Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India beat pakistan by 58 runs in under 19 world cup super six match1
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌

అండర్‌ 19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పాకిస్తాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్‌ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఆఖర్లో కనిష్క్‌ చౌహాన్‌ (35), ఖిలన్‌ పటేల్‌ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌ (16), కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (0), అభిగ్యాన్‌ కుందు (16), దీపేశ్‌ దేవేంద్రన్‌ (1) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (30), విహాన్‌ మల్హోత్రా (21), అంబ్రిష్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో అబ్దుల్‌ సుభాన్‌ 3, మొహమ్మద్‌ సయ్యద్‌ 2, అలీ రజా, అహ్మద్‌ హుసేన్‌, మొమిన్‌ ఖమార్‌, అలీ హస్సన్‌ బలోచ్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్‌ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్‌ పటేల్‌ (9.2-1-35-3), ఆయుశ్‌ మాత్రే (8-0-21-3), కనిష్క్‌ చౌహాన్‌ (10-1-30-1), విహాన్‌ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్‌ (5-0-26-1), హెనిల్‌ పటేల్‌ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్‌ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖాన్‌ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్‌ (42), ‍కెప్టెన్‌ ఫర్హాన్‌ యూసఫ్‌ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్‌-2 నుంచి భారత్‌, ఇంగ్లండ్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. గ్రూప్‌-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ భారత్‌ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌ తలపడతాయి.

Pakistan to forfeit India clash in T20 World Cup 20262
పాక్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన

టీ20 ప్రపంచకప్‌-2026 నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ హై–వోల్టేజ్‌ పోరుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, పాక్‌ జట్టు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే మిగతా ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ ఆ దేశ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ను కలిసిన కొన్ని గంటల తర్వాత వెలువడింది. పాక్‌ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్‌-పాక్‌ ఇప్పటివరకు కేవలం​ ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడేవి. ఇప్పుడు అది కూడా లేకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలిచి వేస్తుంది. పాక్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ ఏరకంగా స్పందిస్తుందో వేచి చూడాలి. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు వల్ల అభిమానులకే కాదు, వాణిజ్యానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పాక్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య రాజకీయ, ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.కాగా, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్‌ జట్టు ఇదివరకే ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది. ఇప్పుడు పాక్‌ కూడా అదే కారణాన్ని సాకుగా చూపుతూ భారత్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌ ఇటీవలికాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో మొదలైంది. ఈ కారణంగా బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించగా.. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్‌ భారత్‌లో జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌లు ఆడమని భీష్మించుకు కూర్చుంది. వేదికలను శ్రీలంక‍కు మార్చాలని కోరగా ఐసీసీ ససేమిరా అంది. ఈ విషయంలో పాక్‌ బంగ్లాదేశ్‌కు మొదటి నుంచి వంత పాడుతూ వచ్చింది. బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్‌కు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లభించింది. కాగా, ప్రపంచకప్‌లో పాక్‌ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనున్న విషయం తెలిసిందే. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కూడా శ్రీలంకలోనే షెడ్యూలై ఉండింది.

Pakistan defeat australia by 111 runs in third t20, clean sweep the series3
మూడో టీ20లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన పాక్‌

టీ20 ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ 111 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-0 తేడాతో ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసిన పాక్‌.. అనంతరం ఆసీస్‌ను 16.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూల్చి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.రాణించిన బాబర్‌, సైమ్‌పాక్‌ ఇన్నింగ్స్‌లో సైమ్‌ అయూబ్‌ (56), బాబర్‌ ఆజమ్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో షాదాబ్‌ ఖాన్‌ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా పాక్‌ ఆటగాళ్లలో ఫకర్‌ జమాన్‌ 10, కెప్టెన్‌ సల్మాన్‌ అఘా 5, ఖ్వాజా నఫే 21, మొహమ్మద్‌ నవాజ్‌ 5, ఫహీం అష్రాఫ్‌ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో డ్వార్షుయిస్‌ 2, గ్రీన్‌, కన్నోలీ, షార్ట్‌, కుహ్నేమన్‌ తలో వికెట్‌ తీశారు.తిప్పేసిన నవాజ్‌అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ చేతులెత్తేసింది. మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో గ్రీన్‌ (22), స్టోయినిస్‌ (23), జోష్‌ ఫిలిప్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్ష్‌ (1), షార్ట్‌ (2), రెన్‌షా (1), ఓవెన్‌ (8), కన్నోలీ (0), కుహ్నేమన్‌ (5) దారుణంగా విఫలమయ్యారు. ఆడమ్‌ జంపా బ్యాటింగ్‌కు దిగలేదు. పాక్‌ ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ​కూడా భారీ విజయాలు సాధించింది. ఈ సిరీస్‌కు ఆసీస్‌ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ప్రపంచకప్‌ దృష్ట్యా సీనియర్లకు విశ్రాంతినిచ్చింది.

Babar Azam breaks HUGE Virat Kohli record with fighting fifty in PAK vs AUS 3rd T20I4
విరాట్‌ కోహ్లి పేరిట ఉండిన భారీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్‌ ఆజమ్‌

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ భారత దిగ్గజం విరాట్‌ కోహ్లి పేరిట ఉండిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న మూడో టీ20లో హాఫ్‌ సెంచరీ చేసిన బాబర్‌.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ద సెంచరీలు (39) చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు విరాట్‌ కోహ్లి (38) పేరిట ఉండేది. తాజాగా బాబర్‌ తన పేరిట బదలాయించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్‌, విరాట్‌ తర్వాతి స్థానాల్లో రోహిత్‌ శర్మ (32), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (30), డేవిడ్‌ వార్నర్‌ (28), జోస్‌ బట్లర్‌ (28) ఉన్నారు.మరో రికార్డుతాజా హాఫ్‌ సెంచరీతో బాబర్‌ మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆరు సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్‌ లెజెండ్‌ క్రిస్‌ గేల్‌ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ (8) అగ్రస్థానంలో ఉన్నాడు.ఫామ్‌లోకి వచ్చిన బాబర్‌BBL 2025–26లో సిడ్నీ సిక్సర్స్‌ తరఫున నిరాశాజనకమైన ప్రదర్శనలు (11 ఇన్నింగ్స్‌ల్లో 202 పరుగులు) చేసిన బాబర్‌.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై చివరి టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి, ఫామ్‌లోకి వచ్చాడు.మ్యాచ్‌ పరిస్థితి లాహోర్‌ వేదికగా జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసిన 207 పరుగుల (6 వికెట్ల నష్టానికి) భారీ స్కోర్‌ చేసింది. సైమ్‌ అయూబ్‌ (56), బాబర్‌ ఆజమ్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో షాదాబ్‌ ఖాన్‌ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆసీస్‌ బౌలర్లలో డ్వార్షుయిస్‌ 2, గ్రీన్‌, కన్నోలీ, షార్ట్‌, కుహ్నేమన్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ చేతులెత్తేసింది. 15.5 ఓవర్ల తర్వాత 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి దిశగా పయనిస్తుంది. మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన పాక్‌ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Ranji Trophy: In a must win game, Padikkal smashed century for Karnataka5
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పడిక్కల్‌ విధ్వంసకర శతకం

కర్ణాటక బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ దేశవాలీ క్రికెట్‌లో అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల విజయ్‌ హజారే వన్డే టోర్నీలో 9 ఇన్నింగ్స్‌ల్లో 90కి పైగా సగటుతో 4 సెంచరీల సాయంతో 725 పరుగులు చేసిన అతను.. తాజాగా రంజీ ట్రోఫీలో పంజాబ్‌పై విధ్వంసకర శతకంతో చెలరేగాడు. క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పడిక్కల్‌ ఉగ్రరూపం దాల్చాడు. 40 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 85 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 120 పరుగులు చేసి, తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో పడిక్కల్‌ కర్ణాటక కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సహా మ్యాచ్‌ను గెలిపించి చిరస్మరణీయం చేసుకున్నాడు. ఛేదనలో పడిక్కల్‌కు మయాంక్‌ అగర్వాల్‌ (53), శ్రేయస్‌ గోపాల్‌ (33) సహకరించారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. పడిక్కల్‌ విధ్వంసకర శతక​ంతో కదంతొక్కడంతో కర్ణాటక 27.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్‌ బౌలర్లలో అన్మోల్‌జీత్‌ సింగ్‌ 3 వికెట్లు తీయగా.. సుఖ్‌దీప్‌, ఎమన్‌జోత్‌ చహల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.అంతకుముందు పంజాబ​్‌ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఉదమ్‌ సహారన్‌ 93 పరుగులతో రాణించాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో సహారన్‌ మినహా ఎ‍వ్వరూ రాణించలేదు. అన్మోల్‌ప్రీత్‌ (44), అభిజీత్‌ (33), హర్ప్రీత్‌ బ్రార్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీయగా.. శిఖర్‌ షెట్టి 2, విధ్యాదర్‌ పాటిల్‌, మొహిసిన్‌ ఖాన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.దీనికి ముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ గోపాల్‌ (77), కేఎల్‌ రాహుల్‌ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మయాంక్‌ అగర్వాల్‌ (32), విధ్యాదర్‌ పాటిల్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ 4, సుఖ్‌దీప్‌ 3, అన్మోల్‌ 2, చహల్‌ ఓ వికెట్‌ తీశారు. అంతకుముందు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. అభిజీత్‌ (81), చహల్‌ (83) అర్ద సెంచరీలతో రాణించగా.. సహారన్‌ (44) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. విధ్యాదర్‌ పాటిల్‌ 4, శ్రేయస్‌ గోపాల్‌ 3, మొహిసిన్‌ ఖాన్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు.

Scotland, Ireland Seal 2026 Women's T20 World Cup Spots6
టీ20 ప్రపంచకప్‌కు మరో రెండు జట్లు

ఈ ఏడాది ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ అర్హత సాధించాయి. నేపాల్‌లో జరుగుతున్న క్వాలిఫయర్‌ పోటీల ద్వారా ఈ రెండు జట్లు ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కించుకున్నాయి. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ జట్లు కూడా ప్రపంచకప్‌ అర్హత సాధించాయి.ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో అమెరికా పై విజయం సాధించడంతో స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటి అమెరికాను మట్టికరిపించింది.మరోవైపు థాయ్‌లాండ్‌పై గెలుపుతో ఐర్లాండ్‌ ‍ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ తక్కువ స్కోరే చేసిన, దాన్ని విజయవంతంగా కాపాడుకుంది. కాగా, ఈ గ్లోబల్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనగా.. బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ టాప్‌-4లో నిలిచి ప్రపంచకప్‌ టికెట్‌ దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, భారత్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌, శ్రీలంక నేరుగా ప్రపంచకప్‌ అర్హత సాధించాయి.కాగా, జూన్‌ 12న బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్‌ 14న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి టైటిల్‌. ఆ ఎడిషన్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది.

Under 19 World Cup 2026: India all out for 252 vs Pakistan in super six match7
పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్‌.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌

అండర్‌–19 ప్రపంచకప్‌-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య కీలకమైన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్‌ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్‌ ఇప్పటికే సెమీఫైనల్‌ దిశగా అడుగులు వేసినా, పాక్‌ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేస్తుంది. పాక్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్‌ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్‌ చౌహాన్‌ (35), ఖిలన్‌ పటేల్‌ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మొత్తంగా భారత్‌ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌ (16), కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (0), అభిగ్యాన్‌ కుందు (16), దీపేశ్‌ దేవేంద్రన్‌ (1) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (30), విహాన్‌ మల్హోత్రా (21), అంబ్రిష్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో అబ్దుల్‌ సుభాన్‌ 3, మొహమ్మద్‌ సయ్యద్‌ 2, అలీ రజా, అహ్మద్‌ హుసేన్‌, మొమిన్‌ ఖమార్‌, అలీ హస్సన్‌ బలోచ్‌ తలో వికెట్‌ తీశారు.

Bangladesh announce new tournament after missing out on T20 World Cup 20268
టీ20 ప్రపంచకప్‌ నుంచి తొలగింపు.. బంగ్లాదేశ్‌ కీలక అడుగు

టీ20 ప్రపంచకప్‌ నుంచి తొలగించబడిన తర్వాత బంగ్లదేశ్‌ క్రికెట్‌ బోర్డు కీలక అడుగు వేసింది. ప్రపంచకప్‌ గ్యాప్‌ను కవర్‌ చేసుకునేందుకు స్వదేశంలో కొత్త టీ20 టోర్నీని ప్రకటించింది. ఈ టోర్నీకి ఓడొమ్మో (ODOMMO) బంగ్లాదేశ్‌ టీ20 కప్‌గా నామకరణం చేసింది. మూడు జట్లు (ధూమకేతు XI, దుర్బార్‌ XI, దురొంటో XI) పోటీ పడే ఈ టోర్నీ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ లాంచ్‌ విషయాన్ని ఆ దేశ యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహ్బూబ్‌–ఉల్–ఆలమ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచకప్‌ ఆడకపోయినా, ఆటగాళ్లకు పరిహారం ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.కాగా, భారత్‌లో భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్‌ జట్టు ప్రపంచకప్‌కు వెళ్లేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌కు వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కింది.ODOMMO టోర్నీ వివరాలు - జట్లు: ధూమకేతు XI, దుర్బార్‌ XI, దురొంటో XI - కెప్టెన్లు: లిటన్‌ దాస్‌ (ధూమకేతు), నజ్ముల్‌ హొసైన్‌ షాంటో (దుర్బార్‌), అక్బర్‌ అలీ (దురొంటో) - మ్యాచ్‌లు: గ్రూప్‌ స్టేజ్‌ ఫిబ్రవరి 5, 6, 7; ఫైనల్‌ ఫిబ్రవరి 9 - ప్రారంభం: ప్రతి మ్యాచ్‌ రోజు సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం, 6 గంటలకు మ్యాచ్‌ - ప్రైజ్‌ మనీ: మొత్తం 2.5 కోట్లు టాకా, ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులు కూడా ఇవ్వబడతాయి

Ayush Mhatre, Suryavanshi Chokers: Fans tear into India U19 stars amid collapse vs Pakistan9
భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రే

భారత యువ జట్టు కెరటాలు ఆయుశ్‌ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీ సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైనందుకు టీమిండియా ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురవుతున్నారు. చోకర్స్‌ అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. సూర్యవంశీతో పోలిస్తే మాత్రేపై ట్రోలింగ్‌ ధాటి అధికంగా ఉంది. ప్రతి కీలక మ్యాచ్‌లో విఫలమవుతాడు, ఇతన్ని ఎలా కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మాత్రే రెండు బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేకపోగా.. చిన్న జట్లపై చెలరేగిపోయే వైభవ్‌ సూర్యవంశీ ​కీలకమైన మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయారు. వైభవ్‌ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. వాస్తవానికి వైభవ్‌ చేసిన ఈ స్కోర్‌ అంత తీసి పాడేయాల్సిందేమీ కాకపోయినప్పటికీ.. కీలకమైన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌ కావడం, అందులోనూ ప్రత్యర్ధి పాక్‌ కావడం వల్ల అభిమానులు ఆగ్రహిస్తున్నారు. రెండు లైఫ్‌లు లభించిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోవడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వైభవ్‌పై కట్టలు తెంచుకుంది.వీరిద్దరితో పాటు మరో ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ (16) కూడా విఫలం కావడంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కష్టాల్లో పడింది. ఈ ముగ్గురు ఒకే స్కోర్‌ (47 పరుగులు) వద్ద, నాలుగు బంతుల వ్యవధిలో ఔట్‌ కావడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. పాక్‌ పేసర్‌ మొహమ్మద్‌ సయ్యమ్‌ భారత టాపార్డర్‌ను కూల్చడంలో సఫలీకృతుడయ్యాడు. మరో 62 పరుగుల తర్వాత భారత్‌ మరో వికెట్‌ కోల్పోయింది. 109 పరుగుల వద్ద విహాన్‌ మల్హోత్రా (21) అహ్మద్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 30 ఓవర్ల తర్వాత భారత్‌ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి ఎదురీదుతుంది. వేదాంత్‌ త్రివేది (50), అభిగ్యాన్‌ కుందు (12) భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించే ప్రయత్నం చేస్తున్నారు.కెప్టెన్సీ నుంచి తీసేయండి..!ఇటీవలికాలంలో ఆయుశ్‌ మాత్రే ప్రదర్శలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో అతను ఇప్పటివరకు 99 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 53 పరుగులు న్యూజిలాండ్‌పై చిన్న లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వచ్చాయి. దీనికి ముందు ఆసియా కప్‌లోనూ అతని ప్రదర్శనలు దారుణంగా ఉన్నాయి. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 65 పరుగులు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో మాత్రేను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Sri Lanka's T20 World Cup 2026 squad announced10
టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి శ్రీలంక జట్టు ప్రకటన

టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ దసున్ షనక సారథ్యం వహించనున్నాడు. లంక వరల్డ్‌కప్ జట్టులో పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, వానిందు హసరంగ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.అదేవిధంగా యువ పేసర్ ఈషాన్ మలింగకు కూడా జట్టులో చోటు దక్కింది. దుష్మంత చమీర, మతీష పతిరణ, ప్రమోద్ మదుషన్‌లతో కలిసి మలింగ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన యువ బ్యాటర్ పవన్ రత్నాయకేకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఇక స్పిన్ విభాగంలో హసరంగ, తీక్షణ, వెల్లలాగే వంటి ఉన్నారు. సొంతగడ్డపై మ్యాచ్‌లు జరగనుండడంతో ఈ స్పిన్ త్రయం శ్రీలంకకు కీలకం కానుంది.అసలంకపై వేటు..కాగా ఈ మెగా టోర్నీ కోసం లం‍క సెలెక్టర్లు గత డిసెంబర్‌లో 25 మం‍ది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చరిత్ అసలంకను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన దాసున్ శనకను తిరిగి కెప్టెన్‌గా ఎంపిక చేశారు.షనక కెప్టెన్‌గా గతంలో లంకకు ఆసియాకప్‌ను అందించారు. ఇప్పుడు మరోసారి తన అనుభవంతో జట్టును నడిపించేందుకు సిద్దమయ్యాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. లంకేయులు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతున్నారు.టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్‌), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్‌ తీక్షణ

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement