Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Ahmedabad, not Bengaluru to host IPL 2026 final1
ఐపీఎల్‌ ఫైనల్‌ పోయింది

బెంగళూరు: అనుకున్నట్లుగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్‌ ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ మరోచోటుకు మారింది. గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుందని బీసీసీఐ ప్రకటించడంతో బెంగళూరు క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నెల 31న మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్లు, చిన్న స్టేడియం కావడం తదితర కారణాలతో మార్చేసినట్లు బీసీసీఐ ప్రకటించడం గమనార్హం. ఇటీవల చిన్నస్వామిలో భద్రతా సమస్యలు తలెత్తాయి. గతంలో తీవ్ర తొక్కిసలాట జరిగి అనేకమంది చనిపోవడం తెలిసిందే. ఇటీవల ఆర్‌సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ సమయంలో సుమారు 240 కెమెరాలను పనిచేయలేదు.ఎమ్మెల్యేల టికెట్లకు లింకు లేదు: డీసీఎంఅహ్మదాబాద్‌లో పెద్ద స్టేడియం ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి అక్కడికి మార్చి ఉండవచ్చు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్ల పంపిణీకి, మ్యాచ్‌ మార్పునకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీసీసీఐ పెద్దలు అలాగే మాట్లాడనీ, సరైన సమాధానం ఇస్తానన్నారు.

Shreyas Iyer considered among the best captains of IPL2
శ్రేయస్‌ అయ్యర్‌ మరో టైటిల్‌ గెలిస్తే...

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో సారథిగా శ్రేయస్‌ అయ్యర్‌ రెండో టైటిల్‌ను గెలవగలిగితే అతను దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరతాడని భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జియో స్టార్‌ ‘అవుట్‌ ఆర్‌ నాటౌట్‌’ కార్యక్రమంలో అయ్యర్‌ నాయకత్వ లక్షణాలను అతను ప్రశంసించాడు. ‘శ్రేయస్‌ అయ్యర్‌ మరో సీజన్‌లో తన టీమ్‌ను సమర్థంగా నడిపిస్తున్నాడు. అతను ఢిల్లీ, కోల్‌కతా, పంజాబ్‌... ఎక్కడ కెప్టెన్‌గా చేసినా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శించాడు. తన ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచుతాడు. ప్రశాంతంగా తనకు కావాల్సింది రాబట్టగల సామర్థ్యం అతనికి ఉంది. మరో ట్రోఫీ గెలిస్తే ధోని, రోహిత్, గంభీర్‌ల సరసన శ్రేయస్‌ చేరతాడు’ అని ఇర్ఫాన్‌ వ్యాఖ్యానించాడు.

IPL 2026: SRH Take-Revenge Beating Punjab Kings By 33 Runs3
ప్రతీకార విజయం.. టేబుల్‌ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) పంజాబ్ కింగ్స్‌పై ప్రతీకార విజయం సాధించింది. బుధవారం సొంతగడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్‌) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో కమిన్స్‌, శివాంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, నితీశ్‌కుమార్‌, మలింగ, సాకిబ్ హుస్సేన్‌ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.ఇషాన్‌, క్లాసెన్ మెరుపులుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓపెనర్లు అభిషేక్‌, హెడ్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇషాన్‌కు క్లాసెన్ తోడవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల వరద పారింది. 55 పరుగులు చేసి ఇషాన్ ఔటైనా చివర్లో క్లాసెన్‌, నితీశ్‌రెడ్డిలు ధాటిగా ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్ 230 ప్లస్ స్కోరు సాధించింది.కొంపముంచిన టాపార్డర్‌..భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్ ఆర్యలు తక్కువ స్కోర్లకే వెనుదిరగడం, ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 5 పరుగులు చేసి ఔటవ్వడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ దశలో కూపర్ కన్నోలి, స్టోయినిస్‌లు కాసేపు వికెట్లు పతనం అడ్డుకున్నారు. స్టోయినిస్, సూర్యాంశ్ ఔటైనప్పటికీ కూపర్ కన్నోలీ ఆఖరిదాకా నిలిచి అజేయ సెంచరీతో రాణించినప్పటికీ లాభం లేకపోయింది.పట్టికలో ఫస్ట్‌ ప్లేస్‌కుఇది ఎస్‌ఆర్‌హెచ్‌కు ఏడో విజయం కాగా.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, మూడు ఓటమలు కలిపి 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.A win that takes the team to the 𝘁𝗼𝗽 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘁𝗮𝗯𝗹𝗲 🧡A comfortable 33-run victory at home that takes @Sunrisers to not just 2️⃣ more points but the first spot on the points table 👊🔥SCORECARD ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS pic.twitter.com/gjgBIMUhG0— IndianPremierLeague (@IPL) May 6, 2026

Abhishek-Travis Head Record Most Partnership Runs In IPL 20264
ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ల అరుదైన ఫీట్!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రికార్డుల మీద రికార్డులు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు అభిషేక్‌, హెడ్‌లు శుభారంభం ఇవ్వ‌గా.. ఆ త‌ర్వాత మిడిలార్డ‌ర్‌లో ఇషాన్ కిష‌న్‌, క్లాసెన్‌, నితీశ్ కుమార్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్‌ జంట ఒక అరుదైన ఫీట్‌ సాధించింది. ఈ సీజ‌న్‌లో అభిషేక్‌, ట్రావిస్ హెడ్ జంట 627 ప‌రుగులు సాధించింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌కు ఈ జంట 54 ప‌రుగులు జోడించ‌డం ద్వారా 600 ప్ల‌స్ మార్కును దాటింది. త‌ద్వారా ఒక సీజ‌న్‌లో 500కు పైగా ప‌రుగులు సాధించిన జోడీగా అభిషేక్‌-హెడ్ నిలిచారు. రెండో స్థానంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్‌-వైభ‌వ్ సూర్య‌వంశీ (457 ప‌రుగులు), గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌-సాయి సుద‌ర్శ‌న్ జంట (402 ప‌రుగులు) సాధించి మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు.More than 600 runs as a pair when no one else has gone past 500 😲Abhishek Sharma and Travis Head miles ahead of everyone else 👏#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/MAw6RNVxem— IndianPremierLeague (@IPL) May 6, 2026Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026

Heinrich Klaasen Scripts History Most 50-Plus Scores for SRH In IPL5
రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన క్లాసెన్‌

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 ప‌రుగులు సాధించిన క్లాసెన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు బాదిన క్రికెటర్ల జాబితాలో క్లాసెన్ చోటు సంపాదించాడు.ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున క్లాసెస్‌కు ఇది 14వ అర్థ‌శ‌త‌కం కాగా.. అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. 18 హాఫ్ సెంచ‌రీల‌తో కేన్ విలియ‌మ్స‌న్ మూడో స్థానంలో, 19 అర్థ‌శ‌త‌కాల‌తో శిఖ‌ర్ దావ‌న్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మొద‌టి స్థానంలో డేవిడ్ వార్న‌ర్ 42 అర్థ‌శ‌త‌కాల‌తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచాడు.అంతేకాదు క్లాసెన్ ఈ మ్యాచ్ ద్వారా మ‌రో రికార్డు కూడా సాధించాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి దాకా 5 హాఫ్ సెంచ‌రీలు బాది తొలి స్థానంలో నిలిచాడు. అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, కేఎల్ రాహుల్‌, సాయి సుద‌ర్శ‌న్‌, ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, అయ్య‌ర్‌లు నాలుగు హాఫ్ సెంచ‌రీలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.Finishing the innings with finesse 🤌🎥 Some delightful shots in the final over from Heinrich Klaasen to finish 69 (43) 👏👏Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/jbmQ02eo0h— IndianPremierLeague (@IPL) May 6, 2026 చదవండి: పంజాబ్ అంటేనే అభిషేక్‌కు పూన‌కం!

Abhishek Sharma BlockBuster Innings Vs Punjab Kings In IPL History6
పంజాబ్ అంటేనే అభిషేక్‌కు పూన‌కం!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రోసారి చెల‌రేగింది. తొలి అంచె పోటీలో అభిషేక్ మెరుపు సెంచ‌రీతో భారీ స్కోరు సాధించిన‌ప్ప‌టికీ ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ చేతిలో ఓట‌మి చ‌విచూసింది. అయితే రెండో అంచె పోటీలో భాగంగా సొంత‌గ‌డ్డ‌పై ఎలాగైనా పంజాబ్‌పై పైచేయి సాధించాల‌ని భావిస్తున్న ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ విధ్వంస‌కర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ పంజాబ్‌తో మ్యాచ్‌లో మ‌రోసారి చెల‌రేగాడు. పంజాబ్‌తో మ్యాచ్ అంటేనే పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా చెల‌రేగిపోతున్నాడు. మ్యాచ్‌లో ఎక్కువ సేపు నిల‌వ‌న‌ప్ప‌టికీ ఉన్నంత సేపు అభిషేక్ (13 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ద‌డ‌ద‌డ‌లాడించాడు. 👉 ఈ నేప‌థ్యంలో పంజాబ్‌పై గ‌త నాలుగు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. అభిషేక్ వ‌రుస‌గా 66, 141, 74, 35 ప‌రుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 200 ప్ల‌స్ స్కోరు సాధించ‌డం ఎస్ఆర్‌హెచ్‌కు ఇది ఎనిమిదోసారి. 👉ముంబై ఇండియ‌న్స్ కూడా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై ఎనిమిది సార్లు 200 ప్ల‌స్ స్కోర్లు సాధించ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 17 సిక్సర్లు కొట్టింది. ఐపీఎల్‌లో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్ అత్యధిక సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.👉 ఇక ఐపీఎల్‌లో 220 ప్లస్‌ స్కోరు చేయడం ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది పదోసారి. అయితే ఈ పదిసార్లు ఎస్‌ఆర్‌హెచ్‌నే విజయం వరించడం విశేషం.మ్యాచ్ విష‌యానికొస్తే.. ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్‌ సాధిస్తాడు’

Shreyas Iyer Might Pips-Dhoni-Gambhir-Rohit Legacy As IPL Captain7
‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్‌ సాధిస్తాడు’

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌, గౌత‌మ్ గంభీర్‌లు విజ‌య‌వంత‌మైన కెప్టెన్లుగా ముద్ర‌ప‌డ్డారు. ఇందులో ధోని, రోహిత్‌లు ఐదేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా.. గంభీర్ సార‌థ్యంలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తాజాగా వీరి స‌ర‌స‌న చేరేందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సిద్ధ‌మ‌వుతున్నాడు. 2024లో కేకేఆర్‌కు మూడోసారి టైటిల్ అందించిన శ్రేయ‌స్ ల‌క్కీ కెప్టెన్‌గా మారిపోయాడు. జ‌ట్లు మారిన‌ప్ప‌టికీ త‌న కెప్టెన్సీ, ఆట‌తీరుతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా అయ్య‌ర్ పేరు సంపాదించాడు. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌ను అయ్య‌ర్ విజేతగా నిల‌బెడితే ధోని, రోహిత్ శ‌ర్మ‌ను కూడా అధిగ‌మిస్తాడ‌ని మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. జియో హాట్‌స్టార్‌కు ఇంట‌ర్య్వూ ఇచ్చిన ప‌ఠాన్ మాట్లాడుతూ.. 'ధోని, రోహిత్‌, గంభీర్ వంటి అత్యుత్త‌మ ఐపీఎల్ కెప్టెన్ల‌ను దాటుకొని మ‌రీ తొలి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే ధోని, రోహిత్‌, గంభీర్‌లు ఒకే జ‌ట్టుకు టైటిల్స్ అందించారు. కానీ అయ్య‌ర్ మాత్రం ఇప్ప‌టికే కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు కూడా టైటిల్ అందిస్తే వేర్వేరు జ‌ట్ల‌కు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్‌గా అయ్య‌ర్ నిల‌వ‌నున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, కేకేఆర్‌, పంజాబ్ ఇలా మూడు వేర్వేరు జ‌ట్ల‌ను కూడా ఐపీఎల్‌లో ఫైన‌ల్ చేర్చిన ఘ‌న‌త అయ్య‌ర్ సొంతం. ఒక‌వేళ అయ్య‌ర్ ఈ సీజ‌న్‌లో అది సాధిస్తే మాత్రం అత‌డి రికార్డు చెరిగిపోనిదిగా మిగిలిపోతుంది' అని ప‌ఠాన్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు అద్భుత‌మైన ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న అయ్య‌ర్ 2020 సీజ‌న్‌లో ఆ జ‌ట్టును ర‌న్న‌ర‌ప్‌గా నిలిపాడు. ఆ త‌ర్వాత కేకేఆర్‌కు మారిన శ్రేయస్ అయ్యర్ 2024 సీజన్‌లో ఆ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. 2025 సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్ చేర్చిన అయ్యర్ 2026 సీజన్‌లోనూ ఆ జట్టును టైటిల్‌ దిశగా అడుగులు వేయిస్తున్నాడు. పంజాబ్ తరఫున 33 మ్యాచ్‌లు, ఢిల్లీ తరఫున 41 మ్యాచ్‌లు, కేకేఆర్ తరఫున 29 మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా పనిచేశాడు. అతని సక్సెస్ రేటు 90 శాతం ఉండడం గమనార్హం.చదవండి: ‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ‌!’

IPL 2026: Sunrisers Hyderabad Vs Punjab Kings Match Live Updates8
IPL 2026: పంజాబ్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ గెలుపు

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్‌) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్‌లు రెండు వికెట్లు తీయగా.. నితీశ్‌కుమార్‌, మలింగ, సాకిబ్ హుస్సేన్‌ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్‌ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 ప‌రుగులు చేసిన సూర్యాంశ్ క‌మిన్స్ బౌలింగ్‌లో అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవ‌ర్లు ముగిసేసరికి 5 వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగులుచేసింది.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్‌ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.శ్రేయ‌స్ (5) ఔట్‌.. మూడో వికెట్ డౌన్‌భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వ‌స్తోంది. 5 ప‌రుగులు చేసిన‌ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో ఔట్ అవ్వ‌డంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.పంజాబ్‌కు షాక్‌.. ఓపెన‌ర్లిద్ద‌రు ఔట్‌236 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో క‌మిన్స్ బౌలింగ్‌లో ఒక్క ప‌రుగు చేసిన ప్రియాన్ష్ ఆర్య మ‌లింగ‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 2వ ఓవ‌ర్ తొలి బంతికే నితీశ్ కుమార్ బౌలింగ్ ప్ర‌బ్‌సిమ్ర‌న్ (3) ఔట్ అయ్యాడు.పంజాబ్ టార్గెట్ 236 ప‌రుగులుఉప్ప‌ల్ వేదిక‌గా జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు.అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.క్లాసెన్ అర్థ‌సెంచ‌రీ.. ఎస్ఆర్‌హెచ్ 212-3పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు దిశ‌గా సాగుతోంది. 18 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. క్లాసెన్ అర్థ‌సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. నితీశ్‌కుమార్ (26) ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.అర్ధ శతకం బాది ఇషాన్‌ ఔట్‌ ఇషాన్‌ కిషన్‌ అర్ధ శతకం బాది ఔటయ్యాడు. 32 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. క్రీజులోకి నితీశ్‌ కుమార్‌ రెడ్డి వచ్చాడు. స్కోరు 174-3 (15 ఓవర్లలో)గా ఉంది.9 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 107-2పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 8వ ఓవర్లో వంద పరుగుల మార్క్‌ను దాటింది. 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇషాన్ (17), క్లాసెన్ (14) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌పంజాబ్‌తో మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న హెడ్ (38) చాహల్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.దంచికొడుతున్న హెడ్‌6 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (35) పంజాబ్ బౌల‌ర్ల‌ను ఉతికారేస్తున్నాడు. ఇషాన్ కిష‌న్ (7) ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.అభిషేక్ శర్మ (35) ఔట్‌పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతుల్లో 35 పరుగులతో దూకుడు ప్రదర్శించిన అభిషేక్ శర్మ ఫెర్గూసన్ బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.టాస్‌ పంజాబ్‌దేటాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజ‌ట్లు ఒక్కో మార్పుతో బ‌రిలోకి దిగాయి. ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వ‌గా.. పంజాబ్ జ‌ట్టులోకి శ‌శాంక్ సింగ్ తిరిగి వ‌చ్చాడు. ఈ సీజ‌న్‌లో తొలి అంచె పోటీలో ఎస్ఆర్‌హెచ్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ‌రి ఎస్ఆర్‌హెచ్ ప్ర‌తీకారం తీర్చుకుంటుందా లేదా అన్న‌ది చూడాలి. ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 25 సార్లు త‌ల‌ప‌డితే ఎస్ఆర్‌హెచ్ 17 సార్లు, పంజాబ్ 8 సార్లు నెగ్గింది. ఇక హైద‌రాబాద్‌లో పంజాబ్‌తో ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ 9 సార్లు నెగ్గితే.. పంజాబ్ ఒక‌సారి మాత్ర‌మే గెలిచింది.తుదిజ‌ట్లు:పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీప‌ర్‌), కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు: అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్

Babette de Leede to captain Netherlands in their maiden Women's T20 World Cup9
ప్రపంచ కప్‌ జట్టు ప్రకటన

తమ తొలి టీ20 ప్రపంచకప్‌ కోసం నెదర్లాండ్స్‌ మహిళల క్రికెట్‌ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా బాబెట్ డి లీడేను ఎంపికైంది. బాబెట్కు క్రికెట్ వారసత్వం ఉంది. ఆమె మామ టిమ్‌ డి లీడే, కజిన్ బాస్‌ డి లీడే ఇప్పటికే పురుషుల వరల్డ్ కప్‌లలో నెదర్లాండ్స్ తరఫున ఆడారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన బాబెట్‌ డి లీడే మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టుకు నాయకత్వం వహించనుండటం విశేషం.కాగా, మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌లోని వివిధ వేదికల్లో జరుగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. నెదర్లాండ్స్‌ జట్టు భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ లాంటి పటిష్టమైన జట్లు ఉన్న గ్రూప్‌-ఏలో ఉంది. ఈ జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అనంతరం భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌లతో ఆడనుంది. కాగా, నెదర్లాండ్స్‌ జట్టు ఈ ఏడాది నేపాల్‌లో జరిగిన గ్లోబల్ క్వాలిఫయర్‌లో కీలక విజయాలు సాధించి, తొలిసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.నెదర్లాండ్స్ జట్టు: బాబెట్ డి లీడే (సి), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్‌డిజ్క్, హన్నా లంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్‌హూయిస్, మిర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్‌బోర్, రాబిన్‌ రిజ్కే, రోస్లీ లారెన్స్‌, సాన్యా ఖురానా, సిల్వర్‌ సీగర్స్, స్టెర్రే కాలిస్

Thomas Cup Hero-Satwik Sairaj-Heartbroken By Lack Of Support10
‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ‌!’

బ్యాడ్మింట‌న్‌లో థామ‌స్ క‌ప్‌కు ఉండే ప్ర‌త్యేకత వేరు. చైనా, మ‌లేషియా, జ‌పాన్ లాంటి దేశాల్లో బ్యాడ్మింట‌న్ ఆట‌కు ఉన్న క్రేజ్ కూడా వేరు. భారత్‌లోనూ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, ల‌క్ష్య‌సేన్‌, కిడాంబి శ్రీకాంత్‌, డ‌బుల్స్ జోడి చిరాగ్‌-సాత్విక్ జోడి బ్యాడ్మింటన్‌లో అంచ‌నాలు అందుకుంటూ ప‌త‌కాలు సాధించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. అయినా కూడా భార‌త్‌లో క్రికెట్‌ను మిన‌హాయించి ఏ క్రీడ‌ను అంత‌గా ప‌ట్టించుకోరన్న‌ది చాలాసార్లు రుజువైంది. తాజాగా జ‌ర్మ‌నీ వేదిక‌గా జ‌రిగిన థామ‌స్ క‌ప్‌లో భార‌త పురుషుల బృందం కాంస్య ప‌త‌కం గెలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే థామస్ క‌ప్‌లో ప‌త‌కం సాధించి భార‌త్‌కు తిరిగి వ‌స్తే త‌మ‌ను క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోలేదంటూ భార‌త ఆట‌గాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌ర్మ‌నీ ఎయిర్‌పోర్టులో భారతీయులు ఉన్నా కూడా త‌మ ద‌గ్గ‌ర‌కు రాలేద‌ని, ఇక భార‌త్‌లో అయితే క‌నీసం త‌మ ముఖాలు కూడా చూడ‌లేద‌ని డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ బాధ‌ను వ్య‌క్తం చేశాడు. దేశానికి ప‌త‌కాలు సాధించినా త‌మ‌కు త‌గిన గుర్తింపు లేక‌పోవ‌డం ష‌ట్ల‌ర్లుగా త‌మ‌కు నిరాశ క‌లిగించింద‌న్నాడు. ఇలాంటి అవ‌మానాల‌తో భార‌త్‌లో బ్యాడ్మింట‌న్ వంటి క్రీడ‌ను వృత్తి ప‌రంగా కొన‌సాగించాలా వ‌ద్దా అనేది ఆలోచించుకునే ప‌రిస్థితిలో ఉన్న‌ట్లు తెలిపాడు. సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ.. ‘జ‌ర్మ‌నీ నుంచి ఏడు గంట‌ల పాటు విమాన ప్ర‌యాణం చేసి హైద‌రాబాద్ చేరుకున్నాం. మేము జ‌ర్మ‌నీ ఎయిర్‌పోర్టులో ఉన్న‌ప్పుడు మా కాంస్య‌ ప‌త‌కాలు చూసిన కొంద‌రు.. ఎవ‌రు మీరు, ఎక్క‌డి నుంచి వ‌చ్చారు అని అడ‌గ‌లేదు. అందులో భార‌తీయుల‌తో పాటు చాలా మంది తెలుగువాళ్లు కూడా ఉన్నారు. మేమంతా థామ‌స్ క‌ప్ జెర్సీలు ధ‌రించి ఉన్న‌ప్ప‌టికీ, వాళ్లంతా ఐపీఎల్‌, రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. 2022లో ఇదే థామ‌స్ క‌ప్‌లో స్వ‌ర్ణం సాదించిన‌ప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఇలాంటి ఘ‌న‌తలు సాధించిన‌ప్పుడు సంబ‌రాలు చేసుకోవాలి. ఇలాంటి అవ‌కాశాలు త‌ర‌చూ రావ‌ని మ‌న అభిమానుల‌కు తెలియ‌డం లేదు. థామ‌స్ క‌ప్ గెల‌వ‌డం చాలా క‌ష్టం, ప‌త‌కాలు సాధించ‌డం కూడా క‌ష్ట‌త‌రం. ఎయిర్‌పోర్టులో దిగిన త‌ర్వాత ప్ర‌ణ‌య్‌, శ్రీకాంత్‌, ధ్రువ్ క్యాబ్‌లు బుక్ చేసుకోవ‌డం చూశాను. అభినందించ‌డానికి ఒక్క‌రు కూడా మా ద‌గ్గ‌రికి రాలేదు. నా స్నేహితులు న‌న్ను పిక్ చేసుకునేందుకు వ‌చ్చారు. కానీ ఎయిర్‌పోర్ట్‌లో నా స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు క్యాబ్‌లు బుక్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు సాగించ‌డం బాధ‌గా అనిపించింది. టోర్నీల్లో బరిలోకి దిగి గాయపడితే.. మన బదులు ఆడేందుకు ఎవరూ ఉండరు. టీమ్ ఈవెంట్స్‌లోనూ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. బయట నుంచి పెద్దగా సపోర్ట్ లేకుండా ఆడతాం. పతకాలు గెలిచినా సరిపోవడం లేదు. ఓ సందర్భంలో ప్రణయ్‌తో.. 'ఈ క్రీడకు ఎలాంటి గుర్తింపులేదు. నేను నా పిల్లలను బ్యాడ్మింటన్ వైపు రానివ్వను' అని చెప్పా. మానసికంగా దృఢంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే మనం ఎంత ప్రదర్శన చేసినా గుర్తించకపోతే చాలా బాధేస్తుంది. హైదరాబాద్ అకాడమీలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం వరకే ఆశిస్తున్నాం’అని సాత్విక్ బాధాతప్త హృదయంతో వెల్లడించాడు.చదవండి: పాక్‌తో ఆడేది లేదు.. వాళ్ల‌కు మాత్రం మిన‌హాయింపు!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement