Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Netizens Lambasts Mohsin Naqvi India fuel claim over PSL crowds1
ఇండియాలోనే ఆ సంక్షోభం?.. పీసీబీ చీఫ్‌నకు చివాట్లు

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీపై భారతీయ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఇంత తేలిగ్గా అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం సిగ్గులేదా’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌, భారత్‌పై పడి ఏడ్వటం మానేసి పాకిస్తాన్‌ సంగతి చూసుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.అసలు ఏం జరిగిందంటే.. ఐపీఎల్‌కు దరిదాపుల్లో కూడా లేకపోయినా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)ను అదే స్థాయిలో ప్రమోట్‌ చేయాలని పీసీబీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఐపీఎల్‌కు పోటీగా మార్చిలోనే ఈ లీగ్‌ను నిర్వహిస్తుండగా.. ప్రసార హక్కుల విషయంలో ఈ రెండింటికీ నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.నాలుగు సీజన్లకు సమానంఐపీఎల్‌లో కేవలం ఏడు మ్యాచ్‌ల మీడియా హక్కుల విలువ పీఎస్‌ఎల్‌ నాలుగు సీజన్లకు సమానంగా ఉంటుందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఐపీఎల్‌తో పోలుస్తూ పాక్‌ మాజీ క్రికెటర్లు, పీసీబీ చీఫ్‌ నఖ్వీ పీఎస్‌ఎల్‌ను పొగుడుకుంటూ ఉంటారు.ఇక తాజా సీజన్‌పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం గట్టిగానే పడింది. దీంతో పాక్‌లో చమురు సంక్షోభం తలెత్తగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే కేవలం కరాచీ, లాహోర్‌లో మాత్రమే పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. ఐపీఎల్‌ అన్ని వేదికల్లోనూ సజావుగా మ్యాచ్‌లు సాగుతుండగా.. ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు.అర్థం చేసుకోవాలిఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను స్టేడియానికి ఎప్పుడు అనుమతిస్తారు అనే ప్రశ్న ఎదురుకాగా.. మొహ్సిన్‌ నఖ్వీ ఇచ్చిన సమాధానం వైరల్‌ అవుతోంది. ‘‘ఈరోజే నేను పీఎస్‌ఎల్‌ జట్ల యజమానులు, ఆటగాళ్లతో మాట్లాడాను.కరాచీ కింగ్స్‌ కూడా ఈ విషయం గురించి మమ్మల్ని రిక్వెస్ట్‌ చేసింది. నేను ప్రధానిని కలిసి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాల్సిందిగా కోరతాను. అయితే, ప్రస్తుతం చుట్టుపక్కల దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి.అంతటా ఇంధన సంక్షోభం ముదిరింది. ఓవైపు మా ప్రధాని మాత్రం ఇరాన్‌- అమెరికా యుద్ధానికి చరమగీతం పాడి శాంతివైపు మొగ్గుచూపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి.ఇండియాలో పరిస్థితి ఘోరంగా ఉందిమా ప్రధాని అదే పనిమీద ఉన్నారు. ఇండియాలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ చమురు సంక్షోభం ఎక్కువైంది. పెట్రోల్‌ పంపుల్లో బారులు తీసిన వాహనాలను చూస్తుంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు’’ అని నఖ్వీ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడికి చురకలు అంటిస్తున్నారు.‘‘అవును.. పాకిస్తాన్‌లో అసలు ఎలాంటి సంక్షోభం లేదు. ఇండియాలో అయితే నేను ఈరోజు సాయంత్రం.. 45 లీటర్ల పెట్రోల్‌ కొట్టించుకోవడానికి మూడు నిమిషాలు పట్టింది. ఎంత పెద్ద సంక్షోభమో’’ అంటూ నఖ్వీకి కౌంటర్లు ఇస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చదవండి: ఐసీసీ చైర్మన్‌గిరిపై నఖ్వీ అధికారిక ప్రకటనPakistan's effort is to establish peace. There is a petrol shortage in India, whereas there is no such issue in Pakistan. I will request the Prime Minister to allow spectators to attend the PSL matches." Mohsin Naqvi Chairman PCB#Pakistán #Cricket #PakistanShapesPeace #india pic.twitter.com/oxEJV9MvLY— Ali Hasan 🏅 (@AaliHasan10) April 13, 2026

ICC names Sanju Samson over Bumrah as Player of the Month for March2
బుమ్రాను కాదని.. సంజూకు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సంజూ శాంసన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అందించే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఏడాది మార్చి నెలకు గానూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’గా ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎంపికయ్యాడు. సహచర ఆటగాడు, ప్రపంచస్థాయి పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను కాదని ఈ అవార్డు సంజూను వరించడం విశేషం.ఆరంభంలో జట్టులో చోటే కరువుటీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఆరంభంలో సంజూకు భారత తుదిజట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. అయితే, సూపర్‌-8 మ్యాచ్‌లలో అనూహ్య రీతిలో మేనేజ్‌మెంట్‌ అతడికి అవకాశం ఇవ్వగా.. సద్వినియోగం చేసుకున్నాడు సంజూ. ముఖ్యంగా నాకౌట్‌ మ్యాచ్‌లలో వెస్టిండీస్‌పై 97*, ఇంగ్లండ్‌పై 89 పరుగులతో దుమ్ములేపాడు.ఫైనల్లోనూ ఇరగదీసిన సంజూఇక ఫైనల్లో న్యూజిలాండ్‌ మీద కూడా 89 పరుగులతో రాణించిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. మొత్తంగా మార్చిలో మూడు మ్యాచ్‌లలో కలిపి సంజూ 275 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌రేటు 199.38. మరోవైపు.. బుమ్రా సైతం ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 14 వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.సంజూకే దక్కిన అవార్డుఈ క్రమంలో సంజూ, బుమ్రాలతో పాటు సౌతాఫ్రికాకు చెందిన నయా ఆటగాడు కన్నార్‌ ఎస్తెరుజియెన్‌ కూడా మార్చి నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. అయితే, వీరిద్దరిని ఓడించి సంజూ శాంసన్‌ ఈ పురస్కారం గెలుచుకున్నాడు. ఇక మహిళల విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్‌ వుమెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా ఎంపికైంది. చదవండి: రాయల్స్‌ వైఖరిపై అసంతృప్తిలో వైభవ్‌

Kavya Maran reaction goes viral after Vaibhav Suryavanshi wicket3
కావ్యా మారన్‌ను ఇలా ఎప్పుడు చూసి ఉండరు!

వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంతమైదానం ఉప్పల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.ఇషాన్‌ కిషన్‌ (44 బంతుల్లో 91) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (40), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (28), సలీల్‌ అరోరా (24 నాటౌట్‌) రాణించారు. అయితే, ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ రాయల్స్‌ నుంచి సన్‌రైజర్స్‌కు గట్టిపోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, అనూహ్య రీతిలో సన్‌రైజర్స్‌ పేసర్‌ ప్రఫుల్‌ హింగే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆది నుంచే దూకుడు చూపిస్తూ రాజస్తాన్‌ బ్యాటింగ్‌ టాప్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ముఖ్యంగా రాజస్తాన్‌ విధ్వంసకరవీరుడు వైభవ్‌ సూర్యవంశీని గోల్డెన్‌ డకౌట్‌గా వెనక్కి పంపడంలో ఎస్‌ఆర్‌హెచ్‌ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఆ సమయంలో సన్‌రైజర్స్‌ జట్టు యజమాని కావ్యా మారన్‌ సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేసుకున్నారు. ప్రఫుల్‌ ఊహించని రీతిలో బ్రేక్‌ ఇవ్వడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ఇదసలు నమ్మశక్యంగా లేదు అన్నట్లుగా తొలుత ఆశ్చర్యపోయిన కావ్యా మారన్‌.. ఆ తర్వాత లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వులు చిందించారు. కావ్యా వైల్డ్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.Kavya Marian reaction on Vaibhav Sooryavanshi Wicket 😭❤️#SRHvsRR #IPL2026 #TATAIPL #CricketTwitter #IPLMatchDay #CricketFever #Wickets #IPLDrama pic.twitter.com/aMqj8XP2Ay— Rushikesh Vadolkar (@RVadolkar) April 13, 2026ఇక వైభవ్‌తో పాటు రాజస్తాన్‌ కీలక బ్యాటర్లు ధ్రువ్‌ జురెల్‌ (0), లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (0), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (4)లను కూడా ప్రఫుల్‌ హింగే వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపించాడు. రవీంద్ర జడేజా (45), డొనోవాన్‌ ఫెరీరా (69) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.సన్‌రైజర్స్‌ బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులు చేసి రాజస్తాన్‌ ఆలౌట్‌ అయింది. దీంతో 57 పరుగుల తేడాతో రైజర్స్‌ జయభేరి మోగించింది. ఫలితంగా హైదరాబాద్‌ ఖాతాలో రెండో విజయం చేరగా.. రాజస్తాన్‌ తొలి ఓటమిని చూవిచూసింది. కాగా ఈ రెండు జట్లు ఇప్పటికి ఐదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి.It's all Orange in Hyderabad 🧡A dominant victory by 5⃣7⃣ runs for @SunRisers ✌️They end #RR's unbeaten streak this season 👏Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR pic.twitter.com/ZRdkxcW2jh— IndianPremierLeague (@IPL) April 13, 2026

CSA Announce 15-member Women squad for T20I series vs India4
భారత్‌తో సిరీస్‌.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన

టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టు స్వదేశంలో భారత జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 17- 27 మధ్య ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ సౌతాఫ్రికా (CSA) భారత్‌తో తలపడే తమ జట్టును ప్రకటించింది.పదిహేను మంది సభ్యులకు చోటుఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటు ఇచ్చినట్లు CSA తెలిపింది. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత మహిళా జట్టుతో సిరీస్‌ కోసం టొబొగొ మచికేను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. గాయపడిన కరాబో మెసో స్థానంలో 25 ఏళ్ల మచికేకు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది.తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికఅదే విధంగా మసబటా క్లాస్‌ స్థానాన్ని ఎలిజ్‌ మేరీ మార్క్స్‌ భర్తీ చేసిందన్న CSA.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీని దృష్టిలో పెట్టుకునే ఈ మేరకు ఇద్దరు కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్‌ మహిళా జట్టు హెడ్‌కోచ్‌ మండ్లా మషింబియ్‌ మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది.ఎలిజ్‌, టొబొగొలను జట్టుకు ఆడించడం కోసం మేము ఆతురతగా ఎదురుచూస్తున్నాం. వాళ్లిద్దరు గొప్పగా ఆడతారని విశ్వసిస్తున్నాం. కొత్త ముఖాలకు చోటు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. యువ ఆటగాళ్లు జట్టుతో ఉంటే నూతనోత్సాహంతో ముందుకు సాగగలం’’ అని పేర్కొన్నారు. కాగా భారత్‌తో టీ20 సిరీస్‌కు లారా వొల్వర్ట్‌ సౌతాఫ్రికా జట్టుకు సారథ్యం వహించనుంది.భారత్‌తో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా మహిళా జట్టులారా వొల్వర్ట్‌ (కెప్టెన్‌), అనికె బాష్‌, తజ్మిన్‌ బ్రిట్స్‌, నదినె డి క్లెర్క్‌, ఆనెరి డెర్క్‌సన్‌, అయాండా హ్లుబి, సినాలో జాఫ్తా, అయబోంగా ఖాక, సునె లుస్‌, టొబొగొ మచికె, ఎలిజ్‌ మేరీ మార్క్స్, నొంకులులెకో మలబ, కాయ్‌లా రెయ్‌నికె, తుమి సెఖుఖునె, క్లో ట్రియాన్‌.సౌతాఫ్రికా- భారత్‌ మహిళా జట్ల టీ20 సిరీస్‌ షెడ్యూల్‌- 5 మ్యాచ్‌లు👉తొలి టీ20- ఏప్రిల్‌ 17- డర్బన్‌👉రెండో టీ20- ఏప్రిల్‌ 19- డర్బన్‌👉మూడో టీ20- ఏప్రిల్‌ 22- జొహన్నస్‌బర్గ్‌నాలుగో టీ20- ఏప్రిల్‌ 25- జొహన్నస్‌బర్గ్‌👉ఐదో టీ20- ఏప్రిల్‌ 27- బెనోని.చదవండి: సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి తర్వాత రియాన్‌ పరాగ్‌ వ్యాఖ్యలు

Vaibhav Sooryavanshi Unhappy With Rajasthan Royals, Team Official Reveals Details5
అసంతృప్తిలో వైభవ్‌

ఐపీఎల్‌ 2026లో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ సొంత జట్టు వైఖరిపై అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ ట్రెవర్‌ పెన్నీ స్వయంగా వెల్లడించారు. రాయల్స్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌ కూడా అయిన పెన్నీ నిన్న (ఏప్రిల్‌ 13) సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా మాట్లాడుతూ.. వైభవ్‌కు ఫీల్డింగ్‌ అంటే చాలా ఇష్టం. కానీ డొనోవన్‌ ఫెరియెరా ఫిట్‌నెస్‌ పాస్‌ చేశాడు. అతను గన్‌ ఫీల్డర్‌. అందుకే అతనిని మెయిన్‌ XIలో ఉంచాం. వైభవ్‌ దీని పట్ల సంతోషంగా లేడు. ఈ విషయంలో జట్టు ఉద్దేశం వైభవ్‌ మంచి ఫీల్డర్‌ కాదని కాదు. ప్రస్తుతానికి ఫెరియెరా ఫీల్డింగ్‌ అత్యుత్తమంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే వైభవ్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడిస్తున్నామని అన్నాడు.కాగా, ప్రస్తుత ఐపీఎల్‌లో వైభవ్‌ సూర్యవంశీ గత కొద్ది మ్యాచ్‌లుగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతను ఇంపార్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా (బ్యాటర్‌గా మాత్రమే) ఆడాడు. రాయల్స్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకోవడంతో అతను డగౌట్‌కే పరిమితమయ్యాడు. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ అరంగేట్రం పేసర్‌ ప్రఫుల్‌ హింగే అద్భుతమైన బంతితో వైభవ్‌ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో హింగే వైభవ్‌తో పాటు మరో ముగ్గురిని కూడా ఔట్‌ చేసి ఎస్‌ఆర్‌హెచ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలి ఓవర్‌లోనే హింగే వైభవ్‌తో పాటు జురెల్‌, ప్రిటోరియస్‌లను కూడా డకౌట్‌ చేసి ఐపీఎల్‌ చరిత్రలో తొలి ఓవర్‌లోనే ముగ్గురిని ఔట్‌ చేసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు ముందు వైభవ్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. 5 మ్యాచ్‌ల్లో సగటు 40, స్ట్రైక్‌ రేట్‌ 263.16తో 200 పరుగులు చేసి, లీడింగ్‌ స్కోరర్‌గా ఉన్నాడు. సీఎస్‌కే, ఆర్సీబీపై 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు చేసి సంచలనం సృష్టించాడు.

BCCI issues show cause notice to RR manager Romi Bhinder6
షోకాజు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు మేనేజర్‌ రోమీ భిందర్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అతడు డగౌట్‌లో మొబైల్‌ ఫోన్‌ వాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అవినీతి, భద్రత నిరోధక విభాగం రోమీ భిందర్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. డగౌట్‌లో మొబైల్‌ ఫోన్‌ ఎందుకు వాడారో 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో బీసీసీఐ పేర్కొంది.వైభవ్‌ సూర్యవంశీ కూడా...కాగా శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుతో గువాహటిలో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా రోమీ భిందర్‌ మొబైల్‌ ఫోన్‌ వాడాడు. ఆ సమయంలో రాజస్తాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉన్నాడు. వీరిద్దరు మొబైల్‌లోకి చూస్తున్నట్లుగా ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌ పాలక మండలి నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్‌కు మొబైల్‌ ఫోన్‌ వాడే వెసులుబాటు ఉన్నా... డగౌట్‌లో మాత్రం ఉపయోగించడానికి వీలు లేదు.తొలి ఓటమిఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దుమ్ములేపుతున్న రాజస్తాన్‌ రాయల్స్‌ జోరుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అడ్డుకట్ట వేసింది. ఉప్పల్‌ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో రాయల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచిన రాయల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌కు దిగింది.నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది సన్‌రైజర్స్‌. లక్ష్య ఛేదనలో రాయల్స్‌ 19 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. సన్‌రైజర్స్‌ బౌలర్‌ ప్రఫుల్‌ హింగే ఆకాశమే హద్దుగా చెలరేగి ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (0)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్‌ జురెల్‌ (0), లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (0), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (4)లను అవుట్‌ చేసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఇక ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాయల్స్‌ నాలుగు గెలిచింది. చదవండి: సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి తర్వాత రియాన్‌ పరాగ్‌ వ్యాఖ్యలు

Rashid Khan Gets Fresh Appointment In Middle Of IPL 20267
రషీద్‌ ఖాన్‌కు కీలక పదవి

ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌కు కీలక పదవి దక్కింది. ప్రపంచ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (WCA) ప్లేయర్‌ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని WCA సీఈవో ఇవాళ (ఏప్రిల్‌ 14) ప్రకటించారు. WCA ప్లేయర్‌ అడ్వైజరీ బోర్డులో రషీద్‌తో పాటు చమారి ఆటపట్టు, డారిల్‌ మిచెల్, వేన్‌ మాడ్సెన్, మాడీ గ్రీన్‌ కూడా చోటు దక్కింది. ఈ పదవిలో రషీద్‌ తదితరులు గ్లోబల్‌ క్రికెట్‌లో జరిగే విషయాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. WCA బోర్డు 2018లో ఏర్పడింది. ఐసీసీ ఈవెంట్లు, షెడ్యూలింగ్‌, కమర్షియల్‌ అంశాలపై ఆటగాళ్ల అభిప్రాయాలను ప్రతిబింబించడం ఈ బోర్డు ప్రధాన లక్ష్యం. ఇందులో 17 ప్రధాన క్రికెట్‌ దేశాల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం ఉంది.కొత్త బోర్డు సభ్యుల నియామకం తర్వాత WCA సీఈవో మాట్లాడుతూ.. ఆటగాళ్లు క్రికెట్‌ భవిష్యత్తుపై శ్రద్ధ చూపుతున్నారు. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పాల్గొనడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఆటగాళ్ల హక్కులు, అవకాశాలు, క్రికెట్‌ అభివృద్ధి కోసం వారు కలసి పనిచేయాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, ‍ప్రస్తుతం రషీద్‌ ఖాన్‌ ఐపీఎల్‌ 2026లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో అతను ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై (4-0-17-3) మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేసి, గతకొంతకాలంగా లేని ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు. 2024లో వెన్ను శస్త్రచికిత్స తర్వాత రషీద్‌ ప్రభావం కాస్త తగ్గింది. ఈ సీజన్‌లో గుజరాత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 17న జరుగనుంది.

Praful Hinge journey: Early Setbacks To A Dreamy IPL Start8
నిరాశలో హింగే.. ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?

‘ఈ మ్యాచ్‌తో ప్రఫుల్‌ హింగే ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు’... పంజాబ్‌ కింగ్స్‌తో గత మ్యాచ్‌ టాస్‌ సమయంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ చెప్పిన మాట ఇది. రైజర్స్‌ బౌలింగ్‌ సమయంలో ఇంపాక్ట్‌ సబ్‌గా హింగే రావాల్సింది. నిరాశకు లోనైన హింగేదురదృష్టవశాత్తూ జట్టు వ్యూహాల్లో భాగంగా చివరి నిమిషంలో అతడిని కాదని జయదేవ్‌ ఉనాద్కట్‌ను రైజర్స్‌ ఆడించింది. దీంతో హింగే తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ చాన్స్‌ వచ్చిన ఆనందం అతనిలో ఆవిరైంది. ఒక 24 ఏళ్ల యువ ఆటగాడికి మానసికంగా ఇది ఎంతో ఇబ్బంది కలిగించే అంశం. Hang it in the Louvre 🤌pic.twitter.com/3VbpYVQumP— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2026అయితే ఈ బాధతో వచ్చిన కసిని అతను తాజా మ్యాచ్‌లో చూపించినట్లున్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ డేంజరస్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (0)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్‌ జురెల్‌ (0), లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (0), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (4)లను అవుట్‌ చేసి.. ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు.దేశవాళీలో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్రఫుల్‌ 2024–25 సీజన్‌తోనే రంజీ ట్రోఫీలో అడుగు పెట్టాడు. ఎరుపు బంతితోనే బాగా ప్రభావం చూపించగల పేసర్‌గా గుర్తింపు పొందిన అతను 10 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 27 వికెట్లు పడగొట్టాడు. కేవలం 6 వన్డేలే ఆడిన ప్రఫుల్‌కు ఐపీఎల్‌కు ముందు ఒకే ఒక టి20 మ్యాచ్‌ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. ఉమేశ్‌ యాదవ్‌ను అభిమానించే ప్రఫుల్‌ అభిమాన బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌. నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్‌ ఒక్కసారిగా సీన్‌లోకి రాలేదు. ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?2022 నుంచి హింగే చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌లో శిక్షణ పొందుతున్నాడు. భవిష్యత్తు కోసం ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ సానబెట్టే బీసీసీఐ ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన ఆటగాళ్లలో ప్రఫుల్‌ కూడా ఉన్నాడు. 2024లో బ్రిస్బేన్‌లో జరిగిన పేస్‌ బౌలర్ల ప్రత్యేక శిక్షణా శిబిరంలో కూడా అతను పాల్గొన్నాడు. విదర్భ టి20 లీగ్‌లో నెకో మాస్టర్‌ బ్లాస్టర్స్‌ జట్టు విజేతగా నిలవడంలో అతను కీలకపాత్ర పోషించాడు. సన్‌రైజర్స్‌ ట్రయల్స్‌లో జట్టు బౌలింగ్‌ కోచ్‌ ప్రఫుల్‌ ప్రతిభను గుర్తించాడు. వేలంలో అతని కనీస ధర రూ. 30 లక్షలకు సన్‌రైజర్స్‌ తీసుకుంది. మరోవైపు.. బిహార్‌కు చెందిన పేసర్‌ సాకిబ్‌ హుస్సేన్‌ కూడా ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 2024లో కోల్‌కతా టీమ్‌లో ఉన్నా మ్యాచ్‌ ఆడే అవకాశం రాకపోగా, ఈసారి రైజర్స్‌ రూ. 30 లక్షలకు ఎంచుకుంది. చదవండి: ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్‌ రాయల్స్‌

Mohsin Naqvi Issues Official Statement On Replacing Jay Shah As ICC Chairman9
ఐసీసీ చైర్మన్‌గిరిపై నఖ్వీ అధికారిక ప్రకటన

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు మోహిసిన్‌ నఖ్వీ, ఐసీసీ చైర్మన్‌గా జై షా స్థానాన్ని భర్తీ చేస్తాడని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై నఖ్వీ తాజాగా స్పందించాడు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే తనకు చాలా బాధ్యతలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. వాటి పనిభారమే అధికంగా ఉందని తెలిపాడు. ఐసీసీ చైర్మన్‌గిరిపై ఆలోచన కూడా లేదని స్పష్టం చేశాడు.ఇదే సందర్భంగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌కు సంబంధించిన పలు విషయాలను కూడా వెల్లడించాడు. పీఎస్‌ఎల్‌లో ప్రేక్షకుల అనుమతి విషయం ప్రధానితో చర్చిస్తానని తెలిపాడు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం కారణంగా పాక్‌ ప్రభుత్వం ఖర్చులు తగ్గించేందుకు పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించని విషయం తెలిసిందే. కాగా, ఐసీసీ చైర్మన్‌గా నఖ్వీ వస్తాడన్న ప్రచారాన్ని భారత క్రికెట్‌ అభిమానులు ముందే తోసి పుచ్చారు. నఖ్వీకు అంత సీన్‌ లేదని లైట్‌ తీసుకున్నారు. అతనికి ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గిరినే చాలా ఎక్కువని అన్నారు. జై షాను పక్కకు పెట్టి నఖ్వీని ఐసీసీ పీఠంపై కూర్చోబెడతారని అనుకోవడం​ మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. ఆనుకున్నట్లుగానే నఖ్వీనే ముందుకు వచ్చి తనకు అంత సీన్‌ లేదని చెప్పడంతో పాక్‌ అభిమానులు తోకముడిచారు.జై షా పదవీకాలం ఇంకా ఉందిఐసీసీ అధ్యక్షుడిగా జై షా 2024 డిసెంబర్‌ 1న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో అతను మూడేళ్ల పాటు ఉంటారు. ఈ విషయం కూడా తెలియకుండానే పాక్‌ అభిమానులు నఖ్వీ త్వరలో ఐసీసీ పీఠాన్ని అధిరోహిస్తాడని డబ్బాలు కొట్టుకున్నారు. తీరా నఖ్వీనే ప్రకటన చేసే సరికి మిన్నకుండిపోయారు.

Praful Hinge Shares Secret Recipe To Dismiss Vaibhav Sooryavanshi In IPL 202610
వైభవ్‌ను ఔట్‌ చేయడంపై హింగే సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 13) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ అరంగేట్రం పేసర్లు ప్రఫుల్‌ హింగే (4-0-34-4), సకిబ్‌ హెస్సేన్‌ (4-0-24-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా హింగే పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు తీసి రాయల్స్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. తద్వారా 19 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.తొలి ఓవర్‌లో హింగే ఔట్‌ చేసిన ముగ్గురు బ్యాటర్లు (వైభవ్‌ సూర్యవంశీ, ధృవ్‌ జురెల్‌, ప్రిటోరియస్‌) డకౌట్‌ కావడం విశేషం. వీరిలో వైభవ్‌ వికెట్‌ చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్‌పై అతి భారీ అంచనాలు ఉండేవి. ఈ సీజన్‌లో అతను తొలి మ్యాచ్‌ నుంచి విధ్వంసం సృష్టిస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై దండయాత్ర తప్పదని అంతా అనుకున్నారు.అయితే వైభవ్‌ విషయంలో హింజ్‌ ప్లాన్స్‌ వేరేలా ఉన్నాయి. సూపర్‌ ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను అతను రెండో బంతికే ఔట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హింగే సంధించిన అద్భుతమైన డెలివరీ కారణంగా వైభవ్‌ గోల్డెన్‌ డకౌటయ్యాడు. హింగే వేసిన బౌన్సర్‌ను ఆడే క్రమంలో బంతి వైభవ్‌ బ్యాట్‌ టాప్‌ ఎడ్జ్‌ తీసుకొని వికెట్‌కీపర్‌ సలీల్‌ అరోరా చేతుల్లోకి వెళ్లింది.వైభవ్‌ వికెట్‌పై మ్యాచ్‌ అనంతరం హింగే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ముందే ప్లాన్‌ చేశాను. వైభవ్‌కి బౌన్సర్‌ వేసి ఔట్‌ చేస్తానని 2–3 మందికి చెప్పాను. నా తొలి మ్యాచ్‌లో నాలుగైదు వికెట్లు తీస్తానని గతేడాదే రాసుకున్నాను. పవర్‌ప్లేలో ఆధిపత్యం చూపుతానని ఊహించాను. అదే నిజమైంది అని అన్నాడు. హింగే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అతని అరంగేట్రంపై ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడని స్పష్టమవుతుంది. నిన్నటి మ్యాచ్‌లో ప్లాన్‌ ప్రకారమే వైభవ్‌ను ఔట్‌ చేసిన విషయమూ తెలుస్తుంది. తన అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్న హింగే రాబోయే మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌కు కీలక బౌలర్‌గా మారిపోయాడు. రాత్రిరాత్రే స్టార్‌ డమ్‌ సంపాదించి హీరో హైప్‌ తెచ్చుకున్నాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌, ఇషాన్‌ కిషన్‌ (91) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్లాసెస్‌ (40) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో సలీల్‌ అరోరా (24 నాటౌట్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (28) బ్యాట్‌ ఝులిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో హింగే, సకిబ్‌ ధాటికి విలవిలలాడిపోయిన రాయల్స్‌ అతికష్టం మీద 19 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాయల్స్‌ను రవీంద్ర జడేజా (45), డొనొవన్‌ ఫెరియెరా (69) ఆదుకున్నారు. ఆఖర్లో తుషార్‌ దేశ్‌పాండే (25) సైతం బ్యాట్‌ ఝులిపించాడు. అయితే అప్పటికే రాయల్స్‌ ఓటమి ఖరారైపోయింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement