ప్రధాన వార్తలు
'అతడితో జాగ్రత్త.. స్టార్ బ్యాటర్లను సైతం భయపెట్టగలడు'
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్కు రంగం సిద్దమైంది. మార్చి 28 నుంచి ఈ వరల్డ్ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ పేసర్ మహమ్మద్ ఇజార్పై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇజార్ను తక్కువగా అంచనా వేయొద్దని బ్యాటర్లను పఠాన్ హెచ్చరించాడు.కాగా గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో బిహార్కు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ ఇజార్ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అయిన ఇజార్.. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ముంబై వంటి పెద్ద ఫ్రాంచైజీ తమ జట్టులోకి తీసుకుంది."ముంబై ఇండియన్స్లో ఇప్పటికే ట్రెంట్ బౌల్డ్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ వంటి ప్రధాన పేసర్లు ఉన్నారు. ఇప్పుడు మహ్మద్ ఇజార్ రూపంలో మరో పేస్ సంచలనం ముంబై జట్టులోకి వచ్చాడు. అతడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇజార్ 'బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్' స్లోయర్ డెలివరీలు అద్భుతంగా బౌలింగ్ చేయగలడు.అతడి బౌలింగ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇజార్ 135 కిలోమీటర్ల వేగంతో షార్ట్ బాల్స్, ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలు కూడా సంధించగలడు. ముఖ్యంగా స్లో బాల్స్ వేయడం అతడి స్పెషాలిటీ. ఆ బంతులతో ఎలాంటి బ్యాటర్నైనా అతడు ముప్పుతిప్పలు పెట్టగలడు.గతసీజన్లో యువ పేసర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా రాణించాడు. కాబట్టి అందరి దృష్టి అతడిపై ఉంటుంది. కానీ ఇజార్ను కూడా తక్కువ అంచనా వేయకండి" అని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్
40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మరోసారి తండ్రయ్యాడు. అతడి భార్య, స్టార్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పండింటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ పాపకు డికే-దీపికా జోడీ 'రాహా' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.దీంతో అభిమానులు వారిద్దరికి శుభకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు కుమారులు(కవలలు) ఉన్నారు. 2021లో కబీర్, జియాన్ జన్మించారు. ఇప్పుడు 40 ఏళ్ల వయసులో డికే మూడోసారి తండ్రి అయ్యాడు.కాగా ఆల్ఫార్మాట్ క్రికెట్ విడ్కోలు పలికిన కార్తీక్.. ప్రస్తుతం కామెంటేటర్గా, కోచ్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్గా డీకే వ్యవహరిస్తున్నాడు. ఇక దీపికా విషయానికి వస్తే.. ఆమె చివరగా ఆసియాగేమ్స్-2023లో మిక్సిడ్ డబుల్స్లో బంగారు పతకంతో మెరిసింది.అంతకుముందు వరల్డ్ డబుల్స్ ఛాంపియన్షిప్-2022లో రెండు స్వర్ణాలు ఆమె సాధించింది. దీంతో ఆమె సేవలకుగాను భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.చదవండి: T20 WC 2026: జోస్ బట్లర్ రిటైర్మెంట్..?
జోస్ బట్లర్ రిటైర్మెంట్..?
జోస్ బట్లర్.. ప్రస్తుత తరం అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అయితే ఈ ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. బట్లర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.మొత్తం 8 మ్యాచ్లలో అతడు కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 30 పరుగులు సాధించలేకపోయాడు. ఈ క్రమంలో బట్లర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకునున్నట్లు ప్రాచారం జరిగింది. తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై బట్లర్ స్పందించాడు. ఇప్పటిలో తనకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని బట్లర్ స్పష్టం చేశాడు. బట్లర్ ఇటీవల ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్కాస్ట్లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ తదుపరి వైట్-బాల్ సిరీస్లో ఆడతారా? అన్న ప్రశ్న జోస్కు ఎదురైంది."ఇంగ్లండ్ తదుపరి సిరీస్లో ఆడాలనుకుంటున్నాను. నిజంగానే టీ20 వరల్డ్కప్లో పేలవ ప్రదర్శన కనబరిచాను. ఇలా ఆడుతానని అస్సలు ఊహించలేదు. అది తీవ్ర నిరాశ కలిగించింది. అయితే గత కొన్నేళ్లుగా నా కెరీర్లోనే అత్యుత్తమ క్రికెట్ ఆడాను. త్వరలోనే తిరిగి ఫామ్లోకి వస్తాననే నమ్మకం నాకు ఉంది. ఇంగ్లండ్ తరపున మరి కొంత కాలం ఆడాలనుకుంటున్నాను. కానీ నేను ఇప్పుడు కెప్టెన్ని కాను కేవలం ప్లేయర్ మాత్రమే. జట్టులో కొనసాగడం లేకపోవడం అనేది సెలెక్టర్ల చేతుల్లో ఉంటుంది. ఏమి జరుగుతుందో చూద్దాం. ప్రపంచకప్ తర్వాత ఫ్యామిలీతో గడిపిన సమయం నాకు ఉపశమనం కలిగించింది" అని బట్లర్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్ వైఫల్యం తర్వాత బట్లర్ తన ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్ ట్రిప్నకు వెళ్లాడు. అతడు ఒకట్రెండు రోజుల్లో ఐపీఎల్-2026 సీజన్ కోసం భారత్కు రానున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున బట్లర్ బరిలోకి దిగనున్నాడు.చదవండి: సీఎస్కే వైస్ కెప్టెన్గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే
అతడు ఆర్సీబీ గుండెచప్పుడు: డివిలియర్స్
ఐపీఎల్-2026 సీజన్ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో చేరాడు. త్వరలోనే అతడు ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది.వరుసగా రెండో సీజన్లోనూ విజేతగా నిలవాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ స్టార్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-19వ సీజన్లోనూ ఆర్సీబీకీ కోహ్లి కీలకం కానున్నాడని డివిలియర్స్ తెలిపాడు. కాగా బెంగళూరు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో విరాట్ది కీలక పాత్ర. ఐపీఎల్-2025 సీజన్లో కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు అదే జోరును విరాట్ కొనసాగించాలని ఏబీడీ కోరుకుంటున్నాడు."ఆర్సీబీకి విరాట్ కోహ్లి గుండెచప్పుడు లాంటి వాడు. కేవలం తన అద్భుతమైన బ్యాటింగ్తో మాత్రమే కాకుండా, అతడు చూపించే పట్టుదల, ఎనర్జీ జట్టులోని ఇతర ఆటగాళ్లకు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి. మైదానంలోనూ, మైదానం వెలుపలా కోహ్లి వ్యవహరించే తీరు అమోఘం.విరాట్ నుంచి యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారు. కోహ్లి సృష్టించిన ఈ సానుకూల వాతావరణమే, గత సీజన్లో ఆర్సీబీ తన తొలి టైటిల్ నెగ్గడానికి ప్రధాన కారణం. అంతకుముందు సీజన్ వరకు ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే ఆర్సీబీ ఆధారపడేది. కానీ ఇప్పుడు మాత్రం తొలి టైటిల్ గెలవడంలో జట్టులో ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు" అని జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ పేర్కొన్నాడు.చదవండి: సీఎస్కే వైస్ కెప్టెన్గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే
సీఎస్కే వైస్ కెప్టెన్గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే
టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్-2026లో సత్తాచాటేందుకు సన్నద్దమవుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు సంజూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఐపీఎల్-19వ సీజన్ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కే శాంసన్ ట్రేడ్ అయ్యాడు.అందుకోసం చెన్నై ఫ్రాంచైజీ రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్ వంటి స్టార్ ఆల్రౌండర్లను వదులుకోవాల్సి వచ్చింది. 11 సీజన్ల పాటు రాజస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన శాంసన్.. ఇప్పుడు ఎల్లో జెర్సీలో మెరవనున్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. శాంసన్ను ట్రేడ్ డీల్ను కుంబ్లే సమర్ధించాడు. ఎంఎస్ ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంజూకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని కుంబ్లే అభిప్రాయపడ్డాడు."భారత క్రికెట్లో సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్, ఆపై ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి వరకు వారసత్వం ఎలా కొనసాగిందో.. ఇప్పుడు ధోని నుంచి ఆ బాధ్యతను శాంసన్ అందుకోబోతున్నాడు. సంజూను జట్టులోకి తీసుకోవడం సీఎస్కే వ్యూహత్మక నిర్ణయంగా చెప్పుకోవాలి. సంజూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.బ్యాటింగ్తో పాటు వికెట్ల వెనక కూడా బాధ్యతలు నిర్వర్తించగలడు. టీ20 ప్రపంచకప్లో వరుసగా మూడు సంచలన ఇన్నింగ్స్లు ఆడి భారత్కు విజయాన్ని అందించాడు. ఇప్పుడు అదే జోరును సీఎస్కే తరపున కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. అతడి రాకతో సీఎస్కే ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరగనుంది. సీఎస్కే వైస్ కెప్టెన్సీ రోల్కు సంజూ సరిగ్గా సరిపోతాడు. అతడికి కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో జడేజా కెప్టెన్సీ తప్పుకున్నప్పుడు, రుతురాజ్ గైక్వాడ్ గాయపడినప్పుడు మళ్ళీ ధోనీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సంజూ రాకతో రుతురాజ్ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే లీడర్ జట్టుకు దొరికినట్లయింది" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్
ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి!
ఐపీఎల్-2026 సీజన్లోని ఆరంభ మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. ఎస్ఆర్హెచ్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనుంది. దీంతో టోర్నీ ఫస్ట్ హాఫ్కు కమ్మిన్స్కు దూరంగా ఉన్నాడు. క్రమంలోనే కిషన్ను కెప్టెన్గా, వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మను సన్రైజర్స్ యాజమాన్యం నియమించింది.తొలిసారి అందరూ భారత కెప్టెన్లే.. సన్రైజర్స్ యాజమాన్యం ఇషాన్ కిషన్ను కెప్టెన్ ప్రకటించడంతో... ఐపీఎల్ చరిత్రలో తొలిసారి బరిలో ఉన్న 10 జట్లకు భారత ప్లేయర్లే సారథులుగా కనిపించనున్నారు. గత 18 సీజన్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 19వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పాటీదార్... ఢిల్లీ క్యాపిటల్స్కు అక్షర్ పటేల్... గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుబ్మన్ గిల్... కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు అజింక్య రహానే... రాజస్తాన్ రాయల్స్కు రియాన్ పరాగ్... ముంబై ఇండియన్స్కు హర్దిక్ పాండ్యా... పంజాబ్ కింగ్స్కు శ్రేయస్ అయ్యర్... లక్నో సూపర్ జెయింట్స్కు రిషభ్ పంత్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.ఇక ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్లో లీగ్ ఆరంభం(మార్చి 28) రోజున చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో తలపడనుంది. ప్రస్తుతం బీసీసీఐ కేవలం 20 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసింది.
ఆర్సీబీ రె‘ఢీ’
ఒకటి కాదు రెండు కాదు పదిహేడు సీజన్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ టైటిల్ వేటలో విఫలమైంది. ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో బరిలోకి దిగడం చివరకు ఖాళీ చేతులతో వెనుదిరగడం జట్టుకు అలవాటులా కనిపించింది. మూడుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కానీ ఆర్సీబీ అభిమానుల కోరిక ఎట్టకేలకు గత సీజన్లో తీరింది. ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో బెంగళూరు ఐపీఎల్ విజేతగా నిలిచింది. విజయోత్సవ వేడుకలో అపశ్రుతితో ఈ గెలుపు సంబరాలు కాస్త తగ్గినా ఇప్పుడు అంతా సర్దుకుంది. తమ సొంత మైదానంలో మళ్లీ మ్యాచ్లకు ఆర్సీబీ సిద్ధమైంది. గత ఏడాదితో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా దాదాపు అదే బృందాన్ని కొనసాగించిన టీమ్ మళ్లీ టైటిల్ కొడుతుందా లేదా వేచి చూడాలి! సాక్షి క్రీడా విభాగం తొలి టైటిల్ కోసం ఎంతగానో ఎదురు చూసిన తర్వాత ఆర్సీబీ టీమ్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఒకప్పుడు కోహ్లి లేదా గేల్ లేదా డివిలియర్స్ల వ్యక్తిగత ప్రదర్శనలపైనే ఆధారపడిన జట్టు 2025 సీజన్లో సమష్టి తత్వాన్ని నమ్ముకుంది. అదే మంచి ఫలితాలను ఇచ్చింది. కోహ్లి ఎప్పటిలాగే తనదైన శైలిలో 657 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే కోహ్లి ప్రదర్శనకు మించి ఇతర ఎన్నో అంశాలు జట్టును నడిపించాయి. జట్టు కష్టాల్లో నిలిచిన ప్రతీ మ్యాచ్లో ఒక్కో ఆటగాడు హీరోగా నిలిచాడు.కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, హాజల్వుడ్, భువనేశ్వర్... ఇలా అందరూ తమ పాత్ర పోషించారు. కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రశాంతంగా జట్టును నడిపించిన తీరు కూడా ప్రశంసనీయం. కెపె్టన్ హోదా లేకపోయినా కోహ్లి టీమ్లో నింపే స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి సీజన్లో కూడా ఆర్సీబీ నుంచి అభిమానులు అదే ఆశిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఇతర జట్లతో పోలిస్తే వేలం సమయంలో ఆర్సీబీకి పెద్ద సమస్య లేకపోయింది. వేలంలో 8 మంది ఆటగాళ్లను ఎంచుకోగా... వీరిలో ఐదుగురు భారత్కు ఆడని ‘అన్క్యాప్డ్’ ఆటగాళ్లే. మిగతా ముగ్గురు కచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాళ్లు కాదు. ముందు జాగ్రత్తగా వేలంలో జాకబ్ డఫీ, జోర్డాన్ కాక్స్, వెంకటేశ్ అయ్యర్లను తీసుకుంది. అయితే ఎవరూ ఉన్నా, లేకున్నా ఎప్పటిలాగే టీమ్లో జోష్ నింపేందుకు కోహ్లి ఉండటమే అది పెద్ద బలం. పదునైన బ్యాటింగ్... 2025 ఫైనల్లో ఆడిన తుది జట్టును ఈసారి మొదటి మ్యాచ్లో ఆడటం కోసం చూసుకుంటే ఎనిమిది మంది కచ్చితంగా జట్టులో ఉంటారు. ఆర్సీబీ విడుదల చేసిన లివింగ్స్టోన్కు బదులుగా ఈసారి అంతకంటే విధ్వంసకర బ్యాటర్ జాకబ్ బెతెల్కు తుది జట్టులో చోటు ఖాయం. గత ఏడాది అతను 2 మ్యాచ్ల్లో ఆడగా, అందులో ఒక అర్ధసెంచరీ ఉంది. ఇటీవలి టి20 వరల్డ్ కప్లో భారత్పై చెలరేగి బెతెల్ సాధించిన సెంచరీని చూస్తే ఆర్సీబీ బలం మరింత పెరిగినట్లే. మూడో స్థానంలో ఆడిన మయాంక్ అగర్వాల్ జట్టుకు దూరమయ్యాడు. ఈ స్థానం కోసం ఇద్దరు భారత బ్యాటర్లు పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్ మధ్య పోటీ ఉంది. అయితే గతంలో ఇదే జట్టుతో ఆడిన అనుభవం, ఇటీవలి ఫామ్, లోకల్ ముద్ర కారణంగా పడిక్కల్కే ఎక్కువ చాన్స్ ఉంది. కోహ్లి, సాల్ట్లతో తిరుగులేని ఓపెనింగ్ జట్టు సొంతం. వీరిద్దరు ఇచ్చే ఆరంభాలే జట్టు విజయాలకు పునాది అవుతాయి. మిడిలార్డర్లో పాటీదార్, డేవిడ్, జితేశ్ శర్మలు ఇన్నింగ్స్ను ధాటిగా నడిపించగల సమర్థులు. ఈ బృందం విఫలమైనా ఆల్రౌండర్లు కృనాల్ పాండ్యా, షెఫర్డ్ బ్యాటింగ్తో ఆదుకోగలరు. గత సీజన్లో ఇది బాగా కనిపించింది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి మైదానంలో భారీ స్కోర్లు సాధిస్తే జట్టుకు తిరుగుండదు. భువీ, దయాళ్లపై భారం... బౌలింగ్కు సంబంధించి ఆర్సీబీని ఒకే ఒక సమస్య వెంటాడుతోంది. అదే స్టార్ పేసర్ హాజల్వుడ్ లేకపోవడం. గత సీజన్లో 22 వికెట్లతో జట్టుకు విజయం అందించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. హాజల్వుడ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలీని స్థితిలో ప్రత్యామ్నాయంపై జట్టు దృష్టి పెట్టింది. ఇద్దరు భారత పేసర్లు భువనేశ్వర్, యశ్ దయాళ్ కీలకం కానుండగా, ఈసారి పేస్ విషయంలో వీరిపై అదనపు భారం ఉంది. హాజల్వుడ్కు బదులుగా డఫీ, తుషారాలలో ఒకరిని ఆడిస్తారా లేక భారత పేసర్ రసిఖ్ దార్కు అవకాశం ఇస్తారా చూడాలి. స్పిన్లో మరోసారి సుయశ్ శర్మ ప్రధాన అస్త్రం కాగా, కృనాల్ పాండ్యా లెఫ్టార్మ్ స్పిన్తో ప్రత్యర్థిని కట్టడి చేయగలడు. షెఫర్డ్ కూడా బౌలింగ్లో జట్టు కోటా పూర్తి చేయగలడు. ఐపీఎల్లో ఆర్సీబీ గణాంకాలు ఆడిన మ్యాచ్లు 271 గెలిచినవి 134 ఓడినవి 133 రద్దు 4 అత్యుత్తమ ప్రదర్శన: విజేత (2025), రన్నరప్ (2009, 2011, 2016)2026 జట్టు వివరాలు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), పడిక్కల్, కోహ్లి, సాల్ట్, జితేశ్, కాక్స్, కృనాల్, స్వప్నిల్, డేవిడ్, షెఫర్డ్, బెతెల్, వెంకటేశ్ అయ్యర్, సాత్విక్, మంగేశ్, విక్కీ ఒస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, హాజల్వుడ్, రసిఖ్ దార్, సుయాశ్, భువనేశ్వర్, నువాన్ తుషారా, అభినందన్ సింగ్, డఫీ, యశ్ దయాళ్.
ఆగస్టు 20న భారత్, పాక్ పోరు
న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాల ప్రపంచకప్ ట్రోఫీ నిరీక్షణకు తెర దించాలంటే ఈసారి భారత పురుషుల హాకీ జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్ టోర్నీలో వేల్స్ జట్టుతో జరిగే తొలి మ్యాచ్తో టీమిండియా టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ఆగస్టు 16న నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్వీన్లో భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. పూల్ ‘డి’లో ఉన్న భారత బృందం ఆ తర్వాత ఆగస్టు 18న ఇంగ్లండ్తో... ఆగస్టు 20న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ‘ఢీ’కొంటుంది. తదుపరి దశకు అర్హత సాధించాలంటే భారత్ పూల్ ‘డి’లోని తొలి రెండు స్థానాల్లో కచి్చతంగా ఉండాలి. మరోవైపు భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్లో ఆగస్టు 16న చైనాతో తలపడుతుంది. పూల్ ‘డి’లో ఉన్న భారత జట్టు రెండో మ్యాచ్లో ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో... చివరిదైన మూడో మ్యాచ్లో ఆగస్టు 20న ఇంగ్లండ్తో ఆడుతుంది. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక నాలుగు పూల్స్ నుంచి రెండు జట్ల చొప్పున ఎనిమిది జట్లు రెండో రౌండ్కు చేరుకుంటాయి. రెండో రౌండ్లో ఎనిమిది జట్లను రెండు పూల్స్గా (ఒక్కో పూల్లో నాలుగు జట్లు) విభజిస్తారు. రెండో రౌండ్ ముగిశాక రెండు పూల్స్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. భారత పురుషుల జట్టు 1975లో ఏకైకసారి ప్రపంచకప్ టైటిల్ నెగ్గగా... భారత మహిళల జట్టు 1974లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది.
పురుషుల జట్టుకు సులువు మహిళల జట్టుకు క్లిష్టం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లకు భిన్నమైన ‘డ్రా’లు ఎదురయ్యాయి. 2022లో తొలిసారి థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత పురుషుల జట్టు ఈసారి స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం ఖాయం. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, కెనడా, ఆ్రస్టేలియా జట్లతో భారత్కు చోటు కల్పించారు. చైనాను మినహాయిస్తే కెనడా, ఆ్రస్టేలియా జట్లపై భారత్ విజయాన్ని ఊహించవచ్చు. రెండు విజయాలు సాధిస్తే భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది. మరోవైపు ఉబెర్ కప్లో భారత మహిళల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఆతిథ్య దేశం డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంటుంది. ఉక్రెయిన్పై టీమిండియా సులువుగా గెలవచ్చు. కానీ చైనా, డెన్మార్క్ జట్లపై భారత్ విజయావకాశాలు స్వల్పమే. ఈ నేపథ్యంలో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరాలంటే చైనా లేదా డెన్మార్క్ జట్లలో ఒకదానిపై ఖచ్చితంగా నెగ్గాలి. భారత మహిళల జట్టు 2014, 2016లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. రెండు విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొనే థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్లోని హోర్సెన్స్ నగరంలో జరుగుతుంది. 2024 థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీలో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో చైనా చేతిలో... భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో ఓడిపోయాయి.
ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక జోడీ
ఓర్లియాన్స్ ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని జోడీ శుభారంభం చేసింది. ఫ్రాన్స్లో బుధవారం జరిగిన తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ ద్వయం 21–15, 21–9తో త్సాయ్ ఫు చెంగ్–సుంగ్ యు సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 12–21, 10–21తో మాగ్నస్ జొనాసెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. భారత్కే చెందిన ఆయుశ్ శెట్టి 17–21, 21–10, 21–17తో సహచరుడు కిరణ్ జార్జ్పై గెలిచాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో మాళవిక బన్సోద్ 21–18, 21–14తో సుంగ్ షువో యున్ (చైనీస్ తైపీ)పై, ఇషారాణి బారువా 21–19, 21–19తో అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై, అన్మోల్ 21–12, 21–16తో నెష్లిహాన్ అరిన్ (టర్కీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత్కే చెందిన ఆకర్షి కశ్యప్, దేవిక సిహాగ్, రక్షితశ్రీ తొలి రౌండ్లోనే ఓడిపోయారు.
LA Olympics 2028: 4 రోజుల ముందే పోటీలు షురూ
లాస్ ఏంజెలిస్: మరో రెండేళ్లలో లాస్ ఏంజెలిస్లో ...
ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్
లుసానే (స్విట్జర్లాండ్): హాకీ వరల్డ్ కప్లో పాల్...
ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!
పశ్చిమాసియాలో భీకరయుద్ధం నేపథ్యంలో ఇరాన్ జట్టు జూ...
క్యాండిడేట్స్ టోర్నీకి హంపి దూరం!
బెంగళూరు: రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపి...
ఆర్సీబీ రె‘ఢీ’
ఒకటి కాదు రెండు కాదు పదిహేడు సీజన్ల పాటు రాయల్ చా...
ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 హీరో, టీమిండియా ఓపెనర్ సంజూ ...
’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ త...
రోహిత్ శర్మ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి అభిమాను...
క్రీడలు
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
టీం ఇండియా కొత్త కోచ్ గా MS ధోని
SRHకు ఫ్యాన్స్ కు షాక్.. కమిన్స్ లేకుండానే బరిలోకి..
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్లో హార్ట్ టచింగ్ మూమెంట్
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
SRH ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ
భారత్ దెబ్బకు షివరింగ్ వచ్చేసింది.. ఆఫ్రిది కామెంట్స్ వైరల్
ధోని, రోహిత్ తర్వాత శ్రీయాస్ అయ్యరే బెస్ట్ కెప్టెన్..
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
