ప్రధాన వార్తలు
అది నన్ను తీవ్రంగా వేధించింది: విరాట్ కోహ్లి
వరుస వైఫల్యాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి బుధవారం బ్యాట్ ఝులిపించాడు. ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేస్తూ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై శతక్కొట్టాడు. ప్రత్యర్థి విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుని జట్టును గెలిపించాడు.గెలుపులో కీలక పాత్రరాయ్పూర్ వేదికగా కేకేఆర్తో మ్యాచ్లో మొత్తంగా 60 బంతుల్లో.. 105 పరుగులతో కోహ్లి (Virat Kohli) అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లిని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.అది నన్ను తీవ్రంగా వేధించిందిఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గత రెండు మ్యాచ్లలో నేను పరుగులు చేయలేకపోయాను. అది నన్ను తీవ్రంగా వేధించింది. బాగా ఆడగలనని నాకు తెలుసు. ఈరోజు బంతిని బలంగా బాది అనుకున్నట్లుగా పని పూర్తి చేశాను.రోజురోజుకీ మరింత మెరుగ్గా ఆడటమే లక్ష్యం. అయితే, కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురవుతాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. ఒత్తిడిని జయించి ముందుకు సాగాలి. ఒక్కోసారి ఒత్తిడిలో ఆడటం కూడా మంచిదే.Cometh the hour, cometh KING KOHLI! 👑The chase master. The run machine and we are running out of superlatives.Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026కారణం అదేఅదే మనల్ని మరింత కఠినంగా శ్రమించేలా చేస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తొలి అడుగు పడేలా ముందకు తోస్తుంది. గత రెండు మ్యాచ్లలో విఫలమైనప్పుడు నేను నిరాశ చెందిన మాట వాస్తవం. ఈరోజు సెంచరీ పూర్తైన తర్వాత గొప్పగా సంబరాలు చేసుకోకపోవడానికి కారణం అదే.కృతజ్ఞుడిగా ఉంటానునా దృష్టి మొత్తం వీలైనన్ని ఎక్కువగా పరుగులు రాబట్టి జట్టును గెలిపించడమే. బ్యాటింగ్ చేయడమంటే నాకు ఇష్టం. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా నాలో పరుగుల దాహం తీరదు. మళ్లీ మొదటి నుంచి వచ్చినట్లుగానే ఉంటుంది. ఆట కోసం ప్రాణం పెడతా. దేవుడి దయ వల్ల ఎన్నో రికార్డులు సాధించగలిగాను. అందుకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను’’ అని విరాట్ కోహ్లి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్లో కోహ్లికి ఇది తొమ్మిదో సెంచరీ కాగా.. ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో పదవ శతకం. ఇదిలా ఉంటే.. గత రెండు మ్యాచ్లలో కోహ్లి డకౌట్ అయిన సంగతి తెలిసిందే.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర
IPL 2026: సీఎస్కేకు భారీ షాక్!
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్య ఓవర్లలో జట్టుకు కీలకంగా మారిన.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ స్వదేశానికి పయనమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు.. ఐపీఎల్-2026 టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.స్పందించిన ఫ్రాంఛైజీఈ విషయంపై చెన్నై యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘జేమీ ఓవర్టన్ (Jamie Overton) కుడి తొడకు గాయమైంది. అతడు యూకేకు వెళ్లిపోతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం అతడి గాయంపై స్పష్టత వస్తుంది’’ అని పేర్కొంది. కాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న చెన్నై జట్టు.. ఆరింట గెలిచింది.కీలక ఆల్రౌండర్గాతద్వారా 12 పాయింట్లు సాధించి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో కీలక ఆల్రౌండర్ అయిన ఓవర్టన్ గాయం వల్ల జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికి 10 మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్.. 14 వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. 136 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. సీజన్ ఆరంభం నుంచి చెన్నైని గాయాల బెడద వేధిస్తోంది. జట్టు దిగ్గజ సారథి, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ సమస్యల వల్ల ఇప్పటికి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక పేసర్ రామకృష్ణ ఘోష్ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన వేళ.. భారీ షాక్!అంతకు ముందే పేసర్ ఖలీల్ అహ్మద్, ఆయుశ్ మాత్రే, నాథన్ ఎల్లిస్.. అతడి స్థానంలో వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యారు. కాగా టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతో చతికిలపడ్డ చెన్నై.. అనూహ్య రీతిలో పుంజుకుని ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకువచ్చింది. ఇలాంటి కీలక సమయంలో ఓవర్టన్ జట్టుకు దూరం కావడంతో భారీ షాక్ తగిలినట్లయింది.ఇక ఇప్పటికి 11 మ్యాచ్లలో 430 పరుగులు సాధించి సంజూ శాంసన్ చెన్నై తరఫున టాప్ రన్ స్కోరర్గా ఉండగా.. పేసర్ అన్షుల్ కాంబోజ్ 19 వికెట్లు కూల్చి టాప్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర
కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఐపీఎల్-2026లో గత రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన ‘కింగ్’.. ఈసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు.ఛేదనలో మొనగాడినని మరోసారి నిరూపిస్తూ ఐపీఎల్లో తన 9వ సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు.ప్రపంచ రికార్డు బద్దలుటీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుల జాబితాలో డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లి సమం చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాయ్పూర్ వేదికగా టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కోహ్లి (105 నాటౌట్) శతక్కొట్టగా.. దేవ్దత్ పడిక్కల్ (27 బంతుల్లో 39) మెరుగ్గా రాణించాడు.Cometh the hour, cometh KING KOHLI! 👑The chase master. The run machine and we are running out of superlatives.Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్లు👉విరాట్ కోహ్లి- 409 ఇన్నింగ్స్లో👉క్రిస్ గేల్- 423 ఇన్నింగ్స్లో👉డేవిడ్ వార్నర్- 431 ఇన్నింగ్స్లో👉జోస్ బట్లర్- 468 ఇన్నింగ్స్లో👉అలెక్స్ హేల్స్- 505 ఇన్నింగ్స్లో👉కీరన్ పోలార్డ్- 633 ఇన్నింగ్స్లోటీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు👉క్రిస్ గేల్- 22👉బాబర్ ఆజం- 13👉డేవిడ్ వార్నర్- 10👉విరాట్ కోహ్లి- 10👉రీలీ రొసోవ్, సాహిబ్జాదా ఫర్హాన్- 9👉క్వింటన్ డికాక్, అభిషేక్ శర్మ- 9.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు
ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన
భారత జట్టు ఎంపికలో ర్యాంకింగ్స్, అంతర్జాతీయ ప్రదర్శనలకంటే తమ సెలక్షన్ ట్రయల్స్కే ప్రాధాన్యతనిస్తామని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) స్పష్టం చేసింది. ట్రయల్స్లో సత్తా చాటితేనే టీమ్లో చోటు దక్కుతుందని, ర్యాంక్ను పరిగణనలోకి తీసుకోమని ఏడాది క్రితం తాము రూపొందించిన విధానాన్ని వెల్లడించింది. ‘నంబర్ వన్’కు చోటే లేదు!ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ‘షాట్గన్’ టీమ్లను ఎన్ఆర్ఐఏ ప్రకటించింది. అయితే ఇందులో ఆసియా నంబర్వన్, ప్రపంచ ర్యాంకింగ్స్లో 6వ స్థానంలో ఉన్న ట్రాప్ షూటర్ జొరావర్ సింగ్ సంధూకు చోటు దక్కలేదు.గత ఆరు నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అతను నిలకడగా రాణిస్తున్నా... ఇటీవల జాతీయ చాంపియన్షిప్, సెలక్షన్ ట్రయల్స్లోలో ప్రదర్శన బాగా లేకపోవడంతో జొరావర్ను తప్పించారు. నెల రోజుల క్రితమే జొరావర్ ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్నాడు. గత అక్టోబర్లో వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన 47 ఏళ్ల జొరావర్ ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం నెగ్గిన మూడో భారత షూటర్గా గుర్తింపు పొందాడు. గత నెలలో కేవలం స్కోరింగ్ పాయింట్ల కోసమే పాల్గొన్న వరల్డ్ కప్లో కూడా జొరావర్ 119 పాయింట్లతో భారత షూటర్లలో అందరికంటే మెరుగైన స్కోరు సాధించాడు. నా ఘనతను గుర్తించాలని కోరుతున్నాఇక 2025 వరల్డ్ చాంపియన్షిప్లో కూడా 122 పాయింట్లతో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. తమ నిర్ణయాన్ని ఎన్ఆర్ఏఐ పునఃసమీక్షించాలని జొరావర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. ‘ఆసియా నంబర్వన్గా, వరల్డ్ నంబర్ 6గా ఉన్న నా ఘనతను గుర్తించాలని కోరుతున్నా. గత ఆరు నెలలుగా నేను ట్రాప్లో అత్యుత్తమ స్కోరింగ్లు నమోదు చేశాను’ అని జొరావర్ అన్నాడు. ఎంపిక చేసే ప్రసక్తే లేదుఅయితే ఎన్ఆర్ఏఐ మాత్రం ఇవేమీ పరిగణనలోకి తీసుకోమని చెబుతోంది. ఎలాంటి మార్పూ లేకుండా ప్రస్తుతం ప్రకటించిన జట్టే 99 శాతం బరిలోకి దిగుతుందని ఎన్ఆర్ఏఐ కార్యదర్శి పవన్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఆటగాళ్ల పేరు ప్రతిష్టలను బట్టి ఎంపిక ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. టీమ్లోకి ఎంపికైన ఇతర ‘షాట్గన్’ షూటర్ల స్కోరింగ్ అంతర్జాతీయ స్థాయిలో జొరావర్కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ప్రపంచకప్లో రిజ్వీ (122), హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ (119), శపథ్ భరద్వాజ్ (118) స్కోరు సాధించారు. 35 ఏళ్ల కైనన్ మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనున్నాడు. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన కైనన్ 36వ స్థానంలో నిలిచాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కైనన్ కాంస్య పతకాన్ని సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్లోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించిన కైనన్... ఆసియా చాంపియన్షిప్లో ఒక రజతం, ఒక కాంస్యం... ప్రపంచకప్లలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిపి నాలుగు పతకాలు గెలిచాడు. భారత ‘షాట్గన్’ జట్ల వివరాలు పురుషుల ట్రాప్: కైనన్ చెనాయ్, అహ్వర్ రిజ్వీ, శపథ్ భరద్వాజ్. మహిళల ట్రాప్: నీరూ, మనీషా కీర్, ఆషిమా అహ్లావత్. పురుషుల స్కీట్: అనంత్జీత్ సింగ్, భవ్తేజ్ గిల్, మేరాజ్ అహ్మద్ ఖాన్. మహిళల స్కీట్: పరీనాజ్ ధలివాల్, రైజా ఢిల్లాన్, మహేశ్వరి చౌహాన్. ట్రాప్ ‘మిక్స్డ్’: కైనన్ చెనాయ్, నీరూ. స్కీట్ ‘మిక్స్డ్’: అనంత్జీత్ సింగ్, పరీనాజ్ ధలివాల్. చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు
‘టాప్’లోనే బుమ్రా.. కమిన్స్ సూపర్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత స్టార్ జస్ప్రీత్ బుమ్రా నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో బుమ్రా 879 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్), ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) ఒక్కో ర్యాంక్ను మెరుగుపర్చుకొని వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్ నోమన్ అలీ మూడు స్థానాలు పడిపోయి ఐదో ర్యాంక్కు చేరుకున్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్లో నిలిచాడు. పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో షంటో తొలి ఇన్నింగ్స్లో 101 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 87 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. బంగ్లాదేశ్కే చెందిన మోమినుల్ హక్ 12 స్థానాలు మెరుగుపర్చుకొని 35వ ర్యాంక్లో ఉన్నాడు.
శ్రీజేశ్పై అనూహ్య వేటు
న్యూఢిల్లీ: భారత మాజీ గోల్కీపర్, అండర్–21 జూనియర్ పురుషుల హాకీ జట్టు హెడ్ కోచ్ పీఆర్ శ్రీజేశ్పై అనూహ్యంగా వేటు పడింది. అతడిని కోచ్ పదవి నుంచి హాకీ ఇండియా (హెచ్ఐ) తప్పించింది. 17 నెలల పాటు కోచ్గా వ్యవహరించిన శ్రీజేశ్ మార్గనిర్దేశనంలో భారత్ ఐదు టోర్నీలు ఆడగా ఐదింటిలోనూ పతకం సాధించింది. జూనియర్ వరల్డ్ కప్లో కూడా కాంస్యం గెలుచుకుంది. అయితే శ్రీజేశ్ కాంట్రాక్ట్ను పొడిగించకుండా హెచ్ఐ కొత్త జూనియర్ కోచ్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. దీనిపై అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కోచ్గా తన విజయాలను పట్టించుకోకుండా కేవలం విదేశీ కోచ్ను ఎంపిక చేసేందుకే హెచ్ఐ ఈ నిర్ణయం తీసుకుందని అతను ఆరోపించాడు. పురుషుల సీనియర్ జట్టు కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ జూనియర్ టీమ్కు కూడా విదేశీ కోచ్ కావాలని కోరడంతోనే హెచ్ఐ ఈ తరహాలో వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించిందని శ్రీజేశ్ అన్నాడు. ఇటీవలే కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ... 2036 ఒలింపిక్స్ కోసం శ్రీజేశ్లాంటి కోచ్లు కావాలని తనను ప్రశంసించిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. ‘కోచ్గా విఫలమైతే అతడిని తప్పిస్తారనేది ఇంత కాలం చూశాను. కానీ విదేశీ కోచ్ను ఎంపిక చేసేందుకు భారత కోచ్ను తొలగిస్తారనేది ఇప్పుడు చూస్తున్నాను. జూనియర్ జట్టుకు కూడా విదేశీ కోచ్ ఉంటేనే భవిష్యత్తు కోసం సీనియర్ జట్టును సిద్ధం చేసేందుకు అనుకూలంగా ఉంటుందని హాకీ ఇండియా అధ్యక్షుడు నాకు చెప్పారు. విదేశీ కోచ్లకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో దీని వల్ల అర్థమవుతోంది. భారత కోచ్లు భారత హాకీని అభివృద్ధి చేయలేరా’ అని శ్రీజేశ్ స్పందించాడు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో (2020 టోక్యో, 2024 పారిస్) భారత జట్టు కాంస్య పతకాలు గెలవడంలో గోల్కీపర్ శ్రీజేశ్ కీలకపాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం ప్లేయర్గా కెరీర్కు వీడ్కోలు పలికిన శ్రీజేశ్ కోచింగ్ వైపు వెళ్లాడు. హాకీ ఇండియా వివరణ... శ్రీజేశ్ అసంతృప్తిపై హెచ్ఐ స్పందించింది. అతడిపై తాము వేటు వేయలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేసింది. ‘శ్రీజేశ్ కాంట్రాక్ట్ గత డిసెంబర్లో ముగిసింది. దాంతో నిబంధనల ప్రకారం ప్రకటన ఇచ్చాం. అర్హులైన వారందరినీ షార్ట్లిస్ట్ చేసి ప్రక్రియ ప్రకారమే కొత్త కోచ్ను ఎంపిక చేశాం. త్వరలోనే కొత్త కోచ్ పేరును ప్రకటిస్తాం. శ్రీజేశ్ను మేం తొలగించలేదు. వచ్చే రెండు ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకొని డెవలప్మెంట్ టీమ్కు కోచ్గా ఉండమని కోరాం. కోచ్గా కూడా అతను మరింత పరిణతి సాధించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పాం. అయితే మేం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అతను దానిని తిరస్కరించాడు’ అని హెచ్ స్పష్టం చేసింది.
కోల్కతాపై బెంగళూరు విజయం
ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరులో కోల్కతా నైట్రైడర్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజయం అందుకుంది.విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో సీజన్లో 8వ విజయంతో ప్లేఆఫ్స్ రేసుకి మరింత చేరువైంది ఆర్సీబీ.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు
టీమిండియా సూపర్ స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా కేకేఆర్తో మ్యాచ్లో కోహ్లి ఈ ఫీట్ను అందుకున్నాడు.కింగ్ కోహ్లికి ఇది 279వ ఐపీఎల్ మ్యాచ్. ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ముగ్గురూ 278 మ్యాచ్లతో సమంగా ఉండేవారు. తాజా మ్యాచ్తో కోహ్లి వారిద్దరిని అధిగమించి అగ్రస్ధానానికి చేరుకున్నాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి కోహ్లి ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఎంఎస్ ధోనీ సీఎస్కే ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. మిస్టర్ కూల్ గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్లో కోహ్లి రికార్డును రోహిత్ శర్మ సమం చేసే అవకాశముంది. కాగా విరాట్ కోహ్లి ఐపీఎల్లో 9,000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఐపీఎల్లో అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు వీరేవిరాట్ కోహ్లి-279ఎంఎస్ ధోని-278రోహిత్ శర్మ-278రవీంద్ర జడేజా-265చదవండి: టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్!?
రఘువంశీ, రింకూ మెరుపులు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2026లో రాయ్పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికి కోల్కతా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కేకేఆర్ ఇన్నింగ్స్లో యువ ఆటగాడు అంగక్రిష్ రఘువంశీ(71) టాప్ స్కోరర్గా నిలవగా.. రింకూ సింగ్( 29 బంతుల్లో 49), గ్రీన్(32) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, రాసిఖ్ సలామ్ దార్ తలా వికెట్ సాధించారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 8:45 గంటలకు ప్రారంభమైంది.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్వుడ్
టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్!?
ఐపీఎల్-2026లో టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. భువీ 36 ఏళ్ల వయస్సులోనూ తన అద్భుత బౌలింగ్తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ తనలో ఏమాత్రం పదను తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు.సరైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేస్తూ క్రమం తప్పుకుండా వికెట్లు పడగొడుతున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ 21 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేసులో భువీ అగ్రస్ధానంలో ఉన్నాడు. అయితే లేటు వయస్సులో ఇరగదీస్తున్న భువనేశ్వర్ను తిరిగి టీమిండియాలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. వన్డే వరల్డ్కప్-2027లో అతడిని ఆడించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా భువనేశ్వర్ చివరగా 2022 నవంబర్లో టీమ్ ఇండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత పేలవ ఫామ్, యువ బౌలర్లు రాకతో భువీ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ భారత జట్టుకు దూరమైనప్పటికి భువీ.. ఐపీఎల్తో పాటు యూపీ టీ20, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి టోర్నీల్లో ఆడుతూ వస్తున్నాడు.ఈ యూపీ వెటరన్ పేసర్ ప్రస్తుతం ఫుల్ ఫిట్గా కన్పిస్తున్నాడు. అయితే భువీ మాత్రం టీమిండియా కమ్బ్యాక్ గురుంచి ఆలోచించడం లేదని తాజాగా స్పష్టం చేశాడు. చాలా ఏళ్ల క్రితమే లాంగ్ టెర్మ్ గోల్స్ను నిర్దేశించుకోవడం మానేశాను అతడు తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ విషయంలో ఎలాగైతే చర్చ జరిగిందో, ఇప్పుడు భవీ విషయంలోనూ అదే పునరావృతమవుతోంది.చదవండి: వైభవ్ కాదు.. ముందు అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి'
శ్రమించి గెలిచిన సాత్విక్ – చిరాగ్ జోడీ
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మి...
ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత!
ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మాల్ అండర్సన్ (91)...
నేను పోరాటం కొనసాగిస్తా: వినేశ్
గోండా (ఉత్తరప్రదేశ్): ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగ...
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ మ్యాచ్ ‘డ్రా’
ఇండియన్ ఫుట్బాల్ లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్...
రఘువంశీ, రింకూ మెరుపులు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2026లో రాయ్పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్...
టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్!?
ఐపీఎల్-2026లో టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్...
టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్ల షెడ్యూల...
కేకేఆర్తో మ్యాచ్.. ఆర్సీబీ జట్టులోకి డేంజరస్ ప్లేయర్
ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరుకు రంగం సిద్దమైంది....
క్రీడలు
SRH vs PBKS : ఉప్పల్లో ఫుల్ జోష్.. తారల సందడి (ఫొటోలు)
మళ్లీ విజయం వేటలో..ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్..సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
వీడియోలు
టేబుల్ టాపర్ గా గుజరాత్ టైటాన్స్
ఆడపిల్లలకు ఫోన్ ఇవ్వద్దు.. దుమారం రేపుతున్న ఆఫ్రిది కామెంట్స్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ టాప్
ఒక్క నిర్ణయంతో ముంబైని ప్లేఆఫ్స్ నుండి దూరం చేసాడు
ఐపీఎల్ లో ముంబైపై బెంగళూరు విజయం
అయ్యర్ కు చెక్.. టీ20 కెప్టెన్ గా సంజు శాంసన్
సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న రోహిత్ టీజర్
BCCI సంచలన నిర్ణయం.. సూర్య ఔట్.. టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్
ఉత్కంఠ పోరులో బెంగళూరుపై లక్నో విజయం
ఉప్పల్లో దుమ్మురేపిన SRH
