Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Hardik Pandya Hides His Face In Shame Almost Cries In Team Bus1
ముఖం చాటేసిన పాండ్యా.. ఏడుపొక్కటే త‌క్కువ‌!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ వైఫ‌ల్యం కొన‌సాగుతుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజ‌యం మాత్ర‌మే సాధించిన ముంబై గురువారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ దారుణ ఓట‌మిని చ‌విచూసింది. ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల విధ్వంసంతో ముంబై బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. మ్యాచ్‌లో ఓట‌మితో ముంబై ఇండియ‌న్స్ ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానానికి ప‌డిపోయింది. ముంబై ఓట‌మి త‌ర్వాత‌ ఢీలా ప‌డిన ఆ జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బస్సులో హోట‌ల్ రూమ్‌కు బ‌య‌ల్దేరిన స‌మ‌యంలో మీడియా కంట ప‌డ్డాడు. మీడియాను చూసి ముఖం చాటేసిన పాండ్యా తన చేతులు అడ్డుపెట్టుకొని ఏడ్చినంత ప‌ని చేశాడు. త‌న ప‌క్క‌నే కూర్చున్న సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా డ‌ల్‌గా క‌నిపించాడు. ప‌క్క‌నే కూర్చున్న సూర్య‌తో కూడా ఏం మాట్లాడ‌కుండా బ‌స్ అద్దంవైపు తిరిగిన పాండ్యా బ‌య‌ట‌కు చూస్తూ కంట‌త‌డి పెట్టిన‌ట్లు కెమెరాల‌కు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక కెప్టెన్‌గానే గాక ఆట‌గాడిగానూ పాండ్యా విఫ‌ల‌మ‌వుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లు క‌లిపి 27 స‌గ‌టుతో కేవ‌లం 81 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్ర‌మే తీసిన పాండ్యా ఇచ్చుకున్న ప‌రుగులుఎకాన‌మీ రేటు 11.16గా ఉండ‌డం గ‌మ‌నార్హం. పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోవ‌డం దగ్గ‌రి నుంచి పాండ్యాకు ఏదీ క‌లిసిరాలేదు. బ్యాటింగ్‌లో 14 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ఈ ఆల్‌రౌండ‌ర్ మూడు ఓవ‌ర్లు వేసి 39 ప‌రుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ సెంచ‌రీతో మెర‌వ‌గా, న‌మ‌న్ ధిర్ అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. అనంత‌రం పంజాబ్ ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, అయ్య‌ర్ విధ్వంసంతో 16.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 198 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ఇప్ప‌టికే నాలుగు ఓట‌ముల‌తో ప‌ట్టిక‌లో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియ‌న్స్‌కు గుజ‌రాత్ టైటాన్స్‌తో ఏప్రిల్ 20న జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కీల‌కం కానుంది. ఈ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్ వేదిక కానుంది.Hardik Pandya was hiding his face while going hotel in the team bus. He looked quite upset and emotional. After the match last night pic.twitter.com/X0Gdcltzpr— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 17, 2026చదవండి: ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన దృశ్యం..

Jasprit Bumrah left frustrated after heated exchange with Hardik Pandya during MI vs PBKS Match2
ముంబై జట్టులో విభేదాలు.. మైదానంలోనే బుమ్రా- హార్దిక్ ఫైట్!

ఐపీఎల్‌-2026లో ఐదు సార్లు ఛాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌కు ఏది కలిసిరావ‌డం లేదు. గురువారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ప‌రాజ‌యం పాలైంది. ముంబైకి ఇది వ‌రుస‌గా నాలుగో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. ముంబై పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి నుంచి రెండో స్దానంలో కొన‌సాగుతోంది.కాగా వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌లో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా- స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్దం ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.ఏమి జ‌రిగిందంటే?196 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ దూకుడుగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. అత‌డిని ఔట్ చేసేందుకు హార్దిక్ పాండ్యా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశాడు. అయిన‌ప్ప‌టికి ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు. దీంతో పాండ్యా త‌న స‌హ‌నాన్ని కోల్పోయాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్న‌ప్పుడు పాండ్యా పదే పదే ఫీల్డ‌ర్ల‌ను మారుస్తూ విసుగు తెప్పించాడు.తన బౌలింగ్‌కు తగ్గట్టుగా ఫీల్డింగ్ పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా, హార్దిక్ జోక్యం చేసుకోవడం బుమ్రాకు నచ్చలేదు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి మాటల యుద్దం జ‌రిగింది. బుమ్రా అసహనంతో నీవు నాకు చెప్పొద్దు అన్న‌ట్లు సైగ‌లు చేశాడు. ఏదేమైన‌ప్ప‌టికి బుమ్రా చివ‌రికి నిర్ణయానికే తలవంచాల్సి వచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో బుమ్రా దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ టీమిండియా పేస్ గుర్రం ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా సాధించ‌లేదు.చదవండి: IND vs IRE: సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌? View this post on Instagram A post shared by Pranav Kumar (@2_be_pro)

Hardik Pandya Called To Hand Over Mumbai Indians Captaincy To Rohit Sharma3
హార్దిక్ పాండ్యా సంచ‌ల‌న నిర్ణ‌యం!

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ ఓటుమ‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. గురువారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై పరాజ‌యం పాలైంది. ఈ ఏడాది సీజ‌న్‌లో ముంబైకి ఇది వ‌రుస‌గా నాలుగో ఓట‌మి కావ‌డం కావడం గమనార్హం. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తీసుకున్న ఓ నిర్ణయంపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.ఏమి జరిగిదంటే?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్‌లో ముంబై ర్యాన్ రికెల్టన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వెంట వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో ముంబై తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న క్వింటన్ డికాక్‌, యువ ఆటగాడు నమన్ ధీర్ తమ అద్బుత బ్యాటింగ్‌తో ముంబైని ఆదుకున్నాడు. డికాక్ సెంచరీతో చెలరేగగా.. నమన్‌ధీర్ ఆర్ధ శతకంతో సత్తాచాటాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరి దూకుడు చూసి ముంబై 230కి పైగా స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. కానీ నమన్ ధీర్ ఔటయ్యాక సీన్ రివర్స్ అయిపోయింది. నమన్ ధీర్ ఔటయ్యాక, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను కాదని హార్దిక్ పాండ్యా స్వయంగా క్రీజులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా తీవ్ర నిరాశపరిచాడు. పాండ్యా 12 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే ఔటయ్యాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఈ లక్ష్యాన్ని పంజాబ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. తాజాగా హార్దిక్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మండిపడ్డాడు.హార్దిక్‌ చెత్త కెప్టెన్సీ?కెప్టెన్ ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఈ ఒక్క సీజన్ కాదు, గత రెండు సీజన్‌ల‌లో కూడా ఇదే తీరును కనబరిచింది. ఈ వైఫల్యాలకు మూల కారణాలను వెతకాలి. 2013 నుంచి 2023 మ‌ధ్య కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్‌కు ఐదు టైటిల్స్‌ను అందించాడు. ఆ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ క‌నీసం ఒక్క‌సారి కూడా ఫైన‌ల్‌కు చేర‌లేక‌పోయింది. ఇప్పుడు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. హార్దిక్ కెప్టెన్సీ బాగోలేదు. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోహార్దిక్ ముందుగా బ్యాటింగ్‌కు రావాల్సిన అవ‌స‌రం ఏముంది? 12 బంతుల్లో 14 పరుగులు ప‌రుగులు మాత్రమే చేశాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌కు కేవలం ఐదు బంతులు మాత్రమే లభించాయి. ఒకవేళ రూథర్‌ఫోర్డ్ కూడా అన్ని బంతులు ఆడి ఉంటే, అతను 3-4 సిక్సర్లు కొట్టి ఉండేవాడు. అంతేకాకుండా జ‌స్ప్రీత్ బుమ్రాతో తొలి ఓవ‌ర్ వేయించాల్సింది. ఇలా ముంబై ఓట‌మికి చాలా కార‌ణాలు ఉన్నాయి. శ్రేయ‌స్ అయ్య‌ర్ అద్భుత‌మైన కెప్టెన్సీతో పంజాబ్‌ను విజ‌య ప‌థంలో న‌డిపిస్తుంటే, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఇందుకు ఒకే ప‌రిష్క‌రం ఉంది. హార్దిక్ వెంట‌నే కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోని, ఆ బాధ్యతను తిరిగి రోహిత్‌కు అప్పగించాలని నేను భావిస్తున్నాను," అని తివారీ క్రిక్‌బజ్ డిబేట్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ ఓట‌ముల‌కు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ హార్దిక్ సీజ‌న్ మ‌ధ్య‌లోనే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ నుంచి వైదొల‌గ‌నున్నాడ‌ని సోషల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ వైఫల్యం కూడా ముంబై జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. బుమ్రా ఇప్పటివరకు ఒక్క వికెట్‌ కూడా సాధించలేదు. వికెట్ల విషయం పక్కన పెడితే పరుగులను కట్టడం చేయడంలో బుమ్రా విఫలమవుతున్నాడు.చదవండి: IND vs IRE: సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌?

Pakistan Captain Drops Bombshell Ready To Sacrifice T20I Format4
‘బాంబు పేల్చిన’ పాక్‌ కెప్టెన్‌.. కీలక ప్రకటన!

టీ20 ప్రపంచకప్‌-2026లో విఫలమైన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సారథిగా, బ్యాటర్‌ అతడు పూర్తిగా విఫలం కావడమే ఇందుకు కారణం.భారత్‌ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా.. తటస్థ వేదికైన శ్రీలంకలో పాక్‌ తమ మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. భారత్‌, అమెరికా, నెదర్లాండ్స్‌, నమీబియాలతో కలిసి గ్రూప్‌-ఎ నుంచి పోటీపడిన పాక్‌.. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది.కొనసాగుతున్న వైఫల్యాలుఅయితే, పసికూనలపై ప్రతాపం చూపి సూపర్‌-8 వరకు చేరుకోగలిగింది. కానీ ఈ దశను దాటలేక ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో సల్మాన్‌ ఆఘా ఆరు ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 60 పరుగులే చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆఘా వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.నా ప్రదర్శన బాగాలేదు..ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లలో కలిపి ఆఘా కేవలం 84 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అతడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌కు సుదీర్ఘ విరామం ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నా ఫామ్‌ గురించి చర్చ నడుస్తోంది. వరల్డ్‌కప్‌ టోర్నీలో నా ప్రదర్శన బాగాలేదు.పాకిస్తాన్‌ లీగ్‌లోనూ ఇదే కొనసాగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇక వన్డే వరల్డ్‌కప్‌-2027 కూడా ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం నేను ఈ టోర్నీ మీదే దృష్టి సారించాలని భావిస్తున్నాను. ఈ ఏడాది డిసెంబరు దాకా టీ20 మ్యాచ్‌లు కూడా లేవు.నా దృష్టి మొత్తం వాటి మీదేఅందుకే పీఎస్‌ఎల్‌ ముగిసిన తర్వాత వన్డే, టెస్టు ఫార్మాట్ల మీదే ఎక్కువగా దృష్టి సారిస్తాను. వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాల కోసం టీ20లకు దూరంగా ఉండమన్నా ఉంటాను. నా దృష్టి ఇప్పుడు వన్డే, టెస్టుల మీదే ఉంది’’ అని సల్మాన్‌ ఆఘా చెప్పుకొచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత పాకిస్తాన్‌ వన్డే సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సల్మాన్‌ ఆఘా మెరుగ్గా రాణించాడు. మొత్తంగా 175 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. సల్మాన్‌ ఆఘా ఇప్పటి వరకు పాకిస్తాన్‌ తరఫున కేవలం 916 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 123.11 కావడం గమనార్హం. ఇక యాభై వన్డేల్లో కలిపి 1538 రన్స్‌ రాబట్టిన ఆఘా.. 23 టెస్టులాడి 1487 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండగా.. అత్యుత్తమ స్కోరు 132 నాటౌట్‌. కాగా పీఎస్‌ఎల్‌ తర్వాత పాక్‌ జట్టు మూడు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. ఆగష్టు 19న లీడ్స్‌లో తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలయ్యేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు.చదవండి: IND vs IRE: సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌?

ICC Announces New Tournament With No India Matches5
ఐసీసీ సంచలన ప్రకటన.. ఆ టోర్నీలో భారత్‌కు నో ఛాన్స్‌

జై షా నాయ‌క‌త్వంలోని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) చారిత్రత్మక నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళల‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు ముందు స‌రికొత్త టీ20 టోర్న‌మెంట్‌ను ఐసీసీ ప్ర‌క‌టించింది. ఇందుకు ఐసీసీ టీ20 ఛాలెంజ్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. అసోసియేట్ దేశాలకు చెందిన జ‌ట్ల‌కు తగిన గుర్తింపును కల్పించడమే ల‌క్ష్యంగా ఈ టోర్నీని ఐసీసీ నిర్వ‌హించ‌నుంది.అందుకే ఈ టోర్న‌మెంట్‌లో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ వంటి అగ్రశ్రేణి జట్లు పాల్గొనవు. ఈ చారిత్రాత్మక మొదటి సీజన్ రువాండాలోని కిగాలీ నగరంలో జరగనుంది. ఈ ఐసీసీ టీ20 ఛాలెంజ్ టోర్నీలో మొత్తం 5 జ‌ట్లు పాల్గోనున్నాయి.ఈ ఐసీసీ ఈవెంట్‌ ఏప్రిల్ 18 నుండి మే 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీని డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ప్రతి జట్టు ఇతర జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది. అంటే గ్రూప్ దశలో ఒక్కో జట్టుకు 8 మ్యాచ్‌లు లభిస్తాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది.ఈ టోర్నీలో పాల్గోనే జ‌ట్లు ఇవేనేపాల్ (ఆసియా)యూఎస్ఎ (అమెరికా)ఇటలీ (యూరప్)వనాటు (ఈస్ట్ ఆసియా-పసిఫిక్)రువాండా (ఆఫ్రికా - ఆతిథ్య జట్టు)చదవండి: నా భర్త గురించి తప్పుడు ప్రచారం: వినోద్‌ కాంబ్లీ భార్య

Sanju Samson likely lead the Indian team on the Ireland tour: Reports6
సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌?

ఐపీఎల్‌-2026 సీజన్ తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబీజీగా గడపనుంది. తొలుత జూన్‌లో స్వ‌దేశంలో మూడు వ‌న్డేలు, ఏకైక టెస్టు సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం మెన్ ఇన్ బ్లూ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది.అయితే జూలైలో ఇంగ్లండ్‌తో జ‌రిగే ప్ర‌ధాన సిరీస్ దృష్ట్యా ఐరీష్ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి యువ జట్టును పంపాలని బీసీసీఐ భావిస్తుందంట. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్న వైభవ్ సూర్యవంశీ ఆయూశ్ మాత్రే, ప్రిన్స్ యాదవ్ వంటి యువ ఆటగాళ్ల పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌, రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కూడా ఐర్లాండ్ టూర్ కోసం సెలెక్టర్లు పిలుపునిచ్చే ఛాన్స్ ఉంది.కెప్టెన్‌గా సంజూ!అయితే ఈ టూర్‌కు రెగ్యులర్ సారధి సూర్యకుమార్ యాదవ్ దూరం కావడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు పగ్గాలను సంజూ శాంసన్‌కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజూ ఇప్పటివరకు జాతీయ జట్టుకు నాయకత్వం వహించికపోయినప్పటికి.. కేరళ జట్టుతో పాటు రాజస్తాన్ రాయల్స్‌ను లీడ్ చేసిన అనుభవం అతడికి ఉంది.సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన సూర్య.. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం విఫలమవుతున్నాడు. అయినప్పటికి అతడిని కెప్టెన్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ సముఖత చూపుతోంది. ఇంగ్లండ్ టూర్‌లో సూర్య మెరుగైన ప్రదర్శన చేస్తే.. 2028 ఒలింపిక్స్ వ‌ర‌కు భార‌త కెప్టెన్‌గా కొనసాగించే అవ‌కాశ‌ముంది.చదవండి: నా భర్త గురించి తప్పుడు ప్రచారం: వినోద్‌ కాంబ్లీ భార్య

Vinod Kambli Wife Left Fuming Over Claims Over Ex Cricketer Health7
బ్రెయిన్‌స్ట్రోక్‌?.. స్పందించిన వినోద్‌ కాంబ్లీ భార్య

తన భర్త గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్‌ విజ్ఞప్తి చేసింది. దేవుడి దయ వల్ల వినోద్‌ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపింది. కాగా గత కొంతకాలంగా వినోద్‌ కాంబ్లీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో 2024, డిసెంబరులో థానే ఆస్పత్రిలో చికిత్స పొందాడు కాంబ్లీ. ఆ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్లు అతడికి ఆర్థికంగా అండగా నిలిచారు. అతిగా మద్యం సేవించడం, పొగ త్రాగడం వల్లే తనకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు కాంబ్లీ గతంలో స్వయంగా వెల్లడించాడు.మెదడులో రక్తం గడ్డకట్టిందని..ఈ పరిణామాల నేపథ్యంలో వినోద్‌ కాంబ్లీ స్నేహితుడు, ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌ మాజీ అంపైర్‌ మార్కస్‌ కౌట్‌ ఇటీవల హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. కాంబ్లీ మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఏ క్షణమైనా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నాడు.ఇక కాంబ్లీ ఇప్పటికీ పొగతాగే అలవాటు మానుకోలేకపోతున్నట్లు మార్కస్‌ వెల్లడించాడు. అంతేకాదు అతడికి ఆర్థికంగా సాయం అందించేందుకు తాను వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసినట్లు తెలిపాడు. ఇందులో ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఉన్నారని.. సచిన్‌ టెండుల్కర్‌ కూడా ఇందులో భాగమని తెలిపాడు.ఫీజు లేకుండా శిక్షణఅదే విధంగా.. ‘‘కాంబ్లీ కర్ర సాయంతో నడుస్తున్నాడు. అతడి కుమారుడు క్రిస్టియానో క్రికెటర్‌ కావాలని కోరుకుంటున్నాడు. ‍క్రిస్టియానోను అకాడమీలో చేర్చుకోవాల్సిందిగా జతిన్‌ పరాంజపేను కోరాను. అందుకు అతడు అంగీకరించాడు. కాంబ్లీ కుమారుడికి అతడికి అకాడమీలో ఫీజు లేకుండా శిక్షణ లభిస్తుంది’’ అని మార్కస్‌ పేర్కొన్నాడు.వినోద్‌ బాగానే ఉన్నాడుఈ క్రమంలో వినోద్‌ కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్‌ తాజాగా స్పందించింది. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. మార్కస్‌ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ‘‘దేవుడి దయవల్ల వినోద్‌ బాగానే ఉన్నాడు. కానీ అతడి ఆరోగ్యం గురించి ఎవరు ఇలా దుష్ఫ్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని ఆండ్రియా హెవిట్‌ వాపోయింది.చదవండి: T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

Delhi Rejected Virat Kohli For Sangwan In IPL Sehwag Reveals Full Story8
అతడి కోసం ఢిల్లీ విరాట్‌ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఇంత వరకు టైటిల్‌ గెలవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒకటి. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌ (2008)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుంది.తప్పటడుగు వేసి ఉండకపోతే..అయినా సరే ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో భారత విధ్వంసకర ఓపెనర్‌, ఢిల్లీ మాజీ ఆటగాడు వీరేందర్‌ సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఢిల్లీ ఫ్రాంఛైజీ గనుక ఆరోజు తప్పటడుగు వేసి ఉండకపోతే.. ఆ జట్టుకు మంచి క్రేజ్‌ అయినా దక్కి ఉండేదని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ వీరూ భాయ్‌ ఏం చెప్పాడంటే.. టాపార్డర్‌ కిక్కిరిసిపోయి ఉండేది‘‘ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ అంటే.. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో శిఖర్‌ ధావన్‌, తిలక్‌రత్నె దిల్షాన్‌ కూడా ఉన్నట్లు నాకు గుర్తు. వీరిద్దరు ఓపెనింగ్‌ బ్యాటర్లే. అయితే, నేను, గౌతమ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించేవాళ్లం.కాబట్టి ధావన్‌, దిల్షాన్‌ ఆలస్యంగా వచ్చేవాళ్లు. మనోజ్‌ తివారి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసేవాడు. అప్పుడ మా టాపార్డర్‌.. ఇలా కిక్కిరిసిపోయి ఉండేది. కాబట్టి కొత్తగా బ్యాటర్‌ను తీసుకునే అవకాశం లేకుండా పోయింది.కోహ్లికి బదులు జట్టులోకి అతడుఆ సమయంలో విరాట్‌ కోహ్లి వన్‌డౌన్‌ లేదంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసేవాడు. కాబట్టి అతడిని జట్టులోకి తీసుకోలేకపోయారు. అప్పుడు మాకు బౌలర్‌ అవసరం ఉంది. అందుకే కోహ్లికి బదులు ఢిల్లీ ప్రదీప్‌ సాంగ్వాన్‌ను జట్టులోకి తీసుకుంది’’ అని చాంపియన్స్‌ వాలీ కామెంట్రీలో జియోస్టార్‌ ఎక్స్‌పర్ట్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.కాగా ఆరోజు అలా ఢిల్లీ కోహ్లిని కెరీర్‌ తొలినాళ్లలో వదిలేసుకోగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజంగా ఎదిగినా.. కోహ్లి మాత్రం ఇప్పటికీ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా ట్రోఫీ గెలవలేకపోయినా.. గతేడాది రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో ఆర్సీబీ తరఫున కోహ్లి తొలిసారి కప్పును ముద్దాడాడు. మరోవైపు.. ఢిల్లీ టైటిల్‌ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.చదవండి: T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

We need to take some tough calls: Hardik Pandya after MI 4th Defeat9
పంజాబ్‌ చేతిలో ఓటమిపై హార్దిక్‌ కీలక వ్యాఖ్యలు

పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. పరాజయాలపై సమీక్ష నిర్వహిస్తామని.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదేమోనని వ్యాఖ్యానించాడు. మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్‌-2026లో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదుసొంతమైదానం వాంఖడేలో గురువారం పంజాబ్‌ కింగ్స్‌ (MI vs PBKS)తో మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మేము ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుసుకునేందుకు సమీక్ష నిర్వహిస్తాము.వ్యక్తిగత వైఫల్యమా? సమిష్టి వైఫల్యమా? మా ప్రణాళికల్లోనే లోపాలున్నాయా? అన్న అంశాలపై చర్చించాల్సి ఉంది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. లేదంటే ఇలాగే కొనసాగుతూ పరిస్థితులు చక్కదిద్దాలా అన్న విషయం గురించి ఆలోచిస్తాము. కొన్ని కఠినమైన ప్రశ్నలకు జవాబులు వెదకక తప్పదు. వైఫల్యాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు.ఆ ముగ్గురే టార్గెట్‌?ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ సీనియర్లు పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌.. మరో ప్లేయర్‌ తిలక్‌ వర్మ (Tilak Varma)ను ఉద్దేశించే హార్దిక్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచస్థాయి బౌలర్‌ అయిన బుమ్రా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.మరోవైపు.. సూర్య చేసిన పరుగులు వరుసగా 16, 51, 6, 33, 0. ఇక తిలక్‌ వర్మ రాబట్టిన రన్స్‌ 20, 0, 14, 1, 8. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ జట్టుకు ఈ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా క్రెడిట్‌ ఇచ్చాడు. ‘‘వాళ్లు మాకంటే మెరుగ్గా బౌలింగ్‌ చేశారు. మెరుగ్గా బ్యాటింగ్‌ చేశారు. ఫీల్డింగ్‌ అద్భుతం. వారి ప్రదర్శనకు మేము మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా 14 పరుగులు చేశాడు. మూడు ఓవర్ల బౌలింగ్‌లో 39 రన్స్‌ ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు.ముంబై వర్సెస్‌ పంజాబ్‌ స్కోర్లుముంబై- 195/6(20)పంజాబ్‌- 198/3(16.3)ముంబైపై ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ గెలుపు.The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026చదవండి: T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

Our Loss Not His: R Ashwin's Big Shreyas Iyer Warning To Agarkar10
‘అతడిని ఎంపిక చేయకపోతే టీమిండియాకే నష్టం’

ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని శ్రేయస్‌ సేన.. తాజాగా ముంబై ఇండియన్స్‌పై జయభేరి మోగించింది. వాంఖడే వేదికగా ముంబైని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి నాలుగో విజయం నమోదు చేసింది.పంజాబ్‌ గెలుపులో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ది కీలక పాత్ర. ముంబై విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 35 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి శ్రేయస్‌ అయ్యర్‌ 203 పరుగులు సాధించాడు.సారథిగా, బ్యాటర్‌గా సూపర్‌హిట్‌గతేడాది కూడా పంజాబ్‌ కెప్టెన్‌, బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా పదిహేడు మ్యాచ్‌లలో కలిపి 604 రన్స్‌ చేయడంతో పాటు.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతకు ముందు దేశీ క్రికెట్‌లో ముంబై తరఫునా అదరగొట్టాడు. అయినప్పటికీ 2023 తర్వాత మళ్లీ అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు.ఆటతోనే అందరికీ సమాధానంఈ పరిణామాల నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ను టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే నష్టపోయేది టీమిండియానే అని అన్నాడు. ఈ మేరకు.. ‘‘శ్రేయస్‌ తన ఆటతోనే అందరికీ సమాధానం చెబుతున్నాడు. అతడి ప్రతిభ ఏమిటో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు.అతడు షార్ట్‌ బాల్‌ను సరిగ్గా ఎదుర్కోలేడంటూ తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే, ముంబైతో మ్యాచ్‌లో అతడు జస్‌ప్రీత్‌ బుమ్రాను ఎలా ఎదుర్కొన్నాడో అందరూ చూశారు కదా!.. షార్ట్‌ బాల్‌నే మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. అంతకు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో రాణించాడు.ఇంకెన్నిసార్లుఇంకెన్నిసార్లు అతడు తనను తాను నిరూపించుకోవాలి? శ్రేయస్‌ లాంటి క్రికెటర్లను చూస్తే నాకెంతో ఆదర్శంగా ఉంటుంది. స్పిన్‌ బౌలింగ్‌లో హిట్టింగ్‌ ఆడుతున్నాడు. షార్ట్‌ బాల్‌ బలహీనతను అధిగమించాడు. గత రెండేళ్లుగా అతడి స్ట్రైక్‌రేటు కూడా 170కి పైగా ఉంది.He is HIM! He is Shreyas Iyer 🫡🎥 Here's how the #PBKS skipper took on the best to reach his FIFTY 👏Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/oG9HFySe8o— IndianPremierLeague (@IPL) April 16, 2026ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లో 300కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబడుతున్నాడు. మంచి బంతి కోసం ఎదురుచూడటం కాదు.. వాళ్లపై అటాకింగ్‌కు దిగుతూ పైచేయి సాధిస్తున్నాడు. అత్యద్భుతంగా ఆడినా సరే అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదు?టీమిండియాకే నష్టంశ్రేయస్‌ అయ్యర్‌ లాంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం వల్ల.. అతడి కంటే జట్టుకే ఎక్కువ నష్టం. అతడిని నాయకత్వ బృందంలో భాగం చేయకపోవడం కచ్చితంగా జట్టుకు నష్టదాయకం’’ అని అశ్విన్‌ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తీరును విమర్శించాడు. కాగా ఆసియా కప్‌-2025కి ముందు అయ్యర్‌ గురించి మాట్లాడుతూ... జట్టులో ఖాళీ లేనందు వల్లే అతడిని పక్కనపెట్టామని అగార్కర్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాలుగింట గెలిచి అగ్రస్థానానికి దూసుకువచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ మాత్రం వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: ‘ఓటములకు ఆ ఒక్కడినే బాధ్యుడిని చేయలేము’

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement