Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Donald Trump enters T20 World Cup 2026, announces open support to USA team1
క్రికెట్‌ ప్రపంచంలోకి ఎంటరైన ట్రంప్‌

అనునిత్యం వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, తాజాగా క్రికెట్‌ ప్రపంచంలోకి కూడా ఎంటరయ్యాడు. భారత్‌, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న తమ జట్టుకు (యూఎస్‌ఏ) ట్రంప్‌ మద్దతు ప్రకటించాడు. సోషల్‌ ట్రూత్‌లో ఓ ప్రత్యేక సందేశం పోస్ట్ చేస్తూ.. టీమ్‌ యూఎస్‌ఏ చాలా బలమైంది. అమెరికా మొత్తం మీ వెనుకే ఉంది అని పేర్కొన్నాడు. ట్రంప్‌ ఇచ్చిన మద్దతు యూఎస్‌ఏ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. రేపు (ఫిబ్రవరి 10) పాకిస్తాన్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ట్రంప్ సందేశం యూఎస్‌ఏ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ట్రంప్‌ మద్దతు అమెరికాలో క్రికెట్ ఎదుగుదలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్‌కు క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేదు. గోల్ఫ్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ వంటి క్రీడలపై అతనికి ప్రత్యేక ఆసక్తి ఉంది. అయితే ట్రంప్‌కు 2020లో అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం (ప్రస్తుతం నరేంద్ర మోడి స్టేడియం) ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనుభవం ఉంది. భారత్‌తో వాణజ్యపరమైన సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్న వేల, ట్రంప్‌ ప్రకటన భారతీయుల్లోనూ ఆసక్తి కలిగిస్తుంది. ట్రంప్‌ మద్దతు ఉంటే క్రికెట్‌ కూడా విశ్వక్రీడగా మారిపోయే అవకాశం ఉంది.అమెరికాలో క్రికెట్ అభివృద్ధి 2023లో ప్రారంభమైన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌తో మొదలైంది. ఆ టోర్నీలో భారత్‌ తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్‌ క్రికెటర్లందరూ పాల్గొంటారు. 2024 టీ20 ప్రపంచకప్‌కు సహ-ఆతిథ్యం ఇవ్వడంతో అమెరికా ప్రజలకు క్రికెట్‌ మరింత చేరువైంది. యూఎస్‌ఏలో ఇప్పటికే 150 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ జట్టు గత ఎడిషన్‌ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుత ఎడిషన్‌లోనూ ఆ జట్టు మరో సంచలనం సాధించే అవకాశం ఉంది. టోర్నీ ఓపెనర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆటగాళ్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చారు. ఈ మ్యాచ్‌లో వారి పోరాటానికి క్రికెట్‌ అభిమానులంతా ముగ్దులయ్యారు. టీమిండియా ఆ మ్యాచ్‌ను మాత్రమే గెలిచింది కానీ, యూఎస్‌ఏ జట్టు మాత్రం క్రికెట్‌ ప్రపంచాన్నంతా గెలిచింది.

T20 WC 2026: Zimbabwe beat Oman by 8 wickets2
చెలరేగిన బౌలర్లు.. మరో పసికూనను వణికించిన జింబాబ్వే

టీ20 ప్రపంచకప్‌ 2026లో జింబాబ్వే ఘనంగా బోణీ కొట్టింది. ఒమన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. రిచర్డ్‌ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.5-0-18-3), సికందర్‌ రజా (4-0-17-1) ధాటి​కి ఒమన్‌ 103 పరుగులకే (19.5 ఓవర్లలో) కుప్పకూలింది.ఒమన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్‌ మెహమూద్‌ 25, వినాయక్‌ శుక్లా 28, నదీద్‌ ఖాన్‌ 20 పరుగులు చేయడంతో ఒమన్‌ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. మిగతా ఆటగాళ్లలో ఆమిర్‌ కలీమ్‌, కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌, షా ఫైసల్‌ తలో 5 పరుగులు, షకీల్‌ అహ్మద్‌ 4, జితెన్‌ రామనంది 1, వసీం అలీ 3 పరుగులు చేయగా.. హమ్మద్‌ మీర్జా, కరన్‌ సోనావలే డకౌట్లయ్యారు.అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూపాడుతూ ఛేదించింది. 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (48 నాటౌట్‌), బ్రెండన్‌ టేలర్‌ (31 రిటైర్డ్‌ హర్ట్‌) రాణించారు. మరుమని 21, సికందర్‌ రజా 5 (నాటౌట్‌) పరుగులు చేయగా.. డియాన్‌ మైర్స్‌ డకౌటయ్యాడు. ఒమన్‌ బౌలర్లలో సఫ్యాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెస్సింగ్‌ ముజరబానీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Oman veteran Aamir Kaleem scripts T20 World Cup history3
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్‌ ఆటగాడు

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒమన్‌ ఆటగాడు ఆమిర్‌ కలీమ్‌ 44 ఏళ్ల 81 రోజుల వయసులో పొట్టి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడి, టోర్నీ చరిత్రలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒమన్‌ ఇవాళ (ఫిబ్రవరి 9) కొలంబో వేదికగా జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో కలీమ్‌ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు హాంగ్‌కాంగ్‌కు చెందిన ర్యాన్‌ క్యాంప్‌బెల్‌ పేరిట ఉండేది. క్యాంప్‌బెల్‌ 2016 ప్రపంచకప్‌లో 44 ఏళ్ల 30 రోజుల వయసులో బరిలోకి దిగాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 40లు దాటిన వారు చాలామంది ఉన్నారు. ఒమన్‌కే చెందిన మొహమ్మద్‌ నదీమ్‌ 43 వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. ఇటలీ కెప్టెన్‌ వేన్‌ మ్యాడ్‌సన్‌ 42, ఆఫ్ఘనిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ, నెదర్లాండ్స్‌ ఆటగాడు వాన్‌డర్‌ మెర్వ్‌ 41 ఏళ్ల వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌ బరిలో ఉన్నారు.కలీమ్‌ విషయానికొస్తే.. ఇతను పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించి క్రికెట్‌ కెరీర్‌ కోసం ఒమన్‌కు వలస వెళ్లాడు. ఈ జట్టు తరఫున అతను 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 15 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన కలీమ్‌.. ఫిబ్రవరి 3న శ్రీలంక-ఏతో జరిగిన ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను 47 బంతుల్లో 80 పరుగులు చేసి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ప్రస్తుతం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కలీమ్‌ (5) తేలిపోయాడు. అతనితో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్‌ మెహమూద్‌ 25, వినాయక్‌ శుక్లా 28, నదీద్‌ ఖాన్‌ 20 పరుగులు చేయడంతో ఒమన్‌ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.5-0-18-3), సికందర్‌ రజా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. వీరి ధాటికి ఒమన్‌ జట్టు విలవిలలాడింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే గెలుపు దిశగా సాగుతోంది. 7.3 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి, లక్ష్యానికి 75 పరుగుల దూరంలో మాత్రమే ఉంది.

Heartbreak in Ranji Trophy, Sudip Kumar Gharami OUT at 299 after rescuing Bengal alone4
అయ్యో పాపం.. ఒక్క పరుగుతో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌

ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో బెంగాల్‌ యువ బ్యాటర్‌ సుదిప్‌ కుమార్‌ ఘరామీ తృటిలో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. కష్టాల్లో (43-3) ఉన్న జట్టును గట్టెక్కించి, 299 పరుగుల వద్ద ఔటయ్యాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ ఆటగాడు 299 పరుగుల వద్ద ఔట్‌ కావడం ఇదే మొదటిసారి. 1988-89 సీజన్‌లో మహారాష్ట్ర ఆటగాడు శంతాను సుగ్వేకర్‌ 299 పరుగుల వద్ద అజేయంగా మిగిలిపోయాడు. యావత్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఘరామీతో సహా ఇప్పటివరకు కేవలం ముగ్గురే 299 పరుగుల వద్ద ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో ఘరామీ 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 299 పరుగులు చేశాడు. వనడౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఆరో వికెట్‌కు సుమంత్‌ గుప్తాతో (81) 165 పరుగులు, ఏడో వికెట్‌కు హబీబ్‌ గాంధీతో (95) 221 పరుగుల భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఘరామీ బ్యాట్‌ నుంచి జాలువారిన ఈ మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆధునిక రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌ల్లో (12 గంటలకు పైబడి) ఒకటిగా నిలిచిపోతుంది. ఈ హీరోయిక్‌ ఇన్నింగ్స్‌తో బెంగాల్‌ను ఒంటిచేత్తో గట్టెక్కించిన ఘరామీ, ఒక్క పరుగు తేడాతో అరుదైన ట్రిపుల్‌ సెంచరీ మిస్సై నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు. ఘరామీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ కారణంగా ఆంధ్రతో మ్యాచ్‌లో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. ఆఖర్లో టీమిండియా ఆటగాడు, బెంగాల్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ (53) కూడా మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు.దీనికి ముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్‌ (83) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. శ్రీకర్‌ భరత్‌ (47), షేక్‌ రషీద్‌ (46), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ ఐదు వికెట్లతో విజృంభించగా.. మరో టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌దీప్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. షమీ సైతం ఓ వికెట్‌ పడగొట్టాడు.ప్రస్తుతం ఆట చివరి రోజు మూడో సెషన్‌ కొనసాగుతుంది. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. కెప్టెన్‌ రికీ భుయ్‌ (1), నితీశ్‌ కుమార్‌ రెడ్డి క్రీజ్‌లో ఉన్నారు. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆంధ్ర ఇంకా 289 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌ ఎటూ డ్రా అవుతుంది కాబట్టి, తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కారణంగా బెంగాల్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

Big twist Bangladesh asks Mohsin Naqvi to end India T20 WC Boycott5
బిగ్‌ ట్విస్ట్‌!.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ఒత్తిడి పెరుగుతోంది. పాక్‌ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) ఇప్పటికే పీసీబీకి లేఖ రాసింది.ఆర్థికంగా నష్టంగతంలో తమ జట్టుపై పాకిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగినా.. తిరిగి తామే మళ్లీ తొలిసారి ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని లంక బోర్డు ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఒకవేళ మ్యాచ్‌ రద్దు చేసుకుంటే తాము ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతామని పేర్కొంది. ఇకముందు కూడా తాము పీసీబీతో సంబంధాలు కొనసాగించాలనుకున్నామంటూ సుత్తిమెత్తగానే హెచ్చరికలు జారీ చేసింది.యూఏఈ లేఖతాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) క్రికెట్‌ కూడా పాకిస్తాన్‌కు లేఖ రాసింది. ‘‘ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌తో చాలా ఏళ్లుగా బంధం కొనసాగిస్తోంది. గతంలో పాకిస్తాన్‌ కోసం మా వేదికలు ఇచ్చి టోర్నీలు సజావుగా సాగేలా చూసుకున్నాము.అయితే, టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాక్‌ నిర్ణయం మాతో పాటు ఇతర సభ్యదేశాలను తీవ్రంగా గాయపరిచింది. ముఖ్యంగా అసోసియేట్‌ జట్లు ఆర్థికంగా భారీ ఎత్తున నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది.పీసీబీ కుటుంబంలో సభ్యులుగా ఈ విషయంలో పునరాలోచన చేయాలని.. సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని యూఏఈ బోర్డు ఇ-మెయిల్‌ పంపింది. బంగ్లాదేశ్‌ సైతంఇక ఈ వివాదం అంతటికీ మూలకారణమైన బంగ్లాదేశ్‌ సైతం పీసీబీకి ఇదే సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా భారత్‌-శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా.. భారత్‌లో తమకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్‌ ఐసీసీని ఆశ్రయించిది.తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేసిన ఐసీసీ బంగ్లాకు గడువు ఇచ్చింది. అయినా సరే బంగ్లా బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు. దీంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది.మొహ్సిన్‌ నక్వీతో చర్చలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఉంటామంటూ పాక్‌.. మొదట టోర్నీ నుంచే వైదొలుగుతామని బెదిరించింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే బహిష్కరిస్తామని కొత్త నాటకానికి తెరతీసింది. ఇదే జరిగితే ఐసీసీ ఆర్థికంగా భారీగా నష్టపోతుంది. ఈ ప్రభావం పీసీబీతో పాటు ఇతర సభ్య దేశాల బోర్డు మీదా పడుతుంది.మీ మద్దతుకు ధన్యవాదాలు.. కానీఈ క్రమంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా, బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం ఆదివారం పాకిస్తాన్‌కు వెళ్లారు. పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీతో ఈ విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అమినుల్‌ ఇస్లాం.. తమకు మద్దతుగా నిలిచినందుకు పీసీబీకి ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం.అదే సమయంలో భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగకపోతే తమతో పాటు అన్ని బోర్డులు ఆర్థికంగా నష్టపోతాయని అందుకే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అమినుల్‌ నక్వీని కోరిట్లు సమాచారం.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన నక్వీ.. ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తటస్థ వేదికైన కొలంబోలో ఫిబ్రవరి 15న భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. చదవండి: ముకేశ్‌ అంబానీకి నో చెప్పిన రోహిత్‌ శర్మ!

Pakistan origin player removed from T20 World Cup, India accused of bias6
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి పాక్‌ మూలాలున్న ఆటగాడి తొలగింపు

టీ20 వరల్డ్ కప్-2026 పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టులో కలకలం రేగింది. పాకిస్తాన్ మూలాలున్న బ్యాటర్ మొహమ్మద్ జోహెబ్‌ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అకస్మాత్తుగా స్వదేశానికి పంపించింది. బోర్డు ప్రకటన ప్రకారం.. జోహెబ్ శాసన నియమావళిని ఉల్లంఘించాడు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.జోహెబ్‌ ఏ నియమాలు ఉల్లంఘించాడోనని క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఆరా తీస్తుంది. ఇంత సడెన్‌గా ఓ ఆటగాడిని స్వదేశానికి పంపారంటే ఏదో బలమైన కారణమే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, జోహెబ్ మాత్రం తనపై తీసుకున్న చర్యను జాతి వివక్షగా అభివర్ణించాడు. మేనేజ్‌మెంట్ మొత్తం భారతీయ మూలాలున్నవారే ఉన్నారని, తాను పాకిస్తాన్ మూలాలవాడినైనందు వల్ల జట్టు నుంచి ఆకస్మికంగా తొలగించారని ఆరోపించాడు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని, దీనిపై అధికారిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.ఈ విషయంలో జోహెబ్‌ భారత్‌ను నిందించడాన్ని భారతీయులు తప్పుబడుతున్నారు. ఏదైనా ఉంటే యూఏఈతో బోర్డుతో చూసుకోవాలి కాని, భారత మూలలున్న వారిని అడ్డం పెట్టుకొని భారత్‌ను నిందించడం సరికాదని వార్నింగ్‌ ఇస్తున్నారు.కాగా, జోహెబ్ తొలగింపుతో యూఏఈ జట్టులో కలకలం రేగినా, టోర్నమెంట్‌లో వారి ప్రయాణం కొనసాగుతుంది. రేపు (ఫిబ్రవరి 10) జరిగే మొదటి మ్యాచ్‌లో వారు న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటారు. ఆ తర్వాతి మ్యాచ్‌లు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరగనున్నాయి. ప్రీ-టోర్నమెంట్‌లో ఇటలీతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో యూఏఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక, కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. జోహెబ్ లేకుండా యూఏఈ జట్టు మరింత బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ.. కెనడా, ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచకప్‌లో యూఏఈ స్క్వాడ్: మహ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మయాంక్ కుమార్, మహ్మద్ అర్ఫాన్, మహ్మద్ ఫారూక్, మహ్మద్ జవాదుల్లా, రోహిద్ ఖాన్, సోహెబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్

KL RAHUL SCORED A HUNDRED AND WON THE PLAYER OF THE MATCH AWARD IN RANJI TROPHY QUARTER FINAL AGAINST MUMBAI7
కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకం

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో అద్భుతమైన శతకం సాధించి, తన జట్టుకు (కర్ణాటక) అపురూప విజయాన్ని అందించాడు. ఈ శతకం ఛేదనల్లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా మిగిలిపోనుంది. 325 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాహుల్‌ అద్వితీయమైన సమయస్పూర్తి ప్రదర్శించి చారిత్రక శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఏ మాత్రం సహనం కోల్పోకుండా బ్యాటింగ్‌ చేసి విజయం ఖరారయ్యే వరకు క్రీజ్‌లో ఉన్నాడు. 182 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మరణ్‌ రవిచంద్రన్‌తో పాటు రాహుల్‌ నెలకొల్పిన 147 పరుగుల భారీ భాగస్వామ్యం మ్యాచ్‌ను కర్ణాటకవైపు మళ్లించింది.స్మరణ్‌ అజేయమైన అర్ద శతకం (83) సాధించి, కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. విద్యాధర్‌ పాటిల్‌ (31 నాటౌట్‌) స్మరణ్‌కు అండగా నిలిచాడు. 325 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 73.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 15 నుంచి మొదలయ్యే తొలి సెమీఫైనల్లో కర్ణాటక ఉత్తరాఖండ్‌తో తలపడుతుంది.కర్ణాటకతో మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే చాపచుట్టేసింది. కావేరప్ప, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్‌లో అఖిల్‌ హెర్వాద్కర్‌ (60) ఒక్కడే రాణించాడు.అనంతరం కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్‌ అగర్వాల్‌ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్‌ అవస్తి, తుషార్‌ దేశ్‌పాండే తలో 4 వికెట్లు తీశారు.ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌ ఆనంద్‌ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్‌ కోటియన్‌ (48 నాటౌట్‌), తుషార్‌ దేశ్‌పాండే (47), ముషీర్‌ ఖాన్‌ (49), యశస్వి జైస్వాల్‌ (36), అఖిల్‌ హెర్వాద్కర్‌ (33), సిద్దేశ్‌ లాడ్‌ (25), సూర్యాంశ్‌ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్‌ పాటిల్‌, కావేరప్ప తలో 2, శిఖర్‌ షెట్టి 3, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు.

T20 WC: Scotland records highest associate team Total Beats Italy8
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో స్కాట్లాండ్‌ బోణీ కొట్టింది. గ్రూప్‌-సిలో భాగంగా కోల్‌కతాలో సోమవారం ఇటలీతో తలపడింది స్కాట్లాండ్‌. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఇటలీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.అదిరిపోయే ఆరంభంఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌కు ఓపెనర్లలో జార్జ్‌ మున్సే (54 బంతుల్లో 84) అదిరిపోయే ఆరంభం అందించగా.. మైకేల్‌ జోన్స్‌ (37) కూడా రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రెండన్‌ మెక్‌ముల్లన్‌ (18 బంతుల్లో 41 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టగా.. ఆఖర్లో మైకేల్‌ లీస్క్‌ (5 బంతుల్లో 22 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్‌ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో స్కాట్లాండ్‌ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 207 పరుగులు సాధించింది. తద్వారా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో 200కు పైగా స్కోరు చేసిన తొలి అసోసియేట్‌ జట్టుగా స్కాట్లాండ్‌ చరిత్ర సృష్టించింది.McMullen charges out and pumps it clean over long-on for a glorious hit. 🙌Marching towards 200! 💪ICC Men’s #T20WorldCup | #SCOvITA | LIVE NOW 👉 https://t.co/iRy5VavUwZ pic.twitter.com/Ax7EvdDitH— Star Sports (@StarSportsIndia) February 9, 2026ఇక లక్ష్య ఛేదనలో ఇటలీ ఆది నుంచే తడబడింది. టాపార్డర్‌లో జస్టిన్‌ మోస్కా (0), ఆంటోనీ మోస్కా (13) విఫలం కాగా.. జేజే స్మట్స్‌ 22 పరుగులు చేశాడు. హ్యారీ మానెంటి (25 బంతుల్లో 37), బెన్‌ మానెంటి (31 బంతుల్లో 52) రాణించినా.. మిగతా వారి నుంచి సహకారం లభించలేదు.73 పరుగుల తేడాతో ఓటమిఆరో స్థానం నుంచి బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాళ్లు స్కాట్లాండ్‌ బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. 2, 0, 3*, 2, 0, 0, 0 స్కోర్లతో వెనుదిరిగారు. దీంతో 16.4 ఓవర్లలో కేవలం 134 పరుగులు చేసి ఇటలీ ఆలౌట్‌ అయింది.ఫలితంగా స్కాట్లాండ్‌ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. స్కాటిష్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ మైకేల్‌ లీస్క్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్‌ వాట్‌ రెండు, బ్రాడ్‌ క్యూరీ, బ్రాడ్‌ వీల్‌, ఒలివర్‌ డేవిడ్‌సన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అనూహ్య రీతిలో స్కాట్లాండ్‌ రేసులోకి వచ్చింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఓడిన ఈ జట్టు.. తాజాగా ఇటలీని ఓడించి గెలుపు బోణీ కొట్టింది. ఇదిలా ఉంటే.. ఇటలీ ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి.చదవండి: IND vs PAK: పాక్‌ బోర్డుతో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ

BCCI Clears Stance After ICC Meeting Lahore Renews Ind Vs Pak Match Hopes9
IND Vs PAK: పాక్‌తో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ

భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణ నిర్ణయంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) యూటర్న్‌ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) బృందంతో పీసీబీ చర్చలు జరుపుతోంది. లాహోర్‌లో ఈ సమావేశానికి ఐసీసీ, పీసీబీతో పాటు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) తరఫున అమినుల్‌ ఇస్లాం హాజరయ్యాడు.డిమాండ్లు ఇవేనా?ఈ నేపథ్యంలో తాము టీమిండియాతో మ్యాచ్‌ ఆడాలంటే.. ఈ మ్యాచ్‌లో లభించే ఆదాయంలో తమకు అత్యధిక వాటా ఇవ్వాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అదే విధంగా.. బంగ్లాదేశ్‌కు నష్ట పరిహారం చెల్లించాలని, మ్యాచ్‌ ఫీజులు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.అయితే, ఇందుకు ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా సానుకూలంగా లేనట్లు సమాచారం. గత్యంతరం లేకే తాము భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరించామన్న పాక్‌ నిర్ణయంపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. బంగ్లాదేశ్‌కు అన్ని సభ్య దేశాల మాదిరి ఆదాయం మాత్రమే వస్తుందని తెలిపినట్లు సమాచారం.మాస్టర్‌ ప్లాన్‌!ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్‌ తాము ఆర్థికంగా లబ్ది పొందేలా మాస్టర్‌ ప్లాన్‌ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీతో పీసీబీ చర్చలు సఫలమైనా.. పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ నిర్ణయం మేరకే తాము ఆడేది లేనిది చెబుతామని పీసీబీ అంటోందని.. ఇంతకంటే విషయాన్ని పెద్దది చేస్తే పాక్‌ నష్టపోకతప్పదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయిస్పందించిన బీసీసీఐఈ క్రమంలో భారత క్రికెట్‌ మండలి (BCCI) ఈ అంశంపై మరోసారి స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా చెప్పినట్లు ఐసీసీ నిర్ణయం మేరకే మేము నడుచుకుంటాము. ఇందులో బీసీసీఐ చెప్పాల్సిందేమీ లేదు’’ పునరుద్ఘాటించారు.కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్‌ సైతం తమకు భారత్‌లో భద్రత ఉండదని.. లంకకు తమ మ్యాచ్‌ల వేదికను మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్‌ పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది.ఉగ్రదాడి జరిగినాఅప్పటి నుంచి బంగ్లాకు వంతపాడుతూ పాకిస్తాన్‌ డ్రామాలకు తెరలేపింది. తొలుత టోర్నీ నుంచి వైదొలుగుతామన్న పాక్‌.. తమకు తటస్థ వేదిక ఉన్నా ఇలా చేస్తే ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందన్న భయంతో వెనక్కి తగ్గింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తామని పాక్‌ ప్రకటించింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు టీమిండియాతో మ్యాచ్‌కు మాత్రమే ఉంటాయని చెబుతూ నైజం బయటపెట్టుకుంది. ఇందుకు శ్రీలంక గట్టిగా బదులిచ్చింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో మ్యాచ్‌లు ఆడామని గుర్తు చేసింది.భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మ్యాచ్‌ బహిష్కరిస్తే తాము ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందని లంక లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 15నాటి టీమిండియాతో మ్యాచ్‌ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చిన పాక్‌.. అదనపు ఆదాయం కావాలంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: ఛాయ్‌ తీసుకో.. వద్దండి!.. అంబానీకి నో చెప్పిన రోహిత్‌ శర్మ!#WATCH | Delhi | On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI Vice-President Rajeev Shukla says, "We will follow whatever decision is taken by ICC... BCCI has no statement on this..." pic.twitter.com/gug8zToSic— ANI (@ANI) February 9, 2026

'Chanafali Bech Rahe The Kya': Ex-Pak Star Tear Into Team Over NED Show10
జస్ట్‌ మిస్‌.. పల్లీలు అమ్ముకుంటారా?: పాక్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్‌

పాకిస్తాన్‌ సీనియర్‌ ఆటగాళ్ల తీరుపై మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ మండిపడ్డాడు. జట్టుకు ఉపయోగపడని అనుభవం ఉండి ఏం లాభమని ప్రశ్నించాడు. పసికూన చేతిలో తృటిలో పరాభవం తప్పిందని.. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా భారత్‌- శ్రీలంక వేదికగా శనివారం టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ మొదలైన విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో కొలంబో వేదికగా పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ తలపడ్డాయి. అయితే, మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ గెలుపు బోణీ కొట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మూడు బంతులు ఉండగా నెదర్లాండ్స్‌ విధించిన సాధారణ 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్‌ ఏడు వికెట్లు కోల్పోవడంతోపాటు ఆఖరి ఓవర్‌లో మూడు బంతులు ఉండగా నెగ్గి ఊపిరి పీల్చుకుంది.తొలుత నెదర్లాండ్స్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. బాస్‌ డీ లీడ్‌ (30; 4 ఫోర్లు), మిచెల్‌ లెవిట్‌ (24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), అకెర్‌మన్‌ (20; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. పాకిస్తాన్‌ బౌలర్లలో సల్మాన్‌ మీర్జా 3 వికెట్లు పడగొట్టగా... సయీమ్‌ అయూబ్, అబ్రార్‌ అహ్మద్, నవాజ్‌ తలా రెండు వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (31 బంతుల్లో 47;4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. 18 ఓవర్లు ముగిసేసరికి పాక్‌ జట్టు 119/7తో ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (12), బాబర్‌ ఆజమ్‌ (15), ఉస్మాన్‌ ఖాన్‌ (0), షాదాబ్‌ ఖాన్‌ (8), నవాజ్‌ (6) విఫలమయ్యారు.ఫహీమ్‌ ఆష్రఫ్‌ రాణించడంతోవిజయానికి చివరి 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫహీమ్‌ ఆష్రఫ్‌ (11 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ షాట్‌లతో విజృంభించాడు. ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌లో అతడు 6, 2, 6, 6, 4తో 24 పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది. నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఆర్యన్‌ దత్, పాల్‌ వ్యాన్‌ మీకెరెన్‌ చెరో 2 వికెట్లు తీశారు. నిజానికి ఆఖరి ఓవర్లో ఆష్రఫ్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఒడౌడ్‌ వదిలేయడంతో అతడికి లైఫ్‌ రాగా.. పాక్‌ గట్టెక్కింది. ఈ నేపథ్యంలో బసిత్‌ అలీ (Basit Ali) పాక్‌ ప్రదర్శనపై.. ముఖ్యంగా సీనియర్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజం (Babar Azam), నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.పాకిస్తాన్‌ బతికిపోయింది"పాకిస్తాన్‌ బతికిపోయింది. చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది. షాహిన్‌ ఆఫ్రిది బ్యాటింగ్‌ చేయడానికి వచ్చినప్పుడే అంతా అయిపోయిందనుకున్నాం. మిడిలార్డర్‌ చెత్తగా ఆడింది. ముఖ్యంగా బాబర్‌ ఆజం, నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ అసలేం చేశారో వారికైనా తెలుసా?వీళ్లంతా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌లు ఆడుతున్నారు. కానీ ఈరోజు పాకిస్తాన్‌ తరఫున ఒక్కరూ హీరోగా నిలవలేకపోయారు. అందరూ జీరోలుగా మిగిలిపోయారు. బాబర్‌ ఆజం బ్యాటింగ్‌కు రాగానే అంతా సంతోషించారు. అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడని భావించారు.పల్లీలు అమ్ముకోవడానికి వెళ్లారా?కానీ ఇలా వచ్చి అలా వెళ్లడం అతడికి అలవాటైపోయింది. ఫహీమ్‌ ఆష్రఫ్‌ లేకుంటే ఈరోజు పాక్‌ పరువు పోయి ఉండేది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్టార్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా పల్లీలు అమ్ముకోవడానికి అక్కడికి వెళ్లారా?’’ అంటూ బసిత్‌ అలీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement