Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Gudakesh Motie spins Amazon Warriors to CPL 2025 final1
మోటీ మాయాజాలం.. ఫైనల్లో గయానా అమెజాన్‌ వారియర్స్‌

ఇమ్రాన్‌ తాహిర్‌ నేతృత్వంలోని గయానా అమెజాన్‌ వారియర్స్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 ఎడిషన్‌ ఫైనల్స్‌కు చేరింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (సెప్టెంబర్‌ 18) ఉదయం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఆ జట్టు సెయింట్‌ లూసియా కింగ్స్‌పై 14 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా.. తబ్రేజ్‌ షంషి (4-0-33-3), డేవిడ్‌ వీస్‌ (3-0-14-2), అల్జరీ జోసఫ్‌ (3-0-34-2), తైమాల్‌ మిల్స్‌ (3.5-0-38-2), రోస్టన్‌ ఛేజ్‌ (2-0-15-1) ధాటికి 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గయానా ఇన్నింగ్స్‌లో బెన్‌ మెక్‌డెర్మాట్‌ (34), షాయ్‌ హెప్‌ (32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఆఖర్లో రొమారియో షెపర్డ్‌ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్‌), ప్రిటోరియస్‌ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో గయానా గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది.మోటీ మాయాజాలంఅనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్‌.. గుడకేశ్‌ మోటీ మాయాజాలం (4-0-30-4) దెబ్బకు 19.1 ఓవర్లలో 143 పరుగులకే చాపచుట్టేసింది. ఇమ్రాన్‌ తాహిర్‌ (4-0-22-2), ప్రిటోరియస్‌ (4-0-24-2), రొమారియో షెపర్డ్‌ (4-0-36-1), హస్సన్‌ ఖాన్‌ (2.1-0-21-1) కూడా లూసియా కింగ్స్‌ను డ్యామేజ్‌ చేశారు.గయానా బౌలర్ల ధాటికి ఓ దశలో లూసియా కింగ్స్‌ ఇన్నింగ్స్‌ 100లోపే ముగుస్తుందని అనుకున్నారు. అయితే ఖారీ పియెర్‌ (29 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), తైమాల్‌ మిల్స్‌ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) వీరోచితంగా పోరాడి గాయానా శిబిరంలో ఓటమి భయం పుట్టించారు. మోటీ పియెర్‌ను.. హస్సన్‌ ఖాన్‌ మిల్స్‌ను ఔట్‌ చేయడంతో లూసియా కింగ్స్‌ పోరాటం ముగిసింది.ఈ మ్యాచ్‌లో ఓడినా లూసియా కింగ్స్‌కు టైటిల్‌ రేసులో ఉండేందుకు మరో అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 20న జరిగే క్వాలిఫయర్‌-2లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెప్టెంబర్‌ 22న జరిగే ఫైనల్లో గయానాతో అమీతుమీ తేల్చుకుంటుంది.

5 Uncapped Players: West Indies Announce Squad For Nepal, Hosein To Lead2
వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌

నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్‌ (WI vs NEP) క్రికెట్‌ తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ షాయీ హోప్‌నకు విశ్రాంతినిచ్చిన విండీస్‌ బోర్డు.. అతడి స్థానంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అకీల్‌ హొసేన్‌ (Akeal Hosein)కు బాధ్యతలు అప్పగించింది.కాగా షార్జా వేదికగా వెస్టిండీస్‌ జట్టు నేపాల్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 27, 28, 30 తేదీల్లో మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో విండీస్‌ బోర్డు గురువారం తమ జట్టును ప్రకటించింది.ఐదుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చోటుకెప్టెన్‌ షాయి హోప్‌ (Shai Hope)తో పాటు పేసర్‌ అల్జారీ జోసెఫ్‌, బ్యాటర్‌ జాన్సన్‌ చార్లెస్‌ వంటి కీలక ప్లేయర్లకు కూడా సెలక్టర్లు రెస్ట్‌ ఇచ్చారు. అయితే, ఈ సిరీస్‌లో అకీల్‌ హొసేన్‌ సారథ్యంలో జేసన్‌ హోల్డర్‌, ఫాబియాన్‌ అలెన్‌, కైల్‌ మేయర్స్‌ వంటి వారు ప్రధాన భూమిక పోషించేందుకు సిద్ధమయ్యారు.ఇక ఏకంగా ఐదుగురు వెస్టిండీస్‌ ఆటగాళ్లు నేపాల్‌తో సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటర్‌ అకీమ్‌ ఆగస్టీ, ఆల్‌రౌండర్‌ నవీన్‌ బిడైసీ, స్పిన్నర్‌ జీషన్‌ మొతారా, పేసర్‌ రామోన్‌ సైమండ్స్‌, కీపర్‌ అమీర్‌ జాంగూ (టీ20 అరంగేట్రం)లకు తొలిసారి ఈ జట్టులో చోటు దక్కింది.నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్టుఅకీల్‌ హొసేన్‌ (కెప్టెన్‌), ఫాబియాన్‌ అలెన్‌, జువెల్‌ ఆండ్రూ, అకీమ్‌ ఆగస్టీ, నవీన్‌ బిడైసీ, జెడియా బ్లేడ్‌, కేసీ కార్టీ, కరీమా గోరె, జేసన్‌ హోల్డర్‌, అమీర్‌ జాంగూ, కైల్‌ మేయర్స్‌, ఒబెడ్‌ మెకాయ్‌, జీషన్‌ మొతారా, రామోన్‌ సైమండ్స్‌, షమార్‌ స్ప్రింగర్‌.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌ తర్వాత.. సీనియర్లతో కూడిన వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు భారత పర్యటన‌కు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా టీమిండియాతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విండీస్‌ తమ జట్టు వివరాలను వెల్లడించింది.టీమిండియాతో టెస్టులకు విండీస్‌ జట్టు వివరాలురోస్టన్‌ ఛేజ్‌ (కెప్టెన్‌), తేజ్‌ నారాయణ్‌ చందర్‌పాల్, బ్రెండన్‌ కింగ్, కెవ్‌లాన్‌ అండర్సన్, షై హోప్, జాన్‌ క్యాంప్‌బెల్, అతనాజ్, ఇమ్‌లాక్, గ్రీవ్స్, అండర్సన్‌ ఫిలిప్, అల్జారి జోసెఫ్, షామర్‌ జోసెఫ్, జేడెన్‌ సీల్స్, ఖారీ పైర్, జోమెల్‌ వారికాన్‌. చదవండి: ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!

Shreyanka Patil cameo powers Barbados Royals to third consecutive WCPL title3
CPL విజేత బార్బడోస్‌ రాయల్స్‌.. కీలకపాత్ర పోషించిన టీమిండియా ప్లేయర్‌

2025 మహిళల కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ను బార్బడోస్‌ రాయల్స్‌ ఎగరేసుకుపోయింది. నిన్న (సెప్టెంబర్‌ 17) జరిగిన ఫైనల్లో ఆ జట్టు గయానా అమెజాన్‌ వారియర్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి, వరుసగా మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది. యామీ హంటర్‌ (29), కెప్టెన్‌ షెమెయిన్‌ క్యాంప్‌బెల్‌ (28 నాటౌట్‌), వాన్‌ నికెర్క్‌ (27 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బార్బడోస్‌ బౌలర్లలో షమీలియా కాన్నెల్‌, అఫీ ఫ్లెచర్‌, ఆలియా అల్లెన్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం బరిలోకి దిగిన బార్బడోస్‌.. 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోట్నీ వెబ్ (31), కైసియా నైట్‌ (31), చమారీ ఆటపట్టు (25) గెలుపుకు తమవంతు సహకారాన్ని అందించగా.. ఆఖర్లో టీమిండియా ఆల్‌రౌండర్‌ శ్రేయాంక పాటిల్‌ (6 బంతుల్లో 10 నాటౌట్‌; 2 ఫోర్లు), ఆలియా అల్లెన్‌ (9 బంతుల్లో 17 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి బార్బడోస్‌ను విజయతీరాలకు చేర్చారు.స్వల్ప స్కోర్‌ను కాపాడుకునేందుకు గయానా బౌలర్లు చాలా కష్టపడినప్పటికీ.. ఆఖర్లో ఆలియా, శ్రేయాంక వారి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 18 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన తరుణంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోగా.. శ్రేయాంక వరుసగా రెండు బౌండరీలు బాది బార్బడోస్‌ గెలుపును ఖరారు చేసింది.ఆతర్వాతి ఓవర్‌లో ఆలియా వరుసగా సిక్సర్‌, బౌండరీ బాది బార్బడోస్‌ గెలుపును లాంఛనం చేసింది. ఈ టోర్నీలో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాంక, బంతితోనూ (2-0-15-0) పర్వాలేదనిపించింది. 21 ఏళ్ల శ్రేయాంక గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ భారత వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయింది.

Shreyas Iyer Fails in 1st Unofficial Test vs Australia A4
IND VS AUS: దారుణంగా విఫలమైన శ్రేయస్‌ అయ్యర్‌

టెస్ట్‌ రీఎంట్రీపై గంపెడాశలతో స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ బరిలోకి దిగిన టీమిండియా స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. 13 బంతుల్లో బౌండరీ సాయంతో 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.గత కొంతకాలంగా టెస్ట్‌ జట్టులో చోటు ఆశిస్తున్న శ్రేయస్‌ ఈ సిరీస్‌లో సత్తా చాటి, త్వరలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే సిరీస్‌కు ఎంపిక కావాలని భావించాడు. అయితే అతని అంచనాలన్నీ తారుమారయ్యేలా ఉన్నాయి. భారత జట్టులో మిడిలార్డర్‌ బెర్త్‌ల కోసం శ్రేయస్‌తో పోటీపడుతున్న మిగతా ఆటగాళ్లందరూ సత్తా చాటుతున్నారు. శ్రేయస్‌ మాత్రమే వరుసగా విఫలమవుతున్నాడు (దులీప్‌ ట్రోఫీలోనూ (25, 12) నిరాశపరిచాడు). మరోపక్క టీమిండియా బెర్త్‌ కోసం శ్రేయస్‌కు ప్రధాన పోటీదారుడైన సర్ఫరాజ్‌ ఖాన్‌ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతున్నాడు. సర్ఫారాజ్‌ ఇటీవల బుచ్చిబాబు టోర్నీలో సెంచరీతో సత్తా చాటాడు.శ్రేయస్‌కు మరో పోటీదారుడైన సాయి సుదర్శన్‌ ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్ద సెంచరీతో (73) మెరిశాడు. కొత్తగా ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ శ్రేయస్‌ పోటీదారుల జాబితాలో చేరాడు. రజత్‌ తాజాగా ముగిసిన దులీప్‌ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు (ఫైనల్లో సెంచరీ, సెమీఫైనల్లో అర్ద సెంచరీ). దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో రజత్‌ పాటు సెంచరీ చేసిన యశ్‌ రాథోడ్‌, సెమీ ఫైనల్లో భారీ సెంచరీ చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా కొత్తగా శ్రేయస్‌ పోటీదారుల జాబితాలో చేరారు.ఇంత పోటీ మధ్య వరుస వైఫల్యాల బాట పట్టిన శ్రేయస్‌ భారత టెస్ట్‌ జట్టులో చోటు ఆశించడం కరెక్ట్‌ కాదేమో అనిపిస్తుంది.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 532 పరుగుల భారీ స్కోర్‌ చేసిన ఆసీస్‌-ఏకు భారత-ఏ జట్టు కూడా ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేస్తుంది. మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్‌ (44), ఎన్‌ జగదీసన్‌ (64), సాయి సుదర్శన్‌ (73), శ్రేయస్‌ అయ్యర్‌ (8) ఔట్‌ కాగా.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (39), ధృవ్‌ జురెల్‌ (31) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 262 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఆసీస్‌ తరఫున సామ్‌ కొన్‌స్టాస్‌ (109), వికెట్‌ కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ (123 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్‌బెల్‌ కెల్లావే (88), కూపర్‌ కన్నోల్లీ (70), లియమ్‌ స్కాట్‌ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.కాగా, రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు, మూడు అనధికారిక​ వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. భారత-ఏ టెస్ట్‌ జట్టుకు శ్రేయస్‌ అయ్యరే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Kutta kaat jata hai: Former Pakistan Captain on Saim Ayub 3 consecutive ducks5
ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌ లీగ్‌ దశలో పాకిస్తాన్‌ యువ ఓపెనర్‌ సయీమ్‌ ఆయుబ్‌ (Saim Ayub) దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అతడు డకౌట్‌ అయ్యాడు. ఒమన్‌, టీమిండియా, యూఏఈ జట్లతో మ్యాచ్‌లలో పరుగుల ఖాతా తెరవకుండానే 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ వెనుదిరిగాడు.అయితే, బ్యాటర్‌గా విఫలమైనా.. వికెట్లు తీయడంలో మాత్రం సఫలమయ్యాడు ఈ పార్ట్‌టైమ్‌ స్పిన్నర్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. స్పెషలిస్టు బౌలర్ల కంటే అతడే ఓ అడుగు ముందున్నాడు. ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్‌లో పాక్‌ తీసిన మూడు వికెట్లు అతడి ఖాతాలోనే ఉండటం ఇందుకు నిదర్శనం.ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌‍ (Rashid Latif) సయీమ్‌ ఆయుబ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఓ వ్యక్తి ఒంటెపై కూర్చుని ఉన్నా కుక్కకాటు నుంచి మాత్రం తప్పించుకోలేడు’’ అని లతీఫ్‌ పేర్కొన్నాడు. మేనేజ్‌మెంట్‌ నుంచి మద్దతు దక్కుతున్నా ఆయుబ్‌ను దురదృష్టం వెంటాడుతూనే ఉందన్న అర్థంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ బ్యాటర్‌ పరుగులు తీయకుండా.. వికెట్లు తీయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు‘‘ప్రతి ఒక్కరి కెరీర్‌లో గడ్డు దశ అనేది ఒకటి ఉంటుంది. అతడు వైవిధ్యభరితమైన షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నాడు. బ్యాటర్‌గా కాకుండా.. బౌలింగ్‌ విభాగంలో రాణిస్తున్నందున అతడికి తుదిజట్టులో చోటు దక్కుతోంది. అయితే, కీలక మ్యాచ్‌లలో మాత్రం అతడు తప్పక పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు’’ అని రషీద్‌ లతీఫ్‌ ధీమా వ్యక్తం చేశాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా టీమిండియా చేతిలో ఓడిన పాక్‌.. యూఏఈ, ఒమన్‌లపై గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టుతో కలిసి ఈ గ్రూపు నుంచి సూపర్‌-4కు అర్హత సాధించింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్‌- పాక్‌ జట్ల మధ్య సెప్టెంబరు 21న సూపర్‌-4 మ్యాచ్‌ జరుగనుంది. సూపర్‌-4 బెర్తు ఖరారుఇక లీగ్‌ దశలో యూఏఈ, పాకిస్తాన్‌లను చిత్తుగా ఓడించిన సూర్యకుమార్‌ సేన.. ముందుగానే సూపర్‌-4 బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పాక్‌తో మ్యాచ్‌ ఆడినప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. పహల్గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ విషయంపై నానాయాగీ చేసిన పాక్‌ క్రికెట్ బోర్డు బాయ్‌కాట్‌ పేరిట డ్రామాకు తెరతీసింది. అయితే, తమ పాచికలు పారకపోవడంతో యూఏఈతో బుధవారం మ్యాచ్‌ ఆడిన పాక్‌.. 41 పరుగుల తేడాతో గెలిచి సూపర్‌-4కు చేరుకుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్‌ కెప్టెన్‌ ఓవరాక్షన్‌UAE strike early vs Pakistan 🤯Watch #PAKvUAE LIVE NOW, on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/gVRGeSYoBv— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025

Jaiswal as Test Only player is injustice Should play all 3 formats: Ex Ind Star6
‘అతడు ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌.. టెస్టుల్లో మాత్రమే ఆడించడం అన్యాయం’

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జైసూ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించగలడని పేర్కొన్నాడు. అయితే, అతడిని కేవలం టెస్టులకే పరిమితం చేయడం సరికాదంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు.టెస్టులలో దుమ్ములేపుతున్న జైసూభారత టెస్టు జట్టు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ తన స్థానం సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే. అరంగేట్రం నుంచే శతకాలు, ద్విశతకాలతో దుమ్ములేపుతున్న ఈ ముంబై బ్యాటర్‌.. ఇప్పటి వరకు 24 టెస్టుల్లో కలిపి 2209 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఆరు సెంచరీలు, రెండు డబుల్‌ సెంచరీలు ఉన్నాయి.వన్డే, టీ20లలో మా త్రం నో ఛాన్స్‌ఇలా సంప్రదాయ ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తున్న జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తగినన్ని అవకాశాలు రావడం లేదు. టీమిండియా తరఫున 23 టీ20లలో 723 పరుగులు చేసిన జైస్వాల్‌.. ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులు రాబట్టగలిగాడు. టీ20లలో ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ, వన్డేల్లో రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా శుబ్‌మన్‌ గిల్‌ ఉండటంతో జైసూకు నిరాశ తప్పడం లేదు.అతడు ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌ఈ విషయాల గురించి కామెంటేటర్‌, మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్‌ను మూడు ఫార్మాట్లలో ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ‘‘యశస్వి మంచి ఆటగాడు. అతడు మూడు ఫార్మాట్లలో ఆడగలడు. కానీ ఇప్పుడు అతడు కేవలం ఒకే ఫార్మాట్లో ఆడిస్తున్నారు.ఇలా చేయడం సరికాదు. అతడికి అన్యాయం చేసినట్లే. యశస్విని తప్పకుండా మూడు ఫార్మాట్లలో ఆడించాలి. స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులు ఆడించడంతో పాటు.. తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ యశస్వికి అవకాశం ఇవ్వాలి. అతడిని ఆసీస్‌ పర్యటనలో వన్డేల్లో ఆడిస్తారనే అనుకుంటున్నా.అంతేకాదు.. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి యశస్వి కూడా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆడతాడని నమ్ముతున్నా. దీనిపై నాకు సమాచారం లేదు. కానీ మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నా’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఆసియా కప్‌ ముగించుకున్న తర్వాత కాగా టీమిండియా ప్రస్తుతం ఆసియా టీ20 కప్‌-2025 టోర్నీతో బిజీగా ఉంది. ఈ మెగా టోర్నీ ఆడే జట్టులో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కలేదు. స్టాండ్‌ బై ప్లేయర్‌గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.మరోవైపు.. పొట్టి ఫార్మాట్లో సూపర్‌ ఫామ్‌లో ఉన్నా.. శ్రేయస్‌ అయ్యర్‌కు కనీసం రిజర్వు ప్లేయర్‌గానూ స్థానం దక్కలేదు. ఇక ఆసియా కప్‌ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.

PCB Chief Naqvi Explains Why Pak Did Not Pull Out of Asia Cup Fans Reacts7
అందుకే ఆసియా కప్‌లో ఆడుతున్నాం!.. అవునా?.. నిజమా?!

‘నో- షేక్‌హ్యాండ్‌’ వివాదంలో రచ్చ చేసిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) ఆఖరికి తలవంచకతప్పలేదు. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాల్లేవని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్‌ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. ఫలితంగా ‘బాయ్‌కాట్‌’ నాటకాన్ని పక్కనపెట్టిన పాక్‌ జట్టు.. యూఏఈతో బుధవారం మ్యాచ్‌ ఆడింది. అంతేకాదు ఈ మ్యాచ్‌కు రిఫరీ కూడా ఆండీనే కావడం విశేషం. అయితే, ‘సమాచార లోపం కారణంగానే ఇది జరిగిందంటూ పైక్రాఫ్ట్‌ మాకు క్షమాపణ చెప్పారు. ఆడియో లేని వీడియో.. చీప్‌ ట్రిక్స్‌ ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపిస్తామని ఐసీసీ కూడా చెప్పింది’ అంటూ పీసీబీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పైక్రాఫ్ట్‌తో తమ బృందం చర్చిస్తున్న వీడియోను కూడా పోస్ట్‌ చేసింది. అయితే పాక్‌ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఆడియో లేకుండా పాక్‌ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరీ ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ పనికిరావని.. నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు.బాయ్‌కాట్‌కు అందరి మద్దతు ఉంది.. కానీఇదిలా ఉంటే.. తాము ఆసియా కప్‌ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్‌, ఆసియా క్రికెట్‌ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్‌ నక్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘‘సెప్టెంబరు 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్‌ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము.కాసేపటి క్రితమే మ్యాచ్‌ రిఫరీ మా జట్టు కోచ్‌, కెప్టెన్‌, మేనేజర్‌తో మాట్లాడారు. నో- షేక్‌హ్యాండ్‌ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం.రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్‌కాట్‌ చేస్తే.. అదొక అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మనకు ప్రధాన మంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతు ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు!కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అంటూ నక్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా రిఫరీ విషయంలో తమదే పైచేయి అయినందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.కాగా సెప్టెంబరు 14న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, పహల్గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్‌ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమానభారంతో రగిలిపోయిన పాక్‌.. బాయ్‌కాట్‌ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ఒకవేళ నిజంగానే వాళ్లు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.వారికే నష్టంఇప్పటికే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న పాక్‌ బోర్డు పరిస్థితి మాత్రం మరింత దిగజారడం ఖాయం. టోర్నీ నుంచి రావాల్సిన ఆదాయం కోసమే కొనసాగినా.. నక్వీ ఇలా సాకులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్‌లో యూఏఈని ఓడించిన పాక్‌.. సూపర్‌-4కు అర్హత సాధించింది. ఈ క్రమంటో సెప్టెంబరు 21న సల్మాన్‌ ఆఘా బృందం టీమిండియాను ఢీకొట్టనుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్‌ కెప్టెన్‌ ఓవరాక్షన్‌

Asia Cup 2025: Pak Fielder Hits Umpire On Head Vs UAE What Happen Next8
అంపైర్‌పైకి బంతిని విసిరిన పాక్‌ ఫీల్డర్‌.. తర్వాత ఏమైందంటే?

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు- మ్యాచ్‌ అధికారులకు అస్సలు పడటం లేదనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియాతో ‘నో-షేక్‌హ్యాండ్‌’ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్న పాక్‌.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE)తో మ్యాచ్‌ సందర్భంగా అనూహ్య రీతిలో ఫీల్డ్‌ అంపైర్‌ను గాయపరిచింది.ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. పాక్‌ ఫీల్డర్‌ చేసిన పని కారణంగా సదరు అంపైర్‌ నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడటం కనిపించింది. యూఏఈ ఆరో ఇన్నింగ్స్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్‌ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదో నంబర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ పరాశర్‌ (Dhruv Parashar) ఆరో ఓవర్లో సయీమ్‌ ఆయుబ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.అంపైర్‌పైకి పాక్‌ ఫీల్డర్‌ త్రో.. బలంగా తాకిన బంతిఓవర్‌ ఐదో బంతిని థర్డ్‌మ్యాన్‌ రీజర్‌ దిశగా తరలించిన పరాశర్‌.. సింగిల్‌ కోసం పరుగు తీశాడు. ఇంతలో ఫీల్డర్‌ బంతిని అందుకుని నాన్‌-స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు విసిరాడు. అయితే, నేరుగా అది ఫీల్డ్‌ అంపైర్‌ రుచిర పల్లియాగురుగే (Ruchira Palliyaguruge) తలకు తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడగా.. సయీమ్‌ ఆయుబ్‌ వచ్చి ఆరా తీశాడు. మిగతా ఆటగాళ్లు కూడా వచ్చి అతడిని పరామర్శించారు.తర్వాత ఏమైందంటే?అదే విధంగా పాక్‌ ఫిజియో వచ్చి అంపైర్‌కు కంకషన్‌ టెస్టు చేశాడు. ఈ క్రమంలో రుచిరా (శ్రీలంక) మైదానం వీడగా.. రిజర్వ్‌ అంపైర్‌ గాజీ సోహెల్‌ (బంగ్లాదేశ్‌) అతడి స్థానంలో బాధ్యతలు నిర్వర్తించాడు. Andy Pycroft- just missedRuchira - successRevenge from the previous game against India.. #Uaevpak pic.twitter.com/CY1hb7N8KM— Nibraz Ramzan (@nibraz88cricket) September 17, 2025 ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదుకాగా భారత ఆటగాళ్లు ‘షేక్‌ హ్యాండ్‌’ ఇవ్వలేదనే సాకుతో ఆదివారం నుంచి అసహనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్‌ జట్టు చివరకు ఏమీ సాధించకుండానే యూఏఈతో మ్యాచ్‌ బరిలోకి దిగింది.భారత క్రికెటర్లు తమతో కరచాలనం చేయకుండా మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ నిలువరించారని, ఆయనను ఆసియా కప్‌ రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చేసిన డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఏమాత్రం పట్టించుకోలేదు. టోర్నీ సంగతి తర్వాత... యూఏఈతో బుధవారం పాక్‌ ఆడిన మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఎంపిక చేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.‘క్షమాపణ’ చెప్పారంటూ...ఈ మ్యాచ్‌ తాము ఆడబోమని, టోర్నీనే బహిష్కరిస్తామంటూ పాక్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ముందుగా సందేశాలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే నిర్ణీత సమయానికి పాక్‌ ఆటగాళ్లు మైదానానికి బయలుదేరకుండా హోటల్‌లోనే ఉండిపోయారు కూడా. అయితే చివరకు తమకు పైక్రాఫ్ట్‌ ‘క్షమాపణ’ చెప్పారంటూ పాక్‌ ఆటగాళ్లు స్టేడియానికి వచ్చారు.ఈ క్రమంలో పసికూన యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించిన పాక్‌ జట్టు.. సూపర్‌-4కు అర్హత సాధించింది. తదుపరి.. ఆదివారం నాటి మ్యాచ్‌లో మరోసారి టీమిండియాను ఢీకొట్టనుంది. కాగా గ్రూప్‌-ఎ టేబుల్‌ టాపర్‌గా టీమిండియా ముందుగానే సూపర్‌-4కు చేరగా.. పాక్‌ రెండో స్థానంతో బెర్తును ఖరారు చేసుకుంది. యూఏఈ, ఒమన్‌ ఎలిమినేట్‌ అయ్యాయి. చదవండి: Asia Cup 2025: మ‌ళ్లీ భార‌త్-పాక్ మ్యాచ్‌.. ఎప్పుడంటే? Not textbook, but definitely effective 💥Watch the #DPWorldAsiaCup, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork pic.twitter.com/n31XKIwlah— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025

We Are Ready: Salman Agha Ahead India Match After Handshake Row9
అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్‌ కెప్టెన్‌

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు సూపర్‌-4 దశకు అర్హత సాధించింది. పసికూన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి.. లీగ్‌ దశను విజయవంతంగా ముగించింది. యూఏఈ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి ఎట్టకేలకు గట్టెక్కిన పాక్‌.. మరోసారి టీమిండియతో తలపడేందుకు సిద్ధమైంది.దుబాయ్‌ వేదికగా సెప్టెంబరు 21న పాకిస్తాన్‌.. టీమిండియా (Ind vs Pak)ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో యూఏఈపై విజయానంతరం పాక్‌ సారథి సల్మాన్‌ ఆఘా (Salman Agha).. తాము ఏ జట్టునైనా ఓడించగలమంటూ కాస్త అతిగా మాట్లాడాడు. ‘‘మేము ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాము. అయితే, మధ్య ఓవర్లలో ఇంకాస్త శ్రమించాల్సింది.అబ్రార్‌ అహ్మద్‌ అత్యద్భుతంఏదైమైనా మా బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. కానీ బ్యాటింగ్‌ పరంగానే మేము నిరాశకు లోనయ్యాం. ఇప్పటి వరకు మా అత్యుత్తమ స్థాయి ప్రదర్శనను కనబరచలేకపోయాం. ఒకవేళ ఈరోజు మేము మెరుగ్గా బ్యాటింగ్‌ చేసి ఉంటే.. 170-180 పరుగులు సాధించేవాళ్లం.షాహిన్‌ ఆఫ్రిది మ్యాచ్‌ విన్నర్‌. అతడి బ్యాటింగ్‌ కూడా మెరుగుపడింది. ఇక అబ్రార్‌ అహ్మద్‌ (2/13) అత్యద్భుతంగా రాణించాడు. చేజారే మ్యాచ్‌లను మావైపు తిప్పడంలో అతడు ఎల్లప్పుడూ ముందే ఉంటాడు.ఎలాంటి జట్టునైనా ఓడించగలముమున్ముందు ఎదురయ్యే ఎలాంటి సవాలుకైనా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇలాగే గొప్పగా ఆడితే.. ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్‌ ఆఘా చెప్పుకొచ్చాడు. పరోక్షంగా టీమిండియాను ఉద్దేశించి.. తాము సూపర్‌-4 పోరుకు సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశాడు.నాటకీయ పరిణామాల నడుమకాగా గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, యూఏఈ, ఒమన్‌ పోటీపడ్డాయి. ఈ క్రమంలో యూఏఈ, పాక్‌లను ఓడించి టీమిండియా తొలుత సూపర్‌ ఫోర్‌కు అర్హత సాధించగా.. ఒమన్‌ ఎలిమినేట్‌ అయింది. అయితే, గ్రూప్‌-ఎ నుంచి మరో బెర్తు కోసం పాక్‌- యూఏఈ బుధవారం రాత్రి తలపడ్డాయి. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 41 పరుగుల తేడాతో గెలిచి.. తమ బెర్తును ఖరారు చేసుకోగా.. యూఏఈ ఎలిమినేట్‌ అయింది. ఇదిలా ఉంటే.. టీమిండియా చేతిలో పాక్‌ ఏడు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్‌ పెట్టుకోని భారత జట్టు.. మ్యాచ్‌ అయిపోయిన తర్వాత కూడా కరచాలనానికి నిరాకరించింది. పహల్గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అవమానంగా భావించిన పాక్‌.. ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో పాటు తాము బాయ్‌కాట్‌ చేస్తామంటూ రచ్చచేసింది. అయితే, ఆఖరికి పాక్‌ తలొగ్గక తప్పలేదు. యూఏఈతో మ్యాచ్‌కు గంట కావాలనే ఆలస్యం చేసినా.. చివరకు మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది.పాకిస్తాన్‌ వర్సెస్‌ యూఏఈ స్కోర్లుటాస్‌: యూఏఈ.. తొలుత బౌలింగ్‌పాక్‌ స్కోరు: 146/9 (20)యూఏఈ స్కోరు: (17.4)ఫలితం: యూఏఈపై 41 పరుగుల తేడాతో పాక్‌ గెలుపుప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: షాహిన్‌ ఆఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్‌.. మూడు ఓవర్ల బౌలింగ్‌లో 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు).చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే!

IND vs PAK on September 21 as Pakistan set Asia Cup 2025 Super 410
Asia Cup 2025: మ‌ళ్లీ భార‌త్-పాక్ మ్యాచ్‌.. ఎప్పుడంటే?

ఆసియాక‌ప్‌-2025లో చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధ‌వారం జ‌రిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో యూఏఈను 41 ప‌రుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూప‌ర్ 4కు ఆర్హ‌త సాధించిన జ‌ట్టుగా పాకిస్తాన్ నిలిచింది.ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 21(ఆదివారం) దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సూప‌ర్‌-4 మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్‌ను చిత్తు చేయాల‌ని భార‌త జ‌ట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గ‌త ఆదివారం(సెప్టెంబ‌ర్ 14) జ‌రిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫ‌లితం కంటే హ్యాండ్ షేక్ వివాద‌మే ఎక్కువ‌గా హైలెట్ అయింది. ఈ మ్యాచ్‌లో పెహల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిర‌స‌న‌గా భార‌త ఆట‌గాళ్లు పాక్ ప్లేయ‌ర్ల‌తో క‌రాచాల‌నాన్ని తిర‌ష్క‌రించారు.దీంతో ఘోర అవ‌మానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భార‌త్ ఆట‌గాళ్ల‌తో పాటు మ్యాచ్ రిఫ‌రీ అండీ పైక్రాప్ట్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్‌లో ప్ర‌త్య‌ర్ధి ఆట‌గాళ్ల‌తో హ్యాండ్ షేక్ చేయడం త‌ప్ప‌నిసారి అని లేకపోవ‌డంతో ఐసీసీ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇప్పుడు సూప‌ర్‌-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భార‌త్ కొన‌సాగించ‌నుంది.చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్‌.. ఈసారి పసికూన బలి

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement