Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: Sahibzada farhan slams hundred, pakistan set 200 runs target to Namibia1
T20 WC 2026: పసికూనపై పాక్‌ బ్యాటర్ల ప్రతాపం

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. సూపర్‌-8కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ముఖ్యంగా ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (58 బంతుల్లో 100 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఆఖర్లో షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 36 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.​ మధ్యలో కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఓపెనర్‌ సైమ్‌ అయూబ్‌ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు)కు కూడా మంచి ఆరంభమే లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో ఖ్వాజా నఫాయ్‌ (5) తొందరగా ఔటయ్యాడు. మొత్తంగా పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో నమీబియా బౌలర్లు తమ సామర్థ్యానికి మించి రాణించారు. వికెట్లు తీయలేకపోయినా, జోరుమీదున్న పాక్‌ బ్యాటర్లకు కళ్లెం వేశారు. బెర్నాల్డ్‌ స్కోల్జ్‌ 4 ఓవర్లలో 33 పరుగులు, రూబెన్‌ ట్రంపల్మెన్‌ 4 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చి పా​్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. జాక్‌ బ్రస్సెల్‌ (4-0-48-2) పరుగులు కాస్త ఎక్కువగానే సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (3-0-25-1), జేజే స్మిట్‌ (3-0-28-0) పర్వాలేదనిపించారు. మైబుర్గ్‌ (2-0-27-0) ఒక్కడే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో నమీబియా బౌలర్లు కేవలం​ 6 ఎక్స్‌ట్రాలు మాత్రమే ఇవ్వడం విశేషం.

T20 WC 2026: Pakistan Former Coach Levels Serious Allegations Against His Players After India Match2
T20 WC 2026: పాక్‌ మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్‌ 2026 గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న పాక్‌ జట్టుపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ యూసఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ను తొలిసారి ఓడించిన తర్వాత స్టార్లుగా చెప్పుకునే కొందరు పాక్‌ ఆటగాళ్లకు అహంకారం పెరిగిందని ఆయన అన్నాడు. వారి అతి విశ్వాసమే పాక్‌ పతనానికి దారి తీసిందని అభిప్రాయపడ్డాడు. ఒక్క విజయంతోనే కళ్లు నెత్తికెక్కితే పరిస్థితి ఇలానే ఉంటుందంటూ పరోక్షంగా బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిదిని ఉద్దేశిస్తూ చురకలంటించాడు.ప్రస్తుత పాక్‌ జట్టు దుస్థితిపై యూసఫ్‌ స్పందిస్తూ.. 2021లో భారత్‌పై గెలిచిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు మేము ఎవరికీ తగ్గం అనే భావనలో మునిగిపోయారు. కోచ్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌లో గేమ్స్ ఆడటం వంటి నిర్లక్ష్యపు ప్రవర్తన అప్పటి నుంచి మొదలైంది. స్టార్లుగా చెప్పుకునే కొందరి అహంకారం వల్లే పాక్‌ క్రికెట్‌ నష్టపోతుందని అన్నాడు.యూసుఫ్ రాజీనామా వెనుక కారణం ఇదేనేమో..!యూసఫ్‌ 2025లో కేవలం మూడు నెలల పాటు పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఆతర్వాత అనూహ్యంగా ఆ పదవి నుంచి వైదొలిగాడు. అప్పట్లో యూసఫ్‌ తన అనూహ్య రాజీనామాకు గల కారణాలు వెల్లడించలేదు. తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే, జట్టులో స్టార్లుగా చెప్పుకునే కొందరి ప్రవర్తన అతనికి నచ్చలేదన్న విషయం బయటపడింది. ఇదే అతని ఆకస్మిక రాజీనామాకు కారణమై ఉండొచ్చనే భావన కలుగుతోంది.కాగా, టీమిండియా చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్‌ జట్టుపై ఆ దేశాని​కి చెందిన చాలామంది మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు. షోయబ్‌ అక్తర్‌, షాహిద్‌ అఫ్రిది వంటి వారైతే కొందరు పాక్‌ ఆటగాళ్లపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పాక్‌ జట్టు దుస్థితికి స్టార్లుగా చెప్పుకునే ఒకరిద్దరు ఆటగాళ్లే కారణమన్నది వారి అభిప్రాయం కూడా. భారత్‌ చేతిలో వరుస పరాభవాల నేపథ్యంలో పాక్‌ అభిమానులు కూడా పాక్‌ జట్టుపై విసుగెత్తిపోయారు. ఇన్నాళ్లు వెనకేసుకొచ్చిన నోళ్లతో దుర్భాషలాడుతున్నారు. భారత్‌ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్‌ జట్టుకు ఇంట కూడా మర్యాద లేకుండా పోయింది. పాక్‌ దుస్థితికి స్టార్‌ ఆటగాళ్లు కారణమని కొందరంటుంటే, మరికొందరేమో పాక్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ కారణమని ఆరోపిస్తున్నారు. నఖ్వీ పాక్‌ క్రికెట్‌ను సర్వనాశనం చేశాడన్న అభిప్రాయం చాలామంది పాక్‌ జాతీయుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

Had To Wash Dishes: Pakistan Hockey Captain Slams Hockey Federation3
అంట్లు తోముకోవాల్సి వచ్చింది: మండిపడ్డ పాక్‌ కెప్టెన్‌

పాకిస్తాన్‌ హాకీ ఫెడరేషన్‌ (పీహెచ్‌ఎఫ్‌) తీరుపై ఆ దేశ హాకీ జట్టు కెప్టెన్‌ షకీల్‌ అమ్మద్‌ బట్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. PHF ప్రస్తుత యాజమాన్యంతో కలిసి తాము పనిచేయలేమని తేల్చిచెప్పాడు. దేశం కాని దేశంలో తమను రోడ్ల వెంట పరిగెత్తించి.. ఆఖరికి అంట్లు తోముకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. FIH Pro Leagueలో భాగంగా తమ మ్యాచ్‌లు ఆడేందుకు పాక్‌ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే, వారి వసతికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయడంలో PHF విఫలమైంది. కాన్‌బెర్రా వెళ్లేందుకు పాక్‌ జట్టు సిడ్నీ విమానాశ్రయంలో దాదాపు 13-14 గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.అనంతరం హోటల్‌కు వెళ్లిన తర్వాత పాక్‌ హాకీ జట్టుకు మరో ఘోర అవమానం ఎదురైంది. వారి పేరిట అడ్వాన్స్‌ బుకింగ్‌ లేకపోవడంతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో గంటల పాటు పాక్‌ హాకీ ఆటగాళ్లు రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నమే మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా.. ఆసీస్‌ చేతిలో పాక్‌ ఓడిపోయింది. అనంతరం జర్మనీ చేతిలోనూ ఓటమిపాలైంది.మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చిందిఈ నేపథ్యంలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పాకిస్తాన్‌ హాకీ జట్టు కెప్టెన్‌ షకీల్‌ అహ్మద్‌ బట్‌ స్వదేశానికి వచ్చిన తర్వాత లాహోర్‌ ఎయిర్‌పోర్టులో మీడియాకు వెల్లడించాడు. ‘‘ప్రస్తుత హాకీ ఫెడరేషన్‌ యాజమాన్యంతో కలిసి మేము పనిచేయలేము.మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లే ముందు మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది. అలాంటపుడు మ్యాచ్‌ ఫలితం గురించి ఆలోచించే సమయం మాకు ఎక్కడ ఉంటుంది?.. అసలు మ్యాచ్‌ ఆడతామో లేదో తెలియని పరిస్థితి. ఇక ఫలితం గురించి అడగటం ఎందుకు?మాకు విదేశీ కోచ్‌ కావాలిమేము పది రోజుల పాటు చీప్‌ ఏరియాలో ఉండాల్సి వచ్చింది. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని మా ఫెడరేషన్‌ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆస్ట్రేలియాలో మాకు ఏం జరిగిందో అందరికీ తెలియాలి కాబట్టే నేను మాట్లాడుతున్నాను.మాకు విదేశీ కోచ్‌ కావాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. యాజమాన్యం కూడా మంచిగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది’’ అని షకీల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా పాక్‌ హాకీ ఫెడరేషన్‌కు ప్రాటన్‌-ఇన్‌-చీఫ్‌గా ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ఉంటారు.ప్రధాని దృష్టికి తీసుకువెళ్తాముఈ నేపథ్యంలో పీఎస్‌బీ డైరెక్టర్‌- జరనల్‌ నూర్‌ సభా స్పందిస్తూ.. ఆటగాళ్ల ఆరోపణలపై విచారణ చేస్తున్నామని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని చెప్పుకొచ్చాడు. కాగా FIH Pro Leagueలో పాకిస్తాన్‌ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఎనిమిది ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానం (తొమ్మిది)లో ఉంది. మరోవైపు.. బెల్జియం ఎనిమిదింట ఏడు గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ నాలుగింటికి నాలుగు ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

T20 WC 2026: South Africa beat UAE by 6 wickets4
T20 WC 2026: కొనసాగుతున్న సౌతాఫ్రికా జైత్రయాత్ర

టీ20 ప్రపంచకప్‌ 2026లో గత ఎడిషన్‌ రన్నరప్‌ సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రొటీస్‌ జట్టు వరుసగా నాలుగో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లోనూ గెలిచి అజేయ జట్టుగా సూపర్‌-8లోకి ప్రవేశించింది. యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన సౌతాఫ్రికా యూఏఈని 122 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కార్బిన్‌ బాష్‌ (4-0-12-3), అన్రిచ్‌ నోర్జే (4-0-28-2), జార్జ్‌ లిండే (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో అలీషాన్‌ షరాఫు (45) టాప్‌ స్కోరర్‌గా కాగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిలో కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం 22, ఆర్యాంశ్‌ శర్మ 13, ముహమ్మద్‌ అర్ఫాన్‌ 11 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (36), ర్యాన్‌ రికెల్టన్‌ (30), కెప్టెన్‌ మార్క్రమ్‌ (28), డికాక్‌ (14), స్టబ్స్‌ (6 నాటౌట్‌), జేసన్‌ స్మిత్‌ (3 నాటౌట్‌) తలో చేయి వేసి ప్రొటీస్‌ను గెలిపించారు. యూఏఈ బౌలర్లలో హైదర్‌ అలీ, జవాదుల్లా, అర్ఫాన్‌, ఫరూఖ్‌ తలో వికెట్‌ తీశారు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో యూఏఈ పోరాటం ముగిసింది. ఈ జట్టు కెనడాపై మాత్రమే గెలిచి న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో ఓడింది.

Major Blow For Sri Lanka Matheesha Pathirana to miss rest of T20 WC 20265
T20 WC: జోరు మీదున్న శ్రీలంకకు భారీ షాక్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు భారత్‌తో కలిసి ఆతిథ్యం ఇస్తోంది శ్రీలంక. సొంతగడ్డపై అటు టీమిండియా.. ఇటు శ్రీలంక జట్టు సత్తా చాటుతూ ఇప్పటికే సూపర్‌-8కు అర్హత సాధించాయి. గ్రూప్‌-ఎలో భాగంగా మూడింట మూడు గెలిచి భారత్‌.. గ్రూప్‌-బి నుంచి హ్యాట్రిక్‌ విజయాలతో శ్రీలంక ఆయా గ్రూపు టాపర్లుగా కొనసాగుతున్నాయి.దసున్‌ షనక సారథ్యంలోఇక పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక.. కెప్టెన్‌గా తిరిగి వచ్చిన దసున్‌ షనక సారథ్యంలో అదరగొడుతోంది. తొలుత ఐర్లాండ్‌ను.. రెండో మ్యాచ్‌లో ఒమన్‌ను అలవోక​గా ఓడించింది లంక. చివరగా ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి.. సూపర్‌-8 బెర్తును అధికారికంగా ఖరారు చేసుకుంది.లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేతో లంక తలపడనుంది. ఇరుజట్ల మధ్య గురువారం కొలంబోలో ఈ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక శిబిరంలో ఆందోళన నెలకొంది.మతీశ పతిరణకు గాయంస్టార్‌ పేసర్‌ మతీశ పతిరణ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా పతిరణకు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు కుంటుతూనే మైదానం వీడాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో.. అతడికి దాదాపు మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.శ్రీలంక జర్నలిస్టు అందించిన వివరాల ప్రకారం.. పతిరణ గాయం వల్ల మూడు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. అతడి స్థానంలో బినుర ఫెర్నాండో లేదంటే దిల్షాన్‌ మధుషాంక జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. నువాన్‌ తుషార, మిలాన్‌ రత్ననాయకే రూపంలో మరో రెండు ఆప్షన్లు కూడా ఉన్నాయి. కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో పతిరణ కేవలం నాలుగు బంతులే బౌల్‌ చేసి మైదానం వీడాడు. కాగా ఇప్పటికే వనిందు హసరంగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి శ్రీలంక జట్టుపాతుమ్‌ నిస్సాంక, కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌ (వికెట్‌ కీపర్‌), పవన్‌ రత్ననాయకే, దసున్‌ షనక (కెప్టెన్‌), కమిందు మెండిస్‌, దుషాన్‌ హేమంత, దునిత్‌ వెల్లలగే, దుష్మంత చమీర. మహీశ్‌ తీక్షణ, మతీశ పతిరణ, కమిల్‌ మిశారా, చరిత్‌ అసలంక, ప్రమోద్‌ మధుషాన్‌, జనిత్‌ లియనగే.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

How was Smith not on plane: Vaughan Lambasts AUS Group Stage Exit6
T20 WC: అతడిని సెలక్ట్‌ చేయలేదు.. అనుభవించారు!

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీలో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయారంటూ సొంత అభిమానులే విమర్శిస్తున్నారు. కాగా గ్రూప్‌-బిలో శ్రీలంక, జింబాబ్వే, ఒమన్‌, ఐర్లాండ్‌లతో కలిసి ఉన్న ఆసీస్‌.. పసికూన జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడింది.తద్వారా సూపర్‌-8 అవకాశాలు సంక్లిష్టం కాగా.. మంగళవారం నాటి జింబాబ్వే- ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో ఆసీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసీస్‌ కంటే మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వే శ్రీలంకతో పాటు సూపర్‌-8లో అడుగుపెట్టింది.గాయాల బెడదకాగా టోర్నీ ఆరంభానికి ముందు నుంచే కంగారూ జట్టును గాయాల బెడద వేధించింది. ప్రధాన పేసర్లు ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins), జోష్‌ హాజిల్‌వుడ్‌ (Josh Hazlewood) టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సైతం ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.ఇక మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను తొలుత టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేయనేలేదు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు మాత్రం అతడిని హుటాహుటిన రప్పించారు. అయితే, ఈ మ్యాచ్‌లో స్మిత్‌ను ఆడించలేదు. ఈ మ్యాచ్‌లో ఓడిన ఆసీస్‌.. సూపర్‌-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. అతడిని సెలక్ట్‌ చేయలేదు.. అనుభవించారు!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘బహుశా స్టీవ్‌ స్మిత్‌ తాను వచ్చిన విమానంలోనే వెనుదిరిగి ఉంటాడు. ఎందుకంటే వీళ్లు (ఆసీస్‌) టోర్నీ నుంచి నిష్క్రమించేశారు కదా!అసలు అతడిని ముందుగానే ఎందుకు ఎంపిక చేయలేదో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. బిగ్‌బాష్‌ లీగ్‌లో అతడు మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. అంతేకాదు అతడు స్పిన్‌ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడగలడు. అయినప్పటికీ స్టీవ్‌ స్మిత్‌ను ముందుగానే సెలక్ట్‌ చేయకుండా క్రికెట్‌ ఆస్ట్రేలియా తప్పు చేసింది’’ అని మైకేల్‌ వాన్‌ విమర్శించాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌లపై స్మిత్‌ను ఆడించకుండా.. ఆసీస్‌ మూల్యం చెల్లించిందని వాన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఇటీవల దేశీ టీ20 టోర్నీలో సత్తా చాటిన స్మిత్‌.. బిగ్‌బాష్‌ లీగ్‌లో 299 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. స్మిత్‌ ఆసీస్‌ తరఫున చివరగా 2024 ఫిబ్రవరిలో టీ20 మ్యాచ్‌ ఆడాడు.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

Jammu Kashmir Script Ranji Trophy History Beat Bengal Enter 1st Ever Final7
సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్‌

జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌ మ్యాచ్‌లో అనూహ్య రీతిలో బెంగాల్‌ను మట్టికరిపించి తమ క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.రంజీ ట్రోఫీ 2025-26 రెండో సెమీస్‌లో భాగంగా బెంగాల్‌- జమ్మూ కశ్మీర్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ మొదలైంది. బెంగాల్‌లోని కళ్యాణి వేదికగా టాస్‌ గెలిచిన కశ్మీర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.ఘరామి సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్‌కు దగిన బెంగాల్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకు ఆలౌట్‌ అయింది. సుదీప్‌ కుమార్‌ ఘరామి (146) సెంచరీ సాధించి టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. కశ్మీర్‌ బౌలర్లలో పేస్‌ సంచలన ఆకిబ్‌ నబీ ఐదు వికెట్లతో చెలరేగగా.. సునిల్‌ కుమార్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. యుధ్‌వీర్‌ సింగ్‌ చరఖ్‌, అబిద్‌ ముస్తాక్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.అనంతరం జమ్మూ కశ్మీర్‌ బ్యాటింగ్‌కు దిగి 302 పరుగులకు ఆలౌట్‌ అయింది. అబ్దుల్‌ సమద్‌ 82 పరుగులతో రాణించగా.. కెప్టెన్‌ పారసస్‌‌​ డోగ్రా (58), ఆకిబ్‌ నబీ (42) కూడా మెరుగైన స్కోర్లు సాధించారు. బెంగాల్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ ఎనిమిది వికెట్లు కూల్చగా.. ముకేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.చెలరేగిన కశ్మీర్‌ బౌలర్లుఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన బెంగాల్‌కు కశ్మీర్‌ బౌలర్లు దిమ్మదిరిగే షాకిచ్చారు. పటిష్ట బెంగాల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేస్తూ 99 పరుగులకే కుప్పకూల్చారు. టాపార్డర్‌లో కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ ఐదు పరుగేల చేయగా.. సుదీప్‌ ఛటర్జీ, సుదీప్‌ కుమార్‌ ఘరామి డకౌట్‌ అయ్యారు. ఓపెనర్ల వికెట్లతో పాటు సూరజ్‌ (14), షాకిర్‌ హబీబ్‌ గాంధీ (10) వికెట్లను ఆకిబ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.మిగిలిన వారిలో సునిల్‌ కుమార్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. యుధ్‌వీర్‌ రెండు వికెట్లు దక్కించకున్నాడు. ఈ క్రమంలో బెంగాల్‌ విధించిన 126 పరుగుల లక్ష్యాన్ని జమ్మూ కశ్మీర్‌నాలుగో రోజు ఆటలో పూర్తి చేసింది. ఓపెనర్లు శుభం ఖజూరియా (1), యావర్‌ హసన్‌ (6, కెప్టెన్‌ డోగ్రా (9) విఫలమైనా.. శుభం పందిర్‌ (27), వన్షజ్‌ శర్మ (43 నాటౌట్‌), అబ్దుల్‌ సమద్‌ (30 నాటౌట్‌) పనిపూర్తి చేశారు. తొలిసారి రంజీ ఫైనల్‌లోలక్ష్య ఛేదనలో నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసిన జమ్మూ కశ్మీర్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా తొమ్మిది వికెట్లు తీసిన ఆకిబ్‌ నబీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌ 𝙎𝘾𝙀𝙉𝙀𝙎 𝙊𝙁 𝙋𝙐𝙍𝙀 𝙅𝙐𝘽𝙄𝙇𝘼𝙏𝙄𝙊𝙉 🤩J&K create history as they defeat Bengal by 7️⃣ wickets to book their ticket to the #RanjiTrophy Final for the very first time 🫡Scorecard ▶️ https://t.co/QXyCuRHJ6e@IDFCFIRSTBank pic.twitter.com/VBKPD9I9mX— BCCI Domestic (@BCCIdomestic) February 18, 2026

T20 WC 2026 PAK vs NAM: What Happens If Rain Washes Out Match8
PAK Vs NAM: పాకిస్తాన్‌కు శుభవార్త!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఇప్పటికే ఏడు జట్లు సూపర్‌-8 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ సూపర్‌-8లో అడుగుపెట్టగా.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ అర్హత సాధించాయి.పోటీలో అమెరికా, పాక్‌ ఇక గ్రూప్‌-ఎ నుంచి డిఫెండింగ్‌ చాంపియన్‌, ఆతిథ్య భారత్‌ హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌-8కు చేరుకోగా.. ఇదే గ్రూపు నుంచి రెండో బెర్తు కోసం అమెరికా, పాకిస్తాన్‌ పోటీలో ఉన్నాయి. గ్రూప్‌-ఎ టాపర్‌ టీమిండియా ఖాతాలో ఆరు పాయింట్లు ఉండగా.. నెట్‌రన్‌రేటు (+3.050).రెండో స్థానంలో ఉన్న అమెరికా నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని రెండు గెలిచి 4 పాయింట్లతో ఉంది. నెట్‌రన్‌రేటు (+0.787). ఇక నమీబియా ఆడిన మూడింటికి మూడు ఓడి ఎలిమినేట్‌ కాగా.. పాక్‌ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లు సాధించిది. అమెరికాతో సమానంగా పాయింట్లు ఉన్నా నెట్‌రన్‌రేటు (-0.403) పరంగా వెనుకబడి ప్రస్తుతానికి మూడో స్థానంలో నిలిచింది.వర్షం పడితే.. ఈ క్రమంలో గ్రూప్‌ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా పాకిస్తాన్‌ బుధవారం నమీబియాతో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఇందుకు వేదిక. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.పల్లెకెలెలో వాన వల్ల జింబాబ్వే- ఐర్లాండ్‌ మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ టాస్‌ పడకుండానే రద్దైపోయింది. దీంతో జింబాబ్వే సూపర్‌-8కు చేరగా.. ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఇక పాక్‌- నమీబియా మ్యాచ్‌కు కూడా వాన ముప్పు పొంచి ఉంది.ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం.. కొలంబోలో బుధవారం వర్షం పడేందుకు 67 శాతం అవకాశాలు ఉన్నాయి. రాత్రికి 55 శాతం వాన పడే అవకాశాలు తగ్గినా.. పాక్‌- నమీబియా మ్యాచ్‌ మధ్యాహ్నం మూడు గంటలకే మొదలుకావాల్సి ఉంది.సంతోషంలో పాక్‌ జట్టు అభిమానులుఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్‌ గనుక రద్దైతే పాకిస్తాన్‌కు పండుగే. వాన వల్ల మ్యాచ్‌ సాగకపోతే పాక్‌, నమీబియాలకు చెరో పాయింట్‌ వస్తుంది. తద్వారా పాక్‌ ఖాతాలోని పాయింట్ల సంఖ్య ఐదుకు చేరి.. సూపర్‌-8కు నేరుగా అర్హత సాధిస్తుంది. దీంతో అమెరికా నిష్క్రమించాల్సి ఉంటుంది.ఒకవేళ మ్యాచ్‌ జరిగినా పాక్‌ నమీబియాపై తప్పక గెలవాలి. నమీబియా పసికూనే అయినా పాక్‌ నిలకడలేమితనం ఆ జట్టు అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. అయితే, మ్యాచ్‌కు వాన ముప్పు ఉందని తెలిసి వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.చదవండి: కెప్టెన్‌ నిర్ణయం... జట్టు పాలిట శాపం!

T20 WC: Mohsin Naqvi Names Actual Hero For Pak India Boycott U Turn9
IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆది నుంచి పాక్‌ బోర్డు చర్చ చేయడమే ఇందుకు కారణం.ఈ ఐసీసీ ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ మ్యాచ్‌ల కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఉంటామంటూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాక్‌ ప్రగల్భాలు పలికింది. ఆ దేశ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ఈ విషయం గురించి ప్రకటన చేశారు.మరోసారి చిత్తుగా ఓడి..అయితే, అందరూ ఊహించినట్లుగానే పాక్‌ మాట మార్చింది. ఐసీసీ జోక్యంతో పాటు.. శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్‌ బోర్డుల నుంచి ఒత్తిడి రావడంతో టీమిండియాతో మ్యాచ్‌ (IND vs PAK) ఆడతామని ప్రకటించింది. కొలంబోలో ఆదివారం భారత్‌తో తలపడి మరోసారి చిత్తుగా ఓడింది.ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్‌ మొహ్సిన్‌ నక్వీ (Mohsing Naqvi) ముందుగానే స్టేడియం నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాము భారత్‌తో మ్యాచ్‌ ఆడటంలో శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిస్సనాయకేదే కీలక పాత్ర అని నక్వీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.అసలైన హీరో మీరేదిస్సనాయకేతో సమావేశంలో నక్వీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ తరఫున మీకు శుభాభినందనలు. నిన్నటి మ్యాచ్‌ (ఆదివారం టీమిండియాతో మ్యాచ్‌) జరగడానికి ముఖ్య కారణం మీరే.ఈ మ్యాచ్‌ సజావుగా సాగడంలో మీదే కీలక పాత్ర. మీరే హీరో. దాదాపు రెండు బిలియన్ల మంది ప్రేక్షకులు మీ కారణంగా వినోదం పొందగలిగారు. కేవలం మీ చొరవ వల్లే ఈ మ్యాచ్‌ జరిగింది.టీమిండియాతో ఆడకూడదని మేము నిర్ణయించుకున్నాం. వారితో మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే, మా ప్రధానికి మీరు ఎప్పుడైతే ఫోన్‌ చేశారో.. ఆయన వెంటనే నాకు ఫోన్‌ చేసి.. ‘ఇకపై ఎలాంటి సమస్యా లేదు.. మనం టీమిండియాతో మ్యాచ్‌ ఆడుతున్నాం అంతే’ అని అన్నారు. మీకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు.ఉగ్రదాడిని గుర్తు చేస్తూ లంక లేఖకాగా శ్రీలంక జట్టుపై పాక్‌లో గతంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. అదే విధంగా గతేడాది సైతం బాంబుల మోత నడుమ లంక పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ పూర్తి చేసింది. ఈ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ లంక బోర్డు పాక్‌ బోర్డుకు లేఖ రాసింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా తిరిగి ఆ దేశంలో పర్యటించామని గుర్తు చేసింది.అలాంటిది వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌- పాక్‌ మ్యాచ్‌ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత రద్దు చేసుకుంటామనడం సరికాదని హెచ్చరించింది. మరోవైపు.. ఐసీసీ సైతం కఠిన చర్యలకు ఉపక్రమిస్తామనే సందేశం ఇచ్చింది. ఈ క్రమంలో యూటర్న్‌ తీసుకున్న పాక్‌ టీమిండియాతో మ్యాచ్‌ ఆడింది. చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

T20 WC: Sikandar Raza Sends Strong Message After Qualifying Super 810
పెద్దగా సంబరాల్లేవ్‌!.. మా లక్ష్యం అదే: జింబాబ్వే కెప్టెన్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే, శ్రీలంక జట్ల చేతిలో ఓటమి.. కంగారూలను సూపర్‌-8కు దూరం చేసింది. పల్లెకెలెలో మంగళవారం జరగాల్సిన జింబాబ్వే- ఐర్లాండ్‌ (ZIM vs IRE) మ్యాచ్‌ రద్దు కావడంతో ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.లీగ్‌ దశలోనేపేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లిస్తూ కంగారూలు లీగ్‌ దశలోనే అవమానకర రీతిలో ఇంటిబాట పట్టగా.. జింబాబ్వే సగర్వంగా సూపర్‌-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే కెప్టెన్‌ సికిందర్‌ రజా (Sikandar Raza)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సమిష్టిగా రాణించి‘‘ఆఫ్రికా సబ్‌ రీజియనల్‌ క్వాలిఫైయర్స్‌లో మేము గ్రూప్‌-బిలో కెన్యా, రువాండా, టాంజానియా వంటి జట్లతో తలపడ్డాము. ఆ సమయంలో మా లక్ష్యం గెలుపు ఒక్కటే. లేదంటే జట్టు మొత్తం తమను తాము నిందించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పాను.అక్కడ సమిష్టిగా రాణించి ప్రపంచకప్‌ టోర్నీలో అడుగుపెట్టాము. ఇప్పుడు సూపర్‌-8కు కూడా అర్హత సాధించాము. ఈ ఆనందాన్ని తప్పక సెలబ్రేట్‌ చేసుకుంటాం. అయితే, పెద్దగా సంబరాలు చేసుకోవడం లేదు.మా లక్ష్యంలో మొదటి దశను మేము దాటాము. తదుపరి మేము శ్రీలంకతో మ్యాచ్‌ ఆడబోతున్నాం. ఆ మ్యాచ్‌ నామమాత్రమే అయినా గెలుపుపై గురిపెట్టాము. నేను, మా కోచ్‌ వారి బలాబలాల గురించి డేటాను పరిశీలిస్తున్నాం. అందుకు తగ్గట్లుగా మా వ్యూహాలు సిద్ధం చేసుకుంటాము.అండర్‌డాగ్‌గా బరిలోకిఆ మ్యాచ్‌లోనూ గెలిచేందుకు వందకు వంద శాతం ప్రయత్నిస్తాం. సూపర్‌-8కు అర్హత సాధించినంత మాత్రాన మా లక్ష్యంలో ఎలాంటి మార్పూ ఉండదు. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి ఈ స్థాయికి చేరడం ఎవరికైనా సంతోషమే. అయితే, ప్రతిరోజూ కొత్తదే. కఠినంగా శ్రమిస్తేనే ఆశించిన ఫలితం వస్తుంది’’ అని సికిందర్‌ రజా పేర్కొన్నాడు.కాగా గ్రూప్‌-బి నుంచి ఐర్లాండ్‌, ఒమన్‌, ఆస్ట్రేలియాలను ఎలిమినేట్‌ చేసి శ్రీలంక, జింబాబ్వే సూపర్‌-8కు చేరుకున్నాయి. ఇరుజట్లు గురువారం లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో ముఖాముఖి తలపడతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!This is what it means! 🤩Zimbabwe qualify for the Super 8s with a game to spare, knocking out Australia. Sikandar Raza leads the celebrations with the fans. 👏ICC Men’s #T20WorldCup | #SCOvNEP | LIVE NOW 👉 https://t.co/8SrC1cprbz pic.twitter.com/cqXeLv8ZtI— Star Sports (@StarSportsIndia) February 17, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement