Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: Mumbai indians beat LSG1
రోహిత్‌, రికెల్టన్‌ ఊచకోత.. లక్నోపై ముంబై ఇండియన్స్‌ గెలుపు

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్‌ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రోహిత్‌, రికెల్టన్‌ ఊచకోత229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోయారు. రోహిత్‌ శర్మ (83), రికెల్టన్‌ (84) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో ఏకంగా 143 పరుగులు జోడించి గెలుపు ఖాయం​ చేశారు. అనంతరం తిలక్‌ వర్మ (11), సూర్యకుమార్‌ యాదవ్‌ (12) తక్కువ స్కోర్లకే ఔటైనా, నమన్‌ ధిర్‌ (23 నాటౌట్‌), విల్‌ జాక్స్‌ (10 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో మణిమారన్‌ సిద్దార్థ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, మొహిసిన్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు..పూరన్‌ విధ్వంసంటాస​్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. నికోలస్‌ పూరన్‌ (21 బంతుల్లో 63; ఫోర్‌, 8 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్‌ చేసింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో స్కోర్‌ కాస్త నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (25 బంతుల్లో 31 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌), హిమ్మత్‌ సింగ్‌ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడారు. మిగతా బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లిస్‌ 13, కెప్టెన్‌ పంత్‌ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్‌ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2 వికెట్లు తీయగా.. ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Pakistan women cricket team beat zimbabwe2
చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్తాన్‌ ప్రతాపం

జింబాబ్వే మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి పాకిస్తాన్‌లో పర్యటిస్తుంది. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు జింబాబ్వేపై ప్రతాపం చూపింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 168 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ సదాఫ్‌ షమాస్‌ (98) తృటిలో సెంచరీ మిస్‌ కాగా.. మరో ఓపెనర్‌ గుల్‌ ఫిరోజా (50), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సిద్రా అమీన్‌ (67), మిడిలార్డర్‌ బ్యాటర్‌ నజిహా అల్వి (56 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లలో అయేషా జాఫర్‌ 3, ఆలియా రియాజ్‌ 2, కెప్టెన్‌ ఫాతిమా సనా 11 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ప్రెసియస్‌ మరంగే 3 వికెట్లతో రాణించగా.. కుద్జాయ్‌ చిగోరా, కెప్టెన్‌ నోమ్వెలో సిబండ తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పసికూన జింబాబ్వే చేతులెత్తేసింది. బిలవ్డ్‌ బిజా (53) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఓపెనర్‌ కెలిస్‌ (31) ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. మిగతా ప్లేయర్లలో కెల్లీ (11), మెలిండ (10), సిబండ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్‌ బౌలర్లలో ఫాతిమా సనా, తస్మియా రుబాబ్‌, సయ్యదా ఆరూబ్‌ షా తలో 2 వికెట్లు పడగొట్టగా.. మొమినా రియాసత్‌, నష్రా సంధు చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇదే కరాచీ వేదికగా మే 6న జరుగనుంది. కాగా, వన్డే సిరీస్‌ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరుగనుంది.

Rishabh Pant Breaks Promise To Sanjeev Goenka Batting Failure Vs MI3
మాట త‌ప్పిన రిషబ్‌ పంత్‌!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజ‌న్‌లో ఎంట్రీ ఇచ్చి వ‌రుస‌గా తొలి రెండు సీజ‌న్ల‌లో ప్లేఆఫ్స్ చేరి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ సంచ‌ల‌నం సృష్టించింది. అయితే ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మాత్రం ల‌క్నో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్ర‌మే విజ‌యం సాధించిన ల‌క్నో ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. తాజాగా సోమ‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్‌ కీల‌క మ్యాచ్ ఆడుతోంది. ఈ నేప‌థ్యంలో టాస్ స‌మ‌యంలో ల‌క్నో కెప్టెన్ పంత్ ఆ జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గోయెంకా పేరును ప్ర‌స్తావించాడు. తాను పేల‌వ ఫామ్‌ను అధిగ‌మించి ముంబైతో మ్యాచ్‌లో ప‌రుగులు సాధిస్తాన‌ని సంజీవ్ గోయెంకాకు మాట ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశాడు. అయితే మ్యాచ్‌లో కేవ‌లం 15 ప‌రుగులు చేసిన పంత్ సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేక‌పోయాడు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘టాస్ మేము గెలిచినా బౌలింగ్‌ ఎంచుకునేవాళ్లం. ఎందుకంటే వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎంత లక్ష్యాన్నైనా అవలీలగా ఛేదించొచ్చు. నిజానికి ఈ సీజన్‌ను మేము మంచి ఈజ్‌తో ప్రారంభించాము. కానీ మధ్యలో నిలకడ కోల్పోయి వరుస ఓటములు చవిచూస్తూ వచ్చాం. జట్టుగా విఫలమైనప్పటికీ సంజీవ్ గోయెంకా మాపై నమ్మకముంచారు. ఆయనకు క్రికెట్ అంటే అపారమైన ఇష్టం. అయితే ఆయన అంచనాలను, అభిమానుల ఆశలను అందుకోవడంలో విఫలమయ్యాం. కానీ ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్‌లో భారీ స్కోర్లు సాధించి సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టకుంటాం. 200 శాతం కష్టపడి విజయాలు సాధించి అభిమానులను, ఫ్రాంచైజీని సంతృప్తి పరుస్తామని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఇక లక్నో కెప్టెన్‌ పంత్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 204 పరుగులు సాధించాడు.అయితే ముంబైతో మ్యాచ్‌లో పంత్ 15 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో రికెల్‌టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. పూరన్ (21 బంతుల్లో 63), మార్ష్ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.చదవండి: ల‌క్నోతో మ్యాచ్‌కు హార్దిక్ దూరం.. కార‌ణ‌మిదే!

Akshat Raghuwanshi Became 11th Player to hit first ball in IPL career for six4
ఐపీఎల్‌లో మరో సిక్సర్ల చిచ్చరపిడుగు.. వైభవ్‌ సూర్యవంశీలాగే..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మరో సిక్సర్ల చిచ్చరపిడుగును పరిచయం చేసింది. 2026 ఎడషన్‌లో భాగంగా ఇవాళ (మే 4) ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 22 ఏళ్ల అక్షత్‌ రఘువంశీ అనే మెరుపు వీరుడు లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అక్షత్‌ వచ్చీ రాగానే ఓ భారీ సిక్సర్ల రికార్డు సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్శించాడు.అక్షత్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అరుదైన రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అక్షత్‌కు ముందు రాబ్‌ క్వీని (రాజస్థాన్‌), కెవాన్‌ కూపర్‌ (రాజస్థాన్‌), ఆండ్రీ రసెల్‌ (కేకేఆర్‌), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (ఢిల్లీ), అనికేత్‌ చౌదరి (ఆర్సీబీ), జేవన్‌ సీల్స్‌ (కేకేఆర్‌), సిద్దేశ్‌ లాడ్‌ (ముంబై), మహీశ్‌ తీక్షణ (సీఎస్‌కే), సమీర్‌ రిజ్వి (సీఎస్‌కే), వైభవ్‌ సూర్యవంశీ (రాజస్థాన్‌) ఈ ఘనత సాధించారు.ఈ సీజన్‌ వేలంలో అక్షత్‌కు లక్నో రూ. 2.2 కోట్లకు దక్కించుకుంది. అక్షత్‌ తన డెబ్యూ క్యాప్‌ను తన ఆరాధ్య ఆటగాడు రోహిత్‌ శర్మ నుంచి తీసుకున్నాడు. అక్షత్‌ 2025 మధ్యప్రదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో 56 బంతుల్లో 115 పరుగులు చేసిన అక్షత్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ అప్పుడే కన్నేసింది.అక్షత్‌కు దేశవాలీ క్రికెట్‌లోనూ ఓ అదిరిపోయే రికార్డు ఉంది. 2021-22 రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్‌ తరఫున అరంగేట్రం చేసిన అతను.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి బంతికే సిక్సర్‌ బాదిన అక్షత్‌ ఆతర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 7 బంతుల్లో సిక్సర్‌ సాయంతో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న లక్నో 19 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ (44), పూరన్‌ (63) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. మార్క్రమ్‌ (29), హిమ్మత్‌ సింగ్‌ (37) క్రీజ్‌లో ఉన్నారు.

Nicholas Pooran Scores Second Fastest Fifty For Lucknow Super Giants, Achieves Feat During MI vs LSG IPL 20265
పూరన్‌ మహోగ్రరూపం

ఐపీఎల్‌ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 4) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ చెలరేగిపోయాడు. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతూ వచ్చిన అతను.. ఈ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, లక్నో తరఫున రెండో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ కూడా ఇతని పేరిటే ఉంది. 2023 ఎడిషన్‌లో కేవలం 15 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు.తాజా హాఫ్‌ సెంచరీలో 7 సిక్సర్లు, ఓ బౌండరీ బాదిన పూరన్‌.. ఓవరాల్‌గా 21 బంతులు ఎదుర్కొని ఫోర్‌, 8 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న లక్నో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది.ఒక్కసారి కుదుపుపూరన్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు అతి భారీ స్కోర్‌ దిశగా సాగిన లక్నో.. అతను ఔట్‌ కాగానే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. రెండు పరుగుల వ్యవధిలో (123-125) పూరన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌ (44) కూడా ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే (148, 160 పరుగుల వద్ద) రిషబ్‌ పంత్‌ (15), అక్షత్‌ రఘువంశీ (11) కూడా పెవిలియన్‌ బాట పట్డారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 164-5గా ఉంది. మార్క్రమ్‌ (10), హిమ్మత్‌ సింగ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2, ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ తీశారు.తుది జట్టు..లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్‌ఫర్, రఘు శర్మ

Reason Why Mumbai Indians Captain Hardik playing Not Playing Vs LSG6
ల‌క్నోతో మ్యాచ్‌కు హార్దిక్ దూరం.. కార‌ణ‌మిదే!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రుస్తోంది. ఈ సీజ‌న్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు ఓట‌ములు చ‌విచూసిన ముంబై ఇండియ‌న్స్ ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవ‌కాశాలు దాదాపు కోల్పోయింది. పాండ్యా కెప్టెన్సీపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మయ్యాయి. ఈ నేపథ్యంలో సోమ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ హార్దిక్ దూర‌మ‌వ్వ‌డం ప‌లు అనుమానాలకు తావిచ్చింది. అయితే టాస్ స‌మ‌యంలో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ‌చ్చిన‌ సూర్య‌కుమార్‌.. పాండ్యా ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు. అందుకే మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో విఫలమైన హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గానూ పూర్తిగా తేలిపోయాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 146 పరుగులు మాత్రమే చేసిన పాండ్యా బౌలింగ్‌లోనూ కేవలం నాలుగు వికెట్లు తీశాడు. అంతేకాదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తనపై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జ‌ట్టు ఆట‌గాళ్ల ప‌ట్ల దురుసు ప్ర‌వ‌ర్త‌న‌తో చెడ్డ పేరును మూట‌గ‌ట్టుకున్నాడు. ఒక ద‌శ‌లో పాండ్యాను త‌ప్పించి రోహిత్‌కు మ‌ళ్లీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని ముంబై అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.🚨 Toss Update 🚨@mipaltan won the toss and elected to field against @LucknowIPL. Surya Kumar Yadav is captaining #MI as Hardik Panyda is unwell. Updates ▶️https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/eQjzr2GXrm— IndianPremierLeague (@IPL) May 4, 2026చదవండి: ‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్‌!

KKR-Varun Chakravarthy-Special Message-Vijay TVK Win-Tamil nadu7
‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్‌!

సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయినప్పటికీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్‌ను అభినందిస్తూ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు విజయ్ అంటే తనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నాడు. కాగా విజయ్‌కి వీరాభిమాని కావడంతో ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ విజయ్‌కి అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా తన అభిమాన హీరోతో కలిసి దిగిన పాత ఫోటోను షేర్ చేసుకున్న వరుణ్ చక్రవర్తి ‘అన్నా.. గెలిచాం’ అంటూ ఎమోజీతో కూడిన సింబల్‌ను పంచుకున్నాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ చక్రవర్తి ఆదివారం ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు సీజ‌న్‌లో ఏడు మ్యాచ్‌లాడిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 10 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ సీజ‌న్‌లో తొలి అంచె పోటీల్లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన కేకేఆర్ రెండో అంచె పోటీల్లో మాత్రం వ‌రుస విజ‌యాలతో అద‌ర‌గొడుతుంది. లేట్‌గా ఫామ్‌లోకి వ‌చ్చిన రింకూ సింగ్ త‌న ఫినిషింగ్ ట‌చ్‌తో కేకేఆర్‌కు రెండు విజ‌యాలు సాధించి పెట్టాడు. ప్ర‌స్తుతం కేకేఆర్ 9 మ్యాచ్‌ల్లో 3 విజ‌యాలు, 5 ఓట‌ములు, ఒక మ్యాచ్ ర‌ద్దుతో ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రో 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేప‌థ్యంలో అన్నింటా గెలిస్తే 17 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవ‌కాశం కూడా ఉంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా కేకేఆర్ ప్లేఆఫ్ అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతాయి. కేకేఆర్ త‌మ త‌ర్వాతి మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, ఆర్సీబీతో, గుజ‌రాత్‌తో, ముంబైతో ఆడాల్సి ఉంది.ఇక వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి దేశ‌వాలీ క్రికెట్‌లో త‌మిళనాడుకు ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డం ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ అంశం. టీమిండియా త‌ర‌ఫున 4 వ‌న్డేల్లో 10 వికెట్లు, 45 టీ20ల్లో 73 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐపీఎల్‌లో 91 మ్యాచ్‌లాడిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 110 వికెట్లు తీశాడు.చదవండి: విజ‌య్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెట‌ర్‌!

Not Virat Kohli, Sunil Narine Named The New King Of IPL8
విరాట్‌ కోహ్లి కాదు.. కొత్త 'కింగ్‌' అతడే..!

ఐపీఎల్‌ 2026 మధ్య దశకు చేరుకున్న వేళ ‘కింగ్‌’ అనే బిరుదుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఈ ట్యాగ్‌కు ప్రతీకగా నిలిచిన విరాట్‌ కోహ్లికి ఇప్పుడు గట్టి పోటీదారు వచ్చాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ తమ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ సునీల్‌ నరైన్‌ను "కొత్త కింగ్‌"గా అభివర్ణిస్తూ సరికొత్త చర్చకు తెరలేపాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ 200 ఐపీఎల్ వికెట్ల మైలురాయిని అందుకోవడంతో ఈ చర్చ మొదలైంది.నరైన్ ఐపీఎల్‌లో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 200కు పైగా వికెట్లు, 1000కు పైగా పరుగులు, సెంచరీ, హ్యాట్రిక్, ఐదు వికెట్ల హాల్, మూడు సార్లు మోస్ట్‌ వాల్యుయబుల్‌ ప్లేయర్‌ అవార్డులు.. ఇలాంటి ఎన్నో ఘనతలు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ కారణంగానే మైసూర్ నరైన్‌ను గేమ్ చేంజర్‌గా కొనియాడుతూ 'కింగ్'గా అభివర్ణించాడు.మరోవైపు విరాట్‌ కోహ్లి కింగ్‌ అనే బిరుదుకు సార్దకత చేకూరుస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కాలంగా స్థిరమైన ప్రదర్శన, జట్టు విజయాల్లో కీలక పాత్ర, భారీ అభిమాన వర్గం.. ఇవి కోహ్లీని 'కింగ్'గా నిలబెట్టాయి.నరైన్‌ కూడా విరాట్‌లాగే కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తూ.. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో స్థిరంగా రాణిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ కింగ్‌ బిరుదు కోసం పోటీపడుతున్నాడు. బ్యాటింగ్‌లో విరాట్‌.. ఆల్‌రౌండ్ ప్రదర్శనల్లో నరైన్ ఆధిపత్యం చాటుతుండటంతో కింగ్‌ ఎవరో డిసైడ్‌ చేయడం చాలా కష్టంగా మారింది.ఇదిలా ఉంటే, ఈ సీజన్‌ తొలి 6 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేని కేకేఆర్‌.. అనూహ్యంగా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి ఉనికి చాటుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు కలిగి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆ జట్టుకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతు అయినప్పటికీ.. అధికారికంగా రేసులోనే ఉంది. మరోవైపు విరాట్‌ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి, పట్టికలో రెండో స్థానంలో ఉంది.

IPL 2026, Match 47: Mumbai Indians vs LSG Updates and Highlights9
లక్నోపై ముంబై ఇండియన్స్‌ గెలుపు

లక్నోపై ముంబై ఇండియన్స్‌ గెలుపుఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స​్‌ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్‌ శర్మ (84) ఔట్‌13.6వ ఓవర్‌- 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన అనంతరం రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. విధ్వంసం సృష్టించి ఔటైన రికెల్టన్‌10.5వ ఓవర్‌- రికెల్టన్‌ 32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి మొహిసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దంచికొడుతున్న రోహిత్‌, రికెల్టన్‌229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. తొలి ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఏకంగా 71 పరుగులు చేశారు. రోహిత్‌ శర్మ (36), రికెల్టన్‌ (34) దంచికొడుతున్నారు. లక్నో భారీ స్కోర్‌టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నికోలస్‌ పూరన్‌ (21 బంతుల్లో 63; ఫోర్‌, 8 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో లక్నో ఇంకా భారీ స్కోర్‌ సాధించేలా కనిపించింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో స్కోర్‌ నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (25 బంతుల్లో 31 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌), హిమ్మత్‌ సింగ్‌ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడి, ఊహించినంత కాకపోయినా ఓ మోస్తరు స్కోర్‌ అందించారు. మిగతా బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లిస్‌ 13, కెప్టెన్‌ పంత్‌ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్‌ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2 వికెట్లు తీయగా.. ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఒక్కసారి కుదుపుపూరన్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు అతి భారీ స్కోర్‌ దిశగా సాగిన లక్నో.. అతను ఔట్‌ కాగానే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. రెండు పరుగుల వ్యవధిలో (123-125) పూరన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌ (44) కూడా ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే (148, 160 పరుగుల వద్ద) రిషబ్‌ పంత్‌ (15), అక్షత్‌ రఘువంశీ (11) కూడా పెవిలియన్‌ బాట పట్డారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 164-5గా ఉంది. మార్క్రమ్‌ (10), హిమ్మత్‌ సింగ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2, ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ తీశారు.పంత్‌ ఔట్‌10.4వ ఓవర్‌- విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి రిషబ్‌ పంత్‌ (15) ఔటయ్యాడు.ఒకే ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయిన లక్నో8.5వ ఓవర్‌- కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌ నమన్‌ ధిర్‌కు క్యాచ్‌ ఇచ్చి మిచెల్‌ మార్ష్‌ (44) ఔటయ్యాడు. రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో8.1వ ఓవర్‌- కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో ర్యాన్‌ రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి పూరన్‌ (63) ఔటయ్యాడు.దంచికొడుతున్న లక్నో..ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ దంచికొడుతుంది. ఏడు ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్‌ నష్టానికి 106 పరుగులు చేసింది. పూరన్‌ (47), మిచెల్‌ మార్ష్‌ (43) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 15 పరుగులు చేసిన జోస్‌ ఇంగ్లిస్‌ గజన్‌ఫర్‌ బౌలింగ్‌లో సూర్యకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరుగుతున్న 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్వల్ప అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడటం​ లేదని స్కై తెలిపాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కూడా బరిలోకి దిగుతున్నాడు. హిట్‌మ్యాన్‌ గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం​ ముంబై మరో మార్పు కూడా చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌ స్థానంలో కార్బిన్‌ బాష్‌ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్టు..లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్‌ఫర్, రఘు శర్మ

England Cricketer Jofra Archer Old Tweet Viral Hero Vijay Landslide Win-Tamil Nadu10
విజ‌య్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెట‌ర్‌!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సినీహీరో విజ‌య్ స్థాపించిన త‌మిళగ వెట్రి క‌జ‌గం (టీవీకే) సంచ‌ల‌నం సృష్టించింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విజ‌య్ టీవీకే పార్టీ త‌మిళ‌నాట వెలువ‌డిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 109 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాలేదు. అయితే అత్య‌ధిక స్థానాలు గెలిచిన విజ‌య్ కింగ్ మేక‌ర్‌గా నిలిచారు. అయితే డీఎంకే లేదా అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకొని విజ‌య్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్న‌ది చూడాలి. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చ‌ర్ త‌మిళ‌నాట విజ‌య్ గెలుపు గురించి ముందే ఊహించాడంటూ సోష‌ల్ మీడియాలో ఒక ట్వీట్ చ‌క్క‌ర్లు కొడుతుంది. 2015 ఏప్రిల్ 25న ఆర్చర్ తన ‘ఎక్స్‌’ (అప్పటి ట్విటర్‌) వేదికగా ‘విజయ్ డబ్ల్యూటీఎఫ్‌’ అని పోస్టు పెట్టాడు. నిజానికి ఆర్చ‌ర్ ఆ ట్వీట్ పెట్టింది క్రికెటర్ మురళీ విజయ్‌ను ఉద్దేశించి అని తెలుస్తోంది. అంతకుముందు 2014, డిసెంబర్ 27న ‘లవ్ టు వాచ్ విజయ్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. దానికి ముందు 2013, మార్చి 4న ‘M.Vijay 140*’ అంటూ ట్వీట్ చేశాడు జోఫ్రా ఆర్చర్. ఈ ట్వీట్స్ అన్నీ కూడా క్రికెటర్ మురళీ విజయ్‌కి సంబంధించినవి మాత్రమే. అయితే తాజాగా త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన నేపథ్యంలో విజయ్ విజయదుందుబి మోగించడంతో ఆయన అభిమానులు ఆర్చర్ ట్వీట్‌ను తమ హీరో విజయ్‌ కోసం చేసినట్లుగా రీట్వీట్ చేశారు. ‘మా విజయ్ ముందే గెలుస్తాడని ఊహించిన ఆర్చర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కామెంట్లు కూడా పెడుతున్నారు.అయితే ఆర్చర్‌ నిజంగా ఆ ట్వీట్‌ చేశాడా అన్నది ఒకసారి చెక్‌ చేసుకోవాలని మరికొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఎందు కంటే గతంలో మురళీ విజయ్‌తో విభేదాల సమయంలో క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ కూడా ఇలాంటి ట్వీట్‌ చేసినట్లు గుర్తు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన ఆర్చర్ 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఇక సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో వరుస ఓటములు చవిచూస్తోంది. అయితే ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.pic.twitter.com/hoSIATmltw— Out Of Context Cricket (@GemsOfCricket) May 4, 2026 చదవండి: పాక్‌ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్‌మనీనా!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement