ప్రధాన వార్తలు
టీమిండియా ‘ప్రపంచ’ రికార్డు.. పాకిస్తాన్తో సమంగా
వెస్టిండీస్తో సూపర్-8 మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విండీస్ను ఓడించి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత జట్టు సమం చేసింది.సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిశ్రీలంకతో కలిసి వరల్డ్కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్.. లీగ్ దశలో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, సూపర్-8 దశలో తొలి మ్యాచ్లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.వరుస విజయాలతో సెమీస్కుఅయితే, తదుపరి మ్యాచ్లో జింబాబ్వే (IND vs ZIM)ను భారీ తేడాతో ఓడించి సెమీ ఫైనల్ రేసులో ముందుకు వచ్చిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్లో వెస్టిండీస్ (IND vs WI)ను చిత్తు చేసి బెర్తును ఖరారు చేసుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.విండీస్ బ్యాటర్లలో రోవ్మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37) అజేయ ఇన్నింగ్స్తో అలరించగా.. ఓపెనర్ రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సంజూ స్పెషల్ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) జట్టును విజయతీరాలకు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపును ఖరారు చేశాడు. ఈ మ్యాచ్లో వెస్టిండీస్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026పాక్ ప్రపంచ రికార్డు సమంకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ చేరడం ఇది ఆరోసారి. తద్వారా పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. ఇక ఇదే ఎడిషన్లో అందరి కంటే ముందే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్ సైతం ఆరోసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టి.. పాక్, భారత్ సరసన నిలిచింది. ఇక గురువారం నాటిమ్యాచ్లో ఫైనల్ బెర్తు కోసం టీమిండియా ఇంగ్లండ్ మధ్యమ్యాచ్ జరుగుతుంది. ఇందుకు ముంబై వేదిక.టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధికసార్లు సెమీ ఫైనల్ చేరిన జట్లు ఇవే👉పాకిస్తాన్- ఆరుసార్లు (2007, 2009, 2010, 2012, 2021, 2022)👉టీమిండియా- ఆరుసార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026)👉ఇంగ్లండ్- ఆరుసార్లు (2010, 2016, 2021, 2022, 2024, 2026చదవండి: ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్
అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ సంజూ శాంసన్పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్ అంటూ ఆకాశానికెత్తాడు. సరైన సమయంలో రాణించి తన విలువను మరోసారి చాటుకున్నాడని కొనియాడాడు.టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు ఫామ్లేమితో సతమతమైన సంజూ (Sanju Samson)తుదిజట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్గా అతడి స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరం కాగా సంజూ తొలిసారి వరల్డ్కప్ మ్యాచ్ ఆడాడు.బాధ్యతాయుత ఇన్నింగ్స్అనంతరం సూపర్-8లో జింబాబ్వేతో మ్యాచ్లో ఆడిన సంజూ.. తాజాగా వెస్టిండీస్తో ఆదివారం నాటి కీలక మ్యాచ్లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఆట తీరుతో జట్టును సెమీ ఫైనల్కు చేర్చాడు.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026కోల్కతా వేదికగా సహచర ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమైన వేళ సంజూ.. 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ సంజూను ప్రశంసలతో ముంచెత్తాడు.అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు‘‘సంజూ మంచి ఆటగాడు అని అందరికీ తెలుసు. అయితే, కొన్నిసార్లు విఫలమైనా అతడికి మద్దతుగా నిలవడం అవసరం. మేము అదే పని చేశాము. అందుకు తగ్గట్లుగానే జట్టుకు అతడి అవసరం ఉన్న కీలక సమయంలో రాణించాడు.అతడి పూర్తి స్థాయి నైపుణ్యాలను ఈరోజు ప్రదర్శించి.. జట్టుకు విజయం అందించాడు. అతడు వరల్డ్క్లాస్ ప్లేయర్ అని నేను తరచూ చెబుతూ ఉంటాను. సంజుకు గొప్ప ప్రతిభ ఉంది. ఇప్పటి నుంచి అతడి నుంచి ఇలాంటి ఇంకెన్నో ఇన్నింగ్స్ చూడాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్ సంజూను కొనియాడాడు.ఐదు వికెట్ల తేడాతో విజయంకాగా వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్కతాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 199 పరుగులు సాధించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికాతో పాటు సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ముంబై వేదికగా గురువారం సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది.As soon as Sanju Samson smashed a match winning SIX, just look at the Celebration of Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Suryakumar Yadav and Jay Shah 💥- Most trolled and most hated Sanju Samson delivered at the biggest stage 👏🏻#INDvsWI pic.twitter.com/tYJmi4fxwC— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 1, 2026
ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభానికి ముందు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు టీమిండియా స్టార్ సంజూ శాంసన్. మెగా టోర్నీకి సన్నాహకంగా స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో వరుస వైఫల్యాలతో సతమతమయ్యాడు.ఈ సిరీస్లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. దీంతో వరల్డ్కప్ జట్టులో ఓపెనర్గా అతడి స్థానం గల్లంతైంది. ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మకు జోడీగా ఐసీసీ ఈవెంట్లో వరుస అవకాశాలు అందిపుచ్చుక్నునాడు.ఉద్దేశపూర్వకంగానే!అయితే, అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా నమీబియాతో తొలిసారి బరిలో దిగాడు సంజూ. ఆ మ్యాచ్లో 8 బంతుల్లో 22 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తదుపరి జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్లో 15 బంతుల్లో 24 రన్స్ రాబట్టగలిగాడు. పొరపాట్లను పునరావృతం చేస్తూ షార్ట్ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుటైన నేపథ్యంలో మరోసారి సంజూపై విమర్శల వర్షం కురిసింది.మరోవైపు.. అతడి అభిమానులు మాత్రం.. మిగతా వాళ్లకు ఇచ్చినట్లుగా సంజూకు అవకాశాలు ఇవ్వడం లేదని మద్దతుగా నిలిచారు. ఈ కేరళ స్టార్ను ఉద్దేశపూర్వకంగా ప్రతీసారి పక్కన పెడుతున్నారని భారత జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. అయితే, వరుస విమర్శల తర్వాత అప్పుడప్పుడు అవకాశాలు పొందుతున్నా సంజూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేక ప్రతీసారి చేతులెత్తేయం ప్రతికూలాంశంగా పరిణమించింది. ఏదో కారణంతో అదృష్టవశాత్తూ చాన్స్ దక్కినా దానిని అతడు వాడుకోలేకపోతున్నాడనే అపవాదు పడింది. ముందుగా చెప్పినట్లు ఈ వరల్డ్ కప్లో కూడా ఆడిన రెండు మ్యాచ్లలో విఫలం కావడం ఇందుకు కారణం.ఒకే ఒక అర్ధ సెంచరీ...నిజానికి 2024 నవంబర్లో సౌతాఫ్రికాపై సెంచరీ తర్వాత శాంసన్ 18 ఇన్నింగ్స్లు ఆడితే ఒకే ఒక అర్ధ సెంచరీ... అదీ బలహీన జట్టు ఒమన్పై వచ్చింది. వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికైన తర్వాత కూడా కివీస్తో సిరీస్లో వైఫల్యంతో తన స్థానాన్ని అతను ఇషాన్ కిషన్కు కోల్పోవాల్సి రావడం గమనార్హం.కెరీర్కు కొత్త ఊపుఇలాంటి స్థితిలో ఆదివారం వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో సంజూ ఇన్నింగ్స్ అతడి కెరీర్కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రదర్శన నమోదు చేశాడు.విండీస్తో మ్యాచ్లో అన్ని రకాల షాట్లతో సంజూ చెలరేగాడు. ఈసారి 20.. 30... దాటిన తర్వాత అతడు వికెట్ పారేసుకోలేదు. అకీల్ హొసీన్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్లతో జోరు మొదలు పెట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ షెఫర్డ్ ఓవర్లో వరుసగా 6, 4 బాది 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026టీమిండియాను సెమీస్కు చేర్చిటీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచిన సంజూ... ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో 6, 4తో మ్యాచ్ను ముగించాడు. టీమిండియాను సెమీ ఫైనల్కు చేర్చి చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు.. 97 పరుగులు నాటౌట్గా నిలిచిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.కాగా 2024లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన సామ్సన్కు నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశమే రాలేదు. ఇప్పుడు అసలు సమరంలో సత్తాను ప్రదర్శించిన అతను ఇదే ఫామ్ను కొనసాగిస్తే సెమీస్, ఆపై ఫైనల్లో కూడా అద్భుతం చూడవచ్చు. చదవండి: మూడు పరుగులతో సెంచరీ మిస్!.. అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్
సామ్సన్ ఆట... సెమీస్ బాట...
సెమీస్ చేరాలంటే వెస్టిండీస్పై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ విజయలక్ష్యం 196 పరుగులు... పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నా... ఆరంభం చూస్తే కాస్త సందేహం. హిట్టర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తొందరగా వెనుదిరగ్గా, సూర్యకుమార్ కూడా ప్రభావం చూపించలేదు. కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడు. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని సంజు సామ్సన్ అసలు సమయంలో సత్తా చాటాడు. ప్రత్యర్థి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ ఎక్కడా తడబాటు లేకుండా ఈడెన్ గార్డెన్స్లో జట్టును గెలుపుతీరం చేర్చాడు. అంతకు ముందు విండీస్ మరింత పెద్ద స్కోరు చేయకుండా నిలువరించడంలో మన బౌలర్లు సఫలమయ్యారు. తాజా ఫలితంతో 2024 తరహాలోనే ఈసారి కూడా రెండో సెమీఫైనల్లోనే ఇంగ్లండ్ను ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధమైంది. మరో రెండు నాకౌట్ పంచ్లతో భారత్ చరిత్ర సృష్టించడమే మిగిలింది. కోల్కతా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ టి20 ప్రపంచకప్లో ఆరోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వెస్టిండీస్తో చివరి ‘సూపర్–8’ మ్యాచ్లో కాస్త పోటీ ఎదురైనట్లు కనిపించినా, చివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేసింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విండీస్ను ఓడించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు), రావ్మన్ పావెల్ (19 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), షై హోప్ (33 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (50 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటి చేత్తో ఛేదనను సులువుగా మార్చేశాడు. గురువారం వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. సమష్టి ప్రదర్శన... తొలిసారి అంతర్జాతీయ టి20ల్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ఛేజ్ మెరుగ్గానే ఆడినా... మరో ఎండ్లో కెపె్టన్ హోప్ నెమ్మదైన ఇన్నింగ్స్ వెస్టిండీస్కు నష్టాన్ని కలిగించింది. వరుణ్ ఏమరుపాటుగా ఉండడంతో వ్యక్తిగత స్కోరు ‘1‘ వద్ద రనౌట్ కాకుండా తప్పించుకున్న ఛేజ్... 14 పరుగుల వద్ద అభిషేక్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. పవర్ప్లేలో విండీస్ 45 పరుగులు చేయగలిగింది. వరుణ్ తన తొలి ఓవర్లోనే హోప్ను బౌల్డ్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లంతా క్రీజ్లో ఉన్నంతసేపు దూకుడు కనబర్చడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. వరుణ్ ఓవర్లో సిక్స్ ఫోర్ కొట్టిన హెట్మైర్తో పాటు ఛేజ్ను బుమ్రా ఒకే ఓవర్లో వెనక్కి పంపాడు. ‘1’ వద్ద తిలక్ క్యాచ్ వదిలేయడంతో రూథర్ఫర్డ్ (14) కొన్ని పరుగులు జోడించగలిగాడు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 125/4 వద్ద నిలిచింది. ఆఖరి 5 ఓవర్లలో విండీస్ 70 పరుగులు రాబట్టింది. 16వ ఓవర్ వేసిన అర్ష్ దీప్24 పరుగులు ఇచి్చనా... తన తర్వాతి ఓవర్లో అతను 6 పరుగులే ఇచ్చాడు. బుమ్రా 2 ఓవర్లలో విండీస్ 26 పరుగులు స్కోరు చేయగలిగింది. పావెల్, హోల్డర్ ఐదో వికెట్కు 35 బంతుల్లో అభేద్యంగా 76 పరుగులు జోడించారు. రాణించిన తిలక్... ఛేదనలో భారత్కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. తడబడుతూనే ఆడిన అభిషేక్ శర్మ (10)తో పాటు ఇషాన్ కిషన్ (10) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే సామ్సన్ పదునైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను నడిపించడంతో భారత్కు ఇబ్బంది ఎదురు కాలేదు. ముందుగా సూర్యకుమార్ (18) కొద్దిసేపు సామ్సన్కు సహకరించగా, ఆ తర్వాత తిలక్ వర్మ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా అండగా నిలిచాడు. జోసెఫ్ ఓవర్లలో వరుసగా మూడు ఫోర్లతో ఆకట్టుకున్న తిలక్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (17) మరికొన్ని పరుగులు జోడించాడు. చివర్లో శివమ్ దూబే (8 నాటౌట్)తో కలిసి సామ్సన్ మ్యాచ్ ముగించాడు.97 టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా సామ్సన్ నిలిచాడు. గతంలో కోహ్లి రెండుసార్లు 82 నాటౌట్ (ఆ్రస్టేలియా, పాక్లపై)గా నిలిచాడు.స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (బి) వరుణ్ 32; ఛేజ్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 40; హెట్మైర్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 27; రూథర్ఫర్డ్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 14; పావెల్ (నాటౌట్) 34; హోల్డర్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–68, 2–102, 3–103, 4–119. బౌలింగ్: అర్ష్ దీప్4–0–43–0, పాండ్యా 4–0–40–1, అక్షర్ 4–0–35–0, బుమ్రా 4–0–36–2, వరుణ్ 4–0–40–1. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) హెట్మైర్ (బి) హొసీన్ 10; సామ్సన్ (నాటౌట్) 97; ఇషాన్ కిషన్ (సి) హెట్మైర్ (బి) హోల్డర్ 10; సూర్యకుమార్ (సి) రూథర్ఫర్డ్ (బి) జోసెఫ్ 18; తిలక్ (సి) హెట్మైర్ (బి) హోల్డర్ 27; పాండ్యా (సి) హోల్డర్ (బి) జోసెఫ్ 17; దూబే (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–29, 2–41, 3–99, 4–141, 5–179. బౌలింగ్: హొసీన్ 2–0–22–1, ఫోర్డ్ 3–0–22–0, హోల్డర్ 4–0–38–2, మోతీ 2–0–18–0, షెఫర్డ్ 2.2–0–34–0, జోసెఫ్ 4–0–42–2, ఛేజ్ 2–0–18–0.
నాకౌట్కూ అజేయంగానే...
న్యూఢిల్లీ: గత మెగా ఈవెంట్ రన్నరప్ దక్షిణాఫ్రికా ఈ టి20 ప్రపంచకప్ను కసిమీద ఆడుతోంది. లీగ్ దశలో గ్రూప్ ‘డి’లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన దక్షిణాఫ్రికా అజేయంగా ‘సూపర్–8’కు చేరింది. ‘సూపర్–8’లోనూ తమ జోరు కొనసాగిస్తూ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి నాకౌట్ పోరుకు సై అంటోంది. దక్షిణాఫ్రికా ఇదివరకే సెమీస్ చేరడంతో.... జింబాబ్వేతో ఆదివారం జరిగిన గ్రూప్–1 ‘సూపర్–8’ నామమాత్రమైంది. అయినప్పటికీ సమష్టి ఆటతీరుతో మెరిపించిన మార్క్రమ్ బృందం 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొంది ఈ టోర్నీలో వరుసగా ఏడో విజయం నమోదు చేసింది. కోల్కతాలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. సెమీఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే కేటాయించారు. దక్షిణాఫ్రికాతో పోరులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (43 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. కార్బిన్ బాష్, మఫాక చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి గెలిచింది. బ్రెవిస్ (18 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్లు) భారీ సిక్స్లతో విరుచుకుపడగా, జార్జ్ లిండే (21 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. బ్రెవిస్ అవుటయ్యాక లిండే, స్టబ్స్ ఆరో వికెట్కు అజేయంగా 53 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. బౌలింగ్లోనూ 3 వికెట్లు తీసిన జింబాబ్వే కెప్టెన్ రజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: మరుమని (బి) మఫాక 7; బెనెట్ (సి) మార్క్రమ్ (బి) నోర్జే 15; మైయెర్స్ (సి) బ్రెవిస్ (బి) లిండే 11; సికందర్ రజా (సి) మిల్లర్ (బి) మఫాక 73; బర్ల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎన్గిడి 5; మున్యోంగా (బి) బాష్ 2; మడండె (నాటౌట్) 26; ఇవాన్స్ (బి) బాష్ 8; మసకద్జా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–66, 4–82, 5–87, 6–126, 7–146. బౌలింగ్: లిండే 3–0–22–1, మఫాక 4–0–21–2, ఎన్గిడి 4–0–29–1, నోర్జే 4–0–29–1, బాష్ 4–0–40–2, మార్క్రమ్ 1–0–11–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) సికందర్ రజా 4; డికాక్ (సి) మరుమని (బి) సికందర్ రజా 0; రికెల్టన్ (సి) బర్ల్ (బి) ఇవాన్స్ 31; బ్రెవిస్ (సి) బర్ల్ (బి) సికందర్ రజా 42; మిల్లర్ (సి) మైయెర్స్ (బి) ముజరబాని 22; స్టబ్స్ (నాటౌట్) 21; లిండే (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–1, 2–14, 3–43, 4–93, 5–101. బౌలింగ్: సికందర్ రజా 4–0–29–3, ముజరబాని 3.5–0–32–1, ఇవాన్స్ 3–0–22–1, క్రెమర్ 2–0–27–0, మసకద్జా 2–0–23–0, బర్ల్ 2–0–12–0, బెనెట్ 1–0–9–0. 5 టి20 ప్రపంచకప్ చరిత్రలో సికందర్ రజా అందుకున్న ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు నెగ్గిన జాబితాలో విరాట్ కోహ్లి (8), ఆడమ్ జంపా (6) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో షేన్ వాట్సన్, క్రిస్ గేల్, జయవర్ధనే, సికందర్ రజా (5 చొప్పున) ఉన్నారు.
ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్’
హోబర్ట్: ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా టి20 సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు... వన్డే సిరీస్లో ‘వైట్వాష్’కు గురైంది. ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు... చివరి మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో వన్డే ప్రపంచ చాంపియన్ టీమిండియాపై 185 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా విజయం సాధించి 3–0తో సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. కెరీర్లో చివరి వన్డే ఆడిన ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు శతకం చేసింది. బెత్ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... జార్జియా వోల్ (52 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ సాధించింది. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షాట్లతో స్కోరును నాలుగొందలు దాటించింది. భారత బౌలర్లలో శ్రీచరణి, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టారు. తెలుగమ్మాయి శ్రీచరణి 10 ఓవర్లలో 106 పరుగులిచ్చింది. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న భారత బౌలర్గా చెత్త రికార్డును ఆమె మూటగట్టుకుంది. వరుస వికెట్లు కోల్పోయి... అనంతరం భారీ లక్ష్యఛేదనలో టీమిండియా తడబడింది. 45.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. కొండంత లక్ష్యఛేదనలో టీమిండియా ఏ దశలోనూ పోటీలో కనిపించలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన హర్మన్ బృందం లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (0) డకౌట్ కాగా... ప్రతీక రావల్ (27; 6 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 42; 9 ఫోర్లు) కాస్త పోరాడారు. వీరిద్దరూ రెండో వికెట్కు 35 బంతుల్లో 54 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చినవాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (25; 2 ఫోర్లు), హర్లీన్ డియోల్ (14), దీప్తి శర్మ (29; 2 ఫోర్లు), రిచా ఘోష్ (18; 2 ఫోర్లు, 1 సిక్స్) విఫలమయ్యారు. స్నేహ్ రాణా (74 బంతుల్లో 44; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ 4 వికెట్లు పడగొట్టింది. అలీసా హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 6 నుంచి పెర్త్లో ఏకైక టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ వన్డేలకు గుడ్బై చెప్పిన అలీసా తన కెరీర్లో 126 వన్డేలు ఆడి 3777 పరుగులు చేసింది. ఇందులో 8 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
సలీమా టెటె సారథ్యంలో...
సాక్షి, హైదరాబాద్: స్వదేశంలో జరిగే మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు మిడ్ఫీల్డర్ సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. సీనియర్ స్టార్ గోల్కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా కుటుంబ కారణాలరీత్యా ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఆతిథ్య భారత్తోపాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు ఈ టోర్నీలో పోటీపడతాయి. పూల్ ‘ఎ’లో ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా... పూల్ ‘బి’లో భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్ను 8న ఉరుగ్వేతో, తర్వాత 9న స్కాట్లాండ్తో, 11న వేల్స్తో తలపడుతుంది. ఈ టోర్నీ ద్వారా మూడు జట్లు ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. భారత మహిళల హాకీ జట్టు: బన్సారి, బిచ్చూ దేవి (గోల్కీపర్లు), సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, మనీషా, ఉదిత, ఇషిక చౌధరీ (డిఫెండర్లు), నేహా, సలీమా టెటె, సునెలితా టొప్పో, సాక్షి రాణా, వైష్ణవి, రుతుజా, దీపిక (మిడ్ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్, ఇషిక, లాల్రెమ్సియామి, బ్యూటీ డుంగ్డుంగ్, బల్జీత్ కౌర్, అన్ను (ఫార్వర్డ్స్).
T20 WC 2026: అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్
‘‘నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఇదొకటి. ఇదే (ఆట) నా ప్రపంచం. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే.. దేశం కోసం ఆడాలనే కల కన్నాను. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూశాను. నా కెరీర్లో ఎన్నో ఎత్తు పళ్లాలు ఉన్నాయి.ఒక్కోసారి నా మీద నాకే సందేహం కలిగేది. నేనసలు ఆడగలనా.. ఒకవేళ ఆడితే ఎలా ఉంటుంది. అనుకున్న విధంగా రాణించగలనా.. ఇలా ఎన్నెన్నో సందేహాలు. అయితే, ఆ దేవుడి మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఈరోజు ఆయన నన్ను దీవించాడు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. టీ20 ఫార్మాట్లో నాకెంతో అనుభవం ఉంది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గత మ్యాచ్లలో వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయాను. అయితే, ఈ రోజు భాగస్వామ్యాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి సారించాను. బంతిని చూస్తూ ఆడాను. ఈరోజు నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాను’’ అంటూ టీమిండియా స్టార్ సంజూ శాంసన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.టీ20 ప్రపంచకప్-2026లో భారత్ సెమీ ఫైనల్కు దూసుకువెళ్లడంలో సంజూదే కీలక పాత్ర. టీ20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా పేరొందిన వెస్టిండీస్తో మ్యాచ్లో ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియాను గెలిపించాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్కు వరుస కడుతున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలకడగా బ్యాటింగ్ చేశాడు.This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంజూ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా విండీస్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా గత కొన్ని రోజులుగా సంజూ ఫామ్లేమితో సతమతమయ్యాడు. ఫలితంగా ఓపెనర్గా స్థానం కోల్పోయాడు.అయితే, గత మ్యాచ్ (జింబాబ్వే)తో మళ్లీ తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. తాజాగా వెస్టిండీస్పై అదరగొట్టి తన విలువ చాటుకున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్తో మెరిసి అభిమానులను ఖుషీ చేశాడు.భారత్ వర్సెస్ వెస్టిండీస్ స్కోర్లువేదిక- ఈడెన్ గార్డెన్స్, కోల్కతాటాస్- భారత్.. తొలుత బౌలింగ్వెస్టిండీస్ స్కోరు- 195/4(20)భారత్ స్కోరు- 199/5 (19.2)ఫలితం- ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు.. 97 పరుగులు నాటౌట్).
T20 WC 2026: విండీస్ను చిత్తు చేసి సెమీ ఫైనల్లో టీమిండియా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. సూపర్-8 దశలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ (IND Beat WI)ను ఓడించి టైటిల్ దిశగా కీలక ముందడుగు వేసింది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో ఆదివారం టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.195 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ షాయీ హోప్ (33 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) రాణించాడు.మిగిలిన వారిలో షిమ్రన్ హెట్మైర్ (12 బంతుల్లో 27) ధనాధన్ దంచికొట్టగా.. షెర్ఫానే రూథర్ఫర్డ్ (9 బంతుల్లో 14) రాణించాడు. ఆఖర్లో రోవ్మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు.నిరాశపరిచిన అభిషేక్, ఇషాన్భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (11 బంతుల్లో 10) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 10) సైతం నిరాశపరిచాడు.సంజూ బాధ్యతాయుత ఇన్నింగ్స్కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 18) చేతులెత్తేయగా.. తిలక్ వర్మ (15 బంతులలో 27) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. ఇలాంటి దశలో ఓపెనర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026 అయితే విజయానికి 10 బంతులలో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతులలో 17) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో శివం దూబే సంజూకు జతయ్యాడు. దూబే 4 బంతులలో 8 పరుగులు చేయగా.. సంజూ ఆఖరి ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలోఈ మ్యాచ్లో సంజూ మొత్తంగా 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా చిరస్మరణీయ ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించాడు. ఇక మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విండీస్ను ఓడించింది.
టీమిండియా టార్గెట్ 196
కోల్కతా: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో భారత్కు 196 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది వెస్టిండీస్, ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఆది నుంచి బ్యాట్ ఝుళిపించింది. ఓపెనర్లు షాయ్ హోప్( 32: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రోస్టన్ ఛేజ్(40: 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత హెట్ మెయిర్ ( 27: 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు) చెలరేగి ఆడే యత్నం చేశాడు. విండీస్ స్కోరు బోర్డు వేగం పుంజుకునే క్రమంలో బూమ్రా బౌలింగ్ లో హెట్ మెయిర్ అవుటయ్యాడు. బూమ్రా బౌలింగ్ లో సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెట్ మెయిర్. అప్పటికి విండీస్ స్కోరు 11.3 ఓవర్లలో 102 పరుగులుగా ఉంది. అయితే హెట్ మెయిర్ రెండో వికెట్గా ఔటైన తర్వాత విండీస్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది. అయితే రావెన్ పావెల్(34 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), జాసన్ హోల్డర్(37 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.భారత బౌలర్లలో బుమ్రా మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బుమ్రా నాలుగు ఓవర్లలో 36 పరుగులే ఇవ్వగా, హార్దిక్ పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు, అర్షదీప్ 43 పరుగులు, వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చారు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.పావెల్ అరుదైన ఘనతఈ మ్యాచ్లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా రోవ్మాన్ పావెల్ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్ తరుఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పావెల్ టీ20ల్లో 150 సిక్సర్లు మార్కును చేరుకోవడంతో విండిస్ తరుఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో నికోలస్ పూరన్ 149 సిక్సర్లు కొట్టిన జాబితాలో ఉండగా, వెవిన్ లూయిస్ 136 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్ గేల్ 124 సిక్సర్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.పొలార్డ్, హెట్మెయిర్లు 99 సిక్సర్లతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
‘షూటౌట్’లో గెలిచాం
స్వదేశంలో గెలుపు ఖాతా తెరవడంలో విఫలమైన భారత పురుషు...
మరోసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: ప్రొ హాకీ లీగ్లో భారత పురుషుల హాకీ జట్ట...
ఈసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: వేదిక మారినా... ప్రత్యర్థులు మారినా... క...
సింగిల్స్ రన్నరప్ వైష్ణవి
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ...
T20 WC 2026: అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్
‘‘నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఇదొకటి. ఇదే ...
T20 WC 2026: విండీస్ను చిత్తు చేసి సెమీ ఫైనల్లో టీమిండియా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీ ఫ...
T20 WC 2026: విండీస్తో డూ ఆర్ డై మ్యాచ్.. టీమిండియా ఇదే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 1) డూ ఆర్ డై ...
T20 WC 2026: నామమాత్రపు మ్యాచ్లోనూ సౌతాఫ్రికాదే గెలుపు
టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసా...
క్రీడలు
అర్జున్ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
వీడియోలు
సంజు శాంసన్ విశ్వరూపం.. పడి లేచిన కెరటం
నేడు కోల్ కతా వేదికగా హై ఓల్టేజ్ ఫైట్
T20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్
దుబాయ్ లో తాజా పరిణామాలపై పీవీ సింధు వీడియో విడుదల
సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్
రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
జింబాబ్వేపై భారత్ విజయం
టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి
Analyst Venkatesh : టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే..
టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు పరీక్షా సమయం
