ప్రధాన వార్తలు
కోల్‘కథ’ హిట్ అవుతుందా?
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ల తర్వాత ‘ఐపీఎల్’ బుక్లో తమ కంటూ చరిత్ర లిఖించుకున్న ఫ్రాంచైజీ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్). మూడుసార్లు చాంపియన్గా నిలిచిన ఈ ‘త్రీ స్టార్’ చాంపియన్ గతేడాది మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. 2024లో విజేతగా నిలిచిన కేకేఆర్... గత సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి పేలవమైన ప్రదర్శనతో ఏకంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మాత్రం ఈ మరకను మరిచి... ఇంకో ఐదు రోజుల్లో ఆరంభమయ్యే లీగ్లో మెరుగైన ప్రదర్శనతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమైంది. –సాక్షి క్రీడా విభాగంఐపీఎల్ లీగ్లో ఫైనల్ చేరితే టైటిల్స్ను ఉడుం పట్టులా పట్టిన జట్టేదైనా ఉందంటే అది కోల్కతా నైట్రైడర్స్ ఒక్కటే! నాలుగుసార్లు 2012, 2014, 2021, 2024లలో తుదిపోరుకు అర్హత సంపాదించిన కేకేఆర్ ఒకే ఒక్కసారి (2021లో) మాత్రమే రన్నరప్తో సరిపెట్టుకుంది. మిగతా మూడుసార్లు లీగ్ అసాంతం అసాధారణంగా రాణించిన జట్లను ఫైనల్లో బోల్తా కొట్టించి మరీ టైటిళ్లను ఎగరేసుకుపోయిన ఘనత కోల్కతాకే దక్కుతుంది. ఇప్పుడు కూడా ఇలాంటి ఆశల పల్లకితోనే ఈ సీజన్ బరిలోకి దిగుతోంది. అనుభవజ్ఞుడైన అజింక్య రహానే సారథ్యం గత సీజన్కు అక్కరకు రాలేదు. అలాగని అన్నీసార్లు అదే జరగదు! పైగా ఇది పొట్టి ఫార్మాట్! ఒక్క ఓవర్ చాలు ఫలితం తారుమారయ్యేందుకు..! కాబట్టి ప్రపంచ శ్రేణి హిట్టర్లు అందుబాటులో ఉన్న నైట్రైడర్స్ జట్టును గత సీజన్ ప్రదర్శనను బట్టి తక్కువ అంచనా వేయలేం. గ్రీన్పై గంపెడాశలతో...కోల్కతా జట్టులో మేటి బ్యాటర్లున్నారు. స్టార్ ఆల్రౌండర్లు సైతం అందుబాటులో ఉన్నారు. అయినా సరే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆస్ట్రేలియన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ను (రూ.25.20 కోట్లు) పాతిక కోట్లు పోసి కొనుక్కొంది. ఇంత భారీ మొత్తం పెట్టిన గ్రీన్ స్పెషలిస్టు టాపార్డర్ బ్యాటర్. ఓపెనింగ్ లేదంటే వన్డౌన్లో బ్యాటింగ్ దిగేందుకే ఇష్టపడతాడు. కానీ టాప్–3లో అందరూ పాతుకుపోయిన బ్యాటర్లే బోలెడు మంది ఉన్నారు. కెప్టెన్ రహానే సహా సునీల్ నరైన్, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్లు టాపార్డర్ బ్యాటర్లే. అంతే కాదు... నలుగురు విదేశీ ఆటగాళ్లు (నరైన్, ఫిన్, టిమ్, గ్రీన్)లు తుది జట్టుకు ఆడే ఆటగాళ్లు. అందుకే జట్టు మేనేజ్మెంట్కు బ్యాటింగ్ ఆర్డర్ సర్దుబాటే అతిపెద్ద సవాలుగా మారింది. ఇంపాక్ట్ ఓకే... మరి కూర్పు?విదేశీ స్టార్లే కాదు... భారత మేటి ఆటగాళ్లు సైతం నైట్రైడర్స్కు వెన్నుదన్నుగా ఉన్నారు. న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ టి20ల్లోనే ప్రమాదకర బ్యాటర్. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్లో కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో కివీ డాషింగ్ ఓపెనర్ దక్షిణాఫ్రికాపై సెమీస్లో 33 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. సీఫెర్ట్ కూడా నిలకడైన బ్యాటింగ్తో ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగని భారత ఆటగాళ్లు తక్కువ కాదు. అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణ్దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠిలతో కూడిన బ్యాటింగ్ బెంచ్ అసాధరణమని చెప్పొచ్చు. ముఖ్యంగా రఘువంశీ, త్రిపాఠి, త్యాగిలు ఇంపాక్ట్ ప్లేయర్లుగా బరిలోకి దింపినా... రెగ్యులర్ జట్టులో రింకూ, రమణ్దీప్లు కూడా హిట్టర్లు. వీరందరూ టి20 ఫార్మాట్కు అవసరమైన వారే. కానీ తుది 11 మంది కూర్పు కోసం జట్టు మేనేజ్మెంట్ పెద్ద కసరత్తే చేయాలి. స్పిన్నర్లపైనే భారమంతా...బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనపడుతోంది. కానీ బౌలింగే ఆందోళన పరుస్తోంది. కీలకమైన పేసర్లు గాయాల బారిన పడటంతో ఇప్పుడు బౌలింగ్ భారమంతా స్పిన్నర్లపైనే పడింది. తిప్పేసే సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలే కోల్కతా బలమైనా... దళమైనా! డెత్ ఓవర్లను నియంత్రించే హర్షిత్ రాణాలాంటి పేసర్ స్థానంలో ముజరబాని (జింబాబ్వే)ను తీసుకున్నారు. ఇది ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. మొత్తానికి ఒక్క పేస్ బౌలింగ్ కళ తప్పినా... ఆల్రౌండ్ సత్తా చాటే ఆటగాళ్లు కోల్కతాకు అందుబాటులో ఉన్నారు.గాయాల బెడదతో దడదడ!జట్టును ప్రధానంగా వేధిస్తున్న సమస్య గాయాలు. భారత పేస్ బౌలర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ సీజన్ మొత్తానికే దూరమయ్యారు. శ్రీలంక యార్కర్ స్పెషలిస్ట్ పతిరణ పరిస్థితి కూడా అదే! ఇప్పటికైతే ఆరంభ మ్యాచ్లకు దూరమైనప్పటికీ సింహళ సీమర్ అందుబాటులోకి వచ్చేది అనుమానమే. దీంతో బౌలింగ్ దళం... ప్రత్యేకించి పేస్ విభాగం బలహీనమైంది. దీనివల్ల అందుబాటులో ఉన్న బౌలర్లపై అదనపు భారమే కాదు... ఒత్తిడి కూడా పడినట్లయింది.కోల్కతా నైట్రైడర్స్ జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, కామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, రోవ్మన్ పావెల్, రింకూ సింగ్, ఉమ్రాన్ మాలిక్, రమణ్దీప్ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ముజరబాని, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్, దక్ష్ కమ్రా, సార్థక్ రంజన్, మనీశ్ పాండే, అంగ్క్రిష్ రఘువంశీ, రాహుల్ త్రిపాఠి, తేజస్వి సింగ్, ప్రశాంత్ సోలంకి, పతిరణ.ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ గణాంకాలుఆడిన మ్యాచ్లు 265 గెలిచినవి 136ఓడినవి 127రద్దు 2అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్ (2012, 2014, 2024), రన్నరప్ (2021).
అనాహత్, అభయ్లకు టైటిల్స్
ముంబై: ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లే టైటిల్స్ సాధించారు. టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన అనాహత్ సింగ్ మహిళల టైటిల్ చేజిక్కించుకుంది. పురుషుల ఈవెంట్లో అభయ్ సింగ్ నిలకడైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన అమ్మాయిల ఫైనల్లో యువ సంచలనం అనాహత్ 3–1 (11–5, 11–6, 9–11, 11–6)తో ఈజిప్టు క్రీడాకారిణి హనా మొతాజ్ను ఓడించింది. భారత ప్లేయర్ తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకోగా... మూడో సెట్ను ఈజిప్టు అమ్మాయి దక్కించుకుంది. వెంటనే పుంజుకున్న అనాహత్ నాలుగో సెట్ నెగ్గి మ్యాచ్ను ముగించింది. గత నెలలో ఈ భారత ప్లేయర్ కెరీర్ బెస్ట్ ప్రపంచ 19వ ర్యాంకుకు ఎగబాకింది. ఇపుడు తాజా టైటిల్ విజయంతో టాప్–20 ర్యాంకింగ్స్లో నిలకడగా కొనసాగనుంది. 2022 ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన అనాహత్... గతేడాది ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్లో కాంస్యంతో భారత్ 15 ఏళ్ల పతక నిరీక్షిణకు తెరదించింది. చెన్నైలో జరిగిన స్క్వాష్ ప్రపంచకప్లోనూ ఆమె బంగారు పతకంతో సత్తాచాటింది. భారత ఆటగాళ్ల మధ్యే జరిగిన పురుషుల ఫైనల్లో అభయ్ సింగ్ తన సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస సెట్లలో గెలుపొందాడు. అతను 11–9, 11–8, 11–4 వీర్ చొత్రానిపై విజయం సాధించాడు.
రన్నరప్ రిత్విక్–అర్జున్ జోడీ
న్యూఢిల్లీ: మొరెలాస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ రన్నరప్గా నిలిచాడు. మెక్సికోలో ఆదివారం జరిగిన ఫైనల్లో రిత్విక్–అర్జున్ ఖడే (భారత్) జోడీ 3–6, 6–7 (4/7)తో ఆండ్రెస్ అండ్రాడె (ఈక్వెడార్)–అగస్టిన్ గోమెజ్ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడింది. ఫైనల్లో ఓడిన రిత్విక్ జోడీకి 2.70 లక్షల నగదు (2,880 డాలర్లు)తో పాటు 50 పాయింట్లు లబించాయి.
లెబ్రాన్ జేమ్స్ అరుదైన రికార్డు
ఒర్లాండో (ఫ్లోరిడా): అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా లెబ్రాన్ ఘనత సాధించాడు. ఆదివారం ఒర్లాండో మ్యాజిక్ జట్టుతో జరిగిన మ్యాచ్ ఆడటం ద్వారా లెబ్రాన్ జేమ్స్ కెరీర్లో 1612 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. 30 ఏళ్లుగా ఈ రికార్డు రాబర్ట్ పారిశ్ (1611 మ్యాచ్లు) పేరిట ఉండగా... దాన్ని లెబ్రాన్ జేమ్స్ బద్దలు కొట్టాడు. ఇప్పటికే ఎన్బీఏలో వరుసగా 23 సీజన్లు ఆడిన ప్లేయర్గా... అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టించిన జేమ్స్... ఒర్లాండో మ్యాచ్లో 12 పాయింట్లతో సత్తాచాటాడు. ఫలితంగా హోరాహోరీగా సాగిన పోరులో లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు 105–104 పాయింట్ల తేడాతో ఒర్లాండో మ్యాజిక్పై విజయం సాధించింది.
న్యూజిలాండ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు!
న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ అమేలియా కెర్ అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అమేలియా కెర్ వరుసగా పదోసారి 30కి పైగా పరుగులు సాధించడం విశేషం. సౌతాఫ్రికా మహిళలతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా అమేలియా ఈ ప్రపంచ రికార్డును అందుకుంది. ఈ నేపథ్యంలోనే పురుషుల,మహిళల క్రికెట్లోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు కూడా అమేలియా కెర్ తాజాగా తన పేరిట లిఖించుకుంది. గతంలో అమేలియా కెర్ సహా శ్రీలంకకు చెందిన చమేరి ఆటపట్టు, రోమానియాకు చెందిన రెబెక్కా బ్లేక్లు 9 సార్లు వరుసగా 30కి పైగా స్కోర్లు సాధించారు.తాజాగా వీరిని వెనక్కినెట్టిన అమేలియా కెర్ అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల క్రికెట్లో రోహిత్ శర్మ (భారత్), అభిషేక్ శర్మ (భారత్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), హ్రిస్టో లాకోవ్లు వరుసగా ఏడుసార్లు 30కి పైగా స్కోర్లు సాధించారు. ఇదే మ్యాచ్లో మరో కివీస్ బ్యాటర్ సోఫీ డివైన్ కూడా అరుదైన రికార్డు సాధించింది. మ్యాచ్లో 34 బంతుల్లో 64 పరుగులు చేసిన సోఫీ డివైన్.. దక్షిణాఫ్రికా జట్టుపై 10సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్గా నిలిచింది. గతంలో బాబర్ ఆజమ్ (వర్సెస్ న్యూజిలాండ్), స్మృతి మంధాన (వర్సెస్ ఇంగ్లండ్), బెత్ మూనీ (వర్సెస్ భారత్) తొమ్మిదేసి సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. మ్యాచ్ విషయానికి వస్తే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కివీస్ 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం కివీస్ మహిళలు 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జెస్ కెర్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. నామమాత్రమైన ఐదో టీ20 బుధవారం జరగనుంది.చదవండి: IPL 2026: అభిమానుల కన్నీటిపర్యంతం!
IPL 2026: అభిమానుల కన్నీటిపర్యంతం!
ఎంఎస్ ధోని.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. టీమిండియాకు రెండుసార్లు ఐసీసీ వరల్డ్కప్లు అందించిన ధోనికి అభిమాన గణం కూడా ఎక్కువే. ధోని నడిచినా, నవ్వినా, బ్యాటింగ్ చేసినా అతడి మైకంలో మునిగితేలిన అభిమానులు ఎందరో ఉన్నారు. అతడు మైదానంలోకి దిగుతున్నాడంటేనే ఏదో తెలియని అనుభూతికి లోనయ్యే ఫ్యాన్స్ తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారిపోతుంది. అచ్చం అలాంటి సంఘటనే చెపాక్ స్టేడియంలో మరోసారి జరిగింది. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా సీఎస్కే తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్న ధోని ఆదివారం అలా చెపాక్ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. విషయంలోకి వెళితే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా ప్రాక్టీస్లో మునిగితేలారు. మ్యాచ్ జరగనప్పటికీ చెపాక్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. దీనికి ప్రధాన కారణం ధోనినే అన్న సంగతి తర్వాతి క్షణంలోనే తెలిసొచ్చింది. సీఎస్కే ప్లేయర్లంతా ప్రాక్టీస్లో మునిగిన సమయంలో ధోని అలా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పెవిలియన్ ఎండ్ నుంచి చిన్నగా నడుచుకుంటూ గ్రౌండ్ మధ్యలోకి చేరుకున్నాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. ప్రేక్షకులంతా లేచి నిలబడి ‘ధోని.. ధోని.. ధోని’.. ‘తలా.. తలా’ అంటూ అరుపులు, కేకలతో స్టేడియం దద్దరిల్లింది. ఇదే సమయంలో కొంతమంది అభిమానులు ధోనిని చూసి ఎమోషన్ను అదుపు చేసుకోలేక కన్నీటిపర్యంతమవ్వడం కనిపించింది. ధోని అంతర్జాతీయ క్రికెట్కు 2020లో వీడ్కోలు పలలికినప్పటికీ ఐపీఎల్లో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి ధోనిని చూడగానే అభిమానుల్లో దుఃఖం బయటికి రావడానికి ‘ధోనికి బహుశా ఇదే చివరి సీజన్’ అనే కారణం కూడా ఉండొచ్చు. కొంతకాలంగా ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. దీనికి సంబంధించిన వీడియోనూ సీఎస్కే యాజమాన్యం తన ‘ఎక్స్’లో షేర్ చేసుకోవడంతో వైరల్గా మారింది. ఇక 2023లో విజేతగా నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో మరోసారి టైటిల్ సాధించి ధోనికి ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తోంది. ఈసారి సీఎస్కేకు సంజూ శాంసన్ రాకతో జట్టుకు అదనపు బలం చేకూరినట్లయింది. ఇక ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది.Thala Dharisanam 🦁#Roar26 #WhistlePodu pic.twitter.com/RST5EpXKct— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026చదవండి: 21 సిక్సర్లతో ఆర్సీబీ మాజీ ఆటగాడి విధ్వంసం!
21 సిక్సర్లతో ఆర్సీబీ మాజీ ఆటగాడి విధ్వంసం!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా అయోధ్య ప్రీమియర్ లీగ్లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని స్వస్తిక్ లీగ్లో 69 బంతుల్లోనే 195 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. అయోధ్య ప్రీమియర్ లీగ్ పోరులో హిండన్ టైటాన్స్పై గోమతి థండర్ తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగిన ప్రియాంశు పాండే, చికారా ఇన్నింగ్స్ ఆద్యంతం బ్యాటింగ్ చేసి 307 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాండే 54 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇదే సమయంలో మరో ఓపెనర్ చికారా హిండన్ టైటాన్స్ బౌలర్లపై మెరుపు దాడి చేశాడు. 69 బంతుల్లో 195 పరుగులు బాదిన స్వస్తిక్ చికారా ఇన్నింగ్స్లో 21 సిక్సర్లు, 11 బౌండరీలు ఉన్నాయి. కేవలం సిక్సర్లు, బౌండరీల రూపంలోనే 126 పరుగులు వచ్చాయంటే ఊచకోత ఏ రేంజ్లో ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. చికారా డబుల్ సెంచరీకి 27 పరుగుల దూరంలో 173 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఉన్నప్పుడూ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉన్నాయి. ఈ దశలో మూడు సిక్సర్లు, ఒక ఫోర్తో అలరించినప్పటికీ డబుల్ మార్క్కు ఐదు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అనంతరం 308 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ కు దిగిన హిండన్ టైటాన్స్ 218 పరుగులకే ఆలౌటైంది. టైటాన్స్ బ్యాటర్లలో శేఖర్ సిరోహి 33 బంతుల్లో 68 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.ఎవరీ స్వస్తిక్ చికారా?భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను ఆరాధ్య క్రికెటర్గా భావించిన స్వస్తిక్ చికారా 2024 ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడుతున్నప్పుడు వెలుగులోకి వచ్చాడు. ఆ లీగ్లో 499 పరుగులు సాధించిన స్వస్తిక్ చికారా టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత కొద్దికాలానికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం యూపీ జట్టుకు ఎంపికయ్యాడు. దేశవాళీ టోర్నీలో అతను నాలుగు మ్యాచ్లలో కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది. 2025లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్లో కూడా ఆడకపోయినప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ గెలిచిన జట్టులో చికారా సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్2026 వేలానికి ముందే అతడిని ఆర్సీబీ విడుదల చేసింది. కానీ వేలంలో స్వస్తిక్ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.చదవండి: క్షమాపణ చెప్పిన పీసీబీ చైర్మన్!Swastik Chikara hammered 195*(69) at the Ayodhya Premier League .5 short of a double ton in t20s 🤯😵.He is unsold in IPL 2026 auction pic.twitter.com/QwVPP59AmP— Mithun 🧢 (@Mithun71389478) March 22, 2026
క్షమాపణ చెప్పిన పీసీబీ చైర్మన్!
పశ్చిమాసియాలో భీకర యుద్ధం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)పై ప్రభావం చూపిస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం, ఇంధన ధరలు పెరగడం ప్రేక్షకులు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్లు నిర్వహించాలని పీఎస్ఎల్ నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ క్రికెట్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. 'పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కారణంగా దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో పాకిస్థాన్ ప్రజలందరూ తమ రాకపోకలను పరిమితం చేసుకోవాలని ప్రధాని కోరారు. పరిస్థితులన్నింటిని గమనించి, మా భద్రతా సంస్థలతో చర్చించిన తర్వాతే ప్రేక్షకులు లేకుండా పీఎస్ఎల్ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాం. 10 నుంచి 15 రోజుల పాటు పీఎస్ఎల్లో అన్ని మ్యాచ్లు ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతాయి. ఫైనల్ వరకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఆలోచిస్తాం. ఇక టోర్నీ మొత్తం కూడా లాహోర్, కరాచీ వేదికల్లోనే జరుగుతుంది. అంతేకాదు చమురు సంక్షోభం కారణంగా పీఎస్ఎల్ ప్రారంభ వేడుకలను కూడా రద్దు చేశాము. అయితే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహిస్తుండడంతో గేట్ రెవెన్యూలో వచ్చిన నష్టానికి ఫ్రాంచైజీలకు నష్టపరిహారం చెల్లించనున్నాం. అఫ్గానిస్థాన్కు సరిహద్దుగా ఉండడంతో పెషావర్ స్టేడియంను మ్యాచ్ల నిర్వహణ నుంచి తొలగించినందుకు కూడా నఖ్వీ క్షమాపణలు చెబుతున్నా' అంటూ పేర్కొన్నాడు.చదవండి: లక్నో సూపర్జెయింట్స్ కథ మారేనా?
లక్నో సూపర్జెయింట్స్ కథ మారేనా?
ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్జెయింట్స్ కొత్తగా ప్రవేశించాయి. తమ తొలి సీజన్లోనూ గుజరాత్ టైటాన్స్ చాంపియన్గా నిలిచి ఔరా అనిపిస్తే.. లక్నో ప్లేఆఫ్స్కు చేరి ఆకట్టుకుంది. 2023 సీజన్లోనూ లక్నో జట్టు మరోసారి ప్లేఆఫ్స్కు చేరినప్పటికీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది. 2024 సీజన్లో లీగ్ దశకే పరిమితమైన లక్నో 2025లో కెప్టెన్ను మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత సీజన్లోనూ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్జెయింట్స్ జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈ సీజన్లో మాత్రం గత అనుభవాలను తిరగరాస్తూ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటాలని పంత్ సేన పట్టుదలతో ఉంది. అదొక్కటే ఊరట!మిగతా జట్లతో పోలిస్తే ప్లేయర్ల గాయాల బాధ లేకపోవడం ఒకింత ఊరటనిచ్చే అంశమని చెప్పొచ్చు. షమీ, నోర్ట్జే, మోసిన్ ఖాన్, ఆవేశ్ఖాన్, మయాంక్ యాదవ్ లాంటి పేసర్లు ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించగలరు. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో లక్నో బలాలు, బలహీనతలపై ఒక లుక్కేద్దాం.లక్నో జట్టులో హార్డ్హిట్టర్లకు కొదువలేదు. పొట్టి ఫార్మాట్లో తమ దూకుడైన బ్యాటింగ్తో మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చే శక్తి ఉన్న ప్లేయర్లు లక్నో సొంతం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్పై తమదైన ఆటతీరుతో ముద్రవేసిన మార్కరమ్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లక్నోకు కొండంత బలం. వీరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్న మ్యాచ్ ఫలితం మారినట్లే.విదేశీ ప్లేయర్లే బలం..ఇటీవలి టీ20 ప్రపంచకప్లో అదరగొట్టిన మార్కరమ్.. మిచెల్ మార్ష్తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశముంది. మరోవైపు గత రెండు సీజన్లలో 499, 524 పరుగులతో జట్టు బ్యాటింగ్కు వెన్నెముకగా నిలిచిన నికోలస్ పూరన్ లక్నోకు అదనపు ఆకర్షణ. అవసరమైతే కీపర్గా సేవలందించేందుకు సిద్ధంగా ఉండే పూరన్..మిడిలార్డర్తో పాటు ఆఖర్లో మెరుపులు మెరిపించడంలో దిట్ట. ఇక కెప్టెన్ పంత్ ఫామ్ కొంత ఆందోళన కల్గిస్తున్నది. గత సీజన్లో ఘోరంగా విఫలమైన పంత్ ఈసారైనా మెరుపులు మెరిపిస్తాడని ఫ్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఇంగ్లిస్, నోర్ట్జే, హసరంగ వంటి ప్లేయర్లను వేలంలో తీసుకున్న లక్నో..వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ, అర్జున్ టెండూల్కర్లను ట్రేడ్ ద్వారా ఎంపిక చేసుకుంది. అయితే 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన షమీ దేశవాళీ సీజన్లో దుమ్మురేపాడు.షమీ కథేంటి?తన సూపర్ స్వింగ్తో అటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో పాటు రంజీల్లోనూ అదరగొట్టాడు 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఇస్పటి నుంచే ప్లేయర్ల ఎంపికపై దృష్టి పెట్టిన బీసీసీఐ..షమీని పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది చూడాలి. జట్టులో కొంత మందికి గాయాల బెడద తోడు ఫిట్నెస్ సమస్యలు జట్టుకు ప్రతికూలంగా మారనున్నాయి. మిస్టరీ స్పిన్నర్ హసరంగకు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ మంజూరు కాలేదు. మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్స్టర్ నోకియా తరుచూ గాయాల పాలు అవుతుండటం జట్టుకు ఆందోళన కల్గిస్తున్నది. బౌలింగ్ పరంగా పేపర్ మీద బలంగా కనిపిస్తున్న లక్నోకు ఫిట్నెస్ పెద్ద సమస్యగా మారింది. షమీ, ఆవేశ్ఖాన్, మయాంక్ యాదవ్ పూర్తి సీజన్ జట్టుకు అందుబాటులో ఉంటారా అన్నది అనుమానమే. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ తమ తొలి మ్యాచ్ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: బెదిరింపులకు లొంగని 11 ఏళ్ల చిన్నది!
బెదిరింపులకు లొంగని 11 ఏళ్ల చిన్నది!
ఫార్ములా వన్ రేసులో రారాజులే ఎక్కువగా కనిపిస్తారు. మైకెల్ షుమాకర్, లూయిస్ హామిల్టన్, వెర్స్టాపెన్ వంటి ఎందరో దిగ్గజాలను ఫార్ములా వన్ రేస్ ప్రపంచానికి పరిచయం చేసింది. భారత్లో కూడా ఫార్ములా వన్ రేసుపై మక్కువ ఇటీవలే కాలంలో పెరిగిపోయింది. ఫార్ములా వన్ అబ్బాయిలే ఎక్కువగా ఇష్టపడతారనేది ఎక్కువగా వినిపిస్తుంది. కానీ భారత్లో మాత్రం 11 ఏళ్ల అతికా మిర్ మాత్రం అబ్బాయిలకు ధీటుగా ఫార్ముల్ వన్లో దూసుకెళ్తోంది. యూరోపియన్ సర్క్యూట్లో అతికా మిర్ తన తొలి ప్రయత్నంలో (12 నుంచి 14 ఏళ్ల మధ్య) నిర్వహించే రేస్ కార్టింగ్లో అంచనాలకు మించి రాణించింది. అయితే రేసింగ్ ఇప్పటికీ పురుషాధిక్య క్రీడగానే ఉండడంతో తరచూ అబ్బాయిల చేతిలో బెదిరింపులకు గురయ్యేదానినని అతికా మిర్ చెప్పు కొచ్చింది. అతికా మిర్ కేవలం తన ప్రతిభ ఆధారంగానే మినీ (8 నుంచి 12 ఏళ్లు) విభాగం నుంచి జూనియర్ (12 నుంచి 14 ఏళ్లు) వేగంగా పదోన్నతి పొందడమే గాక తన అద్భుతమైన రేసింగ్ నైపుణ్యంతో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం భారత్ తరఫున అతికా మిర్ ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న భారతీయ కార్టర్గా మాత్రమే గాక, 40 వరకు ఉండే కార్ట్లు ఉండే రద్దీగా ఉండే గ్రిడ్లపై కూడా అతికా చాలా మంది పురుష రేసర్లను వెనక్కి నెట్టేయడం విశేషం. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన అతికా మిర్ ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తోంది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మాక్స్ వెర్స్టాపెన్ను అతికా తన ఆరాధ్య దైవంగా భావిస్తోంది. అతికా మిర్ రేసింగ్ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి ఆసిర్ మిర్ భారత మొట్టమొదటి జాతీయ కార్టింగ్ చాంపియన్. 2021లో అబుదాబిలో జరిగిన ఫార్ములా వన్ సీజన్ ఫైనల్లో లూయిస్ హామిల్టన్, వెర్స్టాపెన్ల మధ్య జరిగిన అద్భుతమైన టైటిల్ పోరును చూసినత తర్వాత అతికా మిర్ రేసింగ్పై ఇష్టాన్ని పెంచుకుంది. మోటార్ రేసింగ్లో పురుషాధిక్యం మామూలే. అందుకే ఫార్ములా వన్లో మహిళలు కనిపించరు. కానీ నమ్మకం, ఆత్మవిశ్వాసం ఇవాళ నన్ను రేసింగ్ను కెరీర్గా ఎంచుకునేలా చేశాయి. ట్రాక్పై అబ్బాయిలు వేధింపులకు గురైనప్పుడల్లా నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతూ పోయింది. 2021లో ఫార్ములా వన్ రేసు ఫైనల్ వీక్షించే వరకు నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. టీవీలో అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ద్వారా రేసింగ్పై మక్కువ పెంచుకున్నా అని అతికా చెప్పుకొచ్చింది. చదవండి: పంజాబ్ కింగ్స్లో లుకలుకలు!
జపాన్ స్టార్కు షాకిచ్చిన తాన్వి శర్మ
ఓర్లియాన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల...
ఇంకోటి ఆడితే రికార్డు పుటల్లోకి...
మయామి: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, లాస్ఏంజెలి...
‘మానసిక వేదన అనుభవిస్తున్నా’
పోలండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ సంచలన వ్...
ఇరాన్కు షాకిచ్చిన ఫిఫా!
ఫిఫా ప్రపంచకప్ 2026లో తమ మ్యాచ్ వేదికలను అమెరికా...
ఈ సారి 2000-3000 పరుగులు చేస్తా: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026 సీజన్కు మరో ఐదు రోజుల్లో తెరలేవన...
ఇషాన్ కిషన్పై యువ ప్లేయర్ సీరియస్..
ఐపీఎల్-2026 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ...
అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచకోత!
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే సన్రైజర్స్ హైద...
పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్
ఆసియాకప్-2025 సందర్భంగా ఓ పాకిస్తానీ టీవీ క్రికెట...
క్రీడలు
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
మాతో పెట్టుకోవద్దు.. పాక్కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్
అమ్మకంలో కూడా తగ్గని క్రేజ్... RCB టీమ్ కొత్త ఓనర్ ఎవరంటే..?
ప్యాట్ కమిన్స్ దూరం.. SRH కెప్టెన్ గా ఇషాన్ కిషన్..
CSK డెన్ లోకి చెట్టా గ్రాండ్ ఎంట్రీ
తిలక్ వర్మకు పెద్ది బ్యాట్ గిఫ్ట్ V ఇచ్చిన రామ్ చరణ్
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
టీం ఇండియా కొత్త కోచ్ గా MS ధోని
SRHకు ఫ్యాన్స్ కు షాక్.. కమిన్స్ లేకుండానే బరిలోకి..
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్లో హార్ట్ టచింగ్ మూమెంట్
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
