Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Devon Conway slams second Test double century against West Indies in third Test1
ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ డ‌బుల్ సెంచ‌రీతో

మౌంట్ మౌంగానుయి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 316 బంతుల్లో తన రెండో టెస్టు డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.178 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కాన్వే దూకుడుగా ఆడి తన ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 367 బంతులు ఎదుర్కొన్న కాన్వే.. 31 ఫోర్ల సాయంతో 508 పరుగులు చేశాడు. ఇంతకుముందు డెవాన్ ఇంగ్లండ్‌పై తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు.కాన్వే-లాథమ్ వరల్డ్ రి​కార్డు..ఈ మ్యాచ్‌లో డెవాన్ కాన్వేతో పాటు కెప్టెన్ టామ్ లాథమ్ కూడా (246 బంతుల్లో 137; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 323 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ సాధించిన జోడీగా లాథమ్‌- కాన్వే చరిత్ర సృష్టించారు. అదేవిధంగా డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ- మయాంక్‌ అగర్వాల్‌ తొలి వికెట్‌కు 317 పరుగులు జోడించగా.. లాథమ్‌- కాన్వే ఈ రికార్డును బ్రేక్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 145 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 508 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌..కాగా డబుల్ సెం‍చరీ వీరుడు డెవాన్ కాన్వే ఇటీవల జరిగిన ఐపీఎల్‌-2026 మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలో​కి వచ్చిన కాన్వేను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఐపీఎల్‌లో కూడా మంచి రికార్డును డెవాన్‌ను ఎవరూ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. గతంలో అతడు సీఎస్‌కే ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: Ashes 2025: స్టోక్స్‌, ఆర్చర్ విరోచిత పోరాటం​.. ఇంగ్లండ్ ఆలౌట్‌

England all out for 286 on day three of the third Test at Adelaide Oval2
స్టోక్స్‌, ఆర్చర్ విరోచిత పోరాటం​.. ఇంగ్లండ్ ఆలౌట్‌

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 213/8 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల వద్ద ఆలౌటైంది.టాపార్డర్ విఫలమైనప్పటికి.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 83), లోయార్డర్ బ్యాటర్ జోఫ్రా ఆర్చర్‌(105 బంతుల్లో 51) విరోచిత పోరాటం కనబరిచారు. ‘బాజ్‌బాల్‌’ ఆటతీరును పక్కన పెట్టిన స్టోక్స్‌... సంప్రదాయ టెస్టు క్రికెట్‌ ఫార్మాట్‌లో ఓవర్లకు ఓవర్లు క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్‌ చేశాడు.ఈ క్రమంలో బ్రూక్‌తో ఐదో వికెట్‌కు 56 పరుగులు జోడించిన స్టోక్స్‌... తొమ్మిదో వికెట్‌కు ఆర్చర్‌తో 106 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆర్చర్ కూడా ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులు వెనకబడింది.శాంతించిన స్టార్క్‌..గత రెండు మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు దక్కించుకున్న మిచెల్‌ స్టార్క్‌ ఈసారి కాస్త శాంతించగా... ఆసీస్ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బోలాండ్ తలా 3 వికెట్లతో సత్తా చాటారు. నాథన్‌ లయన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆ్రస్టేలియా బౌలర్‌గా లయన్‌ నిలిచాడు. పేస్‌ దిగ్గజం మెక్‌గ్రాత్‌ను అతడు అధిగమించాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 326/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 91.2 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ స్టార్క్‌ (75 బంతుల్లో 54; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 5 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్‌ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.చదవండి: సమమా... సొంతమా!

FIFA has announced the prize money details for next years World Cup football tournament3
విజేతకు రూ. 450 కోట్లు

దోహా: మరో ఏడు నెలల్లో జరగనున్న ప్రపంచకప్‌ పురుషుల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు సంబంధించి ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) గురువారం వెల్లడించింది. ఈసారి విజేత జట్టుకు 5 కోట్ల డాలర్లు (రూ. 450 కోట్లు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్‌ జట్టు ఖాతాలో 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 297 కోట్లు) చేరుతాయి. 2026 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఓవరాల్‌ ప్రైజ్‌మనీ 65 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 5,905 కోట్లు) కావడం విశేషం. 2022లో ఖతర్‌లో జరిగిన ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి మొత్తం ప్రైజ్‌మనీలో 48.9 శాతం పెరుగుదల ఉంది. 2022 ప్రపంచకప్‌ మొత్తం ప్రైజ్‌మనీ 44 కోట్లు కావడం గమనార్హం. 2022 ప్రపంచకప్‌లో టైటిల్‌ నెగ్గిన అర్జెంటీనా జట్టుకు 4 కోట్ల 20 లక్షల డాలర్లు... రన్నరప్‌ ఫ్రాన్స్‌ జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్లు లభించాయి. 2026 ప్రపంచకప్‌ జూన్‌ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడాలలో నిర్వహిస్తారు. తొలిసారి 48 జట్లతో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. దోహాలో జరిగిన ‘ఫిఫా’ కౌన్సిల్‌ సమావేశంలో ప్రైజ్‌మనీ వివరాలకు ఆమోదం లభించింది. ఎప్పటిలాగే టోర్నీకి అర్హత సాధించిన అన్ని జట్లకు ‘ఫిఫా’ నుంచి భారీ మొత్తం అందనుంది. మెగా ఈవెంట్‌కు అర్హత పొందినందుకు 48 జట్లకు 90 లక్షల డాలర్ల (రూ. 8 కోట్ల 11 లక్షలు) చొప్పున పార్టిసిపేషన్‌ ఫీజు... ప్రపంచకప్‌ సన్నాహాల ఖర్చుల కింద 15 లక్షల డాలర్ల (రూ. 1 కోటీ 35 లక్షలు) చొప్పున ‘ఫిఫా’ చెల్లిస్తుంది. ‘ఫిఫా’ చెల్లించే మొత్తం ఆయా దేశాల ఫుట్‌బాల్‌ సమాఖ్యలకు వెళుతుంది. తమ క్రీడాకారులకు ఎంత మొత్తం చెల్లించాలో ఆయా దేశాల సమాఖ్యలే నిర్ణయం తీసుకుంటాయని ‘ఫిఫా’ వివరించింది. ఎవరికెంత ప్రైజ్‌మనీ అంటే...విజేత: 5 కోట్ల డాలర్లు (రూ. 450 కోట్లు) రన్నరప్‌: 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 297 కోట్లు) మూడో స్థానం: 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 261 కోట్లు) నాలుగో స్థానం: 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 243 కోట్లు) 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన జట్లకు 1 కోటీ 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 171 కోట్లు చొప్పున) 9 నుంచి 16 స్థానాల్లో నిలిచిన జట్లకు 1 కోటీ 50 లక్షల డాలర్ల చొప్పున (రూ. 135 కోట్లు చొప్పున) 17 నుంచి 32 స్థానాల్లో నిలిచిన జట్లకు 1 కోటీ 10 లక్షల డాలర్ల చొప్పున (రూ. 99 కోట్లు చొప్పున) 33 నుంచి 48 స్థానాల్లో నిలిచిన జట్లకు 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 81 కోట్లు చొప్పున)

An interesting discussion took place in the Rajya Sabha regarding the Indian football team4
మన ఫుట్‌బాల్‌ సంగతేంటి?

న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్‌ జట్టుపై గురువారం రాజ్యసభలో ఆసక్తికరచర్చ జరిగింది. 1 లక్షా 58 వేల జనాభా మాత్రమే ఉన్న కురసావ్‌ దేశం జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి అర్హత సాధించింది. అయితే 143 కోట్ల జనభా ఉన్న భారత్‌ సంగతేంటని కేరళకు చెందిన కాంగ్రెస్‌ సభ్యులు జోస్‌ కె. మణి రాజ్యసభలో ప్రశ్నించారు. మన ఫుట్‌బాల్‌ జట్టు ప్రగతిపై దీర్ఘకాలిక ప్రణాళికలేవైనా ఉన్నాయా అని కూడా అడిగారు. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పందిస్తూ కురసావ్‌ దేశం పేరెత్తకుండా బదులిచ్చారు. ‘ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించడం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిర్దేశించిన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది’ అని అన్నారు. ఏదైనా ప్రపంచకప్‌ లేదంటే ప్రపంచ చాంపియన్‌íÙప్‌లలో పాల్గొనడానికి, అర్హత సంపాదించడానికి సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్య చూసుకోవాల్సిన అంశమని, ఆయా క్రీడల నిర్దిష్ట అభివృద్ధికి సంబంధిత సమాఖ్యలదే బాధ్యతని ఆయన సభకు వివరించారు. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) దేశంలో క్రీడాభివృద్ధికి, ఆదరణ పెంచేందుకు, ప్రతిభగల ఫుట్‌బాలర్లను మరింత సానబెట్టేందుకు, పురుషులు, మహిళల జట్టు ‘ఫిఫా’ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తాయని మంత్రి మాండవీయ వివరించారు. తమ ప్రభుత్వ పరంగా ‘ఖేలో ఇండియా’ పేరుతో చేపట్టిన బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన అథ్లెట్లు ఎందరో వెలుగులోకి వచ్చారని, 20 వేల పైచిలుకు క్రీడాకారులు ఈ ఖేలో ఇండియాతో ప్రయోజనం పొందారని చర్చ సందర్భంగా జవాబిచ్చారు. దేశంలో ఉన్న 991 ఖేలో ఇండియా కేంద్రాల్లో 28,214 మంది క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని చెప్పారు.

Indian shooter achieves a remarkable feat in the ISSF Top 55
ఈ ఏటి మేటి షోలో సామ్రాట్‌ ‘స్వర్ణ’ గురి

న్యూఢిల్లీ: భారత షూటర్‌ సామ్రాట్‌ రాణా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శనకు అరుదైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) విడుదల చేసిన ఈ ఏడాది మేటి ఐదు ప్రదర్శనల్లో మన షూటర్‌ ఘనత కూడా నిలిచింది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల యువ షూటర్‌ సామ్రాట్‌ గత నెల కైరోలో జరిగిన ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో అసాధారణ గురితో ‘స్వర్ణ’ధరికి చేరాడు. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, సొంత వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి షూటింగ్‌ కేంద్రమే సామ్రాట్‌ను ప్రపంచ చాంపియన్‌గా మలిచింది. ఈ సందర్భంగా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ సామ్రాట్‌ పసిడి పతక ప్రదర్శనను ఆకాశానికెత్తింది. అద్భుతమని కితాబిచ్చి ంది. అక్కడ అతనేం చేశాడంటే... పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్స్‌కు సామ్రాట్‌ అర్హత సాధించాడు. కానీ అక్కడ ప్రపంచ నంబర్‌వన్‌ హు కై (చైనా) ఉన్నాడు. పైగా ఈ ఏడాది అతను ఎవరి చేతిలోనూ ఓడలేదు. అలాంటి అజేయ షూటర్‌ స్వర్ణం లక్ష్యంగా బుల్లెట్‌లను ఫైర్‌ చేశాడు. ఇంకో నాలుగైదు షాట్లే మిగిలున్నాయి. చైనా షూటర్‌ స్పష్టమైన అధిక్యంలో ఉన్నాడు. ఇలాంటి దశలో ఒత్తిడి లేకుండా సామ్రాట్‌ తన కంటికి లక్ష్యబిందువు తప్ప ఇంకేది కనపడనీయలేదు. ట్రిగ్గర్‌ నొక్కి కచ్చి తత్వంతో కూడిన రెండు వరుస షాట్లు (10.2 పాయింట్లు, 10.6 పాయింట్లు) హరియాణా షూటర్‌కు అసాధారణ విజయాన్ని కట్టబెట్టాయి.

Today is the final T20 match between India and South Africa6
సమమా... సొంతమా!

అహ్మదాబాద్‌: సిరీస్‌ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు శుక్రవారం దక్షిణాఫ్రికాతో చివరి టి20 మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా రెండు విజయాలు సాధించగా... దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌ నెగ్గింది. మరో మ్యాచ్‌ పొగమంచు కారణంగా రద్దు అయింది. దీంతో ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని భారత్‌ 2–1తో ముందంజలో ఉంది. చివరి మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా... సుదీర్ఘ పర్యటనను విజయంతో ముగించి సిరీస్‌ను సమం చేయాలని సఫారీలు చూస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ నెగ్గగా... టీమిండియా వన్డే సిరీస్‌ సొతం చేసుకుంది. ఇప్పుడిక టి20 విజేతను తేల్చే మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన భారత వైస్‌ కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌... జట్టుతో పాటు అహ్మదాబాద్‌ చేరుకున్నాడు. దీంతో తుది జట్టులో సామ్సన్‌కు చోటు దక్కుతుందా లేక గిల్‌ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సఫారీ జట్టు సిరీస్‌ సమం చేసి సగర్వంగా స్వదేశానికి తిరిగి వేళ్లాలని చూస్తోంది. అహ్మదాబాద్‌ పిచ్‌ అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించనున్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయమే! సూర్యకుమార్‌ సత్తా చాటేనా! స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఆడిన 18 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్‌ 14.20 సగటుతో 213 పరుగులు మాత్రమే చేశాడు. అతడు తనకు అలవాటైన మూడో స్థానంలో బరిలోకి దిగి భారీ ఇన్నింగ్స్‌తో అనుమానాలను పటాపంచలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టి20 వరల్డ్‌కప్‌నకు ముందు టీమిండియా మరో ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్న నేపథ్యంలో... అటు ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇటు సిరీస్‌ చేజిక్కించుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహాలు రచిస్తోంది. విధ్వంసక ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. అతడు కాసేపు క్రీజులో నిలిస్తే చాలు ప్రత్యర్థి బౌలర్ల గణాంకాలు తారుమారు కావడం ఖాయమే. ఇక మరో ఓపెనర్‌గా గిల్, సామ్సన్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. హైదరాబాద్‌ ప్లేయర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ నిలకడ కొనసాగిస్తున్నా... బ్యాటింగ్‌లో మరింత వేగం పెంచాల్సిన అవసరముంది. హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, జితేశ్‌ శర్మ, హర్షిత్‌ రాణా భారీ షాట్‌లు ఆడగల సమర్థులే. అయితే వీరంతా కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది. బుమ్రా రాకతో బౌలింగ్‌ విభాగం పటిష్టమవగా... మరోసారి వరుణ్‌ చక్రవర్తి కీలకం కానున్నాడు. మార్క్‌రమ్‌పై ఆశలు టెస్టు సిరీస్‌ విజయంతో ఈ పర్యటనను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు టి20 సిరీస్‌ను సమం చేయడంతో... ముగించాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో నైపుణ్యానికి కొదవ లేకపోయినా... వారంతా సమష్టిగా రాణించలేకపోవడమే సఫారీ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతుంటే... మరో ఓపెనర్‌ డికాక్‌ నిలకడలేమితో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో డికాక్‌తో కలిసి మార్క్‌రమ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించవచ్చు. భారత పిచ్‌లపై మంచి అవగాహన ఉన్న డికాక్, మార్క్‌రమ్‌ రాణిస్తే సఫారీ జట్టుకు తిరుగుండదు. బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, కార్బిన్‌ బాష్‌ రూపంలో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో యాన్సెన్, ఎన్‌గిడి, బాష్, బార్ట్‌మన్‌ కీలకం కానున్నారు.తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్), అభిషేక్‌ శర్మ, గిల్‌/సామ్సన్, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, హర్షిత్‌ రాణా/వాషింగ్టన్‌ సుందర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, బాష్, లిండే/కేశవ్, ఎన్‌గిడి, బార్ట్‌మన్‌.

Bommadevara Dheeraj shone with two medals7
ధీరజ్‌కు రెండు పతకాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌టీపీసీ జాతీయ సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ రెండు పతకాలతో మెరిశాడు. రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ధీరజ్‌... టీమ్‌ విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో గురువారం ముగిసిన ఈ పోటీల్లోపురుషుల రికర్వ్‌ వ్యక్తిగత ఫైనల్లో ధీరజ్‌ 6–0తో పార్థ్‌ సుశాంత్‌ సాలుంకే (మహారాష్ట్ర)పై గెలిచి జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. టీమ్‌ విభాగంలో ధీరజ్, రాహుల్, సుఖ్‌చెయిన్‌ సింగ్‌లతో కూడిన సర్వీసెస్‌ జట్టు ఫైనల్లో అభ్యుదయ్, పార్థ్‌ సాలుంకే, సాహిల్‌లతో కూడిన మహారాష్ట్ర జట్టు చేతిలో ఓడిపోయింది. గౌరవ్, యశ్‌దీప్, పవన్‌లతో కూడిన రైల్వేస్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ) జట్టుకు కాంస్య పతకం దక్కింది. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అధ్యక్షుడు అర్జున్‌ ముండా ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ నిర్వహణ కోసం భారత్‌ బిడ్‌ దాఖలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించేందుకు ముందుకొచ్చే క్రీడా సంఘాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు టి.రాజు, జనరల్‌ సెక్రటరీ అరవింద్, ఆర్చరీ డెవలప్‌మెంట్‌ సభ్యుడు పుట్టా శంకరయ్య, హైదరాబాద్‌ ఆర్చరీ సంఘానికి చెందిన అశ్విన్‌ రావు, బేగంపేట హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ గుస్తీ నోరియా, కమిటీ సభ్యుడు మర్రి ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు.

Satwiksairaj and Chirag Shetty secure another victory in the World Tour Finals8
సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి రెండో విజయం

హాంగ్జౌ: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–11, 16–21, 21–11తో ఫజర్‌ అల్ఫియాన్‌–షోహిబుల్‌ ఫిక్రి (ఇండోనేసియా) జంటను ఓడించింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన భారత జోడీ రెండో గేమ్‌లో తడబడింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ లయలోకి వచ్చి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో లియాంగ్‌ వె కెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా) జంట 21–14, 21–18తో ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ (మలేసియా) జోడీపై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌లతో సాత్విక్‌–చిరాగ్‌; లియాంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా)లతో అల్ఫియాన్‌–ఫిక్రి తలపడతారు.

Jaiswal Suffers Food Poison Loses Over 2 Kg Weight In 2 Days: Report9
రెండు రోజుల్లో 2 కిలోలు తగ్గాడు.. జైస్వాల్‌కు ఏమైంది?

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్‌ అందింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహితులు జాతీయ మీడియాకు వెల్లడించారు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత జైసూ.. దేశీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో ముంబై తరపున బరిలోకి దిగాడు.మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడి 145 పరుగులు సాధించాడు జైసూ (Yashasvi Jaiswal). ఇందులో ఓ శతకం కూడా ఉంది. అయితే, రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు జైస్వాల్‌ అస్వస్థతకు గురయ్యాడు. అయినప్పటికీ పుణె వేదికగా రాజస్తాన్‌తో మ్యాచ్‌ బరిలో దిగి.. 15 పరుగులు చేసి అవుటయ్యాడు. తీవ్రమైన కడుపు నొప్పిఅయితే, ఈ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌ తర్వాత జైస్వాల్‌ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో వెంటనే హుటాహుటిన పుణెలోని ఆదిత్య బిర్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం పొట్టలో తీవ్రమైన ఇన్షెక్షన్‌ ఉన్నట్లు వైద్యులు తేల్చారు.ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఫుడ్‌ పాయిజన్‌ (Food Poison) అయింది. పుణె హోటళ్లో జైస్వాల్‌ తిన్న కలుషిత ఆహారమే ఇందుకు దారితీసింది. తీవ్రమైన నొప్పితో అతడు విలవిల్లాడాడు.రెండు రోజుల్లో 2 కిలోలు తగ్గాడుఅయితే, వైద్యుల చికిత్స తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రెండు రోజుల్లోనే రెండు కిలోల బరువు తగ్గిపోయాడు. పూర్తిగా కోలుకోవడానికి 7- 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు’’ అని పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో జైస్వాల్‌ దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌ నాటికి 23 ఏళ్ల ఈ యువ ఓపెనర్‌ తిరిగి టీమిండియాతో చేరే అవకాశం ఉంది. కాగా రాజస్తాన్‌తో సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికీ.. నెట్‌ రన్‌ రేటు తక్కువగా ఉన్న కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ టోర్నీలో పుణె వేదికగా గురువారం జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించి జార్ఖండ్‌ విజేతగా నిలిచింది.చదవండి: AUS vs ENG: ఆర్చర్‌పై స్టోక్స్‌ ఫైర్‌!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై

SMAT 2025 Final: Jharkhand Beat Haryana By 69 Runs Won Title10
కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ కొట్టేశాడు!

దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 టైటిల్‌ను జార్ఖండ్‌ గెలుచుకుంది. హర్యానాతో గురువారం నాటి ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో దేశీ టోర్నీల్లో ఓవరాల్‌గా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది.పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా టైటిల్‌ పోరులో హర్యానా- జార్ఖండ్‌ (Haryana Vs Jharkhand) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హర్యానా.. జార్ఖండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లలో కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.101 పరుగులుమరో ఓపెనర్‌ విరాట్‌ సింగ్‌ (2) విఫలమైనా.. ఇషాన్‌ (Ishan Kishan) మాత్రం నిలకడగా ఆడాడు. 45 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. మొత్తంగా 49 బంతుల్లో ఆరు ఫోర్లు, పది సిక్స్‌లు బాది 101 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్‌ కుశాగ్రా మెరుపు హాఫ్‌ సెంచరీ (38 బంతుల్లో 81)తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 177 పరుగులు జోడించారు.ధనాధన్‌ ఇన్నింగ్స్‌అనంతరం అనుకుల్‌ రాయ్‌ (20 బంతుల్లో 40), రాబిన్‌ మింజ్‌ (14 బంతుల్లో 31) కూడా ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్‌ మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 262 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్‌ కాంబోజ్‌, సమంత్‌ జేఖర్‌, సుమిత్‌ కుమార్‌ తలా ఒక వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 18.3 ఓవర్లో 193 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. జార్ఖండ్‌ బౌలర్ల ధాటికి టాపార్డర్‌ కుదేలు అయింది. ఓపెనర్లలో అర్ష్‌ రంగా (17) ఓ మోస్తరుగా ఆడగా.. కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌, వన్‌డౌన్‌లో వచ్చిన ఆశిష్‌ సివాజ్‌ డకౌట్‌ అయ్యారు.పోరాడిన మిడిలార్డర్‌ఇలాంటి దశలో మిడిలార్డర్‌లో యశ్‌వర్ధన్‌ దలాల్‌ (22 బంతుల్లో 53), నిషాంత్‌ సింధు (15 బంతుల్లో 31), సమంత్‌ జేఖర్‌ (17 బంతుల్లో 38) ధనాధన్‌ ఆడి.. ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జార్ఖండ్‌ బౌలర్లు వారిని వరుస విరామాల్లో పెవిలియన్‌కు పంపారు.ఆఖర్లో పార్త్‌ వట్స్‌ (4), సుమిత్‌ కుమార్‌ (5), అన్షుల్‌ కాంబోజ్‌ (11) తడబడగా.. అమిత్‌ రాణా (13 నాటౌట్‌), ఇషాంత్‌ భరద్వాజ్‌ (17) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హర్యానా 193 పరుగులకే ఆలౌట్‌ కావడంతో జార్ఖండ్‌ 69 పరుగుల తేడాతో గెలిచింది.జార్ఖండ్‌ బౌలర్లలో సుశాంత్‌ మిశ్రా, బాల్‌ క్రిష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. వికాస్‌ సింగ్‌, అనుకుల్‌ రాయ్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. కాగా గతంలో దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2010-11 టైటిల్‌ గెలుచుకున్న జార్ఖండ్‌.. తాజాగా ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్సీలో దేశీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్‌ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు That winning feeling! 🥳Time for celebration in the Jharkhand camp as they win the Syed Mushtaq Ali Trophy for the first time 🙌Scorecard ▶️ https://t.co/3fGWDCTjoo#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/qJB0b2oS0Y— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement