ప్రధాన వార్తలు
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) తన సొంత జట్టు జార్ఖండ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయ తెలిసిందే.182 పరుగులుఈ టోర్నీలో ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో జార్ఖండ్... త్రిపుర (Jharkhand vs Tripura) జట్టుతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం చేయగా... బ్రికమ్ కుమార్ దాస్ (29 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మణిశంకర్ (21 బంతుల్లో 42; 5 సిక్స్లు) రాణించారు.సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్జార్ఖండ్ బౌలర్లలో వికాస్ సింగ్, అనుకూల్ రాయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో జార్ఖండ్ 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (50 బంతుల్లో 113 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్లు) అజేయ శతకంతో చెలరేగాడు. విరాట్ సింగ్ (40 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. ఫలితంగా జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో త్రిపురను చిత్తు చేసి గెలుపు నమోదు చేసింది. సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాటీ20 ఫార్మాట్లో కెప్టెన్గా, వికెట్ కీపర్గా వ్యవహరిస్తూ ఇషాన్ కిషన్ సాధించిన మూడో సెంచరీ ఇది. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఈ చోటా డైనమైట్ నిలిచాడు.గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2018-19 సీజన్లో జార్ఖండ్ సారథిగా, వికెట్ కీపర్గా ఉంటూ రెండు శతకాలు బాదాడు ఇషాన్. అంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ టీ20 ఫార్మాట్లో మిడిల్స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) కెప్టెన్గా, వికెట్ కీపర్గా ఉంటూ రెండు సెంచరీలు చేశాడు.టీ20 క్రికెట్లో ఒకే మ్యాచ్లో కెప్టెన్గా, వికెట్ కీపర్గా ఉంటూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు🏏ఇషాన్ కిషన్ (ఇండియా)- జార్ఖండ్ తరఫున 3 శతకాలు🏏ఆడం గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- మిడిల్స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ తరఫున కలిని 2 శతకాలు🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- ముల్తాన్ సుల్తాన్స్ తరఫున 2 శతకాలు. చదవండి: నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కుండబద్దలు కొట్టిన కోహ్లి
ఎవరికీ అందనంత ఎత్తులో రోహిత్ శర్మ
సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్ 30) జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 3 సిక్సర్లు బాదిన హిట్మ్యాన్.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా (352) పాకిస్తాన్ మాజీ షాహిద్ అఫ్రిది (351) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డు విభాగంలో రోహిత్, అఫ్రిది తర్వాత 300 సిక్సర్ల మార్కు తాకిన ఏకైక ఆటగాడు విండీస్ వీరుడు క్రిస్ గేల్ (331) మాత్రమే.తాజా ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ సిక్సర్ల సంఖ్య 645కి చేరింది. ఈ విభాగంలో ఇప్పటికే టాప్ ప్లేస్లో ఉన్న అతను.. రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ విభాగంలో రోహిత్ కనుచూపు మేరలో కూడా ఎవరూ లేరు. రోహిత్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ (553) కొనసాగుతున్నాడు. ఆతర్వాతి స్థానాల్లో అఫ్రిది (476), బ్రెండన్ మెల్కల్లమ్ (398), జోస్ బట్లర్ (387) టాప్-5లో ఉన్నారు.ఇక్కడ గమనించదగ్గ ఓ విషయం ఏంటంటే.. ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న ఆటగాళ్లలో రోహిత్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఈ విభాగంలో ఐదో స్థానంలో ఉన్న జోస్ బట్లర్ హిట్మ్యాన్కు ఆమడదూరంలో ఉన్నాడు. రోహిత్కు బట్లర్కు మధ్య ఉన్న సిక్సర్ల వ్యత్యాసం ఏకంగా 258. కెరీర్ చరమాంకంలో ఉన్న బట్లర్ మహా అయితే ఇంకో 100 సిక్సర్లు కొట్టగలడు.ఈ లెక్కన అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ శర్మ పేరిట చిరకాలం ఉండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈతరం క్రికెటర్లలో ఎవరికీ మూడు ఫార్మాట్లలో కొనసాగేంత సీన్ లేదు. ఒకటి, రెండు ఫార్మాట్లతో హిట్మ్యాన్ రికార్డును బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు. కాబట్టి రోహిత్ శర్మ సిక్సర్ల శర్మగా క్రికెట్ అభిమానులకు కలకాలం గుర్తుండిపోతాడు.
IND vs AFG ODIs: ఫైనల్ వర్షార్పణం.. విజేత ఎవరంటే?
బెంగళూరు: అండర్–19 ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ వర్షం కారణంగా రద్దు అయింది. దిత్వా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ను 31 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత ‘ఎ’ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసిన దశలో వెలుతురులేమి, వర్షం కారణంగా మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత ఎంతసేపు ఎదురుచూసినా ఆట తిరిగి ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కెప్టెన్ విఫలంభారత బ్యాటర్లలో కనిష్క్ చౌహాన్ (28 నాటౌట్), అభిజ్ఞ కుందు (27) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ విహాన్ మల్హోత్రా (10), వన్ష్ ఆచార్య (2), వఫీ (2), వినీత్ (0) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్ అజీజ్ 2 వికెట్లు పడగొట్టాడు.ఈ టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్తో పాటు భారత్ ‘బి’ జట్టు కూడా పాల్గొంది. లీగ్ దశలో అఫ్గానిస్తాన్ 4 మ్యాచ్లు ఆడి మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడి 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... భారత ‘ఎ’ జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో 8 పాయింట్లతో ఫైనల్కు అర్హత సాధించింది. భారత ‘బి’ జట్టు 4 మ్యాచ్ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో చివరి స్థానంలో నిలిచింది. చదవండి: సూర్యవంశీ మరోసారి ఫెయిల్.. మాత్రే వరుస సెంచరీలు
నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కోహ్లి
సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి పాత ‘కింగ్’ను గుర్తుచేశాడు. రాంచి వేదికగా ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి శతక్కొట్టాడు. వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసి.. సింగిల్ ఫార్మాట్లో అత్యధికసార్లు వంద పరుగుల మార్కు అందుకున్న ఏకైక బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు.తన ‘విన్’టేజ్ ఆటతోనే విమర్శకులకు సమాధానం ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. టీమిండియా యాజమాన్యానికి కూడా తన ఫామ్ గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో సఫారీలపై విజయానంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు‘‘నేను వందకు 120 శాతం ఫామ్తో తిరిగి వస్తానని ఇప్పటికే చెప్పాను. ఈ మ్యాచ్ కోసం నేను పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాను. ఒకరోజు ముందుగానే ఇక్కడికి చేరుకుని ప్రాక్టీస్ చేశాను. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు.నా శరీరానికి కూడా తగినంత విశ్రాంతి, రికవరీ కోసం సమయం కావాలి. ఆట ఎలా ఉండబోతుందో ముందుగానే నా మైండ్లోనే ఓ స్పష్టతకు వచ్చేస్తాను. ఈరోజు మ్యాచ్లో ఇలా ఆడటం అద్భుతంగా అనిపించింది. తొలి 20- 25 ఓవర్ల వరకు పిచ్ బాగానే ఉంది. ఆ తర్వాత వికెట్ కాస్త నెమ్మదించింది.వెళ్లి బంతిని బాదడమే కదా అనుకున్నా. కానీ తర్వాత పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాను. ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆటను పూర్తిగా ఆస్వాదించాను. చాలా ఏళ్లుగా నేను ఇదే పని చేస్తున్నాను. గత 15-16 ఏళ్లలో 300కు పైగా వన్డేలు ఆడాను.టచ్లో ఉన్నట్లే లెక్కప్రాక్టీస్లో మనం బంతిని హిట్ చేయగలిగామంటే టచ్లో ఉన్నట్లే లెక్క. సుదీర్ఘకాలం పాటు క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయాలంటే శారీరకంగా ఫిట్గా ఉండటం ముఖ్యం. ఆటకు మానసికంగా సిద్ధంగా ఉండటం అత్యంత ముఖ్యం.కేవలం గంటల కొద్ది సాధన చేస్తేనే రాణించగలము అనే మాటను నేను పెద్దగా నమ్మను. ముందుగా చెప్పినట్లు మానసికంగా సిద్ధంగా ఉంటే ఏదైనా సాధ్యమే. నేను ప్రతిరోజూ కఠినశ్రమ చేస్తాను. క్రికెట్ ఆడుతున్నాను కాబట్టే వర్కౌట్ చేయను. జీవితంలో ఇదీ ఒక భాగం కాబట్టే చేస్తాను.అప్పటి వరకు ఆడుతూనే ఉంటానాకు నచ్చినట్లుగా జీవిస్తాను. శారీరకంగా ఫిట్గా ఉండి.. మానసికంగా ఆటను ఆస్వాదించినన్ని రోజులు క్రికెట్ ఆడుతూనే ఉంటాను’’ అని కోహ్లి కుండబద్దలు కొట్టాడు. ఇప్పట్లో తాను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని సంకేతాలు ఇచ్చాడు.కాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి నుంచి వన్డే వరల్డ్కప్-2027 ఆడతామనే హామీ రాలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గతంలో పేర్కొన్నాడు. అయితే, రో-కో వన్డేల్లో వరుసగా సత్తా చాటుతూ తాము ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నామని చాటి చెబుతున్నారు.తాజాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు చేయగా.. ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ 51 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 136 పరుగులు జోడించారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా సఫారీలను 17 పరుగులతో ఓడించి.. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్! A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025
9 ఎడిషన్ల తర్వాత వేలం.. ఖరీదైన ఆటగాడు అతడే..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో తొమ్మిది ఎడిషన్ల తర్వాత మళ్లీ ఆటగాళ్ల వేలం జరిగింది. 2012లో తొలి సీజన్ వేలం తర్వాత ఇప్పటివరకు డ్రాఫ్ట్ విధానం అమల్లో ఉండింది. అయితే రాబోయే సీజన్ కోసం ఈసారి ఆటగాళ్ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నయీమ్ను చిట్టగాంగ్ రాయల్స్ BDT 1 కోటి (USD 88000)కు కొనుగోలు చేసింది. ఈ వేలంలో కోటి టాకాల మార్క్ దాటిన ఏకైక ఆటగాడు నయీమే కావడం విశేషం. నయీమ్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా తౌహిద్ హ్రిదోయ్, లిట్టన్ దాస్ నిలిచారు. వీరిద్దరినీ రంగ్పూర్ రైడర్స్ ఫ్రాంచైజీనే సొంతం చేసుకుంది. హ్రిదోయ్ USD 73600కు, లిట్టన్ దాస్ USD 56,000కు అమ్ముడుపోయారు.బంగ్లాదేశీ వెటరన్ స్టార్లు మహ్ముదుల్లా, ముష్ఫికుర్ రహీమ్ కోసం తొలుత ఏ ఫ్రాంచైజీ బిడ్ చేయకపోయినా, చివరికి మహ్ముదుల్లాను రైడర్స్, ముష్ఫికుర్ను రాజ్షాహి వారియర్స్ వారి బేస్ ప్రైస్ BDT 35 లక్షలకు దక్కించుకున్నాయి.ఈ వేలంలో విదేశీ ప్లేయర్లు వందల సంఖ్యలో పాల్గొన్నా 90 శాతానికి పైగా అమ్ముడుపోకపోవడం మరో విశేషం. ఈ కేటగిరిలో శ్రీలంక ఆల్రౌండర్ దసున్ షనకకు అత్యధిక ధర దక్కింది. ఇతన్ని ఢాకా క్యాపిటల్స్ USD 55000కు కొనుగోలు చేసింది.కాగా, ఈ సీజన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ డిసెంబర్ 26 నుంచి జనవరి 23 వరకు జరగనుంది. ఈ సీజన్లో పాల్గొనే జట్లు.. ఢాకా క్యాపిటల్స్, రంగ్పూర్ రైడర్స్, రాజ్షాహి వారియర్స్, నోయాఖాలి ఎక్స్ప్రెస్, సిల్హెట్ టైటాన్స్, చిట్టగాంగ్ రాయల్స్.
టీమిండియాకు శుభవార్త
టీమిండియాకు శుభవార్త. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం నుంచి కోలుకునే దిశగా కీలక అడుగు వేశాడు. మెడ గాయం కారణంగా గిల్ దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్కి దూరమయ్యాడు. ఈ గాయం కారణగానే అతడు సౌతాఫ్రికాతో రెండో టెస్టు కూడా ఆడలేకపోయాడు. ఇవాళ (డిసెంబర్ 1) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో గిల్ రిహాబ్ కార్యక్రమం ప్రారంభమైందని తెలుస్తుంది. ముంబైలో విస్తృత ఫిజియోథెరపీ పూర్తి చేసిన గిల్, కుటుంబంతో కొద్ది రోజులు గడిపి, ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని సమాచారం. వైద్యులు ఆయనకు ప్రత్యేక ఫిట్నెస్ ప్రోగ్రామ్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. గాయం తర్వాత బ్యాటింగ్కి దూరంగా ఉన్న గిల్, త్వరలోనే తేలికపాటి నెట్ సెషన్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల చేసిన పలు విమాన ప్రయాణాల్లో గిల్కు ఎలాంటి అసౌకర్యం లేకపోవడం వైద్య బృందాన్ని ఉత్సాహపరుస్తోంది. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్లో గిల్ ఆడతాడా లేదా అన్నది రిహాబ్ ప్రోగ్రామ్లో అతని ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. విరాట్ కోహ్లి సూపర్ సెంచరీతో, రోహిత్, రాహుల్ అద్భుతమైన అర్ద శతకాలతో భారత్కు భారీ స్కోర్ అందించారు. ఆతర్వాత భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా అద్భుతంగా ప్రతిఘటించినా అంతిమంగా భారత్దే పైచేయి అయ్యింది. రెండో వన్డే రాయ్పూర్ వేదికగా డిసెంబర్ 3న జరుగనుంది.
అస్తవ్యస్తంగా ఉన్న భారత మిడిలార్డర్కు శాశ్వత పరిష్కారమేది..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. వెటరన్ స్టార్ విరాట్ కోహ్లి అద్భుత శతకంతో (135) చెలరేగి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.మరో వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (57), ఈ సిరీస్లో భారత కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ (60) కూడా తలో హాఫ్ సెంచరీ చేసి, గెలుపులో తనవంతు పాత్రలు పోషించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత శిబిరంలో గుబులు పుట్టించారు. అంతిమంగా భారత్దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది.సఫారీల ఆట కట్టించడంలో భారత బౌలర్లు కూడా తమవంతు పాత్ర పోషించారు. ఆదిలో అర్షదీప్, హర్షిత్ రాణా.. ఆఖర్లో కుల్దీప్ వికెట్లు తీసి సఫారీలను కట్టడి చేయగలిగారు. ఈ గెలుపుతో భారత్ టెస్ట్ సిరీస్లో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది.ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే, ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం ఓ లోపం స్పష్టంగా కనిపించింది. మిడిలార్డర్లో భారత్ అవసరం లేని ప్రయోగానికి పోయి ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది.సహజంగా ఓపెనింగ్, తప్పదనుకుంటే వన్డౌన్లో బ్యాటింగ్ చేసే రుతురాజ్ను నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దించి చేతులు కాల్చుకుంది. వాస్తవానికి రుతురాజ్ను ఆ స్థానంలో బ్యాటింగ్కు దించే అవసరం లేదు. అప్పటికే భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుండింది. రోహిత్ తర్వాత బరిలోకి దిగిన రుతు 14 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా సాధించలేక కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.రుతురాజ్ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. టెక్నికల్గా ఆలోచిస్తే, ఈ మ్యాచ్లో రుతురాజ్ కంటే తిలక్ వర్మ బెటర్ ఆప్షన్ అయ్యుండేవాడు. లేని పక్షంలో ఇన్ ఫామ్ బ్యాటర్ ధృవ్ జురెల్ కూడా మంచి ఆప్షనే. వీరిద్దరిని కాదని భారత మేనేజ్మెంట్ రుతుకు ఎందుకు ఓటు వేసిందో అర్దం కావడం లేదు.లోతుగా పరిశీలిస్తే.. ఈ మధ్యకాలంలో భారత మిడిలార్డర్ (వన్డేల్లో) అస్వవ్యస్తంగా మారిపోయింది. ఏ మ్యాచ్లో ఎవరు, ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగుతారో ఎవరికీ అర్దం కాదు. శ్రేయస్ గాయపడిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాషింగ్టన్ సుందర్కు ప్రమోషన్ ఇచ్చి ఆడిస్తున్నా, ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో అక్షర్ పటేల్ పర్వాలేదనిపించినా, సౌతాఫ్రికా సిరీస్లో అతను లేడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ను స్థిరంగా ఆడిస్తేనే మరింత మెరుగైన ఫలితాలు రావచ్చు. అయితే సందర్భానుసారం రాహుల్ తన స్థానాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి అద్భుతమైన అర్ద సెంచరీతో భారత్కు భారీ స్కోర్ను అందించాడు.ఇది తాత్కాలిక ఫలితమే కాబట్టి భారత మేనేజ్మెంట్ ఐదు, ఆరు స్థానాల కోసం స్థిరమైన బ్యాటర్లను చూసుకోవాలి. పంత్ సరైన అప్షనే అయినప్పటికీ.. కేఎల్ రాహుల్ వల్ల అది సాధ్యపడకపోచ్చు. ఇటీవలికాలంలో అద్భుతంగా రాణిస్తున్న ధృవ్ జురెల్ బెటర్ ఆప్షన్ కావచ్చు. జురెల్ వికెట్కీపింగ్ బ్యాటర్ అయినప్పటికీ, అతన్ని స్పెషలిస్ట్ బ్యాటర్గా కొనసాగించినా నష్టం లేదు. పైగా అతను ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్నాడు. లేదనుకుంటే రియాన్ పరాగ్, రింకూ సింగ్ కూడా మంచి ఆప్షన్సే. వీరిద్దరు కూడా ఈ స్థానాలకు న్యాయం చేసే అవకాశం ఉంది. రింకూతో పోలిస్తే పరాగ్కు ఆరో స్థానంలో అద్భుతంగా ఫిట్ అయ్యే అవకాశం ఉంది. అలా అని రింకూని కూడా తీసి పారేయాల్సిన అవసరం లేదు. అతను కూడా చేయి తిప్పగల సమర్థుడే. ఒకవేళ హార్దిక్ పాండ్డా జట్టులోకి వచ్చినా ఈ సమస్యకు కొంత పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే అతడు తరుచూ గాయాలతో సతమతమవుతుంటాడు. కాబట్టి రియాన్, రింకూలకు సరైన అవకాశాలు కల్పిస్తే దీర్ఘకాలం ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగే అవకాశం ఉంది.
సూర్యవంశీ మరోసారి.. మాత్రే వరుస సెంచరీలు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో నిన్న (నవంబర్ 30) పలు అద్బుత ప్రదర్శనలు నమోదయ్యాయి. యువ ఆటగాళ్లలో ఆయుశ్ మాత్రే వరుసగా సెంచరీతో విజృంభించగా.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి వారు మెరుపు సెంచరీలతో విరుచుకుపడ్డారు. యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈ టోర్నీలో వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.అభి'షేక్' సెంచరీబెంగాల్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఓవరాల్గా 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ ధాటికి పంజాబ్ రికార్డు స్థాయిలో 310 పరుగులు చేయగా.. బెంగాల్ కనీస పోరాటం కూడా చేయలేకపోయింది.విస్ఫోటనం సృష్టించిన పాకెట్ డైనమైట్త్రిపురతో జరిగిన మ్యాచ్లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (జార్ఖండ్) విస్ఫోటనం సృష్టించాడు. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో జార్ఖండ్ త్రిపురపై ఘన విజయం సాధించింది.మాత్రే వరుస సెంచరీలుముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే మూడు రోజుల వ్యవధిలో రెండో సెంచరీ చేశాడు. ఆంధ్రతో నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రే 59 బంతుల్లో అజేయమైన 104 పరుగులు చేసి తన జట్టుకు సునాయాస విజయాన్నందించాడు.వైభవ్ వరుస వైఫల్యాలుఈ టోర్నీలో యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పరంపర కొనసాగుతుంది. జమ్మూ అండ్ కశ్మీర్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేవలం 7 పరుగులకే ఔటయ్యాడు. సంచలన పేసర్, జమ్మూ అండ్ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ వైభవ్ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్లో బిహార్పై జమ్మూ అండ్ కశ్మీర్ ఘన విజయం సాధించింది.ఇవే కాక నిన్న మరిన్ని చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదయ్యాయి. సంజూ శాంసన్, రజత్ పాటిదార్, రింకూ సింగ్, కరుణ్ నాయర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి నోటెడ్ స్టార్లు మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.
IND Vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా
ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) టీమిండియా గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి వన్డేలో (India vs South Africa) ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో భారత జట్టు సఫారీలకు చుక్కలు చూపించింది.విరాట్ కోహ్లి (Virat Kohli) 52వ వన్డే శతకంతో చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) కూడా అర్ద సెంచరీలతో సత్తా చాటారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆదిలో తబడిన సౌతాఫ్రికా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి టీమిండియా శిబిరంలో గుబులు పుట్టించారు. అంతింగా భారత్దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది. 49.2 ఓవర్లలో ఆ జట్టు 332 పరుగులు చేసి లక్ష్యానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఈ మ్యాచ్లో ఓడినా సౌతాఫ్రికా (South Africa) ఓ విషయంలో చరిత్ర సృష్టించింది. వన్డే లక్ష్య ఛేదనల్లో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయి అంతిమంగా 300 పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీనికి ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2019లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ లక్ష్య ఛేదనలో 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, అంతిమంగా 297 పరుగులు చేసింది.
టిమ్ డేవిడ్ విలయతాండవం
అబుదాబీ టీ10 లీగ్ (Abu Dhabi T10 League) 2025 ఎడిషన్లో యూఏఈ బుల్స్ (UAE Bulls) విజేతగా ఆవిర్భవించింది. నిన్న (నవంబర్ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్ స్టాల్లియన్స్పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగుల ఊహకందని స్కోర్ చేసింది.బుల్స్కు ఆడుతున్న ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు టిమ్ డేవిడ్ (Tim David) కేవలం 30 బంతుల్లో 12 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. మిగతా ఆటగాళ్లలో రోవ్మన్ పావెల్ 20 బంతుల్లో 24 (నాటౌట్), ఫిల్ సాల్ట్ 8 బంతుల్లో 18 పరుగులు చేశారు. జేమ్స్ విన్స్ డకౌటయ్యాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్టాల్లియన్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ కమ్ కెప్టెన్ రహ్మానుల్లా గుర్బాజ్ (15 బంతుల్లో 18) సహా అంతా నిదానంగా ఆడారు. ఆండీ ఫ్లెచర్ 2 (రిటైర్డ్ హర్ట్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ డకౌట్, డు ప్లూయ్ 16, కట్టింగ్ 11, కరీమ్ జనత్ 15, సామ్ బిల్లింగ్స్ 3 పరుగులు మాత్రమే చేశారు. సిక్సర్ల సునామీ సృష్టించి యూఏఈని ఒంటిచేత్తో గెలిపించిన టిమ్ డేవిడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 9 సీజన్ల లీగ్ చరిత్రలో యూఏఈ బుల్స్కు ఇదే మొదటి టైటిల్.
రొనాల్డో కల నెరవేరిన వేళ.. పోర్చు‘గోల్’ చేరింది!
దోహ: పోర్చుగల్ ఫుట్బాల్ అంటే ముందుగా గుర్తుకొచ్...
ఆర్చరీలో చికితకు రజతం
జైపూర్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ (కేఐయూజీ)...
భారత్ శుభారంభం
చెన్నై: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల జూనియర్ ప్ర...
రూ.1750 నుంచి రూ.13,500 వరకు...
సాక్షి, హైదరాబాద్: ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా...
అస్తవ్యస్తంగా ఉన్న భారత మిడిలార్డర్కు శాశ్వత పరిష్కారమేది..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన...
సూర్యవంశీ మరోసారి.. మాత్రే వరుస సెంచరీలు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో నిన్న (నవంబర్...
IND Vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా
ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్లో దక్షిణాఫ్రికా చేతిల...
టిమ్ డేవిడ్ విలయతాండవం
అబుదాబీ టీ10 లీగ్ (Abu Dhabi T10 League) 2025 ఎడి...
క్రీడలు
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
ఉత్సాహంగా వైజాగ్ మారథాన్ ర్యాలీ (ఫొటోలు)
హైదరాబాద్కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
ధోనీ కేరళ వస్తే? ఇది ఏఐ అని చెబితే తప్ప తెలియదు (ఫొటోలు)
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసిన గీతా బస్రా, హర్భజన్ దంపతులు (ఫొటోలు)
ప్రీ మెచ్యూర్డ్ చిల్డ్రన్స్ కు ‘ప్రీమిథాన్’ (ఫొటోలు)
మంధాన పెళ్లి షురూ.. సంగీత్లో వరల్డ్ కప్ స్టార్స్ డాన్స్ (ఫోటోలు)
లేడీ క్రికెటర్ స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్ (ఫొటోలు)
నా జీవితంలోని ఆల్రౌండర్కు హ్యాపీ బర్త్ డే: సూర్యకుమార్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
వీడియోలు
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
స్మృతి మందాన పెళ్లి రద్దు? వేరే అమ్మాయితో పలాస్ డేటింగ్!
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
Nikhat Zareen: అదరగొట్టిన తెలంగాణ బాక్సర్.. గోల్డ్ మెడల్
గిల్ అనుమానమే..!
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
