Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

BCCI Reacts To Anti-Corruption Protocol Breach In RR vs RCB Match1
వైభవ్‌ సూర్యవంశీకి భారీ షాక్‌..! ఒకవేళ అదే జరిగితే?

ఐపీఎల్‌-2026లో శుక్ర‌వారం(ఏప్రిల్ 10) ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజ‌స్తాన్ గెలుపొందిన‌ప్ప‌టికి.. ఆ జట్టు మేనేజర్ రోమీ భిందర్ చేసిన ఒక చిన్న పొరాటు ఇప్పుడు వివాదానికి దారితీసింది.మ్యాచ్ జరుగుతుండగా రోమీ భిందర్ డగౌట్‌లో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి మొబైల్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ఇందుకు సబంధించిన వీడియోను తొలుత ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్‌లో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషేధం. ఈ ఘటనపై ఐపీఎల్ ఫౌండర్‌, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు. అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులు అప్పుడు ఏం చేస్తున్నారని అతడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు.రోమీ భిందర్ 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా' నిబంధనలను ఉల్లంఘించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో సెల్ ఫోన్ వాడకం నిషేధం. ఇది పొరపాటున జరిగి ఉండవచ్చు. కానీ అతడు నిబంధనలు ఉల్లంఘించనందున చర్యలు తప్పవు. మ్యాచ్ రిఫరీ, అవినీతి నిరోధక విభాగం నివేదిక ఆధారంగా జరిమానా ఉంటుందా లేదా మ్యాచ్ నిషేధం ఉంటుందా అనేది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐ పేర్కొన్నారు. కాగా మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తన "లోకల్ గార్డియన్" అని రోమీ భిందర్‌ను పేర్కొనడంతో, ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ యాంటి కరప్షన్‌ యూనిట్‌ నివేదిక ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ అతడిపై చర్యలు తీసుకోనుంది. నివేదిక ఆధారంగా భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాకుండా నిషేధం విధించే ఛాన్స్‌ ఉంది.మరోవైపు రుమీ బింద‌ర్ ప‌క్క‌న ఉండి ఫోన్ చూసిన 15 వైభ‌వ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ స్వల్ప జరిమానాను విధించే అవకాశం ఉందని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది.చదవండి: Sanju Samson: చరిత్ర సృష్టించిన శాంసన్‌.. ధోని కూడా సాధ్యం కాలేదు

IPL 2026, Match 19: LSG VS GT Updates2
గుజరాత్‌ టార్గెట్‌ 165

గుజరాత్‌ టార్గెట్‌ 165టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో ని​ర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్‌ కృష్ణ 4 వికెట్లు తీసి లక్నోను దెబ్బ తీశాడు. ఏడో వికెట్‌ కోల్పోయిన లక్నో18.1వ ఓవర​్‌- 131 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి ముకుల్‌ చౌదరి (18) ఔటయ్యాడు.ఐదో వికెట్‌ కోల్పోయిన లక్నో14.3వ ఓవర్‌-109 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పూరన్‌ (19) ఔటయ్యాడు.నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నోలక్నో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 96 పరుగులుగా ఉంది. పూరన్‌ (6), సమద్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో4.1వ ఓవర్‌- 45 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో తెవాతియాకు క్యాచ్‌ ఇచ్చి పంత్‌ (18) ఔటయ్యాడు. మార్ష్‌ (11) ఔట్‌1.3వ ఓవర్‌- 14 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 12) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ ఇంపాక్ట్ సబ్స్‌: షారుక్ ఖాన్, మానవ్ సుతార్, జాసన్ హోల్డర్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్స్‌: మణిమారన్ సిద్ధార్థ్, జార్జ్ లిండే, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్

IPL 2026: Sanju Samson joins the elite list of Indian Six hitters3
రోహిత్‌, విరాట్‌ సరసన సంజూ

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే సింగం​ సంజూ శాంసన్‌ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంజూ జూలు విదిల్చి సూపర్‌ సెంచరీ చేశాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సంజూతో పాటు బౌలింగ్‌లో జేమీ ఓవర్టన్‌ (4-0-18-4), అన్షుల్‌ కంబోజ్‌ (4-0-35-3) సత్తా చాటడంతో ఢిల్లీపై సీఎస్‌కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సీజన్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగిన సంజూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకోవడంతో పాటు పలు రికార్డులు సాధించాడు. ఇందులో ఓ భారీ సిక్సర్ల రికార్డు సైతం ఉంది. అదేంటంటే.. ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన అనంతరం టీ20ల్లో సంజూ సిక్సర్ల సంఖ్య క్వాడ్రపుల్‌ సెంచరీకి (400) చేరింది.పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఇది అత్యంత అరుదైన మైలురాయి. ఇప్పటివరకు ఈ మైలురాయిని కేవలం 29 మంది మాత్రమే (సంజూతో కలుపుకొని) తాకారు. భారత్‌ తరఫున సంజూకు ముందు కేవలం ముగ్గురు మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు. వీరిలో రోహిత్‌ శర్మ (554), విరాట్‌ కోహ్లి (440), సూర్యకుమార్‌ యాదవ్‌ (421) వంటి సిక్స్‌ హిట్టింగ్‌ మిషన్లు ఉన్నారు. ఇప్పుడు సంజూ బాబా వీరి సరసన చేరాడు. ఓవరాల్‌గా పొట్టి క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ (1056) చలామణి అవుతున్నాడు. అతనికి చాలా దూరంలో కీరన్‌ పోలార్డ్‌ (982), ఆండ్రీ రసెల్‌ (784) తదితర విండీస్‌ యోధులు ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ 9, విరాట్‌ కోహ్లి 21, సూర్యకుమార్‌ యాదవ్‌ 23, సంజూ శాంసన్‌ 29 స్థానాల్లో ఉన్నారు.

IPL 2026: Sanju Samson is the player with the most first centuries of each IPL season4
ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించిన సంజూ

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్‌కే 23 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (115 నాటౌట్‌) సూపర్‌ సెంచరీ సాధించి సీఎస్‌కేకు తొలి విజయాన్ని అందించాడు. సంజూ రాజస్థాన్‌ నుంచి సీఎస్‌కేకు మారిన తర్వాత ఇది తొలి సెంచరీ. ఈ సెంచరీతో అతను చాలా రికార్డులు సాధించాడు.ఇందులో ముఖ్యమైనది..సంజూ తన ఐపీఎల్‌ కెరీర్‌‌లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు (ప్రస్తుత సెంచరీతో కలుపుకొని) చేయగా.. అందులో ప్రతి సెంచరీ సీజన్‌లో మొట్టమొదటిదిగా నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. తాను చేసిన నాలుగు సెంచరీలు సీజన్‌లో మొదటివి కావడం సంజూకు మాత్రమే సాధ్యమైంది. 2017, 2019, 2021, 2026 సీజన్లలో మొదటి సెంచరీలను సంజూనే చేశాడు. తద్వారా సీజన్‌లో తొలి సెంచరీలను ఎక్కువ సార్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి సంజూ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఉన్నాడు. మెక్‌కల్లమ్‌ 2008, 2015 సీజన్లలో తొలి సెంచరీలు చేసి, సీజన్‌లో తొలి సెంచరీలు అత్యధిక సార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత చాలామంది ఆటగాళ్లు సీజన్‌లో తొలి సెంచరీలు చేశారు.ప్రతి ఐపీఎల్‌ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాళ్లు.. 2008- బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌2009- ఏబీ డివిలియర్స్‌2010- యూసఫ్‌ పఠాన్‌2011- పాల్‌ వాల్తాటి2012- అజింక్య రహానే2013- షేన్‌ వాట్సన్‌2014- లెండిల్‌ సిమన్స్‌2015- బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌2016- క్వింటన్‌ డికాక్‌2017- సంజూ శాంసన్‌2018- క్రిస్‌ గేల్‌2019- సంజూ శాంసన్‌2020- కేఎల్‌ రాహుల్‌2021- సంజూ శాంసన్‌2022- జోస్‌ బట్లర్‌2023- హ్యారీ బ్రూక్‌2024- విరాట్‌ కోహ్లి2025- ఇషాన్‌ కిషన్‌2026- సంజూ శాంసన్‌పై రికార్డు కాకుండా ఈ సెంచరీతో సంజూ మరో భారీ రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్ల తరఫున సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సంజూ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (2), సీఎస్‌కే ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. సంజూకు ముందు కేఎల్‌ రాహుల్‌ ఈ ఘనతను సాధించాడు. రాహుల్‌ పంజాబ్‌, లక్నో, ఢిల్లీ ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు.

Jyothi Surekha-led Indian women compound team wins gold medal5
ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం

ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది. సీనియర్‌ స్టార్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ వెన్నం జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 233–232 (59–58, 55–59, 59–57, 60–58) పాయింట్ల తేడాతో అలెక్సిస్‌ రుయిజ్, పియర్స్, ఒలివియా డీన్‌లతో కూడిన అమెరికా జట్టును ఓడించింది. ఓవరాల్‌గా సురేఖ కెరీర్‌లో ఇది 12వ ప్రపంచకప్‌ పసిడి పతకం కావడం విశేషం. తొలి రౌండ్‌ నుంచే భారత్‌, అమెరికా ఢీ అంటే ఢీ అన్నట్ల పోటీపడ్డాయి. తొలి రౌండ్‌లో భారత్‌ 59-58తో అమెరికాపై స్వల్ప ఆధిక్యం ప్రదర్శించగా, రెండో రౌండ్‌లో ఆధిక్యం 114-117 తగ్గింది. అయితే మూడో రౌండ్‌ ముగిసే సరికి 173-174తో స్వల్ప వెనుకంజలో ఉన్న భారత్‌ చివర్లో ఆరు పది పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పసిడి ఖాతాలో చేరింది.చదవండి: అథ్లెటిక్స్‌లో సంచలనం.. బోల్ట్ రికార్డు బ‌ద్ద‌లు!

18-year-old Gout Gout shatters Usain Bolt record 200m sprint6
అథ్లెటిక్స్‌లో సంచలనం.. బోల్ట్ రికార్డు బ‌ద్ద‌లు!

ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే రేసింగ్ ట్రాక్ మీద చిరుతలా పరుగులు పెట్టిన స్ప్రింటర్ గుర్తుకువస్తాడు. పరుగుపందెంలో మిగిలిన వారికీ, ఉసేన్ బోల్ట్‌కి మధ్య ఉన్న దూరం చూసి, ప్రపంచం విస్తుపోయింది. 100, 200, 400 మీట‌ర్ల ఈవెంట్స్‌లో బోల్ట్ ప్ర‌పంచ రికార్డులు నెల‌కొల్పాడు. తాజాగా 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో బోల్ట్ నెలకొల్పిన రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు గౌట్‌ బద్దలుకొట్టడం విశేషం. ఆస్ట్రేలియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం ఈ అద్భుతం చోటుచేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసులో గౌట్ 19.67 సెకన్లలో గమ్యాన్ని చేరి సరికొత్త సృష్టించాడు. ఇంతకముందు ఉసేన్ బోల్ట్ 200 మీటర్ల రేసును 19.93 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో గౌట్ ఇదే 200 మీటర్ల రేసును 20.02 సెకన్లలో పూర్తి చేశాడు. తాజాగా తన రికార్డును మరింత సవరించడమే గాకుండా ఏకంగా జమైకా చిరుత బోల్ట్ రికార్డుకు ఎసరు పెట్టి నయా చిరుతగా ఆవిర్భవించాడు. ఇక ఫైనల్లో తన ప్రత్యర్థుల నుంచి గౌట్‌కు పోటీ ఎదురైంది. ఐడాన్ మర్ఫీ 19.88 సెకన్లతో రెండో స్థానంలో, కాలబ్ లా 20.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఫైనల్‌కు ముందే లాచ్లెన్ కెన్నెడీ వైదొలగడం కూడా గౌట్‌కు కలిసొచ్చింది.ఎవరీ గౌట్‌?గౌట్ పేరెంట్స్ అత‌డు పుట్ట‌కముందే ద‌క్షిణ సుడాన్ నుంచి ఆస్ట్రేలియాకు వ‌ల‌స వ‌చ్చారు. క్వీన్స్‌లాండ్‌లో నివాసం ఏర్ప‌ర‌చుకున్న మోనికా, బోనా దంప‌తుల‌కు ఏడుగురు సంతానం. అయితే గౌట్ పూర్వీకుల‌ది ఈజిప్ట్ కావ‌డంతో అత‌డికి ఆ పేరు పెట్టారు. సౌత్ఈస్ట్ క్వీన్స్‌లాండ్‌లోని ఇప్స్‌విచ్ గ్రామర్ స్కూల్‌లో చ‌దువుకున్న గౌట్ చిన్న‌ప్ప‌టి నుంచి సాక‌ర్ ఆడ‌డం నేర్చుకున్నాడు. అలా అథ్లెటిక్స్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఆ త‌ర్వాత పూర్తి అథ్లెటిక్స్‌లోకి మారిన గౌట్ అండ‌ర్ 16 విభాగంలో 100, 200 మీట‌ర్ల ప‌లు రికార్డులు నెల‌కొల్పాడు. 14 ఏళ్ల వ‌య‌సులో గౌట్ 100 మీట‌ర్ల రేసును 10.57 సెక‌న్ల‌లో పూర్తి చేసిస స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల వ‌య‌సులో గౌట్ అండ‌ర్‌-18 విభాగంలో 200 మీట‌ర్ల రేసును 20.87 సెకన్ల‌లో పూర్తి చేసి దేశ‌వాలీలో రికార్డు నెల‌కొల్పాడు. అంత‌ర్జాతీయ అథ్లెటిక్స్ టోర్నీల్లోనూ స‌త్త చాటిన గౌట్ ఓషినియా అండ‌ర్ 18 అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్స్‌లో 200 మీట‌ర్లు, 4x400 మీట‌ర్ల రిలేలో స్వ‌ర్ణ ప‌త‌కాలు కైవ‌సం చేసుకున్నాడు. ఇక ఉసేన్ బోల్ట్, 2009లో 100 మీటర్ల పరుగు పందెన్ని 9.58 సెకన్లలో పూర్తి చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే 150 మీటర్లను 14.35 సెకన్లు, 200 మీటర్లను 19.19 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 2, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 3, 2016 రియో ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు సాధించిన ఉసేన్ బోల్ట్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 11 స్వర్ణాలు సాధించాడు. 18-year-old GOUT GOUT 🇦🇺 19.67s (1.7) over 200m at Australian Championships in Sydney!!🤯🤯A new U20 World Record ☑️National Record ☑️ First Australian man under 20 seconds ☑️A star is born!pic.twitter.com/1GTfFJ4gst— Track & Field Gazette (@TrackGazette) April 12, 2026 చదవండి: దేశ ప్రజలను అవమానించిన పాక్‌ క్రికెటర్‌!

Nitish Rana, Ruturaj Gaikwad Punished By BCCI After CSK's 1st Win In IPL 20267
IPL 2026: నితీశ్‌ రాణా, రుతురాజ్‌పై చర్యలు

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్‌కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. సంజూ శాంసన్‌ (115 నాటౌట్‌) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆయుశ్‌ మాత్రే (59 రిటైర్డ్‌ ఔట్‌) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో శివమ్‌ దూబే (20 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ.. జేమీ ఓవర్టన్‌ (4-0-18-4), అన్షుల్‌ కంబోజ్‌ (4-0-35-3) ధాటికి 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (60) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు సీఎస్‌కేకు ఈ సీజన్‌లో మొదటిది కాగా.. ఢిల్లీ నాలుగు మ్యాచ్‌ల్లో రెండో పరాజయాన్ని ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, ఢిల్లీ ఆటగాడు నితీశ్‌ రాణాకు జరిమానా విధించింది.సీఎస్‌కే కెప్టెన్‌గా రుతురాజ్‌ స్లో ఓవర్‌రేట్‌ మెయిన్‌టైన్‌ చేసినందుకు గానూ మ్యాచ్‌ ఫీజ్‌లో రూ. 12 లక్షలు కోల్పోగా.. నితీశ్‌కు మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం కోత, అదనంగా ఓ డీమెరిట్‌ పాయింట్‌ శిక్షగా విధించబడింది. సీఎస్‌కేకు ఈ సీజన్‌లో ఇది మొదటి తప్పిదం కావడంతో జరిమానాతో సరిపెట్టారు.నితీశ్‌ విషయానికొస్తే.. అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గానూ ఈ శిక్షను ఎదుర్కొన్నాడు. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో (19వ ఓవర్‌లో) ట్రిస్టన్‌ స్టబ్స్‌ గ్లవ్స్‌ మార్చుకోవాలని అంపైర్లను కోరగా, వారు నిరాకరించారు. దీంతో నితీశ్‌ మధ్యలో కల్పించుకొని స్టబ్స్‌కు వత్తాసుగా ఫోర్త్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అసభ్య పదజాలం కూడా వాడాడు. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఆర్టికల్‌ 2.3 నిబంధన ప్రకారం ఇది లెవెల్‌ 1 నేరం కిందికి వస్తుంది. ఇందుకు మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ కేటాయించారు.

Hasan Ali Shows Vulgar Signs To Pakistan People During PSL Match8
దేశ ప్రజలను అవమానించిన పాక్‌ క్రికెటర్‌!

పాకిస్తాన్‌ క్రికెట‌ర్ హ‌స‌న్ అలీ వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ సూప‌ర్‌లీగ్ (పీఎస్ఎల్‌)లో క‌రాచీ కింగ్స్ త‌రఫున ఆడుతున్న హ‌స‌న్ అలీ అసభ్య‌క‌ర‌మైన సంజ్ఞ‌తో సైగ‌లు చేయ‌డం వివాదానికి దారి తీసింది. విష‌యంలోకి వెళితే.. శనివారం క‌రాచీ కింగ్స్‌, హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది.కింగ్స్‌మెన్ ఇన్నింగ్స్ సమయంలో అబ్బాస్ అఫ్రిది వేసిన 8వ ఓవర్‌లో ఉస్మాన్‌ఖాన్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే నిల్చున్న హసన్ అలీ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. అయితే క్యాచ్ తీసుకున్న వెంటనే పెవిలియ్ స్టాండ్ వైపు తిరిగి ‘నోరు మూయండి’ అన్నట్లు సైగ చేసి ఆ తర్వాత గాల్లోకి పంచ్ విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం పీఎస్‌ఎల్ ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. కరాచీ కింగ్స్ తమ సొంత గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్ధంగా ఉండడం ప్రేక్షకులు లేకుండానే మాకు హాయిగా ఉంది అన్నట్లుగా అర్థం వచ్చేలా సైగలు ఉండడం వివాదంగా మారింది. ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో పీఎస్‌ఎల్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అంతకముందు ఇన్నింగ్స్ 7.3 ఓవర్లో ఉస్మాన్ ఖాన్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ జారవిడిచాడు. మళ్లీ హసన్ అలీనే ఉస్మాన్ ఖాన్ క్యాచ్ తీసుకున్నాడు. చేసిన తప్పు​కు ప్రాయచిత్తం చేసుకునేందుకే హసన్ అలీ ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన కరాచీ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ కింగ్స్‌మెన్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకొని విజయం సాధించింది.- @RealHa55an signalling this to whom? 🤔 pic.twitter.com/FGOJ1TaWIP— HAMAS 🇵🇰 (@HamasulGhani) April 11, 2026చదవండి: ట్విస్ట్ అదుర్స్‌.. అరుదైన జాబితాలో ఆయుశ్ మాత్రే!

Indian Wrestlers Won Medals In Asia Senior Wrestling Championship9
అద‌రగొట్టిన భార‌త రెజ్ల‌ర్లు..

బిష్‌కెక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత రెజ్లర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో సుజీత్‌ కల్కాల్‌ (65 కేజీలు), అభిమన్యు (70 కేజీలు) పసిడి పతకాలతో మెరిపించగా... సందీప్‌ సింగ్‌ మాన్‌ (79 కేజీలు) రజతం... అంకుశ్‌ (57 కేజీలు) కాంస్యం దక్కించుకున్నారు. ఈ ఏడాది అజేయంగా ఉన్న సుజీత్‌ ఫైనల్లో 8–1 పాయింట్ల తేడాతో ఉమిద్‌జాన్‌ జలోలోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను అలవోకగా ఓడించాడు. ఈ విజయంతో సుజీత్‌ 2019లో బజరంగ్‌ పూనియా తర్వాత 65 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించిన భారత రెండో రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. మరోవైపు అభిమన్యు 5–3తో తుల్గా తుముర్‌ ఒచిర్‌ (మంగోలియా)పై గెలుపొందాడు. 79 కేజీల ఫైనల్లో సందీప్‌ సింగ్‌ 1–2తో కీవన్‌ ఘరెదాగి (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. 57 కేజీల కాంస్య పతక బౌట్‌లో అంకుశ్‌ 8–2తో ఫుగా ససాకి (జపాన్‌)పై విజయం సాధించాడు. 97 కేజీల కాంస్య పతక బౌట్‌లో విక్కీ 5–7తో షెర్జాద్‌ పొయోనోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో అమన్, ముకుల్‌ టోర్నీ చివరిరోజు ఆదివారం భారత్‌కు మరో రెండు స్వర్ణ పతకాలు లభించే అవకాశం ఉంది. 61 కేజీల విభాగంలో అమన్‌ సెహ్రావత్, 86 కేజీల విభాగంలో ముకుల్‌ దహియా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో అమన్‌ 11–9తో అహ్మద్‌ (ఇరాన్‌)పై, ముకుల్‌ 12–6తో బొలాత్‌ సకాయెవ్‌ (కజకిస్తాన్‌)పై గెలిచారు. 125 కేజీల విభాగం సెమీఫైనల్లో దినేశ్‌ 0–2తో షరిపోవ్‌ (బహ్రెయిన్‌) చేతిలో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం పోటీపడతాడు.

Ayush Mhatre Joins Elite List After Retired Out Vs Delhi Capitals10
ట్విస్ట్ అదుర్స్‌.. అరుదైన జాబితాలో ఆయుశ్ మాత్రే!

ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో భాగంగా శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఆట‌గాడు ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయుశ్ రిటైర్డ్ ఔట్ వెనుక సీఎస్‌కే మేనేజ్‌మెంట్ హ‌స్తం ఉంది. మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేస్తున్న ఆయుశ్ మాత్రేను అర్థంత‌రంగా రిటైర్డ్ ఔట్‌గా వెళ్లిపోవడం వెనుక విమ‌ర్శ‌లు వచ్చాయి. కానీ సీఎస్‌కే నిర్ణ‌యం స‌రైన‌దే అని కాసేప‌టికే తెలిసొచ్చింది. ఆయుశ్ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన హార్డ్ హిట్ట‌ర్ శివ‌మ్ దూబే త‌న పాత్ర‌కు న్యాయం చేస్తూ వేగంగా ప‌రుగులు రాబ‌ట్టాడు. ఫ‌లితంగా సీఎస్‌కే భారీ స్కోరు సాధించింది. ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్ వెనుక కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ పాత్ర కీల‌కం. అందుకే మాత్రే పెవిలియ‌న్ చేరుకున్న స‌మ‌యంలో అత‌డికి స్టాండింగ్ ఒవేష‌న్ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ఆయుశ్ మాత్రే ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔట్‌లు చాలా త‌క్కువ‌గా జ‌రుగుతుంటాయి. గ‌తంలో రవిచంద్రన్ అశ్విన్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, డెవాన్ కాన్వే వంటి క్రికెట‌ర్లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. తాజాగా ఈ జాబితాలో ఆయుశ్ మాత్రే కూడా చేరిపోయాడు. కాగా ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఆయుశ్‌ మాత్రేదే తొలి రిటైర్డ్‌ ఔట్‌.సాధార‌ణంగా క్రికెట్‌లో రిటైర్డ్ హ‌ర్ట్‌, రిటైర్డ్ ఔట్ వేర్వేరు. రిటైర్డ్ హర్ట్' అంటే గాయం కారణంగా ఆటగాడు మైదానం విడిచిపెట్టడం. అదే రిటైర్డ్ ఔట్ అనేది జ‌ట్టు ప్రయోజనాల కోసం స్వచ్చందంగా మైదానం విడిచిపెట్టడం. రిటైర్డ్ హ‌ర్ట్ అయితే స‌ద‌రు మ్యాచ్‌లో మళ్లీ మైదానంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అలా కాదు. ఒక్క‌సారి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగితే మళ్లీ క్రీజులోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉండ‌దు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. View this post on Instagram A post shared by IPL (@iplt20) చదవండి: అంపైర్‌తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్‌!

Advertisement
Advertisement
 
Advertisement