Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

East Bengal achieves a record victory in the Indian Womens Football League1
గుగులోత్‌ సౌమ్య ‘హ్యాట్రిక్‌’

కోల్‌కతా: భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్‌ గుగులోత్‌ సౌమ్య... భారత మహిళల లీగ్‌ (ఐడబ్ల్యూఎల్‌)లో ‘హ్యాట్రిక్‌’తో విజృంభించింది. లీగ్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు తరఫున ఆడుతున్న గుగులోత్‌ సౌమ్య... మ్యాచ్‌ ఆరంభం నుంచి చివరి వరకు తన ఆటతీరుతో కట్టిపడేసింది. సౌమ్యతో పాటు ఫాజిలా కూడా హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టడంతో... భారత మహిళల లీగ్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు రికార్డు విజయం ఖాతాలో వేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు 9–0 గోల్స్‌ తేడాతో... సెసా ఫుట్‌బాల్‌ అకాడమీపై విజయం సాధించింది. సౌమ్య (6వ, 54వ, 86వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో దుమ్ము రేపగా... ఫాజిలా ఇక్వాపుట్‌ (9వ, 22వ, 25వ, 72వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో సత్తా చాటింది. సులాజన రౌల్‌ (18వ నిమిషంలో), రెస్టీ నాన్‌జిరి (40వ నిమిషంలో) చెరో గోల్‌ చేశారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు తమ స్థాయిని ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ 9 పాయింట్లతో... పట్టిక రెండో స్థానంలో ఉంది. నీతా ఫుట్‌బాల్‌ అకాడమీ 4 మ్యాచ్‌లాడి మూడు విజయాలు ఒక ‘డ్రా’తో 10 పాయింట్లతో ‘టాప్‌’లో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం నీతా ఫుట్‌బాల్‌ అకాడమీతో ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్‌ ఆరంభమైన ఆరో నిమిషంలోనే సుష్మిత చక్కటి అవకాశాన్ని కల్పించుకొని ప్రత్యర్థి పోస్ట్‌పై దాడి చేయగా... ప్రత్యర్థి గోల్‌కీపర్‌ దాన్ని అడ్డుకుంది. అయితే బాక్స్‌ సమీపంలో బంతిని అందుకున్న తెలంగాణ స్ట్రయికర్‌ సౌమ్య... గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ చక్కటి గోల్‌తో ఈస్ట్‌ బెంగాల్‌ ఖాతా తెరిచింది. మరో మూడు నిమిషాల తర్వాత సుష్మిత డీప్‌ నుంచి ఇచ్చిన పాస్‌ను చక్కగా అందుకున్న షాజిలా మరో గోల్‌తో జట్టు స్కోరును రెట్టింపు చేసింది. ఇక అక్కడి నుంచి ఈస్ట్‌ బెంగాల్‌ పదేపదే దాడులతో రెచ్చిపోగా... వాటిని అడ్డుకోవడంలో సెసా జట్టు విఫలమైంది. ఈ క్రమంలో మూడు నిమిషాల వ్యవధిలో మరో రెండు గోల్స్‌ కొట్టిన ఫాజిలా ‘హ్యాట్రిక్‌ పూర్తి చేసుకోగా... సులాజన రౌల్, రెస్టీ చెరో గోల్‌ సాధించారు. దీంతో హాఫ్‌ టైమ్‌ ముగిసే సరికి ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు 6–0తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలో సౌమ్య చెలరేగి మరో రెండు గోల్స్‌ బాదగా... ఫాజిలా మరో గోల్‌ చేసింది. దీంతో ఈస్ట్‌బెంగాల్‌ జట్టు భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ఈస్ట్‌బెంగాల్‌ జట్టు తరఫున ఆల్‌టైమ్‌ టాప్‌ గోల్‌ స్కోరర్‌ (11)గా సౌమ్య నిలిచింది.

Bradman baggy green cap up for auction2
వేలానికి బ్రాడ్‌మన్‌ ‘బ్యాగీ గ్రీన్‌’

సిడ్నీ: క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌కు చెందిన మరో ‘బ్యాగీ గ్రీన్‌’ క్యాప్‌ అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. 1947–48 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో బ్రాడ్‌మన్‌ ఈ క్యాప్‌ ధరించాడు. ఈ సిరీస్‌లో 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 178.75 సగటుతో బ్రాడ్‌మన్‌ 715 పరుగులు (ఇందులో ఒక డబుల్‌ సెంచరీ, 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి) సాధించాడు. బ్రాడ్‌మన్‌ తన కెరీర్‌లో భారత్‌తో ఆడిన ఏకైక సిరీస్‌ ఇదే కాగా...స్వాతంత్య్రం లభించిన తర్వాత భారత క్రికెట్‌ జట్టు తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.ఈతరంలో ఆ్రస్టేలియా క్రికెటర్లకు ఒక సారి అరంగేట్ర సమయంలో బ్యాగీ గ్రీన్‌ ఇస్తే కెరీర్‌ చివరి వరకు దానినే వాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే నాటి రోజుల్లో ప్రతీ సిరీస్‌కు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు కొత్త బ్యాగీ గ్రీన్‌ క్యాప్‌ను అందించేవారు. అందు వల్లే బ్రాడ్‌మన్‌కు చెందిన పలు క్యాప్‌లు వేర్వేరు మ్యూజియంలలో ఉండగా, ఇతర క్యాప్‌లు, జ్ఞాపికలను పలువురు ప్రైవేట్‌ వ్యక్తులు వేలం ద్వారా సొంతం చేసుకున్నారు. 1947–48 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టుకు శ్రీరంగ వాసుదేవ్‌ సొహొని ప్రాతినిధ్యం వహించాడు. సిరీస్‌ ముగిసిన అనంతరం వాసుదేవ్‌కు బ్రాడ్‌మన్‌ తన క్యాప్‌ను కానుకగా అందించాడు. గత 78 ఏళ్లుగా ఈ క్యాప్‌ వాసుదేవ్‌ కుటుంబం వద్దే ఉంది. ఇప్పుడు దీనిని ప్రముఖ ఆక్షనర్‌ లీ హేమ్స్‌ వేలం వేస్తున్నాడు. జనవరి 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి భారీ మొత్తం పలికే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సిరీస్‌లో బ్రాడ్‌మన్‌ ధరించిన మరో క్యాప్‌ను వేలం వేస్తే దానికి రూ.2.63 కోట్లు లభించాయి.

Bindra led task force report to sports ministry3
ముందుగా వ్యవస్థను మార్చండి!

న్యూఢిల్లీ: క్రీడల్లో విజేతల్ని చూడాలంటే ఇప్పుడున్న క్రీడా వ్యవస్థని సమూలంగా మార్చాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్‌ సూచించింది. మాజీ ఒలింపిక్‌ చాంపియన్‌ అభినవ్‌ బింద్రా నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ మంగళవారం క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు తుది నివేదికను సమర్పించింది. 170 పేజీల నివేదికలో పలు కీలకమైన సిఫార్సులతో పాటు వేళ్లూనుకుపోయిన వ్యవస్థీకృత లోటుపాట్లను టాస్క్ఫోర్స్‌ ఎండగట్టింది. రాష్ట్ర క్రీడా సంఘాలు, జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌)లన్నీ సంస్థాగత లోపాలతో మునిగిపోయాయని, క్రీడా పరిపాలకుల్లో సరైన అథ్లెట్లే లేరని టాస్‌్కఫోర్స్‌ ఎత్తి చూపింది. ఉన్నా ఒకరిద్దరిలో అర్హతలు, సమర్థత లేనివారేనని గుర్తించింది. ప్రస్తుత క్రీడా వ్యవస్థపై టాస్క్‌ఫోర్స్‌ లోతుగా అధ్యయనం చేసింది. ఏదో అరకొరగా, ఒకరిద్దరితో తమ భేటీని ముగించలేదని... అథ్లెట్లు, ప్రభుత్వ అధికారులు, ‘సాయ్‌’ వర్గాలు, రాష్ట్ర, కేంద్ర క్రీడా సంఘాలు, సమాఖ్యలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు, అంతర్జాతీయ సంస్థలతోనూ టాస్‌్కఫోర్స్‌ చర్చించింది. అంతర్జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ప్యానెల్‌ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) మాజీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ (మాజీ ఒలింపిక్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌), ప్రస్తుత అధ్యక్షుడు కిర్‌స్టీ కొవెంట్రీ (మాజీ ఒలింపిక్‌ చాంపియన్‌), ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) చీఫ్‌ సెబాస్టియన్‌ కొ (మాజీ ఒలింపిక్‌ మిడిల్‌డిస్టెన్స్‌ రన్నింగ్‌ చాంపియన్‌)లతో చర్చించింది. » రాష్ట్ర సంఘాలు, జాతీయ సమాఖ్యలు, స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడానికి, ముఖ్యంగా క్రీడా శిక్షణకు, క్రీడా పరిపాలన నియంత్రణకు జాతీయ స్థాయిలో సమన్వయ మండలి అవసరమని బింద్రా కమిటీ సూచించింది. ఇందుకోసం కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జాతీయ క్రీడా శిక్షణ–సమర్థ నిర్వహణ మండలి (ఎన్‌సీఎస్‌ఈసీబీ) ఏర్పాటు చేయాలని అందులో పేర్కొంది. » ప్రస్తుత క్రీడా పాలనలో గుణాత్మక మార్పు రావాలని, సుప్తావస్థని రూపుమాపేలా కొన్ని కఠినమైన నిర్ణయాలు, నిర్మాణాత్మక సిఫార్సుల్ని బింద్రా టాస్‌్కఫోర్స్‌ సూచించింది. » ‘సాయ్‌’కి గానీ, రాష్ట్ర క్రీడాశాఖల్లో గానీ నిబద్ధత, సమర్థత కలిగిన కార్యాలయ సిబ్బందే లేదు. సాధారణ అధికారులు లేదంటే కాంట్రాక్టు సిబ్బందితో ఆయా పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఇది తూతూ మంత్రంగా పనులు చక్కబెడుతోంది. తద్వారా పాలక వ్యవస్థనే నీరుగారుస్తోంది. » క్రీడా పాలనలో అథ్లెట్లకు సరైన మార్గ నిర్దేశనమే లేదు. ఉదాహరణకు జాతీయ క్రీడా పాలసీ ప్రకారం క్రీడా సమాఖ్య కార్యవర్గాల్లో అథ్లెట్లను తప్పనిసరి చేసినప్పటికీ ఆయా అథ్లెట్లు కార్యనిర్వహణలో రాణించేలా ఎలాంటి శిక్షణ వ్యవస్థ లేదు. » దేశంలో ఇప్పటికీ క్రీడాకారుల వృద్ధి కోసం దీర్ఘకాలిక అభివృద్ధి మండలిలాంటిది ఏదీ లేదు. ఇదే ఉంటే విద్య, అథ్లెట్‌ కెరీర్‌కు సంబంధించి సంయుక్త ప్రణాళిక, కెరీర్‌ ఓరియంటేషన్‌ కార్యక్రమం సరైన మార్గంలో సాగేది.

Sri Lanka lost the final T20 by 15 runs4
భారత్‌ 5.. శ్రీలంక 0

ఫార్మాటే మారింది. కానీ జోరు ఏమాత్రం మారలేదు. తొలిసారి వన్డే ప్రపంచకప్‌ సాధించిన ఊపుమీదున్న భారత మహిళల జట్టు ఇదే ఉత్సాహంతో పొట్టి ఫార్మాట్‌లో శ్రీలంకను గట్టిదెబ్బ కొట్టింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత్‌ 5–0తో వైట్‌వాష్‌ చేసింది. ఆడినవన్నీ ఓడిన చమరి ఆటపట్టు సేన నిరాశగా వెనుదిరుగుతోంది.తిరువనంతపురం: ఆఖరి పోరులోనూ భారత అమ్మాయిలే హోరెత్తించారు. ఫలితంగా ఐదు టి20ల సిరీస్‌ను 5–0తో హర్మన్‌ సేన చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన చివరి సమరంలో భారత్‌ 15 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేసింది. హైదరాబాదీ ఆల్‌రౌండర్‌ అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) డెత్‌ ఓవర్లలో దంచేసింది. ప్రత్యర్థి బౌలర్లలో కవీశా దిల్హరి, రష్మిక, చమరి తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. హాసిని (42 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్‌), ఇమిషా దులాని (39 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించారు. ఈ టోర్నీలో నిలకడగా రాణించి 241 పరుగులు చేసిన షఫాలీ వర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది.ఆదుకున్న హర్మన్‌ మొదట బ్యాటింగ్‌కు దిగగానే భారత్‌ దెబ్బమీద దెబ్బతో కుదేలైంది. షఫాలీ (5), తొలి మ్యాచ్‌ ఆడుతుతన్న కమలిని (12), హర్లీన్‌ డియోల్‌ (13), రిచా ఘోష్‌ (5), దీప్తిశర్మ (7) ఇలా ప్రధాన బ్యాటింగ్‌ బలగాన్ని కోల్పోయి 77/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. అమన్‌జోత్‌ (21)తో కలిసి వికెట్‌ కాపాడుకుంటూనే పరుగుల వేగం పెంచింది. దీంతో 14.2 ఓవర్లో భారత్‌ స్కోరు 100కు చేరింది. హర్మన్‌ 35 బంతుల్లో ఫిఫ్టీని పూర్తిచేసుకుంది. సిక్స్, ఫోర్‌ కొట్టిన ఉత్సాహంలో ఉన్న అమన్‌ను రష్మిక అవుట్‌ చేయడంతో ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 4 పరుగుల వ్యవధిలో 142 స్కోరు వద్ద హర్మన్‌ ఏడో వికెట్‌గా వెనుదిరిగింది. హాసిని, ఇమిషా ఫిఫ్టీ–ఫిఫ్టీ లంక లక్ష్యఛేదన ఆరంభంలోనే చమరి (2) వికెట్‌ను కోల్పోయినప్పటికీ హాసిని, ఇమిషా రాణించడంతో 11 ఓవర్ల వరకు మరో వికెట్‌ను కోల్పోలేదు. 86/1 స్కోరు వద్ద శ్రీలంక గెలిచేలా కనిపించింది. కానీ అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే ఇమిషా అవుటయ్యాక లంక తిరోగమించింది. నీలాక్షిక (3), కవీశా (5), హర్షిత (8), కౌశిని (1) విఫలమయ్యారు. దీంతో శ్రీలంక లక్ష్యానికి దూరమైంది. 89వ మ్యాచ్‌ ఆడుతున్న ఓపెనర్‌ హాసిని ఎట్టకేలకు ఒక ఫిఫ్టీని ఈ మ్యాచ్‌ ద్వారా సాధించగలిగింది. దీప్తి, అరుంధతీ, స్నేహ్, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జోత్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. తమిళనాడుకు చెందిన గుణాలన్‌ కమలిని ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. భారత్‌ తరఫున టి20 మ్యాచ్‌లు ఆడిన 90వ క్రీడాకారిణిగా కమలిని గుర్తింపు పొందింది. 17 ఏళ్ల కమలిని ఈ ఏడాది ఆరంభంలో అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. సీనియర్‌ మహిళల టి20 టోర్నీలో తమిళనాడు తరఫున టాప్‌స్కోరర్‌ (297 పరుగులు)గా నిలవడంతో ఆమెకు భారత జట్టులో అవకాశం లభించింది. చివరి టి20లో కమలిని, రేణుకా ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌...స్మృతి మంధానకు విశ్రాంతినిచ్చి స్నేహ్‌ రాణాను తప్పించింది.20వ ఓవర్లో 20హైదరాబాదీ క్రికెటర్‌ అరుంధతీ డెత్‌ ఓవర్లలో చేసిన పరుగులే మ్యాచ్‌ విజయంలో కీలకమయ్యాయి. హర్మన్‌ అవుటయ్యే సమయానికి జట్టు స్కోరు 150ని కూడా చేరుకోలేదు. ఈ దశలో స్నేహ్‌ రాణా అండతో అరుంధతి ఆఖర్లో చెలరేగింది. 19వ ఓవర్‌ ముగిసేసరికి భారత్‌ స్కోరు 155/7 కాగా... మదర వేసిన ఆఖరి ఓవర్లో అరుంధతి విరుచుకుపడింది. మొదటి 5 బంతులాడిన ఆమె వరుసగా 4, 1(వైడ్‌), 6, 4, 4, 1లతో 19 పరుగులు పిండుకుంది. చివరి బంతికి స్నేహ్‌ రాణా పరుగు చేయలేదు. వైడ్‌ సహా 20వ ఓవర్లో 20 పరుగులొచ్చాయి.152 భారత బౌలర్‌ దీప్తిశర్మ తీసిన వికెట్లు. అంతర్జాతీయ టి20లో అత్యధిక వికెట్లు (152) తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కింది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) ఇమిషా (బి) నిమషా 5; కమలిని (ఎల్బీడబ్ల్యూ) (బి) కవీశా 12; హర్లీన్‌ (బి) రష్మిక 13; హర్మన్‌ప్రీత్‌ (బి) కవీశా 68; రిచా ఘోష్‌ (సి) కౌశిని (బి) చమరి 5; దీప్తిశర్మ (సి) నిమషా (బి) చమరి 7; అమన్‌జోత్‌ (సి) కవీశా (బి) రష్మిక 21; అరుంధతీ (నాటౌట్‌) 27; స్నేహ్‌ రాణా (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–5, 2–27, 3–41, 4–64, 5–77, 6–138, 7–142. బౌలింగ్‌: మాల్కి మదర 4–0–37–0, నిమషా మీపగె 3–0–25–1, కవీశా దిల్హరి 2–0–11–2, ఇనొక 4–0–39–0, రష్మిక 4–0–42–2, చమరి 3–0–21–2. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్‌: హాసిని (బి) శ్రీచరణి 65; చమరి (సి) వైష్ణవి (బి) అరుంధతీ 2; ఇమిషా (సి) షఫాలీ (బి) అమన్‌జోత్‌ 50; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 3; కవీశా (బి) వైష్ణవి 5; హర్షిత (సి) హర్లీన్‌ (బి) స్నేహ్‌ రాణా 8; కౌశిని రనౌట్‌ 1; రష్మిక (నాటౌట్‌) 14; మదర (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–86, 3–100, 4–107, 5–132, 6–140, 7–140. బౌలింగ్‌: దీప్తి శర్మ 4–0–28–1, అరుంధతీ 2–0–16–1, స్నేహ్‌ రాణా 4–0–31–1, వైష్ణవి 4–0–33–1, శ్రీచరణి 4–0–31–1, అమన్‌జోత్‌ 2–0–17–1.

Indian player Arjun Erigaisi lost in the semis5
అర్జున్‌కు కాంస్యం

దోహా: ‘ఫిడే’ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌ ర్యాపిడ్‌ విభాగంలో మూడో స్థానం సాధించిన భారత ఆటగాడు, తెలంగాణకు చెందిన అర్జున్‌ ఇరిగేశికి బ్లిట్జ్‌ విభాగంలోనూ కాంస్య పతకం దక్కింది. మంగళవారం జరిగిన బ్లిట్జ్‌ ఈవెంట్‌ తొలి సెమీ ఫైనల్లో అర్జున్‌ 0.5–2.5 తేడాతో అబ్దుస్సత్తొరొవ్‌ నొదిర్‌బెక్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో ఈ మెగా టోర్నీలో అర్జున్‌ రెండో కాంస్యానికి పరిమితమయ్యాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఒకే వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ రెండు విభాగాల్లో (ర్యాపిడ్, బ్లిట్జ్‌) పతకాలు సాధించిన రెండో భారత ఆటగాడిగా అర్జున్‌ నిలవడం విశేషం. సత్తొరొవ్‌తో జరిగిన పోరులో తొలి రెండు గేమ్‌లలో అర్జున్‌ వరుసగా 47 ఎత్తుల్లో, 83 ఎత్తుల్లో పరాజయంపాలయ్యాడు. తప్పనిసరిగా నెగ్గాల్సిన మూడో గేమ్‌ 33 ఎత్తుల తర్వాత ‘డ్రా’గా ముగిసింది. దాంతో నాలుగో గేమ్‌ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే అర్జున్‌ ఓటమి ఖాయమైంది. రెండో సెమీఫైనల్లో కార్ల్‌సన్‌ చేతిలో 1–3తో ఫాబియానో కరువానా (అమెరికా) ఓటమిపాలయ్యాడు. టోర్నీ నిబంధనల ప్రకారం సెమీస్‌లో ఓడిన అర్జున్, కరువానాలిద్దరికీ కాంస్యం అందించారు. వీరిద్దరికి చెరో 28 వేల యూరోలు (సుమారు రూ.30 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీస్‌ టైబ్రేక్‌కు ముందు జరిగిన రెగ్యులర్‌ రౌండ్లలో అర్జున్‌ 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆడిన 19 రౌండ్లలో 12 గెలిచి 6 డ్రా చేసుకొని ఒకటి మాత్రమే ఓడిన అర్జున్‌ నంబర్‌వన్‌గా ముగించాడు. అర్జున్‌తో పాటు టాప్‌–4లో నిలిచిన కరువానా (14), కార్ల్‌సన్‌ (13.5), అబ్దుస్సత్తొరొవ్‌ (13) సెమీ ఫైనల్‌కు అర్హత సాధించారు.

Magnus Carlsen becomes world champion for the 20th time6
20వ సారి ప్రపంచ చాంపియన్‌గా...

దిగ్గజ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) బ్లిట్జ్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ చాంపియన్‌ షిప్‌లో అతను ర్యాపిడ్‌ విభాగంలోనూ విజేతగా నిలిచాడు. ఫైనల్లో కార్ల్‌సన్‌ 2.5–1.5 తేడాతో అబ్దుస్సత్తొరొవ్‌పై విజయం సాధించాడు. తుది పోరు తొలి గేమ్‌లో ఓడిన అనంతరం కోలుకున్న కార్ల్‌సన్‌ రెండో గేమ్‌ను గెలుచుకున్నాడు. మూడో గేమ్‌ ‘డ్రా’గా ముగియగా...నాలుగో గేమ్‌లో నల్లపావులతో ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అసాధారణ కెరీర్‌లో కార్ల్‌సన్‌ అన్ని ఫార్మాట్‌లు కలిపి 20వ సారి ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. 2025లో మొత్తంగా కార్ల్‌సన్‌ 10 టోర్నీల్లో విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో బిబిసార అసౌబయెవా (కజకిస్తాన్‌) బ్లిట్జ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 2.5–1.5 తేడాతో అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించింది. 21 ఏళ్ల బిబిసార వరల్డ్‌ బ్లిట్జ్‌లో విజేతగా నిలవడం ఇది మూడో సారి కావడం విశేషం.

India Women won by 15 runs On Srilanka7
టీమిండియా క్లీన్‌స్వీప్‌

శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. చివరిదైన ఐదో టీ20లో గెలిచి టీమిండియా తన జైత్ర యత్రను కొనసాగించింది. ఐదో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. శ్రీలంక బ్యాటర్లలో హాసిని పెరీరా(65), ఇమేషా దులాని(50)లు రాణించినా జట్టుకు విజయం చేకూర్చలేకపోయారు. భారత మహిళా బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్‌ రానా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్‌ జ్యోత్‌ కౌర్‌లు తలో వికెట్‌ తీసి విజయానికి సహకరించారు.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్‌) చెలరేగగా.. ఆఖర్లో అమన్‌జోత్‌ కౌర్‌ (18 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్‌ కమలిని 12, హర్లీన్‌ డియోల్‌ 13, రిచా ఘోష్‌ 5, దీప్తి శర్మ 7, స్నేహ్‌ రాణా (8 నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్‌ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్‌ పడగొట్టింది.

INDW VS SLW 5th T20I: sri lanka restricted team india to 175 runs8
హర్మన్‌ప్రీత్‌ మెరుపులు.. శ్రీలంక టార్గెట్‌ ఎంతంటే..?

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్‌) చెలరేగగా.. ఆఖర్లో అమన్‌జోత్‌ కౌర్‌ (18 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్‌ కమలిని 12, హర్లీన్‌ డియోల్‌ 13, రిచా ఘోష్‌ 5, దీప్తి శర్మ 7, స్నేహ్‌ రాణా (8 నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్‌ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్‌ పడగొట్టింది.కాగా, స్వదేశంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకొని, క్లీన్‌ స్వీప్‌ దిశగా అడుగులు వేస్తుంది.

Former Sri Lanka U19 star Akshu Fernando passes away after battling Coma9
శ్రీలంక క్రికెటర్‌ కన్నుమూత

శ్రీలంక మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో కన్నుమూశాడు. 2018 డిసెంబర్‌లో జరిగిన రైల్వే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఏడేళ్లు అపస్మారక స్థితిలో ఉండి ఇవాళ (డిసెంబర్‌ 30) ఉదయం తుదిశ్వాస విడిచాడు. కొలొంబోకు సమీపంలో గల మౌంట్ లవినియా బీచ్ వద్ద రక్షణలేని ట్రాక్ దాటుతుండగా ఆక్షుని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలో చాలా చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో లైఫ్ సపోర్ట్‌పై ఉంచారు. ప్రమాదం జరిగిన నాటికి అక్షు వయసు 27 ఏళ్లు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందు అక్షు ఓ స్థానిక టోర్నీ ఆడాడు. అందులో రగామా క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అక్షు మరణం శ్రీలంక క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బంగారు భవిష్యత్తు కలిగిన అక్షు దురదృష్టకర రీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్నే బాధిస్తుంది.అక్షు న్యూజిలాండ్‌లో జరిగిన 2010 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలో కెనడాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో కీలక పరుగులు చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికాపై క్వార్టర్ ఫైనల్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లో 52 పరుగులు (88 బంతుల్లో) చేశాడు. ఆ టోర్నీలో అక్షు వ్యక్తిగతంగా రాణించినా, శ్రీలంక నాలుగో స్థానంలో ముగించింది.

INDW VS SLW 5th T20I: Sri Lanka Won the Toss and choose to Bowl10
శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్‌.. స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌

స్వదేశంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకొని, క్లీన్‌ స్వీప్‌ దిశగా అడుగులు వేస్తుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్‌ 30) నామమాత్రపు ఐదో మ్యాచ్‌ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్‌ తరఫున స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధన, రేణుక సింగ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహ్‌ రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌తోనే కమిలిని అరంగేట్రం చేస్తుంది.శ్రీలంక విషయానికొస్తే.. మల్షా శేషని, కావ్యా కవిండి స్థానాల్లో ఇనోకా రణవీరా, మల్కి మదారా తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), ఇనోకా రణవీరా, మల్కి మదారా, రష్మిక సెవ్వంది, నిమేషా మదుషానిభారత్‌: షఫాలీ వర్మ, స్నేహ్‌ రాణా, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, కమిలిని, శ్రీ చరణి

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement