Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ILT20 2025-26: Vipers prevail in season opener after Gous fifty1
సప్పగా ప్రారంభమైన ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ నాలుగో ఎడిషన్‌ ఎలాంటి మెరుపుల్లేకుండా సప్పగా ప్రారంభమైంది. టోర్నీ ఓపెనర్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌, డెజర్ట్‌ వైపర్స్‌ తలపడగా.. వైపర్స్‌ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. 39 పరుగులు చేసిన రోవ్‌మన్‌ పావెల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. నబీ 29, అటల్‌ 16, జహంగీర్‌ 19, గుల్బదిన్‌ డకౌట్‌, కాక్స్‌ 2, విల్లే 10, షకన 12, కర్రీ 5 (నాటౌట్‌), హైదర్‌ అలీ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. వైపర్స్‌ బౌలర్లలో డేవిడ్‌ పేన్‌, తన్వీర్‌, నూర్‌ అహ్మద్‌ తలో 2 వికెట్లు తీయగా.. నసీం షా, సామ్‌ కర్రన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో వైపర్స్‌ కూడా తడబడింది. అతి కష్టం మీద 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆండ్రియస్‌ గౌస్‌ (58) బాధ్యతాయుతంగా ఆడి వైపర్స్‌ను గెలిపించాడు. ఫకర్‌ జమాన్‌ 26, హెల్డన్‌ 16, సామ్‌ కర్రన్‌ 7, డాన్‌ లారెన్స్‌ 19 నాటౌట్‌, హెట్‌మైర్‌ 7, హసన్‌ నవాజ్‌ 3, తన్వీర్‌ 12 నాటౌట్‌ పరుగులు చేశారు. క్యాపిటల్స్‌ బౌలర్లలో కర్రీ, సలాంకిల్‌ తలో 2, నబీ, నైబ్‌ చెరో వికెట్‌ తీశారు. ఇవాళ షార్జా వారియర్జ్‌, అబుదాబీ నైట్‌రైడర్స్‌ తలపడనున్నాయి.

West Indies All Out For 167 in first innings of 1st test against New Zealand2
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. తొలుత విండీస్‌ బౌలర్లు రెచ్చిపోయి కివీస్‌ను 231 పరుగులకే కట్టడి చేయగా.. ఆతర్వాత కివీస్‌ బౌలర్లు విండీస్‌ను 167 పరుగులకే కుప్పకూల్చి ప్రతీకారం తీర్చుకున్నారు. జేకబ్‌ డఫీ ఐదు వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బేశాడు. మ్యాట్‌ హెన్రీ 3, ఫౌల్క్స్‌ 2 వికెట్లతో మిగతా పని కానిచ్చేశారు.తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (52), షాయ్‌ హోప్‌ (56) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరు కాకుండా ఇమ్లాచ్‌ (14), రోచ్‌ (10 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు ఖాతా కూడా తెరవలేకపోయారు.అంతకుముందు విండీస్‌ బౌలర్లు తలో చేయి వేసి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. కేన్ విలియమ్సన్‌ (52), బ్రేస్‌వెల్‌ (47) ఓ మోస్తరుగా రాణించడంతో ఆ జట్టు గౌరవప్రమైన స్కోర్‌ చేయగలిగింది.64 పరుగుల కీలక ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌.. రెండో రోజు మూడో సెషన్‌ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 10, డెవాన్‌ కాన్వే 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.

IND VS SA 2nd ODI: Rohit Sharma is 41 short of 20000 international runs3
భారీ మైలురాయిపై కన్నేసిన రోహిత్‌ శర్మ

భారత్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్‌ 3) రెండో వన్డే జరుగనుంది. రాయ్‌పూర్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు భారత వెటరన్‌ స్టార్‌ రోహిత్‌ శర్మను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో అతను 41 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 20000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు కేవలం​ 13 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో భారత్‌కు చెందిన వారే ముగ్గురున్నారు (సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, రాహుల్‌ ద్రవిడ్‌). వీరిలో సచిన్‌ అందరి కంటే ఎక్కువగా 34357 పరుగులు చేసి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..సచిన్‌-34357సంగక్కర-28016కోహ్లి-27808పాంటింగ్‌-27483జయవర్దనే-25957కల్లిస్‌-25534ద్రవిడ్‌-24208లారా-22358రూట్‌-21774జయసూర్య-21032చంద్రపాల్‌-20988ఇంజమామ్‌-20580డివిలియర్స్‌-20014కాగా, టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్‌ శర్మ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో హాఫ్‌ సెంచరీ, ఓ సూపర్‌ సెంచరీతో రెచ్చిపోయిన హిట్‌మ్యాన్‌.. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనూ అదిరిపోయే అర్ద సెంచరీతో అలరించాడు. ప్రస్తుత రోహిత్‌ ఫామ్‌ను బట్టి చూస్తే.. ఇవాల్టి మ్యాచ్‌లో 20000 పరుగుల మార్కును చేరుకోవడం అంత కష్టమైన పనేమీ కాకపోవచ్చు.

Tanzid enters into record books with highest catches as fielder in a single T20I4
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ ప్లేయర్‌

ఐర్లాండ్‌తో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాడు తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (Tanzid Hasan Tamim) అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను ఏకంగా ఐదు క్యాచ్‌లు పట్టాడు. అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఓ ఫీల్డర్‌ (నాన్‌ వికెట్‌కీపర్‌) ఇన్ని క్యాచ్‌లు పట్టడంతో ఇది కేవలం మూడోసారి మాత్రమే. టెస్ట్‌ క్రికెట్‌ ఆడే దేశాల పరంగా చూస్తే.. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌ తంజిదే. మిగతా ఇద్దరు నాన్‌ టెస్ట్‌ ప్లేయింగ్‌ దేశాలకు చెందిన వారు. మాల్దీవ్స్‌కు వెదగే మలిండ, స్వీడన్‌కు చెందిన సెదిక్‌ సహక్‌ ఆ మిగతా ఇద్దరు.ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తంజిద్‌ డాక్రెల్‌, డెలానీ, మార్క్‌ అదైర్‌, హంఫ్రేస్‌, బెంజమిన్‌ వైట్‌ క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌లో తంజిద్‌ క్యాచ్‌ పట్టడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించి అజేయ అర్ద సెంచరీ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 117 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం బంగ్లాదేశ్‌ సునాయాసంగా విజయతీరాలకు చేరింది. తద్వారా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ కూడా కైవసం చేసుకుంది. ఐదు క్యాచ్‌లతో పాటు అజేయ అర్ద సెంచరీ చేసిన తంజిద్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌ తొలి మ్యాచ్‌ గెలువగా.. బంగ్లాదేశ్‌ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.

Bangladesh beat Ireland in 3rd T20 and clinches series5
బంగ్లాదేశ్‌దే సిరీస్‌

స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (డిసెంబర్‌ 2) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ బంగ్లా బౌలర్ల ధాటికి 117 పరుగులకే ఆలౌటైంది. ముస్తాఫిజుర్‌, రిషద్‌ హొస్సేన్‌ తలో 3, షోరిఫుల్‌ 2, మెహిది హసన్‌, సైఫుద్దీన్‌ చెరో వికెట్‌ తీసి ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌, కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (38) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. టెక్టర్‌ (17), డాక్రెల్‌ (19), డెలాని (10) అతి కష్టంమీద రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ (55) అజేయ అర్ద సెంచరీతో బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి పర్వేజ్‌ హస్సేన్‌ ఎమోన్‌ (33 నాటౌట్‌) సహకరించాడు. అర్ద సెంచరీతో పాటు ఐదు క్యాచ్‌లు పట్టిన తంజిద్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా, ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌ తొలి మ్యాచ్‌ గెలువగా.. బంగ్లాదేశ్‌ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది.

West Indies Restricted New Zealand To just 231 runs in 1st test6
కివీస్‌పై విండీస్‌ ఆధిపత్యం

క్రైస్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో విండీస్‌ బౌలర్లు చెలరేగిపోయారు. తలో చేయి వేసి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. కీమర్‌ రోచ్‌, సీల్స్‌, షీల్డ్స్‌, గ్రీవ్స్‌ తలో 2.. లేన్‌, ఛేజ్‌ చెరో వికెట్‌ తీసి కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 231 పరుగులకే కుప్పకూల్చారు.కివీస్‌ ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ (52) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. బ్రేస్‌వెల్‌ (47), బ్లండల్‌ (29), లాథమ్‌ (24), నాథన్‌ స్మిత్‌ (23), యంగ్‌ (14) రెండంకెల​ స్కోర్లు చేయగలిగారు. కాన్వే (0), రచిన్‌ (3), ఫౌల్క్స్‌ (4), హెన్రీ (8) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో కివీస్‌పై విండీస్‌ స్పష్టమై ఆధిపత్యం చలాయించింది.అనంతరం బరిలోకి దిగిన విండీస్‌ బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపిస్తుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. షాయ్‌ హోప్‌ (56) అర్ద సెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ 38, కెప్టెన్‌ ఛేజ్‌ 0 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు విండీస్‌ ఇంకా 126 పరుగులు వెనుకపడి ఉంది. ప్రస్తుతం రెండో రోజు రెండో సెషన్‌ ఆట కొనసాగుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్‌ ఇది.

Kohli confirms availability to play Vijay Hazare Trophy7
విరాట్‌ కోహ్లి అభిమానులకు పిచ్చెక్కించే వార్త

దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) అభిమానులకు ఇది బంపర్‌ బొనాంజా లాంటి వార్త. కింగ్‌ త్వరలో జరుగబోయే దేశవాలీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ ఆడతానని స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులగా ఈ విషయమై సందిగ్దత నెలకొని ఉండింది. కోహ్లి స్వయంగా తాను విజయ్‌ హజారే ట్రోఫీ ఆడతానని చెప్పడంతో అతడి అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి.. దేశవాలీ టోర్నీ ఆడనుండటం క్రికెట్‌ అభిమానులకు నిజంగా పండుగే. కోహ్లి తన సొంత దేశవాలీ జట్టు ఢిల్లీ తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీ ఆడేందుకు కోహ్లి సంసిద్దత వ్యక్తం చేసిన విషయాన్ని ఢిల్లీ క్రికెట్‌ ఆసోసియేషన్‌ చీఫ్‌ రోహన్‌ జైట్లీ ధృవీకరించారు.ఈ విషయాన్ని ఆయన క్రిక్‌బజ్‌ మాధ్యమంగా వెల్లడిస్తూ.. అవును.. కోహ్లి విజయ్‌ హజారే ట్రోఫీ ఆడనున్న మాట వాస్తవమే. అయితే అతడెన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడన్న విషయం ఇప్పుడే చెప్పలేమని అన్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్‌ 24 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 వరకు జరుగుతుంది.కాగా, జాతీయ జట్టు పరిగణలో ఉండాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక రాణించాల్సి ఉంటుందని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కోహ్లి ఈ నిర్ణయం 2027 ప్రపంచకప్‌ ఆడాలనుకున్న అతని బలమైన సంకల్పాన్ని సూచిస్తుంది.కోహ్లి చివరిగా 2009-10 విజయ్‌ హజారే ట్రోఫీ ఆడాడు. ఈ టోర్నీలో అతను 14 మ్యాచ్‌లు ఆడి నాలుగు సెంచరీలు, మూడు అర్ద సెంచరీల సాయంతో 819 పరుగులు చేశాడు. ఈ గణంకాలు చూస్తే చాలు ఈ టోర్నీలోనూ కింగ్‌ హవా ఎలా కొనసాగిందో చెప్పడానికి.ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో కోహ్లి సూపర్‌ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత కోహ్లి అత్యుత్తమ టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. చూడచక్కని డ్రైవ్‌లు, షాట్లు ఆడి అభిమానులకు అలరించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో కోహ్లి తన కెరీర్‌ అత్యున్నత స్థితిని గుర్తు చేశాడు.

Indian batsman Thakur Tilak Varma about Test cricket8
టెస్టులు ఆడే సత్తా ఉంది: తిలక్‌ వర్మ

న్యూఢిల్లీ: సంప్రదాయ టెస్టు క్రికెట్‌ సైతం ఆడే సత్తా తనలో ఉందని భారత బ్యాటర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ అన్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు రాబట్టేందుకు విరాట్‌ కోహ్లి సలహా తీసుకున్నానని ఈ స్టార్‌ హైదరాబాదీ క్రికెటర్‌ చెప్పాడు. భారత్‌ తరఫున అంతర్జాతీయ వన్డేలు ఆడిన 23 ఏళ్ల బ్యాటర్‌కు ఇంకా టెస్టులు ఆడే అవకాశమైతే రాలేదు. అయితే భారత టి20 జట్టులో మాత్రం పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియా టి20 క్రికెట్‌ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపేందుకు అజేయ పోరాటం చేశాడు. డిజిటల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిలక్‌ మాట్లాడుతూ ‘వన్డేలు, టెస్టులు కూడా నాకు నప్పుతాయి. సంప్రదాయ ఫార్మాట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. మరిన్ని వన్డేలు ఆడేందుకు నేనెంతగానో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఒకే జట్టులో రోహిత్, విరాట్‌ ఉంటే ఆ జట్టులో ఆత్మవిశ్వాసం మరోస్థాయిలో ఉంటుంది. వాళ్లిద్దరికి ఎంతో అనుభవముంది. వారి పరుగుల పరిజ్ఞానం అద్భుతం. నేనైతే వీలైనప్పుడల్లా వారి సలహాలు తీసుకుంటూనే ఉంటాను. ముఖ్యంగా ఫిట్‌నెస్‌లో కోహ్లి సూపర్‌. అందుకే వికెట్ల మధ్య చురుగ్గా పరుగులు తీసేందుకు అతని చిట్కాలే పాటిస్తా’ అని అన్నాడు. హైదరాబాద్‌ స్టార్‌ బ్యాటర్‌ టీమిండియా తరఫున కేవలం నాలుగే వన్డేలు ఆడాడు. ఫిఫ్టీ (52) సహా 68 పరుగులు చేశాడు. రెండేళ్ల క్రితం 2023లో దక్షిణాఫ్రికా పర్యటనలో చివరిసారిగా వన్డే ఆడిన అతనికి మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో బరిలోకి దిగే అవకాశం లభించలేదు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకుంటానని చెప్పాడు.

Australian all rounder withdraws from IPL9
మ్యాక్స్‌వెల్‌ కూడా...

సిడ్నీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నుంచి తప్పుకుంటున్న సీనియర్‌ ఆటగాళ్ల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా స్టార్‌ ఫాఫ్‌ డుప్లెసిస్, వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రె రసెల్‌ లీగ్‌కు దూరం కాగా... ఇప్పుడా జాబితాలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ చేరారు. ఈ నెల 16న అబుదాబి వేదికగా ఐపీఎల్‌ మినీ వేలం జరగనుండగా... ఇప్పటికే దాదాపు అన్నీ ఫ్రాంచైజీల వద్ద సరిపడా విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో తమకు అవకాశం దక్కదని భావించిన పలువురు సీనియర్‌ ప్లేయర్లు లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. 2012 నుంచి ఐపీఎల్‌లో కొనసాగుతున్న మ్యాక్స్‌వెల్‌... చాలా సీజన్‌లలో భారీ అంచనాలతో అత్యధిక ధర దక్కించుకున్నా... మైదానంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. లీగ్‌లో నాలుగు ఫ్రాంచైజీలకు (పంజాబ్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు) ప్రాతినిధ్యం వహించిన 37 ఏళ్ల మ్యాక్స్‌వెల్‌... తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఐపీఎల్‌లో 141 మ్యాచ్‌లాడి 2819 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ 41 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో... ఇక ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో నా పేరు నమోదు చేసుకోలేదు. లీగ్‌ నాకు ఎంతో ఇచ్చింది. ఇక్కడ ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. కేవలం ఒక క్రికెటర్‌గానే కాకుండా... వ్యక్తిగానూ నన్ను ఐపీఎల్‌ ఎంతో మార్చింది. ఎంతోమంది అంతర్జాతీయ స్టార్‌లతో కలిసి ఆడే అవకాశం దక్కింది. ఇక అభిమానుల ఆదరణ అమోఘం. ఇలాంటి ఎన్నో తీపి గుర్తులను ఎప్పటికీ దాచుకుంటా’ అని మ్యాక్స్‌వెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. ఓవరాల్‌గా 13 సీజన్‌ల పాటు ఐపీఎల్‌ ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2021లో మాత్రమే 500 పైచిలుకు పరుగులు చేశాడు. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ జట్టు అతడిని రూ. 4 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేయగా... ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మ్యాక్స్‌వెల్‌ దానికి న్యాయం చేయలేకపోయాడు. దీంతో ఈసారి వేలంలో అతడిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాకొపోవచ్చనే ఉద్దేశంతో అతడు లీగ్‌కు దూరం అవుతున్నట్లు ప్రకటించాడు. పీఎస్‌ఎల్‌ బరిలో మొయిన్‌ అలీ ఇక 8 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్న ఇంగ్లండ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కూడా ఐపీఎల్‌ను వీడి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మొయిన్‌ అలీ రెండుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గాడు. నవంబర్‌ 30తోనే ఆటగాళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగియగా... మినీ వేలంలో అత్యధికంగా 77 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అందులో 31 మంది విదేశీ ఆటగాళ్లకు చాన్స్‌ ఉంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వద్ద అత్యధికంగా రూ. 64.3 కోట్లు ఉండగా... చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఖాతాలో రూ. 43.4 కోట్లు ఉన్నాయి. గత వేలంలో రూ. 23.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ సహా మొత్తం 9 మంది ఆటగాళ్లను కోల్‌కతా ఫ్రాంచైజీ వేలానికి వదిలేసింది. 2025 మెగా వేలానికి దూరంగా ఉన్న ఆ్రస్టేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌కు ఈసారి భారీ మొత్తం దక్కే అవకాశం ఉంది. వేలం బరిలో ఉన్న వారిలో రవి బిష్ణోయ్, స్టీవ్‌ స్మిత్, మెక్‌గుర్క్, ఇన్‌గ్లిస్, అట్కిన్సన్, డకెట్, లివింగ్‌స్టోన్, డెవాన్‌ కాన్వే, జెమీసన్, డేవిడ్‌ మిల్లర్, పతిరణ, తీక్షణపై అందరి దృష్టి నిలవనుంది. రూ. 2 కోట్ల ప్రాథమిక ధర గల ఆటగాళ్ల జాబితా రవి బిష్ణోయ్, వెంకటేశ్‌ అయ్యర్‌ (భారత్‌), ముజీబ్, నవీన్‌ ఉల్‌ హక్‌ (అఫ్గానిస్తాన్‌), సీన్‌ అబాట్, అస్టన్‌ అగర్, కూపర్‌ కొనొల్లీ, జేక్‌ ఫ్రెజర్‌ మెక్‌గుర్క్, కామెరూన్‌ గ్రీన్, జోష్‌ ఇన్‌గ్లిస్, స్టీవ్‌ స్మిత్‌ (ఆ్రస్టేలియా), ముస్తఫిజుర్‌ రహమాన్‌ (బంగ్లాదేశ్‌), అట్కిన్సన్, టాప్‌ బాంటన్, టామ్‌ కరన్, లియామ్‌ డాసన్, బెన్‌ డకెట్, డాన్‌ లారెన్స్, లివింగ్‌స్టోన్, టైమల్‌ మిల్స్, జేమీ స్మిత్‌ (ఇంగ్లండ్‌), ఫిన్‌ అలెన్, మైకేల్‌ బ్రేస్‌వెల్, డెవాన్‌ కాన్వే, జాకబ్‌ డఫీ, మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జెమీసన్, ఆడమ్‌ మిల్నె, డారిల్‌ మిచెల్, విల్‌ ఓ రూర్కె, రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌), గెరాల్డ్‌ కోట్జీ, డేవిడ్‌ మిల్లర్, ఇన్‌గిడి, అన్రిచ్‌ నోర్జే, రిలీ రూసో, తబ్రేజ్‌ షమ్సీ, డేవిడ్‌ వీస్‌ (దక్షిణాఫ్రికా), హసరంగ, మతీశ పతిరణ, మహేశ్‌ తీక్షణ (శ్రీలంక), జేసన్‌ హోల్డర్, షై హోప్, అకీల్‌ హుసేన్, అల్జారీ జోసెఫ్‌ (వెస్టిండీస్‌).

Indias second ODI against South Africa today10
సిరీస్‌ విజయంపై భారత్‌ గురి

రాయ్‌పూర్‌: వన్డే క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికాపై గత మ్యాచ్‌లో పైచేయి సాధించిన భారత్‌ ఇప్పుడు మరో విజయంపై గురి పెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే రెండో వన్డేలో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, దక్షిణాఫ్రికా కోలుకోవాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో 349 పరుగులు చేసిన తర్వాత కూడా కేవలం 17 పరుగుల తేడాతో భారత్‌ గెలవడం ఇరు జట్ల మధ్య బలమైన పోటీని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయం. మార్పుల్లేకుండా... భారత్‌ ఆడిన గత వరుస రెండు వన్డేల్లో ఒక మ్యాచ్‌లో (ఆ్రస్టేలియాతో) రోహిత్‌ శర్మ, మరో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి సెంచరీలు సాధించి తమ విలువేంటో చూపించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి ప్రదర్శనపై చర్చ అనవసరం. భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఇలాంటి స్థితిలో జట్టు సిరీస్‌ సాధించడంపైనే పూర్తిగా దృష్టి పెట్టింది. తొలి మ్యాచ్‌లో మన జట్టు ఆటను చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రిషభ్‌ పంత్‌ మరోసారి పెవిలియన్‌కే పరిమితం కావచ్చు. యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్‌ తమ సత్తాను ప్రదర్శించే ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. రాంచీ వన్డే ప్రదర్శన తర్వాత పేసర్‌ హర్షిత్‌ రాణాపై విమర్శలు తగ్గాయి. బరిలోకి బవుమా... తొలి వన్డేతో పోలిస్తే దక్షిణాఫ్రికా జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ తెంబా బవుమాతో పాటు స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ కూడా బరిలోకి దిగుతున్నాడు. రికెల్టన్, సుబ్రాయెన్‌ స్థానాల్లో వీరు ఆడతారు. రాంచీలో ఓడినా దక్షిణాఫ్రికా చివరి వరకు పట్టుదలను ప్రదర్శించింది. అంచనాలకు తగినట్లు బ్రీట్‌కీ, బ్రెవిస్‌ రాణించగా, మార్క్‌రమ్‌ వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. ఆల్‌రౌండర్లు యాన్సెన్, కార్బిన్‌ బాష్‌ బ్యాటింగ్‌ జట్టుకుఅదనపు బలంగా మారింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement