Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Preity Zinta Epic Response For Chahal Wants-To Open For Punjab Kings1
ప్రీతి జింటా దిమ్మతిరిగే కౌంటర్‌.. షాక్‌లో చాహల్‌!

ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ క్యాంపులో ప్రస్తుతం సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు స్పిన్నర్ య‌జ్వేంద్ర చాహల్, ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండటంతో, య‌జ్వేంద్ర చాహల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రీతి జింటాను ఉద్దేశించి స‌ర‌దాగా పోస్టు పెట్టాడు. ‘మేడమ్.. నాకు ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా?’ అని సరదాగా అడిగాడు. దీనికి ప్రీతి జింటా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘తప్పకుండా చాహల్‌.. నీ కోసం ఏదైనా చేస్తాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత నీకు నచ్చిన మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయొచ్చు. అప్పుడు ప్రబ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్‌ ఆర్య కూడా ఏమీ అనుకోరని నాకు తెలుసు’ అంటూ లాఫింగ్‌ ఎమోజీ జత చేస్తూనే తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్‌ ఇవ్వడంతో చాహల్‌ షాక్‌ తినక తప్పలేదు.ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసిన పంజాబ్ పలు రికార్డులు తన పేరిట లిఖించింది. ఇప్పటికే పట్టికలో టాప్ స్థానంలో కొనసా గుతున్న పంజాబ్ ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే తొలి జట్టుగా కూడా నిలవనుంది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌కే పరిమితమైన పంజాబ్ ఈసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది.Mam ek match mein open batting karne ka chance mil jaaye toh 🥹🤣🤣😁 #pzchat— Yuzvendra Chahal (@yuzi_chahal) April 27, 2026చదవండి: వైరల్‌గా మారిన జితేశ్‌ శర్మ చర్య!

IPL 2026 Match 40: Punjab Kings vs Rajasthan Royals Updates2
7 ఓవర్ల తర్వాత 80-1

7 ఓవర్ల తర్వాత 80-17 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 80-1గా ఉంది. ప్రభ్‌సిమ్రన్‌ 27, కూపర్‌ కన్నోల్లీ 19 పరుగులతో అజేయంగా ఉన్నారు. తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌2.5వ ఓవర్‌- క్రీజ్‌లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన ప్రియాంశ్‌ ఆర్మ (29) ఆర్చర్‌ బౌలింగ్‌లో బర్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 28) జరుగనున్న 40వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. పంజాబ్‌ హోం గ్రౌండ్‌ అయిన ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.ప్రస్తుత ఎడిషన్‌లో ఏకైక అజేయ జట్టుగా కొనసాగుతున్న పంజాబ్‌ (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ రద్దు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్‌ 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ కోసం​ రాజస్థాన్‌ రెండు మార్పులు చేసింది. హెట్‌మైర్‌ స్థానంలో షనక, రవి బిష్ణోయ్‌ స్థానంలో యశ్‌ రాజ్‌ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్‌ కూడా ఈ మ్యాచ్‌ కోసం రెండు మార్పులు చేసింది. సూర్యంశ్‌ షెడ్గే, లోకీ ఫెర్గూసన్‌ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజాపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), కూపర్ కొన్నోలీ, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

Women's cricket: All round show helped Sri Lanka go 1-0 up Vs Bangladesh in T20 Series3
టీ20 సిరీస్‌లోనూ బోణీ కొట్టిన శ్రీలంక

మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్‌ తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాల్టి నుంచి (ఏప్రిల్‌ 28) నుంచి ప్రారంభమైన టీ20 సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. సిల్హెట్‌ వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనలతో అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసిన లంకేయులు, ఆతర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటి బంగ్లాదేశ్‌ను 136 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు.లంక బ్యాటర్లలో ఇమేషా దులని (55), హర్షిత సమరవిక్రమ (61) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్‌ చమారీ 32 పరుగులతో పర్వాలేదనిపించింది. మిగతా ప్లేయర్లలో హాసిని పెరీరా 7, హన్సిమ కరుణరత్నే 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో సల్తానా ఖాతూన్‌ 2, మరుఫా అక్తెర్‌, నహిద అక్తెర్‌ తలో వికెట్‌ తీశారు.బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో షోర్నా అక్తెర్‌ (60) అర్ద సెంచరీతో రాణించగా.. ఆమెకు మరో ఎండ్‌ నుండి ఎవరి సహకారం లభించలేదు. దిల్హర అక్తెర్‌ 23, జుయారియా ఫిర్దోస్‌ 16, షిర్మన్‌ అక్తెర్‌ 1, కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా డకౌట్‌, శోభన మోస్తరి 16, రబేయా ఖాన్‌ 6, సుల్తానా ఖాతూన్‌ 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో మల్కి మదారా, మిథాలీ అయోధ్య, చమారీ తలో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. సుగంధిక, కవిష వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్‌ 30న జరుగనుంది.

Jitesh shows Respect Rowards DC Flag Became Viral During Match4
వైరల్‌గా మారిన జితేశ్‌ శర్మ చర్య!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కనబరుస్తోంది. సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఒక ప్రేక్షకుడి చేతిలో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి జెండా గాలిలో ఎగురుకుంటూ మైదానంలోకి వచ్చింది. దీనిని గమనించిన ఆర్సీబీ వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ ఆ జెండాను అందుకొని తన జేబులో పెట్టుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విష‌యానికొస్తే సొంత‌గ‌డ్డ‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువ‌నేశ్వ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఛేద‌న‌లో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ప‌డిక్క‌ల్ (34 నాటౌట్‌), కోహ్లి (23 నాటౌట్) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను మే1న రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. The way Jitesh shows respect towards DC flag he is pure soul 🥺❤️ pic.twitter.com/1nyd5XpPN3— Ankur (@flick_class) April 28, 2026చదవండి: ‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మ‌డం ఆపండి!’

 Ex-India Player Shows Support KL Rahul Decision Vs RCB5
‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మ‌డం ఆపండి!’

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సోమ‌వారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో దారుణ ఓట‌మిని చ‌విచూసింది. 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఢిల్లీ 9 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ విధ్వ‌సంక‌ర సెంచ‌రీతో పంజాబ్‌పై భారీ స్కోరు చేసిన‌ప్ప‌టికీ, ఆ మ్యాచ్‌ను కూడా కాపాడుకోవ‌డంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విఫ‌ల‌మైంది. అయితే పంజాబ్‌తో మ్యాచ్‌లో 152 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. అయితే కేఎల్ రాహుల్ స్ట్రైకింగ్ తీసుకోకుండా డెబ్యు ఆట‌గాడు సాహిల్ ప‌రాక్‌కు చాన్స్ ఇవ్వ‌డంపై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే కేఎల్ రాహుల్‌కు భార‌త మాజీ క్రికెటర్‌ దొడ్డ గ‌ణేశ్ అండ‌గా నిల‌బ‌డ్డాడు. ‘ఆర్సీబీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్.. డెబ్యూ ఆట‌గాడు సాహిల్ ప‌రాక్‌కు స్ట్రైక్ ఇవ్వ‌డంపై కొంతమంది జ‌ర్న‌లిస్టులు విమ‌ర్శిస్తూ ట్వీట్లు చేశారు. అయితే సాహిల్ ప‌రాక్ టెయిలెండ‌ర్ కాదు, అత‌డొక బ్యాట‌ర్‌. అందుకే అత‌డిని ఓపెన‌ర్‌గా ఎంచుకున్నారు. ఈ విష‌యం తెలియ‌క రాహుల్‌ను అకార‌ణంగా తిడుతున్నారు. పిచ్ ప‌రిస్థితులపై అవ‌గాహ‌న‌లేమి ఢిల్లీ క్యాపిట‌ల్స్ దారుణ ఆట‌తీరుకు కార‌ణ‌మ‌య్యింది. కానీ కేఎల్ రాహుల్ ఏదో త‌ప్పు చేసిన‌ట్లు అంద‌రూ అత‌డిపై క్రూర‌త్వం ప్రద‌ర్శించ‌డమేంటనేది నాకు అర్థం కావ‌డం లేదు. అత‌డిపై విషం చిమ్మ‌డం ఆపండి’ అని చెప్పు కొచ్చాడు.మ్యాచ్ విష‌యానికొస్తే సొంత‌గ‌డ్డ‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువ‌నేశ్వ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఛేద‌న‌లో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ప‌డిక్క‌ల్ (34 నాటౌట్‌), కోహ్లి (23 నాటౌట్) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను మే1న రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. ఇక దొడ్డ గణేశ్‌ టీమిండియా తరఫున ఒక వన్డే, నాలుగు టెస్టులు ఆడాడు.Saw a couple of journalists’ tweet yesterday where they blamed KL Rahul for exposing the debutant from ball one.FYI guys, that kid is no tail ender; he’s a proper batter and that’s why he was chosen to open. Can’t understand this toxicity around KL Rahul #IPL2026— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) April 28, 2026చదవండి: భార‌త్‌కు తప్పని చైనా గండం!

Son Of Virat Kohli’s Massive Fan From West Indies Breaks Multiple Records6
రికార్డులు బద్దలు కొట్టిన విరాట్‌ అభిమాని కొడుకు

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా, ఆ వయసు-ఈ వయసు, మహిళలు-పురుషులు అన్న తేడా లేకుండా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ అభిమనగనంలోని ఒకరి కుమారుడు వెస్టిండీస్‌ దేశవాలీ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో విండీస్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జాషువ డసిల్వా తల్లి కరోలిన్ డసిల్వా విరాట్‌ కోహ్లిని కలిసింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. విరాట్‌ ఆటతీరు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌ను చాలా చనువుగా ఆలింగనం చేసుకున్న దృష్యాలు సోషల్‌మీడియాలో బాగా వైరలయ్యాయి.వాటిపై జాషువ డసిల్వ సైతం స్పందించాడు. మా అమ్మకు విరాట్‌ కోహ్లి అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. అతని ఆటతీరే కాకుండా ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ బిహేవియర్‌ను కూడా మా అమ్మ చాలా ఇష్టపడుతుందని అన్నాడు.ఆ జాషువ డసిల్వనే ప్రస్తుతం విండీస్‌ దేశవాలీ క్రికెట్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అతని చేసిన ఓ డబుల్‌ సెంచరీ వెస్టిండీస్ దేశీయ క్రికెట్‌లో సంచలనంగా మారింది.వెస్టిండీస్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్న జాషువ, లీవర్డ్ ఐలాండ్స్‌పై ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, ఒంటరి పోరాటంతో (304 బంతుల్లో 220 పరుగులు, 29 ఫోర్లు, 2 సిక్సర్లు) తన జట్టుకు భారీ స్కోర్‌ (522/9) అందించాడు.ఈ ఇన్నింగ్స్‌తో జాషువ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా నిలిచాడు.అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున సంయుక్తంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ డసిల్వకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో తొమ్మిదవది. ఇందులోని ఓ సెంచరీ డసిల్వ వెస్టిండీస్‌ తరఫున చేశాడు.వెస్టిండీస్‌ తరఫున అడపాదడపా టెస్ట్‌ అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న డసిల్వ.. ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు.

IPL 2026: Suyash Sharma Leaves Legends Behind With Historic IPL Record7
చరిత్ర సృష్టించిన సుయాశ్‌ శర్మ

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 27) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసిన ఆర్సీబీ ప్రత్యర్దిని 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని వికెట్‌ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది.ఢిల్లీని 75 పరుగులకు కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (3-0-5-3), హాజిల్‌వుడ్‌ (3.3-0-12-4), రసిక్‌ సలాం దార్‌ (2-0-21-1), సుయాశ్‌ శర్మ (4-1-7-1), కృనాల్‌ పాండ్యా (2-0-9-1) కీలకపాత్ర పోషించారు. వీరిలో భువీ, హాజిల్‌వుడ్‌ ఆరంభంలో చెలరేగగా.. ఆతర్వాత సుయాశ్‌ శర్మ పేట్రేగిపోయాడు. ఈ క్రమంలో సుయాశ్‌ చారిత్రక ప్రదర్శన నమోదు చేశాడు.తన కోటా 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చిన సుయాశ్‌, ఓ వికెట్ కూడా పడగొట్టాడు. అంతేకాదు, తన స్పెల్‌లో ఏకంగా 20 డాట్ బాల్స్ వేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో సంయుక్తంగా అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా అతడిని నిలిపింది. ఈ ఘనతను ఇంతకుముందు దీపక్‌ చాహర్‌ సాధించాడు. చాహర్‌ 2019 ఎడిషన్‌లో సీఎస్‌కేకు ఆడుతూ కేకేఆర్‌పై ఈ చారిత్రక గణాంకాలు నమోదు చేశాడు. ఇక్కడ దీపక్‌ చాహర్‌ పేస్‌ బౌలర్‌ కాగా.. ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా సుయాశ్‌ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి టాప​-5 బౌలర్లలో సుయాశ్‌ ఒక్కడే స్పిన్నర్‌గా ఉన్నాడు.ఐపీఎల్‌ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్లు (టాప్‌-5)సుయాశ్‌ శర్మ- 20దీపక్‌ చాహర్‌- 20ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌- 19జహీర్‌ ఖాన్‌- 19మహ్మద్‌ షమీ- 19కాగా, ఈ చారిత్రక ప్రదర్శనలో సుయాశ్‌ ఇచ్చిన 7 పరుగుల్లో 3 వైడ్ల రూపంలో వచ్చాయి. ఇవి కూడా వేయకపోయుంటే సుయాశ్‌ ఐపీఎల్‌లో అత్యంత​ పొదుపైన స్పెల్‌ వేసిన బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కేవాడు. ఈ మ్యాచ్‌లో సుయాశ్‌ మధ్య ఓవర్లలో పరుగులకు పూర్తిగా అడ్డుకట్ట వేశాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది.ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా.. ఢిల్లీ ఏడో స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ ఏప్రిల్‌ 30న జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

PV Sindhu loses-India womens team crashes out of Uber Cup 20268
భార‌త్‌కు తప్పని చైనా గండం!

ప్రతిష్ఠాత్మ‌క ఉబెర్ క‌ప్‌లో భారత్ ఆట ముగిసింది. భార‌త మ‌హిళ‌ల నంబ‌ర్‌వ‌న్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు చైనా గండాన్ని దాటి ముందుకెళ్ల‌లేక చ‌తికిల‌ప‌డింది. విష‌యంలోకి వెళితే ఉబెర్ క‌ప్‌లో భాగంగా గ్రూప్‌-ఏలో ఉన్న భార‌త్ త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో చైనాతో త‌ల‌ప‌డింది. అయితే చైనా చేతిలో 5-0తో ప‌రాజ‌యం చ‌విచూసిన భార‌త్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. అయితే నిర్ణయాత్మక సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 16-21, 21-19, 19-21తో వాంగ్ జియి చేతిలో ఓట‌మి చ‌విచూసింది. దీంతో డ‌బుల్స్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన స్థితిలో ప్రియా కొన్‌జెంగ‌మ్‌-శ్రుతి మిశ్రా జంట చైనా జంట చేతిలో ఓట‌మిపాలైంది. ఆ త‌ర్వాత మ‌రో డ‌బుల్స్‌లో ట్రిసా జాలీ-క‌విప్రియ సెల్వ‌మ్ జోడి కూడా ఓట‌మి పాల‌వ్వ‌డంతో భార‌త్ ఓట‌మి ఖ‌రారైంది. ఈ నేప‌థ్యంలో రివ‌ర్స్ సింగిల్స్‌లో ఇషారాణి బ‌రుహా తొలి గేమ్‌ను గెలిచిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు గేముల్లో ఓట‌మిపాలైంది. ఇక థామ‌స్ క‌ప్‌లో భాగంగా ప‌రుషుల విభాగంలో భార‌త జ‌ట్టు బుధ‌వారం చైనాతో త‌ల‌ప‌డ‌నుంది.చదవండి: పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!

ICC Rewards South Africa Captain, Smriti Mandhana Demoted In T20I Rankings9
సౌతాఫ్రికా కెప్టెన్‌కు భారీ లబ్ది

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్‌కు భారీ లబ్ది చేకూరింది. తాజాగా భారత్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విశేషంగా రాణించిన ఆమె.. రెండు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకింది. ఈ సిరీస్‌లో లారా 168కిపైగా స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 330 పరుగులు చేసింది.మరోవైపు సౌతాఫ్రికా సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఓ స్థానం కోల్పోయి, ఐదో స్థానానికి పడిపోయింది. ఈ సిరీస్‌లో మంధన 3 మ్యాచ్‌ల్లో కేవలం 62 పరుగులే చేయగలిగింది. తాజా ర్యాంకింగ్స్‌లో విండీస్‌ బ్యాటర్‌ హేలీ మాథ్యూస్‌ కూడా ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయింది. టాప్‌-2 బ్యాటర్లుగా జార్జియా వాల్‌, బెత్‌ మూనీ కొనసాగుతున్నారు.టాప్‌-10లో ఉన్న షఫాలీ వర్మ ఆరో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోగా.. టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఓ స్థానం మెరుగుపర్చుకొని పదో స్థానానికి చేరింది.బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. పాక్‌ బౌలర్‌ సదియా ఇక్బాల్‌, ఇంగ్లండ్‌ బౌలర్లు సోఫీ ఎక్లెస్టోన్‌, లారెన్‌ బెల్‌ టాప్‌-3లో కొనసాగుతుండగా.. భారత స్టార్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ ఓ స్థానం మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి చేరింది. భారత్‌తో సిరీస్‌లో రాణించిన సౌతాఫ్రికా బౌలర్‌ మ్లాబా 2 స్థానాలు మెరుగుపర్చుకొని దీప్తి శర్మతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానం షేర్‌ చేసుకుంది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత స్పిన్నర్‌ శ్రీచరణి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకొని 11వ స్థానానికి ఎగబాకింది.కాగా, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 1-4 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో భారత్‌ కేవలం​ నాలుగో మ్యాచ్‌ మాత్రమే గెలవగా.. సౌతాఫ్రికా మిగతా మ్యాచ్‌లన్నీ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ గెలుపులో లారా వోల్వార్డ్ట్‌ కీలకపాత్ర పోషించింది.

Young Fan Breaks Down In Tears Throws Bat Fails-To Get Kohli Autograph10
పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!

క్రికెట్‌లో విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. చిన్న పిల్లాడి నుంచి పెద్ద‌వాళ్ల దాకా అతడి ఆటోగ్రాఫ్ లేదా ఫొటోల కోసం ఎగ‌బ‌డ‌డం చూస్తుంటాం. ఇక‌ ప్ర‌స్తుతం కోహ్లి ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ్యాచ్ ఆడింది. అయితే ఆర్సీబీ ఆట‌గాళ్లు బ‌స చేస్తున్న హోటల్ రూం వ‌ద్ద ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక చిన్న పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్‌తో అత‌డి వ‌ద్ద‌కు ప‌రిగెత్తాడు. రెండు మూడుసార్లు ఆ పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం తెగ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అధికారులు అత‌డిని అడ్డుకున్నారు. కోహ్లి కూడా ఆ పిల్లాడిని ప‌ట్టించుకోలేదు. దీంతో కోహ్లి త‌న‌కు ఆటోగ్రాఫ్ ఇవ్వ‌కుండానే వెళ్లిపోయాడ‌న్న కోపంతో త‌న చేతిలోని బ్యాట్‌ను విసిరేసి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘ‌ట‌న మ్యాచ్‌కు ముందు జ‌రిగిందా లేక త‌ర్వాత జ‌రిగిందా అన్న‌ది స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ బుడ్డోడు మాత్రం త‌న చ‌ర్య‌తో రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే సొంత‌గ‌డ్డ‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువ‌నేశ్వ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఛేద‌న‌లో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ప‌డిక్క‌ల్ (34 నాటౌట్‌), కోహ్లి (23 నాటౌట్) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 30న గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆడ‌నుంది.Virat Kohli Little fan broke down 😭💔Virat kohli ignored this little fan who was waiting to get his autograph 😭Wait for that child frustration 😭💔 pic.twitter.com/BszA4JX5NW— Jeet (@JeetN25) April 27, 2026చదవండి: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement