Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026 Auction LIVE Updates And Highlights1
మరి కాసేపట్లో ఐపీఎల్‌-2026 వేలం ప్రారంభం..

IPL 2026 Auction LIVE Updates And Highlights: ఐపీఎల్‌-2026 మినీ వేలం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 77 స్ధానాలను గాను ఈ వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 369 ప్లేయ‌ర్లు త‌మ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉన్నాయి. కేకేఆర్‌ తర్వాత స్ధానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌(43.4 కోట్లు) నిలిచింది. పది ఫ్రాంఛైజీల్లో రూ.2.75 కోట్ల పర్స్‌తో ముంబై ఇండియన్స్‌ చివరిస్థానంలో ఉంది. గ్రీన్‌పై అందరి కళ్లు?ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. గతేడాది సీజన్‌కు దూరంగా ఉన్న గ్రీన్‌ను ఈసారి తమ జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ముఖ్యంగా కేకేఆర్‌, సీఎస్‌కే మధ్య పోటీ నెలకొనే ఛాన్స్‌ ఉంది. అతడితో రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి ఆట‌గాళ్ల‌కు భారీ ధ‌ర దక్కనున్నట్లు క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

U19 Asia Cup 2025: Vaibhav Suryavanshi Blazes To Quick Fifty But2
దంచికొట్టిన వైభవ్‌ సూర్యవంశీ.. కానీ..

మలేషియాతో మ్యాచ్‌లో భారత అండర్‌-19 స్టార్‌ వైభవ్‌ సూర్యవంశీ ధనాధన్‌ దంచికొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం పాతిక బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025 టోర్నీలో భాగంగా.. మంగళవారం మలేషియాతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.దుబాయ్‌ వేదికగా ఈ యూత్ వన్డేలో భారత ఓపెనర్‌, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (7 బంతుల్లో 14) నిరాశపరచగా.. వైభవ్‌ (Vaibhav Suryavanshi)మాత్రం తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.దంచికొట్టిన వైభవ్‌ సూర్యవంశీ.. కానీఅయితే, హాఫ్‌ సెంచరీ పూర్తైన వెంటనే వైభవ్‌ సూర్యవంశీ అవుట్‌ కావడం అభిమానులను నిరాశపరిచింది. మలేషియా బౌలర్‌ ముహమ్మద్‌ అక్రమ్‌ బౌలింగ్‌లో ముహమ్మద్‌ ఎన్‌ ఉర్హానిఫ్‌నకు క్యాచ్‌ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా ఆయుశ్‌తో కలిసి వైభవ్‌ తొలి వికెట్‌కు 9 బంతుల్లో 21... రెండో వికెట్‌కు విహాన్‌ మల్హోత్రా (Vihaan Malhotra)తో కలిసి 26.. వేదాంత్‌తో కలిసి మూడో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు.అర్ధ శతకాలు పూర్తిఇదిలా ఉంటే.. మలేషియాతో మ్యాచ్‌లో వన్‌డౌన్లో వచ్చిన విహాన్‌ మల్హోత్రా (7) విఫలం కాగా.. మిగిలిన వారిలో వేదాంత్‌ త్రివేది (90) తృటిలో సెంచరీ చేజార్చున్నాడు. అభిజ్ఞాన్‌ కుందు ఏకంగా అజేయ డబుల్‌ సెంచరీ (125 బంతుల్లో 209)తో దుమ్ములేపాడు. ఫలితంగా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు సాధించింది యువ భారత్‌.కాగా గ్రూప్‌-ఎలో భాగంగా భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో యూఏఈని 234 పరుగుల తేడాతో మట్టికరిపించింది. అనంతరం దాయాది పాకిస్తాన్‌పై 90 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్‌.. మంగళవారం నామమాత్రపు మ్యాచ్‌లో మలేషియాను ఓడించి అజేయంగా నిలవాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే.. యూఏఈపై శతక్కొట్టిన వైభవ్‌.. పాక్‌తో మ్యాచ్‌ (5)లో మాత్రం విఫలమయ్యాడు.చదవండి: సర్ఫరాజ్‌కు జాక్‌పాట్‌!.. మాక్‌ వేలంలో అమ్ముడు పోయిన ప్లేయర్లు వీరే

Lionel Messi Fans thank Mumbai Police at Wankhede Stadium3
కోల్‌క‌తాలో అలా.. ముంబైలో ఇలా..

ఎవ‌రైనా బాగా ప‌నిచేస్తే ప్ర‌శంస‌లు ద‌క్క‌డం స‌హ‌జం. మీరిక్క‌డ చూస్తున్న‌ ఫొటో అలాంటి సంద‌ర్భంలోదే. ముంబై పోలీసుల‌ను ఫుట్‌బాల్ అభిమానులు మెచ్చుకుంటున్న దృశ్యంలోని ఫొటోలివి. వాంఖ‌డే స్టేడియం వ‌ద్ద ఆదివారం అరుదైన దృశ్యాలు క‌నిపించాయి. వంద‌లాది మంది అభిమానులు పోలీసుల ఎదుట గుమిగూడి చ‌ప్ప‌ట్లు కొడుతూ.. 'థ్యాంక్యు' అంటూ నిన‌దించారు. అంత‌మంది త‌మ‌ను పొగుడుతుంటే ముంబై పోలీసులు చిరున‌వ్వులు చిందిస్తూ చూస్తుండి పోయారు.అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లయోన‌ల్ మెస్సీ (Lionel Messi).. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో సంద‌డి చేశాడు. ఆయ‌న‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. స్టేడియంలోని అభిమానుల‌కు అభివాదం చేస్తూ మెస్సీ ప‌ల‌క‌రించ‌డంతో వారంతా ఆనందాశ్చ‌ర్యాలు వ్య‌క్తం చేశారు. మెస్సీతో పాటు స్టేడియంలో ఇండియా క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, భార‌త ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, బాలీవుడ్ హీరోలు అజ‌య్ దేవ్‌గ‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. వీరందరినీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.చ‌ప్ప‌ట్లు కొడుతూ.. థ్యాంక్స్కార్య‌క్ర‌మాలన్నీ స‌జావుగా సాగ‌డంతో వాంఖ‌డే స్టేడియానికి వ‌చ్చిన అభిమానులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. స్టేడియం నుంచి వెళుతూ ముంబై పోలీసుల‌కు థ్యాంక్స్ చెప్పారు. త‌మ‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశార‌ని మెచ్చుకున్నారు. ఉత్సాహంగా చ‌ప్ప‌ట్లు కొడుతూ పోలీసుల‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా (Viral) మారాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ముంబై పోలీసుల‌పై సోష‌ల్ మీడియా వేదికగా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ముంబై పోలీసు సిబ్బంది బాగా ప‌నిచేస్తార‌ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.అర్థ‌మ‌వుతోందా?''శాంతిభ‌ద్ర‌త‌ల నిర్వ‌హ‌ణ ప‌రంగా ముంబై పోలీసు (Mumbai Police) వ్య‌వ‌స్థ ఉత్త‌మ‌మైన‌ది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వారు ప్రతిదీ సజావుగా నిర్వహిస్తార''ని ఓ నెటిజ‌న్ ప్ర‌శంసించారు. "నిస్సందేహంగా ఇది ఉత్తమ పోలీసు విభాగం, ఏడాది పొడవునా వారు ఇంత మంది ప్రజలను దారిలో పెడుతుంటారు. ఇది వారికి మామూలు రోజు లాంటిదేన''ని మ‌రొక‌రు మెచ్చుకున్నారు. ''గౌరవం హృదయం లోపలి నుండి రావాలి. మీరు వారిని అర్థం చేసుకోవాలి'' అంటూ కోల్‌క‌తా పోలీసుల‌ను ఉద్దేశించి మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pratik Pawaskar (@pawaskarpratik)కోల్‌క‌తాలో ఏం జ‌రిగింది?శ‌నివారం కోల్‌క‌తాలోని సాల్ట్‌లేక్ సేడియంలో మెస్సీ అభిమానులు (Messi Fans) విధ్వంసం సృష్టించారు. మెస్సీ కోసం ఎంతోగానే ఎదురు చూసిన అభిమానులను నిరాశ‌కు గురిచేయ‌డంతో వారంతా తీవ్రంగా స్పందించారు. త‌మ ఆరాధ్య ఫుట్‌బాల‌ర్ ప‌ట్టుమ‌ని 10 నిమిషాలు కూడా లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ ఆగ్ర‌శావేశాల‌కు లోన‌య్యారు. వాట‌ర్ బాటిళ్లు, కుర్చీలను మైదానంలోకి విసిరేశారు, ఫ్లెక్సీలు చించేశారు. అభిమానుల వీరంగంతో సాల్ట్‌లేక్ సేడియం ర‌ణ‌రంగంగా మారిపోయింది. అభిమానుల‌ను నియంత్రించ‌లేక కోల్‌క‌తా పోలీసులు చేతులెత్తేశారు. మ‌రోవైపు ఈవెంట్ నిర్వాహ‌కుడు శ‌ర‌త్రు ద‌త్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. త‌మ పౌరుల ప్ర‌వ‌ర్త‌న, ఈవెంట్ నిర్వ‌హ‌ణ వైఫ‌ల్యంపై మెస్సీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. కాగా, అభిమానులకు టిక్కెట్ డ‌బ్బులు వెన‌క్కు ఇచ్చేస్తామ‌ని నిర్వ‌హ‌కుడు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.చ‌ద‌వండి: మెస్సీ అందుకే ఇండియాలో మ్యాచ్‌లు ఆడ‌లేదు!

IPL Auction 2026: What is IPL Auction Explained Interesting Details?4
IPL: అసలు ఎందుకీ వేలం?.. పన్నెండు ఆసక్తికర అంశాలు

క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 వేలమే హాట్‌టాపిక్‌. అబుదాబి వేదికగా మంగళవారం వేలం పాటకు రంగం సిద్ధమైంది. అన్ని ఫ్రాంఛైజీలలో కలిపి మొత్తం 77 ఖాళీలు ఉండగా.. 359 మంది క్రికెటర్లు పోటీలో ఉన్నారు.ఇంతకీ అసలు ఈ వేలంపాట ఎందుకు నిర్వహిస్తారు? ఆటగాళ్లను మార్చుకోకుండా.. ఆక్షన్‌ ద్వారానే ఎందుకు కొనుగోలు చేస్తారు? బిడ్డింగ్‌ ఎలా జరుగుతుంది? తదితర పన్నెండు ఆసక్తికర అంశాలు ఈ సందర్భంగా తెలుసుకుందాం!ఎందుకీ ఐపీఎల్‌ వేలం?లీగ్‌లో భాగమైన పది ఫ్రాంఛైజీలు.. వచ్చే సీజన్‌కు గానూ తమ జట్లను నిర్మించుకోవడం, పటిష్టం చేసుకోవడం కోసం బిడ్లు వేస్తాయి. తమ పర్సులో ఉన్న మొత్తం ద్వారా వేలంలో అందుబాటులో ఉ‍న్న ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి.వేలం ఎవరు నిర్వహిస్తారు?భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఈ వేలాన్ని నిర్వహిస్తుంది. ఇండిపెండెంట్‌ ఆక్షనీర్‌ వేలంపాట పాడతారు. నిబంధనలకు అనుగుణంగా బిడ్లను పూర్తి చేసేలా చూసుకుంటారు. తొలుత పురుషులు మాత్రమే ఐపీఎల్‌ ఆక్షనీర్లుగా ఉండగా.. గత కొంతకాలంగా మల్లికా సాగర్‌ ఆక్షనీర్‌గా సత్తా చాటుతున్నారు.వేలానికి బదులు సింపుల్‌గా ఆటగాళ్లను మార్చుకోవచ్చా?ఫ్రాంఛైజీ మధ్య పోటీతత్వం, సమాన అవకాశాలు దక్కాలంటే వేలం నిర్వహణ తప్పనిసరి. పర్సులో అధిక మొత్తం కలిగిన ఫ్రాంఛైజీలు తొలుత టాప్‌ ప్లేయర్లందరినీ సొంతం చేసుకుంటే.. మిగతా ఫ్రాంఛైజీల జట్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.అందుకే వేలం ద్వారానే ఆటగాళ్లను సొంతం చేసుకోవడం జరుగుతుంది. అయితే, ట్రేడింగ్‌ ద్వారా వేలానికి ముందు ఆటగాళ్లను మార్చుకునే వెసలుబాటు కూడా ఉంటుంది.ఐపీఎల్‌ వేలంలోకి ఆటగాళ్లు ఎలా వస్తారు?తమ దేశ క్రికెట్‌ బోర్డుల అనుమతితో ఆయా దేశాల ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంలో కనీస ధరతో తమ పేరును నమోదు చేసుకుంటారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు తమకు ఆసక్తి ఉన్న ప్లేయర్ల జాబితాను సమర్పించిన తర్వాత.. అధికారికంగా ఆటగాళ్లు వేలం బరిలో నిలుస్తారు. రిజిస్టర్‌ చేసుకున్న ప్రతి ఒక్కరు ఆక్షన్‌ పూల్‌లోకి రాలేరు.కనీస ధర అంటే ఏమిటి?ఓ ఆటగాడు తన స్థాయికి తగిన రీతిలో కనీస ధరతో వేలంలో నమోదు చేసుకుంటాడు. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు సాధారణంగా రూ. 20 లక్షలతో వేలంలోకి వస్తారు.నిజానికి వేలంలో వివిధ స్లాబులు ఉంటాయి. అయితే, కనీస ధర ఎక్కువగా ఉన్న ఆటగాళ్లు (సాధారణంగా రూ. 2 కోట్లతో స్టార్లు మాత్రమే ఉంటారు) సెలక్షన్‌ గ్యారెంటీ అనేమీ ఉండదు. ఫామ్‌ దృష్ట్యా ఫ్రాంఛైజీలు ఒక్కోసారి కనీస ధర అత్యంత తక్కువగా ఉన్న ఆటగాళ్లను కూడా కొనుగోలు చేస్తాయి.అదే విధంగా తమ జట్టుకు అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తాయి. అంతేకాదు ఆటగాడి వయసు కూడా ఇక్కడ కీలకమే.బిడ్డింగ్‌ వర్క్‌ ఎలా జరుగుతుంది?ఆక్షనీర్‌ ఆటగాడి పేరు చదవగానే.. సదరు ప్లేయర్‌పై ఆసక్తి ఉన్న ఫ్రాంఛైజీలు తమ పెడల్స్‌ను ఎత్తుతాయి. ఆటగాడిని దక్కించుకోవాలని భావిస్తే ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడుతూ ధరను పెంచుతూ పోతాయి. ఆఖరికి మిగతా వారితో పోలిస్తే అధిక ధర పలికిన ఫ్రాంఛైజీకే ప్లేయర్‌ దక్కుతాడు.పర్సు విలువ సమానమేనా?లీగ్‌లోని ప్రతి ఫ్రాంఛైజీ పర్సు విలువ సమానంగానే ఉంటుంది. తమకు కేటాయించిన మొత్తం నుంచే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అదే విధంగా విదేశీ ప్లేయర్ల సంఖ్యకు కూడా ఓ పరిమితి ఉంటుంది.రిటెన్షన్‌, రిలీజ్‌లు!వేలానికి ముందు తాము అట్టిపెట్టుకోవాలనుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు నిర్ణీత గడువులోగా సమర్పిస్తాయి. అదే విధంగా.. తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదులుతాయి. ఈ క్రమంలో పర్సులో మిగిలిన మొత్తం ఆధారంగా వేలంలో తమ వ్యూహాలను అమలు చేస్తాయి.అయితే, రిలీజ్‌ చేసిన ఆటగాడిని తిరిగి దక్కించుకునేందుకు రైట్‌ టు మ్యాచ్‌ (RTM) నిబంధన ద్వారా ఫ్రాంఛైజీలకు వెసలుబాటు ఉంటుంది. అంటే.. తాము వదిలేసిన ఆటగాడు సరసమైన ధరకే తిరిగి తమకు దొరికే క్రమంలో.. ఇతర ఫ్రాంఛైజీ ఎంత మొత్తమైతే చెల్లిస్తుందో అదే ధరకు అతడిని తిరిగి తాము కొనుగోలు చేసుకోవచ్చు.మినీ వేలం అంటే?జట్లలో స్వల్ప మార్పుల నిమిత్తం నిర్వహించేదే మినీ వేలం. రీషఫిల్‌లో భాగంగా ఫ్రాంఛైజీలు డెత్‌ ఓవర్‌ బౌలర్లు, పవర్‌ హిట్టర్లు, మణికట్టు స్పిన్నర్లు.. వంటి కచ్చితమైన నైపుణ్యాలున్న కొంతమంది ఆటగాళ్ల కోసం పోటీపడతాయి.అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు కూడా భారీ మొత్తం ఎలా?అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉండి.. తమ జట్టులో ఇమిడిపోతాడనుకుంటే అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లను సైతం ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించేందుకు వెనుకాడవు. ముఖ్యంగా ఇలాంటి యువ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తాయి. తద్వారా వారిని తమ జట్టులో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం భాగం చేసుకునే వీలు కలుగుతుంది. ఇందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ గతేడాది మెగా వేలంలో వైభవ్‌ సూర్యవంశీ అనే పద్నాలుగేళ్ల పిల్లాడిని రూ. 1.10 కోట్లకు కొనడం నిదర్శనం. అందుకు తగ్గట్లే విధ్వంసకర శతకంతో ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.అమ్ముడుపోకుండా ఉంటారెందుకు?ఫామ్‌లేమి, ఆటలో నిలకడలేకపోడం.. కనీస ధర అర్హత కంటే అధికంగా ఉందని ఫ్రాంఛైజీలు భావించడం వల్ల కొంతమంది ఆటగాళ్లు అమ్ముడుపోకుండా మిగిలిపోతారు. ఆటగాడి వయసు, వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఆటగాళ్ల కొనుగోలు అంశాన్ని ప్రభావితం చేశాయి.మరి ఆ ఆటగాడి పరిస్థితి ఏమిటి?తొలి రౌండ్లలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన ఆటగాడు.. ఫ్రాంఛైజీల ఆసక్తి దృష్ట్యా తదుపరి ఆక్సిలెరేటెడ్‌ రౌండ్‌లో వేలంలోకి వస్తారు. అప్పటికీ అమ్ముడుపోకుండా ఉంటే.. ఎవరైనా ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో వీరిని ఏ ఫ్రాంఛైజీ అయినా రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంటుంది. అదీ జరగదలేదంటే.. ఆసారికి సదరు ప్లేయర్‌ ఐపీఎల్‌లో భాగం కాడు.ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఎంత క్రేజ్‌ ఉందో.. వేలానికి కూడా అంతే ఆదరణ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన ఆటగాడు, జట్ల కూర్పు తదితర అంశాల దృష్ట్యా క్రికెట్‌ ప్రేమికులు వేలం పూర్తయ్యేవరకు స్క్రీన్లకే అతుక్కుపోతారనడంలో అతిశయోక్తిలేదు.చదవండి: IPL 2026 Auction: ఐపీఎల్‌ వేలంలో మనోళ్లు 17 మంది.. అదృష్టం వరించేనా

Australia announce playing 11 for Ashes 3rd Test Big Change5
Ashes: ఆస్ట్రేలియా తుదిజట్టులో అనూహ్య మార్పు

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌తో ఆసీస్‌ సారథి, స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ పునరాగమం చేస్తున్నట్లు వెల్లడించింది. అతడితో పాటు వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ కూడా ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చినట్లు తెలిపింది. 2-0తో ఆధిక్యంలోకాగా గాయం నుంచి కోలుకునే క్రమంలో.. ఫిట్‌నెస్‌ సమస్యల దృష్ట్యా కమిన్స్‌ (Pat Cummins) చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. కమిన్స్‌ స్థానంలో జట్టును ముందుకు నడిపించిన మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. వరుస విజయాలు అందుకున్నాడు.ఫలితంగా ఆసీస్‌ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక పెర్త్‌ టెస్టులో నాథన్‌ లియోన్‌ను ఆడించిన యాజమాన్యం.. బ్రిస్బేన్‌లో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు నుంచి తప్పించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు బ్రెండన్‌ డాగట్‌ (Brendan Doggett ) మెరుగ్గా రాణించగా.. మైకేల్‌ నెసర్‌ (Michael Neser) రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.నెసర్‌, డాగట్‌లపై వేటు.. ఖవాజాకు షాక్‌ అయితే, మూడో టెస్టుకు కమిన్స్‌ తిరిగి రాగా.. సెలక్టర్లు ఈసారి నాథన్‌ లియోన్‌కు కూడా అవకాశం ఇచ్చారు. దీంతో నెసర్‌, డాగట్‌లపై వేటు పడింది. పిచ్‌ స్వభావం దృష్ట్యానే నాథన్‌ కోసం నెసర్‌ను అనూహ్య రీతిలో పక్కన పెట్టారా అనే చర్చ నడుస్తోంది. అదే విధంగా.. వెన్నునొప్పి వల్ల రెండో టెస్టుకు దూరమైన ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజాను కూడా మేనేజ్‌మెంట్‌ మరోసారి పక్కనపెట్టింది. ఓపెనింగ్‌ జోడీగా ట్రవిస్‌ హెడ్‌- జేక్‌ వెదరాల్డ్‌ రాణిస్తుండటంతో ఖవాజాకు మొండిచేయి చూపింది. కాగా డిసెంబరు 17 నుంచి ఆసీస్‌- ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్‌ వేదిక.ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ఆసీస్‌ తుదిజట్టుట్రవిస్‌ హెడ్‌, జేక్‌ వెదరాల్డ్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, కామెరాన్‌ గ్రీన్‌, జోష్‌ ఇంగ్లిస్‌, అలెక్స్‌ క్యారీ, ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లియోన్‌, స్కాట్‌ బోలాండ్‌.మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టులో జోష్‌ టంగ్‌ ఆసీస్‌ జరిగే యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో పాల్గొనే ఇంగ్లండ్‌ తుది జట్టును సోమవారమే ప్రకటించారు. పేసర్‌ గుస్‌ అట్కిన్‌సన్‌ స్థానంలో మరో బౌలర్‌ జోష్‌ టంగ్‌ జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన జోష్‌ టంగ్‌ 19 వికెట్లతో అదరగొట్టాడు. టంగ్‌కిది రెండో యాషెస్‌ టెస్టు కానుంది. కాగా 2023లో లార్డ్స్‌ జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ‘యాషెస్‌’ టెస్టు ఆడిన టంగ్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్‌ జట్టుజాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జేమీ స్మిత్, విల్‌ జాక్స్, జోష్‌ టంగ్, బ్రైడన్‌ కార్స్, జోఫ్రా ఆర్చర్‌. చదవండి: మాక్‌ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్‌.. ఎవరు కొన్నారంటే?

Gayatri Pullela Tressa Jolly About Their Achievements in Season6
నాన్న తోడుగా నిలువగా..

న్యూఢిల్లీ: స్వదేశంలో ఇటీవల జరిగిన సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ టైటిల్‌ను నిలబెట్టుకున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఎట్టకేలకు ఈ సీజన్‌ను సంతృప్తికరంగా మలచుకుంది. రెండుసార్లు ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనలిస్టుగా నిలిచిన ఈ హైదరాబాద్‌ జోడీకి ఈ సీజన్‌ ఆరంభం నుంచి కలిసిరాలేదు. ఈ ఏడాది ఆల్‌ ఇంగ్లండ్‌ ఈవెంట్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన గాయత్రి–ట్రెసా ద్వయం స్విస్‌ ఓపెన్‌లో సెమీస్‌లోనే ఆగిపోయింది. తర్వాత జూన్‌లో గాయత్రి భుజం గాయంతో ఈ జోడీ మకావు ఓపెన్‌ నుంచి నిష్క్రమించి, ఇంటికే పరిమితమైంది. ఎట్టకేలకు తాజా లక్నో ఈవెంట్‌లో లభించిన టైటిల్‌ వీళ్లిద్దరి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీనిపై గాయత్రి మాట్లాడుతూ ఓపిక, పట్టుదల, అంకితభావానికి లభించిన టైటిల్‌గా అభివర్ణించింది. పలు అంశాలపై గాయత్రి, ట్రెసా జాలీ అభిప్రాయాలు వారి మాటల్లోనే...నాన్న తోడుగా నిలువగా... ఈ ఏడాది భుజం గాయం చాలా ఇబ్బంది పెట్టింది. సీజన్‌లో సుదీర్ఘకాలం ఆటకు దూరం చేసింది. రెండు నెలలకు పైగా విరామం తర్వాత మళ్లీ ఆడటం ప్రారంభించాను. ఇలాంటి సమయంలో సయ్యద్‌ మోడీ టైటిల్‌ నా ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. నా ఆట సరైన దిశలో సాగుతోందనిపించేలా చేసింది. నా ప్రదర్శన, ఫామ్‌పై నమ్మకాన్ని రెట్టింపు చేసింది. కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైంది. ముఖ్యంగా నాన్న పుల్లెల గోపీచంద్‌ ఎంతో శ్రద్ధ పెట్టాడు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఎప్పటికప్పుడు తోడుగా నిలిచాడు.కోటి ఆశలతో కొత్త సీజన్‌కు... మా జోడీకి ఈ సీజన్‌ గడ్డుగా గడిచింది. కానీ ఒక్క టైటిల్‌ సాఫల్యం మమ్మల్ని నిలబడేలా చేసింది. కొత్త ఆశలతో వచ్చే సీజన్‌ను ప్రారంభించేందుకు దోహదం చేసింది. ఈ ఏడాది మేం 13 వారాలపాటు (మూడు నెలలకు పైగానే) తొమ్మిదో ర్యాంక్‌తో టాప్‌–10లో కొనసాగాం. వచ్చే ఏడాది కూడా టాప్‌–10లో మరెంతో కాలం నిలిచేందుకు, నిలకడైన ఆటతీరుతో రాణించేందుకు నేను ట్రెసా జాలీ కష్టపడతాం. టైటిల్, టాప్‌–10 ర్యాంక్‌ మా ప్రదర్శనకు తగిన ప్రతిఫలంగా భావిస్తాం. ట్రెసా మిక్స్‌డ్‌లోనూ రాణించేందుకు శ్రమిస్తోంది. ప్రతీ ఈవెంట్‌లో ‘మిక్స్‌డ్‌’ కష్టమే... గాయత్రి గాయంతో దూరమవడంతో మిక్స్‌డ్‌ డబుల్స్‌ బరిలోకి దిగాను. ఇది ఎంతకాలం కొనసాగిస్తానో చెప్పడం కష్టం. ముఖ్యంగా మేటి టోరీ్నల్లో మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలను సమన్వయం చేసుకోవడం క్లిష్టంగా మారుతుంది. కోర్టులో గాయత్రితో నా సమన్వయం చక్కగా సాగుతోంది. ప్రతి టోర్నీపై మాకు స్పష్టమైన వైఖరి ఉంది. కాబట్టే ముందు మహిళల డబుల్స్‌కే ప్రాధన్యమిస్తాను. దీంతో పాటే మిక్స్‌డ్‌లో కొనసాగుతాను. ఆటలో ఏదీ అంతా సులువు కాదని నాకు తెలుసు. అందుకే ప్రతీరోజు కష్టపడాల్సి ఉంటుంది. –ట్రెసా జాలీ .చదవండి: Lionel Messi Net Worth 2025: నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. మెస్సీ నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?

Arjuna Ranatunga Sri Lanka 1996 World Cup Hero To Face Arrest7
శ్రీలంక క్రికెట్‌ దిగ్గజానికి భారీ షాక్‌!

శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ అర్జున రణతుంగ చిక్కుల్లో పడ్డాడు. మంత్రిగా ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రణతుంగను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.అంతర్జాతీయ క్రికెట్‌లో అర్జున రణతుంగా శ్రీలంక తరఫున సత్తా చాటాడు. ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 1996లో కెప్టెన్‌ హోదాలో శ్రీలంకకు వన్డే వరల్డ్‌కప్‌ అందించాడు. రణతుంగ సారథ్యంలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి లంక టైటిల్‌ గెలవడంతో అతడి ప్రతిష్ట మరింత పెరిగింది.ఇక ఆటకు స్వస్తి పలికిన తర్వాత అర్జున రణతుంగా రాజకీయాల్లో ప్రవేశించాడు. శ్రీలంక రవాణా, విమానయాన శాఖ (2018- 19), పోర్ట్స్‌ అండ్‌ షిప్పింగ్‌ (2015- 17)శాఖ, పెట్రోలియం వనరుల అభివృద్ధి శాఖ (2017-18) మంత్రిగా పనిచేశాడు. అయితే, పెట్రోలియమ్‌ మినిస్టర్‌గా ఉన్న సమయంలో అతడు అవినీతికి పాల్పడినట్లు సమాచారం.రూ. 23. 5 కోట్లుఈ కేసు విచారణలో భాగంగా అవినీతి నిరోధక శాఖ కొలంబో మెజిస్ట్రేట్‌ అసంగ బొడరగమా ముందు సోమవారం తమ వాదనలు వినిపించింది. మొత్తంగా 27సార్లు జరిపిన కొనుగోళ్లలో 800 మిలియన్‌ శ్రీలంకన్‌ రూపాయలు (భారత కరెన్సీలో రూ. 23. 5 కోట్లు) అవినీతి జరిగినట్లు తాము గుర్తించినట్లు తెలిపింది.కాగా ఈ కేసులో ఇప్పటికే అర్జున రణతుంగ అన్నయ్య, సిలోన్‌ పెట్రోలియమ్‌ చైర్మన్‌గా ఉన్న ధమ్మిక రణతుంగను పోలీసులు సోమవారం అరెస్టు చేశాడు. అయితే, కాసేపటికే అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.ధమ్మికకు శ్రీలంక పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉండటం గమనార్హం. కాగా అర్జున రణతుంగ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని.. స్వదేశానికి తిరిగి రాగానే అతడిని అరెస్టు చేయనున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అర్జున రణతుంగ మరో సోదరుడు, పర్యాటక శాఖ మాజీ మంత్రి ప్రసన్న కూడా గత నెలలో ఫ్రాడ్‌ కేసులో అరెస్టయ్యాడు. చదవండి: అక్షరాలా రూ.8 వేల కోట్లు!

IPL 2026 Auction: Telugu Players In List Who Will Get Nod8
ఐపీఎల్‌ వేలంలో మనోళ్లు 17 మంది.. అదృష్టం వరించేనా

శ్రీకాకుళం: భారత క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఒకసారైనా ఐపీఎల్‌కు ఎంపికైతే చాలని సగటు క్రికెటర్‌ కలగంటాడు. ఐపీఎల్‌కు ఎంపికైతే వారి దశ, దిశ తిరిగిపోవడం ఖాయం. ఇందుకు భారత క్రికెట్‌ జట్టుకు ప్రస్తుతం ఆడుతున్న పలువురు క్రికెటర్లే నిలువెత్తు సాక్ష్యం. 2026 మార్చి నుంచి మే నెలల్లో జరగనున్న ఐపీఎల్‌ సీజన్‌–19కు మినీ వేలం మంగళవారం యూఏఈలోని అబుదాబి వేదికగా షురూ కానుంది. వివిధ ప్రాంచైజీలు వేలంలో క్రీడాకారులను కొనుగోలు చేసే ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో జిల్లాకు చెందిన సింగుపురం దుర్గా నాగవర(ఎస్‌డీఎన్‌వీ) ప్రసాద్‌ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.కల తీరేనా..? ఐపీఎల్‌ రేసులో ఉన్న యువ క్రికెటర్‌ జలుమూరు చెందిన సింగుపురం దుర్గా నాగ వర (ఎస్‌డీఎన్‌వీ)ప్రసాద్‌. గత ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఆఖరి నిమిషంలో ఎవరూ ఇంట్రస్ట్‌ చూపించలేదు. అనంతరం జరిగిన కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 టోర్నీ, టీ–20 టోర్నీ అనేక టోరీ్నల్లో విశేషంగా రాణిస్తూ వచ్చాడు. ఏపీఎల్‌ సీజన్‌–4లో అమరావతి రాయల్స్‌ జట్టుకు రికార్డు స్థాయిలో రూ. 9.50 లక్షలకు అమ్ముడయ్యాడు. తాజాగా బీసీసీఐ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ సీనియర్స్‌ టీ–20 క్రికెట్‌ టోరీ్నలో కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు. దీంతో ఈసారి ఐపీఎల్‌ షార్ట్‌ లిస్టులో ఉండడంతో ఎంట్రీ దొరుకుతుందని భావిస్తున్నాడు. జలుమూరు పోలీస్‌స్టేషన్‌ వీధిలో నివాసం ఉంటున్న ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌.. తండ్రి సింగుపురం ఉపేంద్రం కారు డ్రైవర్‌గా పనిచేస్తు 2019లో అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి రేవతి జలుమూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్నారు. గతేడాది విజయ్‌ ఎంట్రీ గతేడాది ఐపీఎల్‌ సీజన్‌–18లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి జాక్‌పాట్‌ కొట్డాడు త్రిపురాన విజయ్‌. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ 23 ఏళ్ల కుర్రాడిని గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ రూ.30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫైనల్‌ లెవన్‌లో చోటు దక్కనప్పటికీ.. పలు మ్యాచ్‌ల్లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలో అలరించాడు. ఐపీఎల్‌ అనంతరం ఈ ఏడాది అనేక రంజీ మ్యాచ్‌ల్లో అటు రైటార్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోను మెరిశాడు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఏపీఎల్‌ 4వ సీజన్‌లో రాణించాడు. విజయ్‌ను రూ.7.55 లక్షలకు వైజాగ్‌ లయన్స్‌ కొనుగోలు చేసింది. టెక్కలిలోని అయ్యప్పనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి త్రిపురాన వెంకటకృష్ణరాజు సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. ఈ సీజన్‌లో విజయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ మరోసారి రిటైన్‌ చేసుకుంది.వేలంలో హైదరాబాద్, ఆంధ్ర జట్లకు చెందిన 17 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో భారత్‌కు ఆడిన కేఎస్‌ భరత్‌ తన కనీస విలువను రూ.75 లక్షలుగా నిర్ణయించుకోగా... మిగతా క్రికెటర్లంతా రూ.30 లక్షల ధరలో వేలానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్‌ జట్టు నుంచి 9 మంది, ఆంధ్ర నుంచి 8 మంది తమ ఐపీఎల్‌ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్‌: పేరాల అమన్‌రావు, రాహుల్‌ బుద్ధి, తనయ్‌ త్యాగరాజన్, ఆరోన్‌ జార్జి వర్గీస్, రక్షణ్‌ రెడ్డి, మనీశ్‌ రెడ్డి, నిశాంత్‌ శరణు, అర్ఫాజ్‌ మొహమ్మద్, నితిన్‌ సాయి యాదవ్‌.ఆంధ్ర: కోన శ్రీకర్‌ భరత్, రికీ భుయ్, సత్యనారాయణ రాజు, యర్రా పృథ్వీ రాజ్, బైలాపుడి యశ్వంత్, ధీరజ్‌ కుమార్, మారం రెడ్డి హేమంత్‌ రెడ్డి, సాదిఖ్‌ హుస్సేన్‌.అదృష్టం కలిసొస్తే.. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌–19 సీజన్‌ వేలానికి ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌ రేసులో ఉన్నాడు. గతేడాది త్రిపురాన విజయ్‌ ఎంపికవ్వడం జరిగింది. వీరితో మరింత మందికి అవకాశం దొరకాలని ప్రయత్నాలు చేస్తున్నాం. అదృష్టం కలిసొస్తే మినీ వేలంలో ఎంపిక పెద్ద కష్టమేమీ కాదు.సమష్టిగా కష్టపడుతున్నాం గత మూడేళ్లుగా జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధి కోసం అనేక యాక్టివిటీస్‌ను చేపడుతున్నాం. సొంత నిధులు వెచ్చిస్తున్నాం. క్రికెటర్ల అభివృద్ధి, గుర్తింపు కోసం సమష్టిగా కష్టపడుతున్నాం. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌ మినీ వేలంలో మరొకరికి అవకాశం దొరుకుతుందని భావిస్తున్నాం. – ఇలియాస్‌ మహ్మద్, మెంటార్, జిల్లా క్రికెట్‌ సంఘం శ్రీకాకుళం

IPL 2026 Mock Auction: Sold Unsold Players List Highest Price Is9
IPL 2026: రచిన్‌కు షాక్‌.. అత్యధిక ధర పలికింది వీరే!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 వేలానికి రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా మంగళవారం ఆక్షన్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్‌ జియోస్టార్‌ సోమవారం మాక్‌ వేలం (Mock Auction) నిర్వహించగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ రికార్డు ధర పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున మాక్‌ వేలంలో ‍పాల్గొన్న రాబిన్‌ ఊతప్ప గ్రీన్‌ కోసం ఏకంగా రూ. 30.50 కోట్లు వెచ్చించాడు.అతడికి కళ్లు చెదిరే మొత్తంఅదే విధంగా.. ఇంగ్లండ్‌ స్టార్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఏకంగా రూ. 19 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఐపీఎల్‌-2025లో పేలవ ప్రదర్శన కారణంగా లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) వదిలేసిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా ఆటగాళ్లలో పృథ్వీ షా నామమాత్రపు ధరకు అమ్ముడుపోగా.. రాహుల్‌ చహర్‌ (Rahul Chahar)కు కళ్లు చెదిరే మొత్తం దక్కింది.భారత స్పిన్నర్‌ రవి బిష్ణోయి కూడా భారీ ధర దక్కించుకున్నాడు. మరి వీరందరితో పాటు మాక్‌ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు, అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా!మాక్‌ వేలంలో అమ్ముడు పోయిన ఆటగాళ్లు💰కామెరాన్‌ గ్రీన్‌- రూ. 30.50 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్‌💰పృథ్వీ షా- రూ. 2.75 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌💰వెంకటేశ్‌ అయ్యర్‌- రూ. 6 కోట్లు- ఆర్సీబీ 💰సర్ఫరాజ్‌ ఖాన్‌- రూ. 7 కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్‌ 💰లియామ్‌ లివింగ్‌స్టోన్‌- రూ. 19 కోట్లు- లక్నో సూపర్‌ జెయింట్స్‌💰మతీశ పతిరణ- రూ. 13 కోట్లు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌💰రవి బిష్ణోయి- రూ. 11.50 కోట్లు- రాజస్తాన్‌ రాయల్స్‌💰రాహుల్‌ చహర్‌- రూ. 10 కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్‌💰గెరాల్డ్‌ కోయెట్జి- రూ. 8 కోట్లు- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌💰అన్రిచ్‌ నోర్జే- రూ. 7.50 ​కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్‌💰డేవిడ్‌ మిల్లర్‌- రూ. 9.50 ​కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌💰లుంగి ఎంగిడి- రూ. 6.50 ​కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌💰ఆకాశ్‌ దీప్‌- రూ. 5 కోట్లు- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌💰చేతన్‌ సకారియా- రూ. 6.5 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌💰జానీ బెయిర్‌ స్టో- రూ. 2.5 కోట్లు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌💰జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌- రూ. 2 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌💰వనిందు హసరంగ- రూ. 2 కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్‌💰జేమీ స్మిత్‌- రూ. 2 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌💰విజయ్‌ శంకర్‌- రూ. 2 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌💰డారిల్‌ మిచెల్‌- రూ. 2 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌💰క్వింటన్‌ డికాక్‌- రూ. కోటి- ఢిల్లీ క్యాపిటల్స్‌💰మహీశ్‌ తీక్షణ- రూ. 2 కోట్లు- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌💰రాహుల్‌ త్రిపాఠి- రూ. 75 లక్షలు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌💰శివం మావి- రూ. 2.50 కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్‌మాక్‌ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరేబెన్‌ డకెట్‌, రచిన్‌ రవీంద్ర, డెవాన్‌ కాన్వేకాగా మాక్‌ వేలంలో కేకేఆర్‌ తరఫున ఊతప్ప, సన్‌రైజర్స్‌ తరఫున ఎస్‌.బద్రీనాథ్‌, చెన్నై తరఫున సురేశ్‌ రైనా, ఆర్సీబీ తరఫున అనిల్‌ కుంబ్లే, గుజరాత్‌ తరఫున ఛతేశ్వర్‌ పుజారా, ముంబై ఇండియన్స్‌ తరఫున అభినవ్‌ ముకుంద్‌, ఢిల్లీ తరఫున మొహమ్మద్‌ కైఫ్‌, లక్నో తరఫున ఇర్ఫాన్‌ పఠాన్‌, పంజాబ్‌ తరఫున సంజయ్‌ బంగర్‌, రాజస్తాన్‌ తరఫున ఆకాశ్‌ చోప్రా పాల్గొన్నారు.చదవండి: IND vs SA: అక్షర్‌ పటేల్‌ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన

Not just Ro Ko All current India players to play Atleast 2 VHT Games: BCCI10
బీసీసీఐ కీలక ఆదేశాలు

ముంబై: ప్రస్తుత భారత జట్టులోని క్రికెటర్లు ఎవరైనా సరే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీకి దూరం కావద్దని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. అవకాశం ఉంటే అన్ని మ్యాచ్‌లు ఆడాలని... లేదా కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఆదేశించింది. కాగా డిసెంబర్‌ 24 నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో భారత్‌ చివరి టీ20 జరిగే డిసెంబర్‌ 19, న్యూజిలాండ్‌తో తొలి వన్డే జరిగే జనవరి 11 మధ్య సమయంలో అవకాశం ఉన్న అన్ని మ్యాచ్‌లు ఆడాలని బోర్డు తేల్చి చెప్పింది. రో-కోలకు మా త్రమే కాకుండాఇక భారత్‌ తరఫున ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకే కాకుండా ఇతర రెగ్యులర్‌ క్రికెటర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. దక్షిణాఫ్రికాతో రెండో టి20 ముగియగానే ఆటగాళ్లకు ఈ విషయాన్ని బోర్డు వెల్లడించినట్లు సమాచారం.అదే విధంగా.. ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉన్నట్లు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) అన్‌ఫిట్‌గా తేలిస్తేనే వారికి సడలింపు ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఒకే రోజు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్, టీ20 వరల్డ్‌ కప్‌ జట్లను సెలక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. కుటుంబ సన్నిహితులు ఒకరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతోనే జస్‌ప్రీత్‌ బుమ్రా ధర్మశాలలో మూడో టీ20 మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిసింది. అంతా బాగుంటేనే అతడు తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు.క్రీడాసమాఖ్యల జాబితాలో బీసీసీఐ లేదు! న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌)ల జాబితాలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) లేదని క్రీడా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పష్టం చేసారు. త్వరలో అమల్లోకి రానున్న కొత్త క్రీడా చట్టానికి సంబంధించి లోక్‌సభలో జరిగిన చర్చపై జవాబిస్తూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. బీసీసీఐని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చే అవకాశం ఉందా అంటూ టీఎంసీ ఎంపీ మాల రాయ్‌ అడిగిన ప్రశ్నకు మాండవీయ సమాధానమిచ్చారు. చదవండి: IND vs SA: అక్షర్‌ పటేల్‌ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement