Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Year Ender 2025: Viabhav Divya Sheetal Indian Successful players1
Year Ender 2025: వైభవ్‌, దివ్య, శీతల్‌.. మరెన్నో విజయాలు

భారత క్రీడా‌ రంగంలో ఈ ఏడాది యువ ప్లేయర్లు దుమ్ములేపారు. ఐపీఎల్‌-2025లో పద్నాలుగేళ్ల వైభవ్‌ సూర్యవంశీతో పాటు ఆయుశ్‌ మాత్రే సంచలన ప్రదర్శనలు నమోదు చేయగా.. చెస్‌లో దివ్యా దేశ్‌ముఖ్‌ మహిళల వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచి సత్తా చాటింది. వీరితో పాటు 2025లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న భారత యువ ఆటగాళ్లు, వారి విజయాలను నెమరు వేసుకుందాం!దూసుకొచ్చిన యువ కెరటంభారత క్రికెట్‌లో నయా సెన్సేషన్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). హర్యానాకు చెందిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఐపీఎల్‌ వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ అతడిని ఏకంగా 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.ఈ క్రమంలో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో ఐపీఎల్‌లో శతక్కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అదే విధంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా యూత్‌ వన్డే, టెస్టుల్లో సెంచరీలతో చెలరేగాడు.ఆయుశ్‌ మాత్రేమహారాష్ట్రకు చెందిన ఆయుశ్‌ మాత్రే ఈ ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 28 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వైభవ్‌ మాదిరే సెంచరీ బాదాలని చూసిన ఆయుశ్‌ ఆర్సీబీతో మ్యాచ్‌లో 48 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నాడు.ఇక వైభవ్‌ బ్యాటర్‌గా భారత అండర్‌-19 జట్టు తరఫున సత్తా చాటుతుండగా.. పదిహేడేళ్ల ఆయుశ్‌ అతడికి ఓపెనింగ్‌ జోడీగా ఉంటూనే కెప్టెన్‌గానూ కీలక బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తున్నాడు.దివ్య దేశ్‌ముఖ్‌భారత చెస్‌ రంగంలో సరికొత్త సంచలన దివ్య దేశ్‌ముఖ్‌. ఫిడే మహిళల వరల్డ్‌కప్‌-2025లో ఈ మహారాష్ట్ర అమ్మాయి అద్భుత విజయం సాధించింది. సీనియర్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపిని ఓడించి టైటిల్‌ కైవసం చేసుకుంది.తద్వారా అత్యంత పిన్నవయసులోనే (19 ఏళ్లు) ఈ ఘనత సాధించిన చెస్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. గ్రాండ్‌ మాస్టర్‌ హోదా పొందడానికి ముందే ఈ ఫీట్‌ అందుకున్న ప్లేయర్‌గానూ రికార్డు సాధించింది. వరల్డ్‌కప్‌ విజయంతోనే దివ్యకు గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కింది. ఓవరాల్‌గా ఇండియాలో 88వ, మహిళలలో 44వ గ్రాండ్‌ మాస్టర్‌గా దివ్య నిలిచింది.ఇక వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌-2026​కు కూడా దివ్య దేశ్‌ముఖ్‌ అర్హత సాధించింది.డి. గుకేశ్‌గతేడాది వరల్డ్‌చెస్‌ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌ ఈ ఏడాదిని ఫిడే గ్రాండ్‌ స్విస్‌-2025లో విజయం సాధించాడు. అంతేకాదు.. తొలిసారిగా తన కెరీర్‌లో అత్యుత్తమంగా ఫిడే క్లాసికల్‌ రేటింగ్‌ లిస్టులో వరల్డ్‌ నంబర్‌ 3గా ఈ చెన్నై చిన్నోడు నిలిచాడు. ఆర్‌. ప్రజ్ఞానంద, వైశాలి రమేశ్‌బాబుచెన్నైకి చెందిన అక్కాతమ్ముళ్లైన ఈ చెస్‌ గ్రాండ్‌మాస్టర్లు ఈ ఏడాది కూడా తమ హవా కొనసాగించారు. ప్రజ్ఞానంద టాటా స్టీల్‌ చెస్‌-2025లో గుకేశ్‌ను టై బ్రేకర్‌లో ఓడించి టైటిల్‌ సాధించాడు.తద్వారా ఫిడే రేటింగ్స్‌లో అత్యుత్తమంగా వరల్డ్‌ నంబర్‌ 8 ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనతో అతడు ఆకట్టుకున్నాడు.ఇక వైశాలి రమేశ్‌ బాబు వరుసగా రెండో ఏడాది ఫిడే గ్రాండ్‌ స్విస్‌ 2025 టైటిల్‌ గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా చెస్‌ ప్లేయర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన నేపథ్యంలో వుమెన్స్‌ క్యాండిడేట్స్‌కు అర్హత సాధించింది. ఆమె కంటే ముందు హంపి, దివ్య ఈ క్వాలిఫై అయ్యారు.టాటా స్టీల్‌ చాలెంజర్స్‌లోనూ సత్తా చాటిన వైశాలి రమేశ్‌బాబు మహిళల రేటింగ్స్‌లో ఇండియా నంబర్‌ 2గా నిలిచింది. వీరితో పాటు తెలంగాణ స్టార్‌ అర్జున్‌ ఇరిగేసి కూడా ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.మరెన్నో విజయాలుఫ్రీస్టైల్‌ చెస్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌నే ఓడించి నాకౌట్‌కు చేరాడు. అంతేకాదు.. రాపిడ్‌ రౌండ్‌ రాబిన్‌ స్టేజ్‌లోనూ మరోసారి అతడికి ఓటమిని రుచి చూపించాడు. అయితే, క్వార్టర్‌ఫైనల్స్‌లో విన్సెంట్‌ కెమెర్‌ చేతిలో ఓడిపోవడంతో అర్జున్‌ సెమీస్‌ చేరే అవకాశాన్ని కోల్పోయాడు.ఇక ఇతరులలో పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి ఈ ఏడాది వరల్డ్‌ ఆర్చరీ పారా చాంపియన్‌షిప్స్‌ గెలిచింది. మరోవైపు.. షూటర్‌ సామ్రాట్‌ రాణా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్స్‌షిప్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ విభాగంలో టైటిల్‌ గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.వీరితో పాటు పారా అథ్లెట్‌ సుమిత్‌ ఆంటిల్‌, అథ్లెట్‌ అనిమేశ్‌ కుజూర్‌ చెప్పుకోదగ్గ విజయాలు సాధించారు. మరోవైపు.. టీమ్‌ ఈవెంట్లలో భారత్‌ తొలిసారి మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలవగా.. ఖో-ఖో పురుషుల, మహిళలు.. కబడ్డీ పురుషులు, మహిళా జట్లు చాంపియన్లుగా నిలిచి సత్తా చాటాయి. మహిళల అంధుల క్రికెట్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ గెలిచింది. చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వ‌ర‌కు..

SMAT 2025 Final Ishan Kishan Slams 101 Kushagra Shines Vs HAR2
ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ విధ్వంసకర శతకం.. వీడియో

దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఎలైట్‌-2025 ముగింపు దశకు చేరుకుంది. పుణె వేదికగా గురువారం నాటి ఫైనల్‌తో ఈ సీజన్‌ విజేత ఎవరో తేలనుంది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో హర్యానాతో టైటిల్‌ పోరులో టాస్‌ ఓడిన జార్ఖండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో విరాట్‌ సింగ్‌ (2) విఫలం కాగా.. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హర్యానా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.శతక్కొట్టిన ఇషాన్‌ కిషన్‌.. కుశాగ్రా ధనాధన్‌మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న ఇషాన్‌ కిషన్‌ ఆరు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, శతకం పూర్తి చేసుకున్న వెంటనే.. సుమిత్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరోవైపు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్రా (Kumar Kushagra) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 38 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 81 పరుగులు సాధించాడు.అనుకుల్‌, రాబిన్‌ మింజ్‌ ధనాధన్‌ఇషాన్‌ కిషన్‌, కుమార్‌ కుశాగ్రాకు తోడు అనుకుల్‌ రాయ్‌, రాబిన్‌ మింజ్‌ ధనాధన్‌ దంచికొట్టారు. అనుకుల్‌ రాయ్‌ 20 బంతుల్లో 40 (3 ఫోర్లు, 2 సిక్స్‌లు).. రాబిన్‌ మింజ్‌ 14 బంతుల్లోనే 31 పరుగుల (3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచారు.ఫలితంగా హర్యానాతో ఫైనల్లో జార్ఖండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 262 పరుగులు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్‌ కాంబోజ్‌, సుమిత్‌ కుమార్‌, సమంత్‌ జేఖర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.చదవండి: IND vs SA: డబ్బు తిరిగి ఇచ్చేయండి.. స్పందించిన బీసీసీఐLeading from the front! 🫡Ishan Kishan with a magnificent hundred in the #SMAT final 💯The Jharkhand captain walks back for 1⃣0⃣1⃣(49) 👏Updates ▶️ https://t.co/3fGWDCTjoo@IDFCFIRSTBank | @ishankishan51 pic.twitter.com/PJ7VI752wp— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025

Tension Boils Over Between Stokes And Archer Ponting Reaction Viral3
ఆర్చర్‌పై స్టోక్స్‌ ఫైర్‌!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై!

యాషెస్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా రెండోరోజూ ఆధిపత్యం కొనసాగించింది. అడిలైడ్‌ వేదికగా గురువారం ఆట పూర్తయ్యే సరికి.. ఇంగ్లండ్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 213 పరుగులే చేసింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే ఇంకా 158 పరుగులు వెనుకబడింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లిష్‌ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.ఓపెనర్లు జాక్‌ క్రాలీ (9), బెన్‌ డకెట్‌ (29) నిరాశపరచగా.. ఓలీ పోప్‌ (3), జో రూట్‌ (19) కూడా విఫలం అయ్యారు. ఇలాంటి దశలో హ్యారీ బ్రూక్‌ (45), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (45 నాటౌట్‌) మెరుగైన ఆటతో జట్టు పరువు కాపాడే ప్రయత్నం చేశారు. మిగిలిన వారిలో జేమీ స్మిత్‌ 22 పరుగులు చేయగా.. విల్‌ జాక్స్‌ (6), బ్రైడన్‌ కార్స్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆఖర్లో టెయిలెండర్‌ జోఫ్రా ఆర్చర్‌ 30 పరుగులతో అజేయంగా నిలవడంతో.. స్కోరు 200 అయినా దాటగలిగింది.ఆసీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) మూడు వికెట్లతో చెలరేగగా.. స్కాట్‌ బోలాండ్‌ రెండు, నాథన్‌ లియోన్‌ రెండు, కామెరాన్‌ గ్రీన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. స్టార్క్‌ అర్ధ శతకంఇదిలా ఉంటే.. అంతకు ముందు 326/8తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ 371 పరుగులకు ఆలౌట్‌ అయింది. టెయిలెండర్‌ మిచెల్‌ స్టార్క్‌ అర్ధ శతకం(54)తో అదరగొట్టడంతో కంగారూలకు ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇంగ్లండ్‌ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన స్టార్క్‌ వరుస విరామాల్లో ఫోర్లు బాదుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. అయితే, అతడిని నిలువరించేందుకు ఇంగ్లండ్‌ సారథి స్టోక్స్‌ తన వ్యూహాలన్నీ అమలు చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే తమ జట్టు స్టార్‌ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ (Jofra Archer)పై అసహనం ప్రదర్శించాడు.ఇందుకు ఆర్చర్‌ తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 86వ ఓవర్లో బంతితో రంగంలో దిగిన ఆర్చర్‌.. స్టార్క్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు. దెబ్బకు లెగ్‌ స్టంప్‌ కూడా ఎగిరిపోయింది.చెంప చెళ్లుమనిపించేలా రిప్లై!ఈ క్రమంలో ఆర్చర్‌ను సహచరులు అభినందిస్తుండగా.. స్టోక్స్‌ మాత్రం.. ‘‘నువ్వు ప్రతిసారి ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్ల గురించి ఫిర్యాదు చేయకు. సరైన లైన్‌ అండ్ లెంగ్త్‌తో‌ బౌల్‌ చేయి’’ అని చెప్పినట్లుగా ఉంది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరే వేళ సహచరులు వారిని విడదీశారు.ఈ నేపథ్యంలో ఆర్చర్‌.. ‘‘నాకే సలహా ఇస్తున్నాడు చూడు’’ అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్చర్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. కాగా స్టోక్స్‌- ఆర్చర్‌ వాగ్వాదం గురించి కామెంటేటర్‌, ఆసీస్‌ దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ స్పందిస్తూ..‘‘ఇది మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. స్టోక్స్‌ నేరుగా అతడి దగ్గరికి వెళ్లి క్లాస్‌ తీసుకున్నాడు. అయితే, ఇందుకు ఆర్చర్‌ చెంప మీద కొట్టినట్లుగా వికెట్‌తో సమాధానం ఇచ్చాడు’’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ 2-0తో ఆధిక్యంలో ఉంది. రెండు మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శనతో పేసర్‌ స్టార్క్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలవడం విశేషం.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్‌ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డుBen Stokes saying to Archer Mate don't complain about the field placings when you bowl."Bowl on the stumps" he says and yep and look what happens.#ashes25 #AUSvENG pic.twitter.com/jrB46LSlyF— Bemba Tavuma 𝕏 🐐 (@gaandfaadtits) December 18, 2025

BCCI Breaks Silence Over Refund Demands After IND vs SA 4th T20I4
డబ్బు తిరిగి ఇచ్చేయండి.. బీసీసీఐ స్పందన ఇదే

భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దైన నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై విమర్శల వర్షం కురుస్తోంది. లక్నోలో పొగమంచు కారణంగా టాస్‌ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. ఆరుసార్లు మైదానంలోకి వచ్చి.. పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు ఆఖరికి 9.30 నిమిషాల సమయంలో.. ప్రతికూల వాతావరణం వల్ల మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే, ఉత్తర భారతంలో పరిస్థితులు తెలిసి కూడా బీసీసీఐ (BCCI) ఇలా మ్యాచ్‌ను షెడ్యూల్‌ చేయడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో అక్కడ కాలుష్యం, పొగమంచు ఏ స్థాయిలో ఉంటుందో తెలిసినా లక్నోలో మ్యాచ్‌ ఎలా షెడ్యూల్‌ చేశారని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. స్పందించిన బీసీసీఐమరోవైపు.. లక్నో మ్యాచ్‌ కోసం టికెట్ల రూపంలో డబ్బులు ఖర్చుచేసిన ప్రేక్షకులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పందించారు. ఈ మ్యాచ్‌ నిర్వహణకు ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (UPCA) బాధ్యత వహిస్తుందని తెలిపారు.‘‘ఈ మ్యాచ్‌ టికెట్ల విక్రయాన్ని రాష్ట్ర అసోసియేషన్‌ చూసుకుంది. బీసీసీఐ మ్యాచ్‌ నిర్వహణ హక్కులను మాత్రమే వారికి ఇచ్చింది. మిగతా విషయాలన్ని యూపీసీఏ పరిధిలోనే ఉంటాయి’’ అని IANSకు గురువారం దేవజిత్‌ సైకియా తెలిపారు. తద్వారా ప్రేక్షకులకు టికెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో యూపీసీఏదే పూర్తి బాధ్యత అని చెప్పకనే చెప్పారు. రీఫండ్‌ నిబంధనల ప్రకారం.. కాగా బీసీసీఐ రీఫండ్‌ నిబంధనల ప్రకారం.. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దైతే టికెట్లు కొనుక్కున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు అర్హులు అవుతారు. ఇప్పుడు బంతి యూపీసీఏ కోర్టులో ఉందన్నమాట! కాగా సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత కటక్‌లో భారత్‌ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో ప్రొటిస్‌ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ధర్మశాలలో మూడో టీ20లో భారత్‌ గెలిచి.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో నాలుగో టీ20 జరగాల్సి ఉండగా.. పొగమంచు వల్ల రద్దైపోయింది. ఇరుజట్ల మధ్య ఆఖరి, ఐదో టీ20కి అహ్మదాబాద్‌ వేదిక.చదవండి: తల్లి నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా!

NZ vs WI: Conway Latham scripts history Becomes 1st pair In WTC To5
వేలంలో అన్‌సోల్డ్‌.. కట్‌చేస్తే!.. ప్రపంచ రికార్డు

న్యూజిలాండ్‌ స్టార్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీగా నిలిచారు. వెస్టిండీస్‌తో గురువారం మొదలైన మూడో టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించారు.డబ్ల్యూటీసీ (WTC) 2025-27లో భాగంగా కివీస్‌ జట్టు స్వదేశంలో విండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. అసాధారణ పోరాటంతో వెస్టిండీస్‌ తొలి టెస్టు డ్రా చేసుకోగా.. రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం ‘బే ఓవల్‌’ వేదికగా మూడో టెస్టు మొదలైంది.ఓపెనింగ్‌ జోడీగా వచ్చి.. శతకాలతో చెలరేగిటాస్‌ గెలిచిన ఆతిథ్య కివీస్‌.. పర్యాటక విండీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనింగ్‌ జోడీగా వచ్చిన కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (Tom Latham), డెవాన్‌ కాన్వే సెంచరీలతో చెలరేగారు. లాథమ్‌ 246 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 137 పరుగులు చేసి.. రోచ్‌ బౌలింగ్‌లో రోస్టన్‌ చేజ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.మరోవైపు.. తొలిరోజు ఆట ముగిసే సరికి కాన్వే 279 బంతుల్లో 178 పరుగులతో (25 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా నైట్‌ వాచ్‌మన్‌ జేకబ్‌ డఫీ (Jacob Duffy) 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫలితంగా గురువారం నాటి మొదటిరోజు ఆటలో న్యూజిలాండ్‌ 90 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 334 పరుగులు సాధించింది.ప్రపంచ రికార్డుఇదిలా ఉంటే.. తొలి వికెట్‌కు లాథమ్‌, కాన్వే కలిసి 520 బంతుల్లో ఏకంగా 323 పరుగులు జతచేశారు. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ- మయాంక్‌ అగర్వాల్‌ తొలి వికెట్‌కు 317 పరుగులు జోడించగా.. లాథమ్‌- కాన్వే తాజాగా ఈ రికార్డును సవరించారు.అంతేకాదు.. సొంతగడ్డపై టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ సాధించిన జోడీగానూ లాథమ్‌- కాన్వే చరిత్రకెక్కారు. గతంలో ఈ రికార్డు చార్లెస్‌ స్టెవర్ట్‌ డెంప్‌స్టర్‌- జాన్‌ ఎర్నెస్ట్‌ మిల్స్‌ పేరిట ఉండేది. వీరిద్దరు కలిసి ఇంగ్లండ్‌పై 1930లో 276 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. అబుదాబిలో మంగళవారం జరిగిన ఐపీఎల్‌-2026 మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలి పోయిన కాన్వే.. వేలం తర్వాత తన తొలి మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీ సాధించడం విశేషం.చదవండి: IPL 2026 Auction: స్టీవ్‌ స్మిత్‌, కాన్వేలకు షాక్‌.. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

Mother Sold Jewellery Father Slept Hungry CSK Rs 14 Cr Kartik Sharma Journey6
నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోని ఫ్రాంఛైజీలు తమ జట్లను పటిష్ట పరచుకునే క్రమంలో మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి.. ఒక రకంగా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయి. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది.రూ. 14.20 కోట్లుఅన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు అయిన కార్తిక్‌ శర్మ (Kartik Sharma), ప్రశాంత్‌ వీర్‌ (Prashant Veer)లపై చెరో రూ. 14.20 కోట్లు కుమ్మరించి మరీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ప్రపంచంలోని టాప్‌ టీ20 లీగ్‌లో వీరిద్దరు నయా సెన్సేషన్లుగా నిలిచారు. ఇద్దరిదీ మధ్య తరగతి కుటుంబమే. తల్లిదండ్రుల త్యాగాలతోనే ఆటగాళ్లుగా ఎదిగిన కార్తిక్‌, ప్రశాంత్‌ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా చరిత్ర సృష్టించారు.వీరిద్దరిలో కార్తిక్‌ శర్మ కుటుంబం ఒకానొక దశలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని అతడి కుటుంబమే స్వయంగా IANSకు తెలిపింది. పందొమ్మిదేళ్ల కార్తిక్‌ స్వస్థలం రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌. అతడి తల్లిదండ్రులు మనోజ్‌ శర్మ, రాధ. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం.అయితే, కుమారుడిని క్రికెటర్‌ చేయాలన్నది కార్తిక్‌ తల్లిదండ్రుల కల. ముఖ్యంగా అతడి తల్లి రాధ కొడుకు ఏదో ఒకరోజు కచ్చితంగా ఆటగాడిగా ఎదుగుతాడని బలంగా నమ్మేవారు. అందుకోసం భర్తతో కలిసి ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విషయం గురించి కార్తిక్‌ తండ్రి మనోజ్‌ శర్మ మాటల్లోనే..నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు‘‘మా ఆదాయం అంతంతమాత్రమే. అయితే, నా భార్య రాధకు మాత్రం ఓ కల ఉండేది. ఎట్టిపరిస్థితుల్లోనైనా కార్తిక్‌ను క్రికెటర్‌ చేయాలని ఆమె అంటూ ఉండేది. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. మా కుమారుడు క్రికెటర్‌ అయితే చాలు అనుకునేది.కార్తిక్‌ శిక్షణ కోసం మేము మాకున్న చిన్నపాటి ప్లాట్లు, బరేనా గ్రామంలో మాకున్న పొలం అమ్మేశాము. రాధ తన నగలు కూడా అమ్మేసింది. మా జీవితాల్లో అదొక అత్యంత కఠినమైన దశ. అయితే, ఆర్థిక ఇబ్బందుల ప్రభావం కార్తిక్‌పై పడకుండా మేము చూసుకున్నాము.గ్వాలియర్‌లో టోర్నమెంట్‌ ఆడేందుకు కార్తిక్‌ను నేను అక్కడికి తీసుకువెళ్లాను. నాలుగైదు మ్యాచ్‌లలోనే జట్టు ఇంటిబాట పడుతుందని అనుకున్నాము. అయితే, కార్తిక్‌ ప్రదర్శన కారణంగా జట్టు ఫైనల్‌ చేరింది. అయితే, ఆ మ్యాచ్‌ అయ్యేంత వరకు గ్వాలియర్‌లోనే ఉండేందుకు మా దగ్గర సరిపడా డబ్బు లేదు.ఖాళీ కడుపుతోనేఅప్పుడు మేము ఓ నైట్‌ షెల్టర్‌లో ఉన్నాము. తినడానికి ఏమీ లేదు. ఖాళీ కడుపుతోనే ఆరోజు నిద్రపోయాము. తర్వాత ఫైనల్లో మ్యాచ్‌ గెలిచిన తర్వాత కార్తిక్‌కు వచ్చిన ప్రైజ్‌మనీతోనే మేము తిరిగి ఇంటికి చేరుకోగలిగాము’’ అని తాము పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు.అదే విధంగా.. ‘‘రెండున్నరేళ్ల వయసులోనే నా కుమారుడు బ్యాట్‌తో బంతిని బాది రెండు ఫొటోఫ్రేములను పగులగొట్టాడు. అది మాకెంతో ప్రత్యేకం. ఆరోజే మేము తన భవిష్యత్తు గురించి ఓ అంచనాకు వచ్చేశాము. నిజానికి క్రికెటర్‌ కావాలని నేనూ కలగన్నాను. అయితే, నా కోరిక తీరలేదు. నా కుమారుడి రూపంలో ఇప్పుడు ఆ కల నెరవేరింది’’ అని మనోజ్‌ శర్మ తెలిపారు.చదువునూ కొనసాగిస్తాకాగా దేశీ క్రికెట్‌లో సత్తా చాటిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కార్తిక్‌ శర్మ కోసం వేలంలో గట్టి పోటీ ఎదురైనా చెన్నై మాత్రం అతడిని వదల్లేదు. భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన కార్తిక్‌.. క్రికెట్‌తో పాటు చదువునూ కొనసాగిస్తానని చెబుతున్నాడు. ఇక కార్తిక్‌ పెద్ద తమ్ముడు చదువుపైనే ఎక్కువగా దృష్టి పెట్టగా.. చిన్న తమ్ముడు మాత్రం క్రికెట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.సంకల్పం బలంగా ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరవచ్చని ఇప్పటికే ఎంతో మంది యువ క్రీడాకారులు నిరూపించారు. ఇప్పుడీ జాబితాలో కార్తిక్‌ శర్మ కూడా చేరాడు. తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలంగా.. టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసే ఐపీఎల్‌కు అతడు సెలక్ట్‌ అయ్యాడు. చెన్నై వంటి చాంపియన్‌ జట్టు అతడిని ఏరికోరి కొనుక్కోవడం అతడి ప్రతిభకు నిదర్శనం.చదవండి: IND vs SA: 'ఇంత‌కంటే దారుణ ప‌రిస్థితుల్లో ఆడాను.. అంపైర్ల నిర్ణ‌యంతో షాక‌య్యాను'

Ashes third Test: England trail Australia by 158 runs7
పోరాడుతున్న ఇంగ్లండ్‌.. రెండో రోజు ఆసీస్‌దే

అడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ జ‌ట్టు 8 వికెట్ల న‌ష్టానికి 213 ప‌రుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్‌(45), జోఫ్రా ఆర్చ‌ర్‌(30) ఉన్నారు. వీరిద్ద‌రూ తొమ్మిదో వికెట్‌కు 45 ప‌రుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఇంగ్లండ్ జ‌ట్టు ఇంకా 158 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట‌ర్ల పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌, ఆర్చ‌ర్‌తో పాటు హ్యారీ బ్రూక్ (45), బెన్ డకెట్ (29) ఫ‌ర్వాలేద‌న్పించారు. వైస్ కెప్టెన్ పోప్‌(3), క్రాలీ(9), రూట్(19) తీవ్ర నిరాశ‌ప‌రిచారు.ఆసీస్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. లియోన్‌, బోలాండ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. మ‌రో వికెట్ గ్రీన్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంత‌కుముందు 326/8 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ఆసీస్ 371 ప‌రుగుల‌కు ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..ఖ‌వాజా(82), స్టార్క్‌(54) రాణించారు.డీఆర్ఎస్ వివాదం..కాగా ఈ మ్యాచ్‌లో డీఆర్ఎస్ వివాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేస్తుండ‌గా బంతి స్ప‌ష్టంగా బ్యాట్‌కు తాకిన‌ప్ప‌టికి.. స్నికోమీటర్ సాంకేతిక లోపం వల్ల స్పైక్ రాలేదు. ఇంగ్లండ్ రివ్యూ తీసుకున్న‌ప్ప‌టికి స్నికోమీట‌ర్‌లో స్పైక్ చూపించ‌క‌పోవ‌డంతో థ‌ర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించారు. అయితే ఈ విష‌యంపై ఐసీసీ స్పందించింది. సాంకేతిక అంగీకరిస్తూ.. ఇంగ్లండ్ కోల్పోయిన రివ్యూను తిరిగి ఇచ్చింది

Predicted India playing XI for IND vs SA 5th T20I: Sanju Samson to replace Shubman Gill,8
గిల్‌కు గాయం.. అత‌డికి వ‌రం! భారత తుది జట్టు ఇదే

అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దు కావడంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు సఫారీలు కూడా ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాత్మక పోరులో టీమిండియా కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.సంజూకు లక్కీ ఛాన్స్‌!ఈ మ్యాచ్‌కు భార‌త వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ గాయం కార‌ణంగా దూరమ‌య్యాడు. నాలుగో టీ20కు ముందు ప్రాక్టీస్ చేస్తుండ‌గా గిల్ పాదానికి గాయ‌మైంది. దీంతో చివ‌రి రెండు టీ20ల‌కు అత‌డు దూరంగా ఉండ‌నున్న‌ట్లు బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.గిల్ గైర్హ‌జ‌రీలో స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ తిరిగి తుది జ‌ట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి భారత ఇన్నింగ్స్‌ను సంజూ ప్రారంభించ‌నున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన శాంసన్.. 2026 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో తన ఫామ్‌ను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం.బుమ్రా రీఎంట్రీ!మ‌రోవైపు ఈ కీల‌క మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా అందుబాటులో ఉండవచ్చు. వ్యక్తిగత కారణాల వల్ల మూడో మ్యాచ్‌కు దూరమైన అతను.. నాలుగో మ్యాచ్‌ సందర్భంగా జట్టుతో కలిసి కనిపించాడు. కాబట్టి ఇప్పుడు ఐదో టీ20లో అతడు ఆడే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.ఒక‌వేళ అత‌డు జ‌ట్టుతో క‌లిస్తే హ‌ర్షిత్ రాణా ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో ఉండకపోవచ్చు. అదేవిధంగా అక్ష‌ర్ ప‌టేల్ స్ధానంలో ప్రధాన జ‌ట్టులోకి వ‌చ్చిన ఆల్‌రౌండ‌ర్ షాబాజ్ అహ్మ‌ద్‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌చ్చు.భారత తుది జట్టు (అంచనా):అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా/ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.చదవండి: IND vs SA: క్రికెట్ వ‌ర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!

KL Rahul, Prasidh Krishna named in Karnataka Vijay Hazare Trophy squad9
మయాంక్‌ కెప్టెన్సీలో ఆడనున్న కేఎల్‌ రాహుల్‌

విజయ్ హజారే ట్రోఫీ 2025–26 సీజన్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కర్ణాటక క్రికెట్ అసోసియేషిన్‌ ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్‌, ప్రసిద్ద్ కృష్ణలు ఉన్నారు. దీంతో కర్ణాటక జట్టు మరింత పటిష్టంగా మారింది.బీసీసీఐ అదేశాలతో వీరిద్దరూ దేశవాళీ వన్డే టోర్నీ బరిలోకి దిగనున్నారు. ఇక ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా కరుణ్ నాయర్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా అండర్-23 టోర్నీలో కర్ణాటక తరపున అదరగొట్టిన హర్షిల్ ధర్మాని, ధ్రువ్ ప్రభాకర్లకు సీనియర్ జట్టులో చోటు లభించింది.ఈ టోర్నీలో ధర్మాని తమిళనాడుపై 142 పరుగులు, ప్రభాకర్ విదర్భపై 126 పరుగులతో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా శ్రీష ఆచార్ చోటు దక్కించుకున్నాడు. కర్ణాటక తమ గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లో ఆడనుంది.ఈ టోర్నీలో కర్ణాటక​ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. కర్ణాటక టీమ్ తొలి మ్యాచ్‌లో డిసెంబర్ 24న జార్ఖండ్‌తో తలపడనుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల సైతం ఈ టోర్నీలో ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26 కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్ (వైస్ కెప్టెన్‌), స్మరణ్, శ్రీజిత్, అభినవ్ మనోహర్, శ్రేయాస్ గోపాల్,వ్యాషాక్, మన్వంత్ కుమార్ , శ్రీషా S ఆచార్, అభిలాష్ శెట్టి, శరత్ , హర్షిల్ ధర్మాని, కేఎల్ రాహుల్‌, ప్రభాకర్ చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వ‌ర‌కు..

Virat Kohli To John Cena, Listing Top Sports Personalities Who Shocked The World With Their Retirements10
Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వ‌ర‌కు..

2025 ఏడాదిలో క్రీడల్లో ఒక శకం ముగిసింది. మైదానంలో తమ అసాధారణ ప్రతిభతో అభిమానులను మంత్రముగ్ధులను చేసిన ఎందరో సూపర్ స్టార్‌లు ఈ ఏడాది (2025) తమ కెరీర్‌ను ముగించారు. ఈ క్రమంలో ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడా దిగ్గజాలపై ఓ లుక్కేద్దాం.రోహిత్ శర్మ..టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ ఏడాది మేలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన రోహిత్.. ఇంగ్లండ్ టూర్‌కు ముందు రెడ్‌బాల్ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. తన టెస్టు కెరీర్‌లో 67 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 40.58 సగటుతో 4301 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. రోహిత్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపికయ్యాడు. రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.విరాట్ కోహ్లి..క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లి కూడా రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం రోజులకే కింగ్ కూడా టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. టెస్ట్ క్రికెట్ అంటే తనకు అమితమైన ఇష్టమని, భారత్ తరపున ఆడినంత కాలం ఈ ఫార్మాట్‌లో కొనసాగుతానని కోహ్లి ఎన్నోసార్లు చెప్పారు. కానీ సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కోహ్లి తప్పుకోవడంతో భారత టెస్ట్ క్రికెట్‌లో 'రో-కో' శకం ముగిసింది. విరాట్‌ కోహ్లి తన టెస్టు కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 ఆర్ధ శతకాలు ఉన్నాయి. విరాట్ కూడా ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.ఛతేశ్వర్ పుజారాభారత టెస్ట్ క్రికెట్ లో 'నయా వాల్' గా పేరుగాంచిన ఛతేశ్వర్ పుజారా.. ఈ ఏడాది ఆగస్టులో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి తప్పుకొన్నాడు. గత కొన్నేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం పుజారా అద్భుతంగా రాణిస్తుండేవాడు. కానీ యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన కెరీర్‌ను ఛతేశ్వర్ ముగించాడు. పుజారా తన కెరీర్‌లో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయ.స్టీవ్ స్మిత్‌, మాక్సీ గుడ్‌బైఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్‌, గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకొని అందరికి షాకిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. మాక్సీ ఈ ఏడాది జూన్‌లో తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.హెన్రీచ్ క్లాసెన్సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు సడన్‌గా వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. బోర్డుతో విభేదాల కారణంగా క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్లాసెన్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో 3245 పరుగులు చేశాడు.నికోలస్ పూరన్: వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకొని అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల మోజులో పడి పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.జాన్ సీనా..స్టార్ రెజ్ల‌ర్‌, WWE దిగ్గజం జాన్ సీనా ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికారు. జాన్ సీనా తన చివరి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి.. ప్రపంచ రెజ్లింగ్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. జాన్ సీనా తన కెరీర్‌లో మొత్తం 17 వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు.ఈ లెజెండరీ రెజ్లర్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే 'పీస్‌మేకర్' (Peacemaker) వంటి సిరీస్‌లతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జాన్‌సీనా.సెర్గియో బుస్కెట్స్ (ఫుట్‌బాల్)స్పెయిన్ మిడ్‌ఫీల్డ్ మాంత్రికుడు సెర్గియో బుస్కెట్స్ మేజర్ లీగ్ సాకర్ సీజన్ ముగిసిన తర్వాత ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మయామి ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున లియోనెల్ మెస్సీతో కలిసి సెర్గియో ఆడాడు.పర్దీప్ నర్వాల్ (కబడ్డీ)కబడ్డీ లెజెండ్, 'డూ ఆర్ డై' స్పెషలిస్ట్ పర్దీప్ నర్వాల్ 2025 ప్రో కబడ్డీ లీగ్ (PKL) వేలంలో అమ్ముడుపోకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. అయితే కోచ్‌గా పనిచేసేందుకు తన సిద్దంగా ఉన్నట్లు నర్వాల్ తెలిపాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement