Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

I Want Rain: Ahead Of IND vs PAK T20 WC Clash Ex Star Bizarre Remark1
IND vs PAK: ‘​వర్షం పడాలని కోరుకుంటున్నా’

క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడి భయం అభిమానులను వేధిస్తోంది.వాన పడొద్దు దేవుడా!కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో గ్రూప్‌-ఎలో ఉన్న భారత్‌- పాక్‌ మధ్య మ్యాచ్‌కు శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్‌. ప్రేమదాస స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, ఆదివారం కొలంబోలో వాన పడే అవకాశాలు 93 శాతం ఉన్నట్లు ఆక్యూవెదర్‌ పేర్కొంది. సాయంత్రానికి వర్షం ముప్పు తగ్గినా అవుట్‌ ఫీల్డ్‌ తడిగా ఉంటే మ్యాచ్‌ సజావుగా సాగే అవకాశాలు సన్నగిల్లుతాయి.ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులంతా వర్షం ప్రభావం ఈ మ్యాచ్‌ పడకుండా చూడాలంటూ దేవుడిని వేడుకుంటున్నారు. క్రేజీ మ్యాచ్‌ కోసం తామంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని.. తమ ఆశలపై నీళ్లు చల్లవద్దని వరుణుడిని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ (Basit Ali) వింత వ్యాఖ్యలు చేశాడు.వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాఓ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. "ఆ సర్వాంతర్యామి (దేవుడు) నా ప్రార్థన విని వర్షం పడేలా చేయాలి’’ అని బసిత్‌ అలీ వ్యాఖ్యానించాడు. ఇందుకు హోస్ట్‌.. "మీరు మ్యాచ్‌ మొత్తం చూడాలని అనుకోవడం లేదా?" అని అడుగగా.. "నేను వర్షం పడాలని కోరుకుంటున్నాను (I Want Rain)" అని పునరుద్ఘాటించాడు.అదే జరిగితే మ్యాచ్‌ రద్దుకాగా వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ఉండదు. ఫలితం కోసం ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదీ కుదరని పక్షంలో మ్యాచ్‌ రద్దైనట్లు అంపైర్లు ప్రకటిస్తారు. ఇరుజట్లకు చెరో పాయింట్‌ కేటాయిస్తారు.ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌.. అమెరికా, నమీబియాలపై గెలిచి నాలుగు పాయింట్లు సాధించగా.. పాకిస్తాన్‌ సైతం నెదర్లాండ్స్‌, అమెరికా జట్లను ఓడించి నాలుగు పాయింట్లతో ఉంది. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా టీమిండియా (+3.050) పాకిస్తాన్‌ (+0.932) అత్యంత మెరుగ్గా ఉండి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.ఇదేం కోరిక?ఒకవేళ దాయాదుల పోరు వర్షం వల్ల రద్దు అయిపోతే.. భారత్‌- పాక్‌ ఐదు పాయింట్లతో సూపర్‌-8 దశకు దాదాపుగా అర్హత సాధించినట్లే. గ్రూప్‌ దశలో అమెరికా, నెదర్లాండ్స్‌లకు చెరో మ్యాచ్‌ మిగిలి ఉండగా.. నమీబియా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, నెదర్లాండ్స్‌ (-1.352), నమీబియా (-2.884) నెట్‌రన్‌రేటు మైనస్‌లలో ఉండటం గమనార్హం.ఇక గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో అనూహ్య రీతిలో పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియాతో పాటు అమెరికా సూపర్‌-8కు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాక్‌ టోర్నీ నుంచి అవమాన భారంతో నిష్క్రమించింది. ఇక ఇప్పుడు భారత్‌ చేతిలో పాక్‌ గనుక భారీ తేడాతో ఓడితే మళ్లీ అమెరికాతో ప్రమాదం పొంచి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్‌- పాక్‌ మ్యాచ్‌ వాన వల్ల చెడిపోవాలని బసిత్‌ అలీ కోరుకుంటున్నాడని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.చదవండి: IND vs PAK: పాక్‌తో భారత్‌ మ్యాచ్‌.. మధ్యాహ్నమే!

T20 WC: Quinton de Kock Creates History breaks MS Dhoni World Record2
T20 WC 2026: చరిత్ర సృష్టించిన డికాక్‌

సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ క్వింటన్‌ డికాక్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బద్దలు కొట్టాడు.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా శనివారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా న్యూజిలాండ్‌తో తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన సఫారీ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.యాన్సెన్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రొటిస్‌ బౌలర్లలో మార్కో యాన్సెన్‌ (Marco Jansen) నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఎంగిడి, కేశవ్‌ మహరాజ్‌, బాష్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. మరోవైపు.. వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ (Quinton de Kock) కివీస్‌ ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ (13) ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు.ధోని వరల్డ్‌ రికార్డు బద్దలుఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్‌గా డికాక్‌ చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. టీ20 ప్రపంచకప్‌ ఈవెంట్లో ధోని 32 ఇన్నింగ్స్‌లో 32 డిస్మిసల్స్‌లో భాగం కాగా.. డికాక్‌ 30 ఇన్నింగ్స్‌లోనే 33 సార్లు ప్రత్యర్థి బ్యాటర్‌ అవుట్‌ కావడంలో తన వంతు పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. కివీస్‌ విధించిన నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు సాధించింది. తద్వారా న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ మెరుపు, అజేయ అర్ధ శతకం (44 బంతుల్లో 86)తో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక మరో ఓపెనర్‌ డికాక్‌ మాత్రం (14 బంతుల్లో 20) నిరాశపరిచాడు.Aiden Markram goes big over long-on for his third six of the innings! 💥The Proteas have started strong, racing past the 50-run mark in under 4 overs.ICC Men’s #T20WorldCup | #NZvSA | LIVE NOW 👉https://t.co/QWNvn10eTj pic.twitter.com/Fz1rZvafPE— Star Sports (@StarSportsIndia) February 14, 2026టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్లు👉క్వింటన్‌ డికాక్‌ (సౌతాఫ్రికా)- 33 డిస్మిసల్స్‌👉ఎంఎస్‌ ధోని (ఇండియా)- 32 డిస్మిసల్స్‌👉కమ్రాన్‌ అక్మల్‌ (పాకిస్తాన్‌)- 30 డిస్మిసల్స్‌👉దినేశ్‌ రామ్‌దిన్‌ (వెస్టిండీస్‌)- 27 డిస్మిసల్స్‌.చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య

IND vs PAK Feb 15: T20 WC 2026 And Women Asia Cup Rising Stars Today3
పాక్‌తో భారత్‌ మ్యాచ్‌.. మధ్యాహ్నమే!

క్రికెట్‌ ప్రపంచంలో దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉన్న ఆదరణ వేరు. ఏ స్థాయిలోనైనా చిరకాల ప్రత్యర్థుల పోరుకు ప్రత్యేకంగా ఫ్యాన్‌ బేస్‌ ఉందనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వీరాభిమానులకు ఆదివారం (ఫిబ్రవరి 15) పండుగే. వారి కోసం భారత్‌- పాక్‌ మ్యాచ్‌ డబుల్‌ ధమాకా ఎదురుచూస్తోంది. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోఓ వైపు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్‌ శ్రీలంక వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని భారత్‌- సల్మాన్‌ ఆఘా బృందంతో అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు మహిళల ‘ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ (ACC Women's Asia Cup Rising Stars 2026)’ టోర్నీలో కూడా ఈ రెండు జట్ల మధ్య నేడు (ఆదివారం) పోరు జరగనుంది.మధ్యాహ్నం 12.30 గంటలకు ఆరంభంభారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు దాయాది మహిళా జట్ల మధ్య మ్యాచ్‌ మొదలు అవుతుంది. బ్యాంకాక్‌లోని టెర్‌థాయ్‌ క్రికెట్‌ మైదానం ఇందుకు వేదిక. కాగా మహిళ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌-ఎ, పాకిస్తాన్‌-ఎ జట్లతో పాటు యూఏఈ, నేపాల్‌ తలపడుతున్నాయి.అగ్రస్థానంలో పాక్‌ఇక గ్రూప్‌-బి నుంచి ఆతిథ్య థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌-ఎ, శ్రీలంక-ఎ, మలేషియా జట్లు పోటీలో ఉన్నాయి. గ్రూప్‌-లో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ నేపాల్‌పై 30 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు.. భారత్‌-ఎ జట్టు మాత్రం అనూహ్య రీతిలో పసికూన యూఏఈ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.రాధ యాదవ్‌ కెప్టెన్సీలోఫలితంగా గ్రూప్‌-ఎలో ప్రస్తుతానికి పాక్‌, యూఏఈ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్‌, నేపాల్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాగా భారత మహిళల సీనియర్‌ జట్టు‌ సభ్యురాలైన రాధ యాదవ్‌ కెప్టెన్సీలో భారత్‌-ఎ జట్టు ఈ టీ20 టోర్నీ బరిలో దిగింది. మన మహిళల బృందంలో అనుష్క శర్మ, తేజల్‌ హసబ్నిస్, మిన్ను మణి, నందిని శర్మవంటి ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ స్టార్లు కూడా ఉన్నారు.ఎక్కడ చూడాలంటే?ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌- పాక్‌ మ్యాచ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌, జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానుండగా.. మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో దాయాదుల పోరును సోనీ స్పోర్ట్స్‌ టీవీ నెట్‌వర్క్‌, సోనీ లివ్‌ ఇండియాలో వీక్షించవచ్చు.చదవండి: T20 WC 2026: పాక్‌తో మ్యాచ్.. భార‌త తుది జ‌ట్టు ఇదే! వారిద్ద‌రిపై వేటు

IND vs PAK: Suryakumar Massive Remark On Pak Spinner Usman Tariq4
IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య

పాకిస్తాన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ గురించి టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు వైవిధ్యమైన బౌలర్‌ అన్న మాట వాస్తవమేనని.. అయితే, తాము మాత్రం అతడి ఆటకు లొంగమని పేర్కొన్నాడు. టీ20 ‍ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ ఆదివారం ముఖాముఖి తలపడనున్న విషయం తెలిసిందే. శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్‌.ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.అపుడే చూస్తారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) పలు విషయాలపై స్పందించాడు. ముఖ్యంగా పాక్‌ ఆటగాళ్లతో ఈసారి కరచాలనం చేస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘మేం చక్కటి క్రికెట్‌ ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. అది మాత్రమే అత్యంత ముఖ్యం. మిగతావన్నీ అనవసర విషయాలు.షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పను. మ్యాచ్‌ ప్రారంభమైనప్పుడే మీరు చూస్తారు’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. సున్నా నుంచి మొదలుఇక టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో పాక్‌పై 7-1తో భారత్‌ ఆధిపత్యం కొనసాగిస్తున్న అంశం ప్రస్తావనకు రాగా.. ‘‘పాక్‌పై పాత రికార్డు ఇక్కడ పనికి రాదు. మళ్లీ సున్నా నుంచి స్కోరు మొదలు పెట్టాల్సిందే’’ అని సూర్య నిజాయితీగా సమాధానం ఇచ్చాడు.అదే విధంగా ఉస్మాన్‌ తారిఖ్‌ (Usman Tariq)నైపుణ్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘పరీక్షలో సెలబస్‌ నుంచి కాకుండా ఇతర అంశాల గురించి ప్రశ్నలు వచ్చినంత మాత్రాన దానిని వదిలివేయలేము కదా!.. అతడి ఆటకు మేము లొంగిపోముఅతడొక వైవిధ్యమైన బౌలర్‌. అయినంత మాత్రాన మేము అతడి ఆట ముందు లొంగిపోము. అతడి బౌలింగ్‌లో ఆడేందుకు మా వాళ్లు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు’’ అని సూర్య పేర్కొన్నాడు.చకింగ్ ఆరోపణలుకాగా తన వైవిధ్యమైన బౌలింగ్‌ శైలితో పాక్‌ ఆఫ్‌స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ వార్తల్లో నిలుస్తున్నాడు​. ‘చకింగ్ (సందేహాస్పద బౌలింగ్‌)‌’ చేస్తున్నాడంటూ ఆరోపణలు వినిపించినా...రెండు సార్లు అతడి యాక్షన్‌కు ఐసీసీ అనుమతి ఇచ్చింది. కాబట్టి నిబంధనల ప్రకారం తప్పు లేకపోవచ్చు. ఈ విషయం గురించి పలువురు మాజీ అంపైర్లు కూడా ఇదే చెప్పారు.అయితే బంతి విసిరే ముందు అతను కాస్త ఆగినట్లుగా ఉంటూ (పాజ్‌) వేయడం చర్చకు దారి తీసింది. ఇది బ్యాటర్‌ను గందరగోళంలో పడేయవచ్చని... బ్యాటర్‌ కూడా కాస్త జరిగి షాట్‌ ఆడటమే దీనికి ఉపాయమని అశ్విన్‌ విశ్లేషించాడు. అంత సీన్‌ లేదుఅయితే తారిఖ్‌ యాక్షన్‌ ఎలా ఉన్నా... అతడు సాధారణ ఆఫ్‌స్పిన్నర్‌ మాత్రమేనని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయ పడ్డాడు. భారత బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో చెలరేగుతారని ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: T20 WC 2026: పాక్‌తో మ్యాచ్.. భార‌త తుది జ‌ట్టు ఇదే! వారిద్ద‌రిపై వేటు

India vs Pakistan match today in T20 World Cup5
అసలు సమరానికి సమయం

ఫిబ్రవరి 1...టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్‌... ఫిబ్రవరి 5...మాకు అవన్నీ తెలీదు...మా కొలంబో ఫ్లయిట్‌ బుక్‌ అయిపోయిందన్న సూర్యకుమార్‌... ఫిబ్రవరి 9...భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు మేం సిద్ధమంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వ ప్రకటన... ఫిబ్రవరి 15...భారత్, పాక్‌ మధ్య కొలంబోలో మ్యాచ్‌కు రంగం సిద్ధం...ప్రపంచకప్‌లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్‌లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు...1992 నుంచి అభిమానులు ఇది చూస్తూనే వచ్చారు...ఫలితం ఎలా ఉన్నా, ఏకపక్షంగా సాగినా ఈ మ్యాచ్‌కు ఉండే ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై సాగే సుదీర్ఘ వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ లేదంటే సహజంగానే పెద్ద చర్చే జరిగింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది...కొలంబో వెళ్లే ఫ్లయిట్‌ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటే హోటళ్లలో ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనా ఖాళీ లేదనే సమాధానం వచ్చేస్తోంది. మైదానంలోనే ఉండి జట్టుకు మద్దతుగా నిలవాలనుకునే వేలాది మంది మాత్రమే కాదు...తమ ఇళ్లనుంచి కన్నార్పకుండా ప్రతీ బంతిని చూసే ఫ్యాన్స్‌ సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మరో వరల్డ్‌ కప్‌ పోరుకు ఇరు జట్లు సై అంటున్నాయి. ఇటీవల ఆసియా కప్‌లో 3–0తో పాక్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో చెలరేగుతుందో చూడాలి. కొలంబో: టి20 వరల్డ్‌ కప్‌లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్, పాకిస్తాన్‌ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతీ టి20 వరల్డ్‌ కప్‌లో తలపడుతున్న ఇరు జట్లు ఈ సారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో నేడు (ఆదివారం) జరిగే గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత్‌ ఎదుర్కొంటుంది. రెండు జట్లూ తమ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా...ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈ సారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్‌ భావిస్తోంది. కుల్దీప్‌కు అవకాశం... భారత బ్యాటింగ్‌ లైనప్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్‌ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకూ సింగ్‌కు తగిన అవకాశం రాకపోగా, తిలక్‌ వర్మ కూడా రెండు సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా గత మ్యాచ్‌ తరహాలో భారీ స్కోరు ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కించుకున్న సామ్సన్‌ మాత్రం విఫలమయ్యాడు. అభిషేక్‌ శర్మ అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే సామ్సన్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్‌ అయిన అభిషేక్‌ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్‌ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో అతను అందించే ఆరంభం భారత్‌ భారీ స్కోరుకు పునాది అవుతుంది. బౌలింగ్‌కు సంబంధించి తుది జట్టులో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఇక్కడి పిచ్‌ను బట్టి చూస్తే భారత్‌ మూడో రెగ్యులర్‌ స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు ‘మిస్టరీ’గానే ఉన్న వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌లతో పాటు కుల్దీప్‌ను కూడా ఆడించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అర్ష్ దీప్ స్థానంలో అతను ఆడతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్‌ భారం పంచుకుంటారు కాబట్టి రెగ్యులర్‌ పేసర్‌గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవలి ఫామ్, బలాబలాలను చూస్తే పాక్‌కంటే టీమిండియా ఎంతో ముందుంది. బాబర్‌ ఆజమ్‌ రాణించేనా... అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్‌ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. పాక్‌ ఇప్పటికే ఇద్దరు రెగ్యులర్‌ స్పిన్నర్లు అబ్రార్, తారిఖ్‌లతో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్లు నవాజ్, షాదాబ్‌లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్‌ కూడా స్పిన్‌ బౌలింగ్‌ చేయగలడు. వీరిలో తారిఖ్‌ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్‌ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా, చర్చనీయాంశమైన యాక్షన్‌తో ఆడే ఆఫ్‌స్పిన్నర్‌ తారిఖ్‌ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరం. భారత్‌ తమ సన్నాహకాల్లో దీనిపై కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు. పేసర్‌ షాహిన్‌ అఫ్రిది చాలా కాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్‌లో టాప్‌–4 మాత్రమే రెగ్యులర్‌ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్‌ ఆగా ఆసియా కప్‌లో భారత్‌పై వరుసగా విఫలమవగా, ఫర్హాన్‌ ఒక్కడే రాణించాడు. కెప్టెన్ అయిన తర్వాత సల్మాన్‌ ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తమ జట్టుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా స్టార్‌ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాబర్‌ ఆజమ్‌ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడి చాలా కాలమైంది. అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇంతకంటే సమయం, వేదిక ఉండవని పాక్‌ అభిమానులు భావిస్తున్నారు. 13 భారత్, పాక్‌ మధ్య ఓవరాల్‌గా 16 మ్యాచ్‌లు జరగ్గా...13 గెలిచిన భారత్‌ 3 ఓడింది.7-1 టి20 ప్రపంచ కప్‌లో భారత్, పాక్‌ మధ్య 8 మ్యాచ్‌లు జరగ్గా... భారత్‌ 7 గెలిచి ఒకటే ఓడింది.పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. అయితే బౌలర్లూ ప్రభావం చూపించగలరు. మ్యాచ్‌కు ముందు రోజు మాత్రమే భారత్‌ ఇక్కడ సాధన చేసింది. పాక్‌ జట్టు కొలంబోలోనే ఉన్నా... తమ రెండు మ్యాచ్‌లను ఎస్‌ఎస్‌సీ మైదానంలో ఆడింది కాబట్టి తేడా ఉండకపోవచ్చు. అయితే మ్యాచ్‌ను వాన గండం వెంటాడుతోంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్, ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా పాకిస్తాన్‌: సల్మాన్‌ ఆగా (కెప్టెన్ ), ఫర్హాన్, అయూబ్, బాబర్‌ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్, నవాజ్, ఫహీమ్, షాహిన్‌ అఫ్రిది, తారిఖ్, అబ్రార్‌ టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్‌ X నేపాల్‌వేదిక: ముంబై; ఉదయం 11 గంటల నుంచిఅమెరికా X నమీబియావేదిక: చెన్నై; మధ్యాహ్నం 3 గంటల నుంచి

Indian womens cricket team to play first T20 against Australia today6
మహిళల పోరులో పైచేయి ఎవరిదో!

సిడ్నీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు కూడా కీలకమైన టి20 పోరుకు సిద్ధమైంది. భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి సమరం జరుగుతుంది. వన్డే వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టి20 సిరీస్‌ ఆడి క్లీన్‌స్వీప్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌ సేన ఇప్పుడు ఒక పెద్ద జట్టుతో ప్రత్యర్థి గడ్డపై తలపడుతోంది. కెపె్టన్‌ హర్మన్‌తో పాటు రెగ్యులర్‌ ఆటగాళ్లు స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో చెలరేగితే భారత్‌ పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్ల్యూపీఎల్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచి అద్భుతమైన ఫామ్‌తో స్మృతి ఈ సిరీస్‌కు సిద్ధమైంది. గత టి20 వరల్డ్‌ కప్‌ తర్వాతి నుంచి 143.54 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్న స్మృతికి ఆసీస్‌ గడ్డపై కూడా మంచి రికార్డు ఉంది. క్రాంతి, అరుంధతి, శ్రీచరణి, శ్రేయాంక, రేణుకా సింగ్‌ బౌలింగ్‌ బాధ్యతలు తీసుకుంటారు. మరో వైపు కొత్త కెప్టెన్‌ సోఫీ మోలినే నాయకత్వంలో ఆసీస్‌ బరిలోకి దిగుతోంది. గత 19 టి20 సిరీస్‌లలో ఆ్రస్టేలియా ఒక్కటి మాత్రమే ఓడింది. అలీసా హీలీ ఈ ఫార్మాట్‌నుంచి రిటైరైనా... ఇతర స్టార్లు ఎలైస్‌ పెరీ, సదర్లాండ్, మూనీ, లిచ్‌ఫీల్డ్, వోల్, వేర్‌హామ్‌లకు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉంది. ఆ్రస్టేలియాలో భారత పర్యటనను ప్రతీ ఫార్మాట్‌కు వేర్వేరుగా కాకుండా తొలిసారి మూడు ఫార్మాట్‌లలో ప్రదర్శనను బట్టి సిరీస్‌ విజేతను నిర్ణయిస్తారు. 3 టి20, 3 వన్డేలు, ఒక టెస్టు తర్వాత ఇది తేలుతుంది. పరిమిత ఓవర్లలో ఒక విజయానికి 2 పాయింట్లు, టెస్టులో విజయానికి 4 పాయింట్లు...టెస్టు డ్రా అయితే చెరో 2 పాయింట్లు కేటాయిస్తారు.

South Africa beat New Zealand by 7 wickets in T20 World Cup7
మార్క్‌రమ్, యాన్సెన్‌ జోరు

అహ్మదాబాద్‌: బౌలింగ్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్కో యాన్సెన్‌ జోరు (4/40), బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కెప్టెన్ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (44 బంతుల్లో 86 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుతో దక్షిణాఫ్రికా ఖాతాలో మరో విజయం చేరింది. గ్రూప్‌ ‘డి’లో శనివారం జరిగిన ఈ లీగ్‌ మ్యాచ్‌లో సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ నెగ్గిన మార్క్‌రమ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్‌ చాప్‌మన్‌ (26 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలిచింది. ఫెర్గూసన్, నీషమ్, రచిన్‌ రవీంద్రలకు తలా ఒక వికెట్‌ దక్కింది. టాపార్డర్‌ టపటపా... ఇన్‌గిడి మూడో ఓవర్లో అలెన్‌ 3 ఫోర్లు, 1 సిక్స్‌తో కివీస్‌ శిబిరానికి జోష్‌ తెచ్చాడు. యాన్సెన్‌ తర్వాతి ఓవల్లో సీఫెర్ట్‌ (13) అవుటైనా... అలెన్‌ 4, 6తో జోరు కొనసాగించే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఆరో ఓవర్‌ వేసిన యాన్సెన్‌ ఈ సారి రచిన్‌ రవీంద్ర (13), అలెన్‌ (17 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుకు చెక్‌పెట్టాడు. కివీస్‌ పవర్‌ ప్లే కష్టాల నుంచి కోలుకోకముందే కేశవ్‌ మహరాజ్‌... ఫిలిప్స్‌ (1)ను బౌల్డ్‌ చేయడంతో 64 పరుగుల వద్ద కివీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.ఈ దశలో చాప్‌మన్‌ ధాటిగా ఆడి న్యూజిలాండ్‌ స్కోరు పెంచాడు. డారిల్‌ మిచెల్‌ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఆఖర్లో నీషమ్‌ (15 బంతుల్లో 23 నాటౌట్‌; 3 ఫోర్లు) బౌండరీలతో న్యూజిలాండ్‌ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యాన్సెన్‌ సగటున ఓవర్‌కు 10 చొప్పున పరుగులిచ్చినా కీలక వికెట్లు తీశాడు. రఫాడించిన మార్క్‌రమ్‌ కివీస్‌ చేసిందేమీ తక్కువ స్కోరు కాదు. దీంతో ఈ గ్రూప్‌లో రెండు పోటీ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందనుకుంటే మార్క్‌రమ్‌ ఏకపక్షంగా మార్చేశాడు. అతను ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా మూడో ఓవర్లోనే 50 స్కోరుకు చేరుకుంది. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద డికాక్‌ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అవుటయ్యాడు. కాసేపటికే మార్క్‌రమ్‌ 19 బంతుల్లోనే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున వేగవంతమైన అర్ధశతకాన్ని సాధించాడు. రికెల్టన్‌ (11 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా కెప్టెన్‌లాగే కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 7.2 ఓవర్లలోనే వంద పరుగులు దాటింది. తర్వాత వచ్చిన బ్రెవిస్‌ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌), మిల్లర్‌ (17 బంతుల్లో 24 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో ఇంకో 2.5 ఓవర్లముందే సఫారీ లక్ష్యాన్ని దాటేసింది.

India lose to Belgium in Pro Hockey League8
బెల్జియం చేతిలో భారత్‌ ఓటమి

రూర్కెలా: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ హాకీ లీగ్‌లో భారత జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో బెల్జియం 4–2 గోల్స్‌ తేడాతో భారత్‌ను ఓడించింది. బెల్జియం తరఫున హ్యూగో లబుషేర్‌ (11వ నిమిషం), అలెగ్జాండర్‌ హెన్‌డ్రిక్‌ (14వ ని., 17వ ని.), ఆర్థర్‌ స్లూవర్‌ (15వ ని.) గోల్స్‌ నమోదు చేశారు. భారత ఆటగాళ్లలో ఆదిత్య అర్జున్‌ (24వ ని.), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (37వ ని.) గోల్స్‌ సాధించారు. తొలి క్వార్టర్‌లో 3 గోల్స్‌ సాధించి బెల్జియం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్‌లో ఇరు జట్లు చెరో గోల్‌ చేయగా, మూడో క్వార్టర్‌లో భారత్‌ ఖాతాలో మరో గోల్‌ చేరింది. అయితే చివరి క్వార్టర్‌లో రాణించి ఓటమినుంచి తప్పించుకోవాలని భారత్‌ చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో జర్మనీ 6–1 గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. నేడు జరిగే పోరులో అర్జెంటీనాతో భారత్‌ తలపడుతుంది.

T20 WC 2026: England beat Scotland by 5 wickets9
T20 WC 2026: స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం

టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శ‌నివారం కోల్‌క‌తా వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగులకు ఆలౌటైంది.కెప్టెన్ రిచీ బెరింగ్టన్(49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మైకేల్ జోన్స్(33), బ్రూస్‌(24) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో అదిల్ ర‌షీద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్చ‌ర్, డాస‌న్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ త‌డ‌బ‌డిన‌ప్ప‌టికి, మిడిల్ ఆర్డర్ రాణించడంతో విజ‌యాన్ని అందుకుంది.టామ్ బాంట‌న్‌(41 బంతుల్లో 63 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాట‌గా.. జాకబ్ బెథెల్(32), సామ్ కర్రన్(28) రాణించారు. స్కాట్లాండ్ బౌల‌ర్ల‌లో మెక్‌ముల్ల‌న్‌, బ్రాడ్‌ వీల్, కుర్రీ త‌లా వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్-సిలో ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరుకోగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది.

Indias Likely Playing XI For T20 World Cup 2026 Match Against Pakistan10
పాక్‌తో మ్యాచ్.. భార‌త తుది జ‌ట్టు ఇదే! వారిద్ద‌రిపై వేటు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా.. అదే జోరును దాయాది జ‌ట్టుపై కూడా కొన‌సాగించాల‌ని భావిస్తోంది.అయితే ఈ హైవోల్టేజ్ కోసం భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. అనారోగ్యం కార‌ణంగా న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మైన విధ్వంసక‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ.. తిరిగి పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఇదే జ‌రిగితే సంజూ శాంస‌న్‌పై వేటు ప‌డ‌నుంది.గ‌త మ్యాచ్‌లో సంజూకు అవ‌కాశం ల‌భించిన‌ప్ప‌టికి స‌ద్వినియోగ ప‌రుచుకోలేక‌పోయాడు. దూకుడుగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అదేవిధంగా కొలంబో పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవ‌కాశముండ‌డంతో కుల్దీప్ యాద‌వ్ తుది జ‌ట్టులోకి రానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. న‌మీబియాతో మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్ లేదా రింకూ సింగ్‌లో ఎవ‌రో ఒక‌రిని ప‌క్క‌న పెట్టే అవ‌కాశ‌ముంది. పాక్‌పై కుల్దీప్ యాద‌వ్‌కు అద్భుత‌మైన రికార్డు (3 టీ20ల్లో 8 వికెట్లు) ఉంది. కాబ‌ట్టి అత‌డిని తుది జ‌ట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే ఛాన్స్ ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఆదివారం వర్షం కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒక‌వేళ మ్యాచ్ ర‌ద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ద‌క్కుతుంది.పాక్‌తో మ్యాచ్‌కు భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా): సంజు శాంసన్/అభిషేక్ శ‌ర్మ‌,ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement