Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

PSL 2026: Fakhar Zaman handed two match ban for ball tampering1
పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌పై నిషేధం

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ ఫకర్‌ జమాన్‌ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2026లో బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు రుజువు కావడంతో లీగ్‌ యాజమాన్యం ఇతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. పీఎస్‌ఎల్‌లో లాహోర్‌ ఖలందర్స్‌కు ఆడే జమాన్‌.. మార్చి 29న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం టీవీ స్క్రీన్లలోనూ స్పష్టం కనిపించింది.అయితే జమాన్‌ ఈ ఆరోపణలు ఖండించాడు. తాను ఎలాంటి బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడలేదని అన్నాడు. దీంతో మ్యాచ్‌ రిఫరి రోషన్‌ మహానామా రంగంగలోకి దిగి విచారణ చేపట్టారు. ఇందులో జమాన్‌ దోషిగా తేలడంతో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. బాల్‌ టాంపరింగ్‌ అంశం పీఎస్‌ఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని లెవల్‌–3 ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇందుకు శిక్ష రెండు మ్యాచ్‌ల నిషేధం.నిషేధం ప్రకటనలో జమాన్‌ ఏప్రిల్‌ 3న ముల్తాన్‌ సుల్తాన్స్‌తో, ఏప్రిల్‌ 9న ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరుగనున్న మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అసలేం జరిగిందంటే..?క‌రాచీ కింగ్స్ విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను కెప్టెన్ షాహీన్ అఫ్రిది పేస‌ర్ హ‌రీస్ ర‌వూఫ్‌కు అప్ప‌గించాడు. అయితే ఈ క్ర‌మంలో ఫకర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ ఎండ్ వ‌ద్ద‌ మాట్లాడుకున్నారు. ఈ స‌మ‌యంలో బంతికి ఒక‌రు చేతి నుంచి ఒకరు మార్చుకున్నారు.అయితే బంతిని ఫ‌కర్ త‌న చేతి వేలితో గీకిన‌ట్లు కనిపించింది. దీంతో వెంట‌నే అంపైర్ బంతిని అత‌డి చేతి నుంచి తీసుకుని టాంపరింగ్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్ర‌మంలో బంతిని మార్చ‌డంతో పాటు ల‌హోర్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫ‌లితమే తారుమారైంది. జమాన్‌ జట్టు ఓటమిపాలైంది.

IPL 2026 Member Suffers Death In Mumbai, Investigation Launched2
ఐపీఎల్‌ 2026లో విషాదం

ఐపీఎల్‌ 2026లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన 76 ఏళ్ల బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌ జాన్‌ విలియం లాంగ్‌ఫోర్డ్‌ ముంబైలోని తన హోటల్‌ గదిలో విగతజీవిగా పడి ఉన్నారు. లాంగ్‌ఫోర్డ్‌ మార్చి 24 నుంచి ముంబైలోని ట్రైడెంట్‌ హోటల్‌లో ఉంటున్నారు. మార్చి 29న జరిగిన ముంబై ఇండియన్స్‌–కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌లో ఆయన పని చేశారు. ఆ రాత్రి హోటల్‌ గదిలోకి వెళ్లిన అతను.. మరుసటి రోజు ఉదయం ఎంతకీ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది స్పేర్‌ లాక్‌తో డోర్‌ ఓపెన్‌ చేసి చూడగా లాంగ్‌ఫోర్డ్‌ నేలపై పడివున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన మెరైన్‌ డ్రైవ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించలేదని పోలీసులు తెలిపారు. లాంగ్‌ఫోర్డ్‌ కెరీర్‌ బ్రిటిష్‌ సిటిజన్‌ అయిన లాంగ్‌ఫోర్డ్‌ ఐపీఎల్‌ 2026లో ZOOM కమ్యూనికేషన్స్‌ తరఫున ఫ్రీలాన్స్‌ విజన్‌ సూపర్వైజర్‌గా పని చేస్తున్నారు. గతంలో అతను మహిళల ప్రీమియర్‌ లీగ్‌, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌, 2010 FIFA వరల్డ్‌ కప్‌ వంటి ప్రధాన ఈవెంట్లలో కూడా సేవలందించారు. 1996 నుంచి 2011 వరకు భారత్‌, శ్రీలంక, వెస్టిండీస్‌లో జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్స్‌లో కూడా పని చేశారు. లాంగ్‌ఫోర్డ్‌కు ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్‌–కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ చివరి అసైన్‌మెంట్‌గా మిగిలిపోయింది. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (78), ర్యాన్‌ రిక్‌ల్టన్‌ (81) మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా ముంబై ఇండయన్స్‌ ఘన విజయం సాధించింది.

Ignored Despite 67 Wickets Shami Strong Message To Ajit Agarkar3
ఒకే సీజన్లో 67 వికెట్లు.. అయినా పట్టించుకోరు!

గత కొన్నాళ్లుగా టీమిండియా సెలక్షన్‌ కమిటీ వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని పట్టించుకోవడం మానేసింది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారత్‌ ఫైనల్‌ చేరడంలో ఈ రైటార్మ్‌ బౌలర్‌ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలోనూ షమీది ముఖ్య భూమిక.అయితే, దాదాపు మూడేళ్లుగా షమీకి టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఇక వన్డేల్లో మేజర్‌ టోర్నీల్లో సత్తా చాటినా.. ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఫిట్‌నెస్‌ సమస్యల వల్లే షమీని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్వయంగా వెల్లడించాడు.కానీ షమీ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించడమే కాకుండా.. పూర్తి ఫిట్‌నెస్‌తో దేశవాళీ క్రికెట్‌ బరిలో దిగి సత్తా చాటాడు. బెంగాల్‌ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు.ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌ ఊహాగానాలు వస్తుండగా షమీ స్పందించాడు. శుభంకర్‌ మిశ్రా షోలో మాట్లాడుతూ.. ‘నేను అలసిపోయానని భావించిన మరుక్షణం రిటైర్‌ అవుతాను. అంతేగాని ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదు. నిజానికి రిటైర్మెంట్‌ గురించి ఆలోచిస్తే మనం వెనుకబడి పోతాము.ముందుగా చెప్పినట్లు నేను అలసిపోయాను.. ఆడలేను అని భావించినపుడే నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నేను ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అందుకు తగ్గట్లే సానుకూల ఫలితాలు వస్తున్నాయి’ అని షమీ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ షమీని లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘బౌలర్‌గా వంద శాతం బాధ్యతలు నిర్వర్తించగలను.అంచనాలు అందుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. మిగతాదంతా నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. దానిని నేనైతే మార్చలేను. అంకితభావంతో ఆడటం మాత్రమే నా పని. లక్నో నన్ము నమ్మింది. కచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’’ అని షమీ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున 2023లో చివరగా టెస్టు ఆడిన షమీ.. 2025లో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Let people talk not here to prove my talent: Ajinkya Rahane shuts critics4
IPL 2026: ’ప్రేక్షకుల్ని మురిపించడానికి ఆడను’

తనను విమర్శించే వారికి భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి అజింక్య రహానే గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తాను క్రికెట్‌ ఆడేది పూర్తిగా తన వ్యక్తిగతమని.. ప్రేక్షకుల్ని మురిపించడానికో.. విమర్శకులకు తానేంటో నిరూపించడానికో కాదని స్పష్టం చేశాడు. ఆటగాడిగానేతన భవిష్యత్తుపై, రిటైర్మెంట్‌పై వచ్చే ఊహాగానాలను రహానే (Ajinkya Rahane) కొట్టిపారేశాడు. 37 ఏళ్ల రహానే గత సీజన్‌లో ముంబై రంజీ ట్రోఫీ సారథ్యం నుంచి తప్పుకున్నాడు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ నాయకుడిగా కాకుండా ఆటగాడిగానే కొనసాగాడు. దీంతో ఇక విమర్శకులు అదేపనిగా రహానే రిటైర్మెంట్‌ ఖాయమనే వ్యాఖ్యలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా అదే పని ముంబైతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో దీనిపై రహానే స్పందిస్తూ ‘ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటారు. ఇవేమి కొత్తకాదు కదా! దాదాపు 20 ఏళ్లుగా నా గురించి మాట్లాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లని అలాగే కొనసాగనివ్వండి. నేనేమో నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తాను. వాళ్లనలా చూడనివ్వండినా ఆటతీరేంటో నాకు తెలుసు. నా ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉన్నాను. అంతేతప్ప నేనేంటో... నా ప్రతిభేంటో కొత్తగా ఎవరికీ చూపించుకోవడానికి ఆడట్లేదు. ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్లనలా చూడనివ్వండి. విమర్శకులు విమర్శిస్తారు. వీళ్లను అలాగే చేయనివ్వండి’ అని అన్నాడు. ముంబైతో జరిగిన పోరులో రహానే మెరుపు ఫిఫ్టీతో అదరగొట్టాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన ‘జింక్స్‌’... 5 సిక్సర్లు, మూడు బౌండరీలు బాదాడు. గత రెండు మూడేళ్లుగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో నా బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకున్న తీరుపట్ల తానెంతో సంతోషంగా ఉన్నానన్నాడు. ఓ క్రికెటర్‌గా, బ్యాటర్‌గా ఎదగడం ముఖ్యమని, తానిప్పుడు చేస్తున్నది కూడా అదేనని రహానె చెప్పుకొచ్చాడు. ముంబైతో జరిగిన పోరులో తాము బాగానే ఆడామని, కీలకమైన తరుణంలో మరిన్ని ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండగా చేయలేకపోయామని అన్నాడు.మా ఓటమికి కారణం అదే‘ముందుగా మేం 220 స్కోరు చేస్తే చాలానుకున్నాం. కానీ ఓ దశలో 235 నుంచి 240 పరుగులు చేస్తామని కూడా అనిపించింది. అయితే బుమ్రా స్పెల్‌ మా జోరుకు అడ్డుకట్ట వేసింది. అతని రెండు ఓవర్ల స్పెలే మరిన్ని పరుగులు చేయకుండా నిరోధించింది’ అని రహానే అన్నాడు.అనుభవలేమి బౌలింగ్‌ కూడా తమ ఓటమికి కారణమని రహానే చెప్పాడు. వైభవ్, కార్తీక్‌ త్యాగి, ముజరబానిలు తేలిపోయారని చెప్పాడు. ముజరబానికి అంతర్జాతీయ అనుభవమైతే ఉండొచ్చు కానీ ఐపీఎల్‌ అనుభవమైతే లేదన్నాడు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మాయాజాలం కూడా పనిచేయలేదని, దీనివల్లే ముంబై జోరుకు ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయామన్నాడు. చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు వైభవ్‌ సూర్యవంశీని పంపండి: మైకేల్‌ వాన్‌

Leander Paes Joins BJP Under Kiran Rijuju Ahead Bengal Assembly Elections5
బెంగాల్‌లో అనూహ్య పరిణామం.. బీజేపీలోకి టెన్నిస్‌ దిగ్గజం

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పేస్‌ పాపులారిటీ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. 1973 జూన్ 17న కోల్‌కతాలో లియాండర్‌ పేస్‌ జన్మించారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో బ్రెజిల్‌కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడిగా పేస్‌ నిలిచారు.ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో సింగిల్స్‌ కంటే డబుల్స్‌పై దృష్టి సారించిన పేస్‌ పురుషుల గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో డబుల్స్‌లో ఎనిమిది సార్లు, పది సార్లు మిక్స్‌డ్ డబుల్స్ లో టైటిల్స్ సాధించాడు. దేశానికి చేసిన సేవలకుగాను 1990లో అర్జున, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014 జనవరిలో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. బెంగాల్‌ రాజకీయాల్లో కీలకమైన యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పేస్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించడాన్ని బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఇది కీలక పరిణామం. #WATCH | Delhi: Former ace Tennis star Leander Paes joins the BJP, in the presence of Union Ministers Kiren Rijiju and Sukanta Majumdar. pic.twitter.com/qIDW1OovWz— ANI (@ANI) March 31, 2026

BCCI Told To Pick Vaibhav Sooryavanshi For Team India England Tour6
IND vs ENG: ఇంగ్లండ్‌ టూర్‌కు వైభవ్‌ సూర్యవంశీ!

భారత యువ సంచలనం, రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ దుమ్మురేపాడు. మెరుపు అర్ధ శతకం బాది శెభాష్‌ అనిపించుకున్నాడు.ప్రశంసల వర్షంగువాహటి వేదికగా కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక వైభవ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా రాజస్తాన్‌ చెన్నైపై అలవోక విజయం సాధించింది. 128 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అయితే ఓ అడుగు ముందుకేసి.. వైభవ్‌ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెచ్చాడు. క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ..నేనే గనుక సెలక్టర్‌ అయి ఉంటే‘‘అతడు ఎప్పుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడు? అని నేనెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇది కాస్త తొందరపాటే అని అనిపించవచ్చు. ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో అతడికి ఇదే తొలి ఇన్నింగ్స్‌. ఏదేమైనా కొన్ని నెలల తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.ఒకవేళ నేనే గనుక సెలక్టర్‌ అయి ఉంటే వైభవ్‌ను ఈ టూర్‌కు కచ్చితంగా ఎంపిక చేస్తా. ప్రస్తుతానికి అతడికి జట్టులో చేరాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ జట్టుకు అతడి అవసరం ఉంటుందేమో!.. పదిహేనేళ్ల పిల్లాడిని టూర్‌కు అనుమతిస్తారా? అంటే నేనేమీ చెప్పలేను.కానీ అతడు ఇప్పటికే ఆటగాడిగా పరిణతి సాధించాడు. టీమిండియా తరఫున కూడా కచ్చితంగా సత్తా చాటగలడు’’ అని మైకేల్‌ వాన్‌ పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా వైభవ్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు.చదవండి: Ravindra Jadeja: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!

IPL 2026 KKR Should Be Eligible For A Refund: Green In The Spotlight7
కేకేఆర్‌ను మోసం చేసిన గ్రీన్‌?.. రీఫండ్‌ చెల్లించాల్సిందే!

భారత క్రికెట్‌ వర్గాల్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గురించి చర్చ నడుస్తోంది. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) అతడి కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది. ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో అతడికి సరైన వారసుడిగా గ్రీన్‌ను భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.అయితే, ఊహించని రీతిలో కేకేఆర్‌కు షాక్‌ తగిలింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌ తొలుత ముంబై ఇండియన్స్‌తో తలపడగా.. ఆ మ్యాచ్‌లో గ్రీన్‌ బౌలింగ్‌ చేయనేలేదు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు.. అందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా బదులిచ్చిన తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.క్రికెట్‌ ఆస్ట్రేలియానే అడగండి‘ఆ విషయం ఏదో క్రికెట్‌ ఆస్ట్రేలియానే (CA) అడగండి’... ముంబైతో మ్యాచ్‌లో కామెరాన్‌ గ్రీన్‌ (Cameron Green) బౌలింగ్‌ చేయకపోవడంపై అడిగిన ప్రశ్నకు అజింక్య రహానే సమాధానమిది. ఒక ఐపీఎల్‌ టీమ్‌ సారథిగా తన జట్టు సభ్యుడి గురించి తనకే తెలీదన్నట్లుగా ఒకింత అసహనంతో రహానే ఈ మాట చెప్పడం వివాదాన్ని రేపింది. 10–12 రోజుల్లో దీనిపై ఆస్ట్రేలియా వెంటనే స్పందించింది. ‘గ్రీన్‌ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతనిపై భారం ఎక్కువ పడకూడదని బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. 10–12 రోజుల్లో అతను బౌలింగ్‌ చేయవచ్చు. ఈ విషయం కేకేఆర్‌ యాజమాన్యానికి కూడా తెలుసు’ అని సీఏ స్పష్టం చేసింది. ఒక ఆల్‌రౌండర్‌ బౌలింగ్‌ చేయలేకపోవడం కోల్‌కతా తుది జట్టులో కూర్పుకు సమస్యగా మారింది. నిజానికి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు, మ్యాచ్‌ ఆరంభానికి కొద్ది సేపు ముందు కూడా గ్రీన్‌ బౌలింగ్‌ చేశాడు. కానీ మ్యాచ్‌లో మాత్రం అతను బంతిని అందుకోలేదు! ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌లో అన్ని మ్యాచ్‌లూ కలిపి గ్రీన్‌ 19 బంతులే వేశాడంటే ఇప్పటికి దీనిపై కోల్‌కతా యాజమాన్యానికి స్పష్టత వచ్చేసి ఉంటుంది. రూ.25.20 కోట్లా!!!.. తెలివైన మోసం?నిజానికి తాజా పరిస్థితికి నైట్‌రైడర్స్‌ స్వయంకృతమే కారణం అనిపిస్తుంది. గ్రీన్‌ తన వైపు నుంచి తెలివిగా వేలంలోకి అడుగు పెట్టాడు. రిజిస్ట్రేషన్‌లో కేవలం ‘బ్యాటర్‌’ జాబితాలోనే తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇలా ఎందుకని అడిగితే తన మేనేజర్‌ పొరపాటు అని, బౌలింగ్‌ కూడా చేస్తానని చెప్పాడు. కానీ అది సాంకేతికంగా ముందు జాగ్రత్త కోసమే ‘ఆల్‌రౌండర్‌’ జాబితాలో పేరు నమోదు చేసుకోలేదు. ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్‌ ఒక పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కోసం చూస్తోంది. ఇలాంటి సమయంలో గ్రీన్‌ పేరు వచ్చింది. వేలం నిబంధనల ప్రకారం మొదటి ‘సెట్‌’లో బ్యాటర్లు వస్తారు. ఆ సమయంలో అన్ని జట్ల వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లిసహజంగానే జట్లు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ‘బ్యాటర్‌’ జాబితాలో వచ్చిన గ్రీన్‌ కోసం కేకేఆర్‌ తీవ్రంగా పోటీ పడింది. అప్పటికే గ్రీన్‌ బౌలింగ్‌ గురించి టీమ్‌కు సమాచారం ఉండే ఉంటుంది. ఎందుకంటే 2025 డిసెంబర్‌లో వేలం జరగ్గా... అంతకుముందు సంవత్సరంపాటు సెప్టెంబరు 24 నుంచి అక్టోబర్‌ 2025 వరకు గాయంతో గ్రీన్‌ బౌలింగ్‌ చేయలేదు. టీ20ల్లో బ్యాటర్‌గా గ్రీన్‌ రికార్డు ఏమీ ఘనంగా లేదు. పైగా కొన్ని బంతుల్లో మ్యాచ్‌ గమనాన్ని మార్చే విధ్వంసకర బ్యాటర్‌ కూడా కాదు. అయినా సరే వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లిన కేకేఆర్‌ కేవలం అతని బ్యాటింగ్‌ కోసం ఏకంగా రూ.25.20 కోట్లు ఖర్చు చేసింది! విఫల సమర్థనఇప్పుడేమో బౌలింగ్‌ చేయడం లేదని వాపోతోంది. నిజానికి గ్రీన్‌ కోసం వెచ్చించిన మొత్తంపై సంతోషమే అంటూ కేకేఆర్‌ సీఈఓ వెంకీ మైసూర్‌ విఫల సమర్థన కొత్త కాదు. 2025 సీజన్‌ కోసం వెంకటేశ్‌ అయ్యర్‌కు రూ. 23.75 కోట్లు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఆ సీజన్‌లో అతను అన్ని మ్యాచ్‌లు కూడా ఆడలేదు. 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఒకే అర్ధసెంచరీతో 142 పరుగులు చేసిన వెంకటేశ్‌ ఒక్క బంతి కూడా బౌల్‌ చేయలేదు! రీఫండ్‌ చెల్లించాల్సిందే!ఇదిలా ఉంటే.. గ్రీన్‌ విషయంలో భారత మాజీ క్రికెటర్‌, కేకేఆర్‌ మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా కోల్‌కతా జట్టుకు అండగా నిలిచాడు. ‘ఒకవేళ మనం ఆల్‌రౌండర్‌గా ఆడే వ్యక్తికి భారీ మొత్తం చెల్లిస్తే.. అతడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటే.. రీఫండ్‌ పొందడం కనీస అర్హత’ అని ట్వీట్‌ చేశాడు. అయితే, అతడి పోస్ట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరేమో గ్రీన్‌ కేకేఆర్‌ను తెలివిగా మోసం చేశాడని అంటుండగా.. మరికొందరు మాత్రం అన్నీ తెలిసే కేకేఆర్‌ ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుందని చివాట్లు పెడుతున్నారు. చదవండి: IPL 2026: నిషేధిత బ్యాట్‌తో దొరికిపోయిన సర్ఫరాజ్‌ ఖాన్‌

Story-CSK Many Reasons Behind Match Lost Vs Rajasthan IPL 20268
చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్ల‌లో ఒక‌టి. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ కొట్టిన సీఎస్‌కే ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్‌తో క‌లిసి సంయుక్తంగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. అయితే ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో సోమవారం రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పేల‌వ ఆట‌తీరుతో చెన్నై సూప‌ర్‌కింగ్స్ దారుణ ఓట‌మిని ఎదుర్కొంది. సౌతాఫ్రికా స్టార్ బ్యాట‌ర్ డెవాల్డ్ బ్రెవిస్ లేక‌పోవ‌డం, అన్నింటికీ మించి ఎంఎస్ ధోని గాయంతో జ‌ట్టుకు దూర‌మ‌వ్వ‌డం సీఎస్‌కేను ఒత్తిడిలోకి నెట్టేసిన‌ట్ల‌యింది. సంజూ శాంస‌న్‌, రుతురాజ్ గైక్వాడ్‌, శివ‌మ్ దూబే వంటి స్టార్ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ అనుభ‌వ‌లేమి స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే ఒక్క మ్యాచ్‌లో ఓట‌మితోనే సీఎస్‌కేను త‌ప్పు బ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కూర్పు గందరగోళం..కానీ మ్యాచ్ ఫ‌లితం క్ష‌ణాల్లో మారిపోయే ఐపీఎల్‌లో ఫ‌స్ట్ హాఫ్ సీజ‌న్‌లో వీలైన‌న్ని ఎక్కువ మ్యాచ్‌లు గెల‌వ‌డమే అన్ని జ‌ట్లు టార్గెట్‌గా పెట్టుకుంటాయి. దీంతో సీజ‌న్ తొలి మ్యాచ్ నుంచే అన్ని జ‌ట్లు గెల‌వాల‌నే సంక‌ల్పంతోనే ఆడుతుంటాయి. వాస్త‌వానికి సీఎస్‌కే జ‌ట్టు కూర్పు కొంత గంద‌ర‌గోళంగానే క‌నిపిస్తుంది. డెవాల్డ్ బ్రెవిస్ గాయంతో మ్యాచ్‌కు దూర‌మ‌వ్వ‌డంతో స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కాకుండా ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దింపితే వేరుగా ఉండేది. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో స‌ర్ఫ‌రాజ్ ముంబై త‌ర‌ఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఒకవేళ సీఎస్‌కే స‌ర్ఫ‌రాజ్ సేవ‌ల్ని ఉప‌యోగించుకోవాల‌నుకుంటే బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ప్ర‌మోష‌న్ ఇచ్చి ఓపెనింగ్ లేదా మూడో స్థానంలో ఆడిస్తే బాగుండేది.మిడిలార్డర్‌ ఫెయిల్‌సాధార‌ణంగా మ్యాచ్‌లో టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్పుడు మిడిలార్డ‌ర్ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే బాధ్య‌తను తీసుకోవాల్సి ఉంటుంది.కానీ కెప్టెన్ రుతురాజ్ 11 బంతుల్లో ఆరు ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డం, అండ‌ర్‌-19 టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే డ‌కౌట్ కావడం, మాథ్య షార్ట్ కూడా 2 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేర‌డం సీఎస్‌కేను మ‌రింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. జట్టులో రుతురాజ్‌, సంజూ శాంస‌న్‌, దూబే మిన‌హా మిగ‌తావారంతా జూనియ‌ర్లే. దూబే విఫలం..ఈ నేప‌థ్యంలో బాధ్య‌త‌గా ఆడాల్సిన సీనియ‌ర్లు నిర్లక్ష్య ఆట‌తీరుతో వికెట్లు పారేసుకోవ‌డం కూడా సీఎస్‌కే కొంప‌ముంచింది. ఇటీవ‌లే ముగిసిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శివ‌మ్ దూబే ఫినిష‌ర్‌గా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సీన్‌ను ఇప్పుడు ఐపీఎల్‌లో సీఎస్‌కే త‌ర‌ఫున పున‌రావృతం చేస్తాడ‌ని భావించిన అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. వ‌చ్చీ రాగానే సిక్స్ కొట్టి దూకుడు ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ.. అప్పుడున్న ప‌రిస్థితుల్లో సిక్స‌ర్లు బాద‌డం కంటే ఇన్నింగ్స్ నిర్మించ‌డంపై దూబే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే దూబే త‌ర్వాత బ్యాట‌ర్లు పెద్ద‌గా లేరు. అయితే సీఎస్‌కే త‌ర‌ఫున టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన జేమీ ఓవ‌ర్ట‌న్‌కు దూబే నుంచి స‌హ‌కారం అంది ఉంటే ప‌రిస్థితి వేరుగా ఉండేది. దూబే బాధ్య‌తాయుతంగా బ్యాటింగ్ చేసి ఉంటే క‌నీసం 170 ప‌రుగులైనా చేసి ఉండేది. ధోని గైర్హాజ‌రీలో దూబే నిల‌బ‌డి సాధికారికంగా బ్యాటింగ్ చేసి ఉంటే అత‌డి విలువ అమాంతం పెరిగిపోయేది. ఇక సీఎస్‌కే లో స్కోరింగ్ మ్యాచ్‌ల‌ను కూడా కాపాడుకున్న సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. కనిపించిన ధోని లోటు!అయితే అప్పుడు ధోని మాస్ట‌ర్ మైండ్‌లా వ్య‌వ‌హ‌రించి వ్యూహాలు ప‌న్ని ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను చిత్తు చేయ‌డంలో స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసేవాడు.కానీ ఇప్పుడు ధోని దూరం కావ‌డంతో ఆ ప్ర‌భావం క‌నిపించింది. ధోని ఉన్న‌ప్పుడు కూడా సీఎస్‌కే మ్యాచ్‌లు ఓడిపోలేదా అని అభిమానులు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది నిజ‌మే కావొచ్చు.కానీ ధోని కేవ‌ల సీఎస్‌కే ఆట‌గాడు మాత్రమే కాదు. రెండు మూడు సీజ‌న్లుగా చివర్లోనే బ్యాటింగ్‌ వస్తున్నాడు. కాని అత‌డిచ్చి స‌ల‌హాలు సీఎస్‌కే కెప్టెన్లు త‌ప్పకుండా పాటించి ఫ‌లితాలు సాధించేది. కానీ ఈసారి ధోని లేక‌పోవ‌డం జ‌ట్టును దెబ్బ‌తీసింద‌ని చెప్పొచ్చు. చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఫీల్డింగ్ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉంటుంది. కానీ నిన్న‌టి రాజ‌స్తాన్ మ్యాచ్‌లో ఆట‌గాళ్ల‌లో నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. ప్ర‌మాద‌క‌ర సూర్య‌వంశీ క్యాచ్‌ను కార్తిక్ శ‌ర్మ విడిచి పెట్ట‌డం, ఆ త‌ర్వాత బౌండ‌రీ వెళ్ల‌కుండా బంతిని క‌నీసం ఆపే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌ర్ణుడి చావుకు స‌వా ల‌క్ష కార‌ణాలు అన్న‌ట్లు రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే ఓట‌మికి కూడా కార‌ణాలు చాలానే ఉన్నాయి. అయితే ఇది సీజ‌న్‌లో తొలి మ్యాచ్ మాత్ర‌మే కావ‌డంతో రాబోయే మ్యాచ్‌ల్లో త‌ప్పుల‌ను స‌రిదిద్దుకొని ఆడాల్సిన అవ‌స‌రం సీఎస్కేకు ఉంది. ఇక డెవాల్డ్ బ్రెవిస్‌, ధోని ఎప్పుడు ఆడ‌తార‌న్న దానిపై స్ప‌ష్ట‌త లేదు. కాబట్టి వీరిద్ద‌రు జ‌ట్టులోకి వ‌చ్చేలోపూ తొలి హాఫ్‌లో క‌నీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే టాప్‌-4లో నిలిచేందుకు అవ‌కాశాలు మెరుగ్గా ఉంటాయ‌ని చెప్పొచ్చు.చదవండి: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!

Ravindra Jadeja Says Pink Looking Good After Match Won Vs CSK9
రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ఐపీఎల్‌లో 17 ఏళ్ల త‌ర్వాత త‌న సొంత గూటికి చేరాడు. త‌న‌ను వెలుగులోకి తీసుకొచ్చిన‌ రాజస్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సోమ‌వారం సీఎస్‌కేతో జ‌రిగిన సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లోనే జ‌డేజా అదుర్స్ అనిపించాడు. ఇన్నాళ్లు తాను ఆడిన జట్లే త‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా మారిన వేళ బంతితో మెరిశాడు. మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసిన జ‌డేజా 4 ఓవ‌ర్ల‌లో 18 ప‌రుగులిచ్చి 2 వికెట్లు ప‌డగొట్టాడు. రాజ‌స్తాన్ మ్యాచ్ గెల‌వ‌డంలో త‌న వంతు పాత్ర‌ను స‌మ‌ర్థంగా పోషించాడు. ‘నాకు పింక్ జెర్సీ బాగుంటుందనిపిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్‌కే జట్టుతో ఎన్నో ఏళ్ల అనుబంధముంది. ఆ జట్టులో ఏ ఆటగాడు ఎలా ఆడుతాడనే దానిపై స్పష్టత ఉంది. ముఖ్యంగా సీఎస్‌కే ఆల్‌రౌండర్శి శివమ్ దూబేకు నెట్స్‌లో చాలాసార్లు బౌలింగ్ చేశాను. కాబట్టి అతడు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటా డనేది నాకు తెలుసు. అందుకే సీఎస్‌కేకు బౌలింగ్ చేయడంలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఆఫ్ స్టంప్ ఆవల బంతులు వేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. అలా అయితే దూబే భారీ షాట్లు ఆడతాడని నాకు తెలుసు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందన్న మాట నిజమే,. పిచ్ కాస్త పచ్చికగా ఉండడం, బంతి టర్న్ అవుతుండడంతో బౌలింగ్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. మొత్తంగా 17 ఏళ్ల తర్వాత నన్ను తొలిసారి వెలుగులోకి తీసుకొచ్చిన జట్టుతో (రాజస్తాన్ రాయల్స్‌) కలవడం సంతోషంగా అనిపిస్తోంది. 128 పరుగుల టార్గెట్ తక్కువే కదా అని నిర్లక్ష్యం చేసి ఉంటే మొదటికే మోసం వచ్చేది. కానీ మా బ్యాటర్లు జైస్వాల్‌, సూర్యవంశీలు దూకుడైన బ్యాటింగ్‌తో పని సులువు చేశారు. లోస్కోరింగ్‌, హై స్కోరింగ్ ఏదైనా సరే మనం వంద శాతం కష్టపడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.’ అని చెప్పుకొచ్చాడు. అయితే జడేజా కామెంట్స్‌పై అభిమానులు ఫన్నీ కామెంట్లు పెట్టారు. ‘జడేజా ఒక ఊసరవెల్లి.. జెర్సీ మారిందో లేదో వెంటనే మాట మార్చాడు’ అని పేర్కొన్నారు.ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన రవీంద్ర జడేజా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ సీజన్‌లో రాజస్తాన్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాతి సీజన్‌లోనూ ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు. 2010లో ఐపీఎల్‌కు దూరంగా ఉన్న జడేజాను 2011 సీజన్‌కు కొచ్చి టస్కర్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ జట్టుపై నిషేధం పడడంతో జడేజా కోసం 2012 వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌, చెన్నై పోటీ పడ్డాయి. చివరికి చెన్నై సూపర్‌కింగ్స్ అప్పట్లోనే రూ. 9.8 కోట్లకు జడేజాను దక్కించుకుంది. మధ్యలో చెన్నైపై రెండేళ్ల నిషేదం పడడంతో గుజరాత్ లయన్స్‌కు ఆడిన జడేజా ఆ తర్వాత 2025 సీజన్ వరకు మళ్లీ చెన్నై జట్టుతోనే కొనసాగాడు. తాజాగా 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్‌లో శాంసన్‌ను దక్కించుకున్న సీఎస్‌కే జడేజాను రాజస్తాన్‌కు బదలాయింపు చేసింది. ధోని కెప్టెన్సీలో 2018, 2021, 2023లో టైటిల్ గెలిచిన సీఎస్‌కే జ‌ట్టులో జ‌డేజా స‌భ్యుడిగా ఉన్నాడు.జ‌డ్డూ ఎమెష‌న‌ల్‌2012 నుంచి 2025 వ‌ర‌కు సీఎస్‌కే జ‌ట్టులో కొన‌సాగిన ర‌వీంద్ర జ‌డేజా సోమ‌వారం మ్యాచ్‌లో భాగంగా సీఎస్‌కే ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఎమెష‌న‌ల్ అయిన‌ట్లు తెలుస్తోంది. 9వ ఓవ‌ర్లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద నిల‌బ‌డిన జ‌డేజాను చూస్తూ అభిమానులు సీఎస్‌కే.. సీఎస్‌కే అంటూ అర‌వ‌డం క‌నిపించింది. ఇదే స‌మ‌యంలో కెమెరాలు జ‌డేజా వైపు తిప్ప‌గా, జ‌డ్డూ ఉబికి వ‌స్తున్న దుఃఖాన్ని ఆపుకున్న‌ట్లుగా క‌నిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు జ‌డేజా సీఎస్‌కే వ‌దిలి వెళ్లిన‌ప్ప‌టికీ త‌మ మ‌నసులో మాత్రం ఎప్ప‌టికీ ఉంటాడు* అని కామెంట్లు పెట్టారు. ఓవరాల్‌గా జడేజా ఐపీఎల్‌లో 255 మ్యాచ్‌లాడి 3,260 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 172 వికెట్లు పడగొట్టాడు.Jadeja was seen emotional when crowd starts to chant CSK...CSK pic.twitter.com/oPRvmU2wAm— rocket.jadeja (@sherjedeja) March 30, 2026చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’

Para Athlete Sheetal Devi Wins World Archery Para Archer of the Year10
ప్రతిభకు పురస్కారం

లుసానే: భారత మహిళా పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి ప్రతిభకు ప్రపంచ పురస్కారం దక్కింది. భుజాల నుంచే రెండు చేతులు లేని ఈ కశీ్మరి ఆర్చర్‌ అంతర్జాతీయ పారా క్రీడల్లో సత్తాచాటుతోంది. దీంతో 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆర్చరీ ప్రకటించిన ‘పారా ఆర్చర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు శీతల్‌ దేవికి దక్కింది. గతేడాది గ్వాంగ్జూ (దక్షిణ కొరియా)లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆమె అసాధారణ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. ఇందులో బరిలోకి దిగిన ఆమె అసలు చేతులే లేని ఏకైక మహిళా ఆర్చర్‌... వ్యక్తిగత కాంపౌండ్‌ ఈవెంట్‌లో చేతులుండి వైకల్యమున్న ప్రపంచ స్థాయి పారా ఆర్చర్లను ఢీకొట్టి మరీ విజేతగా నిలిచింది. తన కాలి వేళ్లు, భుజం సాయంతో విల్లును లక్ష్య బిందువుపై ఎక్కుపెట్టే ప్రతిభ చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒకసారి ఆమె పోటీ మొదలైతే ప్రేక్షకులెవరూ కనులు తిప్పుకోనివ్వని నైపుణ్యం ఆమె సొంతం. ఈ నైపుణ్యంతోనే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల్ని సాధిస్తున్న శీతల్‌కు వార్షిక అవార్డుల రేసులో ప్రపంచ ఆర్చరీ పట్టం కట్టింది. ‘పారా ఆర్చర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఎంపిక చేసింది. కొరియాలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఆమె కేవలం ఒక స్వర్ణంతోనే సరిపెట్టుకోలేదు... మహిళల టీమ్‌ ఈవెంట్‌లో రజతం, మిక్స్‌డ్‌ టీమ్‌లో కాంస్యం సాధించింది. ప్రపంచ ఆర్చరీ అవార్డులకు నామినేట్‌ కావడం ఇప్పుడు పురస్కారానికి ఎంపికవడం చాలా సంతోషాన్నిచి్చందని, వ్యక్తిగతంగా ఈ అవార్డు తన గుండెను తాకిందని శీతల్‌ దేవి భావోద్వేగంతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లోనూ ఈ కశ్మీరీ ఆర్చర్‌ సత్తా చాటుకుంది. ఆమె మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గింది. 2022 పారా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్‌లో రజతం, 2023 ఆసియా చాంపియన్‌íÙప్‌లో రజతం గెలుచుకుంది. ప్రపంచ ఆర్చరీలో ఈ తరహా అవార్డుల్ని 2011లో ప్రారంభించారు. అసాధారణ నైపుణ్యం కనబరిచిన ఆర్చర్లు, పారా ఆర్చర్ల ఘనతను గుర్తించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం. చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’

Advertisement
Advertisement
 
Advertisement