ప్రధాన వార్తలు
WI vs ZIM: జింబాబ్వేపై వెస్టిండీస్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశలో జింబాబ్వేపై వెస్టిండీస్ జట్టు 107 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసింది. షిమ్రోన్ హెట్మయెర్: 85 పరుగులు (34 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్లు), రోవ్మన్ పావెల్: 59 పరుగులు (35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) , చివర్లో షెర్ఫానె రూథర్ఫోర్డ్ (31), రొమారియో షెఫర్డ్ (21), జాసన్ హోల్డర్ (13) వేగంగా ఆడి స్కోరును భారీగా పెంచారు. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (9), షై హోప్ (14) విఫలమయ్యారు. భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఇవాన్స్ (43; 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లు) మాత్రమే చేశాడు. డియోన్ మైయర్స్ (28), సికిందర్ రజా (27) కొంతమేర సహకరించారు. ఒక దశలో 103 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను ఇవాన్స్ మెరుపులు కొంత ముందుకు నెట్టాయి. విండీస్ బౌలర్లలో గుడాకేష్ మోటి: 4 వికెట్లు, అకిల్ హోస్సేన్: 3 వికెట్లు, మాథ్యూ ఫోర్డ్: 2 వికెట్లు, జాసన్ హోల్డర్: 1 వికెట్ తీశారు. ఈ విజయంతో వెస్టిండీస్ సూపర్-8లో తమ స్థాయిని మరింత బలపరుచుకుంది. జింబాబ్వే బౌలర్లలో ఎన్గరవా, ముజరబాని చెరో 2 వికెట్లు, బ్రాడ్ ఇవాన్స్, క్రెమెర్ చెరో వికెట్ తీశారు.
వెస్టిండీస్ బ్యాటర్ల విధ్వంసం.. ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్లు బ్రాండెన్ కింగ్(9), షాయ్ హోప్(14) విఫలమైనప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్లు మాత్రం విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా షెమ్రాన్ హెట్మైర్ అయితే జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన హెట్మైర్ కేవలం బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.మొత్తంగా 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్మైర్.. 7 ఫోర్లు, 7 సిక్స్లతో 85 పరుగులు చేశాడు. అతడితో పాటు రావ్మన్ పావెల్(59), రూథర్ ఫర్డ్(31), షెఫర్డ్(21) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. జింబాబ్వే బౌలరల్లో నగారవ, ముజర్బానీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. క్రీమర్, ఎవెన్స్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం.
చరిత్ర సృష్టించిన హెట్మైర్.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 ప్రపంచకప్-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్మైర్ విధ్వంసం సృష్టించాడు. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో క్రీజులోకి వచ్చిన హెట్మైర్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు.జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా కెప్టెన్ సికిందర్ రజాకు అయితే చుక్కలు చూపించాడు. 8వ ఓవర్ వేసిన రజా బౌలింగ్లో హెట్మైర్ ఏకంగా మూడు సిక్స్లతో 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హెట్మైర్ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా హెట్మైర్ టీ20 ప్రపంచకప్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన విండీస్ ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు.వెస్టిండీస్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు. ఇదే టోర్నీలోహెట్మైర్ స్కాట్లాండ్పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు కేవలం 19 బంతుల్లోనే ఆర్ధం శతకం బాదేశాడు.ఓవరాల్గా ఈ మ్యాచ్లో కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్మైర్.. 7 ఫోర్లు, 7 సిక్స్లతో 85 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో రెండు సార్లు హెట్మైర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రెండు సులువైన క్యాచ్లను జింబాబ్వే ఫీల్డర్లు జారవిడిచారు. ఇందుకు జింబాబ్వే భారీ మూల్యం చెల్లించుకోంది.
'వరల్డ్కప్ ఒక ఫారెస్ట్ లాంటిది.. వారిద్దరి ఆట తీరు మారాలి'
టీ20 వరల్డ్కప్-2026లో టీమిండియా యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. అభిషేక్ శర్మ వరుసగా మూడు డకౌట్లు కాగా.. తిలక్ కూడా తన జిడ్డు బ్యాటింగ్తో తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఆదివారం అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ 13 పరుగులు చేయగా, తిలక్ డకౌటయ్యాడు. ఇప్పటివరకు తిలక్ ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో 21.40 సగటుతో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు.అతని స్ట్రైక్ రేట్ 119 కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై భారత మాజీ క్రికెటర్ సదాగోపన్ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతే ఇటువంటి ఫలితాలే ఎదురవతాయని అతడు హెచ్చరించాడు."అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు వారు చూసింది కేవలం గార్డెన్ మాత్రమే, కానీ ప్రపంచకప్ అనేది ఒక అడవి లాంటిది. ఇక్కడ వేటాడాలి, లేదంటే మీరే బలి అవుతారు. ఇటువంటి ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానిని తట్టుకుని ఆడడం నేర్చుకోవాలి" అని రమేష్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.ఇక డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ తమ తొలి సూపర్-8 మ్యాచ్లోనే ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. భారత్ సెమీస్కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలో భారీ తేడాతో విజయం సాధించాలి.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ మొన్జురుల్ ఇస్లాంపై వేటు వేసింది. తమ పరిధిలోకి వచ్చే క్రికెట్ సంబంధిత వ్యవహారాలన్నింటికీ దూరంగా ఉండాలని అతడిని ఆదేశించింది. ఈ మేరకు అతడిపై నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది.అసలేం జరిగిందంటే.. ప్రపంచకప్-2022 సందర్భంగా మొన్జురుల్ ఇస్లాం తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బంగ్లా మహిళా క్రికెట్ జట్టు నాటి కెప్టెన్ జహనారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. స్వతంత్ర విచారణ కమిటీఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన బోర్డు.. ఆదివారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. షేర్-ఏ- బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో సమావేశమైన బోర్డు సభ్యులు.. స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించారు.జహనారా ఆరోపించినట్లుగానే మొన్జురెల్కు సంబంధించి తమకు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ‘‘బీసీబీ నియమించిన స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు... మహిళా జట్టు కెప్టెన్ జహనార ఆలం ఆరోపణలు నిజమేనని తేలాయి.నిషేధం విధిస్తున్నాంఈ క్రమంలో మొన్జురుల్ ఇస్లాంపై నిషేధం విధిస్తున్నాం. బీసీబీ పరిధిలోని క్రికెట్ సంబంధిత వ్యవహారాలతో ఇకపై అతడికి ఎలాంటి సంబంధాలు ఉండవు. కమిటీ చేసిన సిఫారసులను బీసీబీ సమీక్షిస్తుంది. ఈ విషయంలో అదనపు చర్యలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తాం’’ అని బీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది.కాగా బంగ్లాదేశ్ మహిళల జట్టు సెలక్టర్, మేనేజర్గా మొన్జురుల్ వ్యవహరించాడు. గతేడాది జూన్ 30న అతడి పదవీకాలం ముగిసింది. ఇదిలా ఉంటే.. మహిళా జట్టు సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ ఘాజి ఆష్రఫ్ హొసేన్ పదవీకాలాన్ని నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బీసీబీ ఈ సందర్భంగా వెల్లడించింది. ఘాజి స్థానాన్ని త్వరలోనే భర్తీ చేస్తామని.. అందుకోసం కాస్త సమయం పడుతుంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.చారిత్రాత్మక ముందుడుగుబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక ముందడుగు వేసింది. మహిళల క్రికెట్ను ప్రోత్సహించే క్రమంలో వుమెన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (WBPL) నిర్వహణకు పచ్చజెండా ఊపింది. తొలి ఎడిషన్కు ఏప్రిల్ 4- 14 వరకు షెడ్యూల్ ఫిక్స్ చేయగా.. బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఢాకా, ఛట్టోగ్రామ్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా స్టార్
అతడొక అద్భుతం.. కానీ: పాక్ మాజీ క్రికెటర్ యూటర్న్
టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. కెరీర్లో తొలిసారి వరల్డ్కప్ ఈవెంట్లో ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.హ్యాట్రిక్ డకౌట్లులీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లతో ఆడిన మ్యాచ్లలో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ అభిషేక్ బ్యాటింగ్ శైలిని విమర్శించాడు. కేవలం పవర్ హిట్టింగ్పైనే ఆధారపడతాడని.. అతడి టెక్నిక్ సరిగ్గా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా అతడిని ‘స్లాగర్’గా అభివర్ణించాడు.పరుగులు చేయాలనే తొందరలో వికెట్ పారేసుకుంటున్నాడని.. టెక్నిక్తో ఆడటం అతడికి చేతకాదని ఆమిర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీమిండియా అభిమానులు అతడిపై ఫైర్ అయ్యారు. అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ప్రపంచ నంబర్వన్ బ్యాటర్ అని.. ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమంటూ భారత ఆటగాడికి మద్దతుగా నిలిచారు.మరోసారి విఫలంఇక సూపర్-8 దశలో తొలి మ్యాచ్లోనూ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి పోరులో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 12 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది 15 పరుగులు చేశాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్లో కార్బిన్ బాష్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఆమిర్ యూటర్న్!ఈ నేపథ్యంలో మహ్మద్ ఆమిర్ మరోసారి అభిషేక్ శర్మ గురించి వ్యాఖ్యలు చేశాడు. తన మాటలను అందరూ అపార్థం చేసుకున్నారంటూ యూటర్న్ తీసుకున్నాడు. ‘‘బౌలర్ వైపు నుంచి నేను అభిషేక్ శర్మ ఆటను విమర్శించాను. అతడి టెక్నిక్ గురించి మాత్రమే నేను మాట్లాడాను.కానీ నేను స్లాగర్ అన్న పదం వాడటం చాలా మందికి నచ్చలేదు. పటిష్ట జట్టు, బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కాస్త ఓపికగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే అభిషేక్ శర్మ బలహీనత ఏమిటో అందరికీ తెలిసిపోయింది. వాళ్లు అతడిని ఈజీగా ట్రాప్ చేయగలరు.అద్భుతమైన నైపుణ్యాలు.. కానీతాజా మ్యాచ్లో అతడు పద్నాలుగు పరుగులను ఒకే వైపు నుంచి రాబట్టాడు. అవి కూడా చెత్త బంతుల ద్వారా వచ్చిన పరుగులే. రబడ బౌలింగ్ మొదలుపెట్టాగానే.. అభిషేక్ శర్మ తెల్లముఖం వేశాడు.సీనియర్ ఆటగాడిగా నేను అభిషేక్ శర్మకు ఓ సలహా ఇస్తున్నా. నీ టెక్నిక్ గురించి ప్రత్యర్థులకు తెలిసిపోయింది. కాస్త ఓపికగా ఉండి.. బంతి ఎలా వస్తుందో అర్థం చేసుకుని ఆడితే నువ్వు మళ్లీ మునుపటిలా విజృంభించగలవు.అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని అతడు ఎలా ఉపయోగించుకుంటాడన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఇదే. కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని మహ్మద్ ఆమిర్ చెప్పుకొచ్చాడు. చదవండి: కెప్టెన్, హెడ్కోచ్ ఏం చేస్తున్నారు?.. భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం
వెస్టిండీస్తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా ముంబై వేదికగా వెస్టిండీస్, జింబాబ్వే జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సూపర్-8 పోరులో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి.జింబాబ్వే జట్టులోకి నగరవ రాగా.. విండీస్ జట్టులోకి రొమారియో షెపర్డ్ వచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఇరు జట్లు కూడా అజేయంగా నిలిచాయి. మరి సూపర్-8లో ఎవరు బోణీ కొడతారో వేచి చూడాలి.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, టోనీ మునియోంగా, తాషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గరవ, బ్లెస్సింగ్ ముజారబానీవెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్
సఫారీ బ్యాటర్తో సుందర్ ఫైట్.. కారణమిదే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 188 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. లక్ష్య చేధనలో మెన్ ఇన్ బ్లూ 111 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, సఫారీ సూపర్ స్టార్ డేవిడ్ మిల్లర్ మధ్య వాగ్వదం చోటు చేసుకుంది.అసలేమి జరిగిందంటే?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసేందుకు కెప్టెన్ సూర్యకుమార్ స్పిన్నర్ సుందర్ను ఎటాక్లోకి తీసుకొచ్చాడు. అయితే నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న డేవిడ్ మిల్లర్ క్రీజు వదిలి ముందుకు రావడంపై సుందర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అవుట్ఫీల్డ్ గ్రాస్ కాస్త తడిగా ఉండడంతో, పరుగు తీసేటప్పుడు జారిపోకుండా ఉండేందుకు మిల్లర్ క్రీజు లైన్ అంచున నిలబడ్డాడు.దీంతో బౌలింగ్ వేసే క్రమంలో సుందర్ మధ్యలోనే ఆగిపోయి, మిల్లర్ క్రీజు దాటుతున్నాడంటూ అంపైర్ క్రిస్ గఫానీకి ఫిర్యాదు చేశాడు. ఇది 'మన్కడింగ్' (రనౌట్)లా అన్పించింది. దీంతో మిల్లర్ అసహనం వ్యక్తం చేస్తూ ఏదో ఉన్నాడు. ఓవర్ ముగిసిన తర్వాత కూడా వారిద్దరి మధ్య మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.The zen masters lost it! Miller vs Sundar explodes 🤬Both are usually the calmest on the field, but this time even they couldn’t keep their cool 🔥 Backing up too far?#INDvsSA #CricketFever #T20WorldCup2026 #Cricket pic.twitter.com/OWStXaB1PY— Cricket Update (@sportshourly) February 23, 2026 మిల్లర్ నేరుగా సుందర్ వద్దకు వెళ్లి సీరియస్గా మాట్లాడు. అంపైర్లు వెంటనే జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో సుందర్ బంతితో పాటు బ్యాట్తో కూడా విఫలమయ్యాడు. ఈ ఓటమితో భారత్ తమ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.
మీ వల్లే ఈ ఓటమి: భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో భారత్కు కనీవినీ ఎరుగని పరాజయం ఎదురైంది. టీ20 వరల్డ్కప్-2026 ఈవెంట్లో టీమిండియా అవమానకర రీతిలో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. సూపర్-8 కీలక మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఓటమిపాలై.. పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.ఊహించని షాక్ఈ నేపథ్యంలో టీమిండియా నాయకత్వ బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను తుదిజట్టులో ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా స్పందించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది ఊహించని షాక్. తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది సాధారణ ఓటమి కాదు. వాళ్లు మనల్ని చిత్తు చిత్తుగా ఓడించారు. సౌతాఫ్రికా టీమిండియాపై భారీ విజయం సాధించింది.కెప్టెన్, హెడ్కోచ్ ఏం చేస్తున్నారు?ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ను సఫారీ బ్యాటర్లు అటాక్ చేసిన తీరు మరీ ఘోరం. ఇందుకు కెప్టెన్, హెడ్కోచ్ జవాబుదారులుగా ఉండాలి. యాజమాన్యంతో పాటు ఆటగాళ్లు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టారు.అహంకారం వద్దునెట్ రన్ రేటు గురించి ఆలోచనే లేదు. సెలక్షన్ విషయంలోనూ తప్పులు. మనవాళ్ల బ్యాటింగ్ శైలి ఏమాత్రం సరిగ్గాలేదు. వీటన్నిటికీ యాజమాన్యం సమాధానం చెప్పాలి. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య సన్నని రేఖ మాత్రమే ఉంటుంది. టీమిండియా దానిని తుడిచివేసేలా కనిపిస్తోంది’’ అంటూ తీవ్ర స్థాయిలో బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో టీమిండియా సమిష్టిగా విఫలమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: T20 WC 2026: టీమిండియాలో కలకలం
మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే తన ప్రేయసి, మోడల్ మహీక శర్మ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు ఈ బరోడా క్రికెటర్.ప్రేయసికి 25 కానుకలుమహీక 25వ బర్త్డే సందర్భంగా ఆమెను కానుకలతో ముంచెత్తాడు. ఈ విషయాన్ని మహీక స్వయంగా వెల్లడించింది. తనకు హార్దిక్ పాండ్యా 25 బహుమతులు ఇచ్చాడని.. ఈ పుట్టినరోజును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది.కాగా గత కొంతకాలంగా మహీకతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న హార్దిక్ పాండ్యా.. తన కుమారుడు అగస్త్యను మాత్రం దూరం పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది అతడిని ట్రోల్ చేశారు. మాజీ భార్య నటాషా స్టాంకోవిక్తో పాటు.. కుమారుడు అగస్త్యను కూడా పూర్తిగా మర్చిపోయాడని నిందించారు.రూ. 4 కోట్ల విలువైన కారుఅలాంటి వాళ్లకు దిమ్మదిరిగేలా హార్దిక్ పాండ్యా తన చేష్టలతో కౌంటర్ ఇచ్చాడు. నటాషాతో విడిపోయినప్పటికీ ఆమె పట్ల ఆప్యాయతను కనబరిచాడు. నటాషా, అగస్త్య కోసం ఖరీదైన కారును హార్దిక్ పాండ్యా కొనుగోలు చేశాడు. రూ. 4 కోట్ల విలువైన లాండ్ రోవర్ డిఫెండర్ను అగస్త్య, నటాషాలకు బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.కాగా సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించిన హార్దిక్ పాండ్యా 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి కుమారుడు అగస్త్య జన్మించాడు. ఆ తర్వాత కుమారుడి సమక్షంలో హిందూ, క్రిస్టియన్సంప్రదాయాల ప్రకారం మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేశారు.తల్లి దగ్గరే ఎక్కువగా..అయితే, అనూహ్య రీతిలో 2024లో తాము విడిపోయినట్లు ప్రకటించారు నటాషా- హార్దిక్. ఆ తర్వాత మహీకతో తాను ప్రేమలో ఉన్నట్లు హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా పోస్టుల ద్వారా స్పష్టం చేశాడు. అయితే, విడిపోయినప్పటికీ అగస్త్యకు తల్లిదండ్రులుగా ఉంటామని నటాషా- హార్దిక్ ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. అందుకు తగ్గట్లుగానే కుమారుడి బాధ్యతను ఇద్దరూ పంచుకుంటున్నారు. అయితే, తల్లి దగ్గరే అగస్త్య ఎక్కువగా ఉంటున్నాడు.ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉన్నాడు. చివరగా నిన్న (ఆదివారం) సౌతాఫ్రికాతో మ్యాచ్లో పాండ్యా టీమిండియా తరఫున బరిలో దిగాడు. అటు బౌలర్గా.. ఇటు బ్యాటర్గా అతడు విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్లో 45 పరుగులు ఇచ్చిన హార్దిక్.. బ్యాటింగ్లో 17 బంతుల్లో 18 పరుగులే చేయగలిగాడు.చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్
పాక్ కెప్టెన్పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మాద్ బ...
రుతుజా జోడీ ఓటమి
దుబాయ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ ...
హర్మన్ప్రీత్ దూరం
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన పురుషుల ప్రొ లీగ్ తొ...
బెల్జియం చేతిలో భారత్ ఓటమి
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భారత జట్టుక...
వెస్టిండీస్తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా ముంబై వ...
సఫారీ బ్యాటర్తో సుందర్ ఫైట్.. కారణమిదే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరి...
మీ వల్లే ఈ ఓటమి: భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో భారత్కు కనీవ...
మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆట...
క్రీడలు
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
వీడియోలు
కొంపముంచిన గంభీర్
సూపర్ 8లో హై ఓల్టేజ్ ఫైట్..! ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
టీ20 ప్రపంచ కప్ లో నేడు కీలక మ్యాచ్
ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
భారత్ కు మహాశివరాత్రి.. పాక్ కు కాళరాత్రి...
