ప్రధాన వార్తలు
అఫ్గాన్ అద్భుత విజయం.. ట్రాట్కు ఘన వీడ్కోలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ అఫ్గానిస్తాన్ అద్భుతమైన విజయంతో ముగించింది. చెన్నై వేదికగా కెనడాతో జరిగిన తమ చివరి మ్యాచ్లో రషీద్ సేన ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. జద్రాన్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు సెదికుల్లా అటల్(44), రెహ్మనుల్లా గుర్బాజ్(30) రాణించారు. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. డిలాన్ హీలిగర్ ఓ వికెట్ సాధించాడు.నబీ మ్యాజిక్అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ నాలుగు వికెట్లు పడగొట్టి కెనడాను దెబ్బ తీశాడు. అతడితో పాటు రషీద్ ఖాన్ రెండు, ముజీబ్, అజ్మతుల్లా తలా వికెట్ సాధించారు.కెనడా బ్యాటర్లలో హర్ష్ ఠాకర్ (30) టాప్ స్కోరర్గా నిలిచాడు.మిగిలిన బ్యాటర్లు ఎవరూ అఫ్గాన్ బౌలింగ్ను ఎదుర్కొలేకపోయారు. కాగా ఇప్పటికే అఫ్గాన్ జట్టు కివీస్, సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలై సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది. మరోవైపు అఫ్గానిస్తాన్ హెడ్కోచ్గా జోనాథన్ ట్రాట్ ప్రయాణం ముగిసింది. టీ20 ప్రపంచకప్ తర్వాత తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ట్రాట్ ముందే ప్రకటించాడు.
T20 WC 2026: జద్రాన్ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్, కెనడా జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 95 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సెంచరీకి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగతా వారిలో సెదిఖుల్లా అటల్ (44), రహ్మానుల్లా గుర్బాజ్ (30) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. గుల్బదిన్ నైబ్ (1), అజ్మతుల్లా ఒమర్జాయ్ (13) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దర్విష్ రసూల్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ 3 వికెట్లు తీయగా.. దిలన్ హేలిగర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కెనడా తడబడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా (13), నవ్నీత్ ధలివాల్ (0) ఔట్ కాగా.. యువ్రాజ్ సమ్రా (17), హర్ష్ ఠాకూర్ (1) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్, ఒమర్జాయ్కు తలో వికెట్ దక్కింది.కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే సూపర్-8 బెర్త్లు ఖరారైపోయాయి. ఆఫ్ఘన్, కెనడా జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8కు చేరాయి.
అభిషేక్ శర్మ స్థానంలో సంజూకు చాన్స్?
మొట్ట మొదటి టి20 ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మ తర్వాతి మ్యాచ్ల్లో ఆడతాడా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీగ్ మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్కు సూపర్- 8 మ్యాచ్ల్లో ఆడే అవకాశం రాకపోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో సంజూ శామ్సన్ను తీసుకుంటారని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుసగా మూడుసార్లు డకౌట్ కావడంతో అభిషేక్పై వేటు తప్పదని భావిస్తున్నారు.లీగ్ దశలో నమీబియాతో జరిగిన మ్యాచ్కు అభిషేక్ దూరం కావడంతో సంజూకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు శామ్సన్. అయితే వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న తర్వాత సంజూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. వచ్చిన ఒక అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గత కొన్నాళ్లుగా భారీ స్కోరు చేయడంలో విఫలమవుతున్నాడు. అయితే అభిషేక్ వైఫల్యం సంజూకు కలిసొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అభిషేక్ కంటే సంజూయే కాస్త బెటరన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో సంజూకు చాన్స్ రావొచ్చని ఆశిస్తున్నారు. కాగా, టాపార్డర్లో ముగ్గురు లెఫ్టాండర్ బ్యాలర్లే ఉండడం సమస్యేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే అంగీకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్, హెడ్ కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.అటు బౌలింగ్లోనూ వరుణ్ చక్రవర్తి మినహా మిగతా స్పిన్నర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్-8 మ్యాచ్ల్లో బౌలర్లు సమిష్టిగా రాణిస్తేనే టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. తర్వాతి మ్యాచ్కు వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ (Axar Patel) జట్టులోకి వచ్చే అవకాశముంది. రింకు సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా క్రీడాభిమానుల్లో నడుస్తోంది. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్గా బ్యాటింగ్ చేయగల సత్తా వాషింగ్టన్ సుందర్కు ఉంది.చదవండి: అతడిని కావాలనే తొక్కేస్తున్నారా?భారత జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన టీ20 మ్యాచ్తో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ కలుపుకొని హర్మన్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) 356 మ్యాచ్లు ఆడింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ప్లేయర్ సూజీ బేట్స్ పేరిట ఉండేది. సూజీ తన కెరీర్లో 355 మ్యాచ్లు ఆడింది. ఈ జాబితాలో హర్మన్, సూజీ తర్వాతి స్థానంలో ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ ఉంది. పెర్రీ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 349 మ్యాచ్లు ఆడింది.హర్మన్ విషయానికొస్తే.. 2009 మార్చి 7న పాకిస్తాన్పై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు 6 టెస్టులు, 161 వన్డేలు, 189 T20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2016లో కెప్టెన్సీ చేపట్టిన హర్మన్, 2025 నవంబర్లో వన్డే వరల్డ్ కప్ గెలిపించి కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేసింది. హర్మన్ తన కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 8000కిపైగా పరుగులు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత వాల్-మూనీ ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.వాల్-మూనీ తొలి వికెట్కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. వాల్, మూనీ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్ఫీల్డ్ 6, ఎల్లిస్ పెర్రీ 7, గార్డ్నర్ 10 (నాటౌట్), జార్జియా వేర్హమ్ డకౌటయ్యారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ను ఆసీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఓడించారు. ఆష్లే గార్డ్నర్ (4-0-22-3), కిమ్ గార్త్ (3-0-16-2), అన్నాబెల్ సదర్ల్యాండ్ (4-0-18-2), సోఫీ మోలినెక్స్ (4-0-37-2) ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. భారత ఇన్నింగ్స్కు షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (31) శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన వారు ఆ ఊపును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్ (36) కాసేపు పోరాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.భారత ఇన్నింగ్స్లో పై ముగ్గురితో పాటు రిచా ఘోష్ (19), క్రాంతి గౌడ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (4), అమన్జోత్ (3), అరుంధతి రెడ్డి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. దీప్తి శర్మ, శ్రీచరణి ఖాతా కూడా తెరవలేకపోయారు.కాగా, ఈ సిరీస్లో భారత్ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఫిబ్రవరి 21న అడిలైడ్ వేదికగా జరుగనుంది. ఈ ఆసీస్ పర్యటనలో భారత్ టీ20ల తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది.
T20 WC 2026: జింబాబ్వే మరో సంచలనం
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో తొలుత టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వెన్లు.. తాజాగా తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించిన షాకిచ్చారు. కొలొంబో వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్లో జింబాబ్వే శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా గ్రూప్-బిలో ఓటమెరుగని జట్టుగా నిలిచింది.ఈ గ్రూప్లో జింబాబ్వే.. ఒమన్, ఆస్ట్రేలియా, శ్రీలంకపై విజయాలు సాధించింది. ఐర్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ గ్రూప్ నుంచి జింబాబ్వే, శ్రీలంక ఇదివరకే సూపర్-8లోకి ప్రవేశించాయి. ఈ గ్రూప్లో శ్రీలంక సైతం ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు శ్రీలంకను జింబాబ్వే వారి సొంతగడ్డపై ఓడించి సంచలనం సృష్టించింది. పాయింట్ల పట్టికలోనూ జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (62), పవన్ రత్నాయకే (44) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో కుసాల్ పెరీరా 22, కుసాల్ మెండిస్ 14, కమిందు మెండిస్ 7, దసున్ షనక 6, వెల్లాలగే 15 (నాటౌట్) పరుగులు చేశారు. దుషన్ హేమంత డకౌటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్, గ్రేమీ క్రీమర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ర్యాన్ బర్ల్ ఓ వికెట్ తీశాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బ్రియాన్ బెన్నెట్ (63) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ సికందర్ రజా (45) మెరుపు ఇన్నింగ్స్తో తన జట్టును విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. మరో ఓపెనర్ మరుమణి (34), ర్యాన్ బర్ల్ (23) ఓ మోస్తరు స్కోర్లతో జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. లంక బౌలర్లలో హేమంత 2, వెల్లలగే, షనక చెరో వికెట్ తీశారు.
క్రికెట్ మైదానంలో పెను విషాదం
క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఓ ఫీల్డ్ అంపైర్ ప్రాణాలు కోల్పోయాడు. 15-20 మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన కాన్పూర్లోని (ఉత్తర్ప్రదేశ్) శుక్లగంజ్ సప్రూ మైదానంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా అండర్-13 మ్యాచ్ జరుగుతున్న సమయంలో తేనెటీగల గుంపు ఒక్కసారిగా మైదానంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అంపైరింగ్ చేస్తున్న 65 ఏళ్ల మాణిక్ గుప్తాను తేనెటీగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో గుప్తా ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తేనెటీగలు అంపైర్ గుప్తాతో పాటు మరో ఫీల్డ్ అంపైర్ జగదీశ్ శర్మపై కూడా దాడి చేశాయి. అలాగే మ్యాచ్ ఆడుతున్న 15–20 మంది ఆటగాళ్లను కూడా చుట్టుముట్టాయి. గుప్తాను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో అంపైర్ జగదీశ్ శర్మకు అత్యవసర చికిత్స అందించగా.. ప్రస్తుతం అతను ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. అస్వస్థతకు గురైన ఆటగాళ్ల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.ఊహించిన ఈ ఘటనపై కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్. సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుప్తాను ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా తేనెటీగలు ఆయన ముఖం, శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నాయని ఆయన వాపోయారు. గుప్తాకు స్థానిక క్రికెట్లో అనుభవజ్ఞుడైన అంపైర్గా పేరుంది.తేనెటీగల దాడులు కొత్తేమీ కాదుక్రికెట్లో తేనెటీగల దాడులు కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి దాడులు జరిగాయి. అయితే భారత్లో ప్రాణనష్టం మాత్రం ఎప్పుడూ సంభవించలేదు. కాన్పూర్ ఘటనే తొలిసారి.గతేడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా కూడా ఇదే తరహాలో తేనెటీగల దాడి జరిగింది. ఆ ఘటనలో పలువురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు.2019లో త్రివేండ్రం గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో ఇండియా ఏ-ఇంగ్లండ్ లయన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా కూడా తేనెటీగలు దాడి చేశాయి. ఆ సందర్భంలో స్టేడియంలోని చాలామంది ప్రేక్షకులు తేనెటీగల దాడికి గురై అసుపత్రిపాలయ్యారు.
భారత్పై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా
మహిళల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్వదేశంలో టీమిండియాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. ఇందులో తొలుత 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కాగా.. భారత్ తొలి మ్యాచ్లోనే ఆతిథ్య జట్టుకు షాకిచ్చి తమ ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో ఎదురైన పరాభవానికి ఆసీస్ రెండో మ్యాచ్లోనే ప్రతీకారం తీర్చుకుంది.కాన్బెర్రా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన రెండో టీ20లో ఆసీస్ 19 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత వాల్-మూనీ ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.వాల్-మూనీ తొలి వికెట్కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. వాల్, మూనీ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్ఫీల్డ్ 6, ఎల్లిస్ పెర్రీ 7, గార్డ్నర్ 10 (నాటౌట్), జార్జియా వేర్హమ్ డకౌటయ్యారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ను ఆసీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఓడించారు. ఆష్లే గార్డ్నర్ (4-0-22-3), కిమ్ గార్త్ (3-0-16-2), అన్నాబెల్ సదర్ల్యాండ్ (4-0-18-2), సోఫీ మోలినెక్స్ (4-0-37-2) ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. భారత ఇన్నింగ్స్కు షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (31) శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన వారు ఆ ఊపును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్ (36) కాసేపు పోరాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. భారత ఇన్నింగ్స్లో పై ముగ్గురితో పాటు రిచా ఘోష్ (19), క్రాంతి గౌడ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (4), అమన్జోత్ (3), అరుంధతి రెడ్డి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. దీప్తి శర్మ, శ్రీచరణి ఖాతా కూడా తెరవలేకపోయారు.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఫిబ్రవరి 21న అడిలైడ్ వేదికగా జరుగనుంది. ఈ ఆసీస్ పర్యటనలో భారత్ టీ20ల తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది.
T20 WC 2026: ఏ జట్లకు సెమీస్ అవకాశాలు..?
టీ20 వరల్డ్కప్ 2026లో మరికొన్ని మ్యాచ్లు మిగిలుండగానే సూపర్-8 బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఫైనల్-8కి అర్హత సాధించాయి.సూపర్-8 దశలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, భారత్, జింబాబ్వే గ్రూప్ 1లో ఉండగా.. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ గ్రూప్ 2లో ఉన్నాయి. సూపర్-8 మ్యాచ్లు ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభమవుతాయి. గ్రూప్ 1 మ్యాచ్లన్నీ భారత్లో జరుగనుండగా.. గ్రూప్ 2 మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. సెమీస్, ఫైనల్స్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు.సూపర్-8 సమరాలకు సర్వం సిద్దమైన వేల ఏయే జట్లు సెమీస్కు చేరతాయన్న చర్చ జోరందుకుంది. ఈ టాపిక్పై ఎవరి అంచనాలు వారికున్నా, ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఫైనల్-4కు చేరడం ఏ జట్టుకూ అంత ఈజీగా అయితే కనిపించడం లేదు. సూపర్-8 దశకు చేరాయంటేనే ఆ జట్ల సత్తా ఏంటో ఇదివరకే నిరూపితమైనట్లు. అలాంటిది టగ్ ఆఫ్ వార్ ఫైట్లలో అన్నీ జట్లు శక్తివంచన లేకుండా పోరాడటం ఖాయంగా కనిపిస్తుంది.సూపర్ 8 దశలో రెండు గ్రూప్ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు చేరతాయి. ఇరు గ్రూప్ల్లో ఆ రెండు బెర్త్ల కోసం అన్ని జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది.గ్రూప్ 1 విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. వెస్టిండీస్, జింబాబ్వేను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా విండీస్ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మిగతా జట్లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. విండీస్ ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తూ, పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. పైగా గ్రూప్ దశలో ఈ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించి జోష్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విండీస్తో ఏమరపాటుగా ఉంటే సౌతాఫ్రికా ప్రపంచకప్ కల ఈసారి కూడా కలగానే మిగిలిపోతుంది.ఎందుకంటే, ప్రస్తుతం భారత్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లకు ఓడించడం అంత కష్టం కాకపోవచ్చు. పైగా టీమిండియాకు హోం అడ్వాంటేజ్ కూడా ఉంది. కాబట్టి భారత్ ఫైనల్-4కు చేరడం నల్లేరుపై నడకే అవుతుంది. ఇక మిగిలిన రెండో బెర్త్ కోసం ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది. జింబాబ్వే సహా ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జింబాబ్వే గ్రూప్ దశలో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి, తామేంటో ఈసారి ప్రపంచానికి చూపిస్తామని ఛాలెంజ్ చేసింది. మరోపక్క సౌతాఫ్రికా సమతూకమైన, పటిష్టమైన జట్టుతో గత ఎడిషన్లో తృటిలో మిస్ అయిన టైటిల్ కోసం ఆకలితో ఎదురుచూస్తుంది. విండీస్ గురించి ఇదివరకే మాట్లాడుకున్నాం. ఈ జట్టు మూడోసారి టైటిల్ సాధించి, క్రికెట్ ప్రపంచానికి షాకివ్వాలని ఉవ్విళ్లూరుతుంది. గ్రూప్ 1 నుంచి అండర్ డాగ్ ఏ జట్టు అంటే విండీస్ పేరు చెప్పాలి. జట్టు పరంగా చూసినా, ప్రస్తుత విండీస్ జట్టు గతంలో స్టార్లతో నిండిన జట్టు కంటే పటిష్టంగా కనిపిస్తుంది. షాయ్ హోప్ సారథ్యంలో ఈ జట్టు నూతనోత్సహంతో పూర్వవైభవం దిశగా ఉరకలేస్తుంది. హోప్ సహా హెట్మైర్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, మోటీ, షమార్ జోసఫ్ సూపర్-8 దశలో సంచలన ప్రదర్శనలతో చెలరేగే అవకాశం ఉంది.గ్రూప్ 2 విషయానికొస్తే.. ఈ గ్రూప్ గ్రూప్ 1 కంటే ప్రమాదకరంగా ఉంది. పాక్ మినహా మిగతా మూడు జట్లు సెమీస్ రేసులో నువ్వా-నేనా అన్నట్లు ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ గ్రూప్లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది. ఈ జట్టు సెమీస్కు చేరడమే కాదు, తమ తొలి ప్రపంచకప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేపర్పై ఈ జట్టు సాదాసీదాగా కనిపించినా, పోరాటపటిమ వారిని ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిలబెడుతుంది. ఇటీవల భారత్తో జరిగిన సిరీస్లో ఆ జట్టు పోరాటాన్ని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. పైగా ఈ జట్టులోకి చాలామంది ఆటగాళ్లకు ఉపఖండపు పిచ్లపై ఆడిన అనుభవం కూడా ఉంది. భారత్ తర్వాత అత్యధిక హోం అడ్వాంటేజ్ లభించే జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది.ఈ గ్రూప్ నుంచి మరో అండర్ డాగ్గా శ్రీలంకను చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ జట్టుకు కూడా హోం అడ్వాంటేజ్ ఉంది. ప్రదర్శనల ఆధారంగా చూసినా, ఈ జట్టు గ్రూప్ దశలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి ఉత్సాహంగా కనిపిస్తుంది. జట్టు పరంగా చూస్తే.. వీరు పేపర్పై బలంగా కనిపించకపోయినా, తమదైన రోజున ఇంగ్లండ్, న్యూజిలాండ్ను మట్టికరిపించగల సమర్దులు. కాబట్టి ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్తో పాటు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ గ్రూప్ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ విషయానికొస్తే.. చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఈ గ్రూప్లో హాట్ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే, ఈ జట్టుకు మిగతా మూడు జట్ల నుంచి టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ జట్టు గ్రూప్ దశలో పసికూనలపై గెలిచేందుకు కూడా తీవ్రంగా శ్రమించింది. పేపర్పై బలంగా కనిపిస్తున్నా, కీలక ఆటగాళ్లు ఇప్పటివరకు సామర్థ్యం మేరకు రాణించలేదు. సూపర్-8 దశలో కీలక ఆటగాళ్లు టచ్లోకి వస్తే.. ఇంగ్లండ్ను సెమీస్కు చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇక ఈ గ్రూప్లో అత్యంత బలహీనమైన, ఏమాత్రం అంచనాలు లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది పాకిస్తానే. అతికష్టం మీద సూపర్-8కు అర్హత సాధించిన ఈ జట్టు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లను కాదని ముందుకు వెళ్లడం దాదాపుగా అసంభవమేనని చెప్పాలి.ఓవరాల్గా చూస్తే.. గ్రూప్ 1 నుంచి సెమీస్ రేసులో భారత్ హాట్ ఫేవరెట్ కాగా.. రెండో బెర్త్ కోసం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 2 నుంచి ఏ జట్టునూ హాట్ ఫేవరెట్ అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు పోటీ ఉండవచ్చు.
వైభవ్ సూర్యవంశీ తండ్రి కీలక వ్యాఖ్యలు
భారత యువ క్రికెట్ తరంగం వైభవ్ సూర్యవంశీ పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులోనే విధ్వంసకర శతకం బాదిన ఈ బిహారీ పిల్లాడు.. యూత్ వన్డే, టెస్టుల్లోనూ శతకాల మోత మోగించాడు.ఇటీవల అండర్-19 వరల్డ్కప్ టోర్నీ-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ఇంగ్లండ్తో ఫైనల్లో మెరుపు, భారీ శతకం (80 బంతుల్లో 175) బాది.. భారత్ ఆరో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.ఐపీఎల్-2026కు సన్నద్ధంఇక వైభవ్ సూర్యవంశీ తదుపరి ఐపీఎల్-2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. అంతకంటే ముందు అతడు పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలకు హాజరవుతాడని.. ఇందుకోసం ఆటకు విరామం ఇస్తాడనే వార్తలు వచ్చాయి.పరీక్షలకు దూరంఅయితే, వైభవ్ చదివే స్కూల్ డైరెక్టర్ మాత్రం అతడు ఈ ఏడాది పరీక్షలకు హాజరు కావడం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తాజాగా ధ్రువీకరించారు. ‘మిడ్డే’తో మాట్లాడుతూ..అవును.. మాకు అదే ముఖ్యం‘‘అవును.. నా కుమారుడు ప్రస్తుతం నాగ్పూర్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి వైభవ్ పరీక్షల గురించి చాలా చర్చ నడుస్తోంది. అందుకే అతడు పరీక్షలు రాయకూడదని నిర్ణయించుకున్నాడు.వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడు. ఈ ఏడాది ఒకవేళ పరీక్షలకు హాజరైనా అతడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయేవాడు. ఒత్తిడిలో ఏ పనీ చేయకూడదు. నిజానికి చదువులో వైభవ్ ఎప్పుడూ ముందే ఉంటాడు.అన్ని సబ్జెక్టులలోనూ వాడికి 90 శాతానికి పైగా మార్కులు వచ్చేవి. అయితే, ఇప్పుడు మా ప్రాధాన్యం క్రికెట్ మాత్రమే’’ అని సంజీవ్ సూర్యవంశీ స్పష్టం చేశారు. కాగా మంగళవారం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలో భాగంగా వైభవ్ బిహార్లో ఉన్న పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎగ్జామ్కు హాజరుకావాల్సింది. అయితే, అతడు పరీక్షా కేంద్రానికి రాలేదని.. అతడికి ఆబ్సెంట్ వేశామని పాఠశాల ప్రిన్సిపల్ ఎన్కే సిన్హా ANIకి తెలిపారు.చదవండి: అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లే: పాంటింగ్
ఆసీస్తో రెండో టీ20.. అనూహ్యంగా పుంజుకున్న భారత బౌలర్లు
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు ఇవాళ (ఫిబ్రవరి 19) రెండో టీ20 ఆడుతుంది. కాన్బెర్రా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆసీస్ను 163 పరుగులకే (5 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.తొలుత ఆసీస్ ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.వాల్-మూనీ తొలి వికెట్కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. వాల్, మూనీ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్ఫీల్డ్ 6, ఎల్లిస్ పెర్రీ 7, గార్డ్నర్ 10 (నాటౌట్), జార్జియా వేర్హమ్ డకౌటయ్యారు. స్కోర్ను 170 పరుగులైనా దాటించాలనే ఆతృతతో ఆసీస్ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు కోల్పోయింది. వేర్హమ్, పెర్రీ రనౌట్లయ్యారు. ఈ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. శ్రీచరణి ఆసీస్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేసింది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించి, ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఆసీస్ పర్యటనలో భారత్ టీ20ల తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది.
T20 WC 2026: ఏ జట్లకు సెమీస్ అవకాశాలు..?
టీ20 వరల్డ్కప్ 2026లో మరికొన్ని మ్యాచ్లు మిగిలు...
వైభవ్ సూర్యవంశీ తండ్రి కీలక వ్యాఖ్యలు
భారత యువ క్రికెట్ తరంగం వైభవ్ సూర్యవంశీ పద్నాలుగ...
ఆసీస్తో రెండో టీ20.. అనూహ్యంగా పుంజుకున్న భారత బౌలర్లు
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్...
T20 WC 2026: విండీస్ ప్లేయర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమార్ జోసఫ్ అంతర్జాత...
క్రీడలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
వీడియోలు
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
భారత్ కు మహాశివరాత్రి.. పాక్ కు కాళరాత్రి...
కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
నమీబియాను చిత్తు చేసిన భారత్
T20: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ నమీబియాతో భారత్
