Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Lakshya Sen to face world No 1 Shi Yu Qi in first round In All England 20261
నిరీక్షణ ముగిసేనా? 

బర్మింగ్‌హామ్‌: శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్‌ టోర్నీ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌కు నేడు తెర లేవనుంది. ఆరు రోజులపాటు జరిగే ఈ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలోని ఐదు విభాగాల్లోనూ (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌) భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ఆయుశ్‌ శెట్టి... డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక బన్సోద్, ఉన్నతి హుడా... డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌; ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో బరిలో ఉన్నారు. అయితే స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌ ఎయిర్‌ స్పేస్, ఎయిర్‌పోర్టు మూసివేయడంతో సింధు అక్కడే చిక్కుకుపోయింది. దుబాయ్‌ విమానాశ్రయం నుంచి సోమవారం సాయంత్రం నుంచి పాక్షికంగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సింధు తన తొలి రౌండ్‌ మ్యాచ్‌ను బుధవారం థాయ్‌లాండ్‌ ప్లేయర్‌ సుపనిద కటెథోంగ్‌తో ఆడాల్సి ఉంది. సింధు మినహా భారత ఇతర ప్లేయర్లు సింగపూర్, ఆఫ్రికా దేశాల మీదుగా బర్మింగ్‌హామ్‌కు చేరుకున్నారు. క్లిష్టమైన ‘డ్రా’ 127 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్‌ (2001లో) మాత్రమే టైటిల్స్‌ సాధించారు. 2022లో లక్ష్య సేన్‌ ఫైనల్‌ చేరినా తుదకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహా్వల్‌ కూడా రన్నరప్‌గానే నిలిచింది. ఈ ఏడాదైనా భారత ప్లేయర్లు టైటిల్‌ నిరీక్షణకు తెరదించుతారో లేదో వేచి చూడాలి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ఆయుశ్‌ శెట్టిలకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ షి యుకి (చైనా)తో లక్ష్య సేన్, అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా)తో ఆయుశ్‌ శెట్టి ఆడతారు. 2022, 2023లలో సెమీఫైనల్‌ చేరిన గాయత్రి–ట్రెసా ద్వయం తొలి రౌండ్‌లో సయాకా హిరోటా–అయాకో సకురామోటో (జపాన్‌) జోడీతో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో కాంగ్‌ ఖాయ్‌ జింగ్‌–ఆరోన్‌ టాయ్‌ (మలేసియా)లతో సాతి్వక్‌–చిరాగ్‌ పోటీపడతారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ చెన్‌ యుఫె (చైనా)తో మాళవిక; ఆరో సీడ్‌ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో ఉన్నతి ఆడతారు.

T20 WC 2026: team india dropped 3 catches in do or die match against west indies2
టీమిండియాలో ఆందోళన.. తప్పు జరిగిందా, చరిత్ర హీనులవుతారు..!

టీ20 ప్రపంచకప్‌ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.కాగా, ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. భారత ఫీల్డింగ్‌ ప్రతి భారత క్రికెట్‌ అభిమానిని ఆందోళనకు గురి చేస్తోంది. విండీస్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 మ్యాచ్‌లు నేలపాలు చేశారు. ముఖ్యంగా అభిషేక్‌ శర్మ కీలక దశలో రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. ఓ క్యాచ్‌ను తిలక్‌ వర్మ వదిలేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చుంటే, అభిషేక్‌, తిలక్‌పై ముప్పేట దాడి జరిగుండేది. టీమిండియా గెలవడంతో ఈ ఇద్దరు భారీ ట్రోలింగ్‌ను తప్పించుకున్నారు.విండీస్‌తో మ్యాచ్‌ ఒక్కటే కాదు, మెగా టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఫీల్డింగ్‌ అత్యంత చెత్తగా ఉంది. సూపర్‌-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త క్యాచింగ్‌ ప్రదర్శనలు మనవే. భారత ఫీల్డర్లు 100లో కేవలం​ 71 శాతం క్యాచ్‌లను మాత్రమే పట్టారు. మొత్తంగా సూపర్‌-8కు చేరిన జట్లలో ఏ జట్టు వదలని విధంగా ఏకంగా 13 క్యాచ్‌లు నేలపాలు చేశాడు. అదనంగా భారత ఫీల్డర్లు మిస్‌ ఫీల్డింగ్‌ కూడా చేసి ప్రత్యర్దిని అదనపు పరుగులు సమకూర్చారు.సెమీస్‌లో ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియా తప్పక మూల్యం​ చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయన్న విషయాన్ని భారత ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత ప్రపంచకప్‌ ఫైనల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టిన క్యాచే​ భారత్‌ను జగజ్జేతగా నిలిపిన విషయాన్ని ప్రస్తుత టీమిండియా సభ్యులు గుర్తు పెట్టుకోవాలి. క్యాచ్‌లు నేలపాలు చేసినా, మిస్‌ ఫీల్డింగ్‌ చేసి అదనపు పరుగులు సమర్పించుకున్నా, సరిదిద్దుకోవడానికి జరగబోయేది సామాన్యమైన మ్యాచ్‌ కాదు. ఒక్కసారి తప్పు జరిగిపోతే, ఎంతటి స్టార్‌ ఆటగాడైనా చరిత్ర హీనుడవ్వాల్సిందే. కాబట్టి, సెమీఫైనల్లో ప్రతి భారత ఆటగాడు ఫీల్డ్‌లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్‌ హెచ్చరిస్తున్నారు.

What happens if T20 WC semi final get washed out3
T20 WC 2026: అదే జరిగితే భారత్‌కు చుక్కెదురే..!

టీ20 ప్రపంచకప్‌ 2026 తుది దశకు చేరింది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్‌లకు వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం​ చేత రద్దైతే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నాకౌట్‌ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్‌ డే కేటాయించింది. షెడ్యూలైన రోజు మ్యాచ్‌ జరుగకపోయినా లేక పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి మరుసటి రోజు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్‌ డేలో కూడా మ్యాచ్‌ సాధ్యపడకపోతే మాత్రం సూపర్‌-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది.ఈ లెక్కన తొలి సెమీఫైనల్‌ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్‌-8లో గ్రూప్‌-1 టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్‌కు వెళ్తుంది. న్యూజిలాండ్‌ ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్‌ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్‌-8లో గ్రూప్‌-2 టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏ కారణంగా కూడా సెమీస్‌ రద్దు కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.

Jonny Bairstow Trapped With Family In Dubai As USA-Iran War Escalates4
మధ్యప్రాచ్యంలో యుద్దం.. ఆపదలో ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జానీ బెయిర్‌స్టో ఆపదలో ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ద నేపథ్యంలో కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకుని, బిక్కుబిక్కుమంటున్నాడు. బెయిర్‌స్టో కొద్ది రోజుల కిందట కుటుంబంతో కలిసి దుబాయ్‌ పర్యటనకు వెళ్లాడు. వారు తిరిగి స్వదేశానికి బయల్దేరాల్సిన సమయంలో మధ్యప్రాచ్యంలో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. దీంతో దుబాయ్‌ విమానాశ్రయం సహా మధ్యప్రాచ్యంలోని అన్ని విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. ఎ‍క్కడి వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ కలం వెల్లదీస్తున్నారు.For those writing that I’m with the England Lions team… I am not. I am with my young family in Dubai…sure the England Lions security staff will be doing all they can to get them out of Abu Dhabi but I am trying to keep my family safe and get us out of here!!— Jonny Bairstow (@jbairstow21) March 2, 2026ముందుగా బెయిర్‌స్టో అబుదాబీలో పర్యటిస్తున్న ఇంగ్లండ్‌ లయన్స్‌ బృందంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం​ లేదని బెయిర్‌స్టో స్వయంగా స్పష్టం చేశాడు. తాను కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించాడు.ఇంగ్లండ్ లయన్స్‌ను భద్రతా సిబ్బంది అబుదాబి నుండి బయటకు తీసుకురావడానికి చేయగలిగినదంతా చేస్తుందని అనుకుంటున్నాను. నేను నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకొని, ఇక్కడి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కాగా, మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఈ యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్‌ షాహీన్స్‌-ఇంగ్లండ్‌ లయన్స్‌ వన్డే సిరీస్‌ రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్‌ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. త్వరలో దుబాయ్‌, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్‌-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌ కూడా సందిగ్దంలో పడింది. మరోవైపు సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగించుకున్న పాకిస్తాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు కూడా దుబాయ్‌ విమానాశ్రయం మూసివేయడంతో డర్బన్‌లోనే ఇరుక్కుపోయింది.

Cricketer Sanju Samson offers the real Kerala story says Netizens5
ధ‌న్య‌వాదాలు.. సంజు సామ్స‌న్‌

చ‌క్క‌టి ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించి సెమీస్‌కు చేర్చిన టీమిండియా బ్యాట‌ర్ సంజు సామ్స‌న్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. టి20 ప్ర‌పంచ‌క‌ప్‌ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రివ‌ర‌కు క్రీజ్‌లో నిల‌బ‌డి విజ‌యాన్ని అందించిన ఈ కేర‌ళ క్రికెట‌ర్‌పై అభిమానుల‌తో పాటు ప్ర‌ముఖులు పొగుడుతున్నారు. ముఖ్యంగా సొంత రాష్ట్రానికి చెందిన సినిమా స్టార్స్ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. సంజు సూప‌ర్ ఇన్నింగ్స్ కీర్తిస్తూ మాలీవుడ్ ప్ర‌ముఖులు మోహన్‌లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, బాసిల్ జోస‌ఫ్‌, న‌విన్ పాలీ త‌దిత‌రులు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు.Exhilarating to watch @IamSanjuSamson in such sublime form! A truly masterful innings that speaks volumes of his character and talent. Hearty congratulations to the entire Indian team for storming into the #T20WorldCup2026 Semi-Finals. Keep the flag flying high! 🇮🇳 pic.twitter.com/jLMYCQSOWc— Mohanlal (@Mohanlal) March 1, 2026విజ‌య‌కేత‌నం ఎగురవేయండిమాస్ట‌ర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో సంజు సామ్స‌న్ స‌త్తా చాటాడని ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌లాల్‌ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. సంజు ఫామ్‌లోకి రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. సెమీ-ఫైనల్స్‌కు దూసుకెళ్లిన టీమిండియాకు అభినంద‌న‌లు తెలిపారు. సెమీస్‌లోనూ విజ‌య‌కేత‌నం ఎగురవేయాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. స్వచ్ఛమైన ఆధిపత్యంసంజు సామ్స‌న్ అద్భుతంగా ఆడాడ‌ని విల‌క్ష‌ణ న‌టుడు మ‌మ్ముట్టి ప్ర‌శంసించారు. అతిపెద్ద వేదిక‌పై స్వచ్ఛమైన ఆధిపత్యం చెలాయించారని వ్యాఖ్యానించారు. సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో సంజు ఫొటో పోస్ట్ చేసి హార్ట్‌, క్లాప్స్ ఎమోజీల‌ను జోడించారు.What a knock, @IamSanjuSamsonPure class. Pure dominance. A fearless statement on the biggest stage.Congratulations to the Indian cricket team for marching into the #T20WorldCup2026 Semi Final. pic.twitter.com/j8Di5hYY7C— Mammootty (@mammukka) March 1, 2026 చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్'టి20 గొప్ప ఇన్నింగ్స్‌లో ఇదీ ఒక‌టి. కీల‌క క్వార్ట‌ర్ ఫైనల్లో సంజు సామ్స‌న్ చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ ఆడాడ‌'ని నటుడు-చిత్రనిర్మాత- ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. “నిన్ను చూసి గర్వంగా ఉంది మచా. (మిత్రుడు)” అని నటుడు కాళిదాస్ జయరామ్ మెచ్చుకున్నారు. వాట్ యాన్ ఇన్నింగ్స్ అంటూ న‌టుడు టొవినో థామస్ పొగిడారు. 'థ్యాంక్యూ సంజు సామ్స‌న్' అంటూ ప్ర‌కాశ్‌రాజ్ అభినందించారు.THE KERALA STORY: Sanju Samson takes India to the semis.— CS Amudhan (@csamudhan) March 1, 2026 ది రియ‌ల్ కేర‌ళ స్టోరీకాగా, కేర‌ళ స్టోరీ 2 సినిమాకు కొంత‌మంది కౌంట‌ర్ ఇచ్చారు. త‌మిళ‌ దర్శకుడు సిఎస్ అముధన్ సంజు విజయాన్ని ‘ది కేరళ స్టోరీ: టీమిండియాను సంజు సామ్స‌న్ సెమీస్ ఫైన‌ల్‌కు చేర్చాడ‌ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత సంజు చేసిన ప్రార్థ‌న‌లు మ‌త‌సామ‌ర‌స్యానికి చిరునామాగా నిలిచాయ‌ని, ఇదే రియ‌ల్ కేర‌ళ స్టోరీ అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు కామెంట్లు పెడుతున్నారు. ఎవ‌రినీ హర్ట్ చేయ‌కుండా అన్ని మ‌తాల‌ను గౌర‌వించాడ‌ని పేర్కొంటూ ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు. The Real Kerala Story ☪️✝️🕉️ft. Sanju Samson ❤️ pic.twitter.com/slCZHUHvWA— Luckyram9887.base.eth π² (@Luckyram9887) March 2, 2026

Pakistan Women's cricket Team Deserted Because Of America Israel Iran War6
యుద్ధ ప్రభావం.. అక్కడే ఇరుక్కుపోయిన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు

మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా పాకిస్తాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు సౌతాఫ్రికాలో ఇరుక్కుపోయింది. సౌతాఫ్రికాలో వైట్‌ బాల్‌ సిరీస్‌ ముగించుకున్న పాకిస్తాన్‌ జట్టు ఇవాళ (మార్చి 2) రాత్రి డర్బన్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంది. అయితే, యుద్ధం కారణంగా దుబాయ్‌ విమానాశ్రయం మూసివేయడటంతో ఈ ప్రయాణం నిలిచిపోయింది. దీంతో పాక్‌ జట్టు డర్బన్‌లోనే ఆగిపోయింది. తిరుగు ప్రయాణంపై స్పష్టత లేకపోవడంతో పాక్‌ బృందం ఆందోళన చెందుతుంది. తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని పీసీబీకి విజ్ఞప్తులు చేస్తుంది.యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్‌ షాహీన్స్‌-ఇంగ్లండ్‌ లయన్స్‌ వన్డే సిరీస్‌ కూడా రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్‌ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. యుద్ద ప్రభావం యావత్‌ క్రికెట్‌ ప్రపంచంపై పడే అవకాశం ఉంది. త్వరలో దుబాయ్‌, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్‌-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌ కూడా సందిగ్దంలో పడింది.ఇదిలా ఉంటే, పాక్‌ మహిళల క్రికెట్‌ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించింది. ఈ రెండు సిరీస్‌లను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం​ చేసుకుంది. అయితే చివరిదైన మూడో టీ20లో గెలిచి పాక్‌ ఊరట పొందింది. డర్బన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ 119 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది.

Harbhajan Singh Joins BCCI7
బీసీసీఐలో చేరిన హర్భజన్‌ సింగ్‌

భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐలో చేరాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, యువ స్పిన్నర్లకు మార్గదర్శకత్వం చేయనున్నాడు. ఇప్పటికే మరో భారత మాజీ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ ఫాస్ట్ బౌలర్లతో పని చేస్తున్నాడు. తాజాగా హర్భజన్ సింగ్ ఈ జాబితాలో చేరాడు.బీసీసీఐ మార్చి మొదటి వారంలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో రెడ్ బాల్ స్పెషలైజ్డ్ క్యాంపులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ శిబిరాలు అండర్-19 మరియు ఇండియా A జట్లలో ప్రతిభ చూపిన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీరిని త్వరలోనే సీనియర్ జట్టులోకి తీసుకురావడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మరో దిగ్గజం కూడా..!యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత మాజీలు క్యూ కడుతున్నారు. జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌ ఇప్పటికే రంగంలోకి దిగగా.. మరో దిగ్గజ బౌలర్‌ కూడా తన స్పెషలైజేషన్‌లో యువ బౌలర్లకు శిక్షణ​ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే రిస్ట్‌ స్పిన్నర్ల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం కార్యక్రమాన్ని మరో భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సమన్వయం చేస్తున్నారు. ఇతర మాజీ ఆటగాళ్లను కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి అతను సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, బీసీసీఐలో ఇలాంటి శిక్షణా శిబిరాలు కొత్తవి కావు. జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మాజీ ఆటగాళ్లను యువ క్రికెటర్లకు మార్గదర్శకులుగా ఆహ్వానించే పద్ధతి ప్రారంభమైంది. అప్పట్లో చందు బోర్డే, ఎరపల్లి ప్రసన్న, సయ్యద్ కిర్మాణి వంటి ప్రముఖులు జోనల్ అకాడమీ శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు.

T20 WC 2026: India becomes the first team to reach 20 semi finals in ICC events8
T20 WC 2026: చరిత్ర సృష్టించిన టీమిండియా

భారత పురుషుల క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీస్‌కు చేరడంతో ఈ ఘనత సాధించింది. భారత్‌ తర్వాత అత్యధిక సార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్‌కు చేరిన జట్లుగా ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్‌ (18) ఉన్నాయి. ఆతర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్‌ (16), పాకిస్తాన్‌ (16), సౌతాఫ్రికా (15), శ్రీలంక (11), వెస్టిండీస్‌ (11), ఆఫ్ఘనిస్తాన్‌ (1), బంగ్లాదేశ్‌ (1), కెన్యా (1) జట్లు ఉన్నాయి.ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ సెమీస్‌కు చేరిన సందర్భాలు..వన్డే వరల్డ్‌కప్‌- 8 సార్లు (1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023)టీ20 వరల్డ్‌కప్‌- 6 సార్లు (1998, 2000, 2002, 2013, 2017, 2025)ఛాంపియన్స్‌ ట్రోఫీ- 6 సార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026*)కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (మార్చి 1) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్‌ (97 నాటౌట్‌) చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా శాంసన్‌ సహనం కోల్పోకుండా కడదాకా క్రీజ్‌లో ఉండి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్‌ 1 టాపర్‌ సౌతాఫ్రికా, గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా తలపడతాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.

If you are unable to score runs get out: Abhishek Nayar on India star9
Abhishek Sharma: పరుగులు చేయకుంటే.. అవుటైపో!

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. గ్రూప్‌ దశలో అమెరికా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లతో మ్యాచ్‌లలో ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక నమీబియాతో మ్యాచ్‌కు అనారోగ్యం వల్ల దూరం అయ్యాడు.జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రంఅనంతరం సూపర్‌-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో పోరులోనూ అభిషేక్‌ (Abhishek Sharma) విఫలమయ్యాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకం (30 బంతుల్లో 55) చేయగలిగాడు. అయితే, తాజాగా వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌లో మాత్రం మరోసారి అభిషేక్‌ తేలిపోయాడు.అవుటైపోవడం బెటర్‌ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేసి నిష్క్రమించాడు. అకీల్‌ హొసేన్‌ బౌలింగ్‌లో షిమ్రన్‌ హెట్‌మైర్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ అభిషేక్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్‌ ఎంత వేగంగా ఆడితే అంత మంచింది.తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. అయితే, విండీస్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ ఆ పని చేయలేకపోయాడు. ఒకవేళ పరుగులు రాబట్టడంలో విఫలమైతే అవుటైపోవడం బెటర్‌. టీ20 క్రికెట్‌లో ఇది కీలకం.పవర్‌ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడుపరుగులు తీయలేక ఇబ్బంది పడుతున్న బ్యాటర్‌ అవుటైతే వేరొకరికి అవకాశం వస్తుంది. నిజానికి వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయీ హోప్‌ ఈ నియమాన్ని పాటించకుండా పవర్‌ ప్లేలో మొత్తం క్రీజులో ఉండి జట్టును వెనుకపడేశాడు. పవర్‌ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడు.ఇక అభిషేక్‌ శర్మ తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులే చేసి.. ఆ తర్వాత మరీ వెనుకబడ్డాడు. ఆ వెంటనే అవుటైపోయాడు. జట్టు ప్రయోజనాల కోసం అతడు రిస్క్‌ తీసుకునే సాహసం చేయలేదు’’ అని అభిషేక్‌ నాయర్‌.. అభిషేక్‌ శర్మ ఆట తీరును విశ్లేషించాడు.కాగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే.. విండీస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ షాయీ హోప్‌ 33 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతడి స్లో బ్యాటింగ్‌ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. భారత్‌ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

women's cricket: pakistan beat south africa, sri lanka beat west indies10
సౌతాఫ్రికాపై పాకిస్తాన్‌.. వెస్టిండీస్‌పై శ్రీలంక..!

ఓ పక్క పురుషుల టీ20 ప్రపంచకప్‌ జరుగుతుండగా.. మహిళల విభాగంలో వన్డే, టీ20 సిరీస్‌లు జరుగుతున్నాయి. మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్‌ సౌతాఫ్రికాలో.. శ్రీలంక విండీస్‌లో పర్యటిస్తున్నాయి.క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆసీస్‌ఆసీస్‌ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడింది. వన్డే ప్రపంచ ఛాంపియన్‌ హోదాలో భారత జట్టు తమ తొలి సిరీస్‌లోనే ఆసీస్‌ చేతిలో 0-3 తేడాతో క్లీన్‌ స్వీప్‌ అయ్యింది. ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.నామమాత్రపు విజయంసౌతాఫ్రికా పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్‌.. వన్డే సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని (1-2) పునరావృతం చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో పాక్‌ ఆతిథ్య జట్టుపై 119 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, కంటితుడుపు విజయాన్ని సాధించింది.చమారీ ఆల్‌రౌండ్‌ షోవిండీస్‌ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న శ్రీలంక.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. చివరి టీ20 మార్చి 3న జరుగనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement