Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

40 Indian origin cricketers in the T20 World Cup1
మెరుపుల పండక్కి భారత సంతతి!

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌లో ఒక్కో జట్టు నుంచి 11 మంది ప్లేయర్లు మాత్రమే మైదానంలో అడుగు పెడతారు. కానీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌లో మాత్రం లెక్కకు మిక్కిలి భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. అదేంటి ఏ జట్టుకైనా ఒకటే నిబంధన కదా అనే అనుమానం రాకమానదు. ఇక్కడే అసలు మెలిక ఉంది. టీమిండియా తరఫున ఆడేది పదకొండు మందే... కానీ, ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతున్న 20 జట్లలో భారత్‌తో పాటు మరో తొమ్మిది జట్ల తరఫున మనదేశ సంతతి ఆటగాళ్లు ఆడనున్నారు. రెండోసారి టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన కెనడా జట్టులో అత్యధికంగా 11 మంది భారత సంతతి ప్లేయర్లు ఉండగా... అమెరికా జట్టులో 9 మంది మనవాళ్లు ఉన్నారు. ప్రవాస భారతీయులు అధికంగా ఉండే ఒమన్, యూఏఈ నుంచి ఏడుగురు చొప్పున మన మూలాలున్న ప్లేయర్లు వరల్డ్‌కప్‌ ఆడనుండగా... ఇష్‌ సోధి, రచిన్‌ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్‌ నుంచి ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇటలీ, నెదర్లాండ్స్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున వరల్డ్‌కప్‌లో ఆడనున్నారు. ఇందులో కెనడా, అమెరికా, ఒమన్‌ జాతీయ జట్లకు సారథ్యం వహిస్తుంది కూడా మనవాళ్లే కావడం విశేషం. మరో మూడు రోజుల్లో టి20 వరల్డ్‌కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి ఆటగాళ్లపై ఓ కన్నేద్దాం! పాకిస్తాన్‌ పనిపట్టి... సౌరభ్‌ నేత్రావల్కర్‌... ఈ పేరు గత టి20 ప్రపంచకప్‌ సమయంలో బాగా వినిపించింది. అమెరికా వేదికగా జరిగిన ఆ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ను అమెరికా ఓడించడంలో ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కీలక పాత్ర పోషించాడు. గ్రూప్‌ దశలో పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగిన పోరులో స్కోర్లు సమం కాగా... సూపర్‌ ఓవర్‌లో బౌలింగ్‌ చేసిన నేత్రావల్కర్‌... పాక్‌ బ్యాటర్లను కట్టడి చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లోనూ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులకే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముంబైలో పుట్టి పెరిగి... ఒకప్పుడు అండర్‌–19 స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సౌరభ్‌ ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. లెఫ్టార్మ్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌తో రాణించి అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత వరల్డ్‌కప్‌లో అమెరికా జట్టు ‘సూపర్‌–8’ దశకు చేరడంతో కీలకంగా వ్యవహరించిన 34 ఏళ్ల సౌరభ్‌... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి సెలవు పెట్టి మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఒకప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి మ్యాచ్‌లు ఆడిన సౌరభ్‌ ఈ శనివారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా అతడికి ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ‘ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. కానీ, ఇది చాలా భావోద్వేగ క్షణం. జీవితం ఒక చక్రం లాంటిది. నేను ఇక్కడే క్రికెట్‌ ఆడటం ప్రారంభించా... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడే టీమిండియతో మ్యాచ్‌ ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు’ అని నేత్రావల్కర్‌ అన్నాడు. మోనాంక్‌ పటేల్‌ భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి ఒకప్పుడు మ్యాచ్‌లు ఆడిన మోనాంక్‌ పటేల్‌... ప్రస్తుతం అమెరికా జట్టుకు కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌నకు సిద్ధమయ్యాడు. 2024 టి20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో పోరులో చక్కటి అర్ధశతకంతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన మోనాంక్‌... ఈసారి కూడా మెగా టోర్నీలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. గుజరాత్‌లో పుట్టి పెరిగిన 32 ఏళ్ల మోనాంక్‌... అండర్‌–19 స్థాయిలో బుమ్రాతో మ్యాచ్‌లు ఆడాడు. ‘మేమిద్దరం చిన్నప్పుడు కలిసి మ్యాచ్‌లు ఆడాం. ఆ తర్వాత ఇద్దరి దారులు వేరయ్యాయి. బుమ్రా ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ స్థాయికి ఎదిగాడు. టీమిండియాతో మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం అని తెలుసు. మా వరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని అనుకుంటున్నాం’ అని మోనాంక్‌ అన్నాడు. జస్‌ప్రీత్‌ సింగ్‌ మొదటిసారి ఐసీసీ టి20 ప్రపంచకప్‌ ఆడనున్న ఇటలీ జట్టులో పంజాబ్‌లో పుట్టి పెరిగిన జస్‌ప్రీత్‌ సింగ్‌ చోటు దక్కించుకున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం మెరుగైన జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్‌ప్రీత్‌... అక్కడ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూనే క్రికెట్‌ కొనసాగించాడు. తన ప్రదర్శనతో జాతీయ జట్టుకు ఎంపికైన 32 ఏళ్ల జస్‌ప్రీత్‌... వరల్డ్‌కప్‌ కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు. ఆర్యన్‌ దత్‌ ఇప్పటికే 2023 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా నెదర్లాండ్స్‌ తరఫున భారత్‌లో మ్యాచ్‌లాడిన ఆర్యన్‌ దత్‌... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్‌నకు సిద్ధమవుతున్నాడు. 22 ఏళ్ల ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ భారత్‌లో పుట్టకపోయినా... అతడి తల్లిదండ్రులది పంజాబే. మెరుగైన జీవనోపాధి కోసం ఆర్యన్‌ కుటుంబం నెదర్లాండ్స్‌కు వలస వెళ్లగా... అక్కడ తన స్పిన్‌తో సత్తాచాటిన ఆర్యన్‌ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దిల్‌ప్రీత్‌ బాజ్వా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగనున్న కెనడా జట్టయితే పూర్తిగా భాతర సంతతి ఆటగాళ్లతో నిండి ఉంది. ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్న దిల్‌ప్రీత్‌ బాజ్వా ఇటీవలే కెనడాకు వలస వెళ్లాడు. అనతి కాలంలోనే తన ప్రతిభతో అక్కడి జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్‌ప్రీత్‌... కెనడా గ్లోబల్‌ టి20 లీగ్‌లో విజృంభించి వెలుగులోకి వచ్చాడు. జతిందర్‌ సింగ్‌ పంజాబ్‌లోని లుధియానాలో పుట్టి పెరిగిన జతిందర్‌ సింగ్‌... ఈ ప్రపంచకప్‌లో ఒమన్‌ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దశాబ్దానికి పైగా భారత దేశవాళీల్లో ఆడిన 36 ఏళ్ల జతిందర్‌... అవకాశాలు రాకపోవడంతో ఒమన్‌కు వలసవెళ్లి ఆ దేశ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు వినాయక్‌ శుక్లా, కరణ్‌ సోనావాలె, జై, ఆశిష్, వసీం, జితేన్‌ రామనంది ఇలా ఏడుగురు భారత సంతతి ఆటగాళ్లు ఒమన్‌ తరఫున బరిలోకి దిగనున్నారు. టి20 ప్రపంచకప్‌లో భారత సంతతి ఆటగాళ్లు కెనడా (11): దిల్‌ప్రీత్‌ బాజ్వా (కెప్టెన్ ), అజయ్‌వీర్‌ హుండల్, అంశ్‌ పటేల్, హర్ష్ థాకెర్, జస్‌కరణ్‌దీప్‌ బుట్టర్, కన్వర్‌పాల్‌ తత్ఘుర్, నవ్‌నీత్‌ ధలీవాల్, రవీందర్‌పాల్‌ సింగ్, శివం శర్మ, శ్రేయస్‌ మొవ్వ, యువరాజ్‌ సామ్రా. అమెరికా (9): మోనాంక్‌ పటేల్‌ (కెప్టెన్ ), జెస్సీ సింగ్, మిలింద్‌ కుమార్, నోస్తుష్‌ కెంజిగె, సాయితేజ ముక్కామల, సంజయ్‌ కృష్ణమూర్తి, హర్మీత్‌ సింగ్, సౌరభ్‌ నేత్రావల్కర్, శుభం రంజనె. ఒమన్‌ (7): జతిందర్‌ సింగ్‌ (కెప్టెన్‌), వినాయక్‌ శుక్లా, కరణ్‌ సోనావాలె, జై ఒడెద్రా, ఆశిష్‌ ఒడెద్రా, వసీం అలీ, జితేన్‌ రామనంది. యూఏఈ (7): అలీషాన్‌ షరాఫు, ఆర్యాంశ్‌ శర్మ, ధ్రువ్‌ పరాశర్, హర్షిత్‌ కౌశిక్, మయాంక్‌ కుమార్, సిమ్రన్‌జీత్‌ సింగ్, సొహైబ్‌ ఖాన్‌. న్యూజిలాండ్‌ (2): ఇష్‌ సోధి, రచిన్‌ రవీంద్ర దక్షిణాఫ్రికా (1): కేశవ్‌ మహరాజ్‌ వెస్టిండీస్‌ (1): గుడకేశ్‌ మోతీ ఇటలీ (1): జస్‌ప్రీత్‌ సింగ్‌ నెదర్లాండ్స్‌ (1): ఆర్యన్‌ దత్‌ తెలుగువాళ్లు కూడా...అమెరికా తరఫున ఆడుతున్న ముక్కామల సాయితేజ రెడ్డి... కెనడా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రేయస్‌ మొవ్వ తెలుగు మూలాలున్న ఆటగాళ్లే. అమెరికాలోనే పుట్టి పెరిగిన సాయితేజ రెడ్డి అమెరికా జాతీయ జట్టు ఓపెనర్‌గా 37 వన్డేలు, 18 టి20లు ఆడాడు. మంచి స్ట్రయిక్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయితేజ... ఈ మెగాటోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. భారత్‌లో పుట్టి కెనడాకు వలస వెళ్లిన శ్రేయస్‌ మొవ్వ ఆ దేశ జట్టు తరఫున ఇప్పటి వరకు 24 వన్డేలు, 24 టి20లు ఆడాడు.

Pro Wrestling League champions Haryana Thunders2
చాంపియన్‌ హరియాణా థండర్స్‌

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్ల్యూఎల్‌)లో హరియాణా థండర్స్‌ జట్టు వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో హరియాణా 5–4 పాయింట్ల తేడాతో ఢిల్లీ దంగల్‌ వారియర్స్‌పై గెలిచింది. ఇప్పటి వరకు ఈ లీగ్‌ ఐదుసార్లు నిర్వహించగా... అందులో హరియాణా జట్టు రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. చివరగా 2019లో జరిగిన లీగ్‌లో హరియాణా జట్టు టైటిల్‌ నెగ్గింది. తాజా లీగ్‌లో హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఎనిమిది బౌట్‌లు ముగిసేసరికి ఇరు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. చివరగా జరిగిన మహిళల 62 కేజీల పోరులో పారిస్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత ఇరినా కొలియాడెన్కో ఒత్తిడిని అధిగమిస్తూ... అంజలిని చిత్తుచేసింది. దీంతో హరియాణా థండర్స్‌ విజేతగా నిలిచింది. అంతకుముందు పురుషుల 74 కేజీల విభాగంలో జరిగిన తొలి బౌట్‌లో బైరమోవ్‌ (ఢిల్లీ) 8–2తో ప్రవిందర్‌ (హరియాణా)పై... రెండో బౌట్‌గా జరిగిన మహిళల 76 కేజీల పోరులో కాజల్‌ (హరియాణా) 3–1తో అనస్తసియా అల్పియోవా (ఢిల్లీ)పై... మూడో బౌట్‌ పురుషుల 65 కేజీల ఈవెంట్‌లో సుజీత్‌ కల్కల్‌ (ఢిల్లీ) 8–6తో తుముర్‌ ఒచిర్‌ తుల్గా (హరియాణా)పై... నాలుగో బౌట్‌ మహిళల 53 కేజీల పోరులో యీ సుసకీ (హరియాణా) 5–0తో సారిక (ఢిల్లీ)పై... ఐదో బౌట్‌ పురుషుల 86 కేజీల విభాగంలో హాది భక్తియార్‌ 11–0తో అశిరోవ్‌ అష్రఫ్‌ (హరియాణా)పై... ఆరో బౌట్‌ పురుషుల 57 కేజీల పోరులో అక్షయ్‌ ఢేరె (హరియాణా) 16–0తో అమిత్‌ (ఢిల్లీ)పై... ఏడో బౌట్‌గా జరిగిన పురుషుల 125 కేజీల పోరులో రోనక్‌ 12–1తో అనిరుధ్‌ (హరియాణా)పై గెలిచారు.ఎనిమిదో బౌట్‌ మహళల 57 కేజీల విభాగంలో నేహ (హరియాణా) 8–2తో అంజలి (ఢిల్లీ)పై గెలిచారు. ఢిల్లీ దంగల్‌ వారియర్స్‌కు చెందిన యువ రెజ్లర్‌ తురాన్‌ బైరమోవ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డు దక్కించుకున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో పోటీపడిన అతడు... ఆడిన ఏడు బౌట్‌లలోనూ విజయాలు సాధించడం విశేషం. హరియాణా థండర్స్‌ రెజ్లర్‌ నేహా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ... ఢిల్లీ దంగల్‌ వారియర్స్‌కు చెందిన రోనక్‌ (125 కేజీలు) ‘ఫైటర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నారు. పంజాబ్‌ రాయల్స్‌కు చెందిన చంద్రమోహన్‌ లీగ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన రెజ్లర్‌గా నిలిచాడు. హరియాణా థండర్స్‌కు చెందిన అక్షయ్‌ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్నాడు.

India will play its second semi final against Afghanistan today3
యువ భారత్‌ను ఆపతరమా!

హరారే: అండర్‌–19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న యువ భారత్‌ ఇదే జోరుతో ఫైనల్‌ చేరాలని ఆశిస్తోంది. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. ఫామ్‌ పరంగా చూసినా, మొత్తం టీమ్‌ ప్రదర్శన చూసినా ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని భారత్‌ను అడ్డుకోవడం అఫ్గాన్‌కు సాధ్యమయ్యే పనైతే కాదు. అండర్‌–19 ప్రపంచకప్‌ల చరిత్రలోనే ఐదు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిరూపించుకున్న యువ భారత్‌... 2000, 2008, 2012, 2018, 2022 సరసన ఈ ఏడాదిని కూడా చేర్చాలని ఆరాటపడుతోంది. మన కుర్రాళ్లు ఆడుతున్న తీరు, గెలుస్తున్న వైనం చూస్తుంటే ఇదేమంత కష్టం కానేకాదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించింది. ఇలాంటి దుర్బేధ్యమైన భారత సేనను ఎదుర్కోవాలంటే అఫ్గానిస్తాన్‌ పెద్ద కసరత్తే చేయాలి. ఇక గెలవాలంటే మాత్రం ఓ సంచలనం నమోదవ్వాలి. అయితే ప్రత్యేకించి ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్‌ కూడా బాగా ఆడింది. భారత కుర్రాళ్లు ఐదు గెలిస్తే... అఫ్గాన్‌ కేవలం ఒకటి ఓడి, నాలుగు విజయాలతో సత్తా చాటుకుంది. ఇలాంటి మేటి ప్రదర్శన కనబరిచిన అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయకూడదని ఆయుశ్‌ బృందానికి బాగా తెలుసు. ఆదమరుపు లేకుండా ఎప్పటిలాగే మరో మ్యాచ్‌ విజయం కోసం చెమటోడ్చాలని యువ బృందం పట్టుదలతో ఉంది. టీనేజ్‌ సంచలనం, ఓపెనింగ్‌ హిట్టర్‌ వైభవ్‌ సూర్యవంశీ సహా టాపార్డర్‌ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నారు. ఆల్‌రౌండర్‌ విహాన్‌ మల్హోత్రా బ్యాట్‌తో, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే బంతితో ప్రత్యర్థి జట్ల పని పడుతున్నారు. వీరితో పాటు పేసర్లు హేనిల్‌ పటేల్, అంబరీశ్‌ నిప్పులు చెరుగుతుండటం బౌలింగ్‌ దళానికి వెన్నుదన్నుగా ఉంది. అఫ్గానిస్తాన్‌ కూడా మ్యాచ్‌మ్యాచ్‌కు రాటుదేలుతున్నప్పటికీ భారత్‌లాంటి ఆల్‌రౌండ్‌ సామర్థ్యమున్న జట్టును ఓడించాలంటే సర్వశక్తులు ఒడ్డినా సరిపోదేమో!ఆ్రస్టేలియాపై గెలిచి ఫైనల్లో ఇంగ్లండ్‌మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 27 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. కెప్టెన్ థామస్‌ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్‌–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్‌ పీక్‌ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత్, అఫ్గానిస్తాన్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో శుక్రవారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌ తలపడుతుంది.

Delhi Capitals win 4
మళ్లీ ఢిల్లీనే...

వడోదర: ఢిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ ఫైనల్‌ చేరింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మంగళవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్‌ చేరిన జట్టుగా ఢిల్లీ ఘనత వహించింది. గురువారం జరిగే టైటిల్‌ పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో క్యాపిటల్స్‌ తలపడుతుంది. 2024లోనూ ఇరు జట్లు టైటిల్‌ కోసం ఢీకొనగా ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. మొదట గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (51 బంతుల్లో 62 నాటౌట్‌; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, జార్జియా వేర్‌హమ్‌ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ సోఫీ డివైన్‌ (0), కెప్టెన్‌ యాష్లీ గార్డ్‌నర్‌ (0) విఫలమయ్యారు. చినెల్లి హెన్రీ 3 వికెట్లు, నందిని శర్మ 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి గెలిచింది. లిజెల్లీ లీ (24 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (23 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్‌) దంచేశారు. షఫాలీ వర్మ (21 బంతుల్లో 31; 7 ఫోర్లు), లౌరా వోల్‌వార్డ్‌ (24 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. వేర్‌హమ్‌కు 2 వికెట్లు దక్కాయి.స్కోరు వివరాలుగుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: బెత్‌ మూనీ (నాటౌట్‌) 62; సోఫీ డివైన్‌ (సి) లిజెల్లీ (బి) హెన్రీ 6; అనుష్క (సి) హెన్రీ (బి) నందిని 16; యాష్లీ గార్డ్‌నర్‌ (సి) స్నేహ్‌ రాణా (బి) నందిని 0; కనిక (స్టంప్డ్‌) లిజెల్లీ (బి) మిన్ను మణి 6; వేర్‌హమ్‌ (సి) వోల్‌వార్డ్‌ (బి) హెన్రీ 35; భారతి (సి అండ్‌ బి) హెన్రీ 0; కాశ్వీ గౌతమ్‌ (రనౌట్‌) 18; తనూజ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–38, 4–59, 5–120, 6–125, 7–164. బౌలింగ్‌: మరిజాన్‌ కాప్‌ 4–0–32–0, చినెల్లీ హెన్రీ 4–0–35–3, నందిని శర్మ 4–0–44–2, మిన్ను మణి 4–0–23–1, స్నేహ్‌ రాణా 1–0–3–0, శ్రీచరణి 3–0–25–0. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: లిజెల్లీ లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) వేర్‌హమ్‌ 43; షఫాలీ వర్మ (బి) వేర్‌హమ్‌ 31; వోల్‌వార్డ్‌ (నాటౌట్‌) 32; జెమీమా (సి) సోఫీ (బి) రాజేశ్వరి 41; మరిజాన్‌ కాప్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–89, 2–92, 3–160. బౌలింగ్‌: రేణుక 2–0–27–0, కాశ్వీ గౌతమ్‌ 2–0–17–0, రాజేశ్వరి 3–0–33–1, సోఫీ డివైన్‌ 3–0–35–0, జార్జియా వేర్‌హమ్‌ 3.4–0–28–2, తనూజ 1–0–5–0, యాష్లీ గార్డ్‌నర్‌ 1–0–15–0.

Changes to the cricket rules5
వికెట్‌పడ్డా.. టెస్టుల్లో ఇక ఆఖరి ఓవర్లో 6 బంతులు పడాల్సిందే!

లండన్‌: క్రికెట్‌ నియమావళి మారింది. కొత్త మార్పులు ఈ ఏడాది నుంచే అమలవుతాయని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) వెల్లడించింది. నియమావళిలో ఏకంగా 73 సవరణలు జరిగినప్పటికీ ప్రధానంగా టెస్టుల్లో ఇకపై ఆఖరి ఓవర్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలన్న నిబంధన అమలుకానుంది. దశాబ్దాలుగా సంప్రదాయ ఫార్మాట్‌లో ఆ రోజు చివరి ఓవర్లో వికెట్‌ పడితే అక్కడితోనే ఆట ముగిస్తున్నారు. మరో బ్యాటర్‌ రావడం... మిగతా బంతులు ఆడటం జరగట్లేదు. బ్యాడ్‌లైట్‌ లాంటి ప్రతికూల వాతావరణం లేకుంటే ఇకపై బ్యాటర్‌ క్రీజులోకి రావాల్సిందే... మిగిలిన బంతులు ఆడాల్సిందేనని ఎంసీసీ సవరించిన నియమావళి చెబుతోంది. ఆఖరి ఓవర్‌ డ్రామాను అర్ధంతరంగా ముగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కొత్త మార్పులు, నియమావళిని ఈ అక్టోబర్‌ నుంచి అమలు చేయనున్నట్లు ఎంసీసీ పేర్కొంది. ల్యామినేటెడ్‌ బ్యాట్లకు సై పురుషులు ఆడే క్లబ్‌ క్రికెట్‌లో ఇకపై ల్యామినేటెడ్‌ బ్యాట్లను అనుమతిస్తారు. ల్యామినేటెడ్‌ బ్యాట్లకు దూరంగా ఉన్న ఎంసీసీ తొలిసారిగా 2017లో జూనియర్‌ క్రికెట్‌లో అనుమతించింది. ఇప్పుడు సీనియర్‌ క్రికెట్‌లో సై అంటున్నారు. బంతిని ఆడే క్రమంలో బ్యాటర్‌ తనను తాను నియంత్రించుకోకుండా వికెట్లను తగిలితే హిట్‌ వికెట్‌గా అవుట్‌ ఇస్తారు. ఇది యథాతథం. అయితే బ్యాటర్‌ ప్రమేయం లేకుండా ఫీల్డర్ల పొరపాటు వల్ల వికెట్లను తాకితే ఇకమీదట ఆ బ్యాటర్‌ను హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌కు పంపించరు.

WPL 2026 Eliminator GGTW vs DCW: Mooney Fifty Check Gujarat Score6
WPL Eliminator: దంచికొట్టిన బెత్‌ మూనీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)-2026 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఫైనల్‌ చేరగా.. మరో బెర్తు కోసం గుజరాత్‌ జెయింట్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య పోటీ నెలకొంది.దంచికొట్టిన బెత్‌ మూనీఇందులో భాగంగా కొటాంబిలోని వడోదర స్టేడియంలో మంగళవారం నాటి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. గుజరాత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ అజేయ అర్ధ శతకం (51 బంతుల్లో 62) మెరవగా.. మరో ఓపెనర్‌ సోఫీ డివైన్‌ (6), వన్‌డౌన్‌ బ్యాటర్‌ అనుష్క శర్మ (16) నిరాశపరిచారు.ఇక కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌, భారతి ఫల్మలి డకౌట్‌గా వెనుదిరగగా.. కనిక అహుజా సైతం 6 పరుగులకే అవుటైంది. జార్జియా వారేహమ్‌ (25 బంతుల్లో 35), కశ్వీ గౌతం (10 బంతుల్లో 18) మెరుగ్గా రాణించారు. ఫలితంగా గుజరాత్‌ 150 పరుగుల మార్కు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో చినెల్లి హెన్రీ మూడు వికెట్లతో చెలరేగగా.. నందాని శర్మ రెండు, మిన్ను మణి ఒక వికెట్‌ పడగొట్టారు. గుజరాత్‌ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది.డబ్ల్యూపీఎల్‌-2026 ఎలిమినేటర్‌ మ్యాచ్‌ గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీతుదిజట్లుగుజరాత్‌బెత్‌ మూనీ (వికెట్‌ కీపర్‌), సోఫీ డివైన్‌, అనుష్క శర్మ, ఆష్లే గార్డ్‌నర్‌ (కెప్టెన్‌), జార్జియా వరేహమ్‌, భారతి ఫల్మలి, కనిక అహుజా, కశ్వీ గౌతం, తనుజా కన్వేర్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌.ఢిల్లీలిజెల్లి లీ (వికెట్‌ కీపర్‌), షఫాలి వర్మ, లారా వల్వర్ట్‌, జెమీమా రోడ్రిగ్స్‌ (కెప్టెన్‌), మరిజానే కాప్‌, చినెల్లి హెన్రీ, నికీ ప్రసాద్‌, స్నేహ్‌ రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందాని శర్మ. Beth Mooney dances down the track and puts it away for a much-needed boundary 👊Will Mooney anchor Gujarat Giants to a big total in this eliminator clash? 👀#TATAWPL Eliminator | #GGvDC 👉 LIVE NOW ➡️ https://t.co/Bd8nlT8AGe pic.twitter.com/YO8yPWT0VJ— Star Sports (@StarSportsIndia) February 3, 2026

U19 WC 2026 1st Semis: England Beat Australia Enters Final7
WC 2026: ఆసీస్‌ అవుట్‌.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌

ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్కంఠగా సాగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి ఇంగ్లండ్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌ టోర్నీలో సూపర్‌ సిక్స్‌ గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించగా.. గ్రూప్‌-2 నుంచి భారత్‌ , ఇంగ్లండ్‌ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌- ఇంగ్లండ్‌ మంగళవారం తలపడ్డాయి.థామస్‌ రూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌బులవాయోలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో బెన్‌ డాకిన్స్‌ (1) విఫలం కాగా.. జోసెఫ్‌ మూర్స్‌ 25 పరుగులు.. వన్‌డౌన్‌లో వచ్చిన బెన్‌ మేయ్స్‌ 24 రన్స్‌ చేశారు. టాపార్డర్‌ ఇలా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన థామస్‌ రూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.శతకంతో చెలరేగిన థామస్‌.. మొత్తంగా 107 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 110 పరుగులు సాధించాడు. మిగతావాళ్లలో కలేబ్‌ ఫాల్కనర్‌ 40 పరుగులతో రాణించగా.. ఫర్హాన్‌ అహ్మద్‌ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.ఆసీస్‌ బౌలర్లలో హేడెన్‌ షీలర్‌, నడేన్‌ కూరే చెరో రెండు వికెట్లు తీయగా.. విల్‌ బైరమ్‌, ఆర్యన్‌ శర్మ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్‌ ఒలీవర్‌ పీక్‌ ఒంటరి పోరాటంఓపెనర్‌ విల్‌ మలాజుక్‌ 15, వన్‌డౌన్‌ బ్యాటర్‌ 3 పరుగుల చేసి అవుటయ్యారు. మరో ఓపెనర్‌ నితేశ్‌ సామ్యూల్‌ 83 బంతుల్లో 47 పరుగులు చేయగా.. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ లీ యంగ్‌ (3), జేడన్‌ డ్రేపర్‌ (12) నిరాశపరిచారు.ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నాలుగో నంబర్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ ఒలీవర్‌ పీక్‌ ఒంటరి పోరాటం చేశాడు. 88 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న ఒలీవర్‌ పదో వికెట్‌గా వెనుదిరిగడంతో ఇంగ్లండ్‌ గెలుపు ఖరారైంది. టార్గెట్‌ ఛేదనలో 47.3 ఓవర్లలో 250 పరుగులకే పరిమితమై ఆసీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. థామస్‌ రూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రెండో సెమీ ఫైనల్లో భారత్‌- అఫ్గనిస్తాన్‌ బుధవారం తలపడతాయి.అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆసీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ స్కోర్లు👉ఇంగ్లండ్‌-277/7(50)👉ఆస్ట్రేలియా- 250(47.3). చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

Ramiz Raja Warned Them: Cut Off India and PCB Could Collapse Old Video8
భారత ప్రధాని ఒక్క మాట చెబితే మన ఖేల్‌ ఖతం: రమీజ్‌ రాజా

క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వైఖరి గురించేప్రధానంగా చర్చ నడుస్తోంది. తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి పాక్‌ కష్టాలు కొని తెచ్చుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను ఇప్పటికే తప్పించిన విషయం తెలిసిందే.కోరికోరి వివాదాలుభారత్‌లో తమకు భద్రత ఉండదంటూ ఆరోపణలకు దిగిన బంగ్లా.. మరో వేదికైన శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడించాలని ఐసీసీని కోరింది. అయితే, ఈ వాదనలో నిజం లేదంటూ కొట్టిపారేసిన ఐసీసీ.. బంగ్లా అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ బంగ్లా పట్టువీడకపోవడంతో.. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకువచ్చింది.అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ తాము కూడా టోర్నీలో పాల్గొనమని బెదిరింపు ధోరణి అవలంబించిన పాకిస్తాన్‌.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందనేమో.. కేవలం భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రకటించింది. తటస్థ వేదికల ఏర్పాటుకాగా భారత్‌- పాక్‌ మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా అవుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్‌ టోర్నీలో ముఖాముఖి తలపడుతున్న దాయాదుల మధ్య 2024లో ఐసీసీ ఓ ఒప్పందం కుదిర్చింది.ఇరు దేశాల్లో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. మరో జట్టు కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగానే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి పాక్‌ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడింది. ఆ తర్వాత ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 టోర్నీ భారత్‌లో జరుగగా.. పాక్‌ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లోనూ పాక్‌ పురుషుల జట్టు శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.భారత్‌తో పెట్టుకుంటే అంతేఅయినప్పటికీ బంగ్లాదేశ్‌ కోసమంటూ పాక్‌.. భారత్‌ను ఢీకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా.. భారత్‌తో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలో హెచ్చరించిన వీడియో తాజాగా వైరల్‌ అవుతోంది.సెనేట్‌ స్టాండింగ్‌ కమిటీ ముందు 2021లో పీసీబీ చైర్మన్‌ హోదాలో మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పే విషయాలు భయపెట్టేవని నాకు తెలుసు. ఐసీసీ నుంచి వచ్చే 50 శాతం నిధులతోనే పాక్‌ బోర్డు తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇతర బోర్డు మెంబర్లతో కలిసి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా ఐసీసీకి ఆదాయం వస్తుంది.90 శాతం ఆదాయం అక్కడి నుంచేఇక ఐసీసీకి వచ్చే ఆదాయంలో 90 శాతం ఇండియన్‌ మార్కెట్ల నుంచే వస్తుంది. అంటే ఒకరకంగా.. భారత్‌లోని వ్యాపారం వల్లే పాకిస్తాన్‌ క్రికెట్‌ మనుగడ కొనసాగిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో భారత ప్రధాని పాకిస్తాన్‌ క్రికెట్‌కు ఫండింగ్‌ ఆపేయమని చెబితే.. పీసీబీ కుప్పకూలుతుంది’’ అని రమీజ్‌ రాజా వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వీడియో ఫేక్‌ కావొచ్చు అంటూ పాక్‌ అభిమానులు అంటుండగా... ఏదేమైనా ఈ మాటలు మాత్రం నిజమేనంటూ టీమిండియా ఫ్యాన్స్‌ కౌంటర్లు ఇస్తున్నారు. చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!#WATCH : Throwback Video Of Ramiz Raja Warned PCB Could ‘Collapse’ If India Pulls SupportAn old video of former Ramiz Raja, made during his tenure as chairman of the Pakistan Cricket Board, has resurfaced on social media, drawing renewed attention amid ongoing cricket diplomacy… pic.twitter.com/BCkNgzyI2z— upuknews (@upuknews1) February 3, 2026

T20 WC warm up: Kaleem powers Oman to Beat Sri Lanka A9
T20 WC: శ్రీలంకకు షాకిచ్చిన పసికూన!

టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహక మ్యాచ్‌లో ఒమన్‌ శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించి లంక-'ఎ' జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా భారత్‌- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభంకానున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో సోమవారం నుంచి వార్మప్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీలంక-'ఎ' జట్టు మంగళవారం ఒమన్‌తో తలపడింది. కొలంబో వేదికగా టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 145 పరుగులకే పరిమితంఅయితే, ఒమన్‌ బౌలర్ల ధాటికి తాళలేక 145 పరుగులకే పరిమితమైంది. టాపార్డర్‌లో ఓపెనర్‌ సినెత్‌ జయవర్దన (9), వన్‌డౌన్‌ బ్యాటర్‌ పులిందు పెరిరా (9) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ దుల్‌నిత్‌ సిగెర (20) ఫర్వాలేదనిపించాడు.మిగిలిన వారిలో గుణశేఖర (21), వనుజ సహాన్‌ (29) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి శ్రీలంక 145 పరుగులు చేసింది. ఒమన్‌ బౌలర్లో షా ఫైజల్‌, షకీల్‌ అహ్మద్‌, జే ఒడెరా రెండేసి వికెట్లు పడగొట్టగా.. నదీం ఖాన్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆమీర్‌ కలీమ్‌ ధనాధన్‌ అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్‌ 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులు సాధించింది. ఓపెనర్‌, 44 ఏళ్ల వెటరన్‌ ప్లేయర్‌ ఆమీర్‌ కలీమ్‌ (47 బంతుల్లో 80) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. అతడికి తోడుగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వినాయక్‌ శుక్లా (24 బంతుల్లో 39 నాటౌట్‌) రాణించాడు. మిగిలిన వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం అయ్యారు. లంక బౌలర్లలో వనుజ సహాన్‌ మూడు వికెట్లు కూల్చగా.. కెప్టెన్‌ లాహిరు సమరకూన్‌, కవిజ గమేజ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!

ISL: Sunil Chhetri rest of Bengaluru FC players agree to pay cuts10
మెట్టు దిగిన ఆటగాళ్లు.. ఫీజుల కోతకు అంగీకారం

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ నిర్వహణ కోసం ఆటగాళ్లు ఓ మెట్టు దిగారు. సునీల్‌ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ (FC) ఆటగాళ్లు తమ మ్యాచ్‌ ఫీజుల తగ్గింపునకు సమ్మతించారు. పలు సమస్యలతో ఐఎస్‌ఎల్‌ గతేడాది జరగలేదు. ఏడాది విరామం తర్వాత మొత్తానికి సమస్యలు పరిష్కరించుకొని ఇటు లీగ్‌ నిర్వాహకులు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఈ ఏడాది నుంచి తిరిగి ఎప్పటిలాగే టోర్నీని నిర్వహించాలనే ఒప్పందానికి వచ్చారు.ఈ నెల 14 నుంచే ఫుట్‌బాల్‌ లీగ్‌ జరుగుతుంది. సజావుగా టోర్నీ నిర్వహణకు ఫుట్‌బాలర్లు సైతం తమ మ్యాచ్‌ ఫీజుల కోతకు అంగీకరించారు. దీనిపై బెంగళూరు యజమాని పార్థ్‌ జిందాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. లీగ్‌ ఒడిదొడుకులను అర్థం చేసుకొని టోర్నీ నిర్వహణ కోసం తమ ఫీజుల్ని తగ్గించుకున్న ఆటగాళ్లను ఆయన అభినందించారు. రూ.కోట్లు పోయి లక్షలు ఐఎస్‌ఎల్‌ ప్రసార హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ‘ఫ్యాన్‌కోడ్‌’ యాప్‌ చేజిక్కించుకుంది. మొత్తం 91 మ్యాచ్‌లున్న ఫుట్‌బాల్‌ ఈవెంట్‌ ప్రపంచవ్యాప్త ప్రసార హక్కుల్ని రూ. 8.62 కోట్లకే దక్కించుకుంది. అంటే ఒక్కో మ్యాచ్‌కు సగటున రూ.9.5 లక్షలకే గ్లోబల్‌ మీడియా రైట్స్‌ పొందింది. 2024–25 సీజన్‌లో రూ.275 కోట్లు రాగా అప్పుడు 163 మ్యాచ్‌లు జరిగాయి. అంటే మ్యాచ్‌కు రూ. 1.68 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్‌కు వచ్చేసరికి రూ.కోట్లు పోయి రూ.9.5 లక్షలకు పడిపోయింది. ఇదీ చదవండి: భారత జట్టు ఓటమి నేపాల్‌ వేదికగా దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–19 మహిళల చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న భారత యువ జట్టుకు బంగ్లాదేశ్‌ చేతిలో చుక్కెదురైంది. ఏఎఫ్‌సీ అండర్‌–17 మహిళల ఆసియా కప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఈ అండర్‌–19 టోరీ్నలో భారత్‌ అండర్‌–17 జట్టును బరిలోకి దింపింది.టీనేజ్‌ జట్టు తొలి మ్యాచ్‌లో 1–0తో ఆతిథ్య నేపాల్‌పై గెలిచింది. కానీ సోమవారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 0–2 స్కోరుతో బంగ్లాదేశ్‌ చేతిలో కంగుతింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ అసలు ఖాతానే తెరువలేదు. బంగ్లా జట్టులో అర్పిత బిస్వాస్‌ (29వ నిమిషంలో), అల్పి అక్తర్‌ (40వ ని.) చెరో గోల్‌ చేశారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement