ప్రధాన వార్తలు
IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ బౌలర్ల మీదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 వేలంలో దేశీ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, రవి బిష్ణోయి, సర్ఫరాజ్ ఖాన్ తదితరులు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. పాటు విదేశీ ప్లేయర్లు కామెరాన్ గ్రీన్, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ వంటి వారు హైలైట్ కానున్నారు. స్టార్లను మినహాయించితే ఈ ఐదుగురు భారత అన్క్యాప్డ్ బౌలర్లు కూడా ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది.ఆకిబ్ నబీజమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ. అనుభవం, నైపుణ్యాలు కలిగిన ఈ ఫాస్ట్బౌలర్ కోసం ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడం ఖాయం. తాజా దేశీ సీజన్లలో అతడు అద్భుత ప్రదర్శన కనబరచడం ఇందుకు కారణం. 2025-26 రంజీ సీజన్లో అదరగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దుమ్ములేపాడు.ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు 15 వికెట్లు కూల్చిన ఆకిబ్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. మధ్యప్రదేశ్తో మ్యాచ్లో బ్యాట్తోనూ సత్తా చాటాడు. వేలానికి ముందు అతడి ఈ అత్యుత్తమ ప్రదర్శన ఫ్రాంఛైజీలను ఊరిస్తోంది.ఈడెన్ ఆపిల్ టామ్కేరళకు చెందిన తాజా బౌలింగ్ సంచలనం ఈడెన్ ఆపిల్ టామ్. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్లలో రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు 20 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్. తాజా రంజీ సీజన్లో మధ్యప్రదేశ్పై (4/55 & 2/33) ఉత్తమ గణాంఖాలు నమోదు చేశాడు.ఇక మొత్తంగా ఏడు ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో కలిపి 19 వికెట్లు కూల్చాడు ఆపిల్. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడికి అనుభవం లేదు. అయినప్పటికీ అతడి నైపుణ్యాల కారణంగా కనీస ధర రూ. 20లక్షలకైనా అమ్ముడుపోయే అవకాశం ఉంది.రాజ్ లింబానిఅండర్-19 వరల్డ్కప్లో ఫైనల్ చేరిన భారత జట్టులో రాజ్ లింబాని సభ్యుడు. 2024లో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఇప్పటికి 11 మ్యాచ్లలో కలిపి 16 వికెట్లు కూల్చాడు. కొత్త బంతితో అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో అతడు అదరగొట్టాడు. డెత్ ఓవర్లలోనూ తనదైన శైలిలో రాణించాడు.ఆకాశ్ మధ్వాల్2023లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు ఆకాశ్ మధ్వాల్. ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్ ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటాడు. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్కు మారి అక్కడా తనను తాను నిరూపించుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్లో 17 మ్యాచ్లు ఆడి 23 వికెట్లు తీశాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో ఈ యార్కర్ల కింగ్ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. ఉత్తరాఖండ్ తరపున ఆరు మ్యాచ్లలో మూడు వికెట్లే తీశాడు. అయితే, అతడి అనుభవం దృష్ట్యా ఈసారి మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.అశోక్ శర్మసయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో రాజస్తాన్ తరఫున సత్తా చాటుతున్నాడు అశోక్ శర్మ. ఇప్పటికి ఏడు మ్యాచ్లలో కలిపి ఏకంగా 19 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లకు నెట్బౌలర్గా పనిచేసిన అశోక్ శర్మ ఈసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు.
నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. సచిన్, కోహ్లి దరిదాపుల్లో లేరు!
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మేనియాతో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. మెస్సీ నామస్మరణతో మహానగరం శనివారం మారుమోగ్రిపోయింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆద్యంతం చలాకీగా, సరదాగా గడిపిన మెస్సీ.. సరదా కిక్లతో ఫుట్బాల్ను స్టాండ్స్కు పంపించాడు. వాటిని అందుకుని అందుకున్న అభిమానులు ఇదేకదా అసలు ‘కిక్కు’ అంటూ మురిసిపోయారు.కాగా మెస్సీ.. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా సామాన్యులనూ ఆకర్షించిన అంశం.. వారిని ముక్కునవేలేసుకునేలా చేసిన విషయం ఏమిటంటే.. ఈ లెజెండరీ ఆటగాడితో ఫొటో దిగాలంటే ఏకంగా పది లక్షలు చెల్లించాల్సి ఉండటం. అయితే, మెస్సీ రేంజ్ గురించి తెలిసిన వాళ్లు మినమమ్ ఉంటది కదా! అని సరిపెట్టుకున్నారు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెస్సీ సంపాదన.. 2025 నాటికి ఏడు వేల కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా!ఫుట్బాల్కే ఆదరణ ఎక్కువభారత్తో పాటు క్రికెట్ ఆడే దేశాల్లో ప్రఖ్యాతి పొందిన భారత క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ (దాదాపు రూ. 1400 కోట్లు), విరాట్ కోహ్లి (సుమారుగా వెయ్యి కోట్లు)లతో పోలిస్తే మెస్సీ సంపాదన చాలా ఎక్కువ. భారత్లో క్రికెట్ మతమైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్కి ఆదరణ ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఒక్కో మెట్టు ఎక్కుతూ..పుట్టుకతోనే మెస్సీ కోటీశ్వరుడేమీ కాదు. చిన్ననాటి నుంచే ఫుట్బాల్పై ఉన్న మక్కువ.. ఆటలో అంకిత భావం, నైపుణ్యాలు అతడిని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. క్లబ్లకు ఆడుతూ పెద్ద మొత్తంలో ఆర్జించిన మెస్సీ.. ఇంటర్ మియామిలో చేరిన తొలి నాళ్లలో నెలకు మిలియన్ డాలర్లకు పైగా పొందాడు. ప్రస్తుతం ఈ క్లబ్ ద్వారా అతడు పొందే ఆదాయం నెలకు 2.67 మిలియన్ డాలర్లుగా ఉందంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక బార్సిలోనా క్లబ్ ద్వారా మెస్సీ లెక్కకు మిక్కిలి ఆర్జిస్తున్నాడు.అంతేకాదు.. టాప్ బ్రాండ్లకు అంబాసిడర్గా పనిచేస్తూ మెస్సీ దండిగా సంపాదన కూడబెట్టాడు. ఉదాహరణకు అడిడాస్, పెప్సీ వంటి బ్రాండ్లు మెస్సీ క్రేజ్ దృష్ట్యా అతడికి ఏడాదికి రూ. 70 మిలియన్లకు పైగా ముట్టజెప్పుతున్నట్లు వివిధ వార్తా సంస్థలు నివేదించాయి.రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాలుఇవే కాకుండా డిజిటల్ కాయిన్ల రూపంలోనూ అతడు మనీ సేవ్ చేస్తున్నాడు. ఇక ఆట, ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్లో పెట్టాడు. అంతేకాదు.. హోటల్ వ్యాపారాలనూ పెద్ద ఎత్తున విస్తరించాడు. ఇలా అటు క్లబ్లు.. ఇటు ఎండార్స్మెంట్లు, వ్యాపారాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న మెస్సీ... నికర ఆస్తుల విలువ ఏడు వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే.. మెస్సీ నెల ఆదాయం సుమారుగా రూ. 41.67 కోట్లు. అంటే ఏడాదికి దాదాపుగా రూ. 500 కోట్లు అన్నమాట. చదవండి: IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్
IND Vs PAK: పాక్తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ అట్టర్ఫ్లాప్
భారీ అంచనాల నడుమ పాకిస్తాన్తో మ్యాచ్లో బరిలోకి దిగిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. పాక్తో మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా గ్రూప్-‘ఎ’ లో ఉన్న భారత్- పాక్ (Ind vs Pak)మధ్య ఆదివారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా.. మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు.ధనాధన్ ఇన్నింగ్స్తో మొదలుపెట్టిన ఆయుశ్ఇక దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో దాయాదితో పోరులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. గత మ్యాచ్లో యూఏఈపై విఫలమైన ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) ఈసారి ధనాధన్ ఇన్నింగ్స్తో మొదలుపెట్టగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఆది నుంచే తడబడ్డాడు.పాక్ బౌలింగ్ అటాక్ను ఆరంభించిన అలీ రెజా.. తొలి ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. అతడి బౌలింగ్లో నాలుగో బంతికి ఆయుశ్ మాత్రే పరుగు తీశాడు. ఇక రెండో ఓవర్లో మొహమ్మద్ సయ్యామ్ బౌలింగ్లో ఆయుశ్ ఫోర్, సిక్స్, ఫోర్తో అలరించగా.. వైభవ్ మాత్రం ఇక్కడా ఖాతా తెరవలేదు.టచ్లోకి వచ్చినట్లే వచ్చిమూడో ఓవర్లో మళ్లీ రెజా రంగంలోకి దిగగా.. తొలి బంతినే బౌండరీకి తరలించి వైభవ్ టచ్లోకి వచ్చినట్లు కనిపించాడు. తర్వాత ఆయుశ్ రెజా బౌలింగ్లో రెండు ఫోర్లు బాది సత్తా చాటాడు. అయితే, నాలుగో ఓవర్లో మొహమ్మద్ సయ్యామ్ బౌలింగ్లో రెండో బంతిని వైభవ్ స్ట్రెయిట్ షాట్ బాదగా.. అతడు బంతిని క్యాచ్ పట్టాడు.దీంతో ఆరు బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు. అతడి స్థానంలో హైదరాబాదీ స్టార్ ఆరోన్ జార్జ్ క్రీజులోకి వచ్చాడు. కాగా ఆయుశ్ మాత్రే 25 బంతుల్లో 38 పరుగులు చేసి నిష్క్రమించగా.. విహాన్ మల్హోత్రా (12), వేదాంత్ త్రివేది (7) ఫెయిలయ్యారు. ఫలితంగా 20 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులే చేయగలిగింది. కాగా యూఏఈతో గత మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ భారీ శతకం (171) బాదిన విషయం తెలిసిందే. అయితే, సెమీస్ చేరడంలో కీలకమైన పాక్తో మ్యాచ్లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. చదవండి: IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్
IND vs PAK: టాస్గెలిచిన పాకిస్తాన్.. భారత్ బ్యాటింగ్
ఆసియా క్రికెట్ మండలి అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్తో మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచింది. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ఆదివారం నాటి మ్యాచ్లో.. ఆయుశ్ మాత్రే సేనను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా.. మ్యాచ్ను నలభై తొమ్మిది ఓవర్లకు కుదించారు.తొలి మ్యాచ్లలో ఘన విజయాలుకాగా అండర్-19 ఆసియా కప్లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, మలేషియా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, నేపాల్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్లో భారత్ యూఏఈ (IND vs UAE)ని.. పాక్ మలేషియా (PAK vs MLY)ను చిత్తుగా ఓడించి శుభారంభం అందుకున్నాయి. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో దాయాదులు అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్లో భారత చిచ్చరపిడుగు, యూఏఈతో మ్యాచ్లో భారీ శతకంతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పైనే కళ్లన్నీ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్ తలా ఒక మ్యాచ్ గెలిచి టాప్-2లో ఉండగా.. గ్రూప్-ఎలో పాక్, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.భారత్ అండర్-19 వర్సెస్ పాకిస్తాన్ అండర్-19 తుదిజట్లుభారత్ఆయుష్ మాత్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్.పాకిస్తాన్ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, అలీ హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్(కెప్టెన్), హమ్జా జహూర్(వికెట్ కీపర్), హుజైఫా అహ్సన్, నిఖాబ్ షఫీక్, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయ్యమ్, అలీ రజా.చదవండి: తుదిజట్టు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు!.. సౌతాఫ్రికా కోచ్ ఏమన్నాడంటే..
IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ తన విషయంలో స్పష్టత ఇచ్చాడు. ఈసారి క్యాష్ రిచ్ లీగ్లో తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తన మేనేజర్ తప్పిదం వల్లే రిజిస్ట్రేషన్ విషయంలో తప్పు జరిగి ఉండవచ్చని పేర్కొన్నాడు.110 మంది విదేశీ ప్లేయర్లు అబుదాబి వేదికగా డిసెంబరు 16 (మంగళవారం)న మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. మొత్తంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 110 మంది విదేశీ ప్లేయర్లు ఇందులో ఉన్నారు.అయితే, ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) ఈసారి పూర్తిస్థాయి బ్యాటర్ స్లాట్లో తన పేరును నమోదు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో ప్యూర్ బ్యాటర్ స్లాట్లో సెట్ 1లోనే అతడు వేలంలోకి రానున్నాడు. దీంతో గ్రీన్ ఈ సీజన్లో బౌలింగ్ చేయడేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఇది అతడి ధరపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..ఈ నేపథ్యంలో కామెరాన్ గ్రీన్ తన పేరు బ్యాటర్గా మాత్రమే నమోదు కావడంపై స్పందించాడు. యాషెస్ సిరీస్ (Ashes Series)లో భాగంగా అడిలైడ్లో మూడో టెస్టుకు ముందు రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ‘‘నేను బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నన్ను బ్యాటర్గా మాత్రమే రిజిస్టర్ చేశారన్న విషయం మా మేనేజర్కు తెలిసే ఉండదు.పొరపాటున అతడు తప్పుడు ఆప్షన్ ఎంపిక చేసి ఉంటాడు. ఇదెలా జరిగిందో తెలియదు’’ అని గ్రీన్ చెప్పుకొచ్చాడు. కాగా 2023లో రూ. 17.50 కోట్ల ధరతో ఐపీఎల్లో అడుగుపెట్టిన గ్రీన్.. ముంబై ఇండియన్స్ తరఫున 452 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు.గ్రీన్పై భారీ అంచనాలుఈ క్రమంలో 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ పేస్ ఆల్రౌండర్ను ట్రేడ్ చేసుకోగా.. 255 రన్స్ రాబట్టడంతో పాటు.. 10 వికెట్లు కూల్చాడు. అయితే, 2025లో గ్రీన్ గాయపడటంతో ఈ సీజన్లో ఆడలేకపోయాడు. ఈసారి మాత్రం ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్పై భారీ అంచనాలు ఉన్నాయి.చదవండి: ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు రెడీ: తిలక్ వర్మ
ఏదో మొక్కుబడిగా చేయను.. క్లారిటీ ఉంది: సౌతాఫ్రికా కోచ్
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా టీ20 జట్టులో తరచూ ఇలా జరగడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA)తో రెండో టీ20లోనూ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను వన్డౌన్లో పంపడం.. అందుకు తగ్గ మూల్యం చెల్లించడం జరిగాయి.ఏదో మొక్కుబడిగా చేయనుమరోవైపు.. ఈ మ్యాచ్లో తుదిజట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మూడో టీ20కి ధర్మశాల వేదిక. ఈ మ్యాచ్కు ముందు సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము కూడా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తామని.. అయితే, అదేదో మొక్కుబడిగా చేసే పనికాదని పేర్కొన్నాడు.స్పష్టమైన అవగాహన ఉందిటీ20 ప్రపంచకప్-2026 ప్రణాళికలకు అనుగుణంగానే తాము ముందుకు సాగుతున్నట్లు కన్రాడ్ వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ప్రతీ మ్యాచ్లోనూ మేము బ్యాటింగ్ ఆర్డర్ను మార్చబోము. తప్పక ఆర్డర్ను మార్చాలన్న నియమేమీ లేదు. ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది.ఇందుకు అనుగుణంగానే ప్లేయర్లను మారుస్తూ ఉన్నాము. టెస్టు సిరీస్ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఇక్కడే ఉన్నా.. వారికి అవకాశం రాలేదు. ఈ సిరీస్ తర్వాత SA20 లీగ్ కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా మా వాళ్ల ప్రదర్శనను చూస్తాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము.ఇక్కడ ఏది వర్కౌట్ అయింది.. ఏది వర్కౌట్ కాలేదు అన్న విషయాలను విశ్లేషిస్తాం. ఏదేమైనా మా ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా మాకేం కావాలో పూర్తి స్పష్టతతోనే ఉన్నాము’’ అని షుక్రి కన్రాడ్ చెప్పుకొచ్చాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.1-1తో సమంఇందులో భాగంగా తొలుత టెస్టులు జరుగగా.. 2-0తో సఫారీలు టీమిండియాను వైట్వాష్ చేశారు. అనంతరం.. వన్డే సిరీస్లో భారత్.. సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది. ఇక కటక్ వేదికగా తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో జయభేరి మోగించగా.. ముల్లన్పూర్లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో గెలిచింది.ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా మూడు మార్పులలతో బరిలోకి దిగింది. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, ఓట్నీల్ బార్ట్మన్లను బరిలోకి దించింది. బార్ట్మన్ నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20లో ఆడిన తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మాన్.చదవండి: భారత్ X పాకిస్తాన్
స్టాండ్స్లోకి కిక్ చేసి.. ఉప్పల్లో మెస్సీ చర్య వైరల్
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం మెస్సీ మంత్రం జపించింది. గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది. దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్ స్టేడియం ఉర్రూతలూగింది. గోట్ పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్కు వచ్చిన మెస్సీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నా రు. అనంతరం ఆయన ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. అభిమాన క్రీడాకారుణ్ని ఒక్కసారైనా దూరం నుంచైనా చూడాలని అభిమానులు పోటెత్తారు. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ఉప్పల్ స్టేడియంలో తన ఆటతో మైమరిపించారు. స్టాండ్స్లోకి కిక్ చేసివీవీఐపీలు, ఫుట్బాల్ ప్రేమికులు, మెస్సీ అభిమానులు దిగ్గజ క్రీడాకారుణ్ని చూసేందుకు పోటీపడ్డారు. స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకుల కేరింతల మధ్య కోలాహలంగా సాగింది. ఇక అభివాదం చేస్తు న్న సమయంలో ఫుట్బాల్ను స్టాండ్స్లోకి కిక్ చేసి మెస్సీ అభిమానులను అలరించిన తీరు వైరల్గా మారింది. ✨𝐀𝐧 𝐔𝐧𝐟𝐨𝐫𝐠𝐞𝐭𝐭𝐚𝐛𝐥𝐞 𝐌𝐨𝐦𝐞𝐧𝐭 ✨Football's Greatest Of All Time Lionel Messi in Hyderabad. pic.twitter.com/5z5gXCKbG9— Congress (@INCIndia) December 13, 2025మ్యూజిక్.. మ్యాజిక్.. ఫుట్బాల్ మ్యాచ్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకుడు రాహుల్ సిప్లీగంజ్, గాయని మంగ్లీ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఆస్కార్ పాట నాటు.. నాటు పాట పాడుతూ సిప్లీగంజ్ అభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీతో పాటు వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఈ పాటకు ఊగిపోయారు. ఎన్నడూ లేనివిధంగా స్టేడియంలో లైట్లు, లేజర్ షో ఏర్పాటు చేశారు. ఈ షో ఆదంత్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఫోక్ సాంగ్స్తో మంగ్లీ మెస్మరైజింగ్ షో అదరగొట్టింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీతారలు సైతం స్టేడియంలో సందడి చేశారు. ఫలించిన పోలీసుల వ్యూహం..ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ రాక సందర్శంగా శనివారం మధ్యాహ్నం నుంచే ఉప్పల్ స్టేడియం దారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. టికెట్, పాస్లున్న వారిని స్డేడియంలోనికి మూడు గంటలు ముందుగానే అనుమతించడంతో పొలీసులు వ్యూహం ఫలించింది. మ్యాచ్ను తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. మ్యాచ్ను వీక్షించేందుకు వస్తున్న యువత కాగా.. గతంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను సమర్థంగా నిర్వహించిన రాచకొండ పోలీసులు అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ తదితర వ్యూహాలు ఫలించాయి. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషం. రాచకొండ సీపీ సుదీర్ బాబు పిలుపు మేరకు అభిమానులు క్రమశిక్షణతోనే మెలిగారు. పాసులు లేనివారు స్టేడియం వైపు రాకపోవడం గమనార్హం. స్టేడియంలోకి అభిమానులంతా దాదాపుగా మెస్సీ టీ షర్ట్ను ధరించి వెళ్లడం కనిపించింది.
గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో అత్యుత్తమ గ్రాండ్మాస్టర్లు
సాక్షి, సిటీబ్యూరో: టెక్ మహీంద్రా, ‘ఫిడే’ సంయుక్త భాగస్వామ్యంలో గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్కు రంగం సిద్ధమైంది. ముంబైలోని రాయల్ ఒపెరా హౌస్లో నేటి నుంచి ఈ లీగ్ జరుగుతుంది. ఆరు జట్ల మధ్య 34 మ్యాచ్లు జరుగుతాయి. ఈ సందర్భంగా సీజన్–3 విన్నర్స్ ట్రోఫీని ఆవిష్కరించారు. త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ మధ్య మ్యాచ్తో ఈ సీజన్ అధికారికంగా ఆదివారం ప్రారంభమవుతుంది. మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, ద్రోణవల్లి హారిక, అలీరెజా ఫిరూజా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్మాస్టర్లుఈ సీజన్ జీసీఎల్ లక్ష్యాలను ప్రపంచ స్థాయి ఆటగాళ్ల ఎంపిక ద్వారా సాధిస్తుందని చైర్పర్సన్ పీయూష్ దూబే తెలిపారు. ఈ సీజన్లో ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్మాస్టర్లు ఆడనున్నారు. ప్రధాన ఆటగాళ్లలో అలీరెజా ఫిరూజా, ఫాబియానో కరువానా, హికారు నకముర, హు ఇఫాన్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు విశ్వనాథన్ ఆనంద్ సహా భారత మేటి ఆటగాళ్లు పోటీపడతారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ భారత చెస్ శక్తిని చాటుతున్నారు. రెండుసార్లు విజేతలైన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది. 10 రోజుల పాటుమరోవైపు.. పీబీజీ అలాస్కాన్ నైట్స్ జట్టు యజమాని పునిత్ బాలన్, గుకేశ్ అర్జున్ వంటి ప్రతిభావంతులతో తాము బలమైన స్థితిలో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. జేసీఎల్ మూడో సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో 10 రోజుల పాటు జరుగుతుంది. ఇక ఈ లీగ్లో ప్రతి జట్టు 10 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఆడుతుంది. తర్వాత డిసెంబర్ 23న ఫైనల్ జరుగుతుంది. ప్రతి మ్యాచ్ ఆరు బోర్డులపై పురుషులు, మహిళలు, యువ క్రీడాకారులు కలిసి పోటీపడతారు. భారత్లోని అభిమానులు జియో హాట్స్టార్ నెట్వర్క్లో లీగ్ను చూడవచ్చు. టిక్కెట్లు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
ధర్మశాలలో దుమ్మురేపేనా!
ధర్మశాల: సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో టి20 ఆడనుంది. గత రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరొకటి గెలవడంతో సిరీస్ 1–1తో సమం కాగా... ఇప్పుడు పైచేయి సాధించేందుకు సూర్యకుమార్ బృందం రెడీ అవుతోంది. తొలి మ్యాచ్లో ఓ మాదిరి లక్ష్యాన్ని కాపాడుకున్న టీమిండియా... రెండో టి20లో భారీ లక్ష్యఛేదనలో కనీస ప్రతిఘటన చూపకుండానే పరాజయం పాలైంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు భారత జట్టు మరో 8 మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. వీటిలో ప్రదర్శన ఆధారంగా వరల్డ్కప్నకు జట్టును ఎంపిక చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేర్పులను పరిశీలించుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న శుబ్మన్ గిల్పై అందరి దృష్టి నిలవనుంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. వీరిద్దరు రాణించాల్సిన అవసరముంది. మరోవైపు గత మ్యాచ్లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ధర్మశాలలో అడుగుపెట్టనుంది. ఇక్కటి చల్లటి వాతావరణం, పేస్, బౌన్స్కు అనుకూలించే పిచ్ సఫారీలకు మరింత సహాయపడనుంది. గిల్ రాణించేనా..! టెస్టు, వన్డే ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుబ్మన్ గిల్... టి20ల్లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోతున్నాడు. తొలి బంతి నుంచే దూకుడు కనబర్చాల్సిన ఈ ఫార్మాట్లో గిల్ ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం టి20ల్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న గిల్ మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ ఇదే తరహా ఆటతీరు కనబరిస్తే... టీమ్ మేనేజ్మెంట్కు వ్యూహం మార్చాల్సి రావచ్చు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లో రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగగా... ఈ ఇద్దరి రిటైర్మెంట్ అనంతరం అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ ఎక్కువ మ్యాచ్ల్లో ఇన్నింగ్స్ను ఆరంభించారు. అయితే దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా సామ్సన్ను బెంచ్కు పరిమితం చేసిన మేనేజ్మెంట్... గిల్కు విరివిగా అవకాశాలు ఇస్తోంది. కానీ వాటిని వినియోగించుకోవడంలో మాత్రం అతడు విఫలమవుతున్నాడు. గత రెండు మ్యాచ్ల్లోనూ గిల్ పేలవంగా వికెట్ పారేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్కు దిగడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అత్యుత్తమ ఆటగాళ్లను డగౌట్లో కూర్చోబెట్టి అక్షర్కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో కోచ్ గంభీర్కే తెలియాలి. అడపాదడపా షాట్లు ఆడటం తప్ప నిలకడగా ఇన్నింగ్స్ను నిర్మించలేకపోతున్న అక్షర్ వల్ల ఇతర ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. సారథి సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అభిషేక్ మెరుపుల మధ్య సూర్య వైఫల్యం బయటకు కనిపించడం లేదు కానీ... అతడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాన్నాళ్లైంది. తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నా... అతడికి సహకారం కరువైంది. హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, శివమ్ దూబే ఇలా స్టార్లకు కొదవ లేకపోయినా... వీరంతా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. గత మ్యాచ్లో దూబేను ఎనిమిదో స్థానంలో బరిలోకి దింపడంపై కూడా అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తారా లేక గంభీర్ తన మొండి పట్టుదలను కొనసాగిస్తాడా చూడాలి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రభావం చూపలేకపోవడం బౌలింగ్లో ప్రధాన సమస్యగా మారింది. గత మ్యాచ్లో అనామక బ్యాటర్ సైతం బుమ్రా బౌలింగ్లో భారీ సిక్స్లు కొట్టడం అభిమానులకు ఇబ్బంది కలిగించింది. మరోవైపు అర్ష్ దీప్ నియంత్రణ కోల్పోతుండటం జట్టుకు మరింత భారం అవుతోంది. వరుణ్ చక్రవర్తి ఫర్వాలేదనిపిస్తుండగా... కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. పటిష్టంగా దక్షిణాఫ్రికా... సుదీర్ఘ పర్యాటనలో భాగంగా టెస్టు సిరీస్ ‘క్లీన్ స్వీప్’ చేసిన దక్షిణాఫ్రికా... ఆ తర్వాత వన్డే సిరీస్లో పరాజయం పాలైంది. ఇప్పుడిక చివరగా జరుగుతున్న టి20 సిరీస్లో 1–1తో సమంగా ఉంది. ఈ టూర్లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న సఫారీలు ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్లో పైచేయి సాధించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గత మ్యాచ్లో చక్కటి ఇన్నింగ్స్తో డికాక్ తన దమ్మేంటో చూపగా... కెప్టెన్ మార్క్రమ్, హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్, ఫెరీరా, లిండె, యాన్సెన్తో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. మెరుగైన ఆరంభం లభిస్తే చాలు... క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ భారీ షాట్లు ఆడగల సమర్థులే కావడం దక్షిణాఫ్రికా జట్టుకు కలిసి రానుంది. ఇక బౌలింగ్లో యాన్సెన్ భారత జట్టుకు సింహస్వప్పంలా మారగా... ఎన్గిడి, సిపామ్లా, బార్ట్మన్ సమష్టిగా కదంతొక్కుతున్నారు. పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో... సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం భారత జట్టుకు కష్టసాధ్యమైన పనే. అభిషేక్ శర్మ ఆరంభంలోనే చెలరేగి వారి లయను దెబ్బతీయకపోతే... ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై దక్షిణాఫ్రికా బౌలర్లు సులువుగా ఒత్తిడి పెంచగలరు.పిచ్, వాతావరణం హిమాలయ పర్వత సానువుల్లో జరగనున్న ఈ మ్యాచ్లో చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ఇక్కడ జరిగిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట చేజింగ్ జట్లు గెలుపొందాయి. మంచు ప్రభావంతో రెండో ఇన్నింగ్స్లో బంతిపై బౌలర్లకు పట్టుచిక్కడం కష్టం. పిచ్ పేసర్లకు సహకరించనుంది. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, స్టబ్స్/హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్, డొనొవాన్ ఫెరీరా, యాన్సెన్, లిండె, ఎన్గిడి, బార్ట్మన్, నోర్జే/సిపామ్లా.
భారత్ X పాకిస్తాన్
దుబాయ్: అండర్–19 ఆసియాకప్లో ఘనవిజయంతో బోణీ కొట్టిన యువ భారత జట్టు ఆదివారం దాయాది పాకిస్తాన్తో అమీతుమీకి సిద్ధమైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ పోరులో గెలిచి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని యంగ్ ఇండియా భావిస్తోంది. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు ‘హ్యాండ్ షేక్’ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో... ఇటీవల జరిగిన పురుషుల సీనియర్ ఆసియాకప్, మహిళల వన్డే ప్రపంచకప్, రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో భారత ప్లేయర్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్లో భారత జట్టు 234 పరుగుల తేడాతో యూఏఈపై గెలిచి మంచి జోష్లో ఉంది. ఐపీఎల్ సహా సీనియర్ స్థాయిలో ఆడిన పలు టోర్నమెంట్లలో సెంచరీలతో విజృంభించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. యూఏఈతో పోరులో అతడు 95 బంతుల్లోనే 9 ఫోర్లు, 14 సిక్స్లతో 171 పరుగులు చేసి అదరగొట్టాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై కూడా అతడు అదే జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైస్కెపె్టన్ విహాన్ మల్హోత్రాతో పాటు హైదరాబాద్ ఆటగాడు ఆరోన్ జార్జి మంచి టచ్లో ఉన్నారు. వీరంతా సమష్టిగా సత్తాచాటితే పాకిస్తాన్కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక మరోవైపు తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 297 పరుగుల తేడాతో మలేసియాపై గెలిచింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరీహోరీ ఖాయమే!
సాల్ట్లేక్ స్టేడియంలో మెస్సీ ఫ్యాన్స్ రచ్చ..
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్...
70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్ ఇదే!
మెస్సీ.. మెస్సీ.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇదే ...
మెస్సీ వస్తున్నాడని.. హనీమూన్ రద్దు
కోల్కతా: మెస్సీ మేనియాతో ఇండియా ఊగిపోతోంది. అర్జ...
భారత్కు పదో స్థానం
సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీ ట...
భారత్ X పాకిస్తాన్
దుబాయ్: అండర్–19 ఆసియాకప్లో ఘనవిజయంతో బోణీ కొట్...
ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు రెడీ: తిలక్ వర్మ
ధర్మశాల: భారత జట్టులో ఎక్కువ మంది ప్లేయర్లు ఏ స్థా...
నేపాల్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో సంచలనం
నేపాల్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్లో సంచలనం నమోదై...
సంజూ చేసిన తప్పు ఏంటి.. ఎందుకు బలి చేస్తున్నారు?: ఉతప్ప
ఈ ఏడాది ఆసియాకప్తో టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిం...
క్రీడలు
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (ఫోటోలు)
కోల్కతాలో మెస్సీ మాయ.. (ఫోటోలు)
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
‘విరుష్క’ పెళ్లి రోజు.. అందమైన ఫొటోలు
బాలిలో చిల్ అవుతున్న షెఫాలీ వర్మ (ఫొటోలు)
హార్దిక్ పాండ్యా సూపర్ షో...తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
రయ్ రయ్ మంటూ.. ఆకట్టుకున్న బైకర్ల విన్యాసాలు.. (ఫోటోలు)
వీడియోలు
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
హైదరాబాద్ కు మెస్సీ.. ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు!
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ భారీ స్కోర్
సానియా మీర్జా లానే స్మృతి మంధాన కూడా..!
Cricket: ఫైనల్లో దుమ్ములేపిన సాక్షి టీమ్ TV9పై ఘన విజయం
ఊహించినట్టే జరిగింది.. పెళ్లిపై ఇద్దరూ క్లారిటీ
పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చేసిన స్మృతి
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
విశాఖలో క్రికెట్ ఫీవర్.. టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
