ప్రధాన వార్తలు
దేవజిత్ సైకియా ఆకస్మిక రాజీనామా
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.అసోం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ ప్రభుత్వంలో దాదాపు ఐదేళ్ల పాటు అడ్వకేట్ జనరల్గా సేవలందించిన దేవజిత్ సైకియా.. రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.క్రికెట్తో పాటు న్యాయరంగంలోనూ సైకియా ప్రత్యేక గుర్తింపు పొందారు. అసోంకు చెందిన ఆయన గతంలో రాష్ట్ర రంజీ జట్టుకు వికెట్కీపర్, మిడిలార్డర్ బ్యాటర్గా సేవలందించారు. అనంతరం న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2021లో అసోం రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు.ఇక క్రికెట్ పరిపాలనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అసోం క్రికెట్ అసోసియేషన్లో వివిధ హోదాల్లో పని చేసి.. 2022లో బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అనంతరం జై షా ఐసీసీ చైర్మన్గా వెళ్లిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు.
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్లో 13 బంతుల్లో 4 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 35 పరుగులు చేసి బీభత్సం సృష్టించిన అతను.. విండీస్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఓపెనర్గా ఐపీఎల్లో 200కు పైగా స్ట్రైక్రేట్తో అత్యధిక సార్లు 30+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అతడు 14 సార్లు ఈ ఫీట్ను సాధించి గేల్ (13) రికార్డును అధిగమించాడు. నిన్నటి మ్యాచ్లో అభిషేక్ స్ట్రైక్రేట్ ఏకంగా 269.23గా ఉండింది. గత సీజన్ నుంచి అభిషేక్ ప్రత్యర్ది బౌలర్లను షేక్ చేస్తున్నాడు. భయంలేని బ్యాటింగ్తో మెరుపు ఆరంభాలు అందిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. పవర్ప్లేలోనే మ్యాచ్ గమనాన్ని మార్చేస్తూ.. ప్రత్యర్దులను పోరాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు.ఈ సీజన్లో అభిషేక్ విధ్వంసం పతాకస్థాయిలో ఉంది. 11 మ్యాచ్ల్లో అతడు 210.18 స్ట్రైక్రేట్తో 475 పరుగులు చేశాడు. ఇందులో 36 సిక్సర్లు, 43 బౌండరీలు, ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ దూకుడు కారణంగా హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది. నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ మెరుపు ఆరంభం ఇవ్వడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. అనంతరం బౌలర్లు సత్తా చాటడంతో లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2027 సిరీస్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. వచ్చే ఏడాది జనవరి 21న తొలి టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగనుంది.అనంతరం జనవరి 29 నుండి చెన్నై వేదికగా రెండో టెస్ట్.. ఫిబ్రవరి 11 నుండి గౌహతి వేదికగా మూడో టెస్ట్.. ఫిబ్రవరి 19 నుండి రాంచీ వేదికగా నాలుగో టెస్ట్.. ఫిబ్రవరి 27 నుండి అహ్మదాబాద్ వేదికగా ఐదో టెస్ట్ ఆడనుంది.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2027 తేదీల ప్రకటనతో పాటు భారత పర్యటనలోని మరిన్ని సిరీస్ల వివరాలను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. బీజీటీ 2027కు ముందు ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత ఏ జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది.అలాగే ఆస్ట్రేలియా మహిళల ఏ జట్టు, పురుషుల అండర్-19 జట్టు కూడా సంబంధిత జట్లతో మల్టీ ఫార్మాట్ సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది.ఆస్ట్రేలియా-ఏతో సిరీస్సెప్టెంబర్ 22- తొలి మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)సెప్టెంబర్ 29- రెండో మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)అండర్-19 జట్టుతో సిరీస్భారత అండర్-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్లు ఆడనుంది.సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 27- తొలి మల్టీ డే మ్యాచ్ (రాజ్కోట్)అక్టోబర్ 5- రెండో మల్టీ డే మ్యాచ్ (అహ్మదాబాద్)మహిళల ఏ జట్టుతో సిరీస్ఆస్ట్రేలియా జట్టుతో భారత మహిళల ఏ జట్టు సెప్టెంబర్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (సెప్టెంబర్ 12, 15, 17-మొహాలి), 3 వన్డేలు (20, 23, 25- ధర్మశాల), ఓ మల్టీ డే మ్యాచ్ (29- ధర్మశాల) జరుగనున్నాయి.
మళ్లీ యాక్షన్లోకి కేన్ మామ
ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లతో త్వరలో జరుగబోయే టెస్ట్ సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టును నిన్న (మే 6) ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్గా టామ్ లాథమ్ నియమితుడు కాగా.. గాయాల నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్లు కైల్ జేమీసన్, విలియమ్ ఓ రూర్కీ, వెటరన్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి వచ్చారు.రెండేళ్ల తర్వాత అవకాశం2024 ఫిబ్రవరిలో వెన్నెముక గాయం కారణంగా టెస్టులకు దూరమైన కైల్ జేమీసన్ ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. 19 టెస్టుల్లో 80 వికెట్లు తీసి అద్భుత రికార్డు కలిగిన జేమీసన్పై న్యూజిలాండ్ జట్టుకు భారీ అంచనాలు ఉన్నాయి.24 ఏళ్ల రూర్కీ సైతం గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. అతడు ఇప్పటికే 11 టెస్టుల్లో 39 వికెట్లు సాధించి మంచి జోరుమీదున్నాడు. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఇటీవలికాలంలో తరుచూ గాయాల బారిన పడుతూ జట్టులోకి వచ్చీ పోతున్నాడు. రాబోయే సిరీస్ల్లో కేన్ కూడా న్యూజిలాండ్కు కీలకం కానున్నాడు.బలమైన పేస్ దళంఐర్లాండ్, ఇంగ్లండ్తో సిరీస్ల కోసం న్యూజిలాండ్ భారీ పేస్ దళాన్ని ఎంపిక చేసింది. జట్టులో మ్యాట్ హెన్రీ, జకరీ ఫౌల్క్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ లాంటి భయంకరమైన పేసర్లు ఉన్నారు.తొలి పిలుపుసెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఆల్రౌండర్ డీన్ ఫాక్స్క్రాఫ్ట్కు తొలిసారి టెస్టు జట్టులో అవకాశం లభించింది. డీన్.. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.కీలక గైర్హాజరీలు- జేకబ్ డఫీ తన తొలి బిడ్డ జననం కారణంగా ఎంపికకు అందుబాటులో లేడు.- మైఖేల్ బ్రేస్వెల్ టెస్టు క్రికెట్కు తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.- మిచెల్ సాంట్నర్ భుజ గాయం నుంచి కోలుకుంటున్నాడు.కాగా, న్యూజిలాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఐర్లాండ్.. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్తో మ్యాచ్ బెల్ఫాస్ట్ వేదికగా మే 27న మొదలు కానుండగా.. ఇంగ్లండ్తో మూడు టెస్ట్లు లార్డ్స్, కెన్నింగ్టన్ ఓవల్, ట్రెంట్బ్రిడ్జ్ వేదికలుగా జూన్ 4, 17, 25 తేదీలోల ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, ఈ రెండు సిరీస్లను కీలకంగా భావిస్తోంది. ముందున్న భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని బలమైన జట్టును సిద్ధం చేసుకుంటుంది.ఐర్లాండ్ టెస్ట్ కోసం న్యూజిలాండ్ జట్టు:టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), క్రిస్టియన్ క్లార్క్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రే, రాచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు:టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్*, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్సన్ఇంగ్లాండ్ పర్యటనకు ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్
టీమిండియా చారిత్రక సిరీస్ షెడ్యూల్ విడుదల
వివిధ విభాగాల్లో భారత క్రికెట్ జట్ల ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ నిన్న (మే 6) విడుదల చేసింది. పురుషులు, మహిళలు, ఏ-జట్లు, అండర్-19 జట్ల మ్యాచ్లకు వేదికలు, తేదీలను ఖరారు చేసింది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ బిజీ షెడ్యూల్లోకి వెళ్లనుంది. ముఖ్యంగా భారత్-ఏ, మహిళల సీనియర్ టీమ్, అండర్-19 జట్లు వరుస సిరీస్లలో పాల్గొననున్నాయి.ఆస్ట్రేలియా-ఏతో సిరీస్ఆస్ట్రేలియా-ఏ జట్టు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్-ఏ జట్టుతో రెండు మల్టీ డే మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడనుంది.సెప్టెంబర్ 22- తొలి మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)సెప్టెంబర్ 29- రెండో మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)అండర్-19 జట్టుకు ఆస్ట్రేలియా సవాల్భారత అండర్-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్లు ఆడనుంది.సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 27- తొలి మల్టీ డే మ్యాచ్ (రాజ్కోట్)అక్టోబర్ 5- రెండో మల్టీ డే మ్యాచ్ (అహ్మదాబాద్)చారిత్రక సిరీస్భారత్.. జింబాబ్వే మహిళల జట్టుకు తొలిసారి ఓ ద్వైపాక్షిక సిరీస్ కోసం ఆతిథ్యమివ్వనుంది. టీ20, వన్డే ఫార్మాట్లలో జరిగే ఈ సిరీస్ అక్టోబర్లో జరుగనుంది. ఈ సిరీస్లో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగనున్నాయి. టీ20లకు రాయ్పూర్, వన్డేలకు బరోడా ఆతిథ్యమివ్వనుంది.అక్టోబర్ 16- తొలి టీ20అక్టోబర్ 18- రెండో టీ20అక్టోబర్ 20- మూడో టీ20అక్టోబర్ 23- తొలి వన్డేఅక్టోబర్ 25- రెండో వన్డేఅక్టోబర్ 28- మూడో వన్డేమహిళల ఏ జట్టు vs ఆస్ట్రేలియాఆస్ట్రేలియా జట్టుతో భారత మహిళల ఏ జట్టు సెప్టెంబర్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (సెప్టెంబర్ 12, 15, 17-మొహాలి), 3 వన్డేలు (20, 23, 25- ధర్మశాల), ఓ మల్టీ డే మ్యాచ్ (29- ధర్మశాల) జరుగనున్నాయి.మహిళల ఏ జట్టు vs ఇంగ్లండ్ఇంగ్లండ్ జట్టుతో భారత మహిళల ఏ జట్టు నవంబర్-డిసెంబర్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (నవంబర్ 30, డిసెంబర్ 3, 5- పూణే), 3 వన్డేలు (డిసెంబర్ 8, 11, 14- నవీ ముంబై), ఓ మల్టీ డే మ్యాచ్ (డిసెంబర్ 19- నవీ ముంబై) జరుగనున్నాయి.మహిళల అండర్-19 జట్టు vs శ్రీలంకశ్రీలంక అండర్-19 జట్టు జూన్లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 3 టీ20లు (జూన్ 22, 24, 27- చెన్నై), 3 వన్డేలు (జూన్ 30, జులై 3, 6- పుదుచ్చేరి) జరుగనున్నాయి.మహిళల అండర్-19 జట్టు vs ఇంగ్లండ్ఇంగ్లండ్ అండర్-19 జట్టు నవంబర్-డిసెంబర్లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 5 టీ20లు (నవంబర్ 26, 28 (బరోడా), డిసెంబర్ 1, 3, 6 (సూరత్)) జరుగనున్నాయి.
పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా.. షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరోసారి పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమైంది. మే-జూన్ నెలల్లో జరిగే ఈ పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ విడుదలైంది.తొలి వన్డే మే 30న రావల్సిండిలో జరుగనుండగా.. మిగతా వన్డేలు జూన్ 2, 4 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా మే 23న ఇస్లామాబాద్ చేరుకోనుంది.స్టార్ ఆటగాళ్లపై సందేహాలుపాక్ సిరీస్ ఐపీఎల్ ముగింపు సమయానికి ప్రారంభమవుతుండటంతో ఆసీస్ ఆటగాళ్ల లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్ పాట్ కమిన్స్ సహా పలువురు సీనియర్ ఆటగాళ్ల అందుబాటుపై స్పష్టత లేదు.ప్రపంచకప్కు ముందు టీ20 సిరీస్ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది జనవరిలో, టీ20 ప్రపంచకప్కు ముందు కూడా పాకిస్తాన్లో పర్యటించింది. ఆ పర్యటనలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్ను పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం విశేషం.బంగ్లాదేశ్ చేతిలో ఓటమిఇటీవల పాక్ బంగ్లాదేశ్ చేతిలో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్ కోసం పాక్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది.రేపటి నుంచి టెస్ట్ సిరీస్ప్రస్తుతం పాక్ జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్ ఢాకా వేదికగా రేపటి నుండి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ సిల్హెట్ వేదికగా మే 16 నుండి మొదలవుతుంది.తర్వాత బంగ్లాదేశ్ టూర్పాకిస్తాన్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు జూన్ 9 నుంచి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ల సిరీస్లు జరుగనున్నాయి.
ఓపెనర్ల శతకాలు.. చారిత్రక విజయం సాధించిన పాక్
మహిళల క్రికెట్లో పాకిస్తాన్ అద్భుత విజయం సాధించింది. స్వదేశంలో జరిగిన వన్డేలో పసికూన జింబాబ్వేపై 206 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాక్ మహిళల క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి భారీ విజయం. ఈ గెలుపుతో పాక్ సిరీస్ను కూడా కైవసం చేసుకుంది.జింబాబ్వే తొలిసారి పాక్లో పర్యటిస్తున్న చారిత్రక సిరీస్ ఇది. ఈ పర్యటనలో జింబాబ్వే 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్లో భాగంగా జరిగిన రెండో వన్డే ఇది. అంతకుముందు తొలి వన్డేలోనూ పాకిస్తానే విజయం సాధించింది (168 పరుగుల తేడాతో). ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే కరాచీ వేదికగా మే 9న జరుగనుంది. అనంతరం 12, 14, 15 తేదీల్లో ఇదే కరాచీ వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి.ఓపెనర్ల శతకాలుతాజా వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సదాఫ్ షమాస్ (101), గుల్ ఫెరోజా (100) సెంచరీలతో కదంతొక్కారు. వన్డౌన్ బ్యాటర్ సిద్రా అమీన్ (59 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ ఫాతిమా సనా 25, ఆలియా రియాజ్ 27, అయేషా జాఫర్ 18 (నాటౌట్) పరుగులు చేశారు.కుప్పకూలిన జింబాబ్వేభారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 137 పరుగులకే ఆలౌటైంది. ఫాతిమా సనా (6-0-15-3), మొమినా రియాసత్ (8-0-39-2), రమీన్ షమీమ్ (8-2-20-2), సయ్యదా అరూబ్ షా (6-1-18-2), డయానా బేగ్ (7-1-23-1) జింబాబ్వే పతనాన్ని శాశించారు. ఆ జట్టు తరఫున కెలిస్ (32), బిజా (29), పసిపనోద్యా (33 నాటౌట్), లిండోకుహ్లే (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
ఐపీఎల్ ఫైనల్ పోయింది
బెంగళూరు: అనుకున్నట్లుగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ మరోచోటుకు మారింది. గుజరాత్లో అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ ప్రకటించడంతో బెంగళూరు క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నెల 31న మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్లు, చిన్న స్టేడియం కావడం తదితర కారణాలతో మార్చేసినట్లు బీసీసీఐ ప్రకటించడం గమనార్హం. ఇటీవల చిన్నస్వామిలో భద్రతా సమస్యలు తలెత్తాయి. గతంలో తీవ్ర తొక్కిసలాట జరిగి అనేకమంది చనిపోవడం తెలిసిందే. ఇటీవల ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ సమయంలో సుమారు 240 కెమెరాలను పనిచేయలేదు.ఎమ్మెల్యేల టికెట్లకు లింకు లేదు: డీసీఎంఅహ్మదాబాద్లో పెద్ద స్టేడియం ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను బెంగళూరు నుంచి అక్కడికి మార్చి ఉండవచ్చు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్ల పంపిణీకి, మ్యాచ్ మార్పునకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీసీసీఐ పెద్దలు అలాగే మాట్లాడనీ, సరైన సమాధానం ఇస్తానన్నారు.
శ్రేయస్ అయ్యర్ మరో టైటిల్ గెలిస్తే...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో సారథిగా శ్రేయస్ అయ్యర్ రెండో టైటిల్ను గెలవగలిగితే అతను దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరతాడని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జియో స్టార్ ‘అవుట్ ఆర్ నాటౌట్’ కార్యక్రమంలో అయ్యర్ నాయకత్వ లక్షణాలను అతను ప్రశంసించాడు. ‘శ్రేయస్ అయ్యర్ మరో సీజన్లో తన టీమ్ను సమర్థంగా నడిపిస్తున్నాడు. అతను ఢిల్లీ, కోల్కతా, పంజాబ్... ఎక్కడ కెప్టెన్గా చేసినా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శించాడు. తన ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచుతాడు. ప్రశాంతంగా తనకు కావాల్సింది రాబట్టగల సామర్థ్యం అతనికి ఉంది. మరో ట్రోఫీ గెలిస్తే ధోని, రోహిత్, గంభీర్ల సరసన శ్రేయస్ చేరతాడు’ అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.
ప్రతీకార విజయం.. టేబుల్ టాపర్గా ఎస్ఆర్హెచ్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పంజాబ్ కింగ్స్పై ప్రతీకార విజయం సాధించింది. బుధవారం సొంతగడ్డపై పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్లు చెరో రెండు వికెట్లు తీయగా, నితీశ్కుమార్, మలింగ, సాకిబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్కుమార్లు తలా ఒక వికెట్ తీశారు.ఇషాన్, క్లాసెన్ మెరుపులుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు అభిషేక్, హెడ్లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 54 పరుగులు జోడించారు. అనంతరం వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇషాన్కు క్లాసెన్ తోడవ్వడంతో ఎస్ఆర్హెచ్ పరుగుల వరద పారింది. 55 పరుగులు చేసి ఇషాన్ ఔటైనా చివర్లో క్లాసెన్, నితీశ్రెడ్డిలు ధాటిగా ఆడడంతో ఎస్ఆర్హెచ్ 230 ప్లస్ స్కోరు సాధించింది.కొంపముంచిన టాపార్డర్..భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ప్రబ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్యలు తక్కువ స్కోర్లకే వెనుదిరగడం, ఫామ్లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 5 పరుగులు చేసి ఔటవ్వడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ దశలో కూపర్ కన్నోలి, స్టోయినిస్లు కాసేపు వికెట్లు పతనం అడ్డుకున్నారు. స్టోయినిస్, సూర్యాంశ్ ఔటైనప్పటికీ కూపర్ కన్నోలీ ఆఖరిదాకా నిలిచి అజేయ సెంచరీతో రాణించినప్పటికీ లాభం లేకపోయింది.పట్టికలో ఫస్ట్ ప్లేస్కుఇది ఎస్ఆర్హెచ్కు ఏడో విజయం కాగా.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ 10 మ్యాచ్ల్లో ఆరు విజయాలు, మూడు ఓటమలు కలిపి 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.A win that takes the team to the 𝘁𝗼𝗽 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘁𝗮𝗯𝗹𝗲 🧡A comfortable 33-run victory at home that takes @Sunrisers to not just 2️⃣ more points but the first spot on the points table 👊🔥SCORECARD ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS pic.twitter.com/gjgBIMUhG0— IndianPremierLeague (@IPL) May 6, 2026
చైనాదే థామస్ కప్ టైటిల్
హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ క...
చరిత్ర సృష్టించాడు!
మాడ్రిడ్: పురుషుల టెన్నిస్లో ప్రపంచ నంబర్వన్ య...
చైనాకు కొరియా షాక్
హోర్సెన్స్ (డెన్మార్క్): నాలుగేళ్ల విరామం తర్వా...
కాంస్యంతో సరి.. సెమీస్లో భారత్ పరాజయం!
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ థామస్ కప్ బ్యాడ్మింట...
ఓపెనర్ల శతకాలు.. చారిత్రక విజయం సాధించిన పాక్
మహిళల క్రికెట్లో పాకిస్తాన్ అద్భుత విజయం సాధించి...
శ్రేయస్ అయ్యర్ మరో టైటిల్ గెలిస్తే...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో సారథిగా శ్రేయస్ అయ్యర్ రెం...
ప్రతీకార విజయం.. టేబుల్ టాపర్గా ఎస్ఆర్హెచ్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర...
ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ...
క్రీడలు
SRH vs PBKS : ఉప్పల్లో ఫుల్ జోష్.. తారల సందడి (ఫొటోలు)
మళ్లీ విజయం వేటలో..ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్..సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
వీడియోలు
ఉప్పల్లో దుమ్మురేపిన SRH
19 ఏళ్లలో ఒకే ఒక్కడు చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్..
వాడికి 50 కోట్లు ఇస్తే వంటిచెతొ గెలిపిస్తాడు, పంత్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫాన్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
భయం పుట్టిస్తున్న వైభవ్ బ్యాటింగ్..
IPLలో నేడు డబుల్ ధమాకా
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
IPL గేమ్ ఛేజింగ్ రూల్, IPL 2026లో 200+ పరుగుల వరద
వైభవ్ బ్యాటింగ్ పై గర్ల్ ఫ్రెండ్ ప్రశంసలు.. మొహం మాడ్చుకున్న అర్షదీప్
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
