Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Dommaraju Gukesh secures his first win in Tata Steel Masters chess tournament1
గుకేశ్‌కు తొలి గెలుపు

విక్‌ ఆన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో క్లాసికల్‌ ఫార్మాట్‌ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ తొలి విజయం అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఐదో రౌండ్‌ గేమ్‌లో గుకేశ్‌ 51 ఎత్తుల్లో థాయ్‌ డాయ్‌ వాన్‌ నుగుయెన్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందాడు. తొలి నాలుగు రౌండ్‌ గేమ్‌లను గుకేశ్‌ ‘డ్రా’గా ముగించడం గమనార్హం. 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఐదో రౌండ్‌ తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్లు గుకేశ్‌ 3 పాయింట్లతో ఐదో స్థానంలో... ఇరిగేశి అర్జున్‌ 2.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో... అరవింద్‌ చిదంబరం 1.5 పాయింట్లతో 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం తర్వాత నేడు ఆరో రౌండ్‌ గేమ్‌లు జరుగుతాయి.

Lakshya Sen in the quarterfinals at the Indonesia Masters2
శ్రీకాంత్‌ అవుట్‌

జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 21–10, 21–11తో జేసన్‌ గుణవాన్‌ (హాంకాంగ్‌)పై గెలుపొందగా... శ్రీకాంత్‌ 11–21, 10–21తో నాలుగో సీడ్‌ చౌ టియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్‌ స్టార్‌ అన్‌మోల్‌ ఖరబ్‌ 21–16, 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హరిహరన్‌–అర్జున్‌ (భారత్‌) ద్వయం 17–21, 21–9, 16–21తో మాన్‌ వె చోంగ్‌–కాయ్‌ వున్‌ టీ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో పానిత్‌చపోన్‌ (థాయ్‌లాండ్‌)తో లక్ష్య సేన్‌; చెన్‌ యు ఫె (చైనా)తో పీవీ సింధు తలపడతారు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్‌ 1–0తో పానిత్‌చపోన్‌పై ఆధిక్యంలో ఉండగా... సింధు 6–7తో చెన్‌ యు ఫె చేతిలో వెనుకబడి ఉంది.

Saurashtra were all out for 172 in their first innings3
ఒకే రోజు 23 వికెట్లు

రాజ్‌కోట్‌: టీమిండియా వన్డే, టెస్టు జట్ల సారథి శుబ్‌మన్‌ గిల్‌... దేశవాళీ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో ప్రభావం చూపలేకపోయాడు. గ్రూప్‌ ‘బి’లో భాగంగా గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన పోరులో పంజాబ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన గిల్‌ (0) రెండు బంతులు ఎదుర్కొని పార్థ్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇరు జట్ల బ్యాటర్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమవడంతో ఈ మ్యాచ్‌ తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. మొదట సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. జయ్‌ గోహిల్‌ (117 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (7) నిరాశ పర్చగా.. హార్విక్‌ దేశాయ్‌ (13), చిరాగ్‌ జానీ (8), అర్పిత్‌ (2), సమర్‌ (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుసకట్టారు. ప్రేరక్‌ మన్కడ్‌ (32) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ 38 పరుగులిచ్చి 6 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పంజాబ్‌ తీవ్రంగా తడబడింది. 40.1 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. గిల్‌తో పాటు హర్‌నూర్‌ సింగ్‌ (0), నేహల్‌ వధేరా (6), ప్రేరిత్‌ దత్తా (11), ఉదయ్‌ శరణ్‌ (23) విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్‌ భట్‌ 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, ధర్మేంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. హార్విక్‌ దేశాయ్‌ (6), చిరాగ్‌ జానీ (5), జయ్‌ గోహిల్‌ (8) అవుటయ్యారు. చేతిలో 7 వికెట్లు ఉన్న సౌరాష్ట్ర ఓవరాల్‌గా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. ధర్మేంద్ర జడేజా (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 82.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ 90 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. చండీగఢ్‌తో మ్యాచ్‌లో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. చండీగఢ్‌ 34 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 142 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది.

Stanislas Wawrinka holds the record for playing the most five set matches in Grand Slam tournaments4
‘వావ్‌’రింకా...

మెల్‌బోర్న్‌: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని స్విట్జర్లాండ్‌ వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా నిరూపించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ‘వైల్డ్‌ కార్డు’తో బరిలోకి దిగిన మాజీ చాంపియన్‌ మరో అద్భుత విజయంతో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో వావ్రింకా 4–6, 6–3, 3–6, 7–5, 7–6 (10/3)తో క్వాలిఫయర్‌ ఆర్థర్‌ గియా (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. తద్వారా కెన్‌ రోజ్‌వాల్‌ (ఆ్రస్టేలియా–1978లో 44 ఏళ్లు) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా వావ్రింకా (40 ఏళ్ల 296 రోజులు) గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 1987లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో 128 మందితో ‘డ్రా’ రూపొందించడం మొదలయ్యాక ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన అతిపెద్ద వయసు్కడిగానూ వావ్రింకా ఘనత వహించాడు. దాంతోపాటు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చరిత్రలో అత్యధిక ఐదు సెట్‌ల మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గానూ వావ్రింకా రికార్డు నెలకొల్పాడు. ‘గ్రాండ్‌’ టోర్నీల్లో వావ్రింకా ఐదు సెట్‌ల మ్యాచ్‌లు ఆడటం ఇది 49వసారి కాగా... స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ (48 సార్లు) పేరిట ఉన్న రికార్డును వావ్రింకా బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో నొవాక్‌ జొకోవిచ్‌ (47 సార్లు), లీటన్‌ హెవిట్‌ (45 సార్లు), ఫెర్నాండో వెర్డాస్కో (45 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా వావ్రింకా కెరీర్‌లో ఐదు సెట్‌ల మ్యాచ్‌లు ఆడటం ఇది 58వసారి. ఇది కూడా రికార్డే. ఇందులో అతను 31 సార్లు గెలిచి, 27 సార్లు ఓడిపోయాడు. ఈ ఏడాది తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్న వావ్రింకాకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు ‘వైల్డ్‌ కార్డు’ కేటాయించారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా తన శక్తినంతా ధారపోసి ఆడుతున్న వావ్రింకాకు మూడో రౌండ్‌లో కఠినపరీక్ష ఎదురుకానుంది. మూడో రౌండ్‌లో తొమ్మిదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)తో వావ్రింకా తలపడతాడు. ఆర్థర్‌ గియాతో జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 11 ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 63 విన్నర్స్‌ కొట్టడంతోపాటు 69 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. నిర్ణాయక ఐదో సెట్‌ ‘సూపర్‌ టైబ్రేక్‌’లో వావ్రింకా పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. జొకోవిచ్‌ 399వ విజయం పురుషుల సింగిల్స్‌లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్‌లో సినెర్‌ 6–1, 6–4, 6–2తో జేమ్స్‌ డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. 10సార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–3, 6–2, 6–2తో ఫ్రాన్సిస్కో మెస్ట్రెలి (ఇటలీ)పై నెగ్గాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో జొకోవిచ్‌కిది 399వ విజయం. మరో మ్యాచ్‌లో గెలిస్తే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పురుషుల సింగిల్స్‌లో 400 విజయాలు నమోదు చేసుకున్న తొలి ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు సృష్టిస్తాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ ముసెట్టి (ఇటలీ) 6–3, 6–3, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా) 6–3, 6–2, 6–2తో స్వీనీ (ఆ్రస్టేలియా)పై, టేలర్‌ ఫ్రిట్జ్‌ 6–1, 6–4, 7–6 (7/4)తో విట్‌ కొప్రివా (చెక్‌ రిపబ్లిక్‌)పై, 12వ సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) 6–3, 7–5, 6–4తో మునార్‌ (స్పెయిన్‌)పై గెలిచారు. నిశేష్‌ నిష్క్రమణ వరుసగా రెండో ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో ఆడిన తెలుగు సంతతికి చెందిన అమెరికన్‌ ప్లేయర్‌ నిశేష్‌ బసవారెడ్డి పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో నిశేష్‌ 1–6, 4–6, 3–6తో 15వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరిన నిశేష్‌ 1 గంట 57 నిమిషాల్లో ఖచనోవ్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. 10 ఏస్‌లు సంధించిన నిశేష్, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 31 విన్నర్స్‌ కొట్టి, 37 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్‌ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు గెలిచిన నిశేష్‌ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. రెండో రౌండ్‌లో ఓడిన నిశేష్‌ కు 2,25,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 1 కోటీ 40 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ‘మిక్స్‌డ్‌’లో యూకీ జోడీ ఓటమి భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ యూకీ బాంబ్రీకి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో యూకీ (భారత్‌)–నికోల్‌ మెలిచార్‌ మారి్టనెజ్‌ (అమెరికా) ద్వయం 6–3, 1–6, 6–10తో ఆరో సీడ్‌ టిమ్‌ పుట్జ్‌ (జర్మనీ)–జాంగ్‌ షుయె (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.పదో సీడ్‌ బెన్‌చిచ్‌ అవుట్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో పదో సీడ్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) రెండో రౌండ్‌లో నిష్క్రమించగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా), రెండో ర్యాంకర్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌), మాజీ విజేత నయోమి ఒసాకా (జపాన్‌) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. బెన్‌చిచ్‌ 3–6, 6–0, 4–6తో క్వాలిఫయర్‌ నికోలా బర్తున్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడిపోయింది. కీస్‌ 6–1, 7–5తో ఆష్లిన్‌ క్రుగెర్‌ (అమెరికా)పై, స్వియాటెక్‌ 6–2, 6–3తో బుజ్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, ఒసాకా 6–3, 4–6, 6–2తో సొరానా కిర్‌స్టియా (రొమేనియా)పై నెగ్గారు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ అనిసిమోవా (అమెరికా) 6–1, 6–4తో సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, ఐదో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌) 7–5, 6–2తో వర్వరా గ్రాచెవా (ఫ్రాన్స్‌)పై, ఆరో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా) 6–0, 6–2తో మెకార్ట్‌నీ కెస్లెర్‌ (అమెరికా)పై గెలిచారు.

England lost the first ODI against sri lanka5
శ్రీలంక బోణీ

కొలంబో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన శ్రీలంక జట్టు తొలి వన్డేలో 19 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్‌ (117 బంతుల్లో 93 నాటౌట్‌; 11 ఫోర్లు) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోగా... జనిత్‌ లియనాగె (53 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తలా కొన్ని పరుగులు చేయడంతో లంక మంచి స్కోరు చేయగలిగింది. కమిల్‌ మిశ్రా (27), నిసాంక (21), కెపె్టన్‌ అసలంక (17), దునిత్‌ వెల్లలాగె (25 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ డకెట్‌ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్‌), జో రూట్‌ (90 బంతుల్లో 61; 5 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలతో పోరాడారు. ఈ ఇద్దరూ రాణించడంతో ఒక దశలో 129/1తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్‌... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (6), జాక్‌ క్రాలీ (6), జోస్‌ బట్లర్‌ (19), సామ్‌ కరన్‌ (5) విఫలమయ్యారు. జేమీ ఓవర్టన్‌ (17 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రేహాన్‌ అహ్మద్‌ (27; 5 ఫోర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. లంక బౌలర్లలో ప్రమోద్‌ 3 వికెట్లు పడగొట్టగా... దునిత్, జెఫ్రీ వండర్సె చెరో రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన దునిత్‌ వెల్లలాగెకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది.

India plays its second T20 against New Zealand today6
ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు...

రాయ్‌పూర్‌: న్యూజిలాండ్‌తో తొలి టి20లో ఘన విజయం తర్వాత భారత్‌ మరో విజయంపై గురి పెట్టింది. గత పోరులో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన జట్టు 2–0తో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు న్యూజిలాండ్‌ కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు షహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడియంలో రెండో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత్‌ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అక్షర్‌ పటేల్‌ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సామ్సన్, ఇషాన్‌లపై దృష్టి... తొలి టి20లో భారత బ్యాటర్లలో అభిõÙక్‌ శర్మ చెలరేగగా, సూర్యకుమార్‌ కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు పాండ్యా ప్రభావం చూపించగా... ఫినిషర్‌గా రింకూ సింగ్‌ తన పేరును నిలబెట్టుకున్నాడు. అయితే సామ్సన్, ఇషాన్‌ కిషన్‌ మాత్రమే ప్రభావం చూపలేకపోయారు. గిల్‌ను తప్పించడంతో టి20 టీమ్‌లో ఓపెనర్‌గా తన స్థానం చేసుకున్న సామ్సన్‌ అంచనాలకు తగినట్లుగా ఆడాల్సి ఉంది. అదే విధంగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్న ఇషాన్‌ కిషన్‌పై నమ్మకంతో మేనేజ్‌మెంట్‌ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది. ఒక్క మ్యాచ్‌లో వైఫల్యం సమస్య కాకపోయినా... చెత్త షాట్‌లతో వీరు వికెట్లు సమర్పించుకున్నారు. ఈసారి తప్పులు దిద్దుకునే అవకాశం వీరికి ఉంది. పేస్‌ బౌలింగ్‌లో మరోసారి అర్‌‡్షదీప్, బుమ్రా ప్రదర్శనపై జట్టు ఆధారపడి ఉండగా, పాండ్యా కూడా కీలక పాత్ర పోషిస్తాడు. స్పిన్నర్లుగా వరుణ్, అక్షర్‌ ప్రత్యర్థిపై పైచేయి సాధించగలరు. అయితే తొలి మ్యాచ్‌లో చేతికి గాయంతో బౌలింగ్‌ నుంచి తప్పుకున్న అక్షర్‌ ఆడకపోతే మరో స్పిన్నర్‌ బిష్ణోయ్‌కు చోటు లభించవచ్చు. తుది జట్టులోకి బ్రేస్‌వెల్‌! భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి సిరీస్‌ను సమం చేయాలని జట్టు ఆశిస్తోంది. టాప్‌–3 విఫలం కావడంతో జట్టును దెబ్బ తీసింది. వన్డే సిరీస్‌లో కూడా ఘోరంగా విఫలమైన కాన్వే ఇప్పటికైనా రాణించాలని టీమ్‌ కోరుకుంటోంది. రచిన్‌పై కూడా ప్రధాన బాధ్యత ఉండగా, రాబిన్సన్‌ దూకుడుగా ఆడగల సమర్థుడు. ఫిలిప్స్, చాప్‌మన్‌ మరోసారి కీలకం కానుండగా, వన్డే ఫామ్‌ను కొనసాగిస్తున్న మిచెల్‌ ఈ సారైనా జట్టును గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు. గాయంతో ఆల్‌రౌండర్‌ బ్రేస్‌వెల్‌ గత మ్యాచ్‌కు దూరం కావడం కివీస్‌ను బలహీనపర్చింది. అతను కోలుకొని ఈ సారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లలో క్లార్క్‌ను తప్పించి బ్రేస్‌వెల్‌ను ఆడించవచ్చు. ఇతర స్పిన్నర్లు సాంట్నర్, సోధి ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చూడాలి.తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్, సామ్సన్, ఇషాన్‌ కిషన్, పాండ్యా, దూబే, రింకూ సింగ్, అక్షర్‌/బిష్ణోయ్, అర్‌‡్షదీప్, వరుణ్, బుమ్రా. న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్‌), కాన్వే, రాబిన్సన్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, క్లార్క్‌/బ్రేస్‌వెల్, జేమీసన్, సోధి, డఫీ.పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌. ఈ మైదానంలో రెండేళ్ల క్రితం జరిగిన ఏకైక టి20లో ఆ్రస్టేలియాపై భారత్‌ గెలిచింది. మంచు ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి ఛేదన సులువు. ఇటీవల భారత్‌పై వన్డేలో దక్షిణాఫ్రికా 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Gujarat Giants win against UP Warriorz7
సోఫీ డివైన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

వడోదర: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో వరుసగా మూడు పరాజయాల తర్వాత గుజరాత్‌ జెయింట్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆరు మ్యాచ్‌ల తర్వాత మూడో విజయంతో ఆ జట్టు ప్రస్తుతం రెండో స్థానానికి చేరింది. గురువారం జరిగిన పోరులో గుజరాత్‌ 45 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సోఫీ డివైన్‌ (42 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ నమోదు చేసింది. అనంతరం యూపీ 17.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది.రాజేశ్వరి (3/16) ప్రత్యర్థిని పడగొట్టగా ... సోఫీ డివైన్, రేణుకా సింగ్‌ చెరో 2 వికెట్లు తీశారు. నేడు డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌లకు విరామం. శనివారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది.స్కోరు వివరాలు గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి) నవ్‌గిరే (బి) ఎకెల్‌స్టోన్‌ 38; డానీ వ్యాట్‌ (బి) క్రాంతి 14; అనుష్క (సి) శ్వేత (బి) క్రాంతి 14; గార్డ్‌నర్‌ (బి) దీప్తి 5; సోఫీ డివైన్‌ (నాటౌట్‌) 50; భారతి (రనౌట్‌) 5; కనిక (సి) నవ్‌గిరే (బి) ట్రయాన్‌ 6; కాశ్వీ (బి) ఎకెల్‌స్టోన్‌ 11; రేణుక (రనౌట్‌) 1; హ్యాపీ కుమారి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–23, 2–43, 3–65, 4–93, 5–105, 6–115, 7–131, 8–145. బౌలింగ్‌: క్రాంతి 4–0–18–2, శిఖ 4–0–53–0, దీప్తి 2–0–16–1, ఎకెల్‌స్టోన్‌ 4–0–22–2, ట్రయాన్‌ 4–0–32–1, శోభన 2–0–11–0. యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌: లానింగ్‌ (బి) కాశ్వీ 14; నవ్‌గిరే (స్టంప్డ్‌) మూనీ (బి) రేణుక 0; లిచ్‌ఫీల్డ్‌ (సి) రేణుక (బి) గార్డ్‌నర్‌ 32; హర్లీన్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) రేణుక 3; ట్రయాన్‌ (నాటౌట్‌) 30; దీప్తి (ఎల్బీ) (బి) రాజేశ్వరి 4; శ్వేత (స్టంప్డ్‌) మూనీ (బి) రాజేశ్వరి 3; శోభన (సి) గార్డ్‌నర్‌ (బి) రాజేశ్వరి 7; ఎకెల్‌స్టోన్‌ (సి అండ్‌ బి) డివైన్‌ 1; శిఖ (రనౌట్‌) 1; క్రాంతి (బి) డివైన్‌ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్‌) 108. వికెట్ల పతనం: 1–2, 2–39, 3–57, 4–59, 5–67, 6–79, 7–93, 8–94, 9–97, 10–108. బౌలింగ్‌: రేణుక 4–0–20–2, కాశ్వీ 3–0–31–1, డివైన్‌ 3.3–0–16–2, గార్డ్‌నర్‌ 3–0–23–1, రాజేశ్వరి 4–0–16–3.

Mumbai is on course for a huge score in the match against Hyderabad8
సర్ఫరాజ్, సిద్ధేశ్‌ సెంచరీలు

సాక్షి, హైదరాబాద్‌: సర్ఫరాజ్‌ ఖాన్‌ (142 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్‌ సిద్ధేశ్‌ లాడ్‌ (104; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) ‘శత’క్కొట్టారు. ఫలితంగా రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఓపెనర్లు అఖిల్‌ (27), ఆకాశ్‌ ఆనంద్‌ (35)లతో పాటు ముషీర్‌ ఖాన్‌ (11) విఫలమయ్యారు. 82/3తో కష్టాల్లో పడ్డ ముంబైను సిద్ధేశ్, సర్ఫరాజ్‌ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 249 పరుగులు జత చేశారు. తొలి రోజు ఆట ముగుస్తుందనగా సిద్ధేశ్‌ అవుటయ్యాడు. హిమాన్షు (0 బ్యాటింగ్‌)తో కలిసి సర్ఫరాజ్‌ క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్‌ బౌలర్లలో రోహిత్‌ రాయుడు రెండు వికెట్లు పడగొట్టగా... సిరాజ్, నితిన్‌ సాయి యాదవ్‌ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.

Tristan Stubbs And Ryan Rickelton added to South Africas squad, David Miller could miss T20 World Cup9
సౌతాఫ్రికా జట్టులోకి డేంజరస్‌ ప్లేయర్లు

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు ముందు సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా గాయాల కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్‌, ర్యాన్ రికెల్టన్ వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చారు.ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. టోనీ డి జోర్జి విషయానికి వస్తే.. గతేడాది ఆఖరిలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడికి కుడి కాలికి గాయమైంది. అతడు వరల్డ్‌కప్ సమయానికి కోలుకుంటాడని ప్రోటీస్ సెలక్టర్లు భావించారు. కానీ టోనీ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పడుతోంది. ఈ క్రమంలోనే అతడు పొట్టి ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. మరోవైపు సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో ఫెరీరా గాయ‌ప‌డ్డాడు. ప్రిటోరియా క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఫెరీరా(జోబ‌ర్గ్ సూప‌ర్ కింగ్స్‌) భుజం ఎముక విరిగింది. దీంతో అత‌డు కూడా ఈ మెగా టోర్నీకి అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రికెల్టన్‌, స్టబ్స్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.అదేవిధంగా ఈ మెగా టోర్నీ విధ్వంస‌కర ప్లేయ‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ కూడా దూర‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. మిల్ల‌ర్ ప్ర‌స్తుతం కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో వ‌ర‌ల్డ్‌క‌ప్ ముందు వెస్టిండీస్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు మిల్ల‌ర్ దూర‌మ‌య్యాడు. అత‌డిస్ధానంలో రూబెన్ హెర్మ‌న్‌కు చోటు ఇచ్చారు. టీ20 ప్రపంచకప్‌-2026కు సౌతాఫ్రికా జట్టుఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్‌, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్.వెస్టిండీస్‌తో టీ20లకు ప్రోటీస్‌ జట్టుఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్‌, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, హెర్మన్‌, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్.

Irfan Pathan Surprise Pick Team India T20I star for 2027 ODI WC plans10
ODI WC 2027: భారత వన్డే జట్టు.. ఊహించని పేరు!

టీమిండియా టీ20 ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు అతడు శుభారంభం అందించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు ఈ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌.1199 పరుగులుఈ మ్యాచ్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ శర్మ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా తరఫున ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఏడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 190.93 కావడం విశేషం.వరల్డ్‌కప్‌ -2027 జట్టులోనూ ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిషేక్‌ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. వరల్డ్‌కప్‌ -2027 జట్టులోనూ అతడికి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు.. ‘‘యాభై ఓవర్ల ప్రపంచకప్‌ టోర్నీ ఎంపిక సమయంలో అభిషేక్‌ శర్మ పేరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు.అయితే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి టీ20లలో మాదిరే వన్డే పవర్‌ప్లేలోనూ అభిషేక్‌ శర్మ సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా అభిషేక్‌ శర్మ ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు.రోహిత్‌- గిల్‌ జోడీఇక వన్డేల్లో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా ప్రస్తుత సారథి శుబ్‌మన్‌ గిల్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సన్నాహకంగా సాగుతున్న న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అభిషేక్‌ శర్మ ఇదే జోరు కనబరిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.ఇక గత కొంతకాలంగా వరుస సిరీస్‌ విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ ఈసారి కూడా హాట్‌ ఫేవరెట్‌గా వరల్డ్‌కప్‌ బరిలో దిగుతోంది. కాగా 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement