ప్రధాన వార్తలు
'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్ సంచలనం
'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది' అని అంటుంటారు. ఈ మాట సరిగ్గా జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్కి సరిపోతుంది. ఒకప్పుడు ట్రయల్స్ కోసం తన స్నేహితుడి బూట్లు అడిగి తెచ్చుకున్న ఆకిబ్.. ఇప్పుడు నిమిషాల వ్యవధిలో కోటీశ్వరుడుగా మారిపోయాడు. ఎన్నో ఏళ్ల తన శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలంలో రూ. 8.40 కోట్లకు అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆకిబ్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ జట్లు పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. అతడిని బేస్ ప్రైస్ కంటే 28 రెట్లు ఎక్కువ ధర వెచ్చించి టీమ్లోకి తీసుకుంది. ఉమ్రాన్ మాలిక్, యుద్వీర్ సింగ్ చారక్ తర్వాత ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన మూడవ కాశ్మీర్ పేసర్గా నబీ నిలిచాడు. ఈ క్రమంలో ఎవరీ ఆకిబ్ నబీ ధార్ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ ఆకిబ్ నబీ..?29 ఏళ్ల ఆకిబ్ నబీ.. బారముల్లా జిల్లాలోని క్రేరీ గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. దీంతో నబీని డాక్టర్ చేయాలని తన తండ్రి కలలు కన్నాడు. ఆకిబ్ మాత్రం తన తన తండ్రి ఆశయానికి భిన్నంగా క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. సరైన క్రీడా మైదానాలు, శిక్షణ సౌకర్యాలు లేని ప్రాంతం నుండి వచ్చిన నబీ.. తన కఠోర సాధన, పట్టుదలతోనే ఈ స్ధాయికి చేరుకున్నాడు.జమ్మూ కాశ్మీర్లో చలికాలంలో క్రికెట్ ఆడటం చాలా కష్టం. అయినప్పటికి సిమెంట్ వికెట్లపై ప్రాక్టీస్ చేస్తూనే తన బౌలింగ్ను మెరుగు పరుచుకున్నాడు. నబీకి అద్భుతమైన పేస్తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకిబ్కు ఉంది. ఆకిబ్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని 'బారాముల్లా డెయిల్ స్టెయిన్' అని పిలుస్తుంటారు.రంజీల్లో అదుర్స్..నబీ 2020-21 రంజీ సీజన్లో జమ్ము కాశ్మీర్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సీజన్లో నబీ పెద్దగా రాణించికపోయినప్పటికి.. గత రెండేళ్లగా మాత్రం దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నాడు. 2024 రంజీ సీజన్లో 13.93 సగటుతో 44 వికెట్లు పడగొట్టాడు. రంజీ సీజన్ 2025-26లో ఆకిబ్ ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. లీడింగ్ వికెట్ టేకర్గా దార్ కొనసాగుతున్నాడు.నబీకి బంతితో పాటు బ్యాట్తో కూడా రాణించే సత్తా ఉంది. నబీ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 34 మ్యాచ్లు ఆడి 115 వికెట్లతో పాటు 870 పరుగులు చేశాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్గా నబీ రికార్డులెక్కాడు.దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో ఆకిబ్ సత్తాచాటుతున్నాడు. 7 మ్యాచ్లలో 15 వికెట్లు పడగొట్టాడు. బిహార్తో జరిగిన మ్యాచ్లో అతడు నాలుగు వికెట్లు సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. మిచెల్ స్టార్క్, నోర్జే వంటి స్పీడ్ స్టార్లతో డ్రెస్సింగ్ రూమ్ను ఆకిబ్ షేర్ చేసుకోనున్నాడు.
కేకేఆర్లోకి పప్పు యాదవ్ కొడుకు.. ధర ఎంతంటే?
అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్కతా నైట్రైడర్స్ భారీ బిడ్డింగ్స్తో ఆశ్చర్యపరిచింది. రూ. 64.30 కోట్ల భారీ పర్సుతో వేలంలోకి దిగిన కేకేఆర్.. మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ జట్టును పటిష్టం చేసుకుంది.ఈ వేలంలో కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ఏకంగా రూ. 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. అదేవిధంగా కేకేఆర్.. భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా తమ పర్స్లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. కేకేఆర్ కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ (పప్పు యాదవ్) కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు. సార్థక్ను రూ. 30 లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 29 ఏళ్ల సార్థక్ ఐపీఎల్కు ఎంపిక కావడం ఇదే తొలిసారి.సార్థక్ రంజన్ డొమెస్టిక్ క్రికెట్లో ఢిల్లీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు 9.33 సగటుతో 28 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 105, టీ20ల్లో 5 మ్యాచ్లు 66 పరుగులు చేశాడు. ఇక తన కుమారుడు ఐపీఎల్కు ఎంపిక కావడం పట్ల పప్పు యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు."అభినందనలు సార్థక్! నీ టాలెంట్తో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో, నీ కలలను నిజం చేసుకో" అంటూ ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా పప్పు యాదవ్ బీహార్లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
టీమిండియా ఓపెనర్కు అస్వస్థత..
టీమిండియా యువ ఓపెనర్, ముంబై స్టార్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ అనారోగ్యం బారిన పడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో మంగళవారం రాజస్తాన్తో జరిగిన సూపర్ లీగ్ మ్యాచ్ అనంతరం జైశ్వాల్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. దీంతో అతడిని వెంటనే పుణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యులు అతడికి స్కాన్లు నిర్వహించి 'అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్స్ (పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) ఉన్నట్లు తేల్చారు.అయితే జైశ్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అతడికి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అనారోగ్యంతోనే బ్యాటింగ్కాగా రాజస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో జైశ్వాల్ అస్వస్థతతో ఉన్నప్పటికీ ముంబై తరపున మైదానంలోకి దిగాడు. బ్యాటింగ్ చేసే సమయంలో అతడు చాలా అసౌక్యరంగా కన్పించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన జైశ్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. జైశ్వాల్ త్వరగా ఔటైనప్పటికి.. ముంబై 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అజింక్య రహానె (72*), సర్ఫరాజ్ ఖాన్ (73) అద్భుత హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అయితే ఈ మ్యాచ్లో ముంబై గెలిపించినప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ టోర్నీలో జైశ్వాల్ కూడా దుమ్ములేపాడు. మూడు మ్యాచ్లలో 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ జైశ్వాల్ శతక్కొట్టాడు.చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
ఆస్ట్రేలియాకు ఊహించని షాక్.. ఆఖరి నిమిషంలో!
ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు స్టీవ్ స్మిత్ అనారోగ్యం బారిన పడ్డాడు. స్మిత్ 'వర్టిగో' (తల తిరగడం) వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో ఆఖరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరిచింది.స్మిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వికారం, తలతిరగడం వంటి లక్షణాలు అతడికి ఉన్నాయి. స్మిత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయానికి పూర్తిస్థాయిలో కోలుకోలేకపోయారు. అతడిని ఆడించి రిస్క్ తీసుకుడదని మెనెజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. అతడు తిరిగి నాలుగో టెస్టు సమయానికి పూర్తిగా కోలుకునే ఛాన్స్ ఉంది అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు మీడియాతో పేర్కొన్నాడు.అదరగొట్టిన ఉస్మాన్..ఇక స్మిత్ స్ధానంలో వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖావాజాకు తుది జట్టులో చోటు దక్కింది. గత రెండు టెస్టుల్లో ఆడని ఖవాజా.. స్మిత్ స్ధానంలో నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగాడు. అయితే ఉస్మాన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు.మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్లు వెనుదిరగడంతో ఖవాజా జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. 120 బంతుల్లో 82 పరుగులు చేసి కీలక నాక్ ఆడాడు. 48 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి జట్టులోకి రావడం ఆసీస్కు కాస్త ఊరటనిచ్చే ఆంశం.మూడో టెస్టుకు ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, కెమెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే
ఐపీఎల్-2026 మినీ వేలం అబుదాబి వేదికగా విజయవంతంగా ముగిసింది. పది జట్లు 77 మంది ఆటగాళ్ల స్ధానాలను భర్తీ చేశాయి. ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ నిలిచాడు. గ్రీన్ను రూ. 25.20 కోట్ల భారీ ధర వెచ్చించి మరీ కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకుంది. తద్వారా అతడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్గా రికార్డుకెక్కాడు. అదేవిధంగా అన్క్యాప్డ్ ఆటగాళ్ల పంట కూడా పండింది. ఉత్తరప్రదేశ్ స్పిన్ ఆల్రౌండర్ 20 ఏళ్ల ప్రశాంత్ వీర్, రాజస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మలను రికార్డు స్ధాయిలో రూ.14.20 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది.రూ. 30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన ఈ ఇద్దరూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న అన్క్యాప్డ్ ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. అయితే ఈ వేలంలో స్టీవ్ స్మిత్, డెవాన్ కాన్వే వంటి కొంతమంది స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోలేదు. ఈ క్రమంలో అన్సోల్డ్గా మిగిలిన పూర్తి ఆటగాళ్ల జాబితాపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్-2026 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరేజేక్ ఫ్రేజర్-మెక్గుర్క్డెవాన్ కాన్వేగుస్ అట్కిన్సన్వియాన్ ముల్డర్దీపక్ హుడాకేఎస్ భరత్రహ్మానుల్లా గుర్బాజ్జానీ బెయిర్స్టోజామీ స్మిత్గెరాల్డ్ కోయెట్జీస్పెన్సర్ జాన్సన్ఫజల్హక్ ఫారూఖీమహేశ్ తీక్షణముజీబ్ ఉర్ రెహమాన్అథర్వ తైదేఅన్మోల్ప్రీత్ సింగ్అభినవ్ తేజ్రానాఅభినవ్ మనోహర్యష్ ధుల్ఆర్య దేశాయ్విజయ్ శంకర్రాజవర్ధన్ హంగారేకర్మహిపాల్ లోమ్రోర్ఈడెన్ ఆపిల్ టామ్తనుష్ కోటియన్సన్వీర్ సింగ్రుచిత్ అహిర్కమలేష్ నాగరకోటివంశ్ బేడీతుషార్ రహేజారాజ్ లింబానిసిమర్జీత్ సింగ్ఆకాష్ మధ్వల్శివం శుక్లావహిదుల్లా జద్రాన్కర్ణ్ శర్మకుమార్ కార్తికేయసెడిఖుల్లా అటల్మైఖేల్ బ్రేస్వెల్సీన్ అబాట్డారిల్ మిచెల్దాసున్ శనకచేతన్ సకారియావకార్ సలాంఖీల్సల్మాన్ నిజార్మయాంక్ రావత్కేఎమ్ ఆసిఫ్మురుగన్ అశ్విన్తేజస్ బరోకాకేసీ కరియప్పమోహిత్ రాథీడాన్ లారెన్స్తస్కిన్ అహ్మద్రిచర్డ్ గ్లీసన్అల్జారీ జోసెఫ్రిలే మెరెడిత్ఝే రిచర్డ్సన్ధీరజ్ కుమార్తనయ్ త్యాగరాజన్ఇర్ఫాన్ ఉమైర్చింతల్ గాంధీవిశాల్ నిషాద్నాథన్ స్మిత్డేనియల్ లాటెగాన్కరణ్ లాల్ఉత్కర్ష్ సింగ్ఆయుష్ వర్తక్జిక్కు బ్రైట్ఇజాజ్ సవారియామణిశంకర్ మురాసింగ్మనన్ వోహ్రామయాంక్ దాగర్మనీ గ్రేవాల్మాక్నీల్ నోరోన్హాసిద్ధార్థ్ యాదవ్రితిక్ టాడాచామ మిలింద్స్వస్తిక్ చికారావిలియం సదర్లాండ్ఆర్ఎస్ అంబరీష్
ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో టీమిండియా ఆటగాడు, మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా తిరిగి తన సొంత గూటికి చేరాడు. ఐపీఎల్-2026 మినీ వేలంలో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ ఓపెనర్ బ్యాటర్ను ఢిల్లీ క్యాపిటల్స్ కనీస ధర రూ.75 లక్షలకే సొంతం చేసుకుంది. వేలం తొలి సెట్లో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత సెకెండ్ యాక్సిలరేటెడ్ రౌండ్లో కూడా పృథ్వీ షాను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దీంతో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. రెండు రౌండ్లలో తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో పృథ్వీ షా నిరాశచెందాడు. వెంటనే పృథ్వీ షా..తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేస్తూ ఇట్స్ ఒకే అని రాసుకొచ్చాడు. కానీ ఆఖరిలో ఢిల్లీ క్యాపిటల్స్ కనికరించింది. చివరి రౌండ్లో అతడిని ఢిల్లీ కొనుగోలు చేసింది. యాక్సిలరేటెడ్ ప్రాసెస్లో ఎంపికైన 11 మంది ఆటగాళ్లలో షా కూడా ఉన్నాడు. దీంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ముందు పెట్టిన పోస్ట్ను డిలీట్ చేసి.. కొత్తగా మరో పోస్ట్ పెట్టాడు. బ్యాక్ టూ మై ఫ్యామిలీ అంటూ అతడు రాసుకొచ్చాడు.కాగా 2018లో కెప్టెన్గా భారత్కు అండర్-19 ప్రపంచకప్ను అందించిన పృథ్వీ షాను.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడు ఢిల్లీ జట్టులో కీలక సభ్యునిగా మారాడు. పృథ్వీ డీసీకి ఏడు సీజన్ల పాటు ఆడాడు. ఐపీఎల్-2021 వరకు కేవలం రూ. 1.20 అందుకున్న పృథ్వీ షా జీతం ఒక్కసారిగా 525 శాతం పెరిగింది. ఐపీఎల్-2022 సీజన్లో అతడిని రూ.7.50 కోట్లకు ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అనంతరం ఐపీఎల్-2023, 2024 సీజన్లలో ఈ మహరాష్ట్ర ఆటగాడు రూ.8 కోట్లు అందుకున్నాడు. కానీ పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యల వల్ల అతడిని ఐపీఎల్-2025 సీజన్కు ముందు ఢిల్లీ వేలంలోకి విడిచిపెట్టింది. వేలంలోకి వచ్చిన పృథ్వీ షాను ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఏడాది తర్వాత ఢిల్లీ మరోసారి అతడికి అవకాశమిచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర తరపున ఆడుతున్న షా.. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఆ ఫామ్ను ఐపీఎల్లో కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: ఐపీఎల్కు కరీంనగర్ కుర్రాడు
ఐపీఎల్కు కరీంనగర్ కుర్రాడు
కరీంనగర్ కుర్రాడు ఐపీఎల్కు ఎంపికయ్యాడు. జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్రావును మంగళవారం అబుదాబీలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30లక్షలకు దక్కించుకుంది. టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్మన్ అయిన పేరాల అమన్ రావు ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్–19, అండర్–23లో గొప్ప నైపుణ్యం ప్రదర్శించారు. వేలంలో పాల్గొనేందుకు అమన్రావుకు పాస్పోర్టు లేకపోవడంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అప్పటికప్పుడు స్పందించి పాస్పోర్టు జారీ చేయించారని సునీల్రావు తెలిపారు. మొట్టమొదటిసారిగా జిల్లాకు చెందిన కుర్రాడు ఐపీఎల్కు ఎంపిక కావడం హర్షణీయమన్నారు.
సిరీస్ సొంతం చేసుకోవాలని...
స్టార్ బ్యాటర్ల వరుస వైఫల్యాలు... కీలక బౌలర్లకు గాయాలు... గైర్హాజరీలు... అయితేనేం జోరు కొనసాగించాలని.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకోవాలని... సూర్యకుమార్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు దక్షిణాఫ్రికాతో భారత జట్టు నాలుగో టి20 మ్యాచ్ ఆడనుంది. ఆతిథ్య జట్టులోని ప్రతికూలతల్ని సొమ్ము చేసుకొని లక్నో వేదికను లక్కీగా మలచుకోవాలని పర్యాటక దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. ఫలితంగా ఈ మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. లక్నో: భారత్ ఇక్కడ కాకపోతే... అహ్మదాబాద్ (ఆఖరి మ్యాచ్ వేదిక)లోనైనా సిరీస్ను గెలిచే ధీమాతో బరిలోకి దిగుతుండగా... దక్షిణాఫ్రికా ఇక్కడ ఓడితే ఇక్కడే సిరీస్ను ఆతిథ్య జట్టు చేతిలో పెట్టేసే భయంతో మ్యాచ్ ఆడనుంది. ఈ కారణంతోనే సిరీస్లో పైచేయి సాధించిన టీమిండియా రెట్టింపు హుషారుతో సమరానికి సై అంటోంది. గత మ్యాచ్లో స్పిన్, పేస్, బ్యాటింగ్ అన్నీ కలిసి ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని చిత్తు చేసిన సూర్యకుమార్ బృందం గత ‘షో’ను పునరావృతం చేస్తే ఈ మ్యాచ్ గెలుపు, సిరీస్ కైవసం ఏమాత్రం కష్టం కానేకాదు. ఇక సఫారీ పరిస్థితి పూర్తి భిన్నం! మ్యాచ్లో గెలిచేందుకు లక్నోలో సిరీస్ను సమం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తుంది. కెప్టెన్ మార్క్రమ్ ఫామ్కు, డికాక్ మెరుపులు తోడైతే పరుగుల వరద పారే అవకాశముంది. ఆ ఇద్దరిపై ఒత్తిడి భారత జట్టు ఫలితాల పరంగా పైచేయిగా కనిపిస్తోంది. అలాగని జట్టులోని అందరి ప్రదర్శన బాగుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! నాయకుడు సూర్యకుమార్ మెరిపించి చాలా రోజులైంది. గత 21 ఇన్నింగ్స్లుగా అతను చెప్పుకోదగ్గ ప్రదర్శనేది లేదు. ఫిఫ్టీ చేసి ఏడాది దాటింది. పోయిన ఏడాది అక్టోబర్లో అర్ధశతకం సాధించాక మళ్లీ అలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. ఇక ఓపెనింగ్లో శుబ్మన్ గిల్ వరుస వైఫల్యాలు బ్యాటింగ్ ఆర్డర్పై పెనుభారమే మోపుతోంది. గత మ్యాచ్లో 28 పరుగులు చేశాడు. కానీ 28 బంతులాడాడు. ఓ టాపార్డర్ బ్యాటర్కు... పైగా టి20ల్లో ఇది అత్తెసరు స్కోరే అవుతుంది. అభిషేక్ శర్మ, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మలతో భారత్ బ్యాటింగ్లో గట్టెక్కుతుంది. బౌలింగ్ విభాగానికి వస్తే... భారత పేస్ ఎక్స్ప్రెస్ బుమ్రా ఈ మ్యాచ్కూ అందుబాటులో లేడు. తన సన్నిహితుడొకరు ఆస్పత్రిపాలవడంతో గత మ్యాచ్కు ముందే జట్టును వీడాడు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆఖరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. వీళ్లిద్దరు గత మ్యాచ్ కూడా ఆడనప్పటికీ... ఇది భారత బౌలింగ్ దళంపై ఒత్తిడిని పెంచే అంశం. ఏదో ఒక మ్యాచ్లో నెట్టుకురావొచ్చు. కానీ ప్రతీ మ్యాచ్లోనూ కీలక ఆటగాళ్లు బరిలోకి దిగకపోతే ఏ జట్టుకైన అది ప్రతికూలాంశమే! హెండ్రిక్స్ ఘోర వైఫల్యం ప్రత్యర్థి దక్షిణాఫ్రికా సైతం టాపార్డర్ వైఫల్యంతో తడబడుతూనే ఉంది. ఓపెనర్లలో హెండ్రిక్స్ పేలవమైన ఆటతీరుతో టాపార్డర్కే కాదు మొత్తం జట్టుకే భారంగా పరిణమించాడు. ఒక మ్యాచ్లో 8, ఒకో మ్యాచ్లో డకౌట్. ఇక డికాక్ ఒక్క రెండో టి20 మినహా మిగతా రెండు మ్యాచ్ల్లోనూ 0, 1 సింగిల్ డిజిట్లే! ఇద్దరు ఓపెనర్లు ఘోరంగా ఆడుతుండటంతో దక్షిణాఫ్రికాకు శుభారంభం కాదు కదా కనీసం ఓ మోస్తరు భాగస్వామ్యమైనా దక్కడం లేదు. ఇది మొత్తం ఇన్నింగ్స్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కెప్టెన్ మార్క్రమ్ సహా మిడిలార్డర్ బ్యాటర్లలో బ్రెవిస్, ఫెరిరా, మిల్లర్లతో జట్టు నెట్టుకొస్తుంది. కానీ నెగ్గాలంటే మాత్రం టాపార్డర్ కీలకం కదా! బౌలింగ్లో అనుభవజు్ఞలైన ఎన్గిడి, యాన్సెన్లతో పాటు ఒటెనిల్ బార్ట్మన్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే సిరీస్ను సమం చేయాల్సిన ఈ మ్యాచ్లో మాత్రం ఏ ఒకరిద్దరు బౌలర్లో, బ్యాటర్లో కాదు సమష్టిగా రాణిస్తేనే పటిష్టమైన భారత్ను నిలువరిస్తుంది. లేదంటే గత ఫలితాలే పునరావృతం కాకతప్పదు. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, శుబ్మన్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అర్‡్షదీప్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్ ), డికాక్, రిజా హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరిరా, యాన్సెన్, బాష్, జార్జ్ లిండే/కేశవ్, ఎన్గిడి, బార్ట్మన్.పిచ్, వాతావరణంలక్నో స్పిన్ ఫ్రెండ్లీ వికెట్. తప్పకుండా బ్యాటింగ్ దిగిన జట్టుకు స్పిన్నర్ల నుంచి సవాళ్లు తప్పవు. అయితే మంచు ప్రభావం వల్ల రెండో ఇన్నింగ్స్ అంటే ఛేదించే జట్టుకే అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్కేమొగ్గుచూపుతుంది.. చలి తప్ప వాన ముప్పు లేదు.
ఆంధ్ర గెలిచినా...
పుణే: దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఆంధ్ర జట్టు ‘సూపర్ లీగ్’ దశతోనే ముగించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా... మంగళవారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్లో ఆంధ్ర జట్టు విజయం సాధించినా... రన్రేట్లో వెనుకబడ్డ కారణంగా ఫైనల్ చేరే అవకాశం కోల్పోయింది. ‘సూపర్ లీగ్’లో మూడు మ్యాచ్లు ఆడిన ఆంధ్ర జట్టు 2 విజయాలు, ఒక పరాజయంతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. జార్ఖండ్ కూడా ఎనిమిది పాయింట్లతోనే ఉన్నా... రన్రేట్లో మెరుగ్గా ఉన్న జార్ఖండ్ ముందంజ వేయగా... ఆంధ్ర జట్టు ఇంటిబాట పట్టింది. టీమిండియా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (22 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్లు; 2/32) ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో చివరి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 9 పరుగుల తేడాతో జార్ఖండ్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ రెడ్డి టాప్ స్కోరర్ కాగా... శ్రీకర్ భరత్ (35; 4 ఫోర్లు, 1 సిక్స్), అశి్వన్ హెబ్బర్ (30; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం జార్ఖండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. విరాట్ సింగ్ (40 బంతుల్లో 77; 4 ఫోర్లు, 7 సిక్స్లు) హాఫ్సెంచరీ సాధించగా... కెప్టెన్ ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన జార్ఖండ్ (+0.221)... ఆంధ్ర (–0.113) చేతిలో కేవలం 9 పరుగుల తేడాతో మాత్రమే ఓడటంతో మెరుగైన రన్రేట్తో తుదిపోరుకు అర్హత సాధించింది.
హైదరాబాద్ చేజేతులా...
పుణే: ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరే చక్కటి అవకాశాన్ని కోల్పోయింది. గత రెండు మ్యాచ్ల్లో గెలిచిన హైదరాబాద్... మంగళవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన చివరి పోరులో 124 పరుగుల తేడాతో హరియాణా చేతిలో ఓడింది. దీంతో రన్రేట్లో వెనుకబడి ‘సూపర్ లీగ్’ దశతోనే సరిపెట్టుకుంది. రెగ్యులర్ కెప్టెన్ సీవీ మిలింద్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరంకాగా... తనయ్ త్యాగరాజన్ ఈ మ్యాచ్లో నాయకత్వం వహించాడు. టాస్ గెలిచిన తనయ్ ఫీల్డింగ్ ఎంచుకోవాలని నిర్ణయం తీసుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన హరియాణా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సమంత్ జాఖర్ (22 బంతుల్లో 60; 1 ఫోర్, 8 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... కెపె్టన్ అంకిత్ కుమార్ (27 బంతుల్లో 57; 1 ఫోర్, 6 సిక్స్లు), పార్థ్ వత్స్ (19 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్లు) దంచికొట్టారు. హైదరాబాద్ బౌలర్లలో స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 37 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టగా... మిగిలిన బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 16.1 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ బుద్ధి (37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. తన్మయ్ అగర్వాల్ (3), అమన్ రావు (13), మికిల్ జైస్వాల్ (7), కెపె్టన్ తనయ్ త్యాగరాజన్ (16), అర్ఫాజ్ అహ్మద్ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు చేరారు. హరియాణా బౌలర్లలో అమిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు. ‘సూపర్ లీగ్’ దశలో మూడు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ 2 విజయాలు, ఒక ఓటమితో 8 పాయింట్లు సాధించి గ్రూప్లో రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ రన్రేట్ (–0.413) కంటే మెరుగ్గా ఉన్న హరియాణా (+2.325) ఫైనల్కు అర్హత సాధించింది. ఇతర మ్యాచ్ల్లో పంజాబ్ 2 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్పై, ముంబై 3 వికెట్ల తేడాతో రాజస్తాన్పై గెలిచాయి. రెండు గ్రూప్ల్లో ‘టాప్’లో నిలిచిన హరియాణా, జార్ఖండ్ మధ్య గురువారం ఫైనల్ జరగనుంది. ముస్తాక్ అలీ టోర్నీలో ఈ రెండు జట్లు తొలిసారి తుది పోరుకు చేరుకోవడంతో కొత్త చాంపియన్గా అవతరించడం ఖాయమైంది.
సచిన్... సచిన్... మెస్సీ... మెస్సీ
ముంబై: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్స...
‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మె...
సింగిల్స్ చాంప్స్ ఉన్నతి, కిరణ్
కటక్: ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్...
చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ జట్టు... తొలిసారి ప్రపంచకప్ టైటిల్ సొంతం
చెన్నై: స్వదేశంలో భారత స్క్వాష్ జట్టు చిరస్మరణీయ ...
సిరీస్ సొంతం చేసుకోవాలని...
స్టార్ బ్యాటర్ల వరుస వైఫల్యాలు... కీలక బౌలర్లకు గ...
ఆంధ్ర గెలిచినా...
పుణే: దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అ...
హైదరాబాద్ చేజేతులా...
పుణే: ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఫైనల...
కామెరాన్ గ్రీన్పై కోట్లాభిషేకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో ఆ్...
క్రీడలు
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (ఫోటోలు)
కోల్కతాలో మెస్సీ మాయ.. (ఫోటోలు)
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
‘విరుష్క’ పెళ్లి రోజు.. అందమైన ఫొటోలు
బాలిలో చిల్ అవుతున్న షెఫాలీ వర్మ (ఫొటోలు)
హార్దిక్ పాండ్యా సూపర్ షో...తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
వీడియోలు
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్
ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
ధర్మశాలలో భారత్ పంజా..
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
హైదరాబాద్ కు మెస్సీ.. ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు!
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ భారీ స్కోర్
సానియా మీర్జా లానే స్మృతి మంధాన కూడా..!
