ప్రధాన వార్తలు
సచిన్ను ఎల్బీగా ప్రకటించడం తప్పే
న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను ఎల్బీడబ్ల్యూగా అవుటివ్వడం ముమ్మాటికీ తప్పేనని వెస్టిండీస్ దిగ్గజ అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించారు. అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం కలిగిన ఆయన 2009లో అంపైరింగ్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 1989 నుంచి 2009 వరకు వరుసగా జరిగిన ఐదు వన్డే ప్రపంచకప్లకు ఫీల్డ్ అంపైర్గా పనిచేశారు. తాజాగా 79 ఏళ్ల బక్నర్ రెండు దశాబ్దాల తర్వాత విండీస్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్ ఇంటర్వ్యూలో తన పొరపాటును అంగీకరించారు. అంపైరింగ్ కెరీర్లోనే అది అత్యంత పేలవమైన నిర్ణయంగా చెప్పుకొచ్చారు. 2003–04లో ఆ్రస్టేలియా పర్యటనలో భారత్ ఆడిన టెస్టు సిరీస్లో సచిన్ను వికెట్ల ముందు దొరికిపోయినట్లు (ఎల్బీడబ్ల్యూ)గా బక్నర్ ప్రకటించారు. కానీ రిప్లేలో బంతి వికెట్లకు దూరంగా పైనుంచి వెళుతున్నట్లు స్పష్టమైంది. దీనిపై అప్పటి మేటి టీవీ వ్యాఖ్యాత టోనీ గ్రెగ్ అంపైరింగ్లోనే అత్యంత చెత్త నిర్ణయమని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు ఏమైందంటే... ఇది 22 ఏళ్ల క్రితం సంగతి. బ్రిస్బేన్లో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్లో జాసన్ గిలెస్పీ వేసిన బంతిని సచిన్ డిఫెండ్ చేయబోగా అది అతని ప్యాడ్లను తగిలింది. వెంటనే బౌలర్, జట్టు సహచరులంతా ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అరుస్తూ అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ బక్నర్ అప్పీలుకు బదులుగా తన చేతి వేలు పైకెత్తాడు. ఎంతో అనుభవజ్ఞుడైన సచిన్కు బంతి గమనం బాగా గుర్తు. అది ఎల్బీడబ్ల్యూ కానేకాదని అతని గట్టి నమ్మకం అందుకే నిరాశగా వెనుదిరిగాడు. మరుసటి ఏడాది (2005) పాక్తో కోల్కతాలో జరిగిన మ్యాచ్లోనూ సచిన్ను తప్పుడు నిర్ణయంతో బక్నర్ పెవిలియన్కు పంపించారు. రజాక్ సంధించిన బంతి టెండూల్కర్ బ్యాట్ తగలకుండా ఫీల్డర్ చేతుల్లో పడింది. అప్పుడు క్యాచ్ అవుట్గా ప్రకటించారు.
బ్రూక్ శతకంతో ఇంగ్లండ్ సెమీస్కు
టి20 వరల్డ్ కప్లో ‘సూపర్ ఎయిట్స్’లోకి అడుగు పెట్టినా ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్లో ఇంకా తడబాటు... వరుసగా నాలుగు మ్యాచ్లలో తానూ విఫలం కావడంతో విమర్శల ఒత్తిడి... ఇలాంటి స్థితిలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదనపు బాధ్యత తీసుకున్నాడు... 61 మ్యాచ్ల కెరీర్లో తొలిసారి మూడో స్థానంలోకి దిగి జట్టును గెలిపించే భారాన్ని భుజాన వేసుకున్నాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో తనొక్కడే 100 పరుగులు చేసి ఒంటిచేత్తో టీమ్ను సెమీఫైనల్కు చేర్చాడు. బ్యాటింగ్లో సాధారణ స్కోరుకే పరిమితమైన పాకిస్తాన్... బౌలింగ్లో ఇతర బ్యాటర్లను నిలువరించగలిగింది గానీ బ్రూక్ను ఆపలేక మ్యాచ్ను అప్పగించింది. ఫలితంగా ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి! పల్లెకెలె: టి20 ప్రపంచ కప్లో ఇంగ్లండ్ వరుసగా ఐదోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ‘సూపర్–8’లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్–2 మ్యాచ్లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై నెగ్గింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఫర్హాన్ (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో తొలి టి20 సెంచరీతో జట్టును గెలిపించాడు. మొదటి మ్యాచ్లో శ్రీలంకను ఓడించిన ఇంగ్లండ్ ఇప్పుడు పాక్పై గెలిచి ముందంజ వేసింది. మరోవైపు పాక్ సెమీస్ చేరే అవకాశాలకు గండిపడింది. చివరి మ్యాచ్లో శ్రీలంకపై తప్పనిసరిగా గెలవడంతో పాటు ఇతర సమీకరణాలు, రన్రేట్లపై ఆ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది. దక్కని శుభారంభం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్కు శుభారంభం లభించలేదు. సయీమ్ అయూబ్ (7), కెప్టెన్ సల్మాన్ ఆగా (5) తమ వైఫల్యాలను కొనసాగించారు. ఈ దశలో ఫర్హాన్, బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్ప్లేలో ఒక్క సిక్సర్ కూడా లేకుండా పాక్ 46 పరుగులు చేసింది. ఆ తర్వాతా ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో జట్టు ఒకదశలో వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే కొట్టలేకపోయింది! ఈ క్రమంలో బాబర్ వెనుదిరగ్గా, ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మాత్రం కాస్త దూకుడుగా ఆడాడు. మరోవైపు 37 బంతుల్లో ఫర్హాన్ అర్ధసెంచరీ పూర్తయింది. 16 ఓవర్లలో స్కోరు 126/4. అయితే చివరి 4 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసిన టీమ్ 5 వికెట్లు కోల్పోయింది. షాదాబ్ (11 బంతుల్లో 23; 4 ఫోర్లు) కాస్త ధాటిని ప్రదర్శించడంతో స్కోరు 160 పరుగులు దాటింది. హడలెత్తించిన అఫ్రిది ఛేదనలో ఇంగ్లండ్ను ఆరంభంలోనే షాహిన్ షా అఫ్రిది దెబ్బ తీశాడు. తన తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను... తన రెండో ఓవర్లో జోస్ బట్లర్ (2)ను, మూడో ఓవర్లో బెతెల్ (8)ను వెనక్కి పంపించాడు. అయితే ఈ స్థితిలో బ్రూక్ ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. నవాజ్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లేలో టీమ్ స్కోరు 53 పరుగులకు చేరింది. తక్కువ వ్యవధిలో బాంటన్ (2), స్యామ్ కరన్ (16) అవుటైనా... మరోవైపు బ్రూక్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతను అదే ధాటిని కొనసాగించగా, విల్ జాక్స్ (23 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అలవోకగా షాట్లు ఆడిన బ్రూక్... అఫ్రిది బౌలింగ్లో మిడాఫ్ మీదుగా భారీ సిక్స్తో శతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత తడబడినా... చివరకు ఐదు బంతుల ముందే ఇంగ్లండ్ గట్టెక్కింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (ఎల్బీ) (బి) ఒవర్టన్ 63; అయూబ్ (సి) బెతెల్ (బి) ఆర్చర్ 7; సల్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 5; బాబర్ (బి) ఒవర్టన్ 25; ఫఖర్ (సి) డాసన్ (బి) రషీద్ 25; షాదాబ్ (రనౌట్) 23; ఉస్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 8; నవాజ్ (ఎల్బీ) (బి) డాసన్ 0; అఫ్రిది (సి) స్యామ్ కరన్ (బి) ఆర్చర్ 2; సల్మాన్ మీర్జా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–14, 2–27, 3–73, 4–122, 5–132, 6–146, 7–146, 8–149, 9–164. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2, ఒవర్టన్ 3–0–26–2, డాసన్ 4–0–24–3, స్యామ్ కరన్ 3–0–24–0, రషీద్ 4–0– 31–1, జాక్స్ 2–0–27–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 0; బట్లర్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 2; బ్రూక్ (బి) షాహిన్ అఫ్రిది 100; బెతెల్ (సి) ఫర్హాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; బాంటన్ (సి) ఉస్మాన్ (బి) తారిఖ్ 2; స్యామ్ కరన్ (సి) నవాజ్ (బి) తారిఖ్ 16; జాక్స్ (బి) నవాజ్ 28; ఒవర్టన్ (స్టంప్డ్) ఉస్మాన్ (బి) నవాజ్ 0; డాసన్ (నాటౌట్) 1; ఆర్చర్ (నాటౌట్) 5; మొత్తం (19.1 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–35, 4–58, 5–103, 6–155, 7–160, 8–161. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–30–4, సల్మాన్ మీర్జా 3.1–0–26–0, సయీమ్ అయూబ్ 2–0–21–0, నవాజ్ 3–0–26–2, షాదాబ్ ఖాన్ 3–0–31–0, ఉస్మాన్ తారిఖ్ 4–0–31–2. 3 ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా హ్యారీ బ్రూక్ నిలిచాడు. గతంలో జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ మాత్రమే ఈ ఘనత నమోదు చేశారు. ఓవరాల్గా ఏ జట్టు తరఫునైనా టి20 ప్రపంచకప్లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్గా కూడా బ్రూక్ గుర్తింపు పొందాడు. టి20 ప్రపంచకప్లో నేడుశ్రీలంక X న్యూజిలాండ్వేదిక: కొలంబో రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
‘శుభమ్’ ఆరంభం
హుబ్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్కు చేరుకున్న జమ్మూకశ్మీర్ జట్టు... తుదిపోరులోనూ అదే జోరు కనబరుస్తోంది. ఎనిమిది సార్లు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన కర్ణాటకపై ఏమాత్రం అదురు బెదురు లేకుండా సాధికారికంగా ఆడుతోంది. మంగళవారం ప్రారంభమైన రంజీ ఫైనల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న జమ్మూకశ్మీర్ జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 87 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. శుభమ్ పుండిర్ (221 బంతుల్లో 117 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీతో విజృంభించగా... యావర్ హసన్ (150 బంతుల్లో 88; 13 ఫోర్లు), అబ్దుల్ సమద్ (67 బంతుల్లో 52 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో మెరిశారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబరుస్తున్న జమ్మూకశ్మీర్ జట్టు... స్టార్లతో నిండి ఉన్న కర్ణాటకపై అదే దూకుడు కనబర్చింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (6) విఫలం కాగా... మరో ఓపెనర్ యావర్ హసన్తో కలిసి శుభమ్ రెండో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో యావర్ 77 బంతుల్లో శుభమ్ 100 బంతుల్లో హాఫ్సెంచరీలు పూర్తి చేసుకున్నారు. శుభమ్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడితే... యావర్ మాత్రం ఎడాపెడా బౌండరీలు బాదాడు. కర్ణాటక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ ద్వయం 244 బంతుల్లో 139 పరుగులు జోడించింది. ప్రసిధ్ బౌన్సర్కు గాయపడిన కెపె్టన్ పారస్ డోగ్రా (9) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగ్గా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్... శుభమ్కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్కు 144 బంతుల్లో 105 పరుగులు జోడించారు. ఈ క్రమంలో శుభమ్ భారీ సిక్స్ సాయంతో 186 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్, సెమీఫైనల్లో బెంగాల్పై విజయాలు సాధించిన జమ్మూకశీ్మర్ జట్టు... కర్ణాటకపై సైతం చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. కర్ణాటక జట్టు తరఫున ఈ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో జమ్మూకశ్మీర్ ప్లేయర్లు పరుగుల వరద పారించడం విశేషం. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న జమ్మూకశీ్మర్ జట్టు రెండో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందనేది కీలకం. స్కోరు వివరాలు జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: కమ్రాన్ ఇక్బాల్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 6; యావర్ హసన్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 88; శుభమ్ (బ్యాటింగ్) 117; పారస్ డోగ్రా (రిటైర్డ్ హర్ట్) 9; అబ్దుల్ సమద్ (బ్యాటింగ్) 52; ఎక్స్ట్రాలు 12; మొత్తం (87 ఓవర్లలో 2 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–18, 2–157, 2–179. బౌలింగ్: విద్యాధర్ పాటిల్ 16–0–66–0; విజయ్ కుమార్ వైశాఖ్ 18–6–25–0; ప్రసిధ్ కృష్ణ 16–5–36–2; శ్రేయస్ గోపాల్ 17–1–79–0; శిఖర్ షెట్టి 20–0–68–0.
మరోసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: ప్రొ హాకీ లీగ్లో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మొదటి ఐదు మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో ఓటమి పాలైన టీమిండియా... తర్వాతి రెండు మ్యాచ్ల్లో ‘షూటౌట్’లో ఓడిపోయింది. రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–4 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. స్పెయిన్కు రెండు పాయింట్లు, భారత్కు ఒక పాయింట్ లభించింది. నిర్ణీత సమయంలో 59 నిమిషాల వరకు 1–0తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... 59వ నిమిషంలో గోల్ సమర్పించుకుంది. దాంతో స్పెయిన్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆట 19వ నిమిషంలో మణీందర్ సింగ్ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి విజయం దిశగా సాగింది. మరో రెండు నిమిషాలు పూర్తయితే భారత్కు తొలి గెలుపు ఖాయమయ్యే స్థితిలో స్పెయిన్ ప్లేయర్ బ్రూనో ఫాంట్ గోల్ చేశాడు. చివరి 13 సెకన్లలో స్పెయిన్కు ఏకంగా మూడు పెనాల్టీ కార్నర్లను సమర్పించుకున్న భారత్ వాటిని నిలువరించింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో స్పెయిన్ ఆటగాళ్లు తొలి నాలుగు అవకాశాలను సద్వినియోగం చేసుకోగా... భారత్ తరఫున అభిషేక్, కెప్టెన్ హార్దిక్ సింగ్ గురి తప్పడంతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్లో స్పెయిన్కు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు, భారత్కు నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే రెండు జట్లు అన్నింటిని వృథా చేశాయి. నేడు జరిగే రెండో అంచె చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత జట్టు రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.
తండ్రికి సీరియస్.. జట్టును వీడిన భారత పవర్ హిట్టర్
టీ20 ప్రపంచకప్-2026లో జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రింకూ హుటాహుటిన ఇంటికి బయలు దేరి వెళ్లిపోయాడు.దీంతో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్కు రింకూ దూరమయ్యాడు. అతడు ఎప్పుడు తిరిగి వస్తాడన్నది కూడా స్పష్టత లేదు. రింకూ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని స్థానిక ఆస్పత్రిలో వెంటిటేలర్పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు రింకూ జట్టును వీడాడు. కాగా ఈ మెగా టోర్నీలో రింకూకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 24 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్ల్లో ఆఖరి ఓవర్లలోనే క్రీజులోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో ముందుగానే బ్యాటింగ్కు వచ్చినప్పటికి.. డకౌటై పెవిలియన్కు చేరాడు.అయితే సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాల్వడంతో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్కు చాలా కీలకం. ఇటువంటి మ్యాచ్కు ముందు రింకూ జట్టును వీడడం గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి.
రాణించిన పాక్ బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పల్లెకలే వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో పాకిస్తాన్ ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.ఓపెనర్ సైమ్ అయూబ్(9), కెప్టెన్ సల్మాన్ అఘా(5) నిరాశపరిచినప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్(63), ఫఖర్ జమాన్(25), బాబర్ ఆజం(25),షాదాబ్ ఖాన్(23) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లైమ్ డాసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్, జోఫ్రా అర్చర్ తలా రెండేసి వికెట్లు చోప్పున సాధించారు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
వైభవ్కు టాటా లగ్జరీ కారు గిఫ్ట్.. ధర ఎంతంటే?
బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల వైభవ్ ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్.. తన సంచలన బ్యాటింగ్తో వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వణికించాడు.కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. అతడు 206.56 స్ట్రైక్ రేట్తో కేవలం 7 మ్యాచ్ల్లోనే 252 పరుగులు చేశాడు. దీంతో వైభవ్ “ టాటా కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్” అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా టాటా మోటార్స్ అతనికి ప్రత్యేక బహుమతిగా కొత్త టాటా కర్వ్ SUV కారును అందించింది. వైభవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను టాటా మోటార్స్ ఇన్స్టాలో షేర్ చేసింది. కాగా టాటా కర్వ్ టాప్ మోడల్ ఆన్-రోడ్ ధర ఢిల్లీలో రూ. 22 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు అత్యాధునికమైన డీజిల్ ఇంజిన్ ,డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ వంటి ఫ్యూచర్స్ కలిగి ఉంది.
ఇంగ్లండ్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న పాక్
టీ20 ప్రపంచకప్-2026లో మరో రసవత్తర పోరుకు తెర లేచింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్,ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో పాక్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫహీమ్ అష్రాప్ స్ధానంలో షాహీన్ అఫ్రిది తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
'వాళ్లేం మాల్కం మార్షల్ కాదు'.. హార్దిక్, దూబేపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా సెమీఫైనల్కు చేరుతుందా? లేదా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో పరిస్థితి అంతా తారుమారైంది. గ్రూపు-1 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్ధానంలో ఉంది. నెట్రన్ రేట్(-3.800) భారీగా పడిపోయింది.దీంతో భారత్ సెమీస్కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలో భారీ విజయాలతో పాటు, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ భారత్ విఫలమైంది.21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సఫారీలను భారత బౌలర్లు ఆపలేకపోయారు. మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఓటమిలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత వద్ద సరైన ఫాస్ట్ బౌలర్లు లేరని అక్తర్ అన్నాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు ఏమి మాల్కమ్ మార్షల్ వంటి బౌలర్లు కాదని అక్తర్ ఎద్దేవా చేశాడు."సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. సాధారణంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 97 నుంచి 98 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్లో 94 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అతడిని డెవాల్డ్ బ్రెవిస్ టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నారు.వారిద్దరూ ఏమి ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెట్టే మాల్కమ్ మార్షల్లు కారు. డెత్ ఓవర్లలో అటువంటి వారితో బౌలింగ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రోటీస్తో మ్యాచ్లో అదే జరిగింది. ఈ మ్యాచ్లో పాండ్యా 45 పరుగులు సమర్పించుకున్నాడు" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు.
'గంభీర్ రాజకీయాలు చేస్తున్నాడు.. సూర్యతో కుల్దీప్కు గొడవ'
టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు పరిస్థితి గందరగోళంగా మారింది. లీగ్ స్టేజిలో వరుస విజయాలతో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ, కీలకమైన సూపర్-8 స్టేజిలో మాత్రం తేలిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన భారత్ .. తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలోనూ భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ప్రయోగం బెడిసి కొట్టింది.అద్బుతమైన ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్కు కాదని వాషింగ్టన్ సుందర్కు తుది జట్టులో ఛాన్స్ వచ్చారు. సుందర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమయ్యాడు. దీంతో గంభీర్పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ వ్యవహారశైలి జట్టును దెబ్బతీస్తోందని అతడు అన్నాడు."గంభీర్ వ్యూహత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. తుది జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లను ఆడించాల్సిన అవసరం ఏముంది? గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఐడైన్ మార్క్రామ్ వంటి పార్ట్ టైమ్ బౌలర్ వచ్చి వికెట్ తీస్తే, అది జట్టుపై అనవసరమైన ఒత్తిడిని కచ్చితంగా పెంచుతోంది.భారత జట్టు వద్ద చాలా అప్షన్స్ ఉన్నాయి. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ గంభీర్ ఆటగాళ్లను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి మ్యాచ్ విన్నర్లను భారత్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ను సూర్య వెనక్కి నెట్టివేసిన వీడియో ఒకటి వైరలైంది.బహుశా సూర్యకుమార్తో ఉన్న గొడవ వల్లే కులదీప్ను తప్పించారని అందరూ అనుకుంటున్నారు. లేదంటే కుల్దీప్ లాంటి స్టార్ స్పిన్నర్ పక్కన పెట్టే ఛాన్సే లేదు. ఏదైనా రంగంలో రాణించాలంటే పూర్తి ఏకాగ్రత అవసరం. కానీ గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల అతడి ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయింది.గంభీర్ రాజకీయాల్లో పెద్దగా రాణించలేక తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఇప్పుడు అదే తరహా రాజకీయాలను టీమిండియాలో చేస్తున్నాడు. గంభీర్ తన సొంతప్రయోగాలతో భారత జట్టు ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహజాద్ పేర్కొన్నాడు.
సీఎం కప్ ఫైనల్స్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: చీఫ్ మినిస్టర్ కప్ 2025 (తె...
పాక్ కెప్టెన్పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మాద్ బ...
రుతుజా జోడీ ఓటమి
దుబాయ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ ...
హర్మన్ప్రీత్ దూరం
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన పురుషుల ప్రొ లీగ్ తొ...
ఇంగ్లండ్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న పాక్
టీ20 ప్రపంచకప్-2026లో మరో రసవత్తర పోరుకు ...
'వాళ్లేం మాల్కం మార్షల్ కాదు'.. హార్దిక్, దూబేపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా సెమీఫైనల్కు చ...
'గంభీర్ రాజకీయాలు చేస్తున్నాడు.. సూర్యతో కుల్దీప్కు గొడవ'
టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు పరిస్థితి గ...
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల...
క్రీడలు
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
వీడియోలు
రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!
కొంపముంచిన గంభీర్
సూపర్ 8లో హై ఓల్టేజ్ ఫైట్..! ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
టీ20 ప్రపంచ కప్ లో నేడు కీలక మ్యాచ్
ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
