Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

SRH predicted XI vs RCB, IPL 20261
ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు ఇదే.. వికెట్ల వీరుడు అరంగేట్రం?

ఐపీఎల్‌-2026 సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. మార్చి 28న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎస్‌ఆర్‌హెచ్ ఢీకొట్టనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఆరెంజ్ ఆర్మీ అన్ని విధాల సిద్దమైంది.అయితే ఈ మ్యాచ్‌కు రెగ్యులర్‌ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులో లేడు. దీంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం.గత ఏడాదిలాగే ఎస్‌ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ తమ టాప్ ఆర్డర్‌ను కొనసాగించనుంది. ఓపెనర్లుగా విధ్వంసకర ప్లేయర్లు ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శర్మలు బరిలోకి దిగనున్నారు. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో ఇషాన్ కిషన్‌, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ రానున్నారు. కిషన్ గత సీజన్‌లో మూడో స్ధానంలోనే బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతమైన సెంచరీ సాధించాడు.ఇక ఐదో స్ధానంలో హెన్రిచ్ క్లాసన్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్‌రౌండర్‌ లివింగ్‌స్టోన్‌, అనికేత్ వర్మలు ఫినిషర్ పాత్రను పోషించనున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే ప్యాట్ కమ్మిన్స్ స్ధానాన్ని ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్‌తో భర్తీ చేసే సూచనలు కన్పిస్తున్నాయి.దూబే అరంగేట్రం?కార్స్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించగలడు. హర్షల్ పటేల్, శివమ్ మావి, జయదేవ్ ఉనద్కత్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అదేవిధంగా విధ‌ర్బ స్పిన్న‌ర్ హ‌ర్ష్ దూబే ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది. అయితే గ‌త సీజ‌న్‌లో ఆక‌ట్టుకున్న జేషాన్ అన్సారీ కూడా తుది జ‌ట్టు రేసులో ఉన్నాడు.కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజ‌న్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఒక రంజీ సీజ‌న్‌లో అత్య‌ధిక వికెట్లు(69) వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. దీంతో గ‌తేడాది జ‌రిగిన మినీ వేలంలో రూ.30 ల‌క్ష‌ల బేస్‌ప్రైస్‌కు అత‌డిని ఎస్ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది.ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు ఇదేట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్‌, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, శివమ్ మావిచదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌తో ఎంట్రీ?

Who The Hell Are People To Tell MS Dhoni: Yograj Singh2
ధోనికి హ్యాట్సాఫ్.. మరో పదేళ్లు ఆడాలి: యోగ్ రాజ్ సింగ్

ఐపీఎల్‌-2026కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం(మార్చి 28) ఈ నుంచి ధానాధన్‌ క్రికెట్ లీగ్ షూరు కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే అందరి దృష్టి టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోనిపైనే ఉంది.42 ఏళ్ల ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ కానుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని, తన రిటైర్మెంట్ గురించి అనవసర చర్చలు పెడుతున్నారని యోగ్‌రాజ్ మండిపడ్డాడు."ధోని ఫిట్‌గా కన్పిస్తున్నాడు. ప్రతీ సీజన్‌లోనూ సరైన క్రమశిక్షణ, అంకితభావంతో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటున్నాడు. ఇప్పటికీ అతడిలో ఏ మాత్రం పవర్ తగ్గలేదు. అతడి మోచేతి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ధోని ఒక అద్భుతం. అతడు రిటైర్ అవ్వాలని చెప్పడానికి అసలు వీళ్లెవరు? అనవసర చర్చలు పెడుతున్నారు. అతడు మరో పదేళ్లు ఆడాలి. క్రికెట్ పరంగా ధోనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అని ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ పేర్కొన్నాడు. అయితే వీలు చిక్కినప్పుడల్లా ధోనిపై విమర్శలు గుప్పించే యోగ్‌రాజ్.. ఈసారి మిస్టర్ కూల్‌కు మద్దతుగా నిలవడం గమనార్హం.మరోవైపు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోని భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్‌కేకు వచ్చిన సంజూ శాంసన్ధో.. ధోనికి సరైన వారసుడని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 30న రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. సీఎస్‌కే జట్టు కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు.చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌తో ఎంట్రీ?

Hardik Pandya Heavily Rewards Wankhede Staff3
హార్దిక్ పాండ్యా మంచి మ‌న‌సు.. ఆ 11 మందికి?

ఐపీఎల్‌-2026 సీజ‌న్ ఆరంభానికి ముందు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌, భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని గ్రౌండ్ స్టాఫ్ ఒక్కొక్కరికి రూ.10,000 రూపాయల రివార్డును అందజేశాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు హార్దిక్ పాండ్యా వాంఖడే స్టేడియంలో తీవ్రంగా శ్రమించాడు. ఆ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ తమ పనివేళల కంటే అదనంగా శ్రమించి హార్దిక్ ప్రాక్టీస్‌కు సహకరించారు. దీంతో వారందరికీ నగదు బహుమతి ఇస్తానని పాండ్యా మాటిచ్చాడు.ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం​ హార్దిక్ వారిని వ్యక్తిగతంగా కలిసి మొత్తం 11 మందికి చెక్కులను అందజేశాడు. అయితే తొలుత ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఇచ్చారని ప్రచారం జరిగినప్పటికీ, వాస్తవానికి అది రూ. 10,000 మాత్రమే అని తేలింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో గ్రౌండ్ స్టాప్ కష్టాన్ని గుర్తించింనందుకు పాండ్యాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్.. ఇప్పుడు ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టును పాండ్యా నడిపించనున్నాడు. ముంబై తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29 వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌తో ఎంట్రీ?

Vaibhav Suryavanshi now officially eligible to make international debut for India4
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌తో ఎంట్రీ?

వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫుట్‌బాల్ ప్రపంచంలో లామిన్ యమల్ ఎంతటి సంచలనమో.. ఇప్పుడు క్రికెట్ వరల్డ్‌లో వైభవ్ కూడా అంతే ఫేమస్‌. కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయిలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం తన బ్యాటింగ్‌తో వణికిస్తున్న ఈ బిహార్ ఆటగాడు.. నేడు తన 15వ పుట్టిన రోజును జరపునకుంటున్నాడు. దీంతో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసేందేకు అర్హత సాధించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కనీసం 15 ఏళ్లు నిండి ఉండాలి. ఇప్పుడు సరిగ్గా ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఒక్క రోజు ముందే తన 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో సీనియర్ జట్టు తరుపున ఆడేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు.వైభ‌వ్ జోరు కొన‌సాగుతుందా?త‌న అరంగేట్ర ఐపీఎల్ సీజ‌న్‌లో దుమ్ములేపిన వైభ‌వ్ ఇప్పుడు.. ఐపీఎల్ 2026లో ఎలా రాణిస్తాడో అని అంద‌రూ అతృతగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్‌లో వైభవ్ తన ఆడిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. అది కూడా శార్ధూల్ ఠాకూర్ వంటి సీనియర్ బౌలర్ బౌలింగ్‌లో కావడం గమనార్హం. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో 35 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్‌.. ఐపీఎల్ చరిత్రలో శతక్కొట్టిన అతి పిన్న వయష్కుడిగా రికార్డులెక్కాడు. అనంతరం అండర్‌-19 ప్రపంచకప్‌లోనై ఈ యువ సంచలనం సత్తాచాటాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో భారీ సెంచరీ వైభవ్‌(175) చెలరేగాడు. ఇప్పుడు అదే జోరును ఈ ఏడాది ఐపీఎల్‌లో కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.డేంజర్‌లో సచిన్ రికార్డు!భార‌త్ త‌ర‌పున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న‌వ‌య‌ష్కుడిగా రికార్డు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ క‌లిగి ఉన్నాడు. స‌చిన్ 16 ఏళ్ల 205 రోజుల్లో టీమిండియా త‌ర‌పున డెబ్యూ చేశాడు. ఇప్పుడు ఈ క్రికెట్ దేవుడు రికార్డు డేంజ‌ర్‌లో ప‌డింది. వైభ‌వ్ సూర్య‌వంశీ ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో జ‌ర‌గనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసే అవ‌కాశ‌ముంది. ఐపీఎల్ త‌ర్వాత టీమిండియా రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. అనంత‌రం అక్క‌డ నుంచి ఇంగ్లండ్ టూర్‌కు మెన్ ఇన్ బ్లూ వెళ్ల‌నుంది. అయితే టీమిండియా బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఐరీష్ టూర్‌కు అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ వంటి ప్లేయ‌ర్ల‌కు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో 15 ఏళ్ల వైభ‌వ్ సూర్యవంశీకి భార‌త సీనియ‌ర్ జ‌ట్టు నుంచి పిలుపు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఇదే జ‌రిగితే భార‌త్ త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన అతి పిన్న వ‌య‌ష్కుడిగా వైభ‌వ్ చ‌రిత్ర సృష్టించనున్నాడు. ఒక‌వేళ ఐర్లాండ్ టూర్‌కు ఎంపిక కాకపోయినా.. ఈ ఏడాది ఆఖరిలో జరిగే ఏషియన్ గేమ్స్‌లోనైనా అతడు భారత్ తరపున డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది.చదవండి: Evin Lewis: విండీస్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

Aryna Sabalenka And Coco Gauff Reaches Miami Tennis Open Final5
సబలెంకాతో పోరుకు సిద్ధమైన గాఫ్‌

మియామి ఓపెన్ మాస్ట‌ర్స్ టెన్నిస్ టోర్నీలో మ‌హిళ‌ల ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ అరీనా స‌బ‌లెంకా ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. శుక్ర‌వారం మ‌హిళ‌ల సింగిల్స్ సెమీఫైన‌ల్లో స‌బ‌లెంకా 6-4, 6-3తో మూడో సీడ్ రిబాకినా (క‌జ‌కిస్థాన్‌)పై సునాయాస విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. కేవ‌లం రెండు సెట్ల‌లోనే ముగిసిన మ్యాచ్‌లో స‌బ‌లెంకా ఆద్యంతం ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. గంటా 19 నిమిషాల పాటు సాగిన పోరులో స‌బ‌లెంకా 30 విన్న‌ర్లు, 9 ఏస్‌లు సంధించ‌గా.. రిబాకినా 2 ఏస్‌లు మాత్ర‌మే సంధించి 15 విన్న‌ర్ల‌కే ప‌రిమిత‌మైంది. తొలుత మ్యాచ్‌లో రిబాకినా 3-1తో స‌బ‌లెంకాపై ఆధిప‌త్యం క‌న‌బ‌రించింది. కానీ వ‌రుస‌గా రెండుసార్లు రిబాకినా సర్వీస్‌ను బ్రేక్ స‌ఫ‌ల‌మైన స‌బ‌లెంకా ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. మ‌రో సెమీఫైన‌ల్లో అమెరికా న‌ల్ల‌కలువ కోకో గాఫ్ 6-1, 6-1తో చెక్ రిప‌బ్లిక్‌కు చెందిన క‌రోలినా ముచోవాను చిత్తుగా ఓడించి తుది పోరులో అడుగుపెట్టింది. రేపు జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో స‌బ‌లెంకాతో కోకో గాఫ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక స‌బ‌లెంకా మియామి ఓపెన్ ఫైన‌ల్స్‌కు చేర‌డం ఇది వ‌రుస‌గా రెండోసారి. గ‌తంలో రిబాకినా 2023, 2024లో వ‌రుస‌గా ఫైన‌ల్ చేరింది. అంత‌క‌ముందు సెరెనా విలియ‌మ్స్ 2013 నుంచి 2015 మ‌ధ్య వ‌రుస‌గా మియామి ఓప‌న్‌లో ఫైన‌ల్ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. స‌బ‌లెంకా, గాఫ్‌లు 2020లో తొలిసారి ఫైన‌ల్లో ఎదురుప‌డ్డారు. ఆ త‌ర్వాత జ‌రిగిన పోరులో ఇద్ద‌రు చెరో 6 విజ‌యాలతో స‌మానంగా ఉన్నారు. గాఫ్ రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్లో స‌బ‌లెంకాను ఓడించి చాంపియ‌న్‌గా నిలిచింది. ఈ రెండు సంద‌ర్భాల్లోనూ గాఫ్ మూడు సెట్ల‌లోనే స‌బ‌లెంకాను ఓడించ‌డం విశేషం.చదవండి: విండీస్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

West Indies Cricketer Evin Lewis Reverses International Retirement6
విండీస్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

వెస్టిండీస్ సీనియర్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఎవిన్ లూయిస్‌కు చోటు దక్కలేదు. దీంతో 34 ఏళ్ల ఎవిన్ లూయిస్ ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన లూయిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు తరఫున నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. త‌న కెరీర్‌లో కేవ‌లం వైట్‌బాల్ క్రికెట్ (వ‌న్డే, టీ20 ఫార్మాట్‌)కే ప‌రిమిత‌మైన లూయిస్ తాజాగా తొమ్మిదేళ్ల తర్వాత రెడ్‌బాల్ క్రికెట్ (టెస్టు ఫార్మాట్‌)లోనూ తాను ఆడాలనుకుంటున్న‌ట్లు మ‌న‌సులోని మాట‌ను బయటపెట్టాడు. అయితే ఫ‌స్ట్‌క్లాస్ కెరీర్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో త‌ర‌ఫున ఎవిన్ లూయిస్ 22 మ్యాచ్‌ల్లో 1,229 ప‌రుగులు సాధించాడు. 2016లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఎవిన్ లూయిస్ 67 వ‌న్డేల్లో 2,175 ప‌రుగులు చేశాడు. 65 టీ20 మ్యాచ్‌ల్లో 1,782 ప‌రుగులు సాధించాడు. ఇందులో వ‌న్డేల్లో 5 శ‌త‌కాలు, టీ20ల్లో రెండు సెంచ‌రీలు సాధించాడు. 2016 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన విండీస్ జ‌ట్టులో ఎవిన్ లూయిస్ స‌భ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో 176 ప‌రుగుల వ‌ద్ద రిటైర్డ్ హ‌ర్ట్ అయిన క్రికెట‌ర్‌గా లూయిస్ రికార్డుల‌కెక్కాడు. ఇక అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో విండీస్ త‌ర‌ఫున అత్య‌ధిక స్కోరు (125 నాటౌట్‌) సాధించిన ఆట‌గాడిగాను రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.చదవండి: సంచ‌ల‌నాల సూర్య‌వంశీ!

Happy Birthday Vaibhav Sooryavanshi: Set For Another Stellar IPL Season7
సంచ‌ల‌నాల సూర్య‌వంశీ!

అత‌డు కూడా అంద‌రిలా సాధార‌ణంగా క్రికెట్ ఆడుకుంటూ పోతే పెద్ద‌గా గుర్తింపు వ‌చ్చేది కాదేమో. కానీ 12 ఏళ్ల‌కే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి ఆడ‌కముందే రికార్డు సృష్టించాడు. ఇక బ్యాట్ ప‌ట్టి క‌ద‌నరంగంలోకి దూకిన త‌ర్వాత బ్యాట్‌కు అలుపొచ్చిందేమో కానీ అత‌డి పరుగుల దాహం కొనసాగుతూనే వస్తోంది.14 ఏళ్ల‌కే ఐపీఎల్‌లో అడుగుపెట్టి సంచ‌ల‌నం సృష్టించిన ఆ బుడ‌త‌డు ఇటీవ‌లే ముగిసిన అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టాడు. ఆ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో 55 బంతుల్లోనే 175 ప‌రుగులు సాధించి ఔరా అనిపించాడు. కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సులోనే ప‌వ‌ర్‌హిట్టింగ్‌తో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారాడు బీహార్ చిన్నోడు వైభ‌వ్ సూర్య‌వంశీ.ఇవాళ వైభవ్‌ సూర్యవంశీ 15వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నాడు. స‌చిన్ లాగే 15 ఏళ్ల వ‌య‌సులో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న వైభ‌వ్ సూర్య‌వంశీ కోరిక నెర‌వేరాల‌ని ఆశిద్దాం. హ్యాపీ బ‌ర్త్‌డే టూ వైభ‌వ్ సూర్య‌వంశీ..క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ మార్చి 27తో మ‌రో మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు వైభవ్ తన 15వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. గతేడాది 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బీహార్ కుర్రాడు, ఇప్పుడు 15వ ఏట అడుగుపెడుతూ మరింత జోరు చూపించడానికి సిద్ధమయ్యాడు.15వ పుట్టినరోజు సందర్భంగా వైభవ్ సూర్య‌వంశీ తన లక్ష్యాలను పంచుకున్నాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించడమే తన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న‌ 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలనేది త‌న చిర‌కాల కోరిక అని వైభ‌వ్ పేర్కొన్నాడు. త్వరలో జాతీయ జట్టులోకి..ఇప్ప‌టికే అండ‌ర్‌-19 జూనియ‌ర్ స్థాయి క్రికెట్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లోనే 175 ప‌రుగుల ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడి బీసీసీఐ సెలెక్ట‌ర్ల దృష్టిలో ప‌డ్డాడు. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక ఆట‌గాడు సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు క‌నీసం 15 ఏళ్లు ఉండాల‌న్న‌ది నిబంధ‌న‌. తాజాగా వైభ‌వ్ సూర్య‌వంశీ 15వ ఏట అడుగుపెట్ట‌డంతో సీనియ‌ర్ జ‌ట్టు లోకి తొంద‌ర్లోనే పిలుపు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అండ‌ర్‌-19 క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు వైభ‌వ్ సూర్య‌వంశీ 18 మ్యాచ్‌లు ఆడి 701 ప‌రుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచ‌రీలు, ఒక అర్థ‌సెంచ‌రీ ఉన్నాయి.హోంగ్రౌండ్‌లో వేడుకలు..ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తన మొదటి మ్యాచ్‌ను మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్‌కు ఇది రెండో హోమ్ గ్రౌండ్ కావడంతో జట్టు సభ్యులందరూ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వైభవ్ సూర్యవంశీ కూడా టీమ్‌తోనే ఉన్నాడు. దీంతో తన 15వ పుట్టినరోజు వేడుకలు తన జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ సొంత ఊరైన గౌహతిలోనే జరగనున్నాయి. వరుసగా రెండో ఏడాది వైభవ్ తన పుట్టినరోజును ఐపీఎల్ ఫ్రాంచైజీతో జరుపుకోవడం విశేషం.ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జ‌రిగిన వేలంలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇవ్వడంతోనే రికార్డు లిఖించాడు. ఆ త‌ర్వాత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అత‌డిని రూ. 1.1 కోట్ల‌కు ద‌క్కించుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచింది. ఆ సీజ‌న్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున 7 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, ఏకంగా 252 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉండటం విశేషం.ద్రవిడ్‌ పర్యవేక్షణలో..రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రస్తుతం వైభవ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. టీమ్ మెంటార్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో వైభవ్ తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. రియాన్ పరాగ్ వంటి యువ కెప్టెన్ తోడుండటంతో వైభవ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బర్త్‌డే వేడుకల అనంతరం వైభవ్ తిరిగి నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. రైతు కొడుకు నుంచి క్రికెటర్‌ దాకా..2011 మార్చి 27న బీహార్‌లోని తాజ్‌పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌పై వైభ‌వ్ పెంచుకున్న మ‌క్కువ‌ అతని తండ్రి సంజీవ్‌కి అర్థమైంది. వెంటనే తన ఇంటి వెనుక భాగంలో వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే స్వయంగా రోజంతా కష్టపడి ఆ స్థలం అంతా చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్‌ తయారు చేసి ఇచ్చాడు. అలా ఇంటి వెనుక వైభవ్‌ ఆడుకునే వాడు. అతనికి తొమ్మిది సంవత్సరాలు నిండగానే క్రికెట్‌ కోచింగ్‌ కోసం తమ ఊరికి దగ్గర్లోని సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో వైభవ్‌ను చేర్పాడు వాళ్ల నాన్న. తొమ్మిదేళ్ల కొడుకు క్రికెటర్‌గా ఎదుగుతాడనే నమ్మకంతో.. సంజీవ్‌ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వైభవ్‌ క్రికెట్‌ కోచింగ్‌ కోసం తన పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాడు.కొడుకు కోసం పొలం అమ్మి..ఆ పొలంపై తన కుటుంబం ఆధారపడి జీవిస్తుందనే విషయాన్ని కూడా పక్కనపెట్టి.. కొడుకు ఎదుగుదలనే నమ్మాడు. తన కొడుకు క్రికెట్ కలలను సాకారం చేసుకోవడానికి మోతీపూర్‌లోని తన పొలాన్ని అమ్మేశాడు. తండ్రి పొలం అమ్మిన విషయం తెలిసి వైభవ్‌ క్రికెట్‌ను ప్రాణం పెట్టి నేర్చుకున్నాడు. సమస్తిపూర్‌లో రెండున్నర సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16 ట్రయల్స్ ఇచ్చాడు వైభవ్‌. అదే సమయంలో మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా ఆధ్వర్యంలో వైభవ్‌కు మంచి క్వాలిటీ కోచింగ్‌ కూడా అందింది. ఆయన కోచింగ్‌ వైభవ్‌కు ఎంతో ప్లస్‌ అయింది. ఆ తర్వాతి చరిత్ర అందరికీ తెలిసిందే.A boy with a dream who picked up a bat and has made it his mission to achieve it all 🔥Today is your day, Vaibhav Sooryavanshi 💗🎂 pic.twitter.com/oEJWupOgXp— Rajasthan Royals (@rajasthanroyals) March 26, 2026Wishing a very happy birthday to our very own Boss Baby, Vaibhav Suryavanshi. He consistently delivers explosive performances and lights up the field with his dynamic play. All the very best for IPL 2026 Vaibhav.#Vaibhavsooryavanshi #happybirthdayVaibhavSooryavanshi pic.twitter.com/8yyl49eZTq— 𝐈𝐂𝐓 ᴬᵁᴿᴬ🇮🇳 (@AURAICTT) March 26, 2026చదవండి: భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టుకు అవ‌మానం!

Indian Football Players-Coach Denied Entry Stadium Over Payment Issue8
భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టుకు అవ‌మానం!

భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టుకు అవ‌మానం ఎదురైంది. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించ‌ని కార‌ణంగా ఆట‌గాళ్ల‌తో పాటు కోచ్‌ను స్టేడియంలోకి అనుమ‌తించ‌లేదు. ఏఎఫ్‌సీ ఆసియా క‌ప్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీలో భాగంగా మార్చి 31న కొచ్చిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ అంత‌ర్జాతీయ స్టేడియంలో హాంకాంగ్‌తో భార‌త జ‌ట్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశానికి కోచ్ ఖ‌లీద్ జ‌మీల్‌, ఆట‌గాళ్లు అషిక్ కురియ‌న్‌, స‌హ‌ల్ అబ్దుల్‌, బిజోయ్ వ‌ర్గీస్ స్టేడియానికి వ‌చ్చారు. కానీ గ్రేట‌ర్ కొచ్చిన్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీకి కేర‌ళ ఫుట్‌బాల్ సంఘం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించ‌క‌పోవ‌డంతో ఆట‌గాళ్ల‌ను, కోచ్‌ను లోపలికి వెళ్ల‌కుండా అధికారులు అడ్డుకున్నారు. అయితే మీడియా స‌మావేశానికి ముందు ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం త‌మ‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని కోచ్ ఖ‌లీద్ జ‌మీల్ తెలిపాడు. అయితే ద‌శాబ్ద కాలంలో కొచ్చిలో భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు మ్యాచ్ ఆడ‌నుండ‌డం ఇదే తొలిసారి. అయితే కోచ్‌, ఆట‌గాళ్ల‌ను అడ్డుకోవ‌డంపై కేర‌ళ ఫుట్‌బాల్ అసోసియేష‌న్ (కేఏఎఫ్‌) అధ్య‌క్షుడు న‌వాస్ మీర‌న్ స్పందించాడు. ‘ఆసియా క‌ప్ క్వాలిఫ‌య‌ర్ ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే జ‌రుగుతుంది. స‌మాచార లోపం వ‌ల్ల ఈ స‌మ‌స్య ఏర్ప‌డింది. దీనిని త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే నివేదికల ప్ర‌కారం స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు గ్రేట‌ర్ కొచ్చి డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ త‌మ‌కు రూ. 20 నుంచి 25 ల‌క్ష‌లు చెల్లించ‌డంతో పాటు రూ. 3 ల‌క్ష‌లు అద్దె కూడా చెల్లించాల‌ని డిమాండ్ చేసింది. అయితే చెల్లింపుల‌కు కేఎఫ్ఏ స‌మ‌యం కోరిన‌ప్ప‌టికీ, విష‌యం తెలియ‌ని జీసీడీఏ సిబ్బంది కోచ్‌, ఆట‌గాళ్ల‌ను అడ్డుకున్న‌ట్లు తెలిసింది. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో చెల్లింపు వివాదం కార‌ణంగా ఇండియ‌న్ సూప‌ర్‌లీగ్ (ఐఎస్ఎల్‌)లోనూ కేర‌ళ బ్లాస్ట‌ర్స్‌కు ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది.చదవండి: PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం!

Marnus Labuschagne Comment Shames PSL Over Pink Ball Drama9
‘సిగ్గుచేటు.. ఇలాంటిదెన్నడూ చూడలేదు’

పాకిస్థాన్ సూప‌ర్‌లీగ్ (పీఎస్ఎల్‌) 2026 సీజ‌న్ తొలిరోజే బంతి విష‌యంలో వివాదం చోటుచేసుకుంది. లాహోర్ వేదిక‌గా లాహోర్ ఖ‌లంద‌ర్స్‌, హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో తెలుపు రంగు బంతి కాస్తా ఉదారంగులోకి మారిపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అయితే ఇక‌ బంతి ఇలా వేరే రంగులోకి మారిపోవ‌డం త‌న క్రికెట్ కెరీర్‌లో ఇప్పటివ‌ర‌కు ఎప్పుడు చూడ‌లేదంటూ హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ మార్న‌స్ ల‌బుషేన్ పేర్కొన్నాడు. ల‌బుషేన్ మాట్లాడుతూ.. 'నిజానికి రెండో ఓవ‌ర్‌లోనే బంతి రంగు మార‌డాన్ని గ‌మ‌నించాను. ఇదే విష‌య‌మై అంపైర్ల దృష్టికి కూడా తీసుకెళ్లాను. అస‌లు ఏం జ‌రుగుతోంది? బంతి రంగు ఎందుకు మారుతోందంటూ అంపైర్ల‌ను అడిగాను. అయితే బంతి దుస్తుల‌కు అదే ప‌నిగా రాయ‌డం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని అనుకుంటున్నా. కానీ నా కెరీర్‌లో ఇలాంటి ఘ‌ట‌న మాత్రం ఎన్న‌డూ చూడ‌లేదు. అయితే బ్యాట్‌పై ఉన్న ఏదైనా స్టిక్క‌ర్‌పై బంతి ప‌డి అది దానికి అతుక్కుపోవ‌డం వ‌ల్ల బంతి రంగు మార‌డం చూశాను.కానీ దుస్తుల‌కు బంతిని ప‌దే ప‌దే రుద్ద‌డం ద్వారా వేరే రంగులోకి మార‌డం మాత్రం అరుదైన విష‌య‌మని చెప్పొచ్చు. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా లీగ్ నిర్వాహ‌కులు జాగ్ర‌త్త ప‌డ‌తార‌ని భావిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం హైదరాబాద్‌ కింగ్స్‌మెన్‌ తమ ‘ఎక్స్‌’ వేదికగా..‘ తొలి పింక్‌ బాల్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన లాహోర్‌ ఖలందర్స్‌కు మా అభినందనలు’ అంటూ ఆసక్తికర ట్వీట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖ‌లంద‌ర్స్ 69 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖ‌లంద‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (53) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా, హ‌సీబుల్లా ఖాన్ (40 నాటౌట్‌) చివ‌ర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ కింగ్స్ బౌల‌ర్ల‌లో రిలే మెరిడిత్‌, హ‌స‌న్ ఖాన్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ 20 ఓవ‌ర్ల‌లో 130 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కెప్టెన్ ల‌బుషేన్ (26) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. లాహోర్ ఖ‌లంద‌ర్స్ బౌల‌ర్ల‌లో హారిస్ ర‌వూఫ్‌, సికంద‌ర్ ర‌జా, ఉబైద్ షా త‌లా రెండు వికెట్లు తీశారు. నేడు జ‌ర‌గనున్న మ్యాచ్‌లో క్వెటా గ్లాడియేట‌ర్స్‌, క‌రాచీ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.🚨🚨Marnus Labuschagne on the change of ball color"I did say to the umpires after the second over, What’s going on? The ball is red, it must be from the clothes or something like that. I’ve never seen anything like pic.twitter.com/VHSXouHZYx— SheR•ALI (@Sher__Ali) March 26, 2026చదవండి: PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం!

Pakistan Super League 1st Match Turns Into Pink Ball Contest Viral10
PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం!

ఆంక్ష‌ల న‌డుమ మొదలైన పాకిస్థాన్ సూప‌ర్‌లీగ్ (పీఎస్ఎల్‌) 2026 సీజ‌న్ తొలిరోజునే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లాహోర్ ఖ‌లంద‌ర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్ సంద‌ర్భంగా బంతి రంగు మార‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. సాధార‌ణంగా ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో వైట్‌బాల్‌ను ఉప‌యోగించ‌డం ఆన‌వాయితీ. అయితే అనూహ్యంగా బంతి గులాబీ రంగులోకి మారిపోయింది. ఇది ఎలా జ‌రిగిందో అర్థం కాక ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ఓవ‌ర్ ముగిసిన త‌ర్వాత బంతిని ప‌రిశీలించిన అంపైర్లు దాని స్థానంలో మ‌రొక బంతిని తీసుకొని మ్యాచ్‌ను కొన‌సాగించారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్య‌క్తి సామాజిక మాధ్య‌మంలో షేర్ చేసుకోవ‌డంతో ఉన్న‌ప‌ళంగా వైరల్‌గా మారిపోయింది. క్రీడాభిమానులు సోష‌ల్ మీడియాలో ఫ‌న్నీ కామెంట్ల‌తో రెచ్చిపోయారు. 'బౌల‌ర్లు ప‌దేప‌దే బంతిని రుద్ద‌డం వ‌ల్లే తెల్ల‌బంతి కాస్తా గులాబీ రంగుకు మారిపోయి ఉంటుంది'.. 'ఇది పీఎస్ఎల్ కాదు పైసా షార్టేజ్ లీగ్ అనుకుంటా'.. 'ఇది అంత‌ర్జాతీయ క్రికెటా లేక గ‌ల్లీ క్రికెటా అన్న‌ది అర్థం కావ‌డం లేదు'.. అని కామెంట్లు చేశారు. ప్రేక్ష‌కులు లేకుండానే మొదలైన పీఎస్‌ఎల్‌లో తొలి మ్యాచ్‌ షహీన్‌ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలంద‌ర్స్‌, ల‌బుషేన్ నేతృ త్వంలోని హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖ‌లంద‌ర్స్ 69 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖ‌లంద‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (53) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా, హ‌సీబుల్లా ఖాన్ (40 నాటౌట్‌) చివ‌ర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ కింగ్స్ బౌల‌ర్ల‌లో రిలే మెరిడిత్‌, హ‌స‌న్ ఖాన్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ 20 ఓవ‌ర్ల‌లో 130 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కెప్టెన్ ల‌బుషేన్ (26) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. లాహోర్ ఖ‌లంద‌ర్స్ బౌల‌ర్ల‌లో హారిస్ ర‌వూఫ్‌, సికంద‌ర్ ర‌జా, ఉబైద్ షా త‌లా రెండు వికెట్లు తీశారు. నేడు జ‌ర‌గనున్న మ్యాచ్‌లో క్వెటా గ్లాడియేట‌ర్స్‌, క‌రాచీ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.Peak Pakistan Super League standards 😭During the very first match of PSL 11, the ball literally turned pink every time Hyderabad Kingsmen players rubbed it on their kit.Did they get knockoff kits instead of authentic ones?International league or gully-level experiment? 🤡 pic.twitter.com/Beq5zhmSkb— Brutal Truth (@sarkarstix) March 26, 2026During today’s PSL match, the ball turned pink as early as the second over because players kept rubbing it on their pants, causing the dye to transfer onto the ball.Paisa Shortage League for a reason 🤣 pic.twitter.com/QQf7wlc2qG— Tejash (@Tejashyyyyy) March 26, 2026చదవండి: ధోనిపై మాజీ ఆట‌గాడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Advertisement
Advertisement
 
Advertisement