పించి, ఆర్థిక సాయంతో పాటు నిరంతరం గైడెన్స్ ఇచ్చారు. నేడు బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీలో టెక్నికల్ డిజైనర్గా స్థిరపడ్డా. – షేక్ తాజ్ అహ్మద్, ప్యుస్ట్ గ్లోబ్ కంపెనీ పేద విద్యార్థులకు బాసట దత్తత తీసుకుని ప్రోత్సాహం రైల్వే ఉన్నతాధికారి సత్యనారాయణ ఆదర్శం కొనసాగిస్తున్న సేవాయజ్ఞం వంద మందికి ఆసరా ఇవ్వడమే లక్ష్యం -
భగవద్గీత కంఠస్థ పోటీల్లో జిల్లాకు బహుమతులు
అక్షయ ఈర్ల జ్యోతిపి.హన్విక సుమలత అనకాపల్లి: విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రస్థాయి భగవద్గీత 12వ అధ్యాయం కంఠస్థ పోటీలు ఈనెల 25న విజయవాడలో జరిగాయి. ఈ పోటీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన ఒకటో విభాగంలో పి.హన్విక (యలమంచిలి) ప్రథమ బహుమతి, నాలుగవ విభాగంలో పి. హేమ అక్షయ తృతీయ బహుమతి(యలమంచిలి), మహిళా విభాగంలో ఈర్ల జ్యోతి (కొత్తూరు, అనకాపల్లి) ద్వితీయ బహుమతి, ఎం. సుమలత (అనకాపల్లి) ప్రోత్సాహక బహుమతి గెలిపొందినట్లు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రముఖ్ శ్రీకాళహస్తి జిల్లా అధ్యక్షుడు డి.డి.నాయుడు, కోశాధికారి గోకవరపు రమేష్ గురువారం తెలిపారు. -
ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్గా కృష్ణవేణి
నర్సీపట్నం : నేషనల్ బాక్సింగ్ క్రీడాకారిణి కె.కృష్ణవేణి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్గా ఉద్యోగం సాధించింది. బాక్సర్గా 14కు ఫైగా జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంది. అంతర్జాతీయ చెస్ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే 15కు పైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో 10కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించింది. నర్సీపట్నం ప్రభుత్వ జెడ్పీ బాలికల హైస్కూల్లో చదువుకుని ఆమె బాక్సింగ్ నేర్చుకుంది. తండ్రి శ్రీను కరాటే క్రీడాకారుడు కావడంతో ఆమెను బాక్సింగ్ క్రీడాకారిణిగా రాణించేందుకు ప్రోత్సహించారు. విద్యార్థి దశ నుంచి నింజాస్ అకాడమీ కోచ్ అబ్బు వద్ద బాక్సింగ్లో తర్ఫీదు పొందింది. కోచ్గా ఉద్యోగం రావడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అకాడమీ మెంబర్లు హర్షం వ్యక్తం చేశారు. -
ఘనంగా పగల్పత్తు ఉత్సవాలు
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పగల్పత్తు ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి బంగారుచాయ పల్లకిలో వేంజేపచేశారు. తెల్లవారుజామున ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. షోడషోపచార పూజలు జరిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి ఆలయ బేడామండపంలో తిరువీధి వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో 10వ పాశుర విన్నపం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. -
రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు
రావికమతం : టి.అర్జాపురం శివారు చిలకవానిపాలెం ఇటికుల బట్టీ దగ్గరలో బి.ఎన్.రోడ్డు మార్గంలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా వమ్మంగి, ధర్మవరం గ్రామాలకు చెందిన షేక్ మీరా సాహెబ్, వాసులు ఇరువురు కాకినాడ నుంచి పాడేరు వెళుతుండగా వి.మాడుగుల మండలం కింతలి వల్లాపురం గ్రామానికి చెందిన కోన జగ్గారావు, పొంగలిపాక గ్రామానికి చెందిన శెట్టి నాయుడు ఇరువురు కలిసి నర్సీపట్నం వైపు వెళ్లుతున్నారు. చిలకవానిపాలెం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ మీరా సాహెబ్కు చేతికి, వాసుకు తలకు బలమైన గాయాలయ్యాయి. కొత్తకోట పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని క్షతగాత్రులకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి క్షతగాత్రుల నుంచి ఫిర్యాదు అందలేదని కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
సెస్ చెల్లించని నెయ్యి లారీ నిలిపివేత
బలిఘట్టం మార్కెట్ యార్డు చెక్పోస్టు వద్ద నెయ్యి లారీని నిలిపివేసిన మార్కెట్ కమిటి సిబ్బంది నర్సీపట్నం : వ్యవసాయ మార్కెట్ కమిటీ సెస్ కట్టకుండా తరలిస్తున్న నెయ్యి లారీని బలిఘట్టం చెక్పోస్టు వద్ద మార్కెట్ యార్డు సిబ్బంది పట్టుకున్నారు. మార్కెట్ కమిటీకి సెస్ చెల్లించకుండా వ్యాపారస్తులపై ప్రత్యేక దృష్టిసారించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ఇటీవల సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఇటీవల మార్కెట్ కమిటీ సిబ్బంది ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం రాత్రి నర్సీపట్నం నుంచి నెయ్యితో వెళ్తున్న లారీని బలిఘట్టం చెక్పోస్టు వద్ద సిబ్బంది పట్టుకున్నారు. సిబ్బంది లారీ వే బిల్లులను పరిశీలించారు. సుమారు రూ.కోటి 27 లక్షల నెయ్యిని తరలిస్తున్నారు. దీని ప్రకారం మార్కెట్ కమిటీకి సెస్ రూపంలో రూ.లక్షా 27 వేలు వ్యాపారి చెల్లించాల్సి ఉంది. సెస్ చెల్లించిన తరువాతే లారీని విడిచి పెడతామని మార్కెట్ కమిటీ సిబ్బంది వ్యాపారికి సూచించారు. వ్యాపారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో చెక్పోస్టు వద్దే లారీని నిలిపివేశారు. -
అతి వేగంతో అనర్థం..
యలమంచిలి రూరల్: మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగ్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా, ఐదుగురు గాయపడ్డారు.ఈ విషాదకర ఘటన యలమంచిలి పట్టణం అయ్యప్పస్వామి ఆలయానికి సమీపంలో ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం జరిగింది. ఇక్కడ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ముగ్గురు యువకులతో అతివేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు, ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. యలమంచిలి మండలం రేగుపాలెంకు చెందిన రాజాన సాయి తేజ(23), రాజాన గౌతమ్(17), పక్కుర్తి కార్తీక్ (17) బుధవారం సాయంత్రం తమ గ్రామం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో యలమంచిలి పట్టణానికి వచ్చారు. తిరిగి రేగుపాలెం వెళ్తుండగా మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ వెళ్లి ఆటోను ఢీకొట్టారు. బైకు నడుపుతున్న రాజాన సాయితేజతో పాటు మిగిలిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలంలోనే సాయితేజ తల నుంచి తీవ్రంగా రక్తస్రావమైంది. ఆటోలో ఉన్న జి.యేసు, కె.భారతి, ఎ.నూకరాజు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులందరికీ ఆటోల్లో యలమంచిలి సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ముగ్గురు యువకుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు వైద్యాధికారి నిహారిక తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ రాజాన సాయితేజ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మిగిలిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతున్నారు. -
ఎస్పీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు
అనకాపల్లి: లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు శుభ పరిణామమని, క్రిస్టియన్ సోదరులు ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం, కరుణకు ప్రతీక అని పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, అపారమైన సహనం, క్షమాగుణం వంటి విలువలను క్రీస్తు మానవాళికి అందించారని, వాటిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, ఆర్ఐ మన్మథరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
మట్టి పన్ను కట్టం.. ఏం చేసుకుంటారో చేసుకోండి!
గొలుగొండ: ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బందికి మట్టి పన్ను కట్టం..ఏం చేసుకుంటారో చేసుకోండి.. పేదలకు ప్రభుత్వం న్యాయం చేయకుండా మట్టిపై ఎలా పన్ను కట్టగలమని చీడిగుమ్మల గ్రామంలో సుమారుగా 100 మంది వరకు రైతులు, కూలీలు, ట్రాక్టర్ యజమానులు ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి. చీడిగ్ముమల గ్రామంలో బుధవారం ఉదయం ట్రాక్టర్ యజమానులు, ఇటుక బట్టీ కూలీలు ట్రాక్టర్లపై పొలంతో మట్టి తీసుకు వస్తున్న సమయలో ఏఎంఆర్ సంస్ద ప్రతినిధులు ట్రాక్టర్కు రూ.405 పన్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. పునాదులు, ఇటుక తయారీకి పొలంలో మట్టి తీసుకు వెళుతున్నామని, దీనిపై ఇంత మొత్తంలో డబ్బులు చెల్లించలేమని వారు బదులిచ్చారు. అయితే డబ్బులు కడితేనే తప్ప ట్రాక్టర్లు వెళ్లడానికి వీలు లేదని సంస్ధ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో పోలవరం, చీడిగుమ్మల, ఎరకంపేట, అయ్యన్నపాలెం, ఎర్రవరం, ఏఎల్పురంకు చెందిన ట్రాక్టర్ యజమానులంతా ఐక్యంగా ఆందోళనకు దిగారు. మట్టి తరలించడం ఆపడం కుదరదన్నారు. చిన్న ఇల్లు కట్టుకొనే సమయంలో ఈ పన్ను కడితే కనీపం పునాదికి రూ.60 వేల వరకు ఖర్చవుతుందని, ఇక పేదవారు ఇల్లు ఎలా కట్టుకోగలరని అన్నారు. రైతులు, ఇటుక కూలీల పక్షాన చీడిగుమ్మల గ్రామ టీడీపీ అధ్యక్షుడు కామిరెడ్డి గోవింద్ నిలబడి ఏఎంఆర్ సంస్థ వల్ల పేదలకు ఎంతో అన్యాయం జరుగుతోందన్నారు. ఈఏఎంఆర్ సంస్థ ప్రతి గ్రామంలో సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఈ మట్టిపై పన్ను వసూళ్లు చేయడం పట్ల ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ఈ దందాను తక్షణం అపాలని డిమాండ్ చేశారు. కాగా రైతుల అవసరం కోసం మట్టి తరలించడానికి మండల తహసీల్దార్ నుంచి అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని ఇన్చార్జి జియాలజిస్టు వెంకటరావు తెలిపారు. ఈ వివాదం పెద్దది కావడంతో ఆయన ఈ గ్రామాన్ని సందర్శించారు. రైతులు మట్టి తీస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నాకే మట్టి తరలించుకోవాలని, ప్రస్తుతం మట్టి తరలింపు ఆపాలని సూచించారు. -
పాము కాటుతో మహిళ మృతి
బుచ్చెయ్యపేట: నీలకంఠాపురం గ్రామానికి చెందిన మహిళ పాము కాటుతో మృతి చెందింది. గ్రామానికి చెందిన మలమంచిలి ధనలక్ష్మి(25) మంగళవారం చోడవరం మండలం దామునాపల్లిలో పుట్టింటికి వెళ్లింది. పొలంలో వరి కుప్పలు పెడుతున్న తల్లిదండ్రులకు పొలం గట్లపై నుంచి నడిచి భోజనాలు తీసుకెళ్తుండగా ఆమె కాలిపై పాము కాటు వేసింది. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త శ్యామ్ సంతోష్, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత
బుచ్చెయ్యపేట: ఆర్.శివరాంపురం ఫారెస్ట్ పరిధిలో నీలగిరి చెట్లు అక్రమంగా నరికివేతకు గురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో కలప తరలిపోవడంలో ఫారెస్ట్ అధికారుల ప్రమేయం ఉందని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన వారే కలప తరలిస్తున్నారని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ రేంజర్ సతీష్కు డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోరుకొండ రవికుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై ఫారెస్ట్ బీట్ వాచర్ సత్యారావును వివరణ కోరగా అటవీ ప్రాంతంలో గ్రేడింగ్ చేసిన పనులు తప్ప, అమ్మకాలు చేయలేదన్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులకు తెలిపామన్నారు. -
ప్రభుత్వ భూమిపై టీడీపీ నేతల కన్ను
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం చినరాచపల్లి వద్ద ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించి యథేచ్ఛగా దుక్కులు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆక్రమణదారులకు పట్టడం లేదు. గ్రామ సమీపంలో ఉన్న ఊటగెడ్డ రిజర్వాయర్ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు బుధవారం ట్రాక్టర్లతో చదును చేశారు. పట్టపగలు యంత్రాలతో పనులు చేశారు. గతంలో నీరు–చెట్టు పనుల్లో భాగంగా రిజర్వాయర్లోని పూడిక మట్టిని తొలగించారు. అయితే ఈ రిజర్వాయర్లోకి ఎగువభాగం నుంచి నీరు వచ్చే గెడ్డలను పూడిక మట్టితో కప్పి వేసి ఆక్రమించేందుకు యత్నించారు. ఆ సమయంలో పత్రికల్లో వార్తలు రావడంతో ఈ భూమిలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో హెచ్చరిక బోర్డు ఉండగానే తాజాగా ట్రాక్టర్తో ఆక్రమణదారులు దుక్కులు చేసే పనులు చేపట్టారు. ఆక్రమణలను అడ్డుకుని ప్రభుత్వ భూమిని రక్షించాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ వెంకటరమణను సంప్రదించగా రిజర్వాయర్ భూమి ఆక్రమణకు సంబంధించి రామన్నపాలెం మాజీ సర్పంచ్ చుక్కా పోతురాజు (టీడీపీ), అడిగర్ల శ్రీనివాసరావు (టీడీపీ)లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అలాగే దుక్కులు చేస్తున్న ఒక ట్రాక్టర్, అక్కడే ఉన్న ఒక బైకును సీజ్ చేసి పోలీసులకు అప్పగించామన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటి వారైనా కేసులు తప్పవని హెచ్చరించారు. -
1200 లీటర్ల సారా పులుపు ధ్వంసం
నాతవరం: అక్రమంగా సారా తయారు చేసినా, విక్రయాలు జరిపినా కేసులు నమోదు చేస్తామని నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అన్నారు. ఆయన బుధవారం మండలంలో పెడిమికొండ అటవీ ప్రాంతంలో సారా తయారు చేసే బట్టీలపై ఆకస్మికంగా దాడులు జరిపారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1200 లీటర్ల పులుపును ధ్వంసం చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ తారకేశ్వరరావు మాట్లాడుతూ పెడిమి కొండ అటవీ ప్రాంతంలో సారా తయారీకి సిద్ధం చేసిన పులుపును ధ్వంసం చేశామని, నిర్వాహకులు పరారయ్యారని తెలిపారు. సారా తయారీ సామాగ్రిని ధ్వంసం చేసి, మిగిలిన సామాగ్రిని స్టేషన్కు తరలించామన్నారు.


