Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Former Cricketer Manoj Tiwary Says No One Supports Hardik Pandya1
‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ అత్యధిక టైటిల్స్ విషయంలో సీఎస్‌కేతో కలిసి సమానంగా ఉంది. అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో మాత్రం ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే 9 మ్యాచ్‌లాడిన ముంబై ఏడు పరాజయాలు చవిచూసింది. శనివారం సీఎస్‌కేతో మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకున్నట్లే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముంబై ప్లేఆఫ్ చేరడం కష్టం. ఇక కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. మ్యాచ్ ఓటములను తట్టుకోలేక సహచరులపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ జట్టులో విద్వేశం పెరిగిపోయిందని, అతడికి జట్టులో కనీస మద్దతు కరువయిందంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. జట్టు పేలవ ప్రదర్శనకు పాండ్యాను ఒక్కడినే నిందించడం తగదని పేర్కొన్నాడు. క్రిక్‌బజ్‌తో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. జట్టు వైఫల్యాలకు కెప్టెన్ పాండ్యాను విమర్శిస్తున్నారు. కానీ అతడికి జట్టు నుంచి సరైన మద్దతు లేదనిపిస్తోంది. కెప్టెన్‌గా పాండ్యా చేయాల్సింది చేస్తున్నాడు. జట్టులో ఆటగాళ్లు సరిగ్గా ఆడడం లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో సూపర్‌స్టార్‌గా పేరుపొందిన సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమవుతున్నాడు. తిలక్ వర్మ ఒక్క మ్యాచ్ మినహా మళ్లీ రాణించింది లేదు. జట్టులో నిలకడ ప్రదర్శన లేనప్పుడు పాండ్యాను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం లేదు. కలిసికట్టుగా ఆడినప్పుడే జట్టుకు విజయాలు లభిస్తాయి. కానీ ముంబై ఇండియన్స్‌లో ఇప్పుడు అది మిస్సయింది. రోహిత్ గాయంతో డగౌట్‌కు పరిమితమవ్వడం, బుమ్రా, సూర్య, తిలక్ వంటి ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం ముంబైని దెబ్బ​కొట్టాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ పాండ్యాను విమర్శించడం తగదు. అతడి ప్రవర్తనతో ఆటగాళ్లు క్రమంగా విద్వేషం పెంచుకుంటున్నారనిపిస్తుంది. అందుకే అతడికి జట్టు నుంచి మద్దతు కరువయ్యింది. ఇక 9 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలను వదిలేసుకున్న ముంబై ఇండియన్స్‌కు అదృష్టం తోడవ్వాలి. ఎందుకంటే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. మరోవైపు టాప్‌-4లో ఉన్న పంజాబ్‌కు ఆరు మ్యాచ్‌లు, ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ఐదేసీ మ్యాచ్‌లు, రాజస్తాన్‌కు నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ముంబై ప్లేఆఫ్ చేరాలంటే ఈ జట్లు తమ మ్యాచ్‌లన్నీ ఓడిపోవాలి. కానీ 99 శాతం ఇది జరగని పని. కాబట్టి ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ప్లేఆఫ్ ఆశలు పక్కనబెట్టి విజయాలు సాధించి గౌరవంగా నిష్క్రమించడం మంచిది’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ‘నేను క్రెడిట్‌ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్‌’

CSK Captain Ruturaj Gaikwad Winning Comments I Wont Take Credit2
‘నేను క్రెడిట్‌ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్‌’

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ త‌మ ప్లేఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ అజేయ అర్థ‌సెంచ‌రీ సాధించి జ‌ట్టును గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన‌ కార్తిక్ శ‌ర్మ కూడా అజేయ హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. సీజ‌న్‌లో నాలుగో విజ‌యం అందుకున్న సీఎస్‌కే 8 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో ఉంది. మ్యాచ్ ముగిసిన అనంత‌రం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. నిజానికి ఈ మ్యాచ్ విన్నర్ తాను కాదని, ఇంపాక్ట్‌గా వచ్చి అజేయ అర్థసెంచరీతో అదరగొట్టిన కార్తిక్ శర్మకు క్రెడిట్ ఇవ్వాలని రుతురాజ్ తెలిపాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని చెప్పాడు. రుతురాజ్‌ మాట్లాడుతూ..'చాలా సంతోషంగా ఉంది. మేం మొదట బాగానే ప్రారంభించాం. కానీ మధ్యలో ముంబై ఇండియన్స్ పుంజు కుంది. అయితే మేం మళ్లీ మ్యాచ్‌ను మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం. మొదటి కొన్ని ఓవర్లను తట్టుకుని నిలబడటం.. ఆపై టాప్ త్రీ బ్యాటర్లలో ఒకరు చివరి వరకు ఉండటం కీలకమని మేం భావించాం. ఇక అన్షుల్‌ కంబోజ్‌ చాలా నిలకడగా రాణిస్తున్నాడు. తన ప్రక్రియను అనుసరిస్తున్నాడు. అతని ఆలోచనా తీరు ఒక బ్యాటర్ లాగా ఉంటుంది. నూర్ కూడా కొన్ని మార్పులు చేసుకుని బాగా రాణిస్తున్నాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే అఖీల్ హుస్సేన్‌ను ఆడించలేదు. 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని, అదనపు బౌలర్ ఉండాలని ఆలోచించాం. ప్రశాంత్ వీర్, ఘోష్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలరు. మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ చెబుతున్నట్లుగా.. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. అయితే ఇది టీ20 క్రికెట్. సరైన సమయం కోసం వేచి చూశాను. కార్తీక్ శర్మకు ఈ ఇన్నింగ్స్ మంచి బూస్ట్‌లాంటిది. అతను సిక్సర్లు కొట్టగలడు. కానీ అతను బంతులను ఎంచుకొని ఆడిన తీరు బాగుంది. అతను ఫామ్ కొనసాగిస్తే జట్టుకు ప్రయోజనం. మేం ఆటను చాలా సింపుల్‌గా ఉంచుతున్నాం. తప్పులు జరుగుతుంటాయి కానీ బలంగా తిరిగి రావాలి. ఈ జెర్సీ, అభిమానుల కోసం మా సర్వస్వం ఇస్తాం.’ అని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.Trusting the process and letting the bat do the talking 💛🎥 Skipper Ruturaj Gaikwad talks about finding his rhythm and the match-winning knock 🗣️#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL | @Ruutu1331 pic.twitter.com/VZ2T0hqcYZ— IndianPremierLeague (@IPL) May 2, 2026చదవండి: ముంబై ఇండియ‌న్స్ ప్రపంచ రికార్డు!

Mumbai Indians World Record-1st-Team Score-50000 Runs T20 Cricket3
ముంబై ఇండియ‌న్స్ ప్రపంచ రికార్డు!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు ప‌రాజ‌యాల‌తో ప్లేఆఫ్ ఆశ‌ల‌ను దాదాపు గ‌ల్లంతు చేసుకుంది. శ‌నివారం చెన్నై సూప‌ర్‌కింగ్స్ (సీఎస్‌కే)తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఓడిన‌ప్ప‌టికీ ముంబై ఇండియ‌న్స్ ప్ర‌పంచ రికార్డును న‌మోదు చేయ‌డం విశేషం. టీ20 క్రికెట్ చరిత్రలో 50 వేల పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ చ‌రిత్ర‌ సృష్టించింది. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. 50వేల ప‌రుగుల మైలురాయిని అందుకోవ‌డానికి ముంబై ఇండియ‌న్స్‌కు 114 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్లో ఆ మైలురాయిని అందుకుంది. ముంబై ఇండియన్స్‌కు ఇది 308వ టీ20 మ్యాచ్. ఇందులో 286 ఐపీఎల్ మ్యాచ్‌లు కాగా.. మ‌రో 22 మ్యాచ్‌లు ఛాంపియన్స్ లీగ్‌వి ఉన్నాయి. ఇక‌ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన సోమర్‌సెట్‌ (48,244 పరుగులు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (47,304 పరుగులు), చెన్నై సూపర్ కింగ్స్ (46,438 పరుగులు) తర్వాతి స్థానాల్లో కొన‌సాగుతున్నాయి. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మ (6,286 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (3,933), కీరన్ పొలార్డ్ (3,915) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్ర‌పంచ రికార్డు సాధించిన‌ప్ప‌టికీ మ్యాచ్ ఫ‌లితం మాత్రం ముంబై ఇండియ‌న్స్‌కు చేదు అనుభ‌వం మిగిల్చింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (57) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. రికెల్‌ట‌న్ (37), సూర్య‌కుమార్ (21) ప‌ర్వాలేద‌నిపించారు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీయ‌గా, నూర్ అహ్మ‌ద్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ 18.1 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల నష్టానికి 160 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్‌), కార్తిక్ శ‌ర్మ (54 నాటౌట్‌) సీఎస్‌కేను గెలిపించారు. సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజ‌యం కాగా.. ముంబైకి ఇది ఏడో ఓట‌మి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవ‌కాశాలు మ‌రింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో సీఎస్‌కే 8 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉండ‌గా.. ముంబై ఇండియ‌న్స్ 4 పాయింట్ల‌తో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది.చదవండి: ఇంపాక్ట్‌ నిబంధనపై బీసీసీఐ కీలక నిర్ణయం!

BCCI Secretary Saikia-Says No immediate Review-Impact Player IPL 2026 4
ఇంపాక్ట్‌ నిబంధనపై బీసీసీఐ కీలక నిర్ణయం!

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలు, వివాదాస్పద 'ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధ‌న‌కు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శ‌నివారం రాత్రి కీలక ప్ర‌క‌ట‌న చేశారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో క్వాలిఫ‌యర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 స‌హా ఫైనల్‌కు సంబంధించి ముఖ్య విష‌యం వెల్ల‌డించారు. ఈ మ్యాచ్‌ల‌కు ఆతిథ్యమిచ్చే వేదికలను మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సైకియా తెలిపారు. ప్లేఆఫ్స్, ఫైనల్ నిర్వహణకు తగిన వేదికల ఎంపికపై బోర్డు ప్రస్తుతం కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఇక 2023లో ప్రవేశపెట్టిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సైకియా స్పందించారు. ఈ నిబంధన వల్ల అభిమానులు మ్యాచ్‌ల‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారని, కొన్ని జట్లు 260 పరుగులు చేస్తే, మరికొన్ని తక్కువ స్కోర్లకే పరిమితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇంపాక్ట్ రూల్‌పై ఫ్రాంచైజీల నుంచి ఎటువంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని, జట్లు దీనితో సౌకర్యవంతంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు మే 24తో ముగియ‌నున్నాయి. ఇప్ప‌టికైతే పాయింట్ల ప‌రంగా పంజాబ్ కింగ్స్‌, ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా తొలి నాలుగు స్థానాల్లో కొన‌సాగుతున్నాయి.చదవండి: తిలక్‌ వర్మకు చేదు అనుభవం!

BCCI announced the 15-member Indian Womens T20 World Cup 2026 5
టి20 ప్రపంచ కప్‌ వంతు

‘గత ప్రపంచ కప్‌ విజయం ఎంతో ప్రత్యేకం... కానీ మేం చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. ఫార్మాట్‌లు వేరైనా తీవ్రతలో తేడా లేదు’... భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వ్యాఖ్య ఇది. 2025లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి ఈ ఫార్మాట్‌లో ప్రపంచ కప్‌ లేని లోటు తీర్చుకున్న భారత్‌ ఇప్పుడు టి20 ప్రపంచకప్‌పై గురి పెట్టింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యుల టీమ్‌ను బీసీసీఐ విభిన్న రీతిలో ప్రకటించింది. హర్మన్, కోచ్‌ అమోల్‌ మజుందార్‌ వ్యాఖ్యల తర్వాత ఆటగాళ్లు పేర్లు వరుసగా వెల్లడిస్తూ ఆపై అభిమానుల అంచనాలతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ద్వారా సెలక్షన్‌ వివరాలను చెప్పడం విశేషం.ముంబై: ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టును శనివారం సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అమితా శర్మ నేతృత్వంలోని బృందం ఎలాంటి సంచలనాలు, అనూహ్య ఎంపికలకు అవకాశం ఇవ్వకుండా టీమ్‌ను వెల్లడించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరోసారి సారథిగా బాధ్యతలు నిర్వర్తించనుండగా, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది జూన్‌ 12 నుంచి జులై 5 వరకు ఇంగ్లండ్‌లో వరల్డ్‌ కప్‌ జరుగుతుంది. ఈ టోర్నీకి ముందు సన్నాహకంగా ఇంగ్లండ్‌తోనే భారత్‌ 3 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇప్పటి వరకు జరిగిన 9 టి20 వరల్డ్‌ కప్‌లలోనూ పాల్గొన్న భారత్‌ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు. 2020లో రన్నరప్‌గా నిలవడమే జట్టు అత్యుత్తమ ప్రదర్శన. హర్మన్‌ నాయకత్వంలో ఐదో సారి భారత్‌ టి20 వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగుతోంది. నందనికి తొలి చాన్స్‌... దక్షిణాఫ్రికాతో ఇటీవల టి20 సిరీస్‌ ఆడిన జట్టులో స్వల్ప మార్పులతో వరల్డ్‌ కప్‌ టీమ్‌ను ప్రకటించారు. ఈ సిరీస్‌ కోసం జట్టులో ఉన్న అనుష్క శర్మ, ఉమా ఛెత్రి తమ స్థానాలు కోల్పోయారు. కాశ్వీ గౌతమ్‌ గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. గాయంనుంచి కోలుకోకపోవడంతో దక్షిణాఫ్రికా టూర్‌కే వెళ్లని ఆల్‌రౌండర్‌ అమన్‌జోత్‌ కౌర్‌ను కూడా వరల్డ్‌ కప్‌ కోసం పరిశీలించలేదు. మెగా టోర్నీ కోసం ముగ్గురు ప్లేయర్లు నందని శర్మ, రాధ యాదవ్, యస్తిక భాటియాలను ఎంపిక చేశారు. రెండేళ్ల క్రితం భారత్‌కు చివరి సారి టి20 మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించిన వికెట్‌ కీపర్‌ యస్తిక వరుస గాయాలతో ఇబ్బంది పడింది. ఎట్టకేలకు ఆమె ఇప్పుడు పునరాగమనం చేసింది. ఈ స్థానం కోసం ప్రతీక రావల్‌ పేరు కూడా పరిశీలించామని... అయితే అనుభవజు్ఞరాలైన యస్తికకు ఓటు వేసినట్లు చీఫ్‌ సెలక్టర్‌ అమితా శర్మ వెల్లడించింది. అమన్‌జోత్, కాశ్వీ దూరం కావడంతో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ అవసరం ఏర్పడింది. దాంతో రాధ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెప్పారు. పేస్‌ బౌలర్‌ నందని శర్మకు మాత్రం భారత్‌ తరఫున ఇదే తొలి అవకాశం కావడం విశేషం. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడని నేరుగా వరల్డ్‌ కప్‌కే ఎంపికైంది. డబ్ల్యూపీఎల్‌లో 17 వికెట్లతో ఆమె ఆకట్టుకునే ప్రదర్శన నమోదు చేసింది. జట్టులో అరుంధతి, శ్రీచరణి... గత కొంత కాలంగా భారత జట్టులో రెగ్యులర్‌ సభ్యులుగా ఉన్న తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, నల్లపురెడ్డి శ్రీచరణి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలోనూ వీరిద్దరు జట్టులో భాగంగా ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ అరుంధతి ఇప్పటి వరకు 49 టి20ల్లో 7.78 ఎకానమీతో 46 వికెట్లు పడగొట్టగా... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీచరణి 17 టి20ల్లో 7.60 ఎకానమీతో 24 వికెట్లు తీసింది. మరో వైపు శ్రీచరణికి భారత టెస్టు టీమ్‌లో కూడా తొలి సారి చోటు దక్కడం విశేషం. వరల్డ్‌ కప్‌ ముగిసిన తర్వాత భారత్‌ జులై 10 నుంచి 13 వరకు లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడుతుంది. ఈ టెస్టులో పాల్గొనే జట్టును కూడా సెలక్టర్లు శనివారమే ప్రకటించారు.పాక్‌ మ్యాచ్‌తో మొదలు... టి20 వరల్డ్‌ కప్‌ ఫార్మాట్‌లో మార్పు లేకుండా ఎప్పటిలాగే 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ టీమ్‌ తమ గ్రూప్‌లోని ఐదు టీమ్‌లతో తలపడుతుంది. టాప్‌–2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌ ‘1’లో ఉన్న భారత్‌ వరుసగా పాకిస్తాన్‌ (జూన్‌ 14), నెదర్లాండ్స్‌ (జూన్‌ 17), దక్షిణాఫ్రికా (జూన్‌ 21), బంగ్లాదేశ్‌ (జూన్‌ 25), ఆ్రస్టేలియా (జూన్‌ 28)లతో తలపడుతుంది.

IPL 2026: Chennai Super Kings Beat Mumbai Indians By 8 Wickets 6
సీఎస్‌కేను గెలిపించిన కార్తిక్ శర్మ.. ముంబై ఓటమి

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై సీఎస్‌కే ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. తొలి అంచె పోటీల్లో ముంబైని చిత్తుగా ఓడించిన సీఎస్‌కే శ‌నివారం రెండో అంచె పోటీలోనూ మ‌రోసారి ముంబైని ఓడించింది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.160 ప‌రుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే మరో 11 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్‌), ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వచ్చిన కార్తిక్‌ శ‌ర్మ (54 నాటౌట్‌) అజేయంగా నిలిచి సీఎస్‌కేను గెలిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గ‌జ‌న్‌ఫ‌ర్ చెరొక వికెట్ తీశారు. అంత‌క‌ముందు ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్‌టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.అజేయ అర్థ‌సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజ‌యం కాగా.. ముంబైకి ఇది ఆరో ఓట‌మి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవ‌కాశాలు మ‌రింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో సీఎస్‌కే 8 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉండ‌గా.. ముంబై ఇండియ‌న్స్ 4 పాయింట్ల‌తో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది.An unorthodox finishing touch to a classic rivalry! 🎬🎥 @ChennaiIPL complete the double over their arch-rivals #MI in style 💛Scorecard ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/yeBWsXZ6Lu— IndianPremierLeague (@IPL) May 2, 2026

Jamie Overton Breaks Tilak Varma's Wrist Watch In Half Days After Heated Face7
తిలక్‌ వర్మకు చేదు అనుభవం.. 28 వేల వాచ్‌ గోవిందా!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ క్రికెట‌ర్ తిలక్ వ‌ర్మకు చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. ముంబై ఇన్నింగ్స్ స‌మ‌యంలో సీఎస్కే బౌల‌ర్ జేమీ ఓవ‌ర్ట‌న్ వేసిన బంతి తిల‌క్ వ‌ర్మ చేతికున్న రిస్ట్ వాచ్‌ను రెండు ముక్క‌లు చేసింది. ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్లో ఇది చోటుచేసుకుంది. ఓవ‌ర్ట‌న్ వేసిన షార్ట్ పిచ్ బంతిని షాట్ ఆడే క్ర‌మంలో తిల‌క్ వ‌ర్మ మిస్ చేశాడు. దీంతో బంతి తిల‌క్ వ‌ర్మ చేతికి బ‌లంగా తాకింది. నొప్పితో బాధ‌ప‌డిన తిల‌క్‌ను ఫిజియో వ‌చ్చి ప‌రిశీలించాడు. అదే స‌మ‌యంలో చేతికున్న రిస్ట్ వాచ్ రెండు ముక్క‌లు కావ‌డం గ‌మ‌నార్హం. కాగా తిలక్‌వర్మ తన చేతికి ధరించిన రిస్ట్‌ వాచ్‌ ధర రూ.28 వేలు కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తిలక్‌ వర్మ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన తిలక్‌ వర్మ నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (57) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా.. రికెల్‌ట‌న్ 37 ప‌రుగులు చేశాడు.𝗧𝗜𝗠𝗘 𝗢𝗨𝗧 ⌚🤐#TilakVarma’s wrist-watch, too, now has a #BiggestRivalry story to tell 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvMI | LIVE NOW 👉https://t.co/wLcMjiCsSi pic.twitter.com/cCLwL6SYux— Star Sports (@StarSportsIndia) May 2, 2026చదవండి: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్

Ish Sodhi Creates Record-Became Highest Wicket-Taker For New Zealand8
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్

టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోదీ చరిత్ర సృష్టించాడు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో ​టీ20 మ్యాచ్‌లో వికెట్ తీయడం ద్వారా సోదీ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బంగ్లా బ్యాటర్ షమ్మీ హొసేన్‌ను ఔట్ చేయడం ద్వారా ఇష్ సోదీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 141 మ్యాచ్‌ల్లో 8.16 ఎకానమీ రేటుతో 165 వికెట్లు తీశాడు. అంతేకాదు కివీస్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గానూ ఇష్ సోదీ నిలిచాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇక రెండో స్థానంలో టిమ్ సౌతీ ఉన్నాడు. సౌతీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు పడగొట్టాడు.ఆ తర్వాతి ‍స్థానంలో మిచెల్ సాంట్నర్ (138 మ్యాచ్‌ల్లో 142 వికెట్లు), నాలుగో స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (83 వికెట్లు), లోకి ఫెర్గూసన్ (76 వికెట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 14.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదోయ్ (33) టాప్ స్కోరర్‌. కివీస్ బౌలర్లలో జోష్ క్లార్క్‌సన్ 3 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్‌, బెన్ సియర్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. బెవన్ జాకబ్స్ (62 నాటౌట్‌) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించాడు. మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ వర్షంతో రద్దుకాగా, ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేశాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బెవన్ జాకబ్స్‌, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా తౌహిద్ హృదోయ్ నిలిచాడు. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బం‍గ్లాదేశ్ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..

Sehwag Tells BCCI Selectors To Consider 36-Year-Old-Pacer In Team India 9
సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ భువనేశ్వర్‌ కుమార్‌ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 36 ఏళ్ల వయసులోనూ తన పేస్‌ పదును చూపిస్తూ ఐపీఎల్‌ 2026 సీజన్లో‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున వికెట్లు తీస్తోన్న భువనేశ్వర్‌ను టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుందని మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. వయసును కాకుండా ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు వయసు కేవలం ఒక అంకె మాత్రమే అనిపిస్తుంది. అతనికి 35-36 ఏళ్లు ఉంటే ఏంటి? అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు, టీ20 ఫార్మాట్‌లో తన పునరాగమనం గురించి అతను ఆలోచించాలి లేదా సెలక్టర్లు ఆలోచించాలి. మనం పాత భువనేశ్వర్‌ను మళ్లీ చూస్తున్నాం. అతని బౌలింగ్‌లో ఆ వాడి, వేడి స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త బంతితో, పాత బంతితో కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు’ అని ప్రశంసించాడు.ఈ ఐపీఎల్ సీజన్‌లో భువనేశ్వర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీ తరఫున ఆడిన కేవలం 9 మ్యాచ్‌లలోనే 17 వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. గ‌తేడాది (2025) ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన సీజన్ మొత్తం మీద అతను 17 వికెట్లు తీయగా, ఈసారి కేవలం 9 మ్యాచ్‌లలోనే ఆ మార్కును అందుకోవడం అతని ఫామ్‌కు నిదర్శనం. ఆర్‌సీబీ ఆడిన గత ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో అతను కనీసం మూడు వికెట్లు తీశాడు.ఇటీవలే అతను టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన మైలురాయిని కూడా అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 350 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్‌గా, రెండో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 325 టీ20 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్, 24.51 సగటుతో 352 వికెట్లు పడగొట్టాడు. అతని కంటే ముందు భారత్ నుంచి స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (391 వికెట్లు) మాత్రమే ఉన్నాడు.చదవండి: చిక్కుల్లో పడిన క్రికెటర్‌ షమీ సోదరుడు!

David Warner Daughters Wear Gharara and Hijab Pic Viral10
పాకిస్తాన్‌పై వార్నర్‌ ప్రేమ?.. హిజాబ్‌ ధరించిన కుమార్తెలు!

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇటీవల అతడు ఐపీఎల్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల పాటు ఐపీఎల్‌లో ఆడి పేరుకు పేరు.. డబ్బు, అభిమానం దండిగా సంపాదించుకున్నాడు వార్నర్‌.ఆరెంజ్‌ ఆర్మీకి ఫేవరెట్‌ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా 2016లో టైటిల్‌ అందించడంతో.. ఆరెంజ్‌ ఆర్మీకి ఫేవరెట్‌గా మారిపోయాడు వార్నర్‌. ఆ తర్వాత జట్టును వీడినా ఇప్పటికీ ఆరెంజ్‌ ఆర్మీ వార్నర్‌ను తమ వాడిలానే భావిస్తుంది. ఇక 2024లో చివరగా ఐపీఎల్‌ ఆడిన ఈ ఆసీస్‌ బ్యాటర్‌ను ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.దీంతో వార్నర్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో చేరాడు. ఈ ఏడాది కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఆరంభంలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించినా.. ఆ తర్వాత వరుస పరాజయాల నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ చేరుకుండానే కరాచీ నిష్క్రమించింది.పాక్‌ బోర్డుకు వార్నర్‌ ధన్యవాదాలుఈ నేపథ్యంలో కరాచీ కింగ్స్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. చక్కటి ఆతిథ్యం ఇచ్చారంటూ పాక్‌ బోర్డుకు వార్నర్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు స్పందిస్తూ భారతీయ నెటిజన్‌ ఒకరు.. ‘‘పీఎస్‌ఎల్‌ను వదిలేసి.. ఐపీఎల్‌కు వచ్చేసెయ్‌’’ అని కామెంట్‌ పెట్టారు. ఇందుకు వార్నర్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘ఇప్పుడు ఆ అవసరం ఏమీలేదు’’ అని పేర్కొన్నాడు.దీంతో వార్నర్‌ పట్ల టీమిండియా, ఐపీఎల్‌ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వార్నర్‌ మరోసారి పాకిస్తాన్‌ పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. తన కూతుళ్లలో ఇద్దరికి పాకిస్తానీ తరహా డ్రెస్సులు (ఘెరారా) వేసి మురిసిపోయాడు. అంతేకాదు ఇద్దరూ హిజాబ్‌ మాదిరి చున్నీ కూడా ధరించడం విశేషం. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31)హిజాబ్‌ ధరించిన కుమార్తెలు!ఈ ఫొటోలను పంచుకుంటూ.. ‘‘పిల్లలకు సంప్రదాయ దుస్తులు ఇచ్చినందుకు హైదర్‌కు థాంక్యూ. తమకు తాముగా పిల్లలు ఇలా రెడీ అయ్యారు. ఫీడ్‌బ్యాక్‌ సూపర్‌గా ఉంది. మీ బెస్ట్‌ అవుట్‌ఫిట్‌ ఏమిటో జత చేయండి’’ అని వార్నర్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ దుస్తుల్లో తన కుమార్తెలు అత్యంత అందంగా ఉన్నారని కొనియాడాడు.ఇందుకు బదులుగా... ‘‘పిల్లలు చక్కగా ఉన్నారు వార్నర్‌ భాయ్‌’’ అంటూ కొంతమంది కితాబులిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం.. ‘‘ఇప్పుడు డ్రెస్సులు.. ఆ తర్వాత సంప్రదాయాలు.. కాస్త ఆలోచించు వార్నర్‌ భయ్యా.. తప్పుగా తీసుకోవద్దు.. కానీ జాగ్రత్తగా ఉండాలి’’ అని హెచ్చరిస్తున్నారు. వార్నర్‌పై ద్వేషం తగదుఇంకొందరేమో వార్నర్‌పై ద్వేషం తగదని.. ఐపీఎల్‌-2026 ఆరంభానికి ముందు.. సన్‌రైజర్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ.. ఆరెంజ్‌ ఆర్మీ పట్ల అతడు ప్రేమను చాటుకున్న తీరును గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా వార్నర్‌ షేర్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌గా మారింది.కాగా డేవిడ్‌ వార్నర్‌- కాండిస్‌ దంపతులుకు ఇవీ మే, ఇండీ రే, ఇస్లా రోస్‌ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్‌డేట్లను వార్నర్‌, కాండిస్‌ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. చదవండి: ‘భారీ’ ధరకు అమ్ముడుపోయిన అర్జున్‌ టెండుల్కర్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement