breaking news
Anakapalle
-
వైద్య కళాశాలలు ప్రభుత్వమే నిర్వహించాలి
రేపు మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద నిరసన అనకాపల్లి: వైఎస్సార్సీపీ పాలనలో పేద విద్యార్ధులకు మెడికల్ సీట్లు రావాలని, పేద రోగులకు సకాలంలో వైద్యసేవలు అందాలని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేసి భవనాలు నిర్మిస్తే, 2023 ఏడాదిలో ఆరు మెడికల్ కళాశాలల్లో మెడికల్ విద్యార్దులు విద్యను అభ్యసిస్తుంటే, కూటమి పాలనలో మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తోందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ అన్నారు. దీనిని నిరసిస్తూ ఈనెల 19న నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం అధ్యర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలలను టీడీపీ కార్పొరేట్ నాయకులకు ధారాదత్తం చేయడానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారన్నారు. పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నపరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో విద్య, వైద్యం రెండు నేత్రాలుగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలన చేస్తే, సీఎం చంద్రబాబు పాలనలో విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పాలనలో విద్యార్థులకు ఫీజ్ రియింబర్స్మెంట్ చేసి పెద విద్యార్ధులు ఉన్నత చదువులు అభ్యసించాలని చేస్తే, నేటి పాలనలో పేద విద్యార్ధులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మెడికల్ కళాశాలలను దేశంలో ఎక్కడా ప్రైవేట్ పరం చేయలేదని, మన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మెడికల్ కళాశాలలను పీపీపీ పద్దతిలో కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అన్యాయమన్నారు. ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ విద్యార్ధి, యువజన విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్ మాట్లాడుతూ కూటమి 15 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలు విరక్తి చెందారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో అప్పగిస్తే రాష్ట్రంలో విద్యార్ధుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఽనిరసనలు చేయడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, మండల విద్యార్ధి విభాగం అధ్యక్షుడు బాదపు హరికృష్ణ పాల్గొన్నారు. -
గోసంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
పాయకరావుపేట: దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా గోసంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు, అఖిలాంధ్ర సాధు పరిషత్ కార్యదర్శి కృష్ణ చరణానంద భారతి స్వామి అన్నారు. స్థానిక కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన హిందూ సనాతన ధర్మ మహాసభలో ప్రసంగించారు. ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా సంస్కృత విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, గోవధను నిషేధించాలని, హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, ఆక్రమణలకు గురైన ఆలయ భూములను దేవాలయాలకు అప్పగించాలన్నారు. సభ ప్రారంభానికి ముందు పాండురంగ దేవస్థానం నుంచి మెయిన్రోడ్డు మీదుగా పాదయాత్ర చేశారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
అమల్లో.. రెడ్ బుక్ రాజ్యాంగం
ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అనుసరించడం లేదు. ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న ఈ ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీసే సాక్షి పత్రిక, టీవీ జర్నలిస్టులపై, సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేసే కుట్రలకు పాల్పడుతోంది. ఒక రాజకీయ నాయకుడి ప్రెస్మీట్ను వార్తగా రాస్తే కేసు ఎలా నమోదు చేస్తారు. రాజకీయ పార్టీల నాయకులు ప్రెస్మీట్ల ద్వారా వెల్లడించిన అంశాలను వార్తగా మలిచే హక్కు జర్నలిస్టులకు ఉంటుంది. అంతమాత్రాన జర్నలిస్టులకు, ఆ పత్రికలకు వాటిని ఆపాదించి కేసులు వేయడం సరికాదు. – మొల్లి అప్పారావు, విశాఖ తూర్పు సమన్వయకర్త -
బీఎన్ రోడ్డులో కూరుకుపోయిన వాహనాలు
బుచ్చెయ్యపేట భీమునిపట్నం, నర్సీపట్నం(బిఎన్) రోడ్డులో రోజు రోజుకు ప్రయాణీకులు కష్టాలు ఎక్కువవుతన్నాయి. కూటమి ప్రభుత్వం వస్తే రోడ్డు బాగుపడుతుందని ఆశపడ్డ ప్రజలికి ఆడియాశలే మిగిలేయి. బుధవారం బంగారుమెట్ట, ఎల్బీ పురం గ్రామాల మధ్యన పెద్ద గోతిలో నల్లరాయిని తీసుకెళ్తున్న లారీ బురదలో కూరుకుపోయింది. మూడు పొక్లెయిన్ల సాయంతో బయటకు లాగినా లారీ బయటకు రాలేదు. తెల్లవారుజామున దిగిపోయిన లారీ మధ్యాహ్నం 11 గంటలు వరకు బురదలోనే ఉండిపోయింది. దీంతో నర్సీపట్నం, వడ్డాది రహదారిలో తిరిగే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలు కిలోమీటర్లు మేర నిలిచిపోయాయి. ఉద్యోగులు, విద్యార్ధులతో పాటు అత్యవసర పనులపై వెళ్లే వాహనదారులు అవస్ధలు పడ్డారు. -
రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు గ్రౌండ్ పరిశీలన
గొలుగొండ: వచ్చేనెల 5,6,7 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఏఎల్పురం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ను బుధవారం నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 26 జట్లు ఈ పోటీల్లో పాల్గోనున్నట్టు తెలిపారు. క్రీడాకారులకు తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాతవరం, గొలుగొండ ఎస్ఐలు తారకేశ్వరరావు, రామారావుతో పాటు స్కూల్ కమిటీ చైర్మన్ రాజు, హెచ్ఎం కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి. వాటిపై కనీస ధ్యాస లేదు. ప్రజా సమస్యల్ని, ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజా పక్షాన పోరాడే పత్రికలపై, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు సరికాదు. పత్రికలపై, జర్నలిస్టులపై అక్రమ కేసులతో పత్రికాస్వేచ్ఛను హరిస్తామంటే ప్రజాస్వామాన్ని ఖూనీ చేసినట్లే. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను చూపించే సాక్షి పత్రికపై అక్రమ కేసులు నమోదుచేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి మీడియా సమావేశం పెడితే అది వార్తగా ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. – మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే -
సాగుకు, వైద్యానికి కూటమి దెబ్బ
నాతవరం: స్పీకరు అయ్యన్నపాత్రుడు ఇలాకాలో నాడు సాగురైతులకు, నేడు విద్య వైద్య రంగానికి జీర్ణించుకోలేని నష్టం కూటమి ప్రభుత్వం చేస్తోంది. నియోజకవర్గంలో ఏలేరు తాండవ అనుసంధానానికి మెడికల్ కాలేజీకి వై.ఎస్.జగన్మోహర్రెడ్డి సుమారుగా రూ.1000 కోట్లు మంజూరు చేశారు. ఈరెండింటికీ తాలుకా పనులు వివిధ దశలో జరుగుతున్న నేపధ్యంలో వాటిని పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు మాదిరిగా వ్యవహరించింది. రైతుల శ్రేయస్సు పక్కన పెట్టి ఏలేరు కాలువ నీటిని పైపులైను ద్వారా ప్రైవేటు కంపెనీలకు తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నాడు ఏలేరు నీటిని రైతులు సాగు కోసం తాండవ ప్రాజెక్టులోకి తరలించేందుకు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రూ 470.05 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. ఏలేరు తాండవ ప్రాజెక్టు అనుసంధానం పనులు కూటమి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే ఏలేరు కాలువలో నీటిని నాతవరం మండలం ఎంబీపట్నం పంచాయతీ శివారు ఎ.శరభవరం వద్ద ఏలేరు నుంచి పైపులైను ద్వారా నక్కపల్లి మండలానికి తరలించేందుకు పనులు చేస్తున్నారు. నక్కపల్లి మండలంలో నిర్మించనున్న ప్రైవేటు కంపెనీలైన స్టీల్ప్లాంటు, బల్క్డ్రగ్ పార్కుకు అవసరమైన నీటిని ఇక్కడ్నుంచి తరలించనున్నారు. నీటిని తరలించేందుకు ఎ,శరభవరం వద్ద పంప్హౌస్ నిర్మాణానికి భూమిని సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. మిట్టల్ కంపెనీ పేరిట రెండు ఎకరాలకుపైగా జిరాయితీ భూమి బలవంతంగా రైతుల నుంచి రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఏలేరు రిజర్వాయరు తాండవ ప్రాజెక్టు అనుసంధానం పనులు పూర్తి అయితే రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతుందని రైతులు ఆశించారు. వారి ఆశలను కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేసినప్పుడు 2022లో నర్సీపట్నం, పాయకరావుపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు పెట్ల ఉమా శంకర్ గణేష్, గొల్ల బాబురావు, పర్వతనేని పూర్ణచంద్రప్రసాద్ తాండవ ప్రాజెక్టుపై రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఏలేరు తాండవ అనుసంధానం పనులు గత ఏడాది రద్దు చేశారు. ఈఏడాది మాకవరపాలెం మండలంలో మెడికల్ కాలేజీ రూ 500 కోట్లతో పనులు జరుగుతుండగా ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు చూస్తోంది. కళ్ల ముందే అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా కూటమి నేతలు నిస్సిగ్గుగా వెనకేసుకు వస్తున్నారు. రైతులకు విద్యార్ధులకు శాశ్వతంగా ఉపయోగ పడే కార్యక్రమాలు వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభిస్తే నేడు ప్రభుత్వం స్వలాభం కోసం ప్రైవేటు పరం చేయాలని చూడడాన్ని ఈ ప్రాంతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ధోరణికి నిరసనగా ఈనెల 18వ తేదీన నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమం తలపెట్టారు. ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం.. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నియోజకవర్గంలో తలపెట్టిన శాశ్వత పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేయడాన్ని ప్రజలు దృష్టికి తీసుకెళ్తాం. వైజాగ్లో ఉన్న కింగ్జార్జి ఆసుపత్రిని తలపించేలా మాకవరపాలెంలో మెడికల్ కాలేజీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించాం. సీఎం జగన్మోహన్రెడ్డితో మాట్లాడి అనకాపల్లిలో ఏర్పాటు చేసే కాలేజీని నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకు రావడానికి ఎంతో కృషి చేశారు. దీనిని పూర్తి చేయాల్సిన కూటమి పెద్దలు ప్రైవేటుపరం చేయాలని చూడడం బాధాకరం. కూటమి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు క్షేత్రస్ధాయి లో తెలియజేస్తాం. నేడు నర్సీపట్నంలో గాంధీ విగ్ర హం ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతాం. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో రెండు ప్రాజెక్టులకు రూ. 1000 కోట్లు కూటమి ప్రభుత్వం రాకతో ఒకటి రద్దు రెండోది ప్రైవేటు పరం నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ అధ్వర్యంలో నిరసన -
జిల్లాలో 332 మలేరియా, 99 డెంగ్యూ కేసులు నమోదు
జిల్లా మలేరియా అధికారి కె.వరహాల దొర దేవరాపల్లి: జిల్లాలో ఈ ఏడాది 332 మలేరియా, 99 డెంగ్యూ కేసులు నమోదైనట్టు జిల్లా మలేరియా అధికారి కె.వరహాల దొర తెలిపారు. స్థానిక పీహెచ్సీ ఆవరణలో బుధవారం జరిగిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జిల్లాకు చెందిన పలు గ్రామాలు అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆనుకుని ఉండడంతో మలేరియా కేసులు పెరిగాయన్నారు. మలేరియా కేసులు నమోదైన 108 గ్రామాల్లో, 135 హాస్టళ్లలో దోమల నివారణ మందును పిచికారీ చేయించినట్టు చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా, లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. దోమ కాటుకు గురికాకుండా ప్రతి ఒక్కరూ దోమ తెరలు విధిగా వినియోగించాలన్నారు. -
పరిశ్రమల స్థాపనకు భూముల కేటాయింపునకు చర్యలు
పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్ మాకవరపాలెం: పరిశ్రమల స్థాపనకు భూములను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.యువరాజ్ తెలిపారు. మండలంలోని రాచపల్లి రెవెన్యూలో 290 ఎకరాల ఏపీఐఐసీ భూములతోపాటు యరకన్నపాలెం వద్ద సర్వే నంబర్ 737లోని పేదల సాగులో ఉన్న భూములను, వాటి మ్యాప్లను ఆయన బుధవారం పరిశీలించారు. కలెక్టర్ విజయకృష్ణన్, నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రామన్నపాలెం జంక్షన్ నుంచి యలమంచిలి మండలం పెదపల్లిని కలుపుతూ హైవే వరకు రోడ్డు నిర్మించేందుకు నిర్ణయించిన మార్గాన్ని కూడా సందర్శించారు. 290 ఎకరాల్లో 50 ఎకరాల చొప్పున బ్లాక్లుగా ఏర్పాటు చేయాలని ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇదే భూమిలో రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఇప్పటికే అల్లూరి జిల్లా కలెక్టర్ భూములు కావాలన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో భూములను పరిశ్రమలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఏపీఐఐసీలో ఆధీనంలో ఉన్న 290 ఎకరాలతోపాటు యరకన్నపాలెం వద్ద సర్వేనంబర్ 737లో ఉన్న మరో 400 ఎకరాల్లో పరిశ్రమలకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
కౌలు రైతుకు కష్టం
గురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025లైంగికదాడి కేసులో నిందితుడికి రిమాండ్ విలేకర్లతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావుఎస్.రాయవరం: బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, లైంగికదాడి చేసిన యువకుడిని అరెస్టు చేసి, రిమాండ్కు పంపినట్టు నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో బుధవారం స్థానిక విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. ఎస్.రాయవరం గ్రామానికి చెందిన సింగన శ్రీను అదేగ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో వంచించి, లైంగికదాడి చేశాడని మంగళవారం ఫిర్యాదు అందినట్టు చెప్పారు. ఎస్.రాయవరం , అడ్డురోడ్డు సర్కిల్ పోలీసులు విచారణ జరిపి, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.ఈ సమావేశలో అడ్డురోడ్డు సీఐ రామకృష్ణ,ఎస్.రాయవరం ఎస్ఐ విభీషణరావు పాల్గొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారి కష్టాలు చెప్పనలవికానివిగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. అన్నదాత సుఖీభవ పథకం మంజూరు చేయలేదు. పెట్టబడి సాయం అందక...అటు రుణాలు మంజూరుకాక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ సాగు చేస్తున్నారు. ప్రభుత్వ సాయం అందక కౌలు రైతులు నష్టపోతున్నా పాలక పెద్దల్లో మాత్రం కనీసం చలనం రావడం లేదని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. సాక్షి, అనకాపల్లి: కౌలు రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పట్టించుకోవడం లేదు. కనీసం ఎటువంటి సాయం అందించడం లేదు. కూటమి నాయకులు చెబుతున్న మాటలకు , క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. రైతన్న ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఎదురు దెబ్బలే చవిచూశాడు. ఎరువుల కొరత ఒక వైపు వేధిస్తుంటే..మరో వైపు కౌలు రైతులకు కనీసం ఎటువంటి సాయం అందడం లేదు. కుటుంబ పోషణకు పలువురు రైతులు భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ప్రకృతి సహకరిస్తే పరవాలేదు. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేయాలంటే వారికి పెట్టుబడి కావాలి. ఇందుకోసం వారు ప్రైవేటు వ్యాపారుల దగ్గర వడ్డీకి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం అందించే సాయంతో పాటు రుణ సాయం కూడా అందని దుస్థితి ప్రస్తుతం నెలకొంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా సాధారణ రైతులు మాదిరిగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేశారు. దీంతో వారు పంటల సాగుకు పెట్టుబడి కోసం అప్పులు చేసే పరిస్థితి తప్పింది. రైతు భరోసా కింద వారికి రూ. 13,500 చొప్పన ఇవ్వడం వల్ల వారు వాటిని విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు పెట్టుబడిగా ఉపయోగించుకునేవారు. అదేవిధంగా కౌలు రైతులకు రుణాలు కూడా ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. 4,285 మంది దరఖాస్తు అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లాలో తొమ్మిదివేల మందికి పైగా రైతులు దరఖాస్తులు చేశారు. వీరిలో 4,285 మంది కౌలు రైతులు ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద సాధారణ రైతులకు రూ.ఏడు వేలు పెట్టుబడి సాయం అందించింది. వారితో పాటు తమకూ సాయం అందిస్తారని కౌలురైతులు ఆశగా ఎదురు చూశారు. సెప్టెంబర్ నెలాఖరుకు కూడా పెట్టిబడి సాయం అందకపోవడంతో తీవ్ర నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్నివిధాలుగా సాయం అందడంతో సంతోషంగా సాగు చేసిన కౌలు రైతులు కూటమి పాలనలో అన్నింటికీ దూరమై కష్టాల నడుమ సాగు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఐదువేలకు పైగా రైతులకు సాగు హక్కు కార్డులు అందించారు. ఒక్కొక్కరికీ రూ.13,500 చొప్పున పెట్టిబడి సాయం మంజూరు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కౌలు రైతులకు మొండి చేయి చూపించారు. అమలు కాని అన్నదాత సుఖీభవ కూటమి పాలనలో జిల్లాలో 4,285 మందికి మొండి చేయికౌలు రైతులను గుర్తించాం.. జిల్లాలో కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం. ఇప్పటికే నాలుగు వేల మంది వరకూ కౌలు రైతులు అర్హులుగా గుర్తించాం. గతంలో సీసీఆర్ కార్డు ఉన్నా..వారు ఈ ఖరీఫ్ సీజన్లో క్రాప్ వేస్తేనే కౌలుదారులుగా గుర్తిస్తాం. ప్రభుత్వ జీవో 33 ప్రకారం జిల్లాలో అర్హత ఉన్న కౌలు రైతులకు అక్టోబర్ నెలాఖరు నాటికి పెట్టుబడి సాయం అందిస్తాం. రెండు విడతలుగా ఈ సాయం అందజేస్తాం. – మోహన్రావు, జిల్లా వ్యవసాయ అధికారి -
విశ్వకర్మ సేవలు ఆదర్శనీయం
తుమ్మపాల: విరాట్ విశ్వకర్మ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి చేసిన సేవలు ఆదర్శనీయమని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం విరాట్ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జేసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన స్పష్టించారన్నారు. ప్రధానంగా కమ్మరి, వడ్ల, స్వర్ణకార, శిల్ప, కంచరి తదితర వృత్తులను సృష్టించి సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేసుకునేలా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ప్రపంచపు తొలి వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా పేరుగాంచిన విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై.సత్యనారాయణ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.శ్రీదేవి, ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లి: స్థానిక ఎస్పీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి స్పెషల్ బ్రాంచ్ సీఐ బాల సూర్యారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మకు విశిష్టస్థానం ఉందన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ఈకార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ డి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
అధ్యయన యాత్రలో అడ్డగోలుతనం
డాబాగార్డెన్స్(విశాఖ): జీవీఎంసీ అధ్యయన యాత్రలు విహార యాత్రలుగా మారాయనే ఆరోపణలు సర్వసాధారణం. అందుకే వామపక్ష కార్పొరేటర్లు వీటిని చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. అయితే అడ్డగోలుగా జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఈ అధ్యయన యాత్రలను మరింతగా దిగజార్చాయన్న ఆరోపణలు మూటుగట్టుకుంటోంది. కార్పొరేటర్లు, అధికారుల కుటుంబ సభ్యులు ఇన్నాళ్లూ షికార్ల వరకే పరిమితమయ్యేవారు. ఈసారి ఓ అడుగు ముందుకేసి అక్కడి అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం గమనార్హం. దీన్ని నియంత్రించాల్సిన మేయర్, జీవీఎంసీ అధికారులు ఇందుకు వత్తాసుగా నిలవడమే విశేషం..! అధ్యయనం పేరిట విహారం : అధ్యయన యాత్రం కోసం మేయర్ పీలా శ్రీనివాసరావుతో పా టు కార్పొరేటర్ల బృందం, వారి కుటుంబ సభ్యులు, జీవీఎంసీ అధికారులు మంగళవారం బయలుదేరిన విషయం తెలిసిందే. వీరంతా షెడ్యూల్ మేరకు బుధవారం జైపూర్ కార్పొరేషన్ను సందర్శించారు. వాస్తవానికి అధ్యయన యాత్ర మేయర్, కార్పొరేటర్లు, అధికారులకు మాత్రమే. వారి కుటుంబ సభ్యుల షికారుకు, వారు తీసుకున్న రూమ్ చార్జీల భారమూ జీవీఎంసీయే భరించడం రివాజుగా మారింది. ఈసారి మేయర్, కార్పొరేటర్ల బృందంతో వారి కుటుంబ సభ్యులు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. వీరి అవసరమేంటో..? : భీమిలి నియోజకవర్గానికి చెందిన ఓ కార్పొరేటర్ భర్త, ఉత్తర నియోజకవర్గానికి చెందిన మరో కార్పొరేటర్ సోదరుడు, దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఇంకో కార్పొరేటర్ దగ్గరి బంధువు.. ఇలా చాలా మంది నేరుగా జైపూర్ కార్పొరేషన్ను సందర్శించి, జైపూర్ నగర్ నిగమ్ మేయర్ సోనమ్ గుర్జార్ను కలుసుకున్నారు. అక్కడి కార్పొరేషన్లో నిర్వహించిన సమావేశంలో కూడా వీరంతా పాల్గొనడం గమనార్హం. అసలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు పాల్గొనవచ్చా? నేరుగా అక్కడి కార్పొరేషన్లోనే కార్పొరేటర్లతో కూర్చుంటే మేయర్ పీలా శ్రీనివాసరావు, అధికారులు ఏం చేస్తున్నట్టో..! అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ సొమ్ముతో షికార్లు చేయడమే కాకుండా.. ఇలా జీవీఎంసీ పరువు తీసేలా వ్యవహరించడం సరికాదని నగరవాసులు ఆక్షేపిస్తున్నారు. జైపూర్ కార్పొరేషన్లో జీవీఎంసీ బృందం జీవీఎంసీ కార్పొరేటర్ల బృందం అధ్యయన యాత్రలో భాగంగా బుధవారం జైపూర్ కార్పొరేషన్ను సందర్శించినట్లు జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్ల బృందం జైపూర్(రెడ్ సిటీని) సందర్శించి జైపూర్ అభివృద్ధి కార్యక్రమాలు, వారసత్వ సంరక్షణ, ఘన–ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్రజాహిత పాలన వంటి అంశాలపై అధ్యయనం చేశారని, అలాగే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రణాళికలు, పురాతన వారసత్వ భవనాల సంరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ధి వంటివి అమలవుతున్న నూతన పద్ధతులను మేయర్, కార్పొరేటర్ల బృందం పరిశీలించారని జీవీఎంసీ కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా జైపూర్ నగర నిగమ్ మేయర్ సోనమ్ గుర్జార్, ఇంజినీర్ ఓమన్ కార్గ్ జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల బృందానికి స్వాగతం పలికి, జైపూర్ నగరాభివృద్ధితో పాటు సాధించిన ప్రగతి వివరించినట్లు చెప్పారు. జీవీఎంసీ సాధిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకులు అన్ని నగరాలకు ఆదర్శంగా ఉంటున్నాయని, విశాఖ నగరం సుందరీకరణతో అందర్నీ ఆకర్షిస్తోందని కొనియాడుతూ జ్ఞాపికను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావుకు జైపూర్ నగర్ నిగమ్ మేయర్ అందించారు. అనంతరం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ అధికారులు జైపూర్ మేయర్, అక్కడి అధికారులకు విశాఖ నగరాభివృద్ధికి చేపడుతున్న ప్రాజెక్టులు, పారిశుధ్య నిర్వహణ, రెవెన్యూ, ప్రజాపాలన తదితర అంశాలను వివరించి జీవీఎంసీ తరఫున జ్ఞాపిక అందించినట్లు సెక్రటరీ తెలిపారు. -
ప్రాణాలకు తెగించైనా బల్క్ డ్రగ్ను అడ్డుకుంటాం
నక్కపల్లి: ‘మా సహనాన్ని పరీక్షించొద్దు... శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో అణగతొక్కాలని ప్రయత్నిస్తోంది... ప్రాణాలకు తెగించైనా బల్క్డ్రగ్ను అడ్డుకుంటాం.. ఓట్లేసి గెలిపిస్తే హోంమంత్రి అనిత తమపట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారను కోలేదు’ అంటూ రాజయ్యపేట మత్స్యకారులు ఆగ్రహంతో రగిలిపోయారు. బల్క్ డ్రగ్పార్క్ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహారదీక్ష నాల్గో రోజు బుధవారం కొనసాగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో టెంట్లు వేసి, దీక్ష కొనసాగించేందుకు సిద్ధపడగా సీఐ కుమార స్వామి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు పర్మిషన్ లేదని, టెంట్లు వేయడానికి వీల్లేదన్నారు. దీంతో గంగపుత్రులు గొడుగుల నీడలో దీక్షను కొనసాగించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని వారు ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మత్స్యకారులపై కేసులు నమోదు చేశారని, అరెస్టులవడానికి, జైలుకెళ్లడానికై నా సిద్ధంగా ఉన్నామంటూ మత్స్యకార మహిళలు నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు కె.లోకనాథం, జాతీయమత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు, వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రాజేష్, రైతు సంఘనాయకుడు సత్యనారాయణ తదితరులు మద్దతు తెలిపారు. ఎండలో మత్స్యకారులతో కలసి నిరాహారదీక్షలో పాల్గొన్నారు. దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ మత్స్యకారులను కూటమిప్రభుత్వం దేశద్రోహులగా చిత్రీకరిస్తోందని, శాంతియుతంగా నిరాహరదీక్ష చేస్తున్న వారిపై ఆంక్షలు విధిస్తోందని చెప్పారు. నాలుగు రోజులుగా రాజయ్యపేటలో పోలీసుల రాజ్యం నడుస్తోందన్నారు.తనను ఆదరించిన మత్స్యకారులను ఆదుకోకపోగా పోలీసుల సాయంతో ఉద్యమంపై హోంమంత్రి అనిత ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. బల్క్ డ్రగ్పార్క్ రద్దుచేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి అసెంబ్లీసమావేశాలు ప్రారంభ కానున్నాయని, ఈ సమావేశాల్లో రాజయ్యపేటలో జరుగుతున్న ఆందోళనల గురించి ప్రస్తావించి బల్క్డ్రగ్పార్క్ రద్దుచేసే విధంగా బిల్లు పాస్చేయాలని కోరారు. దేశంలో మూడు చోట్ల..గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లలో ఈ బల్క్డ్రగ్పార్క్లను పెడుతున్నామని చెబుతున్నప్పటికీ అది నిజం కాదని, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే పెడుతున్నారన్నారు. ఈ పార్క్ ఏర్పాటయితే పదుల సంఖ్యలో ప్రమాదకర రసాయన పరిశ్రమలు వస్తాయని, ఈ ప్రాంత మంతా శ్మశానంగా మారుతుందని చెప్పారు. పరిసర ప్రాంతాల వారు పలు వ్యాధులకు గురికావలసి వస్తుందని తెలిపారు. గంగపుత్రులు చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. జాతీయమత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు మాట్లాడుతూ ఇది ఒక్క రాజయ్యపేట మత్స్యకారుల సమస్య కాదని, తూర్పుతీరంలో ఉన్న అందరి సమస్య అని చెప్పారు. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తే పోలీసులు ఇష్టాను సారం వ్యవహరించి అడ్డుకుంటున్నారని తెలిపారు. ఎండలో మహిళలు ఇబ్బంది పడుతుంటే టెంట్లు వేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. మత్స్యకారులు తలచుకుంటే టెంట్లు వేయడం పెద్ద పనికాదని చెప్పారు. తమ సహనాన్ని పరీక్షించవద్దన్నా రు. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరిని ఏకం చేస్తా మని, త్వరలోనే ఇతరప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరినీ రాజయ్యపేట తీసుకు వచ్చి తమ సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. జాతీయమత్స్యకార సంఘ అధ్యక్షుడు, ఇతర మత్స్యకార పెద్దలను కలసి ఇక్కడి సమస్య వివరిస్తామన్నారు. ప్రాణాలకు తెగించైనా సరే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. రాజయ్యపేట మత్స్యకారులను హోంమంత్రి అనిత మోసం చేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, ఉపాధ్యక్షుడు నాగేశు, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ మాట్లాడుతూ మత్స్యకారుల పట్ల పోలీసుల వైఖరి సరికాదన్నారు. ఉద్యమానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బల్క్ డ్రగ్పార్క్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో మత్స్యకార నాయకులు సోమేష్, పిక్కి తాతీలు, పిక్కి కోదండరావు, మైలపల్లిసూరిబా బు, నారాయణరావు,కాశీరావు,మహేష్, రాజశేఖర్, యజ్జల అప్పలరాజు, కోడకాశీరావు, పైడితల్లి,నూకరాజు,వందలాదిమందిమహిళలు పాల్గొన్నారు. మండుటెండలో నాల్గోరోజు కొనసాగిన నిరాహార దీక్ష సహనాన్ని పరీక్షించవద్దని మత్స్యకారుల హెచ్చరిక మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు -
రేషన్ షాపులకు అధునాతన ఇ–పోస్ యంత్రాలు
తుమ్మపాల: చౌక ధరల దుకాణాలకు అధునాతన ఇ–పోస్ యంత్రాలను సరఫరా చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఆమె యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, డీలర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు జిల్లాలో 1,069 చౌకధరల దుకాణాలకు అధునాతన ఇ–పోస్ యంత్రాలను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్ రేషను కార్డుల పంపిణీ సత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంపిణీ అధికారి మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
ఆర్డీవో వివి రమణ మత్స్యకారుల తో మాట్లాడుతున్న ఆర్డీవో రమణ నక్కపల్లి: బల్క్ డ్రగ్పార్క్కు వ్యతిరేకంగా మూడు రోజుల నుంచి మత్స్యకారులు చేస్తున్న ఆందో ళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణ తెలిపారు. మంగళవారం ఆయన రాజయ్యపేటలో పర్యటించి, నిరాహారదీక్ష శిబిరం వద్దకు వెళ్లారు. బల్క్ డ్రగ్పార్క్ ఏర్పాటయితే ఈ ప్రాంత మంతా కాలుష్యమవుతుందని, ప్రజలు క్యాన్సర్,కిడ్నీసమస్యలు వంటి రుగ్మతలతో బాధపడతారని, ప్రజలప్రాణాలకు హానికలిగించే ఈ బల్క్ డ్రగ్పార్క్ను రద్దుచేయాలని మత్స్యకారులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఎటువంటి హింసా త్మక సంఘటనలకు పాల్పడరాదన్నారు. అనుమ తులు లేకుండా ఆందోళనలు చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని, గ్రామస్తులు సంయమనం పాటించాలన్నారు. మీ ఆందోళన కలెక్టర్, హోంమంత్రి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ నర్సింహమూర్తి, సీఐ కుమార స్వామి ఎస్ఐ సన్నిబాబు ఉన్నారు. బెంగళూరు–కామాఖ్య ఎక్స్ప్రెస్ దారిమళ్లింపు తాటిచెట్లపాలెం(విశాఖ): ఈస్ట్రన్ రైల్వే, అసన్ సోల్ డివిజన్ పరిధిలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా తేదీల్లో బెంగళూరు–కామాఖ్య–బెంగళూరు ఎక్స్ప్రెస్ను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. నవంబర్ 1, 8, 15, 22వ తేదీల్లో ఎస్ఎంవీటి బెంగళూరు–కామాఖ్య(12551) ఏసీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, నవంబరు 5,12,19వ తేదీల్లో కామాఖ్య–ఎస్ఎంవీటి బెంగళూరు(12552) ఏసీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు రెగ్యులర్ మార్గంలో కాకుండా వయా అసన్సోల్, అండల్, సైంథియా స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
అరకొరగా యూరియా.. అన్నదాతల ఆందోళన
యూరియా కోసం రైతుల పడిగాపులు కొనసాగుతున్నాయి. చాలినన్ని బస్తాల యూరియా రాకపోవడంతో సర్వత్రా రైతుల్లో ఆందోళన నెలకొంది. మంగళవారం కూడా మండలంలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ తీరును రైతులు నిరసించారు. మాడుగుల రూరల్: యూరియా కొరత రైతుల్ని ఇంకా వేధిస్తోంది. అరకొరగా వచ్చిన యూరియా నిల్వలతో రైతులు అందోళన చెందుతున్నారు. వరినాట్లకు సరైన సమయంలో అందించాల్సిన యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేసి రెండు మాసాలవడంతో యూరియా వేయక.. పంట దిగుబడిలో భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో విత్తనాల నుంచి విక్రయాల వరకు అన్నీ సవ్యంగా జరిగేవని, ఎరువుల కోసం ఇంతగా ఎదురుచూడాల్సిన దుస్థితి ఎప్పుడూ లేదని వాపోతున్నారు. కనీసం యూరియా ఇవ్వకపోతే ఎలా? మండలంలోని ఎం.కె.వల్లాపురం సహకార సంఘానికి 267 బస్తాల యూరియా వచ్చింది. మంగళవారం ఉదయం నుంచి విక్రయాలు ప్రారంభించారు. ఈ సహకార సంఘం పరిధిలో గల గ్రామాలకు ప్రస్తుతం వచ్చిన యూరియా ఏమాత్రం సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరినాట్లు వేసి రెండు మాసాలు పూర్తి కావస్తున్న తరుణంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి దారుణంగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని ఎం.కోటపాడు గ్రామానికి చెందిన రైతు కోట్ని రామారావు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎరువులు కొరత ఏనాడూ చూడలేదని ఆక్షేపించారు. సచివాలయం వద్ద ఆందోళన జి.అగ్రహారం రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం మంగళవారం ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాశారు. ఈ కేంద్రానికి 240 బస్తాల యూరియా వచ్చింది. జి.అగ్రహారం, వీరనారాయణం సచివాలయాలు కలిపి ఒకే క్లస్టర్ కావడంతో ఈ రెండు సచివాలయాల పరిధిలోని మూడు గ్రామాలకు 80 బస్తాల చొప్పున అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ రెండు సచివాలయాల పరిధిలో 1600 మంది రైతులకు 240 బస్తాల యూరియా ఏ మేరకు సరిపోతుందని వైఎస్సార్సీపీ నాయకులు, చింతలూరు సర్పంచ్ కాళింగ కల్యాణరాజు వ్యవసాయ సిబ్బందిని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో యూరియా పంపిణీ చేయాలంటూ జి.అగ్రహారం, చింతలూరు, వీరనారాయణం రైతులు అందోళనకు దిగారు. స్థానిక ఎస్ఐ జి.నారాయణరావు తన సిబ్బందితో వచ్చి రైతులకు నచ్చజెప్పారు. గ్రామానికి 80 బస్తాలు చొప్పున సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. యూరియా అందని రైతులు ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. రావికమతం: దొండపూడి, కన్నంపేట, చినపాచిల రైతు సేవా కేంద్రాల వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు ఎగబడడంతో రైతు సేవా కేంద్రాల దగ్గర పోలీసులను మోహరించి వారి సమక్షంలో యూరియా విక్రయాలు జరిపారు. దొండపూడి రైతు సేవా కేంద్రానికి 150 బస్తాలు, కన్నంపేటకు 250 బస్తాలు, చినపాచిలంకు 140 బస్తాలు యూరియా సరఫరా అయ్యాయి. దేవరాపల్లి: మండలంలోని కొత్తపెంటలో మంగళవారం యూరియా కోసం రైతులు ఉదయం 8 గంటలకే అధిక సంఖ్యలో రైతులు చేరుకున్నారు. గంటల తరబడి నిలబడ లేక పలువురు రైతులు కూర్చుండిపోయారు. స్టాక్ అరకొర ఉందని తెలియడంతో తమకు దక్కుతుందో లేదోనని ఆందోళనతో ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. టోకెన్ల ప్రకారం పంపిణీ చేశారు. గంటల తరబడి క్యూలైన్లో పడిగాపులు కాసినా యూరియా దక్కక పోవడంతో పలువురు రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అడుగడుగునా ఇబ్బందులు కూటమి ప్రభుత్వం రైతుల్ని నిలువునా ముంచేసింది. రైతు పండించే పంటకు ఎరువులు అందించలేని అధ్వాన స్థితిలో ఉంది. వరి నాట్లు వేసి రెండు మాసాలవుతోంది. ఇప్పటి వరకు ఎరువుల్లేక పంట నష్టపోయే పరిస్థితి. గత వైఎస్సార్సీపీ పాలనలో పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు ఎరువులు అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రైతులకు అడుగడుగునా ఇబ్బందులే తలెత్తుతున్నాయి. –గాడి ముత్యాలనాయుడు, రైతు, వీరనారాయణం ఎం.కె.వల్లాపురం ఆర్ఎస్కేకు 267 బస్తాలు వీరనారాయణం, జి.అగ్రహారానికి కలిపి 240 బస్తాలు పోలీసుల సమక్షంలో యూరియా విక్రయాలు -
టార్గెట్లు!
టూర్ పేరుతో కార్పొరేటర్ల అధ్యయన యాత్రకు జీవీఎంసీలోని అన్ని విభాగాల నుంచి కలెక్షన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్లో కూటమి నేతల వసూళ్ల పర్వానికి అంతులేకుండా పోతోంది. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ పేరుతో వసూళ్లకు తెగబడిన కూటమి నేతలు.. ఇప్పుడు కార్పొరేటర్ల అధ్యయన యాత్ర పేరుతో టార్గెట్లు విధించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. జీవీఎంసీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత విభాగాల వారీగా లక్ష్యాలు విధించి మరీ భారీగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్, యూసీడీ ఇలా అన్ని విభాగాల అధికారులను పిలిచి ఇంత మొత్తం వసూలు చేసి ఇవ్వాలంటూ లక్ష్యాలు విధించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జైపూర్, జోద్పూర్, జైసల్మీర్, ఢిల్లీ ప్రాంతాల్లో అధ్యయన యాత్ర పేరుతో జీవీఎంసీ కార్పొరేటర్లు వెళుతున్నారు. ఈ యాత్రకు జనసేనకు చెందిన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, సీపీఎం కార్పొరేటర్ గంగారావుతో సహా 15 మంది దూరంగా ఉంటున్నారు. అయితే, కార్పొరేటర్లు టూర్ వెళుతున్నందున.. కూటమి కార్పొరేటర్లకు కొంత మొత్తం ఖర్చుల కోసం ఇవ్వాలంటూ ఈ వసూళ్లకు దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు కొన్ని విభాగాల నుంచి సదరు కీలక నేతకు భారీ మొత్తం ముట్టినట్టు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా కోటి రూపాయల మేర ఈ విధంగా దండుకున్నట్టు తెలుస్తోంది. సీఎం కంటే టూరే ముద్దు! వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విశాఖ వస్తున్నారు. అయితే, సీఎం నగరానికి వస్తున్న సమయంలో ప్రోటోకాల్ మేరకు నగర ప్రథమ పౌరుడు మేయర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయినప్పటికీ సీఎం పర్యటనకు ముందు రోజే మేయర్ పీలా శ్రీనివాసరావు విమానంలో పర్యటనకు వెళ్లిపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర ప్రథమ పౌరుడిగా సీఎంకు స్వాగతం పలకకుండా టూర్కు వెళ్లడం ఏమిటంటూ వాపోతున్నారు. ఇప్పటికే మేయర్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న సొంత పార్టీకి చెందిన నేతలు.. ఇదే విషయంపై నేరుగా సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. -
ప్రజాస్వామ్యమా?.. పోలీస్ రాజ్యమా?
ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇలాంటి కంపెనీలను వవ్యతిరేకించి ఇప్పుడు ఎలా ఏర్పాటు చేస్తారన్నారు. పోలీసుల మానవతా ధృక్పదంతో ఆలోచించి నిరసన తెలియజేయడానికి మత్స్యకారులకు సహకరించాలన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, మత్స్యకార నాయకుడు గోసలరాజశేఖర్, ఎరిపిల్లి నాగేశులు మాట్లాడుతూ ఆరు నెలల నుంచి బల్క్ డ్రగ్పార్క్కు వ్యతిరకేకంగా పోరాడుతున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా హోంమంత్రి అనిత ఒక్కసారి కూడా గ్రామంలోకి రాలేదన్నారు. అమాయకులైన మత్స్యకారులను ప్రభుత్వం బలిపశువులను చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకై నా తెగిస్తామని, బల్క్ డ్రగ్పార్క్ ఏర్పాటు కానివ్వబోమని స్పష్టం చేశారు.ఈ ఆందోళనలో మత్స్యకారులు పిక్కి తాతీలు, మహేష్, ఎం.సూరిబాబు, పిక్కి కోదండరావు, పిక్కి గంగరాజు, యజ్జల అప్పలరాజు, పిక్కి రాంబాబు, పైడితల్లి, పిక్కరాజేష్, సోమేష్, కాశీరావు, సీఐటీయూ జిల్లాకార్యదర్శి ఎం.రాజేష్, రైతు సంఘనాయకులు సత్యనారాయణ వందలాది మంది మత్స్యకారులు మహిళలు పాల్గొన్నారు. సీఐ కుమార స్వామి, ఎస్ఐలు సన్నిబాబు, అంజు తదితరుల ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. -
ఎంపీడీవోలుగా 9 మందికి పదోన్నతులు
మహారాణిపేట (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న పరిపాలనాధికారులు(ఏవో), విస్తరణాధికారుల(ఈవోఆర్డీ)కు మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా(ఎంపీడీవో) పదోన్నతులు లభించాయి. మొత్తం 9 మందికి పదోన్నతులతో పాటు పోస్టింగ్లు ఇస్తూ జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర వారికి నియామక పత్రాలు అందజేశారు. జి.కె.వీధి ఎంపీడీవోగా బి.హెచ్.వి.రమణబాబు, బుచ్చ య్యపేట ఎంపీడీవోగా కె.ఎన్.సి.నారాయణరావు, రావికమతం ఎంపీడీవోగా ఒ.మహేష్, కశింకోట ఎంపీడీవోగా సి.హెచ్.చంద్రశేఖరరావు, కోట వురట్ల ఎంపీడీవోగా చంద్రశేఖరరావు, నాతవరం ఎంపీడీవోగా ఎం.ఎస్.శ్రీనివాసులు, ఎస్.రాయవరం ఎంపీడీవోగా మీనా కుమారి, పాయకరావుపేట ఎంపీడీవోగా విజయలక్ష్మి, ముంచంగిపుట్టు ఎంపీడీవోగా కె.ధర్మారావు నియమితులయ్యారు. పదోన్నతులు పొందిన అధికారులు వెంటనే విధుల్లో చేరాలని చైర్పర్సన్ సుభద్ర సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్తిబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల నిరసన
డీఆర్వోకు వినతిపత్రం అందిస్తున్న ఉపాధ్యాయులు తుమ్మపాల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాణ త్రినాథ్, జిల్లా అధ్యక్షుడు కె.కె.ఎల్.ఎన్. ధర్మారావు మాట్లాడుతూ 12వ పీఆర్సీని నియమించి, ఐఆర్ ప్రకటించాలని, ఈహెచ్ఎస్ పరిమితి రూ.25 లక్షలకు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించి, బోధనకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పెండింగ్ డీఏల విడుదల, మెమో నంబర్ 57 అమలు తదితర పలు అంశాలపై డీఆర్వో సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, సభ్యులు మహాలక్ష్మి నాయుడు, బి.దేముడు బాబు, కె.విజయ పాల్గొన్నారు. -
మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్
స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ వాల్పోస్టర్ ఆవిష్కరిస్తున్న జేసి జాహ్నవి తుమ్మపాల: మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమావేశంలో కార్యక్రమం వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి జిల్లాలో 46 కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అక్టోబరు 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారని చెప్పారు. మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి తగిన వైద్య సేవలను అందించాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.హైమావతి, జిల్లా ఇమ్యునైజేషను అధికారి డాక్టర్ చంద్రశేఖర్ దేవ్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ కె. వీరజ్యోతి పాల్గొన్నారు. -
వెలుగు వీవోఏల సమస్యల పరిష్కారానికి ధర్నా
అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో వీవోఏ మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 మాసాలవుతున్నా దాన్ని రద్దు చేయకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వెలుగు వీవోఏల సంఘం(సిటు) రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి, సిటు జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావులు మండిపడ్డారు. స్థానిక సిటు కార్యాలయం నుంచి డీఆర్డీఏ కార్యాలయం వరకూ వీవోఏల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్డీఏ పీడీ శచీదేవికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీవోఏలకు ఉరితాడుగా ఉన్న మూడేళ్ల కాల పరిమితి సర్క్యులర్ రద్దు, ఉద్యోగ భద్రత, పెండింగ్ జీతాల చెల్లింపు తక్షణమే చేయాలనానరు. వీవోఏలకు సంబంధం లేని చాలా పనులు చేయిస్తున్నారని, లబ్ధిదారులతో గేదెల కొనుగోలు, యూరియా సర్వే, వృద్ధుల పెన్షన్ విధులను కూడా అప్పగించడం ఆక్షేపణీయమన్నారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వని ప్రభుత్వం, పనుల్ని మాత్రం క్రమం తప్పకుండా చేయించుకుంటోందని ధ్వజమెత్తారు. ఆందోళనలో సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకరరావు, ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్, వీవోఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటలక్ష్మి, కోశాధికారి సీహెచ్ఎల్ఎన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యపై కూటమి ప్రభుత్వం కుట్రలు దారుణం
వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ దేవరాపల్లి: వైద్య విద్యపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేసి, వైద్య వృత్తిలోకి రావాలనుకునే పేద విద్యార్థుల కలల్ని నాశనం చేస్తోందని వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ ఆరోపించారు. ఈ మేరకు దేవరాపల్లిలో మంగళవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. వైద్య విద్యకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యాతనిచ్చి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలోనే నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు సైతం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించాలని కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. -
ఉపమాకలో ఘనంగా ఉట్లోత్సవం
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలోరెండు రోజుల పాటు జరిగిన వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు మంగళవారంతో ముగిశాయి. ఈవే డుకల్లో భాగంగా ఉట్ల ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉదయం స్వామివారి మూలవిరాట్కు, ఉత్సవమూర్తులకు, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, గోదాదేవి అమ్మవారికి నిత్యపూజలు, అరాధనలు కై ంకర్యాలు పూర్తిచేశారు. అనంతరం కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తులను పీఠంపై ఉంచి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఉట్టికి షోడోపచారపూజలు నిర్వహించారు. అనంతరం ఏకాంతంగా ఉట్లోత్సవం నిర్వహించారు. నీరాజన మంత్రపుష్పాలు, తీర్థగోష్టి, నిత్యసేవాకాలం, విశేష ప్రసాద నివేదన, ప్రసాద వినియోగం జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, రాజగోపాలాచార్యులు, శ్రీనివసాచార్యులు,గోపాలాచార్యులు పాల్గొన్నారు. -
బీఎన్ రోడ్డు బురదలో కూరుకుపోయిన వాహనాలు
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో బంగారుమెట్ట, ఎల్బీ పురం గ్రామాల మధ్య బురదలో వాహనాలు కూరుకుపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నర్సీపట్నం నుంచి వడ్డాది వైపు వస్తున్న వ్యాను బంగారుమెట్ట సమీపంలో ఉన్న చర్చి వద్ద బురదలో కూరుకు పోయింది. దాని వెనకాలే వస్తున్న మరొక వ్యాను పక్క నుంచి వెళ్లే ప్రయత్నంలో అదీ బురదలో చిక్కుకుంది. రెండు వ్యాన్లు ఓకే గోతి వద్ద పక్క పక్కనే కూరుకుపోవడంతో ఇతర వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. దీంతో నర్సీపట్నం, వడ్డాది రూటులో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలూ నిలిచిపోయాయి. రాత్రిపూట వేగంగా ఇంటికి చేరుకోవాలని వెళ్తున్న రావికమతం, కొత్తకోట, రోలుగుంట, చోడవరం, వడ్డాది, అనకాపల్లి, విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లే పలువురు ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. చీకట్లో ఎటూ వెళ్లలేక నరకయాతనపడ్డారు. ఉదయం కూడా ఇదే గోతి వద్ద వ్యాన్ ఇతర వాహనాలు కూరుకుపోగా ట్రాక్టర్ల సహాయంతో బైటకు లాగారు. ఆర్ అండ్ బీ అధికారులు తక్షణం ఈ గోతిని పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.వడ్డాది, నర్సీపట్నం రోడ్డులో నిలిచిపోయిన వాహనాలు -
బావిలో తేలిన మృతదేహం
ట్యాక్సీ డ్రైవర్గా గుర్తింపు ● ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ యలమంచిలి రూరల్: పట్టణంలోని రాంనగర్ టిడ్కో గృహ సముదాయం వెనుక బావిలో తేలిన మృతదేహం యలమంచిలి పట్టణానికి చెందిన ట్యాక్సీ డైవర్ అప్పికొండ రమణ(59) గా పట్టణ పోలీసులు గుర్తించారు. స్థానిక ఫైర్ ఆఫీస్ కాలనీకి చెందిన మృతుడు కొన్నేళ్ల క్రితం భార్యతో గొడవ పడి ఒంటరిగా ఉంటున్నాడు. మద్యానికి బానిసైన రమణ జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అతని సమీప బంధువు అప్పికొండ చంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ కె. సావిత్రి మంగళవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. బావిలోంచి దుర్వాసన రావడంతో అక్కడ పశువుల కాపరి కొండలరావు మృతుని బంధువులకు సమాచారమిచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. బావి పక్కనున్న ఎర్ర రంగు బ్యాగులో మృతుని గుర్తింపు కార్డు, చిరునామా లభించాయి. మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీయించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. -
ఆస్తులు లాగేసి...అనాథగా వదిలేసి
సాక్షి, అనకాపల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో కశింకోటలో ఉన్న గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ(ఆర్ఈసీఎస్)ను విలీనం చేసిన తరువాత దానికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస సౌకర్యాలు లేక, ఉద్యోగులకు జీతాలందక అధ్వాన దుస్థితి నెలకింది. దీంతో సిబ్బంది కుటుంబాలు ఎనిమిది నెలలుగా అర్ధాకలితో అలమటిస్తుండగా సక్రమంగా తరగతులు సాగక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కళాశాలలో పనిచేసే ఉద్యోగులకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్ ) ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఆర్ఈసీఎస్ ఆస్తులు, మిగులు నిధులపై పెత్తనం చెలాయిస్తూ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. కనీసం టాయిలెట్లు శుభ్రపరచడానికి కూడా నిధులు ఇవ్వడం లేదు. స్వీపర్లకు కూడా జీతాలు చెల్లించడం లేదు. క్లాస్ రూంలో మౌలిక వసతులు, తాగునీటి సదుపాయం కల్పించలేదు. కళాశాలలో మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు, ఇతర పనులకు విద్యార్థులు, సిబ్బంది తమ సొంత సొమ్మును చెల్లిస్తున్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్మెంట్లో కొంత సొమ్మును కళాశాల నిర్వహణ పనులకు ఖర్చు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నిలిచిపోయింది. కళాశాలలో రాజ్యమేలుతున్న సమస్యలను ఆర్ఈసీఎస్కు గౌరవ చైర్మన్గా ఉన్న కలెక్టర్ విజయకృష్ణన్, సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్న ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) ప్రసాద్ దృష్టికి పలుమార్లు కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులైన గ్రామీణ వినియోగదారులు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. స్థానిక కూటమి పార్టీ ఎమ్మెల్యేకు విన్నవించుకున్నా.. పట్టించుకున్న పాపానపోలేదు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం లేదు. ఈపీడీసీఎల్ వైఖరి, జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యంగా కారణంగా తరగతులు సరిగ్గా జరగడం లేదని, దీంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తల్లిదండ్రులు, వినియోగదారులు వాపోతున్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించాలని విద్యార్థి, వినియోగదారుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఈసీఎస్లో ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ గాలికి... ఆస్తులపై పెత్తనం తప్ప బాధ్యతలు తీసుకోని ఈపీడీసీఎల్ 8 నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించని వైనం తరగతులు సక్రమంగా సాగక విద్యార్థులకు ఇబ్బందులు ‘నా పేరు రాజేష్(పేరు మార్పు). నేను ఆర్ఈసీఎస్ అనుబంధ రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో సీఎస్ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. కళాశాలలో క్లీనింగ్ చేసే సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులందరం కలిసి చందాలు వేసుకుని వారికి ఇస్తున్నాం. టాయిలెట్ల క్లీనింగ్ కూడా మేమే చేసుకుంటున్నాం. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్కు వచ్చే డబ్బులతో కళాశాల మెయింటేనెన్స్ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవడంతో క్లాసులు సరిగ్గా జరగడం లేదు. కాలేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా సాగుతోంది.’ ఇదీ ఈ ఒక్క విద్యార్థి ఆవేదనే కాదు పాలిటెక్నిక్ విద్యార్థులందరిదీ..ఆర్ఈసీఎస్ చేతికి వచ్చాక ఆస్తులు, మిగులు నిధులపై పెత్తనం చేస్తున్న ఈపీడీసీఎల్...ఆర్ఈసీఎస్కు చెందిన పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోకుండా అనాథగా వదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. -
నూతన హైస్కూల్కు స్థల పరిశీలన
కొత్తగా ఏర్పాటు చేసే ముత్రాస్ కాలనీ హైస్కూల్ స్థల పరిశీలనలో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి అనకాపల్లి: మండలంలోని కొత్తూరు పంచాయతీ ముత్రాస్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న హైస్కూల్ స్థలాన్ని జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైస్కూల్ భవనానికి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు. తరగతి గదులు, ఆటస్థలానికి వీలుగా ఉంటుందన్నారు. ఆయన వెంట ఎంపీడీవో ఆశాజ్యోతి, కొత్తూరు సర్పంచ్ సప్పారపు లక్ష్మీప్రసన్న, ఈవో సుభాష్, ఏఈ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం అనకాపల్లి: రాగల ఐదురోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి వర్షంపడే అవకాశం ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్త వి.గౌరి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 33.1 నుంచి 34.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25
వెలుగు వీవోఏల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం అనకాపల్లి డీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.యూరియా కోసం రైతుల పడిగాపులు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ తీరును రైతులు నిరసించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఎలా? ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి పత్రికల స్వేచ్ఛను పోలీసు కేసులతో ప్రభుత్వం హరిస్తామంటే ఎలా..? ఇటీవల సాక్షిలో ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడిన ప్రెస్మీట్ వార్తగా రాస్తే.. సంబంధిత జర్నలిస్టుతో పాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. మీడియా గొంతును నొక్కే ప్రయత్నాలకు పాల్పడుతోంది. అక్షరాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను నోటీసు లు, అక్రమ కేసులతో పోలీసులు నిరోధించలేరు. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపులకు పాల్పడుతోంది. – పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యేప్రభుత్వ తీరు దారుణం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి నుంచీ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోంది. తాజాగా పత్రికా స్వేచ్ఛను కూడా ప్రభుత్వం హరిస్తోంది. జర్నలిస్టులపై, సాక్షిపై వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. విలేకరుల సమావేశంలో నాయకుల మాటలను వార్తలుగా ప్రచురిస్తే పత్రికలపై కేసులు పెట్టడం చరిత్రలో తొలిసారి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే బాధ్యత మీడియాపై ఉంది. రాష్ట్రంలోని ప్రజలు ప్రతీ అంశాన్ని గమనిస్తున్నారు. కచ్చితంగా కూటమి ప్రభుత్వానికి తగదని గుణపాఠం తప్పదు. – అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ ఎమ్మెల్యే -
శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
కేజీబీవీని తనిఖీ చేస్తున్న డీఈవో బుచ్చెయ్యపేట: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి, విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. వడ్డాది కేజీబీవీని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థినుల సంఖ్య, హాజరు పట్టికలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను, తాగునీటి సరఫరా పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు సూచించారు. ఎంఈవో కాశీ విశ్వేశ్వరరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ రామూర్తినాయుడు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యమా?.. పోలీస్ రాజ్యమా?
దీక్షకు ఆటంకం కలిగించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మత్స్యకారులునక్కపల్లి: ‘మేమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నామా పోలీసు రాజ్యంలో ఉన్నామా, మా బాధలు చెప్పుకునే స్వేచ్ఛకూడా మాకులేదా.. శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా అవకాశమివ్వరా.. మేమేమైనా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నామా, పోలీసు విధులకు ఆటంకంకగిస్తు న్నామా.. విషపూరితమైన కంపెనీల వల్ల మా ప్రాణాలు పోతాయి, అటువంటి కంపెనీలు మావద్ద ఏర్పాటు చేయొద్దంటూ ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే మా గ్రామంలోనే శాంతియుతంగా నిరాహార దీక్ష చేసుకుంటామంటే ప్రభుత్వం పోలీసులతో ఇన్ని అడ్డంకులు సృష్టిస్తూ ధారణంగా వ్యవహరిస్తుందా’ అంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మా గొంతునొక్కేయడం కోసమేనా మంత్రి అనితకు మా గ్రామం తరఫున రెండువేల ఓట్ల మెజార్టీ ఇచ్చామా అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ అక్కడ మత్స్యకారులు చేపట్టిన ఆందోళన మూడో రోజు కొనసాగింది. మంగళవారం మత్స్యకారులంతా కూలిపనులు మానుకుని, వేటకు విరామం ప్రకటించి శిబిరం వద్దకు భారీగా చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. టెంట్లు వేయడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దీక్ష కొనసాగించారు. మంగళవారం మత్స్యకారుల దీక్షకు వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. వచ్చిన నాయకులు తమ నుద్దేశించి భరోసా ఇచ్చే విధంగా ప్రసంగించేందుకు మైక్ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. డీజే బాక్సులు తీసుకురావడాన్ని సీఐ,ఎస్ఐలు అడ్డుకోవడంతో మహిళలంతా ఒక్కసారిగా పోలీసులపై విరుచుకుపడటానికి సిద్ధపడ్డారు. ఇంతలో నిర్వాహకులు జోక్యం చేసుకుని వారిని వారించారు. హ్యాండ్మైక్ ద్వారా నాయకులు ప్రసంగించేందుకు పోలీసులు అనుమతిచ్చారు. అడ్డుకోవడం తగదు వైఎస్సార్సీపీ నేత, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు హాని కలిగించే బల్క్ డ్రగ్పార్క్ను ఇక్కడ మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. గతంలో ఇదే పార్క్ కాకినాడ సమీపంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రభుత్వానికి లేఖరాశారని, పవన్ కల్యాణ్ ధర్నా చేశారన్నారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు. ఇప్పుడు రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనిని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తే పోలీసులు అడ్డుకోవడం, అనుమతి ఇవ్వకపోవడంతో పాటు సుమారు 35 మందిపై కేసులు నమోదు చేయడం తగదన్నారు. ఈవిషయాన్ని వైఎస్సార్సీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామమని చెప్పారు. అవసరమైతే రాష్ట్రనాయకులను రాజయ్యపేట రప్పించి మత్స్యకారులకు అండగా నిలబడతామని తెలిపారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. సీపీఎం జిల్లాకార్యదర్శ కోటేశ్వరరావు మాట్లాడుతూ తమప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులపై పోలీసులు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కంపెనీలు వస్తే రాజయ్యపేట పరిసర ప్రాంతాలు వల్లకాడుగా మారతాయన్నారు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతో మత్స్యకారులు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఆందోళన చేస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే హెటెరో డ్రగ్స్ వల్ల మత్స్యకారుల జీవనోపాధి కోల్పోయారని, అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని చెప్పారు. బల్క్ డ్రగ్పేరుతో వందలాది కంపెనీలు పెట్టి ఈ ప్రాంతాన్ని శ్మశానంగా మార్చే మాట్లాడుతున్న వైఎస్సార్సీపీనేత వీసం రామకృష్ణ టెంట్లు వేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఎండలో గొడుగులతో నిరసన తెలుపుతున్న మత్స్యకారులునిరాహారదీక్ష వద్దకు మైక్సెట్ తీసుకు రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా మూడో రోజు కొనసాగిన నిరాహార దీక్ష భారీ ఎత్తున పాల్గొన్న జనం మైక్ పెట్టేందుకు అంగీకరించని పోలీసులు రాజయ్యపేటలో భారీగా మోహరింపు -
మత్స్యకారులపై ప్రభుత్వ నిర్బంధం అన్యాయం
అనకాపల్లి: రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులు, సీపీఎం నాయకులపై కూటమి ప్రభుత్వం ఉద్యమ కారులపై ఉక్కుపాదం మోపడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్.శంకరరావు అన్నారు. స్థానిక జోనల్ కార్యాలయంలో వద్ద పార్టీ ఆధ్వర్యంలో బల్క్డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసులను మోహరించి మత్స్యకారులపై, సీపీఎం నాయకులపైన నిర్బంధం ప్రయోగించి శాంతియుత పోరాటాన్ని అణచివేయాలనే చూస్తే ప్రజాగ్రహానికి గురికాకతప్పదన్నారు. ప్రజాస్వామ్యంలో తమ నిరసనను స్వేచ్ఛగా తెలియజేసే హక్కు ప్రజలకు ఉందని, బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్న మత్స్యకారులపై పోలీసులు కేసులు పెడతామని బెదిరించి వారిని భయబ్రాంతులకు గురిచేయడం అన్యాయమన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్డ్రగ్ పార్కు ప్రమాదకరమని చెప్పి వారి పోరాటంలో పాల్గొన్న టీడీపీ నాయకులు నేడు అధికారంలోకి రాగానే మాటమార్చడమంటే మత్స్యకారులను మోసం చేయడమేనన్నారు. ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా, స్థానిక వ్యతిరేకతను లెక్కచేయకుండా ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గంటా శ్రీరామ్, అల్లు రాజు, నాయకులు పి.చలపతి,నాగిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. -
క్షేత్ర స్థాయి పర్యటనతోనేఅర్జీల పరిష్కారం
అధికారులకు జేసీ జాహ్నవి ఆదేశం ● కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు 313 అర్జీలుతుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు, పీజీఆర్ఎస్ ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. మొత్తం 313 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీలు పెట్టినా తల్లికి వందనంపై స్పష్టత లేదు తన భార్య మృతి చెందడంతో తల్లికి వందనం పథకం నిలిపివేశారని, తండ్రిగా తన బ్యాంక్ ఖాతాను జోడించి పథకం వర్తింపజేయాలని కోరుతూ మూడు సార్లు అర్జీలు అందజేసినా ఎటువంటి ప్రయోజనం లేదని పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన పి.వెంకటేశ్వరరావు పీపీఆర్ఎస్లో మళ్లీ అర్జీ అందజేశారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఒక్కరికి కూడా పథకం మంజూరు చేయలేదన్నారు. సచివాలయ సిబ్బంది వచ్చి సంతకం తీసుకుని వెళ్లిపోతున్నారని, నగదు మాత్రం అందించడం లేదని వాపోయారు. గతంలో చేసిన అర్జీలు చూపించడంతో అర్జీ నమోదు చేయకుండా రూం.6కు వెళ్లాలంటూ సూచిస్తున్నారని, అక్కడికి వెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ పథకాలపై అర్జీలకు నిరాకరణ తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వస్తున్న అర్జీదారులకు అధికారులు పెడుతున్న షరతులు విసిగితెప్పిస్తున్నాయి. వెంట తెచ్చుకున్న బ్యాగులు, చేతిలో ఫిర్యాదులను పరిశీలించిన తరువాతనే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద క్యూలో నిల్చున్న అర్జీదారుల వద్ద ఉన్న ఫిర్యాదు స్వరూపం ఆధారంగా ఆయా శాఖలకు రిఫర్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పథకాలైన తల్లికి వందనం, పింఛన్లు, అన్నదాత సుఖీభవ వంటి వాటిపై అర్జీలను పీజీఆర్ఎస్లో నమోదు చేయకుండా గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయం(రూమ్ నెం.6)కు వెళ్లాలంటూ అర్జీదారులను పంపించేస్తున్నారు. పీజీఆర్ఎస్లో అర్జీలు సమర్పించడానికి వస్తే ఇలా మరో చోటకు వెళ్లమనడమేమిటని అర్జీదారులు ప్రశ్నించినా ఫలితం లేకుండాపోయింది. -
మిడిసి పడుతున్న పసిడి
సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి: పసిడితో భారతీయులకు ఉన్న అనుబంధం మరే దేశంలోనూ కనిపించదు. చేతిలో కొద్దిగా డబ్బులు కనిపిస్తే.. వెంటనే కొనుగోలు చేసేది బంగారాన్నే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా.. పుత్తడి కొంటే.. శుభసూచకమని అంటుంటారు. అందుకే స్వర్ణం.. సమస్తమయమైపోయింది. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ నేపథ్యంలో రోజురోజుకీ పసిడి ధర ౖపైపెకి ఎగబాకుతూ.. ఆల్టైమ్ హై రేట్ని నమోదు చేస్తోంది. ఒకప్పుడు 10 గ్రాముల ధరతో ఇప్పుడు గ్రాము కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. వారం రోజులుగా ఎగబాకుతున్న బంగారాన్ని చూసి.. వెండి కూడా అదే బాటలో దూసుకుపోతోంది. లక్ష రూపాయల కంటే దిగువకు బంగారం ధర దిగే రోజులు ఇప్పట్లో కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. బంగారానికి ఇంత వన్నె ఎందుకో..? పుత్తడి ఎంత ఉన్నా సగటు వ్యక్తికి మోజు తీరడం లేదు. తన శక్తి మేరకు బంగారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అసలు బంగారానికి ఇంత వన్నె ఉండటానికి కారణం అంతర్జాతీయ కరెన్సీకి ప్రత్యామ్నాయం కావడమే. ఒక దేశం జారీ చేసిన నోట్లు చెల్లకపోవడం. వాటి విలువ క్షీణించడం ఉంటుంది. కానీ బంగారానికి అలాంటి బేధాలేమీ లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతో కొంత ధరకు చలామణీ అవుతుంది. అందుకే స్వర్ణానికి అంత కళ. ధర తగ్గినా పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. పెట్టుబడి విషయంలోనూ బంగారమే..! రోజు రోజుకీ ధర పెరుగుతూ వస్తున్నా బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ప్రజలు అస్సలు తగ్గేదే..లే అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో పసిడి ఎంత ఉంటే అంత ఎక్కువ సొమ్ము ఉన్నట్లుగా భావిస్తారు. వాస్తవానికి బంగారం నిరర్థక ఆస్తి. ఎంతో కష్టించి సంపాదించిన సొమ్ము బంగారంగా మార్చితే బీరువాల్లోనూ, బ్యాంకు లాకర్లలోనూ భద్రంగా ఉంచడం తప్ప... మరో ప్రయోజనం ఏంటి..? భవిష్యత్తులో ధర పెరిగి, పెరిగిన ధరకు దాన్ని విక్రయిస్తేనే లాభం. మనకు తెలిసినంత వరకూ బంగారం కొనడమే కానీ.. విక్రయించడమన్నది అరుదు. దీని బదులు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వెచ్చిస్తే సంపద సృష్టి జరుగుతుంది. మన దేశంలో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయడంలో బంగారం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న సరకు బంగారమేనన్నది విస్మయపరిచే అంశం. ఇటీవల కాలంలో మనదేశంలో బంగారం కొనుగోళ్లు అధికమై.. నగదు పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. గృహస్తులు ఇతర వాటిపై ఒక్క శాతం పెట్టుబడులు పెడుతుండగా బంగారంపై మాత్రం ఆరున్నర రెట్లు ఎక్కువ మొగ్గు చూపుతుండటం విశేషం.గత వారం రోజులుగా బంగారం ధర తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1,08, 380 ఉండగా.. 9వ తేదీన రూ.1,10,290కి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.1.10 లక్షలకు తక్కువ కాలేదు. వెండి కూడా ధగధగ మెరిసిపోతోంది. ఈ నెల 8న కిలో వెండి ధర రూ.1.37 లక్షలు ఉండగా.. 15వ తేదీ నాటికి రూ.6 వేలు పెరిగి రూ.1.43 లక్షలకు చేరుకుంది. అంటే రోజుకు దాదాపు రూ.1000 చొప్పున పెరుగుతూ వస్తోంది.గత వారం రోజులుగా 10 గ్రాముల బంగారం, కిలో వెండి ధరలురోజురోజుకూ పెరుగుతున్న పుత్తడి ధర -
క్షతగాత్రుడు వరహాలనాయుడికి పరామర్శ
ఎన్టీఆర్ ఆస్పత్రిలో వరహాల నాయుడిని పరామర్శిస్తున్న గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా చైర్మన్ గంటా శ్రీరామ్ అనకాపల్లి: జిల్లాలో వి.మాడుగుల మండలం ఎం.కృష్ణాపురంలో గొర్రెలు, మేకల పెంపకందారుడు కోళ్ల వరహాలనాయుడిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు భూసమస్య నేపథ్యంలో దాడి చేసి గాయపరిచారు. దీనిపై ఈ నెల 11న నాయుడు కుటుంబ సభ్యులు అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పటించుకోలేదని జిల్లా గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం చైర్మన్ గంటా శ్రీరామ్ ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో క్షతగాత్రుడు కోళ్ల వరహాలనాయుడిని సోమవారం సంఘం సభ్యులు పరామర్శించారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో నాయుడుకు అండగా నిలబడుతూ ఎస్పీ తుహిన్ సిన్హాకు వినతిపత్రం అందజేశారు. నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో ఈ నెల 18న మాడుగుల తహసీల్దార్ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ సబ్బి శ్రీనివాసరావు, ఎం.కృష్ణాపురం మాజీ సర్పంచ్ మొల్లి అప్పారావు, జిల్లా కార్యదర్శి గోకాడ దేముడునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
వెంటాడుతున్న యూరియా కష్టాలు
● గరిశింగిలో అరకొర సరఫరాతో రైతుల అవస్థలు ● స్వల్ప తోపులాటతో పోలీసుల రాక ● వారి పర్యవేక్షణలో ఎరువుల పంపిణీ దేవరాపల్లి: అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా గరిశింగిలో సోమవారం అరకొరగా యూరియా అందుబాటులోకి రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో వారి మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో మహిళా, వృద్ధ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గరిశింగి రైతు సేవా కేంద్రం పరిధిలో 270 యూరియా బస్తాలు సోమవారం అందుబాటులోకి రాగా వీటిలో 80 బస్తాలను వాలాబు పంచాయతీకి, మరో 80 బస్తాలను చినగంగవరం గ్రామానికి కేటాయించారు. మిగిలి ఉన్న 110 యూరియా బస్తాల కోసం గరిశింగితోపాటు డొర్రి చెరువు, కించుమండ, కొత్తూరు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రైతులు రెట్టింపు సంఖ్యలో ఉండగా సరఫరా మాత్రం అరకొరగా ఉండటం రైతుల మధ్య స్వల్ప తోపులాటకు దారితీసింది. స్థానిక వ్యవసాయ సిబ్బంది పోలీస్లకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ వి.సత్యనారాయణ తక్షణమే తన సిబ్బందితో గరిశింగి చేరుకున్నారు. టోకెన్ల ప్రకారం రైతులను క్యూలైన్లో ఉంచి యూరియాను పంపిణీ చేయించారు. అరకొరగా యూరియా సరఫరా చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేయడం తగదని ప్రభుత్వ తీరుపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక యూరియా బస్తా కోసం -
పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలా..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసమర్థపాలన కొనసాగుతుంది. మాట వినని అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారు. పచ్చపత్రికలు ఈ వాస్తవాలను ఎలాగూ ప్రజలకు చూపించరు. సాక్షి పత్రిక మాత్రమే నిర్భయంగా నిజాలను ప్రజలకు చేరవేస్తుంది. వీటిని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక సాక్షి పత్రికపై కేసులు నమోదు చేయడం, ఎడిటర్ ధనుంజయరెడ్డికి నోటీసులు అందించడం రాజ్యాంగ విరుద్ధం. పత్రికల గొంతునొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే. అలాంటి ప్రభుత్వాలు ఎంతోకాలం మనుగడ సాధించలేవని చరిత్ర చూస్తే తెలుస్తుంది. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ భీమిలి సమన్వయకర్త -
మెడికల్ కాలేజీ సాధనకు ఉద్యమ కార్యాచరణ
● ఈనెల 18న శాంతియుత నిరసన ● దశలవారీగా ఉద్యమం ఉధృతం ● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్నర్సీపట్నం: మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించేలా ఒత్తిడి తెచ్చేందుకు దశలవారీగా ఉద్యమానికి కార్యాచరణ రూపొందించామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ అత్యంత అవసరమన్నారు. ప్రజాభీష్టాన్ని శాసనసభ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈనెల 18న మున్సిపల్ స్టేడియంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ విధిగా హాజరై మన నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలన్నారు. మైదాన, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే మెడికల్ కాలేజీ అవసరమన్నారు. పీపీపీ విధానం వల్ల కాలేజీ ప్రైవేటుపరమైతే అన్ని రకాల వైద్యసేవలకు డబ్బు చెల్లించాల్సి వస్తుందన్నారు. అనుమతి కోరుతూ సీఐకి వినతి సమావేశం ముగిసిన వెంటనే పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ టౌన్ పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. సీఐ గోవిందరావును కలిసి ఈనెల 18న చేపడుతున్న శాంతియుత నిరసనకు అనుమతి కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీలు సుర్ల గిరిబాబు, అప్పలనర్స, ఎంపీపీలు సుర్ల రాజేశ్వరి, రుత్తల సర్వేశ్వరరావు, గజ్జలపు మణికుమారి, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, పార్టీ మండల అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, ఫణి శాంతరామ్, నాగేశ్వరరావు, చిటికెల రమణ, తదితరులు ఉన్నారు. -
పట్టువదలని గంగపుత్రులు
నక్కపల్లి: మత్స్యకారుల పట్టు సడలలేదు. బల్క్డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ ఆదివారం రోజంతా ఉద్రిక్తత మధ్య గడిపిన రాజయ్యపేట మత్స్యకారులు రెండో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. బల్క్డ్రగ్ పార్క్ కంటే ఉరే సరి అంటూ మెడలో ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. మత్స్యకారుల పొట్ట కొట్టే బల్క్డగ్ర్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిరాహార దీక్షకు యత్నించడం, అనుమతి నిరాకరించిన పోలీసులు భవిష్యత్ కార్యాచరణకు సమావేశం కావడాన్ని అడ్డుకోవడం తెలిసిందే. 14 మందిపై కేసులు పెట్టడమే కాక ఆదివారం రాత్రి భారీ సంఖ్యలో పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం కూడా నక్కపల్లి సీఐ కుమారస్వామి, ఎస్.రాయవరం సీఐ ఎల్.రామకృష్ణ, పాయకరావుపేట సీఐ అప్పన్న, ఎస్ఐ సన్నిబాబు, ట్రెయినీ ఎస్ఐ సాహిబ్ అంజు తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు రాజయ్యపేటలో మోహరించారు. తాము బల్క్డ్రగ్ పార్క్ అడ్డుకోలేదని, ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదని, అయినప్పటికీ అంతమంది పోలీసులు మోహరించి ఎక్కడకూ కదలకుండా అడ్డుకుంటున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. బల్క్డ్రగ్ పార్క్ వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ ఆందోళనకు మద్దతు తెలిపి మత్స్యకారులతోపాటు నిరాహారదీక్షలో కూర్చున్నారు. హోం మంత్రి సమాధానం చెప్పాల్సిందే.. ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినపుడు వంగలపూడి అనిత ఓట్లు వేసి గెలిపించాలని కోరారని, ప్రమాదకర రసాయన పరిశ్రమలు రాకుండా గ్రామాన్ని కాపాడతానని హామీ ఇచ్చారని, తీరా ఆధికారంలోకి వచ్చిన తర్వాత తమ గోడు వినేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని మత్స్యకారులు వాపోయా రు. ఆమెను నమ్మి ఓట్లేసినందుకు బాగానే రుణం తీర్చుకుంటున్నారన్నారు. హోంమంత్రి తమ గ్రా మానికి వచ్చి సమాధానం చెప్పాలన్నారు. ఆమె ఆదేశాలు లేకుండా వందలాది మంది పోలీసులు గ్రామంలోకి వస్తారా అని ప్రశ్నించారు. మంత్రికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. తా మంతా ప్రాణాలకు తెగించేందుకు సిద్ధంగా ఉన్నా మని కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు. ప్రాణాలు కాపాడుకుంటామన్నారు.మత్స్యకారులకు న్యాయం చేయాలి ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకోవాలి. బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటయితే మత్స్యకారుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. పార్టీలకతీతంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రాంత ఆడబిడ్డగా మంత్రి అనిత ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ల దృష్టికి తీసుకెళ్లి మత్స్యకారులకు న్యాయం చేయాలి. – గోసల కాసులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు హోం మంత్రిదే బాధ్యత మా ఆందోళనకు హోం మంత్రి అనిత వచ్చి సమాధానం చెప్పాల్సిందే. మీ ఆడపిల్లను గెలిపిస్తే అండగా ఉంటానని నమ్మించారు. ఇప్పుడు నిలబెట్టుకోవాలి కదా. రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ఏం న్యాయం చేశారు. ఇంత వరకు మంత్రి మా గ్రామంలోకి రాలేదు. మా ప్రాణాలకేమైనా జరిగితే హోం మంత్రి బాధ్యత వహించాలి. –కాశీరావు, మత్స్యకారుడు, రాజయ్యపేట పార్టీ కంటే గ్రామస్తుల ప్రాణాలే ముఖ్యం బల్క్డ్రగ్ పార్క్ రద్దు చేయాలని హోం మంత్రి అనితను కోరాం. న్యాయం చేస్తామ ని హామీ ఇచ్చారు. మాకు పార్టీ కంటే గ్రామస్తుల ప్రాణాలే ముఖ్యం. బల్క్డ్రగ్ పార్క్ వల్ల రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బంది పడతాం. గ్రామస్తులతోపాటు ఎటువంటి పోరాటానికై నా సిద్ధంగా ఉన్నాం. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే కేసులు పెట్టడం తగదు. –పిక్కి గంగరాజు, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు పోలీసులు చుట్టుముట్టినా రెండో రోజూ కొనసాగిన దీక్ష బల్క్డ్రగ్ పార్క్ కంటే ఉరే సరి అంటూ నినాదాలు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన హోం మంత్రి సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టీకరణ -
సీపీఎం నేత అప్పలరాజు గృహ నిర్బంధం
అప్పలరాజు ఇంటి ముందు పోలీసుల కాపలా నక్కపల్లి: బల్క్డ్రగ్ పార్క్ను రద్దు చేయాలని కోరుతూ రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును సోమవారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో అప్పలరాజు తన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలా ఉంచారు. కొద్ది నెలలుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు అప్పలరాజు తదితరులు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆదివారం వారి దీక్షలో అప్పలరాజు పాల్గొన్నారు. దీంతో పోలీసులు అప్పలరాజుకు 41 నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేశారు. సోమవారం ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉద్యమాలను అణగదొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అప్పలరాజు ఆరోపించారు. మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిశ్రమల ఏర్పాటును విరమించుకోవాలన్నారు. అప్పలరాజును అడ్డుకోవడంతో రాజయ్యపేటలో జరిగిన ఆందోళనలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రాజేష్, ఎం.సత్యనారాయణలు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
హాసిని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని తల్లి ఆర్డీవో వి.వి.రమణకు ఫిర్యాదు చేస్తున్న మృతి చెందిన హాస్టల్ విద్యార్థిని తల్లి నాగమణినర్సీపట్నం: నర్సీపట్నం మండలం, వేములపూడి బీసీ వసతిగృహంలో తన కుమార్తె హాసి ని మరణించిన ఉదంతంపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని విద్యా ర్థిని తల్లి నాగమణి ఆర్డీవో వి.వి.రమణకు ఫిర్యాదు చేశారు. కడుపు నొప్పితో బాధ పడుతున్న విషయం తన కుమార్తె హాస్టల్ సిబ్బందికి తెలియపరిచినా తనకు చెప్పలేదని బాధితురాలు ఆర్డీవోకు వివరించారు. రాత్రి కడుపు నొప్పి వస్తే శుక్రవారం ఉదయం వరకు హాస్పిటల్కు తీసుకువెళ్లకపోవటం వల్ల తన కుమార్తె చనిపోయిందని కంటతడి పెట్టారు. అదే రాత్రి హాసిని ఉంటున్న రూమ్లోకి పాము వస్తే బయట వారితో కొట్టించారని తన చిన్న కుమార్తె చెప్పిందని తెలియజేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో బహిరంగ విచారణ జరపాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను అణగదొక్కడం అవివేకం
పత్రికలనేవి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయి. అటువంటి పత్రికా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్ష సాధించడం దారుణం. రాజకీయ పార్టీ నాయకుడి ప్రెస్మీట్ను వార్త రూపంలో రాస్తే పాత్రికేయుడిపైన, సాక్షి ఎడిటర్పైన కేసులు నమోదు చేయడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పత్రికా వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కూటమి ప్రభుత్వం విష సంస్కృతికి తెర లేపుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛను హరించాలని చూడటం మానుకోవాలి. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. –కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యే -
కొనుగోళ్లు తగ్గినా.. మార్కెట్ దూసుకుపోతోంది
టెక్స్టైల్స్ మార్కెట్ 15 నుంచి 20 శాతం పడిపోయింది. బంగారం మార్కెట్ కూడా 15 నుంచి 20 శాతం పడిపోయింది. మార్కెట్ విలువ మాత్రం బంగారం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. చైనా, భారత్ వంటి దేశాలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో పసిడి ధర మూడు నాలుగు రోజులకోసారి మారేది. ఇప్పుడు ఒక పూట ఉన్న రేటు మరో పూటకు ఉండటం లేదు. బులియన్ మార్కెట్ కూడా అంచనా వేయలేకపోతోంది. పెట్టుబడుల విషయంలోనూ బంగారానికి మంచి డిమాండ్ ఉంది. బంగారంతో వెండి పోటీ పడుతోంది. బ్యాటరీ కార్లలో వెండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలకు ఓ కారణమని చెప్పవచ్చు. – కంకటాల మల్లికార్జునరావు, ఫ్యాప్సీ పాస్ట్ ప్రెసిడెంట్, విశాఖపట్నం -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యాయత్నం
అల్లిపురం: ఎంవీపీకాలనీలో ఉంటున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ భైవరపట్ల శ్రీరామ్(41) సూర్యాబాగ్లో గల ఒక హోటల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవా రం ఉదయం సూర్యాబాగ్లో గల రాఘవేంద్ర హోటల్లో ఆయన అద్దెకు తీసుకున్న గది నుంచి ఘాటైన వాసన రావడంతో సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ ఎర్రంనాయుడు, ఎస్ఐ కొల్లి సతీష్, కానిస్టేబుళ్లు గది తలుపులు విరగ్గొట్టి లోపలకు వెళ్లే సమయానికి శ్రీరామ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్ గదిలో దొరికిన లేఖలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రాసి ఉన్నట్లు తెలిపారు. సకాలంలో స్పందించి ఒకరి ప్రాణాన్ని రక్షించినందుకు గాను సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. -
‘తాండవ’లో పుష్కలంగా నీటి నిల్వలు
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటి మట్టం నిలకడగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగుకు పంట కాలువల ద్వారా ఆగస్ట్ 10న నీటిని విడుదల చేశారు. ఆ సమయానికి తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం 372.0 అడుగులు ఉండేది. ఆ రోజు నుంచి ప్రధాన కాలువల ద్వారా రోజు ఒక్కంటికి 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తరచూ వర్షాలు కురియడంతో తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గకుండా పెరుగుతుంది. సోమవారం సాయంత్రానికి తాండవలో నీటి మట్టం 375.5 అడుగులు ఉంది. ప్రస్తుతం పంట కాలువల ద్వారా విడుదల చేసే నీరు కంటే ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో అధికంగా రావడం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడం లేదని ప్రాజెక్టు జేఈ శ్యామ్కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగుకు శివారు ఆయకట్టుకు సైతం సకాలంలో నీటిని సరాఫరా చేశామని, రైతులంతా పొదుపుగా నీటిని వాడుకోవాలని సూచించారు. -
వెంటాడుతున్న యూరియా కష్టాలు
క్యూలైన్లలో గంటల కొద్ది పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లో నిరీక్షణ చేసినా యూరియా దొరకక పలువురు రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఇప్పటికే పలుమార్లు అధికార్లు వచ్చి యూరియా కోసం పేర్లు నమోదు చేసుకున్నారని, సరిపడా యూరియ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని పలువురు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగాపురంలో రైతుల ఆందోళన గొలుగొండ: యూరియా కొరత వలన రైతులు నాగాపురం గ్రామ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కూటమి సర్కార్ రైతులకు న్యాయం చేయకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపించారు. గ్రామంలో వరి, పత్తి, కూరగాయాలతోపాటు ఇతర పంటలు వేయగా సకాలంలో యూరియాతోపాటు ఇతర ఎరువులు లేకపోవడం వలన పంటలు నాశనం అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. నాగాపురం పంచాయతీలో ఎంత వ్యవసాయ భూమి ఉంది.. ఎన్ని రకాల పంటలు సాగు చేస్తారు.. వారికి ఎంతమేర ఎరువులు అవసరం అని ఆలోచించుకోవద్దా అని నిలదీశారు. రైతులు యర్రా వరహాలు, పి.భూషణం, రామకృష్ణ, త్రినాథ్, నాగ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు
అనకాపల్లి: చట్ట పరిధిలో సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తన కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో అర్జీదారుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు 40 అర్జీలు వచ్చాయని, భూతగాదాలు–23, కుటుంబ కలహాలు–4, మోసాలకు సంబంధించినవి–3, వివిధ విభాగాలకు సంబంధించినవి–10 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పూర్తి విచారణ చేసి, పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు. -
పింఛన్ ఇప్పించండమ్మా..
భర్త చనిపోయి పిల్లలపై ఆధారపడి జీవిస్తున్న తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు బొగాది మహాలక్ష్మి వేడుకుంది. కుమారుడి సహాయంతో కలెక్టరేట్కు వచ్చిన ఆమె పీజీఆర్ఎస్లో అర్జీ అందజేసింది. భర్త చనిపోయిన మహిళలకు ఇటీవల ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసినప్పటికీ తనకు ఇవ్వలేదని, సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని వాపోయింది. పింఛన్ ఇప్పించాలని ఎస్డీసీ సుబ్బలక్ష్మిని వేడుకుంది. –వృద్ధురాలు బొగాది మహాలక్ష్మి -
నేత్రపర్వంగా వైష్ణవ కృష్ణాష్టమి
● ఉపమాకలో ఘనంగా ప్రారంభం ● యశోదగా గోదాదేవి అమ్మవారు నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలు, బాలభోగ నివేదలు, నిత్య హోమాలు, తీర్థగోష్టి నిర్వహించారు. తర్వాత గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తికి యశోదాదేవి అలంకరణ చేశారు. యశోద అలంకరణలో ఉన్న అమ్మవారు కృష్ణ పరమాత్మకు ఉగ్గుపాలు పడుతూ ఉండే విశేష ఘట్టం భక్తులను ఆకట్టుకుంది. సాయంత్రం ఆలయంలో విశేష అలంకరణలో ఉన్న యశోదాదేవి అమ్మవారికి, శ్రీదేవి భూదేవి సమేత కల్కి వేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు, ఆలయ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి విశేష పూజలు చేశారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉదయం గరుడాద్రి పర్వతంపై కొలువైన మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం, విశేష ప్రసాద నివేదనలు, తీర్థగోష్టి నిర్వహించారు. కొండ దిగువన ఉన్న ఉత్సవమూర్తులకు నిత్య పూజలు, రాజభోగం, నిత్య సేవా కాలం, సాయయంకాలారాధనలు పూర్తి చేశారు. స్వామివారికి పలు రకాల ప్రసాదాలను తయారు చేసి నివేదించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ● కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఆస్థాన మండపంలో ఉభయ దేవేరులతో కూడిన స్వామివారి ఉత్సవమూర్తులను, బుల్లి కృష్ణుడిని, స్వామి వారి పీఠంపై అధిష్టింపజేయనున్నారు. వెన్నతో కూడిన ఉట్టికి ప్రత్యేక ఆరాధనలు, అనంతరం ఏకాంతంగా ఉట్టికొట్టే సంబరాన్ని నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, రాజగోపాలాచార్యులు, శేషాచార్యులు, సాయి ఆచార్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. -
బెల్టు షాపులతో పేదల జీవితాలు ఛిద్రం
● గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకోరా? ● మాడుగుల ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నామాడుగుల రూరల్: నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్టుషాపుల ఏర్పాటుతో పేదల జీవితాలు ఛిద్రమవుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న ధ్వజమెత్తారు. మాడుగుల ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ బెల్టుషాపులు నిర్వహిస్తూ పేదలు కష్టాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్వక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన లైసస్స్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో బెల్ట్ దుకాణాలతో పాటు పాన్షాపులు, డాబాలు, టీ షాపుల్లో సైతం యథేచ్ఛగా మద్యం విక్రయాలు చేపడుతున్నారన్నారు. ఎంఆర్పీ కంటే బెల్టుషాపుల్లో బాటిల్పై రూ.40 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికార వేలం పాటలు నిర్వహించి, గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. బెల్టుషాపులు, అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని అనంతరం కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం దేవరాపల్లి మండల కార్యదర్శి బి.టి.దొర, వంతల కేశవరావు, దాసు పాంగి మత్యరాజు, పాంగి విజయ, పార్టీ మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి, కె.భవానీ, తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీ లక్ష్యం రూ.3 వేల కోట్ల టర్నోవర్
పాయకరావుపేట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) టర్నోవర్ రూ.3 వేల కోట్లకు పెంచాలన్న ధ్యేయంతో పని చేస్తున్నట్టు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు తెలిపారు. పట్టణంలోని బ్యాంచిలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం రూ.2700 కోట్ల టర్నోవర్లో ఉందన్నారు. కొత్తగా భీమిలీ, ఆనందపురంతో పాటు అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో కూడా బ్యాంచ్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న 92 పీఏసీఎస్లను కంప్యూటరీకరిస్తామన్నారు. తమలపాకు రైతులకు లక్ష రూపాయల రుణం అందిస్తున్నామని, దీనిని రూ.3 లక్షలకు పెంచుతామన్నారు. రైతులకు ఇతర అవసరాలకు కూడా జీరో వడ్డీతో రూ.2 లక్షలు వరకు క్రాప్ రుణం అందిస్తున్నామన్నారు. హౌసింగ్, ఎడ్యుకేషన్, మార్ట్గేజ్, ఖాళీ స్థలాలకు, చిన్న పరిశ్రమలకు కూడా రుణాలు మంజూరు చేస్తామన్నారు. పేదలకు గొర్రెలు, గేదెలు, పౌల్ట్రీ, డైరీల ఏర్పాటుకు 50 శాతం రాయితీపై నాబార్డు లింకేజ్ ద్వారా రుణాలు అందిస్తామన్నారు. అతి తక్కువ రుణాలు కలిగి ఉండి చెల్లించలేని పేదలకు ఓటీఎస్ అమలు చేస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులకు రూ.432 కోట్ల రుణాలు అందిమన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ బోడపాటి శివదత్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, డీసీసీబీ సీఈవో డి.వి.ఎస్.వర్మ, మేనేజరు కె.ఎల్ శిల్ప, ఫీల్డ్ ఆఫీసర్ సతీష్, నోడల్ ఆఫీసర్ ఎల్కేఎన్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు కార్మికులకు వేతనాలు చెల్లించాలి
కంచాలు కొట్టి మహిళల నిరసనఉక్కునగరం : స్టీల్ప్లాంట్ కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని మహిళలు డిమాండ్ చేశారు. సోమవారం స్టీల్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యోగుల కుటుంబీకులు అడ్మిన్ బిల్డింగ్ కూడలి పెద్ద ఎత్తున ధర్నాలో చేశారు. మహిళలు, ఉద్యోగులు కంచాలు కొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ ఉక్కు కార్మికులకు జీతాల చెల్లించామని కేంద్ర ఉక్కు మంత్రి ప్రకటించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఉక్కు కార్మికులకు గత ఏడాదిగా పూర్తి జీతాలు చెల్లించకుండా యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తుందన్నారు. జీతాలు చెల్లించమని అడిగిన కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చే ప్రయత్నం విరమించుకోవాలన్నారు. ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్టీల్ కార్మికులకు బోనస్ చెల్లించే అంశంపై చర్చలు జరుగుతుంటే ఇక్కడ జీతాల చెల్లించకుండా వేధిస్తున్నారన్నారు. జిల్లా సీఐటీయూ నాయకులు ఎన్.రామారావు మాట్లాడుతూ జీతాలు చెల్లించమని అడుగుతున్న కార్మికులపై చర్యలు చేపట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. -
పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా
● తప్పనిసరిగా వేయించాలి ● జేసీ జాహ్నవి పిలుపు తుమ్మపాల: నాలుగు నెలలు దాటిన ప్రతి పశువుకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా వేయించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో పాడి రంగం అభివృద్ధికి అధికారులు నిర్ణీత సమయంలో టీకా కార్యక్రమం జరపాలని, గాలికుంటు వ్యాధి పూర్తిగా నిర్మూలించాలన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రామమోహనరావు మాట్లాడుతూ జిల్లాలో 3,54,200 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని, నెల రోజులపాటు టీకా కార్యక్రమం రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఎస్డీసీ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించకుండా చూడాలి
జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర అనకాపల్లి: పంచాయతీల పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర చెప్పారు. కొత్తూరు పంచాయతీ పరిధిలో కొత్తూరు, ముత్రాస్ కాలనీల్లో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తూరు పరిధిలో జిల్లా పరిషత్కు సంబంధించిన 12 ఎకరాల స్థలం ఉందని, ఇందులో మూడు ఎకరాలను ముత్రాస్ కాలనీ హైస్కూల్కు కేటాయించే విషయం పరిశీలిస్తున్నామని చెప్పారు. మిగిలిన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని, దీనిపై పంచాయతీ అధికారులు దృష్టి పెట్టాలని ఆమె కోరారు. పట్టణ పరిధిలో జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని ఆర్డీవో కార్యాలయంగా మార్చారని, కొత్తూరులో కొత్తగా ఆర్డీవో కార్యాలయం నూతన భవనాన్ని ఏర్పాటు చేశారని, 10 రోజుల్లో కొత్త భవనంలోనికి ఆర్డీవో కార్యాలయాన్ని తరలించాలని ఆమె కోరారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, ఎంపీడీవో పి.ఆశాజ్యోతి, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ బి.వి.సత్యవతి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు పెతకంశెట్టి శివసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బ్రాండిక్స్లో 580 మందికి కంటి పరీక్షలు
అచ్యుతాపురం: స్థానిక బ్రాండిక్స్లో ఆదివారం నిర్వహించిన 142వ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 580 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 450 మందికి బ్రాండిక్స్ భారత భాగస్వామి దొరైస్వామి ఉచితంగా కళ్లద్దాలు అందజేశారు. మరో 140 మందికి మందులు పంపిణీ చేశారు. 57 మందికి కాటరాక్ట్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా దొరైస్వామి మాట్లాడుతూ కాటరాక్ట్ సర్జరీ అవసరమైన వారిని తమ వాహనాల్లో విశాఖకు తీసుకెళ్లి, అక్కడ శస్త్రచికిత్స తర్వాత వారి స్వగృహాలకు చేరుస్తామని తెలిపారు. వైద్య పరీక్షలకు హాజరైన వారికి మజ్జిగ, ఫలహారం, భోజన సదుపాయాలు కల్పించారు. -
ముగిసిన జిల్లా స్థాయి నృత్య పోటీలు
మద్దిలపాలెం(విశాఖ): ఎంఎంటీసీ కాలనీలోని ఏపీఎస్ఈబీ వెల్ఫేర్ అసోసియేషన్ హాలులో రెండు రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి నృత్య పోటీలు ఆదివారం ముగిశాయి. భారతీయ శాసీ్త్రయ, సంస్కృతి, సంప్రదా య, జానపద నృత్యాలతో దాదాపు 300 మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నా రు. ఈ పోటీలను స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించాయి. విజేతలకు వాకర్స్ ఇంటర్నేషనల్ట్రస్టీ కమల్బేడి, ఏపీఎస్ఈబీ వెల్ఫేర్ అసో సియేషన్ చైర్మన్ కె.రామారావు, బ్రహ్మకుమారి రామే శ్వరి బహుమతులు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా స్కూల్ఆఫ్ థియేటర్ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ ఆర్.నాగ రాజు పట్నాయక్, విజయవేణి వ్యవహరించారు. -
ఓనం.. ఆనందం
మురళీనగర్: విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన విశాఖపట్నంలో కేరళీయుల సాంస్కృతిక వైభవం వెల్లివిరిసింది. తమ వారసత్వాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతో.. బిర్లా కూడలి సమీపంలోని కేరళ కళాసమితిలో ఆదివారం ఓనం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న కేరళీయులు నిర్వహించిన ఈ వేడుకలు కేరళ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టాయి. ముందుగా తమ ఆరాధ్య దైవమైన బలి చక్రవర్తికి స్వాగతం పలికే కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మేళతాళాల నడుమ మహిళలు దీపాలతో, ఛత్రంతో బలి చక్రవర్తిని వేదికపైకి ఆహ్వానించారు. ఆయన రాకతో సభాప్రాంగణం మొత్తం లేచి నిలబడి గౌరవాన్ని ప్రకటించింది. అనంతరం బలి చక్రవర్తి ప్రజలందరినీ ఆశీర్వదించి, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ముందు, మహిళలు పూలతో అందంగా అలంకరించిన ‘ఓనపూక్కళం’వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రదక్షిణలు చేశారు. అనంతరం కేరళ ఎంపీ బెన్ని బెహనన్, ఎమ్మెల్యే ఎం.ఎస్. అరుణ్ కుమార్, ఇతర పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన ‘తిరువాదిరకళి’నృత్యం, శాసీ్త్రయ నృత్యమైన ‘మోహినియాట్టం’, పులివేషాలు, చెండమేళం వాయిద్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేరళ ఎంపీ బెన్ని బెహనన్ మాట్లాడుతూ.. ఎక్కడ ఉన్నా స్థానిక ప్రజలతో కలిసిపోతూ తమ సంస్కృతిని కాపాడుకోవడం కేరళీయుల ప్రత్యేకత అని అన్నారు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మావిలెక్కిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం.ఎస్. అరుణ్ కుమార్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చిలు కేరళీయులకు ఓనం శుభాకాంక్షలు తెలిపి, తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన 8 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు. నగరం నలుమూలల నుంచి సుమారు 1,500 మంది కేరళీయులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. చివరగా 29 రకాల పదార్థాలతో తయారు చేసిన కేరళీయలు ప్రత్యేక విందు భోజనం ‘సాద్య’ను సామూహికంగా ఆరగించారు. కార్యక్రమంలో కేరళ కళాసమితి అధ్యక్షుడు జె.థామస్, జనరల్ సెక్రటరీ హరిదాస్, కై రళీ ఆర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ శశిధరణ్ పిళ్లై, వీఎండబ్ల్యూఏ అధ్యక్షుడు కేపీ వర్గీస్, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత నందినీ మేనన్ తదితరులు, పాల్గొన్నారు. -
కూటమి సిగపట్లు
పెందుర్తిలో పెందుర్తి: ‘నేను పెందుర్తి ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేని. నా మీద టీడీపీ ఇన్చార్జిని వేసి అతనికీ అధికారాలు ఇస్తామంటే ఎలా. ప్రతీ అధికారిక సమావేశానికి ఇన్చార్జిలు వచ్చి పెత్తనం చేయడం ఏంటి. నియోజకవర్గంలో కూడా మాకు తెలియకుండా టీడీపీ నేతలు పనులు చేయించుకుంటున్నారు. పార్టీ ఇన్చార్జిలు అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం ఏంటి. ఇదేనా కూటమి పొత్తు ధర్మం’ రెండు నెలల క్రితం వీఎంఆర్డీఎ వేదికగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు చేసిన వ్యాఖ్యల సారంశం. ‘నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కలిసి పనిచేస్తేనే కూటమి అభ్యర్థి గెలిచారు. వారికి ప్రజా సమస్యలపై ఎంత బాధ్యత ఉందో మాకు అంతే బాధ్యత ఉంది. పేదలకు, దళితులకు అన్యాయం చేస్తూ అభివృద్ది చేస్తామంటే మేం ఒప్పుకోం. పేదల పక్షాల నిలబడితే అభివృద్ధికి అడ్డుపడుతున్నామంటూ మాపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. కూటమిగా అధికారంలో ఉండి ఇలాంటి చర్యలకు కొందరు పాల్పడడం మా దౌర్భగ్యం’ సబ్బవరంలో మీడియా ముఖంగా టీడీపీ ఇంచార్జి గండి బాబ్జి వాఖ్యలు ఇవి. పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకులైన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఇద్దరు నాయకులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కలిసి హాజరవుతున్నప్పటికీ, లోపల మాత్రం వారి మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని వివాదాస్పద పనుల విషయంలో ఇద్దరూ భిన్నమైన వైఖరి తీసుకుంటూ అధికారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని సమాచారం. తమ చెప్పుచేతల్లో అధికార యంత్రాంగాన్ని పెట్టుకోవడానికి ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. పంచకర్ల రమేష్ బాబు తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సుప్రీం అని భావిస్తుండగా, గండి బాబ్జి ఎన్నికల్లో తన కృషికి ఫలితంగా విజయం దక్కిందని, ఎమ్మెల్యేతో సమానంగా గౌర వం కావాలని పట్టుబడుతున్నారు. రెండు నెలల క్రితం వీఎంఆర్డీఏ సమీక్షలో కూడా వారి మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. తాజాగా, సబ్బవరంలో ఒక అభివృద్ధి పని విషయంలో ఇరువురి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీనిపై గండి బాబ్జి శనివారం మీడియా ముందు మాట్లాడుతూ, ‘పేదల భూములు లాక్కొని అభివృద్ధి చేస్తారా? నేను బాధితుల తరఫున మాట్లాడితే, మా పొత్తులో ఉన్నవారే మా అధిష్టానానికి నాపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెందుర్తి నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య సఖ్యత లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తొలి నుంచీ తలో దారే పెందుర్తిలో జరుగుతున్న ప్రతీ అంశంలోనూ ఎమ్మెల్యే పంచకర్లకు, గండి బాబ్జికి మద్య సఖ్యత ఉండడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల కాలంలో వీరి మద్య మరింత దూరం పెరిగింది. పెందుర్తి పీఏసీఎస్ చైర్మన్గా పంచకర్ల సిఫార్సుతో జనసేన నాయకుడు అయిత సింహాచలంని నియమించారు. నెల రోజుల క్రితం జరిగిన చైర్మన్ ప్రమాణ స్వీకారానికి కూటమిలోనే ఉన్న గండి బాబ్జి ముఖ్యం చాటేశారు. అతనితో పాటు టీడీపీ నాయకులెవరూ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. చివరకు పీఏసీఎస్ సభ్యుడిగా నియమితులైన చిరికి అవతారం కూడా కార్యక్రామనికి హాజరు కాలేదు(తరువాత పీఏసీఎస్ కార్యాలయంలో బాధ్యత స్వీకరించారు). ఈ క్రమంలో పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా టీడీపీ ఇంచార్జి గండి బాబ్జీ లేఖతో అతని అనుచరుడు అవగడ్డ అప్పలనాయడు భార్య జ్యోతిని నియమించారు. అయితే జ్యోతి ప్రమాణ స్వీకారం చేస్తున్న సభకు కేవలం కిలో మీటర్ దూరం వరకు వచ్చిన పంచకర్ల రమేష్బాబు సహా జనసేన కేడర్ అంతా వెనుదిరిగారు. ఇక పంచకర్ల అనుచరులు చింతగట్లలో ఐదెకరాల భూమిపై కన్నెసి తప్పుడు పత్రాలు సృష్టిస్తే దాన్ని గంబి బాబ్జీ వర్గీయులు అడ్డుకున్నట్లు బహిరంగంగానే చర్చ జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే తాజాగా నియోజవర్గంలో పరిణామాల బట్టి పంచకర్ల రమేష్బాబు, గండి బాబ్జీ పోరు తారాస్థాయికి చేరుకున్నట్టే కనిపిస్తుంది. ఆధిపత్య పోరు పెందుర్తి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జి మధ్య ఎన్నికల నుంచే కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు అధికారులకి పెద్ద తలనొప్పిగా మారింది. వీరిద్దరూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కలిసి పనిచేశారు తప్ప, వారి మధ్య విభేదాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. అధికారుల బదిలీలు, ఒత్తిళ్లు అధికారం చేపట్టిన వెంటనే అధికారుల బదిలీల విషయంలోనే ఈ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు మొదల య్యాయి. పంచకర్లకు పోటీగా గండి బాబ్జి కూడా తన సిఫార్సులను అధికారులకు పంపారు. బాబ్జికి జిల్లా.. రాష్ట్రస్థాయి నాయకులతో ఉన్న పరిచయాల కారణంగా ఆయన సిఫార్సులకు ప్రాధాన్యత లభించడం, పంచకర్ల సిఫార్సులు కొన్నిసార్లు అమలు కాకపోవడం ఆయన అసహనానికి కారణమైంది. అంతేకాకుండా, ఎమ్మెల్యేకు పోటీగా బాబ్జి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం, పీజీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టడం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం వంటివి కూడా పంచకర్లకు మరింత కోపం తెప్పించాయి. ఈ కోపాన్ని ఇద్దరు నాయకులు అధికారులపై చూపుతున్నారు. ఒకే పని విషయంలో ఒకరు ‘వద్దు’ అంటే, మరొకరు ‘చేయాలి’ అని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండటంతో అధికారులు ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలకు మేలు చేసేదెవరు? ఈ ఆధిపత్య పోరులో ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ 15 నెలల కాలంలో ఇద్దరు నేతలు తమ తమ పార్టీల నాయకులకు, కార్యకర్తల కోసం మాత్రమే పనిచేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, కేవలం తమ కార్యకర్తలకు మేలు చేయడానికి, వారు కేసుల్లో ఇరుక్కుంటే కాపాడడానికి, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవడానికి మాత్రమే ఈ నేతలు ఉత్సాహం చూపిస్తున్నారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఈ నేతల వేధింపులు తాళలేక చాలా మంది అధికారులు బదిలీలపై వెళ్లిపోయారని కూడా ఆరోపణలు ఉన్నాయి. తమకు నచ్చని అధికారులను వేధించి బదిలీ చేయించడం కోసం మాత్రమే ఈ నేతలు అధికారాన్ని పంచుకుంటున్నారని పెందుర్తి ప్రజలు మండిపడుతున్నారు. -
నేడు ఉపమాకలో వైష్ణవ కృష్ణాష్టమి
సముద్రంలో కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన మైరెన్ పోలీసులు సురక్షితంగా బయటపడ్డ శివసాయితో మైరెన్ పోలీసులు ఎస్.రాయవరం: రేవుపోలవరం తీరంలో సముద్రంలో స్నానానికి దిగిన వ్యక్తి మునిగిపోతుండగా ఒడ్డున ఉన్న మైరెన సీఐ మురళీరావు సిబ్బందితో వెళ్లి కాపాడారు. చోడవరం మండలం గౌరీపట్నం గ్రామానికి చెందిన కర్రి శివసాయి (28) బంధువులతో వచ్చి తీరంలో స్నానం చేస్తుండగా పెద అల రావడంతో సముద్రం లోపలికి వెళ్లి మునిగిపోయాడు. వెంటనే బంధువులు కేకలు వేయడంతో సీఐ మురళీరావు, ఎస్ఐ దొర, ఏఎస్ఐ కృష్ణ, కానిస్టేబుల్ చిన్నబాబు, హోం గార్డులు శివ, శ్రీను మునిగిపోతున్న శివసాయికి లైఫ్ జాకెట్ అందించి ఒడ్డుకు చేర్చారు. దీంతో శివసాయికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మైరెన్ సీఐ, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సముద్రంలో మునిగిన వ్యక్తిని కాపాడినందుకు వారికి అభినందలు తెలిపారు. వీకెండ్లో రేవుపోలవరం తీరానికి వస్తున్న పర్యాటకుల రక్షణ కోసం పెంటకోట మైరెన్ స్టేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని సీఐ చెప్పారు.నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమ, మంగళవారాల్లో వైష్ణవ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఆలయంలో నిత్యపూజా కార్యక్రమాలు, బాలభోగ నివేదనలు, నిత్య హోమాలు, తీర్థగోష్టి, యథావిధిగా జరుగుతాయన్నారు. కృష్ణ పరమాత్మకు ఉగ్గుపాలు పడుతున్నట్టు గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు యశోదాదేవి అలంకరణ చేస్తారని చెప్పారు. సాయంత్రం ఆలయంలో విశేష అలంకరణలో ఉన్న యశోదాదేవికి, శ్రీదేవి భూదేవి సమేత కల్కి వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు, ఆలయ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి నీరాజనాలు సమర్పించిన తర్వాత భక్తులందరికీ విశేష ప్రసాద నివేదన ఉంటుందన్నారు. అనంతరం గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తమై వెలసిన మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం, విశేష ప్రసాద నివేదనలు, తీర్థగోష్టి నిర్వహిస్తామన్నారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఆస్థాన మండపంలో ఉభయ దేవేరులతో కూడిన స్వామివారి ఉత్సవమూర్తులను, బుల్లి కృష్ణుడిని స్వామివారి పీఠంపై అధిష్టింపజేసి ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వెన్నతో కూడిన ఉట్టికి ప్రత్యేక ఆరాధనలు అనంతరం, ఏకాంతంగా ఉట్టి కొట్టే సంబరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.యశోద అలంకరణలో గోదాదేవి అమ్మవారు -
ఆచార్యులుకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
నక్కపల్లి: మండలంలో పెదబోదిగల్లం జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎన్.వి.ఎస్. ఆచార్యులు మాస్టర్ను ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర శాఖ గుంటూరులో ఆదివారం ఘనంగా సన్మానించి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేసింది. ఈ నెల 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని పురస్కారం అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో పనిచేస్తున్న బ్రాహ్మణ ఉపాధ్యాయులకు ఈ పురస్కారాలను అందజేస్తున్నట్టు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతికి చెందిన ఎస్.ఆర్. కృష్ణమూర్తి, నాగార్జున విశ్వవిద్యాలయం సంస్కృత విభాగానికి చెందిన డాక్టర్ మంజుల చింతలపాటి, కౌతా ధర్మసంస్థల అధినేత కౌతా సుబ్బారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకుడు విష్ణువర్దన్, రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు మంగళంపల్లి అంజిబాబు, బందా రవి, రామభద్రుడు, కాణిపాకం ఆలయ అర్చక పురోహిత సంఘం ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కార్యదర్శి అయ్యన్న పాల్గొన్నారు. 15 ఏళ్లుగా ఆచార్యులు మాస్టర్ విద్యార్థుల్లో విద్యాప్రమాణాల మెరుగుకు, దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సెలవు రోజుల్లో గ్రామాల్లో పర్యటించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఘన ంగా సన్మానం -
వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలి
వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్ఐ రమేష్, సిబ్బందినర్సీపట్నం: వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలని లేని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని టౌన్ ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు అధిక సంఖ్యలో మోహరించి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీచేశారు. రికార్డులు లేని వాహనాలను స్వాధీ నం చేసుకుని స్టేషన్కు తరలించారు. సుమా రు 50 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేదిలేదన్నారు. -
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: గర్భిణులు, బాలింతలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని 102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బసవరాజు డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో విశాఖ ఉమ్మడి జిల్లా యూనియన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.7,800 జీతంతో ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని చెప్పారు. కనీస వేతనాలు అమలు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం, అరబిందో యాజమాన్యం పట్టించుకోవడంలేదని, పైగా యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం చేయాలన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.దేవి ప్రసాద్ మాట్లాడుతూ 102 ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు వై.సతీష్, అల్లూరి జిల్లా అధ్యక్షుడు వి. వాసు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఉమ్మడి విశాఖ జిల్లా యూనియన్ సదస్సులో వక్తలు -
బహిరంగ ప్రదేశాల్లో కోళ్ల కళేబరాలు పడేస్తే కఠిన చర్యలు
కె.కోటపాడు పశు సంవర్ధకశాఖ ఏడీ దినేష్కుమార్ దేవరాపల్లి: బహిరంగ ప్రదేశాల్లో కోళ్ల కళేబరాలను పడేస్తే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కె.కోటపాడు పశు సంవర్ధకశాఖ ఏడీ ఈ.దినేష్కుమార్ హెచ్చరించారు. మండలంలోని చేనులపాలెం కల్లాలు సమీపంలో సాగు నీటి చెరువు, కాలువల్లో గుట్టలు గుట్టలుగా పడేసిన కోళ్ల కళేబరాలను స్థానిక పశు వైద్యాధికారులు జి.గాయత్రీదేవి, కె.మంజుషారాణి, జి.ప్రియాంకతో కలిసి ఆదివారం పరిశీలించారు. స్థానిక పంచాయతీ సెక్రటరీ స్వామినాయుడు, వీఆర్వో రాజేంద్రకుమార్ల సమక్షంలో చెరువులోంచి వాటిని బయటకు తీయించి, గోతిలోపూడ్చి వేశారు. ఈ సందర్భంగా ఏడీ దినేష్కుమార్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో కోళ్లు లేదా ఇతర జంతువుల కళేబరాలను పడేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. -
సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
పెందుర్తిలో ‘కూటమి’ సిగపట్లు ● పెత్తనం కోసం ఎమ్మెల్యే పంచకర్ల.. టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జి పాట్లు ● ఒకరిపై ఒకరు తమ తమ అధిష్టానానికి ఫిర్యాదులు ● మీడియా ముఖంగా బహిర్గతం చేసిన గండి బాబ్జి పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఎలా? ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి పత్రికల స్వేచ్ఛను పోలీసు కేసులతో ప్రభుత్వం హరిస్తామంటే ఎలా..? ఇటీవల సాక్షిలో ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడిన ప్రెస్మీట్ను వార్తగా రాస్తే.. సంబంధిత జర్నలిస్టుపై, ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. ప్రజల గొంతుకుగా నిలిచే మీడియా గొంతును నులిమే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది. అక్షరాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను నోటీసులు, అక్రమ కేసులతో పోలీసులు నిరోధించలేరు. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపుల ధోరణికే పాల్పడుతోంది. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పత్రికలపై కక్ష కట్టిన ఏ నాయకుడూ బాగుపడిన దాఖలా చరిత్రలో లేదు. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ మాజీ విప్రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు ప్రపంచంలోనే అత్యంత దృఢమైనదని భారత రాజ్యాంగానికి పేరు. అలాంటి రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండడానికే మీడియాను అణగదొక్కుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రెస్మీట్ను వార్తగా రాస్తే కేసు ఎలా నమోదు చేస్తారు? ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే. రాజకీయ పార్టీల నాయకులు ప్రెస్మీట్ల ద్వారా వెల్లడించిన అంశాలను వార్తగా మలిచే హక్కు జర్నలిస్టులకు ఉంటుంది. నాయకులు మీడియా సమావేశాలు పెట్టి అనేక అంశాలు మాట్లాడతారు. వాటిని వార్త రూపంలో ప్రజలకు చేరువేయడంతో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. అంతమాత్రాన వార్త రాసిన జర్నలిస్టుపై, పత్రిక ఎడిటర్పై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేడయం సరికాదు. – తైనాల విజయకుమార్, మాజీ ఎమ్మెల్యే -
‘న్యాయవాదుల రక్షణకు చట్టాలను తీసుకురావాలి’
అనకాపల్లి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదులపై దాడులు అంతకంతకు పెరిగిపోతున్నాయని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.ఎస్.అజయ్కుమార్ తెలిపారు.న్యాయవాదుల రక్షణకు తగిన చట్టాలను తీసుకురావాలన్నారు. స్థానిక గాంధీనగరం అసోసియేషన్ ఫర్ జస్టిస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లిలో ఉన్న కోర్టుల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయని, న్యాయమూర్తులు, కలెక్టర్ వెంటనే స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. న్యాయస్థానాల్లో మౌలిక వసతులు, ఇతర సమస్యలపై న్యాయ, మున్సిపల్ శాఖలకు లేఖలు రాయాలని తీర్మానం చేసినట్టు చెప్పారు. న్యాయవాది ఐ.ఆర్.గంగాధర్ మాట్లాడుతూ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణకు చట్టాన్ని తీసుకువచ్చిందని, రాజస్థాన్ రాష్ట్ర శాసనసభలో కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చట్టాలు తీసుకురావలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఇళ్ల అవినాష్ , ఓడిబోయిన రాంబాబు, చిట్టా జయశ్రీ, జి. బాలప్రభ, వడిసెల కస్తూరి తదితరులు పాల్గొన్నారు. -
కంటి మీదకునుకు లేదు
నక్కపల్లి: రాజయ్యపేటలో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్క్డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గ్రామానికి చెందిన మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోకి ఎందుకొచ్చారంటూ నిలదీశారు. మత్స్యకారుల ఆందోళనకు నాయకత్వం వహించిన ఎరిపిల్లి నాగేశ్వరరావు (నాగేశు)కు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లినట్లు ఆందోళనకారులు తెలిపారు. నోటీసులు తీసుకోడానికి నిరాకరించామని, నోటీసు తీసుకున్నా తీసుకోకపోయినా అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు నాగేశు తెలిపాడు. నాగేశును అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న వందలాది మంది మహిళలు, గ్రామస్తులు పోలీసులను చుట్టుముట్టారు. ఉదయం ఆందోళన చేసిన ప్రాంతంలోనే మహిళలంతా ఆందోళన కొనసాగిస్తున్నారు. నాగేశు అరెస్టును అడ్డుకుంటామంటూ మహిళలు ముక్తకంఠంతో చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో అధిక సంఖ్యలో పోలీసులు గ్రామంలోకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల రాకను నిరసిస్తూ గ్రామంలో రాత్రి 11 గంటలు దాటాక కూడా పిక్కి నూకరాజు, కారే వెంకటేష్, అర్జల్లి మాధవ, పిక్కి కాశీ, మైలపరి సూరిబాబు తదితరులతోపాటు వందలాది మంది మహిళ లు ఆందోళన కొనసాగిస్తున్నారు. నాగేశును పోలీసులు తీసుకెళ్లకుండా కాపలా ఉన్నారు. అర్ధరాత్రి మోహరించిన పోలీసులు మత్స్యకార నేత నాగేశు అరెస్టుకు యత్నాలు అడ్డుకున్న మహిళలు.. గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతున్న ఆందోళన -
వాల్తేరు డివిజన్లో రైల్వే పనులపై సమీక్ష
తాటిచెట్లపాలెం (విశాఖ): వాల్తేరు డివిజన్లో జరుగుతున్న సివిల్ ఇంజనీరింగ్ విభాగం పనులపై డీఆర్ఎం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధునీకరించిన సివిల్ ఇంజనీరింగ్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. రైల్వే భద్రతకు అత్యధిక ప్రా ధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. రద్దీ సీజన్లలో వివిధ విభాగాల మధ్య సమన్వయం మెరుగుపరుచుకోవడం ద్వారా డివిజన్ పనితీరు మరింత మెరుగవుతుందని ఆయన తెలిపారు. సమీక్షలో భాగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణ పనులు, అమృత్ భారత్ స్టేషన్ పనులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టాల్సిన చర్యలు, కొండచరియల ప్రాంతాలలో భద్రతా పనుల గురించి చర్చించారు. ఆధునీకరించిన సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. -
‘ప్రగాఢ’ అవిశ్వాసం
ఎమ్మెల్యే వర్గీయులపై ప్రగడ నాగేశ్వరరావు కారాలు, మిరియాలు అచ్యుతాపురం రూరల్: యలమంచిలి రాజకీయాలు రోజురోజుకు రసకందాయంలో పడుతున్నాయి. నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జినైన తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్పై, ఆయనతో సన్నిహితంగా ఉంటున్న టీడీపీలోని వైరి వర్గంపై రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు కారాలు, మిరియాలు నూరుతున్నారు. దుప్పితూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రగడ ఆదివారం పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం వచ్చిన కాంక్రీట్ లారీని దుప్పితూరు గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుమారుడు ప్రగడ జూనియర్ నాగేశ్వరరావు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో గతంలో నిర్మించిన రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. రహదారి నిర్మాణాన్ని ఎమ్మెల్యే అండదండలతో దురుద్దేశంతో అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో లేనిపోని విభేదాలు సృష్టించవద్దని నాయకులకు హితవు పలికారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో లోపించిన నాణ్యతా ప్రమాణాలు ఫ్లైఓవర్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. అచ్యుతాపురంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణం పనుల్లో ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి అవగాహనలేని కాంట్రాక్ట్ లేబర్ను పెట్టి పనులు చేయిస్తున్నారన్నారు. దీంతో ప్రమాదాలు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ రహదారులు లేక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురతున్నారని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి, అధికారుల పర్యవేక్షణలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. -
రగులుతున్న రాజయ్యపేట
గంగపుత్రుల గొంతు నొక్కేశారు.. తమ ఆవేదన వెలిబుచ్చే అవకాశాన్ని కాలరాశారు.. బల్క్డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనకు సిద్ధపడ్డ మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి నిరాకరించడమే కాక.. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి ఎండలో టెంటు వేసుకుంటామన్నా ఒప్పుకోలేదు. దీంతో మండుటెండలో ఏడు గంటలపాటు మత్స్యకారులు ధర్నా చేశారు.● బల్క్డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నిరాహార దీక్షకు సిద్ధపడ్డ మత్స్యకారులు ● అనుమతి నిరాకరించిన పోలీసులు ● భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సమావేశమైనా ఆటంకాలు ● టెంట్లపై వాహనాలు నిలపడంతో పోలీసులతో వాగ్వాదం ● మండుటెండలో నిరసనకు దిగిన గంగపుత్రులు ● ఏడు గంటలపాటు బైఠాయించిన బాధితులునక్కపల్లి: రాజయ్యపేటలో మళ్లీ నిరసన సెగ రగిలింది. ఈ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న బల్క్డ్రగ్ పార్క్ను నిలిపివేయాలంటూ తాము చేపట్టిన శాంతియుత నిరాహారదీక్షను పోలీసులు అడ్డుకోవడంతో మత్స్యకారులు మండిపడ్డారు. కనీసం తమకు ఆవేదన వెలిబుచ్చే హక్కు కూడా లేదా అని ఆగ్రహంతో ఊగిపోయారు. తమ గ్రామంలో భారీ మెజారిటీ ఇచ్చినందుకు ఇదేనా బహుమానం అని కోపంతో నిలదీశారు. రాజయ్యపేట సమీపంలో బల్క్డ్రగ్ పార్క్ నిర్మిస్తే మత్స్య సంపద నశిస్తుందని, ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ మత్స్యకారులు ఆదివారం నిరాహారదీక్షను తలపెట్టారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు టెంట్లపై తమ జీపులను నిలబెట్టడంతో గంగపుత్రులు తీవ్ర మనస్తాపం చెందారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారంటూ హోం మంత్రి వంగలపూడి అనితపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసులకు భయపడేది లేదని, నిరాహారదీక్షలు చేసి తీరుతామంటూ దీక్ష చేసే ప్రాంతం వద్ద ఏడు గంటలపాటు తీవ్రమైన ఎండలో ఆందోళన కొనసాగించారు. మున్ముందు మరింత ఉధృతంగా పోరాడేందుకు సిద్ధపడుతున్నారు. మత్స్యసంపదకు ముప్పు కలిగించొద్దు ప్రభుత్వం రాజయ్యపేట సమీపంలో 2 వేల ఎకరాల్లో రూ.1800 కోట్ల వ్యయంతో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్డ్రగ్ పార్క్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పనులు మూడు నెలల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఈ బల్క్డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారులు, సమీప ప్రాంతాలత్లో నివసించేవారి ప్రాణాలకు మప్పు వాటిల్లుతుందని, సముద్రంలోకి వేసే పైపులైన్ల వల్ల మత్స్య సంపద నాశనమవుతుందని, జీవనోపాధి కోల్పోయి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సి వస్తుందని రాజయ్యపేట, బోయపాడు, దొండవాక తదితర గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ర్యాలీలు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా తమ పనులు కొనసాగిస్తోంది. హోం మంత్రి అనితను కూడా మత్స్యకారులు కలిసి సమస్యను వివరించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో మత్స్యకారులు పనులు చేసే చోట శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తామని, అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆదివారం గ్రామస్తులంతా ఊరి చివరన సముద్రపు ఒడ్డుకు సమీపంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు సమావేశమయ్యారు. ఎండగా ఉందని టెంట్లు వేసే సమయంలో నక్కపల్లి, ఎస్.రాయవరం సీఐలు కుమారస్వామి, రామకృష్ణ,, ఎస్ఐలు సన్నిబాబు, అంజుల ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టెంట్లపై పోలీసు జీపులను ఉంచి టెంట్లు వేయకుండా అడ్డుకున్నారు. దీంతో మత్స్యకారులు, మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. మండుటెండలో తాటి కమ్మలు చేతపట్టి, ఎండ తగలకుండా ఆందోళన కొనసాగించారు. పనులు అడ్డుకోవడం, దీక్ష చేపట్టకుండానే పోలీసులు తమను బెదిరించడం, టెంట్లపై జీపులు పెట్టడం సరికాదని మత్స్యకార నాయకుడు ఎరిపిల్లి నాగేశు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే బల్క్డ్రగ్ పార్క్ రద్దు చేయాల్సిందేనన్నారు. విషయం తెలుసుకున్న సీపీఎం నాయకుడు ఎం.అప్పలరాజు తదితరు లు సంఘటన స్థలానికి చేరుకొని మత్స్యకారులకు సంఘీభావం తెలిపారు. పోలీసుల వైఖరి సరికాదన్నారు. టెంట్లు వేయకుండా పోలీసులను అడ్డుకున్నట్టు తెలుసుకుని వందలాది మంది మహిళలు వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. రాజయ్యపేటను అమ్మేశావా అనితమ్మా..ధర్నా చేసిన మత్స్యకారులపై కేసులు బల్క్డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ ఆదివారం రాజయ్యపేటలో నిరాహార దీక్షకు ప్రయత్నించిన 13మంది మత్స్యకారులపై నక్కపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ మత్స్యకారులు ధర్నా కొనసాగించారు. ప్రభుత్వ అధికారుల ఆదేశాలు ఉల్లంఘించి ధర్నా చేసినందుకు ఎరిపిల్లి నాగేశ్వరరావు, మైలపల్లి మహేష్, మైలపల్లి బైరాగి, గోసల స్వామి, కోడ కాశీరావు, పిక్కి రాము, మైలిపల్లి సూరిబాబు, మైలిపల్లి జాను, మైలపల్లి రాజు, పిక్కి కోదండరాజు, చోడిపల్లి కాశీ, పిక్కి సత్తియ్య, మేడిబోయిన అప్పలరాజులతోపాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేసినట్టు సీఐ కుమారస్వామి తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు, మహిళలు హోం మంత్రి వంగలపూడి అనితపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చిన అనిత ఇప్పుడు కనిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని కంపెనీల కోసం అమ్మేశారంటూ ఆరోపించారు. ఇంటింటికీ తిరిగి మీ ఆడపడుచును అంటూ ఓట్లు వేయించుకుని తీరా గెలిచిన తర్వాత ముఖం చాటేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిత అండదండలతోనే పోలీసులు తమ దీక్షలను అడ్డుకుంటున్నారన్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడా ఉండదన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం ఐదుగంటల వరకు కొనసాగింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా దీక్ష చేసి తీరుతామని మత్స్యకారులు చెబుతున్నారు. గ్రామస్తులంతా ఏకమై పోరాడుతున్న ఈ సమస్యపై ఒక నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సమావేశంపై పోలీసులు ఆంక్షలు విధించడం సమంజసం కాదని సీపీఎం నాయకులు అప్పలరాజు అన్నారు. ఈ ఆందోళనలో మత్స్యకార నాయకులు ఎం.సూరిబాబు, పిక్కి సత్తియ్య, ఎం.మహేష్బాబు, సోమేశ్వరరావు, డి.నానాజీ, నరేష్, మాధవ్, కె.కాశీ, పి.నల్ల, సిహెచ్ వసంతమ్మ, రామ్చరణ్ పలువురు మహిళలు పాల్గొన్నారు. -
మా గ్రామాన్ని బల్క్ డ్రగ్ పార్క్కు అమ్మేశావా?
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): ‘ఓట్ల కోసం వచ్చినప్పుడు కాళ్లా వేళ్లాపడ్డావు. మీ ఆడపిల్లనన్నావు. రాజయ్యపేట నా పుట్టినిల్లు అనుకుంటానని నమ్మబలికావు. నిన్ను నమ్మి నక్కపల్లి మండలంలో ఏ గ్రామంలోనూ రాని విధంగా రాజయ్యపేటలో టీడీపీకి 2వేల ఓట్ల మెజార్టీ ఇచ్చాము. ఇంతలా ఆదరించిన మత్స్యకారుల రుణం బాగానే తీర్చుకున్నావు అనితమ్మా... మా రాజయ్యపేటని బల్క్ డ్రగ్ పార్క్ కోసం అమ్మేశావా? ఆరు నెలల నుంచి బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలంటూ గంగపుత్రులు ఆందోళన చేస్తుంటే మా గోడు వినేందుకు కూడా నీకు తీరిక లేదా...’ అంటూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.రాజయ్యపేట సమీపంలో నిర్మిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ను నిలిపివేయాలని మత్స్యకారులు ఆదివారం శాంతియుతంగా చేపట్టిన సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సమావేశం కోసం తెచ్చిన టెంట్లపై పోలీసు జీపులను నిలబెట్టారు. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ధర్నాకు కూర్చున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు.. మత్స్య సంపద నాశనం.. ప్రభుత్వం రాజయ్యపేట సమీపంలో 2వేల ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ పార్క్ నిరి్మస్తోంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారులు, సమీప ప్రాంతాల్లో నివసించేవారి ప్రాణాలకు పుప్పు వాటిల్లుతుందని, సముద్రంలోకి వేసే పైపులైన్ల వల్ల మత్స్య సంపద నాశనమవుతుందని రాజయ్యపేట, బోయపాడు, దొండవాక తదితర గ్రామాల మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తోంది. దీంతో మత్స్యకారులు పనులు చేసే చోట శాంతియుతంగా నిరాహార దీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆదివారం గ్రామçస్తులు సముద్రం ఒడ్డున సమావేశం కాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశారు. మత్స్యకార నాయకుడు ఎరిపిల్లి నాగేశు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకులు మత్స్యకారులకు సంఘీభావం తెలిపారు. 13మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు మరోమారు నోటీసులతో గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. -
స్పా ముసుగులో గుట్టుగా వ్యభిచారం
విశాఖపట్నం: గాజువాకలోని ఒక స్పా సెంటర్పై గాజువాక పోలీసులు, సిటీ టాస్్కఫోర్స్ సిబ్బంది శనివారం దాడి చేశారు. అందులో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని రట్టు చేశారు. పాతగాజువాకలోని సీఎంఆర్ సెంట్రల్కు సమీపంలోని ఎస్ఎస్ థాయ్ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది గాజువాక పోలీసులతో కలిసి దాడి చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతుండటంతో స్పా సెంటర్ నిర్వాహకురాలు సహా ఒక విటుడిని అరెస్టు, ఐదు గురు బాధితులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు గాజువాక సీఐ పార్థసారధి తెలిపారు. జోన్–2 టాస్్కఫోర్స్ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఎస్ఐ భరత్, సిబ్బంది పాల్గొన్నారు. -
మా కుమారుడిది ముమ్మాటికీ హత్యే.!
దేవరాపల్లి: తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికే హత్యేనని దేవరాపల్లి మండలం కాశీపురానికి చెందిన డెక్క నవీన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. డెక్క నవీన్(23) చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన తమ కుమారుడు నవీన్ మేడ మీద నుంచి కింద పడి చనిపోయాడంటూ ఓ యువతి ఫోన్ నుంచి మరో యువకుడు ఫోన్ చేసి చెప్పడం పట్ల వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ప్రేమించిన రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువతితో పాటు ఆమె తల్లి, వారి బంధవులు పథకం ప్రకారం తమ కుమారుడిని తీర్థ యాత్ర పేరుతో తీసుకెళ్లి హతమార్చారని మృతుడి తల్లిదండ్రులు రాంబాబు, విజయ, చెల్లెలు రేష్మ ఆరోపించారు. నవీన్ మృతిపై నిష్పాక్షికంగా విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రేమిస్తే ఇంత దారుణంగా హతమారుస్తారా అంటూ గుండెలవిసేలా రోదించారు. తమకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. హోంమంత్రిని, ఎస్పీని, ఎమ్మెల్యేను కలిసి తమ కుమారుడి మృతిపై విచారణ చేసి న్యాయం చేయమని కోరతామని శనివారం విలేకర్లకు మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. బతుకుతెరువు కోసం అచ్యుతాపురం వలస కాశీపురానికి చెందిన నవీన్ కుటుంబం సుమారు 12 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం అచ్యుతాపురం మండలం చినపూడి గ్రామానికి వలస వెళ్లారు. నవీన్ తండ్రి రాంబాబు అక్కడ ఓప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇంటర్, ఐటీఐ చదివిన నవీన్ అథ్లెటిక్స్లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగి రాణిస్తున్నాడు. అతను చదువుకునే సమయంలో తనతో చదివిన అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆమె మరో రాష్ట్రంలో చదువుతుండగా, నవీన్ రెండు నెలల కిందట తమ కుటుంబం నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళుతున్నానంటూ నవీన్ తన తల్లికి చెప్పి ఈ నెల 8వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఎప్పటికప్పుడు తల్లికి ఫోన్ చేసేవాడు. 10న ఉదయం 11 గంటల ప్రాంతంలో అరుణాచలం ఆలయానికి వెళ్లిన నవీన్ తన తల్లితో అక్కడి నుంచే వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అదే రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నవీన్కి తల్లి విజయ ఫోన్ చేయగా, చెన్నై వెళ్తున్నామంటూ చెప్పాడు. ఈ నెల 11న (గురువారం) ఉదయం తన కుమారుడు ప్రేమిస్తున్న యువతి ఫోన్తో మరో యువకుడు మాట్లాడుతూ నవీన్ మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి విజయకు చెప్పారు.కాశీపురంలో విషాదఛాయలు నవీన్ మృతితో స్వగ్రామం కాశీపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. చెన్నై నుంచి నవీన్ మృతదేహాన్ని శనివారం ఉదయం కాశీపురానికి తీసుకువచ్చారు. ఆనందపురం నుంచి నవీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు బైక్ ర్యాలీతో స్వగ్రామం తీసుకువచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపించిన తీరు అందర్నీ కంటనీరు పెట్టించింది. తమలాంటి కడుపు కోత మరెవ్వరికి రాకూడదంటూ మృతుడి తల్లి రోదించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అశ్రునయనాల మధ్య కాశీపురం శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నైలో కేసు నమోదునవీన్ మృతిపై అతని మేనమామ నాళం వాసు చెన్నైలోని కె–10 కొయంబేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య, ఆత్మహత్య అని నిర్ధారణకు వస్తామని పోలీసులు చెప్పినట్లు సమాచారం. -
యూరియా కోసం యుద్ధం
సంతబొమ్మాళి/బుచ్చెయ్యపేట/చౌడేపల్లె/సంతకవిటి/సామర్లకోట/ఎచ్చెర్ల/పిఠాపురం: కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. వారం రోజుల కిందట వచ్చిన 110 యూరియా బస్తాలను అధికారులు పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. ఎప్పుడు పంపిణీ చేస్తారని సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను రైతులు అడుగగా సరిపడా యూరియా ఇంకా రాలేదని, పెట్టిన ఇండెంట్ మొత్తం వస్తే పంపిణీ చేస్తామని వాయిదా వేస్తూ వచ్చారు. రోజులు గడుస్తున్నా రావాల్సిన యూరియా రాలేదు. దీంతో ఇదివరకు వచ్చిన 110 బస్తాల యూరియా కోసం శనివారం రైతులు పంచాయతీ కార్యాలయం వద్ద కాపు కాశారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను గ్రామంలో ఉన్న అసిరమ్మ గుడి వద్దకు రహస్యంగా రప్పించి తమ అనుకూలమైన వారితో వేలి ముద్రలు వేయించి స్లిప్పులను తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త కప్ప ఎర్రయ్య రైతులను బూతులు తిట్టడంతో కర్షకులు తిరగబడ్డారు. ఎర్రయ్యను చితకబాదారు. » అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో యూరియా కోసం రైతులు శనివారం తోపులాటకు దిగారు. రాజాం రైతు సేవా కేంద్రానికి 260 బస్తాల యూరియా రావడంతో రాజాం, నీలకంఠాపురం గ్రామాలకు చెందిన 500 మందికి పైగా రైతులు వచ్చారు. ఈ సందర్భంగా రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా తోపులాటకు దారితీసింది. చివరకు కొద్దిమందికే యూరియా అందడంతో మిగిలిన రైతులు నిరాశగా వెనుదిరిగారు.» చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో శనివారం యూరియా కోసం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద, గ్రోమోర్ దుకాణం వద్ద రైతులు క్యూకట్టారు. రెండురోజులుగా ఎరువుల షాపుల వద్ద, వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నా కొందరికే ఎరువులు అందాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. » విజయనగరం జిల్లా సంతకవిటిలోని కోరమాండల్ దుకాణం వద్ద శనివారం గంటల తరబడి రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటలకే దుకాణం వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. పొందూరు–సంతకవిటి ప్రధానరోడ్డు వరకు రైతులు క్యూ కట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. » కాకినాడ జిల్లా నవర గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్లలో నిలబడలేని వారు కూలీలకు రూ.600 ఇచ్చి లైన్లలో నిలబెట్టారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఎండలో నిరీక్షించారు. » యూరియా లేక రైతులు గగ్గోలు పెడుతుంటే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ యూరియా కొరత లేదనడంపై రైతులు మండిపడ్డారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంగొల్లప్రోలు మండలం చేబ్రోలు మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. ‘ఎక్కడున్నావ్ వర్మా.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి యూరియా ఇప్పించు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీకి యూరియా వచ్చిందన్న సమాచారంతో తెల్లవారుజాము నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ఏడీఏ చేతిలోని టోకెన్లను స్థానిక టీడీపీ నేత లాక్కుని కొందరు రైతులకు అందజేయడంతో మిగిలిన రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ నాగలోవరాజు వచ్చి రైతులందరికీ యూరియా ఇవ్వాలని కోరారు. టోకెన్లు అందరికీ ఇచ్చేశామని ఏడీఏ బదులివ్వడంతో జెడ్పీటీసీ రైతులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి స్థానిక మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. జెడ్పీటీసీ, మిగిలినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
జనసేనకు సర్ప్రైజ్ షాక్
సాక్షి, అనకాపల్లి: జనసేన పార్టీకి సర్ప్రైజ్ షాక్ తగిలింది. మునగపాక ఎంపీపీ మల్ల జయలక్ష్మి తిరిగి వైఎస్సార్సీపీ గూటికే చేరుకున్నారు. ధర్మశ్రీ, కన్నబాబురాజు, బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఊహించని ఈ పరిణామంపై జనసేన వర్గాలు కంగుతిన్నాయి.అభివృద్ధి కోసమే జనసేన పార్టీలో చేరాను. మా మండలాన్ని అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా కూటమి నేతలు మోసం చేశారు. పార్టీలో నన్ను అవమానాలకు గురి చేశారు. జనసేన పార్టీలో అభివృద్ధి కోరుకునేవారికి తగిన గుర్తింపు ఉండదు అని జయలక్ష్మి అన్నారామె. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ కేడర్కు ఆమె క్షమాపణలు తెలియజేశారు.వైయస్ఆర్సీపీని వీడి తప్పు చేశాను, నన్ను క్షమించాలి. చేసిన తప్పును సర్దించుకోవడం కోసం మళ్లీ వైఎస్సార్సీపీలో తిరిగి జాయిన్ అయ్యాను అని ఎంపీపీ మల్ల జయలక్ష్మి తెలిపారు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఆగష్టులో మల్ల జయలక్ష్మి జనసేనలో చేరారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీకి స్థానికంగా పెద్ద దెబ్బ పడిందంటూ జనసేన శ్రేణులు సంబురాలు చేసుకోవడమూ తీవ్ర చర్చనీయాంశంగానూ మారింది. -
మద్యం కోసం కన్నతల్లినే కడతేర్చాడు
నాతవరం(అనకాపల్లి జిల్లా): మద్యం కోసం కన్నతల్లినే కడతేర్చాడు. మండలంలో వైబీ పట్నంలో మద్యం మత్తులో తల్లిని చంపిన ఘటన సంచలనంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిటికిల జోగునాయుడు, మంగ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా కొడుకు రామ్మూర్తినాయుడు మాకవరపాలెం మండలానికి చెందిన అమ్మాయిని çప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో కుమారుడు వ్యసనాలకు బానిసై మద్యం తాగడానికి డబ్బులివ్వాలంటూ ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. భర్త వే«ధింపులు భరించలేక భార్య దేవి నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు కూడా పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్మూర్తినాయుడు హైదరాబాద్ వెళ్లిపోయాడు. గురువారం మరిడమ్మతల్లి పండగ కావడంతో గ్రామానికి వచ్చాడు. రాత్రి ఒంటి గంట వరకు మద్యం తాగి వైబీ పట్నంలోని తన ఇంటికి వచ్చాడు. మళ్లీ డబ్బుల కోసం తండ్రితో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న కొడుకు పరిస్థితి గమనించిన ఆయన అక్కడి నుంచి తప్పించుకోగా, నిద్రిస్తున్న తల్లి మంగను కొట్టి డబ్బులడిగాడు. మంచం పైనుంచి కింద పడేసి పక్కనే ఉన్న పూల కుండీతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తల్లి స్పృహ తప్పి అపస్మార స్థితికి చేరుకుంది. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, శతమానం లాక్కుని పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి మంగ మరణించింది. మృతురాలి భర్త జోగునాయుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోని తీసుకున్నామని, దర్యాప్తు అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. -
అరుణాచలంలో కాశీపాలెంవాసి హత్య!
విశాఖపట్నం: పొరుగు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో దేవరాపల్లి మండలం కాశీపాలెం గ్రామానికి చెందిన డెక్క నవీన్ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం. పోలీసులు ధ్రువీకరించనప్పటికీ ఈ దుర్ఘటన జరిగినట్టు శుక్రవారం రాత్రి విస్తృతంగా ప్రచారమైంది. నవీన్ రాంబిల్లి మండలం చిన్నపూడి గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుమార్తెతో పదో తరగతి, ఇంటర్ నుంచి అతడికి స్నేహం ఏర్పడింది. వీరి సాన్నిహిత్యం గురించి తెలిసి యువతిని చెన్నైలో చదివిస్తున్నారని, అయినా వీరి మధ్య పరిచయం కొనసాగిందని, అదే అమ్మాయి తరపు వారికి కంటగింపుగా మారిందని సమాచారం. నవీన్ వేరే కులానికి చెందినవాడు కావడం, పెద్దగా చదువుకోకపోవడం, ఆస్తి లేకపోవడంతో అమ్మాయి తల్లికి ఇష్టం లేదు. మూడు రోజుల క్రితమే అమ్మాయిని తీసుకొని తల్లి అరుణాచలం వెళ్లింది. నవీన్కి ఫోన్ చేసి వారు ఉన్న చోటుకు రప్పించారు. అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకొని ఉన్నారు. నవీన్ ఫోన్లో అసభ్యకరమైన ఫొటోలు ఉన్నట్లు గమనించి లాక్కొని చితకొట్టేశారు. అనంతరం తమతో వచ్చిన ఇద్దరు వ్యక్తులతో నవీన్ను హత్య చేసినట్లు సమాచారం. అమ్మాయిని, ఆమె తల్లిని అరుణాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. ప్రస్తుతం ఇద్దరూ అక్కడ జైల్లో ఉన్నట్లు భోగట్టా. -
‘కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్యులకు చేరాలి’
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం తుమ్మపాల: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) మాసాంతపు సమావేశం శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. దిశ కమిటీ చైర్మన్, ఎంపీ రమేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని జిల్లా అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందేలా చూడవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉందని ఎంపీ రమేష్ అన్నారు. యూరియా పంపిణీ, సంక్షేమం, అభివృద్ధి గురించి కమిటీ సభ్యులకు కలెక్టర్ వివరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ అనకాపల్లి, యలమంచిలి రైల్వే స్టేషన్ల సాఫ్ట్ అప్గ్రెడేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ యూరియా అమ్మకం, పంపిణీలో బ్లాక్ మార్కెట్ను అరికట్టాలన్నారు. డీఆర్వో సత్యనారాయణరావు, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, ఏఎస్పీ ఎం.దేవప్రసాద్, ఆర్డీవోలు, షేక్ ఆయిషా, వి.వి.రమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీపీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వలిసె విలాపం
మన్యం పేరు చెబితే ప్రకృతి అందాలకు నిలయమే కాకుండా పచ్చని కొండలు గుట్టల మధ్య పసుపు తివాచీ పరిచినట్లుండే వలిసె పూలు గుర్తుకు వస్తాయి. అందానికే కాకుండా మరో వైపు ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటగా వలిసెలకు గుర్తింపు ఉంది. వేరుశనగ తరువాత అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ఈ పంట విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం పర్యాటకులకు నిరాశ కలిగిస్తోంది. పర్యాటక సీజన్లో మంచు తెరల మధ్య వన్నెలద్దే వలిసె పూలు పూర్వవైభవం కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. చింతపల్లి ఆర్ఏఆర్ఎస్లో వలిసె సాగు పరిశోధన క్షేత్రంచింతపల్లి: వలిసె సాగు జిల్లాలో పాడేరు డివిజన్లో నూనె గింజల పంటగా గిరిజనులు సాగు చేస్తున్నారు. సంప్రదాయ విత్తనాల వినియోగం, ఆకాశపందిరి కలుపు మొక్క ప్రభావం కారణంగా దిగుబడి తగ్గింది. దీంతో నిరాశకు గురవుతున్న రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపడం లేదు. ● రెండు దశాబ్దాల క్రితం 6 వేల ఎకరాలకు పైగా ఉన్న సాగు విస్తీర్ణం ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. గత రెండేళ్లలో 1500 నుంచి 1600 ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం ఇప్పుడు 1200 ఎకరాలకు తగ్గిపోయింది. కారణాలివీ.. గిరిజన రైతులు సంప్రదాయ విత్తనాలను వినియోగించడం వల్ల దిగుబడి రావడం లేదు. మరోపక్క మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. తేనెటీగలు తగ్గడం కూడా దిగుబడిపై ప్రభావం చూపిస్తోంది. రాజ్మా, వరి విత్తనాలను ప్రభుత్వం రాయితీపై అందజేయడం వల్ల ఆ పంటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడం కూడా గిరి రైతులను నిరాశ పరుస్తోంది. అనువైన రకాలు ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో సాగు చేసేందుకు అనువైన రకాలను స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. జేఎన్ఎస్–28,30, జేఎన్ఎస్–2016, 1115, కేజీఎన్ –2 రకాలు వంద నుంచి 110 రోజుల్లో దిగుబడి వస్తుంది. జేఎన్ఎస్–6 రకం 110 రోజులు, జేఎన్ఎస్–9, ఉత్కల్ నైజర్–150 రకాలు 95 నుంచి వందరోజుల్లో దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. త్వరలో చింతపల్లి నైజర్ 1,2 విత్తనాలు ఇక్కడి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వలిసెలపై ప్రత్యేకంగా జాతీయ ప్రాజెక్ట్ అమలు అవుతోంది.ఇక్కడ వేల రకాల విత్తనాలపై 2018 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా చింతపల్లి నైజర్ 1,2 రకాలు ఉన్నట్టు చింతపల్లి గుర్తించారు. వీటిపై పరిశోధనలు మరో రెండేళ్లు జరిపిన అనంతరం రైతులకు పంపిణీ చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది ఆలస్యంగా.. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునందున సాగు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏటా ఆగస్టు నెలాఖరు, సెప్టెంబర్లో సాగు మొదలు పెడతారు. నవంబర్ నుంచి పూత వస్తుంది. జనవరి నాటికి దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు సాగు చేపట్టిన పరిస్థితులు కనిపించలేదు.అగ్రీ టూరిజంలో సంకల్పించినా.. సాగు విస్తీర్ణం పెంచే చర్యల్లో భాగంగా రెండేళ్ల క్రితం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అగ్రిటూరిజంలో ఈ పంటను చేర్చారు. రైతులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే మన్యానికి శోభనిచ్చే వలిసె పూలు భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు లేకపోలేదు. వలిసె పూల మకరందాన్ని సేకరించే తేనెటీగలు పరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి, ఇది పంటల దిగుబడికి మరియు కొత్త మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. వలిసె తోటల వద్ద తేనెటీగలు చేరడం సహజమే అయినా, ఇటీవలి కాలంలో తేనెటీగల సంఖ్య తగ్గడం వల్ల దిగుబడి తగ్గి గిరిజన రైతులకు నష్టం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
యూరియా కొరతతో రైతులకు ఇబ్బందులు
గొలుగొండ: యూరియా కొరత వల్ల మండలంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ శాఖ అధికారులు సరైన సమాధానం చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ మణికుమారి అధ్యక్షతను స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుత్తడిగైరంపేట సర్పంచ్ పత్తి రమణ, నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురాం ఎరువుల కొరతపై నిలదీశారు. వ్యవసాయశాఖ అధికారులు సరిగా స్పందించకపోవడం వల్లే ఈ సమస్య వస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు కష్టాలు చాలా ఎక్కవగా ఉన్నాయని వాపోయారు. ఎంపీపీ మణికుమారి మాట్లాడుతూ మండలంలో సాగు విస్తీర్ణం, ఎంతమేర ఎరువులు అవసరం, ఇప్పటి వరకు ఎంతమేర వచ్చాయని వ్యవసాయ అధికారులను అడిగితే సరైన సమాచారం ఇవ్వలేదని వాపోయారు. మండలంలో ఎరువుల కొరత వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గొలుగొండలో తాగునీటి సమస్య గురించి సర్పంచ్ కసిపల్లి అప్పారావు, నాగాపురం ప్రభుత్వ పాఠశాలలో సమస్యల గురించి సర్పంచ్ రఘురాం ప్రస్తావించారు. ఇన్చార్జి ఎంపీడీవో బాబూరావు, వైస్ ఎంపీపీ జక్కు నాగమణితోపాటు పలువులు పాల్గొన్నారు. -
డిసెంబరుకు అనకాపల్లి స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి
అనకాపల్లి: దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) మోహిత్ సోనాహి అనకాపల్లి రైల్వే స్టేషన్ను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. స్టేషన్ పరిధిలో 1, 2, 3 ప్లాట్ఫారంలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పగలు, రాత్రి సమయంలో స్టేషన్ పరిధిలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని, సీసీ కెమేరాల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. స్టేషన్ అభివృద్ధి పనులు ఈ ఏడాది డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం ప్రశాంత్, సీనియర్ డీవోఎం, డి.నరేంద్రవర్మ, ఏడీఎన్ కృష్ణయ్య, అనకాపల్లి స్టేషన్ మేనేజర్ సత్యనివాస్, ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ కంటెర్ల నవీన్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మిత్రులతో వెళ్లాడు.. శవమై తేలాడు..
నర్సీపట్నం: మిత్రులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు శవమై తేలాడు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పాత సంతబయలకు చెందిన రామిశెట్టి భాస్కర్(34) ఈ నెల 8న ఇంటికి వచ్చిన ముగ్గురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన తల్లి లక్ష్మీ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భాస్కర్ సెల్ఫోన్ సిగ్నల్స్ నాతవరం మండలం డి.ఎర్రవరం వద్ద ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో గాలింపు చేసినా ఫలితం లేకపోయింది. కోటవురట్ల రూట్లో జోగినాథునిపాలెం సీసీ కెమెరాల్లో ఆయన కదలికలు రికార్డు అయ్యాయి. ఆ మార్గంలో బంధువులు గాలింపు చేయగా ఆర్ అండ్ బీ రోడ్డు కల్వర్టు కింద భాస్కర్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట పాటు నర్సీపట్నం–చింతపల్లి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భాస్కర్ మరణంపై అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. భాస్కర్ను ఇంటి నుంచి తీసుకెళ్లిన స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించాలని నినాదాలు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భాస్కర్ను తీసుకువెళ్లిన వ్యక్తులు స్థానికంగా లాడ్జీలో ఉన్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. -
4 రోజుల్లో చోరీ కేసు ఛేదన
నక్కపల్లి: చోరీ కేసును నాలుగు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఈ నెల 8వ తేదీన వేంపాడులో కొత్త నాగేశ్వరరావు ఇంట్లో చోరీ జరిగింది. భోజన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తాళాలు పగుల గొట్టి రూ.72 వేలు, 53 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు సీసీఫుటేజీల ఆధారంగా డీఎల్పురం గ్రామానికి చెందిన గింజాల అప్పారావు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ క్రమంలో మధ్యవర్తుల సమక్షంలో అతడి నుంచి 27.25 గ్రాముల బంగారు చైన్, 14.78 గ్రాముల లాకెట్, 3 గ్రాముల లక్ష్మీదేవి ఉంగరం 7.86 గ్రాముల బంగారు ముద్ద, ఒక గ్రాము ఉంగరం, రూ.72 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ సమావేశంలో సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు, ట్రైనీ ఎస్ఐ అంజు, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు
విశాఖ సిటీ: గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం రేంజ్ పరిధిలోని అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో డీఐజీ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ నేరాల నిరోధక చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు. అక్రమ గంజాయి రవాణా వ్యాపారంలో పాల్గొన్న 14 మంది నేరస్తుల ఆస్తులు రూ.10,04,89,621 స్వాధీనం చేసుకోవడాన్ని అభినందించారు. ఇప్పటి వరకు 1,119 మంది గంజాయి నేరస్తుల కదలికలపై షీట్లు తెరిచినట్లు చెప్పారు. అలాగే 51 మంది నిందితులపై పీడీ చట్టం, 80 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం అమలుకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. తరచూ గంజాయి రవాణా చేసే 368 మంది, అలాగే గంజాయితో పాటు ఇతర నేరాలలో పాల్గొన్న 370 మందిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. న్యాయస్థానాలు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్లు ఆధారంగా 341 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 కేసుల్లో 33 మంది నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. వీరిలో 24 మందికి 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. విశాఖపట్నం రేంజ్ పోలీసులు స్టే సేఫ్, నిదాన్, కాజ్, నాట్ గ్రిడ్ యాప్స్ ద్వారా పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంలో కృషిని అభినందించారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, మహిళ మిస్సింగ్ కేసులపై సమీక్షించారు. ఇటువంటి కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని చెప్పారు. రేంజ్ పరిధిలోని శాంతి భద్రతల సమస్యలపై చర్చించారు. భవిష్యత్తు కోసం తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణ అన్యాయం
చోడవరం: విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ శనివారం తలపెట్టిన రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బి. బాబ్జి పిలుపు ఇచ్చారు. గుంటూరులో నిర్వహించే ఈ సదస్సుకు సంబంధించి వాల్ పోస్టర్లను శుక్రవారం ఆయన చోడవరంలో ఆవిష్కరించారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విద్యార్థులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్ బకాయిలు రూ. 600కోట్లు ఇప్పటి వరకూ విడుదల చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలేజీల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయన్నారు. తక్షణం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ సీట్లు పూర్తిగా యాజమాన్యాలకు ఇవ్వడం అన్యాయమని, హాస్టళ్ల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు నాగదుర్గ, రాజు, నాయుడు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్లకు మద్దతుగా సైకిల్ యాత్ర
సైకిల్ యాత్ర చేస్తున్న ఆటో డ్రైవర్ అప్పలరాజుతో ఆటో డ్రైవర్లు అనకాపల్లి: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదని, వారికి ఉపాధి లేకుండా పోయిందని గాజువాక 86వ ఆటో యూనియన్ అధ్యక్షుడు గొలగాని అప్పలరాజు వాపోయారు. ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ గాజువాక నుంచి విజయవాడ వరకూ శుక్రవారం ఉదయం 9 గంటలకు సైకిల్ యాత్రను ప్రారంభించారు. అనకాపల్లి నెహ్రూచౌక్ బస్టాండ్ వద్దకు చేరుకున్న అప్పలరాజుకు స్థానిక ఆటోడ్రైవర్లు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ 400 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈ నెల 20న విజయవాడ చేరుకుంటానన్నారు. రోజుకు 50 కిలోమీటర్లు మేర సైకిల్ యాత్ర చేసి, రాత్రిళ్లు దేవాలయాల వద్ద బస చేస్తానన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్లను కలిసి వినతిపత్రం అందజేస్తానన్నారు. వాహన మిత్ర పథకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, రోజుకు ఆటో డ్రైవర్లకు రూ.41 మాత్రమే వస్తుందన్నారు. కార్యక్రమంలో నెహ్రూచౌక్ ఆటో యూనియన్ డ్రైవర్లు బీమవరపు శ్రీను, సంతోష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఎలా.. ఎప్పుడు ఏర్పడ్డాయంటే..?
ఈ ఎర్రమట్టి దిబ్బలు సుమారు 18,500 నుంచి 20,000 సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడినట్లు భౌగోళిక చరిత్ర చెబుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం బంగాళాఖాతం ప్రస్తుత తీర రేఖ నుంచి కనీసం 5 నుంచి 10 కి.మీ వెనక్కి ఉండేది. తూర్పు కనుమల్లో ఖొండలైట్ శిలలు విస్తరించి ఉన్నాయి. ఈ శిలల్లో గార్నేట్, క్వార్జ్, సిల్లిమనైట్, ఫెల్డ్స్పార్, ఇనుప ఖనిజాలు విస్తారంగా ఉంటాయి. భారీ వర్షాలు పడే సమయంలో ఈ కొండల నుంచి నీటి ప్రవాహాల ద్వారా కొట్టుకొచ్చిన మట్టి పదార్థాలు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇలా వరద నీటితో పాటు తూర్పుకనుమల్లో ఉన్న ఖనిజాలు కొట్టుకొచ్చి సముద్ర తీరంలోకి ఇసుకతో కలిసిపోయి మిశ్రమంగా ఏర్పడి పేరుకున్నాయి. కొండల్లోని మట్టి, సముద్రపు ఇసుక, ఖొండలైట్ శిలల్లోని ఖనిజాలన్నీ కలిసి కాస్తా గట్టిదనాన్ని సంతరించుకోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఖనిజాల సమ్మేళనాలు ఆక్సీకరణం చెందడం వల్ల ఈ కొండలు ఎర్రగా మారిపోయాయి. ఏర్పడిన సమయంలో వీటిని ఎర్ర ఇసుక కొండలుగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ గుట్టల్లో పేరుకుపోయిన మిశ్రమ అవక్షేపాల్లో వదులుగా ఉండేచోట నీటి ప్రవాహాల తాకిడితో కొట్టుకొని పోవడం వల్ల ఆ ప్రాంతం చిన్న చిన్న లోయలుగా రూపాంతరం చెందింది. క్రమంగా భారీ వర్షాల సమయంలో దాదాపు 3వేల సంవత్సరాల క్రితం వరకూ ఈ ఎర్రమట్టి దిబ్బలు నిరంతరం మార్పులు సంభవిస్తున్నాయి. -
ఇసుకే అయినా.. మట్టిదిబ్బలని...
పూర్వ కాలంలో వీటిని ఎర్ర ఇసుక కొండలుగానూ పిలిచేవారు. పాయలుగా ఏర్పడిన తర్వాత.. ఎర్రమట్టి దిబ్బలుగా పిలుస్తున్నారు. వాస్తవానికి భౌగోళిక పరంగా ఇది ఇసుక నుంచి రాయి ఏర్పడుతుంది. పొరలు పొరలుగా ఒక చోట చేరిన ఇసుక రేణువులే వేల సంవత్సరాల తర్వాత రాయిగా మారుతాయి. అలా ఒకచోట పేరుకుపోయిన ఇసుక క్రమంగా గట్టిపడటం మొదలవుతుంది. అది పూర్తి రాయిగా మారే క్రమంలో కాస్త మట్టిలా అనిపించే విధంగా మారుతుంది. ఇది ఇసుకే అయినా మట్టిలా గట్టిగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దిబ్బల్లోని ఇసుక, మట్టి ఎరుపు రంగులో ఉండటం వల్ల వీటిని ఎర్రమట్టి దిబ్బలుగా పిలవడం అలవాటైపోయింది. -
స్మార్ట్ రేషన్ కార్డులు ఎక్కడ?
సాక్షి, అనకాపల్లి: రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెంచేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకున్న ‘కూటమి’ నేతలు కార్డుల పంపిణీకి వారే అడ్డంకిగా నిలిచారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్మార్ట్ కార్డుల పంపిణీని ఈనెల 10వ తేదీన ప్రారంభించాలి. కార్డులు సిద్ధమైనా జిల్లాలోని కేవలం 2 మండలాల్లో మాత్రమే పంపిణీ మొదలైంది. జిల్లావ్యాప్తంగా 24 మండలాల్లోని 1063 రేషన్ డిపోల పరిధిలో 5,32,346 రేషన్ కార్డుదారులున్నారు. కనీసం ఇంతవరకు రెండు వేల స్మార్ట్ కార్డులు కూడా పంపిణీ జరగలేదు. కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పంపిణీని ప్రారంభించాలని అధికారులకు అనధికార ఆదేశాలున్నాయి. వారు ఇదిగో అదిగో అంటూ ఆలస్యం చేయడంతో ఈ ప్రక్రియ మొదలు కాలేదు. అనకాపల్లి, యలమంచిలి తదితర ప్రాంతాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు కూడా ఇందుకు తోడయ్యాయి. మేమంటే మేమని ఒకరితో ఒకరు పోటీ పడుతూ పంపిణీకి బ్రేకులు వేస్తున్నారు. కొత్త కార్డుదారులకు నిరాశ స్మార్ట్ కార్డులు అందించకపోవడంతో కొత్తగా కార్డులు మంజూరైన 3,250 కుటుంబాలు రేషన్ అందక విలవిల్లాడుతున్నాయి. అధికారులు వీరి కోసం సరకులు రిలీజ్ చేశారు. కానీ వారి వద్ద ఎలాంటి కార్డు లేక పంపిణీ చేయలేని పరిస్థితి. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెండు మండలాల్లో హడావుడిగా ఈ ప్రక్రియ ప్రారంభించారు. మిగతా చోట్ల స్మార్ట్ ఈ–పోస్ యంత్రాలు, క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు మూలుగుతున్నాయి. కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ ‘సాక్షి’తో మాట్లాడుతూ కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల డేట్లు లేకపోవడంతో స్మార్ట్ కార్డుల పంపిణీలో జాప్యం జరగడం సరికాదని అన్నారు. తాను సీఎం కార్యాలయానికి, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేసిన అనంతరం రెండు మండలాల్లో శుక్రవారం తూతూ మంత్రంగా ప్రారంభించారని చెప్పారు. 10న ప్రారంభం కావాల్సిన పంపిణీ ‘కూటమి’ నేతల పెత్తనంతో ఆలస్యం కొత్త కార్డులకు నిలిచిన రేషన్ పంపిణీ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్కు ఫిర్యాదులు కేవలం 2 మండలాల్లోనే పంపిణీ ప్రారంభం -
భావ ప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం రాజ్యాంగ విరుద్ధం
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు, టీవీలు వ్యవహరిస్తుంటాయి. పాత్రికేయులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు, ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తుంటారు. తప్పులు సరిదిద్దుకోవాలి గానీ రాసిన పత్రికపై, పాత్రికేయులపై కక్ష కడితే ఎలా? ఇటీవల సాక్షిలో ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడిన ప్రెస్మీట్ను వార్తగా రాస్తే.. ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై, సంబంధిత జర్నలిస్టుపై అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారు. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది. రాజ్యాంగం అందించిన భావ ప్రకటనా స్వేచ్ఛను అక్రమ కేసులతో పోలీసులు నిరోధించలేరు. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి వేధించే ధోరణి అవలంబిస్తోంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. – డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, మాజీ ఎంపీ, అనకాపల్లి -
అరుణాచలంలో జిల్లా వాసి హత్య!
అచ్యుతాపురం : పొరుగు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో దేవరాపల్లి మండలం కాశీపాలెం గ్రామానికి చెందిన డెక్క నవీన్ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం. పోలీసులు ధ్రువీకరించనప్పటికీ ఈ దుర్ఘటన జరిగినట్టు శుక్రవారం రాత్రి విస్తృతంగా ప్రచారమైంది. నవీన్ రాంబిల్లి మండలం చిన్నపూడి గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుమార్తెతో పదో తరగతి, ఇంటర్ నుంచి అతడికి స్నేహం ఏర్పడింది. వీరి సాన్నిహిత్యం గురించి తెలిసి యువతిని చైన్నెలో చదివిస్తున్నారని, అయినా వీరి మధ్య పరిచయం కొనసాగిందని, అదే అమ్మాయి తరపు వారికి కంటగింపుగా మారిందని సమాచారం. నవీన్ వేరే కులానికి చెందినవాడు కావడం, పెద్దగా చదువుకోకపోవడం, ఆస్తి లేకపోవడంతో అమ్మాయి తల్లికి ఇష్టం లేదు. మూడు రోజుల క్రితమే అమ్మాయిని తీసుకొని తల్లి అరుణాచలం వెళ్లింది. నవీన్కి ఫోన్ చేసి వారు ఉన్న చోటుకు రప్పించారు. అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకొని ఉన్నారు. నవీన్ ఫోన్లో అసభ్యకరమైన ఫొటోలు ఉన్నట్లు గమనించి లాక్కొని చితకొట్టేశారు. అనంతరం తమతో వచ్చిన ఇద్దరు వ్యక్తులతో నవీన్ను హత్య చేసినట్లు సమాచారం. అమ్మాయిని, ఆమె తల్లిని అరుణాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. ప్రస్తుతం ఇద్దరూ అక్కడ జైల్లో ఉన్నట్లు భోగట్టా. -
తాచేరు డైవర్షన్ రోడ్డు పనులపై ఎందుకీ కక్ష?
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయి మూడు జిల్లాల ప్రజలు తీవ్ర రవాణా కష్టాలు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జోరు వర్షంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి విజయరామరాజుపేట తాచేరు నదిపై కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డును పరిశీలించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో కలిసి బీఎన్ రోడ్డు విస్తరణ కోసం రూ.110 కోట్లు మంజూరు చేయించామని అమర్నాథ్ తెలిపారు. అప్పట్లో ఈ రోడ్డు కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కావాలనే రోడ్డు పనులు చేయకుండా, కూలిన వంతెనలు కట్టకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. నెల రోజుల కిందట వర్షాలకు డైవర్షన్ రోడ్డు కోతకు గురైందన్నారు. మరమ్మతు పనులకు రూ.15 లక్షలు మంజూరు కాగా.. కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పది రోజులైనా నేటికి పనులు ప్రారంభించకపోవడంపై ఆయన మండిపడ్డారు. కావాలనే తాచేరు వంతెన, డైవర్షన్ రోడ్డు పనులపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉండగా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తూ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. సంక్రాంతికి రోడ్లు బాగు ఎక్కడ? అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి కల్లా రోడ్లన్నీ బాగు చేస్తామని గతేడాది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని అమర్నాథ్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైనా బీఎన్ రోడ్డు బాగు పడలేదన్నారు. ఏ రోడ్డును చూసినా పెద్ద పెద్ద గోతులు, వర్షపు నీరు, మట్టి దిబ్బలతో దీవులను తలపిస్తున్నాయన్నారు. ప్రజల రవాణా కష్టాలు తీర్చడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరి జిల్లాల ప్రజలు బీఎన్ రోడ్డులో ఉన్న విజయరామరాజుపేట మీదగా రాకపోకలు సాగిస్తారన్నారు. డైవర్షన్ రోడ్డు గండి కారణంగా గౌరీపట్నం, తదితర ఇరుకు రోడ్ల మీదుగా రాకపోకలు సాగిస్తూ గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోతున్నారన్నారు. అయినా కూటమి నేతలు, ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరించడం సరికాదన్నారు. పేట డైవర్షన్ రోడ్డు మరమ్మతులు చేపట్టి రవాణా కష్టాలు తీర్చకపోతే ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు, జెడ్పీటీసీ దొండా రాంబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు, వైస్ ఎంపీపీ దొండా లలితా నారాయణమూర్తి, గొంపా చినబాబు, నాయకులు జోగా కొండబాబు, నమ్మి అప్పలరాజు, గుమ్మిడి ప్రసాద్, కోరుకొండ రమణ, ఎల్లపు విజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. అప్పుడు, ఇప్పుడు టెండర్లు దక్కించుకున్నది టీడీపీ కాంట్రాక్టర్లే పనులు పూర్తి చేయకుండా కాలయాపన మూడు జిల్లాల ప్రజల కష్టాలు కనిపించడం లేదా? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఆగ్రహం జోరువానలో పేటలో డైవర్షన్ రోడ్డు పరిశీలన -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రెస్ మీట్లో నాయకుడు ఇచ్చిన వార్తను ప్రచురిస్తే కేసులు పెట్టడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం ఈ రాష్ట్రంలో లేదా? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి వాస్తవాలు వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపులకు పాల్పడుతోంది. రాజకీయ పార్టీ నేత ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలను రిపోర్టర్ వార్తగా రాస్తే ఎడిటర్పై కేసులు పెడతారా? భావ ప్రకటన స్వేచ్ఛను అక్రమ కేసులు, నోటీసులతో నిరోధించలేరు. రాజకీయ కక్షతో సాక్షి ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. కూటమి పాలనలో అన్ని వర్గాలను గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి నేతలకు సరైన గుణపాఠం తప్పదు. – డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఎంపీ, అరకులోయ -
ముగ్గురు జైలు సిబ్బందికి చార్జి మెమోలు
చోడవరం: సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీ లు పరారైన సంఘటనకు సంబంధించి ముగ్గురు చోడవరం సబ్జైలు అధికారులకు జైళ్లశాఖ అధికారులు గురువారం చార్జి మెమోలు జారీ చేశారు. ఈనెల 5వ తేదీన చోడవరం సబ్ జైలులో నక్కా రవికుమార్, బెజవాడ రాము అనే ఇద్దరు రిమాండ్ ఖైదీలు విధినిర్వహణలో ఉన్న జైలు వార్డర్ను సుత్తి తో తలపై కొట్టి గాయపరిచి ఆయన జేబులో ఉన్న తాళాలను తీసుకొని మెయిన్గేటు తీసుకొని పరారయిన విషయం తెలిసిందే. తర్వాత 24 గంటలు తిరగకముందే టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పరారైన ఇద్దరు ఖైదీలను పట్టుకొని అరెస్టు చేశారు. అయితే ఎంతో పగడ్బందీగా ఉన్న సబ్జైలు నుంచి ఖైదీలు ఇంత సునాయాసంగా పరారవ్వడానికి గల కారణాలపై ఎస్పీ తుహిన్సిన్హాతోపాటు జైలు శాఖ ఉన్నతాధికారులు అదే రోజు విచారణ చేశారు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం ఉందని గుర్తించిన అధికారులు ఆ సమయంలో విధినిర్వహణలో ఉన్న జైలు సూపరింటెండెంట్ బాబూరావు, హెడ్వార్డర్ వి.వీర్రాజు, వార్డర్ ఎం.అప్పలనాయుడుకు చార్జి మెమో జారీచ ేశారు. సంఘటన జరిగిన సమయంలో ముగ్గురు వార్డర్లు లోపల, ఒక హెడ్ వార్డరు మెయిన్ గేటు దగ్గర, సబ్జైలర్ తన గదిలో విధినిర్వహణలో ఉన్నారు. ఇంత జరగడానికి విధి నిర్వహణలో ఉన్న జైలు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ జైలుశాఖ ఉన్నతాధికారులు ముగ్గురికి చార్జి మెమోలు జారీ చేశారు. వారి వివరణ అనంతరం తరుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
19 పీఎస్లకు డ్రోన్ కెమెరాలు
కె.కోటపాడు : జిల్లాలో 19 పోలీస్స్టేషన్లకు సీఎస్ఆర్ నిధులతో డ్రోన్ కెమెరాలను అందించినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా తెలిపారు. కె.కోటపాడు పోలీస్స్టేషన్ను గురువారం వార్షిక తనిఖీ నిర్వహించారు ఈ ఏడాది పోలీస్స్టేషన్లో నమోలైన కేసుల వివరాలను ఎస్ఐ ఆర్.ధనుంజయ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై నిఘాతో పాటు చోరీ ఘటనల్లో నిందితులను పట్టుకోవడానికి డ్రోన్ నిఘా వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అలాగే గంజాయి రవాణాను అరికట్టడానికి పటిష్టమైన చెక్పోస్టు వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. గంజాయి సేవనం, బహిరంగ ప్రాంతాల్లో మద్యపానం వంటి వాటిపై 112కు సమాచారం అందించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, కూడలిలో ట్రాఫిక్ ఇబ్బందులను చక్కదిద్దడానికి ఎస్పీ తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్, చీడికాడ, దేవరాపల్లి ఎస్ఐలు బి.సతీష్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
కళ్లు తెరవండి.. నిజం చెప్పండి
ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం మండలంలో భీమబోయినపాలెం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల.. ఇది కల కాదు.. నిజమే! అనకాపల్లి జిల్లావాసులతోపాటు సరిహద్దులోని పాడేరు నియోజకవర్గంలో కొన్ని మారుమూల గ్రామాల గిరిజనులకు ఉపయోగపడే విధంగా గత వైఎస్సార్సీపీ తలపెట్టిన బృహత్ కార్యక్రమమిది.. విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన దార్శనికుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలల ప్రాజెక్టు ఇది. అందమైన కల కనడమే కాదు.. 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల్లో రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించేందుకు 2022 డిసెంబరు 30న శంకుస్థాపన చేశారు. ఏడాది కాలంలో సగానికి పైగా దాదాపు 60 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు. బోధనాస్పత్రి భవనంలో మూడు అంతస్తులు సిద్ధమయ్యాయి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల భవనంలో రెండు అంతస్తులు పూర్తయ్యాయి. అదే వేగంతో నిర్మాణం జరిగితే కొద్ది నెలల్లోనే మొత్తం భవనాలు అందుబాటులోకి వచ్చేవి. కానీ కూటమి ప్రభుత్వం కుటిల బుద్ధితో పనులు నిలిపివేసింది. 15 నెలల కాలంలో అడుగు నిర్మాణం కూడా చేపట్టకపోగా.. ఆ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అప్పగించేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రైవేట్కు ధారాదత్తం చేసేందుకు జీవో కూడా విడుదల చేసింది. పైగా నిర్మాణాలు ప్రారంభ దశలోనే ఉన్నాయంటూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. అందుకే వైఎస్సార్సీపీ నాయకులు గురువారం కళాశాల భవనాలను పరిశీలించారు. రుజువులు, సాక్ష్యాలతో వాస్తవ పరిస్థితిని బయటపెట్టారు. సాక్షి, అనకాపల్లి: ఉత్తరాంధ్ర ప్రాంతంలో 1921 సంవత్సరంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. వందేళ్ల తర్వాత ఇదే ప్రాంతంలో అనకాపల్లి, పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడేరు మెడికల్ కళాశాల పూర్తి కావడంతో తరగతులు ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చారు. మాకవరపాలెం మండలంలోని కళాశాల భవనాలు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేవి. జిల్లాలో గల ఆరు నియోజకవర్గాల ప్రజలకు, పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి, కొయ్యూరు పరిసర ప్రాంత గిరిజన ప్రజలకు మేలు జరిగేది. కళాశాల ప్రారంభమైతే ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చేవి. తర్వాత పీజీ వైద్య కోర్సులు రావడానికి అవకాశం ఏర్పడేది. కూటమి సర్కారు ప్రైవేటు దాహంతో ఇవన్నీ తీరని కలలా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. వైఎస్సార్సీపీ బృందం సందర్శన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతలపూడి వెంకట్రామయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, ఏరువాక సత్యారావు, తదితరులు భీమబోయినపాలెంలో సగానికిపైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీని గురువారం సందర్శించారు. భవనాలు సగానికి పైగా పూర్తయ్యాయని, కూటమి సర్కారు వచ్చాక ఎక్కడి నిర్మాణాలు అక్కడ నిలిపివేయడం దారుణమన్నారు. ప్రజల యోగ క్షేమాలను పరిగణనలోకి తీసుకొని పనులు పూర్తి చేయాలన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియడం లేదంటూ విమర్శించారు. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేయడాన్ని అంగీకరించబోమన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో కలిసివచ్చే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. పార్టీ ముఖ్యనేతలు రుత్తల ఎర్రాపాత్రుడు, బోని శివరామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కె.రామకృష్ణ, ఎంపీపీలు రుత్తల సర్వేశ్వరరావు, మణికుమారి, సుర్ల రాజేశ్వరి, సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీలు అప్పలనర్స, సుర్ల వెంకట గిరిబాబు, మాకవరపాలెం, గొలుగొండ, నర్సీపట్నం రూరల్, నాతవరం మండల పార్టీ అధ్యక్షులు చిటికెల రమణ, కొరుప్రోలు ఫాణి తాంఽథారామ్, సానాపతి వెంకటరత్నం, నాగేశ్వరావు, మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం మాస్టర్ ప్లాన్పై చర్చ నర్సీపట్నం: నూతనంగా రూపొందించిన ము న్సిపాలిటీ మాస్టర్ ప్లాన్పై సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు గురువారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించా రు. 2040 నాటికి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్టు వీఎంఆర్డీఏ ప్లానింగ్ ఆఫీసర్ అ రుణవల్లి పేర్కొన్నారు. పట్టణంలో ఇంటర్నల్ రోడ్లతోపాటు ప్రధాన రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. అబిద్ సెంటర్ నుంచి పెదబొడ్డేపల్లి, అబిద్ నుంచి చింతపల్లి, అబిద్ నుంచి కె.డి.పేట రోడ్డు వంద అడుగులకు విస్తరించాలని ప్లాన్లో పేర్కొన్నారు. దీనిపై పలువురు వ్యాపారస్తులు వారి అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ జంపా సురేంద్ర పాల్గొన్నారు. సాక్షి, అనకాపల్లి : జాతీయ రహదారిపై సుదూర ప్రయాణం చేసే వాహనదారులు రాత్రి వేళ అలసటతో నిద్రలోకి జారుకోవడం కారణంగా తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళల్లో నిద్రలేమి కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు, జిల్లా జాతీయ రహదారులపై ఉన్న 9 హైవే మొబైల్ టీమ్లను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. అనకాపల్లి జిల్లా పరిధి జాతీయ రహదారి–16 పై లంకెలపాలెం నుంచి పాయకరావుపేట వరకు 80 కిలోమీటర్ల మేర తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను 9 బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ప్రతి 7 నుంచి 14 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఒక్కో పాయింట్లో ఒక మొబైల్ టీమ్ చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో మొబైల్ టీమ్లో ఒక డ్రైవర్, హెడ్ కానిస్టేబుల్ లేదా ఏఎస్ఐ ఉంటారు. వీరికి ఫస్ట్ ఎయిడ్తో పాటు ఫేస్ వాష్ కూడా శిక్షణ ఇచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు నడిపే డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని సూచిస్తున్నారు. ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, లైటింగ్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు... చైన్నె–కోల్కతా నేషనల్ హైవే మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హైవేకు ఇరువైపులా గ్రామాలు ఉన్నాయి. ప్రధానంగా పరవాడలో ఫార్మా కంపెనీల నుంచి షిప్ట్ల వారీగా కార్మికులు హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సమయంలో రాత్రి వేళ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాల్లో అధికంగా డ్రైవర్ల నిద్రమత్తు వల్లే జరుగుతున్నట్టు గుర్తించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అర్ధరాత్రి 12 తరువాత తెల్లవారుజామున 4 గంటలలోపు అత్యధికంగా ప్రమాదాలు జరిగాయి. జిల్లా పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 60 శాతం నేషనల్ హైవేపైనే జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో వాహనం నడిపేటప్పుడు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే వాహనాన్ని అపేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని పోలీసులు డ్రైవర్లకు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని చెబుతున్నారు. మొబైల్ టీంలు ఇలా.. అనకాపల్లి పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ ఎస్.రమేష్ పర్యవేక్షణలో మొబైల్ టీంలను దిశానిర్దేశం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా హైవేలో అనకాపల్లి (కొప్పాక–కశింకోట జంక్షన్), కశింకోట జంక్షన్–ఎనీపాలెం, యలమంచిలి (ఎనీజీపాలెం–రేగుపాలెం), యలమంచిలి (రేగుపాలెం–ధర్మవరం), ఎస్.రాయవరం, నక్కపల్లి (ఉపమాక జంక్షన్– ఉద్దండపురం), పాయకరావుపేట (ఉద్దండపురం–తాండవా జంక్షన్),సబ్బవరం (చిన్నయ్యపాలెం–మర్రిపాలెం) 7 కి.మీలు, పరవాడ (క్యాన్సర్ ఆస్పత్రి–కొప్పాక జంక్షన్)లో మొబైల్ టీంలను ఏర్పాటు చేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం 60 శాతం పూర్తి కావడం నిజం కాదా? 50 ఎకరాల్లో 13.21 లక్షల చ.అ. విస్తీర్ణంలో భవన సముదాయం నిర్మించడం నిజం కాదా? అందుకు రూ.500 కోట్లు మంజూరు చేయడం నిజం కాదా? పేద ప్రజలకు ఎంతో మేలు చేసే వైద్య కళాశాల, బోధనాస్పత్రులను ప్రైవేటుపరం చేయాలన్న మీ కుట్ర నిజం కాదా? నిజ నిర్ధారణ కోసం పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకుల సూటి ప్రశ్నలివి.. -
మోదీ నేతృత్వంలో దేశాభివృద్ధి
అనకాపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి రింగ్రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షతన గురువారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ జీఎస్టీలో సంస్కరణల వల్ల ఈనెల 22 నుంచి పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయని చెప్పారు. కూటమి పాలనలో పార్టీ శ్రేణుల్లో కొంత మేరకు అసంతృప్తి ఉన్న విషయం పార్టీ దృష్టికి వచ్చిందని, స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనకాపల్లి–రాజమహేంద్రవరం ఆరు లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు త్వరలో శ్రీకారం చుడతారన్నారు. ఈనెల 14న విశాఖ రైల్వే క్రీడా మైదానంలో బీజేపీ రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. వివిధ వర్గాల వారితో చాయ్ పే చర్చ అనకాపల్లి టౌన్: స్థానిక నాలుగురోడ్ల జంక్షన్ వద్ద చాయ్ పే చర్చ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు పలు సమస్యలపై వివిధ వర్గాల వారు ఏకరువు పెట్టారు. పట్టణ నడిబొడ్డున, మున్సిపల్ స్కూల్ పక్కన్న డంపింగ్ యార్డు తక్షణమే తరలించాలన్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టును అనకాపల్లి వరకు పొడిగించాలన్నారు. -
ప్రెస్మీట్ కవర్ చేస్తే కేసులు పెడతారా..!
రాజకీయ పార్టీల నాయకుల స్టేట్మెంట్లు పత్రికలో పబ్లిష్ చేస్తే రిపోర్టర్లు, ఎడిటర్పై కేసులు పెడతారా..? రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)ఎ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంది. ప్రజల పక్షాన గళమెత్తుతున్న ’సాక్షి’ గొంతు నులిమే చర్య ఇది. ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి. రిజాయిండర్ ఇవ్వాలి. కానీ పత్రికలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఇలాంటి సంస్కృతికి బీజం నాటడం భవిష్యత్తులో నిజాన్ని అణగదొక్కినట్లే అవుతుంది. – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం -
మండల స్థాయిలో స్కూలు గేమ్స్కు సన్నద్ధం
కశింకోట: మండల స్థాయిలో స్కూలు గేమ్స్ పకడ్బందీగా నిర్వహించడానికి సన్నద్ధం కావాలని డీఈవో గిడ్డి అప్పారావునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో గురువారం సాయంత్రం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ నిర్వహణకు పీడీలు, హెచ్ఎంలు సమన్వయంతో వ్యవహరించి ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్, యోగా, త్రో బాల్, షటిల్ బ్యాడ్మింటన్, తదితర ఏడు ఆటలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి తర్వాత జోన్ స్థాయిలో నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత యధావిధిగా జిల్లా, రాష్ట్ర స్థాయి ఆటలు జరుగుతాయన్నారు. జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా కె. మహాలక్ష్మినాయుడు, పరిపాలన కార్యదర్శిగా అచ్చయ్యమ్మలను నియమించారన్నారు. వీరిని సమావేశంలో అభినందించారు. ఉప విద్యా శాఖ అధికారి అప్పారావు నాయుడు పాల్గొన్నారు. -
గోవాడ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలి
చోడవరం : గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ అఖిల పక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు గురువారం ధర్నా నిర్వహించాయి. ఈ ఏడాది క్రషింగ్కు సంబంధించి ఇంకా ఎటువంటి ఆదేశాలు, ఫ్యాక్టరీ మిషనరీ ఓవర్హాలింగ్ పనులు చేపట్టకపోవడంతో క్రషింగ్ జరుగుతుందా..లేదా అనే ఆందోళనలో రైతులంతా ఉన్నారు. దీంతో కొద్ది రోజులుగా అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి పలుమార్లు ఆందోళనలు చేశాయి. అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో మళ్లీ రైతుసంఘాలు, కార్మికులు ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గురువారం ఫ్యాక్టరీ గేటు వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.50కోట్లు విడుదల చేసి చెరకు రైతులకు పాత బకాయిలు చెల్లించాలని, ఈ ఏడాది క్రషింగ్ సీజన్కు కావలసిన యంత్రాల ఓవర్హాలింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కూటమి నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని ఆధునికీకరించాలని, ఈనెల 30వ తేదీలోగా నిర్వహించాల్సిన ఫ్యాక్టరీ మహాజనసభను సకాలంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని రక్షించుకునేందుకు అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా రైతుసంఘాలు, కార్మిక సంఘాలు తీర్మానించాయి. ఈ ఆందోళనలో ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, కార్మికసంఘం నాయకుడు శరగడం రామునాయుడు, రైతు సంఘాల ప్రతినిధులు దండుపాటి తాతారావు, తనకల జగన్, ఏడువాక శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..?
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై వేధింపులకు పాల్పడుతోంది. ఒక రాజకీయ పార్టీ నేత ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలను రిపోర్టర్ వార్తగా రాస్తే ఎడిటర్పై కేసు పెడతారా? మీడియా గొంతును నులిమేస్తారా? రాష్ట్రంలో ప్రతికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..? అక్షరాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను నోటీసులు, అక్రమ కేసులతో నిరోధించలేరు. రాజకీయ కక్షలు కార్పణ్యాలతో పత్రిక ఎడిటర్పై కేసుల నమోదు ఏమాత్రం సరికాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి డబ్బా కొట్టే పచ్చ మీడియా మాత్రమే ఉండాలా? మీ అవినీతి, అక్రమాలను ఎత్తిచూపించే ఏ మీడియా ఉండకూడదా.. అయినా మీకెందుకంత ఉలికిపాటు. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపం
కోటవురట్ల: ఓ యువతి ఇష్టం లేని పెళ్లి చేశారని తీవ్ర మనస్తాపం చెందింది. మనసు చంపుకుని భర్తతో కాపురం చేయలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని ఆక్సాహేబుపేటలో గురువారం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన చల్లపల్లి లోవలక్ష్మి (24)కి ఇష్టం లేకపోయినా నాలుగు నెలల క్రితం ఆక్సాహేబుపేటకు చెందిన జోగిరాజుకు ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి కలతగా ఉన్న ఆమె మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో శబ్దం రావడంతో బంధువులు వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కొన ఊపిరితో కనిపించింది. ఆమెను ఉరి నుంచి తప్పించి హుటాహుటిన తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. అయితే లోవలక్ష్మి భర్త జోగిరాజు చాలా మంచి వ్యక్తి అని, అర్థం చేసుకోకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘విజయ పథం’లో కేజీబీవీలు
కశింకోట/ఎస్.రాయవరం: విజయ పథకం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల కార్యదర్శి దేవానందరెడ్డి ఆదేశించారు. కశింకోట మండలంలోని తేగాడ కేజీబీవీ, ఎస్.రాయవరం మండలంలోని తిమ్మాపురం కేజీబీవీలను గురువారం ఆయన సందర్శించారు. విజ యపథం కార్యక్రమం, విద్యా ప్రమాణా లు, రికార్డులు, విద్యార్థుల నోట్ పుస్తకాలు, స్లిప్టెస్ట్ మూల్యాంకనాలను పరిశీలించారు. టెన్త్, ఇంటర్మీడియట్లో శత శాతం ఉత్తీర్ణత సాధన కు పలు సూచనలిచ్చారు. తేగాడలో విద్యార్థులతో సహ పంక్తి భోజనం చేశారు. ప్రిన్సిపాల్ డి.చంద్రకళ, ఏజీసీడీవో సబియా సుల్తానా, వృత్తి విద్యా సమన్వయకర్త శ్రీలత, జిల్లా జీసీడీవో ఏఎస్డీ జెమిమ పాల్గొన్నారు. తిమ్మాపురంలో పాఠశాల భవన నిర్మాణం పూర్తయిన వెంటనే ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. -
రాష్ట్ర స్థాయి వుషూ పోటీలకు గురుకుల విద్యార్థినులు
రాష్ట్రస్థాయి వుషూ పోటీలకు అర్హత సాధించిన విద్యార్థినులు నర్సీపట్నం: స్టేట్ స్కూల్ గేమ్స్ వుషూ పోటీలకు నర్సీపట్నం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. విశాఖలో సంస్కృతి గ్లోబ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం జరిగిన జిల్లా స్థాయి అండర్ –19 స్కూల్ గేమ్స్ వుషూ పోటీల్లో గురుకుల విద్యార్థినులు పి.దుర్గా భవాని 45 కేజీలు, బి.కావ్య 52 కేజీలు, పి.జ్యోష్ణ మేరీ 60 కేజీలు, వి.ప్రణితి 65 కేజీల విభాగాల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. పీడీ సాయి పర్యవేక్షణలో వుషూ కోచ్ వేపాడ ప్రియాంక శిక్షణలో మెడల్స్ సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ రాజేశ్వరి, శాప్ కోచ్ అబ్బు అభినందించారు. -
ఉక్కుకు ఉచ్చు?
రూ.3లక్షల కోట్ల ఆస్తి భద్రత ప్రశ్నార్థకం సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న కుయుక్తులు ఉక్కు పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. సంవత్సరాలుగా ఉద్యోగ, కార్మిక సంఘాలు తమ కుటుంబాలతో కలిసి రోడ్లపై పోరాటాలు చేస్తున్నా.. కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి చకచకా పావులు కదుపుతోంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో ఉద్యోగులను, వేలాది మంది కార్మికులను విడతలవారీగా విధుల నుంచి తొలగించేసింది. ఇదే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా సిబ్బందిపైనా వేటు పడింది. ఈ నేపథ్యంలో ప్లాంట్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. భారీగా తగ్గిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది దేశంలోని పార్లమెంట్, విమానాశ్రయాలు వంటి అత్యంత కీలకమైన సంస్థలకు రక్షణ కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) విశాఖ ఉక్కు కర్మాగారానికి 1983 ఆగస్టు నుంచి భద్రత కల్పిస్తోంది. రూ.3 లక్షల కోట్ల విలువైన ప్లాంట్ ఆస్తులు, యంత్రాలు, ముడి పదార్థాలను సుమారు 40 ఏళ్లుగా సుమారు 1,013 మంది సిబ్బంది కంటికి రెప్పలా కాపాడారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘డిప్లాయ్మెంట్ కాస్ట్ కటింగ్’పేరుతో యాజమాన్యం సీఐఎస్ఎఫ్ సిబ్బందిని భారీగా తగ్గించింది. మొత్తం 1013 మందిలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు వంటి హోదాలో ఉన్న 438 మందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ప్రస్తుతం కేవలం 575 మంది సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. సిబ్బందిని తగ్గించిన తర్వాత ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయడంలో యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
ప్లాంట్ భద్రతా వ్యవస్థను బలహీనం చేశారు
స్టీల్ప్లాంట్ ఆస్తులను దొడ్డిదారిన దోచుకోవడానికి పెద్దస్థాయిలో కుట్ర జరుగుతోంది. భద్రతా వలయంలో ఉంటూ నిరంతరం రూ.వేల కోట్ల ఉత్పత్తులున్న చోట్ల బయట వాహనాల్లో వచ్చి చోరీ చేస్తే.. ప్లాంట్లో ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. కాపర్ స్టేవ్స్ ఒక్కో ప్లేట్ 1.4 టన్నుల బరువు ఉంటుంది. వాటిని ఎత్తాలంటే హైడ్రాలిక్ క్రేన్, లారీ అవసరం. అలాంటివి ఆరు కాపర్ స్టేవ్లు మాయమయ్యాయి. ఈ నేరానికి పాల్పడినవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని బదిలీ చేసి, సెక్యూరిటీని బలహీనపరిచారు. ప్రజల ఆస్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన చోట, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని బదిలీ చేసిన తర్వాత ఇంతవరకూ ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం గర్హనీయం. – అయోధ్యరామ్, కన్వీనర్, విశాఖ ఉక్కు పోరాట కమిటీ -
చంద్రబాబు కామన్ మ్యాన్ కాదు కార్పొరేట్ మ్యాన్
సాక్షి, అనకాపల్లి: ‘‘సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్’’ అంటూ అనంతపురంలో నిర్వహించిన సభలో చంద్రబాబు చెప్పుకొన్నట్లు సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు.. కేపిటలిస్ట్ మ్యాన్ (పెట్టుబడిదారీ మనిషి), కార్పొరేట్ మ్యాన్.. ఆయన ఆ వర్గాలకే వత్తాసు పలుకుతారు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తయిన, సగానికి పైగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ కుట్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు తమ నాయకుడు వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ హయాంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో సగానికిపైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీని గురువారం వైఎస్సార్సీపీ నేతలు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, ఏరువాక సత్యారావు, తదితరులతో కలిసి అమర్నాథ్ పరిశీలించారు. వేరొకరి పనికి క్రెడిట్ తీసుకోవడం బాబు నైజం ‘‘కూటమి ప్రభుత్వం 15 నెలల్లో రూ.1.95 లక్షల కోట్లు అప్పు చేసింది. వీటిలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించినా... కూటమి ప్రభుత్వం తమకి అవసరం లేదంటూ అత్యంత అన్యాయంగా లేఖ రాసింది. అయినా అనంతపురం సభలో మెడికల్ కాలేజీలు తానే తీసుకొచ్చానని చంద్రబాబు చెప్పుకొంటున్నారు. ఎవరో చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం ఆయనకు బాగా అలవాటు’’ అని అమర్నాథ్ విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా నియంత కిమ్ తరహాలో ఆంధ్రాలో పాలన సాగిస్తున్న లోకేశ్ ఆంధ్రా కిమ్ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే వైద్యరంగంలో సంస్కరణలు ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించి రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని అమర్నాథ్ తెలిపారు. ‘‘ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని, ఒక్కో మెడికల్ కాలేజీకి సుమారు రూ.500 కోట్లు వెచ్చించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. విజయనగరం, మచిలీపట్నం సహా ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు నడుస్తున్నాయి. 150 చొప్పున 750 మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో 2022 డిసెంబరు 30న అప్పటి సీఎం వైఎస్ జగన్ మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మెడికల్ కాలేజీ మూడు, ఆసుపత్రి రెండు అంతస్థులు నిర్మాణం పూర్తయ్యాయి. హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. కూటమి సర్కారు వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’’ అని విమర్శించారు. -
‘ఆ నిర్ణయాన్ని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలి’
సాక్షి, నర్సీపట్నం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలు పునర్విభజన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశ్యంతో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకువచ్చారన్నారు.‘‘8500 కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఖర్చు మొదలు పెట్టారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్ను తయారు చేయాలన్నది వైఎస్ జగన్ ఆశయం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 4500 మెడికల్ సీట్లు విద్యార్థులకు వస్తాయని ఆశించారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీలో హాస్పిటల్ భవనం మూడు అంతస్తులు పూర్తి అయింది. ఈ భవనం నిర్మాణం పూర్తి చేయడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?. చంద్రబాబు కామన్ మెన్ కాదు.. క్యాపలిస్ట్ మెన్. అప్పు చేసిన 2 లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే సరిపోతుంది. పులివెందుల మెడికల్ కాలేజీకు సీట్లు వద్దని లేఖ రాశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తున్న చంద్రబాబు, నేడు మెడికల్ కాలేజీలను నేనే తెచ్చానని మాట్లాడుతున్నారు. సైకో కంటే పెద్ద పేరు చంద్రబాబు అని గూగుల్ చూపిస్తుంది. కిమ్ ఉత్తర కొరియా నియంత అయితే లోకేష్ ఏపీ నియంత’’ అంటూ గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వడానికి మీ అబ్బ జాగీరు కాదు. పేదవాడికి రాష్ట్రంలో చోటు లేదు. వైఎస్ జగన్ పథకాలను కాపీలను కొట్టిన ఘనత చంద్రబాబుది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాటిని ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నర్సీపట్నంలో ఇప్పటికే 50 కోట్లకు పై మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఖర్చు చేశారు. స్పీకర్ అయ్యన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం బాధ్యత తీసుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
లైంగిక దాడి దోషులను కఠినంగా శిక్షించాలి
దేవరాపల్లి: విశాఖపట్నం సీతమ్మధారలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ డిమాండ్ చేశారు. దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు న్యాయం చేసి, అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కూటమి పాలనలో మహిళలు, బాలికలకు రక్షణ కొరవడిందని విమర్శించారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరపడంతో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువయ్యాయని ఆమె ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అనురాధ కోరారు. -
కేజీహెచ్ వార్డు బాయ్పై చర్యలు
మహారాణిపేట: ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కేజీహెచ్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వైద్యురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై రోజుల తరబడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు.. ‘కేజీహెచ్లో కీచకులు’శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఉలిక్కిపడి.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డు బాయ్ శంకరరావును సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26న గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డులో మహిళా వైద్యురాలి పట్ల వార్డు బాయ్ శంకరరావు రెండుసార్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అదే రోజు కేజీహెచ్ సూపరింటెండెంట్, ఏఎంసీ ప్రిన్సిపల్, విభాగాధిపతులతో పాటు వన్టౌన్ పోలీసులకు సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయంపై ‘సాక్షి’దినపత్రికలో కథనం వెలువడింది. దీంతో కేజీహెచ్ యాజమాన్యం తర్జనభర్జనల అనంతరం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. వెంటనే సంబంధిత ఫైల్ను తయారుచేసి, శంకరరావును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు త్వరలో సమావేశం కానున్నట్లు తెలిసింది. కాగా.. సర్జరీ విభాగంలో బాలిక తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కూడా ఆస్పత్రి ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ నుంచి కేజీహెచ్కు వచ్చిన రెండు ఈ–మెయిల్స్ను ఎవరు డిలీట్ చేశారన్న దానిపై కూడా అంతర్గత విచారణ మొదలైనట్లు సమాచారం. -
23 నుంచి సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
సింహాచలం: ఈ నెల 23 నుంచి అక్టోబరు 1 వరకు సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు బుధవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఆలయంలో శ్రీ రామాయణ నవరాత్ర పారాయణం ఉంటుందన్నారు. రోజూ సాయంత్రం 5 గంటలకు చతుర్భుజ తాయారు, సువర్ణ అమ్మవార్లకు ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న సింహవల్లీ తాయారు సన్నిధిలో వీరలక్ష్మీ ఆరాధనం, 29న మూల నక్షత్రం పురస్కరించుకుని ఆయుధపూజ నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 2 విజయదశమి నాడు కొండదిగువ పూలతోటలో సాయంత్రం నుంచి జమ్మివేట ఉత్సవం, శమీపూజ జరపనున్నట్లు తెలిపారు. ఆ రోజు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి శ్రీరామాలంకారం చేసి కొండపైనుంచి మెట్ల మార్గంలో కొండ దిగువ పూలతోటకు తీసుకెళ్తామన్నారు. విజయదశమి నాడు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపై స్వామివారి దర్శనాలు లభిస్తాయన్నారు. -
బైకుపై వెళుతూ ఆగిన బస్సును ఢీకొని..
రావికమతం : మండలంలోని పిల్లవానిపాలెం దాటిన తరువాత గొంప దగ్గరలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనం (ఎపి 39 కువై 2649 )పై వెళ్తూ ఆర్టీసీ బస్సు (ఎపి35 జెపి 0087)ను ఢీకొట్టి కంచర్ల రామారావు(70) అనే వ్యక్తి మృతి చెందాడు. రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాలివి. బుచ్చెయ్యపేట మండలం పెదమదీన గ్రామానికి చెందిన కంచర్ల రామారావు బుధవారం సాయంత్రం గుడ్డిపలో వ్యవసాయ పనులు ముగించుకొని స్వగ్రామం పెదమదీనకు ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. అనకాపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తూ ఆగింది. దీంతో బైకుపై వెనుకగా వస్తున్న రామారావు బస్సు వెనుక బలంగా ఢీకొన్నాడు. పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ బస్సు దిగివచ్చి చూడగా అప్పటికే రామారావు రోడ్డుపై పడి ఉన్నాడు. అతరిరి వైద్యం కోసం రావికమతంలోని ప్రైవేటు అస్పత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య పార్వతి, వివాహితులైన కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ , కండక్టర్లను అదుపులోనికి తీసుకొన్నట్టు ఎస్ఐ తెలిపారు. రామారావు మృతితో పెదమదినాలో విషాదఛాయలు అలముకున్నాయి. -
పత్రికా స్వేచ్ఛకు భంగం
జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు లేదా పరువు నష్టం దావా వేయవచ్చు. అంతేగానీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయలేదు. ఈ విధమైన వైఖరి వల్ల జర్నలిస్టులు సరైన వార్తలు పాఠకులకు అందించలేరు. వాస్తవాలను రాయడానికి, నిజానిజాలు వెల్లడించడానికి వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. జర్నలిస్టుల స్వేచ్ఛకు ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా ఆలోచన చేయాలి. – గంట్ల శ్రీనుబాబు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి -
డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు సన్మానం
నర్సీపట్నం: డీఎస్సీ–2025లో ఎంపికై న అభ్యర్థులను పీఆర్టీయూ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ విద్యార్థులను ప్రయోజకులను చేసే అవకాశాన్ని కొత్త ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంకిత భావంతో పని చేసి ఉపాధ్యాయ వృత్తికి గుర్తింపు తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం ఉపాధ్యాయులుగా ఎంపికై న 200 మందిని సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్, యూనియన్ ప్రతినిధులు రమణ, అప్పారావు, ప్రసాద్, వరహాలనాయుడు, జి.వి.రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
వడ్డాదిలో వర్ష బీభత్సం
బుచ్చెయ్యపేట: మండలంలో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. మేజర్ పంచాయతీ వడ్డాదిలో రెండిళ్లకు చెందిన ప్రహరీలు కూలిపోయాయి. సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో బీఎన్ రోడ్డు వద్ద వేంకటేశ్వరస్వామి ఆర్చ్ దగ్గరలో చంద్రశేఖర్ ఇంటి ప్రహరీ కూలిపోయి పక్కనే ఉన్న సయ్యపురెడ్డి శ్రీను ఇంటి ప్రహరీపై పడింది. దీంతో ఆ గోడ కూడా కూలిపోయింది. ఆయా ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. – వడ్డాది పెద్దేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహానికి నదిపై ఉన్న శిథిల వంతెనపై మళ్లీ రంధ్రం పడింది. గతంలో రంధ్రం పడి గొయ్యి పడటంతో ఆర్అండ్బీ అధికారులు గొయ్యిని పూడ్చారు. నీటి ఉధృతికి మళ్లీ వంతెన వద్ద గొయ్యి పడటంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా స్థానికులు గొయ్యి చుట్టూ రాళ్లు పేర్చి హెచ్చరికలు జారీ చేశారు. -
మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయొద్దు
అనకాపల్లి: నర్సీపట్నం(మాకవరపాలెం) సహా రాష్ట్రంలోని పది కొత్త మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానంలో నిర్మించాలని విడుదల చేసిన జీవో నంబర్ 590ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, ఆరోగ్య రంగాన్ని లాభాపేక్ష కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. మాకవరపాలెంలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే చివరి దశలో ఉన్నాయని, వీటిని పూర్తి చేసి వైద్య సేవలు వెంటనే ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య కళాశాలలు ప్రతిభకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తాయని, ప్రైవేట్ యాజమాన్యాలు సంపన్నులకే సీట్లు కేటాయిస్తాయని, వ్యాపార దృక్పథం పేద ప్రజలకు వైద్యం అందకుండా చేస్తుందన్నారు. వైద్య విద్య, ఆరోగ్యం ప్రజా హక్కులను లాభాల కోసం తాకట్టు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికే ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజుల భారం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వమే కొత్త మెడికల్ కాలేజీలను పూర్తిగా నిర్మాణం చేపట్టి, ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. -
దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయొద్దు
పంచాయతీరాజ్ అధికారుల తీరుపై జెడ్పీటీసీ సభ్యుల అసంతృప్తిమహారాణిపేట (విశాఖ): దివ్యాంగుల పింఛన్ల రీ వెరిఫికేషన్ చేసినప్పటికీ.. అర్హులైన వారందరికీ పింఛన్లు కొనసాగించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆమె అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ 40 శాతం లోపు వైకల్యం ఉందంటూ దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి, సదరం సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫికేషన్ చేస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దివ్యాంగుల పింఛన్ల విషయంలో పలు రకాలుగా వేధిస్తున్నారని, దీని వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్.. దివ్యాంగుల పింఛన్లను రద్దు చేయవద్దన్నారు. ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని, పంచాయతీల్లో ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా.. అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలోని పంచాయతీరాజ్ అధికారుల పనితీరుపై జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జేఈపై చర్యలు తీసుకోవాలి పరవాడలో ఇప్పటికే సీసీ రోడ్లు ఉన్న చోట మళ్లీ కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు చేయడం, వాటికి ఆమోదం తెలిపిన తర్వాత పనులు నిలుపుదల చేయడంపై పరవాడ జెడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు అభ్యంతరం తెలిపారు. ఈ విధంగా తప్పుడు ప్రతిపాదనలు చేసిన జేఈపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ, కేజీహెచ్ సేవలపై అసంతృప్తి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణికి ఫోన్ చేస్తే స్పందించడం లేదని కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆరోపించారు. తాము సొంత పనుల కోసం ఫోన్ చేయమని, పేద రోగులకు వైద్యం కోసమే ఫోన్ చేస్తామని, అయినా అధికారి స్పందించకపోవడం దారుణమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కావడం లేదని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేద రోగులకు వైద్య సేవలు అందేలా చూడాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు కోరారు. దీనిపై విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు స్పందిస్తూ.. ఆరోగ్యశ్రీ కింద 3,000కు పైగా ప్రొసీజర్లకు చికిత్స అందిస్తున్నామని, కార్డు ఉన్న వారందరికీ సేవలు అందుతున్నాయని తెలిపారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వా ణి మాట్లాడుతూ ఆసుపత్రిలో పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్స, గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయని, వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పీఎం–సూర్య ఘర్పై అవగాహన విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 నంబర్కు ఫోన్ చేస్తే.. 4 గంటల్లోపు సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పీఎం–సూర్య ఘర్ పథకం ద్వారా ప్రజలు విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. జెడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి, మూడు జిల్లాల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అచ్చెన్న చెరువుపై చర్చ అచ్యుతాపురం మండలంలోని యర్రవరం గ్రామంలో సర్వే నెం.147 ప్రభుత్వ చెరువులో వారం రోజులుగా జరుగుతున్న చెరువు మట్టి అక్రమ తవ్వకాలపై కో ఆప్షన్ సభ్యుడు నర్మాల కుమార్ ధ్వజమెత్తారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో యర్రవరం గ్రామంలో రెవెన్యూ అధికారులు తప్పుడు అనుమతులు ఇవ్వడంతో కోట్ల విలువైన ప్రభుత్వ చెరువు మట్టిని కూటమి నాయకులు సెజ్ పరిశ్రమలకు, వివిధ వ్యాపార సముదాయాలకు, ప్రైవేట్ లే–అవుట్లకు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. -
సాక్షి ఎడిటర్పై వేధింపులు సరికాదు
సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం, తాజాగా ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం కక్ష సాధింపులో ఓ భాగమే. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ నేత మాట్లాడిన విషయాలను వార్తగా ప్రచురించడంపై కూడా కేసు పెట్టడం, నోటీసుల పేరిట వేధించడం సబబు కాదు. భారత రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ప్రయ త్నం చేయడం అప్రజాస్వామికం. అన్యాయాన్ని, అవినీతిని, ప్రజా సమస్యలను తన కలంతో వెలికితీయడమే జర్నలిస్టుల వృత్తి. అలాంటి పత్రికా స్వాతంత్య్రాన్ని, జర్నలిస్టుల కలాన్ని పోలీసు కేసులతో నియంత్రించాలని చూస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఏదైనా వార్త అవాస్తవమని భావిస్తే, దానికి ప్రభుత్వం వివరణ కోరాలి. కానీ కేసులు నమోదు చేయడం సరైంది కాదు. – సీహెచ్బీఎల్ స్వామి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి జిల్లా -
పెట్రోలింగ్ బైకులు.. రయ్.. రయ్
యలమంచిలి రూరల్: భారీగా పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. ప్రధాన, అంతర్గత రహదారుల్లో ఎక్కడైనా ట్రాఫిక్ స్తంభిస్తే వెంటనే అక్కడకు చేరుకుని క్రమబద్ధీకరించేందుకు పోలీసులకు సవాలుగా తయారైంది. మరోవైపు గొడవలు, అల్లర్లు, ఘర్షణలు జరిగినప్పుడు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించడం పోలీసులకు కత్తి మీద సాములా పరిణమించింది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా పోలీసు శాఖ పలు ఠాణాలకు అన్ని సౌకర్యాలతో కొత్త ద్విచక్ర వాహనాలను అందజేసింది. పరవాడ పోలీసు సబ్ డివిజన్ పరిధిలో 5 పోలీస్ స్టేషన్లకు పెట్రోలింగ్ బైకులను కేటాయించారు. యలమంచిలి పట్టణం, యలమంచిలి ట్రాఫిక్, అచ్యుతాపురం, పరవాడ, సబ్బవరం ఠాణాలకు కేటాయించిన ఈ సరికొత్త వాహనాలు సంబంధిత సిబ్బందికి విధి నిర్వహణలో చాలా సౌకర్యవంతంగా, ఉపయుక్తంగా ఉన్నాయి. ఇటీవల ఆయా ఠాణాలకు అందజేసిన టీవీఎస్ అపాచీ బ్రాండ్కు చెందిన ఈ బైకులకు అనేక ప్రత్యేకతలున్నాయి. ట్రాఫిక్ స్తంభించిన సమయాల్లో, ఏవైనా రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో వేగంగా ఘటనాస్థలికి చేరుకుని, వాహనాల రద్దీని క్లియర్ చేయడానికి కొత్త వాహనాలు ఉపయోగపడుతున్నాయి. ప్రత్యేకతలు ●బైక్కు వెనుక భాగాన ఎర్రటి బుగ్గ బల్బు, బ్లూ, ఎర్ర రంగు లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతాయి. వాటి పక్కన మైక్లు ఉన్నాయి. అదే క్రమంలో సైరన్ కూడా మోగుతుంది. ట్రాఫిక్ సమస్య తలెత్తినప్పుడు మైక్ ద్వారా సూచనలు చెబుతూ పోలీసులు పరిస్థితిని క్రమబద్ధీకరిస్తున్నారు. ●ప్రమాదాలు జరిగిన ప్రాంతంలోనే బైక్ను నిలిపి ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. ●ఊరేగింపులు, ర్యాలీల సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఏయే మార్గాల్లో వెళ్లాలో మైకుల ద్వారా ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేయొచ్చు. ●ఎక్కడైనా ట్రాఫిక్ నిలిచిపోయి డయల్ 112కు ఫిర్యాదు వస్తే వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. ●పోలీసు జీపులు, పెద్ద వాహనాలు చిన్నపాటి సందుల్లో వెళ్లలేవు కాబట్టి ఈ ద్విచక్ర వాహనాలతో సులువుగా ఘటనా స్థలానికి చేరుకోవచ్చు. ●రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ●వాహనంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, పరికరాలతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు శ్వాస పరీక్షలు చేసే పరికరం కలిగిన పెట్టే కూడా ఉంది. పెట్రోలింగ్కు బాగా ఉపయోగం ఈ వాహనాలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. గస్తీ సులభంగా ఉంటోంది. ఈ వాహనాల్లో ఇన్బిల్ట్ సైరన్ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు, అల్లర్లకు పాల్పడే వారిని చెదరగొట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. తొలి విడతలో 5 పోలీస్ స్టేషన్లకు ఇచ్చాం. మరిన్ని వాహనాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని ఠాణాలకు సమకూర్చితే సంబంధిత సిబ్బందికి సౌకర్యవంతంగా ఉంటుంది. – వి.విష్ణుస్వరూప్, డీఎస్పీ, పరవాడ -
ఉత్సాహంగా ఓనం సంబరాలు
పాయకరావుపేట: ఓనం సంబరాలు శ్రీప్రకాష్ జూనియర్ కళాశాలలో బుధవారం ఘనంగా జరిగాయి. విద్యార్థినులు కేరళా సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కేరళాలో ప్రాచుర్యం పొందిన పాటలు పాడుతూ నృత్యం చేస్తూ సందడి చేశారు. ఓనం పండగ విశిష్టతను ఓ విద్యార్థిని చక్కగా వివరించి ఆకట్టుకుంది. ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థులకు వివిధ రాష్ట్రాల ఆచార, వ్యవహారాలపై అవగాహన ఏర్పడి, మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి దోహదపడుతుందని ప్రిన్సిపాల్ భానుమూర్తి తెలిపారు. -
చావైనా.. బతుకై నా..
●ఎన్నాళ్లీ కష్టాలు? ఉరకగెడ్డ దాటాల్సిందే..తాచేరు గెడ్డపై నిర్మించిన కర్రల వంతెన మాడుగుల: మండలంలోని శంకరం పంచాయతీలో ఏడు గిరిజన గ్రామాలకు వర్షాకాలం వస్తే గండమే. బయటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే వారి బతుకు నరకమే. ఎన్నో ఏళ్ల నుంచి ఇదే దుస్థితి. ఈ గిరిజనులు మండల కేంద్రానికి రావాలన్నా, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా ఉరకగెడ్డ దాటవలసిందే. చిన్నపాటి వర్షం కురిసినా సరే గెడ్డ దాటలేని పరిస్థితులున్నాయి. అత్యవసర సమయాలలో గెడ్డ దాటాలంటే ప్రాణాలు గుప్పెట పెట్టుకుని ఈదవలసిందే. వైఎస్సార్ సీపీ హయాంలో ఈ గిరిజన గ్రామాలకు రహదారితోపాటు ఈ గెడ్డపై వంతెన నిర్మాణానికి రూ.7.20 కోట్లు మంజూరయ్యాయి. కొంత రోడ్డు పనులు కూడా జరిగాయి. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో పనులు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా ఈ వంతెన ఊసెత్తలేదని ఆదివాసీ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. కర్రల వంతెనపై ప్రమాదకర ప్రయాణం తాటిపర్తి పంచాయతీ అజయ్పురం వద్ద కొండగెడ్డపై తాత్కాలికంగా కర్రల వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెనపై ప్రయాణించేటప్పుడు అదుపు తప్పితే ప్రాణాలు నీటిలో కలసి పోతున్నాయి. రెండు నెలల క్రితం సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఉరకగెడ్డపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆదివాసీ గిరిజనులు గెడ్డలో దిగి ఆందోళన చేపట్టారు. అయినా సరే కూటమి సర్కారులో ఎటువంటి స్పందన లేదని ఆదివాసీ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం, తాడివలస, గొప్పూరు, గిరి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వారం రోజుల క్రితం అజయ్పురం గ్రామానికి చెందిన మాచమ్మ.. తాచేరు గెడ్డ కర్రల వంతెనపై కూలి పనికి వెళుతూ అదుపు తప్పి గెడ్డలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆమె మతదేహాన్ని తిరిగి గ్రామానికి తీసుకురావడానికి అదే కర్రల వంతెనపై అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. హృదయం ద్రవించిపోయే ఈ దుర్ఘటన నేపథ్యం ఏడు గిరిజన గ్రామాలతో ముడిపడి ఉంది. వర్షం వస్తే ఏడు ఆదివాసీ గ్రామాలు దిగ్బంధం తాచేరు గెడ్డపై తాత్కాలికంగా కర్రల వంతెన నిర్మాణం ఈ వంతెన నుంచే జారిపడి ఇటీవల మహిళ మృతి వంతెన నిర్మాణానికి రూ.7.20 కోట్లు మంజూరు చేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్తో ఆగిన పనులు కూటమి సర్కార్ వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పట్టించుకోని వైనం వంతెన నిర్మాణం చేపట్టాలి శంకరం పంచాయతీలో ఏడు గిరిజన గ్రామాల చుట్టూరా ఉరకగెడ్డ ప్రవహిస్తోంది. వర్షాకాలంలో గెడ్డ దాటలేని పరిస్థితులున్నాయి. మా పూర్వీకుల నుంచి ఇదే పరిస్థితి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొంతవరకు రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. వంతెన నిర్మాణం చేపట్టడానికి సిద్ధమవుతున్న సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు నిలిచిపోయాయి. కూటమి సర్కారు వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా వంతెన ఊసెత్తలేదు. పలుసార్లు సీపీఎం నాయకులతో కలసి నిరసనలు వ్యక్తం చేసినా సరే పట్టించుకోలేదు. గర్భిణులను వర్షాకాలంలో గెడ్డ దాటించడం కష్టంగా ఉంది. –శోలం రమేష్, గిరిజన సంఘ నాయకుడు, కొత్తవలస -
రోజూ 500 క్యూసెక్కుల నీరు విడుదల
తాండవ కాలువలో నీటిని పరిశీలిస్తున్న జేఈ శ్యామ్కుమార్ నాతవరం : ఖరీఫ్ పంట సాగుకు రెండు కాలువల ద్వారా రోజు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తాండవ జేఈ శ్యామ్కుమార్ చెప్పారు. ఆయన బుధవారం రెండు జిల్లాల సరిహద్దులో శివారు ఆయకట్టు భూములకు ప్రవహిస్తున్న తాండవ ఎడమ కాలువ నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజర్వాయరులో నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 375.3 అడుగులు ఉందన్నారు. తాండవ ప్రాజెక్టు ప్రమాదస్థాయి నీటిమట్టం 380 అడుగులు, డెడ్ స్టోరేజీ నీటి మట్టం 345 అడుగులుగా పరిగణిస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు తాండవ నుంచి ఆగస్టు 10న ఆయకట్టుకు నీరు విడుదల చేశామని గుర్తు చేశారు. వర్షాలు బాగా కురవడంతో నీటిని పంట కాలువలు ద్వారా విడుదల చేసినా ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గలేదన్నారు. నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులు నీరు పొదుపుగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు నాతవరం సెక్షన్ వర్కు ఇన్స్పెక్టరు అప్పారావు సిబ్బంది ఉన్నారు. -
దళిత రైతుల సమస్యపై స్పీకర్ స్పందించాలి
ప్లేట్లతో నిరసన తెలుపుతున్న బాధిత రైతులు, సీపీఎం నాయకులు నర్సీపట్నం: మాకవరపాలెం, జి.కోడూరు క్వారీ బాధితుల నిరసన కార్యక్రమం 50వ రోజూ కొనసాగింది. బుధవారం సీపీఎం నాయకులు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. బాధితులతో కలిసి ఆర్డీవో కార్యాలయం వద్ద ప్లేట్లతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని రోజుల తరబడి దళిత రైతులు నిరసన చేస్తున్నా స్పీకర్ అయ్యన్నపాత్రుడు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఇప్పటికై నా స్పీకర్ స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. ఆర్డీవో, మైనింగ్ అధికారులు బాధిత రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. క్వారీ నిర్వహణ వల్ల సాగు చేసుకుంటున్న జీడి మామిడి తోటలు నాశనమవుతున్నాయన్నారు. తక్షణమే అధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కారం చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు, బీఎస్పీ నాయకుడు బొట్టా నాగరాజు, రైతులు అప్పారావు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆటోలో...రక్తపు మడుగులో...
చోడవరం: వెంకన్నపాలెం–సబ్బవరం రోడ్డులో అడ్డూరు సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెనుగుపూడి నుంచి గాజువాక వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగంగా వెళుతూ ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ కురుచా భూషణం అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వివరాల్లోకి వెళితే... చీడికాడ మండలం జైతవరం గ్రామానికి చెందిన కురచా భూషణం, కురచా నాయుడు, కురచా వరాహమూర్తి, మతల వరాహమూర్తి, కురచా శంకర్ జీవనోపాధి రీత్యా గత కొంతకాలంగా గాజువాకలో నివాసం ఉంటున్నారు. దేవరాపల్లి మండలం తెనుగుపూడి గ్రామంలో తమ బంధువుల ఇంట్లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి భూషణం ఆటోలో వీరంతా మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వస్తుండగా వెంకన్నపాలెం–సబ్బవరం రోడ్డులో అడ్డూరుకు సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వీరు ప్రయాణిస్తున్న ఆటో నుజ్జునుజ్జయింది. ఆటో డ్రైవర్ భూషణం అక్కడికక్కడే మృతి చెందగా మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యారు. వీరిలో కురచా శంకర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్కు తీసుకువెళ్లారు. మృతుడు భూషణానికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్షతగాత్రుల్లో కురచానాయుడు విశాఖ డెయిరీలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తుండగా మిగతా వారు ఎస్ఆర్ఎంటీలో పనిచేస్తున్నారు. వీరి తల్లిదండ్రులు స్వగ్రామమైన జైతవరంలో ఉంటుండగా భార్యా పిల్లలతో కలిసి వీరంతా గాజువాకలో నివాసం ఉంటున్నారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే జైతవరం గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్టు సీఐ అప్పలరాజు చెప్పారు.గంటపాటు రోడ్డుపైనే రక్తపు మడుగులో క్షతగాత్రులు108 అంబులెన్స్ రాకపోవడంతో సుమారు గంటపాటు క్షతగాత్రులంతా రక్తపు మడుగులోనే ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడారు. బస్సు ఢీకొనడంతో ఆటో ముందుభాగం పూర్తిగా ధ్వంసమై ఆటోలో కూర్చొని గాయాలపాలైన వారంతా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అటుగా వెళుతున్న వారంతా సహాయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ తీవ్ర రక్తస్రావంతో క్షతగాత్రులంతా ఉండటం వల్ల సాధ్యం కాలేదు. దీంతో తీవ్ర రోదనల మధ్య క్షతగాత్రులంతా రక్తపు మడుగులోనే గంటపాటు ఉండిపోయారు. వైద్యం ఆలస్యం కావడం వల్లే తలకు బలమైన గాయమై ఎక్కువ రక్తం పోయిన కురచా శంకర్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని అక్కడి వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.సకాలంలో స్పందించిన చోడవరం పోలీసులుఫోన్ చేసి గంట అయినా 108 అంబులెన్స్ రాకపోవడంతో కొందరు చోడవరం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలరాజుకు ఫోన్ చేశారు. ఆయన వెంటనే స్పందించి హుటాహుటిన జీపులో ఎస్ఐతోపాటు సిబ్బందిని ప్రమాద స్థలానికి పంపారు. వారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.అందుబాటులో లేని 108 అంబులెన్స్ ఒకప్పుడు ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకునే 108 అంబులెన్సులు ఇప్పుడు గంటలు గడిచినా రావడం లేదు. దీంతో సకాలంలో వైద్యం అందక అనేకమంది క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారు. ఇదే పరిస్థితి అడ్డూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు ఎదురైంది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టి గంటసేపయినా ఒక్క 108 అంబులెన్స్ కూడా ప్రమాదస్థలానికి రాలేదు. అక్కడ ఉన్న వారంతా ఎవరికి వారు 108 కాల్సెంటర్కు ఫోన్ చేసి ప్రమాద విషయం చెప్పినా అంబులెన్స్ మాత్రం రాలేదు. గ్రామీణ జిల్లాలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, సబ్బవరం ప్రాంతాల్లో ఉన్న 108 అంబులెన్సులన్నీ విశాఖపట్నం రిఫరల్ కేసులు తీసుకెళ్తున్నాయని, అందుకే కొంత ఆలస్యమవుతుందని కాల్సెంటర్ నుంచి సమాధానం రావడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు
నక్కపల్లి: ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ నక్కపల్లికి చెందిన వీరవెంకట రాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఖాళీ ఆటోలతో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ పథకం తమ ఉపాధిని దెబ్బ తీసిందని, బేరాలు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వారు ఆందోళన బాట పట్టారు. నక్కపల్లి జాతీయ రహదారిపై వారపు సంత నుంచి వెదుళ్లపాలం జంక్షన్, అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఖాళీ ఆటోలతో ర్యాలీ చేశారు. ఆటోవాలాల ఆందోళనకు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటోలకు బేరాలకు లేక నక్కపల్లి ఉపమాక రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, వారపు సంత, రాజయ్యపేట ఆటో స్టాండ్ల వద్ద రోజంతా ఖాళీగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ డ్రైవర్లు వాపోయారు. ఆటోలపై ఆధారపడ్డ మెకానిక్లు, సర్వీసింగ్ చేసేవారు, మొబైల్ రంగంలో పనిచేసేవారు సైతం ఉపాధి కోల్పోయారన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఆటోలు కొనుగోలు చేసిన వారు ఉచిత బస్సు కారణంగా ప్రైవేటు ఫైనాన్స్ వారి వద్ద తెచ్చిన అప్పులు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ‘వాహనమిత్ర’ పథకం కింద ప్రతి ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకపోగా ఉన్న ఉపాధిని దెబ్బ తీసిందన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు బేరాలు లేక కుటుంబ జీవనానికి సైతం అల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని, కాని పక్షంలో ప్రతి నెలా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఏటా ఆటో డ్రైవర్లకు రూ.30 వేల చొప్పున చెల్లించాలన్నారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కొద్దిసేపు అక్కడ ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు. వైస్ ఎంపీపీ వీసం నానాజీ, సీతంపాలెం ఎంపీటీసీ గొర్ల గోవిందు, ఆటో యూనియన్ నాయకులు శీరం నూకరాజు, దుర్గారావు, రాజు, తాతబాబు, కృష్ణ, నాయుడు పాల్గొన్నారు. -
ఈ రోడ్డుపై ప్రయాణం ఎలా మహాప్రభో?
రావికమతం: చినపాచిలి నుంచి టి.అర్జాపురం వర కు బీఎన్ రోడ్డు పనులు పూర్తి చేయాలని బురదలో కూర్చొని గిరిజనులు బుధవారం నిరసన తెలిపారు. కె.కొట్నాబిల్లి, గదపపాలెం, రామన్నదొరపాలెం, డోలవానిపాలెం, ఎర్రబంద గ్రామాల వారు ఏ అవసరం వచ్చినా ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలి. టి.అర్జాపురం నుంచి మాడుగుల వెళ్లే ప్రజలు కూడా దగ్గరగా ఉంటుందని ఈ రోడ్డునే ఆశ్రయిస్తారు. వైఎస్సార్ సీపీ ప్ర భుత్వం 2023 అక్టోబర్ నెలలో హై ఇంపాక్ట్ రోడ్డు నిధులు మంజూరు చేసింది. రూ.6.98 కోట్లతో 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు 2024 జనవరిలో పనులు మొదలుపట్టారు. తరువాత ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్డు పనులు కొనసాగలేదు. కాంట్రాక్టర్ను ప్రశ్నించగా.. బిల్లులు అందలేదని, అందువల్లనే పనులు నిలిపివేసినట్లు తెలిపారని గిరిజనులు పేర్కొన్నారు. రోడ్డు పనులు తక్షణమే చేయాలని, లేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు పాడి బెన్నయ్య, ఎస్.వలసయ్య డిమాండ్ చేశారు. -
నేటి నుంచి ఉపాధ్యాయుల నిరసన వారం
బుచ్చెయ్యపేట/ఎస్.రాయవరం: ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గురువారం నుంచి నిరసన వారం చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ధర్మారావు, దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం వీరు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. గద్దె నెక్కి 15 నెలలైనా పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు వారం రోజులపాటు రోజుకొక రీతిలో నిరసన తెలుపుతామన్నారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలను తక్షణం విడుదల చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని,1 2వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఇతర పనులు అప్పగించకుండా ఉపాధ్యాయులను బోధనకే వినియోగించాలని, 30 శాతం ఐఆర్ ఇవ్వడంలో ప్రభుత్వం కప్పదాటు వైఖరి మానుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వారం చేపడతున్నామన్నారు. 11న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు, 12న మండల కేంద్రాల్లో నిరసన, 13, 14 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేత, 15న పాత తాలుకా కేంద్రాల వద్ద నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన, 17న ముఖ్యమంత్రి, సీఎస్లకు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా వినతులు పంపడం చేపడుతున్నామన్నారు. -
మహా సముద్రాలు సంపదకు నిలయాలు
పాయకరావుపేట: మహా సముద్రాలు సంపదకు నిలయాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ డాక్టరు గిడుగు రామదాస్ తెలిపారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాలలో డిపార్టుమెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో సముద్ర సాంకేతిక పరిజ్ఞానంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామదాస్ హాజరై మాట్లాడుతూ మహా సముద్రాలను కాపాడుకోవాలన్నారు. సముద్రాల నుంచి వచ్చిన అపరిమితమైన వనరులు, వాటిని పొందేందుకు, అధ్యయనం చేసేందుకు ఉపయోగించే పరికరాలు, వాటి సాంకేతికతను వివరించారు. ఇటీవల సముద్రయాన్ అభియాన్ ద్వారా మత్స్య 6000 అనే జలాంతర్గామిని రూపొందించి మానవులను ఆరు వేల అడుగుల లోతుకు పంపగలిగామన్నారు. ఈ విజయంతో భారతదేశం ప్రపంచంలో ఆరో దేశంగా అవతరించిందన్నారు. ఇది దేశానికి గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రిన్సిపాల్ డాక్టరు రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై కూటమి దెబ్బ
అనకాపల్లి/తుమ్మపాల: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా జీవనోపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల గోవింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓలా, ఊబర్, రాపిడో, తదితర ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ప్రభుత్వ యాప్తో సర్వీసులు చేపట్టాలని కోరారు. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.25వేలు అందించాలన్నారు. ఇన్సూరెన్స్తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. అధిక జరిమానాలు విధించే జీవో నంబర్లు 21, 31లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి వేల్పువీధి జంక్షన్, పెరుగుబజార్ జంక్షన్, రింగ్ రోడ్డు మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకూ ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు కోన లక్ష్మణ, జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మార్కండేయులు, సహాయ కార్యదర్శి సూరిశెట్టి బాపునాయుడు, నాయకులు కె.నాగరాజు, అంజి, కోరిబిల్లి రామప్పారావు, వెంకటేష్ పాల్గొన్నారు. ● పట్టణంలో పలు ఆటో యూనియన్ సంఘాలు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.వి.శ్రీనివాసరావు, రుత్తల శంకరరావు మాట్లాడుతూ ఈ నెల 18న విజయవాడలో తలపెట్టిన ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు గణపతి, శంకర్, ఎస్.కె.సుభాని, శ్రీనివాసరావు, కాళీ, రమణ, తదితరులు పాల్గొన్నారు. -
క్వారీ బాంబు పేలుళ్ల బాధితులకు భరోసా
రోలుగుంట: మండలంలో రాజన్నపేటలో క్వారీలో బ్లాస్టింగు వల్ల దెబ్బతిన్న గృహాలను, రహదారులను తహసీల్దార్ సీహెచ్ నాగమ్మ మంగళవారం పరిశీలించారు. రెండు మాసాల క్రితం శరభవరం, రాజన్నపేట సమీపంలో క్వారీలో బాంబు పేలుళ్లు చేపట్టారు. దాంతో రాజన్నపేటలో పలు గృహాలు దెబ్బతిన్నాయి. రోడ్లకు పగుళ్లు ఏర్పడి నష్టం వాటిల్లింది. ఈ సమస్యను బాధితులు మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో రాజన్నపేటలో ఈ నెల 7న బాధితులు సీపీఎం ఆధ్వర్యంలో అధికారుల తీరుకు నిరసన చేపట్టారు. దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆర్డీవో వి.వి. రమణ స్పందించి గ్రామానికి వెళ్లి సమస్య తెలుసుకోవాలని తహసీల్దార్ నాగమ్మను ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఆర్ఐ రామ్మూర్తితో రాజన్నపేటలో పరిశీలించారు. ఆర్డీవోకి నివేదికలు అందజేస్తానని గ్రామస్తులకు తెలియజేశారు. -
అన్నదాతల నినాదాలతో ప్రతిధ్వనించిన నర్సీపట్నం
నర్సీపట్నం: రైతులకు ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆందోళనను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ పార్టీ నాయకులను హౌస్ అరెస్టులు చేయించింది. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, స్పెషల్పార్టీ పోలీసులు మోహరించారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులు వివిధ మార్గాల్లో ఆందోళన కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా మున్సిపల్ స్టేడియంలో గాంధీ విగ్రహం, అబీద్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే గణేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు అడ్డుకోవడం భావ్యం కాదని గణేష్ పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు వెనక్కు తగ్గారు. ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆర్డీవో లేకపోవడంతో కార్యాలయ ఏవో సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. అయ్యన్నపాత్రుడికి తెలిసిందల్లా దోపిడీలు, దౌర్జన్యాలే.. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతుండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, బాధ్యత గుర్తు చేసేందుకు తాము శాంతియుతంగా నిరసన చేపడితే భగ్నం చేసేందుకు ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసిందన్నారు. వ్యవసాయం గురించి తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు వ్యవసాయం గురించి అయ్యన్నపాత్రుడికి ఏమి తెలుసునని గణేష్ మండిపడ్డారు. ఆయనకు తెలిసిందల్లా దోపిడీలు, దౌర్జన్యాలేనన్నారు. లేటరైట్ ద్వారా స్పీకర్ రోజుకు రూ.3 కోట్లు వెనకేసుకుంటున్నారన్నారు. రోలుగుంట క్వారీల ద్వారా నెలకు రూ.50 లక్షలు, జి.కోడూరు క్వారీ ద్వారా కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చిన విషయం తెలియలేదంటే.. జగనన్న పెట్టిన రైతు భరోసా కేంద్రాలు అయ్యన్నపాత్రుడి గుండెల్లో ఎంతగా నాటుకుపోయాయో అర్థమవుతోందన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని స్పీకర్ అనుకుంటే సరిపోదని, గ్రామాల్లోకి వెళితే ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయన్నారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలో 4015 టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 1500 టన్నులు సరఫరా చేశామని అధికారులే చెబుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, యూత్ వింగ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్.వరుణ్, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, పార్టీ నర్సీపట్నం మండల అధ్యక్షుడు శానపతి వెంకటరత్నం, గొలుగొండ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, కౌన్సిలర్లు మాకిరెడ్డి బుల్లిదొర, సిరసపల్లి నాని, బేతిరెడ్డి రత్నం, వీరమాచినేని జగదీశ్వరి, కోఆప్షన్ సభ్యులు షేక్ రోజా, పార్టీ నాయకులు పెట్ల భద్రాచలం, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పోలీసు శాఖకు కొత్త అతిథి ‘రియో’
అనకాపల్లి: జిల్లాలో పోలీస్ శాఖకు కొత్త అతిథి వచ్చింది. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ 6వ బెటాలియన్లో 10 నెలల పాటు శిక్షణ పొందిన జాగిలం ‘రియో’మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సందడి చేసింది. ఈ జాగిలాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. బెల్జియం మలనాయిస్ జాతికి చెందిన ఈ ఆడ జాగిలం ట్రాకింగ్, పేలుడు పదార్థాలను గుర్తించడంలో శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించే జాగిలాల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 7 జాగిలాలు ఉండగా.. కొత్తగా చేరిన రియోతో వీటికి సంఖ్య మొత్తం ఎనిమిదికి చేరిందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ రిజర్వ్డ్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, సీఐ బి.రామకృష్ణ, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి అడ్డాల ఆదినారాయణ పాల్గొన్నారు. -
విశ్రాంత హోంగార్డుకు రూ.4.04 లక్షల చెక్కు
అనకాపల్లి: హోంగార్డుల విధులు పోలీస్శాఖలో అంతర్భాగమేనని, కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో హోంగార్డుగా విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందిన సీంద్రి కోమలకు రూ.4,04,890ల చెక్కును మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రిటైరైన లేదా మరణించిన హోంగార్డులకు రెండు జిల్లాల హోంగార్డులు ఒకరోజు వేతనం స్వచ్ఛందంగా అందజేస్తున్నారని చెప్పారు. సీంద్రి కోమల విధులను నిబద్ధతతో, విశ్వాసపాత్రంగా నిర్వర్తించారని, ఆమె సేవలు ప్రశంసనీయమన్నారు. ఎస్పీ కార్యాలయం పరిపాలన అధికారి సీహెచ్.తిలక్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా 5కె రెడ్ రన్
అనకాపల్లి టౌన్: పట్టణంలో ఇంటర్నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్లో భాగంగా జిల్లా స్థాయి మారథాన్ 5కె రెడ్ రన్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్ కృష్ణారావు ప్రారంభించారు. పూడిమడక రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ రన్లో జిల్లా వైద్య విద్యా అధికారి విభాగం సహకారంతో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ప్రథమ, ద్వితీయ బహుమతులుగా పురుషుల్లో రామానాయుడుకు రూ.10 వేలు, వినోద్కు రూ.7 వేలు, సీ్త్రలలో వాణికి రూ.10 వేలు, దివ్యకు రూ.7వేలు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కే రామచందర్, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ స్పందన ప్రశాంతి, డీఎండీవో చిరంజీవి, ఐసీటీసీ కౌన్సిలర్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి స్కూల్ గేమ్స్కు ఎంపికలు
యలమంచిలి రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఎంపికలు(అండర్–19 బాల బాలికలకు) ఈ నెల 11 నుంచి 13 వరకు వయో విభాగాల వారీగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు జూనియర్ కళాశాలల గేమ్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వీఏ పుష్పలత తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే బాల బాలికలు 2007 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఓపెన్ స్కూల్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఎంపికలకు అనర్హులు. అర్హులైన విద్యార్థులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రం, విద్యార్థి పెన్ నెంబర్, వారు చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్ జారీ చేసిన స్టడీ సర్టిఫికెట్ తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 94408 85898, 99669 31556, 98854 73808, 99516 76965, 99850 65340 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు. -
● వైద్యురాలిపై వార్డు బాయ్, రోగి తల్లిపై వైద్యుడి వేధింపులు ● ఫిర్యాదు చేసినా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ● మహిళా కమిషన్ దృష్టికెళ్లినా ఫలితం శూన్యం ● కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకం?
కేజీహెచ్లో కీచకులుమహారాణిపేట (విశాఖ): కేజీహెచ్లో కీచకుల వ్యవ హారం కలకలం రేపుతోంది. రోగులు, వారి బంధువులనే కాకుండా, మహిళా వైద్యులను సైతం కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. వార్డు బాయ్ల నుంచి వైద్యుల వరకు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యురాలి పట్ల వార్డు బాయ్, చికిత్స కోసం వచ్చిన రోగి తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించడం దుమారం రేపుతోంది. ఈ ఘటనలపై బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. విశేషమేమిటంటే.. ఇటు కేజీహెచ్కు, అటు ఆంధ్రా మెడికల్ కాలేజీకి మహిళలే సారథ్యం వహిస్తున్న తరుణంలో.. ఇలాంటి ఘటనలు జరగడం, వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటనలు కేజీహెచ్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. వైద్యురాలిపై వార్డు బాయ్ అసభ్య ప్రవర్తన అనస్థీషియా విభాగానికి చెందిన ఒక వైద్యురాలు.. వారానికి రెండు రోజులు (మంగళ, శుక్రవారాలు) అధికారుల ఆదేశాల మేరకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా గత నెల 26న ఉదయం 11 గంటల సమయంలో ఆమె రోగులను చూస్తుండగా.. శంకరరావు అనే వార్డు బాయ్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒకసారి కాదు, రెండుసార్లు.. అందరి ముందు అలా ప్రవర్తించడంతో ఆ వైద్యురాలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, తమ విభాగాధిపతులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే రోజు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐకి కూడా ఫిర్యాదు చేశారు. రోగి తల్లికి వైద్యుడి వేధింపులు పరవాడ ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెను తీసుకుని కేజీహెచ్కు వచ్చారు. సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న కుమార్తె వద్ద సహాయంగా ఉంటున్న ఆ తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను రోగితో కాకుండా ఆమె తల్లితో అనుచితంగా మాట్లాడటంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందికి గురైంది. ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగదనే అనుమానంతో.. బాధితురాలు నేరుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కోరుతూ మహిళా కమిషన్.. కేజీహెచ్ సూపరింటెండెంట్కు గత నెల 20న ఒకసారి, ఈ నెల 4న మరోసారి లేఖలు పంపింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని కమిషన్ చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మోకాలిలో కిలోన్నర కణితి తొలగింపు
నక్కపల్లి: స్థానిక 50 పడకల ఏరియా ఆస్పత్రిలో మంగళవారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. మోకాలిలో కిలోన్నర కణితిని ఆర్ధోపెడిక్ వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఉద్దండపురం గ్రామానికి చెందిన తుమ్మల రాజారావు విపరీతమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. కాలు బరువుగా ఉండటంతో నడవలేని పరిస్థితి నెలకొంది. ఇతను వైద్యం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలో ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ రవికిరణ్ను కలిశాడు. వెంటనే ఎక్స్రే తీసి మోకాలిలో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చేర్చుకుని శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. తొలగించిన కణితి బరువు 1.50 కిలోలు ఉంటుందని డాక్టర్ తెలిపారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, రోగి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. బాధితుడు రాజారావు మాట్లాడుతూ ఎంతోకాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద నొప్పి కోసం మందులు వాడేవాడినన్నారు. నక్కపల్లిలో ఆర్ధోపెడిక్ సర్జన్ ఉన్న విషయం తెలుసుకుని ఇక్కడకు వస్తే ఆపరేషన్ చేశారన్నారు. ఇదే కణితిని ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి తొలగిస్తే వేలాది రూపాయలు ఖర్చవుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. తొలిసారిగా ఇటువంటి కణితిని తొలగించినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ రవికిరణ్ను సూపరింటెండెండ్ డాక్టర్ శిరీష, సహచర వైద్య సిబ్బంది అభినందించారు. నక్కపల్లి సీహెచ్సీలో అరుదైన శస్త్రచికిత్స -
రైతన్న కన్నెర్ర
పోలీసుల ఆంక్షల మధ్య హోరెత్తిన ‘అన్నదాత పోరు’ ● యూరియా కొరతపై కదం తొక్కిన వ్యవసాయదారులు ● ఎన్ని ఆటంకాలు కల్పించినా వైఎస్సార్సీపీ ఆందోళన సూపర్ సక్సెస్ ● అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసన ● అవసరమైనంత ఎరువులు అందించాలని అధికారులకు వినతి ప్రతి ఖరీఫ్ సీజన్కు ముందు వ్యవసాయ శాఖ ఎంత యూరియా అవసరమో అంచనా వేసుకుంటుంది. అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారుచేసుకొని అమలు చేస్తుంది. వరినాట్లు వేసే సరికి ఎరువులు, విత్తనాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం కారణంగా ఇవేవీ జరగలేదు. ముఖ్యమంత్రికి ముందుచూపు ఉండాలి. మా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం సకాలంలో అందించాం. మా హయాంలో తీసుకున్న చర్యల వల్ల గత ఏడాది ఇబ్బంది రాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎరువులు వాడితే పంట దిగుబడి రాదంటున్నారు. ఇక సీఎం చంద్రబాబు అయితే ఎరువులు ఇవ్వండని అడిగిన రైతులను జైల్లో వేసి, కేసులు నమోదు చేయాలంటూ భయపెడుతున్నారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి మారకుంటే వైఎస్సార్సీపీ మరింత ఉధృతంగా పోరాటం చేస్తుంది. –గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనకాపల్లిలో ఆర్డీవో కార్యాలయానికి భారీ సంఖ్యలో ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులుయూరియా కొరతపై అన్నదాత కన్నెర్ర జేశాడు. వ్యవసాయం దండగ అన్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన చెందాడు. తమ సమస్యలను పట్టించుకోనందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకే పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యం లో మంగళవారం నిర్వహించిన ‘అన్నదాత పోరు’లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా అదరలేదు.. బెదరలేదు. జిల్లాలోని అన్ని మండలాల్లో వేకువజాము నుంచే వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ముఖ్యమైన జిల్లా స్థాయి నాయకులను గృహ నిర్బంధం చేసి ‘అన్నదాత పోరు’ను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ కుటిల ప్రయత్నాలు చేసింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా అనకాపల్లి, నర్సీపట్నంలలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. వందలాదిమంది నినాదాలతో హోరెత్తించారు. కూటమి ప్రభుత్వం 15 నెలల పాలన రైతులకు శాపంగా మారింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో, పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో సాధారణ సాగులో 70 శాతమే పంట వేశారు. దానికే ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు రాజుగా ఉండేవాడు. విత్తనాలు, ఎరువులు ఇంటికే డోర్ డెలివరీ చేశావాళ్లం. కూటమి నాయకులు యూరియాను బ్లాక్లో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. –ఎమ్మెల్సీ వరుదు కల్యాణి సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి, నర్సీపట్నంలలో తలపెట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమం సందర్భంగా ఎమర్జెన్సీ వాతావరణం కనిపించింది. అనకాపల్లి రింగురోడ్డులో గల వైఎస్సార్సీపీ కార్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. అన్నదాత పోరు ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 10 నుంచి 20 మంది వరకే అనుమతిస్తామని, అంతకు మించితే అరెస్ట్ చేస్తామంటూ డీఎస్పీ శ్రావణి, అనకాపల్లి టౌన్ సీఐ విజయ్కుమార్ రైతులను, పార్టీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేశారు. ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదంటూ మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్కు డీఎస్పీ నోటీసు కూడా ఇచ్చారు. అయినా ఎక్కడా రైతులు భయపడలేదు. మమ్మల్ని అరెస్ట్ చేసుకున్నా.. మాపై కేసులు పెట్టుకున్నా ర్యాలీ చేసి తీరుతాం.. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామంటూ పాదయాత్రగా బయలుదేరారు. పోలీసులు చుట్టుముట్టినా ఎక్కడా బెదరలేదు.. జంకలేదు.. రైతులకు కొరత లేకుండా యూరియా ఇవ్వాలంటూ నినాదాలు చేసుకుంటూ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ రెండు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావు పేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల నుంచి రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో షేక్ ఆయిషాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, మలసాల భరత్కుమార్, అన్నంరెడ్డి అదీప్రాజ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, పార్టీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డేడ ప్రసాద్, దంతులూరి దిలీప్కుమార్, మలసాల కుమార్రాజా, పైలా శ్రీనివాసరావు, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీ రామరాజు, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జాజుల రమేష్, గవర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బొడ్డేడ శివ, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్, పరవాడ జెడ్పీటీసీ పీఎస్ రాజు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు హేమంత్కుమార్, నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు వడ్డాది అప్పలరాజు, సీనియర్ నాయకులు శరగడం చినఅప్పలనాయుడు, గండి రవికుమార్, బోకం రామునాయుడు, కె.ఎం నాయుడు, కోరకుండ రాఘవ, వేగి త్రినాథ్, తగరంపూడి నూకరత్నం, తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎన్ని టన్నుల యూరియా అవసరమో ప్రభుత్వానికి తెలియదా? రైతుకు అర ఎకరం ఉన్నా.. ఐదెకరాలున్నా ఒక యూరియా బస్తాయే ఇస్తున్నారు. అదెలా సరిపోతుంది. అధికారులు యూరియా కొరత లేదు, అడిగినంతా ఇస్తున్నామంటున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడాలని వారిని వేడుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నారు. పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా.. గతేడాదిలాగే అప్పుల ఊబిలో కూరుకుపోతామేమోనని ఆవేదన చెందుతున్నారు. –బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎంరాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతులు యూరియా కావాలంటూ కదం తొక్కారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసుల ద్వారా రైతుల గొంతు నొక్కే ప్రయత్నాలు చేశారు. ఎరువుల కొరత నివారించాలి. క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలి. యూరియా కొరత ఉన్నా.. అధికారులు మాత్రం లేదంటున్నారు. ప్రైవేట్ దుకాణాల్లో టీడీపీ నేతలు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో రైతులు ఈ ఏడాది కూడా దిగుబడి రాదేమోనని భయపడుతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలి. రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి. –కరణం ధర్మశ్రీ, వూజీ ప్రభుత్వ విప్ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి కూటమి పాలన... రైతులకు శాపం కూటమి పాలన... రైతులకు శాపం ఐదెకరాలున్నా ఒక బస్తాయేనా? ఐదెకరాలున్నా ఒక బస్తాయేనా? రైతుల గొంతునొక్కే ప్రయత్నం రైతుల గొంతునొక్కే ప్రయత్నం -
ఎక్కడికక్కడ అరెస్టులు.. ఆటంకాలు
నర్సీపట్నం: మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణల హౌస్ అరెస్ట్ సాక్షి, అనకాపల్లి: ఎమర్జెన్సీని తలపించేలా ‘అన్నదాత పోరు’ను అడ్డుకునేందుకు కూటమి సర్కారు కుటిల ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు మంగళవారం వేకువజాము నుంచే వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని గృహ నిర్బంధం చేశారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనకుండా వారిని కట్టడి చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో గృహ నిర్బంధం చేసిన వారిలో.. నక్కపల్లిలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, అడ్డురోడ్డులో పార్టీ నక్కపల్లి మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, చినదొడ్డిగల్లులో వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, కోటవురట్ల మండలం తంగేడులో మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, వైస్ ఎంపీపీ దత్తుడు సీతబాబు, జెడ్పీటీసీ సిద్దాబత్తుల ఉమాదేవి, పాముల వాకలో మండల పార్టీ అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు, పాయకరావుపేట మండలం పెంటకోటలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, నామవరంలో ఎంపీపీ ఈసరపు పార్వతి తాతారావు, జెడ్పీటీసీ లంక సూరిబాబు ఉన్నారు. అడ్డురోడ్డులో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులును ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్నానని, జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి వెళ్లక తప్పదని, పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించడంతో జోగులును మాత్రం విడిచిపెట్టారు. చోడవరం నియోజకవర్గం: పార్టీ బుచ్చెయ్యపేట మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు, జెడ్పీటీసీ దొండా రాంబాబు, వడ్డాది టౌన్ అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి జోగా కొండబాబు, రోలుగుంట జెడ్పీటీసీ పోతల లక్ష్మీ రమణమ్మ, లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు, రావికమతం మండల అధ్యక్షుడు ముక్కా మహలక్ష్మినాయుడు, ఎంపీపీ పైలా రాజు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తలారి ఆదిమూర్తిలను హౌస్ అరెస్ట్ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గం: నర్సీపట్నంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, నర్సీపట్నం ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, మాకవరపాలెంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, ఎంపీపీ సర్వేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు చిటికెల రమణ, నాతవరం జెడ్పీటీసీ అప్పలనర్స, మండల అధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ పైల సునీల్లను హౌస్ అరెస్ట్ చేశారు. మాడుగుల నియోజకవర్గం: కె.కోటపాడు ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల శివాజీరాజు, జేసీఎస్ కన్వీనర్, ఎంపీటీసీ ఏటుకూరి రాజేష్, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, మాడుగుల ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, వైస్ ఎంపీపీ పొలిమేర విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, దేవరాపల్లి ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడులను గృహ నిర్బంధం చేశారు. యలమంచిలి నియోజకవర్గం: ఎంపీపీ బోదెపు గోవింద్, జెడ్పీటీసీ సేనాపతి సంధ్యారాణి, ఆమె భర్త సేనాపతి రాము, అచ్యుతాపురం ఎంపీపీ కోన సంధ్య లచ్చన్నాయుడు, మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, జెడ్పీటీసీ లాలం రాములను హౌస్ అరెస్ట్ చేశారు. అనకాపల్లి నియోజకవర్గం: అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ సభ్యుడు దంతులూరి శ్రీధర్రాజు, మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబులను గృహ నిర్బంధం చేశారు. మాకవరపాలెం: హౌస్ అరెస్ట్లో ఉన్న రుత్తల యర్రాపాత్రుడు గొలుగొండ : నిర్బంధంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత -
బల్క్డ్రగ్ పార్క్ ఉద్యమానికి సహకరించండి
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, ఈ ప్రాంత మంతా కాలుష్య కాసారమవుతుందని మండలంలో రాజయ్యపేట, బోయపాడు గ్రామాలకు చెందిన మత్స్యకారులు కోడ లక్ష్మణ్, పిక్కి చిట్టిబాబు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వివరించారు. మంగళవారం వారు తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని కలిిసి బల్క్ డ్రగ్పార్క్ వల్ల కలిగే నష్టాలను, ఈ ప్రాంత మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలు గురించి వివరించారు. స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ను కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ఏర్పాటు చేస్తోందన్నారు. గత నెలలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మత్స్యకారులు బల్క్డ్రగ్పార్క్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. సభలో తమ అభిప్రాయాలు చెప్పకుండా పోలీసుల సాయంతో తమను సభ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్నారని జగన్మోహన్రెడ్డికి వివరించడం జరిగిందని, లక్ష్మణ్, చిట్టిబాబు తెలిపారు. కోస్టల్ కారిడార్ పేరుతో కెమికల్ ఫ్యాక్టరీలు, ఫిిషింగ్ హార్బర్లు, రిసార్ట్స్, టూరిజం పార్క్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అలాగే ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపులో ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలకు వైఎస్సార్సీపీ తరపున సంఘీభావం ప్రకటించి గంగపుత్రుల ప్రాణాలు కాపాడాలని జగన్మోహన్రెడ్డిని కోరడం జరిగిందన్నారు. తమ సమస్యలను పూర్తిగా విన్న జగన్ సానుకూలంగా స్పందించారని, మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. -
క్రిటికల్ సమస్యా.. డోంట్ కేర్
హెచ్డీయూ(6 బెడ్లు), డీయూ, అనస్థీషియా రూమ్, అటెండెంట్ వెయిటింగ్, ఐసీయూ (10 బెడ్లు), ఓటీలు– 2 నంబర్లు, స్టెరిలైజేషన్, ఎలక్ట్రికల్ రూమ్, ఈక్యూఎంటీ రూమ్, ఫ్రీ అండ్ పోస్ట్ ఓపీ– 5 బెడ్లు డీఆర్ డ్యూటీ, స్టాఫ్ నర్సులు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ఐఎస్వో రూమ్ (2 పడకలు), డైనింగ్ మెల్ –2 నంబర్లు, డీయూ, ఏఎస్వో వార్డు (6 పడకలు), క్లినికల్ టెస్ట్, ఐఎస్వో వార్డు (15 పడకలు), కౌన్సెలింగ్ రూమ్లు–2 నోస్, డౌఫింగ్, ఐసీయూ–ఐఎస్వో స్టోర్, డీఆర్ డ్యూటీ, స్టాఫ్ రూమ్, ఐఎస్వో వార్డు –2 నంబర్లు (ఒక్కొక్కటి 2 బెడ్లు), మరుగుదొడ్లు ఉంటాయి. డిలేసిస్ (4 పడకలు), డాక్టర్ రూమ్, డోనింగ్, డీయూ ఎంసీహెచ్( 2 పడకలు), ఎల్డీఆర్ (ఒక్కొక్కరికి 1 బెడ్), డోనింగ్ ఫిమేల్, ఆర్వో డయాలైజర్, అల్ట్రా సౌండ్, ప్లాస్టర్ రూమ్, పీఓసీ ల్యాబ్, ఎలక్ట్రికల్ రూమ్, డ్యూటీ డాక్టర్/ఎగ్జామినేషన్ రూమ్, ఎమర్జెన్సీ వార్డు (6 పడకలు), మైనర్ ప్రొసీజర్, నర్సుల రూమ్, ఇంజెక్షన్ డ్రెస్సింగ్ రూమ్, మరుగుదొడ్లు ఉంటాయి. రెండో అంతస్తుగ్రౌండ్ ఫ్లోర్మొదటి అంతస్తు అనకాపల్లి: పట్టణంలో క్రిటికల్ కేర్ బ్లాక్ త్వరలో అందుబాటులోకి రానుంది. జిల్లాలో అత్యధిక రసాయన పరిశ్రమలు ఉండటంతో ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలందక మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కానున్నాయి. మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలూ వైద్య సేవలందించనున్నారు. జిల్లాలో అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి, రాంబిల్లి మండలాల్లో ఎక్కువగా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల్లో పలువురు మృతి చెందుతున్నారు. గాయపడిన మరికొందరిని విశాఖ సిటీలో కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించే క్రమంలో కొంతమంది మార్గమధ్యంలో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో క్రిటికల్ కేర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్టయితే గాయపడిన వారికి సకాలంలో వైద్య సేవలు అందించినట్టయితే ప్రాణాలు కాపాడవచ్చు. ఈ విషయమై 2023 డిసెంబర్లో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంపీ బీవీ సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధికారులు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరగా, క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి రూ.22.5 కోట్లు విడుదల చేశారు. 2024 ఫిబ్రవరిలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదురుగా ప్రభుత్వ స్థలంలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక పార్కింగ్ స్థలం... క్రిటికల్ కేర్ బ్లాక్కు ఎదురుగా వాహనాలు నిలుపుదల చేసేందుకు ఎక్కువగా పార్కింగ్ స్థలం ఉంది. రోగితోపాటు రోగి బంధువు ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు పూర్తవుతాయి రెండు మాసాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రానుంది. భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ఈ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తాం. వెంటనే ఏడాదిపాటు కేంద్ర ఆరోగ్యశాఖ పర్యవేక్షణ తర్వాత రాష్ట్ర ఆరోగ్యశాఖకు అప్పగిస్తుంది. – కృష్ణారావు, సూపరింటెండెంట్, ఎన్టీఆర్ ఆస్పత్రి, అనకాపల్లిఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు ఈ నెల 30వ తేదీలోపు పూర్తవుతాయి. ఈ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసిన వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్యం శాఖ 50 పడకలకు కావలసిన వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించినట్లయితే కేంద్ర ప్రభుత్వం రోగులకు ఉపయోగించే అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తుంది. ఏడాది పాటు వైద్యులకు, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లిస్తుంది. రెండో ఏడాది నుంచి పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి వస్తుంది. చివరి దశలో 50 పడకల ఆస్పత్రి పనులు క్రిటికల్ కేర్ బ్లాక్లో 24 గంటలూ వైద్యం... క్రిటికల్ కేర్ ఆస్పత్రిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదురుగా నిర్మిస్తున్నారు. ఇక్కడ మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్(ఆస్పత్రి)ను ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి అనుసంధానం చేస్తారు. క్రిటికల్ కేర్ బ్లాక్లో, డయాలసిస్ రోగులకు ప్రత్యేకంగా కొన్ని బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. గుండెపోటు, శ్వాసకోశ వైఫల్యం, తీవ్రమైన గాయాలైన వారికి ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. 24 గంటలూ నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. -
జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
మునగపాక: మండలంలోని పాటిపల్లి మోడల్ స్కూల్కు చెందిన ఇంటర్ విద్యార్థిని వి.వినీల జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై ంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వినీల తొలి నుంచి బాల్ బ్యాడ్మింటన్లో రాణిస్తూ ఉండేది. అంతర్ జిల్లాల పోటీ ల్లో పాల్గొన్న ఆమె అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పతకం సాధించి మరింత ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి తెలిపారు. వినీలతో పాటు ఆమె కృషికి కారణమైన పీటీ మహలక్ష్మిని ఎస్ఎంసీ చైర్మన్ జోగినాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఉపాధి కూలీల వేదన.. ఖాళీ కంచాలతో నిరసన
ఆజయపురంలో ఖాళీ కంచాలతో ధర్నా చేస్తున్న గిరిజన ఉపాధి కూలీలు రావికమతం: మూడు మాసాల నుంచి ఉపాధి మామీ కూలీ చెల్లింపులు చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చీమలపాడు పంచాయతీ పరిధిలో గల గిరిజన ఉపాధి కూలీలు సోమవారం ఖాళీ కంచాలతో ధర్నా చేశారు. నేరేడుబంద, ఆజయపురం, జీలుగలోవ గ్రామాల్లో ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు పనిచేసిన ఉపాధి కూలీలకు నగదు తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం 5 వ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఖాలీ కంచాలతో భిక్షాటన చేసి, ధర్నా నిర్వహించారు. ఉపాధి హమీ చట్టం ప్రకారం పనిచేసిన ప్రతి ఉపాధి కూలీకి పేస్లిప్లు ఇచ్చి, రెండు పూటలు పని చేయాలనే నిబంధనలు రద్దు చేయాలన్నారు. ప్రతి 15 రోజులకు ఉపాధి బకాయిలు ఇవ్వకపోవడంతో ఉపాధివేతన దారులు ఇక్కట్లు పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె. గోవిందరావు పేర్కొన్నారు. ఈ ధర్నాలో గిరిజన సంఘం నాయకులు వంతల చిరంజీవి, పాంగి సూరిబాబు, పాంగి శ్రీరామ్ పాల్గొన్నారు. -
‘అన్నదాత పోరు’కు తరలిరండి..
అనకాపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మన రాష్ట్రం వ్యవసాయంపై అధారపడి ఉందని, ఖరీఫ్ సీజన్లో రైతులకు సకాలంలో యూరియా అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు యూరియా నిల్వ చేయడం జరిగిందని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో అన్న యూరియాను రైతులకు సకాలంలో అందజేయడం వల్ల గత ఏడాది యూరియా సమస్య లేకుండా పోయిందన్నారు. ఈ ఏడాది సీఎం చంద్రబాబు ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని రైతులకు సకాలంలో యూరియాను అందజేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల పక్షాన వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాలు వద్ద అన్నదాత పోరు బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, రైతులు హాజరు కావాలని ఆయన పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, మండలపార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ -
యూరియా..ఏదయ్యా..!
ఖరీఫ్ సీజన్ ఆరంభమై మూడు నెలలైనా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉండడం లేదు. వరి నాట్లు వేసి నెల రోజులు దాటినా నేటికీ యూరియా అందక పడిగాపులు కాస్తున్నారు. పగలనక, రాత్రనక యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. వచ్చిన కొద్దిపాటి యూరియాను రైతులకు ఒక్కో కట్ట మాత్రం అందిస్తున్నారు. మరో పక్క యూరియా రైతులందరికీ అందుబాటులో ఉందంటూ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత ఎరువుల కోసం రోడ్డెక్కుతున్నాడు. రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. ● ఎరువులను సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలం ● పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు ● జిల్లాలో 32,321 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ● అందుబాటులో 12 వేల టన్నులు ● ఎరువుల సరఫరాలో కూటమి నేతల చేతివాటం ● రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ పోరుబాట ● నేడు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన -
అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
ఉపాధి కోసం వినతి డిగ్రీ చదువుకున్న తనకు ఉపాధి కల్పించాలని కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు దాలిబోయిన తరుణ్కుమార్ కలెక్టర్ను వేడుకున్నారు. పుట్టుకతో చర్మవ్యాధి ఉన్నప్పటికి సొంత కాళ్లపై నిలబడాలనే ఆశతో కూలీపనులు చేసుకుంటూ తల్లిదండ్రులు తనను డిగ్రీ చదివించారని, ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన చెప్పారు. దివ్యాంగుల కోటా లో ఉద్యోగం ఇప్పించాలని కోరారు. తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, ప్రత్యేక ఉప కలెక్టర్(ఏపీఐఐసీ) అనిత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి తీసుకున్న అర్జీల గురించి వెంటనే సంబంధిత అదికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారి అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షించి, నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 232 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో 47 అర్జీల స్వీకరణ అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 47 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్టీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు–30, కుటుంబ కలహాలు–3, మోసపూర్తి హామీ–1, వివిధ విభాగాలకు చెందినవి–13 అర్జీలు వచ్చాయని చెప్పారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.ఇల్లు ఆక్రమణపై ఫిర్యాదు తన ఇంటిని ఆక్రమించి తప్పుడు దస్తావేజులు సృష్టించిన డి.శ్యామలపై పోర్జరీ కేసు నమోదు చేయాలని మునగపాక మండలం టి.సిరసపల్లికి చెందిన పొట్ల వీరునాయుడు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పనులు లేక కొన్నేళ్ల క్రితం కుటుంబంతో వలస పోయానని, ప్రస్తుతం కిడ్నీ సమస్యతో పనులు చేయలేక గ్రామంలో సొంతింటికి వస్తే సోదరి సముద్రాలు, ఆమె కుమార్తె శ్యామల అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తప్పుడు దస్తావేజులు చూపిస్తూ ఇబ్బందులు పెడుతున్నా రని వాపోయారు. రిజిస్ట్రార్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా.. అవి తప్పుడు దస్తావేజులని తెలిసిందని, వాటిని రద్దు చేసి పోర్జరీ కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి క్షేత్ర స్థాయి పర్యటనతో సమస్యల పరిష్కారం అధికారులకు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం పీజీఆర్ఎస్కు 232 అర్జీలు -
నేత్రదాన ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీలు
తుమ్మపాల: నేత్రదాన అవశ్యకత, నేత్రదాన ప్రాముఖ్యతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ విజయ కృష్ణన్, జేసి.జాహ్నవి ప్రశంస పత్రాలు అందించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో 40వ నేత్రదాన పక్షోత్సవాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థ్ధులను సోమవారం కలెక్టరేట్లోని ఆమె చాంబర్లో అభినందించారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ టి.డేవిడ్ కుమార్, బోడ మోహన్రావు, విద్యార్థులు పాల్గొన్నారు.విజేతలకు ప్రశంసాపత్రాలు -
ప్రభుత్వ వైద్య కళాశాలలపై ప్రై‘వేటు’ సిగ్గుచేటు
అనకాపల్లి: వైఎస్సార్సీపీ పాలనలో పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే, కూటమి పాలనలో మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.బాబ్జి అన్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీనిర్వహించి, నెహ్రూచౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే... అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి 14 వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారని ఆయన గుర్తుచేశారు. రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలలను ప్రారంభించారన్నారు. జగన్ ప్రభుత్వంలో జీవో నంబర్లు 107, 108 ఉత్తర్వుల్ని తీసుకువచ్చి నూతన మెడికల్ కళాశాలల్లో 50 శాతం ఎంబీబీఎస్ సీట్లను ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాము అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 107, 108లు 100 రోజుల్లోనే రద్దు చేసి వైద్య కళాశాలలను నూరుశాతం ప్రభుత్వ కళాశాలలుగా కొనసాగిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి వైద్య కళాశాలలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల నష్టపోయేది విద్యార్థులు మాత్రమే కాదని, పేద వర్గాల ప్రజలు కూడా ఉచిత వైద్యానికి దూరమవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వి.రాజు, ఏఐఎస్ఎఫ్ నియోజవర్గ నాయకులు లతా, సీత, నవ్య పాల్గొన్నారు.ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ -
ఒకే రోజు అల్లుడు, మామ మృతి
మునగపాక: ఓ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. ఒకే ఇంట్లో ఒకే రోజు అల్లుడు, మామ మృతితో తీవ్ర విషాదం నింపింది. సోమవారం అనారోగ్యంతో చనిపోయిన తన మామ అంత్యక్రియలకు అవసరమైన కట్టెలు తెచ్చేందుకు పొలానికి వెళ్లిన అల్లుడు విద్యుత్ షాక్కు గురై మృత్యువాతకు గురైన ఘటన నారాయుడుపాలెంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నారాయుడుపాలెం గ్రామానికి చెందిన కొయ్య మీసాల అప్పారావు(64) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు అతని అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా అప్పారావు అల్లుడు ప్రసాదుల సన్యాసిరావు(54) అవసరమైన కట్టెలను తెచ్చేందుకు మధ్యాహ్నం స్థానికులతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు ఆయన కాలికి తగలడంతో సన్యాసిరావు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మునగపాక ఎస్ఐ పి.ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఏఈ శరగడం జగదీష్.. నారాయుడుపాలెంలో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. -
జిల్లాలో పరిస్థితి ఇలా..
క్లస్టర్ విధానం రద్దు చేయాలి కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన క్లస్టర్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాశీపురం రైతు సేవా కేంద్రాన్ని సుమారు 4 కిలోమీటర్ల దూరంలో రైవాడలో కలపడం దారుణం. దీంతో కాశీపురం పరిధిలోని రైతులంతా ఎరువులు కోసం రైవాడ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలి. – దాసరి గోపి, రైతు, కాశీపురం. పంటల విస్తీర్ణం ఆధారంగా... ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్రికల్చర్, హార్టికల్చర్ పంటల విస్తీర్ణం ఆధారంగా రైతు సేవా కేంద్రాలను క్లస్టర్లుగా విభజించాం. మండలంలో 20 రైతు సేవా కేంద్రాలను 14 క్లస్టర్లుగా మార్పు చేశాం. అక్కడ సిబ్బందిని సర్దుబాటు చేశాం. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందించేలా చర్యలు చేపడుతున్నాం. ముషిడిపల్లి, కాశీపురం తదితర గ్రామాల రైతులకు క్లస్టర్లలో పంపిణీ చేయడంతో కాస్తా ఇబ్బంది పడడం వాస్తవమే. –ఎల్వై. కాంతమ్మ, మండల వ్యవసాయ అధికారి, దేవరాపల్లి ఒక్క బస్తా అయినా ఇవ్వలేదు.. దమ్ములో వేయడానికి వరి నాట్లు వేసి నెల రోజులు దాటినా యారియ అందుబాటులో లేదు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల్లో, ప్రైవేటు షాపుల్లో ఎప్పుడు వెళ్లినా యూరియా దొరికేది. ఇపుడు ప్రభుత్వ, ప్రైవేటు షాపుల్లో యూరియా దొరక్కపోతే మేం ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలి. – బండి రాజారావు, లోపూడి రైతు, బుచ్చెయ్యపేట మండలం సాక్షి, అనకాపల్లి: రైతులకు ఈ ఖరీఫ్ సీజన్లో యూరియాను సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ముందస్తుగా ఎన్ని టన్నుల యూరియా అవసర ముంటుందో ప్రభుత్వానికి తెలిసినప్పటికీ రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమకూర్చిన ఎరువులు సమృద్ధిగా ఉండడంతో గతేడాది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినా.. రైతులకు అంత కొరత రాలేదు. కానీ ఈ ఖరీఫ్ సీజన్లో మాత్రం ఇటు పెట్టుబడి పెట్టలేక..అటు యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడతున్నారు. వరినాట్లు ప్రాథమిక దశలోనే యూరియా వేస్తే పంట ఏపుగా ఎదుగుతుంది. ఇప్పుడా యూరియానే బంగారమైపోయింది. యూరియా కోసం రైతుసేవాకేంద్రాల్లో, పీఏసీఎల్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్నా బస్తా యూరియా సంపాదించడం కష్టంగా మారింది. ఎరువు లేక పంటల్లో ఎదుగుదల లోపిస్తోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆ ఆవేదన రైతు ఒకటి తీసుకునే దగ్గర రెండు తీసుకుంటున్న పరిస్థితులున్నాయి. అది కూడా ఎక్కడైనా స్టాక్ వచ్చిందంటే తొలుత కూటమి నేతలు సగంకు పైగా దారి మళ్లిస్తున్నారు. మిగిలిన వాటిని అరకొరగా రైతులకు ఇస్తున్నారు. రైతు వేసే వరి నాట్లు ఆధారంగా రెండు మూడు కావాల్సిన వారికి కూడా ఒకటే యూరియా బస్తా ఇవ్వడంతో చాలా చోట్ల ఆగ్రహంగా మారి అన్నదాతలను రోడ్డెక్కేలా చేస్తోంది. గత నెల రోజులుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది, చాలాచోట్ల రైతులు.. ఎరువుల కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గుంపులు గుంపులుగా రహదారుల మీదకొచ్చి రాస్తారోకోలు చేశారు. క్యూలైన్లలో తోపులాటలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల సిబ్బందిపై రైతులు తిరగబడుతున్నారు. నానో యూరియాను అంటగట్టే యత్నం.. రైతులు వినియోగించే ఎరువులు, యూరియాపై కూటమి సర్కార్ దొంగాట ఆడుతోంది. సరిపడా యూరియా, ఎరువులు నిల్వలు ఉన్నాయంటూ అధికారులు పేపర్ లెక్కలే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధం లేకుండా పోయింది. పంటలు వేసిన తర్వాత యూరియా, ఇతర ఎరువులు ఎంతో అవసరం ఉంటుంది. ప్రైవేట్ దుకాణాల్లో నానో యూరియా, నానో డీఏపీల పేరిట రైతులకు అంటకట్టడానికి ఆలోచనతో కూటమి సర్కార్ యూరియాను కృత్రిమ కొరతను సృష్టిందన్న విమర్శలు వస్తున్నాయి. యూరియా సరిపడా వస్తుందని రైతులకు వ్యవసాయ అధికారులు నచ్చచెబుతున్నారు. కానీ యూరియా రాకపోవడం, సహకార సంఘాల వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. జిల్లాకు చేరిన యూరియా, డీఏపీ ఎరువులు చేరినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్ధాయిలో ఇవి చేరుకోకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కూడా నానో యూరియా అమ్మకాలు పెంచాలని, ఇటు వ్యవసాయ అధికారులకు, అటు కూటమి సర్కార్ మీద వత్తిడి తెస్తున్నారు. యూరియాను విక్రయిస్తున్న సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలను లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇదే పరిస్థితిలో నానో యూరియాను కూడా కొనుగోలు చేయాలని, రైతుల నెత్తిన నానో యూరియా రుద్దడానికి వ్యవసాయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుబాట.. అనకాపల్లి జిల్లాలో యూరియా కొరతతో పలు ఇబ్బందులు గురవుతున్న రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9న అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయాల వద్ద మరో పోరాటానికి సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో యూరియా కొరతపై అనకాపల్లి ఆర్డీవో కార్యాలయాల వద్ద ‘అన్నదాత పోరుబాట’ పేరిట ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. జిల్లాలో యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా రైతుల సంఘాల నాయకులు కూడా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు వైఎస్సార్సీపీ తెలిపింది. అనకాపల్లి, మర్దీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. అనంతరం ఆర్డీవో కు వినతి పత్రం అందజేయనున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఎరువులు, విత్తనాల సమస్య అనేది ఎక్కడా లేదన్నారు. ఈఖరీఫ్ సీజన్ లో యూరియాను రైతులకు అందించకుండా కూటమి నేతలు పక్కదారి పట్టిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ప్రధానంగా యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. కొన్ని ప్రైవేటు దుకాణాల్లోనే... జిల్లా వ్యాప్తంగా 98 శాతం వరినాట్లు వేశారు. ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉంది. డీఏపీ అంతంతమాత్రంగానే ఉంది. కూటమి నేతల జోక్యం కారణంగా కొత్తగా యూరియా స్టాక్ వచ్చినా వారి అనుకూల ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో రూ.400 నుంచి రూ.450 వరకూ వెచ్చించి రైతులు బ్లాక్లో కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ దుకాణాలకే యూరియా ఇస్తున్నారు.కె.కోటపాడులో యూరియా కోసం క్యూలో ఉన్న రైతులు (ఫైల్)క్లస్టర్ విధానంతో కొత్త కష్టాలు అన్నదాత పోరుబాటజిల్లాలో ఖరీఫ్ రైతులు 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తారు. వీటిలో వరి 1.60 వేల ఎకరాల్లో సాగు చేస్తారు. ఈ ఖరీఫ్లో 20 వేల మెట్రిక్ టన్నులు ఎరువులు వినియోగిస్తారని అంచనా. అయితే జిల్లాలో ఇప్పటివరకూ 12 వేల మెట్రిక్ టన్నులు వరకూ యూరియా ఇచ్చారు. మరో 801 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్ఫెడ్, ప్రైవేట్ సొసైటీలు, రైతు సేవాకేంద్రాలలో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో 1500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రావు వెల్లడించారు. దేవరాపల్లి: అన్నదాతలు ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కోసం మండల కేంద్రానికి వేళ్లే అవసరం లేకుండా రైతుల చెంతనే అన్నీ అందజేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను తీసుకువచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్పు చేసి తీసుకువచ్చిన క్లస్టర్ విధానంతో అన్నదాతలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. రెండు రైతు సేవా కేంద్రాలను కలిపి క్లస్టర్గా మార్పు చేయడంతో యూరియా, విత్తనాల కోసం రైతులు పక్క ఆర్ఎస్కేలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో భారీ క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి మండలంలో రైతు సేవా కేంద్రాలను 14 క్లస్టర్లుగా మార్పు చేశారు. గరిశింగి, తెనుగుపూడి ఆర్ఎస్కేలను క్లస్టర్గాను, చింతలపూడి, నాగయ్యపేటను మరో క్లస్టర్గా, ఎం.అలమండ, పెదనందిపల్లిని మరో క్లస్టర్గా విభజించారు. ఎ. కొత్తపల్లి, ముషిడిపల్లి ఆర్ఎస్కేలను క్లస్టర్గా, కాశీపురం, రైవాడను క్లస్టర్గా, దేవరాపల్లిలోని రెండు ఆర్ఎస్కేలను మరో క్లస్టర్గా ఏర్పాటు చేశారు. దీంతో ముషిడిపల్లి సచివాలయ పరిధిలోని రైతులకు ఎ.కొత్తపల్లి సచివాలయంలో, కాశీపురం రైతులకు ఎరువులు తీసుకోవాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైవాడ వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. -
విధుల్లో అంకితభావంతో గుర్తింపు
అనకాపల్లి: పోలీస్ శాఖలో అంకిత భావంతో విధులు నిర్వహించినట్టయితే మంచి గుర్తింపు వస్తుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో సోమవారం జిల్లాలో నలుగురు ఏఎస్ఐలు ఎస్ఐలుగా పదోన్నతి పొందిన ఎం.డి.వై.మొహిద్దిన్, ఆర్.వి.రామనాయుడు, పి.శంకరరావు, ఎం.రాజారావులు ఎస్పీ తుహిన్ సిన్హాను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్ఐగా పదోన్నతి పొందిన ఎస్ఐలు జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో శాంతి భద్రతల పరిరక్షణలో విశేష కృషి చేయడం జరిగిందన్నారు. కొత్తగా పదోన్నతి పొందిన వారు పోలీస్శాఖకు మంచి గుర్తింపు తీసుకువచ్చే విధంగా విధులు నిర్వహించాలని ఎస్పీ కోరారు.