Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sunrisers Leeds appoint Vettori as head coach Who Will Coach SRH1
‘సన్‌రైజర్స్‌’ కీలక ప్రకటన

సన్‌రైజర్స్‌ యాజమాన్యం తమ జట్టు హెడ్‌కోచ్‌ పేరును ప్రకటించింది. డానియెల్‌ వెటోరికి స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించింది. ఆండ్రూ ఫ్లింటాఫ్‌ స్థానంలో వెటోరిని నియమించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.2023 సీజన్‌ నుంచి కన్‌ఫ్యూజ్‌ అయ్యారా?... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఆటగాడిగా సత్తా చాటిన న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డానియెల్‌ వెటోరి చాన్నాళ్లక్రితమే కోచ్‌ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. గతంలో ఆర్సీబీతో మమేకం అయిన వెటోరి.. 2023 సీజన్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు హెడ్‌కోచ్‌గా కొనసాగుతున్నాడు.వెటోరి మార్గదర్శనంలో SRH ఐపీఎల్‌-2024లో ఫైనల్‌కు కూడా చేరింది. ఈ క్రమంలో యాజమాన్యం అతడినే హెడ్‌కోచ్‌గా కొనసాగిస్తోంది. 2026లోనూ SRH కోచ్‌గా వెటోరీనే మార్గదర్శనం చేయనున్నాడు. తాజాగా.. సన్‌రైజర్స్‌ లీడ్స్‌ జట్టుకు కూడా హెడ్‌కోచ్‌గా మేనేజ్‌మెంట్‌ అతడిని నియమించింది.భారీ ధరకు కొనుగోలుఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్‌ లీగ్‌లో భాగమైన నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌ను సన్ గ్రూపు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 1100 కోట్ల భారీ ధరకు ఈ ఫ్రాంఛైజీని దక్కించుకుని.. సన్‌రైజర్స్‌ లీడ్స్‌గా పేరు మార్చింది. ఈ జట్టుకు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ హెడ్‌కోచ్‌గా ఉండగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని డానియెల్‌ వెటోరీతో భర్తీ చేసింది.ఫ్లింటాఫ్‌నకు వీడ్కోలుకాగా గత రెండు సీజన్లుగా ‘నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌’కు కోచ్‌గా వ్యవహరించాడు ఫ్లింటాఫ్‌. అతడి శిక్షణలో 2024లో నాలుగో స్థానంతో సీజన్‌ ముగించిన జట్టు.. 2025లో ఎలిమినేటర్‌ వరకు చేరుకుంది. అయితే, వెటోరీపై నమ్మకంతో ఫ్లింటాఫ్‌నకు వీడ్కోలు పలికి.. అతడిని తమ హెడ్‌కోచ్‌గా నియమించింది సన్‌ గ్రూపు.ఫ్లింటాఫ్‌నకు గుడ్‌బై కాగా లీగ్‌లోని అన్ని ఫ్రాంఛైజీల కంటే తనకు తక్కువ జీతం చెల్లించేందుకు సన్‌రైజర్స్‌ సిద్ధపడిందని ఫ్లింటాఫ్‌ బహిరంగంగానే ఆరోపించాడు. అయితే, యాజమాన్యం మాత్రం.. తాము భారీగానే ఆఫర్‌ చేసినా.. తన స్థాయికి అది తగదంటూ అతడే బంధం తెంచుకున్నాడని పేర్కొంది. కాగా సన్‌ గ్రూప్‌ ఐపీఎల్‌లో హైదరాబాద్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈస్టర్న్‌కేప్‌ ఫ్రాంఛైజీలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. కావ్యా మారన్‌ ఈ జట్ల వ్యవహారాలు చూసుకుంటారు.చదవండి: ఐసీసీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

Last One: Australian legend announces retirement from all forms of cricket2
రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆసీస్ క్రికెట్‌ దిగ్గజం

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ అలిసా హేలీ కీలక ప్రకటన చేసింది. స్వదేశంలో భారత్‌తో ఆడబోయే సిరీస్‌ తన కెరీర్‌లో చివరిదని పేర్కొంది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది.నా కెరీర్‌లో చివరిదిఈ మేరకు.. ‘‘మిశ్రమ భావోద్వేగాలు చుట్టుముడుతున్నాయి. ఆస్ట్రేలియా తరఫున భారత్‌తో ఆడబోయే సిరీస్‌ నా కెరీర్‌లో చివరిది. ఆసీస్‌ తరఫున ఇంకా ఇంకా ఆడాలనే ఉంది. అయితే, నాలో పోటీతత్వం కొరవడిందని అనిపిస్తోంది.అందుకే రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈసారి టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు నేను వెళ్లడం లేదని తెలుసు. ఈ మెగా టోర్నీ సన్నాహకాలకు చాలా తక్కువ సమయం ఉంది. టీమిండియాతో టీ20లలోనూ నేను ఆడలేను.ఇండియాతో వీడ్కోలు మ్యాచ్‌ ప్రత్యేకంఅయితే, సొంతగడ్డపై భారత్‌తో మ్యాచ్‌లో వన్డే, టెస్టు కెప్టెన్‌గా కెరీర్‌ ముగించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. నాకు దక్కిన గొప్ప అవకాశం ఇది. మాకు క్యాలెండర్‌ ఇయర్‌లో వచ్చే అతిపెద్ద సిరీస్‌ ఇదే’’ అంటూ అలిసా హేలీ ‘ది విల్లో టాక్‌’ పాడ్‌కాస్ట్‌లో తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్‌గాకాగా 2010లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసింది వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలిసా హేలీ. ఆమె నాయకత్వంలో అన్ని ఫార్మాట్లలోనూ ఆసీస్‌ మహిళా క్రికెట్‌ జట్టు పటిష్ట జట్టుగా మారింది. 2010, 2012, 2014, 2018, 2020, 2023 టీ20 టోర్నీ గెలిచిన జట్లలో అలిసా సభ్యురాలు. అంతేకాదు.. 2013, 2022లో వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులోనూ అలిసా ఉంది.ఇక 2018, 2019 ఇయర్లకు గానూ ‘ఐసీసీ టీ20 క్రికెర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును 35 ఏళ్ల అలిసా హేలీ అందుకుంది. కాగా అలిసా నిష్క్రమణ తర్వాత తహీలా మెగ్రాత్‌ ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉంది. భారత్‌తో, టీ20 ప్రపంచకప్‌-2026లో ఆసీస్‌ను ఆమె ముందుకు నడుపనున్నట్లు తెలుస్తోంది.స్టార్క్‌ జీవిత భాగస్వామికాగా ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌- అలిసా హేలీ భార్యాభర్తలు అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 6 వరకు భారత మహిళా క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడనుంది.చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్‌ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు!

ICC Existence Unnecessary If: Ex Pak Cricketer Sensational Comments3
ఐసీసీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)ని ఉద్దేశించి పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సయీద్‌ అజ్మల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేని ఐసీసీ ఉనికిలో ఉండి లాభం లేదన్నాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించాడు.అతిపెద్ద మార్కెట్‌ క్రికెట్‌ ప్రయోజనాలకు పెద్ద పీట వేయలేని ఐసీసీ తన కార్యకలాపాలు ఆపేస్తే మంచిదంటూ సయీద్‌ అజ్మల్‌ (Saeed Ajmal) అతి చేశాడు. కాగా ప్రపంచంలోని క్రికెట్‌ బోర్డులన్నింటిలో బీసీసీఐ సంపన్న బోర్డు అన్న విషయం తెలిసిందే. భారత్‌లో మతంగా భావించే క్రికెట్‌కు ఉన్న ఆదరణే ఇందుకు కారణం.ఐపీఎల్‌ ప్రవేశపెట్టిన తర్వాత బీసీసీఐ ఆదాయం గణనీయంగా పెరిగింది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మార్కెట్‌ దృష్ట్యా బీసీసీఐకి ఐసీసీ నుంచి రెవెన్యూ భారీ మొత్తంలో అందుతుంది. ఇక ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్నారు.శ్రీలంక క్రికెట్‌ జట్టుపై గతంలో ఉగ్రదాడిఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌లో ఇప్పటికే క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2009లో గడాఫీ స్టేడియం నుంచి శ్రీలంక క్రికెట్‌ జట్టు బస్సులో వెళ్తున్న వేళ 12 మంది ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కొంతమంది అధికారులు మరణించగా.. ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయాలపాలయ్యారు. కెప్టెన్‌ మహేళ జయవర్ధనే సహా కుమార్‌ సంగక్కర ఈ జాబితాలో ఉన్నారు.పాకిస్తాన్‌కు చెందిన అహ్సాన్‌ రజా అనే అంపైర్‌ చచ్చిబతికాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా చాలాకాలం వరకు విదేశీ జట్లు అక్కడ పర్యటించలేదు. కొంతకాలం క్రితం నుంచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, శ్రీలంక వంటి జట్లు మళ్లీ పాక్‌ పర్యటన మొదలుపెట్టాయి.భద్రతా కారణాల దృష్ట్యాఇక దాయాది దేశంలో ఉగ్రదాడుల భయంతో భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ టీమిండియాను అక్కడికి పంపడం లేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి పాక్‌ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా అక్కడికి వెళ్లలేదు.ఐసీసీ నిర్ణయంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడి ట్రోఫీ గెలుచుకుంది. మరోవైపు ఆతిథ్య పాక్‌ చెత్త ప్రదర్శనతో లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. ఇక పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్‌ టోర్నీలో పాక్‌ ఆటగాళ్లతో కరచాలనానికీ టీమిండియా నిరాకరించింది.ఇదిలా ఉంటే.. తాజాగా బంగ్లాదేశ్‌ కూడా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వడం.. మైనారిటీలపై దాడులు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ప్లేయర్‌ ముస్తాఫిజుర్‌ను తొలగించగా.. టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్‌ అంటోంది. భద్రతా కారణాలు అంటూ ఓవరాక్షన్‌ చేస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాక్‌ మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కాడు.ఎలాంటి లాజిక్‌ లేదు.. కొంచమైనా బుద్ధి ఉందా?‘‘ఐసీసీ నిర్ణయాలు తీసుకునేందుకు ఇండియన్‌ బోర్డుపై ఆధారపడితే.. దాని ఉనికి ఉండి కూడా వృథానే. పాకిస్తాన్‌లో ఆడేందుకు భారత జట్టును పంపకపోవడంలో ఎలాంటి లాజిక్‌ లేదు.ఐసీసీ మాత్రం ఈ విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేసింది. భారతీయులు ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు’’ అని సయీద్‌ అజ్మల్‌ అన్నాడు. గతంలో శ్రీలంక జట్టుపై దాడి... తాజాగా భారత్‌లో పహల్గామ్‌ ఉగ్రదాడి వంటి ఘటనల తర్వాత కూడా అజ్మల్‌ టీమిండియా తమ దేశానికి రాకపోవడాన్ని ప్రస్తావించడాన్ని భారత జట్టు అభిమానులు తప్పుబడుతున్నారు. ‘కొంచమైనా బుద్ధి ఉందా?’’ అంటూ చురకలు అంటిస్తున్నారు.చదవండి: భారత్‌పై నిందలు!.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ!

Virat Kohli told Rohit Sharma Woh Dekh Mera duplicate Chhota Chiku4
అచ్చం నాలాగే..: రోహిత్‌తో కోహ్లి ఏం చెప్పాడంటే..

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దోళ్లే కాదు చిన్న పిల్లలూ అతడి ఫ్యాన్స్‌ జాబితాలో ఉంటారు. ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు ఓ ‘బుల్లి’ అభిమాని కోహ్లిని కలిశాడు.ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా?.. ఆ చోటా ఫ్యాన్‌ కోహ్లి బాల్యంలో ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉండటం ఇక్కడ విశేషం. ఈ విషయాన్ని కోహ్లి (Virat Kohli)నే స్వయంగా అంగీకరించాడు. అంతేకాదు రోహిత్‌ శర్మ (Rohit Sharma)తోనూ ఇదే విషయం చెప్పాడు. స్వదేశంలో కివీస్‌తో వన్డే సిరీస్‌తో టీమిండియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా వడోదరలో ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లిని ఓ పిల్లాడు కలిశాడు. ఈ క్రమంలో కోహ్లి తనను చూసి ఎలా స్పందించాడో తాజాగా చెప్పుకొచ్చాడు. ‘‘కోహ్లి అని పిలిచి.. హాయ్‌ చెప్పాను.నా డూప్లికేట్‌ అక్కడ కూర్చున్నాడుఒక్క నిమిషంలో వస్తాను అని కోహ్లి నాతో అన్నాడు. అంతలోనే రోహిత్‌ శర్మవైపు తిరిగి.. ‘నా డూప్లికేట్‌ (Young Virat Kohli Doppelganger) అక్కడ కూర్చున్నాడు చూడు’ అని చెప్పాడు. అక్కడున్న వాళ్లంతా నన్ను చోటా చీకూ అని పిలిచారు’’ అంటూ ఆ బుడ్డోడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.93 పరుగులుకాగా కోహ్లి ముద్దుపేరు చీకూ అన్న విషయం తెలిసిందే. తనలాగే ఉన్న ఆ పిల్లాడిని కలిసి.. అతడికి ఫొటోగ్రాఫ్‌ కూడా ఇచ్చి ఖుషీ చేశాడు కోహ్లి. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి వన్డేలో భారత్‌ న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.కివీస్‌ విధించిన 301 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే భారత్‌ ఛేదించింది. కోహ్లి సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా 45వ సారి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. మరోవైపు.. రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో 26 పరుగులు చేయగలిగాడు. ఇక భారత్‌- కివీస్‌ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్‌కోట్‌ వేదిక.చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్‌ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు! Virat Kohli said to Rohit Sharma, "Wha dekh Mera duplicate betha hai (Look, my duplicate is sitting there)".- Virat Kohli called him a Chota Cheeku 😭❤️ pic.twitter.com/b4r1DopMUa— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 12, 2026

U19 WC 2026: Vaibhav Fails England Beat India In Warm up Match5
వైభవ్‌ విఫలం.. ఇంగ్లండ్‌ చేతిలో తప్పని ఓటమి

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌-2026 వార్మప్‌ మ్యాచ్‌లో యువ భారత జట్టుకు పరాభవం ఎదురైంది. సన్నాహక మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించిన మాత్రే సేన.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. మెరుగైన స్కోరు సాధించినా.. లక్ష్యాన్ని కాపాడుకోలేక చతికిలపడింది.జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ మొదలుకానుంది. ఇందుకోసం భారత్‌- ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్ల మధ్య సోమవారం బులవాయో వేదికగా సన్నాహక మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.అభిజ్ఞాన్‌ కుందు హాఫ్‌ సెంచరీఓపెనర్లలో కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (49) మెరుగ్గా రాణించగా.. వైభవ్‌ సూర్యవంశీ (1) మాత్రం విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వేదాంత్‌ త్రివేది (14).. మిడిలార్డర్‌లో విహాన్‌ మల్హోత్రా (10) నిరాశపరిచారు.ఇలాంటి పరిస్థితుల్లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అభిజ్ఞాన్‌ కుందు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను తలకెత్తుకున్నాడు. ఐదో స్థానంలో వచ్చిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 99 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు.రాణించిన బౌలింగ్‌ ఆల్‌రౌండర్లుఅభిజ్ఞాన్‌కు తోడుగా బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఆర్‌ఎస్‌ అంబరీష్‌ (48), కనిష్క్‌ చౌహాన్‌ (45 నాటౌట్‌) రాణించారు. మిగిలిన వారిలో హర్‌వన్ష్‌ పంగాలియా (19) విఫలం కాగా.. ఖిలాన్‌ పటేల్‌ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన భారత అండర్‌-19 జట్టు 295 పరుగులు సాధించింది.ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ మింటో ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. సెబాస్టియన్‌ మోర్గాన్‌ రెండు, మ్యానీ లమ్స్‌డన్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో హెనిల్‌ పటేల్‌ ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. ఓపెనర్‌ బెన్‌ డాకిన్స్‌ (8)ను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.థామస్‌ ధనాధన్‌ఇక ఖిలాన్‌ పటేల్‌.. మరో ఓపెనర్‌ జోసఫ్‌ మూర్స్‌ (46), వన్‌డౌన్‌ బ్యాటర్‌ బెన్‌ మేయస్‌ (34) వికెట్లు తీసుకున్నాడు. అయితే, నాలుగో నంబర్‌ బ్యాటర్‌ థామస్‌ ర్యూ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. 66 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్‌ గెలుపుమరో ఎండ్‌ నుంచి కెలెబ్‌ ఫాల్కనర్‌ (29 నాటౌట్‌) థామస్‌కు సహకారం అందించాడు. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి (DLS) ప్రకారం ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్ణయించగా.. 34.3 ఓవర్లలోనే 196 పరుగులు సాధించింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో భారత అండర్‌-19 జట్టుపై ఇంగ్లండ్‌ గెలుపొందింది. చదవండి: చరిత్ర సృష్టించిన పడిక్కల్‌.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు

Netherlands Announce squad for T20 WC 2026 Indian origin players Out6
T20 WC: నెదర్లాండ్స్‌ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు నెదర్లాండ్స్‌ తమ జట్టును ప్రకటించింది. భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్‌ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ ప్రపంచకప్‌ టోర్నీలో తమ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.విక్రమ్‌జిత్‌పై వేటు.. ఇక ఈ జట్టు నుంచి భారత సంతతికి చెందిన విక్రమ్‌జిత్‌ సింగ్‌ (Vikramjit Singh)ను తప్పించారు. ఇటీవల బంగ్లాదేశ్‌- స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో విఫలమైన అతడిపై యాజమాన్యం వేటు వేసింది. తేజ కూడా లేడువిజయవాడకు చెందిన తేజ నిడమనూరు సైతం ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఆర్యన్‌ దత్‌కు మాత్రం సెలక్టర్లు చోటిచ్చారు. మాక్స్‌ ఒడౌడ్‌ జట్టులో స్థానం నిలుపుకోగా.. బాస్‌ డి లీడేకు కూడా చోటు దక్కింది.పాక్‌తో మ్యాచ్‌తో మొదలుకాగా ఈసారి ఇరవై జట్లు ప్రపంచకప్‌ టోర్నీలో భాగం కాగా.. నెదర్లాండ్స్‌ గ్రూప్‌-ఎలో ఉంది. గ్రూప్‌ దశలో ఫిబ్రవరి 7న పాకిస్తాన్‌తో కొలంబోలో.. ఫిబ్రవరి 10న ఢిల్లీలో నమీబియాతో.. ఫిబ్రవరి 13న యూఎస్‌ఏతో చెన్నై వేదికగా.. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో టీమిండియాతో నెదర్లాండ్స్‌ జట్టు తలపడనుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి నెదర్లాండ్స్‌ జట్టుస్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), నోహ్ క్రోస్ (వికెట్‌ కీపర్‌), మాక్స్ ఒ డౌడ్, సాకిబ్ జుల్ఫికర్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, పాల్ వాన్ మీకెరెన్, ఫ్రెడ్ క్లాసెన్, కోలిన్ అకెర్‌మాన్, బాస్‌ డి లీడే, మైకేల్‌ లెవిట్‌, జాక్‌ లయన్‌ కాచెట్‌, లోగన్‌ వాన్‌ బీక్‌, రొలొఫ్‌ వాన్‌ డెన్‌ మెర్వె, టిమ్‌ వాన్‌ డెర్‌ గుటెన్‌.చదవండి: చరిత్ర సృష్టించిన పడిక్కల్‌.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు

VHT 2025 26: Saurashtra And Karnataka Enters Semi Final Check Scores7
రింకూ విఫలం.. సెమీస్‌ బెర్తులు ఖరారు చేసుకున్న జట్లు ఇవే

దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఉత్తరప్రదేశ్‌ జట్టుతో జరిగిన రెండో క్వార్టర్‌ ఫైనల్లో వీజేడీ పద్ధతిలో 17 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌ ఖరారు చేసుకుంది. రింకూ విఫలంబెంగళూరు వేదికగా ముందుగా ఉత్తరప్రదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. అభిషేక్‌ గోస్వామి (82 బంతుల్లో 88; 12 ఫోర్లు), సమీర్‌ రిజ్వీ (77 బంతుల్లో 88 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. కెప్టెన్‌ రింకూ సింగ్‌ (20 బంతుల్లో 13)మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.హార్విక్‌ దేశాయ్‌ సెంచరీతోసౌరాష్ట్ర బౌలర్లలో చేతన్‌ సకారియా 3 వికెట్లు... అంకుర్‌ పన్వర్, ప్రేరక్‌ మన్కడ్‌ 2 వికెట్లు తీశారు. 311 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు సాధించింది. ఓపెనర్‌ హార్విక్‌ దేశాయ్‌ (116 బంతుల్లో 100 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు.ప్రేరక్‌ మన్కడ్‌ (66 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. చిరాగ్‌ జానీ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. సౌరాష్ట్ర స్కోరు 238/3 వద్ద భారీ వర్షం రావడం, ఆ తర్వాత తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. ఆట నిలిచిపోయే సమయానికి సౌరాష్ట్ర విజయసమీకరణం కంటే 17 పరుగులు ముందంజలో ఉండటంతో ఆ జట్టుకు విజయం దక్కింది.పడిక్కల్‌ జోరు.. కర్ణాటక నాలుగోసారిడిఫెండింగ్‌ చాంపియన్‌ కర్ణాటక జట్టు వరుసగా నాలుగోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో ముంబై జట్టుతో సోమవారం జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్లో కర్ణాటక జట్టు వీజేడీ పద్ధతిలో 54 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు సాధించింది. షమ్స్‌ ములానీ (91 బంతుల్లో 86; 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ (58 బంతుల్లో 38; 4 ఫోర్లు), సాయిరాజ్‌ పాటిల్‌ (25 బంతుల్లో 33 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. ముంబై స్టార్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్‌ పాటిల్‌ (3/42), అభిలాశ్‌ శెట్టి (2/59), విద్వత్‌ కావేరప్ప (2/43) రాణించారు. అనంతరం 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 33 ఓవర్లలో 1 వికెట్‌ కోల్పోయి 187 పరుగులు చేసింది.కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (12) తక్కువ స్కోరుకే అవుటవ్వగా... దేవ్‌దత్‌ పడిక్కల్‌ (95 బంతుల్లో 81 నాటౌట్‌; 11 ఫోర్లు), కరుణ్‌ నాయర్‌ (80 బంతుల్లో 74 నాటౌట్‌; 11 ఫోర్లు) రెండో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. కర్ణాటక విజయం దిశగా సాగుతున్న దశలో భారీ వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. వీజేడీ పద్ధతి ప్రకారం 33 ఓవర్లకు కర్ణాటక విజయసమీకరణం 132 పరుగులు. కర్ణాటక 55 పరుగులు ముందుండటంతో ఆ జట్టును గెలుపు వరించింది.చదవండి: భారత్‌పై నిందలు!.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ!

Canada Tennis Star Former Wimbledon finalist Milos Raonic retires8
ఇక సెలవు.. గెలిచిన ప్రైజ్‌మనీ రూ. 187 కోట్లు

మాంట్రియల్‌: కెనడా టెన్నిస్‌ ప్లేయర్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల రావ్‌నిచ్‌ 2016లో కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంక్‌ను అందుకున్నాడు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో చివరిసారి టెన్నిస్‌ మ్యాచ్‌ ఆడిన రావ్‌నిచ్‌ ఆ తర్వాత బరిలోకి దిగలేదు. 2008లో ప్రొఫెషనల్‌గా మారిన రావ్‌నిచ్‌ తన కెరీర్‌లో మొత్తం 8 ఏటీపీ సింగిల్స్‌ టైటిల్స్‌ను సాధించాడు. ‘సమయం వచ్చేసింది. నేను టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అవుతున్నాను. ఏ క్రీడాకారుడైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటాడు. నా జీవితంలో చాలా ఏళ్లు టెన్నిస్‌ అంతర్భాంగా ఉంది. ఈ ఆట నాకెంతో ఇచ్చింది’ అని రావ్‌నిచ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఫెడరర్‌ను ఓడించి2016లో రావ్‌నిచ్‌ కెరీర్‌ అత్యుత్తమ దశలో నిలిచాడు. ఆ ఏడాది వింబుల్డన్‌ సెమీఫైనల్లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ను ఓడించి రావ్‌నిచ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్‌) చేతిలో ఓడిపోయి ఈ కెనడా స్టార్‌ రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. అదే ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో, సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెమీఫైనల్‌ చేరిన అతను ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. కెరీర్‌లో సాధించిన మొత్తం ప్రైజ్‌మనీ - 2,07,64,512డాలర్లు (రూ. 187 కోట్లు).రావ్‌నిచ్‌ సాధించిన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌-3.ప్రొఫెషనల్‌ కెరీర్‌లో రావ్‌నిచ్‌ గెలిచిన మ్యాచ్‌లు- 383కెరీర్‌లో సాధించిన ఏటీపీ సింగిల్స్‌ టైటిల్స్‌- 8

Story Of Antim Panghal9
సవాళ్లకు సిద్ధం

భారత చాంపియన్‌ రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌ గురువారం మొదలయ్యే ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్ల్యూఎల్‌) సవాళ్లకు సిద్ధమని ప్రకటించింది. కొరకరాని విదేశీ రెజ్లర్లపై ఎప్పటి నుంచో దృష్టి సారించినట్లు చెప్పింది. మన రెజ్లర్లకు జాతీయ శిబిరాలు మెలకువలు నేర్పిస్తే... విదేశాల్లో శిక్షణ విదేశీ రెజ్లర్లను దీటుగా ఎదుర్కొనే స్థయిర్యాన్నిస్తుందని చెప్పుకొచ్చింది. న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే మొదలయ్యే పీడబ్ల్యూఎల్‌ కోసం పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యానని భారత స్టార్‌ మహిళా రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌ తెలిపింది. 53 కేజీల కేటగిరీలో జూనియర్, సీనియర్‌ అంతర్జాతీయ స్థాయిల్లో ఇదివరకే నిరూపించుకున్న అంతిమ్‌ ఇప్పుడు కొత్త తరహా లీగ్‌ ‘పట్టు’కు సై అంటోంది. 17 ఏళ్ల వయసులోనే 2022లో అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆమె ఆ మరుసటి ఏడాది టైటిల్‌ నిలబెట్టుకుంది. ప్రపంచ ఛాంపియన్‎షిప్ లో రెండు కాంస్యాలు నెగ్గిన ఆమె.. 2022 ఆసియా క్రీడల్లోనూ కాంస్య పతకంతో మెరిసింది. 21 ఏళ్ల ఈ స్టార్‌ రెజ్లర్‌ తనకు ఎదురయ్యే మింగుడు పడని విదేశీ రెజ్లర్లపై ఓ కన్నేసినట్లు చెప్పింది. జపాన్‌ దిగ్గజ రెజ్లర్‌ యుయ్‌ సుసాకి పోటీల వీడియోలను ఫోన్‌లో తరచూ చూస్తానని చెప్పుకొచ్చింది. తన కెరీర్‌లోనే ఓటమి ఎరుగని సుసాకిపై పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా మేటి రెజ్లర్లను ఓడించే సత్తా మనకుందని 2023లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ అందుకున్న అంతిమ్‌ చెప్పుకొచ్చింది. బౌట్‌కు ముందు ఎన్నో ఆలోచనలు చుట్టూ తిరుగుతూనే ఉంటాయని, అయితే బౌట్‌ కోసం మ్యాట్‌ మీదిగి దిగగానే మైండ్‌ ఒక్కసారిగా ‘పోరాటం’పైనే పడుతుందని, దీంతో... గెలుపోటముల ఆలోచనేది గుర్తుకురాదని, వంద శాతం కుస్తీపట్టడం గురించే ఆలోచిస్తానని అంతిమ్‌ వివరించింది. ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్ల్యూఎల్‌) ఈ నెల 15 నుంచి నోయిడా ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మనోభావాలను ఇలా పంచుకుంది. అర కోటి... అస్సలు ఊహించలేదు! ‘పీడబ్ల్యూఎల్‌ వేలంలో ఈ స్థాయి మొత్తం లభిస్తుందని అస్సలు ఊహించనేలేదు. నేనే కాదు... మా కుటుంబసభ్యులెవరూ ఇంత మొత్తం వస్తుందని అనుకోలేదు. నిజానికి నాకు సుమారు రూ. 30 లక్షలకు అటు ఇటుగా వస్తుందనే ఆశించాను. పెరిగినా దీనికి కాస్తే ఎక్కువ రావొచ్చని అనుకున్నా! కానీ ఏకంగా రూ. 50 లక్షలు దక్కుతాయని ఏమాత్రం ఊహించలేదు. వేలం జరుగుతుండగా నేను ఆలయానికి వెళ్లాను. యూపీ డామినేటర్స్‌ నన్ను అంత మొత్తానికి కొనుగోలు చేసిందని తెలియగానే దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాను. హరియాణాకు చెందిన నేను కెరీర్‌ అసాంతం ఈ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎందుకనో ఈ లీగ్‌లో మాత్రం యూపీ తరఫునే ఆడాలని గట్టిగా అనుకున్నా’. మరింత పట్టుదలతో... ‘సీనియర్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ మరింత పట్టుదలతో, రెట్టించిన ఉత్సాహంతో పునరాగమనం చేస్తుంది. ఆమె రిటైర్మెంట్‌ను పక్కనబెట్టడం శుభపరిణామం. నాకంటే ఆమె ఎంతో అనుభవజ్ఞురాలైన రెజ్లర్‌. ఆమె వస్తుందంటేనే చెమటోడ్చేందుకు సిద్ధమైందని అర్థం. ఏ ప్లేయర్‌ అయినా సరే పోరాడేతత్వం, మనోధైర్యం బలంగా ఉంటేనే పునరాగమనం చేస్తారు. మన వినేశ్‌ కూడా అంతే! ఇక నేను పోటీపడే 53 కేజీల కేటగిరీ నాకు మాత్రమే సొంతం కాదు. ఎవరైనా పోటీపడొచ్చు. ఏ కేటగిరీ సరైందో పోటీ పడే అథ్లెట్‌కే బాగా తెలుస్తుంది. అందులో ఎంతగా కష్టపడగలదో, ఏ రకంగా గెలుస్తుందో, దేనివల్ల ఓడిపోతోందో ఆ విభాగానికి చెందిన అథ్లెట్‌కే బాగా తెలుస్తుంది’. సీనియర్‌ స్థాయికి ఎదగగానే... ‘జూనియర్‌ నుంచి సీనియర్‌ స్థాయి పోటీల్లో బరిలోకి దిగుతుంటే మన పరిణతి కూడా పెరుగుతుంది. జూనియర్స్‌లో ఒకట్రెండు పాయింట్లు ఓడితే నిరాశ ఆవహించేది. కానీ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నా. ఒకట్రెండు పాయింట్లు కాదు... ఆడాల్సింది ఆరు నిమిషాలు. ఒకటి అర కోల్పోయినా ప్రత్యర్థి పట్టుపట్టేందుకు, పైచేయి సాధించేందుకు మన చేతిలో సమయమైతే ఉంటుంది. ఇప్పుడు నా ట్రెయినింగ్‌ కూడా మారింది. అంతేకాదు... మళ్లీ నేను కోచ్‌ సియరామ్‌ దహియాతో శిక్షణ తీసుకోవడం నన్ను మరింత మెరుగుపరిచింది. దహియా మార్గదర్శకంలో అనవసర ఒత్తిడి తగ్గించుకొని త్వరితగతిన పుంజుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాను. అదేపనిగా లేదంటే మితిమీరిన శిక్షణ కూడా తగదని కోచ్‌లు వారిస్తారు. మ్యాట్‌పై ఎప్పుడు కుస్తీ పట్టాలో... వద్దో మేము, కోచ్, ఫిజియో కలిసి నిర్ణయించుకుంటాం. అనుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటాం’. విదేశీ శిక్షణ కీలకం ‘జాతీయ శిబిరాలు రెజ్లర్లను దీటుగా సన్నద్ధపరుస్తున్నాయి. అలాగని విదేశాల్లో శిక్షణ అనవసరం అనుకుంటే పొరపాటు. అది కూడా రెజ్లర్లకు కీలకమైన వేదిక. మేమంతా కూడా సహచరులతో కుస్తీ పట్టడం ద్వారానే నేర్చుకున్నాం. అంటే మా మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో, ఎవరి సత్తా ఎంటో మాకు బాగా తెలుసు. జాతీయ శిబిరాల్లో ఇదే జరుగుతుంది. కానీ విదేశీ రెజ్లర్లు మాలానే ఉంటారని అనుకోలేం. వారిలో వేగం ఎక్కువ. అలాంటి వారితో అడపాదడపా విదేశాల్లో శిక్షణ ఏర్పాటు చేస్తే ఈ అనుభవం అంతర్జాతీయ పోటీలకు బాగా ఉపయోగపడుతుంది’.

Shikhar Dhawan Gets Engaged To Sophie Shine Photo Goes Viral10
‘నిశ్చితార్థం చేసుకున్నాం’

టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ శుభవార్త చెప్పాడు. ప్రియురాలు సోఫీ షైన్‌తో వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపాడు. ‘‘చిరునవ్వుల నుంచి కలల దాకా అన్నీ పంచుకున్నాం. ప్రేమ మమ్మల్ని దీవించింది.చిరకాల ప్రయాణానికి నాందిగా మేము ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాము’’ అని శిఖర్‌- సోఫీ పేరిట సోషల్‌ మీడియా వేదికగా నోట్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాల్కనీలో ఎర్ర గులాబీలతో అందంగా అలంకరించిన హృదయాకారం ముందుకు శిఖర్‌ చేయి చాచగా.. సోఫీ తన వజ్రపు ఉంగరాన్ని చూపిస్తూ అతడి చేతి మీద చేయి వేసిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.శుభాకాంక్షల వెల్లువకాబోయే వధూవరులు శిఖర్‌ ధావన్‌- సోఫీ షైన్‌లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫిబ్రవరి మూడోవారంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా సత్తా చాటిన శిఖర్‌ ధావన్‌ గతంలో.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని 2011లో పెళ్లి చేసుకున్నాడు.కుమారుడికీ దూరంఅన్యోన్యంగా కనిపించిన ఈ జంటకు కుమారుడు జొరావర్‌ ధావన్‌ సంతానం. అంతకుముందు పెళ్లి ద్వారా ఆయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్‌ వాళ్లు కూడా తన సొంత కూతుళ్లలాంటి వారే అని పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే, కొన్నాళ్లకు శిఖర్‌- ఆయేషా మధ్య విభేదాలు తలెత్తి తీవ్రరూపం దాల్చాయి.ఈ క్రమంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. కొడుకు కూడా ధావన్‌కు దూరమయ్యాడు. దీంతో కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న ధావన్‌.. కొంతకాలం క్రితం ఐర్లాండ్‌ భామ సోఫీ షైన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు ఈ జంట. కాగా సోఫీ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్‌ అని సమాచారం. అబుదాబిలోని ఓ కంపెనీకి ఆమె వైస్‌ ప్రెసిడెంట్‌ అని తెలుస్తోంది.చదవండి: బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల వేదికలు మార్చండి!.. స్పందించిన బీసీసీఐ

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement

వీడియోలు