ప్రధాన వార్తలు
IPL 2026: అభిమానులకు గుడ్న్యూస్!
ఐపీఎల్ 2026 సీజన్కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మ్యాచ్కు సంబంధించిన టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి. మండు వేసవిలో ఫోర్లు, సిక్సర్ల వర్షంలో రెండు నెలల పాటు అభిమానులు తడిసి ముద్దయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈసారి వరుణుడు కూడా ఐపీఎల్ మ్యాచ్లపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో సీజన్ తొలి మ్యాచ్కు వర్షం అడ్డంకి ఏమైనా ఉందా అన్న విషయం ఆసక్తిగా మారింది. అయితే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదని బెంగళూరు కేంద్రంగా ఉన్న వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ మేరకు బెంగళూరుకు చిన్న చినుకుకు కూడా అవకాశం లేదని తెలిపింది. ఆకాశం నిర్మలంగా ఉంటుందని, గాలిలో తేమ ఎక్కువ ఉన్నందును టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్కు మొగ్గు చూపే అవకాశముందని తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ మేర ఉంటుందని పేర్కొంది. ఇది అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. భారత్లో చిన్న స్టేడియాల్లో ఒకటైన చిన్నస్వామి స్టేడియంలో బౌండరీ మీటర్ తక్కువ దూరం ఉండడంతో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. 2025లో చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ బ్యాటింగ్లో బలంగా కనిపిస్తోంది. కోహ్లీ, సాల్ట్, జితేశ్ శర్మ, పడిక్కల్, టిమ్ డేవిడ్, పాటిదార్, వెంకటేశ్ అయ్యర్లు బ్యాటింగ్లో కీలకం కానున్నారు. మరోవైపు బౌలింగ్లో కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ భువనేశ్వర్, యష్ దయాల్లు కీలకం. ఇక ఐపీఎల్లోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్ సొంతం. కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగుతోంది. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, లివింగ్స్టోన్, నితీవ్ కుమార్లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అయితే కమిన్స్ లేకపోవడంతో బౌలింగ్లో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్ కీలకం కానున్నారు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి , దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా , స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ , రసీ షర్మా దయాల్, భువనేశ్వర్ కుమార్ వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, సాత్విక్ దేస్వాల్, మంగేష్ యాదవ్, జోర్డాన్ కాక్స్, విక్కీ ఓస్త్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్సన్రైజర్స్ హైదరాబాద్: ఇషాన్ కిషన్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ , నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్ , శివన్ కుమార్ అన్ద్కత్, ఎషన్ కుమార్ అన్ద్కత్, ఎషాన్ మలింగస్ సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, క్రైన్స్ ఫులేట్రా, లియామ్ లివింగ్స్టోన్, శివమ్ మావి, జాక్ ఎడ్వర్డ్స్, పాట్ కమిన్స్చదవండి: ఉచితంగా ఐపీఎల్ టికెట్లు
పంతమే నెగ్గింది.. ఉచితంగా ఐపీఎల్ టికెట్లు!
ఐపీఎల్ టికెట్ల విషయంలో కర్ణాటక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పంతం నెగ్గించుకున్నారు. ఐపీఎల్ టికెట్లు కొనడానికి క్యూలైన్లో నిలబడేందుకు నిరాకరించిన ఎమ్మెల్యేలు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు పొందనున్నారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఎమ్మెల్యేలకు ఐపీఎల్ ఉచిత టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ, హైదరాబాద్ మ్యాచ్కు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేలకు చిన్నస్వామి స్టేడియంలో వీఐపీ స్టేటస్లో ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించ నున్నట్లు తెలిపారు. చిన్న స్వామి స్టేడియంలో జరిగే అన్ని మ్యాచులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక్కొక్కరికి 3 టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఈ పరిణామం జరగడానికి ఒక రోజు ముందు టికెట్ల విషయంలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణలే ఇవాళ వారికి ఉచిత ఐపీఎల్ టికెట్లు రావడానికి కారణమైంది. రాష్ట్ర ఎమ్మెల్యేలకు కేఎస్సీఏ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, సామాన్యుల లాగే టికెట్స్ కోసం క్యూలో నిలబడడం ఏంటని విమర్శలకు దిగింది. దీంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి రెండేసి టికెట్లు ఇవ్వాల్సిందిగా కర్ణాటక క్రికెట్ బోర్డును కోరారు. దీంతో ఉచిత టికెట్లు ఇచ్చేందుకు కేఎస్సీఏ ముందుకు వచ్చింది. గతేడాది ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ఈసారి తమ ఏడు హోం మ్యాచ్లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది విజయోత్సవంలో జరిగిన విషాదం నేపథ్యంలో ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలుత హోం గ్రౌండ్ను రాయ్పూర్కు మార్చాలని ముందుగా నిర్ణయించింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం రెండు మ్యాచ్లను రాయ్పూర్లో ఆడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. #WATCH | Bengaluru: On State MLAs' demand for IPL tickets, Karnataka Deputy CM DK Shivakumar says, "...Four tickets can't be given. So, every MLA, MP and Minister used to get one seat each. Now, we have requested them to give two tickets if the family members go. For tomorrow's… pic.twitter.com/1bA5wUNAnc— ANI (@ANI) March 27, 2026చదవండి: బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్!
బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్!
ఐపీఎల్ 2026 సీజన్ ఇవాళ షురూ కానుంది. మండు వేసవిలో రెండు నెలల పాటు సాగనున్న క్రికెట్ వినోదం అభిమానుల్లో జోష్ నింపింది. అయితే ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ 2020 తర్వాత మళ్లీ ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమవుతూ వస్తోంది. ఈసారి కప్ కొట్టాలనే బలమైన సంకల్పంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మార్చి 30న ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ను కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో ఆడనుంది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఇంకా జట్టుతో చేరలేదు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బుమ్రా శుక్రవారం సందర్శించాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో మెడికల్స్టాఫ్ పర్యవేక్షణలో బుమ్రా బౌలింగ్ సాధన చేశాడు. దీంతో కేకేఆర్తో జరగబోయే మ్యాచ్కు బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ బుమ్రా కేకేఆర్తో మ్యాచ్కు దూరమైతే మాత్రం ఆకాశ్ మధ్వాల్ ముంబై తుది జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఐపీఎల్ మినీ వేలంలో ఆకాశ్ మధ్వాల్ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కానీ శుక్రవారం రాత్రి మాత్రం ముంబై జట్టుకు నెట్ బౌలర్గా వ్యవహరించాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ అక్కడికి రావడం, రోహిత్ను చూసిన ఆకాశ్ మధ్వాల్ రెండు చేతులు జోడించి దండం పెట్టడం కనిపించింది. దీనికి బదులుగా రోహిత్ అతన్ని హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతానికి నెట్ బౌలర్గా ఉన్న ఆకాశ్ మధ్వాల్ కచ్చితంగా బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికే ముంబై యాజమాన్యం అతన్ని తీసుకొచ్చిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే మరో బౌలర్ అథర్వ అంకోలేకర్ కూడా దూరమవ్వడంతో ముంబై జట్టుకు ఇబ్బంది ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆకాశ్ మధ్వాల్ గతంలో (2023, 2024 సీజన్లు) ఇదే ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. అయితే 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం ద్వారా ఆకాశ్ మధ్వాల్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత సీజన్కు రాజస్థాన్ రాయల్స్ ఆకాశ్ను జట్టులోకి తీసుకుంది. 2025 సీజన్లో ఆకాశ్ రాజస్థాన్ తరఫున నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత రాజస్థాన్ జట్టు విడుదల చేయగా ఐపీఎల్ 2026 సీజన్కు ముందు జరిగిన మినీ వేలంలో ఆకాశ్ మధ్వాల్ అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు.చదవండి: గాయాలతో సతమతం.. ఆటకు గుడ్బైWe are sure you were not expecting this meet up 🥹💙 pic.twitter.com/MBbC2wMEAT— Mumbai Indians (@mipaltan) March 27, 2026
గాయాలతో సతమతం.. ఆటకు గుడ్బై
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న భారత హాకీ ఆటగాడు గుర్జంత్ సింగ్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాలు సాధించిన భారత పురుషుల హాకీ జట్టులో సభ్యుడైన గుర్జంత్... కెరీర్లో 130 మ్యాచ్లు ఆడాడు. పంజాబ్కు చెందిన 31 ఏళ్ల గుర్జంత్ 2023 ఆసియా క్రీడల్లో భారత జట్టు పసిడి నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. 2017లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన అతను కెరీర్ మొత్తంలో 33 గోల్స్ చేశాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన గోల్ చేసిన ప్లేయర్గానూ రికార్డు సృష్టించాడు. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో గుర్జంత్ 13 సెకన్లలోనే గోల్ నమోదు చేశాడు. హాకీ ఇండియా వార్షిక అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా గుర్జంత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘ఇదే సరైన సమయం అనుకుంటున్నా. గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్నా. కోలుకొని తిరిగి వచ్చినా... జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయా. కెరీర్లో సాధించిన దానితో సంతృప్తిగా వీడ్కోలు పలుకుతున్నా. ఇక మీద దేశవాళీలు, హాకీ ఇండియా లీగ్లో ఆడుతా’ అని గుర్జంత్ వెల్లడించాడు. A player for the big moments 🫡Thank you, Gurjant Singh, for the passion, grit, and unforgettable memories you’ve given Indian hockey.From Punjab to the biggest stages in world hockey, your journey has been defined by resilience and impact. Time and again, you rose to the… pic.twitter.com/4e8sAT6YGU— Hockey India (@TheHockeyIndia) March 27, 2026Flashback to January 18, 2020, at the iconic Kalinga Stadium 🏟️, where Gurjant Singh set the turf on fire with a rapid goal scored 13 seconds into the match against the Netherlands! 🔥 This electrifying opener laid the foundation for Team India’s remarkable 5-2 victory in their… pic.twitter.com/6Jf6eMNFCN— Hockey India (@TheHockeyIndia) January 18, 2025చదవండి: విండీస్ క్రికెటర్ సంచలన నిర్ణయం!
మెరుపుల పండగొచ్చింది
టి20 వరల్డ్ కప్లో భారత జట్టు జైత్రయాత్రను చూసి మూడు వారాలు గడిచాయి. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ సాధించిన టీమిండియాకు మన అభిమానులంతా జేజేలు పలికారు. ఆ తర్వాత క్రికెట్ లేకుండా కాస్త స్తబ్దత. ఇప్పుడు మళ్లీ అందరిలో జోష్ నింపే వేసవి వినోదం వచ్చేసింది. కొద్ది రోజుల క్రితం వరకు ఒకే జట్టుగా టీమిండియాను చాంపియన్గా నిలిపిన సహచరులంతా ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆరో టైటిల్ వేటలో రెండు టీమ్లు పోటీ పడుతుండగా, నాలుగో ట్రోఫీపై మరో జట్టు గురి పెట్టింది. రెండోసారి విజేతగా నిలవాలని మరో నాలుగు టీమ్లు సిద్ధం కాగా... తొలిసారి కప్ను ముద్దాడేందుకు ఇంకో మూడు జట్లు తమ పోరాటాన్ని కొనసాగించనున్నాయి. రెండు నెలల పాటు జరిగే 74 మ్యాచ్లతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ సమరానికి రంగం సిద్ధమైంది. ఇక పగలూ రాత్రీ అక్కడా ఇక్కడా ఎక్కడైనా ఐపీఎల్ స్కోర్లు, ఫలితాలు, విశ్లేషణలపైనే చర్చ షురూ కానుంది. బెంగళూరు: ఐపీఎల్–2026కు నేటితో తెర లేవనుంది. చిన్నస్వామి మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్తో టోర్నీ మొదలవుతుంది. గత నాలుగు సీజన్ల తరహాలోనే ఈసారి కూడా మొత్తం 10 టీమ్లు బరిలోకి దిగుతున్నాయి. మే 24 వరకు లీగ్ దశలు పోటీలు జరుగుతాయి. వీటిలో 12 రోజుల్లో డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు మ్యాచ్లు) ఉన్నాయి. ఆ తర్వాత ‘ప్లే ఆఫ్స్’ నిర్వహిస్తారు.‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్ల వేదికలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఫైనల్ మ్యాచ్ మే 31న బెంగళూరులో నిర్వహిస్తారు. ప్రతీ ఏటా ప్రజాదరణలో, వాణిజ్యపరంగా కూడా స్థాయిని పెంచుకుంటూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ కూడా ఎప్పటిలాగే హోరాహోరీగా, ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. దిగ్గజ క్రికెటర్లు ధోని, కోహ్లి, రోహిత్ ఈ సీజన్లో కూడా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. లీగ్లో మరో రసవత్తర వినోదానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ సీజన్కు సంబంధించి కొన్ని విశేషాలు.... » డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ఈసారి తమ ఏడు హోం మ్యాచ్లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది విజయోత్సవంలో జరిగిన విషాదం నేపథ్యంలో ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందేహాల మధ్య హోం గ్రౌండ్ను రాయ్పూర్కు మార్చాలని ముందుగా నిర్ణయించింది. ఆ తర్వాత అనుమతి రాగా... ముందుగా ఇచి్చన మాట ప్రకారం రెండు మ్యాచ్లను రాయ్పూర్లో ఆడేందుకు సిద్ధమైంది. » ఢిల్లీ క్యాపిటల్స్ గత రెండు సీజన్లలో రెండేసి మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడింది. ఈసారి ఆ జట్టు వైజాగ్లో బరిలోకి దిగడం లేదు. తమ ఏడు హోం మ్యాచ్లు అన్నింటినీ ఢిల్లీలోనే ఆడనుంది. ప్రతీ సీజన్లాగే రాజస్తాన్కు గువాహటి, పంజాబ్కు ధర్మశాల ‘రెండో హోం గ్రౌండ్’గా ఉంటాయి. » ఐపీఎల్ జట్లకు ఈసారి కొత్త కోచ్లు వచ్చారు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కుమార్ సంగక్కర రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. కోల్కతా నైట్రైడర్స్ చంద్రకాంత్ పండిత్ స్థానంలో అభిõÙక్ నాయర్ను హెడ్ కోచ్గా ఎంచుకుంది. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండ్రీ రసెల్ను తమతోనే ఉంచుకున్న కేకేఆర్ ‘పవర్ కోచ్’ అనే కొత్త పదవిని సృష్టించి బాధ్యతలు అప్పగించింది. కేన్ విలియమ్సన్ను లక్నో ఫ్రాంచైజీ ‘వ్యూహాత్మక సలహాదారు’గా నియమించుకుంది. ఆసీస్ మాజీ స్టార్ మాథ్యూ హేడెన్ గుజరాత్కు బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనుండగా, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఇయాన్ బెల్ను ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్గా తీసుకుంది. » ఆటగాళ్లపరంగా చూస్తే టి20 వరల్డ్ కప్ స్టార్ సంజు సామ్సన్ జట్టు మారడమే ఆసక్తికర అంశం. 11 సీజన్ల పాటు రాజస్తాన్ రాయల్స్కు ఆడిన సామ్సన్ ఇప్పుడు అద్భుతమైన ఫామ్తో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. అదే తరహాలో 12 సీజన్ల పాటు చెన్నైతో అనుబంధం ఉన్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన తొలి జట్టు రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈసారి ఆడబోతున్నాడు. » ఐపీఎల్లో మొదటి నుంచి భారత్ తర్వాత ఆ్రస్టేలియన్లదే ఆధిపత్యం. అటు ఆటగాళ్లు, ఇటు కోచింగ్ బృందంలో కూడా వారంతా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈసారి వేలంలో రూ.25.20 కోట్లకు అమ్ముడుపోయిన కామెరాన్ గ్రీన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు. కోల్కతా నైట్రైడర్స్ తరఫున అతను ఏమాత్రం ప్రభావం చూపిస్తాడన్నదే ఆసక్తికరం. ముగ్గురు ఆసీస్ గ్రేట్ బౌలర్లు స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్ మాత్రం లీగ్ ఆరంభంలో కనిపించకపోవచ్చు. గాయాల నుంచి పూర్తిగా కోలుకొని కమిన్స్ (సన్రైజర్స్), హాజల్వుడ్ (ఆర్సీబీ) తమ టీమ్లతో చేరినా... ఎప్పటి నుంచి మ్యాచ్లు ఆడతారనే సందేహం ఉంది. స్టార్క్ అయితే ఇంకా భారత్కే రాకపోగా, దీనిపై ఢిల్లీ మేనేజ్మెంట్కు ఇంకా స్పష్టత లేదు. వీరు కాకుండా ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్, షార్ట్, స్పెన్సర్ జాన్సన్, మిచెల్ మార్‡్ష, ఇన్గ్లిస్, స్టొయినిస్, ఒవెన్, డ్వార్షుయిస్, కనోలీ, బార్త్లెట్ కూడా తమ ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉన్నారు. మ్యాచ్ల ఫార్మాట్ మారింది... లీగ్లోకి పది టీమ్లు వచ్చిన తర్వాత ప్రతీ ఏటా అనుసరిస్తున్న ‘గ్రూపింగ్’ పద్ధతినే ఈసారి కూడా అనుసరించారు. ఆయా టీమ్లు సాధించిన ఐపీఎల్ టైటిల్స్ను బట్టి వీటిని రెండు గ్రూప్లుగా విభజించారు. దీని ప్రకారం గ్రూప్ ‘ఎ’లో చెన్నై (5), కోల్కతా (3), రాజస్తాన్ (1), బెంగళూరు (1), పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో ముంబై (5), హైదరాబాద్ (1), గుజరాత్ (1), ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గత సీజన్ వరకు ప్రతీ జట్టు తమ గ్రూప్లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు (మొత్తం 8), ప్రత్యర్థి గ్రూప్లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ (మొత్తం 4), ఒక టీమ్తో రెండుసార్లు (2) ఆడేవి. ఇలా ప్రతీ జట్టుకు 14 లీగ్ మ్యాచ్లు ఆడే అవకాశం దక్కింది. అయితే ఈసారి ఇదే ఫార్మాట్ను భిన్నంగా మార్చారు. ఈ సీజన్లో ప్రత్యర్థి గ్రూప్లోని ఐదు జట్లతో రెండేసి సార్లు (మొత్తం 10), తమ గ్రూప్లోని టీమ్లతో ఒక్కో మ్యాచ్ (4)లో తలపడాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఐదుసార్లు చాంపియన్లు అయిన చెన్నై, ముంబైల మధ్య రెండు మ్యాచ్లు జరుగుతాయి.27 స్పాన్సర్లతో ప్రకటనల జోరు! ఐపీఎల్ క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని చూస్తే పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు రావడం కొత్త కాదు. కానీ ఈసారి ప్రసారకర్తలు మరింత పెద్ద సంఖ్యలో భారీ మొత్తాలకు స్పాన్సర్లతో జత కట్టారు. తాజా సీజన్ కోసం స్టార్ స్పోర్ట్స్–జియో హాట్స్టార్లలో కలిపి ఏకంగా 27 సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. వీటితో బ్రాడ్కాస్టింగ్ టీమ్కు ప్రకటనల పండగ ఖాయం. స్పాన్సర్ల జాబితాలో గూగుల్ సెర్చ్ ఏఐ, క్యాంపా ఎనర్జీ, హావెల్స్, లాయిడ్, బిర్లా ఒపస్, హీరో మోటో కార్ప్, అమెజాన్, ఏఎంఎఫ్ఐ, ఏషియన్ పెయింట్స్, విమల్ ఇలైచీ, సూపర్ మనీ, ఎంఆర్ఎఫ్, ఫ్లిప్కార్ట్, జిల్లెట్, వీడా, రూపే, మాండెలెజ్, మదర్ డెయిరీ, గ్రో, ర్యాపిడో, ముత్తూట్ ఫినాన్స్, సన్ఫీస్ట్, గూగుల్ పే, టీవీఎస్ ఈవీ, ఏంజెల్ వన్, క్యాంపా ష్యూర్, అమూల్ ఉన్నాయి. టాప్–4 సన్రైజర్స్వే... లీగ్లో జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరు జాబితాలో హైదరాబాద్ హవానే సాగింది. టాప్–4 స్కోర్లు వరుసగా 287, 286, 278, 277 సన్రైజర్స్ నమోదు చేసింది. ఈసారి 300 నమోదవుతుందా అనేది ఆసక్తికరం.109 ఐపీఎల్ చరిత్రలో నమోదైన సెంచరీలు. 58 మంది క్రికెటర్లు సెంచరీలు చేశారు. 2024లో అత్యధికంగా 14 సెంచరీలు నమోదుకాగా ... 2009లో అత్యల్పంగా 2 సెంచరీలు వచ్చాయి. 4 ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు ప్లేయర్లు (ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మనీశ్ పాండే) మాత్రమే ప్రతి సీజన్లో బరిలోకి దిగారు. రోహిత్ శర్మ (డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్), ధోని (చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్) రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించగా... కోహ్లి ఐపీఎల్ ఆరంభం నుంచి ఒకే జట్టు (ఆర్సీబీ)కు ఆడుతున్నాడు. మనీశ్ పాండే మాత్రం ఏడు జట్లకు (ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణే వారియర్స్ ఇండియా, సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ డేర్డెవిల్స్) ప్రాతినిధ్యం వహించాడు.278 ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ ధోని. వరుసగా 19వ సీజన్లో బరిలోకి దిగనున్న ధోని 278 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. రోహిత్ శర్మ (272), విరాట్ కోహ్లి (267) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.10 ఐపీఎల్లో కనీసం 200 మ్యాచ్లు ఆడిన క్రికెటర్లు. ఈ జాబితాలో ధోని, రోహిత్, కోహ్లి, దినేశ్ కార్తీక్ (257), రవీంద్ర జడేజా (254), శిఖర్ ధావన్ (222), రవిచంద్రన్ అశ్విన్ (221), సురేశ్ రైనా (205), రాబిన్ ఉతప్ప (205), అంబటి రాయుడు (204) ఉన్నారు. ఈ సీజన్లో అజింక్య రహానే (198), భువనేశ్వర్ కుమార్ (190), సునీల్ నరైన్ (189) ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.ఐపీఎల్ రికార్డులు... ఐపీఎల్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు తమదైన ప్రత్యేక ముద్ర వేశారు. వీరిలో కొందరు ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరికొందరు ఆటనుంచి నిష్క్రమించినా వారు అందించిన వినోదం, మెరుపులు మర్చిపోలేనివి. ఇప్పుడు బరిలో ఉన్నా, లేకపోయినా 19వ సీజన్ నేపథ్యంలో కొన్ని ఘనతలను గుర్తు చేసుకోక తప్పదు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి (8661), అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా యుజువేంద్ర చహల్ (221) పేరిట రికార్డు ఉంది. అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్ గేల్ (175 నాటౌట్) నమోదు చేయగా, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన అల్జారి జోసెఫ్ (6/12) పేరిట ఉంది. అత్యధిక సిక్స్లు (357) క్రిస్ గేల్ బాదగా, ఒకే సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన ఘనత (973–2016లో) కోహ్లి పేరు మీద చెక్కు చెదరకుండా ఉంది.
ఎప్పటికీ మా హృదయాల్లో...
ఐపీఎల్లో గత ఏడాది ఆర్సీబీ విజేతగా నిలిచిన తర్వాత జరిగిన విజయోత్సవంలో 11 మంది అభిమానులు మృతి చెందారు. వారి స్మారకార్థం ఆర్సీబీ యాజమాన్యం భిన్న రీతిలో నివాళి అర్పించనుంది. ఇకపై చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లలో 11 సీట్లను ఖాళీగా ఉంచనుంది. పీ1 స్టాండ్లోని ఈ సీట్లలో ఎవరూ కూర్చోకుండా ఆ 11 మంది జ్ఞాపకార్ధం శాశ్వతంగా అలాగే ఉంచనుంది. ‘జట్టుతో వారికి ఉన్న అనుబంధానికి ఇవి గుర్తుగా ఉండిపోతాయి. వారు ఎప్పటికీ ఆర్సీబీ అభిమానులే’ అని తమ గౌరవాన్ని ప్రకటించింది.
చికిత ఖాతాలో స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో భారత ఆర్చర్లు మొత్తం 10 పతకాలు సాధించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రజత్ చౌహాన్తో కలిసి పసిడి పతకం సొంతం చేసుకుంది. చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని దక్కించుకుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చికిత–రజత్ చౌహాన్ (భారత్) ద్వయం 158–156తో ఫాతిన్ నూర్ఫతే–జువైది (మలేసియా) జంటపై గెలిచింది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో చికిత, రాజ్ కౌర్, తేజల్ బృందం 227–229తో విక్టోరియా, డయానా, రొక్సానాలతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడి రజత పతకాన్ని గెల్చుకుంది. పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్లో దేవాంగ్ గుప్తా, సుఖ్చెయిన్ సింగ్, జుయెల్ సర్కార్ (భారత్) బృందం 4–5తో కరిమోవ్, ఇల్ఫాత్, దౌలత్కెల్దీ (కజకిస్తాన్) జట్టు చేతిలో ఓడి రజతం నెగ్గింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్లో తేజల్ సాల్వే 144–138తో మరియాపై గెలిచింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఉదయ్ కంబోజ్ (స్వర్ణం), ప్రథమేశ్ (రజతం), రజత్ (కాంస్యం) క్లీన్స్వీప్ చేశారు. ఫైనల్లో ఉదయ్ కంబోజ్ 145–144తో ప్రథమేశ్పై, కాంస్య పతక మ్యాచ్లో రజత్ చౌహాన్ 145–144తో పీరావత్ (థాయ్లాండ్)పై నెగ్గారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రిధి (భారత్) 2–6 సెట్లతో ఒయున్ బసాన్దోర్జ్ (మంగోలియా) చేతిలో ఓడి రజతం సొంతం చేసుకుంది. బుధవారం భారత పురుషుల కాంపౌండ్ జట్టు, భారత మహిళల రికర్వ్ జట్టు కాంస్య పతకాలు సాధించాయి.
‘ఉత్తమ ప్లేయర్లు’ హార్దిక్, నవ్నీత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కనబరుస్తున్న భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, నవ్నీత్ కౌర్లకు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు దక్కాయి. గతేడాది ప్రదర్శనకు గాను హాకీ ఇండియా శుక్రవారం ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. భారత మాజీ కెప్టెన్ 1980 మాస్కో ఒలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన జట్టులో సభ్యుడైన జాఫర్ ఇక్బాల్కు మేజర్ ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1978, 1982 ఆసియా క్రీడల్లో రజత పతకాలు గెలిచిన జట్టులోనూ ఇక్బాల్ సభ్యుడు. 1982 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం గెలిచిన జట్టులోనూ ఇక్బాల్ ఉన్నాడు. హాకీకి చేసిన సేవకుగానూ జాఫర్ ఇక్బాల్కు జీవన సాఫల్య పురస్కారంతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి అందించారు. హార్దిక్, నవ్నీత్లకు అవార్డులతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి దక్కింది. మహిళల జట్టు ప్లేయర్ బిచ్చూ దేవికి ‘గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించగా... ఉత్తమ డిఫెండర్గా సంజయ్కు పురస్కారం దక్కింది. ‘మిడ్ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సుమిత్కు దక్కగా... ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సుఖ్జీత్ సింగ్కు దక్కింది. వీరందరికీ అవార్డుతో పాటు రూ. 5 లక్షల చొప్పున నగదు బహుమతి అందించారు. శుక్రవారం న్యుఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండర్–21 ఏజ్ గ్రూప్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సాక్షి రాణా, ప్రిన్స్ దీప్ సింగ్కు ‘అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు అందించారు. ఈ ఇద్దరికీ చెరో రూ. 10 లక్షల నగదు బహుమతి అందించారు. ప్లేయర్లతో పాటు అంపైర్లు, స్కోరర్లకు కూడా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆసియాకప్లో విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ప్లేయర్లను ప్రత్యేకంగా సన్మానించారు. ట్రోఫీ నెగ్గిన జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి తలా రూ. 1.5 లక్షలు అందజేశారు. జూనియర్ వరల్డ్కప్లో కాంస్యం నెగ్గిన భారత జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.15 లక్షల చొప్పున అందజేశారు. » హైదరాబాద్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో సత్తా చాటిన నవ్నీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు లభించింది. » గతేడాది జరిగిన జాతీయ చాంపియన్షిప్లో సత్తాచాటిన ఏడు (జార్ఖండ్, హరియాణా, మిజోరం, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్) జట్లకు రూ. 10 లక్షల చొప్పున అందజేశారు. » అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లకు ఇన్సెంటివ్లను సైతం శుక్రవారం అందజేశారు. పురుషుల జట్టుకు రూ. 1.38 కోట్లు, మహిళల జట్టుకు రూ. 69 లక్షలు లభించాయి. » జాతీయ జట్టు తరఫున 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మన్ప్రీత్ సింగ్కు రూ. 4 లక్షలు, 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హర్మన్ప్రీత్ సింగ్కు రూ. 2.5 లక్షలు అందించారు. » 150 మ్యాచ్లు పూర్తి చేసుకున్న హార్దిక్ సింగ్, క్రిషన్ బహదూర్ పాఠక్, నిలకంఠ శర్మ, జర్మన్ప్రీత్ సింగ్, సలీమా టెటెకు రూ.1.50 లక్షలు... 100 మ్యాచ్లు ఆడిన అభిõÙక్, సుఖ్జీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్కు రూ. 1 లక్ష చొప్పున అందజేశారు. » మహిళల హాకీలో 200 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన నవ్నీత్ కౌర్, నిక్కీ ప్రధాన్కు రూ. 2 లక్షల చొప్పున ఇచ్చారు.
ఈసారి ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం!
న్యూఢిల్లీ: ఐపీఎల్లో గత ఏడాది టైటిల్ సాధించేందుకు చేరువగా వచ్చి పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్లో ఓటమి పాలైంది. లీగ్ దశలో 14 మ్యాచ్లలో 9 విజయాలు సాధించి దూసుకొచ్చిన పంజాబ్ను తుది పోరులో ఓడించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి విజేతగా నిలిచింది. అయితే ఈసారి అలాంటి పొరపాటుకు తావు ఇవ్వమని, కచ్చితంగా ట్రోఫీని అందుకుంటామని పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన బెంగళూరు హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మే 31న ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ‘మే 31న చిన్నస్వామి మైదానంలో మేం ఫైనల్ ఆడి కప్ను సొంతం చేసుకోబోతున్నాం. ఇది నా ఆశ మాత్రమే కాదు. కచ్చితంగా జరిగి తీరుతుందనే నమ్మకం ఉంది. టీమ్ సభ్యులందరిలో ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోంది కాబట్టి జట్టు మొత్తం కూడా ఇదే నమ్ముతోంది’ అని శశాంక్ వ్యాఖ్యానించాడు. అయితే గత ఏడాది ఫైనల్ గురించి ఆలోచిస్తూ తాము ఒత్తిడి పెంచుకోమని, ఒక్కో మ్యాచ్లో గెలుస్తూ ముందుకు వెళ్లడమే లక్ష్యమని అతను పేర్కొన్నాడు. 2025 సీజన్లో ఆడిన జట్టు నుంచి 21 మంది పంజాబ్ కింగ్స్ కొనసాగిస్తోంది. ‘గత ఏడాది చేసిన చిన్న చిన్న తప్పులను కూడా సరిదిద్దుకుంటూ ఒక్కో మ్యాచ్లో విజయం సాధించడం ముఖ్యం. దాదాపు అదే జట్టు ఉండటం కూడా అందరిలో ప్రేరణ కలిగించే అంశం. ఈ సీజన్కు మేం మరింత బాగా సన్నద్ధమై వచ్చాం’ అని శశాంక్ వెల్లడించాడు. సాధారణంగా టాపార్డర్ బ్యాటర్ అయిన తాను పంజాబ్ కింగ్స్ జట్టు అవసరాల కోసం ఆర్డర్లో దిగువకు మారానని...అయితే ఈ పాత్రను, బాధ్యతను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు చెప్పాడు. ఫిట్నెస్ టెస్టులో తుషారా విఫలంఐపీఎల్కు అనుమతించని శ్రీలంక బోర్డుకొలంబో: ఐపీఎల్లో ఇప్పటికే హాజల్వుడ్ అందుబాటులో లేక పేస్ బౌలింగ్లో డీలాగా మారిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి మరో సమస్య తోడైంది. హాజల్వుడ్ స్థానంలో తుది జట్టులో ఆడే అవకాశం ఉన్న శ్రీలంక పేసర్ నువాన్ తుషారా ఇప్పట్లో జట్టుతో చేరే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో తుషారా విఫలమయ్యాడు. దాంతో అతనికి ఐపీఎల్ కోసం ఎన్ఓసీ ఇచ్చేందుకు లంక బోర్డు తిరస్కరించింది. ఫిట్నెస్ టెస్టులో వేర్వేరు ప్రమాణాల ద్వారా అందుబాటులో ఉన్న 29 పాయింట్లలో కనీసం 17 పాయింట్లు సాధించాల్సి ఉండగా... తుషారా వాటిని అందుకోలేకపోయాడు.
ప్రపంచకప్ ఆడే జట్టే ఆసియా క్రీడలకు...
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత హాకీ జట్టు మెగా ఈవెంట్లతో బిజీ షెడ్యూల్తో గడపనుంది. మరీ ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రపంచకప్, ఆసియా క్రీడల్లో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ రెండు మేజర్ టోర్నీలకు కలిపి ఒకే జట్టు బరిలోకి దిగుతుందని పురుషుల హాకీ హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ స్పష్టం చేశారు. తద్వారా రెండు వేర్వేరు జట్లను తయారు చేస్తారనే ఊహాగానాలకు ఆయన తెరదించారు. ప్రపంచకప్, ఆసియా క్రీడలకు మధ్య కేవలం మూడు వారాల విరామమే ఉండటంతో ఆటగాళ్ల ఫిట్నెస్, పని ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు రెండు జట్లను సిద్ధం చేస్తారని వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ప్రపంచకప్ కోసం సన్నద్ధం చేసే మెరుగైన, ధీటైన జట్టునే ఆసియా క్రీడల్లోనూ ఆడిస్తామని ఆయన చెప్పారు. నిజానికి 15 నెల క్రితం నుంచే ప్రణాళికా బద్ధంగా జట్టు నిర్మాణ ప్రక్రియ చేపట్టామని, ఇందులో భాగంగానే భారత ‘ఎ’ జట్టుపై దృష్టి సారించామని, భవిష్యత్ అవసరాల కోసం సత్తాగల యువ రక్తాన్ని సీనియర్ జట్టుకు ఎక్కించేందుకే ఇలా చేశామని కోచ్ వివరించారు. అప్పుడు జట్టు సీనియర్లు, యువకుల మేళవింపుతో సమతూకంగా ఉంటుందని దక్షిణాఫ్రికాకు చెందిన కోచ్ క్రెయిగ్ చెప్పారు. ‘భారత జట్టుకు వరుస టోర్నీలు ఆడిన అనుభవం ఇదివరకు ఉంది. అజ్లాన్ షా, దక్షిణాసియా క్రీడలు, ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ ఇలా గతంలో పెద్ద పెద్ద టోర్నీలెన్నో ఆడింది. కాబట్టి పని ఒత్తిడి భారం అనే సమస్యయితే ఉండదు. జూన్లో హాకీ ప్రొ లీగ్ జరుగుతుంది. ఇది ముగిసిన వెంటనే ప్రపంచకప్లో బరిలోకి దించే జట్టుపై తుది కూర్పు పూర్తవుతుంది. అలా ఎంపికైన జట్టే బెల్జియం–నెదర్లాండ్స్కు వెళుతుంది. ఆ తర్వాత జపాన్కు బయల్దేరుతుంది’ అని క్రెయిగ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. బెల్జియం, నెదర్లాండ్స్ ఉమ్మడిగా నిర్వహించబోయే ప్రపంచకప్ హాకీ ఈవెంట్ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. ఇది ముగిసిన మూడు వారాల్లోపే సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. జపాన్ ఈవెంట్ లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్కు క్వాలిఫయర్స్గా జరుగబోతుంది.
కరోలినా మారిన్ వీడ్కోలు
మాడ్రిడ్: బ్యాడ్మింటన్కు అంతగా ఆదరణ లేని దేశం ను...
పాక్పై భారత్దే పైచేయి
మాలే (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (...
‘ఆసియా’ పతకమే బాకీ ఉంది
రాయ్పూర్: ఒలింపిక్స్లాంటి ప్రతిష్టాత్మక విశ్వక్...
బెంగళూరు ఎఫ్సీ హెడ్ కోచ్గా మునోజ్
బెంగళూరు: స్పెయిన్ చెందిన పెప్ మునోజ్ను బెంగళూర...
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఆర్సీబీకి భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుం...
ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం?
ఐపీఎల్-2026 సీజన్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్రైజ...
ధోనికి హ్యాట్సాఫ్.. మరో పదేళ్లు ఆడాలి: యోగ్ రాజ్ సింగ్
ఐపీఎల్-2026కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం(మా...
హార్దిక్ పాండ్యా మంచి మనసు.. ఆ 11 మందికి?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్...
క్రీడలు
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
వీడియోలు
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
ఐపీఎల్ తొలి మ్యాచ్ లో RCBతో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
అభిషేక్, ఇషాన్ కాదు.. SRH X ఫ్యాక్టర్ అతనే
బెంగళూరులో ల్యాండ్ అయిన పాట్ కమ్మిన్స్.. ఇక RCB కి చుక్కలే
సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసేటోడు ఇంకా పుట్టలే..! రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.
మాతో పెట్టుకోవద్దు.. పాక్కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్
అమ్మకంలో కూడా తగ్గని క్రేజ్... RCB టీమ్ కొత్త ఓనర్ ఎవరంటే..?
ప్యాట్ కమిన్స్ దూరం.. SRH కెప్టెన్ గా ఇషాన్ కిషన్..
CSK డెన్ లోకి చెట్టా గ్రాండ్ ఎంట్రీ
