Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Several Records Broken By Yashasvi Jaiswal Vs MI IPL 20261
ఒక్క మ్యాచ్‌తో ఇన్ని రికార్డులా.. మాములోడివి కాదు!

ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్థశతకాలతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. వర్షం అంతరాయంతో 11 ఓవర్లకు కుదించిన ఆటలో జైస్వాల్ 32 బంతుల్లోనే 10 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అయితే కేవలం ఒక్క మ్యాచ్‌లోనే జైస్వాల్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.ఐపీఎల్ కెరీర్‌లో యశస్వి జైస్వాల్‌కు ఇది మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ముంబైతో మ్యాచ్‌లో 23 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ గతంలో 2023లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లో, 2021లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో 19 బంతుల్లో హాఫ్‌సెంచరీలు సాధించాడు.ఇక రాజస్తాన్ రాయల్స్ తరఫున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ చోటు సాధించాడు. 19 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన జైస్వాల్ అజింక్యా రహానేతో​ కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 25 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో బట్లర్‌, సంజూ శాంసన్‌లు సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు.ఐపీఎల్‌లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో వంద సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ రికార్డులకెక్కాడు. వంద సిక్సర్లు కొట్టడానికి జైస్వాల్‌కు 69 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. జైస్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్‌లు), రిషబ్ పంత్ (68 ఇన్నింగ్స్‌లు), శివమ్ దూబే (59 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.ఐపీఎల్‌లో ఇప్పటివరకు 70 మ్యాచ్‌లాడిన జైస్వాల్ ఖాతాలో రెండు సెంచరీలు, 17 అర్థసెంచరీలున్నాయి. కాగా ముంబై ఇండియన్స్‌పై ఆడిన ఇన్నింగ్స్ జైస్వాల్ ఐపీఎల్ కెరీర్‌లో నాలుగో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది.ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వంద సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు షేన్ వాట్సన్ (109), బట్లర్ (135), శాంసన్ (192) ఉన్నారు.Guwahati still needs an umbrella! ☔️6️⃣🔥 pic.twitter.com/2oCGPHyP7O— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2026చదవండి: ‘టార్గెట్‌ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’

Yashasvi Jaiswal Winning Comments I Have 3 Overs Target Vs Mumbai Indians2
‘టార్గెట్‌ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జైస్వాల్ మాట్లాడాడు.‘పవర్ ప్లే మాకు మూడు ఓవర్లు మాత్రమే అన్న విషయం నా మైండ్‌లో ఉంది. అందుకే బౌలర్లు ఎవరొచ్చినా ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నా. తొలి ఓవర్ దీపక్ చాహర్ బౌలింగ్‌కు వస్తున్నాడని తెలుసుకొని అతడిని ఎదుర్కొనేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఆ తర్వాత బుమ్రా బాయ్ బౌలింగ్‌కు వచ్చాడు. బుమ్రా సంగతి వైభవ్ సూర్యవంశీ చూసుకుంటాడులే అని మనసులో అనుకున్నా. ఆ తర్వాత ఎవరొచ్చినా ఇదే ప్లాన్ అమలు చేయాలని చూశాం. మూడు ఫార్మాట్లలో ఇదే తరహా ఆటతీరును ఆడొచ్చా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే నేను ఆడే ప్రతీ మ్యాచ్‌లో బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ప్రతీ మ్యాచ్‌లో వినూత్నమైన షాట్లను ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు. అతడు ఆడుతున్న తీరు అమోఘం. అతడు కష్టపడుతున్నాడు. వచ్చీ రాగానే భారీ సిక్సర్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నాడు. ఆటతీరు మార్చుకోమని చెప్పలేను కానీ భారీ ఇన్నింగ్స్ ఆడితే చూడాలని ఉంది. వైభవ్ సూర్యవంశీకి స్వేచ్ఛనిచ్చాం. ఆ స్వేచ్ఛను అతను చక్కగా ఆస్వాదిస్తూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ప్రతీసారి మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ముందు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఈ సీజన్‌లో వరుసగా మూడు అర్థసెంచరీలు సాధించడం వెనుక నా సీక్రెట్ అదే. నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఫిక్సింగ్ క‌ల‌క‌లం.. ఏడుగురు ఆట‌గాళ్ల‌పై నిషేధం!

7 Bangladesh Players Banned For Match Fixing3
ఫిక్సింగ్ క‌ల‌క‌లం.. ఏడుగురు ఆట‌గాళ్ల‌పై నిషేధం!

బంగ్లాదేశ్ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ క‌ల‌కలం రేపింది. గ‌త కొంత‌కాలంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వివాదాల‌తో స‌త‌మ‌త‌మవుతోంది. రాజ‌కీయ అస్థిర‌త కార‌ణంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్‌కు తాజా మ్యాచ్ ఫిక్సింగ్ ఆ దేశ క్రికెట్ ఉనికినే దెబ్బ‌తీసేలా ఉంద‌ని చెప్పొచ్చు. ఇటీవల జరిగిన సీజేకేఎస్ టాలెంట్ కప్ 2026లో ఏడుగురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ 3న జరిగిన టీ20 టోర్నమెంట్లో బాకలియా ఏకాదశ, క్రెసెంట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. బాకలియా ఏకాదశ జట్టుకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు సాకిబ్ హుస్సేన్, ఒబైదుల్ ఆలం, ఉమర్ ఫరూక్, టిన్ ధర్, మాహిర్ అన్వర్, మహ్మద్ ఇక్బాల్ మరియు నాజ్ముల్ ఇస్లాంలు కావాలని ఔటయ్యారు. ఈ ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు విచారణ జరిపితే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. వారు ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించార‌న్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.అయితే ఈ ఫిక్సింగ్ ఉదంతంలో కేవలం ఆటగాళ్లే కాకుండా కోచ్ అమీనుల్ హక్ పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనిని తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఛట్టోగ్రామ్ జిల్లా క్రీడా సంస్థ, కోచ్ అమీనుల్ హకు ఐదేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుండి నిషేధించింది. అలాగే సదరు ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని దేశవ్యాప్తంగా అన్ని దేశీయ లీగ్లో అమలు చేయాలని బీసీబీకి అధికారికంగా లేఖ రాసింది.బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్‌)కూడా గతంలో ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంది. బీసీబీ డైరెక్టర్ ముఖైసూర్ రెహమాన్ షమీమ్ ఫిక్సింగ్ చర్చల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే 2025 సీజన్ లో ఆరుగురు జాతీయ ఆటగాళ్లతో సహా మొత్తం 10 మంది క్రికెటర్లు అవినీతి నిరోధక విభాగం నిఘాలో ఉండటం గమనార్హం. అయితే భార‌త్‌తో తిరిగి స‌త్సంబంధాలు కోరుకుంటున్న బంగ్లాదేశ్ త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల బంగ్లా ప్రీమియ‌ర్ లీగ్‌లోకి భార‌త మ‌హిళా క్రికెట‌ర్ల‌ను ఆహ్వానించాల‌ని బంగ్లా బోర్డు యోచిస్తోంది. ఇక మంగ‌ళ‌వారం బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) నూత‌న చైర్మ‌న్‌గా మాజీ క్రికెటర్‌గా త‌మీమ్ ఇక్బాల్ ఎన్నికైన సంగ‌తి తెలిసిందే.చదవండి: అన్నింటా విఫ‌లం.. ‘త‌లా’ లేక సీఎస్‌కే ఆగమాగం!

Rajasthan Royals win over Mumbai Indians4
యశస్వి, వైభవ్‌ మెరుపులు

గువాహటి: ఐపీఎల్‌ 19వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన రియాన్‌ పరాగ్‌ సారథ్యంలోని రాజస్తాన్‌ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆసల్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (32 బంతుల్లో 77 నాటౌట్‌; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), వైభవ్‌ సూర్యవంశీ (14 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అనంతరం ముంబై తడబడింది. 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడింది. రికెల్టన్‌ (8), రోహిత్‌ (5), సూర్యకుమార్‌ (6), తిలక్‌ (14), హార్దిక్‌ (9) విఫలమయ్యారు. దంచుడే... దంచుడు మ్యాచ్‌ను రాయల్స్‌ మెరుపులతో ఆరంభించింది. చహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో జైస్వాల్‌ 4, 6, 4, 4, 4 కొట్టడంతో 22 పరుగులు రాగా... బుమ్రా వేసిన మరుసటి ఓవర్‌లో వైభవ్‌ రెండు సిక్స్‌లు బాదాడు. బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్‌లో జైస్వాల్‌ రెండు, వైభవ్‌ ఒక సిక్స్‌ కొట్టడంతో మరోసారి 22 పరుగులు వచ్చాయి. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్‌ 58 పరుగులు చేసింది. 4వ ఓవర్‌లో హార్దిక్‌ నాలుగు పరుగులే ఇవ్వగా... శార్దుల్‌ వేసిన ఐదో ఓవర్‌లో 6, 4, 6 కొట్టిన వైభవ్‌ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ధ్రువ్‌ జురేల్‌ (2) విఫలం కాగా... కెప్టెన్ రియాన్‌ పరాగ్‌ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు.స్కోరు వివరాలు రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (నాటౌట్‌) 77; వైభవ్‌ (సి) తిలక్‌ (బి) శార్దుల్‌ 39; జురేల్‌ (ఎల్బీ) ఘజన్‌ఫర్‌ 2; పరాగ్‌ (సి) తిలక్‌ (బి) ఘజన్‌ఫర్‌ 20; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (11 ఓవర్లలో 3 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–80, 2–84, 3–121. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 1–0–22–0; బుమ్రా 3–0–32–0; బౌల్ట్‌ 1–0–22–0; హార్దిక్‌ 2–0–17–0; శార్దుల్‌ 2–0– 36–1; ఘజన్‌ఫర్‌ 2–0–21–2. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) జురేల్‌ (బి) ఆర్చర్‌ 8; రోహిత్‌ (సి) జురేల్‌ (బి) సందీప్‌ 5; సూర్యకుమార్‌ (సి) ఆర్చర్‌ (బి) బర్గర్‌ 6; తిలక్‌ (సి) హెట్‌మైర్‌ (బి) బిష్ణోయ్‌ 14; హార్దిక్‌ (సి) జైస్వాల్‌ (బి) బిష్ణోయ్‌ 9; నమన్‌ (సి) బిష్ణోయ్‌ (బి) బర్గర్‌ 25; రూథర్‌ఫోర్డ్‌ (సి) సందీప్‌ (బి) దేశ్‌పాండే 25; శార్దుల్‌ (సి) జురేల్‌ (బి) సందీప్‌ 8; దీపక్‌ (నాటౌట్‌) 5; బౌల్ట్‌ (రనౌట్‌) 1; బుమ్రా (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (11 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–10, 2–20, 3–22, 4–41, 5–46, 6–93, 7–103, 8–111, 9–116. బౌలింగ్‌: ఆర్చర్‌ 2–0–17–1; బర్గర్‌ 2–0–21–2; సందీప్‌ 3–0–26 –2; దేశ్‌పాండే 2–0–29–1; బిష్ణోయ్‌ 2–0–25–2.

Sensational performance by Mukesh and Palak pair5
ప్రపంచ రికార్డుతో పసిడి పతకం

గ్రనాడా (స్పెయిన్‌): రైఫిల్, పిస్టల్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ను భారత బృందం పసిడి పతకంతో, ప్రపంచ రికార్డుతో ప్రారంభించింది. మంగళవారం మొదలైన సీజన్‌ తొలి ప్రపంచకప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముకేశ్‌ నేలవల్లి, హరియాణా అమ్మాయి పలక్‌ గులియా అద్భుతం చేశారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ముకేశ్‌–పలక్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు. 42 జోడీలు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ముకేశ్‌ (294)–పలక్‌ (287) ద్వయం 581 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో... కియాన్‌జున్‌ యావో–హు కాయ్‌ (చైనా) జోడీ 586 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించాయి. వెరోనికా–అకోస్‌ కరోలీ (హంగేరి; 580 పాయింట్లు), నటాలియా ప్రాడో–నికోలస్‌ మౌరెర్‌ (అమెరికా; 578 పాయింట్లు) జోడీలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత పొందాయి. ఫైనల్లో ముకేశ్‌ (244.7 పాయింట్లు)–పలక్‌ (243 పాయింట్లు) జోడీ 487.7 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డును లిఖించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో నిగీనా సైదుకులోవా–ముఖమ్మద్‌ కమలోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌; 481.3 పాయింట్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును ముకేశ్‌–పలక్‌ బద్దలు కొట్టారు. కియాన్‌జున్‌ యావో –హు కాయ్‌ (484.8 పాయింట్లు) జోడీ రజత పతకాన్ని గెల్చుకుంది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశే మిగిలింది. క్వాలిఫయింగ్‌లో సోనమ్‌–గజానన్‌ (భారత్‌; 631.4 పాయింట్లు) జోడీ ఆరో స్థానంలో ... శ్రుతి–అర్ష్ దీప్‌ సింగ్‌ (భారత్‌; 628 పాయింట్లు) జంట 19వ స్థానంలో నిలిచింది.గురి పెడితే పతకమే...గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల ముకేశ్‌ కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. బరిలో దిగిన ప్రతి టోర్నీలో ఏదో ఒక పతకంతో తిరిగొస్తున్నాడు. రెండేళ్ల క్రితం పెరూలో జరిగిన జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో ముకేశ్‌ స్వర్ణం గెలిచి విశ్వవిజేతగా నిలిచాడు. అదే ఈవెంట్‌లో మరో రెండు కాంస్యాలు కూడా సాధించాడు. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో ముకేశ్‌ స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచాడు. ఈ సంవత్సరమే న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో ముకేశ్‌ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సొంతం చేసుకున్నాడు. సీనియర్‌స్థాయిలో తొలిసారి ప్రపంచకప్‌లో పసిడి పతకంతో ముకేశ్‌ శుభారంభం చేసి తనకెంతో ఉజ్వల భవిష్యత్‌ ఉందని చాటి చెప్పాడు.

Indian wrestler Lalit wins silver medal6
భారత రెజ్లర్‌ లలిత్‌కు రజత పతకం

బిష్‌కెక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో భారత రెజ్లర్లు లలిత్‌ (55 కేజీలు) రజత పతకం... సునీల్‌ (87 కేజీలు) కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో లలిత్‌ 0–9తో బొటిరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్‌లో సునీల్‌ 5–4తో రసులోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచాడు. 77 కేజీల కాంస్య పతక బౌట్‌లో భారత రెజ్లర్‌ అమన్‌ 14–15తో యోంగన్‌ (కొరియా) చేతిలో ఓడిపోయాడు.

Jasmine Lamboria in the final of the Asian Boxing Championship7
ఫైనల్లో జైస్మీన్‌

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు జైస్మీన్‌ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు), విశ్వనాథ్‌ సురేశ్‌ (50 కేజీలు), సచిన్‌ సివాచ్‌ (60 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో జైస్మీన్‌ 3–2తో నిగీనా ఉక్తమోవా (ఉజ్బెకిస్తాన్‌)పై, మీనాక్షి 4–1తో థిప్‌సాచా (థాయ్‌లాండ్‌)పై, విశ్వనాథ్‌ 5–0తో సాన్‌జార్‌ (కజకిస్తాన్‌)పై, సచిన్‌ 4–1తో రువామ్‌థామ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచారు. ఆకాశ్‌ (75 కేజీలు), లోకేశ్‌ (85 కేజీలు), నరేందర్‌ బెర్వాల్‌ (ప్లస్‌ 90 కేజీలు), హర్‌‡్ష (90 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు.

IPL 2026 RR vs MI: Rajasthan Royals won by 27 runs 8
ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన రాజస్తాన్‌

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో జైశ్వాల్‌ విధ్వంసం సృష్టించాడు.జైశ్వాల్‌ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్‌ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్‌, 5 సిక్సర్లతో 39), రియాన్‌ పరాగ్‌(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.అనంతరం 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(25), నమన్‌ ధీర్‌(25) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ రెండు, సందీప్‌ శర్మ, బర్గర్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

Vaibhav Suryavanshi Shocks Jasprit Bumrah With First-Ball Six9
బుమ్రాను ఉతికారేసిన వైభవ్‌ సూర్యవంశీ

రాజ‌స్తాన్ రాయల్స్‌ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ.. టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రాను సైతం వ‌ద‌ల్లేదు. ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో బుమ్రాను సూర్య‌వంశీ ఎలా ఎదుర్కొంటాడో అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ వైభవ్ మాత్రం ఎలాంటి వణుకు బెణుకు లేకుండా బుమ్రాను ఉతికారేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో బుమ్రా తను వేసిన తొలి బంతినే వైభవ్ అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. ఆషాట్‌కు బుమ్రా సైతం ఫిదా అయిపోయాడు. బుమ్రా నవ్వుతూ తన ఎండ్‌ వైపు వెళ్లిపోయాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతిని కూడా సూర్యవంశీ స్టాండ్స్‌కు పంపించాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రాకే చుక్కులు చూపించావు.. బుడ్డోడా నీవు గ్రేట్‌ అంటూ కొనియాడుతున్నారు. కాగా వైభవ్‌ ఈ మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.ఇక గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా కేవలం 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. జైశ్వాల్‌ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్‌ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్‌, 5 సిక్సర్లతో 39), రియాన్‌ పరాగ్‌(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.చదవండి: ముంబై ఇండియ‌న్స్‌లోకి వైభ‌వ్ సూర్య‌వంశీ?

Ravi Shastri To Receive Huge Tribute At Wankhede10
రవిశాస్త్రికి అరుదైన గౌరవం

భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నిర్ణయించింది. గురువారం (ఏప్రిల్ 9) రవిశాస్త్రి పేరిట స్టాండ్‌ను ఘ‌నంగా ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయ‌న చేతుల మీదుగా రవిశాస్త్రి స్టాండ్ అధికారికంగా ప్రారంభం కానుంది. కేవలం రవిశాస్త్రి మాత్రమే కాకుండా మరికొందరు దిగ్గజాలను కూడా అదే రోజున ఎంసీఏ స‌త్క‌రించ‌నుంది.భారత మహిళా క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ డయానా ఎదుల్జీ పేరును వాంఖడే స్టేడియం గేట్‌కు పెట్టనున్నారు. అదేవిధంగా దివంగత దిగ్గజ బ్యాటర్ దిలీప్ సర్దేశాయ్ పేరును కూడా వాంఖ‌డేలోని ఒక గేట్‌కు పెట్టాల‌ని ఎంసీఎ నిర్ణ‌యించింది.కాగా ర‌విశాస్త్రి భార‌త క్రికెట్‌కు నాలుగు దశాబ్ధాల సేవలను అందించాడు. ప్లేయర్‌గా, కోచ్‌గా భారత జట్టు విజయాల్లో భాగమయ్యాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా శాస్త్రి ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు తొలి భారత క్రికెటర్ కూడా శాస్త్రినే కావడం విశేషం. రవిశాస్త్రి తన కెరీర్‌లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడి దాదాపు 7,000 పరుగులు, 280 వికెట్లు తీశారు.

Advertisement
Advertisement
 
Advertisement