Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Monumental choke: Dale Steyn predicts result of IND vs NZ T20 WC final1
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. టీమిండియా- న్యూజిలాండ్‌ ఆదివారం టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్‌, డేల్‌ స్టెయిన్‌ ఫైనల్‌ విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. డివిలియర్స్‌ యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు సౌతాఫ్రికాను ‘చోకర్స్‌’ అని పిలవడానికి ఇష్టపడతారు. కీలక మ్యాచ్‌లలో మనం ఓడిపోవడం ఇందుకు కారణం.ఇది అసాధ్యంఅయితే, న్యూజిలాండ్‌ విషయంలోనూ నేను ఇదే మాట అంటాను. న్యూజిలాండ్‌ ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లు గెలవనేలేదు. సౌతాఫ్రికా మాదిరే ఎన్నోసార్లు ఫైనల్‌కు చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈసారైనా గెలిచేందుకు ప్రయత్నించండి.నిజానికి నాకు న్యూజిలాండ్‌ జట్టు అంటే చాలా ఇష్టం. కానీ వాళ్లు టీమిండియాను ఓడించలేరు. ఇది జరగాలంటే మాత్రం ఏదో ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని భారత జట్టు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది అసాధ్యం. కివీస్‌ గెలవాలనే కోరుకుంటున్నా. కానీ వాళ్లు భారత్‌ను ఓడించగలరా?.. అంటే లేదనే చెప్తాను’’ అని పేర్కొన్నాడు.జట్టు గెలవాలని నాకూ ఉందిఇందుకు డివిలియర్స్‌ బదులిస్తూ... ‘‘అవును.. న్యూజిలాండ్‌కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఆ జట్టు గెలవాలని నాకూ ఉంది. కానీ వారికి ఆ అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి’’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే నెగ్గింది.రెండుసార్లు టీమిండియాను ఓడించిఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని 2000 సంవత్సరంలో కైవసం చేసుకున్న కివీస్‌.. మొట్టమొదటి ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ విజేతగానూ 2021లో అవతరించింది. ఈ రెండుసార్లూ న్యూజిలాండ్‌ ప్రత్యర్థి టీమిండియానే కావడం విశేషం. అయితే, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్‌తో తలపడిన కివీస్‌కు ఈ సారి పరాజయమే ఎదురైంది. భారత్‌ విజేతగా అవతరించింది. అయితే, కివీస్‌ ఇంత వరకు ఒక్క వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలవకపోగా.. భారత్ మూడు ప్రపంచకప్‌ టోర్నీలు గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2024 టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీలను సొంతం చేసుకుంది.చదవండి: T20 WC Final: పిచ్‌ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?

South Africa West Indies Teams stranded in Kolkata Even charter flight planner2
T20 WC 2026: ఐసీసీ రంగంలోకి దిగినా.. తప్పని చిక్కులు

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో వెస్టిండీస్‌ ఫర్వాలేదనిపించగా.. సౌతాఫ్రికా సెమీస్‌ వరకు ప్రయాణం కొనసాగించింది. లీగ్‌ దశలో అదరగొట్టిన విండీస్‌ జట్టు.. సూపర్‌-8లో ​కీలక మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడి నిష్క్రమించింది.మరోవైపు.. సౌతాఫ్రికా లీగ్‌ దశలో అజేయంగా నిలవడంతో పాటు.. సూపర్‌-8లోనూ హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే, కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడి మరోసారి ‘చోకర్స్‌’ అన్న బిరుదును సార్థకం చేసుకుంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఇంకా ఇంటికి చేరుకోలేదు.భారత్‌లోనే చిక్కుకుపోయారుఇందుకు మధ్య ప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం కారణం. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు చేస్తుండగా.. అందుకు ఇరాన్‌ కూడా గట్టిగానే బదులిస్తోంది. దీంతో గల్ఫ్‌ దేశాల్లో గగనతలం మూసివేశారు. దీంతో వెస్టిండీస్‌, జింబాబ్వే, సౌతాఫ్రికా జట్ల ఆటగాళ్లు భారత్‌లోనే చిక్కుకుపోయారు. అయితే, జింబాబ్వే జట్టును ప్రత్యేక విమానంలో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)తరలించినట్లు సమాచారం.ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా..ఇక వెస్టిండీస్‌ జట్టు కోసం కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా.. ఎయిర్‌ ట్రాఫిక్‌ అధికారుల నుంచి ఇంత వరకు ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లలో మరోసారి ఆందోళన నెలకొంది. కాగా ఇప్పటికే వెస్టిండీస్‌ హెడ్‌కోచ్‌ డారెన్‌ సామీ (Daren Sammy).. తమను స్వదేశానికి చేర్చమంటూ దీనంగా అర్థించిన విషయం తెలిసిందే.ఇక బౌలర్‌ అకీల్‌ హొసేన్‌ సైతం క్రిస్టియాన్‌ రొనాల్డోనే ఈ పరిస్థితులలో తమను ఆదుకోగలడంటూ ట్వీట్‌ చేశాడు. అయితే, ఐపీఎల్‌లో భాగమైన షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌, రోవ్‌మన్‌ పావెల్‌, షిమ్రన్‌ హెట్‌మైర్‌ తదితరులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.సౌతాఫ్రికానూ వీడని చిక్కులుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా మరికొన్నాళ్లు భారత్‌లోనే ఉండాల్సి రావొచ్చు. అయితే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో దాదాపు నలుగురు ఆటగాళ్లు నేరుగా కివీస్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సెమీస్‌ మ్యాచ్‌లలో సౌతాఫ్రికాను న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌ను టీమిండియా ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి టైటిల్‌ పోరుకు అహ్మదాబాద్‌ వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్‌ స్టార్‌

T20 WC Final Pitch: Mixed Soil Used After India Intervention Means3
T20 WC Final: పిచ్‌ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?

టీమిండియా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టింది సూర్యకుమార్‌ సేన.సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్‌-2026 ఆడుతున్న భారత జట్టు లీగ్‌ దశలో అజేయంగా నిలిచింది. సూపర్‌-8లో తొలుత తడబడినా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సెమీస్‌ చేరింది. ఇక సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లోనూ ఏడు పరుగుల తేడాతో గెలిచి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.వరుసగా రెండుసార్లుతద్వారా వరుసగా రెండుసార్లు ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్‌కు చేరిన జట్టుగా నిలిచింది. ఇక ట్రోఫీ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కావడం సెంటిమెంట్‌ పరంగా టీమిండియాకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇదే వేదికపై 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో తాజా ఫైనల్‌కు సంబంధించిన పిచ్‌ విషయంలో కూడా టీమిండియా తీవ్రంగా ఆలోచిస్తోంది. నిజానికి పిచ్‌ ఎంపిక, తయారీ ఐసీసీ పరిధిలోని అంశం. కానీ ఎర్ర మట్టితో చేసిన పిచ్‌పై ఆడాలనే తమ ఉద్దేశాన్ని భారత జట్టు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎర్రమట్టితో చేసిన పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తోంది. ముంబైలో ఇదే జరిగింది.టీమిండియా కోరుకుంది ఇదేఇక అహ్మదాబాద్‌లో నల్లరేగడి మట్టితో చేసిన పిచ్‌పై సౌతాఫ్రికా జట్టుతో ‘సూపర్‌–8’ మ్యాచ్‌ ఆడిన సూర్యకుమార్‌ సేన‌ దారుణంగా ఓడిపోయింది. అది పునరావృతం కాకుండా టీమిండియా బ్యాటింగ్‌ పిచ్‌నే కోరుకుంటోంది. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..ఎర్ర మట్టితోనే‘‘నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు మిశ్రమ మట్టితో తయారైన పిచ్‌ లభించనుంది. స్పోర్టింగ్‌ పిచ్‌నే రూపొందిస్తున్నారు. అయితే, ఎక్కువ మటుకు ఇది ఎర్ర మట్టితోనే తయారు చేస్తారు. కాస్త బౌన్సీగా ఉండటంతో పాటు.. బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుంది’’ అని పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన తొలి ఐదు మ్యాచ్‌లలో పేస్‌ బౌలింగ్‌లో 762 బంతుల్లో బ్యాటర్లు 1062 పరుగులు సాధించారు. ఫాస్ట్‌ బౌలర్లకు 45 వికెట్లు దక్కాయి. ఇక స్పిన్‌ బౌలింగ్‌లో 421 బంతుల్లో బ్యాటర్లు 617 పరుగులు రాబట్టగా.. బౌలర్ల ఖాతాలో 20 వికెట్లు చేరాయి. చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్‌ స్టార్‌

Interesting facts about the Indian cricket team revealed4
హోటల్‌ మారితే అదృష్టం మారేనా!

అహ్మదాబాద్‌: నమ్మకం లేదా సెంటిమెంట్‌ అనుకోండి లేదా మూఢ విశ్వాసం అనుకోండి కానీ భారత క్రికెట్‌ జట్టుకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అనూహ్య, ఆసక్తికర విషయాలు బయటకు వస్తుంటాయి. జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తుంటాడని సమాచారం. ఏ నగరంలో మ్యాచ్‌కు వెళ్లినా అక్కడి ప్రఖ్యాత దేవాలయానికి ఆటగాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించడం ఆయనకు రివాజుగా మారిపోయింది. సెమీఫైనల్‌కు ముందు రోజు ప్రాక్టీస్‌ కోసం వాంఖెడే స్టేడియానికి జట్టు వచ్చినా... ఆ రోజు చంద్ర గ్రహణం కారణంగా ఆటగాళ్లంతా డ్రెస్సింగ్‌ రూమ్‌ దాటి బయటకు రాలేదు. గ్రహణం ముగిసిన తర్వాతే గంటసేపు ఆలస్యంగా టీమిండియా సాధన మొదలైంది. ఇప్పుడు కూడా ఫైనల్‌ కోసం మరో సెంటిమెంట్‌ అంశం వినిపిస్తోంది. అహ్మదాబాద్‌లో 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడినప్పుడు భారత జట్టు ఐటీసీ నర్మద హోటల్‌లో బస చేసింది. నాటి మ్యాచ్‌లో పరాజయం జట్టును తీవ్రంగా బాధించింది. ఇప్పుడు టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కోసం అక్కడ మాత్రం ఉండరాదని జట్టు అనుకుంది. అందుకే ఈసారి తాజ్‌ స్కైలైన్‌లో భారత బృందం దిగింది. దీంతో తమ అదృష్టం మారవచ్చని టీమ్‌ భావిస్తున్నట్లుంది. మరోవైపు మ్యాచ్‌ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా ‘హోం’ కాకుండా విజిటర్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ను వాడుకోవాలని కూడా టీమ్‌ నిర్ణయించింది. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో పాల్గొనే అధికారుల బృందాన్ని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్‌ అంపైర్లుగా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్‌ వార్ఫ్‌ వ్యవహరిస్తారు. థర్డ్, ఫోర్త్‌ అంపైర్లుగా దక్షిణాఫ్రికాకు చెందిన అలావుద్దీన్‌ పలేకర్, ఆడ్రియాన్‌ హోల్డ్‌స్టాక్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్‌ రిఫరీగా వరల్డ్‌ కప్‌ తుది పోరు జరుగుతుంది. సామ్సన్‌ నామినేట్‌... టి20 వరల్డ్‌ కప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు కోసం షార్ట్‌ లిస్ట్‌ చేసిన ఎనిమిది ఆటగాళ్ల జాబితాలో భారత్‌కు చెందిన సంజు సామ్సన్‌ పేరు కూడా ఉంది. సామ్సన్‌తో పాటు విల్‌ జాక్స్‌ (ఇంగ్లండ్‌), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (పాకిస్తాన్‌), రచిన్‌ రవీంద్ర, టిమ్‌ సీఫెర్ట్‌ (న్యూజిలాండ్‌), షాడ్లీ వాన్‌ షాల్‌విక్‌ (అమెరికా), మార్క్‌రమ్, ఎన్‌గిడి (దక్షిణాఫ్రికా) ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. బుమ్రా కూడా విఫలం కావచ్చు! భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ఒంటిచేత్తో అతను మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడు. ఈ విషయం న్యూజిలాండ్‌కు కూడా బాగా తెలుసు. అయితే ఫైనల్లో తమపై మాత్రం బుమ్రా విఫలం కావాలని కోరుకుంటున్నట్లు కివీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ అన్నాడు. ‘బుమ్రా అద్భుతమైన బౌలర్‌ అనడంలో సందేహం లేదు. అతని బౌలింగ్‌లో ఎంతో వైవిధ్యం ఉంది. యార్కర్లను గొప్పగా సంధించగలడు. అయితే అతను కూడా మానవమాత్రుడే. ఏదో ఒకరోజు విఫలం కావచ్చు కూడా. అది ఆదివారమే కావాలని ఆశిస్తున్నాం’ అని ఫిలిప్స్‌ చెప్పాడు. భారత్‌తో పోలిస్తే జనాభాలో ఎంతో చిన్నదైన తమ దేశం క్రికెట్‌లో ఇప్పటి వరకు సాధిస్తూ వచ్చిన ఘనత చిన్నదేమీ కాదని అతను అభిప్రాయపడ్డాడు. సుమారు 50 లక్షల జనాభా ఉన్న కివీస్‌ వరల్డ్‌ కప్‌లాంటి వేదికపై భారత్‌తో ఫైనల్లో తలపడే అవకాశం రావడం కూడా గొప్ప విషయమని అతను అన్నాడు.

India vs England semi final breaks records5
‘రికార్డులు’ బద్దలు కొట్టిన భారత్‌–ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌

ముంబై: భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగి రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారీ పరుగులు, బౌండరీలతో రికార్డుల మోత మోగింది. అయితే దీంతో పాటు డిజిటల్‌ వీక్షకుల సంఖ్య విషయంలో కూడా ఈ మ్యాచ్‌ కొత్త రికార్డులు నెలకొల్పింది. జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల (సుమారు 6 కోట్ల 25 లక్షలు) మంది చూడటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడా ఈవెంట్‌లోనైనా ప్రత్యక్ష ప్రసార సమయంలో ఇది అత్యధికం. తాజా గణాంకాలు క్రికెట్‌ స్థాయిని చూపిస్తున్నాయని, ఇది తమకు గర్వకారణమని ఐసీసీ చైర్మన్‌ జై షా పేర్కొన్నారు. తాజా రికార్డు ఆదివారం భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ఫైనల్‌తో చెరిగిపోతుందా అనేది ఆసక్తికరం.

He is Human: New Zealand Star Stunning Remark On Bumrah T20 WC Final6
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్‌ స్టార్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ టైటిల్‌ పోరుకు న్యూజిలాండ్‌, టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో భారత్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్‌ బౌలర్‌ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లోకాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్‌ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్‌ ఫిలిప్స్‌ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్‌ అని అన్నాడు.అతడు కూడా మనిషే కదా!‘‘ఇటీవల టీమిండియా సిరీస్‌లో భాగంగా బుమ్రా బౌలింగ్‌లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్‌ బౌలర్‌. వైవిధ్యభరితంగా బౌలింగ్‌ చేస్తాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్‌లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. ఆరోజు అతడు విఫలం అవుతాడు. అదే, అతడి మీద మాకు మంచి రోజు అవుతుంది. ఫైనలే ఆరోజు కావాలని ఆశిస్తున్నాం?’’ అని గ్లెన్‌ ఫిలిప్స్‌ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్‌ కివీస్‌తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్‌లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Indian womens team all out for 198 in first innings in first Test7
నలుగురి అరంగేట్రం

పెర్త్‌: భారత్, ఆ్రస్టేలియా మహిళల మధ్య శుక్రవారం మొదలైన ఏకైక టెస్టు మ్యాచ్‌ (డే అండ్‌ నైట్‌)లో తొలి రోజు బౌలర్ల హవా సాగింది. పింక్‌ బంతితో జరుగుతున్న ఈ టెస్టులో ఇరు జట్లు కలిపి మొదటి రోజు 13 వికెట్లు చేజార్చుకున్నాయి. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 62.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. దాదాపు 20 నెలల తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న భారత జట్టు గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోలేక తడబడింది. జెమీమా రోడ్రిగ్స్‌ (84 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (48 బంతుల్లో 35; 6 ఫోర్లు), కాశ్వీ గౌతమ్‌ (54 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేసి భారత్‌కు కొంత మేలు చేశారు. అనాబెల్‌ సదర్లాండ్‌ 4 వికెట్లు పడగొట్టగా, తొలి టెస్టు ఆడుతున్న లూసీ హామిల్టన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా మహిళల జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో 3 వికెట్లకు 96 పరుగులు చేసింది. ఎలైస్‌ పెరీ (62 బంతుల్లో 43 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), అనాబెల్‌ సదర్లాండ్‌ (20 బ్యాటింగ్‌) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న అలీసా హీలీ (13) విఫలమైంది. సయాలీ సత్గరేకు 2 వికెట్లు లభించాయి. ప్రస్తుతం ఆ్రస్టేలియా మరో 102 పరుగులు వెనుకబడి ఉంది. నలుగురి అరంగేట్రం... భారత జట్టు తరఫున ఒకేసారి నలుగురు ప్లేయర్లు టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టడం విశేషం. ఈ మ్యాచ్‌ ద్వారా వరుసగా కాశ్వీ గౌతమ్, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్, సయాలీ సత్గరే టెస్టుల్లో అరంగేట్రం చేశారు. భారత్‌ తరఫున టెస్టు ఆడిన 95, 96, 97, 98వ ప్లేయర్లుగా వీరు నిలిచారు. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్‌: స్మృతి (బి) హామిల్టన్‌ 4; షఫాలీ (సి) మూనీ (బి) సదర్లాండ్‌ 35; ప్రతీక (సి) హామిల్టన్‌ (బి) సదర్లాండ్‌ 18; జెమీమా (సి) గార్డ్‌నర్‌ (బి) హామిల్టన్‌ 52; హర్మన్‌ప్రీత్‌ (బి) బ్రౌన్‌ 19; దీప్తి (సి) మూనీ (బి) సదర్లాండ్‌ 7; రిచా (సి) అలానా కింగ్‌ (బి) గార్డ్‌నర్‌ 11; స్నేహ్‌ రాణా (సి) తాలియా (బి) హామిల్టన్‌ 5; కాశ్వీ (నాటౌట్‌) 34; సయాలీ (సి) మూనీ (బి) సదర్లాండ్‌ 7; క్రాంతి (సి) సదర్లాండ్‌ (బి) బ్రౌన్‌ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (62.4 ఓవర్లలో ఆలౌట్‌) 198. వికెట్ల పతనం: 1–18, 2–54, 3–61, 4–84, 5–107, 6–150, 7–150, 8–157, 9–195, 10–198. బౌలింగ్‌: డార్సీ బ్రౌన్‌ 12.4–0–41–2, హామిల్టన్‌ 11–3–31–3, అనాబెల్‌ సదర్లాండ్‌ 17–5–46–4, తాలియా 4–2–15–0, యాష్లీ గార్డ్‌నర్‌ 15–3–39–1, అలానా కింగ్‌ 3–0–23–0. ఆ్రస్టేలియా మహిళల తొలి ఇన్నింగ్స్‌: జార్జియా వోల్‌ (బి) సయాలీ 2; ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (సి) జెమీమా (బి) క్రాంతి 9; పెరీ (బ్యాటింగ్‌) 43; అలీసా హీలీ (సి) జెమీమా (బి) సయాలీ 13; అనాబెల్‌ సదర్లాండ్‌ (బ్యాటింగ్‌) 20; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (27 ఓవర్లలో 3 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–2, 2–31, 3–58. బౌలింగ్‌: సయాలీ 8–1–24–2, క్రాంతి 11–2–28–1, కాశ్వీ 7–1–29–0, స్నేహ్‌ రాణా 1–0–9–0.

ICC names umpires match officials IND vs NZ T20 WC final Fans Reacts8
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్‌.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్‌ ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య మార్చి 8 (ఆదివారం) ఫైనల్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మెగా ఫైనల్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.అంపైర్లు వీరే..టీమిండియా- కివీస్‌ (IND vs NZ Final) మధ్య టైటిల్‌ పోరుకు అంపైర్లను శుక్రవారం ప్రకటించింది. ఫీల్డ్‌ అంపైర్లుగా రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, అలెక్స్‌ వార్ఫ్‌లకు చోటు ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరు ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌కు కూడా అంపైర్లుగా వ్యవహరించారు.ఆ రెండుసార్లూ గెలిచినా..ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫైనల్‌లలో అంపైర్‌గా పని చేసిన అనుభవం ఇల్లింగ్‌వర్త్‌కు ఉంది. వన్డే వరల్డ్‌కప్‌-2023, టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్స్‌లో ఆయనే అంపైర్‌.అయితే, 2023లో తప్ప 2024, 2025 టైటిల్‌ పోరులో టీమిండియానే విజయం వరించింది. అన్నట్లు 2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది.ఆందోళనలో అభిమానులు.. కారణం ఇదేఅయితే, 2024లో వెస్టిండీస్‌ వేదికగా సౌతాఫ్రికాను.. 2025లో దుబాయ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, 2023 మాదిరే ఈసారి కూడా అదే అంపైర్‌ (ఇల్లింగ్‌వర్త్‌), అదే వేదిక (అహ్మదాబాద్‌)పై ఫైనల్‌ కావడంతో అభిమానులు కాస్త సెంటిమెంట్‌ ఫీలవుతున్నారు. దురదృష్టం వెంటాడకూడదని ప్రార్థిస్తున్నారు.టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌- న్యూజిలాండ్‌ ఫైనల్‌కు అంపైర్లు వీరే👉ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు- రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, అలెక్స్‌ వార్ఫ్‌👉థర్డ్‌ అంపైర్‌- అల్లాఉద్దీన్‌ పలేకర్‌👉ఫోర్త్‌ అంపైర్‌- అడ్రియాన్‌ హోల్డ్‌స్టక్‌👉మ్యాచ్‌ రిఫరీ- ఆండీ పైక్రాఫ్ట్‌.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Lakshya Sen storms into semifinals at All England Badminton Championship9
సెమీస్‌లో లక్ష్య సేన్‌

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ లక్ష్య సేన్‌ విజయపరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–13, 21–16తో ప్రపంచ 6వ ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌ (చైనా)పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం లక్ష్య సేన్‌ ఆధిపత్యం చలాయించాడు. ఈ గెలుపుతో గత ఏడాది ఇదే టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో లీ షి ఫెంగ్‌ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్‌ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్‌గా లీ షి ఫెంగ్‌తో 15 సార్లు తలపడ్డ లక్ష్య సేన్‌ 8 సార్లు గెలిచి, 7 సార్లు ఓడిపోయాడు. కొకి వతనాబె (జపాన్‌), విక్టర్‌ లాయ్‌ (కెనడా) మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్‌ తలపడతాడు.

Some Headless batting: Ashwin Lambasts Abhishek Sharma IND vs ENG10
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్‌ శర్మపై అశ్విన్‌ ఆగ్రహం

అభిషేక్‌ శర్మ.. తొలిసారి ప్రపంచకప్‌ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లు ఆడి డకౌట్‌ అయినా యాజమాన్యం అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్‌గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ తేలిపోయాడు. తొందరపడి వికెట్‌ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్‌మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్‌ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‌‘‘ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్‌ చేశాడు. నిజానికి అభిషేక్‌ గేమ్‌ప్లాన్‌కు నేను వీరాభిమానిని. విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్‌ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్‌ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్‌ తీసి మరో ఎండ్‌కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్‌ అభిషేక్‌పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్‌తో ఫైనల్‌ నేపథ్యంలో.. ‘‘అభిషేక్‌ మంచి బ్యాటర్‌. న్యూజిలాండ్‌తో ఇటీవలి సిరీస్‌లో సూపర్‌ ఫామ్‌ కనబరిచాడు. మిచెల్‌ సాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్‌, హెడ్‌కోచ్‌ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్‌మెంట్‌ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌.. అభిషేక్‌ కోసం లెగ్‌సైడ్‌లో ఒకే ఒక్క ఫీల్డర్‌ను ఉంచాడు. అతడికి క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ పెవిలియన్‌ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య టీ20 ప్రంచకప్‌-2026 ఫైనల్‌కు షెడ్యూల్‌ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement