Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Khaled Mahmud, Talha storm out over mismanagement1
షాకింగ్‌.. అలిగి ఆటోలో వెళ్లిపోయిన హెడ్‌ కోచ్‌

బంగ్లాదేశ్‌లో ఓ వైపు అల్లర్లు కొనసాగుతుంటే.. మరోవైపు క్రికెట్ అభిమానులను అలరించేందుకు బీపీఎల్ 12వ సీజ‌న్ సిద్ద‌మైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025-26 శుక్ర‌వారం(డిసెంబ‌ర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఆరంభం రోజే రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా సిల్హెట్ టైటాన్స్, రాజ్‌షాహి వారియర్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.ఆ త‌ర్వాతి మ్యాచ్‌లో నోఖాలి ఎక్స్‌ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. నోఖాలి ఎక్స్‌ప్రెస్.. బీపీఎల్‌లో చేరిన కొత్త ఫ్రాంచైజీ. ఈ జ‌ట్టుకు ఇదే తొలి సీజ‌న్‌. అయితే నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్.. ఛటోగ్రామ్ రాయల్స్‌తో తమ మొదటి మ్యాచ్‌కు స‌న్న‌ద్ద‌మ‌య్యేందుకు గురువారం సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెల్ళింది.అలిగిన కోచ్‌లు..అయితే ప్రాక్టీస్ మధ్యలోనే హెడ్ కోచ్ ఖలీద్ మహముద్, అసిస్టెంట్ కోచ్ తల్హా జుబేర్ బయటకు వచ్చేయడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్రాక్టీస్ సెషన్‌లో కనీసం సరిపడా క్రికెట్ బంతులు కూడా లేకపోవడంతో వారిద్ద‌రూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. బంగ్లాదేశ్ మాజీ పేస‌ర్ అయిన ఖలీద్ మహముద్ గ‌త సీజ‌న్ వ‌ర‌కు ఢాకా క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్‌గా ప‌నిచేశాడు. అయితే ఈ సీజ‌న్‌లో ఫ్రాంచైజీ నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్‌తో జ‌త క‌ట్టాడు.కానీ అత‌డికి ఆరంభంలోనే చేదు అనుభ‌వం ఎదురైంది. ప్రాక్టీస్‌కు జ‌ట్టుతో పాటు వెళ్లిన ఖలీద్ మహముద్‌తో బీసీబీ అధికారి ఒక‌రు దురుసుగా ప్రవర్తించిన‌ట్లు స‌మాచారం. దీంతో ఖలీద్,జుబేర్ ఇద్ద‌రూ స్టేడియం బ‌య‌ట‌కు వ‌చ్చి ఆటోలో వెళ్లిపోయారు. ఈ సంద‌ర్భంగా జుబేర్ మీడియాతో మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఎన్నో బీపీఎల్ సీజ‌న్ల‌ను చూశాను. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ప‌రిస్ధితి ఎప్పుడూ ఎదురు కాలేదు. మిగతా వారు గురుంచి నాకు అన‌వ‌స‌రం. ఇలాంటి ప‌రిస్థితుల్లో నేను కొనసాగలేను పేర్కొన్నారు.అదేవిధంగా హెడ్ కోచ్ ఖలీద్ మహముద్ స్పందిస్తూ.. నేను బీపీఎల్ నుంచి వైదొల‌గాల‌నుకుంటున్నాను. ఇటువంటి ప‌రిస్థితి ఎప్పుడూ చూడ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అయితే కొన్ని గంటల తర్వాత మహమూద్, జుబేర్ తిరిగి మైదానంకు వ‌చ్చారు.ఇద్దరి సన్నిహితుడు ఒక‌రు జోక్యంతో వారు మ‌న‌సు మార్చుకున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మ‌రోషాక్ త‌గిలింది. ఛటోగ్రామ్ రాయల్స్ జట్టు యాజ‌మాన్యం టోర్నీ ఆరంభానికి ముందు తప్పుకొంది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఆ ఫ్రాంచైజీ బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది.చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్‌..

Jasprit Bumrah will replace Suryakumar Yadav as Indias T20I captain: Reports2
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ పేలవ ఫామ్‌తో స‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కెప్టెన్‌గా జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపిస్తున్న‌ప్ప‌టికి..వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌రంగా మాత్రం దారుణంగా విఫ‌ల‌మవుతున్నాడు. 2025 ఏడాది అత‌డి కెరీర్‌లో ఒక పీడ‌క‌ల‌ల మిగిలిపోనుంది. ఆసియాక‌ప్‌ వంటి మేజ‌ర్ టైటిల్స్ సాధించిన‌ప్ప‌టికి.. ఒక ఆట‌గాడిగా మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ ఏడాది కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించ‌లేక‌పోయాడు. ఈ ఏడాది మొత్తంగా 21 అంతర్జాతీయ టీ20లు ఆడిన సూర్యకుమార్‌.. 13.62 సగటుతో కేవలం 218 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్‌ 47గా ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కూడా కేవలం 34 పరుగులు (12, 5, 12, 5) మాత్రమే చేశాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌-2026 తర్వాత సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ముందే సూర్యపై వేటు వేయాలని సెలక్టర్లు భావించినప్పటికి.. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ముందు ప్రయోగాలు ఎందకని తమ నిర్ణయాన్ని మార్చుకున్నారంట.కెప్టెన్‌గా బుమ్రా..!అయితే భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తదుపరి కెప్టెన్‌గా బుమ్రా పేరును సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బుమ్రాకు కెప్టెన్‌గా పెద్ద‌గా అనుభ‌వం లేన‌ప్ప‌టికి.. నాయ‌కత్వ ల‌క్ష‌ణాలు మాత్రం పుష్క‌లంగా ఉన్నాయి.రోహిత్ శర్మ తరహాలోనే బుమ్రా మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడి సమయాల్లో ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకోవాలో ఒక బౌల‌ర్‌గా అత‌డికి బాగా తెలుసు. 2022లో ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో భార‌త జ‌ట్టుకు బుమ్రా నాయ‌క‌త్వం వ‌హించాడు. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 35 పరుగులు చేసి చ‌రిత్ర సృష్టించాడు.టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు బుమ్రా నెలకొల్పాడు. ఆ తర్వాత 2023లో ఐర్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించాడు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన బుమ్రా.. ఆ సిరీస్‌లో కెప్టెన్‌గా, బౌలర్‌గా దుమ్ములేపాడు.అయితే రోహిత్ శర్మ రిటైర్మ్ తర్వాత బుమ్రా టెస్టు కెప్టెన్‌గా ఎంపిక అవుతాడని అంతా భావించారు. కానీ బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడే కీలక బౌలర్ కావడంతో.. అతడికి కొన్ని సిరీస్‌లకు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంగ్లండ్ పర్యటనలో అతడు కేవలం మూడు టెస్టులు ఆడాడు. మిగితా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అందుకే అతడికి టెస్టుల్లో జట్టు పగ్గాలను అప్పగించలేదు. కానీ అతడు ఇప్పుడు దాదాపుగా అన్ని టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటున్నాడు. వన్డే, టెస్టులకు విశ్రాంతి తీసుకుంటున్నప్పటికి పొట్టి ఫార్మాట్‌లో మాత్రం ఆడేందుకు బుమ్రా సముఖత చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టీ20 కెప్టెన్సీ అప్పగించాలని బీసీసీఐ సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్‌..

Shreyas Iyer to begin rehab at BCCI CoE, eyes IND vs NZ comeback3
టీమిండియాకు గుడ్ న్యూస్‌..

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యాటర్‌, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు.దాదాపు రెండు నెలల విరామం తర్వాత అయ్యర్ బుధవారం(డిసెంబర్ 24) తన మొదటి బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోన్నట్లు సమాచారం. సుమారు గంటసేపు నెట్స్‌లో గడిపిన శ్రేయస్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.అతడు ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. శ్రేయస్‌ ఒకట్రెండు రోజుల్లో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ ముంబై ఆటగాడు 4 నుంచి 6 రోజుల పాటు ప్రత్యేక శిక్షణలో పాల్గోనున్నాడు.అనంతరం అతడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృంది ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించింది. ఒకవేళ ఈ పరీక్షలో అయ్యర్ పాసైతే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది. కివీస్‌తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు.అయ్యర్‌కు ఏమైందంటే?అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అత‌డి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంట‌నే అత‌డిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు. మూడు రోజుల త‌ర్వాత అయ్య‌ర్ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంత‌రం ముంబైకు తిరిగొచ్చిన అయ్య‌ర్‌.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు. అత‌డికి దాదాపు నాలుగు ఐదు వారాల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని పార్దివాలా సూచించారు.ఇప్పుడు అత‌డు పూర్తిగా కోలుకోవ‌డంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఒక‌వేళ అయ్య‌ర్ త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే.. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.చదవండి: ఐపీఎల్‌ వద్దు పొమ్మంది.. కట్‌చేస్తే.. డబుల్‌ సెంచరీతో దుమ్ములేపాడు!

Who is Swastik Samal? IPL-reject Odisha prodigy with a double hundred in VHT4
ఐపీఎల్‌ వద్దు పొమ్మంది.. కట్‌చేస్తే.. డబుల్‌ సెంచరీతో దుమ్ములేపాడు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌.. యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు ఇదే వేదికపై సత్తాచాటి క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఆటగాడు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్‌లో భాగం కావాలని భాగం కావాలని కలలు కంటాడు.అలా కలలు కంటున్న వారిలో ఒడిశాకు చెందిన స్వస్తిక్ సామల్ ఒకరు. 25 ఏళ్ల స్వస్తిక్ సామల్ ఐపీఎల్‌లో ఆడేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తాడు. కానీ ప్ర‌తీసారి అత‌డికి నిరాశే ఎదురు అవుతోంది. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో కూడా అత‌డు త‌న పేరును రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌తో రిజిస్ట‌ర్ చేసుకున్నాడు.అయితే దుర‌దృష్టవశాత్తూ తుది వేలం జాబితాలో (369 మంది) అతడికి చోటు దక్కలేదు. కానీ అతడు కొంచెం కూడా దిగులు చెందలేదు. తన సత్తాను మైదానంలోనే చూపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టు ఏకంగా డబుల్ సెంచరీతో మెరిశాడు.డబుల్ సెంచరీతో వీర వీహారం..విజ‌య్ హాజారే ట్రోఫీ-2025లో భాగంగా అలూర్ వేదిక‌గా సౌరాష్ట్ర‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్వస్తిక్ సామ‌ల్ డబుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన సామ‌ల్.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. అలూర్ మైదానంలో బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. కేవ‌లం 169 బంతుల్లో 21 ఫోర్లు, 8 సిక్స‌ర్ల‌తో ఏకంగా 212 ప‌రుగులు చేశాడు. ఫ‌లితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఏకంగా 6 వికెట్ల న‌ష్టానికి 345 ప‌రుగులు చేసింది.అయితే ఈ ల‌క్ష్యాన్ని సౌరాష్ట్ర 5 వికెట్లు కోల్పోయి చేధించేసింది. ఒడిశా ఓడిపోయిన‌ప్ప‌టికి స్వస్తిక్ సామ‌ల్ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అంతేకాకుండా లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఒడిశా ప్లేయ‌ర్‌గా స్వస్తిక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ సాధించిన ఐద‌వ ఆట‌గాడిగా ఏకంగా సంజూ శాంసన్ (212*) రికార్డును సమం చేశాడు. దీంతో సామ‌ల్ గురుంచి తెలుసుకోవడానికి నెటిజ‌న్లు ఆస‌క్తిచూపుతున్నారు.ఎవ‌రీ స‌మాల్‌?25 ఏళ్ల స్వస్తిక్ సామ‌ల్‌.. ఒడిశాలోని కోరాపుట్‌లో జ‌న్మించాడు. అయితే అత‌డికి చిన్న‌తనం నుంచే క్రికెట్‌పై మ‌క్కువ ఎక్క‌వ‌. 10 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ఆ త‌ర్వాత స్ధానికంగా ఓ క్రికెట్ అకాడ‌మీలో అత‌డు చేరాడు.అనంతరం ఒడిశా అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అత‌డికి 2019లో ఒడిశా సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌పున ఆడే అవ‌కాశ‌ముంది. తొలుత అత‌డు స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మిజోరంపై టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది లిస్ట్‌-ఎ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. టీ20, లిస్ట్‌-ఎలో అద్భుతంగా రాణించ‌డంలో అత‌డు రెండేళ్ల కింద‌ట ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అత‌డు ఇప్పుడు ఒడిశా జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు. ఓపెన‌ర్‌గా వ‌చ్చి దూకుడ‌గా ఆడ‌డం అత‌డి స్పెషాలిటి. ముఖ్యంగా టీ20 టీ20 ఫార్మాట్‌లో పవర్ ప్లే ఓవర్లను అద్భుతంగా ఉప‌యోగించుకునే స‌త్తా అత‌డికి ఉంది. గ్రౌండ్ నలుమూలలా కూడా అత‌డు షాట్లు ఆడ‌గ‌ల‌డు. స్వస్తిక్ సామల్ అండర్-16, అండర్-19 ,అండర్-23 స్థాయిలలో ఒడిశా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతడు ఇప్పటివరకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 686 పరుగులతో పాటు లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 521 రన్స్‌ నమోదు చేశాడు. అదేవిధంగా టీ20ల్లో 13 మ్యాచ్‌లు 362 పరుగులు చేశాడు. అయితే మూడు ఫార్మాట్లలోనూ అతడి పేరిట సెంచరీ ఉంది.

Yashasvi Jaiswal for Shubman Gill: Ex-chief selector points out Agarkars big miss for T20 World Cup5
'సెలక్టర్లు తప్పు చేశారు.. గిల్‌ స్ధానంలో అతడే సరైనోడు'

టీ20 వరల్డ్‌కప్‌-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనుహ్యంగా గిల్ స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో కిషన్ రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే సడన్‌గా కిషన్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ చేరాడు. గిల్ స్ధానంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. కాగా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రిటైర్మెంట్ తర్వాత టీ20ల్లో జైశ్వాల్‌కు ఓపెనర్‌గా చోటు దక్కుతుందని అంతా భావించారు.కానీ అతడిని పూర్తిగా జట్టు నుంచే తప్పించారు. గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత జట్టు ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్‌-అభిషేక్ శర్మలకు అవకాశం దక్కింది. ఆ తర్వాత గిల్ తిరిగి జట్టులోకి రావడంతో శాంసన్ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే తన పునరాగమనంలో గిల్ విఫలం కావడంతో సెలక్టర్లు వేటు వేశారు.మళ్లీ అభిషేక్‌-సంజూనే భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. అయితే జైశ్వాల్‌కు కూడా ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌తో పాటు టెస్టు క్రికెట్‌లో కూడా ఓపెనర్‌గా తన మార్క్ చూపించాడు."టీ20 ప్రపంచకప్ టోర్నీకి సెలక్టర్లు అత్యుత్తమ జట్టును ఎంపిక చేశారు. కానీ ఈ జట్టులో యశస్వి జైశ్వాల్ లేకపోవడం తీవ్ర నిరాశపరిచింది. అతడు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికి అతడిని జట్టులోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం.జైశూ టీ20 జట్టులోకి తిరిగి రావాలంటే ఇంకా ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్ టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు. గిల్ ఫామ్‌లో లేనందున పక్కన పెట్టడం సరైన నిర్ణయమే. ఈ విషయంలో నేను సెలక్షన్ కమిటీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాను. కానీ గిల్ స్ధానంలో జైశ్వాల్‌కు అవకాశమిచ్చి ఉంటే బాగుండేది. అతడికి ఓపెనర్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మెరుపు ఆ​రం‍భాలను అందించే సత్తా అతడికి ఉంది అని వెంగ్‌సర్కార్ పిటిఐతో పేర్కొన్నాడు.కాగా జైశ్వాల్ గత కొంత కాలంగా టెస్టు జట్టులో మాత్రం రెగ్యూలర్‌గా సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తన దక్కిన అవకాశాన్ని జైశ్వాల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. గిల్ గైర్హజరీలో జట్టులోకి వచ్చిన జైశూ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.చదవండి: 'అతడు సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్‌ టోర్నీకి రెడీ'

Delhi coach shares good news after Vijay Hazare Trophy return6
'అతడు సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్‌ టోర్నీకి రెడీ'

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి ప్ర‌స్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లి.. తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు.బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి శతక్కొట్టాడు. 299 పరుగుల భారీ లక్ష్య చేధనలో కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఢిల్లీ బాయ్ కేవ‌లం 101 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్ల‌తో 131 ప‌రుగులు చేశాడు. కోహ్లికి ఇది 58వ లిస్ట్‌-ఎ సెంచ‌రీ. అదేవిధంగా ఇదే మ్యాచ్‌లో16,000 లిస్ట్-ఏ పరుగుల మైలురాయిని కూడా కోహ్లి అధిగ‌మించాడు. ఇప్పటికే టీ20, టెస్టుల‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్ర‌స్తుతం కేవ‌లం వ‌న్డే ఫార్మాట్ల‌లో మాత్రమే కొన‌సాగుతున్నాడు. అయిన‌ప్ప‌టికి త‌నలో ఏ మాత్రం జోరు త‌గ్గ‌లేద‌ని కింగ్ నిరూపించుకుంటున్నాడు. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2027కు తాను సిద్దంగా ఉన్నానని త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తోనే సాటిచెబుతున్నాడు. 2025లో కోహ్లి 13 వన్డేల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ నేప‌థ్యంలో కోహ్లి చిన్న‌నాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. "విరాట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కనబరిన జోరునే విజయ్ హాజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.. తన అసాధారణ ప్రదర్శనతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినప్పటికి.. ఎక్కడా కూడా అతడిలో తడబాటు కన్పించలేదు. విరాట్ భారత జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు. అతడు వరల్డ్‌కప్ టోర్నీలో ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లి దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లి 302 పరుగులు చేశాడు.చదవండి: అదరగొట్టిన రింకూ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌.. చెలరేగిన జీషన్‌ అన్సారీ

VHT 2025 HYD vs UP: Captain Rinku Singh Slams 50 UP Beat Hyd7
అదరగొట్టిన రింకూ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆడే భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్‌ దేశీ వన్డే టోర్నీలో శుభారంభం అందుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ నయా ఫినిషర్‌.. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌ను విజయంతో ఆరంభించాడు.ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్‌ 84 పరుగుల తేడాతో హైదరాబాద్‌ (HYD vs UP)పై గెలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసింది ఉత్తరప్రదేశ్.‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 324 పరుగులు సాధించింది. అదరగొట్టిన జురెల్‌, ఆర్యన్‌, రింకూధ్రువ్‌ జురేల్‌ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆర్యన్‌ జుయల్‌ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్‌), అభిషేక్‌ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ రింకూ సింగ్‌ (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో కదంతొక్కారు.ఇక హైదరాబాద్‌ బౌలర్లలో అర్ఫాజ్‌ అహ్మద్‌ 2 వికెట్లు పడగొట్టగా... రక్షణ్‌ రెడ్డి, తనయ్‌ త్యాగరాజన్, నితిన్‌ సాయి యాదవ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ 43 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 84 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్‌ జట్టు చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (53; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ సాధించగా... రాహుల్‌ బుద్ధి (47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), వరుణ్‌ గౌడ్‌ (45; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు.జీషాన్‌ అన్సారీకి 4 వికెట్లుఉత్తరప్రదేశ్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జీషాన్‌ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జమ్మూకశ్మీర్‌ 10 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై... బరోడా 5 వికెట్ల తేడాతో అస్సాంపై... బెంగాల్‌ 3 వికెట్ల తేడాతో విదర్భపై విజయాలు సాధించాయి. ఇక ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో హిమాచల్‌ ప్రదేశ్‌ 95 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై... గోవా 6 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై... పంజాబ్‌ 51 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందాయి.మరోవైపు.. గ్రూప్‌ ‘ఎ’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో కేరళ 145 పరుగుల తేడాతో త్రిపురపై... తమిళనాడు 101 పరుగుల తేడాతో పాండిచ్చేరిపై... మధ్యప్రదేశ్‌ 99 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై విజయాలు సాధించాయి.చదవండి: ప్రపంచకప్‌ జట్టులో జైస్వాల్‌, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్‌!

Venus Williams Andrea Preti Love Story Age Gap Net Worth Who Is Rich8
అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!

‘‘ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కటె జన్మస్థానమంటూ.. కొత్త కథలాగా మొదలైతదమ్మా’’.. ఇటీవలి కాలంలో ప్రేమికులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా పాటలోని పంక్తులు అమెరికా టెన్నిస్‌ దిగ్గజం వీనస్‌ విలియమ్స్‌- ఇటలీ నటుడు ఆండ్రియా ప్రెటీకి సరిగ్గా సరిపోతాయి.వేర్వేరు దేశాలకు చెందిన వీనస్‌- ఆండ్రియా రంగాలూ, పైకి కనిపించే సోకాల్డ్‌ ‘రంగు’లూ భిన్నమైనవే. సంపాదనలోనూ భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా. వయసులోనూ ఎనిమిదేళ్ల వ్యత్యాసం. అయితేనేం వారి హృదయాంతరాల్లో ఉన్న స్వచ్చమైన ప్రేమకు ఈ అంతరాలు అడ్డంకి కాలేదు. ఏడాదిన్నర కాలంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న ఈ జోడీ.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది.ఇటలీలో ఈ సెప్టెంబరులోనే వీనస్‌- ఆండ్రియా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఇటలీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వీనస్‌ విదేశీయురాలు కాబట్టి ఈ వివాహం అధికార ముద్ర పొందేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. అందుకే తాజాగా తన స్వస్థలం ఫ్లోరిడాలోని బీచ్‌లో వీనస్‌ మరోసారి తన భర్తతో పెళ్లినాటి ప్రమాణాలు చేసింది.ఇంతకీ ఈ ఆండ్రియా ప్రెటీ ఎవరు?డానిష్‌ సంతతికి చెందిన ఆండ్రియా ఇటలీలో పెరిగాడు.మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి.. నటుడిగా, నిర్మాతగా కొనసాగుతన్నాడు. సినిమాలు, టీవీ షోలు, రియాల్టీ షోలతో బోలెడంత పాపులారిటీ సంపాదించిన ఆండ్రియా.. విలక్షణ రీతిలో కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.చక్కటి అందగాడు మాత్రమే కాదు.. నిరాడంబరంగా జీవించేందుకే ఆండ్రియా ఇష్టపడతాడని అతడి సన్నిహితులు చెబుతుంటారు. వీనస్‌తో డేటింగ్‌ మొదలుపెట్టిన కొద్దికాలంలోనే ఆమె కుటుంబంతో చక్కగా కలిసిపోయాడు ఆండ్రియా.ప్రేమకథ అలా మొదలైందికెరీర్‌కు ప్రాధాన్యం ఇచ్చే వీనస్‌ విలియమ్స్‌ నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి మాట ఎత్తలేదు. స్వాతంత్ర్యంగా జీవించేందుకు ఇష్టపడే వీనస్‌... గతేడాది వరకూ సింగిలే. అయితే, 2024లో మిలాన్‌లో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌.. ఆమె జీవితంలోని నవ వసంతానికి నాంది పలికింది.అక్కడే తన కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన 37 ఏళ్ల ఆండ్రియా ప్రెటీ తొలి చూపులోనే వీనస్‌ దృష్టిని ఆకర్షించాడు. అతడిది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. మాటలు కలిశాయి. మనసులు ఒక్కటయ్యాయి. స్నేహం ప్రేమగా మారి పరిణయానికి దారి తీసింది.ఎవరి నెట్‌వర్త్‌ ఎంత?మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకున్న వీనస్‌ విలియమ్స్‌.. డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కలిపి మరో పదహారు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల వాషింగ్టన్‌ డీసీ ఓపెన్‌లో గెలిచిన 45 ఏళ్ల వీనస్‌.. ఈ టైటిల్‌ గెలుచుకున్న రెండో అతిపెద్ద వయస్కురాలిగా చరిత్రకెక్కింది.చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకుని దిగ్గజంగా ఎదిగిన వీనస్‌ విలియమ్స్‌.. ఇటు టెన్నిస్‌ టైటిళ్ల ద్వారా వచ్చే ప్రైజ్‌మనీ.. అటు ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీ మొత్తమే కూడబెట్టింది. అంతేకాదు ఇంటీరియర్‌ రంగంలో అడుగుపెట్టిన వీనస్‌కు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి.వంద రెట్లు ఎక్కువఇలా రెండు చేతులా సంపాదిస్తున్న వీనస్‌ విలియమ్స్‌ నికర ఆస్తుల విలువ తొంభై ఐదు మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపు 851 కోట్ల రూపాయలకు పైమాటే.మరోవైపు.. వీనస్‌ భర్త ఆండ్రియా ప్రెటీ.. మోడలింగ్‌, నటన, సినిమా ప్రొడక్షన్‌ ద్వారా సుమారుగా 1- 2 మిలియన్‌ డాలర్లు సంపాదించినట్లు అంచనా (భారత కరెన్సీలో దాదాపు రూ. 8- 17 ​కోట్లు). దీనర్థం భర్త కంటే వీనస్‌ ఆస్తుల విలువ రమారమి వంద రెట్లు ఎక్కువ. అందుకే మరి అనేది.. ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కటె జన్మస్థానమంటూ.. కొత్త కథలాగా మొదలైతదమ్మా!!చదవండి: David Beckham: భార్యే సర్వస్వం.. చీలిన కుటుంబం

Steve Smith returns Australia name Playing XII for 4th Ashes Test9
Ashes:‍ ప్లేయింగ్‌ XII ప్రకటించిన ఆస్ట్రేలియా

సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను సొంతం చేసుకుని జోష్‌లో ఉంది ఆస్ట్రేలియా. పెర్త్‌, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నామమాత్రపు నాలుగో, ఐదు టెస్టులలోనూ సత్తా చాటి వైట్‌వాష్‌ చేయాలని పట్టుదలగా ఉంది.మరోసారి స్మిత్‌ సారథ్యంలో కాగా ఆసీస్‌- ఇంగ్లండ్‌ మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా బాక్సింగ్‌ డే టెస్టు (Aus Vs Eng Boxing Day Test) జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ నుంచి రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins)కు విశ్రాంతినివ్వగా.. మరోసారి స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) సారథిగా వ్యవహరించనున్నాడు. తొలి రెండు టెస్టుల మాదిరే ఈసారీ గెలుపు రుచి చూడాలని స్మిత్‌ భావిస్తున్నాడు.ఆ ముగ్గురి మధ్య పోటీఅయితే, కమిన్స్‌తో పాటు వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ సైతం నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై కెప్టెన్‌ స్మిత్‌ అంచనాకు రాలేకపోయాడు. దీంతో పన్నెండు మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించారు. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో రెండు స్థానాల కోసం పేసర్లు బ్రెండాన్‌ డాగెట్‌, మైకేల్‌ నాసర్‌, జే రిచర్డ్‌సన్‌ మధ్య పోటీ ఉందని స్మిత్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.పిచ్‌కు అనుగుణంగాపచ్చగా ఉన్న మెల్‌బోర్న్‌ పిచ్‌ను నిశితంగా పరిశీలించిన తర్వాతే తాము తుదిజట్టును ఎంపిక చేసుకుంటామని స్మిత్‌ స్పష్టం చేశాడు. తద్వారా స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీకి మరోసారి మొండిచేయి తప్పదని సంకేతాలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో 82, 40 పరుగులతో ఆకట్టుకున్న ఉస్మాన్‌ ఖవాజా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.బాక్సింగ్‌ డే టెస్టు (డిసెంబరు 26-30)కు ఆస్ట్రేలియా ప్లేయింగ్‌ XIIట్రవిస్‌ హెడ్‌, జేక్‌ వెదరాల్డ్, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా , అలెక్స్‌ క్యారీ (వికెట్‌ కీపర్‌), కామెరాన్‌ గ్రీన్‌, మిచెల్‌ స్టార్క్‌, స్కాట్‌ బోలాండ్‌, బ్రెండాన్‌ డాగెట్‌, మైకేల్‌ నాసర్‌, జే రిచర్డ్‌సన్‌.బాక్సింగ్‌ డే టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, బ్రెండాన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, టాడ్ మర్ఫీ, మైకేల్‌ నాసర్‌, జే రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.మరోవైపు ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టుకు ఇంగ్లండ్‌ తమ తుదిజట్టును ప్రకటించింది. జోఫ్రా ఆర్చర్‌ పక్కటెముకల నొప్పితో దూరం కాగా.. ఓలీ పోప్‌ను తప్పించింది. వీరి స్థానాల్లో గస్‌ అట్కిన్సన్‌, జేకబ్‌ బెతెల్‌ వచ్చారు.ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టుకు ఇంగ్లండ్‌ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్‌ బెతెల్‌, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌ కీపర్‌), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్.చదవండి: ప్రపంచకప్‌ జట్టులో జైస్వాల్‌, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్‌!

Gambhir dekh raha hai na: Fans troll coach after Rohit 100 in Jaipur10
ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్‌!

దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌ ఆరంభమైన రోజే (బుధవారం) పరుగుల వరద పారింది. ఈ ఎడిషన్‌లోని తొలి మ్యాచ్‌.. దాదాపు ప్రతీ బౌలర్‌కూ ఓ పీడకలను మిగిల్చింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు ఏకంగా 22 శతకాలు నమోదు కావడం.. ఇందులో ఫాస్టెస్ట్‌ సెంచరీలు ఉండటం ఇందుకు నిదర్శనం.అయితే, ఇందులో రెండు శతకాలు మాత్రం అత్యంత ప్రత్యేకం. సుమారుగా పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ తరఫున భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి (Virat Kohli) ఈ దేశీ టోర్నీ బరిలో దిగగా.. ముంబై రాజా, టీమిండియా లెజెండరీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) కూడా సొంత జట్టు తరఫున రంగంలోకి దిగాడు.62 బంతుల్లోనే జైపూర్‌ వేదికగా సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో సిక్కింతో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ శతక్కొట్టాడు. కేవలం 62 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన లిస్‌-ఎ క్రికెట్‌ కెరీర్‌లోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ (Fastest Century) నమోదు చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు సాధించాడు. ఇందులో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.ఇక రోహిత్‌ అద్భుత ప్రదర్శన కారణంగా సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని.. ముంబై కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మను చూసేందుకు వేలాది మంది అభిమానులు జైపూర్‌ స్టేడియానికి వచ్చారు.కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ జరుగుతున్న వేళ కొంతమంది.. టీమిండియా సెలక్టర్‌ ఆర్పీ సింగ్‌ స్టేడియంలో ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో.. లక్ష్య ఛేదనలో రోహిత్‌ మెరుపు శతకంతో చెలరేగడంతో.. టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్‌!‘‘గంభీర్‌ నువ్వు ఎక్కడున్నావు? మాకైతే కనిపించడం లేదు.. నువ్వేతై కళ్లప్పగించి రోహిత్‌ ఇన్నింగ్స్‌ చూడు’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. కాగా వన్డే ప్రపంచకప్‌-2027 ఆడటంపై స్పష్టత లేదంటూ.. ఇటీవలే రోహిత్‌ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన సారథిపై వేటు వేసింది. మరోవైపు.. టీమిండియా యువ ఆటగాళ్లతో పాటు.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వంటి దిగ్గజాలు కూడా దేశీ టోర్నీల్లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రో-కోలను కావాలనే టార్గెట్‌ చేస్తున్నారంటూ వారి అభిమానులు.. సందర్భం వచ్చినపుడల్లా గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు అదరగొట్టడం.. విజయ్‌ హజారే ట్రోఫీలోనూ శతకాలు బాదడంతో మరోసారి గంభీర్‌ ట్రోల్‌ అవుతున్నాడు. శతక్కొట్టిన కోహ్లికాగా ఆంధ్రతో మ్యాచ్‌లో కోహ్లి 131 పరుగులు సాధించాడు. కోహ్లితో పాటు ప్రియాన్ష్‌ ఆర్య (74), నితీశ్‌ రాణా (77) రాణించడంతో ఆంధ్ర విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 37.4 ఓవర్లలో ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రో-కో కేవలం వన్డేలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: ప్రపంచకప్‌ జట్టులో జైస్వాల్‌, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్‌!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement