ప్రధాన వార్తలు
'ఎంత మంది వచ్చినా అతడే నా ఫేవరేట్ కెప్టెన్'
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కోల్కతా నైట్రైడర్స్కు కెప్టెన్గా మూడో టైటిల్ను అందించిన శ్రేయస్ అయ్యర్.. గతేడాది పంజాబ్ కింగ్స్ను రన్నరప్గా నిలిచాడు. ఐపీఎల్-2026లో కూడా పంజాబ్ను అయ్యర్ విజయపథంలో నడిపిస్తున్నాడు.ఈ ఏడాది సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి రెండు విజయాలను నమోదు చేసింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్పై ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2019 నుండి జట్టుతో ఉన్న ప్రభ్సిమ్రాన్.. గత ఏడేళ్లలో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజ కెప్టెన్ల నాయకత్వంలో ఆడాడు. కానీ తన ఫేవరేట్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ప్రభ్సిమ్రాన్ ఎంచుకున్నాడు.శ్రేయస్ అయ్యర్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటాడు. నేను కొన్ని మ్యాచ్లలో సరిగ్గా ఆడకపోయినప్పటికి, శ్రేయస్ నా దగ్గరకు వచ్చి ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని చెప్పేవాడు. నా ఆట నన్ను ఆడమని మద్దతు ఇచ్చేవాడు. అందుకే నా దృష్టిలో అతడే బెస్ట్ కెప్టెన్. అయ్యర్ నన్ను ఒక సీనియర్ ప్లేయర్గా చూశేవాడు. జట్టు వ్యూహాల్లో భాగం చేయడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ప్రభ్సిమ్రాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’
ఆస్ట్రేలియా ప్లేయర్ షాకింగ్ నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మోసస్ హెన్రిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో అతను ఆస్ట్రేలియాను వదిలి పోర్చుగల్కు వలస వెళ్లనున్నాడని సమాచారం. ఈ విషయాన్ని పోర్చుగల్ క్రికెటర్ సిరాజ్ ఉల్లా ఖదెమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా లీక్ చేశాడు. త్వరలో మన జట్టులో ఓ బిగ్బాష్ లీగ్ ప్లేయర్ జాయిన్ కాబోతున్నాడని హింట్ ఇచ్చాడు.హెన్రిక్స్ పోర్చుగల్కు మకాం మార్చడానికి ఓ ప్రధాన కారణముంది. అతనికి ఆస్ట్రేలియా జట్టు తరఫున అవకాశాలు రావడం లేదు. స్టోయినిస్, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్ల వల్ల అతని అవకాశాలు కనుమరుగయ్యాయి. పైగా అతని వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. వయసు కూడా అతనికి అడ్డంకిగా మారింది. దీంతో అతను తన స్వస్థలమైన పోర్చుగల్కు మారాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. హెన్రిక్స్కు ఆస్ట్రేలియాతో పాటు పోర్చగల్ పౌరసత్వం కూడా ఉంది.హెన్రిక్స్ 1989లో పోర్చుగల్లో జన్మించాడు. అతడి తండ్రి ఆల్వారో ఓ ప్రొఫెషనల్ ఫుట్బాలర్. చిన్న వయసులోనే హెన్రిక్స్ కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. 2013లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన హెన్రిక్స్ 4 టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హెన్రిక్స్ అంతర్జాతీయ కెరీర్లో 636 పరుగులు చేసి, 17 వికెట్లు సాధించాడు. బిగ్బాష్ లీగ్లో హెన్రిక్స్కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. సిడ్నీ సిక్సర్స్ తరఫున 3324 పరుగులు చేసి, రెండు టైటిల్స్ (2019/20, 2020/21) గెలిపించాడు. అసోసియేట్ దేశాలు అంతర్జాతీయ క్రికెట్లో బలంగా ఎదుగుతున్న తరుణంలో హెన్రిక్స్ లాంటి ఆటగాడు పోర్చుగల్కు వలస వెళ్లడం ఆ దేశ క్రికెట్ తలరాతనే మార్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లో ఇటలీ లాంటి చిన్న జట్టు అద్భుతాలు చేసి, ప్రపంచ దృష్టిని ఆకర్శించిన విషయం విధితమే.అసోసియేట్ జట్లలో చేరిన ప్రముఖ క్రికెటర్లు- ఉన్ముక్త్ చంద్ (భారత్) – యూఎస్ఏ - రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే – నెదర్లాండ్స్ - కోరె ఆండర్సన్ – యూఎస్ఏ - డేవిడ్ వీస్ – నమీబియా - వేన్ మాడ్సన్ – ఇటలీ - రాస్ టేలర్ – సమోవా
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఐసీసీ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ (2007)లో భారత్ గెలవడంలో ఈ ఆల్రౌండర్ది కీలక పాత్ర.అదే విధంగా.. సొంతగడ్డపై భారత్ వన్డే వరల్డ్కప్-2011 టైటిల్ గెలవడంలో యువీదే ముఖ్య భూమిక. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అద్భుత ప్రదర్శన కారణంగా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత టీమిండియా మరోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో యువీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.ఆటకే ప్రాధాన్యంఅయితే, ఇంతటి సంతోషకర సమయంలోనే ఓ చేదు వార్త యువరాజ్ సింగ్కు తెలిసింది. తనకు క్యాన్సర్ సోకిందనే విషయం బయటపడింది. అదే సమయంలో టెస్టు జట్టులో యువీకి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కంటే ఆటకే ప్రాధాన్యం ఇవ్వాలని అతడు భావించాడు. అయితే, డాక్టర్ హెచ్చరికల తర్వాత యువీ తన నిర్ణయాన్ని మార్చుకోకతప్పలేదు.అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న యువరాజ్ సింగ్.. మహమ్మారిని జయించి యువరాజ్ సింగ్ మరికొన్నేళ్లు క్రికెటర్గా కొనసాగాడు. అయితే, చేదు అనుభవాల గురించి అతడు తాజాగా మనసు విప్పాడు. ‘‘ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకున్న వేళ ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోతున్నట్లు అనిపించింది.అప్పుడు మేము ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంగూలీ రిటైర్ అయిన కారణంగా నాకు టెస్టు జట్టులో అప్పుడే చోటు దక్కింది. ఏడేళ్ల నిరీక్షణ ఫలించబోతున్న తరుణం. నేను చచ్చిపోయినా పర్లేదు.. ఆ స్థానం నాకు కావాల్సిందే అని మనసులో గట్టిగా అనుకున్నాను.ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చుఅయితే, అప్పుడు డాక్టర్ నితేశ్ రోహత్గి నాకో భయంకర నిజం చెప్పారు. ‘నీ గుండె, ఊపిరి తిత్తులకు మధ్య ట్యూమర్ ఉంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్లి క్రికెట్ ఆడితే గుండెపోటు వచ్చినా రావొచ్చు. కీమోథెరపీ ఇప్పుడు గనుక మొదలుపెట్టకపోతే ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం’ అని కుండబద్దలుకొట్టేశారు.అప్పుడే నాకు సమస్య తీవ్రత అర్థమైంది. అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్నా. నేనిక ఆడలేను అన్న బాధ మానసికంగా నన్ను కుంగదీసింది. కానీ అసలు క్రికెట్ లేకపోతే నేనెవరిని? నా గుర్తింపు ఏమిటి? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పుడు పాత క్రికెట్ వీడియోలు చూస్తూ స్ఫూర్తి పొందేవాడిని.ముందు ఆరోగ్యంమీద శ్రద్ధ పెట్టునేను అమెరికాలో ఉన్నపుడు అనిల్ కుంబ్లే వచ్చాడు. లాప్టాప్లో మ్యాచ్లు చూస్తుంటే.. ‘ముందు ఆరోగ్యంమీద శ్రద్ధ పెట్టు. ఇవన్నీ పక్కన పెట్టు’ అని మందలించాడు. ఇంగ్లండ్లో ఉన్నపుడు సచిన్ పాజీ వచ్చి ‘నువ్వు త్వరలోనే కోలుకుని తిరిగి వస్తావు’ అని ధైర్యం నింపాడు’’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్తో యూట్యూబ్ చాట్లో యువీ పంచుకున్నాడు.చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్ తన మొదటి నిర్ణయంతోనే సంచలనం సృష్టించాడు. తమీమ్ తన తొలి సంతకాన్ని క్రికెటర్ల జీతాల పెంపు ఫైల్పై చేసి, వారి జీవితాల్లో ఆనందాలు నింపాడు. గతంలో ఏ అధ్యక్షుడు క్రికెటర్ల జీతాల గురించి పట్టించుకోలేదన్న వాదన ఉంది. తమీమ్ అధ్యక్షుడు కాగానే జీతాలు పెరగడంతో క్రికెటర్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బాస్ అంటే ఇలా ఉండాలంటూ పలువురు క్రికెటర్లు సోషల్మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.ఏప్రిల్ 7న బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్వ బోర్డును రద్దు చేసి, తమీమ్ను 11 మంది సభ్యులతో కూడిన అడ్–హాక్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించింది. 37 ఏళ్ల వయసులోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించాడు. తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరన్న విషయం తెలిసిందే.మహిళా క్రికెటర్లకు భారీ ఊరట తమీమ్ మొదటి నిర్ణయం బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్లకు భారీ ఊరట కలిగించింది. గతంలో కొందరు స్థానిక క్రికెటర్లు కేవలం 1000 టాకాలు (రూ. 749.69) మాత్రమే జీతంగా పొందేవారు. తమీమ్ తాజా నిర్ణయంతో ఇప్పుడు వారి జీతాలు టీ20 మ్యాచ్కు 10000 టాకాలు, 50 ఓవర్ల మ్యాచ్కు 15000 టాకాలు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు 20000 టాకాలుగా మారాయి. టాప్ 36 మహిళా క్రికెటర్ల జీతాలు సైతం గణనీయంగా పెరిగాయి. గతంలో 30000 టాకాలుగా ఉండిన వారి నెల జీతం ఇప్పుడు 40000 టాకాలకు పెరిగింది. ఈ పెంపు మహిళా క్రికెటర్లకు ఆర్థిక భరోసా కలిగించడంతో పాటు ప్రోత్సాహం కూడా అందించింది. పురుష క్రికెటర్లకు జాక్పాట్తమీమ్ నిర్ణయంతో బంగ్లాదేశ్ పురుషు క్రికెటర్లకు జాక్పాట్ తగిలనట్లైంది. గతంలో గ్రేడ్ ఏ, బీ, సీ కేటగిరిల్లో ఉండే ఆటగాళ్లకు కేవలం 35000 టాకాలు జీతంగా అందేది. ఇప్పుడు గ్రేడ్ల వారీగా విభజన జరిగి, గ్రేడ్ సి ఆటగాళ్లకు 40000 టాకాలు, గ్రేడ్ బి ఆటగాళ్లకు 50000 టాకాలు, గ్రేడ్ ఏ ఆటగాళ్లకు 65000 టాకాలు జీతంగా నిర్ణయించబడింది. అలాగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఫీజు 75000 టాకాల నుంచి 100000 టాకాలకు పెరిగింది. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని తమీమ్ ప్రకటించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఇన్నేళ్లుగా జీతాల్లో పెద్ద మార్పులు జరగలేదు. కష్టపడి ఆడే ఆటగాళ్లకు న్యాయమైన వేతనం ఇవ్వడం మా లక్ష్యమని అన్నారు.
బాంబు పేల్చిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, తన అంతర్జాతీయ కెరీర్పై ఆసక్తికర ప్రకటన చేశాడు. నిన్న (ఏప్రిల్ 8) ఢిల్లీ క్యాపిటల్స్పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (3-17) చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన అతను.. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చి బాంబు పేల్చాడు.మ్యాచ్ అనంతరం రషీద్ మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా నేను ఆడాను. గతేడాది జింబాబ్వేపై ఓ టెస్ట్ మ్యాచ్లో 67 ఓవర్లు వేశాను. ఈ చర్య నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. నేను ఓ టెస్ట్ మ్యాచ్లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇకపై టెస్ట్లు ఆడే సాహసం చేస్తే, ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగలేనని హెచ్చరించినట్లు వెల్లడించాడు. కాగా, రషీద్ ఖాన్ 2023 నుంచి వెన్ను గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. శస్త్రచికిత్స కూడా జరిగింది. వైద్యులు రెడ్బాల్ క్రికెట్ ఆడొద్దని స్పష్టంగా సూచించారు. అయినా రషీద్ గతేడాది జింబాబ్వేపై టెస్ట్ మ్యాచ్ ఆడి ఏకంగా 67 ఓవర్లు వేశాడు. ఈ నిర్ణయం అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. రషీద్ 2023 వన్డే వరల్డ్ కప్ కోసం శస్త్రచికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆతర్వాత యూకేలో సర్జరీ చేయించుకున్నాడు. 2024లో తిరిగి వచ్చాడు. వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే అతను తిరిగి గాడిలో పడ్డాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు. బ్యాట్తోనూ పర్వాలేదనిపించాడు. రషీద్ టెస్ట్ కెరీర్ను పరిశీలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 2017లో టెస్ట్ హోదా పొందినప్పటి నుంచి 12 మ్యాచ్లు ఆడగా, రషీద్ కేవలం 6 టెస్ట్ల్లో మాత్రమే పాల్గొన్నాడు. చివరిసారి అతను 2025లో జింబాబ్వేపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో 67 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. మొత్తంగా రషీద్ తన టెస్ట్ కెరీర్లో 6 మ్యాచ్ల్లో 45 వికెట్లు తీశాడు.
కన్నీళ్లు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 8) జరిగిన ఉత్కంఠ సమరంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఢిల్లీని గెలిపించేందుకు డేవిడ్ మిల్లర్ చివరి బంతి వరకు పోరాడి విఫలమయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన తరుణంలో మిల్లర్ సింగిల్కు నిరాకరించడం కీలక తప్పిదంగా మారింది. Backing our Tiger, always 🫂💙 pic.twitter.com/pAFouiVmVH— Delhi Capitals (@DelhiCapitals) April 9, 2026ఆఖరి బంతిని మిస్ చేయడంతో కుల్దీప్ యాదవ్ రనౌటయ్యాడు. దీంతో ఢిల్లీ పరుగు తేడాతో పరాజయంపాలైంది. అంతకుముందు ఓవర్లో (19) 23 పరుగులు బాది ఢిల్లీని గెలుపుకు చేరువ చేసింది కూడా మిల్లరే. ఇంత చేసి చివరికి మ్యాచ్ గెలిపించలేకపోవడంతో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. బాధపడుతున్న మిల్లర్ను కెప్టెన్ అక్షర్ పటేల్, హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ ఓదార్చారు. మిల్లర్ భావోద్వేగ క్షణాలను డీసీ తమ సోషల్మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసింది. “Backing our Tiger, always 💙” అంటూ మిల్లర్కు మద్దతు తెలిపింది. ఇది నాణేనికి ఒకవైపు.. మరోవైపు, కొందరు సొంత అభిమానులే మిల్లర్ను తిట్టిపోశారు. 19వ ఓవర్ ఐదో బంతిలో సింగిల్ తీసుంటే కనీసం సూపర్ ఓవర్కి అవకాశం ఉండేది. తప్పంతా మిల్లర్దే అంటూ సోషల్మీడియాలో దుమ్మెత్తిపోశారు. అంత అతి విశ్వాసం పనికి రాదంటూ మిల్లర్కు చీవాట్లు పెట్టారు.నాణేనికి అటు ఇటు ఉన్న విషయాలను పక్కన పెడితే, మిల్లర్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఆ సందర్భంలో అనుభవమున్న ఏ బ్యాటర్ అయినా అలాగే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇలా మిస్ ఫైర్ అవడం సహజమే. ఇందులో మిల్లర్ను నిందించాల్సిన అవసరం లేదు.ఎవరు ఔనన్నా, కాదన్నా ఈ సీజన్లో ఢిల్లీ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. తాజాగా గుజరాత్ చేతిలో ఓటమి మినహా, ఈ సీజన్లో ఆ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. వరుసగా లక్నో, ముంబై ఇండియన్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా ఓటమి తర్వాత కూడా మెరుగైన రన్రేట్ కలిగి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ హైలైట్స్ - GT 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.- గిల్ (70), బట్లర్ (52), సుందర్ (55) అర్ద సెంచరీలతో రాణించారు. - ఛేదనలో DC ఓపెనర్లు కేఎల్ రాహుల్ (92), నిస్సంక (41) చెలరేగి ఆడారు. - గాయపడిన చేతితో డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్) చివరి బంతి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీని గెలిపించలేకపోయాడు. - రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 3/17తో DC మిడిలార్డర్ను కుదిపేశాడు.
IPL: అత్తా- కోడళ్ల సీరియల్స్ చూసేవాళ్లే కావాలి!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా ప్రాచుర్యం పొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). భారత్లో టీ20 ఫార్మాట్లో 2008లో మొదలైన ఈ టోర్నీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఐపీఎల్ ప్రసార హక్కులు రూ. 40 వేల కోట్లకు పైగా అమ్ముడుపోవడం ఈ లీగ్కు ఉన్న ఆదరణకు నిదర్శనం. అయితే, ఆరంభంలో ఐపీఎల్ ప్రసారాలకు అసలు బ్రాడ్కాస్టర్లే దొరకలేదట.ప్రతి చోటా ‘నో’ అనే సమాధానమే దాదాపు వెయ్యి మంది వ్యాపారవేత్తలు ఐపీఎల్ ఐడియాను తిరస్కరించారట. ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్, ఆర్థిక నేరగాడు లలిత్ మోదీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘అప్పట్లో బ్రాడ్కాస్టర్లందరి దగ్గరికి మేము వెళ్లాము. కానీ ఒక్కరు కూడా మా మాట వినలేదు.ప్రతి ఒక్కరి నుంచి ‘నో’ అనే సమాధానమే వచ్చేది. దాదాపు వెయ్యి మంది వ్యాపారవేత్తలకు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. అందులో 90 శాతం మందికి అసలు నేనేం చెబుతున్నానో అర్థమయ్యేదే కాదు. అప్పుడు నేను తీవ్రంగా ఆలోచించాను.అత్తా-కోడళ్ల సీరియళ్లు చూసేవారిని మళ్లించాలిటీవీలో వచ్చే అత్తా-కోడళ్ల సీరియళ్లు చూసే ప్రేక్షకులను టార్గెట్ చేయాలనుకున్నా. అక్కడే మనం ఊహించనంత డబ్బు ఉంటుంది. నిజానికి భారత ప్రచార మార్కెట్లో ఎనిమిది గంటల స్లాట్ అత్యంతముఖ్యమైనది.కాబట్టి నైట్ క్రికెట్ వైపు మొగ్గుచూపితే బాగుంటుందనిపించింది. సంగీతం, డ్యాన్సులతో ఎనిమిది గంటలకు మ్యాచ్ ఆరంభించాలనే నిర్ణయానికి వచ్చాము. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల్ని ఆకర్షించడం మా ప్రధాన ఉద్దేశం. ఈ ప్రేక్షకుల వల్లే డబ్బు ఎక్కువగా వస్తుంది.భారత్ పాకిస్తాన్ను చిత్తు చేయడంతోఇక మొట్టమొదటి, టీ20 ప్రపంచకప్-2007 ఫైనల్లో భారత్ పాకిస్తాన్ను చిత్తు చేయడం మాకు కలిసి వచ్చింది. టీమిండియా ఆటగాళ్లను హీరోలుగా కీర్తిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేశాము. వారిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. ఐపీఎల్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇది కూడా బాగా ఉపయోగపడింది’’ అని లలిత్ మోదీ స్పోర్ట్స్టార్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!
బుమ్రాపై వైభవ్ సూర్యవంశీ కామెంట్ వైరల్
టీమిండియా ప్రధాన పేసర్, ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన శైలితో రాణిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు బుమ్రా. అతడు బంతితో రంగంలోకి దిగాడంటే దిగ్గజ బ్యాటర్లు సైతం వణికిపోవాల్సిందే.అయితే, రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ మాత్రం బుమ్రాను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అతడికి ఏకంగా సిక్సర్తో స్వాగతం పలికి ఔరా అనిపించాడు. ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్- రాజస్తాన్ రాయల్స్ మంగళవారం తలపడ్డాయి.తొలి బంతికే సిక్సర్ ఈ మ్యాచ్లో వైభవ్- బుమ్రా ఫైట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. బుమ్రా బౌలింగ్లో తొలి బంతికే సిక్సర్ బాదిన వైభవ్.. అతడి ఓవర్లో మరో సిక్స్ కూడా రాబట్టాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ తీరుపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ బుమ్రాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ముంబైపై విజయానంతరం రాయల్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో బుమ్రాను ఎదుర్కొన్న అనుభవం ఎలా ఉందన్న ప్రశ్నకు బదులిస్తూ..గొప్పగా ఫీలవ్వడానికి ఏమీ లేదు‘‘ఇందులో నేనేమీ గొప్పగా ఫీలవ్వడానికి ఏమీ లేదు. బౌలర్ కంటే కూడా బంతిపైనే ఎక్కువగా దృష్టి పెట్టేందుకు నేను ఎల్లవేళలా ప్రయత్నిస్తాను. అయితే, బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ ఎదురుగా ఉండటం వల్ల కాస్త గాబరాగానే అనిపించింది.అయితే, నా అలవాటుకు తగ్గట్లే బంతిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అనుకున్న ఫలితం రాబట్టగలిగాను’’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. కాగా ముంబైతో మ్యాచ్లో వైభవ్ 14 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో రాజస్తాన్ ముంబైపై 27 పరుగుల తేడాతో గెలిచింది.చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే! View this post on Instagram A post shared by Rajasthan Royals (@rajasthanroyals)
‘మిల్లర్ తప్పేమీ లేదు.. కుల్దీప్ స్ట్రైక్ తీసుకుంటే బాగుండేది’
టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మిల్లర్ తప్పేమీ లేదంటూ అతడికి మద్దతుగా నిలిచాడు. ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం మంచిదే అయినా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తప్పవని.. మిల్లర్ విషయంలోనూ ఇదే జరిగిందన్నాడు.ఐపీఎల్-2026లో భాగంగా ఢిల్లీ- గుజరాత్ బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడ్డా.. డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41*) విజయంపై ఆశలు పెంచాడు.ఒక్క పరుగు తేడాతోఈ ఐదో నంబర్ బ్యాటర్ ధనాధన్ దంచికొడుతూ ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకువచ్చాడు. అయితే, చివరి ఓవర్లో గుజరాత్ బౌలర్ ప్రసిద్ కృష్ణ రంగంలోకి దిగగా.. విప్రాజ్ నిగమ్ తొలి బంతికి సిక్స్ బాది మరుసటి బంతికి అవుటయ్యాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైక్ మిల్లర్కు ఇవ్వగా.. నాలుగో బంతికి అతడు సిక్సర్ బాదాడు.చివరి రెండు బంతుల్లో విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. మిల్లర్ సింగిల్కు నిరాకరించాడు. ఆఖరి బంతికి తానే హిట్టింగ్ ఆడాలని భావించగా.. ప్రసిద్ షార్ట్ బాల్తో బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో సింగిల్ తీసేందుకు మిల్లర్ ప్రయత్నించగా.. కుల్దీప్ స్ట్రైకర్ వైపునకు వచ్చే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.అతడి తప్పేమీ లేదుఈ నేపథ్యంలో మిల్లర్పై విమర్శలు వస్తుండగా.. భారత దిగ్గజ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాత్రం మద్దతుగా నిలిచాడు. "నిజానికి మిల్లర్ విన్నింగ్ రన్స్ తానే తీయాలని భావించాడు. అయితే, ఆఖరి ఓవర్లో కుల్దీప్ తాను ఎదుర్కొన్న తొలి బంతి ద్వారా సింగిల్ తీసిన తీరును మిల్లర్ గుర్తుంచుకోవాల్సింది.కుల్దీప్నకు స్ట్రైక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అయితే, గత ఓవర్లో తాను సిక్సర్ బాదిన విషయాన్ని మనసులో పెట్టుకుని.. ఈసారి కూడా అదే పునరావృతం చేయగలనని మిల్లర్ విశ్వసించాడు. ఇందులో అతడి తప్పేమీ లేదు. కానీ ప్రసిద్ కృష్ణ అద్భుత బంతి సంధించి మిల్లర్ ఆశలపై నీళ్లు చల్లాడు’’ అని గావస్కర్ పేర్కొన్నాడు. చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026
శుబ్మన్ గిల్కు ‘ఊహించని’ షాక్!
గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2026 టోర్నీలో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం నాటి మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఢిల్లీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్) చేసిన పొరపాటు టైటాన్స్ నెత్తిన పాలు పోసింది. ఫలితంగా ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో టైటాన్స్ను విజయం వరించింది.ధనాధన్సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన ఢిల్లీ.. గుజరాత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్లు నష్టపోయి 210 పరుగులు సాధించింది. శుబ్మన్ గిల్ (45 బంతుల్లో 70) కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరవగా.. జోస్ బట్లర్ (27 బంతుల్లో 52), వాషింగ్టన్ సుందర్ (32 బంతుల్లో 55) ధనాధన్ దంచికొట్టారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగుల వద్ద నిలిచిపోయింది. పాతుమ్ నిస్సాంక (24 బంతుల్లో 41), కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92), మిల్లర్ ఇన్నింగ్స్ వృథా అయ్యాయి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ రెండు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.శుబ్మన్ గిల్కు ఊహించని షాక్అయితే, గెలుపు జోష్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీతో మ్యాచ్లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.‘‘ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు జరిమానా విధించడమైనది. ఈ సీజన్లో ఇదే అతడి తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెడుతున్నాము’’ అని ఐపీఎల్ పాలక మండలి ప్రకటనలో పేర్కొంది. చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026
పాపం.. గర్ల్ఫ్రెండ్ చేసిన పనికి సిన్నర్ ఏమవుతాడో!
ప్రస్తుతం టెన్నిస్లో జానిక్ సిన్నర్, కార్లోస్ అ...
ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
గ్రనాడా (స్పెయిన్): రైఫిల్, పిస్టల్ ప్రపంచకప్ ...
భారత రెజ్లర్ లలిత్కు రజత పతకం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా రెజ్లింగ్ చాంపి...
ఫైనల్లో జైస్మీన్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్...
IPL: అత్తా- కోడళ్ల సీరియల్స్ చూసేవాళ్లే కావాలి!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా ప్రాచుర్యం పొంది...
బుమ్రాపై వైభవ్ సూర్యవంశీ కామెంట్ వైరల్
టీమిండియా ప్రధాన పేసర్, ముంబై ఇండియన్స్ బౌలర్ జ...
‘మిల్లర్ తప్పేమీ లేదు.. కుల్దీప్ స్ట్రైక్ తీసుకుంటే బాగుండేది’
టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఢిల్లీ క్యాపిట...
శుబ్మన్ గిల్కు ‘ఊహించని’ షాక్!
గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2026 టోర్నీలో...
క్రీడలు
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వీడియోలు
మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?
కేకేఆర్ ఫ్యాన్స్ ఫైర్.. స్పందించిన అయ్యర్ సోదరి
పరుగు తేడాతో బోణీ కొట్టిన GT
బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...
విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్!
ఏం గుండెరా బుడ్డోడు? బుమ్రానే చిత్తకొట్టేశావ్ కదరా..
హ్యాట్రిక్ కొట్టిన RR
CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
