ప్రధాన వార్తలు
మరోసారి పేట్రేగిపోయిన వైభవ్ సూర్యవంశీ
యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి పేట్రేగిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీ తొలి 3 మ్యాచ్ల్లో విఫలమైన వైభవ్ ఎట్టకేలకు మహారాష్ట్ర బౌలర్లపై జూలు విదిల్చాడు. 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఓవరాల్గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. వైభవ్ ధాటికి ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.మరో చరిత్రఈ ఇన్నింగ్స్తో వైభవ్ మరో విభాగంలో చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు. వైభవ్కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉండేది. జోల్ 18 ఏళ్ల, 118 రోజుల వయసులో ముంబైపై 63 బంతుల్లో 109 పరుగులు చేశాడు.
కలిసికట్టుగా పోరాడి భారత్ను గెలిపించిన కుకి-మీతై ఫుట్బాలర్లు
వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జరిగే ఆసియా కప్కు అర్హత సాధించడం ద్వారా భారత అండర్-17 పురుషుల ఫుట్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ ఫైనల్లో ఆసియా పవర్ హౌస్ ఇరాన్ను ఓడించడం ద్వారా ఈ ఘనత సాధించింది. అహ్మదాబాద్లోని ఈకే ఏరినాలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో ఇరాన్ను చిత్తు చేసింది. గత 20 ఏళ్లలో భారత్ ఆసియా కప్ ఫైనల్స్కు చేరడం ఇది మూడోసారి మాత్రమే. ఆసియా కప్లో భారత్ ఇదే సంచలన ప్రదర్శనలు చేసి టాప్-4లో నిలిస్తే, 2027 FIFA U-17 వరల్డ్ కప్ (ఖతార్) అర్హత సాధిస్తుంది. మ్యాచ్ విషయానికొస్తే.. మ్యాచ్ 19వ నిమిషంలో ఇరాన్ గోల్ చేసి ముందంజలోకి వెళ్లింది. హాఫ్ టైమ్కు ముందు దల్లాల్ముయోన్ గాంగ్టే (కుకి) పెనాల్టీని గోల్గా మలిచి స్కోర్ను సమం చేశాడు. రెండో అర్దభాగంలో గున్లైబా వాంక్హైరక్పం (మీతై) కౌంటర్ అటాక్లో గోల్ కొట్టి భారత్ను చారిత్రక విజయం దిశగా నడిపించాడు.జాతి ఘర్షణలు పక్కకు పెట్టి దేశం కోసం పోరాడిన యువకులుమణిపూరి జాతి ఘర్షణల్లో ప్రత్యర్థులుగా పోరాడిన కుకి-మీతై తెగలకు చెందిన ఆటగాళ్లు కలిసికట్టుగా గోల్స్ చేసి భారత్ను గెలిపించారు. మణిపూర్లో 2023 నుంచి మీతై–కుకిల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. భూస్వామ్య హక్కులు, రాజకీయ ప్రతినిధిత్వం, భద్రతా సమస్యలు వంటి అంశాలపై వివాదాలు కొనసాగుతున్నాయి.కుకి అంటే ఈశాన్య భారతదేశంలోని ఓ ప్రధాన గిరిజన సమూహం. వీరి మతం క్రైస్తవం. మీతై అంటే ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రధాన జాతి సమూహం. వీరు హిందుమతాన్ని ఆచరిస్తారు. ప్రస్తుత భారత జట్టులో 9 మంది మణిపూర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 7 మంది మీతై, 2 మంది కుకి తెగలకు చెందిన వాళ్లు. మణిపూర్ ఎప్పటినుంచో భారత ఫుట్బాల్కు ప్రతిభావంతుల్ని అందిస్తున్న టాలెంట్ ఫ్యాక్టరీగా కీర్తించబడుతుంది.
పడిక్కల్ విధ్వంసకర శతకం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ చెలరేగిపోయాడు. తమిళనాడుతో ఇవాళ (డిసెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్లో కేవలం 46 బంతుల్లోనే అజేయమైన శతకం (102) బాదాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.పడిక్కల్తో పాటు శరత్ (23 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మరణ్ రవిచంద్రన్ (29 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 3 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది.మిగతా ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ 24, కరుణ్ నాయర్ 4 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్ 2, టి నటరాజన్ ఓ వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత SMAT సీజన్లో ఇప్పటికే ఏడు సెంచరీలు (పడిక్కల్ది కాకుండా) నమోదయ్యాయి. ముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే 2, అభిమన్యు ఈశ్వరన్, రోహన్ కున్నుమ్మల్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఉర్విల్ పటేల్ తలో సెంచరీ చేశారు.
ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని ఈ ఆటగాడికే జాక్పాట్..!
ఐపీఎల్ మినీ వేలం (IPL 2026 Mini Auction) ఈనెల (డిసెంబర్) 16న అబుదాబీలో జరుగనున్న విషయం తెలిసిందే. క్రిక్బజ్ నివేదిక ప్రకారం ఈసారి వేలంలో 15 దేశాలకు చెందిన 1355 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 77 స్లాట్లు.. ఇందులో 31 విదేశీ స్లాట్ల కోసం ఈ ఆటగాళ్ల మధ్య పోటీ జరుగుతుంది. ఈసారి వేలం బరిలో హేమాహేమీలు ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ నుంచి పృథ్వీ షా, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్.. ఆస్ట్రేలియా నుంచి కెమెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్.. ఇంగ్లండ్ నుంచి జానీ బెయిర్స్టో, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, టామ్ కర్రన్.. శ్రీలంక నుంచి వనిందు హసరంగ, మతీష పతిరణ.. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర.. బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నవీన్-ఉల్-హక్.. సౌతాఫ్రికా నుంచి గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే తదితరులు పాల్గొంటున్నారు.వీరిలో ఏ ఫ్రాంచైజీ ఎవరిని దక్కించుకుంటుంది, ఎంతిచ్చి సొంతం చేసుకుంటుందన్న అంశంపై క్రికెట్ ప్రపంచమంతా చర్చించుకుంటుంది. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా, ఫ్రాంచైజీల అవసరాల దృష్ట్యా ఓ విషయమైతే స్పష్టమవుతుంది. ఈసారి వేలంలో ఇంగ్లండ్ డాషింగ్ వికెట్కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (Jamie Smith) జాక్పాట్ కొట్టవచ్చు.అదెలా అంటే.. వేలంలో అత్యధిక పర్స్ నిలువ ఉన్న కేకేఆర్కు వికెట్కీపర్ బ్యాటర్ అవసరం. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ ఇటీవలే రహ్మానుల్లా గుర్బాజ్, క్వింటన్ డికాక్లను వదిలేసింది. దీంతో కేకేఆర్ జేమీ స్మిత్ కోసం ఎంతైనా ఖర్చు చేయవచ్చు. వారి వద్ద 64.30 కోట్లు ఉన్నాయి. ఇందులో జేమీ కోసం సగం వెచ్చించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.రెండోది.. వేలంలో రెండో అత్యధిక పర్స్ నిల్వ ఉన్న సీఎస్కేకు బ్యాకప్ ఓవర్సీస్ ఓపెనర్ అవసరం. జేమీ ఓపెనర్గా మెరుపులు మెరిపించగల సమర్దుడు. దేశవాలీ పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను ఓపెనర్గా సక్సెస్ అయ్యాడు.జేమీ కోసం పోటీపడే ఆస్కారమున్న మరో ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఫ్రాంచైజీకి విదేశీ ఓపెనింగ్ బ్యాటర్ అవసరముంది.జేమీ కోసం పోటీపడే ఛాన్స్ ఉన్న నాలుగో ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్. పంజాబ్ ఇటీవలే వికెట్కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ను వదిలేసుకుంది. దీంతో అతని ప్రత్యామ్నాయంగా జేమీ కోసం పోటీపడవచ్చు. ఈ అవసరాల దృష్ట్యా త్వరలో జరుగనున్న ఐపీఎల్ మినీ వేలంలో జేమీ స్మిత్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు.
భారీ రికార్డులు సొంతం చేసుకున్న కేన్ మామ
క్రైస్ట్చర్చ్లో వెస్టిండీస్తో ఇవాళ (డిసెంబర్ 2) మొదటి టెస్ట్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 102 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి ఔటైన అతడు.. విండీస్పై టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో న్యూజిలాండ్ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కేన్కు ముందు రాస్ టేలర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత విండీస్పై కేన్ టెస్ట్ పరుగుల సంఖ్య 1022 పరుగులకు చేరగా.. రాస్ టేలర్ పరుగుల సంఖ్య 1136గా ఉంది.ఈ ఇన్నింగ్స్తో కేన్ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. టెస్ట్ల్లో విండీస్పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా నాథన్ ఆస్టల్ రికార్డును సమం చేశాడు. కేన్, ఆస్టల్ ఇద్దరూ విండీస్పై తలో 8 టెస్ట్ ఫిఫ్టీలు చేశారు.కేన్ రికార్డులను పక్కన పెడితే.. ఈ మ్యాచ్లో కివీస్ తడబాటుకు లోనైంది. 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌటయ్యాక కేన్, కెప్టెన్ లాథమ్ (24) కాసేపు నిలకడగా బ్యాటింగ్ చేశారు. 94 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేన్ ఔట్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. జట్టు స్కోర్కు మరో పరుగు జోడించబడగానే లాథమ్ కూడా ఔటయ్యాడు. మరో 8 పరుగుల వ్యవధిలో రచిన్ రవీంద్ర (3) కూడా ఔటయ్యాడు. మరో 17 పరుగుల తర్వాత విల్ యంగ్ (14) కూడా పెవిలియన్కు చేరాడు. విండీస్ బౌలర్లలో రోచ్, సీల్స్, లేన్ తలో వికెట్ తీయగా.. గ్రీవ్స్ 2 వికెట్లు పడగొట్టాడు. 48 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 148 పరుగులుగా ఉంది. టామ్ బ్లండల్ (29), బ్రేస్వెల్ (6) క్రీజ్లో ఉన్నారు.
కేకేఆర్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం
కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీ తనను వదిలించుకోవడంతో ఐపీఎల్ మొత్తానికే గుడ్బై చెప్పేశాడు. తదుపరి సీజన్ వేలంలోనూ తన పేరు కూడా నమోదు చేసుకోలేదు.కేకేఆర్ వద్దనుకోవడంతో మనస్థాపం చెందినట్లున్న మొయిన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈమేరకు తన ఇన్స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. పీఎస్ఎల్ 2026కి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.మొయిన్ ఐదేళ్ల తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడనున్నాడు. 2020లో చివరిగా అతను ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంచైజీకి ఆడాడు.కాగా, ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ మొయిన్తో పాటు చాలామంది స్టార్ ఆటగాళ్లను వదిలేసింది. ఆ ఫ్రాంచైజీ విడుదల చేసిన ఆటగాళ్లలో టీ20 దిగ్గజం ఆండ్రీ రసెల్ కూడా ఉన్నాడు.రసెల్తో పాటు గత సీజన్ వేలంలో రూ. 23.75 కోట్ల రికార్డు ధర దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్ను సైతం కేకేఆర్ వదిలేసింది. వీరితో పాటు టీ20 స్పెషలిస్ట్లు అయిన డికాక్, స్పెన్సర్ జాన్సన్, నోర్జే, రహ్మానుల్లా గుర్బాజ్ను కూడా వేలానికి వదిలేసింది.దిగ్గజాన్నే వదిలేసింది, మొయిన్ ఎంత..?మొయిన్ను కేకేఆర్ వదిలేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. వయసు పైబడటంతో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గత సీజన్లో అతను లభించిన అడపాదడపా అవకాశాలను పెద్దగా సద్వినయోగం చేసుకోలేకపోయాడు. రసెల్ లాంటి దిగ్గజాన్నే సైతం వదులుకున్న కేకేఆర్కు మొయిన్ను సాగనంపడం పెద్ద సమస్యేమీ కాలేదు.
IPL 2026: వేలానికి వేళాయే..!
2026 ఐపీఎల్ సీజన్కు సంబంధించి ఇప్పటి నుంచే హడావుడి మొదలైంది. ట్రేడింగ్, రిటెన్షన్ల ప్రక్రియ ముగియగానే ఫ్రాంచైజీలకు వేలం ఫీవర్ పట్టుకుంది. ఈసారి వేలంలో రికార్డు స్థాయిలో 1355 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారని క్రిక్బజ్ నివేదిక తెలిపింది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని దక్కించుకుంటుంది, ఎంతిచ్చి సొంతం చేసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబీలో జరుగనుంది.15 దేశాల ఆటగాళ్లుక్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ఈసారి వేలంలో భారత్ సహా 15 దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఎస్ఏతో పాటు మలేషియా లాంటి దేశం నుంచి ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.బరిలో హేమాహేమీలుఈసారి వేలం బరిలో హేమాహేమీలు ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ నుంచి పృథ్వీ షా, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్.. ఆస్ట్రేలియా నుంచి కెమెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్.. ఇంగ్లండ్ నుంచి జానీ బెయిర్స్టో, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, టామ్ కర్రన్.. శ్రీలంక నుంచి వనిందు హసరంగ, మతీష పతిరణ.. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర.. బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నవీన్-ఉల్-హక్.. సౌతాఫ్రికా నుంచి గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే తదితరులు పాల్గొంటున్నారు.వెంకటేష్ అయ్యర్ మరోసారి జాక్పాట్ కొడతాడా..?గత సీజన్ వేలంలో భారత ఆటగాడు వెంకటేష్ అయ్యర్ రూ. 23.75 కోట్ల రికార్డు ధర దక్కించుకొని జాక్పాట్ కొట్టాడు. భారీ అంచనాలతో కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. అయితే వెంకటేష్ నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కేకేఆర్ అతన్ని వదిలించుకుంది. దీంతో ఈసారి అతను వేలం బరిలో నిలిచాడు. గత సీజన్లా కాకపోయినా ఈసారి కూడా వెంకటేష్కు భారీ మొత్తమే లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అతను అత్యధిక బేస్ప్రైజ్ అయిన 2 కోట్ల విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. భారత్ నుంచి వెంకటేష్తో పాటు రవి బిష్ణోయ్ మాత్రమే ఈ విభాగంలో పోటీపడుతున్నాడు.2 కోట్ల బేస్ప్రైజ్ విభాగంలో ఎవరెవరు..?2 కోట్ల బేస్ప్రైజ్ విభాగంలో ఈసారి మొత్తం 45 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్, కెమరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జేమీ స్మిత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కూపర్ కన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, జోష్ ఇంగ్లిస్, ముస్తాఫిజుర్ రహ్మాన్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డానియల్ లారెన్స్, లియామ్ లివింగ్స్టోన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్వెల్, గెరాల్డ్ కొయెట్జీ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, పతిరణ, తీక్షణ, హసరంగ, షాయ్ హోప్, అల్జరీ జోసఫ్ తదితరులు ఈ విభాగంలో తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు.భారత్ నుంచి ఎవరెవరు..?ఈసారి వేలంలో భారత్ నుంచి మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రాహుల్ చాహర్, రవి బిష్ణోయ్, ఆకాశ్దీప్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ మావి, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సందీప్ వారియర్ మరియు ఉమేశ్ యాదవ్ పాల్గొంటున్నారు.మలేషియా నుంచి కూడా..?ఈసారి వేలంలో మలేషియా నుంచి ఒకరు తమ పేరును నమోదు చేసుకున్నారు. భారత మూలాలున్న ఆల్రౌండర్ విరన్దీప్ సింగ్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్ విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.కోటి విభాగంలో షకీబ్బంగ్లాదేశ్ వెటరన్, 9 ఐపీఎల్ సీజన్లు ఆడిన అనుభవమున్న షకీబ్ ఉల్ హసన్ ఈసారి రూ. కోటి బేస్ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.77 స్లాట్ల కోసం పోటీ77 స్లాట్లు..ఇందులో 31 విదేశీ స్లాట్ల కోసం 1355 మంది ఆటగాళ్లు పోటీపడునున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీల వద్ద రూ. 237.55 కోట్ల నిధులు ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.30 కోట్లు, రెండో అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 43.40 కోట్లు ఉన్నాయి.
భారీ విజయంతో భారత్ బోణీ
సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 13–0 గోల్స్ తేడాతో నమీబియా జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున హీనా బానో (35వ, 35వ, 45వ నిమిషాల్లో), కనిక సివాచ్ (12వ, 30వ, 45వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున సాధించారు. సాక్షి రాణా (10వ, 23వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది. బినిమా ధన్ (14వ నిమిషంలో), సోనమ్ (14వ నిమిషంలో), సాక్షి శుక్లా (27వ నిమిషంలో), ఇషిక (36వ నిమిషంలో), మనీషా (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత్కు 11 పెనాల్టీ కార్నర్లు లభించగా... నమీబియాకు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా రాలేదు. భారత్ 11 పెనాల్టీ కార్నర్లలో ఐదింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. అన్నింటిని లక్ష్యానికి చేరిస్తే విజయం అంతరం మరింత భారీగా ఉండేది. గ్రూప్ ‘సి’లోని మరో మ్యాచ్లో జర్మనీ 7–1తో ఐర్లాండ్ను ఓడించింది. రేపు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో జర్మనీతో భారత్ తలపడుతుంది.
‘కోహ్లి భవిష్యత్తుపై చర్చ అనవసరం’
రాంచీ: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అద్భుత ఇన్నింగ్స్తో ఆదివారం తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు. గత కొంత కాలంగా జట్టులో కోహ్లి స్థానంపై, 2027 వరల్డ్ కప్ వరకు ఆడటంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్లోనూ అతని ప్రదర్శనపై అందరి దృష్టీ నిలుస్తోంది. అయితే ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఖండించాడు. కోహ్లి భవిష్యత్తు అనేది అసలు చర్చించాల్సిన అంశమే కాదని అతను స్పష్టం చేశాడు. ఇంత బాగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంకేం ఆశిస్తామని కొటక్ వ్యాఖ్యానించాడు. ‘కోహ్లి గురించి ఈ తరహాలో ఆలోచించాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు. అతను చాలా గొప్పగా ఆడుతున్నాడు. అసలు అతని భవిష్యత్తుపై మాట్లాడాల్సిన అవసరం ఏముంది. అతని ఆట, ఫిట్నెస్ చూస్తే మరో చర్చకు తావు లేదు. కోహ్లి బ్యాటింగ్ అసాధారణంగా ఉంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే మరో విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కోహ్లి, రోహిత్ ఇద్దరూ జట్టు విజయంలో తమ పాత్ర పోషిస్తున్నారు. వారిద్దరికీ ఎంతో అనుభవం ఉంది. అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. జట్టు విజయంలో వారి భాగస్వామ్యం కూడా కీలకంగా మారింది’ అని కొటక్ భారత్ బ్యాటర్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మంచు ప్రభావం కారణంగా తమ బౌలర్లను పట్టు చిక్కలేదని, అందుకే దక్షిణాఫ్రికా కూడా భారీగా పరుగులు సాధించి విజయానికి చేరువగా రాగలిగిందని విశ్లేíÙంచిన కొటక్...ఆరంభంలో వికెట్లు తీసి ప్రత్యరి్థని కట్టడి చేసిన హర్షిత్ రాణాపై ప్రత్యేకంగా ప్రశంసించాడు.
టెన్నిస్ దిగ్గజం కన్నుమూత
ఇటాలియన్ టెన్నిస్ దిగ్గజం, రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పీట్రాంగెలి(92) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో రోమ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇటాలియన్ టెన్నిస్, పాడెల్ పెడరేషన్ ధ్రువీకరించింది.కాగా పీట్రాంగెలి ఇటలీ టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న ఏకైక ఇటాలియన్ ప్లేయర్ నికోలానే కావడం విశేషం. డేవిస్ కప్ మ్యాచ్లలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్గా కూడా పొందారు. ఆయన తన కెరీర్లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. కాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలిచిన మొట్టమొదటి ఇటాలియన్ ఆటగాడు కూడా నికోలానే. 1959, 1960లో రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. ఆయన వారసత్వాన్ని జానిక్ సిన్నర్, మాటియో బెరెట్టినిల వంటి యువ సంచలనాలు ముందుకు తీసువెళ్తున్నారు. నికోలా పీట్రాంగెలి మృతి పట్ల ఇటలీ ప్రధాన మంత్రి జియోర్జియా మెలోనీ, స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ సంతాపం వ్యక్తం చేశారు.
‘కోహ్లి భవిష్యత్తుపై చర్చ అనవసరం’
రాంచీ: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అద...
నేడు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. హార్దిక్ పాండ్యా X అభిషేక్ శర్మ
సాక్షి, హైదరాబాద్: భారత ఆల్రౌండర్ హార్దిక్ పాం...
సౌతాఫ్రికాకు గుడ్ న్యూస్?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బుధవారం...
చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ ప్లేయర్..
టీమిండియా వెటరన్ పేసర్, సౌరాష్ట్ర దిగ్గజం జయ...
క్రీడలు
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
ఉత్సాహంగా వైజాగ్ మారథాన్ ర్యాలీ (ఫొటోలు)
హైదరాబాద్కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
ధోనీ కేరళ వస్తే? ఇది ఏఐ అని చెబితే తప్ప తెలియదు (ఫొటోలు)
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసిన గీతా బస్రా, హర్భజన్ దంపతులు (ఫొటోలు)
ప్రీ మెచ్యూర్డ్ చిల్డ్రన్స్ కు ‘ప్రీమిథాన్’ (ఫొటోలు)
మంధాన పెళ్లి షురూ.. సంగీత్లో వరల్డ్ కప్ స్టార్స్ డాన్స్ (ఫోటోలు)
లేడీ క్రికెటర్ స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్ (ఫొటోలు)
నా జీవితంలోని ఆల్రౌండర్కు హ్యాపీ బర్త్ డే: సూర్యకుమార్ (ఫొటోలు)
వీడియోలు
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
స్మృతి మందాన పెళ్లి రద్దు? వేరే అమ్మాయితో పలాస్ డేటింగ్!
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
Nikhat Zareen: అదరగొట్టిన తెలంగాణ బాక్సర్.. గోల్డ్ మెడల్
గిల్ అనుమానమే..!
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
