Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

BCCI gives update on Tilak Varma, batter ruled out of first 3 IND vs NZ T20Is1
టీమిండియాకు భారీ షాక్‌..

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్‌ వేదికగా ధ్రువీకరించింది."తిలక్ వర్మ శస్త్రచికిత్స విజయవంతమైంది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. తిలక్‌ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శుక్రవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. నొప్పి త‌గ్గిన త‌ర్వాత అత‌డు త‌న ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్ట‌నున్నాడు. ఈ క్రమంలోన్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు దూరంగా ఉండనున్నాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.ఏమి జరిగిందంటే? తిలక్ ప్రస్తుతం విజయ్ హజారే-2025లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో తిలక్‌కు పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే అతడిని రాజ్‌కోట్‌లో గోకుల్‌కు ఆస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించారు.అతడికి టెస్టిక్యులర్ టార్షన్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తిలక్‌ ఈ సిరీస్‌కు దూరమైనా టీ20 ప్రపంచకప్‌-2026 నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశముంది. జనవరి 21 నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

WPL 2026 schedule: Check full list of matches with timings2
డ‌బ్ల్యూపీఎల్‌-2026కు స‌ర్వం సిద్దం.. షెడ్యూల్ ఇదే! తదితర వివరాలు ఇవే

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో శుక్రవారం నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీని నవీ ముంబైతో పాటు వ‌డోద‌ర వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు.జనవరి 9 నుంచి 17 వరకు తొలి 11 మ్యాచ్‌లు నవీ ముంబైలో జ‌ర‌గ‌నుండ‌గా. ఆ త‌ర్వాత టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల‌కు వ‌డోద‌రలోని బీసీఎ స్టేడియం ఆతిథ్య‌మివ్వ‌నుంది. కీల‌క‌మైన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌తో ఫైన‌ల్ కూడా ఇదే వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఫిబ్రవరి 3న ఎలిమినేటర్ మ్యాచ్, ఫిబ్రవరి 5న ఫైనల్‌సాధార‌ణంగా డ‌బ్ల్యూపీఎల్ ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగుతుంది. కానీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌-2026 కార‌ణంగా ఈ టోర్నీని గ‌తంలో కంటే ఒక నెల ముందుగానే నిర్వహిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్,యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మొత్తం ఐదు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు, యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్‌లు వచ్చారు. ఢిల్లీ జట్టుకు భారత స్టార్ ప్లేయర్ రోడ్రిగ్స్ సారథ్యం వహించనుండగా.. యూపీ వారియర్స్‌ను ఆసీస్ లెజెండ్ మెగ్ లానింగ్ ముందుండి నడిపించనుంది.డబ్ల్యూపీఎల్‌ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే..జనవరి 9 – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (నవీ ముంబై)జనవరి 10 – యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్ (న‌వీ ముంబై)జనవరి 10 – ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)జనవరి 11 – ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (న‌వీ ముంబై)జనవరి 12 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్, (నవీ ముంబై)జనవరి 13 – ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)జనవరి 14 – యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)జనవరి 15 – ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్ ( నవీ ముంబై)జనవరి 16 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)జనవరి 17 – యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స్ ( నవీ ముంబై)జనవరి 17 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( నవీ ముంబై)జనవరి 19 – గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)జనవరి 20 – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ ( వడోదర)జనవరి 22 – గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ ( వడోదర)జనవరి 24 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)జనవరి 26 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ ( వడోదర)జనవరి 27 – గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)జనవరి 29 – యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)జనవరి 30 – గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (వడోదర)ఫిబ్రవరి 1 – ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్ (వడోదర)ఫిబ్రవరి 3 – ఎలిమినేటర్ (వ‌డోదర)ఫిబ్రవరి 5 – ఫైనల్ ( వడోదర)మ్యాచ్‌లు ఎక్కడ చూడాలంటే?ఈ మ్యాచ్‌లను అభిమానులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. అదేవిధంగా జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌ల‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. కాగా నవీ ముంబైలో జరగనున్న ప్రారంభ వేడుకల్లో యోయో హనీ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్లు పాల్గోనున్నారు.

Mizoram cricketer dies after collapsing during a match3
మ్యాచ్‌ జరుగుతుండగా గుండెపోటు.. రంజీ క్రికెటర్‌ హఠాన్మరణం

భార‌త క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిజోరంకు చెందిన‌ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ కె. లాల్రెమ్రుటా (38) గుండె పోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం ధ్రువీకరించింది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు సమీపంలోని సిహ్ముయ్‌లో సెకండ్ డివిజన్ స్క్రీనింగ్ టోర్నమెంట్ జరుగుతోంది.ఈ టోర్నీలో వెంగ్‌నువాయ్ రైడర్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించిన లాల్రెమ్రుటా.. గురువారం చాన్‌పుయ్ క్రికెట్ క్లబ్‌తో మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని హుటాహుటిన అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లాల్రెమ్రుటా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. లాల్రెమ్రుటా మృతి పట్ల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది."లాల్రెమ్రుటా రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో మిజోరంకు ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఏడు మ్యాచ్‌లు ఆడాడు. రాష్ట్ర స్ధాయిలో కూడా చాలా మ్యాచ్‌లలో తన ప్రతిభను చాటుకున్నాడు.మిజోరం ఒక గొప్ప క్రికెటర్‌ను కోల్పోయింది. లాల్రెమ్రుటా కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము" అని సీఏఎం ఒక ప్రకటనలో పేర్కొంది. మిజోరం క్రీడా శాఖా మంత్రి లాల్‌గింగ్లోవాహ్మర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.చదవండి: IPL 2026: ఆర్సీబీకి గుడ్ న్యూస్‌.. ఫామ్‌లోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్‌

Venkatesh Iyer prove haters wrong with dazzling VHT knocks4
ఆర్సీబీకి గుడ్ న్యూస్‌.. ఫామ్‌లోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్‌

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు వెంకటేష్‌ అయ్యర్‌ ఎట్టుకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 208 పరుగుల లక్ష్య చేధనలో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.తొలుత ఆచితూచి ఆడిన వెంకటేష్‌.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు యశ్‌ దూబే(40), త్రిపురేష్‌(36) రాణించారు. ఫలితంగా లక్ష్యాన్ని ఎంపీ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 23.2 ఓవర్లలో చేధించింది.అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక 47.4 ఓవర్లలో కేవలం 207 పరుగులకే ఆలౌటైంది. మధ్యప్రదేశ్‌ పేసర్‌ శివాంగ్‌ కుమార్‌ 5 వికెట్లు పడగొట్టి కర్ణాటక పతనాన్ని శాసించాడు. కర్ణాటక బ్యాటర్లలో కెప్టెన్‌ మయాక్‌ అగర్వాల్‌(49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.ఆర్సీబీకి గుడ్ న్యూస్‌..ఐపీఎల్‌-2026లో వెంకటేశ్ అయ్యర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడనున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో రూ. 7 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత అతడు తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుస మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్నాడు.ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు అయ్యర్ తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు అయ్యర్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్‌-2025లో సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్ తరపున దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని కేకేఆర్ వేలంలోకి విడిచిపెట్టింది.చదవండి: VHT 2025-26: చ‌రిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌.. సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు

Enna Thambi Vaibhav Suryavanshi stepping into big shoes of Sanju: Ashwin5
ఏంటి తమ్ముడూ ఇది!.. సంజూ స్థానంలో వైభవ్‌ సూర్యవంశీ ఫిక్స్‌!

భారత క్రికెట్‌లోకి దూసుకువచ్చిన సరికొత్త సంచలనం పేరు వైభవ్‌ సూర్యవంశీ. తోటి పిల్లలంతా స్కూల్‌ చదువుతో బిజీగా ఉంటే.. అతడు మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్నాడు. పద్నాలుగేళ్ల వయసుకే ఇప్పటికే ఆరు దేశాల్లో ఆరు సెంచరీలు చేసి మరో ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’గా నీరాజనాలు అందుకుంటున్నాడు.దూకుడైన ఆటకు మారుపేరైన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌గానూ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సౌతాఫ్రికా అండర్‌-19 జట్టుతో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల యూత్‌ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేశాడు. ఆఖరి వన్డేలో విధ్వంసకర శతకం బాది.. మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.సెంచరీల మోతచెన్నై వేదికగా 2024లో ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు (104)తో యూత్‌ టెస్టులో శతక్కట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున గుజరాత్‌ టైటాన్స్‌(101)పై సెంచరీ సాధించాడు. గతేడాది ఇంగ్లండ్‌ గడ్డ మీద యూత్‌ వన్డేలో శతకం (143) నమోదు చేసిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌... ఆస్ట్రేలియాలో యూత్‌ టెస్టులోనూ (113) శతక్కొట్టాడు.ఇక ఇండియా-ఎ తరఫున దోహా వేదికగా యూఏఈపై టీ20 సెంచరీ (144) సాధించిన వైభవ్‌ సూర్యవంశీ.. తన సొంతజట్టు బిహార్‌ తరఫున దేశీ క్రికెట్‌లో మహారాష్ట్రపై టీ20 శతకం (108*) సాధించాడు. అనంతరం దుబాయ్‌లో యూఏఈ అండర్‌​-19 జట్టుతో యూత్‌ వన్డేలో (171)లోనూ శతక్కొట్టిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇటీవల విజయ్‌ హజారే వన్డే టోర్నీలో అరుణాచల్‌ ప్రదేశ్‌పై (190) భారీ శతకం సాధించాడు. తాజాగా సౌతాఫ్రికాతో మూడో యూత్‌ వన్డేలో 127 పరుగులతో సత్తా చాటాడు.ఆరు దేశాల్లో ఆరు సెంచరీలుఇలా భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, ఖతార్‌, యూఏఈ, సౌతాఫ్రికా దేశాల్లో సెంచరీలు చేసి.. తాను ఎక్కడైనా బ్యాట్‌ ఝులిపించగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్‌ టీమిండియాలో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందిస్తూ.. ‘‘171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25) & 127(74)... గత ముప్పై రోజులుగా దేశీ, అండర్‌-19 క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ సాధించిన స్కోర్లు ఇవి.ఏంటి తమ్ముడూ ఇది!ఇదంతా ఏంటి తమ్ముడు?... శాంపిల్‌ చూపించావా? మున్ముందు ఇంతకంటే గొప్పగా చెలరేగిపోతావా?.. 14 ఏళ్ల వయసున్న పిల్లాడు ఇలా ఆడుతున్నాడంటే నమ్మబుద్ధికావడమే లేదు. అతడి ఆటను వర్ణించేందుకు మాటలు రావడం లేదు.సంజూ శాంసన్‌ స్థానంలోఅండర్‌-19 వరల్డ్‌కప్‌-2026లో అతడు షోటాపర్‌ కాబోతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌లో సంజూ శాంసన్‌ స్థానంలో పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. వచ్చే నాలుగు నెలలు మనకు వైభవ్‌ జాతరే!అతడి పట్టుదల, టెంపర్‌మెంట్‌, పరుగుల దాహం.. మనకు సరికొత్త అనుభూతి పంచబోతోంది’’ అంటూ అశూ.. వైభవ్‌ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఈ చిచ్చరపిడుగు భర్తీ చేస్తాడని అంచనా వేశాడు. కాగా సంజూ శాంసన్‌ను రాజస్తాన్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ చేసిన విషయం తెలిసిందే.ఓపెనింగ్‌ స్థానానికి ఎసరుఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకు వేసి.. భారత టీ20 జట్టులోనూ సంజూ ఓపెనింగ్‌ స్థానానికి వైభవ్‌ ఎసరుపెట్టబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2026లో సత్తా చాటితేనే సంజూ స్థానం పదిలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ అన్నీ కలిసివచ్చి ఈ ఏడాదే గనుక వైభవ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెడితే.. క్రికెట్‌ దేవుడు, దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలవడం ఖాయం. సచిన్‌ పదహారేళ్లకు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తే.. వైభవ్‌ పద్నాలుగు- పదిహేనేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. కాగా బిహార్‌లో 2011, మార్చి 27న వైభవ్‌ సూర్యవంశీ జన్మించాడు.చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు షాక్‌.. ఒక్క పరుగు తేడాతో..

Ben Stokes hints at the end of Bazball after Ashes defeat vs Aus6
‘బజ్‌బాల్‌’ ఖేల్‌ ఖతం!.. స్టోక్స్‌ కీలక వ్యాఖ్యలు

యాషెస్‌ 2025-26 సిరీస్‌ను విజయంతో ముగించాలన్న ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఆఖదైన ఐదో టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా 4-1తో ఈ టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఆసీస్‌ తమ సొంతం చేసుకుంది.పెర్త్‌, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ టెస్టుల్లో ఆసీస్‌ గెలవగా.. మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. అయితే, సిడ్నీ వేదికగా ఆదివారం మొదలైన ఐదో టెస్టు.. గురువారం ముగిసింది. ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ‘బజ్‌బాల్‌’ ఆటకు స్వస్తి!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) స్పందించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దూకుడుగా ముందుకుపోయే ‘బజ్‌బాల్‌’ ఆటకు స్వస్తి పలుకుతామనే సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మాతో మ్యాచ్‌లో ఎలా ఆడాలో బహుశా అన్ని జట్లకు తెలిసిపోయి ఉంటుంది.బ్యాట్‌తో బరిలోకి దిగినపుడు మేము అంతా బాగుందనే అనుకుంటున్నాం. కానీ ప్రత్యర్థి జట్లు మాకోసం మరింత మెరుగైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. వాళ్లు ఎదురుదాడికి దిగుతున్నారు.ఇలాగే ఆడితే..కాబట్టి పరిస్థితులకు తగ్గట్లుగా మేము బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మా ప్రదర్శన తీసికట్టుగా ఉంది. మా బ్యాటింగ్‌ సరిగ్గా లేదు. ఇక ముందు కూడా ఇలాగే ఆడితే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో ఈ విషయాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను.ఒకరిపై ఒకరం నిందలు వేసుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. అయితే, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఆడాలి. మా జట్టు అలాంటిదే. మేము తిరిగి పుంజుకుని మునుపటి మాదిరే ఉన్నత స్థితికి చేరుకుంటాం.ఏదేమైనా ఈ సిరీస్‌ మొత్తం ఆస్ట్రేలియా అత్యద్భుతంగా ఆడింది. వాళ్లకు కచ్చితంగా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. స్టీవ్‌ స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌.. ఆసీస్‌ జట్టు మొత్తం అదరగొట్టింది. మేము కూడా మా పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం’’ అని స్టోక్స్‌ పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌ గడ్డపై యాషెస్‌లో మరోసారి ఘోర పరాభవం నేపథ్యంలో ‘బజ్‌బాల్’‌ ఆద్యులు హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌, కెప్టెన్‌ స్టోక్స్‌ను పదవుల నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ యాషెస్‌ ఐదో టెస్టు స్కోర్లు👉వేదిక: సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌, సిడ్నీ👉టాస్‌: ఇంగ్లండ్‌.. తొలుత బ్యాటింగ్‌👉ఇంగ్లండ్‌: 384 & 342👉ఆస్ట్రేలియా: 567 & 161/5👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఆసీస్‌ గెలుపు.చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు షాక్‌.. ఒక్క పరుగు తేడాతో..

Sri Lanka appoint Vikram Rathour as batting coach7
శ్రీలంక మాస్టర్‌ మైండ్‌.. వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కోచ్‌తో ఒప్పందం

టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటిం‍గ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్‌ను ఎస్‌ఎల్‌సీ నియమించింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీకి శ్రీలంక జ‌ట్టును స‌న్న‌ద్దం చేసేందుకు విక్రమ్ రాథోర్‌ను కన్సల్టెన్సీ ప్రాతిపదికన బ్యాటింగ్ కోచ్‌గా నియ‌మించాము అని లంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.రాథోర్‌ జ‌న‌వ‌రి 18న లంక‌తో జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. ప్రపంచ కప్ ముగిసే వరకు జ‌ట్టుతోనే ఉండ‌నున్నాడు. విక్ర‌మ్‌కు కోచ్‌గా అపార‌మైన అనుభ‌వం ఉంది. . 2019 సెప్టెంబ‌ర్ నుంచి 2024 జూలై వ‌ర‌కు భార‌త బ్యాటింగ్ కోచ్‌గా చేశారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలోఅత‌డు కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ లెవ‌ల్ 3 కోచ్‌గా కొన‌సాగాడు.అత‌డు ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా కూడా ప‌నిచేస్తున్నాడు. కాగా శ్రీలంక ఇప్ప‌టికే భార‌త మాజీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ రామకృష్ణన్ శ్రీధర్‌ను త‌మ ఫీల్డింగ్ కోచ్‌గా నియ‌మించింది. రాథోర్ భార‌త బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలోనే ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధ‌ర్ పనిచేశాడు.శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ లక్ష్యంగా భారత కోచింగ్ అనుభవాన్ని ఉపయోంచుకుంటుంది. అదేవిధంగా లెజెండరీ బౌలర్ లసిత్ మలింగ కూడా ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవ‌లందించ‌నున్నాడు. కాగా ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు శ్రీలంక‌, భార‌త్ సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి. శ్రీలంక త‌మ లీగ్ మ్యాచ్‌ల‌న్నింట‌ని స్వ‌దేశంలోనే ఆడ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

Sarfaraz Khan joins ODI race with fastest List A half-century by an Indian8
చ‌రిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌.. సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు

విజ‌య్ హ‌జారే ట్రోఫీ 2025-26లో టీమిండియా ఆటగాడు, ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ముంబైకర్ తన సంచలన బ్యాటిం‍గ్‌తో టీ20 మ్యాచ్‌ను తలపించాడు. ప్రత్యర్ది బౌలర్లను ఉతికారేశాడు.ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మకు సర్ఫరాజ్‌చుక్కలు చూపించాడు. అభిషేక్ వేసిన 16 ఓవర్‌లో సర్ఫరాజ్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.త‌ద్వారా లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ సాధించిన భార‌త ప్లేయ‌ర్‌గా స‌ర్ఫ‌రాజ్ చ‌రిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అబిజిత్ కాలే, అటిత్ షేత్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. తాజా మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ కేవలం 15 బంతుల్లోనే ఆర్ధ శతకం బాది ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌, కోహ్లి, రోహిత్‌ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫీట్‌ సాధించలేకపోయారు.మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ .. ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ ముంబై కేవలం​ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 217 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ముంబై జట్టులో టాపర్డర్ రాణించినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.సర్ఫరాజ్ రీ ఎంట్రీ ఇస్తాడా?దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్‌. ఇంగ్లండ్‌పై తన అరంగేట్రంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. తర్వాత మ్యాచ్‌లలో నిలకడ లేకపోవడంతో అతడిని టెస్టు జట్టు నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడు సర్ఫరాజ్‌ తన అద్భుత ప్రదర్శనలతో కేవలం టెస్టులకే కాకుండా పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు తన సిద్దమేనని సవాల్ విసురుతున్నాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సర్ఫరాజ్ దుమ్ములేపాడు.చదవండి: ENG vs NZ: మద్యం మత్తులో దురుసు ప్రవర్తన..! ఇంగ్లండ్‌ కెప్టెన్‌కు రూ. 33 లక్షల ఫైన్‌

Rohit Sharma wife Ritika Sajdeh buys an apartment for Rs 26 Cr: Report9
అపార్టుమెంటు కొనుగోలు చేసిన రితికా.. ధర ఎన్ని కోట్లంటే?

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే ఖరీదైన అపార్టుమెంట్‌ కొనుగోలు చేశారు. ముంబైలోని ప్రభాదేవి ఏరియాలో రూ. 26.30 కోట్ల విలువ గల నివాస స్థలాన్ని ఆమె కొన్నారు. దీని విస్తీర్ణం 2760.40 చదరపు అడుగులు అని తెలుస్తోంది.అదే విధంగా.. మూడు కార్లు పార్కింగ్‌ చేసుకునే వెసలుబాటు కూడా ఉన్నట్లు సమాచారం. ‘స్క్వేర్‌ యార్డ్స్‌’ అందించిన వివరాల ప్రకారం.. ఈ అపార్డుమెంటు కొనుగోలు సమయంలో రితికా సజ్దే (Ritika Sajdeh).. రూ. 1.13 కోట్లు స్టాంపు డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలకు రూ. 30 వేలు ఖర్చు అయ్యాయి. గతేడాది డిసెంబరు 12న రిజిస్ట్రేషన్‌ పూర్తైంది.స్పోర్ట్స్‌ మేనేజర్‌అజింక్య డీవై పాటిల్‌, పూజా అజింక్య పాటిల్‌ నుంచి రితికా సజ్దే ఈ అపార్డుమెంటును కొనుగోలు చేశారు. కాగా భారత దిగ్గజ బ్యాటర్‌గా పేరొందిన రోహిత్‌ శర్మ.. రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తొలుత తన స్పోర్ట్స్‌ మేనేజర్‌గా పనిచేసిన రితికాను జీవిత భాగస్వామి చేసుకున్నాడు.నికర ఆస్తి విలువ ఎంతంటే?ఇక టీమిండియా సంపన్న క్రికెటర్లలో ఒకడైన రోహిత్‌ శర్మ (Rohit Sharma) నికర ఆస్తుల విలువ 2025 నాటికి రూ. 230 కోట్లు అని సమాచారం. వర్లీలో అతడికి దాదాపు రూ. 30 కోట్ల విలువైన అపార్టుమెంట్‌ ఉంది. అతడి దగ్గర లంబోర్గిని ఉరుస్‌, బీఎండబ్ల్యూ ఎం5 వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.ఓవైపు ఆటగాడిగా కొనసాగుతూనే క్రికెట్‌ అకాడమీ స్థాపించాడు రోహిత్‌ శర్మ. కాగా రోహిత్‌- రితికా దంపతులకు కుమార్తె సమైరా, కుమారుడు అహాన్‌ సంతానం. ఇదిలా ఉంటే.. మహిళలు ఫ్లాట్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ కింద ఒక శాతం రాయితీ లభిస్తుందట. ఇక మహారాష్ట్రలో మహిళలు ఇంటి యజమానులుగా ఉంటే.. పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది.చదవండి: అభిషేక్‌ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్‌.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో..Rohit Sharma: కోహ్లి కంటే సన్నబడ్డాడే!.. కింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్‌!

England captain Harry Brook fined INR 36 lakh by ECB for engaging in a fight before Ashes10
ఇంగ్లండ్‌ కెప్టెన్‌కు రూ. 33 లక్షల ఫైన్‌.. ఎందుకంటే?

ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జ‌ట్టు ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 1న వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేకు ముందు బ్రూక్‌ ఓ నైట్ క్ల‌బ్ బౌన్స‌ర్‌తో దురుసగా ప్ర‌వ‌ర్తించాడు.నైట్‌క్లబ్‌లోకి వెళ్లేందుకు బ్రూక్‌ ప్రయత్నించగా.. మద్యం సేవించి ఉన్నాడనే అనుమానంతో అక్కడ ఉన్న బౌన్సర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బ్రూక్ సదరు బౌన్సర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ గొడవలో బౌన్సర్ బ్రూక్‌ను కొట్టినట్లు సమాచారం. ఈ విషయం రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.సారీ చెప్పిన బ్రూక్‌..ఈ ఘటనపై బ్రూక్ స్పందించాడు. యాషెస్ ఐదో టెస్టు ముగిసిన తర్వాత అతడు బహిరంగ క్షమాపణలు తెలిపాడు. నేను ఆ రోజు హద్దులు మీరి ప్రవర్తించాను. అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యలతో నా జట్టుకు, దేశానికి తలవంపులు తీసుకొచ్చాను. అందుకు చాలా చాలా బాధపడుతున్నాను.ఇంగ్లండ్ క్రికెట్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవం. ఇకపై మైదానంలోనూ, బయటా ఇటువంటి తప్పులు చేయనని హామీ ఇస్తున్నాను. మరోసారి అందరికి క్షమాపణలు అడుగుతున్నాను అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో బ్రూక్ పేర్కొన్నాడు.ఈసీబీ సీరియస్‌ఇక ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. బ్రూక్‌కు 30,000 పౌండ్ల ( భారత కరెన్సీలో దాదాపు 33 లక్షల రూపాయలు) భారీ జరిమానా ఈసీబీ విధించింది. అంతేకాకుండా ఇదే చివరి వార్నింగ్ అంటూ ఈసీబీ హెచ్చరించింది. కాగా యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ ఘోర ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను 4-1 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. ఈ ఘోర పరాభావానికి ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యమే కారణమని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఈ సిరీస్ మధ్యలో ఇంగ్లండ్ వెళ్లిన 'నూసా' (Noosa) ట్రిప్ కూడా విమర్శలకు దారితీసింది.చదవండి: అభిషేక్‌ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్‌.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో..

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement