ప్రధాన వార్తలు
యువ జోరు...
నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో సత్తా చాటుకొని విశ్వవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాలని ఆయా జట్ల క్రీడాకారులు తాపత్రయపడుతుంటారు. ప్రతీ ప్రపంచకప్ కొందరిని హీరోలుగా చేస్తుంది. మరికొందరిని జీరోలుగా చేస్తుంది. ప్రపంచకప్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాత్రికి రాత్రే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎందరో యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం సూపర్ స్టార్స్గా మారిన మెస్సీ, రొనాల్డో, నెమార్, ఎంబాపె, మోడ్రిచ్ తదితరులు ఈ దశను దాటి వచ్చినవాళ్లే. రేపటి నుంచి అమెరికా, కెనడా, మెక్సికోలలో మొదలయ్యే 23వ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలోనూ పలువురు యువ ఆటగాళ్లు తమ విన్యాసాలతో అలరించేందుకు సై అంటున్నారు. ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నాడు స్పెయిన్కు చెందిన 18 ఏళ్ల లామినె యామల్. రెండేళ్ల క్రితం యూరో టోర్నీలో స్పెయిన్కు నాలుగోసారి టైటిల్ దక్కడంలో యామల్ కీలకపాత్ర పోషించాడు. తాజా ప్రపంచకప్లో యామల్ మెరిపిస్తే స్పెయిన్ టైటిల్ ఫేవరెట్గా మారుతుందనడంలో సందేహం లేదు. డిఫెండర్లను బోల్తా కొట్టించడంలో... సహచరులకు సమయస్ఫూర్తితో పాస్లు అందించడంలో... సుదూరం నుంచి గోల్పోస్ట్ లక్ష్యంగా కళ్లు చెదిరే కిక్లు కొట్టడంలో యామల్కు తిరుగులేదు. ఐదుసార్లు విజేత బ్రెజిల్ జట్టు తరఫున స్టార్ నెమార్ చివరిసారి ప్రపంచకప్లో ఆడుతుండగా... అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాడు 18 ఏళ్ల ఎస్టవో విలియన్. అభిమానులు ఇప్పటి నుంచే విలియన్ను ‘న్యూ నెమార్’గా పిలుస్తున్నారు. డిఫెన్స్ను ఛేదించి గోల్స్ కొట్టడంలో విలియన్కు మంచి పేరుంది. అర్జెంటీనా జట్టు కెప్టెన్ మెస్సీ రిటైరైనా ఆ జట్టు భవిష్యత్కు ఢోకా లేదని 18 ఏళ్ల ఫ్రాంకో మస్తాంటువానో తన ఆటతీరుతో భరోసా కల్పిస్తున్నాడు. వరుసగా రెండోసారి అర్జెంటీనా ప్రపంచకప్ టైటిల్ నెగ్గాలంటే మెస్సీతోపాటు ఫ్రాంకో ఆటతీరు కూడా కీలకం కానుంది. వరుసగా మూడోసారి ఫ్రాన్స్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశాలు సీనియర్ స్టార్స్ ఎంబాపె, డెంబెలె, 19 ఏళ్ల డిసిర్ డుయు ఆటతీరుపై ఆధారపడి ఉంది. ఇటీవల యూరో చాంపియన్స్ లీగ్ టైటిల్ నిలబెట్టుకున్న పీఎస్జీ జట్టుకు డిసిర్ డుయు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరితోపాటు గిల్బెర్టో మోరా (మెక్సికో), ఇబ్రహీం ఎంబాయె (సెనెగల్), నికో పాజ్ (అర్జెంటీనా), అర్దా లెర్ (టర్కీ), పౌ కుబార్స్ (స్పెయిన్), యాన్ డియోమండె (ఐవరీకోస్ట్), ఆండ్రీ సాంతోస్ (బ్రెజిల్), ఎండ్రిక్ (బ్రెజిల్), ఆంటోనియో నూసా (నార్వే) కూడా సంచలన ప్రదర్శనతో మెరిపించే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి క్రీడా విభాగం
ఓటమి అంచుల నుంచి...
దంబుల్లా: 278 పరుగుల లక్ష్యఛేదనలో 47 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ‘ఎ’ జట్టు 261/6తో నిలిచింది. ఆ జట్టు విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా... చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ సహాన్ (72 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో జోరు మీదున్నాడు. ఇంకేముంది ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంక ‘ఎ’ జట్టు విజయం సాధించడం తథ్యమే అనుకుంటే... అక్కడే భారత ‘ఎ’ బౌలర్లు అద్భుతం చేశారు. 48వ ఓవర్లో 7 పరుగులు ఇ చ్చిన అన్షుల్ కంబోజ్... ప్రత్యర్థి కెప్టెన్ను అవుట్ చేయగా... అర్షద్ ఖాన్ వేసిన 49వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ‘ఎ’ జట్టు 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (114 బంతుల్లో 101; 6 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ ( 97 బంతుల్లో 60; 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14; 3 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (2) విఫలమయ్యారు. భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్లో వైభవ్... ఐపీఎల్ జోరు కనబర్చలేకపోయాడు. ప్రియాన్ష్ ఆర్య (32; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆయుశ్ బదోనీ (24; 2 ఫోర్లు), సూర్యాన్ష్ షెడ్గె (26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్లలో షిరాజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో లంక 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. సహాన్తో పాటు డికెవెల్లా (47), అవిష్క(45), సదీరా సమరవిక్రమ (46) రాణించారు. అయితే చివర్లో ఒత్తిడిని అధిగమించడంలో సఫలమైన భారత జట్టును విజయం వరించింది. భారత ‘ఎ’ బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోనీ, విప్రాజ్ నిగమ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. గురువారం జరగనున్న రెండో లీగ్ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడనుంది.
ప్రిక్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ జోడీ
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హరిహరన్–ఎంఆర్ అర్జున్ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో హరిహరన్–అర్జున్ ద్వయం 21–13, 21–13తో ఆర్డెన్ క్వాన్ లీ–స్టాన్లీ జింగ్ (అమెరికా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో డబుల్స్ మ్యాచ్లో దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–పోచాన అర్జున్ రెడ్డి (భారత్) జోడీ 15–21, 15–21తో ఇగావా–ఊయ్ యి హెర్న్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో భారత ప్లేయర్ సనీత్ దయానంద్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సనీత్ 21–17, 21–15తో కరోనో (ఆస్ట్రేలియా)పై, రెండో రౌండ్లో 21–9, 21–16తో మింగ్ హాంగ్ లిమ్ (మలేసియా)పై గెలిచాడు. భారత్కే చెందిన మన్రాజ్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో 11–21, 18–21తో ఇగోని ఇవి (మలేసియా) చేతిలో ఓడిపోయాడు.
నైట్క్లబ్ వివాదం.. స్టోక్స్ కెరీర్కు ఎండ్ కార్డ్..?
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై సంచలన ప్రచారం జరుగుతోంది. తాజాగా న్యూజిలాండ్పై లార్డ్స్ టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత స్టోక్స్, సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్ జట్టు నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి కర్ఫ్యూ సమయంలో ఓ నైట్క్లబ్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వారు ఫుల్లుగా తాగి ఓ రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ వివాదం తర్వాత స్టోక్స్ తన కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 'ది క్రికెటర్' సీనియర్ జర్నలిస్ట్ జార్జ్ దోబెల్ ప్రకారం.. అతడు స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ కూడా ప్రకటించవచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.ఇదిలా ఉంటే, నైట్క్లబ్ ఘటనలో స్టోక్స్, అట్కిన్సన్ ఎవరిపై దాడికి పాల్పడలేదని ECB వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తప్పకపోవచ్చు. స్టోక్స్కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. గతేడాది నవంబర్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నైట్క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్కు ముందు వెల్లింగ్టన్లోని ఓ నైట్క్లబ్కు వెళ్లిన బ్రూక్, అక్కడ బౌన్సర్తో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లండ్ భవిష్యత్తు ఆశాకిరణం జేకబ్ బెథెల్తో కలిసి సదరు బౌన్సర్పై దాడి చేశాడు. అయితే దాడి పెద్దది కాకపోవడంతో ఈసీబీ వారిద్దరిని మందలింపుతో సరిపెట్టింది.
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం
ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 9) జరిగిన తొలి మ్యాచ్లో 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది.ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన తాజా మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. తౌహిద్ హృదోయ్ (31), తస్కిన్ అహ్మద్ (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ (10-1-38-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రెన్షా తలో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు. బార్ట్లెట్కు ఓ వికెట్ దక్కింది.లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (5.2-0-24-2), తస్కిన్ (5-0-28-1) కూడా రాణించారు.
గైక్వాడ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపు
శ్రీలంకలో జరుగుతున్న ఏ-జట్ల ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఇవాళ (జూన్ 9) జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (101) సూపర్ సెంచరీతో, కెప్టెన్ తిలక్ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో ఆయుశ్ బదోని (24), సూర్యాంశ్ షేడ్గే (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్మ 32, ప్రభ్సిమ్రన్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 1 (నాటౌట్) పరుగు చేయగా.. ఐపీఎల్ 2026 తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్, వనుజ సహాన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో) కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్ రాయ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టింది. జూన్ 11న జరిగే తదుపరి మ్యాచ్లో భారత్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ తలపడనున్నాయి.
వైభవ్ నిర్దయగా సిక్సర్లు బాదాడు!.. ఇదే కొనసాగితే కష్టం!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని.. ఇదే కొనసాగితే పొట్టి ఫార్మాట్ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డాడు.గతేడాది కాలంగా రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. పద్నాలుగేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ (35)తో కదంతొక్కిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఏడాది ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.ఆరెంజ్ క్యాప్ విజేతఐపీఎల్-2026లో మొత్తంగా పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్తో పాటు మరెన్నో బహుమతులు గెలుచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబడ వంటి స్టార్ బౌలర్ల బౌలింగ్లో సైతం వైభవ్ చితక్కొట్టడం విశేషం.ఇక ఈ సీజన్లో ఏకంగా 72 సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల ఆల్టైమ్ రికార్డును బద్దలుకొట్టాడు కూడా!.. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ, వివాదాస్పద కోచ్ గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్లో.. ‘‘పదిహేనేళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ టోర్నీనే శాసించే స్థితికి వెళ్లాడు. 237కు పైగా స్ట్రైక్రేటుతో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ భూమి మీద ఉన్న అత్యుత్తమ బౌలర్లను కూడా తన బ్యాటింగ్తో ఉతికి ఆరేశాడు.సీజన్లో 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డునే బద్దలుకొట్టాడు. సంప్రదాయ క్రికెట్కు పూర్తి విరుద్ధంగా సరికొత్త బెంచ్మార్కు సృష్టించాడు. తనింకా పిల్లాడే. పూర్తి స్థాయిలో సీనియర్ ఆటగాడిగా మారిన తర్వాత అతడిని ఎవరూ ఆపలేరు.ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతంఅంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ బౌలర్లుగా గుర్తింపు పొందిన వారిని సైతం వేటాడేయగలడు. మారుతున్న క్రీడా విధానానికి ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతం. ఆధునిక టీ20 ఫార్మాట్ పారామీటర్లు కూడా మారిపోతున్నాయి.ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనల వల్ల సమతూకం దెబ్బతింటోంది. బ్యాటింగ్ చేసే జట్టుకు అదనపు పవర్హిట్టర్ను ఆడించే వీలు దొరుకుతోంది. వైభవ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా తన ప్రభావం చూపాడు’’ అని గ్రెగ్ చాపెల్ పేర్కొన్నాడు.ఇలా అయితేనే టీ20 క్రికెట్ను కాపాడుకుందాంఅదే విధంగా.. టీ20 క్రికెట్ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ గ్రెగ్ చాపెల్ ఈ సందర్భంగా మూడు ప్రధాన సూచనలు చేశాడు. ‘‘బ్యాటింగ్ చేసే జట్టుకు చేతిలో పది వికెట్లు కూడా ఆరు వికెట్లే ఉండాలి. అప్పుడు బ్యాటర్లు బాదడమే పనిగా పెట్టుకోకుండా మంచి టెక్నిక్తో ఆడే ప్రయత్నం చేశారు.పిచ్ల మీద కనీసం 3 మి.మీ. మేర పచ్చిక ఉండేలా చూసుకోవాలి. తద్వారా కాస్త సీమ్ జనరేట్ అవుతుంది. ఒక్కోసారి పచ్చికతో కూడినవి.. మరోసారి పూర్తిగా పొడి పిచ్లను తయారు చేయాలి. తద్వారా వైవిధ్యం చేకూరుతుంది. లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో కూడా మార్పులు చేయాలి’’ అని గ్రెగ్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. చదవండి: అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్తో సిరీస్ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్కు బదులు యశస్వి జైస్వాల్కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్తో వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్ను వన్డౌన్లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్తో పాటు గుర్నూర్ బ్రార్ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా.. 16 మ్యాచ్లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్రైజర్స్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ
ఇద్దరు ప్రపంచకప్ సభ్యులపై వేటు
జూన్ 11 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 9) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా షాయ్ హోప్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ముగ్గురు టీ20 ప్రపంచకప్ 2026 సభ్యులకు చోటు దక్కలేదు. ఇందులో ఇద్దరిపై (జాన్సన్ ఛార్లెన్, క్వింటన్ సాంప్సన్) వేటు పడగా.. అల్జరీ జోసఫ్కు వర్క్లోడ్ కారణంగా విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లు ఆకీమ్ ఆగస్టే, జువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్లకు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు. విధ్వంసకర వీరులు హెట్మైర్, రూథర్ఫోర్డ్, షెపర్డ్, పావెల్, హోల్డర్ తమ స్థానాలను నిలుపుకున్నారు. శ్రీలంకతో ఈ సిరీస్ జూన్ 12, 14, 15 తేదీల్లో జమైకాలోని సబీనా పార్క్ వేదికగా జరుగనుంది.శ్రీలంకతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టుషాయ్ హోప్ (సి), జువెల్ ఆండ్రూ, అకీమ్ అగస్టే, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్కాగా, శ్రీలంక క్రికెట్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు రెండో వన్డే కూడా వర్షార్పణం అయ్యింది. ఈ సిరీస్లో జరిగిన ఏకైక వన్డేలో గెలవడంతో శ్రీలంక సిరీస్ను కైవసం చేసుకుంది.స్వదేశంలో సిరీస్ కోల్పోవడంతో విండీస్ జట్టు 2027 వన్డే వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. 2023-27 సైకిల్లో విండీస్ ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్గా టోర్నీలోకి అడుగుపెడతాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు-నవంబరు మధ్య జరుగనున్న సంగతి తెలిసిందే.
BCCI: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టు నుంచి స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తప్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోకాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఫామ్లేమితో బాధపడుతున్న సూర్యను తప్పించి.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని జట్టును ఎంపిక చేయడమే కాకుండా.. కెప్టెన్గా నియమించింది.ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా జూన్ 26 నుంచి ఐర్లాండ్లో పర్యటించనుంది. తొలుత ఐర్లాండ్తో రెండు టీ20లు ఆడి.. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. వైభవ్ సూర్యవంశీకి చోటుఇందుకోసం ప్రకటించిన జట్టులో తొలిసారిగా పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తాడని యాజమాన్యం తొలుత ప్రకటించింది.అందుకే సిరాజ్ను తప్పిస్తు న్నాంతాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ‘‘మా వైద్య బృందంతో చర్చల అనంతరం.. సిరాజ్కు విశ్రాంతి కావాలని భావించాము. పనిభారాన్ని తగ్గించే క్రమంలో అతడిని ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన నుంచి తప్పిస్తున్నాము. సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.సిరాజ్ స్థానంలో ప్రసిద్ కృష్ణను సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సిరాజ్కు బదులు ఐర్లాండ్, ఇంగ్లండ్లలో అతడు టీ20 సిరీస్లలో పాల్గొంటాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్కు టీమిండియా (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాలో చోటివ్వరా? సెంచరీతో కదంతొక్కాడు!
‘ఆసియా’ అంతంతే!
టేబుల్ టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక...
సీఎం విజయ్తో చెస్ సంచలనం ప్రజ్ఞానంద
భారత చెస్ గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానం...
పూర్వ వైభవం కోసం!
ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత నిలకడగా రాణి...
రన్నరప్ అనిరుధ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ ...
ఇద్దరు ప్రపంచకప్ సభ్యులపై వేటు
జూన్ 11 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్య...
BCCI: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణ...
టీమిండియాలో చోటివ్వరా? శతకంతో కదం తొక్కాడు!
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు...
ODI WC: కొంప ముంచిన వర్షం.. విండీస్కు తప్పని గండం!
సొంతగడ్డపై వెస్టిండీస్ చతికిలపడింది. పర్యాటక శ్రీ...
క్రీడలు
రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)
చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)
వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)
ఎలిమినేటర్ పోరు.. నితీశ్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ.. చిందేసిన ఉప్పల్ (ఫొటోలు)
ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేయర్ల ప్రాక్టీస్.. ఉప్పల్లో లాస్ట్ పంచ్ ఎవరిది (ఫొటోలు)
భారత జట్టులో మార్పు.. కేకేఆర్ స్టార్కు లక్కీ ఛాన్స్
శ్రీవారి సేవలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ దంపతులు (ఫోటోలు)
సీమంతం ఫొటోలు షేర్ చేసిన దేవిశా శెట్టి (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబం (ఫొటోలు)
వీడియోలు
ఒక్క మ్యాచ్ ఆడకుండానే.. ఇంగ్లాండ్ లో బుడ్డోడి ప్రకంపనలు
పాపం.. కారున్నా నడపలేడు బుడ్జోడికి ఎంత కష్టం వచ్చిందో
భారత్ కు మరో యువరాజ్ అసలెవరీ మానవ్ సుతార్
ఆఫ్గాన్ చిత్తు చిత్తు.. టెస్టుల్లో భారత్ కు అతిపెద్ద విజయం
టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం ఆఫ్ఘన్ ను చిత్తు చేసిన టీమిండియా
టీం ఇండియా కెప్టెన్సీపై అయ్యర్ ఫస్ట్ రియాక్షన్
నేనేమి పాపం చేశాను, రెండు టైటిళ్లు గెలిచినా.. దక్కని చోటు
సంజుకు షాక్ ఇచ్చిన BCCI.. ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన
ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా ఆండ్రీవా సంచలనం
పాపం రా బుడోడా అభిషేకే కే ఎసరు పెట్టిన వైభవ్
