Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

BCB Withdraws NOCs for Mustafizur Nahid Rana for Remainder PSL 20261
PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో కొనసాగేందుకు తమ ఇద్దరు ప్రధాన ఆటగాళ్లకు ఇచ్చిన నిరంభ్యంతర పత్రాల్ని (NOC) రద్దు చేసింది. కాగా ఐపీఎల్‌-2026 నుంచి తొలగించిన తర్వాత బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ పీఎస్‌ఎల్‌లో చేరిన సంగతి తెలిసిందే.జట్టు విజయాల్లో కీలక పాత్రలాహోర్‌ ఖలందర్స్‌తో జట్టుకట్టిన ముస్తాఫిజుర్‌.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోసం ముస్తాఫిజుర్‌ను బీసీబీ వెనక్కి పిలిపించింది. కానీ గాయం వల్ల అతడు మొదటి రెండు వన్డేలకు దూరం కాగా.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో బరిలోకి దిగాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టుకు విజయం అందించడంలో తోడ్పడ్డాడు.పీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడడుఅయితే, ఈ మ్యాచ్‌ తర్వాత బీసీబీ కీలక ప్రకటన చేసింది. పీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ముస్తాఫిజుర్‌ రహమాన్‌ పంపబోమని తెలిపింది. ఫిట్‌నెస్‌ సమస్యల భయం దృష్ట్యా అతడికి ఇచ్చిన NOCని రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB)కి సమాచారం ఇచ్చింది.కాగా తొలుత మార్చి 26- ఏప్రిల్‌ 12 వరకు... తర్వాత ఏప్రిల్‌ 24- మే 3 వరకు ముస్తాఫిజుర్‌కు బీసీబీ NOC జారీ చేసింది. ఇక ముస్తాఫిజుర్‌తో పాటు మరో పేసర్‌ నహీద్‌ రాణా NOCని కూడా బీసీబీ రద్దు చేయడం గమనార్హం. నహీద్‌ రాణా NOC కూడా రద్దుకాగా నహీద్‌ రాణా పీఎస్‌ఎల్‌లో పెషావర్‌ జెల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరగా.. వన్డే సిరీస్‌ ఆడేందుకు నహీద్‌ స్వదేశానికి తిరిగి వచ్చాడు.న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు నహీద్‌. అయితే, అతడిని కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు బీసీబీ. దీంతో పీఎస్‌ఎల్‌లో ప్లే ఆఫ్స్‌ ఆడేందుకు నహీద్‌ వెళ్తాడని భావించగా.. బీసీబీ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. కారణం ఇదేపీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు రాడని స్పష్టం చేసింది. కాగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు నహీద్‌ను సన్నద్ధం చేసేందుకే బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా పీఎస్‌ఎల్‌లో తమదైన ముద్రవేస్తూ లీగ్‌కు కాస్త ఊపు తెచ్చిన ఇద్దరు ప్లేయర్లను కీలక సమయంలో తప్పించడం ద్వారా బీసీబీ.. పీసీబీకి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో బంగ్లా కైవసం చేసుకుంది. అంతకుముందు వెస్టిండీస్‌, పాకిస్తాన్‌లపై కూడా వన్డే సిరీస్‌లు గెలిచి సత్తా చాటింది. చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

Cant See The Fielder: MI Tilak Varma CSK Jamie Overton Clash Video Viral2
జేమీపై తిలక్‌ వర్మ ఫైర్‌.. మధ్యలో సూర్య.. ఆఖరికి!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌- ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌కు ప్రత్యేక అభిమానులు ఉంటారు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ అంటే అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. ఐపీఎల్‌-2026లో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూశారు.అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై ముంబైపై ఏకపక్ష విజయం సాధించింది. సొంతమైదానం వాంఖడేలో హార్దిక్‌ సేనను రుతురాజ్‌ బృందం ఏకంగా 103 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఐపీఎల్‌లో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.జేమీతో గొడవపడ్డ తిలక్‌ వర్మఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా ముంబై బ్యాటర్లు తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్- చెన్నై బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జేమీ ఓవర్టన్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా తిలక్‌ జేమీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇంతలో సూర్య కూడా జోక్యం చేసుకుని జేమీని నిందించగా.. అతడు గట్టిగానే బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. చెన్నై విధించిన 208 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై పవర్‌ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి కుదేలైంది. ఈ క్రమంలో తిలక్‌ వర్మ- సూర్య ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.ఫీల్డర్‌ను చూడనివ్వవా?ఇక ముంబై ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో జేమీ ఓవర్టన్‌ బంతితో రంగంలోకి దిగి స్లో బాల్‌ సంధించగా.. తిలక్‌ మిడ్‌ వికెట్‌ దిశగా షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో సూర్య- తిలక్‌ కలిసి సింగిల్‌ పూర్తి చేసుకోగా.. తిలక్‌ ఇంకో రన్‌ కోసం పిలుపునిచ్చాడు. అయితే, సూర్య ఇందుకు నిరాకరించగా.. తిలక్‌ వేగంగా నాన్‌-స్ట్రైకర్‌ ఎండ్‌వైపు చేరుకున్నాడు.అయితే, అదే సమయంలో ఫీల్డర్‌ నుంచి బంతిని అందుకున్న జేమీ.. తిలక్‌కు అడ్డుగా వచ్చి రనౌట్‌ చేయాలని చూశాడు. దీంతో తిలక్‌ వర్మ సీరియస్‌ అయ్యాడు. తనను కావాలనే జేమీ అటకాయించాడని.. ఫీల్డర్‌ను చూడకుండా చేశాడని ఫైరయ్యాడు. దీంతో జేమీ కూడా ధీటుగా బదులివ్వగా సూర్య జోక్యం చేసుకున్నాడు.Heat. Pressure. Drama 😤This rivalry never disappoints 🔥#TATAIPL 2026 | #MIvCSK | LIVE NOW 👉 https://t.co/vkBKeocOG2 pic.twitter.com/hETDJPFFK3— Star Sports (@StarSportsIndia) April 23, 2026సూర్య కూడా ఫైర్‌.. అంపైర్ల జోక్యంతోఅయితే, సూర్యకు కూడా జేమీ కౌంటర్‌ ఇవ్వగా పరిస్థితి విషమిస్తుందని భావించిన అంపైర్లు వీరిని విడదీశారు. ఈ దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత జేమీని తిలక్‌ వర్మ హత్తుకున్నాడు. దీంతో ఈ వివాదం ఇక్కడితో సమసిపోయినట్లు అయింది.ఈ మ్యాచ్‌లో తిలక్‌ 29 బంతుల్లో 37 పరుగులు చేయగా.. సూర్య 30 బంతుల్లో 36 రన్స్‌ చేశాడు. అయితే, సీఎస్‌కే బౌలర్ల దూకుడు ముందు వీరు నిలవలేకపోయారు. ఫలితంగా 19 ఓవర్లలో కేవలం 104 పరుగులు చేసి ముంబై ఆలౌట్‌ అయింది.‌చదవండి: Hardik pandya: బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా?

MS Dhoni Deliberately Staying Away From CSK Ex NZ Star Stunning Claim3
‘ధోని కావాలనే CSKకు దూరంగా ఉంటున్నాడు’

చెన్నై సూపర్‌ కింగ్స్‌.. మహేంద్ర సింగ్‌ ధోని.. ఈ రెండూ పర్యాయ పదాల లాంటివి అనడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్‌ ఆరంభం నుంచి అంతా తానై చెన్నైని ముందుకు నడిపించాడు ధోని. తన సారథ్యంలో రికార్డు స్థాయిలో జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.సరైన వారసుడు ఎవరు?అయితే, ధోని (MS Dhoni) కెప్టెన్‌గా తప్పుకొన్న తర్వాత ఇప్పటి వరకు అతడి వారసుడిగా ఎవరూ నిలదొక్కుకోవడం లేదు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు 2022లో పగ్గాలు ఇవ్వగా అతడు ఒత్తిడి భరించలేక మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఆ తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్‌ను ధోని స్థానంలో కెప్టెన్‌ను చేశారు.అయితే, గతేడాది ఐదు మ్యాచ్‌ల తర్వాత గాయం కారణంగా అతడు మధ్యలోనే టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ధోని మరోసారి సారథిగా పగ్గాలు చేపట్టగా.. అప్పటికే నష్టం జరిగిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్‌-2025లో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.44 ఏళ్ల వయసులోనూఇక 44 ఏళ్ల వయసులోనూ ధోని చెన్నై తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఐపీఎల్‌-2026లో సీఎస్‌కే ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. అయినా ఇంత వరకు ధోని ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. పిక్కల్లో గాయం కారణంగా అతడు జట్టుకు దూరంగా ఉంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.ధోని కావాలనే దూరంగా ఉంటున్నాడా?అయితే, ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌కు ముందు ధోని బాగానే ప్రాక్టీస్‌ చేసినట్లు కనిపించింది. అయినప్పటికీ అతడు బరిలోకి దిగలేదు. కనీసం స్టేడియానికి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ధోని కావాలనే జట్టుకు దూరంగా ఉంటున్నాడా? అనే సందేహాలు తలెత్తగా.. న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ సైమన్‌ డౌల్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.అందుకే ఇలా చేస్తున్నాడు!క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్‌ ధోని ఫిట్‌గానే కనిపిస్తున్నాడు. అయినా సరే జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కనీసం జట్టుతో కలిసి మైదానానికి రావడం లేదు. డగౌట్‌లోనూ కనిపించడం లేదు.వీలైనంతగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అతడొక దిగ్గజ ఆటగాడు, కెప్టెన్‌. అయినా సరే ఇలా ఎందుకు చేస్తున్నాడు? కావాలనే అతడు జట్టుకు దూరంగా ఉంటున్నట్లు అనిపిస్తోంది. తాను లేకున్నా జట్టు ముందుకు సాగేలా ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నట్లున్నాడు’’ అని సైమన్‌ డౌల్‌ పేర్కొన్నాడు.Respect ++ 💛💙#MIvCSK #WhistlePodupic.twitter.com/xphQe6IpPj— Chennai Super Kings (@ChennaiIPL) April 24, 2026రుతు, సంజూ మీదే ఫోకస్‌ ఉండేలా..‘తలా’ తనకు తానే తన క్రేజ్‌ తగ్గించుకుని.. కొత్త నాయకత్వ బృందంపై దృష్టి పడేలా చేస్తున్నాడని.. జట్టును వారు తమ చేతుల్లోకి తీసుకునేలా చేస్తున్నాడని డౌల్‌ అభిప్రాయపడ్డాడు. కాగా గతంలోనూ రుతు కెప్టెన్‌గా ఉన్నా.. మైదానంలో అతడికి సలహాలు, సూచనలు ఇస్తూ ధోని అంతా తానై వ్యవహరించేవాడు.అయితే, ఈసారి సంజూ శాంసన్‌ రాకతో ధోని తనపై భారం తగ్గించుకుని.. నాయకత్వ బృందంలో రుతుతో పాటు సంజూ భాగమయ్యేలా చేయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. కాగా ధోని స్థానంలో సంజూ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముంబైతో మ్యాచ్‌లో సంజూ అజేయ సెంచరీ (54 బంతుల్లో 101)తో చెలరేగి.. సీఎస్‌కేకు సీజన్‌లో మూడో విజయం అందించాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

MI Accused Of Using Concussion Substitute For Shoulder Injury Coach Reacts4
అతడి మెదడు భుజంలో ఉందా?.. సమర్థించుకున్న ముంబై

ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇంతటి చెత్త ప్రదర్శన ఎప్పుడూ చూడలేదంటూ జట్టు అభిమానులు సైతం తిట్టిపోస్తున్నారు. అదే సమయంలో.. కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌ విషయంలో ముంబై తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది.ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడింది. వాంఖడేలో టాస్‌ ఓడిని చెన్నై.. తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ అజేయ శతకం (54 బంతుల్లో 101 నాటౌట్‌) రాణించాడు.ఇక లక్ష్య ఛేదనలో ముంబై 19 ఓవర్లలో కేవలం 104 పరుగులు చేసి కుప్పకూలింది. ఫలితంగా చెన్నై చేతిలో 103 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్‌ చరిత్రలో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి.వివాదం ఏమిటంటే?ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో డీప్‌స్క్వేర్‌ లెగ్‌ వద్ద కార్తీక్‌ శర్మ (19 బంతుల్లో 18) క్యాచ్‌ పట్టే క్రమంలో.. ముంబై స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ ఎడమ భుజానికి బలమైన గాయమైంది. అతడు బ్యాటింగ్‌ చేసే స్థితిలో లేడు. అయితే ముంబై ఇన్నింగ్స్‌ సమయంలో సాంట్నర్‌కు బదులు ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ‘కన్‌కషన్‌ సబ్‌’ (Concussion Substitute)గా జట్టు బ్యాటింగ్‌కు పంపించడం అనూహ్య పరిణామం.Excellently judged 👌Mitchell Santner with a fine diving catch in the deep 👏👏1⃣st wicket of the night for Jasprit Bumrah ☝️Updates ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @mipaltan pic.twitter.com/5EyRNf9kCb— IndianPremierLeague (@IPL) April 23, 2026నిబంధనల ప్రకారం తల, మెడ వంటి సున్నిత భాగాల్లో గాయమై మగతగా అనిపించే మయంలో కన్‌కషన్‌ సబ్‌ను అనుమతిస్తారు. కానీ మిచెల్‌ సాంట్నర్‌ భుజానికి గాయమైతే.. అతడికి బదులు ‘కన్‌కషన్‌ సబ్‌’ ఆటగాడిగా శార్దూల్‌ను పంపడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోంది.అతడి మెదడు భుజంలో ఉందా?‘‘భుజానికి గాయమైతే కూడా కన్‌కషన్‌ సబ్‌ను అనుమతిస్తారా? సాంట్నర్‌ మెదడు భుజంలో ఉందా ఏమిటి?.. ముంబై ఇండియన్స్‌ ‘క్లాసింగ్‌ చీటింగ్‌’ ఇది. బహుశా అంపైర్లు హెడ్‌ అండ్‌ షోల్డర్‌ షాంపూ వాడుతున్నారేమో. అందుకే ఇలా చేశారు’’ అంటూ నెటిజన్లు ముంబై ఇండియన్స్‌తో పాటు అంపైర్లకు చురకలు అంటిస్తున్నారు. ముంబై స్పందన ఇదేకన్‌కషన్‌ సబ్‌ వివాదంపై ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌ మహేళ జయవర్దనె స్పందించాడు. ‘‘సాంట్నర్‌ తలకు తొలుత గాయమైంది. ఆ తర్వాత భుజానికీ గాయమైంది. అతడిని స్కానింగ్‌కు పంపించాము. అతడు మగతగా ఉందని చెప్పాడు. భుజం నొప్పి తగ్గడానికి కట్టు వేశారు. నిజానికి అతడు బ్యాటింగ్‌ చేసే స్థితిలో లేడు’’ అని జయవర్దనె వివరణ ఇచ్చాడు.ఇక అంపైర్‌, రిఫరీ.. లెప్టార్మ్‌ స్పిన్నర్‌ సాంట్నర్‌కు బదులు రైటార్మ్‌ పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అనుమతించారని.. వారి నిర్ణయానుసారమే తాము శార్దూల్‌ను పంపినట్లు జయవర్దనె తెలిపాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

I think that in powerplay: Hardik Pandya On MI's Biggest IPL Defeat To CSK5
సీఎస్‌కే చేతిలో చిత్తు.. హార్దిక్‌ పాండ్యా స్పందన ఇదే

చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. పవర్‌ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. చెన్నై జట్టు అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిందని.. అందుకు వారికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నాడు.సంజూ శాంసన్‌ అజేయ సెంచరీకాగా ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌ గురువారం సీఎస్‌కేతో తలపడింది. సొంత మైదానం వాంఖడేలో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ అజేయ సెంచరీ (54 బంతుల్లో 101)తో చెలరేగి చెన్నైకి మంచి స్కోరు అందించాడు. సంజూ విధ్వంసం కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 207 పరుగులు చేసింది.పవర్‌ప్లే ముగిసేసరికి లక్ష్య ఛేదనకు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. తొలి 15 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన జట్టు వరుస విరామాల్లో ఓపెనర్లు డానిష్‌ (0), డికాక్‌ (7).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నమన్‌ (0) వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 29 పరుగులు మాత్రమే.104 పరుగులకే ఆలౌట్‌ఈ దశలో సూర్య కుమార్‌ (36), తిలక్‌ వర్మ (37) కలిసి నాలుగో వికెట్‌కు 56 బంతుల్లో 73 పరుగులు జోడించారు. అయితే కేవలం 3 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో సహా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (1), రూథర్‌ఫర్డ్‌ (0) అవుటవ్వడంతో ముంబై ఓటమి ఖరారైంది. Akeal Hosein 🤜🤛 Noor Ahmad 🎥 #CSK’s spin twins breaking the game in style 💥Updates ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @AHosein21 | @noor_ahmad_15 | @ChennaiIPL pic.twitter.com/HkDLnt759X— IndianPremierLeague (@IPL) April 23, 2026సీఎస్‌కే బౌలర్ల విజృంభణ కారణంగా 19 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 104 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఫలితంగా పరుగుల తేడా పరంగా ఐపీఎల్‌ చరిత్రలో తమ అతిపెద్ద ఓటమి నమోదు చేసింది.మా ఓటమికి ప్రధాన కారణం అదేఈ నేపథ్యంలో ఓటమిపై హార్దిక్‌ పాండ్యా స్పందిస్తూ.. ‘‘పవర్‌ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోయిన తర్వాత కోలుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ఛేదనలో ఇలా జరగడం బ్యాటర్లపై ఒత్తిడిని పెంచుతుంది. నేను.. పిచ్‌ను సాకుగా చూపి తప్పించుకునే రకం కాదు.చెన్నై ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఇదే వికెట్‌ మీద వాళ్లు 207 పరుగులు సాధించారు. మేమే మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సింది. మా స్పిన్నర్లు మెరుగ్గానే బౌలింగ్‌ చేశారనుకుంటున్నా. చెన్నై ఓపెనర్‌ సంజూ అత్యద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.వాళ్ల బ్యాటర్లంతా తలా ఓ చెయ్యి వేసి స్కోరును 200 దాటించారు. పవర్‌ ప్లేలో మేము రాణించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో. కానీ అది జరగలేదు. జట్టులో మార్పు గురించి ఇప్పుడే చెప్పలేను. నాయకత్వ బృందంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలిపాడు. చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడుWankhede painted in Yellow 💛Gurjapneet Singh with the final wicket for #CSK ✌️A commanding win by 1⃣0⃣3⃣ runs 👏Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL pic.twitter.com/meXDihvgGy— IndianPremierLeague (@IPL) April 23, 2026

Ravindra Jadeja expressed satisfaction with his all round performance6
‘అహం’ వదిలి మైదానానికి వస్తా!

లక్నో: భారత క్రికెటర్, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా సుదీర్ఘ కాలం తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌లో ప్రభావవంతమైన ప్రదర్శన కనబర్చాడు. అటు బ్యాటింగ్‌లో మెరుగైన స్కోరు సాధించిన అతను, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను నిలువరించి రాజస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గత కొన్ని మ్యాచ్‌లలో జడేజా బౌలర్‌గా తన పూర్తి స్థాయి నాలుగు ఓవర్ల కోటా కూడా వేయలేదు. దీనిపై అతను స్పందించాడు. జట్టు కోణంలోనే అంతా ఆలోచించాలని, ఏ రూపంలోనైనా టీమ్‌కు ఉపయోగపడటమే తన పని అని అతను వ్యాఖ్యానించాడు. ‘నేను మైదానానికి వస్తున్నప్పుడే నా అహాన్ని హోటల్‌ రూంలో వదిలి బయలుదేరతాను. ఆ రోజు టీమ్‌కు ఎలా ఉపయోగపడగలనో అని మాత్రమే ఆలోచిస్తాను తప్ప మిగతా విషయాలు కాదు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ విషయానికి వస్తే చివరి వరకు నిలబడాలని పట్టుదలగా నిర్ణయించుకున్నా. ఎందుకంటే 17 లేదా 18వ ఓవర్లో అవుటైపోతే మేం 159 వరకు చేరేవాళ్లం కాదు. కనీసం 20–25 పరుగులు తగ్గేవి. అప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించడం లక్నోకు సులువయ్యేది. టి20 మ్యాచ్‌లలో ప్రతీ పిచ్, పరిస్థితులు భిన్నంగా ఉండాయి కాబట్టి దానికి తగినట్లుగా ఆడాలి. బౌలింగ్‌లో ఫలానా ప్రత్యర్థి బ్యాటర్‌ నా బౌలింగ్‌ను సులువుగా ఆడతాడని జట్టు భావిస్తే అర్థం చేసుకోగలను. అది జరిగినా, జరగకపోయినా ఆటలో భాగంగానే భావిస్తాను’ అని జడేజా చెప్పాడు. చివరి ఓవర్‌ మయాంక్‌ యాదవ్‌ వేస్తాడని ముందే ఊహించి దానికి తగినట్లుగా సిద్ధమయ్యానన్న జడేజా ఆ ఓవర్లో 20 పరుగులు రాబట్టడంలో సఫలమయ్యాడు. బౌలింగ్‌లో వేగాన్ని సమర్థంగా వాడుకునే మార్‌‡్ష, పూరన్‌లకు స్లో బంతులు వేసి కట్టడి చేయగలిగినట్లు జడేజా వివరించాడు.

South Africa wins third T20 against Indian womens cricket team7
వారెవ్వా వోల్‌వార్ట్‌

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల క్రికెట్‌ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా... బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో మ్యాచ్‌లోనూ ఓడి 0–3తో సిరీస్‌ కోల్పోయింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్‌ షఫాలీ వర్మ (46 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (38 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. వైస్‌ కెప్టెన్ స్మృతి మంధాన (25 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించింది. అనంతరం దక్షిణాఫ్రికా 16.3 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ లౌరా వోల్‌వార్ట్‌ (53 బంతుల్లో 115; 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కింది. వోల్‌వార్ట్‌ 47 బంతుల్లోనే శతకం సాధించి మహిళల టి20ల్లో మూడో ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేసింది. మరో ఓపెనర్‌ సునె లుస్‌ (42 బంతుల్లో 64 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 15.2 ఓవర్లలోనే 183 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు సునాయాసంగా గెలుపొందింది. మహిళల టి20ల్లో ఇది మూడో అతిపెద్ద లక్ష్యఛేదన. వెస్టిండీస్‌ (213; ఆస్ట్రేలియాపై), ఇంగ్లండ్‌ (199; భారత్‌పై) ముందున్నాయి. నాలుగో టి20 మ్యాచ్‌ శనివారం జొహన్నెస్‌బర్గ్‌లోనే జరుగుతుంది.

Hardik pandya poor form continues in ipl 20268
బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా?

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముం‍బై ఇండియన్స్ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్‌ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ దారుణంగా విఫలమయ్యాడు.తొలుత బౌలింగ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం కీలక సమయంలో బ్యాటింగ్‌ వచ్చిన హార్దిక్‌.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ర్యాష్‌ షాట్‌ ఆడి తన వికెట్‌ను వికెట్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ పరంగా కూడా హార్దిక్‌ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.చెత్త నిర్ణయాలు తీసుకుంటూ జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్‌ పాండ్యా కేవలం 97 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో హార్దిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.బ్యాటింగ్‌ రాదు, బౌలింగ్‌ రాదు.. కెప్టెన్సీ అవసరమా హార్దిక్‌ అంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.సీఎస్‌కే ఘన విజయంఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్‌కే స్పిన్నర్‌ అకిల్‌ హుస్సేన్‌ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్‌ అహ్మద్‌ రెండు, గుర్‌జప్‌నీత్‌, కాంబోజ్‌, ముఖేష్‌ చౌదరి, కాంబోజ్‌ తలా వికెట్‌ సాధించారు. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(36), తిల‌క్ వ‌ర్మ‌(37) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది.

Sanju Samson Breaks Multiple IPL Records With Wankhede Century9
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి శ‌త‌క్కొట్టాడు. ఈ ధ‌నాధ‌న్ లీగ్‌లో భాగంగా వాఖండే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో శాంస‌న్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ముంబై బౌల‌ర్ల‌ను త‌నదైన శైలిలో ఉతికారేశాడు.కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూకు ఇది 5వ ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఇది అతడికి ఎనిమిదివ సెంచరీ. ఈ క్రమంలో శాంసన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సంజూ సాధించిన రికార్డులు ఇవేముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసిన మొట్టమొదటి సీఎస్‌కే బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సంజూ కంటే ముందు ఈ సీఎస్‌కే బ్యాటర్ కూడా ముంబైపై మూడంకెల స్కోరును అందుకోలేదు.అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా సంజూ రికార్డు నెలకొల్పాడు.ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కెఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో స్థానంలో శాంసన్‌ నిలిచాడు.టీ20 క్రికెట్‌లో భారత తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ సరసన శాంసన్ నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 8 టీ20 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి(9), అభిషేక్ శర్మ(9) సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు.చదవండి: IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్‌ What composure. What striking 💛𝐒𝐚𝐧𝐣𝐮 𝐒𝐦𝐚𝐬𝐡𝐢𝐧𝐠 𝐒𝐚𝐦𝐬𝐨𝐧 🔥Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL | @IamSanjuSamson pic.twitter.com/2Hr9Ui0UEn— IndianPremierLeague (@IPL) April 23, 2026

Cricket main venue in Los Angeles finalized10
నైట్‌రైడర్స్‌ ‘హోం’లో ఒలింపిక్స్‌

లాస్‌ ఏంజెలిస్‌: ఒలింపిక్స్‌లో 128 సంవత్సరాల తర్వాత క్రికెట్‌ పునరాగమనం చేస్తుండగా ఇప్పుడు ఈ మెగా ఈవెంట్‌లో మ్యాచ్‌లు నిర్వహించే ప్రధాన వేదిక ఖరారైంది. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ కూడా భాగంగా ఉంది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ‘పొమోనా’లో కొత్తగా నిర్మిస్తున్న మైదానాన్ని క్రికెట్‌ ప్రధాన వేదికగా నిర్ణయించారు. ఈ మైదానం ఐపీఎల్‌ టీమ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యానికి చెందినది కావడం విశేషం. అమెరికాలో 2023 సీజన్‌ నుంచి నిర్వహిస్తున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)లో లాస్‌ ఏంజెలిస్‌ నైట్‌రైడర్స్‌ జట్టు కూడా ఉంది. ఈ టోర్నీలో తమ ‘హోం’ గ్రౌండ్‌ కోసం నైట్‌రైడర్స్‌ ఈ స్టేడియాన్ని నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం బుధవారం జరిగింది. వచ్చే రెండేళ్లలో మైదానం నిర్మాణం పూర్తి చేసుకొని ఒలింపిక్స్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధమవుతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో క్రికెట్‌ పురోగతి కొత్త మైలురాయిగా నిలుస్తుందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ జై షా అన్నారు. ‘అంతర్జాతీయ క్రీడగా క్రికెట్‌ విస్తరించే క్రమంలో ఇది మరో కొత్త మలుపు. ఒలింపిక్స్‌లో పాల్గొని ఆట స్థాయిని పెంచడమే మా లక్ష్యం. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పునరాగమనానికి సంబంధించి ఈ స్టేడియం నిర్మాణం కొత్త మైలురాయి. ఒలింపిక్స్‌లో ఈ మైదానం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మా విశ్వాసం’ అని ఆయన చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సంజోగ్‌ గుప్తా, నైట్‌రైడర్స్‌ సీఈఓ వెంకీ మైసూర్, పొమోనా నగర మేయర్‌ టిమ్‌ సాండోవల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement