Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

'Chanafali Bech Rahe The Kya': Ex-Pak Star Tear Into Team Over NED Show1
జస్ట్‌ మిస్‌.. పల్లీలు అమ్ముకుంటారా?: పాక్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్‌

పాకిస్తాన్‌ సీనియర్‌ ఆటగాళ్ల తీరుపై మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ మండిపడ్డాడు. జట్టుకు ఉపయోగపడని అనుభవం ఉండి ఏం లాభమని ప్రశ్నించాడు. పసికూన చేతిలో తృటిలో పరాభవం తప్పిందని.. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా భారత్‌- శ్రీలంక వేదికగా శనివారం టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ మొదలైన విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో కొలంబో వేదికగా పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ తలపడ్డాయి. అయితే, మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ గెలుపు బోణీ కొట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మూడు బంతులు ఉండగా నెదర్లాండ్స్‌ విధించిన సాధారణ 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్‌ ఏడు వికెట్లు కోల్పోవడంతోపాటు ఆఖరి ఓవర్‌లో మూడు బంతులు ఉండగా నెగ్గి ఊపిరి పీల్చుకుంది.తొలుత నెదర్లాండ్స్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. బాస్‌ డీ లీడ్‌ (30; 4 ఫోర్లు), మిచెల్‌ లెవిట్‌ (24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), అకెర్‌మన్‌ (20; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. పాకిస్తాన్‌ బౌలర్లలో సల్మాన్‌ మీర్జా 3 వికెట్లు పడగొట్టగా... సయీమ్‌ అయూబ్, అబ్రార్‌ అహ్మద్, నవాజ్‌ తలా రెండు వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (31 బంతుల్లో 47;4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. 18 ఓవర్లు ముగిసేసరికి పాక్‌ జట్టు 119/7తో ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (12), బాబర్‌ ఆజమ్‌ (15), ఉస్మాన్‌ ఖాన్‌ (0), షాదాబ్‌ ఖాన్‌ (8), నవాజ్‌ (6) విఫలమయ్యారు.ఫహీమ్‌ ఆష్రఫ్‌ రాణించడంతోవిజయానికి చివరి 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫహీమ్‌ ఆష్రఫ్‌ (11 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ షాట్‌లతో విజృంభించాడు. ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌లో అతడు 6, 2, 6, 6, 4తో 24 పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది. నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఆర్యన్‌ దత్, పాల్‌ వ్యాన్‌ మీకెరెన్‌ చెరో 2 వికెట్లు తీశారు. నిజానికి ఆఖరి ఓవర్లో ఆష్రఫ్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఒడౌడ్‌ వదిలేయడంతో అతడికి లైఫ్‌ రాగా.. పాక్‌ గట్టెక్కింది. ఈ నేపథ్యంలో బసిత్‌ అలీ (Basit Ali) పాక్‌ ప్రదర్శనపై.. ముఖ్యంగా సీనియర్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజం (Babar Azam), నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.పాకిస్తాన్‌ బతికిపోయింది"పాకిస్తాన్‌ బతికిపోయింది. చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది. షాహిన్‌ ఆఫ్రిది బ్యాటింగ్‌ చేయడానికి వచ్చినప్పుడే అంతా అయిపోయిందనుకున్నాం. మిడిలార్డర్‌ చెత్తగా ఆడింది. ముఖ్యంగా బాబర్‌ ఆజం, నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ అసలేం చేశారో వారికైనా తెలుసా?వీళ్లంతా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌లు ఆడుతున్నారు. కానీ ఈరోజు పాకిస్తాన్‌ తరఫున ఒక్కరూ హీరోగా నిలవలేకపోయారు. అందరూ జీరోలుగా మిగిలిపోయారు. బాబర్‌ ఆజం బ్యాటింగ్‌కు రాగానే అంతా సంతోషించారు. అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడని భావించారు.పల్లీలు అమ్ముకోవడానికి వెళ్లారా?కానీ ఇలా వచ్చి అలా వెళ్లడం అతడికి అలవాటైపోయింది. ఫహీమ్‌ ఆష్రఫ్‌ లేకుంటే ఈరోజు పాక్‌ పరువు పోయి ఉండేది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్టార్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా పల్లీలు అమ్ముకోవడానికి అక్కడికి వెళ్లారా?’’ అంటూ బసిత్‌ అలీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

IND vs USA Match: Rohit Sharma Politely Denies Mukesh Ambani Food Offer Viral2
ముకేశ్‌ అంబానీకి నో చెప్పిన రోహిత్‌ శర్మ!

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా పేరొందాడు రోహిత్‌ శర్మ. భారత్‌కు 2024లో టీ20 ప్రపంచకప్‌ అందించిన హిట్‌మ్యాన్‌.. 2025లో చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ గెలిచాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. 2007లో టీ20 ప్రపంచకప్‌ టోర్నీ మొదలుకాగా ఇప్పటి వరకు అన్ని ఎడిషన్లలోనూ రోహిత్‌ భాగమయ్యాడు. అయితే, రిటైర్మెంట్‌ నేపథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో హిట్‌మ్యాన్‌ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఇక పొట్టి ఫార్మాట్లో సత్తా చాటి తానేంటో నిరూపించుకున్న రోహిత్‌ శర్మను ఐసీసీ ఈసారి వరల్డ్‌కప్‌ అంబాసిడర్‌గా నియమించింది.వాంఖడేలో వరల్డ్‌కప్‌ ట్రోఫీతో ఎంట్రీఈ నేపథ్యంలో శనివారం ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవగా.. సొంత మైదానం ముంబైలోని వాంఖడేలో వరల్డ్‌కప్‌ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్‌ శర్మ. అమెరికాతో మ్యాచ్‌ నేపథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు.అంబానీ కుటుంబం ఆప్యాయతఇక భారత వ్యాపార దిగ్గజం, కుబేరుడు ముకేశ్‌ అంబానీ కుటుంబం కూడా ఈ మ్యాచ్‌కు హాజరైంది. భార్య నీతా, కుమారుడు ఆకాశ్‌ అంబానీ తదితరులతో కలిసి ముకేశ్‌ మ్యాచ్‌కు విచ్చేశారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ పక్కకు వెళ్లాలని చూడగా.. ముకేశ్‌ అంబానీ మాత్రం అతడి చేయి పట్టుకుని ఆపి మరీ ఆకాశ్‌కు- తనకు మధ్య కూర్చోబెట్టుకున్నారు.ముకేశ్‌ అంబానీ స్వయంగా ఛాయ్‌ ఇవ్వగాఅంతేకాదు.. మధ్యలో టీతో పాటు స్నాక్స్‌తో కూడిన సాసర్‌ను ముకేశ్‌ అంబానీ రోహిత్‌ శర్మకు అందించారు. అయితే, రోహిత్‌ మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.Last night, Rohit Sharma was going to sit beside Ritika, but Mukesh Ambani asked him to sit next to him instead 🤍 pic.twitter.com/d9YEMXajlv— Kusha Sharma  (@Kushacritic) February 8, 2026కాగా 2011 నుంచి రోహిత్‌కు అంబానీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హిట్‌మ్యాన్‌ ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. 2013 నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్‌ శర్మను తప్పించి.. 2023లో హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్‌. అయితే, రోహిత్‌ మాత్రం ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగుతుండటం విశేషం.చదవండి: Gautam Gambhir: సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్‌

T20 WC: Washington Sundar To join team before IND vs NAM In Delhi3
T20 WC 2026: టీమిండియాకు శుభవార్త

టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందు భారత ప్రధాన జట్టులో మార్పులు జరిగాయి. యువ పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం వల్ల దూరం కాగా.. సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అనూహ్య రీతిలో..దాదాపు ఏడాదిన్నర క్రితం చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడిన సిరాజ్‌ (Mohammed Siraj).. అనూహ్య రీతిలో వరల్డ్‌కప్‌ జట్టులోకి రావడమే కాకుండా.. తుదిజట్టులోనూ స్థానం సంపాదించాడు. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా అమెరికాతో తలపడగా.. భారత్‌ విజయంలో సిరాజ్‌ తన వంతు పాత్ర పోషించాడు.ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ హైదరాబాదీ పేసర్‌.. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన సిరాజ్‌ 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.టీమిండియాకు శుభవార్తఇదిలా ఉంటే.. టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన​ సుందర్‌ (Washington Sundar) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన ఈ చెన్నై చిన్నోడు.. నమీబియాతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ధ్రువీకరించాడు.అమెరికాపై గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘వాషీ ఢిల్లీలో జట్టుతో కలుస్తాడు. అతడు బాగున్నాడు. అంతా బాగుంది’’ అని తెలిపాడు. ఇక బుమ్రా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడన్న సూర్య.. వాతావరణ మార్పు వల్లే అతడు ఇబ్బంది పడుతున్నాడని వెల్లడించాడు.కాగా ముంబై వేదికగా తమ తొలి మ్యాచ్‌ ఆడిన టీమిండియా.. అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించి గెలుపు బోణీ కొట్టింది. తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ వేదికగా నమీబియా జట్టుతో గురువారం సూర్య సేన తలపడుతుంది.టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి టీమిండియాసూర్యకుమార్‌ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, మొహమ్మద్‌ సిరాజ్‌.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

T20 World Cup 2026 February 9 Schedule Venues Timings Details4
T20 WC 2026 Feb 9: ఈరోజు జరిగే మ్యాచ్‌లు ఇవే

భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7) తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో తొలుత గ్రూప్‌-‘ఎ’ నుంచి పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ తలపడ్డాయి. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాక్‌ ఊపిరి పీల్చుకుంది.ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవేఅనంతరం మధ్యాహ్నం మ్యాచ్‌లో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విండీస్‌ 35 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది. ఇక సాయంత్రం మ్యాచ్‌లో గ్రూప్‌-ఎ నుంచి టీమిండియా- అమెరికా తలపడగా.. భారత జట్టు 29 పరుగుల తేడాతో గెలుపొందింది.ఇక ఆదివారం (ఫిబ్రవరి 8) నాటి మ్యాచ్‌లో చెన్నైలో అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్‌.. ముంబైలో నేపాల్‌పై ఇంగ్లండ్‌.. ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించాయి. మరి సోమవారం నాటి షెడ్యూల్‌ ఎలా ఉందంటే..టీ20 ప్రపంచకప్‌-2026: ఫిబ్రవరి 9 షెడ్యూల్‌ ఇదేగ్రూప్‌-సి: స్కాట్లాండ్‌ వర్సెస్‌ ఇటలీ- ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా- ఉదయం 11 గంటలకు ఆరంభంగ్రూప్‌-బి: జింబాబ్వే వర్సెస్‌ ఒమన్‌- సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌, కొలంబో- మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభంగ్రూప్‌-డి: సౌతాఫ్రికా వర్సెస్‌ కెనడా- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌- రాత్రి ఏడు గంటలకు ఆరంభంకాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, నమీబియా, నెదర్లాండ్స్‌, అమెరికా.. గ్రూప్‌- బి నుంచి శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్‌, ఐర్లాండ్‌ పోటీపడుతున్నాయి.ఇక గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఇటలీ, నేపాల్‌, స్కాట్లాండ్‌.. గ్రూప్‌-డి నుంచి న్యూజిలాండ్‌, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ, అఫ్గనిస్తాన్‌ రేసులో ఉన్నాయి. స్టార్‌ స్పోర్ట్స్‌, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

T20 WC: Gambhir hosts Team Indi for special dinner in Delhi Video Viral5
సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్‌

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీని విజయంతో ఆరంభించింది టీమిండియా. ముంబై వేదికగా శనివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. తదుపరి.. గురువారం నాటి మ్యాచ్‌లో నమీబియాతో భారత్‌ మ్యాచ్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం ఇందుకు వేదిక.సతీసమేతంగాఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) భారత జట్టును తమ ఇంటికి ఆహ్వానించాడు. తొలుత కారులో గంభీర్‌ తమ ఇంటికి చేరుకున్నాడు. అనంతరం భార్య నటాషా, పిల్లలతో కలిసి టీమిండియాను తమ నివాసానికి సాదరంగా ఆహ్వానించాడు.ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తదితరులు ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో ఉన్న గంభీర్‌ నాలుగు అంతస్థుల విలాస భవనానికి విచ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.#WATCH | Members of the Indian T20 cricket team arrive at the residence of Indian Cricket Team Head Coach Gautam Gambhir in Delhi. Gautam Gambhir is hosting a special dinner for the team https://t.co/VQ2symRZ2M pic.twitter.com/tXgiuAwN6D— ANI (@ANI) February 8, 2026అందుకే డిన్నర్‌ పార్టీలుకాగా టీమిండియాకు ఆటవిడుపు కలిగించేందుకు, జట్టు సభ్యుల మధ్య స్నేహ భావం మరింత పెంపొందేలా గంభీర్‌ డిన్నర్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగానూ ఇలాగే ఆటగాళ్లకు పార్టీ ఇచ్చాడు. ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆటగాళ్ల మధ్య ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా వాటికి పరిష్కారం చూపేలా హెడ్‌కోచ్‌ ఇలాంటి వేదికను ఏర్పాటు​ చేసినట్లు తెలుస్తోంది.టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌.. గ్రూప్‌-ఎలో పాకిస్తాన్‌, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్‌ దేశాలతో కలిసి ఉంది. తొలుత అమెరికాతో మ్యాచ్‌ ఆడిన టీమిండియా.. ఆ తర్వాత గురువారం నమీబియా (ఫిబ్రవరి 12), ఆదివారం పాకిస్తాన్‌ (ఫిబ్రవరి 15).. లీగ్‌ దశలో చివరగా వచ్చే బుధవారం (ఫిబ్రవరి 18) నెదర్లాండ్స్‌తో తలపడేలా షెడ్యూల్‌ ఖరారైంది.టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి భారత జట్టుసూర్యకుమార్‌ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, మొహమ్మద్‌ సిరాజ్‌.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!#WATCH | Indian Cricket Team Head Coach Gautam Gambhir arrives at his residence in Delhi pic.twitter.com/Y3yg3yvgVy— ANI (@ANI) February 8, 2026

T20 WC: Pak Willing To End India Boycott But Has 3 Demands: Report6
IND vs PAK: పాపం బంగ్లాదేశ్‌!.. బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌తో ఆడేందుకు పాకిస్తాన్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ముందు పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మూడు షరతులు ఉంచినట్లు సమాచారం. కాగా బంగ్లాదేశ్‌కు మద్దతగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌ కోసమంటూ.. భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్‌ తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఇందులో నిజం లేదంటూ ఐసీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ బంగ్లా పంతం వీడకపోవడంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో తమకు తటస్థ వేదికగా శ్రీలంక ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌ కోసమంటూ.. తామూ టోర్నీ ఆడమని పాక్‌ కొత్త నాటకానికి తెరతీసింది.మరో డ్రామాఅయితే, ఈ విషయంలో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంటుందనే భయంతో మాట మార్చి తాము భారత్‌తో మాత్రమే మ్యాచ్‌ ఆడమని మరో డ్రామాకు తెరలేపింది. క్రికెట్‌ ప్రపంచంలో అత్యధిక క్రేజ్‌ ఉన్న భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగకపోతే.. ఐసీసీతో పాటు సభ్య దేశాలు భారీ ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. పాక్‌ క్రికెట్‌ బోర్డు మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.ఘాటుగా స్పందించిన శ్రీలంకఇక ఈ విషయంపై శ్రీలంక సైతం ఘాటుగానే స్పందించింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. భారత్‌తో మ్యాచ్‌పై పునరాలోచన చేయాలని పీసీబీకి విజ్ఞప్తి చేసింది. ఇతర సభ్య దేశాల బోర్డులు సైతం పాక్‌ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.మూడు ప్రధాన షరతులుఈ నేపథ్యంలో మొదటికే మోసం వస్తుందని భావించిన పాక్‌.. పంతం వీడేందుకు సిద్ధపడినా.. మూడు ప్రధాన షరతులతో ఐసీసీని లాక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఎక్కువ డబ్బు కావాలి!ఐసీసీ నుంచి తమకు అదనంగా నిధులు సమకూర్చాలని కోరింది. ప్రస్తుతం ఐసీసీ రెవెన్యూ నుంచి నుంచి పీసీబీ 5.75 శాతం ఆదాయం పొందుతోంది. మరోవైపు.. ఇందులో బీసీసీఐ వాటా 39 శాతం. ఇక భారత్‌తో తమ క్రికెట్‌ సంబంధాలను తిరిగి పునరుద్ధరించాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా 2012 నుంచి భారత్‌- పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపో​యిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసియా కప్‌, వరల్డ్‌కప్‌ వంటి టోర్నీలలో మాత్రమే దాయాదులు ముఖాముఖి తలపడుతున్నాయి.కరచాలనం చేయాలిఅదే విధంగా.. టీ20 ప్రపంచకప్‌-2026 మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తమ జట్టుతో కరచాలనం చేయాలని పీసీబీ ఐసీసీకి కండిషన్‌ పెట్టినట్లు సమాచారం. కాగా పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్‌లో పాక్‌ ఆటగాళ్లతో టీమిండియా షేక్‌హ్యాండ్‌కు నిరాకరించిన విషయం తెలిసిందే.పాక్‌ బుద్ధి చూపించిందంటూ ట్రోల్స్‌!ఈ మూడు షరతులకు అంగీకరిస్తేనే తాము టీమిండియాతో మ్యాచ్‌ ఆడతామని పీసీబీ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారగా.. ‘‘పాక్‌ బుద్ధి చూపించింది. డబ్బు కోసం బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతోంది. నిజంగా బంగ్లాపై అంత ప్రేమ ఉంటే టోర్నీ నుంచి వైదొలగాల్సింది.అలా కాకుండా తటస్థ వేదిక ఏర్పాటు చేసినా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి.. క్యాష్‌ చేసుకోవాలని చూస్తోంది. ఇంతకంటే చెత్త విషయం మరొకటి ఉండదు’’ అని టీమిండియా అభిమానులు పీసీబీ తీరుపై మండిపడుతున్నారు. కాగా శనివారం (ఫిబ్రవరి 7) నుంచి భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌ మొదలైన సంగతి తెలిసిందే.వద్దు.. అలా చేయొద్దుఅయితే, పాక్‌ మీడియా డాన్‌ కథనం ప్రకారం.. బంగ్లాదేశ్‌కు పరిహారం చెల్లించాలని పాక్‌ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరాకరించిన ఐసీసీ.. మొత్తం ఆదాయంలో మాత్రం బంగ్లాదేశ్‌కు ఇవ్వాల్సిన వాటా ఇస్తామని తెలిపినట్లు సమాచారం. అంతేకాదు.. పాక్‌ బోర్డు భారత్‌తో మ్యాచ్‌ విషయంలో పునరాలోచన చేయాలని.. ఇలా బహిష్కరిస్తామని చెప్పడం క్రికెట్‌కు ఎంతమాత్రం సరికాదని గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన నేపాల్‌ బౌలర్‌

Nandyal Saiteja Mukkamalla playing for the USA cricket team7
అమెరికా క్రికెట్‌ జట్టులో నంద్యాల యువకుడు

సంజామల: వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్‌ రెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ టీ–20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా ఇండియాతో తలపడిన అమెరికా(యుఎస్‌ఏ) జట్టు తరఫున బరిలో దిగాడు. సాయితేజకు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. చదువుకుంటూనే హైదరాబాద్‌లోని వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందాడు. 2022లో 18 ఏళ్ల వయసులో యుఎస్‌ఏ జాతీయ జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ–20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లలో యుఎస్‌ఎ తరఫున ఆడుతున్నాడు. శనివారం టీ–20 ప్రపంచ కప్‌లో భాగంగా టీం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా తరఫున బరిలో దిగాడు. నంద్యాల జిల్లా యువకుడు అమెరికా దేశం తరఫున టీ–20 ప్రపంచ కప్‌లో ఆడుతుండడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

England defeated Nepal by 4 runs in the T20 World Cup8
ఇంగ్లండ్‌ను వణికించిన నేపాల్‌

ముంబై: ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో చిన్న జట్ల జోరు సాగుతోంది. తొలి రోజు పాకిస్తాన్‌పై నెదర్లాండ్స్‌ గెలిచినంత పనిచేయగా... స్టార్‌లతో నిండి ఉన్న టీమిండియాను అమెరికా భయపెట్టింది. రెండో రోజు ఇదే తరహాలో రెండుసార్లు చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టును నేపాల్‌ వణికించింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. నేపాల్‌ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా... అప్పటి వరకు చక్కటి షాట్‌లు ఆడుతూ జట్టులో ఆశలు రేపిన లోకేశ్‌ బామ్‌... స్యామ్‌ కరన్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌లు ఆడలేకపోయాడు. ఫలితంగా ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ ఇంగ్లండ్‌ 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్‌ బెథెల్‌ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెపె్టన్‌ హ్యారీ బ్రూక్‌ (32 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (18 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ఆఖర్లో మెరుపు షాట్‌లు ఆడగా... జోస్‌ బట్లర్‌ (26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఫిల్‌ సాల్ట్‌ (1), టామ్‌ బాంటన్‌ (2), స్యామ్‌ కరన్‌ (2) విఫలమయ్యారు. నేపాల్‌ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్‌ (29 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ రోహిత్‌ పౌడెల్‌ (34 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లోకేశ్‌ బామ్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్‌ (29; 4 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడారు. నేపాల్‌ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో... ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో లోకేశ్‌ రెండు సిక్స్‌లతో కలిపి 22 పరుగులు వచ్చాయి. తదుపరి ఓవర్‌లో మరో రెండు ఫోర్‌లతో లోకేశ్‌ 14 పరుగులు రాబట్టాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులకు చేరగా... స్యామ్‌ కరన్‌ ఆఖరి ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చి నేపాల్‌ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. టి20 ప్రపంచకప్‌లో నేడుస్కాట్లాండ్‌ X ఇటలీవేదిక: కోల్‌కతా; ఉదయం 11 గంటల నుంచిజింబాబ్వే X ఒమన్‌వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గంటల నుంచిదక్షిణాఫ్రికా X కెనడా వేదిక: అహ్మదాబాద్‌; రాత్రి 7 గంటల నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Gold medal for the Elavenil Arjun pair9
ఇలవేనిల్‌–అర్జున్‌ జోడీకి స్వర్ణ పతకం

న్యూఢిల్లీ: ఆసియా సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇలవేనిల్‌ వలారివన్‌–అర్జున్‌ బబూతా ద్వయం భారత్‌కు పసిడి పతకాన్ని అందించింది. నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్‌–అర్జున్‌ జోడీ 505 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 10 మీటర్ల జూనియర్‌ ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో హిమాన్షు–శాంభవి ద్వయం 502.4 పాయింట్లు స్కోరు చేసి భారత్‌ ఖాతాలో పసిడి పతకాన్ని చేర్చింది. ముకేశ్‌కు రజతం, తనిష్క్ కు కాంస్యం 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ సీనియర్‌ పురుషుల ఈవెంట్‌లో భారత షూటర్లు గుర్‌ప్రీత్‌ (575 పాయింట్లు), హర్‌‡్ష (571), అమన్‌ ప్రీత్‌ (569) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ జూనియర్‌ పురుషుల ఈవెంట్‌లోనూ భారత షూటర్లు క్లీన్‌స్వీప్‌తో అదరగొట్టారు. సూరజ్‌ శర్మ (576 పాయింట్లు)స్వర్ణం నెగ్గగా... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముకేశ్‌ నేలవల్లి (559) రజతం... తెలంగాణకు చెందిన కొడవలి తనిష్క్‌ మురళీధర్‌ నాయుడు (557) కాంస్య పతకం సాధించారు. సీనియర్, జూనియర్‌ విభాగాల్లో కలిపి ఇప్పటి వరకు భారత షూటర్లు 30 స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 50 పతకాలు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

Indias sensational victory over the Netherlands10
దక్షిణేశ్వర్‌ ధమాకా

బెంగళూరు: దేశం కోసం ఆడే సమయంలో భారత టెన్నిస్‌ ఆటగాళ్ల ర్యాంక్‌లను పట్టించుకోవద్దని మరోసారి నిరూపితమైంది. దక్షిణేశ్వర్‌ సురేశ్‌... ప్రపంచ సింగిల్స్‌లో 465వ ర్యాంక్‌... భారత్‌లో నాలుగో ర్యాంక్‌... ప్రపంచ డబుల్స్‌లో 457వ ర్యాంక్‌... అయినా సొంతగడ్డపై ఈ ఆజానుబాహుడు అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు.నెదర్లాండ్స్‌ లాంటి పటిష్ట జట్టుతో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ తొలి రౌండ్‌లో అన్నీతానై ఈ తమిళనాడు ప్లేయర్‌ భారత్‌కు 3–2తో సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఫలితంగా డేవిస్‌కప్‌ పురుషుల ప్రపంచ టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో టీమిండియా వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. 2004లో జపాన్‌ జట్టుపై లియాండర్‌ పేస్‌ తర్వాత భారత్‌ నుంచి ఒక ప్లేయర్‌ రెండు సింగిల్స్‌లో, ఒక డబుల్స్‌లో ఆడి గెలవడం ఇదే ప్రథమం. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 78 కేజీల బరువున్న దక్షిణేశ్వర్‌ ఆదివారం ముందుగా డబుల్స్‌ మ్యాచ్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్, ప్రపంచ 20వ ర్యాంకర్‌ యూకీ బాంబ్రీతో జతకట్టి బరిలోకి దిగాడు. 3 గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణేశ్వర్‌–యూకీ ద్వయం 7–6 (7/0), 3–6, 7–6 (7/1)తో సాండెర్‌ అరెండ్స్‌–డేవిడ్‌ పెల్‌ జోడీని ఓడించింది. దాంతో భారత్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం రివర్స్‌ సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ 7–5, 1–6, 4–6తో ప్రపంచ 73వ ర్యాంకర్‌ జెస్పెర్‌ డి జాంగ్‌ చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన రివర్స్‌ సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో దక్షిణేశ్వర్‌ బరిలోకి దిగాడు. సాధికారిక ఆటతీరును ప్రదర్శించి 99 నిమిషాల్లో 6–4, 7–6 (7/4)తో ప్రపంచ 160వ ర్యాంకర్‌ గయ్‌ డెన్‌ ఉడెన్‌ను ఓడించి భారత్‌కు 3–2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement