ప్రధాన వార్తలు
'అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్.. నిజంగా ఇదొక సర్ప్రైజ్'
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్కు టీ20 వరల్డ్కప్-2026 జట్టులో చోటు దక్కలేదు. మొన్నటివరకు వైస్ కెప్టెన్గా గిల్ను ఇప్పుడు ఏకంగా జట్టు నుంచే తప్పించారు. పేలవ ఫామ్ కారణంగా అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. ఈ ఏడాది ఆసియాకప్తో తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన గిల్ తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు.అతడి కోసం ఇన్ ఫామ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను టీమ్ మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికి గిల్పై మెనెజ్మెంట్ నమ్మకం ఉంచింది. కానీ ఆ నమ్మకాన్ని శుభ్మన్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు.అయితే సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్ ప్రస్తుత ఫామ్ ఆందోళనకరంగా ఉన్నప్పటికి.. అతడిలోని టాలెంట్ ఎప్పటికి పోదు అని గవాస్కర్ అన్నారు."నిజంగా ఇది సర్ప్రైజ్. గిల్ ఒక క్వాలిటీ బ్యాటర్. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో కూడా పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో అతడు విఫలమయ్యాడు. అందుకు నేను అంగీకరిస్తా.కానీ ఫామ్ అనేది తాత్కాలికం, క్లాస్ అనేది శాశ్వతం. టీ20 ఫార్మాట్కు చాలా కాలం దూరంగా ఉండటం వల్లే గిల్ తన రిథమ్ను కోల్పోయాడు. టెస్టు క్రికెట్లో దుమ్ములేపుతున్న గిల్కు టీ20 శైలి అలవడటానికి కొంత సమయం పడుతుందని" స్టార్ స్పోర్ట్స్ షోలో గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా శుభ్మన్ గిల్ స్ధానంలో జట్టులోకి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వచ్చాడు. రెండేళ్ల తర్వాత అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్?
విజయానికి చేరువలో ఆస్ట్రేలియా.. అదే జరిగితే?
అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో విజయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల దూరంలో నిలిచింది. 435 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇంకా 228 రన్స్ వెనుకంజలో ఉంది. పర్యాటక జట్టు విజయం సాధించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. క్రీజులో జెమ్మీ స్మిత్ (2), విల్ జాక్స్ (11) ఉన్నారు. భారీ లక్ష్య చేధనలో ఇంగ్లీష్ జట్టును ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకొట్టాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను బ్యాక్ఫుట్లో ఉంచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(85) టాప్ స్కోరర్గా నిలవగా.. జోరూట్ (39) కాస్త ఫర్వాలేదన్పించాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్తో పాటు పాట్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.హెడ్ సూపర్ సెంచరీ..అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 349 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (219 బంతుల్లో 170 , 16 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా.. అలెక్స్ కారీ 72 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే మరో రెండు టెస్టులు మిగిలూండగానే యాషెస్ సిరీస్ను కంగారులు సొంత చేసుకోనున్నారు.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్?
బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్?
టీ20 ప్రపంచకప్-2026కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో ఆల్రౌండర్ అక్షర్పటేల్ను తిరిగి వైస్ కెప్టెన్గా నియమించారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ను మాత్రం కెప్టెన్గా సెలక్టర్లు కొనసాగించారు. కానీ వచ్చే ఏడాది ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ను తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది.పేలవ ఫామ్లో సూర్య..స్కై కెప్టెన్గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ.. బ్యాటర్గా మాత్రం అట్టర్ప్లాప్ అయ్యాడు. ఒకప్పుడు టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగిన ఈ ముంబై ఆటగాడు.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. గత 14 నెలల్లో 24 టీ20 మ్యాచ్లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్పై పడుతున్నట్లు బీసీసీఐ భావిస్తోంది.దీంతో అతడి స్దానంలో మరో ఆటగాడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు ఇండియా టూడే తమ కథనంలోపేర్కొంది. వాస్తవానికి సూర్యను కెప్టెన్సీ నుంచి ముందే తొలగించాలని భావించినప్పటికీ.. మరికొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ఉండడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మెగా టోర్నీ ముందు ప్రయోగాలు చేయడం ఇష్టం లేక సూర్యనే కెప్టెన్గా ఎంపిక చేశారు. సూర్యకు కెప్టెన్గా ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు.కెప్టెన్సీ రికార్డు అదర్స్..సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటివరకు 35 మ్యాచ్లు ఆడిన భారత్.. ఏకంగా 28 విజయాలు సాధించింది. 5 మ్యాచ్ ఓడిపోగా.. మరో రెండింట ఫలితం రాలేదు. అతడి విజయశాతం 84.9%గా ఉంది. కానీ అతడి పేలవ ఫామ్ను టీమ్ మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది.కెప్టెన్సీ రేసులో అక్షర్, హార్దిక్..!అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. అటువంటిది గిల్ను టీ20 కెప్టెన్గా చేస్తారంటే నమ్మశక్యం కావడం లేదు. టీ20 కెప్టెన్సీ రేసులో స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అక్షర్ను తిరిగి వైస్ కెప్టెన్గా నియమించారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది హార్దిక్కు కెప్టెన్గా అనుభవం ఉందని, తిరిగి అతడికి జట్టు ప్గాలు అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు. భారత జట్టుకు తదుపరి టీ20 కెప్టెన్ ఎవరో తెలియాలంటే ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి దేశవాళీ క్రికెట్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ- 2025 వన్డే టోర్నీ కోసం బెంగాల్ జట్టుకు షమీ ఎంపికయ్యాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కనబరిచిన ఫామ్ను.. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో కూడా కొనసాగించాలని షమీ భావిస్తున్నాడు. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. డొమాస్టిక్ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రస్తుత దేశవాళీ సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 36 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్లు ఆడి 20 వికెట్లు పడగొట్టిన షమీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు తీసి బెంగాల్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.బెంగాల్ జట్టులో షమీతో పాటు భారత పేసర్లు ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ సైతం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు కెప్టెన్గా వెటనర్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. బెంగాల్ ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. బెంగాల్ తమ తొలి మ్యాచ్లో 24న రాజ్కోట్ వేదికగా తలపడనుంది.షమీ విషయానికి వస్తే.. చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్నెస్ సమస్యలు అంటూ అతడిని తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్లు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది.విజయ్ హజారే ట్రోఫీకి బెంగాల్ జట్టుఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఘరామి, సుమంత్ గుప్తా, సుమిత్ నాగ్ (వికెట్ కీపర్), చంద్రహాస్ డాష్, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, సయన్ ఘోష్, రవి కుమార్, అమీర్ ఘనీ, విశాల్ భాటి, అంకిత్ మిశ్రా.చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ వరల్డ్కప్ జట్టులో ఊహించని మార్పులు చేసింది. ఏకంగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పైనే వేటు వేశారు. ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో గిల్కు చోటు దక్కలేదు.అతడి స్దానంలో అక్షర్ పటేల్ను తిరిగి వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. అదేవిధంగా సెలక్టర్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు పిలిపునిచ్చారు. దీంతో నిన్నటివరకు జట్టులో ఉన్న వికెట్ కీపర్ జితీష్ శర్మను పక్కన పెట్టేశారు.తను ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన జితీష్పై వేటు వేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే జితేష్ శర్మను ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు కాంబినేషన్ల కోసమే జితీష్ను పక్కన పెట్టినట్లు అజిత్ తెలిపాడు."టీ20ల్లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు జట్టు కాంబినేషన్ల దృష్ట్యా అతడికి వరల్డ్కప్ జట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా టాప్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ మాకు కావాలి. సంజూ శాంసన్ మాకు ప్రధాన వికెట్ కీపర్, ఓపెనర్గా ఉన్నాడు. సంజూకు బ్యాకప్ ఓపెనర్, వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ సరైనోడు అని భావించాము.అతడికి ఓపెనర్గా అనుభవం ఉంది. అందుకే జితేష్కు బదులుగా కిషన్ను జట్టులో తీసుకున్నాడు. అలాగే లోయార్డర్లో రింకూ సింగ్ ఫినిషర్గా ఉంటాడు. బ్యాటింగ్ ఆర్డర్లో జితీష్ స్ధానాన్ని రింకూ భర్తీ చేస్తాడు. జితీష్ అద్బుతమైన ప్లేయర్ అయినప్పటికి జట్టు కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు" అని ప్రెస్ కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు రింకూ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.అతడి స్ధానంలో జితీష్ ఫినిషర్గా కొనసాగాడు. ఇప్పుడు వరల్డ్కప్లో రింకూ ఫినిషర్గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక కిషన్ కూడా ప్రస్తుతం అద్భతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) కిషన్ దుమ్ములేపాడుఏ. 10 మ్యాచ్లలో 57.44 సగటుతో 571 పరుగులు చేశాడు. ఫైనల్లో సంచలన సెంచరీతో చెలరేగిన కిషన్.. జార్ఖండ్కు తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.
అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదు: అజిత్ అగార్కర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస మ్యాచ్లలో విఫలమవుతున్నా ఇన్నాళ్లు టీ20 జట్టు ఓపెనర్గా కొనసాగించిన శుబ్మన్ గిల్ (Shubman Gill)పై ఎట్టకేలకు వేటు వేసింది. ఊహించని రీతిలో ప్రపంచకప్-2026 జట్టు నుంచి అతడిని తప్పించింది.వైస్ కెప్టెన్గా రీఎంట్రీటీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా.. టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ విషయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్తో వైస్ కెప్టెన్గా భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు గిల్.దీంతో దాదాపు ఏడాది కాలంపాటు అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి ఓపెనర్గా సత్తా చాటిన సంజూ శాంసన్కు కష్టాలు మొదలయ్యాయి. గిల్ను అభిషేక్ జోడీగా ఆడించిన యాజమాన్యం.. సంజూను తొలుత వన్డౌన్లో.. ఆ తర్వాత మిడిలార్డర్కు పంపింది. క్రమక్రమంగా తుదిజట్టు నుంచే తప్పించింది.వరుస మ్యాచ్లలో విఫలం వికెట్ కీపర్గానూ సంజూకు బదులు ఫినిషర్గా ఉపయోగపడే జితేశ్ శర్మకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే, సంజూ స్థానంలో ఓపెనర్గా తిరిగి వచ్చిన గిల్ వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు. అంతకు ముందు కూడా అతడి ప్రదర్శన అంతంత మా త్రమే.గత ఇరవై ఒక్క ఇన్నింగ్స్లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).చివరగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. మూడో టీ20లో 28 బంతుల్లో 28 పరుగులు చేయగలిగాడు. అయితే, పాదానికి గాయమైన కారణంగా ఆఖరి రెండు టీ20ల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ క్రమంలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దు కాగా.. ఐదో టీ20తో సంజూ తుదిజట్టులోకి వచ్చాడు.నిరూపించుకున్న సంజూఅహ్మదాబాద్ వేదికగా ధనాధన్ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 37) ఆడి తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు సంజూ. గిల్ మూడు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగుల కంటే ఒక్క ఇన్నింగ్స్లోనే సంజూనే ఎక్కువ పరుగులు చేయడం విశేషం.ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గిల్ కోసం ఇంకెన్నాళ్లు సంజూను బలిచేస్తారని రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏకంగా ప్రపంచకప్ జట్టు నుంచే గిల్ను తప్పించడం సంచలనంగా మారింది.అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదుఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ... ‘‘శుబ్మన్ గిల్ పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడు. 2024 వరల్డ్కప్ జట్టులోనూ అతడు లేడు.మీ, నా అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. కొన్నిసార్లు జట్టు ఎంపిక అత్యంత క్లిష్టంగా ఉంటుంది. గిల్ ఇప్పటకీ నాణ్యమైన ఆటగాడే అని మేము నమ్ముతున్నాం. ఫామ్ విషయంలో ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజమే.అయితే, జట్టు కూర్పునకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాంటపుడు కొందరికి స్థానం దక్కదు. అతడు మెరుగైన ఆటగాడు కాదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని అనుకోకూడదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో మనకెన్నో మంచి మంచి ఆప్షన్లు ఉన్నాయి’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!
గిల్కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్-2026కు ప్రకటించిన భారత జట్టులో గిల్కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో తిరిగి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించింది.ఈ ఏడాది ఆసియాకప్తో తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన గిల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో కూడా గిల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి మూడు మ్యాచ్లలో ఘోరంగా విఫలమైన గిల్ను ఆఖరి రెండు టీ20లకు గాయం పేరిట టీమ్ మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. దీంతో అతడి స్దానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇకపై సంజూను ఓపెనర్గా కొనసాగించాలని మెనెజ్మెంట్ నిర్ణయించారు. ఈ కారణంతోనే గిల్ను వరల్డ్కప్ జట్టు నుంచి పక్కన పెట్టారు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం ధ్రువీకరించాడు. గిల్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడని, గత టీ20 వరల్డ్కప్లో కూడా అతడు ఆడలేదని అగార్కర్ వెల్లడించాడు.కిషన్కు ఛాన్స్..!ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కిషన్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకుంది. అయితే నిన్నటి వరకు టీ20 జట్టులో భాగంగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జితీష్ శర్మపై సెలక్టర్లు వేటు వేశారు. అతడి స్ధానంలోనే సెకెండ్ వికెట్ కీపర్గా కిషన్ను సెలక్ట్ చేశారు. అదేవిధంగా సౌతాఫ్రికా సిరీస్కు దూరంగా ఉన్న ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టునే వరల్డ్కప్ టోర్నీకి ఎంపిక చేశారు. ఇదే జట్టు న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో తలపడనుంది.కిషన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు తిరిగి జట్టులోకి తీసుకున్నారు. కాగా టీ20 వరల్డ్కప్-2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.
BCCI: వరల్డ్కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. గిల్ అవుట్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ ఇదే జట్టు ఆడుతుందని బోర్డు స్పష్టం చేసింది. ఇక అనూహ్య రీతిలో.. వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ (Shubman Gill)కు ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు. అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) సూర్య డిప్యూటీగా నియమితుడయ్యాడు. మరోవైపు.. జితేశ్ శర్మ విషయంలోనూ యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది.జితేశ్కూ దక్కని చోటు.. దూసుకు వచ్చిన ఇషాన్తుదిజట్టులో గిల్ ఉండేలా.. సంజూ ఓపెనింగ్ స్థానం త్యాగం చేయించిన మేనేజ్మెంట్.. వికెట్ కీపర్గా జితేశ్కు పెద్ద పీట వేసి లోయర్ ఆర్డర్లో ఆడించింది. అయితే, ప్రపంచకప్ జట్టు నుంచి జితేశ్ను తప్పించి.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్గా, బ్యాటర్గా దుమ్ములేపిన ఇషాన్ కిషన్ను తీసుకువచ్చింది. అతడిని బ్యాకప్ ఓపెనర్గా ఉపయోగించుకుంటామని తెలిపింది.అదే విధంగా.. నయా ఫినిషర్గా పేరొందిన రింకూ సింగ్ను మేనేజ్మెంట్ కనికరించింది. మరోసారి వరల్డ్కప్ జట్టులో భాగమయ్యే అవకాశం ఇచ్చింది. ఇక వరుస వైఫల్యాల నేపథ్యంలోనే గిల్ను జట్టు నుంచి తప్పించినట్లు స్పష్టమవుతోంది. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్కప్ టోర్నీకి ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. కొత్తగా బీసీసీఐ కార్యదర్శిఈసారి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనే జట్టును కూడా ప్రకటించడం విశేషం.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.చదవండి: WC 2026: ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?.. ‘ఎక్స్ ఫ్యాక్టర్’ ఎవరంటే?
ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?
టీ20 ప్రపంచకప్-2021లో ఆడింది మూడు మ్యాచ్లు.. పదకొండు ఓవర్ల బౌలింగ్లో 75 పరుగులు సమర్పించుకున్నాడు.. అయితే, కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఏకంగా 33 పరుగులు ఇచ్చుకున్న సదరు భారత బౌలర్.. న్యూజిలాండ్తో మ్యాచ్లో 23, అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో 19 పరుగులు ఇచ్చాడు.మిస్టరీ స్పిన్నర్తో ఫలితాలు రాబట్టవచ్చని జట్టులోకి తీసుకుంటే అతడి వల్ల జట్టుకు పెద్దగా ప్రయోజనమేమీ చేకూరలేదు. అలా తొలి ప్రపంచకప్ టోర్నీయే అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కీలక మ్యాచ్లలో వికెట్లు తీయకపోవడంతో కొందరు అభిమానులు సైతం అతడిని ఓ భారంగా, విలన్గా అభివర్ణించారు కూడా!ఇక అతడి పని అయిపోయినట్లేనని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జాతీయ జట్టులో చోటు కరువైంది. కానీ అతడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలగా శ్రమించాడు. ఐపీఎల్లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. అతడు ప్రాతినిథ్యం వహించిన జట్టుకు మెంటార్గా ఉన్న వ్యక్తి టీమిండియా హెడ్కోచ్గా రావడంతో అతడి పునరాగమనానికి బాటలు పడ్డాయి.ముఖ్యంగా టీ20 జట్టులో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈసారి 2.0 వర్షన్ చూపించాడు అతడు!.. ఈ ఏడాది టీమిండియా 20 టీ20లలో ఏకంగా 36 వికెట్లు కూల్చాడు. తద్వారా టెస్టు హోదా ఉన్న దేశాలపై ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్గా నిలిచాడు.రీఎంట్రీలో సూపర్ హిట్అవును.. ఈ ఉపోద్ఘాతమంగా వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) గురించే!.. గత కొంతకాలంగా భారత టీ20 జట్టులో ఈ మిస్టరీ స్పిన్నర్దే కీలక పాత్ర. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ... మ్యాచ్ను తమవైపు తిప్పగల సత్తా ఉందని నమ్మిన మేనేజ్మెంట్కు అందుకు తగ్గ ఫలితాలు చూపించాడు. మొత్తంగా రీఎంట్రీలో అతడు ఏకంగా 49 వికెట్లు కూల్చడం అతడి నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం.తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. తన వైవిధ్యభరితమైన బౌలింగ్తో గూగ్లీ, క్యారమ్ బాల్, స్లేడర్.. ఇలా వివిధ రీతుల్లో బంతులు సంధిస్తూ బ్యాటర్లను తిప్పలు పెడుతూ వికెట్లు పడగొట్టాడు. అతడి లైన్ అండ్ లెంగ్త్ కూడా ఓ పట్టాన బ్యాటర్కు అర్థం కాదు.అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసి.. భారీ భాగస్వామ్యాలను విడదీయడంలోనూ వరుణ్ దిట్ట. వికెట్లు తీయడం మీద మాత్రమే అతడి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. 2025లో అతడి ఎకానమీ 6.7గా ఉంది.తాజాగా అహ్మదాబాద్లో ఐదో టీ20లోనూ వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఓవరాల్గా ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లలో కలిపి పది వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.ఒకప్పుడు విలన్.. ఇపుడు హీరోఇక ఈసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఉపఖండ పిచ్లపై జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియాకు వరుణ్ చక్రవర్తి ‘ఎక్స్’ ఫ్యాక్టర్ కాబోతున్నాడు. ఆటలో నైపుణ్యమే కాదు.. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న వరుణ్.. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా మరోసారి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించడం పక్కా. గత ఏడాది కాలంగా అతడి గణాంకాలు, నిలకడైన ఆటే ఇందుకు నిదర్శనం.అట్లు ఇటీవల ఆసియా కప్-2025 టీ20లో భారత్ చాంపియన్గా నిలవడంలో వరుణ్దే ముఖ్య పాత్ర. పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో ప్రభావం చూపిన ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత కూడా వరుసమ్యాచ్లలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుని.. ఐసీసీ నంబర్ వన్ టీ20 బౌలర్గా ఈ ఏడాదిని ముగించాడు.కాగా 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా 2022లో సెమీ ఫైనల్ చేరినా ఆఖరి వరకు పోరాడలేకపోయింది. 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి టైటిల్ గెలుచుకుంది. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!
T20 Match: భారత్– శ్రీలంక జట్లు ముమ్మర ప్రాక్టీస్
విశాఖ స్పోర్ట్స్ : భారత్ – శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ20 సిరీస్ కోసం రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ ఆదివారం జరగనుండగా.. రెండో మ్యాచ్ 23న జరగనుంది. శుక్రవారం వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు విశాఖ వేదికగా ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనుండగా మిగిలిన మూడు మ్యాచ్లు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు. శ్రీలంక జట్టు ఈసారి యువ స్పిన్నర్లతో భారత్ను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండు చేతులతోనూ స్పిన్ చేయగల సామర్థ్యం ఉన్న శశినితో పాటు కావ్య, రష్మిక వంటి యువ క్రీడాకారిణులు ఆ జట్టుకు అదనపు బలంగా మారారు. కెప్టెన్ చమరి ఆటతో పాటు ఇనోకా బౌలింగ్ కూడా లంకకు కీలకం కానుంది. బ్యాటింగ్ విభాగంలో ఇటీవల వరల్డ్ కప్లో రాణించిన హాసిని, విష్మి, హరిషత, నీలాక్షిక వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో శ్రీలంక పటిష్టంగా కనిపిస్తోంది.బలంగా టీమిండియామరోవైపు భారత జట్టు కూడా సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జట్టులో కీలక మార్పులు చేసింది. రాధ, యాస్టికా, నయాలి స్థానాల్లో వికెట్ కీపర్ బ్యాటర్ కమలిని, స్పిన్నర్ వైష్ణవిలను తుది జట్టులోకి తీసుకుంది. ప్రాక్టీస్ సెషన్లో చురుగ్గా పాల్గొన్న వీరిద్దరూ విశాఖ వేదికగా టీ20 అరంగేట్రం చేయబోతున్నారు. భారత జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు దీప్తి, షఫాలీ, జెమిమా, రిచా వంటి స్టార్ క్రీడాకారిణులు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. తొలి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
ధీరజ్కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ జాతీయ సీనియర్ ఆర్చ...
సాత్విక్–చిరాగ్ జోడీకి రెండో విజయం
హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్...
Year Ender 2025: వైభవ్, దివ్య, శీతల్.. మరెన్నో విజయాలు
భారత క్రీడా రంగంలో ఈ ఏడాది యువ ప్లేయర్లు దుమ్ములే...
భారత ఫుట్బాల్కు ఉజ్వల భవిత: మెస్సీ
న్యూఢిల్లీ: భారత్లో ఫుట్బాల్కు ఉజ్వల భవిష్యత్తు...
గిల్కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు ...
BCCI: వరల్డ్కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. గిల్ అవుట్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ ...
ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?
టీ20 ప్రపంచకప్-2021లో ఆడింది మూడు మ్యాచ్లు.. పదక...
గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?: రవిశాస్త్రి ఫైర్
గత ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ కీల...
క్రీడలు
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (ఫోటోలు)
కోల్కతాలో మెస్సీ మాయ.. (ఫోటోలు)
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
‘విరుష్క’ పెళ్లి రోజు.. అందమైన ఫొటోలు
వీడియోలు
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
IPL Auction 2026: ఈసారి కూడా కప్పు పాయే!
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్
ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
ధర్మశాలలో భారత్ పంజా..
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
హైదరాబాద్ కు మెస్సీ.. ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు!
