ప్రధాన వార్తలు
బంగ్లాదేశ్కు షాకిచ్చిన ఐసీసీ?!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్లను భారత్ నుంచి తరలించేందుకు ఐసీసీ సుముఖంగా లేనట్లు సమాచారం. క్రిక్బజ్ అందించిన వివరాల ప్రకారం.. బీసీబీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మధ్య ఉన్న ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ఐసీసీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.ముస్తఫిజుర్ రహమాన్ అవుట్ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా మెజారిటీ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న బీసీసీఐకే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్న నేపథ్యంలో క్రికెట్కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న కారణంగా ఆ దేశపు పేస్ బౌలర్ ముస్తఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుంచి తప్పించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు శనివారం కోల్కతా నైట్రైడర్స్ దీనిని అంగీకరిస్తూ ముస్తఫిజుర్ను తమ జట్టునుంచి తొలగించింది. అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.మ్యాచ్లను తరలించాలంటూ ఐసీసీకి విజ్ఞప్తిభారత్లో మ్యాచ్లు ఆడితే తమ ఆటగాళ్లకు భద్రతా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత స్థితిలో తాము భారత్లో ప్రయాణించలేమని స్పష్టం చేసింది. కాబట్టి టీ20 వరల్డ్ కప్లో భాగంగా బంగ్లా ఆడాల్సిన 4 లీగ్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే టీ20 వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్ తమ తొలి మూడు లీగ్ మ్యాచ్లను కోల్కతాలో, చివరి మ్యాచ్ను ముంబైలో ఆడాల్సి ఉంది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం సూచన మేరకు మా క్రికెట్ జట్టు భారత్లో పర్యటించరాదని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల మధ్య అన్నింటికంటే ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ మేం ఆడాల్సిన అన్ని మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరుతున్నాం. బీసీసీఐ ఒక్క ఆటగాడికే భద్రత కల్పించలేకపోతోంది. ఇక మొత్తం జట్టుకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుంది. ఒక్క క్రికెటర్ల గురించే కాకుండా మేం అభిమానులు, సహాయక సిబ్బంది, మీడియా గురించి కూడా ఆలోచిస్తున్నాం’ అని బీసీబీ ప్రకటన జారీ చేసింది. తరలింపు కష్టమే! బంగ్లా బోర్డు ఎన్ని డిమాండ్లు చేసినా ఇప్పటికిప్పుడు మ్యాచ్లను తరలించడం సాధ్యం కాదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టోర్నమెంట్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇలాంటి స్థితిలో బీసీబీ వాదన సహేతుకం కాదని భారత బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఎవరో ఒకరి ఇష్టానుసారం మ్యాచ్లను మార్చడం సాధ్యం కాదు. ఏర్పాట్లపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. బంగ్లాతో ఆడే ప్రత్యర్థి జట్లు ఇప్పటికే విమాన టికెట్లు, హోటల్ బుక్ చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఒక్కో రోజు మూడు మ్యాచ్లు ఉండే వాటిలో ఒకటి శ్రీలంకలో జరుగుతుంది. ప్రసారకర్తలు మ్యాచ్లకు ఎలా సిద్ధమవుతారు. కాబట్టి మాటలు చెప్పినంత సులువు కాదు చేసి చూపించడం’ అని ఆయన అన్నారు. మరో వైపు.. బంగ్లాదేశ్లో ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేయరాదని తమ దేశ ప్రభుత్వానికి బంగ్లా మాజీ క్రికెటర్లు విజ్ఞప్తి చేశారు. చదవండి: ఆ రియల్ హీరోల కోసం.. చప్పట్లతో మారుమోగిన స్టేడియం
అద్భుతం.. కోమా నుంచి బయటపడిన ఆసీస్ దిగ్గజం
ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం డేమియన్ మార్టిన్ (54) ఆరోగ్య విషయంలో అద్భుతం జరిగింది. మెనినైటిస్తో బాధపడుతూ ఇటీవల కోమాలోకి వెళ్లిన ఆయన.. ఆశ్చర్యకర రీతిలో కోమా నుంచి బయటపడ్డాడు. మార్టిన్ ఆరోగ్యం అద్భుత రీతిలో పురోగతి సాధించింది. గంట గంటకు ఇంకా మెరుగవుతున్నాడని డాక్టర్లు చెప్పారు.మార్టిన్ ఆరోగ్యం ఆశ్చర్యకర రీతిలో పురోగతి సాధిస్తుండటాన్ని అతని స్నేహితుడు, ఆసీస్ దిగ్గజ వికెట్కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ 'మిరాకిల్'గా అభివర్ణించాడు.గిల్లీ మాటల్లో.. గత 48 గంటల్లో మార్టిన్ ఆరోగ్యం ఊహించని విధంగా మెరుగు పడింది. అతని ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కోమా నుంచి బయట పడిన తర్వాత మార్టిన్ అసాధారణంగా స్పందిస్తున్నాడు. స్పందించడమే కాకుండా చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. త్వరలోనే అతన్ని ICU నుంచి బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, గిల్క్రిస్ట్ గత కొన్ని రోజులుగా మార్టిన్ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.అభిమానులకు కృతజ్ఞతలుమార్టిన్ ఆశ్చర్యకర రీతిలో కోలుకుంటున్న నేపథ్యంలో అతని భార్య అమాండా తొలిసారి స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెట్ సమాజం చూపిన ప్రేమ, శ్రద్ధ వల్ల మార్టిన్ కోలుకుంటున్నాడని అంది. మార్టిన్ ఆరోగ్యం కుదుటపడటంలో అందరి పాత్ర ఉందని తెలిపింది. అభిమానుల సందేశాలు, మీడియా ద్వారా వచ్చిన మద్దతు మార్టిన్కు బలాన్నిచ్చాయని పేర్కొంది. కష్ట సమయంలో అండగా ఉన్న వారందకీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపింది.సొగసైన బ్యాటర్గా పేరొందిన డేమియన్ మార్టిన్ 1992 నుంచి 2006 మధ్యకాలంలో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 4406, 5346, 120 పరుగులు సాధించాడు.మార్టిన్ ఇటీవల జరిగిన బాక్సింగ్ డే టెస్టుకు ముందు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మార్టిన్ పూర్తిగా కోలుకునే క్రమంలో ఉన్నాడు.
సామ్ కర్రన్ అద్భుత ప్రదర్శన.. డెజర్ట్ వైపర్స్కు తొలి ILT20 టైటిల్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 2025-26 ఎడిషన్ టైటిల్ను డెజర్ట్ వైపర్స్ కైవసం చేసుకుంది. దుబాయ్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో MI ఎమిరేట్స్ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసి తమ తొలి DP వరల్డ్ ILT20 టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో వైపర్స్ 7 లక్షల యూఎస్ డాలర్ల నగదు బహుమతి సహా బ్లాక్ బెల్ట్ను అందుకుంది. రన్నరప్ MI ఎమిరేట్స్కు 3 లక్షల యూఎస్ డాలర్ల నగదు బహుమతి లభించింది. కర్రన్ వన్ మ్యాన్ షోఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్.. కెప్టెన్ సామ్ కర్రన్ (51 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ద సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మ్యాక్స్ హోల్డన్ (41) ఓ మోస్తరు స్కోర్తో రాణించగా.. డాన్ లారెన్స్ 23, ఫకర్ జమాన్ 20, జేసన్ రాయ్ 11 పరుగులు చేశారు. ఎంఐ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 2, అరబ్ గుల్ ఓ వికెట్ తీశారు.అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఎం జట్టు ఆదిలోనే చేతులెత్తేసింది. నసీం షా (4-0-18-3), డేవిడ్ పేన్ (4-0-42-3), ఖుజామియా తన్వీర్ (3.3-0-22-2), ఉస్మాన్ తారిక్ (4-0-20-2) ధాటికి 18.3 ఓవర్లలో 136 పరుగులకే చాపచుట్టేసింది. ఎంఐ ఇన్నింగ్స్లో షకీబ్ అల్ హసన్ (36) టాప్ స్కోరర్గా నిలువగా.. కెప్టెన్ కీరన్ పోలార్డ్ (28), ముహమ్మద్ వసీం (26), తేజిందర్ డిల్లాన్ (12), ఆండ్రీ ఫ్లెచర్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.టోర్నీ ఆధ్యాంతం ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన సామ్ కర్రన్ (97 పరుగులు, 7 వికెట్లు, 10 క్యాచ్లు) రెడ్ బెల్ట్ (MVP), గ్రీన్ బెల్ట్ (Best Batter) గెలుచుకున్నాడు. వకార్ సలాంఖిల్ (Dubai Capitals)– వైట్ బెల్ట్ (Best Bowler, 18 వికెట్లు), ముహమ్మద్ వసీమ్ (MI Emirates– బ్లూ బెల్ట్ (Best UAE Player, 370 పరుగులు) గెలుచుకున్నారు.
జో రూట్ 41వ శతకం
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్ట్ క్రికెట్లో మరో శతకం సాధించాడు. ఇది అతనికి 41వ శతకం. ఓవరాల్గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 60వ శతకం. ఈ సెంచరీతో రూట్ టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్, రూట్ చెరో 41 సెంచరీలు చేశారు. ఈ జాబితాలో సచిన్ (51), సంగక్కర (45) పాంటింగ్, రూట్ కంటే ముందున్నారు.ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ (84) ఒక్కడే రూట్ కంటే ముందున్నాడు. గత ఆరేళ్లలో రూట్కు ఇది 24 శతకం. ఇంత తక్కువ వ్యవధిలో ఓ ఆటగాడు ఇన్ని శతకాలు చేయడమనేది ఆషామాషీ విషయం కాదు.తాజా శతకంతో రూట్ తన సమకాలీకులు, ఫాబ్-4లో మిగతా ముగ్గురి కంటే మరింత ఎత్తుకు ఎదిగాడు. రూట్ ఖాతాలో 41 సెంచరీలు ఉండగా.. స్టీవ్ స్మిత్ 36, కేన్ విలియమ్సన్ 33, విరాట్ కోహ్లి 30 సెంచరీలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి టెస్ట్లో రూట్ తన 41వ శతకాన్ని సాధించాడు. ఈ సిరీస్కు ముందు రూట్కు ఆసీస్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా లేదు. ఇదే సిరీస్లోనే ఆసీస్ గడ్డపై తన తొలి సెంచరీ చేశాడు. తాజాగా ఆ సంఖ్యను రెండుకు పెంచుకున్నాడు. ఈ సిరీస్లో రూట్ 9 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీల సాయంతో 394 పరుగులు చేశాడు.టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (15921) కొనసాగుతుండగా.. అతనికి రూట్కు (13937) వ్యత్యాసం ఇంకా 1984 పరుగులు మాత్రమే.సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 242 బంతులు ఎదుర్కొన్న రూట్ 15 బౌండరీల సాయంతో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) సెంచరీకి చేరువలో ఔట్ కాగా.. జేమీ స్మిత్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మూడో సెషన్ సమయానికి వికెట నష్టపోకుండా 44 పరుగులు చేసింది. హెడ్ 24, వెదరాల్డ్ 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆసీస్ ఇంకా 340 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, 5 మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే
ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే. సామాన్య రైతు బిడ్డ అయినా జాతీయ స్థాయి కబడ్డీలో మెరుస్తోంది. ప్రతిభకు తోడు పట్టుదల ఉంటే పల్లె సరిహద్దులు దాటడం కష్టమేమీ కాదని నిరూపిస్తోంది మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థిని పెమ్మా శ్రీవల్లి. ఉత్తమ ‘రైడర్’గా గుర్తింపు పొందింది.యడ్లపాడు: పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని చిన్న గ్రామమైన గంగిరెడ్డిపాలెంలో రైతు దంపతులు పెమ్మా రామారావు, పద్మల కుమార్తె శ్రీవల్లి. ఆమె సోదరుడు బీటెక్ చదువుతున్నాడు. మద్దిరాల పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో శ్రీవల్లి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. జేఎనీ్వలో సీనియర్ల పతకాలు చూసి తనకు ఇష్టమైన కబడ్డీని ఎంచుకుంది. మొదట్లో ఎంతో భయపడింది. ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు, పీఈటీలు గుడిబెండ గోవిందమ్మ, ఆర్.పాండు రంగారావుల ప్రోత్సాహంతో నిత్యం సాధన చేసింది. ఆట మీద ఏకాగ్రత పెంచింది. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకుంది. క్లస్టర్, రీజినల్, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటింది. పెరిగిన స్థాయి శ్రీవల్లీ ఏకంగా నవోదయ విద్యాసమితి హైదరాబాద్ రీజియన్ (ఐదు రాష్ట్రాల) ప్రతినిధిగా ఎంపిక కావడం విశేషం. ఇప్పుడు ఆమె పోరాటం కేవలం జేఎన్వీలకే పరిమితం కాదు. సీబీఎస్ఈ, వెల్ఫేర్, కేంద్రియ విద్యాలయాల జట్లతో ఆమె తలపడనుంది. జనవరి 18 నుంచి 23వ తేదీ వరకు ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యాన హిమాచల్ ప్రదేశ్లో జరిగే అండర్ –19 జాతీయ పోటీలకు జేఎన్వీ జాతీయ జట్టులో స్థానం పొందింది. ఇందుకోసం హిమాచల్ప్రదేశ్లోని సోలాన్ జేఎన్వీలో వీరి జట్టు శిక్షణకు సిద్ధమైంది. మొత్తం పదిరోజుల పాటు వారు శిక్షణ పొందనున్నారు. ఎప్పటికైనా ఏషియన్ గేమ్స్లో పాల్గొని, విజయం సాధించి దేశం గర్వించేలా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టాలన్నదే శ్రీవల్లి కల.అవకాశాలు వదలొద్దు: శ్రీవల్లి కబడ్డీ నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. లక్ష్యం ఏషియన్ గేమ్స్, ఖేలో ఇండియాలో పాల్గొనడమే. బాలికలు క్రీడల్లో రాణించడం కష్టమనే అభిప్రాయం సాధారణంగా ఉంది. దాన్ని తుడిచేయాలి. అవకాశాల్ని వదలొద్దు. క్రీడల వలన పోరాటతత్వం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగం కూడా పొందొచ్చు. ఇష్టమైన రంగంలో కష్టపడాలి. ఏకాగ్రత, పట్టుదల ఉంటే మైదానంలోనే కాదు, జీవితంలోనూ విజయం సాధించవచ్చు.
బెంగాల్ టైగర్స్ శుభారంభం
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ శ్రాచి బెంగాల్ టైగర్స్ పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో బెంగాల్ 3–1తో సూర్మ హాకీ క్లబ్పై ఘనవిజయం సాధించింది. మొదటి రెండు క్వార్టర్లు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మూడో క్వార్టర్ మొదలైన మూడు నిమిషాలకే బెంగాల్ టైగర్స్ స్ట్రయికర్ సుఖ్జీత్ సింగ్ (33వ ని.) గోల్తో ఖాతా తెరిచాడు. ఈ క్వార్టర్ ముగిసే దశలో మళ్లీ అభిషేక్ (45వ ని.) గోల్ చేయడంతో 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి క్వార్టర్లో ఎట్టకేలకు సూర్మ క్లబ్ తరఫున ప్రభ్జోత్ సింగ్ (54వ ని.) గోల్ కొట్టి 1–2తో బెంగాల్ ఆధిక్యానికి గండికొట్టినప్పటికీ ఆఖరి నిమిషంలో గుర్సేవక్ సింగ్ (60వ ని.) గోల్ చేయడంతో శ్రాచి బెంగాల్ టైగర్స్ 3–1తో విజయం సాధించింది. తర్వాత జరిగిన రెండో మ్యాచ్లో కళింగ లాన్సర్స్ 4–2తో రాంచీ రాయల్స్పై నెగ్గింది. అంతకు ముందు జరిగిన మహిళల హెచ్ఐఎల్లో శ్రాచి బెంగాల్ టైగర్స్ 1–0తో రాంచీ రాయల్స్పై నెగ్గింది. నేడు జరిగే అమ్మాయిల మ్యాచ్లో సూర్మ క్లబ్... రాంచీ రాయల్స్తో, పురుషుల ఈవెంట్లో ఎస్జీ పైపర్స్... హెచ్ఐఎల్ జీసీ జట్టుతో తలపడతాయి.
‘2036లో ఒలింపిక్స్ నిర్వహిస్తాం’
వారణాసి: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2036లో ఈ మెగా ఈవెంట్ను నిర్వహించే సత్తా భారత్కు ఉందన్నారు. ఇప్పటికే 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులు లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆదివారం వారణాసిలో సీనియర్ జాతీయ వాలీబాల్ చాంపియన్షిప్ మొదలు కాగా...వర్చువల్గా ప్రధాని దీనిని ప్రారంభించారు. ప్రధాన వేదికపై జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వర్ధమాన అథ్లెట్లు ఒలింపిక్స్లో రాణించేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ‘ఖేలో ఇండియా’లాంటి క్రీడలు, పథకాలు ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఒక గేమ్ చేంజర్ అని మోదీ పేర్కొన్నారు. ‘2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిస్తోంది. అలాగే 2036 విశ్వక్రీడల ఆతిథ్యం కోసం గట్టిగానే కృషి చేస్తున్నాం. దీనివల్ల మన భారత అథ్లెట్లు ఒలింపిక్స్లాంటి మెగా ఈవెంట్లలో సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది. మేం ఇదివరకే ప్రారంభించిన ఖేలో ఇండియా సత్ఫలితాలను ఇస్తోంది. ప్రతిభ గల క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేలా విస్తృత అవకాశాల్ని కల్పించింది’ అని ప్రధాని వివరించారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) ఎంతోమంది అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తెచ్చేందుకు తోడ్పడిందన్నారు. గత దశాబ్ద కాలంగా భారత్లో 20కి పైగానే మేజర్ క్రీడా ఈవెంట్లు జరిగాయని గుర్తుచేశారు. ‘పదేళ్లుగా వివిధ నగరాల్లో చెప్పుకోదగిన స్థాయిలో అంతర్జాతీయ ఈవెంట్లు ఎన్నో జరిగాయి. ఫిఫా అండర్–17 ప్రపంచకప్, హాకీ ప్రపంచకప్, అంతర్జాతీయ చెస్ టోర్నీలు, ప్రపంచకప్ చెస్ ఈవెంట్లు జరిగాయి. కేంద్రం కూడా ప్రతీ ఏటా క్రీడల బడ్జెట్ను పెంచుతూ పోతోంది. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపరిచేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచాం. ఎక్స్ప్రెస్ వేగంతో సంస్కరణల్ని అమలు చేస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు. సీనియర్ జాతీయ వాలీబాల్ పోటీలు ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు జరుగుతాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సరీ్వసెస్కు చెందిన 58 పురుషులు, మహిళల జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. సుమారు వేయికి పైగా ఆటగాళ్లు ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఇరు విభాగాల్లో లీగ్ దశ పోటీలు జరుగుతాయి. గ్రూప్ దశ అనంతరం నాకౌట్ దశ మొదలవుతుంది. 11న జరిగే ఫైనల్స్తో ఈవెంట్ ముగుస్తుంది.
యూపీ వారియర్జ్కు కొత్త కెప్టెన్.. దీప్తి శర్మపై వేటు
మహిళల ఐపీఎల్ 2026 (WPL) ప్రారంభానికి ముందు యూపీ వారియర్జ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఫ్రాంచైజీ నూతన కెప్టెన్గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ను నియమించింది. ఈ విషయాన్ని వారియర్జ్ యాజమాన్యం సోషల్మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.33 ఏళ్ల లాన్నింగ్ను వారియర్జ్ ఈ సీజన్ వేలంలో రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. లాన్నింగ్ నియామకంతో గత సీజన్ వరకు కెప్టెన్గా వ్యవహంచిన దీప్తి శర్మపై వేటు పడింది. రానున్న సీజన్లో దీప్తి సాధారణ ప్లేయర్గా కొనసాగుతుంది. దీప్తిని ఈ సీజన్ వేలంలో వారియర్జ్ యాజమాన్యం రూ. 3.2 కోట్లు వెచ్చించి, తిరిగి సొంతం చేసుకుంది.లాన్నింగ్కు కెప్టెన్గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆమె సారథ్యంలో ఆసీస్ ఓ వన్డే ప్రపంచకప్, 4 టీ20 ప్రపంచకప్లు గెలిచింది. డబ్ల్యూపీఎల్ కెప్టెన్గానూ లాన్నింగ్కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈమె నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు ఎడిషన్లలో ఫైనల్కు చేరింది. లాన్నింగ్ను డీసీ యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది.లాన్నింగ్ సారథ్యంలో వారియర్జ్ పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. ఈ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన ట్రాక్ రికార్డు ఉన్న జట్టుగా ఉంది. తొలి ఎడిషన్లో (2023) ఐదింటి మూడో స్థానంలో నిలిచిన ఈ జట్టు.. సీజన్ సీజన్కు మరింత దిగజారుతూ నాలుగు (2024), ఐదు (2025) స్థానాలకు పడిపోయింది. కాగా, డబ్ల్యూపీఎల్ 2026 జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్ ఓపెనర్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ తలపడనున్నాయి. వారియర్జ్ తమ తొలి మ్యాచ్ను జనవరి 10న (గుజరాత్ జెయింట్స్తో) ఆడనుంది.
2026లో విరాట్ కోహ్లి ఛేదించబోయే భారీ రికార్డులు ఇవే..!
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి 2026వ సంవత్సరంలోనూ రికార్డు వేటను కొనసాగించనున్నాడు. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. గతేడాది చివరి వరకు రికార్డుల వేటను కొనసాగించాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లో భీకర ఫామ్లో ఉన్న విరాట్.. త్వరలో న్యూజిలాండ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో బరిలోకి దిగుతాడు. ఈ సిరీస్ నుంచే విరాట్ రికార్డుల వేట మొదలవుతుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ ఈ ఏడాది ఛేదించే అవకాశం ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం.28000 అంతర్జాతీయ పరుగులుఅంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ 27975 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్లో విరాట్ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉంది.15000 వన్డే పరుగులు308 ఇన్నింగ్స్ల్లో 14557 పరుగులు చేసి, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్.. మరో 443 పరుగులు చేస్తే 15000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్ల్లో విరాట్ ఈ రికార్డును ఛేదించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటివరకు సచిన్ మాత్రమే 15000 పరుగుల మార్కును తాకాడు.అంతర్జాతీయ క్రికెట్లో రెండో అత్యధిక పరుగులువిరాట్ మరో 42 పరుగులు చేస్తే సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ క్రమంలో సంగక్కరను (28,016) వెనక్కు నెట్టేస్తాడు.అత్యధిక వన్డే పరుగులున్యూజిలాండ్ సిరీస్లో విరాట్ మరో 94 పరుగులు చేస్తే, ఆ దేశంపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (42 మ్యాచ్ల్లో 1750 పరుగులు) ఖాతాలో ఉంది. విరాట్ న్యూజిలాండ్తో ఇప్పటివరకు 33 వన్డేలు ఆడి 1657 పరుగులు చేశాడు.ఐపీఎల్లో 9000 పరుగులుఈ ఏడాది అంతర్జాతీయ వన్డేలతో పాటు ఐపీఎల్ కూడా ఆడనున్న విరాట్.. మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 8,661 పరుగులు (267 మ్యాచ్లు) ఉన్నాయి.
T20 World Cup: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్-2026 తమ గ్రూప్ మ్యాచ్లు భారత్లో ఆడబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ యూత్ మరియు స్పోర్ట్స్ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ నుంచి వారి స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను (కేకేఆర్) తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.🚨 CONFIRMED - BANGLADESH TEAM WILL NOT TRAVEL TO INDIA FOR T20 WORLD CUP 2026 🚨 pic.twitter.com/aVF29iqMoY— Tanuj (@ImTanujSingh) January 4, 2026ముస్తాఫిజుర్ ఉదంతంపై బీసీబీ ఇవాళ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకుంది. ఇందులోనే భారత్లో మ్యాచ్లు ఆడకూడదని నిర్ణయించారు. ఈ విషయమై ఐసీసీకి లేఖ రాయాలని తీర్మానం చేశారు. భారత్లో తమ ఆటగాళ్లు రక్షణ లేదని, అందుకే తమ గ్రూప్ స్టేజీ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరుతామని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ తెలిపారు. ఆటగాళ్ల భద్రత, గౌరవం తమ ప్రాధాన్యత అని ఆయన చెప్పుకొచ్చారు.కాగా, బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వేలంలో ముస్తాఫిజుర్ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని తెలిపింది. ముస్తాఫిజుర్ ఉదంతానికి ప్రతి చర్యగా భారత్లో వరల్డ్కప్ మ్యాచ్లు ఆడకూడదని నిర్ణయించుకుంది. అలాగే దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేయాలని తీర్మానించుకుంది.కాగా, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ జట్టు గ్రూప్-సిలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్ మిగిలిన జట్లుగా ఉన్నాయి. భారత్లోని కోల్కతా, ముంబై నగరాల్లో బంగ్లాదేశ్ తమ వరల్డ్కప్ మ్యాచ్లు ఆడనుంది.గ్రూప్ దశలో బంగ్లాదేశ్ ఆడబోయే మ్యాచ్లు - ఫిబ్రవరి 7: వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్కతా) - ఫిబ్రవరి 9: ఇటలీ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్కతా) - ఫిబ్రవరి 14: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్కతా) - ఫిబ్రవరి 17: నేపాల్ vs బంగ్లాదేశ్ (ముంబై) ఇదిలా ఉంటే, ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును కూడా ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా లిట్టన్ దాస్, వైస్ కెప్టెన్గా మొహమ్మద్ సైఫ్ హస్సన్ ఎంపికయ్యారు.ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్కు దూరంగా ఉన్న పేసర్ తస్కిన్ అహ్మద్ రీఎంట్రీ ఇచ్చాడు.వికెట్ కీపింగ్, బ్యాటర్ జాకిర్ అలీ, బ్యాటర్ మహిదుల్ ఇస్లాం అంకోన్కు జట్టులో చోటు దక్కలేదు. ఫామ్లో ఉన్నా, స్టార్ బ్యాటర్ నజ్ముల్ హసన్ షాంటోపై వేటు పడింది. టీ20 ప్రపంచకప్ 2026కు బంగ్లాదేశ్ జట్టు..- లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్) - మొహమ్మద్ సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్) - తంజీద్ హసన్ - మొహమ్మద్ పర్వేజ్ హొసైన్ ఎమోన్ - తౌహిద్ హ్రిదోయ్ - షమీమ్ హసన్ - ఖాజీ నూరుల్ హసన్ సోహాన్ - మహెది హసన్ - రిషాద్ హసన్ - నసుమ్ అహ్మద్ - ముస్తాఫిజుర్ రహ్మాన్ - తంజీమ్ హసన్ సకిబ్ - టాస్కిన్ అహ్మద్ - మొహమ్మద్ షైఫుద్దిన్ - షొరీఫుల్ ఇస్లాం
అర్జున్ దేశ యువతకు స్ఫూర్తి
న్యూఢిల్లీ: ‘ఫిడే’ వరల్డ్ చెస్ చాంపియన్ప్ బ్లి...
ప్రపంచకప్లు... ప్రతిష్టాత్మక ఈవెంట్లు...
జూనియర్, సీనియర్, మహిళల వరల్డ్ కప్లతో పరుగుల లెక...
రోజుకు 40 డాలర్లేనా!.. ఇలాగే కొనసాగితే...
లాహోర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ ...
గుగులోత్ సౌమ్య ‘హ్యాట్రిక్’
కోల్కతా: భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్...
యూపీ వారియర్జ్కు కొత్త కెప్టెన్.. దీప్తి శర్మపై వేటు
మహిళల ఐపీఎల్ 2026 (WPL) ప్రారంభానికి ముందు యూపీ వ...
2026లో విరాట్ కోహ్లి ఛేదించబోయే భారీ రికార్డులు ఇవే..!
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి 2026వ సంవత్సరంలోనూ...
T20 World Cup: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సంచలన నిర్ణయం త...
టీ20 వరల్డ్కప్కు పాక్ జట్టు ప్రకటన.. ఎట్టకేలకు స్టార్ ప్లేయర్కు చోటు
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయ...
క్రీడలు
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
నా సూపర్స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
వీడియోలు
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!
సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్
భారత్ సిరీస్ క్లీన్ స్వీప్.. శ్రీలంక చిత్తు..
మహిళా క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్
సిరీస్ పై భారత్ ఫోకస్
ఇషాన్ ఊచకోత.. MS ధోని రికార్డు బ్రేక్
శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..
