Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: Chennai Super Kings Beat Delhi Capitals By 8 Wickets1
సంజూ విధ్వంసం.. సీఎస్‌కే ఘన విజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సంజూ శాంసన్ (87 నాటౌట్‌) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. స్ట‌బ్స్ (38), స‌మీర్ రిజ్వీ (40 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్లలో నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, అకిల్ హొసేన్‌, ముకేశ్ చౌద‌రీ, గుర్జ‌ప్‌నీత్ సింగ్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. కాగా టాపార్డ‌ర్ వైఫ‌ల్యం ఢిల్లీ కొంప‌ముంచింది. సీఎస్‌కే బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఢిల్లీ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో స్ట‌బ్స్‌, స‌మీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 ప‌రుగులు జోడించ‌డంతో ఢిల్లీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది.సీఎస్‌కే ఆడుతూ పాడుతూ..156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగింది. కెప్టెన్‌ రుతురాజ్‌, వన్‌డౌన్‌లో వచ్చిన ఉర్విల్ పటేల్‌ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కానీ మరో ఎండ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు శాంసన్‌కు జత కలిసిన కార్తిక్ శర్మ తోడయ్యాడు. ఈ ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లు బాది సీఎస్‌కేకు విజయాన్ని కట్టబెట్టారు. శాంసన్ సునామీ ఇన్నింగ్స్‌తో అలరిస్తే.. కార్తిక్ తన హిట్టింగ్‌ను ఢిల్లీ బౌలర్లకు రుచి చూపించాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఇది ఐదో విజయం కాగా పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, ఆరు ఓటములతో పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.

Cricket Fans Questions Is The Yorker Balls Dead In T20 Cricket2
బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు!

క్రికెట్‌లో ఒక‌ప్పుడు బ్యాట‌ర్ల‌కు భ‌యం పుట్టించిన‌ యార్క‌ర్లు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. చేజింగ్ స‌మ‌యంలో బ్యాటింగ్ చేసే జట్టులో ఆందోళన పెరిగి, సమీకరణం ఉత్కంఠభరితంగా మారినప్పుడు, ఆయా కెప్టెన్లు ఒక బంతినే న‌మ్ముకునేవారు. అదే సంప్ర‌దాయ యార్క‌ర్‌. ముఖ్యంగా డెత్ ఓవ‌ర్ల‌లో మ‌లింగ‌, బుమ్రా లాంటి యార్క‌ర్ల స్పెష‌లిస్టులు విసిరే యార్క‌ర్ల‌కు బ్యాట‌ర్లకు ఫ్యూజులు ఎగిరేవి. ఐపీఎల్‌లోనూ యార్క‌ర్ల‌కు స్వ‌ర్ణ‌యుగం న‌డిచింది. ఆఖరి బంతి దాకా విజ‌యం దోబుచులాడే టీ20 క్రికెట్‌లో ఇటీవ‌లే కాలంలో మ్యాచ్‌ల‌న్నీ వ‌న్‌సైడ్‌గా మారిపోవ‌డం చూస్తున్నాం. ఐపీఎల్‌లోనూ ఈ త‌ర‌హా మ్యాచ్‌లు ఎక్కువైపోయాయి. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోనూ అన్ని జ‌ట్లు 200 ప‌రుగుల టార్గెట్‌ను అవ‌లీల‌గా ఛేదించేస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో యార్క‌ర్ బంతులు క‌నిపించ‌క‌పోవ‌డంతో అటు డ్రెస్సింగ్ రూమ్‌లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఒక‌టే చ‌ర్చ జ‌రుగుతుంది. అదేంటంటే ఒక‌ప్పుడు భ‌యం పుట్టించిన యార్క‌ర్ల‌కు క్ర‌మంగా క‌నుమ‌రుగవుతున్నాయా అని ప్ర‌శ్నలు సంధిస్తున్నారు. నిజానికి ఈ సీజ‌న్‌లో ముంబై త‌ర‌ఫున ఆడుతున్న బుమ్రా కావొచ్చు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆడుతున్న న‌ట‌రాజన్ వీరంతా యార్కర్ల స్పెష‌లిస్టులే. కానీ ఈ సీజ‌న్‌లో ఒక్క‌సారి కూడా వీరు త‌మ యార్క‌ర్ల‌తో ప్ర‌భావం చూప‌లేక‌పోయారు.బ్యాటర్లు ఫినిషింగ్‌ను ఒక శాస్త్రంగా మార్చుకోవడంతో, గత కొన్నేళ్లుగా డెత్ ఓవర్లలో పరుగుల రేట్లు క్రమంగా పెరిగాయి. వారు బంతి కదలికను, ముందుచూపును ఉపయోగించి చిన్నపాటి పొరపాట్లను కూడా బౌండరీలుగా మారుస్తున్నారు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో డెత్ ఓవర్ల (17వ నుండి 20వ ఓవర్ల వరకు) సగటు రన్ రేట్ 9.41గా ఉండగా, అది క్రమంగా పెరిగి 2025 నాటికి 11.5కు చేరుకుంది. అదేవిధంగా, జట్టు సగటు స్కోరు 2008లో 157 నుండి 2025 నాటికి 180కి పెరిగింది.2023లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ప్రవేశపెట్టడం కూడా స్లాగ్ ఓవర్లలో యార్కర్‌కు ప్రాధాన్యత తగ్గడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే ఇంపాక్ట్ నిబంధ‌న‌పై కూడా సీనియ‌ర్ క్రికెట‌ర్లు, బౌల‌ర్లు వ్య‌తిరేకిస్తున్నారు. మొత్తంగా ఒక‌ప్పుడు యార్క‌ర్లు బ్యాట‌ర్లు బెంబెలెత్తించాయి. కానీ ఇప్పుడు అదే యార్క‌ర్లు క‌నిపించ‌కుండా పోతున్నాయి.చదవండి: బెదిరింపులకు దిగిన టెన్నిస్ స్టార్‌!

World No-1-Aryna Sabalenka Calls for Tennis Grand Slams Boycott3
బెదిరింపులకు దిగిన టెన్నిస్ స్టార్‌!

మ‌హిళ‌ల ప్రపంచ నంబ‌ర్‌వ‌న్, స్టార్ క్రీడాకారిణి అరీనా స‌బలెంకా బెదిరింపుల‌కు దిగింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో త‌మ‌కు ఎక్కువ మొత్తంలో షేర్ ఇవ్వ‌క‌పోతే ఆ టోర్నీల‌ను ఆట‌గాళ్లు బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చింది. ఇటీవ‌లే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ప్రైజ్‌మ‌నీ విష‌యంలో ఇట‌లీ స్టార్ జానిక్ సిన్న‌ర్.. 'ప్రైజ్‌మ‌నీ విష‌యంలో పూర్తి నిరాశ‌తో ఉన్నా' అంటూ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సిన్న‌ర్‌కు స‌బలెంకా మ‌ద్ద‌తుగా నిలుస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 'ఆట‌గాళ్ల‌కు ఆదాయంలో వాటా పెర‌గక‌పోతే మేము గ్రాండ్‌స్లామ్ టోర్నీల‌ను బ‌హిష్క‌రించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆట‌గాళ్లు అందుకున్న షేర్‌కు, చూపెడుతున్న లెక్క‌ల‌కు సంబంధం ఉండ‌డం లేదు. అందుకే ఆట‌గాళ్ల‌కు ప‌క్క‌గా ఆదాయంలో ఎక్కువ వాటాను ఇవ్వాలి. ఒక‌వేళ మేము బ‌హిష్క‌రిస్తే టోర్నీలు జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. అదే జ‌రిగితే మా నుంచి వ‌చ్చే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కులు మిస్ అవుతారు. క‌నీసం మాతో చ‌ర్చ‌లు జ‌రిపి ఆట‌గాళ్లు సంతోషప‌డే విధంగా ఆదాయంలో వాటా విష‌య‌మై ఒక ముగింపు ఇస్తార‌ని ఆశిస్తున్నా' అని చెప్పుకొచ్చింది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఓపెన్ ప్రైజ్‌మ‌నీపై అగ్ర‌శ్రేణి ఆటగాళ్లు జానిక్ సిన్న‌ర్‌, కోకో గాఫ్‌, స్వియాటెక్‌, జొకోవిచ్‌, జ్వెరెవ్‌, మెద్వెదెవ్ స‌హా ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తం ప్రైజ్‌మ‌నీ సుమారు ప‌ది శాతం మేర పెరిగి 61.7 యూరో మిలియ‌న్లకు చేరుకుంద‌ని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. అయితే ఆట‌గాళ్లు మాత్రం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆట‌గాళ్ల‌కు ఆదాయంలో అందించే వాటా 15.5 నుంచి 14.9 శాతానికి త‌గ్గింద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇక ఈ సీజ‌న్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ అయిన ఫ్రెంచ్ ఓపెన్ మే 18 నుంచి జూన్ 7 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఫీట్‌!

2nd Time-IPL-Top 4-Batters Marks Double Digit-Not-Reached 20 Runs4
ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఫీట్‌!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఫీట్‌ సాధించింది. సీఎస్‌కేతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఢిల్లీ టాపార్డర్‌ పూర్తిగా విఫలమైంది. ఏ ఒక్కరు కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌లో టాప్‌-4 బ్యాటర్లు రెండంకెల స్కోరు అందుకున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరు 20 పరుగుల మార్క్‌ను దాటకపోవడం గమనార్హం.నిస్సాంక (19), రాహుల్‌ (12), నితీశ్‌రానా (15), కరుణ్‌ నాయర్‌ (13).. ఈ నలుగురు 20 పరుగుల్లోపే ఔటయ్యారు. ఇలా ఒక మ్యాచ్‌లో టాప్‌ నలుగురు బ్యాటర్లు డబుల్‌ డిజిట్‌ మార్క్‌ను అందుకున్నప్పటికీ 20 పరుగులు దాటకపోవడం ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. మొదటిసారి కూడా ఈ ఫీట్‌ను సాధించింది ఢిల్లీ జట్టే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. 2011లో కొచ్చి టస్కర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున టాప్‌ నలుగుల బ్యాటర్లు సెహ్వాగ్‌ (15), వార్నర్‌ (13), నమన్‌ ఓజా (13), యోగేశ్‌ నగర్‌ (18) 20 పరుగుల మార్క్‌ దాటకుండానే ఔటయ్యారు.ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. స‌మీర్ రిజ్వీ (40 నాటౌట్‌), స్ట‌బ్స్ (38) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్లలో నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, అకిల్ హొసేన్‌, ముకేశ్ చౌద‌రీ, గుర్జ‌ప్‌నీత్ సింగ్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డ‌ర్ వైఫ‌ల్యం ఢిల్లీ కొంప‌ముంచింది. సీఎస్‌కే బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఢిల్లీ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో స్ట‌బ్స్‌, స‌మీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 ప‌రుగులు జోడించ‌డంతో ఢిల్లీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. చదవండి: తృణముల్‌ చాప్టర్‌ ముగిసింది: మాజీ క్రికెటర్‌

Ex Cricketer Alleges Demand 5 Crore MLA Ticket -TMC-Chapter Over5
తృణముల్‌ చాప్టర్‌ ముగిసింది: మాజీ క్రికెటర్‌

తృణ‌ముల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే, టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌నోజ్ తివారి తృణ‌ముల్ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. మ‌మతా బెన‌ర్జీ నేతృత్వంలోని టీఎంసీ త‌న‌కు హౌరాలోని షిబ్‌పుర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌డానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన‌ట్లు ఆరోపించాడు. ఇక రాజ‌కీయంగా తృణ‌ముల్ కాంగ్రెస్‌తో త‌న‌ అధ్యాయం ముగిసింద‌ని మ‌నోజ్ తివారి పేర్కొన్నాడు. సోమ‌వారం వెలువ‌డిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 15 ఏళ్ల మ‌మ‌తా బెన‌ర్జీ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడిన‌ బెంగాల్ ప్ర‌జ‌లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో బెంగాల్‌లో బీజేపీ గెలుపుపై మ‌నోజ్ తివారి స్పందించాడు. ఈ సంద‌ర్భంగా తృణ‌ముల్ అవినీతి, పార్టీ చేసిన అరాచ‌కాల‌ను మ‌నోజ్ తివారి ఎండ‌గ‌ట్టాడు. ‘హౌరాలోని శిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వడానికి టీఎంసీ నిరాకరించింది. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ సారి ఎన్నికల్లో సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థులు భారీగా డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. అందుకే పార్టీ ఘోర పరాజయం పాలైంది. అవినీతిమయమైన పార్టీకి పతనం తప్పదు. టీఎంసీతో నా అధ్యాయం ముగిసింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో నేను క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాను. పేరుకే మంత్రి పదవి.. కానీ నాకు ఎటువంటి అధికారాలు ఉండేవి కాదు. కనీసం నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వ‌లేదు. నా సొంత నియోజకవర్గంలో డ్రైనేజీ, మురుగునీటి సమస్యల కోసం ఎంతో పోరాడాను.ప్రతి ఏడాది ఏదో ఒక మాస్టర్ ప్లాన్ అంటారు. కానీ అది మాటలకే పరిమితం అయ్యేది. క్రీడా మంత్రి బిస్వాస్‌కు క్రీడలపై క‌నీస‌ అవగాహన లేదు. నా ఎదుగుదలను చూసి అసూయ పడేవారు. క్రీడా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించకుండా అడ్డుకునేవారు. నాపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. నేను ఐపీఎల్‌లో 10 ఏళ్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20 ఏళ్లు ఆడాను. నాకు డబ్బు అవసరం లేదు’ అని తివారీ స్పష్టం చేశారు.ఇక త‌న రాజ‌కీయ జీవితం ముగిసింద‌ని ప్ర‌క‌టించిన మ‌నోజ్ తివారి త్వ‌ర‌లో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు. అయితే ఈసారి ఆట‌గాడిగా కాకుండా కోచ్ పాత్ర‌లో వ‌స్తున్న‌ట్లు తెలిపాడు. ఇప్ప‌టికే బీసీసీఐ లెవెల్ 2 కోచ్ ప‌రీక్ష‌ను కూడా పాసైన‌ట్లు తెలిపాడు. ఇప్ప‌టికే బెంగాల్ క్రికెట్ హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు పేర్కొన్నాడు. బెంగాల్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన మ‌నోజ్ తివారి దేశ‌వాలీ క్రికెట్‌లో బెంగాల్ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు (10,195 ప‌రుగులు) చేసిన క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఇక టీమిండియా త‌ర‌ఫున 2008 నుంచి 2015 మ‌ధ్య ఆడిన మనోజ్‌ తివారి 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో మనోజ్‌ తివారి కేకేఆర్‌, పంజాబ్‌, రైజింగ్‌ పూణే, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌!

Daniel Vettori provides massive update on Nitish Kumar Reddy injury ahead of PBKS clash6
ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులకు శుభవార్త

ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో రేపు (మే 6) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు శుభవార్త అందింది. అనారోగ్యం కారణంగా కేకేఆర్‌ మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కోలుకున్నాడని తెలుస్తోంది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ విషయంపై జట్టు కోచ్‌ డేనియల్‌ వెటోరీ క్లారిటీ ఇచ్చాడు.కాగా, నితీశ్‌ స్థానంలో కేకేఆర్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగిన స్మరణ్‌ రవిచంద్రన్‌ (4) ఘోరంగా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో నితీశ్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ గెలిచి ఉంటే, ప్లే ఆఫ్స్‌ రేసులో మిగతా జట్లకంటే ముందుండేది.ప్రస్తుతం ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పంజాబ్‌ (13), ఆర్సీబీ (9 మ్యాచ్‌ల్లో 12) తర్వాత పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్‌, గుజరాత్‌కు సైతం తలో 12 పాయింట్లు ఉన్నప్పటికీ.. రన్‌రేట్‌ పరంగా సన్‌రైజర్స్‌ కాస్త మెరుగ్గా ఉంది. ప్రస్తుతం పంజాబ్‌, ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-5లో ఉండి ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. ఇకపై ఈ జట్లకు ప్రతి మ్యాచ్‌ కీలకంగా ఉంటుంది.

IPL 2026: Delhi Capitals Vs Chennai Super Kings-Match Live Updates7
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్‌కే విజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్ (87 నాటౌట్‌) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. విజ‌యం దిశ‌గా సీఎస్‌కేఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే విజ‌యం దిశ‌గా కొన‌సాగుతోంది. 16 ఓవ‌ర్లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు వికెట్ల న‌ష్టానికి 138 ప‌రుగులు చేసింది. శాంస‌న్ (84), కార్తిక్ శ‌ర్మ (23) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. శాంస‌న్ హాఫ్ సెంచ‌రీ.. సీఎస్‌కే 96/2ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్కే ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. 32 బంతుల్లో అర్థ‌సెంచరీ మార్క్ అందుకున్న శాంస‌న్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం సీఎస్‌కే 12 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 96 ప‌రుగులు చేసింది.రెండో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే8 ఓవ‌ర్లు ముగిసేస‌రికి సీఎస్‌కే రెండు వికెట్ల న‌ష్టానికి 60 ప‌రుగులు చేసింది. శాంస‌న్ (22), కార్తిక్ శ‌ర్మ (5) ప‌రుగుల‌తో ఆడుతున్నారు. అంత‌క‌ముందు 17 ప‌రుగులు చేసిన ఉర్విల్ ప‌టేల్ అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో వెనుదిరగ‌డంతో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది.రుతురాజ్‌ ఔట్‌..ఆరు పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎన్గిడి బౌలింగ్‌లో స‌మీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగ‌డంతో సీఎస్‌కే 24 ప‌రుగుల వ‌ద్ద‌ తొలి వికెట్ కోల్పోయింది.156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. శాంసన్ (10), గైక్వాడ్ (6) పరుగులతో ఆడుతున్నారు.సీఎస్‌కే టార్గెట్‌ 156 పరుగులుసీఎస్‌కేతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. స‌మీర్ రిజ్వీ (40 నాటౌట్‌), స్ట‌బ్స్ (38) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్లలో నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, అకిల్ హొసేన్‌, ముకేశ్ చౌద‌రీ, గుర్జ‌ప్‌నీత్ సింగ్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డ‌ర్ వైఫ‌ల్యం ఢిల్లీ కొంప‌ముంచింది. సీఎస్‌కే బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఢిల్లీ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో స్ట‌బ్స్‌, స‌మీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 ప‌రుగులు జోడించ‌డంతో ఢిల్లీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. 16 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ 5 వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (30), స‌మీర్ రిజ్వీ (16) ప‌రుగుల‌తో ఆడుతున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీసీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ల పరంపర కొనసాగుతోంది. 2 పరుగులు చేసిన కెప్టెన్ అక్షర్ పటేల్ గుర్జ్‌ప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో అకిల్ హొసేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (4), ట్రిస్టన్ స్టబ్స్ (12) పరుగులతో ఆడుతున్నారు.4 వికెట్లు డౌన్‌నితీశ్‌ రాణా, కరుణ్‌ నాయర్‌ ఔటయ్యారు. నితీశ్‌ రాణా 15 పరుగులు చేసి.. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో కార్తీక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. కరుణ్‌ నాయర్‌ 13 పరుగులు చేసి.. నూర్‌ అహ‍్మద్‌ బౌలింగ్‌లో గుర్జప్‌నీత్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..12 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ అకిల్‌ హొసేన్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది.తొలి వికెట్ డౌన్‌సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ న‌ష్టానికి 29 ప‌రుగులు చేసింది. రాహుల్ (10) క్రీజులో ఉన్నాడు.టాస్‌ నెగ్గిన ఢిల్లీ టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కైల్‌ జేమీసన్‌ స్థానంలో లుంగి ఎన్గిడి జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్‌కే రెండు మార్పులు చేసింది. అకిల్‌ హొసేన్‌, గుర్జప్‌నీత్‌ సింగ్‌ జట్టులోకి వచ్చారు. సీజ‌న్ తొలి అంచె పోటీలో ఇరుజ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 23 ప‌రుగుల తేడాతో ఢిల్లీపై విజ‌యాన్ని అందుకుంది. మ‌రి ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ సొంత‌గ‌డ్డ‌పై చెన్నైని ఓడించి ప్ర‌తీకారం తీర్చుకుంటుందా లేదా అన్న‌ది చూడాలి. ముఖాముఖి పోరులో మాత్రం చెన్నై సూప‌ర్‌కింగ్స్‌దే పైచేయి. 32 మ్యాచ్‌ల్లో 20 సార్లు సీఎస్‌కే, 12 సార్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్ నెగ్గింది. 2022 నుంచి చూసుకుంటే సీఎస్‌కే నాలుగుసార్లు నెగ్గితే, ఢిల్లీ రెండు సార్లు మాత్ర‌మే విజ‌యం సాధించింది.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్‌), అశుతోష్ శర్మ, లుంగీ ఎంగిడి, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్‌నీత్‌ సింగ్.

Ravi Shastri analyses reason behind Jasprit Bumrahs poor show in IPL 20268
బుమ్రా ఫెయిల్యూర్‌కు కారణమిదే: రవిశాస్త్రి

ఐపీఎల్‌-2026లో టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియ‌న్స్ స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా పేలవ ఫామ్ కొన‌సాగుతోంది. సోమవారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా విఫ‌ల‌మ‌య్యాడు. త‌న శైలికి విరుద్దంగా భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. జ‌స్ప్రీత్ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 11.20 ఏకాన‌మీ రేటుతో ఏకంగా 45 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఈ సీనియ‌ర్ పేస‌ర్ క‌నీసం ఒక్క వికెట్ కూడా సాధించలేక‌పోయాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో బుమ్రా మొత్తంగా కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు.ప్ర‌తీ సీజ‌న్‌లో ప‌ర్పుల్ క్యాప్ రేసులో ఉండే బుమ్రా.. ఈసారి ఇలాంటి ప్ర‌ద‌ర్శన చేయ‌డం క్రికెట్ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చానీయాంశ‌మైంది.ఈ నేపథ్యలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరాయంగా మ్యాచ్‌లు ఆడటం వల్ల బుమ్రాపై వర్క్‌లోడ్‌ పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక పనిభారం వల్లే బుమ్రా రాణించలేకపోతున్నాడని శాస్త్రి చెప్పుకొచ్చారు."బుమ్రా గత 12 నెలలుగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ భారీ వర్క్‌లోడ్‌తో అతడు ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. అతడు శారీరకంగా, మానసికంగా అలిసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడు పేలవ ప్రదర్శనకు ఇది ప్రధాన కారణం. ముంబై ఇండియన్స్ బుమ్రా పట్ల జాగ్రత్త వహించాలి. రాబోయే రెండు ఏళ్లలో భారత జట్టు బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. పలు టెస్టు సిరీస్‌లు, అలాగే వన్డే ప్రపంచ కప్ వంటి కీలక టోర్నమెంట్లు జరగనున్నాయి. బుమ్రా భారత జట్టకు చాలా కీలకం కాబట్టి, ముంబై మేనెజ్‌మెంట్ అతడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని" ఛాంపియన్స్ వాలీ కామెంటరీ కార్యక్రమంలో రవిశాస్త్రి పేర్కొన్నారు.చదవండి: IPL 2026: 'వావ్‌ వాట్ ఏ ప్లేయర్‌.. ఏ మాత్రం మారలేదు'

Simon Harmer makes big claims against BCCI, Indian cricket9
సౌతాఫ్రికా క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

సౌతాఫ్రికా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ను నియంత్రిస్తుందని ఆరోపించాడు. భారత్‌ వాణిజ్య శక్తి కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌పై భారీ ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో శక్తి సమతౌల్యం ఇంకా మారలేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఇంగ్లండ్‌లోని ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైమన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఆ విజయం తర్వాత కూడా మారని సమీకరణలుగతేడాది లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి టెస్ట్‌ ఛాంపియన్‌గా అవతరించింది. 1991-92లో క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత వారికి ఇది తొలి రెడ్‌బాల్ టైటిల్.అయితే ఈ విజయం తర్వాత కూడా ప్రపంచ క్రికెట్‌లో శక్తి సమతౌల్యత మారలేదన్నది సైమన్‌ అభిప్రాయం. ఐసీసీపై ఇంకా భారత్ పెత్తనమే కొనసాగుతుందన్నది అతని వాదన. బీసీసీఐ ధనబలంతో ఐసీసీని నియంత్రిస్తోందన్నది అతని వాదన. బవుమా, కాన్రాడ్‌పై ప్రశంసలుఇదే సందర్భంగా సైమన్‌ తన సొంత జట్టు సభ్యులపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోచ్ షుక్రి కాన్రాడ్‌, కెప్టెన్‌ టెంబా బవుమాను ఆకాశానికెత్తాడు. వారి జట్టు ఒకరిద్దరి స్టార్‌ ప్లేయర్ల జట్టు కాదని.. కోచ్ ప్రతి విషయాన్ని నేరుగా మాట్లాడటం చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు.ఇంగ్లండ్ వ్యవస్థపై కూడా విమర్శలుసైమన్‌ ఇంగ్లండ్ క్రికెట్ వ్యవస్థపై కూడా విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్‌ జాతీయ జట్టులో స్పిన్నర్లకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించాడు. కౌంటీ క్రికెట్ నిర్మాణం వల్ల వారు లీడర్‌షిప్ పాత్రలో ఎదగలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు.మొత్తంగా సైమన్‌ తన వ్యాఖ్యల్లో బీసీసీఐ పెత్తనం చేస్తోందని, ఇంగ్లండ్‌ క్రికెట్‌ వ్యవస్థలో లోపాలున్నాయని అన్నాడు. సైమన్‌ గతేడాది స్వదేశంలో టీమిండియాను ఓడించిన (టెస్ట్‌ సిరీస్‌) జట్టులో సభ్యుడు.

Milind Soman Conquers the Strait of Gibraltar10
జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మిలింద్ సోమన్

వయసు కేవలం అంకె మాత్రమే అని మరోసారి నిరూపించాడు ప్రముఖ మోడల్, భారత ఫిట్‌నెస్ ఐకాన్ మిలింద్ సోమన్. మిలింద్ 60 ఏళ్ల వయస్సులో ఐరోపా, అఫ్రికా ఖండాన్ని వేరు చేసే జిబ్రాల్టర్ జలసంధిని ఈది సరికొత్త చరిత్ర సృష్టించాడు.మే 1న యూరప్‌లోని టారిఫా నుండి ఆఫ్రికాలోని మొరాకో తీరం వరకు సుమారు 15 కిలో మీటర్లు ఈది జిబ్రాల్టర్ జలసంధిని అతడు దాటాడు. ఈ ఘనతను ఒక అద్భుతంగా అతడు అభివర్ణించాడు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను దాటి మరి ఈ లక్ష్యాన్ని అతడు చేరుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. కాగా మిలింద్ సోమన్ ఫిట్‌నెస్ పరంగా ఎంతో మందికి రోల్ మోడల్‌. సోమన్ తాజాగా తన ఫిట్‌నెస్ రహస్యాలను అభిమానులతో పంచుకున్నాడు. గత ఏడాది కాలంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నట్లు మిలింద్ తెలిపాడు.ఇక సోమన్‌ 1990లలో సూపర్‌ మోడల్‌గా నిలిచాడు. ఆ తర్వాత అల్ట్రా-మారథాన్ రన్నర్‌గా, 'ఐరన్ మ్యాన్' టైటిల్‌ను గెలుచుకున్నారు. అంతేకాకుండా జుర్మ్, ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్,, డిసెంబర్‌ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్‌లలో తన నటనతో మొప్పించారు.At 60, most people slow down. Milind Soman chose to cross continents.On May 1, he swam 15 km across the Strait of Gibraltar, from Tarifa in Europe to the coast of Morocco in Africa.Calling the experience “beautiful,” he reminded the world that endurance isn’t about age, it’s… pic.twitter.com/Icx6mRgJFr— The Better India (@thebetterindia) May 5, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement