Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND vs USA: Team India wins against USA in ICC T20 World Cup 20261
IND vs USA: యూఎస్‌ఏపై టీమిండియా విజయం

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో యూఎస్‌ఏ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమతమైంది. దీంతో 29 పరుగుల తేడాతో యూఎస్‌ఏ జట్టు ఓటమి చవిచూసింది. అమెరికా జట్టులో సంజయ్‌ కృష్ణమూర్తి, శుభం రంజనే చెరో 37 పరుగులు చేయగా, మిలింద్‌ కుమార్‌ 34 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌ మూడు వికెట్లు తీయగా, అర్షదీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. వరుణ్‌ చక్రవర్తికి ఒక వికెట్టు దక్కింది.గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏతో భారత్‌ తలపడింది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్‌విక్‌ నాలుగు వికెట్లతో రాణించాడు. హర్మీత్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్ చెరో వికెట్టు తీశారు.

T20 WC 2026: Pakistan Letter to ICC on India boycott Get Strong response2
IND vs PAK: అదెలా?.. పాకిస్తాన్‌కు ఐసీసీ ప్రశ్న

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడి.. కేవలం భారత్‌తో మాత్రమే ఆడకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. మిగతా మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు ఈ మ్యాచ్‌కే ఎందుకనే విమర్శలూ వస్తున్నాయి.బంగ్లాదేశ్‌కు మద్దతుగాఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) సైతం పీసీబీకి ఇదే ప్రశ్నను సంధించింది. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ మ్యాచ్‌ల కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిస్కరిస్తామంటూ పాక్‌ కొత్త రాగం ఎత్తుకుంది.కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా తాము కూడా లంకలోనే ఆడతామని బంగ్లా కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భద్రత పరంగా భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తమ బృందం తేల్చినందున పునరాలోచించుకోవాలని సమాధానం ఇచ్చింది.ఒకవేళ రద్దయితేకానీ బంగ్లాదేశ్‌ మొండి వైఖరి ప్రదర్శించడంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ.. పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తామని ప్రకటించింది. పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ఈ ప్రకటన చేశాడు.కాగా శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 15న భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. భారీ క్రేజ్‌ ఉన్న ఈ మ్యాచ్‌ ఒకవేళ రద్దయితే పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇతర బోర్డులు సైతం పాక్‌ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.తెలివి ప్రదర్శించిన పీసీబీఅయితే, తమపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పాక్‌ తెలివిగా.. ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ (Force Majeure Clause)ను తెరపైకి తెచ్చింది. అనూహ్య, నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఈ నిబంధన ద్వారా లభిస్తుంది.సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన వాదనను సమర్థించుకునే అవకాశం ఉంటుంది. తమ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించనందున ఈ నిబంధన తమకు వర్తింపజేయాలని పీసీబీ ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.గట్టిగానే బదులిచ్చిన ఐసీసీఅయితే, ఇందుకు ఐసీసీ గట్టిగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ప్రభుత్వ అనుమతితో టోర్నీలో కొనసాగుతున్నారు.. కానీ.. ప్రభుత్వ ఆంక్షల ప్రకారం ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తారా? ఇదెలా సాధ్యం? దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలి’’ అని పీసీబీని ఆదేశించినట్లు వార్త సంస్థ PTI వెల్లడించింది. కాగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా తొలుత టోర్నీనే బహిష్కరిస్తామన్న పాక్‌.. ఆ తర్వాత మాట మార్చి భారత్‌తో మాత్రమే ఆడమంటూ డ్రామాకు తెరలేపింది.చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్‌ బోర్డు? యూటర్న్‌?

T20 WC 2026 IND vs USA: Suryakumar Yadav 49 Ball 84 Check Ind Score 3
IND vs USA: సూర్యకుమార్‌ విధ్వంసం

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే టీమిండియా బ్యాటర్లు కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. ముంబై వేదికగా అమెరికా బౌలర్లు ఆది నుంచే చెలరేగుతూ భారత బ్యాటింగ్‌ విభాగంపై ఒత్తిడి పెంచారు. రెండో ఓవర్‌ రెండో బంతికే అలీ ఖాన్‌ అభిషేక్‌ శర్మ (0) డకౌట్‌గా వెనక్కి పంపాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి..ఆ తర్వాత వాన్‌ షాల్‌విక్‌ ఆరో ఓవర్లో రెండో బంతికి ఇషాన్‌ కిషన్‌ (20), ఐదో బంతికి తిలక్‌ వర్మ (25), ఆఖరి బంతికి శివం దూబే (0)ను అవుట్‌ చేసి.. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ఫలితంగా పవర్‌ ప్లేలో కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌మిగిలిన వారిలో రింకూ సింగ్‌ (6), హార్దిక్‌ పాండ్యా (5) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ కాసేపు అలరించి (11 బంతుల్లో 14) పెవిలియన్‌ చేరాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.A fine innings from the man in top form! 👏@surya_14kumar brings up his 25th T20I fifty, just when the team needed it the most! 💙PS. India win 88% of matches when captain SKY scores 50+ ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/GQYypRHKDJ— Star Sports (@StarSportsIndia) February 7, 2026మెరుపు అర్ధ శతకంధనాధన్‌ దంచికొట్టిన సూర్య 36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సూర్య మెరుపు అర్ధ శతకం కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.అమెరికా బౌలర్లలో వాన్‌ షాల్‌విక్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హర్మీత్‌ సింగ్‌ రెండు, అలీ ఖాన్‌, మొహమ్మద్‌ మొహ్సిన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా గ్రూప్‌-‘ఎ’లోచదవండి: అప్పటిదాకా బిగ్‌ క్రికెటర్‌ అని ఒప్పుకోను: వైభవ్‌ సూర్యవంశీ తండ్రి

T20 WC 2026 IND vs USA: Abhishek Sharma Golden Duck Fans React4
గంభీర్‌ బాటలో అభిషేక్‌ శర్మ.. ఇలా చేశావేంటి బ్రో?

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఈ పంజాబీ బ్యాటర్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఓ చెత్త రికార్డును అభిషేక్‌ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత టీ20 జట్టు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్‌ శర్మ ధనాధన్‌ బ్యాటింగ్‌తో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.గత కొన్నాళ్లుగా మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్‌.. కెరీర్‌లో తొలి ప్రపంచకప్‌ టోర్నీకి సిద్ధమయ్యాడు. ముంబైలోని వాంఖడే వేదికగా వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో అమెరికాతో తలపడునుండటంతో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అదరగొడతాడని అంతా భావించారు.అయితే, ఊహించని రీతిలో అభిషేక్‌ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. అమెరికా పేసర్‌ అలీ ఖాన్‌ బౌలింగ్‌లో సంజయ్‌ కృష్ణమూర్తికి క్యాచ్‌ ఇచ్చిన ఈ లెఫ్టాండర్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సైతం ఇలాగే అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు.ఇక అభిషేక్‌ శర్మ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుట్‌కావడంతో.. “గంభీర్‌ బాటలో నడిచిన అభిషేక్‌ శర్మ.. నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాం.. ఇలా చేశావేంటి బ్రో’’ అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండగా.. పవర్‌ ప్లేలోనే 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా.టీ20 వరల్డ్‌కప్‌ అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌ అయిన భారత ఆటగాళ్లు వీరే👉గౌతం గంభీర్‌👉ఆశిష్‌ నెహ్రా (గోల్డెన్‌ డక్‌)👉శార్దూల్‌ ఠాకూర్‌👉దీపక్‌ హుడా👉అభిషేక్‌ శర్మ (గోల్డెన్‌ డక్‌).

T20 WC 2026: Hetmyer Shines Shepherd Hattrick West Indies Beat Scotland5
T20 WC: చెలరేగిన షెఫర్డ్‌.. విండీస్‌ బోణీ

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ బోణీ కొట్టింది. పసికూన స్కాట్లాండ్‌ను చిత్తు చేసి శుభారంభం అందుకుంది. కోల్‌కతా వేదికగా గ్రూప్‌-‘సి’ నుంచి విండీస్‌- స్కాటిష్‌ జట్లు శనివారం తలపడ్డాయి.ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో బ్రాండన్‌ కింగ్‌ (35) రాణించగా.. కెప్టెన్‌ షాయీ హోప్‌ (19) ఫర్వాలేదనిపించాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.మొత్తంగా 36 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో హెట్‌మెయిర్‌ 64 పరుగులు సాధించాడు. రోవ్‌మన్‌ పావెల్‌ (14 బంతుల్లో 24), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (13 బంతుల్లో 26) ధనాధన్‌ దంచికొట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి విండీస్‌ 182 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ క్యూరీ రెండు వికెట్లు తీయగా.. సఫ్యాన్‌ షరీఫ్‌, ఒలీవర్‌ డేవిడ్‌సన్‌, మైకేల్‌ లీస్క్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్‌ ఆది నుంచే తడబడింది. టాపార్డర్‌లో జార్జ్‌ మూన్సే (19), బ్రాండన్‌ మెక్‌ముల్లన్‌ (14) నిరాశపరచగా.. మైకేల్‌ జోన్స్‌ (1) విఫలమయ్యాడు.ఇలాంటి తరుణంలో రిచీ బెరింగ్‌టన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (24 బంతుల్లో 42)తో అలరించగా.. టామ్‌ బ్రూస్‌ (28 బంతుల్లో 35) అతడికి తోడుగా నిలిచాడు. అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం అందలేదు. మాథ్యూ క్రాస్‌ (11), మార్క్‌ వాట్‌ (15) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. 18.5 ఓవర్లలోనే స్కాట్లాండ్‌ ఆలౌట్‌ అయింది. 147 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ మూడు వికెట్లు తీయగా.. షెఫర్డ్‌ హ్యాట్రిక్‌తో కలిపి ఐదు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. షమర్‌ జోసెఫ్‌, గుడకేశ్‌ మోటీ తలా ఒక వికెట్‌ తీసి తమ వంతు సాయం అందించారు.

T20 WC 2026 IND vs USA Toss Playing XIs Updates Highlights6
IND vs USA: టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తొలుత యూఎస్‌ఏతో భారత్‌ తలపడుతోంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమెరికా లక్ష్య ఛేదనకు దిగింది.T20 World Cup 2026 India vs United States of America Updatesటీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపుముంబై వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా.. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ 84 పరుగులతో చేశాడు. ఛేదనలో అమెరికా జట్టు.. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే తలో 37 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పాటు అందించారు.19 ఓవర్లకు స్కోరు 121-719 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 121-7 స్కోరుతో నిలిచింది. క్రీజులో శుభం 27, స్కాల్క్ 2 ఉన్నారు.18 ఓవర్లకు స్కోరు 111-718 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 111-7 స్కోరుతో ఉంది. క్రీజులో శుభం 18, స్కాల్క్ 1 ఉన్నారు.ఏడో వికెట్ కోల్పోయిన అమెరికాఅమెరికా ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ మోసిన్ 8 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 104-617 ఓవర్లు పూర్తయ్యేసరికి అమెరికా.. 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. శుభం 17, మోసిన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.16 ఓవర్లకు స్కోరు 100-6 16 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. శుభం 15, మోసిన్ 1 క్రీజులో ఉన్నారుఆరో వికెట్ కోల్పోయిన అమెరికా15.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హర్మీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. సిరాజ్ క్యాచ్ పట్టాడు.ఐదో వికెట్ కోల్పోయిన యూఎస్ఏ15.2: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సంజయ్ 37 పరుగుల దగ్గర క్యాచ్ ఔట్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన అమెరికా15 ఓవర్లకు స్కోరు 98-4సంజయ్ 37, శుభం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు13 ఓవర్లలో అమెరికా స్కోరు: 78-4సంజయ్‌ 26, శుభం 5 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్‌ డౌన్‌11.6: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌ (34) స్టంపౌట్‌. నాలుగో వికెట్‌ కోల్పోయిన అమెరికా. స్కోరు: 71-4. విజయానికి 48 బంతులో​ 91 పరుగులు కావాలి.పది ఓవర్లలో అమెరికా స్కోరు: 49-3పవర్‌ ప్లేలో అమెరికా స్కోరు: 31-3(6).మిలింద్‌ 16, సంజయ్‌ 4 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్‌ కోల్పోయిన అమెరికా3.2: సిరాజ్‌ బౌలింగ్‌లో సాయితేజ ముక్కామల (2) వరుణ్‌ చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చాడు. మిలింద్‌ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 13-3(3.2)రెండో వికెట్‌ కోల్పోయిన అమెరికా2.1: అర్ష్‌దీప్‌ బౌలింగ్లో అమెరికా కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ (0) శివం దూబేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 11-2(2.1). సాయితేజ ముక్కామల రెండు పరుగులతో ఉండగా.. మిలింద్ కుమార్‌ క్రీజులోకి వచ్చాడు.వికెట్‌ తీసిన సిరాజ్‌1.4: అనూహ్యంగా వరల్డ్‌కప్‌ జట్టులోకి.. తుదిజట్టులోకి వచ్చిన సిరాజ్‌ టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు. తొలి ఓవర్‌ నాలుగో బంతికే వికెట్‌ పడగొట్టాడు. సిరాజ్‌ బౌలింగ్లో తిలక్‌కు క్యాచ్‌ ఇచ్చి అమెరికా ఓపెనర్‌ ఆండ్రీ గౌస్‌ (6) వెనుదిరిగాడు.టీమిండియా స్కోరు: 161-9(20)తొమ్మిదో వికెట్‌ డౌన్‌19.6: వరుణ్‌ చక్రవర్తి (0) రనౌట్‌.. తొమ్మిదో వికెట్‌ డౌన్‌అర్ష్‌దీప్‌ అవుట్‌18.6: షాల్‌విక్‌ బౌలింగ్‌లో... ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన అర్ష్‌దీప్‌ సింగ్‌ (4) సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్‌ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌16.4: హర్మీత్‌ బౌలింగ్‌లో మొహ్సిన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన అక్షర్‌ పటేల్‌ (14). క్రీజులోకి అర్ష్‌దీప్‌ సింగ్‌. సూర్య 47 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 118-7(16.4)అక్షర్‌, సూర్య ధనాధన్‌15: నేత్రావల్కర్‌ బౌలింగ్లో అక్షర్‌ 4,4 బాదగా.. సూర్య 4, 6 బాదాడు. ఒకే ఓవరల్లో 21 పరుగులు. స్కోరు: 115-6 (16).ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌12.4: హర్మీత్‌ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన హార్దిక్‌ పాండ్యా (5). క్రీజులోకి అక్షర్‌ పటేల్‌. స్కోరు: 85-6(13.5).ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌11.4: మొహ్సిన్‌ బౌలింగ్‌లో మిలింద్‌కు క్యాచ్‌ ఇచ్చి రింకూ సింగ్‌ అవుట్‌ (6). సూర్య 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 72-5(11.4) పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 63-4 శివం దూబే డకౌట్‌5.6: వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌లో నేత్రావల్కర్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయిన శివం దూబే. పవర్‌ప్లేలో టీమిండియా స్కోరు: 46-4(6)తిలక్‌ వర్మ అవుట్‌5.5: మూడో వికెట్‌గా వెనుదిరిగిన తిలక్‌ వర్మ (16 బంతుల్లో 25; మూడు ఫోర్లు, ఒక సిక్స్‌). వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌ మోనాంక్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన తిలక్‌. శివం దూబే క్రీజులోకి రాగా.. సూర్య 1 పరుగుతో ఉన్నాడు. స్కోరు: 46-3(5.5)రెండో వికెట్‌ డౌన్‌5.2: వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన ఇషాన్‌ కిషన్‌ (16 బంతుల్లో 20; 1 ఫోర్‌, రెండు సిక్స్‌లు). క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌. తిలక్‌ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45-2(5.2).నాలుగు ఓవర్లలో టీమిండియా స్కోరు: 33-1తిలక్‌ 13 బంతుల్లో 23, ఇషాన్‌ 10 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌1.2: అలీ ఖాన్‌ బౌలింగ్‌లో సంజయ్‌ కృష్ణమూర్తికి క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్‌ శర్మ. ISHAN-DAAR SHURUAAT! 🔥He gets the scoreboard ticking with a maximum, and the crowd erupts at the Wankhede 😍ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/zmtTfy2q4Q— Star Sports (@StarSportsIndia) February 7, 2026తొలి ఓవర్లో ఏడు పరుగులుకట్టుదిట్టంగా నేత్రావల్కర్‌ బౌలింగ్‌... ఇషాన్‌ 7, అభిషేక్‌ 0 పరుగులతో ఉన్నారు. సంజూపై వేటుఇక ఊహించినట్లుగానే తుదిజట్టులో ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కగా.. సంజూ శాంసన్‌ (Sanju Samson)పై వేటు పడింది. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్‌ (Ishan Kishan) భర్తీ చేశాడు. కాగా గత కొంతకాలంగా సంజూ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే.సిరాజ్‌కు లక్కీ ఛాన్స్‌అదే విధంగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. ఇక పేస్‌ దళ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి స్థానంలో మొహమ్మద్‌ సిరాజ్‌ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.కాగా హర్షిత్‌ రాణా గాయపడటంతో సిరాజ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రాణా స్థానంలో ఈ హైదరాబాదీ పేసర్‌ను తీసుకున్నట్లు శుక్రవారం బీసీసీఐ ప్రకటించగా.. బుమ్రా అనారోగ్యం వల్ల ఏకంగా తుదిజట్టులోనూ సిరాజ్‌కు స్థానం దక్కడం విశేషం.మరోవైపు.. యూఎస్‌ఏ కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ మాట్లాడుతూ.. పిచ్‌ బాగుందని.. ఇక్కడ భారీ స్కోరు నమోదుకు ఆస్కారం ఉందని పేర్కొన్నాడు. తమ తుదిజట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు బౌలర్లు ఉన్నట్లు తెలిపాడు.టీ20 ప్రపంచకప్‌-2026: భారత్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ తుదిజట్లుభారత్‌ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్‌ సిరాజ్, వరుణ్ చక్రవర్తియూఎస్‌ఏఆండ్రీస్ గౌస్(వికెట్‌ కీపర్‌), సాయితేజ ముక్కామల, మోనాంక్ పటేల్(కెప్టెన్‌), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్‌విక్‌, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్

Wont consider him big cricketer until He: Vaibhav Suryavanshi father7
బిగ్‌ క్రికెటర్‌ అని ఒప్పుకోను: వైభవ్‌ సూర్యవంశీ తండ్రి

వైభవ్‌ సూర్యవంశీ.. క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే హాట్‌టాపిక్‌. ఫార్మాట్‌ ఏదైనా ఈ పాలబుగ్గల పిల్లాడికి బంతిని బౌండరీకి తరలించడమే తెలుసు.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పీడకలను మిగల్చడం ఈ యువ బ్యాటర్‌కు అలవాటుగా మారింది..ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ-2026లో వైభవ్‌ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. పద్నాలుగేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. ఈ ఈవెంట్లో ఏడు మ్యాచ్‌లలో కలిపి మూడు అర్ధ శతకాలు.. ఓ సెంచరీ సాధించాడు. ఆ శతకం కూడా ఫైనల్లో.. అదీ ఇంగ్లండ్‌ జట్టుపై ఏకంగా 175 పరుగులు సాధించడం విశేషం.Carnage continues as Vaibhav Sooryavanshi brings up 150 in style! 🔥🤩The English bowlers have no answers as the Boss Baby is going all guns blazing with towering sixes! 🙌🏻😮‍💨ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/Dkh4YCXOEC— Star Sports (@StarSportsIndia) February 6, 2026 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్‌వరల్డ్‌కప్‌ ఫైనల్లో 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్‌.. పలు చిరస్మరణీయ రికార్డులు నెలకొల్పాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ బిహారీ కుర్రాడు.. వరల్డ్‌కప్‌ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలవడంతో పాటు.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు కూడా అందుకున్నాడు.Team India be like: Top karne ki aadat ho gayeli hai apun ko 🏆😎The 6th trophy for Team India in the ICC Men’s #U19WorldCup 🇮🇳Watch the highlights 👉 https://t.co/nXMmxDoivS pic.twitter.com/VDeA2PH3Gh— Star Sports (@StarSportsIndia) February 6, 2026పుత్రోత్సాహంఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా సాగిన అతడి విధ్వంసం గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇక వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పుత్రోత్సాహంతో ఆయన ఉప్పొంగిపోతున్నారు.అప్పటిదాకా బిగ్‌ క్రికెటర్‌ అని ఒప్పుకోనుఈ క్రమంలో సంజీవ్‌ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. తను సాధించాల్సింది ఇంకెంతో ఉంది. వైభవ్‌ టెస్టు మ్యాచ్‌ ఆడేదాకా తననొక స్టార్‌ క్రికెటర్‌గా నేను పరిగణించను’’ అని సంజీవ్‌ సూర్యవంశీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నారు.అదే విధంగా.. ‘‘నువ్వెంత గొప్పగా ఆడితే అంత హుందాగా, ఒద్దికగా ఉండాలని తనకు చెబుతూ ఉంటాను. సీనియర్లు, కోచ్‌లతో చర్చిస్తూ లోపాలు సరిచేసుకోవాలని చెప్తాను. ‘అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో సెంచరీ చేశావు.. భేష్‌.. అయితే, ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం.టెస్టు క్రికెట్‌ ఆడటమే లక్ష్యంటీమిండియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడటమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని తనకు చెప్పాను. సచిన్‌ టెండుల్కర్‌ను చూసి ఓ క్రికెటర్‌ ఎలా ఉండాలో నేర్చుకోవాలని తనకి బోధించాను. టన్నుల కొద్దీ పరుగులు సాధించినా.. ఆయన ఎప్పుడూ ఒక్క వివాదంలోనూ చిక్కుకోలేదు. ‍క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఆయనను ఆరాధిస్తున్న తీరు గురించి తరచూ చెబుతూ ఉంటాను’’ అని సంజీవ్‌ సూర్యవంశీ పేర్కొన్నారు. తద్వారా తన కుమారుడు కెరీర్‌లోనే కాదు వ్యక్తిత్వంలోనూ మిన్నగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పకనే చెప్పారు సంజీవ్‌.చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్‌ బోర్డు? యూటర్న్‌?

T20 WC 2026: England Announce playing XI Vs Nepal Salt Included8
T20 WC: నేపాల్‌తో మ్యాచ్‌.. ఇంగ్లండ్‌ తుదిజట్టు ప్రకటన

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ మొదలైంది. పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో శనివారం ఈ పొట్టి క్రికెట్‌ సంగ్రామానికి తెరలేచింది. తొలిరోజు ఈ మ్యాచ్‌తో పాటు.. వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌.. టీమిండియా- యూఎస్‌ఏ మ్యాచ్‌లకు షెడ్యూల్‌ ఖరారైంది.ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లుఇక గ్రూప్‌-సిలో ఉన్న ఇంగ్లండ్‌ తొలత నేపాల్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం మ్యాచ్‌ జరుగనుండగా.. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్‌ శనివారమే తమ తుదిజట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్‌ సారథ్యంలోని ఈ జట్టులో ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, లియామ్‌ డాసన్‌లకు చోటు దక్కింది.హార్డ్‌ హిట్టర్‌ వచ్చేశాడు!అంతేకాదు.. పూర్తి ఫిట్‌నెస్‌తో హార్డ్‌ హిట్టర్‌ ఫిల్‌ సాల్ట్‌ కూడా తుదిజట్టులోకి వచ్చేశాడు. సాల్ట్‌కు తోడు మాజీ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌తో పాటు కెప్టెన్‌ బ్రూక్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను మరింత పటిష్టం చేశారు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, జేకబ్‌ బెతెల్‌ ఉన్నారు. పేస్‌ దళంలో జోఫ్రా ఆర్చర్‌, ల్యూక్‌ వుడ్‌ పేర్లు ఖరారయ్యాయి. కాగా ఇంగ్లండ్‌- నేపాల్‌ మధ్య ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్‌ ఆరంభం అవుతుంది.టీ20 ప్రపంచకప్‌-2026: నేపాల్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ తుదిజట్టుఫిల్‌ సాల్ట్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), జేకబ్‌ బెతెల్‌, టామ్‌ బాంటన్‌, హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, లియామ్‌ డాసన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, ల్యూక్‌ వుడ్‌.బెంచ్‌: రెహాన్‌ అహ్మద్‌, జోష్‌ టంగ్‌, బెన్‌ డకెట్‌, జేమీ ఓవర్టన్‌.వరల్డ్‌కప్‌ టోర్నీకి నేపాల్‌ జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.చదవండి: T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..

Pak Drops At U Turn Hint India Boycott Stance After Sri Lanka Request: Report9
IND vs PAK: పాకిస్తాన్‌ యూటర్న్‌?

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఓటు వేసి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిర్ణయాన్ని వ్యతిరేకించిన పీసీబీ.. భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామంటూ నాటకానికి తెరతీసింది. ఈ విషయం గురించి పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ప్రకటించడం గమనార్హం.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా ఐసీసీ కుదిర్చిన ఒప్పందం ప్రకారం.. పాక్‌ కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేశారు. పాక్‌ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్‌ ఖరారైంది.భారత్‌- బంగ్లా.. మధ్యలో పాక్‌అయితే, భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్‌లో రక్షణ ఉండదని.. అందుకే తమ వేదికను కూడా లంకకు మార్చాలంటూ బంగ్లా బోర్డు ఐసీసీని కోరింది. బంగ్లా వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్‌ పంతం వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది ఐసీసీ.భారత్‌తో మాత్రమే ఆడమంటూఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని.. లంకలో భారత్‌తో మ్యాచ్‌కు తమకు భద్రత ఉండదంటూ పాక్‌.. టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. లీగ్‌ దశలో మిగతా మ్యాచ్‌లకు లేని ఇబ్బంది భారత్‌తో మాత్రమే ఉందని చెప్పడం పాక్‌ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. అంతేకాదు.. ఒకవేళ భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిజంగానే ఆగిపోతే ఐసీసీతో పాటు సభ్య బోర్డులన్నింటికీ పెద్ద ఎత్తున నష్టం వస్తుంది.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌కు లేఖ రాసింది. గతంలో పాక్‌లో తమ జట్టుపై ఉగ్రదాడి జరిగినా.. తిరిగి ఆ దేశంలో పర్యటించిన తొలి జట్టుగా నిలిచామని గుర్తు చేసింది. ఇటీవల కూడా బాంబుల మోతతో దద్దరిల్లిన వేళ పాక్‌లో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్‌ పూర్తి చేశామని సుతిమెత్తగానే చురకలు అంటించింది.ఉగ్రదాడిని గుర్తుచేస్తూఅలాంటిది.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక.. అకస్మాత్తుగా మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. ఆర్థికంగా భారీ నష్టం వస్తుందని.. ఈ అంశంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇలా పాత విషయాలు ముఖ్యంగా ఉగ్రదాడిని గుర్తుచేస్తూ లంక బోర్డు రాసిన లేఖ పాక్‌ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ బోర్డు చైర్మన్‌, పాక్‌ మంత్రి మొహ్సిన్‌ నక్వీ భారత్‌తో మ్యాచ్‌ ఆడే విషయమై పునరాలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ సన్నిహిత వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ..గతంలో సాయం చేశాము కదా!‘‘శ్రీలంక ప్రభుత్వం, క్రికెట్‌ బోర్డుతో పాకిస్తాన్‌ ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. అందుకు తగిన ఫలాలు పొందింది. కాబట్టి లంక బోర్డు నుంచి వచ్చిన లేఖను పాక్‌ నిర్లక్ష్యం చేయలేదు.లంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా.. మొహ్సిన్‌ నక్వీని నేరుగా సంప్రదించి.. పాక్‌ తమకు సాయపడాల్సిందిగా కోరారు. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ల వల్ల వచ్చే అదనపు ఆదాయానికి గండికొట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాము పాక్‌ బోర్డుకు సహాయపడిన విషయాన్ని గుర్తు చేశారు.నక్వీ ఈ విషయం గురించి తప్పక ప్రధాని దృష్టికి తీసుకువెళ్తారు. శ్రీలంక బోర్డు మాత్రమే కాదు.. శ్రీలంక ప్రభుత్వం కూడా గతేడాది నవంబరులో ఆటగాళ్లు మధ్యలోనే వెళ్లిపోకుండా ఒప్పించి.. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ పూర్తి చేసేలా ఒప్పించారు’’ అని పేర్కొన్నాయి.కఠిన చర్యలు తప్పవుఇదిలా ఉంటే.. పాక్‌ అన్నంత పనిచేస్తే ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీతో పాటు బ్రాడ్‌కాస్టర్లు, ఇతర సభ్య దేశాలు పెద్ద ఎత్తున నష్టపోయే క్రమంలో పీసీబీని ఆ పరిహారం చెల్లించాలని కోరే అవకాశాలు లేకపోలేదు. పరిస్థితి చేయిదాటితే ఇంకాస్త కఠినంగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరి 15న భారత్‌- పాకిస్తాన్‌ మధ్య వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది.చదవండి: పసికూనను ఓడించేందుకు కష్టపడ్డ పాకిస్తాన్‌

T20 WC 2026: Pakistan Beat Netherlands In Last Over Thirller10
T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శనివారం తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ తలపడ్డాయి. గ్రూప్‌-ఎ నుంచి ఇరుజట్ల మధ్య పోటీ జరుగగా.. సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.147 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్లలో మైకేల్‌ లెవిట్‌ (24) ఫర్వాలేదనిపించగా.. బాస్‌డీ లీడే (30), కొలిన్‌ అకెర్‌మాన్‌ (20), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ (37) రాణించారు. పాక్‌ బౌలర్లలో సల్మాన్‌ మీర్జా మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్‌ నవాజ్‌, అబ్రార్‌ అహ్మద్‌, సయీబ్‌ ఆయుబ్‌ రెండేసి వికెట్లు కూల్చారు. మిగిలిన వారిలో షాహిన్‌ ఆఫ్రిది ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.ఓపెనర్ల శుభారంభంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (31 బంతుల్లో 47), సయీబ్‌ ఆయుబ్‌ (13 బంతుల్లో 24) శుభారంభం అందించారు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (12)తో పాటు బాబర్‌ ఆజం (15) తడబడగా.. ఉస్మాన్‌ ఖాన్‌ (0) డకౌట్‌ అయ్యాడు.The pressure is back on Pakistan! 😮‍💨Babar Azam is caught as half of the side is back into the hut!Will Netherlands pull off an upset here? 🤔ICC Men's #T20WorldCup | #PAKvNED | LIVE NOW 👉 https://t.co/GKcXaJHm9F pic.twitter.com/PK1NOGXYju— Star Sports (@StarSportsIndia) February 7, 2026మారిన సీన్‌.. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠషాబాద్‌ ఖాన్‌ (8), నవాజ్‌ (6) చేతులెత్తేయగా.. ఆఖర్లో ఫాహీమ్‌ అష్రఫ్‌ (11 బంతుల్లో 29 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టాడు. అతడి తోడు షాహిన్‌ ఆఫ్రిది (5) అజేయంగా నిలిచాడు. అయితే, ఆఖరి ఓవర్లో మూడో బంతికి ఆష్రఫ్‌ కష్టమ్మీద ఫోర్‌ బాదగా పాక్‌ గెలుపు ఖరారైంది. 19.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన పాక్‌.. మూడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచి ఊపిరి పీల్చుకుంది.కాగా నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఆర్యన్‌ దత్‌.. ఆయుబ్‌, ఆఘా రూపంలో రెండు కీలక వికెట్లు తీయగా.. పాల్‌ వాన్‌ మీకెరెన్‌ సాహిబ్‌జాదా, ఉస్మాన్‌ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. మిగిలిన వారిలో లోగాన్‌ వాన్‌ బీక్‌, కైలీ క్లెయిన్‌, వాన్‌ డెర్‌ మెర్వె తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ విజయంతో పాక్‌ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ అరెస్ట్‌కు డిమాండ్‌!.. మరీ ఆ షాట్లు అలా ఆడితే ఎలా?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement