Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Dates And venues for India vs South Africa series announced1
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. వైజాగ్‌లో టీమిండియా మ్యాచ్‌

ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టు ఈ ఏడాది ఆఖ‌రిలో భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానుంది. ఈ టూర్‌లో భాగంగా సౌతాఫ్రికా ఆతిథ్య టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో ఈ సిరీస్‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఖారారు చేసిన‌ట్లు తెలుస్తోంది. బీసీసీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. టెస్టు సిరీస్‌తో ప్రోటీస్ జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా తొలి టెస్టు జ‌ర‌గ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన తేదీల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇక రెండో టెస్టు మాత్రం గౌహ‌తిలోని బర్సాపర క్రికెట్ స్టేడియం వేదికగా నవంబర్ 22 నుండి నవంబర్ 26 వరకు జరగనుంది. గౌహతి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనంతరం నవంబ‌ర్ 30న రాంఛీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేతో వైట్‌బాల్ సిరీస్‌ ప్రారంభం కానుంది. రెండో వ‌న్డే డిసెంబ‌ర్ 3న రాయ్‌పూర్‌, మూడో వ‌న్డే డిసెంబ‌ర్ 6న వైజాగ్ వేదిక‌ల‌గా జ‌ర‌గ‌నుంది.మరో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌పై క‌న్ను..ఐపీఎల్‌-2025 ముగిసిన త‌ర్వాత టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు స‌న్న‌ద్దం కానుంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో జ‌ర‌గ‌నున్న పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఎక్కువగా టీ20 సిరీస్‌లను షెడ్యూల్ చేసింది. ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టు ఏకంగా 23 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భాగంగానే స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. డిసెంబర్ 9న కటక్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌తొలి టెస్టు: - : ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంరెండో టెస్టు: నవంబర్ 22 నుండి నవంబర్ 26-గౌహతిభారత్ వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్:నవంబర్ 30: రాంచీడిసెంబర్ 3: రాయ్‌పూర్‌డిసెంబర్ 6: వైజాగ్భారత్ vs సౌతాఫ్రికా T20I సిరీస్:1st T20I: డిసెంబర్ 9: కటక్2nd T20I: డిసెంబర్ 11: నాగ్‌పూర్3rd T20I: డిసెంబర్ 14: ధర్మశాల4th T20I: డిసెంబర్ 17: లక్నో5th T20I: డిసెంబర్ 19: అహ్మదాబాద్చదవండి: ఐపీఎల్‌-2025 తొలి మ్యాచ్‌ కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ: తుదిజట్లు ఇవే!?

IPL 2025 1st Match KKR vs RCB Probable Playing XI of Both Teams2
ఐపీఎల్‌-2025 తొలి మ్యాచ్‌ కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ: తుదిజట్లు ఇవే!?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) తాజా సీజన్‌కు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌తో శనివారం తెరలేవనుంది. ఇందుకు ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక. ఇక ఈసారి ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.గతేడాది తమను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌ అయ్యర్‌ను వదిలేసిన కోల్‌కతా.. ఈసారి వెటరన్‌ ప్లేయర్‌ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. మరోవైపు.. బెంగళూరు ఫ్రాంఛైజీ అనూహ్య రీతిలో రజత్‌ పాటిదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక​ మెగా వేలం-2025 నేపథ్యంలో జట్లలోనూ భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్లు, కొత్త జట్లతో కేకేఆర్‌- ఆర్సీబీ ఏమేరకు సత్తా చాటుతాయనేది ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌లో గెలుపొంది సీజన్‌లో శుభారంభం అందుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.వర్షం ముప్పు లేనట్లే?మరోవైపు.. వర్షం ఈ మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తుందన్న వార్తల నడుమ.. కోల్‌కతాలో వాన తెరిపినిచ్చిందని, ఎండ కూడా కాస్తోందన్న తాజా సమాచారం సానుకూలాంశంగా పరిణమించింది. మరి క్యాష్‌ రిచ్‌ లీగ్‌-2025 ఎడిషన్‌ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్‌, ఆర్సీబీ తుదిజట్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దామా?కేకేఆర్‌ మరోసారి స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌ను ఓపెనర్‌గా కొనసాగించనుండగా.. అతడికి జోడీగా సౌతాఫ్రికా స్టార్‌ క్వింటన్‌ డికాక్‌ బరిలోకి దిగడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. మూడో స్థానంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌, నాలుగో స్థానంలో కెప్టెన్‌ రహానే ఆడనున్నారు.కోహ్లికి జోడీగా సాల్ట్‌!వీరితో పాటు రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌లతో కేకేఆర్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగానే ఉంది. మరోవైపు.. ఆర్సీబీ తరఫున సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఫిల్‌ సాల్ట్‌ ఓపెనింగ్‌కు రానున్నాడు. వీరితో పాటు లియామ్‌ లివింగ్‌స్టోన్‌, టిమ్‌ డేవిడ్‌, జితేశ్‌ శర్మ బ్యాటింగ్‌ విభాగంలో కీలకం కానున్నారు.ఇక బౌలర్ల విషయానికొస్తే.. కేకేఆర్‌కు పేసర్లు హర్షిత్‌ రాణాతో పాటు వైభవ్‌ అరోరా, స్పెన్సర్‌ జాన్సన్‌లు.. స్పిన్‌ విభాగంలో వరుణ్‌ చక్రవర్తి సేవలు అందించనున్నారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అంగ్‌క్రిష్‌ రఘువన్షీ బరిలోకి దిగే అవకాశం ఉంది.అదే విధంగా.. ఆర్సీబీ పేస్‌ దళం టీమిండియా స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాళ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఆర్సీబీ తరఫున స్పిన్నర్‌ సూయశ్‌ శర్మ లేదంటే స్వప్నిల్‌ సింగ్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చే అవకాశం ఉంది.కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ తుదిజట్లు (అంచనా)కేకేఆర్‌సునిల్‌ నరైన్‌, క్వింటన్‌ డి కాక్‌(వికెట్‌ కీపర్‌), అజింక్య రహానే (కెప్టెన్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి.ఇంపాక్ట్‌ ప్లేయర్‌: అంగ్‌క్రిష్‌ రఘువన్షీ.ఆర్సీబీఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), టిమ్‌ డేవిడ్‌, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, యశ్‌ దయాళ్‌. చదవండి: ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి ఉండదు: ‘లక్నో’పై నెటిజన్లు ఫైర్‌

No One Was Able To Figure Out Way to stop him: Aakash Chopra on KKR Star3
అతడిని ఆపటం ఎవరితరం కాలేదు: భారత మాజీ క్రికెటర్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2025లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బరిలోకి దిగనుంది. తాజా సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా సొంతమైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా.. కోల్‌కతా స్టార్‌ సునిల్‌ నరైన్‌ (Sunil Narine) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్‌-2025 ఆరంభ మ్యాచ్‌లో అందరి కళ్లు నరైన్‌పైనే ఉన్నాయని.. ఈసారి కూడా గతేడాది మాదిరి అతడు రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. బ్యాట్‌తో, బంతితో రాణించగల ఈ వెస్టిండీస్‌ ఆటగాడు మరోసారి కోల్‌కతాకు కీలకం కాబోతున్నాడని ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) పేర్కొన్నాడు.పవర్‌ ప్లేలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తోకాగా గతేడాది కేకేఆర్‌ చాంపియన్‌గా నిలవడంలో సునిల్‌ నరైన్‌ది కీలక పాత్ర. ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగి పరుగుల సునామీ సృష్టించాడు. పవర్‌ ప్లేలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి కేకేఆర్‌ విజయాలకు బాట వేశాడు. గత సీజన్‌లో పద్నాలుగు ఇన్నింగ్స్‌లో మొత్తంగా 488 పరుగులు సాధించాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌. 180.74 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టి కేకేఆర్‌ తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్‌ సునిల్‌ నరైన్‌. నాలుగు ఓవర్లపాటు పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయగలడు కూడా! అయితే, ఈసారి బ్యాట్‌తో ఎలా విజృంభిస్తాడన్నది ఆసక్తికరం.అతడిని ఆపటం ఎవరితరం కాలేదుగతేడాది కేకేఆర్‌ విజయాలను నిర్దేశించింది అతడే! అతడి అద్భుత ప్రదర్శన కారణంగా కేకేఆర్‌ రాత మారిపోయింది. నరైన్‌ బ్యాట్‌ నుంచి సెంచరీ కూడా జాలువారింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో నిలకడైన బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టిన తీరు అద్బుతం.టీ20 క్రికెట్‌కు ఏం కావాలో నరైన్‌ అది చేసి చూపించాడు. పరుగులు రాబట్టుకుంటూ పోయాడు. అతడిని ఆపటం ఎవరితరం కాలేదు. బౌలర్లు ఎన్ని వ్యూహాలు మార్చినా నరైన్‌ను కట్టడి చేయలేకపోయారు. సునిల్‌ నరైన్‌ ఈసారి కూడా అలాగే రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీ స్పిన్నర్లే కీలకంఇక తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌- ఆర్సీబీ తలపడనున్న నేపథ్యంలో.. ‘‘ఆర్సీబీ స్పిన్నర్లు ఎలా బౌలింగ్‌ చేస్తారన్న అంశం మీదే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంటుంది. కృనాల్‌ పాండ్యా, సూయశ్‌ శర్మలతో పాటు లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జేకబ్‌ బెతెల్‌ ప్రదర్శనే ఆర్సీబీకి కీలకం కానుంది.ఇక కేకేఆర్‌కు ఈసారి మిచెల్‌ స్టార్క్‌ లేడు. అతడి స్థానంలో స్పెన్సర్‌ జాన్సన్‌ లేదంటే అన్రిచ్‌ నోర్జే ఆడతారు. బ్యాటర్ల విషయానికొస్తే ఫిల్‌ సాల్ట్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను కేకేఆర్‌ కోల్పోయింది. నరైన్‌.. క్వింటన్‌ డికాక్‌ లేదంటే రహ్మనుల్లా గుర్బాజ్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. టాపార్డర్‌ రాణిస్తేనే కోల్‌కతాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌.. అతడి బ్యాటింగ్‌ అద్భుతం: కివీస్‌ కెప్టెన్‌

England Womens Cricket Coach Stepdown After Poor WC Ashes Results4
ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవికి లూయిస్‌ గుడ్‌బై

లండన్‌: ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుకు కోచ్‌ పదవి నుంచి జాన్‌ లూయిస్‌ తప్పుకొన్నాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనకు తోడు యాషెస్‌ సిరీస్‌లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడంతో జాన్‌ లూయిస్‌ కోచింగ్‌ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2022 నుంచి జాన్‌ ఇంగ్లండ్‌ మహిళల జట్టు కోచ్‌గా వ్యవహరిస్తుండగా... ఆ జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశకే పరిమితమైంది.ఇక వేర్వేరు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లోనూ ఇంగ్లండ్‌ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చింది. ‘ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. జట్టులో ప్రతిభకు లోటు లేదు. మరో మెరుగైన కోచ్‌ను నియమిస్తాం. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకముంది’ అని ఇంగ్లండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: హైదరాబాద్‌ పరాజయంగువాహటి: జాతీయ అండర్‌–23 మహిళల వన్డే ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్‌ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో మమత సారథ్యంలోని హైదరాబాద్‌ జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు 49.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. స్టార్‌ ప్లేయర్‌ గొంగడి త్రిష (14 బంతుల్లో 3) విఫలమవ్వగా... కెప్టెన్, వికెట్‌ కీపర్‌ మమత (83 బంతుల్లో 77; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.సాక్షి రావు (37 బంతుల్లో 36; 1 ఫోర్‌), కావ్య (63 బంతుల్లో 30; 3 ఫోర్లు) రాణించారు. ఉత్తరప్రదేశ్‌ బౌలర్లలో గరీమా యాదవ్, సోనమ్‌ యాదవ్‌ 3 వికెట్ల చొప్పున తీయగా... ఏక్తాకు 2 వికెట్లు లభించాయి. అనంతరం ఉత్తరప్రదేశ్‌ జట్టు 44.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించి విజయం ఖరారు చేసుకుంది. తృప్తి సింగ్‌ (99 బంతుల్లో 73; 10 ఫోర్లు), ముస్కాన్‌ మాలిక్‌ (92 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి ఉత్తరప్రదేశ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్‌ బౌలర్లలో కేసరి ధృతి, సాక్షి రావు ఒక్కో వికెట్‌ తీశారు.

Not Entertainment: LSG Lambasted For Controversial David Miller Viral Video5
ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి ఉండదు: ‘లక్నో’పై నెటిజన్లు ఫైర్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ఆరంభానికి ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ ఇంకొకటి ఉండదంటూ క్రికెట్‌ ప్రేమికులు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుకున్నాం కాబట్టి.. ఆటగాళ్ల భావోద్వేగాలతో ఆడుకోవచ్చనే సంస్కృతికి వీడ్కోలు పలకాలని హితవు పలుకుతున్నారు.భారీ ధరకు కొనుగోలుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్‌ మెగా వేలం-2025లో లక్నో యాజమాన్యం సౌతాఫ్రికా హార్డ్‌ హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌ (David Miller)ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడిన ఈ విధ్వంసకర వీరుడు ఆక్షన్‌లోకి రాగా.. రూ. 7.5 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.ఇక మార్చి 22న ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ ఆరంభం కానుండగా.. మార్చి 24న లక్నో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్లు విశాఖకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే.. లక్నో ఫ్రాంఛైజీ డేవిడ్‌ మిల్లర్‌తో ఓ ఇంటర్వ్యూయర్‌ జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇందులో ఓ వ్యక్తి.. మీ కెరీర్‌లో బిగ్గర్‌ హార్ట్‌బ్రేక్‌ ఏది? అంటూ మిల్లర్‌ను ప్రశ్నించాడు. బిగ్గర్‌ హార్ట్‌బ్రేక్‌ ఏది? నవ్వుతూ ప్రశ్నలుఇందులో.. ‘‘గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున 2023 ఫైనల్లో ఓటమి.. 2014లో పంజాబ్‌ కింగ్స్‌ ఫైనల్‌ ఓటమి.. లేదంటే.. వరల్డ్‌కప్‌-2019, 2021లలో సౌతాఫ్రికా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడం.. లేదా టీ20 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్లో ఓటమి.. అదీ కాదంటే వన్డే వరల్డ్‌కప్‌-2023 సెమీస్‌లో ఓటమి.. లేదంటే.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి.. వీటిల్లో మీ హృదయాన్ని ముక్కలు చేసిన సంఘటన ఏది?’’ అంటూ బోలెడన్ని ఆప్షన్లు కూడా ఇచ్చాడు.అంతేకాదు.. సదరు వ్యక్తి నవ్వుతూ ఈ ప్రశ్నలు అడగటం గమనార్హం. ఇందుకు మిల్లర్‌ బాధగా, దిగాలుగా ముఖం పెట్టుకుని సమాధానాలు ఇచ్చాడు. అయితే, ఇంటర్వ్యూయర్‌ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన లక్నో.. ‘ఇకపై మిల్లర్‌కు ఇలాంటి బాధలు ఉండవు’ అంటూ తాము ఈసారి టైటిల్‌ గెలవబోతున్నట్లు క్యాప్షన్‌ ఇచ్చింది.ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదుమిలియన్‌కు పైగా వ్యూస్‌ సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇది వినోదం కాదు.. ఓ ఆటగాడిని మానసికంగా వేధించడం లాంటిది. ఓటములను గుర్తుచేస్తూ అతడి మనసును మరింత బాధపెట్టడం సరికాదు. వీడియోలు సృజనాత్మకంగా ఉండాలి గానీ.. ఇలా ఆటగాడి మనసును నొప్పించేలా ఉండకూడదు.డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి ఆటగాళ్లంతా తాము చెప్పినట్లు నడచుకోవాలనే లక్నో యాజమాన్యం అహంభావ వైఖరికి ఇది నిదర్శనం. గత సీజన్లో కేఎల్‌ రాహుల్‌ను అవమానించిన తీరును మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఐపీఎల్‌లో ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్‌ చేస్తున్నారు.రాహుల్‌ పట్ల అదే తీరుకాగా గతేడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమి తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా.. అప్పటి తమ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై మైదానంలోనే అరిచేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు విస్తృతంగా వైరల్‌ కాగా.. గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ పరిణామాల నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ లక్నోను వీడి వేలంలోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. మరోవైపు.. మరో టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొన్న లక్నో.. కెప్టెన్‌గా అతడికి పగ్గాలు అప్పగించింది. చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌.. అతడి బ్యాటింగ్‌ అద్భుతం: కివీస్‌ కెప్టెన్‌Manifesting zero heartbreaks for Miller bhai this season 🤞 pic.twitter.com/4zd5FbtblW— Lucknow Super Giants (@LucknowIPL) March 20, 2025

'They Bowl Like Fast Bowlers in IPL': Harbhajan Slams Spinners Asks To Be Brave6
‘ఫాస్ట్‌ బౌలర్ల మాదిరి బౌలింగ్‌ దేనికి? ఆ మాత్రం ధైర్యం లేదా?’

నవతరం స్పిన్నర్ల తీరును భారత స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) విమర్శించాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో చాలా మంది స్పిన్నర్లు తమ సహజత్వానికి భిన్నంగా బౌలింగ్‌ చేస్తున్నారన్నాడు. బంతిని స్పిన్‌ చేసేందుకు బదులు.. డిఫెన్సివ్‌గా ఆడేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని విమర్శలు గుప్పించాడు.కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)- 2025 సీజన్‌ శనివారం ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా సీజన్‌కు తెరలేవనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో గత పదిహేడు ఎడిషన్లలో స్పిన్నర్లు కేవలం మూడుసార్లు మాత్రమే పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకున్నారు.ఇమ్రాన్‌ తాహిర్‌, ప్రజ్ఞాన్‌ ఓజా తర్వాత.. 2022లో అత్యధిక వికెట్ల వీరుడిగా టీమిండియా లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఈ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఫాస్ట్‌ బౌలర్ల మాదిరి బౌలింగ్‌ దేనికి? ఆ మాత్రం ధైర్యం లేదా?‘‘టీ20లలో.. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో చాలా మంది స్పిన్నర్లు ఫాస్ట్‌ బౌలర్ల మాదిరి బౌలింగ్‌ చేస్తున్నారు. బంతిని స్పిన్‌ చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. అసలు బ్యాటర్లపై అటాకింగ్‌ చేయడమే లేదు. వికెట్లు తీయాలనే తాపత్రయం వారిలో కరువైంది.వికెట్లు తీసే విషయంలో స్పిన్నర్లు కాస్త ధైర్యం చూపించాలి. ప్రతిసారీ ఆత్మరక్షణ ధోరణితో ఉండటం సరికాదు’’ అని భజ్జీ స్పిన్నర్ల తీరును విమర్శించాడు. ఇండియా టుడేతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి.. తన బౌలింగ్‌ శైలి ఫాస్ట్‌ బౌలర్ల మాదిరి ఉంటుంది కాబట్టి తాను కేవలం వన్డే, టీ20లు ఆడతానని.. టెస్టులకు సరిపడనని ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌-2025 సీజన్‌లో బంతిపై సెలైవా (లాలాజలం) ఉపయోగించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే.ఐపీఎల్‌-2025 కెప్టెన్ల సమావేశం తర్వాత.. వారి అంగీకారంతో ఈ మేరకు సెలైవా ఉపయోగంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.స్వాగతించదగ్గ విషయంఈ నేపథ్యంలో హర్భజన్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘‘బౌలర్లు సెలైవా ఉపయోగించేందుకు అనుమతి లభించడం స్వాగతించదగ్గ విషయం. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఇదే మాదిరి లాలాజలంతో బంతిని నునుపు చేసేందుకు అనుమతి వస్తే.. పేసర్లు బంతిని మరింత స్వింగ్‌ చేయగలుగుతారు. స్పిన్నర్లకు కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.కాగా కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అప్పట్లో లాలాజలంతో బంతిని రుద్దకుండా ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హర్భజన్‌ సింగ్‌ టీమిండియా తరఫున టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20లలో 25 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 163 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ 150 వికెట్లు కూల్చాడు.చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌.. అతడి బ్యాటింగ్‌ అద్భుతం: కివీస్‌ కెప్టెన్‌

What Happens If IPL 2025 Opener KKR Vs RCB Washed Out, Cut Off Time Etc7
KKR Vs RCB: వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే పరిస్థితి?

మెగా క్రికెట్‌ సమరం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) పద్దెనిమిదవ సీజన్‌కు శనివారం తెరలేవనుంది. తారల సందడితో ఈడెన్‌ గార్డెన్స్‌లో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ను ఆరంభించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)- ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మధ్య పోరుతో ఈ క్రీడా సంబరం మొదలుకానుంది.పొంచి ఉన్న వర్షం ముప్పుఅయితే, ఆరంభ వేడుకలతో పాటు మ్యాచ్‌కు వర్షం అడ్డుతగిలే అవకాశం ఉంది. ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం కోల్‌కతాలో శనివారం భారీ వాన పడే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో సాయంత్రం 6.20 నిమిషాల నుంచి 6.45 నిమిషాల వరకు జరగాల్సిన ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లు సజావుగా సాగడం కష్టమే. సాయంత్రం ఆరు గంటల తర్వాత వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని ఆక్యూవెదర్‌ పేర్కొంది. టాస్‌ సమయానికి అంటే ఏడు గంటల సమయంలో పదిశాతం వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇక రాత్రి పదకొండు గంటల తర్వాత ఇందుకు డెబ్బై శాతం ఆస్కారం ఉన్నట్లు వెల్లడించింది.రెండు రోజులుగా వానఈ నేపథ్యంలో కేకేఆర్‌- ఆర్సీబీ మధ్య ఐపీఎల్‌-2025 ఆరంభ మ్యాచ్‌ సాఫీగా సాగడం కష్టమే అనిపిస్తోంది. కోల్‌కతాలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కేకేఆర్‌- ఆర్సీబీ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. మరోవైపు.. శుక్రవారం కూడా వాన పడగా.. ఈడెన్‌ గార్డెన్స్‌ గ్రౌండ్‌స్టాఫ్‌ కవర్లతో మైదానాన్ని కప్పి ఉంచారు.అంతేకాదు.. ఎప్పటికప్పుడు మైదానం నుంచి నీటిని క్లియర్‌ చేసేందుకు డ్రైనేజీ సిస్టమ్‌ సిద్ధంగానే ఉంది. అయితే, ఎడతెరిపిలేని వర్షం పడితే మాత్రం మ్యాచ్‌ జరగడం సాధ్యం కాదు. మరి వర్షం వల్ల కేకేఆర్‌- ఆర్సీబీ మ్యాచ్‌ రద్దయితే పరిస్థితి ఏమిటి?జరిగేది ఇదే..ప్లే ఆఫ్స్‌, ఫైనల్‌ మాదిరి ఐపీఎల్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ఉండదు. అయితే, వర్షం వల్ల మ్యాచ్‌ ఆలస్యమైతే.. మ్యాచ్‌ ముగియడానికి నిర్ణీత సమయం కంటే అరవై నిమిషాల అదనపు సమయం ఇస్తారు.ఫలితం తేల్చేందుకు ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్‌ టైమ్‌ రాత్రి 10.56 నిమిషాలు. అర్ధరాత్రి 12.06 నిమిషాల వరకు మ్యాచ్‌ను ముగించేయాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్‌ మరీ ఆలస్యమైతే ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.ఇంత చేసినా ఫలితం తేలకుండా.. మ్యాచ్‌ రద్దు చేయాల్సి వస్తే ఇరుజట్లకు చెరో పాయింట్‌ లభిస్తుంది. అయితే, టైటిల్‌ రేసులో నిలిచే క్రమంలో ఈ ఒక్క పాయింట్‌ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే.. ఇటు కేకేఆర్‌.. అటు ఆర్సీబీ అభిమానులు మ్యాచ్‌ సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2025 ఆరంభ వేడుకలో శ్రేయా ఘోషాల్, కరణ్‌ ఔజ్‌లా, దిశా పటాని తదితరులు ఆట, పాటలతో అలరించేందుకు సిద్ధమయ్యారు.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!A little rain won’t stop us! 🌧 The ground’s got its cozy cover, and the drainage system will be ready to save the day 𝘒𝘺𝘶𝘯𝘬𝘪 𝘠𝘦𝘩 𝘐𝘗𝘓 𝘩𝘢𝘪, 𝘺𝘢𝘩𝘢𝘯 𝘴𝘢𝘣 𝘱𝘰𝘴𝘴𝘪𝘣𝘭𝘦 𝘩𝘢𝘪!#IPLonJioStar 👉 SEASON OPENER #KKRvRCB | SAT, 22nd March, 5:30 PM | LIVE on… pic.twitter.com/UwdonS9FeN— Star Sports (@StarSportsIndia) March 21, 2025

He Was Unbelievable: Bracewell Hails Hasan Nawaz Stellar Century Vs NZ8
నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌.. అతడి బ్యాటింగ్‌ అద్భుతం: కివీస్‌ కెప్టెన్‌

పాకిస్తాన్‌ యువ బ్యాటర్‌ హసన్‌ నవాజ్‌పై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ ప్రశంసలు కురిపించాడు. మూడో టీ20లో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌ ఆడి.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని అన్నాడు. పాక్‌ గెలుపులో క్రెడిట్‌ మొత్తం అతడికే ఇవ్వాలని పేర్కొన్నాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత టీ20 సిరీస్‌ ఆరంభం కాగా.. మొదటి రెండు మ్యాచ్‌లలో ఆతిథ్య కివీస్‌ విజయం సాధించింది. అయితే, శుక్రవారం జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్‌ సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అక్లాండ్‌ వేదికగా టాస్‌ గెలిచిన పాక్‌.. తొలుత బౌలింగ్‌ చేసింది. 204 పరుగులకు ఆలౌట్‌ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 19.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మార్క్‌ చాప్‌మన్‌ (44 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ అర్ధశతకంతో ఆకట్టుకోగా... కెప్టెన్‌ బ్రేస్‌వెల్‌ (18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్‌ బౌలర్లలో హరీస్‌ రవూఫ్‌ 3 వికెట్లు పడగొట్టగా... షాహీన్‌ షా అఫ్రిది, అబ్రార్‌ అహ్మద్, అబ్బాస్‌ అఫ్రిది తలా 2 వికెట్లు తీశారు.ఇక 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 16 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హసన్‌ నవాజ్‌ (45 బంతుల్లో 105 నాటౌట్‌; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు నాటౌట్‌) కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకోగా... కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (31 బంతుల్లో 51 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మొహమ్మద్‌ హరీస్‌ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో డఫీ ఒక వికెట్‌ పడగొట్టాడు.రెండు డకౌట్‌ల తర్వాత... నవాజ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ఈ సిరీస్‌ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవాజ్‌... తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయినా మేనేజ్‌మెంట్‌ అతడిపై నమ్మకం ఉంచి మూడో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వగా... తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాశాడు. అతడి దూకుడుతో భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తొలి ఓవర్‌లో రెండు సిక్సర్లతో హెచ్చరికలు జారీచేసిన హరీస్‌... రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. మొదట హరీస్‌కు అండగా నిలిచిన నవాజ్‌... ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం హరీస్‌ అవుట్‌ కాగా... పవర్‌ ప్లే (6 ఓవర్లలో) ముగిసేసరికి పాకిస్తాన్‌ 75/1తో నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక పవర్‌ ప్లే స్కోరు. 2016లో ఇంగ్లండ్‌పై చేసిన 73 పరుగులు రెండో స్థానానికి చేరింది. కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా రాకతో పాక్‌ దూకుడు మరింత పెరిగింది. వీలు చిక్కినప్పుడల్లా నవాజ్‌ సిక్సర్లతో చెలరేగగా... అతడికి సల్మాన్‌ అండగా నిలిచాడు. ఈ క్రమంలో నవాజ్‌ 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఇదే వేగవంతమైన శతకం. 2021లో దక్షిణాఫ్రికాపై బాబర్‌ ఆజమ్‌ (49 బంతుల్లో) చేసిన సెంచరీ రెండో స్థానంలో ఉంది. ‘గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యా. ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుటయ్యా. దీంతో బాగా ఒత్తిడికి గురయ్యా. అయినా మేనేజ్‌మెంట్‌ నాకు మరో అవకాశం ఇచ్చింది.తొలి పరుగు చేసినప్పుడు భారం తీరినట్లు అనిపించింది. దీంతో స్వేచ్ఛగా ఆడి జట్టును గెలిపించాలనుకున్నా’ అని నవాజ్‌ అన్నాడు. ఇక నవాజ్, సల్మాన్‌ అబేధ్యమైన రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోపు పూర్తి చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్‌ నిలిచింది. ఓవరాల్‌గా పాకిస్తాన్‌కు ఇది రెండో పెద్ద ఛేదన. కెప్టెన్‌ సల్మాన్‌ కూడా ఈ మ్యాచ్‌లోనే తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు.అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడుఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కివీస్‌ కెప్టెన్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫలితం మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నవాజ్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. అతడు నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ విషయంలో అతడికి తప్పకుండా క్రెడిట్‌ ఇవ్వాలి.మేము 20 ఓవర్ల పాటు ఆడలేకపోయాం. పొట్టి క్రికెట్‌లో ఇదొక నేరం లాంటిదే. చాప్‌మన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. కానీ అతడు అవుటైన తర్వాత మేము మరో రెండు ఓవర్లు మెరుగ్గా బ్యాటింగ్‌ చేసి ఉంటే.. 230 పరుగుల మేర సాధించేవాళ్లం. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో కనీసం మరో పదిహేను పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది’’ అని పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్‌ సింగ్‌

Lucknow Super Giants Team Reaches Visakhapatnam9
IPL 2025: రాహుల్‌ రానట్టేనా?

విశాఖ స్పోర్ట్స్‌: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు లక్నో సూపర్‌ జెయింట్స్‌(ఎల్‌ఎస్‌జీ) జట్టు విశాఖపట్నం చేరుకుంది. శుక్రవారం ప్రత్యేక విమానంలో లక్నో నుంచి జట్టు విశాఖకు వచ్చింది. వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 24వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఎల్‌ఎస్‌జీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్‌ పంత్‌ విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈసారి ఎల్‌ఎస్‌జీ జట్టు కు రిషబ్‌ పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించగా, ఎల్‌ఎస్‌జీ జట్టు శనివారం ప్రాక్టీస్‌ చేయనుంది. ఎల్‌ఎస్‌జీ జట్టుకు మెంటర్‌గా జహీర్‌ ఖాన్‌, హెడ్‌ కోచ్‌గా లాంగర్‌, సహాయ కోచ్‌లుగా జాంటీ రోడ్స్‌, ప్రవీణ్‌ తంబే, లాన్స్‌ క్లుసెనర్‌ వంటి వారు ఉన్నారు. జట్టులో వికెట్‌ కీపర్లుగా ఆర్యన్‌, నికోలస్‌ అందుబాటులో ఉన్నారు. ఆల్‌రౌండర్లుగా మార్క్రమ్‌, మార్ష్‌, షాబాజ్‌ ఉండగా, బ్యాటింగ్‌లో ఆయుష్‌, డేవిడ్‌ మిల్లర్‌, సమద్‌ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌, ఆవేష్‌, ఆకాష్‌తో పాటు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా సిద్ధార్థ్‌ లేదా అర్షిన్‌ ఆడే అవకాశం ఉంది. అయితే మయాంక్‌, మోషిన్‌, ఆవేష్‌ గాయా ల కారణంగా జట్టుకు అందుబాటులో ఉండటంపై సందేహాలు ఉన్నాయి. ప్రాక్టీస్‌ సెషన్‌ తర్వాత బౌలింగ్‌ విభాగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు గ్రూప్‌–2లో ఉన్నాయి. గత సీజన్‌లో ఇరు జట్లు కూడా లీగ్‌ దశలోనే నిష్క్రమించాయి.రాహుల్‌ రానట్టేనా?కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు కె.ఎల్‌.రాహుల్‌ ఇంకా విశాఖ చేరుకోలేదు. దీంతో ఆయన విశాఖలో జరిగే రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానమే.! దీంతో ఎల్‌ఎస్‌జీతో జరిగే తొలి మ్యాచ్‌లో ఢిల్లీ తరపున ఫెరీరా వికెట్‌ కీపర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్‌లో రాహుల్‌ లక్నో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

IPL 2025: Punjab Kings Aim For 1st Trophy With Title Winner Shreyas Iyer10
IPL 2025: ఆ ఐదుగురు రాణిస్తే.. పంజాబ్‌ కింగ్స్‌ కల సాకారం!

పంజాబ్ కింగ్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్‌ (2008) నుంచి ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయింది. ఆ జట్టు ఫలితాలను పరిశీలించినట్లయితే ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌ చేరుకుంది. మొదటిసారి 2008లో.. ఆ తర్వాత 2014 సీజన్‌లో టాప్‌-4లో నిలిచింది. 2014లో ఫైనల్‌కు చేరుకుని బెంగళూరులో జరిగిన టైటిల్ పొరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం చవిచూసింది.శ్రేయస్‌ అయ్యర్‌కి కెప్టెన్సీ బాధ్యతలుఆ రెండు సీజన్లను మినహాయిస్తే ఒక దశాబ్దం పాటు కింగ్స్ ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. నిరంతరం కోచ్‌లు, కెప్టెన్‌లను మార్చడం కూడా కింగ్స్ ప్రదర్శన పై కోలుకోని దెబ్బతీసింది. పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ గత 17 సీజన్లలో పదహారు మంది కెప్టెన్లు, పది 10 మంది కోచ్‌లను మార్చింది. ఈసారి కూడా భారీ మార్పులతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.ఈసారి 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముందుండి నడిపించి మూడో ఐపీఎల్ టైటిల్‌ను కట్టబెట్టిన భారత బ్యాటర్‌ శ్రేయస్ అయ్యర్ కోసం భారీగా ఖర్చు చేసింది. ఏకంగా రూ 26.75 కోట్లతో శ్రేయస్ అయ్యర్ ని కనుగోలు చేసి అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది. హెడ్‌కోచ్ గా మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌ను ఎంచుకుంది.వేలంలో పంజాబ్ కింగ్స్ ఎలా రాణించింది?ఇక వేలానికి ముందు ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు శశాంక్ సింగ్ మరియు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ని రెటైన్ చేసారు. ఇక వేలంలో ఏకంగా రూ 112 కోట్లు ఖర్చు చేశారు. ముందుగా శ్రేయస్ అయ్యర్ కోసం భారీగా ఖర్చు చేశారు. తర్వాత అర్ష్‌దీప్ సింగ్‌ను రూ 18 కోట్లకు తిరిగి తీసుకున్నారు. అదే మొత్తానికి భారత మాజీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను కొనుగోలు చేశారు.ఇంకా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్లు గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్. న్యూజిలాండ్ పేసర్ మార్కో యాన్సెన్, ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ల చేరడంతో ఆల్ రౌండ్ విభాగాన్ని బాగా బలోపేతం చేసినట్లు కనిపిస్తోంది.కింగ్స్ జట్టులో నేహాల్ వధేరా, వైశక్ విజయ్‌కుమార్, యష్ ఠాకూర్ వంటి కొంతమంది యువ మరియు ఉత్తేజకరమైన ఆటగాళ్లను కూడా ఉన్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో ముంబై విజయంలో కీలక పాత్ర వహించిన సూర్యాంష్ షెడ్గే, ముషీర్ ఖాన్ కూడా జట్టులో చేరారు. వీరంతా ఇటీవలి కాలంలో అందరి దృష్టిని ఆకర్షించారు.ఈ సీజన్‌లో కింగ్స్‌కు లాకీ ఫెర్గూసన్ ప్రధాన పేసర్లలో ఒకడిగా ఉండే అవకాశముంది. ఇంకా విదేశీయ ఆటగాళ్లు జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్‌లెట్ జట్టుకు మరింత నాణ్యతను జోడిస్తారు. మొత్తమ్మీద సీనియర్, యువ ఆటగాళ్లతో, కొత్త కెప్టెన్‌తో జట్టు కొత్త తరహా వ్యూహంతో సిద్ధంగా ఉంది.పంజాబ్ కింగ్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్లుశ్రేయస్ అయ్యర్ఛాంపియన్స్ ట్రోఫీ లో నిలకడ గా రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర వహించిన శ్రేయస్ అయ్యర్ పై పంజాబ్ కింగ్స్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ముంబై బ్యాటర్‌ గత సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను ముందుండి నడిపించి టైటిల్ సాధించిపెట్టాడు.ఇప్పుడు కింగ్స్ కూడా శ్రేయాస్ అయ్యర్ నుంచి అదే కానుక కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌తో ఉన్న ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కింగ్స్‌కు ప్రధాన ఆటగాళ్లలో ఒకడు అనడంలో సందేహం లేదు.యుజ్వేంద్ర చాహల్ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలర్ కొత్త సీజన్‌లో కింగ్స్‌తో కలిసి తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. భారత్ జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ చాహల్ స్పిన్ మాయాజాలాన్ని తక్కువగా అంచనా వేయలేం.అర్ష్‌దీప్ సింగ్టీ20 ఫార్మాట్ లో భారత్ తరుపున నిలకడగా రాణిస్తున్న ఈ ఎడమచేతి వాటం పేస్ బౌలర్ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కి సారధ్యం వహించే అవకాశముంది. గత కొన్ని సీజన్లలో ఐపిఎల్ లో నిరంతరం వికెట్లు సాధిస్తూ భారత్ జట్టులోకి చొచ్చుకొచ్చిన అర్ష్‌దీప్ మరోసారి తన ప్రతిభని నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుత అర్ష్‌దీప్ ఫామ్ పంజాబ్‌కు కీలకం అవుతుంది.గ్లెన్ మాక్స్వెల్2014లో పంజాబ్ ప్లేఆఫ్స్‌ చేరుకున్న సమయంలో మాక్స్వెల్ కూడా జట్టులో ఉన్నాడు. మళ్లీ మాక్స్వెల్ అదే తరహా లో మెరుపులు మెరిపిస్తాడని కింగ్స్ భావిస్తోంది. అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.మార్కస్ స్టోయినిస్ఈ సీజన్‌లో స్టోయినిస్ తన అల్ రౌండ్ ప్రతిభ కనబరుస్తాడని కింగ్స్ ఏంతో ఆశలు పెట్టుకుంది. టాప్‌లో పరుగులు చేయడం, బౌలింగ్ లో కూడా కీలక పాత్ర వహిస్తాడని పంజబ్ గట్టి నమ్మకంతో ఉంది.పంజాబ్ కింగ్స్ జట్టుశ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్, నేహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, వైశాక్ విజయ్‌కుమార్, యష్ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, కుల్దీప్ సేన్, పైలా అవినాష్, సూర్యాంష్ షెడ్గే, ముషీర్ ఖాన్, హర్నూర్ పన్ను, ఆరోన్ హార్డీ, ప్రియాంష్ ఆర్య, అజ్మతుల్లా ఒమర్జాయ్.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement