Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Doesnt See Varun Axar Struggle At T20 WC But Kuldeep: Anil Kumble 1
టీమిండియాకు అతడే కీలకం: అనిల్‌ కుంబ్లే

టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిపై భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉన్న వరుణ్‌.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో స్పిన్‌ దళానికి‌ నాయకుడిగా ఉంటాడని పేర్కొన్నాడు. మంచు ప్రభావం అతడి బౌలింగ్‌పై ప్రభావం చూపబోదని.. తడిచిన బంతితోనూ వరుణ్‌ (Varun Chakravarthy) అనుకున్న ఫలితం రాబట్టలగడని పేర్కొన్నాడు.మంచు ప్రభావంభారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు జరుగనుంది. ఇందుకు ఆఖరి సన్నాహకంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌తో బిజీగా ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే 3-0తో గెలిచి.. సిరీస్‌ సొంతం చేసుకుంది. ఈ మూడు మ్యాచ్‌లలోనూ మంచు ప్రభావం కనిపించింది.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటుతారని.. తేమ ప్రభావం వల్ల మనవాళ్లకు పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లకు కష్టమే.. కానీజియోహాట్‌స్టార్‌లో మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వరల్డ్‌కప్‌ జరగనుంది. రాత్రి పూట మంచు ప్రభావం ఉండటం సహజం. కాబట్టి.. తడిసిన బంతితో బౌలింగ్‌ చేయడం స్పిన్నర్లకు కష్టమే.అయితే భారత స్పిన్నర్లకు ఇది పెద్ద ఇబ్బందేం కాకపోవచ్చు. ముఖ్యంగా వరుణ్‌ చక్రవర్తి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు ఆడాడు. తడిచిన బంతితోనూ ప్రభావం చూపగల సత్తా అతడికి ఉంది. అక్షర్‌ పటేల్‌కు కూడా ఇదేమీ పెద్ద కష్టం కాబోదు. కుల్దీప్‌ ఇబ్బంది పడే అవకాశంఅయితే మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మాత్రం.. తన బౌలింగ్‌ శైలి కారణంగా తేమ కారణంగా కాస్త ఇబ్బంది పడవచ్చు. అయినా పరిస్థితులకు తగ్గట్లు ఎలా బౌలింగ్‌ చేయాలో కుల్దీప్‌నకు తెలుసు’ అని కుంబ్లే అన్నాడు.టీమిండియాకు ఆ సత్తా ఉందిఅదే విధంగా.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా... వరల్డ్‌కప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తుందని కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్‌ గెలవడం అంత సులువైన విషయం కాదు. ఇప్పటి వరకు ఏ జట్టూ ఆ ఫీట్‌ నమోదు చేయలేదు. అయితే టీమిండియాకు ఆ సత్తా ఉంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేంత బలంగా ఉంది’’ అని కుంబ్లే పేర్కొన్నాడు. చదవండి: ICC: పాకిస్తాన్‌ స్థానంలో ఉగాండా!.. ట్వీట్‌ వైరల్‌

WPL 2026: Delhi Capitals Skipper Jemimah Rodrigues Fined Rs 12 Lakh2
జెమీమా రోడ్రిగ్స్‌కు భారీ షాక్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ మహిళా జట్టు కెప్టెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026లో సారథిగా ప్రమోషన్‌ పొందిన ఈ టీమిండియా స్టార్‌.. కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోతోంది. ఇప్పటికే జెమీమా సారథ్యంలో ఈ సీజన్‌లో వరుస పరాజయాలు చవిచూసిన ఢిల్లీ.. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది.వడోదర వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. మూడు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఢిల్లీ ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. మరో ఎదురుదెబ్బఇక గుజరాత్‌ చేతిలో ఓటమితో డీలా పడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఆమెకు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఇందుకు సంబంధించి WPL అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారీ జరిమానా‘‘వడోదరలోని బీసీఏ స్టేడియంలో మంగళవారం గుజరాత్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ జెమీ రోడ్రిగ్స్‌కు జరిమానా విధించడమైనది.ఈ సీజన్‌లో ఇదే ఆమె మొదటి తప్పిదం కావున.. డబ్ల్యూపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టాము’’ అని WPL యాజమాన్యం పేర్కొంది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది.బ్యాటర్‌గా ఫెయిల్‌ లక్ష్య ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 171 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా మూడు పరుగుల తేడాతో ఓడి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జెమీమా (16) నిరాశపరచగా.. నికీ ప్రసాద్‌ (24 బంతుల్లో 47) ఢిల్లీ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచింది.చదవండి: శుబ్‌మన్‌ గిల్‌కు బాగానే అర్థమైంది: రాహుల్‌ ద్రవిడ్‌

Our Captain Is: Cricket Iceland Takes A Dig At Pak T20 WC Boycott Fiasco3
ICC: పాకిస్తాన్‌ స్థానంలో ఉగాండా!.. ట్వీట్‌ వైరల్‌

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీరుపై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సోషల్‌ మీడియా వేదికగా అదిరిపోయే రీతిలో పీసీబీ నాన్చుడు వ్యవహారానికి కౌంటర్‌ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆడే విషయంపై త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని.. అదే సమయంలో తమను దృష్టిలో పెట్టుకోవాలంటూ సెటైరికల్‌గా విజ్ఞప్తి చేసింది.బంగ్లాదేశ్‌ అవుట్‌అసలేం జరిగిందంటే.. భారత్‌- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదంటూ.. తమ వేదికను మార్చాల్సిందిగా బంగ్లాదేశ్‌ పంతం పట్టింది. ఇందుకు నిరాకరించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) బంగ్లాదేశ్‌ను తప్పించి.. ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకువచ్చింది.ఇక బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఓటు వేసిన పాక్‌ బోర్డు.. తాము కూడా టోర్నీ నుంచి వైదొలుతామని బెదిరింపు ధోరణి అవలంబించింది. ఇప్పటికే పాక్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసినా.. బంగ్లా కోసమంటూ పీసీబీ అతి చేస్తోంది. ఒకవేళ పాక్‌ ఇలాగే ఓవరాక్షన్‌ చేస్తే.. ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.పీసీబీ మేకపోతు గాంభీర్యంఅందుకే ఫిబ్రవరి 2 వరకు తమ నిర్ణయం చెబుతామంటూ పీసీబీ మరోసారి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్‌ క్రికెట్‌ సెటైరికల్‌ ట్వీట్‌తో ముందుకు వచ్చింది. ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ట్వీట్‌ వైరల్‌‘‘టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొంటారా? లేదా? అన్న అంశంపై పాకిస్తాన్‌ ఫిబ్రవరి 2 వరకు నిర్ణయం తీసుకునేలా కనిపించడం లేదు. నిజంగా ఇది చాలా అన్యాయం. ఇందులో దాచడానికి ఇంకేముంది. ఇంకా రహస్యంగా ఉంచడం సబబేనా? మా జట్టుకు పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు.ఒకవేళ మీరు ఇప్పటికే నిర్ణయం చెప్పి ఉంటే.. మా జట్టు పూర్తిస్థాయిలో సన్నాహకాలు మొదలుపెట్టేది. మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శ్రమించేది. అసలే మా కెప్టెన్‌ ప్రొఫెషనల్‌ బేకర్‌’’ అని ఐస్‌లాండ్‌ క్రికెట్‌ పీసీబీని టీజ్‌ చేసింది. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తుండగా.. పాక్‌ నెటిజన్లు మాత్రం ఐస్‌లాండ్‌ క్రికెట్‌కు ఇలాంటి పోస్టులు తప్ప ఆట చేతకాదంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంఇందుకు బదులుగా తమ కెప్టెన్‌ ‘బేకర్‌’ అని.. తమ జట్టు హెడ్‌కోచ్‌ స్టార్టప్‌లలో ఇన్వెస్టర్‌ అని.. అదే విధంగా తమ చైర్మన్‌ షిప్‌ కెప్టెన్‌ అని.. తమ జట్టులో భిన్నత్వంలో ఏకత్వం ఉందని కౌంటర్‌ ఇచ్చింది.అదే జరిగితే పాకిస్తాన్‌ స్థానంలో ఉగాండాఇక టీమిండియా అభిమానులు మాత్రం ఐస్‌లాండ్‌ క్రికెట్‌కు మద్దతుగా.. ‘‘పాక్‌ కచ్చితంగా టోర్నీలో ఆడుతుంది. లేదంటే వాళ్లకు ఆర్థికంగా కష్టాలు తప్పవు. పాక్‌ క్రికెట్‌ భవిష్యత్‌ కూడా ప్రమాదంలో పడుతుంది. ఇదంతా తెలిసినా కూడా తమ గురించి చర్చ జరగాలనే ఉద్దేశంతోనే పీసీబీ ఇలా నాటకాలు ఆడుతోంది’’ అని ఏకిపారేస్తున్నారు. కాగా ఒకవేళ పాక్‌ తప్పుకొన్నా.. ర్యాంకింగ్‌ ఆధారంగా ఉగాండా ఆ జట్టును భర్తీ చేస్తుంది. ఐస్‌లాండ్‌ క్రికెట్‌ అసలు ఐసీసీలో సభ్యదేశమే కాదు. అయితే, ఫన్నీ, సెటైరికల్‌ ట్వీట్లతో ఇలా అలరిస్తూ ఉంటుంది.చదవండి: టీ20 వరల్డ్‌కప్‌-2026: సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే!

Gill May Realised How difficult: Dravid Huge remark on IND Test struggles4
గిల్‌కు బాగానే అర్థమైంది: రాహుల్‌ ద్రవిడ్‌

టీమిండియా టెస్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ను ఉద్దేశించి భారత జట్టు మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయర్‌గా ఇప్పటికైనా గిల్‌కు అందులోని కష్టం అర్థమైందని పేర్కొన్నాడు. టెస్టు ప్రాధాన్యత ఏమిటో అతడికి తెలిసివచ్చిందని.. అందుకే ఆ దిశగా మార్పుల కోసం గొంతు విప్పాడని ద్రవిడ్‌ అన్నాడు.ఘోర పరాభవాలుగత రెండేళ్ల కాలంలో సొంతగడ్డపై టీమిండియాకు రెండు ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్‌ చేతిలో తొలిసారి 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత్‌.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలోనూ పాతికేళ్ల విరామం తర్వాత తొలిసారి 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది.అందుకే ఈ చేదు అనుభవాలుఈ పరిణామాల నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మరోవైపు.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్‌ (Shubman Gill)కు సైతం సఫారీల చేతిలో వైట్‌వాష్‌ రూపంలో పీడకల మిగిలింది. విరామం లేకుండా వరుస సిరీస్‌లు ఆడటం.. సరైన విధంగా సన్నద్ధం కాకపోవడం వల్లే టెస్టుల్లో చేదు అనుభవం మిగిలిందని గిల్‌ భావించాడు.బీసీసీఐకి ఓ విజ్ఞప్తిఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్‌కు ముందు కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్‌ మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని గిల్‌.. బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తాజాగా స్పందించాడు. బెంగళూరులో ఓ ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ..గిల్‌కు బాగానే అర్థమైంది‘‘టెస్టు సన్నద్ధత గురించి శుబ్‌మన్‌ ఇటీవలే ఓ కీలక సలహా ఇచ్చినట్లు తెలిసింది. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా అతడికి ఈ విషయంలో అవగాహన ఉంది. ఇటీవల కాలంలో అతడు మూడు ఫార్మాట్లు ఆడుతూ బిజీగా గడిపాడు.ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్‌కు ఎలా సన్నద్ధం కావాలన్న అంశం అతడికి ఇప్పటికి బాగా అర్థమై ఉంటుంది. సంప్రదాయ క్రికెట్‌లో ఉన్న కష్టం ఏమిటో అతడికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు.మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు.. వెనువెంటనే ఒక ఫార్మాట్‌ నుంచి మరొకదానికి మారటం కాస్త కష్టంగానే ఉంటుంది. టెస్టు సిరీస్‌కు నాలుగు రోజుల ముందు కూడా మ్యాచ్‌ ఆడాల్సి ఉంటే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అసలు టెస్టు మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే సమయమే దొరకదు.ప్రాక్టీస్‌తో పాటు నైపుణ్యం అవసరంగత నాలుగైదు నెలల క్రితం జరిగిన రెడ్‌బాల్‌ మ్యాచ్‌ల ఆధారంగా జట్టులోని కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి వచ్చిన విషయాన్ని గమనించాలి. ఇదే అతిపెద్ద సవాలు. టర్నింగ్‌ ట్రాక్స్‌, లేదంటే సీమింగ్‌ పిచ్‌ల మీద గంటల తరబడి బ్యాటింగ్‌ చేయడం అంత సులువేమీ కాదు. ఇందుకు ప్రాక్టీస్‌తో పాటు నైపుణ్యం అవసరం’’ అని రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్‌కప్‌-2026: సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే!

IND vs NZ 4th T20I: Predicted Playing XI, Rare chance for Shreyas Iyer5
IND vs NZ: తుదిజట్టులో శ్రేయస్‌ అయ్యర్‌!

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది టీమిండియా. మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్‌లలోనూ గెలిచి.. ప్రపంచకప్‌ టోర్నీకి ముందు మరోసారి సత్తా చాటాలని సూర్య సేన పట్టుదలగా ఉంది.మరోవైపు.. ఐసీసీ ఈవెంట్‌కు ముందు టీమిండియాను ఒక్కసారైన నిలువరించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా బుధవారం ఇరుజట్లు నాలుగో టీ20 (IND vs NZ 4th T20I)లో తలపడనున్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా ఈ సిరీస్‌ కైవసం చేసుకున్న నేపథ్యంలో.. వరల్డ్‌కప్‌ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు రెస్ట్‌ ఇచ్చే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.హార్దిక్‌ పాండ్యా స్థానంలో..ఈ క్రమంలో చాన్నాళ్లుగా టీమిండియా తరఫున టీ20లలో పునరాగమనం చేయాలన్న మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) కల నెరవేరే అవకాశం లేకపోలేదు. హార్దిక్‌ పాండ్యా స్థానంలో అతడు తుదిజట్టులోకి వస్తాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైనా సంజూ శాంసన్‌కు మరొక్క అవకాశం దక్కనుంది.సంజూ కూడా సేఫ్‌వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం ఇటు సంజూకు.. అటు శ్రేయస్‌కు సానుకూలాంశంగా మారింది. తిలక్‌ స్థానంలో శ్రేయస్‌ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఓపెనర్‌గా సంజూ విఫలం కావడం.. అదే సమయంలో మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ విధ్వంసకర ఆట తీరుతో ఆకట్టుకోవడంతో సంజూ స్థానం ప్రమాదంలో పడింది.ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేస్తే..ఒకవేళ తిలక్‌ నాలుగో టీ20తో తిరిగి వస్తే ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసి సంజూను తుదిజట్టు నుంచి తప్పించే అవకాశం ఉండేది. అయితే, ఇప్పటికి ఆ ప్రమాదం తప్పింది. తిలక్‌ లేకపోవడం వల్ల ఇలా సంజూ సేఫ్‌ కాగా.. హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతినిచ్చే శ్రేయస్‌ అయ్యర్‌కు బ్యాట్‌ పట్టే అవకాశం రావొచ్చు.ఇక రొటేషన్‌లో భాగంగా బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ తుదిజట్టులోకి రావొచ్చు. అదే విధంగా.. అక్షర్‌ పటేల్‌ గాయం నుంచి కోలుకుని కుల్దీప్‌ యాదవ్‌ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.న్యూజిలాండ్‌తో నాలుగో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా/శ్రేయస్‌ అయ్యర్‌, శివం దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయి, హర్షిత్‌ రాణా, జస్‌ప్రీత్‌ బుమ్రా/అర్ష్‌దీప్‌ సింగ్‌.చదవండి: T20 WC 2026: పాక్‌ క్రికెట్‌ని నాశనం చేస్తారా?: పీసీబీపై మాజీల ఫైర్‌

Former Indian cricketers WC Winners Pick T20 WC 2026 semifinalists6
T20 WC 2026: సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే!

పొట్టి క్రికెట్‌ మహా సంగ్రామానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్లో ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి.నాలుగు గ్రూపులుగ్రూప్‌-ఎ నుంచి డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా (India), పాకిస్తాన్‌ (Pakistan), అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ పోటీ పడుతుండగా.. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా (Australia), ఐర్లాండ్‌, ఒమన్‌, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌ (England), వెస్టిండీస్‌, నేపాల్‌, ఇటలీ, స్కాట్లాండ్‌ ఉన్నాయి. బంగ్లాదేశ్‌ నిష్క్రమణతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ వచ్చి చేరింది.ఇక గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై మాజీ క్రికెటర్లు తమ అంచనా తెలియజేస్తున్నారు.ఈసారి భారత్‌- ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరతాయని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ జోస్యం చెప్పాడు. తాజాగా సెమీ ఫైనలిస్టుల గురించి భారత మాజీ క్రికెటర్లు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో భాగంగా తమ అంచనాలను తెలిపారు. సెమీ ఫైనల్‌ చేరే జట్లు ఇవే!ఇందులో భాగంగా 2007 టీ20 ప్రపంచకప్‌ విన్నర్‌ రాబిన్‌ ఊతప్ప మాట్లాడుతూ.. టీమిండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ టాప్‌-4లో నిలుస్తాయని అభిప్రాయపడ్డాడు.పాకిస్తాన్‌ కూడా వస్తుందిఇక టీ20 వరల్డ్‌కప్‌-2007 విజేత ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ.. తన అభిప్రాయం ప్రకారం ఈసారి టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు పాకిస్తాన్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుందని పేర్కొన్నాడు. మరోవైపు.. భారత మాజీ టెస్టు ప్లేయర్‌ ఛతేశ్వర్‌ పుజారా.. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ చేరతాయని జోస్యం చెప్పాడు.గత ఎడిషన్‌ విజేత టీమిండియాఅదే విధంగా.. మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా పూజారా అభిప్రాయంతో ఏకీభవించాడు. కాగా గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌ (2024)లో భారత్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్‌ సెమీస్‌ చేరిన విషయం తెలిసిందే. అయితే తొలి సెమీ ఫైనల్లో అఫ్గన్‌ను సౌతాఫ్రికా.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్‌ ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్‌ అవుట్‌.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్‌!

Bad for Our Cricket: Pak Ex Stars reject PCB T20 WC 2026 Protest plan7
పాక్‌ క్రికెట్‌ని నాశనం చేస్తారా?: పీసీబీపై మాజీల ఫైర్‌

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చి కష్టాలు కొని తెచ్చుకొంటోంది. బంగ్లాదేశ్‌కు మద్దతు పలికే క్రమంలో తమ జట్టు ప్రయోజనాలను కూడా పణంగా పెట్టేందుకు సిద్ధమైంది. వెరసి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC)తో పీసీబీ సంబంధాలు చెడిపోయే ప్రమాదం తలెత్తింది. ఐసీసీతో పెట్టుకోవద్దని వార్నింగ్‌ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్లేయర్లు, క్రీడాపాలకులు పీసీబీ తీరును విమర్శిస్తున్నారు. ఐసీసీతో సంబంధాలు చెడగొట్టుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఫిబ్రవరి 7- మార్చి 8న మధ్య టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను తప్పించింది. బంగ్లాను తప్పిస్తూ కఠిన నిర్ణయం భారత్‌లో తమకు భద్రత లేదంటూ ఆరోపణలు చేసిన బంగ్లా క్రికెట్‌ బోర్డు.. ఐసీసీ పరిశీలనా బృందం అదేమీ లేదని తేల్చినా పంతం వీడలేదు. ఫలితంగా బంగ్లాను తప్పిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను వరల్డ్‌కప్‌ టోర్నీలో చేర్చింది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందని.. తాము కూడా వరల్డ్‌కప్‌లో ఆడేదీ లేనిది ఈ వారంలోగా వెల్లడిస్తామని పీసీబీ చైర్మన్‌ మొహసిన్‌ నక్వీ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్‌ నుంచి వైదొలగాల్సిన అవసరమైతే లేదని ఆ దేశ మాజీలు అంటున్నారు. చెడగొట్టుకోవద్దు‘బంగ్లాదేశ్‌కు అండగా నిలవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వరల్డ్‌కప్‌నకు జట్టును పంపకపోవడానికి కారణమేముంది. అనవసరంగా ఐసీసీతో సంబంధాలను చెడగొట్టుకోవద్దు’ అని పీసీబీ మాజీ కార్యదర్శి ఆరిఫ్‌ అలీ అన్నారు.‘వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించడానికి ముందు జరిగిన సమావేశంలో బంగ్లా బోర్డుకు కేవలం పాకిస్తాన్‌ మాత్రమే మద్దతు తెలిపింది. అయితే బంగ్లా ప్రతిపాదనను తిరస్కరించిన ఐసీసీ వరల్డ్‌కప్‌ నుంచి తప్పించింది’ అని పీసీబీ మాజీ చైర్మన్‌ ఖాలిద్‌ మహమూద్‌ తెలిపారు.పాక్‌ క్రికెట్‌ తీవ్రంగా నష్టపోతుందిపాక్‌ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ మొహసిన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘మనకు భారత్‌తో విబేధాలు ఉన్నాయి. కానీ మనం ఆడనున్న మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు వరల్డ్‌కప్‌ కోసం జట్టును పంపకపోవడానికి కారణమేముంది. అదే జరిగిన పాక్‌ క్రికెట్‌ తీవ్రంగా నష్టపోతుంది’ అని అన్నాడు. మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ మాట్లాడుతూ... ‘పాకిస్తాన్‌ వరల్డ్‌కప్‌లో ఆడాలని కోరుకుంటున్నా. మన దగ్గర మంచి ప్లేయర్లు ఉన్నారు. మన జట్టు ప్రపంచకప్‌ వంటి పెద్ద వేదికలపై మెరుగైన ప్రదర్శన చేస్తుంటే చూడటం బాగుంటుంది’ అని అన్నాడు.పాకిస్తాన్‌ కోసంకాగా భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తటస్థ వేదికలపై ఇరు జట్లు ఐసీసీ ఈవెంట్లలో తలపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో ఆతిథ్యం ఇస్తున్నా.. పాకిస్తాన్‌ కోసం శ్రీలంకను మరో వేదికగా ఎంపిక చేసింది ఐసీసీ. అయితే, పీసీబీ మాత్రం ఐసీసీ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా.. బంగ్లాదేశ్‌ కోసమంటూ టోర్నీ నుంచి వైదొలుతామంటూ అతి చేస్తోంది. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్‌ అవుట్‌.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్‌!

England Beat Sri Lanka By 53 Runs In 3rd ODI Clinch Series 20268
SL Vs ENG: హ్యారీ బ్రూక్‌ విధ్వంసం.. శతక్కొట్టిన రూట్‌

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ జట్టు... శ్రీలంకపై వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ 53 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. తద్వారా 2–1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. 2023 తర్వాత ఇదే తొలిసారికాగా 2023 తర్వాత ఇంగ్లండ్‌ జట్టుకు ఇదే తొలి విదేశీ వన్డే సిరీస్‌ విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (66 బంతుల్లో 136 నాటౌట్‌; 11 ఫోర్లు, 9 సిక్స్‌లు), మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (108 బంతుల్లో 111 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీలతో కదంతొక్కారు. జేకబ్‌ బెథెల్‌ (72 బంతుల్లో 65; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (7), రేహాన్‌ అహ్మద్‌ (24) విఫలమవడంతో ఇంగ్లండ్‌ జట్టు 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా... మూడో వికెట్‌కు బెథెల్‌తో కలిసి రూట్‌ 126 పరుగులు జోడించాడు. 57 బంతుల్లోనే శతకంఅయితే, బ్రూక్‌ రాకతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న పరుగుల ప్రవాహం ఒక్కసారిగా రాకెట్‌ వేగాన్ని అందుకుంది. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు రూట్‌తో కలిసి బ్రూక్‌ 113 బంతుల్లోనే 191 పరుగులు జతచేశాడు. ఈ క్రమంలో 40 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న బ్రూక్‌... 57 బంతుల్లోనే శతకం ఖాతాలో వేసుకున్నాడు. శతక్కొట్టిన రూట్‌ మరోవైపు.. రూట్‌ 100 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, ధనంజయ, వండర్సే తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 46.4 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. పవన్‌ రత్నాయకే (115 బంతుల్లో 121; 12 ఫోర్లు, 1 సిక్స్‌) చక్కటి పోరాటం కనబర్చాడు. 8వ ఓవర్‌లో క్రీజులోకి వచి్చన అతడు చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. మెరుపు అర్ధశతకంఓపెనర్‌ పాథుమ్‌ నిసాంక (25 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకంతో జట్టుకు శుభారంభం ఇవ్వగా... పవన్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. అయితే అతడికి సహచరుల నుంచి తగినంత సహకారం లభించలేదు. కమిల్‌ మిశ్రా (22), కుషాల్‌ మెండిస్‌ (20), కెప్టెన్‌ చరిత అసలంక (13), జనిత్‌ లియనాగె (22), దునిత్‌ వెల్లలాగె (22) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఓవర్టన్, డాసన్, విల్‌ జాక్స్, ఆదిల్‌ రషీద్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. బ్రూక్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, రూట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ప్రారంభం కానుంది.చదవండి: World Cup 2026: టీమిండియా ఘన విజయం

Wicketkeeper Batsman Aashwin Ssuraj Wins Best Batsman Award In England9
చిచ్చర పిడుగు.. అశ్విన్ సూరజ్‌..

హైదరాబాద్‌కు చెందిన వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్‌ పుల్ల అశ్విన్ సూరజ్‌ ఇంగ్లాండ్‌ పిచ్‌పై రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ సీజన్‌–2025లో హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌ ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌లో వాట్‌ఫోర్డ్‌ టౌన్‌ క్రికెట్‌ క్లబ్‌ తరపున 579 పరుగులు సాధించి ‘ఉత్తమ బ్యాట్స్‌మన్‌’ అవార్డు గెలుచుకున్నాడు. సెలవులపై స్వస్థలానికి వచ్చిన అశ్విన్ కు నగరంలోని హాట్‌స్పాట్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఘనంగా సత్కారం జరిగింది. 2017 నుంచి 2021 వరకు నోబుల్‌ క్రికెట్‌ క్లబ్‌కు కెపె్టన్‌గా వ్యవహరిస్తూ క్రమశిక్షణ, ఫిట్‌నెస్, నాయకత్వ లక్షణాలను తన లైఫ్‌ స్టైల్‌లో భాగం చేసుకున్నానని సూరజ్‌ తెలిపారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలోని ఏ–డివిజన్‌ వన్డే లీగ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అశి్వన్, అనంతరం సిటీ కాలేజ్‌ ఓల్డ్‌ బాయ్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. సూరజ్‌ ఎప్పుడూ ఆటలో ప్రతిభ చూపుతూ ముందుంటూ నాయకత్వం వహిస్తాడని మెంటార్‌ డా.ఫహీమ్‌ ఉద్దిన్‌ ఖాజా తెలిపారు.

Kalinga Lancers won the Hockey India League trophy for the second time10
విజేత కళింగ లాన్సర్స్‌

భువనేశ్వర్‌: పురుషుల హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో కళింగ లాన్సర్స్‌ రెండోసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో కళింగ లాన్సర్స్‌ జట్టు 3–2 గోల్స్‌ తేడాతో రాంచీ రాయల్స్‌పై గెలుపొంది 2017 తర్వాత మళ్లీ టైటిల్‌ సాధించింది. కళింగ లాన్సర్స్‌ తరఫున అలెగ్జాండ్రా హెండ్రిక్స్‌ (4వ, 27వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటగా... దిల్‌ప్రీత్‌ సింగ్‌ (25వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. రాంచీ రాయల్స్‌ తరఫున అరిజీత్‌ సింగ్‌ హండల్‌ (9వ నిమిషంలో), టామ్‌ బూన్‌ (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ కొట్టారు. ఫైనల్‌ కంటే ముందు నిర్వహించిన వర్గీకరణ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తూఫాన్స్‌ 4–3 గోల్స్‌ తేడాతో హెచ్‌ఐఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ జట్టుపై విజయం సాధించి మూడో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్‌ తూఫాన్స్‌ తరఫున అమన్‌దీప్‌ లక్రా (30వ, 53వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా... నీలకంఠ శర్మ (24వ నిమిషంలో), జాకబ్‌ అండర్సన్‌ (33వ నిమిషంలో) చెరో గోల్‌ కొట్టారు. హెచ్‌ఐఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ టీమ్‌ తరఫున సామ్‌ వర్డ్‌ (14వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్‌... కేర్‌ రసెల్‌ (55వ నిమిషంలో) ఓ గోల్‌ సాధించాడు. విజేతగా నిలిచిన కళింగ లాన్సర్స్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన రాంచీ రాయల్స్‌కు రూ. 2 కోట్లు దక్కాయి. మూడో స్థానం దక్కించుకున్న హైదరాబాద్‌ తూఫాన్స్‌కు కోటి రూపాయల నగదు బహుమతి లభించింది. హెచ్‌ఐఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ జట్టుకు ‘ఫెయిర్‌ ప్లే’ అవార్డు దక్కింది. తమిళనాడు డ్రాగన్స్‌ గోల్‌కీపర్‌ ప్రిన్స్‌ దీప్‌ సింగ్‌కు ‘బెస్ట్‌ గోల్‌ కీపర్‌’ అవార్డు లభించింది. హెచ్‌ఐఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ జట్టు సభ్యుడైన టాలెమ్‌ ప్రియోబర్టా ‘అప్‌కమింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డు దక్కించుకున్నాడు. వీరిద్దరికీ రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. రాంచీ రాయల్స్‌ కెపె్టన్‌ టామ్‌ బూన్‌ ఈ టోర్నీలో అత్యధిక (19) గోల్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచి ‘టాప్‌ స్కోరర్‌’ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల బహుమతి అందుకున్నాడు. హైదరాబాద్‌ తూఫాన్స్‌ ప్లేయర్‌ అమన్‌దీప్‌ లక్రాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డుతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి లభించింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement