ప్రధాన వార్తలు
రాహుల్ సెంచరీ వృథా.. రాజ్కోట్ వన్డేలో టీమిండియా ఓటమి
రాజ్కోట్ వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో బ్లాక్ క్యాప్స్ జట్టు సమం చేసింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఆడుతూ పడుతూ 47.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ అజేయ శతకంతో చెలరేగాడు.117 బంతులు ఎదుర్కొన్న మిచెల్.. 11 ఫోర్లు, 2 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. అతడితో విల్ యంగ్ కూడా కీలక నాక్ ఆడాడు. యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరిలో గ్లెన్ ఫిలిప్స్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా తలా వికెట్ సాధించారు.రాహుల్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(12) విరోచిత శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, పౌల్క్స్, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరగనుంది.
కెప్టెన్గా మహ్మద్ సిరాజ్.. అధికారిక ప్రకటన
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకెండ్ లెగ్ మ్యాచ్లు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మిగిలిన రెండు లీగ్ మ్యాచ్లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్గఢ్తో హైదరాబాద్ తలపడనుంది.ఈ సమయంలో జాతీయ విధులు లేకపోవడంతో సిరాజ్ రంజీల్లో ఆడనున్నాడు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు అతడికి జట్టు పగ్గాలను అప్పగించారు. సిరాజ్ డిప్యూటీగా రాహుల్ సింగ్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు వంటి సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కింది. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్రావ్ పేరాల కూడా ఉన్నాడు.హైదరాబాద్ జట్టుమహ్మద్ సిరాజ్, రాహుల్ సింగ్, సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు,కె హిమతేజ, వరుణ్ గౌడ్,ఎం అభిరత్ రెడ్డి, రాహుల్ రాధేష్, అమన్ రావ్, రక్షణ్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్, నితీశ్ రెడ్డి, సాయి ప్రగ్నయ్ రెడ్డి,బి పున్నయ్యచదవండి: IND vs NZ: వారెవ్వా హర్షిత్.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో
వారెవ్వా హర్షిత్.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి బంతితో అద్భుతం చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వేను సంచలన బంతితో రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్కు ఓపెనర్లు కాన్వే, హెన్రీ నికోల్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.కానీ భారత పేసర్లు రాణా, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఓపెనర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రాణా వేసిన అద్భుతమైన డెలివరీకి కాన్వే దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ ఢిల్లీ పేసర్ కాన్వేకు గుడ్ లెంగ్త్ బాల్గా సంధించాడు.బంతి ఆఫ్ స్టంప్ దగ్గర పిచ్ అయ్యి లోపలికి దూసుకొచ్చింది. కాన్వే ఆ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. వెంటనే హర్షిత్ రాణా తనదైన శైలిలో దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.కెప్టెన్ శుభ్మన్ గిల్ వైపు వేలు చూపిస్తూ చెప్పా కాదా అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతకుముందు తొలి వన్డేలో రాణా రెండు వికెట్లతో పాటు 29 పరుగులు చేశాడు. తనపై విమర్శలు చేస్తున్నవారికి తన ప్రదర్శనలతో రాణా సమాధనమిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(112) అజేయ సెంచరీతో మెరిశాడు.చదవండి: క్రికెట్కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్Off stump out of the ground 🔥🔥Harshit Rana gets the opening wicket in fine fashion! ⚡️Updates ▶️ https://t.co/x1fEenI0xl#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/mYvTSD273W— BCCI (@BCCI) January 14, 2026
క్రికెట్కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్
కర్ణాటక మిస్టరీ స్పిన్నర్ కేసీ కరియప్ప సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం 31 ఏళ్ల వయస్సులోనే భారత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి కరియప్ప షాకిచ్చాడు. అతడు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు."స్ట్రీట్ క్రికెట్ నుంచి స్టేడియంలో ఫ్లడ్ లైట్లలో ఆడడం వరకు నా ప్రయాణం ఒక్క అద్భుతం. గర్వంగా జెర్సీ ధరించి, ఒకప్పుడు నేను కన్న కలలను నిజం చేసుకున్నాను. అయితే ఈ రోజు భారత క్రికెట్ నుంచి నేను వైదొలుగుతున్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. విజయాలు చిరునవ్వును ఇస్తే, ఓటములు నన్ను రాటుదేల్చాయి. నా ఈ జర్నీలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు" తన రిటైర్మెంట్ నోట్లో పేర్కొన్నాడు.కాగా బీసీసీఐతో పూర్తిగా తెగదింపులు చేసుకున్న కరియప్ప విదేశీ ఫ్రాంచైజీ లీగ్లలో ఆడే అవకాశముంది. కరియప్ప తన డొమెస్టిక్ కెరీర్లో కర్ణాటక, మిజోరం జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 157 వికెట్లు పడగొట్టారు. అయితే ఐపీఎల్ 2015 వేలంతో కరియప్ప వెలుగులోకి వచ్చాడు.ఏ మాత్రం అనుభవం లేనిప్పటికి కోల్కతా నైట్రైడర్స్ అతడిని రూ.2.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం అప్పటిలో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాతి సీజన్లలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు గతకొంతకాలంగా అతడికి దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు కూడా ఛాన్స్లు రావడం లేదు. ఈ క్రమంలోనే భారత క్రికెట్కు కరియప్ప విడ్కోలు పలికాడు.
'గంభీర్ సపోర్ట్తో అతడిని సెలెక్ట్ చేశారు'.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్
న్యూజిలాండ్తో ఆఖరి రెండు వన్డేలకు భారత జట్టులో ఢిల్లీ బ్యాటర్ అయూశ్ బదోనికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలగడంతో బదోనికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.అయితే సెలెక్టర్ల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్లో ఉన్న రియాన్ పరాగ్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లని కాదని బదోనిని తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. గంభీర్ సపోర్ట్ వల్లే అతడిని అనుహ్యంగా జట్టులోకి తీసుకున్నారని మరికొంతమంది విమర్శిస్తున్నారు.కాగా బదోని ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడతున్నాడు. గతంలో లక్నో మెంటార్గా గౌతీ పనిచేశాడు. అతడి గైడెన్స్లో బదోని మరింత రాటుదేలాడు. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బదోని ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.గంభీర్ కూడా ఢిల్లీ నుంచే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం విధితమే. ఈ కారణాలతో అయూశ్ వైపు మొగ్గు చూపాడని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం అతడిని టాలెంట్ ఆధారంగానే జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు."అయూశ్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. భారత్-ఎ జట్టు తరపున కూడా అతడు వన్డే మ్యాచ్లు ఆడాడు. బదోని బ్యాటింగ్తో పాటు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. కేవలం ఐదుగురు బౌలర్లతో మాత్రమే ఆడడం సరైన నిర్ణయం కాదు.ఒకవేళ ప్రధాన బౌలర్లలో ఎవరైనా మ్యాచ్ మధ్యలో గాయపడితే, ఆ ఓవర్లను భర్తీ చేయడానికి ఆరో బౌలింగ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉండాలి. బదోని అవసరమైతే 3 నుండి 5 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలడు. అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాము" అని రెండో వన్డేకు ముందు విలేకరుల సమావేశంలో కోటక్ పేర్కొన్నాడు.చదవండి: BBL: పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు
కేఎల్ రాహుల్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే?
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 120 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రాహుల్ తన సెంచరీతో ఆదుకున్నాడు.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు వీరిద్దరూ 70 పరుగుల భాగస్వామమ్యం నెలకొల్పారు. రోహిత్(24) ఔటయ్యాక గిల్(56), శ్రేయస్ అయ్యర్(8), విరాట్ కోహ్లి(23) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు.ఈ క్రమంలో రాహుల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(27)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. జడేజా ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ 87 బంతుల్లో తన ఎనిమిదివ వన్డే సెంచరీ మార్క్ను కేఎల్ అందుకున్నాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొత్తంగా రాహుల్ 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, పౌల్క్స్చ, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు.చదవండి: BBL: పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు
పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు
బిగ్బాష్ లీగ్ 2025-26 సీజన్లో పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో మెల్బోర్న్ రెనెగేడ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రిజ్వాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు.ఈ క్రమంలో సిడ్నీ థండర్స్తో జరిగిన మ్యాచ్లో రిజ్వాన్కు చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్లో జిడ్డు బ్యాటింగ్తో విసిగించిన రిజ్వాన్ను మెల్బోర్న్ రెనెగేడ్స్ మెనెజ్మెంట్ బలవంతంగా మైదానం నుంచి వెనక్కి పిలిచింది. దీంతో అతడు రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు.నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన రిజ్వాన్ నెమ్మదిగా ఆడుతూ టెస్టు క్రికెట్ను తలపించాడు. ఆఖరికి డెత్ ఓవర్లలో కూడా అతడి ఆట తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్ల ముందు అతడిని వెనక్కి రమ్మని బౌండరీ రోప్ వద్ద నుంచి కెప్టెన్ విల్ సదర్లాండ్ సైగలు చేశాడు.దీంతో రిజ్వాన్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. తద్వారా బిగ్ బాష్ లీగ్ చరిత్రలో రిటైర్డ్ అవుట్ అయిన తొలి ఓవర్సీస్ ప్లేయర్గా రిజ్వాన్ ఆప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. రిటైర్డ్ అవుట్గా వెనదిరిగే ముందు రిజ్వాన్ స్ట్రైక్ రేట్ 113తో 23 బంతుల్లో కేవలం 26 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ వంటి స్టార్ ప్లేయర్కు ఇది 'అవమానకరం' అని అక్మల్ అన్నాడు."లీగ్ క్రికెట్ ప్రస్తుతం చాలా మారిపోయింది. ఆధునిక టీ20 క్రికెట్ అవసరాలకు తగ్గట్టుగా రిజ్వాన్ తన స్ట్రైక్ రేట్ను మెరుగుపరుచుకోకపోతే చాలా కష్టం. రిజ్వాన్తో పాటు బాబర్ ఆజంను కూడా తమ స్ట్రైక్ రేట్ను పెంచుకోవాలని గత మూడేళ్లుగా పదే పదే చెబుతున్నాను.పాకిస్తాన్ జట్టు కెప్టెన్గా పనిచేసిన ఆటగాడిగా ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఘోర అవమానమే. కానీ రిజ్వాన్ తన స్వయంకృత అపరాధం వల్ల ఈ పరిస్థితి తెచ్చుకున్నాడుఐపీఎల్-2025 సీజన్లో తిలక్ వర్మ వంటి కీలక ఆటగాడిని సైతం ముంబై ఇండియన్స్ తిరిగి డగౌట్లోకి పిలిచారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్లు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఎలాంటి వ్యక్తిగత ద్వేషం ఉండదని" ఆక్మల్ పేర్కొన్నాడు.అయితే రిజ్వాన్ వంటి స్టార్ ప్లేయ్ర్ను అర్ధాంతరంగా వెనక్కి పిలవడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని డిబేట్ హోస్ట్ తెలిపారు. రిజ్వాన్ వెంటనే బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పుకొని తిరిగి స్వదేశానికి రావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నట్లు పాక్ జాతీయ మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. రిజ్వాన్ ప్రస్తుతం పాక్ వన్డే, టెస్టు జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు.Muhammad Rizwan has been retired out by the Melbourne Renegades 👀 #BBL15 pic.twitter.com/AuTGoTIHqb— KFC Big Bash League (@BBL) January 12, 2026
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. తొలి వన్డేలో 93 పరుగులతో సత్తాచాటిన కోహ్లి.. రెండో వన్డేలో మాత్రం నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు.29 బంతుల్లో 23 పరుగులు చేసి క్లార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడనప్పటికి ఓ అరుదైన రికార్డు మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కింగ్ కోహ్లి చరిత్ర సృష్టించాడు.4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. కోహ్లి ఇప్పటివరకు కివీస్పై వన్డేల్లో 1770 పరుగులుచ చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1750)ను కోహ్లి అధిగమించాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి రెండో స్ధానంలో నిలిచాడు.అగ్రస్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(1,971) కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో కోహ్లి కూడా పలు అరుదైన రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంతవేగంగా 28,000 పరుగులు మైలు రాయిని అందుకున్న ప్లేయర్గా సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఇంటర్ననేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వన్డే వరల్డ్కప్-2027 లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.చదవండి: రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి
రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి
ఐసీసీ ఇవాళ (జనవరి 14) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా ఫ్యాన్స్కు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. దిగ్గజ బ్యాటర్లలో ఒకరు టాప్ ర్యాంక్కు చేరుకొని సొంత అభిమానుల్లో ఆనందం నింపగా.. అప్పటికే టాప్ ప్లేస్లో ఉన్న మరో ఆటగాడు రెండు స్థానాలు కోల్పోయి, పర్సనల్ ఫ్యాన్స్ను నిరాశకు గురి చేశాడు. ఇంతకీ ఆ దిగ్గజ బ్యాటర్లు ఎవరంటే..?విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. విరాట్ తాజాగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగులు చేయడంతో ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్కు చేరాడు. అప్పటికే టాప్ ప్లేస్లో ఉండిన రోహిత్ శర్మ న్యూజిలాండ్పై కేవలం 26 పరుగులకే పరిమితం కావడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. అదే మ్యాచ్లో 84 పరుగులతో సత్తా చాటిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ఓ స్థానం మెరుగపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ (29 నాటౌట్) ఆడిన కేఎల్ రాహుల్ ఓ స్థానం మెరుగుపర్చుకొని, 11వ స్థానానికి చేరాడు. టాప్-10లో భారత్ తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. శుభ్మన్ గిల్ 5, శ్రేయస్ అయ్యర్ 10 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇవి మినహా ఈ వారం ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.బౌలర్ల విషయానికొస్తే.. టాప్-10లో ఒక్క మార్పు కూడా లేదు. రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, కుల్దీప్ యాదవ్ టాప్-3గా కొనసాగుతున్నారు. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఈ వారం ర్యాంకింగ్స్లో గణనీయంగా లబ్ది పొందాడు. న్యూజిలాండ్పై తొలి వన్డేలో 2 వికెట్లు తీయడంతో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు. అదే మ్యాచ్లో ఘోరంగా విఫలమైన మరో టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఐదు స్థానాలు కోల్పోయి 21వ ప్లేస్కు పడిపోయాడు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్జాయ్, సికందర్, మొహమ్మద్ నబీ టాప్-3లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున అక్షర్ పటేల్ పదో స్థానంలో నిలిచాడు.
న్యూజిలాండ్తో రెండో వన్డే.. టీమిండియా బ్యాటింగ్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 14) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు భారత్ తొలుత బ్యాటింగ్కు దిగనుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి వన్డే సందర్భంగా గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఓ మార్పు చేసింది. ఆ జట్టు తరఫున జేడన్ లెన్నాక్స్ (ఆదిత్య అశోక్ స్థానంలో) అరంగేట్రం చేయనున్నాడు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్భారత్: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
12 ఏళ్ల తర్వాత భారత్కు ఫిఫా ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత భారత్లోకి అ...
ముగిసిన సింధు పోరాటం.. సెమీస్లో ఓటమి
మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు...
ఇక నుంచి రూ. 20 లక్షలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు...
ఆటుపోట్లను దాటుకుంటూ... అడ్డంకులు ఎదురైనా..
గ్రేటర్ నోయిడా: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన...
పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు
బిగ్బాష్ లీగ్ 2025-26 సీజన్లో పాకిస్తాన్ స్టార్...
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండ...
రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి
ఐసీసీ ఇవాళ (జనవరి 14) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ...
న్యూజిలాండ్తో రెండో వన్డే.. టీమిండియా బ్యాటింగ్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 14) ...
క్రీడలు
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
మహిళా షూటర్ పై లైంగిక దాడి.. జాతీయ కోచ్ అంకుశ్ పై వేటు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!
