ప్రధాన వార్తలు
బ్యాట్తో కొడతా.. జాగ్రత్త?
టీమిండియా స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. వారిద్దరూ తమ స్పిన్ మయాజాలంతో ఎన్నో మ్యాచ్ల్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలను అందించారు.ఆన్ది ఫీల్డ్ గానీ, ఆఫ్ ది ఫీల్డ్ గానీ ఈ స్పిన్ ద్వయం చాలా సరదాగా ఉంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన కుల్దీప్ యాదవ్ పెళ్లికి కూడా హాజరై జడ్డూ సందడి చేశాడు. అయితే తాజాగా మరోసారి వారి మధ్య ఉన్న స్నేహం బయటపడింది.ఏమి జరిగిందంటే?ఐపీఎల్-2026లో శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ క్యాష్రిచ్ లీగ్లో జడ్డూ రాజస్తాన్ రాయల్స్కు, కుల్దీప్ ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే రాజస్తాన్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ధ్రువ్ జురెల్ ఔటయ్యాక రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చాడు.మైదానంలోకి వచ్చిన జడ్డూ తన బ్యాట్ను చెక్ చేసుకునేందుకు అంపైర్ వద్దకు వెళ్తుండగా.. పక్కనే ఉన్న కుల్దీప్ సరదా ఏదో అన్నాడు. అందుకు బదులుగా జడ్డూ తన బ్యాట్ను గాలిలో ఊపుతూ కొడతా అన్నట్లు సైగలు చేశాడు. అయితే ఏమాత్రం బెదరని కుల్దీప్, నవ్వుతూ జడేజా భుజాలపై చేతులు వేసి వెనక్కి నెట్టేశాడు.దీంతో పక్కన ఉన్న నితీష్ రాణా సైతం నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో రాజస్తాన్పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: IPL 2026: వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ𝙈𝙖𝙨𝙩𝙞 𝙧𝙪𝙠𝙣𝙞 𝙣𝙖𝙝𝙞 𝙘𝙝𝙖𝙝𝙞𝙮𝙚...Kuldeep Yadav & Ravindra Jadeja shared a fun moment in the middle of the game. 😅#TATAIPL 2026 ➡️ #RRvDC | LIVE NOW 👉https://t.co/cMKydi0l80 pic.twitter.com/6EijsAT5Nd— Star Sports (@StarSportsIndia) May 1, 2026
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్-2026లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాక అతిగా సంబరాలు చేసుకున్న ఢిల్లీ పేసర్ కైల్ జేమీసన్కు బీసీసీఐ షాకిచ్చింది. జేమీసన్ను హెచ్చరించడంతో పాటు అతడి ఖాతాలో ఒక డెమెరిట్ పాయింట్ను చేర్చింది.ఏమి జరిగిందంటే?రాజస్తాన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జేమీసన్ బౌలింగ్లో వైభవ్ తన ఎదుర్కొన్న మొదటి బంతిని బౌండరీకి పంపాడు. అయితే మరుసటి బంతికే జేమీసన్ ఒక అద్భుతమైన డెలివరీతో వైభవ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో జేమీసన్ అతిగా సంబరాలు చేసుకున్నాడు.ఈ కివీ స్పీడ్ స్టార్ 15 ఏళ్ల వైభవ్ వద్దకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెండాఫ్ ఇచ్చాడు. అతడి ప్రవర్తనపై ఫీల్డ్ అంపైర్లు సైతం అగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు 15 ఏళ్ల పిల్లోడుపై నీ ప్రతాపమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.దీంతో బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జేమీసన్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినట్లు బోర్డు నిర్ధారించింది. దీంతో బీసీసీఐ అతడిపై ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.చదవండి: IPL 2026: అన్నా.. సారీ.. నిన్ను తక్కువగా అంచనా వేశాం!Kyle Jamieson gets Vaibhav Sooryavanshi early 🫡But that Celebration pic.twitter.com/c1kQZv9UbM— Shobhit Chandrawanshi (@Shobhit202518) May 1, 2026
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఊదిపడేసింది. ఢిల్లీకి ఛేజింగ్ పరంగా ఇదే అతి పెద్ద విజయం. ఈ రికార్డు విజయంలో కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్లు), పతుమ్ నిసాంక (33 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్లు)లది కీలక పాత్ర. వీరిద్దరూ తొలి వికెట్కు 110 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు.ఆ తర్వాత నిస్సాంక ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఆ తర్వాత ఆశుతోష్, స్టబ్స్ మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఇక హాఫ్ సెంచరీతో సత్తాచాటిన రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ ఓపెనర్గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఓపెనర్గా రాహుల్ ఖాతాలో 202 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(192) ఉన్నారు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్లుకేఎల్ రాహుల్ - 202* సిక్సర్లువిరాట్ కోహ్లీ - 192 సిక్సర్లురోహిత్ శర్మ - 148 సిక్సర్లుశిఖర్ ధావన్ - 143 సిక్సర్లుశుభమాన్ గిల్ - 129 సిక్సర్లుఅదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జాబితాలో రాహుల్ నాలుగో స్ధానంలో జడేజా సరసన నిలిచాడు. ఈ లిస్ట్లో రోహిత్ శర్మ(21) అగ్రస్ధానంలో ఉన్నాడు.అత్యధిక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఇండియన్స్ వీరే21 - రోహిత్ శర్మ20 - విరాట్ కోహ్లీ18 - ఎంఎస్ ధోని17 - రవీంద్ర జడేజా17 - KL రాహుల్*
జట్టుకు చెడ్డపేరు వస్తోంది.. చర్యలు తీసుకుంటాం: సంగక్కర
రాజస్తాన్ రాయల్స్కు సంబంధించి ఈ ఐపీఎల్లో బయటికొచ్చిన వివాదాలపై టీమ్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర స్పందించాడు. ఇవి జట్టుకు చెడ్డ పేరు తెస్తున్నాయని అతను అభిప్రాయపడ్డాడు. టీమ్ కెపె్టన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో ‘వేపింగ్’ చేస్తూ పట్టుబడగా, కొద్ది రోజుల క్రితమే టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడుతూ కనిపించాడు. ఈ రెండు ఘటనలపై బీసీసీఐ చర్య తీసుకుంటూ జరిమానాలు విధించింది. "ఏ రకమైన వివాదమైనా జట్టుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ రెండింటిపై బీసీసీఐ చర్య తీసుకుంది. మా జట్టులో మంచి విలువలు, సంస్కృతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మీరు చేసే ఏ పనైనా ఫ్రాంచైజీకి చెడ్డ పేరు తెస్తుంది కాబట్టి బాధ్యతగా ఉండమని ఆటగాళ్లకు చెబుతున్నాం" అని సంగక్కర వ్యాఖ్యానించాడు.కాగా శుక్రవారం జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఓటమి పాలైంది. రాజస్తాన్కు ఇది నాలుగో ఓటమి. రాయల్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది.
న్యూజిలాండ్కు భారీ షాక్
భుజం గాయంతో బాధపడుతున్న న్యూజిలాండ్ వన్డే, టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నెల రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఐపీఎల్లో భాగంగా వారం రోజుల క్రితం చెన్నైతో జరిగిన మ్యాచ్లో క్యాచ్ అందుకునే క్రమంలో ముంబై ప్లేయర్ సాంట్నర్ భుజానికి గాయమైంది.ఆ మ్యాచ్ నుంచి మధ్యలోనే తప్పుకున్న అతను లీగ్కు కూడా పూర్తిగా దూరమయ్యాడు. ఈ సీజన్ ఐపీఎల్లో అతను నాలుగు మ్యాచ్లు ఆడాడు. ఇటీవలే స్వదేశానికి చేరుకున్న సాంట్నర్కు పరీక్షలు నిర్వహించిన క్రికెట్ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జెడ్సీ) అతని గాయం విషయంపై స్పష్టమైన ప్రకటన ఇచ్చింది. ‘శుక్రవారం ఉదయమే ప్రత్యేక వైద్య నిపుణుడిని సాంట్నర్ కలిశాడు. గాయం నుంచి కోలుకునే క్రమంలో తగినంత విశ్రాంతితో పాటు రీహాబిలిటేషన్ కూడా అవసరం అని వారు తేల్చారు’ అని ఎన్జెడ్సీ వెల్లడించింది. తాజా పరిణామాల కారణంగా ఐర్లాండ్తో జరిగే ఏకైక టెస్టుతో పాటు లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగే తొలి టెస్టు నుంచి అతను తప్పుకోవడం ఖాయమైంది. గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధిస్తే సాంట్నర్ను ఇంగ్లండ్తో తర్వాతి రెండు టెస్టుల్లో ఆడించాలా లేదా అనేదానిపై టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. 2026 టి20 ప్రపంచకప్లో సాంట్నర్ సారథ్యంలోనే కివీస్ జట్టు రన్నరప్గా నిలిచింది.చదవండి: IPL 2026: అన్నా.. సారీ.. నిన్ను తక్కువగా అంచనా వేశాం!
అస్సలు పట్టించుకోను.. వారితో నాకేంటి: రియాన్ పరాగ్
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ నాలుగో ఓటమి చవిచూసింది. శుక్రవారం జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ పరాజయం పాలైంది. 227 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఆ జట్టు కీలక బౌలర్లు జోఫ్రా ఆర్చర్, బర్గర్ పూర్తిగా తేలిపోయారు. ఫలితంగా ఈ భారీ టార్గెట్ను ఢిల్లీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. ఢిల్లీ విజయంలో కేఎల్ రాహుల్(75), ఫాథుమ్ నిస్సాంక(62) కీలక పాత్ర పోషించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. ప్రత్యర్ధి ముందు భారీ టార్గెట్ ఉంచినప్పటకి విజయం సాధించలేకపోయామని పరాగ్ అన్నాడు."ఈ వికెట్పై స్కోర్ 200 దాటితే చాలు అనుకున్నా. కానీ అంతకంటే ఎక్కువే మేము ప్రత్యర్ధి ముందు ఉంచాం. ఇన్నింగ్స్ గడిచే కొద్దీ పిచ్ నెమ్మదిస్తుందని భావించాము. అయితే మిడిల్ ఓవర్లలో మేము ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉంది. ప్రత్యర్ధి బ్యాటర్ల దూకుడును అడ్డుకోవడంలో విఫలమయ్యాం.కొన్ని ఓవర్లలో వరుసగా బౌండరీలు ఇవ్వడం వల్ల మ్యాచ్పై పట్టు కోల్పోయాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని సరైన నిర్ణయమే తీసుకున్నాం. కానీ బౌలింగ్లో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఇక లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే డోనోవన్ ఫెరీరా కంటే ముందు జడేజాను బ్యాటింగ్కు పంపాము. అప్పటికి ఇంకా 8-9 ఓవర్లు ఉన్నాయి.స్పిన్నర్ల బౌలింగ్లో ఓవర్కు 8 లేదా 9 పరుగులు తీస్తూ, తర్వాత ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి హిట్టింగ్ చేయాలని ప్లాన్ చేశాం. అందుకే అతడి బ్యాటింగ్ను కొంచెం ఆలస్యం చేశాం. నా హ్యామ్స్ట్రింగ్(తొడ వెనక భాగం)లో చిన్న నొప్పి ఉంది. ఇది మరీ అంత సీరియస్ కాదు. మా తదుపరి మ్యాచ్కు వారం రోజుల విశ్రాంతి లభించింది. ఈ సమయంలో కోలుకుంటున్నాని ఆశిస్తున్నా. నా ఫామ్పై విమర్శలు చేస్తున్న వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జట్టుకు రెండు పాయింట్లు అందించడమే నా లక్ష్యం. జట్టు ఓడిపోతే నా వ్యక్తిగత స్కోరుకు లేదా ఇన్నింగ్స్కు ఎలాంటి విలువ ఉండదు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పరాగ్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో పరాగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు చేసి తృటిలో తన తొలి ఐపీఎల్ సెంచరీని కోల్పోయాడు.చదవండి: IPL 2026: అన్నా.. సారీ.. నిన్ను తక్కువగా అంచనా వేశాం!
టీ20 ప్రపంచకప్.. నేడే భారత జట్టు ప్రకటన
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనే భారత జట్టు బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం(మే 2) ప్రకటించనుంది. ప్రపంచకప్ జట్టునే కాకుండా, అంతకంటే ముందు ఇంగ్లండ్తో జరిగే మూడు టీ20లకు కూడా భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో పేలవ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్లపై సెలక్టర్లు వేటు వేసే అవకాశముంది.అదేవిధంగా ప్రోటీస్ సిరీస్లో ఆకట్టుకున్న శ్రీ చరణి, భారతి ఫుల్మాలి వంటి వారికి యంగ్ ప్లేయర్లకు చోటు దక్కుతుందో లేదో చూడాలి. గతేడాది వన్డే ప్రపంచకప్ను భారత్ గెలవడంలో శ్రీ చరణిది కీలక పాత్ర. కాబట్టి ఈ తెలుగు అమ్మాయిని టీ20 ప్రపంచకప్ జట్టుకు కూడా ఎంపిక చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. బౌలర్ల విభాగంలో అరుంధతి రెడ్డి, క్రాంత్ గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్లకు చోటు దక్కే ఛాన్స్ ఉంది. బ్యాటర్లగా షెఫాలీ వర్మ, మంధాన, రోడ్రిగ్స్, కెప్టెన్ హార్మన్ప్రీత్ కౌర్ వంటి ఎలాగూ ఉంటారు. అదేవిధంగా రిచా ఘోష్కు బ్యాకప్ వికెట్ కీపర్గా ఉమా ఛెత్రిని ఎంపిక చేసే అవకాశముంది.ఇక ఈ పొట్టి ప్రపంచకప్ జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్ వేదికగా జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది టి20 ప్రపంచకప్లలో ఆడిన భారత జట్టు నాలుగుసార్లు (2009, 2010, 2018, 2023లో)సెమీఫైనల్కు చేరుకొని, ఒకసారి (2020లో) రన్నరప్గా నిలిచింది.వరల్డ్కప్లో భారత్ షెడ్యూల్ ఇదేఈ మెగా టోర్నీలో భారత్ గ్రూప్-1లో ఉంది. మనతో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఈ గ్రూపులో ఉన్నాయి.జూన్ 14: పాకిస్థాన్తో (ఎడ్జ్బాస్టన్)జూన్ 17: నెదర్లాండ్స్తో (హెడింగ్లీ)జూన్ 21: దక్షిణాఫ్రికాతో (ఓల్డ్ ట్రాఫోర్డ్)జూన్ 25: బంగ్లాదేశ్తో (ఓల్డ్ ట్రాఫోర్డ్)జూన్ 28: ఆస్ట్రేలియాతో (లార్డ్స్)చదవండి: IPL 2026: అన్నా.. సారీ.. నిన్ను తక్కువగా అంచనా వేశాం!
అన్నా.. సారీ.. నిన్ను తక్కువగా అంచనా వేశాం!
ఐపీఎల్-2026లో జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైనప్పటికి, ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత కొన్ని మ్యాచ్లగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడిన రియాన్.. ఢిల్లీపై మాత్రం వీరవిహారం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.స్టార్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, జైశ్వాల్ వికెట్లను రాజస్తాన్ తొలి రెండు ఓవర్లలోనే కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పరాగ్ బాధ్యయతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన పరాగ్, క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే గట్టి సమాధానమిచ్చాడు. ఈ అస్సాం క్రికెటర్ కేవలం 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు చేసి తృటిలో తన తొలి ఐపీఎల్ సెంచరీని కోల్పోయాడు. అతడితో పాటు ఆఖరిలో (14 బంతుల్లోనే 6 సిక్సర్లతో 47*) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఇక ఈ మ్యాచ్లో విధ్వంసర బ్యాటింగ్ చేసిన పరాగ్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్నా నిన్ను తక్కువగా అంచనా వేసినందుకు మమ్మల్ని క్షమించు అంటూ ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. కాగా రియాన్ గత వారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో డ్రెస్సింగ్ రూమ్లో 'వేపింగ్' చేస్తూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. దీంతో అతడికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా బీసీసీఐ విధించింది.అనంతరం పరాగ్ను నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు తాజాగా ఇన్నింగ్స్తో విమర్శించిన నోళ్లే అతడిని ప్రశంసిస్తున్నాయి. ఇక రాజస్తాన్ నిర్ధేశించిన ఢిల్లీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఊదిపడేసింది. ఢిల్లీ విజయంలో కేఎల్ రాహుల్(75), నిస్సాంక(62) కీలక పాత్ర పోషించారు.చదవండి: అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర
చెలరేగిన రాహుల్.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ
264 పరుగులు చేసినా ఓడిపోయె... ఆపై 75 పరుగులకు కుప్పకూలె... అటు బ్యాటర్లు, ఇటు బౌలర్ల పేలవ ప్రదర్శన... టీమ్లో గందరగోళ స్థితిలో వరుసగా మూడు ఓటములు... ఇలాంటి స్థితిలో స్థైర్యం కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఎట్టకేలకు ఒక విజయంతో ఊరట లభించింది. సమష్టి ప్రదర్శనతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించడంలో సఫలమైంది. మరోవైపు గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 223 పరుగుల లక్ష్యాన్ని అందుకొని సత్తా చాటిన రాజస్తాన్ ఈసారి 225 పరుగుల స్కోరును నిలబెట్టుకోలేకపోయింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కీలక విజయం దక్కింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కెపె్టన్ రియాన్ పరాగ్ (50 బంతుల్లో 90; 8 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీ అవకాశం కోల్పోగా... ధ్రువ్ జురేల్ (30 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్కు 59 బంతుల్లో 102 పరుగులు జోడించారు. చివర్లో డొనొవాన్ ఫెరీరా (14 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్లు) విధ్వంసకర బ్యాటింగ్తో జట్టు భారీ స్కోరు సాధించింది. అనంతరం ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 226 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్లు), పతుమ్ నిసాంక (33 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్లు) తొలి వికెట్కు 57 బంతుల్లోనే 110 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. ఫెరీరా దూకుడు... ఆసీస్ దిగ్గజ బౌలర్ స్టార్క్ ఈ సీజన్లో తొలిసారి ఐపీఎల్లో బరిలోకి దిగాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే యశస్వి జైస్వాల్ (6) సిక్స్ కొట్టినా... మూడో బంతికే వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో జేమీసన్ పదునైన యార్కర్తో వైభవ్ సూర్యవంశీ (4) ఆట ముగించాడు. ఈ దశలో జురేల్, పరాగ్ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. జేమీసన్ ఓవర్లో పరాగ్ వరుసగా 6, 4, 6 కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. అక్షర్ ఓవర్లోనూ రెండు వరుస సిక్స్లు బాదిన అతను 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. జురేల్ను అక్షర్ వెనక్కి పంపగా, రవీంద్ర జడేజా (20) ప్రభావం చూపలేదు. జేమీసన్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన పరాగ్ 90కి చేరుకున్నాడు. అయితే తర్వాతి ఓవర్ వేసిన స్టార్క్... జడేజా, పరాగ్లను వెనక్కి పంపించాడు. 17 ఓవర్లలో జట్టు స్కోరు 173/5. అయితే చివరి 3 ఓవర్లలో ఫెరీరా చెలరేగిపోవడంతో రాజస్తాన్ 52 పరుగులు రాబట్టింది. కుల్దీప్ ఓవర్లో 3 సిక్సర్లు బాదిన అతను, స్టార్క్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టాడు. నటరాజన్ వేసిన ఆఖరి ఓవర్లోనూ 2 సిక్స్లు, ఫోర్తో సత్తా చాటాడు. మెరుపు ఆరంభం... ఛేదనలో ఢిల్లీకి నిసాంక, రాహుల్ సరైన ఆరంభాన్ని అందించారు. ఆర్చర్ తొలి 2 ఓవర్లలో వీరిద్దరు కలిసి 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26 పరుగులు రాబట్టారు. బర్గర్ తొలి ఓవర్లో రాహుల్ 2 ఫోర్లు కొట్టగా, తర్వాతి ఓవర్లో నిసాంక 2 సిక్స్లు బాదాడు. పవర్ప్లేలో జట్టు 70 పరుగులు చేయగా, 23 బంతుల్లో నిసాంక అర్ధసెంచరీ సాధించాడు. ఆ తర్వాత బిష్ణోయ్ ఓవర్లోనూ రాహుల్ ఫోర్, 2 సిక్స్లతో చెలరేగాడు. శతక భాగస్వామ్యం తర్వాత నిసాంకను అవుట్ చేసి జడేజా ఈ జోడీని విడదీయగా, 27 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. క్రీజ్లో ఉన్నంత సేపు నితీశ్ రాణా (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిని ప్రదర్శించాడు. రాహుల్, రాణా ఆరు పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది. అయితే అశుతోష్ శర్మ (15 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (11 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్కు 24 బంతుల్లో అభేద్యంగా 49 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు.
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 తర్వాత జరుగబోయే ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ సిరీస్లకు ఇద్దరు యువ పేసర్లు దూరమయ్యారు. ఆ ఇద్దరి పేర్లు హర్షిత్ రాణా, ఆకాశ్దీప్. వీరిద్దరు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.హర్షిత్ మోకాలి గాయంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోగా.. ఆకాశ్దీప్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇద్దరి రిహాబిలిటేషన్ సక్రమంగా సాగుతున్నప్పటికీ, పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు చాలా సమయం అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గాయాల కారణంగా హర్షిత్, ఆకాశ్దీప్ ఐపీఎల్కు కూడా దూరమయ్యారు.కాగా, ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఈ కీలక పర్యటనల్లో ఇద్దరు ప్రధాన పేసర్లు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటే.
శభాష్ సౌరవ్
కార్లో (ఐర్లాండ్): భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి సం...
ముగిసిన వేలం.. తెలంగాణ ప్లేయర్కు చోటు.. జట్ల వివరాలివే!
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) 7వ సీ...
గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడాను!.. తప్పని నిషేధం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నలుబోతు షణ్ముగ ...
లీగ్ దశలోనే భారత్ అవుట్
హోర్సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ మహిళల బ్యా...
టీ20 ప్రపంచకప్.. నేడే భారత జట్టు ప్రకటన
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనే భారత జట్టు బ...
అన్నా.. సారీ.. నిన్ను తక్కువగా అంచనా వేశాం!
ఐపీఎల్-2026లో జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్...
చెలరేగిన రాహుల్.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ
264 పరుగులు చేసినా ఓడిపోయె... ఆపై 75 పరుగులకు కుప్...
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు భారీ ఎదురు...
క్రీడలు
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
వీడియోలు
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
చితక్కొట్టిన సన్ రైజర్స్
244 టార్గెట్ ఊదేశారు.. SRHకి వరుసగా ఐదో విజయం
రియాన్ పరాగ్ అరెస్ట్ ?
వైభవ్ సూర్యవంశీపై ఒలంపిక్స్ విజేత మనూ భాకర్ కామెంట్స్ వైరల్..
తొలి ఓటమితో తడబడిన పంజాబ్ కింగ్స్.. దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్..
IPLల్లో ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం
SRHపై బుడ్డోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్
