Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Ek tha jo wicket ke peeche se: CSK Fans Lambasts After RCB troll Dhoni1
‘అప్పట్లో ఒకడు ఉండేవాడు వికెట్ల వెనుక!.. చిల్లర బుద్ధి’

డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఐపీఎల్‌-2026 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించిన ఆర్సీబీ.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే)ను చిత్తు చేసింది.43 పరుగుల తేడాతో జయభేరిబెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ ఓడిన ఆర్సీబీ (RCB vs CSK) తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో కేవలం 207 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.ఫలితంగా ఆర్సీబీ చెన్నైపై 43 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుసగా రెండో విజయం నమోదు చేసి.. నాలుగు పాయింట్లు సాధించింది. భారీ నెట్‌రన్‌రేటు (+2.501) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు.దుమ్మెత్తిపోస్తున్న సీఎస్‌కే ఫ్యాన్స్‌ మరోవైపు.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ మాత్రం ఆర్సీబీ సోషల్‌ మీడియా వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, సీఎస్‌కేను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన మహేంద్ర సింగ్‌ ధోనిని అవమానించేలా పోస్టు పెట్టడమే ఇందుకు కారణం.కాగా 44 ఏళ్ల వయసులోనూ ధోని (MS Dhoni) ఐపీఎల్‌-2026 ఆడేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యా ఆరంభ మ్యాచ్‌లకు ఈ దిగ్గజ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దూరమయ్యాడు. ఈ క్రమంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలోని చెన్నై వరుసగా మూడు పరాజయాలతో చతికిలపడింది. దీంతో ధోని లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.ధోనిని కించపరిచేలా..ఈ నేపథ్యంలో ధోనిని కించపరిచేలా ఆర్సీబీ ఓ పోస్టు పెట్టింది. చెన్నై ఇన్నింగ్స్‌లో పదో ఓవర్లో అభినందన్‌ సింగ్‌ వేసిన ఐదో బంతిని శివం దూబే షాట్‌ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకుని దూబే పెవిలియన్‌ చేరేలా చేశాడు.అప్పట్లో ఒకడుండేవాడు వికెట్ల వెనుకఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆర్సీబీ.. ‘‘అప్పట్లో ఒకడుండేవాడు వికెట్ల వెనుక’’ అంటూ పరోక్షంగా ధోనిని ఉద్దేశించి క్యాప్షన్‌ జతచేసింది. దీంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. Ek tha jo wicket ke piche se………. pic.twitter.com/z6cdirLIUC— Royal Challengers Bengaluru (@RCBTweets) April 5, 2026‘‘ఒక్క టైటిల్‌ కోసం పద్దెనిమిదేళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఓ చెత్త జట్టు.. ఒక్కసారి గెలవగానే చిల్లర బుద్ధి చూపిస్తోంది. ధోని ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచాడు. అయినా ఎప్పుడూ సీఎస్‌కే ఇలాంటి చిల్లరవేషాలు వేయలేదు’’ అంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.చదవండి: IPL 2026: ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే!

Not far : Mohsin Naqvi claims PSL will beat IPL World No. 1 league claim2
త్వరలో మనమే నంబర్‌ వన్‌: పాక్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. భారత్‌లో 2008లో మొదలైన ఈ టీ20 లీగ్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందింది. పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ లీగ్‌కు.. మిగతా లీగ్‌లతో పోలిస్తే ఆదరణ కూడా ఎక్కువే! ఐపీఎల్‌ మీడియా హక్కులు ఏకంగా 6 బిలియన్‌ డాలర్లకు పైగా అమ్ముడుపోయాయంటే ఈ లీగ్‌కు ఉన్న క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.65 శాతం తక్కువమరోవైపు.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) 2016లో మొదలైంది. ఇప్పటికీ ఈ లీగ్‌ అంతగా ప్రాచుర్యం పొందలేకపోయింది. ఐపీఎల్‌లో అమ్ముడుపోని ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌లో ఆడుతూ ఉంటారు. పీఎస్‌ఎల్‌ మీడియా హక్కుల 93 మిలియన్‌ డాలర్లకు మించలేదు. ఐపీఎల్‌తో పోలిస్తే ఇది దాదాపుగా 65 శాతం తక్కువ. ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌ల మీడియా హక్కుల విలువ పీఎస్‌ఎల్‌ నాలుగు సీజన్లకు సమానం.తమదే గొప్ప లీగ్‌ అంటూఅయినప్పటికీ చాలా మంది పాక్‌ మాజీ క్రికెటర్లు పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోలుస్తూ.. తమదే గొప్ప లీగ్‌ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) చీఫ్‌ మొహ్సిన్‌ నక్వీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు.ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ లీగ్‌గా‘‘ప్రస్తుతం పెట్టుబడిదారులకు పీఎస్‌ఎల్‌ అత్యుత్తమ మార్కెట్‌గా పరిణమించింది. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ లీగ్‌ అయ్యేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పీఎస్‌ఎల్‌ గవర్నర్ల సమావేశంలో నక్వీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌కు పోటీగా మార్చిలోనే పీఎస్‌ఎల్‌ను మొదలుపెడుతున్న పీసీబీకి చేదు అనుభవాలే మిగులుతున్నాయి.ఐపీఎల్‌ క్రేజ్‌ ముందు పీఎస్‌ఎల్‌ వెలవెలబోతూ ఉన్నా పీసీబీ వైఖరి మాత్రం మారడం లేదు. అంతేకాదు.. ఈసారి పరిస్థితి మరీ పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లు అయింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ధరలపై ప్రభావం పడగా.. పాక్‌లో తీవ్ర సంక్షోభం నెలకొంది.ఆశకైనా హద్దుండాలిఫలితంగా కేవలం రెండు వేదికల్లో ప్రేక్షకులు లేకుండానే పీఎస్‌ఎల్‌ను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అనతికాలంలోనే ఈ లీగ్‌ నంబర్‌ వన్‌ అవుతుందంటూ నక్వీ చేసిన వ్యాఖ్యలపై.. ఆశకైనా హద్దు ఉండాలి కదా! అంటూ సోషల్‌ మీడియా సెటైర్లు పేలుతున్నాయి.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ పాకిస్తాన్‌కు ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌-2023లో కనీసం సెమీస్‌ చేరకుండానే ఇంటి బాట పట్టిన పాక్‌.. టీ20 ప్రపంచకప్‌-2024లో లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2026లో సెమీ ఫైనల్‌ చేరకుండానే నాకౌట్‌ అయింది. అనంతరం బంగ్లాదేశ్‌ పర్యటనలో పదకొండేళ్ల తర్వాత ఆతిథ్య జట్టుకు తొలిసారి వన్డే సిరీస్‌ కోల్పోయింది.చదవండి: Sanju Samson: ‘ఇష్టం లేక‌పోతే త‌ప్పుకో’.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఆగ్రహం

Im not a machine People Not noticed: Shami On most economical spell3
‘నేనేమీ యంత్రాన్ని కాదు.. వాళ్లు మాత్రం పట్టించుకోరు’

క్రికెట్‌లో కొనసాగాలంటే... ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందేనని టీమిండియా వెటరన్‌ బౌలర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అన్నాడు. శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పుడే నైపుణ్యాలను మెరుగు పరుచుకోగలమని పేర్కొన్నాడు. అందుకే తాను దేశవాళీల్లో అన్నీ మ్యాచ్‌లు ఆడుతున్నానని తెలిపాడు.కాగా 2025 మార్చి నుంచి షమీ (Mohammed Shami) టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. దేశీ క్రికెట్‌లో సత్తా చాటినా సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026లో తనను తాను నిరూపించుకుని మరోసారి ఆటతోనే సెలక్టర్లకు సందేశం పంపాలని షమీ పట్టుదలగా ఉన్నాడు.అత్యంత పొదుపుగాఇక ఈసారి లక్నో తరఫున బరిలోకి దిగిన షమీ.. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఒక వికెట్‌ తీయగలిగాడు. ఇక తాజాగా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసి లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించాడు.కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చిసన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన షమీ.. కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. సన్‌రైజర్స్‌ డేంజరస్‌ ఓపెనర్లు ట్రవిస్‌ హెడ్‌ (7), అభిషేక్‌ శర్మ (0) వికెట్లు కూల్చాడు. తద్వారా లక్నో విజయంలో ముఖ్య భూమిక పోషించిన ఈ రైటార్మ్‌ పేసర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.నేనేమీ యంత్రాన్ని కాదుఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ టీమిండియా సెలక్టర్ల తీరును పరోక్షంగా విమర్శించాడు. ‘‘నేనేమీ యంత్రాన్ని కాదు. కెరీర్‌లో ఎత్తుపళ్లాలు సహజం. అయితే, గత కొన్నేళ్లుగా నేను బాగానే ఆడుతున్నా. అయినప్పటికీ వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు.అది వేరే విషయం అనుకోండి. నేను మాత్రం నిరంతరం శ్రమిస్తూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అభిషేక్, హెడ్‌ వంటి వాళ్లకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్‌ను లాగేసుకుంటారు. అందుకే ఆ రెండు వికెట్లు ఎంతో కీలకం. టీమిండియా తరఫున ఆడుతున్న సమయం నుంచే బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌తో చక్కటి అనుబంధం ఉంది.స్లో బంతులతో ఫలితం అదే ఇప్పుడూ కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. అందుకే ఈ మ్యాచ్‌ కీలకమైంది. నైపుణ్యం లేకుండా ఏదీ సాధ్యం కాదు. గతంలో ఇక్కడ స్లో బంతులతో ఫలితం సాధించిన అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగించా. కొత్త బంతితో బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తా’’ అని షమీ పేర్కొన్నాడు.కాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ 18 డాట్‌ బాల్స్‌ వేశాడు. దీంతో అతడి ప్రదర్శనకుగానూ‘డాట్‌ బాల్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు చాముండేశ్వరీనాథ్‌ చేతుల మీదుగా షమీ ఈ పురస్కారం అందుకున్నాడు.చదవండి: ఆర్సీబీతో మ్యాచ్‌.. ఓట‌మికి పూర్తి బాధ్యత నాదే!Lala with the new ball >>>>> pic.twitter.com/Zz7XBJbm5W— Lucknow Super Giants (@LucknowIPL) April 5, 2026

CSK Fans Troll Sanju Samson Step Aside If You Not Interested To Play4
‘ఇష్టం లేక‌పోతే త‌ప్పుకో’.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఆగ్రహం

టీమిండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలో ఓపెన‌ర్ సంజూ శాంస‌న్‌ది కీల‌క‌పాత్ర అని చెప్పొచ్చు. సూప‌ర్‌-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా ఫామ్‌లోకి వ‌చ్చిన సంజూ ఆ త‌ర్వాత సెమీస్‌, ఫైన‌ల్స్‌లో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అదే సూప‌ర్‌ఫామ్‌ను ఐపీఎల్ 19వ సీజ‌న్‌లోనూ కొన‌సాగిస్తాడ‌ని అంతా భావించిన వేళ సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది.రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నుంచి ఏ ముహూర్తంలో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయ్యాడో కానీ దారుణంగా విఫ‌ల‌మ‌వుతూ వ‌స్తున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ఓట‌మి చ‌విచూస్తే.. శాంస‌న్ ఆడ‌క‌పోవ‌డం కూడా జ‌ట్టును బాగా దెబ్బ‌తీస్తోంది. శాంస‌న్ ఈ సీజ‌న్‌లో సీఎస్‌కేకు బ‌లమ‌వుతాడ‌నుకుంటే దారుణ ఆట‌తీరుతో బ‌ల‌హీనంగా మారిపోయాడు. శాంస‌న్ వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లోనూ 6,7 9 ప‌రుగులు మాత్రమే చేశాడు. దీంతో సీఎస్‌కే అభిమానులు సంజూ శాంస‌న్ ఆట‌తీరుపై గుస్సా అవుతున్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో హీరోగా నిలిచిన శాంస‌న్ ఐపీఎల్‌లో జీరో అయిపోయాడంటూ ట్రోల్స్‌కు గురి చేస్తున్నారు. రాజ‌స్తాన్ కెప్టెన్‌గా అద‌ర‌గొట్టిన శాంస‌న్ సీఎస్‌కేకు వ‌చ్చేస‌రికి మాత్రం పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. ముఖ్యంగా ఆడాల‌నే ప‌ట్టుద‌ల శాంస‌న్‌లో ఏమాత్రం క‌నిపించ‌డం లేద‌ని సీఎస్‌కే అభిమానులు పేర్కొంటున్నారు. జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు అవ‌స‌ర‌మైన ప‌రుగులు చేయాల్సిన చోట విఫ‌ల‌మ‌వుతుండ‌డం చూసి ఆస‌క్తి లేక‌పోతే జ‌ట్టు నుంచి త‌ప్పుకుంటే బాగుంటుందేమోన‌ని సోష‌ల్ మీడియా వేదికగా శాంస‌న్‌కు స‌ల‌హాలు ఇస్తున్నారు. మాన‌సికంగా సిద్ధంగా లేక‌పోతే మాత్రం కొన్ని మ్యాచ్‌ల‌కు జట్టు నుంచి త‌ప్పుకోవ‌డ‌మే మేలని పేర్కొన్నారు. కెమెరాల‌న్నీ శాంస‌న్‌వైపు తిరిగిన ప్ర‌తీసారి ఏదో కోల్పోయినట్లుగా శాంస‌న్ ఫీల‌వుతున్నాడ‌ని, సీఎస్‌కేలోకి వ‌చ్చాకా ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు న‌వ్వ‌డం తాము చూడ‌లేద‌ని అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో క‌నిపించిన శాంస‌న్ మాకు కావాలని, ఆ క‌సి ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని, ఇప్ప‌టినుంచైనా కాస్త శ్ర‌ద్ద పెడితే బాగుంటుంద‌ని వాపోయారు. ఐదుసార్లు ఐపీఎల్‌లో చాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే ఈ సీజన్‌లో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసి విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూడాల్సి వస్తోంది.మ్యాచ్‌ విషయానికొస్తే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్‌ పటిదార్‌, టిమ్‌ డేవిడ్‌, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.Dear @IamSanjuSamson,If you’re not mentally in it, then step aside for a few games. This isn’t just about runs anymore. Your body language is screaming disinterest. Every time the camera’s on you, you look frustrated and disconnected. Honestly, I’ve never seen you smiling even… pic.twitter.com/L7bFl0uJbf— Madras Man (@newbatsman) April 5, 2026చదవండి: ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే!

Seniors Mohammed Shami-Bhuvaneshwar Kumar Terrific Performance IPL 20265
ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే!

మ‌హ్మ‌ద్ ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌.. ఈ ఇద్దరు టీమిండియాకు ప్రాతినిధ్యం వ‌హించారు. ఎన్నో మ్యాచ్‌ల్లో భార‌త్ గెల‌వ‌డంలో ఈ ఇద్ద‌రు కీల‌క‌పాత్ర పోషించారు. 2013 చాంపియ‌న్స్ ట్రోఫీ భార‌త్ గెల‌వ‌డంలో భువ‌నేశ్వ‌ర్ కీల‌క‌పాత్ర పోషించాడు. 2012లో టీమిండియా త‌ర‌ఫున అరంగేట్రం చేసిన భువ‌నేశ్వ‌ర్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన భార‌త బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. అంతేకాదు ధోని హ‌యాంలో బాగా రాటుదేలిన భువ‌నేశ్వ‌ర్‌కు రానురాను అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. స్వింగ్ డెలివ‌రీల‌తో ముప్ప‌తిప్ప‌లు పెట్టిన భువ‌నేశ్వ‌ర్ ద‌శాబ్ద కాలం పాటు టీమిండియాకు మూడు ఫార్మాట్లు (టెస్టు, వ‌న్డే, టీ20లు) ప్ర‌ధాన బౌల‌ర్‌గా సేవ‌లందించాడు. 2022లో టీమిండియా త‌ర‌ఫున చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడిన భువ‌నేశ్వ‌ర్ అప్ప‌టినుంచి ఐపీఎల్‌లోనే క‌నిపిస్తున్నాడు.భువీ క‌థ అలా ఉంటే టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీది మ‌రో క‌థ‌. నిల‌క‌డ‌కు మారుపేరుగా నిలిచే ష‌మీ జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా వికెట్లు తీయ‌డంలో నేర్ప‌రి. ముఖ్యంగా 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ పైన‌ల్ చేర‌డంలో ష‌మీ పాత్ర కీల‌క‌మ‌ని చెప్పొచ్చు. ఆ టోర్నీలో భార‌త్ తుదిమెట్టుపై బోల్తా ప‌డిన‌ప్ప‌టికీ ష‌మీ మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఆ టోర్నీలో ఏడు మ్యాచ్‌లాడిన ష‌మీ 24 వికెట్లు ప‌డ‌గొట్టి లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. టెస్టుల్లోనూ త‌న‌దైన మార్క్ చూపిన ష‌మీకి ఎప్పుడూ అన్యాయం జ‌రుగుతూనే వ‌స్తోంది. గాయాల పేరుతో అకార‌ణంగా జ‌ట్టు నుంచి త‌ప్పించిన ష‌మీ టీమిండియాలో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కృషి చేస్తూనే ఉన్నాడు.తాజాగా ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో అటు భువ‌నేశ్వ‌ర్‌.. ఇటు మహ్మ‌ద్ ష‌మీ త‌మ స‌త్తా చాటుతున్నారు. ఈ ఇద్ద‌రు పొదుపుగా బౌలింగ్ చేయ‌డంతో పాటు వికెట్లు నేల‌కూలుస్తూ త‌మ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిందేనంటూ బీసీసీకి ప‌రోక్షంగా సందేశాలు పంపుతున్నారు. లేటు వ‌య‌సులోనూ ప‌దునైన బౌలింగ్‌తో అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తున్న ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ ఐపీఎల్ 19వ సీజ‌న్‌తో మ‌రోసారి సెలెక్ట‌ర్ల దృష్టిలో ప‌డిన‌ట్లే.గ‌త సీజ‌న్ వ‌ర‌కు గుజ‌రాత్ టైటాన్స్‌లో కొన‌సాగిన ష‌మీని ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆదివారం ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ష‌మీ త‌న ప్రాముఖ్య‌త‌ను రుచి చూపించాడు. 4 ఓవ‌ర్లు వేసిన ష‌మీ 9 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 2 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన షమీ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో షమీ 122 మ్యాచ్‌లాడి 136 వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్‌లో 200 వికెట్ల మార్క్‌ను అందుకున్న భువనేశ్వర్ కుమార్ కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. 2016లో ఎస్‌ఆర్‌హెచ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్ చాలాకాలం పాటు ఆ జట్టుకే ఆడాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అయితే గత సీజన్‌కు ముందు ఆర్సీబీలోకి వెళ్లిన భువనేశ్వర్ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఆర్సీబీ జట్టులోనూ భువీ బాగమయ్యాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ 192 మ్యాచ్‌ల్లో 202 వికెట్లు తీశాడు.దాదాపు ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షమీ, భువనేశ్వర్‌లు తాజాగా లేటు వయసులోనూ ఇరగదీస్తున్నారు. ఓవరాల్‌గా షమీ అన్ని ఫార్మాట్లు కలిపి 462 వికెట్లు పడగొడితే.. భువనేశ్వర్ అన్ని ఫార్మాట్లు కలిపి 294 వికెట్లు తీశాడు. లేటు వ‌య‌సులో ఇర‌గ‌దీస్తున్న భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, మహ్మ‌ద్ ష‌మీలు మ‌ళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆశిద్దాం. View this post on Instagram A post shared by MOHAMMAD SHAMI (@mdshami.11)చదవండి: భ‌యంతో ఆడిన పంత్‌.. సంజీవ్ గోయెంకా రియాక్ష‌న్‌!

Pant Finds Special Mention Sanjiv Goenka Reacts Won Match Vs SRH6
భ‌యంతో ఆడిన పంత్‌.. సంజీవ్ గోయెంకా రియాక్ష‌న్‌!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ బోణీ కొట్టింది. ఆదివారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో 5 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్ ఐదో బంతికి విజాయ‌న్ని అందుకుంది. కాగా రిష‌బ్ పంత్ (68 నాటౌట్‌) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఓపెన‌ర్ మార్క‌ర‌మ్ (45) మ‌రోసారి మెరిశాడు. అయితే పంత్ త‌న శైలికి విరుద్ధంగా ఎక్కువ బంతులాడి అర్థ‌సెంచ‌రీ సాధించ‌డం ఆస‌క్తిగా క‌నిపించింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఓట‌మి పాల‌వ్వ‌డంతో ఆ జ‌ట్టు య‌జమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ పంత్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు రావ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఇద్ద‌రు సీరియ‌స్‌గా చ‌ర్చించుకున్న వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ల‌క్నో ఫ్రాంచైజీ దీనిపై స్ప‌ష్ట‌త‌నిస్తూ పూర్తి వీడియోనూ విడుద‌ల చేయ‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. కానీ ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్‌లో మాత్రం ఆ భ‌యం పోలేద‌నిపిస్తుంది. ఈసారి కూడా ఓట‌మి చ‌విచూస్తే త‌మ బాస్ ఆగ్ర‌హానికి గుర‌వ్వాల్సి వ‌స్తుంద‌ని పంత్ భావించిన‌ట్లున్నాడు. అందుకే ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో పంత్ ఆఖ‌రిదాకా నిల‌బ‌డి జ‌ట్టును గెలిపించాడు. ఫలించిన మొక్కులు..మ్యాచ్ విజ‌యం అనంత‌రం పంత్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన సంజీవ్ గోయెంకా ఈసారి మాత్రం న‌వ్వుతూ అత‌న్ని హ‌గ్ చేసుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినందుకు అత‌న్ని మెచ్చుకున్నాడు. అయితే మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో లక్నో గెలవాలని సంజీవ్‌ గోయెంకా పదేపదే తన వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకు మొక్కడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.#LucknowSuperGiants owner taking blessings of #LordVenkateswaraOm Namo Venkatesaya 🕉️pic.twitter.com/jqY6bfB4Se— Milagro Movies (@MilagroMovies) April 6, 2026ఇక ఎస్ఆర్‌హెచ్‌పై విజ‌యం అనంత‌రం సంజీవ్ గోయెంకా త‌న జ‌ట్టును మెచ్చుకుంటూ ట్విట‌ర్‌లో పోస్టు పెట్టాడు. ‘ఐపీఎల్ అనేది సుదీర్ఘంగా సాగుతుంది. ఒక జట్టు విజయం సాధించాలంటే సమయం, సహనం, జట్టు ఐకమత్యం అవసరం. ఇవాళ ఆ మూడు మా లక్నో జట్టులో ప్రతిబింబించాయి. పంత్ కెప్టెన్‌గా జట్టును దిశానిర్దేశం చేస్తే ఆటగాళ్లంతా క్రమశిక్షణతో దానిని అనుసరించారు. జట్టులో ఉండే సమన్వయం ఎదుగుదలకు తోడ్పతుంది. ఈ విజయం మాకు ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మున్ముందు మా ఆటలో మరింత పురోగతి కనిపిస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. మిడిలార్డర్‌లో నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌లు అర్థసెంచరీలతో రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.చదవండి: ఆర్సీబీతో మ్యాచ్‌.. ఓట‌మికి పూర్తి బాధ్యత నాదే!

IPL 2026: CSK Captain Ruturaj Blames Himself After Match Lost To RCB7
ఆర్సీబీతో మ్యాచ్‌.. ఓట‌మికి పూర్తి బాధ్యత నాదే!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఓట‌ముల ప‌రంప‌ర కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఆదివారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో పరాజ‌యం పాలైన సీఎస్‌కే హ్యాట్రిక్ ఓట‌ముల‌ను మూట‌గ‌ట్టుకుంది. అంతేకాదు ప‌ర‌మ చెత్త ఆట‌తీరుతో (-2.157) దారుణ‌మైన నెట్ ర‌న్‌రేట్‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్ ఓట‌మిపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. మ్యాచ్ ఓట‌మికి తానే మొత్తం బాధ్య‌త తీసుకుంటాన‌ని రుతురాజ్ పేర్కొన్నాడు. బ్యాట‌ర్‌గా, కెప్టెన్‌గా విఫ‌ల‌మ‌య్యాన‌ని, అందుకే ఓట‌మికి పూర్తి బాధ్య‌త తానే తీసుకుంటాన‌ని చెప్పుకొచ్చాడు. రుతురాజ్ మాట్లాడుతూ.. ‘బిగ్ టార్గెట్ మన కళ్లముందు ఉన్నప్పుడు బాధ్యతగా ఆడాల్సిన అవసరముంది. టాపార్డర్‌లో నేను ఎక్కువ పరుగులు చేయాల్సింది. మా బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్‌, ప్రశాంత్ వీర్‌, జేమీ ఓవర్టన్‌తో పాటు శివమ్ దూబే తమ పోరాటం చేశారు. కానీ నేను బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే ఓటమిని నన్ను నేను బాధ్యుడిగా చేసుకుంటున్నా. అన్షుల్ కాంబోజ్ దాదాపుగా అత‌డి వికెట్ తీశాడు. మేం ఆనందంలో ఉన్నాం. అయితే.. ఆ బాల్ నోబాల్ కావ‌డం మా దుర‌దృష్ట‌క‌రం. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న డేవిడ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. మైదానం న‌లువైపులా బంతిని బాదాడు. అత‌డు బ్యాటింగ్ చేసిన విధానానికి ఖ‌చ్చితంగా హ్యాట్సాఫ్. గతంలో భారీ స్కోర్లను ఛేదించిన సందర్భాలున్నాయి. హ్యాట్రిక్ ఓటములు బాధ కలిగిస్తున్నప్పటికీ తర్వాతి మ్యాచ్‌ల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటాం’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 3 బంతుల్లో ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గత సీజన్‌లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రుతురాజ్ అప్పటి నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవుతూనే వస్తున్నాడు. కెప్టెన్సీ అనే బాధ్యత రుతురాజ్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మ్యాచ్‌ విషయానికొస్తే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్‌ పటిదార్‌, టిమ్‌ డేవిడ్‌, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.చదవండి: భువనేశ్వర్‌ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

Bhuvneshwar Scripts IPL History Reached 200 Wickets Milestone Vs CSK8
భువనేశ్వర్‌ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ బౌలింగ్‌లోనూ ప‌దును పెంచుకుంటున్న భువ‌నేశ్వ‌ర్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఫాస్ట్ బౌల‌ర్‌గానూ భువ‌నేశ్వ‌ర్ చ‌రిత్ర పుట‌ల్లో నిలిచాడు. ఆదివారం సీఎస్‌కేతో మ్యాచ్ సంద‌ర్భంగా ఆయుశ్ మాత్రే వికెట్ తీసిన భువీ 200 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే టీమిండియా త‌ర‌ఫున ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన‌ రెండో బౌల‌ర్‌గా నిలిచిన భువ‌నేశ్వ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ల జాబితాలో మాత్రం అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్న తొలి ఆట‌గాడిగా స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ నిలిచాడు. చాహ‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు 176 మ్యాచ్‌ల్లో 224 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజాగా భువ‌నేశ్వ‌ర్ 192 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. భువ‌నేశ్వ‌ర్ త‌ర్వాత కేకేఆర్ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్ 191 మ్యాచ్‌ల్లో 193 వికెట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఈ స్వింగ్ కింగ్ మ‌రో అరుదైన రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌల‌ర్ల‌కు సాధ్యం కాని 200 వికెట్ల మార్క్‌ను అధిగ‌మించిన తొలి బౌల‌ర్‌గా భువీ నిలిచాడు. టీమిండియా స్పీడ‌స్ట‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం ల‌సిత్ మ‌లింగ‌లు కూడా భువ‌నేశ్వ‌ర్ కంటే వెనుక‌బ‌డి ఉన్నారు. ఇక మ్యాచ్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 4 ఓవ‌ర్లు వేసి 41 ప‌రుగులిచ్చి 3 కీల‌క వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ ఖాతాలో మ‌రో రికార్డు..రికార్డులు పెట్ట‌డానికే కోహ్లీ పుట్టిన‌ట్లున్నాడు. తాజ‌గా సీఎస్‌కేతో మ్యాచ్ ద్వారా కోహ్లీ మ‌రో టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 28 ప‌రుగులు చేయ‌డం ద్వారా కోహ్లీ ఆ జ‌ట్టుపై 1,174 ప‌రుగులు సాధించాడు. త‌ద్వారా ఒకే జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇంత‌క‌ముంఉద ఈ రికార్డు రోహిత్ పేరిట ఉంది. రోహిత్ శ‌ర్మ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై 1,161 ప‌రుగులు సాధించాడు. తాజాగా కోహ్లీ రోహిత్‌ను దాటి తొలి స్థానంలో నిలిచాడు.చదవండి: ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం!

KSCA officially unveils Rahul Dravid, Anil Kumble Stands at M Chinnaswamy Stadium9
ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం!

భారత క్రికెట్‌ దిగ్గజాలు రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లేలను కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) సముచిత స్థాయిలో గౌరవించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోని రెండు ఎండ్‌లకు ఈ ఇద్దరి పేర్లు పెట్టింది. ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్‌ ప్రసాద్‌ సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ద్రవిడ్, కుంబ్లే ఎండ్‌లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేఎస్‌సీఏ ప్రతినిధులతో పాటు... ద్రవిడ్, కుంబ్లే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడ్‌ మాట్లాడుతూ... ‘ఈ స్టేడియం నాకు రెండో ఇల్లు లాంటిది. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే అంతా ఈ మైదానం వల్లే. కర్ణాటక క్రికెట్‌ సంఘానికి ధన్యవాదాలు’ అని అన్నాడు. సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు సేవలందించిన ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 24, 177 పరుగులు చేయగా... కుంబ్లే ఓవరాల్‌గా 956 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్‌ విషయానికొస్తే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్‌ పటిదార్‌, టిమ్‌ డేవిడ్‌, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.చదవండి: సీఎస్‌కే అంటే కోహ్లీకి పూన‌క‌మే!

Bangalore beat Chennai Super Kings by 43 runs10
బెంగళూరు వీరంగం

బెంగళూరు: టాపార్డర్‌ దుమ్మురేపడంతో... ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) వరుసగా రెండో విజయం సాధించింది. ఐదుసార్లు విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 43 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (25 బంతుల్లో 70 నాటౌట్‌; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), కెప్టెన్ రజత్‌ పాటీదార్‌ (19 బంతుల్లో 48 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... దేవదత్‌ పడిక్కల్‌ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫిల్‌ సాల్ట్‌ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కొండంత లక్ష్యఛేదనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చెన్నై చివరకు 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఈ సీజన్‌లో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (25 బంతుల్లో 50; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సత్తా చాటగా... కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (7), సంజూ సామ్సన్‌ (9), ఆయుశ్‌ మాత్రే (1), కార్తీక్‌ శర్మ (6), శివమ్‌ దూబే (18) విఫలమయ్యారు. ప్రశాంత్‌ వీర్‌ (29 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్‌), జేమీ ఓవర్టన్‌ (16 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లలో 91/1 ఇన్నింగ్స్‌ ఆరంభంలో బంతి బ్యాట్‌ మీదకు రాకపోవడంతో బెంగళూరు నెమ్మదిగా ఆడింది. గత మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన విరాట్‌ కోహ్లి (18 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. పవర్‌ప్లేలో వికెట్‌ నష్టానికి 51 పరుగులు చేసిన బెంగళూరు... సగం ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 91/1తో నిలిచింది. కాసేపటికే సాల్ట్‌ కూడా అవుట్‌ కాగా... ఆ తర్వాత ఆర్‌సీబీ విధ్వంసం మొదలైంది. చివరి 5 ఓవర్లలో 97 పరుగులు నూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో పాటీదార్, పడిక్కల్‌ చెరో సిక్స్‌తో 16 పరుగులు రాబట్టగా... దూబే వేసిన తదుపరి ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్‌ అవుట్‌ కాగా... టిమ్‌ డేవిడ్‌ రాకతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. ఒకవైపు పాటీదార్‌ సిక్స్‌ల వర్షం కురిపిస్తుంటే... మరోవైపు డేవిడ్‌ బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. నూర్‌ అహ్మద్‌ వేసిన 17వ ఓవర్‌లో ‘హ్యాట్రిక్‌’ సిక్స్‌లు బాదిన అతడు... తదుపరి ఓవర్‌లో 4, 6 కొట్టాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డేవిడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ కాగా... అన్షుల్‌ వేసిన ఆ బంతి నోబాల్‌ కావడంతో బతికిపోయాడు. ఓవర్టన్‌ వేసిన 19వ ఓవర్‌లో డేవిడ్‌ వరుసగా 6, 2, 4, 6, 6, 6 కొట్టడంతో స్టేడియం మోత మోగిపోయింది. డేవిడ్‌ 21 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ మార్క్‌ చేరాడు. చివరి ఓవర్‌లో మరో 6, 4తో బెంగళూరు ఈ సీజన్‌లో తొలిసారి 250 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. పాటీదార్, పడిక్కల్‌ మూడో వికెట్‌కు 21 బంతుల్లో 58 పరుగులు జోడించగా... పాటీదార్, డేవిడ్‌ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 99 పరుగులు జతచేశారు. బెంగళూరు చివరి 5 ఓవర్లలో 97 పరుగులు రాబట్టడం విశేషం. 202 ఐపీఎల్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ తీసిన వికెట్లు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చాహల్‌ (224) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భువీ రెండో స్థానంలో ఉన్నాడు.స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) నూర్‌ (బి) దూబే 46; కోహ్లి (సి) దూబే (బి) అన్షుల్‌ 28; పడిక్కల్‌ (బి) ఓవర్టన్‌ 50; పాటీదార్‌ (నాటౌట్‌) 48; టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 70; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 250. వికెట్ల పతనం: 1–37, 2–93, 3–151. బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–37–0; హెన్రీ 3–0–36–0; అన్షుల్‌ 4–0–52–1; నూర్‌ 4–0–49–0; ఓవర్టన్‌ 3–0–42–1; శివమ్‌ దూబే 2–0–30–1. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) పడిక్కల్‌ (బి) డఫీ 9; రుతురాజ్‌ (సి) పడిక్కల్‌ (బి) డఫీ 7; ఆయుశ్‌ (సి) పాటీదార్‌ (బి) భువనేశ్వర్‌ 1; సర్ఫరాజ్‌ (స్టంప్డ్‌) జితేశ్‌ (బి) కృనాల్‌ 50; కార్తీక్‌ (సి) అభినందన్‌ (బి) కృనాల్‌ 6; శివమ్‌ దూబే (సి) జితేశ్‌ (బి) అభినందన్‌ 18; ప్రశాంత్‌ (సి) పాటీదార్‌ (బి) భువనేశ్వర్‌ 43; ఓవర్టన్‌ (సి) (సబ్‌) బెథెల్‌ (బి) సుయాశ్‌ 37; అన్షుల్‌ (నాటౌట్‌) 19; నూర్‌ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 8; హెన్రీ (సి) సాల్ట్‌ (బి) అభినందన్‌ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 207. వికెట్ల పతనం: 1–9, 2–10, 3–30, 4–77, 5–84, 6–108, 7–165, 8–178, 9–190, 10–207. బౌలింగ్‌: డఫీ 4–0–58–2; భువనేశ్వర్‌ 4–0–41–3; అభినందన్‌ 3.4–0–30–2; కృనాల్‌ 3–0–36–2; సుయాశ్‌ 4–0–21–1; షెఫర్డ్‌ 1–0–19–0; ఐపీఎల్‌లో నేడుకోల్‌కతా X పంజాబ్‌ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement
 
Advertisement