ప్రధాన వార్తలు
పాక్తో మ్యాచ్.. కుండబద్దలు కొట్టిన సూర్యకుమార్
భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తాము అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్కు అనుగుణంగా నడుచుకుంటామని.. ఫిబ్రవరి 15న కొలంబోకు వెళ్తామని కుండబద్దలు కొట్టాడు. ఈ విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని సూర్య ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
వాళ్లు మా సోదరులు: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు. బంగ్లాదేశీయలు తమ సోదరులు అంటూ అతడు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. బంగ్లాదేశ్కు గట్టిగా బుద్ధి చెప్పిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాకిస్తాన్కు కూడా సరైన సమాధానం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.భారత్- బంగ్లా ఉద్రిక్తతలుకాగా 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. పశ్చిమ పాకిస్తాన్ ఆగడాలు తట్టుకోలేక విలవిల్లాడిన తూర్పు ప్రజలకు భారత సైన్యం అండగా నిలిచింది. ఫలితంగా బంగ్లాదేశ్కు స్వతంత్రత వచ్చింది. ఈ యుద్ధంలో సుమారుగా 3900 మంది భారతీయ సైనికులు ప్రాణత్యాగం చేశారు.ఇలా బంగ్లాదేశ్కు ఆది నుంచి భారత్ అండగా ఉంటోంది. అయితే, ఇటీవల కొంతమంది బంగ్లా నేతలు భారత్ భూభాగాల గురించి అవాకులు చెవాకులు పేలడమే కాకుండా.. ఉగ్రవాదులకు తాము ఆశ్రయమిస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మైనారిటీ హిందువులపై బంగ్లాలో హత్యాకాండ జరిగింది.టోర్నీ నుంచి అవుట్ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో తమ ఆటగాళ్లకు భారత్లో భద్రత ఉండదంటూ టీ20 ప్రపంచకప్-2026లో తమ వేదికను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లా ఐసీసీని కోరింది.పాక్ ఓవరాక్షన్అయితే, బంగ్లా ఆరోపణలను కొట్టిపారేసిన ఐసీసీ.. తుదినిర్ణయం చెప్పాలని గడువు ఇచ్చింది. అయినప్పటికి బంగ్లా పట్టువీడకపోవడంతో టోర్నీ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన శ్రీలంకలో మ్యాచ్లు ఆడాల్సి ఉన్న పాక్ సైతం టోర్నీ బహిష్కరిస్తామని తొలుత.. ఆ తర్వాత భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది.ఈ నేపథ్యంలో ‘థాంక్యూ పాకిస్తాన్’ అని బంగ్లాదేశ్ యువజన, క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్నకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్పై ప్రేమ ఒలకబోశాడు.చరిత్ర గుర్తు చేసుకో‘‘బంగ్లాదేశీయులు మా సోదరులు. పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నందుకు వారికి రుణపడి ఉంటాము. కానీ వాళ్లు ఈసారి వరల్డ్కప్ టోర్నీ ఆడకపోవడం చూస్తుంటే బాధగా ఉంది’’ అంటూ సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటూ భారతీయ నెటిజన్లు అతడికి చురకలు అంటిస్తున్నారు. కాగా శనివారం నుంచి భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. పాక్ తమ తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడుతుంది.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్.. పొట్టకొట్టేలా..
న్యూజిలాండ్కు భారీ షాక్
టీ20 ప్రపంచకప్- 2026 ఆరంభానికి ముందు న్యూజిలాండ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే అనారోగ్యం బారిన పడ్డారు. వీరిద్దరూ ప్రస్తుతం వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. దీంతో గురువారం అమెరికాతో జరగాల్సిన వార్మప్ మ్యాచ్కు వారిద్దరూ దూరమయ్యారు.ఈ విషయాన్ని కివీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ధ్రువీకరించారు. రచిన్, కాన్వే ప్రస్తుతం తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని అతడు తెలిపాడు. ఫిబ్రవరి 8న ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మొదటి మ్యాచ్ నాటికి వీరిద్దరూ కోలుకుంటారని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కేవలం అనారోగ్యం మాత్రమే కాకుండా, గాయాలు కూడా కివీస్ జట్టును కలవరపెడుతున్నాయి.విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా భుజం గాయం కారణంగా యూఎస్ఎతో వార్మప్ మ్యాచ్కు అందుబాటులో లేడు. స్టార్ పేసర్ ఆడమ్ మిల్నే ఇప్పటికే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో కైల్ జేమీసన్ జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు కీలక ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ కాళ్ల కండరాల గాయం నుంచి కోలుకుంటున్నాడు.బ్రేస్వెల్ మొదటి మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. అయితే స్పీడ్ స్టార్ లాకీ ఫెర్గూసన్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం సానుకూల అంశంగా చెప్పుకోవాలి.టీ20 ప్రపంచకప్ టోర్నీకి న్యూజిలాండ్ జట్టు ఇదేమిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్,డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర,డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్,టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్),మార్క్ చాప్మన్, మైఖేల్ బ్రేస్వెల్,జేమ్స్ నీషమ్,ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్
అందుకే టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నాం: పాక్ ప్రధాని
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియాతో తమ జట్టు మ్యాచ్ ఆడబోదని పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ పునురుద్ఘాటించారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని.. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్లో ఫెడరల్ క్యాబినెట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ..అందుకే టీమిండియాతో మ్యాచ్ ఆడము‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇండియాతో మ్యాచ్ ఆడవద్దని నిర్ణయించుకున్నట్లు మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే.. క్రీడా మైదానంలో రాజకీయాలకు తావు ఉండకూడదనేది మా వాదన. అందుకే మేము కచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం.బంగ్లాదేశ్కు మద్దతుగా మేము ఈ పని చేస్తున్నాం. ఇది అత్యంత గొప్ప, సరైన నిర్ణయమని నేను భావిస్తున్నాను’’ అని షెబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పేర్కొన్నారు. కాగా పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్గా పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీ (Mohsing Naqvi) ఉన్న సంగతి తెలిసిందే.మీ వేషాలు మామూలుగా లేవండి!ఇప్పుడు వరల్డ్కప్లో భారత్తో మ్యాచ్ బహిష్కరణ గురించి ఏకంగా ప్రధాని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను క్రీడలతో కలగలిపి దౌత్యపరంగా లబ్ది పొందాలని చూస్తుంది మీరేనంటూ షెబాజ్ షరీఫ్పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బంగ్లాదేశ్కు లేని బాధ మీకు ఎందుకని.. ఉద్దేశపూర్వకంగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే నష్టపోయేది మీరేనంటూ చురకలు అంటిస్తున్నారు. ఏదేమైనా.. ‘‘మీ వేషాలు మామూలుగా లేవండి’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.తటస్థ వేదికపై దాయాదుల పోరుకాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా తటస్థ వేదికైన దుబాయ్లో మ్యాచ్లు ఆడింది. ఈ నేపథ్యంలో అప్పుడే భారత్- పాక్లలో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. తటస్థ వేదికను ఏర్పాటు చేయాలనే ఒప్పందం జరిగింది. అందుకు తగ్గట్లే టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ శ్రీలంకతో తమ మ్యాచ్లు ఆడనుంది.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ కొన్నాళ్లుగా భారత్ను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ను బీసీసీఐ తొలగించింది. దీంతో భారత్తో తమకు భద్రత లేదని.. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లా బోర్డు ఐసీసీ దగ్గర పట్టుపట్టింది.బంగ్లాదేశ్కు గట్టిగానే షాక్ తగిలిందిఅయితే, భారత్లో భద్రత విషయంలో బంగ్లా జట్టుకు వచ్చిన ఎలాంటి ముప్పేమీ లేదని ఐసీసీ చెప్పగా.. బంగ్లా మొండివైఖరి వీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. అయితే, పాకిస్తాన్ మాత్రం తమకు తటస్థ వేదిక ఉన్నా.. లంకలో భారత్తో మ్యాచ్కు భద్రతా సమస్యలు ఉన్నాయంటూ కొత్తరాగం ఎత్తుకుంది.అయితే, లీగ్ దశలో మిగిలిన మ్యాచ్లకు లేని భద్రతా కారణాలు.. భారత్తో మ్యాచ్కు మాత్రమే ఎందుకు ఉంటాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్ ప్రధాని స్వయంగా మరోసారి ఈ విషయం గురించి ప్రకటన చేయడం విశేషం. ఒకవేళ పాక్ టీమిండియాతో మ్యాచ్ను బహిష్కరిస్తే ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఐసీసీ ఆదాయం తగ్గి.. ఇతర సభ్య దేశాల బోర్డులపై కూడా ప్రభావం పడుతుంది.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్.. పొట్టకొట్టేలా..
భారత్తో జరగాల్సిన మ్యాచ్కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
క్రికెట్ అభిమానులను ఇది కన్ఫ్యూజ్ చేసే వార్త. ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. అదేంటి.. ఆ రోజు భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాక్ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది కాదా అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. అంతకుముందు వార్త కూడా నిజమే.వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 15న భారత్-పాక్ మధ్య రెండు మ్యాచ్లు జరగాల్సి ఉన్నాయి. పాక్ ప్రభుత్వం పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. మరో మ్యాచ్ మహిళల ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా జరగాల్సి ఉంది.ఈ మ్యాచ్కు పాక్ ప్రభుత్వం నుంచి కాని, ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి కాని ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ మ్యాచ్తో పాటు టోర్నీ మొత్తం కోసమే పీసీబీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా ఉమ్మె-హాని ఎంపికైంది.ఈ జట్టులో ఎమాన్ నసీర్, గుల్ రుఖ్, హఫ్సా ఖలీద్, హురైనా సజ్జాద్, షావాల్ జుల్ఫికార్ కీలక బ్యాటర్లు. వికెట్ కీపర్లుగా కోమల్ ఖాన్, యుస్రా ఆమిర్ ఎంపికయ్యారు. ఆల్రౌండర్లుగా నూరీన్ యాకూబ్, ఉమ్మె-హాని ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అనోషా నసీర్, లుబ్నా బెహ్రామ్, నేహా షర్మిన్ నదీమ్ , సయిదా మసూమా జాఫ్రీ , వహీదా అఖ్తర్ ఆ జట్టు బలంగా ఉంది. రిజర్వ్ ప్లేయర్లుగా జునాష్ అబ్దుల్ సత్తార్, మహమ్ అనీస్, అంబర్ కైనాత్, ఆయేషా బిలాల్ ఎంపికయ్యారు.ఈ టోర్నీలో పాక్ షెడ్యూల్ ఇలా ఉంది. ఫిబ్రవరి 13 – పాకిస్తాన్ ‘A’ vs నేపాల్ (ఉదయం 9.30) ఫిబ్రవరి 15 – పాకిస్తాన్ ‘A’ vs ఇండియా ‘A’ (మధ్యాహ్నం 2.00) ఫిబ్రవరి 17 – పాకిస్తాన్ ‘A’ vs UAE (మధ్యాహ్నం 2.00) అన్ని మ్యాచ్లు బ్యాంకాక్లో జరగనున్నాయి. ఇదిలా ఉంటే, ఈ టోర్నీలో భారత ఏ జట్టు కూడా ఫిబ్రవరి 13నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్లాండ్ గ్రూప్-బిలో ఉండగా.. పాక్, భారత్, యూఏఈ, నేపాల్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్ దశలో భారత్ ఫిబ్రవరి 13న యూఏఈతో, 15న పాకిస్తాన్తో, 17న నేపాల్తో మ్యాచ్లు ఆడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా ఆల్రౌండర్ రాధా యాదవ్ వ్యవహరించనుంది.
IND vs PAK: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!
భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ ప్రకటనపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది. ఇలాంటి నిర్ణయాల వల్ల తాము కూడా నష్టపోయే ప్రమాదం ఉందంటూ.. పాక్కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.బంగ్లా మొండి వైఖరి.. ఐసీసీ కఠిన చర్యలుఅయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్లో భద్రత లేదంటూ బంగ్లా ఆరోపించింది. తమ వేదికను లంకకు మార్చాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించి.. పునరాలోచించుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది.పాక్ బోర్డు డ్రామాలుకానీ.. బీసీబీ మాత్రం మొండిపట్టు వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ను తప్పించి ఆ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను చేర్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్కు తాము మద్దతుగా ఉంటామంటూ పాక్ క్రికెట్ బోర్డు (PCB) డ్రామాకు తెరతీసింది.తొలుత టోర్నీ మొత్తం బహిష్కరిస్తామని.. ఆ తర్వాత భారత్తో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేస్తామని పీసీబీ ఐసీసీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే దాదాపు రెండు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.పాక్ పంతం వీడకపోతే ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఐసీసీ సభ్య దేశాల ఆదాయంలో కోత పడుతుంది. ముఖ్యంగా చిన్నస్థాయి బోర్డుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. పాక్తో పాటు ఇతర సభ్య దేశాలు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.నష్టపరిచే విధానాలను కోరుకోవడం లేదుఈ నేపథ్యంలో పాక్ ప్రకటనపై బంగ్లాదేశ్ సీనియర్ డైరెక్టర్ ఒకరు స్థానిక మీడియా ప్రథోమ్ ఆలోతో మాట్లాడారు. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరుగకపోతే క్రికెట్ ప్రపంచం మొత్తం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుంది. ఆదాయంలో మా వాటా కూడా తగ్గిపోతుంది. ఇలాంటి నష్టపరిచే విధానాలను మేము కోరుకోవడం లేదు’’ అని సదరు డైరెక్టర్ స్పష్టం చేశారు. పాక్ వైఖరి ఇతర బోర్డుల పొట్టకొట్టేలా ఉందని అభిప్రాయపడ్డారు.అయితే, అదే సమయంలో.. ‘‘భారత క్రికెట్కు గట్టి సందేశం ఇవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు ఉంది. క్రికెట్లో భారత్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తోంది. ఆ కోణంలో పాక్ నిర్ణయం ఒక రకంగా సరైందే అయి ఉండవచ్చు’’ అని సదరు డైరెక్టర్ భారత్పై అక్కసు వెళ్లగక్కారు.కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతానికి పైగా ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని పాక్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా గతంలో వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరు భారత క్రికెట్ అని చెప్పడంలో సందేహం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వ్యవస్థ అతలాకుతలంఇలాంటి తరుణంలో పాక్ ఇలా పూటకో నాటకం ఆడుతూ ఇతర బోర్డులకు నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శలూ వస్తున్నాయి. బీసీబీకి చెందిన మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘భారత్- పాక్ మ్యాచ్ వివాదం ఐసీసీ సెంట్రల్ రెవెన్యూ పూల్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మేము కూడా అందులో భాగమే. కెన్యా, ఉగాండా వంటి జట్లు పెద్దగా నష్టపోవు. ఒకవేళ ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం తగ్గితే మా వ్యవస్థ అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది’’ అని పేర్కొన్నారు. చదవండి: వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్!
పాక్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
టీ20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసుకున్న విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు-ఐసీసీ మధ్య అగాధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పీసీబీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందని అంతా అనుకుంటుండగా, ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకున్నట్లు ఐసీసీ పాక్పై చర్యలు తీసుకోకపోగా.. ఆ దేశ క్రికెట్ అభిమానులకు ఓ బంపరాఫర్ ఇచ్చింది.ప్రపంచకప్లో పాక్ ఆడే మ్యాచ్లకు పూర్తిస్థాయి ఉర్దూ వ్యాఖ్యానాన్ని అందిస్తామని ప్రకటించింది. ఐసీసీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రత్యేక ఫీడ్ను ఐసీసీ స్వయంగా తయారు చేసి పాకిస్తాన్ స్థానిక ఛానల్ PTVలో ప్రసారం చేయనుంది. అదనంగా Myco, Tamasha, Tapmad, ARY Zapp వంటి డిజిటల్ ప్లాట్ఫార్మ్లలో కూడా అందుబాటులో ఉంచనుంది. ఇప్పటి వరకు పాక్ అభిమానులు ఎక్కువగా ఇంగ్లీష్ ఫీడ్ లేదా పరిమిత స్థానిక కవరేజ్పై ఆధారపడ్డారు. తాజాగా ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పాక్తో అనుబంధాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తీసుకున్నదిగా తెలుస్తుంది. ఐసీసీ తొలిసారి అందించనున్న పూర్తి ఉర్దూ వ్యాఖ్యానం పాక్ ఆడబోయే వార్మప్ మ్యాచ్కు కూడా వర్తిస్తుంది.ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు. పాక్ ఇన్ని డ్రామాలాడుతున్నా, ఆ దేశ అభిమానుల కోసం ఇలాంటి సౌకర్యాలెందుకని ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్గా భారతీయుడు (జై షా) ఉండి కూడా పాక్కు అనుకూలమైన ఇలాంటి కొత్త సంప్రదాయాలకు తెరలేపడమేంటని నిలదీస్తున్నారు. ఒప్పందాలకు విరుద్దంగా భారత్తో మ్యాచ్ రద్దు చేసుకోవాలని చూస్తున్న పాక్పై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి ఆఫర్లు ఏంటని పెదవి విరుస్తున్నారు. తక్షణమే పాక్పై చర్యలు తీసుకొని, ఆ జట్టు ప్రపంచకప్ మొత్తం నుంచే తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు.కాగా, భారత్తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ మినహా మిగతా ప్రపంచకప్ మ్యాచ్లన్నిటినీ ఆడతామని ఇటీవల పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వారు తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీ మరియు ప్రపంచకప్ ప్రసారకర్తలకు పెద్ద సమస్యగా మారింది. ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల ఐసీసీకి, ప్రసారక్తలను ఆర్దికంగా చాలా నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని నివారించడం కోసమే ఐసీసీ పాక్ అభిమానులను టార్గెట్ చేస్తూ ఉర్దూ వ్యాఖ్యానం అస్త్రాన్ని ప్రయోగించిందని తెలుస్తుంది. ఒకవేళ పాక్ ఇప్పుడు కూడా తగ్గకుండా భారత్తో మ్యాచ్ ఆడమని భీష్మించుకు కూర్చుంటే ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి.
వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం వల్ల న్యూజిలాండ్తో టీ20 సిరీస్ మొత్తానికి దూరం కాగా.. ఇటీవల యూఎస్తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా పునరాగమనం చేశాడు. భారత- ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్లోనూ టీమిండియా తరఫున అదరగొట్టాడు.ఇక తిలక్ వర్మ (Tilak Varma) కోలుకోవడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. లీగ్ దశ మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా స్టార్ పేసర్ హర్షిత్ రాణా కూడా గాయం వల్ల బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు బుధవారం సౌతాఫ్రికాతో తలపడిన విషయం తెలిసిందే.దంచికొట్టిన ఇషాన్, తిలక్నవీ ముంబై వేదికగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 53; 2 ఫోర్లు, 7 సిక్స్లు) హాఫ్సెంచరీతో కదంతొక్కగా... హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (19 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్లు) దంచి కొట్టాడు.ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు), అక్షర్ పటేల్ (23 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (10 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ షాట్లతో ఆకట్టుకున్నారు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ చూడచక్కటి షాట్లతో చెలరేగారు.మరోవైపు.. న్యూజిలాండ్తో సిరీస్లో విఫలమైన వికెట్కీపర్ సంజూ శాంసన్ ఈమ్యాచ్లో బ్యాటింగ్కు దిగలేదు. అతడి స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచకప్ ప్రారంభపోరులో శనివారం అమెరికాపై అభిషేక్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభించడం దాదాపు ఖాయమే.210 పరుగులుఅనంతరం భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ (19 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్లు), రికెల్టన్ (21 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు), జాసన్ స్మిత్ (23 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టబ్స్ (21 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) తలాకొన్ని పరుగులు చేశారు. 9 మంది భారత బౌలర్లు బౌలింగ్ చేయగా... అభిషేక్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.మోకాలి నొప్పి?అయితే, ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా ఒక్క ఓవర్ మాత్రమే వేసి నిష్క్రమించాడు. తన ఓవర్లో పదహారు పరుగులు సమర్పించుకున్న ఈ రైటార్మ్ పేసర్.. బౌలింగ్ చేసే సమయంలో అసౌకర్యానికి గురయ్యాడు. మోకాలి నొప్పితో అతడు బాధపడినట్లు కనిపించింది. తన ఓవర్ పూర్తి చేసుకున్న వెంటనే హర్షిత్ రాణా మైదానం వీడాడు. అతడు కోలుకోవడానికి ఇంకో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, హర్షిత్ గాయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కాగా లోయర్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయడంతో పాటు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సమయంలో హర్షిత్ రాణా సేవలు అందిస్తున్నాడు. ప్రధాన మ్యాచ్లలో బుమ్రాకు తోడుగా అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా రొటేషన్ పద్ధతిలో తుదిజట్టులోకి వస్తున్నారు. చదవండి: భారత్ను పదోసారి ఫైనల్కు చేర్చిన ఈ 'ఆరోన్ జార్జ్' ఎవరు..?
ఆసుపత్రిపాలైన సర్ఫరాజ్ ఖాన్
ఫిబ్రవరి 6 నుంచి కార్ణటకతో జరుగబోయే రంజీ ట్రోఫీ 2025-26 నాలుగో క్వార్టర్ ఫైనల్కు ముందు ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, ఇన్ఫామ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వైరల్ ఫీవర్ కారణంగా ఆసుపత్రిపాలయ్యాడు. వైద్యులు అతనికి అత్యవసర చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం సర్ఫరాజ్ మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చు.సర్ఫరాజ్ ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్ నుంచే ఇబ్బందిపడుతున్నాడు. ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేయగలిగినా ఫీల్డింగ్కు రాలేదు. ఆ సమయంలో అతన్ని హామ్స్ట్రింగ్ సమస్య కూడా ఇబ్బంది పెట్టింది. అయినా అతను మొదటి ఇన్నింగ్స్లో 27 బంతుల్లో 24 పరుగులు చేయగలిగాడు.క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సర్ఫరాజ్ లేని లోటు ముంబైకు తీవ్రంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇటీవలికాలంలో అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. లీగ్ దశలో హైదరాబాద్పై 227 పరుగులు (219 బంతులు) చేసి తన శక్తివంతమైన బ్యాటింగ్ను మరోసారి నిరూపించారు. ఆ ఇన్నింగ్స్లో అతను 5,000 ఫస్ట్క్లాస్ పరుగులు పూర్తి చేశాడు. దీనికి ముందు వైట్ బాల్ క్రికెట్లోనూ సర్ఫరాజ్ చెలరేగిపోయాడు.విధ్వంసకర బ్యాటింగ్తో ఫార్మాట్లకతీతంగా సెంచరీలు నమోదు చేశాడు.
ముంబై జట్టుకు సచిన్ సలహాలు
ముంబై: కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని ఎలా జయించాలనే అంశంపై ముంబై రంజీ జట్టుకు... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు సూచనలు చేశాడు. గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ముంబై జట్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కర్ణాటకతో తలపడనుంది. ఇప్పటి వరకు ముంబై జట్టు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకోగా... కర్ణాటక జట్టు ఎనిమిదిసార్లు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సచిన్ టెండూల్కర్ ముంబై జట్టుతో ముచ్చటించాడు.ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్తో సుదీర్ఘంగా సంభాషించాడు. ‘డ్రెస్సింగ్ రూమ్లో సచిన్ సార్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. విజయ పరంపర కొనసాగించడం, మానసిక దృఢత్వం, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి ఎన్నో అంశాలపై కీలక సూచనలు చేశారు. ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆయన మాటలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కీలక సమరాల్లో ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చో చక్కగా వివరించారు. రంజీ ట్రోఫీలో ఆ సూచనలు పాటిస్తూ విజయాలు సాధించాలని భావిస్తున్నాం’ అని ముంబై కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ పేర్కొన్నాడు.
‘క్షమించండి.. నా మాజీ భర్త గురించే అలా మాట్లాడాను’
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ క్షమాపణలు చెప్ప...
‘క్రీడా’ బడ్జెట్ 2026: కీలక అంశాలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈసారి క్రీడలకు కాస్త...
అర్జున్కు 13వ స్థానం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర...
దేవిక ధమాకా
బ్యాంకాక్: అంచనాలకు మించి రాణించిన భారత రైజింగ్ ...
పాక్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
టీ20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చే...
వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు టీమిండియా...
ఆసుపత్రిపాలైన సర్ఫరాజ్ ఖాన్
ఫిబ్రవరి 6 నుంచి కార్ణటకతో జరుగబోయే రంజీ ట్రోఫీ 20...
ముంబై జట్టుకు సచిన్ సలహాలు
ముంబై: కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని ఎలా జయించాలనే అం...
క్రీడలు
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
వీడియోలు
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
కుర్రాళ్లు కుమ్మేశారు
ఎలిమినేటర్ లో ఢిల్లీ సత్తా.. సెమీస్ లో గుజరాత్ ఔట్
దడపుట్టించిన భారత్.. పాకిస్తాన్ సంచలన ప్రకటన..
పాక్ పై భారత్ ఘన విజయం
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
