Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Fact check: Are Sam and Tom Curran joining Zimbabwe?1
ఇంగ్లండ్‌కు గుడ్‌బై..! జింబాబ్వేకు ఆడ‌నున్న సామ్ కర్రాన్‌?

సామ్ కర్రాన్‌, టామ్ క‌ర్రాన్‌ లు ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ప్ప‌టికి.. జింబాబ్వే క్రికెట్‌తో వారికి వీడ‌దీయ‌రాని బందం ఉంది. వారి తండ్రి కెవిన్ కర్రన్ జింబాబ్వే తరఫున 11 వన్డేలు ఆడ‌గా.. త‌మ్ముడు బెన్ క‌ర్ర‌న్ ప్ర‌స్తుతం జింబాబ్వే జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా ఉన్నాడు.అంతేకాకుండా వారి తాత కెవిన్ పాట్రిక్ కర్రన్ కూడా గతంలో రోడేసియా (ప్రస్తుత జింబాబ్వే) తరఫున ఆడారు. అయితే ఇప్పుడు సామ్ కర్రాన్‌, టామ్ క‌ర్రాన్‌లు కూడా ఇంగ్లండ్ జ‌ట్టును వ‌దిలి జింబాబ్వే తరఫున ఆడబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.జింబాబ్వే క్రికెట్ వర్గాల్లో చురుగ్గా ఉండే సీనియర్ జర్నలిస్ట్ ఆడమ్ థియో తాజాగా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. "మాజీ ఇంగ్లండ్ క్రికెట‌ర్లు సామ్, టామ్ క‌ర్రాన్‌లు ఇప్పుడు జింబాబ్వే క్రికెట్ త‌ర‌పున ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే ప్ర‌స్తుతం టామ్ క‌ర్రాన్‌కు జింబాబ్వే జ‌ట్టు తరపున ఆడేందుకు లైన్ క్లియ‌ర్ అయిన‌ప్ప‌టికి..సామ్ మాత్రం ఐసీసీ నుంచి అనుమ‌తి కోసం ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 త‌ర్వాత ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి" అని ఎక్స్‌లో థియో రాసుకొచ్చాడు. అందుకు సామ్‌, టామ్ జింబాబ్వే జెర్సీలు ధరించిన ఒక ఫోటోను కూడా జోడించాడు. ఇది చూసిన నెటిజ‌న్లు ఒక్క‌సారిగా షాక‌య్యారు. అయితే ఈ రోజు ఏప్రిల్ 1 కావడంతో, తన ఫాలోవర్లను ఆటపట్టించడానికి థియో ఈ పోస్ట్ చేశారు. అంతే త‌ప్ప ఇందులో ఏ మాత్రం నిజం లేదు. కాగా సామ్ క‌ర్రాన్‌, టామ్ క‌ర్రాన్‌లు కేప్‌టౌన్‌లో జన్మించారు. ఆ తర్వాత వీరిద్దరూ యూకే పౌర‌స‌త్వం పొందారు. ఐసీసీ నిబంధనల ప్రకారం వారిద్ద‌రూ.. జింబాబ్వేకు ఆడాలంటే కనీసం నాలుగు ఏళ్లు అక్కడ నివసించాలి. అంతేకాకుండా జింబాబ్వే త‌ర‌పున డొమాస్టిక్ క్రికెట్ ఆడాలి. టామ్ క‌ర్రాన్ ప్ర‌స్తుతం జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉండ‌గా.. సామ్ క‌ర్రాన్ మాత్రం కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడుచదవండి: ICC Rankings: దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌.. ఏకంగా 64 స్ధానాలు

My vote is for Prithvi Shaw: Aakash Chopra DC Probable playing 12 vs LSG2
ఢిల్లీ తుదిజట్టు ఇదే.. ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్‌!

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అక్షర్‌ పటేల్‌ సారథ్యంలో వరుస విజయాలతో ఆరంభంలో దుమ్ములేపిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో ఏడు గెలిచి ప్లే ఆఫ్స్‌ చేరుకుండానే నిష్క్రమించింది.ఈ క్రమంలో ఐపీఎల్‌-2026లో ఎలాగైనా సత్తా చాటాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది. తాజా ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో అక్షర్‌ సేన.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG vs DC)ను ఎదుర్కోనుంది. ఇక ఈసారి ఢిల్లీ ఓపెనింగ్‌ జోడీ మారనుంది.కేఎల్‌ రాహుల్‌ జోడీ ఎవరు?టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ ఢిల్లీ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. అయితే, అతడికి జోడీ ఎవరన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘లక్నోతో మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ ఆరంభించేదెవరు?అభిషేక్‌ పోరెల్‌, పాతుమ్‌ నిస్సాంక లేదంటే పృథ్వీ షా?.. నేనైతే పృథ్వీ షాకే ఓటు వేస్తాను. నితీశ్‌ రాణా వన్‌డౌన్‌లో.. ఆ తర్వాతి స్థానాల్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌ (Axar Patel), డేవిడ్‌ మిల్లర్‌, అశుతోశ్‌ శర్మ రావాలి.ఎనిమిదో స్థానంలో సీమర్‌ రిజ్వీ లేదంటే విప్రాజ్‌ నిగమ్‌ను ఆడించవచ్చు. కుల్దీప్‌ యాదవ్‌, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర ఆ తర్వాతి స్థానాల్లో వస్తారు. ఒకవేళ మరో భారత బౌలర్‌ను ఆడించాలనుకుంటే టి.నటరాజన్‌ లేదంటే ఆకిబ్‌ నబీని తీసుకోవాలి. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఊహించని విధంగా..కాగా గతంలో ఢిల్లీకి ఆడిన పృథ్వీ షా చాన్నాళ్లుగా లీగ్‌కు దూరమయ్యాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటి మినీ వేలంలో పేరు నమోదు చేసుకోగా ముందుగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అయితే, ఆఖరి నిమిషంలో రూ. 75 లక్షల కనీస ధరకు ఢిల్లీ తమ పాత ఆటగాడిని సొంతం చేసుకుంది. తుదిజట్టులో అతడికి చోటు దక్కడం కష్టమేనన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా ఊహించని విధంగా ఓపెనర్‌గా స్థానం ఇవ్వడం గమనార్హం.లక్నోతో మ్యాచ్‌కు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న ఢిల్లీ తుదిజట్టుకేఎల్‌ రాహుల్‌, పృథ్వీ షా, నితీశ్‌ రాణా, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌, డేవిడ్‌ మిల్లర్‌, అశుతోశ్‌ శర్మ, సమీర్‌ రిజ్వి/విప్రాజ్‌ నిగమ్‌, కుల్దీప్‌ యాదవ్‌, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర, టి.నటరాజన్‌/ఆకిబ్‌ నబీ.చదవండి: ‘అందుకే IPL వద్దనుకుని PSLలో ఆడుతున్నా’

Bhanuka Rajapaksa In Illegal Scandal With An Actress3
సినీ నటితో వివాదంలో శ్రీలంక విధ్వంసకర బ్యాటర్‌

శ్రీలంక విధ్వంసకర బ్యాటర్‌ భానుక రాజపక్స ఓ సినీ నటితో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసు ఓ బంగారు గొలుసు చుట్టూ తిరుగుతోంది. హర్షి రసంగా అనే స్థానిక యువ నటికి రాజపక్స ఓ బంగారు గొలుసు (రూ. 9 లక్షలు) ఇచ్చాడు. దీన్ని బహుమతిగా భావించిన ఆమె.. అవసరాల రిత్యా తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంది. అయితే గొలుసును హర్షి తన వద్ద అరువు తీసుకొని, అనుమతి లేకుండా తాకట్టు పెట్టుకుందని రాజపక్స పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసుల విచారణ జరిపి హర్షిని అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రూ. 5 లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు పెట్టి బెయిల్‌ మంజూరు చేసింది. విచారణలో హర్షి న్యాయవాదులు గొలుసును తాకట్టు పెట్టిన విషయాన్ని అంగీకరించి, తిరిగి విడిపిస్తామని హామీ ఇచ్చారు. మాట మార్చిన హర్షిబెయిల్‌ లభించిన తర్వాత హర్షి మాట మార్చింది. మీడియా ముందుకు వచ్చి షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. గొలుసు తనకు రాజపక్స వ్యక్తిగత సంబంధంలో గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలిపింది. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజపక్స వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాజపక్స ఇటీవల టీమిండియాపై నిరాధరమైన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌లో భారత ఆటగాళ్లు ఉపయోగించే బ్యాట్లు అసాధారణంగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యల తర్వాత అతను టీమిండియా అభిమానుల నుంచి చీవాట్లు తిన్నాడు.

 Abhishek–Kishan Hold Top Spots, Esterhuizen Makes Big Leap ICC T20I Rankings 4
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌

ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ త‌మ టాప్‌-2 స్దానాల‌ను నిల‌బెట్టుకున్నారు. అభిషేక్ 875 పాయింట్ల‌తో అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతుండ‌గా.. కిష‌న్(848) రెండో స్ధానంలో నిలిచాడు. మూడో స్ధానంలో పాకిస్తాన్ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్(848) ఉన్నాడు.ఇక ఇటీవ‌ల న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కానర్ ఎస్టర్‌హ్యూజెన్.. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా స‌త్తాచాటాడు. ఎస్టర్‌హ్యూజెన్ ఏకంగా 64 స్ధానాలు ఎగ‌బాకి 39వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రోటీస్ సిరీస్‌లో ఎస్టర్‌హ్యూజెన్ 300 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.ఇక టాప్‌-10లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ జోస్ బట్లర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 8వ ర్యాంకుకు చేరుకోగా, కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ 9వ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ రాబిన్సన్ రెండు స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. మ‌రోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్టార్ ర‌షీద్ ఖాన్ త‌న అగ్ర‌స్ధానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించిన ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు త‌మ ర్యాంక్‌ల‌ను మెరుగుప‌రుచుకున్నారు. జెరాల్డ్ కోయెట్జీ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకును కైవసం చేసుకోగా.. ఒట్నీల్ బార్ట్‌మాన్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 56వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయ‌స్..! ఓపెన‌ర్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ?

Coetzee, Burger, Miller, Van der Dussen lose CSA contracts5
IPL 2026: రాయల్స్‌ హీరోకు షాకిచ్చిన క్రికెట్‌ సౌతాఫ్రికా

రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ బౌలర్‌ నండ్రే బర్గర్‌కు అతని సొంత దేశ క్రికెట్‌ బోర్డు (CSA) షాకిచ్చింది. తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల (2026–27 ) జాబితా నుంచి అతని పేరును తప్పించింది. బర్గర్‌తో పాటు మరికొంత మంది స్టార్‌ ఆటగాళ్లు కూడా ఈ జాబితా నుంచి తప్పించబడ్డారు. గెరాల్డ్‌ కొయెట్జీ, లిజాడ్‌‌ విలియమ్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాసీ వాన్‌ డర్‌ డస్సెన్‌ లాంటి స్టార్లు కాంట్రాక్టులు కోల్పోయారు.కాంట్రాక్ట్‌ల విషయంలో క్రికెట్‌ సౌతాఫ్రికా ముందు నుంచి ఓ విషయం చెప్పుకుంటూ వచ్చింది. ఆటగాళ్లు ఎన్ని ప్రైవేట్‌ లీగ్‌ల్లో పాల్గొన్నా, జాతీయ జట్టు తరఫున వీలైనన్ని మ్యాచ్‌లు ఆడాలని కండీషన్‌ పెట్టింది. అయినా, చాలామంది ఆటగాళ్లు ప్రైవేట్‌ లీగ్‌లకే అధిక ప్రాధాన్యమిచ్చి జాతీయ విధులను నిర్లక్ష్యం చేశాడు. దీని ఫలితమే తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాలో స్టార్‌ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం​.తాజాగా కాంట్రాక్ట్‌ కోల్పోయిన ఆటగాళ్లు ప్రైవేట్‌ లీగ్‌ల్లో ఆడటం వల్ల గాయాలపాలై జాతీయ జట్టు తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయారు. అందుకే వీరిని కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తప్పించినట్లు క్రికెట్‌ సౌతాఫ్రికా వివరణ ఇచ్చింది. సౌతాఫ్రికా జట్టు గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 53 మ్యాచ్‌లు (7 టెస్టులు, 12 వన్డేలు, 34 టీ20లు) ఆడగా.. కొయెట్జీ 8 (టీ20లు), బర్గర్‌ 15 (9 వన్డేలు, 6 టీ20లు), విలియమ్స్‌ 6 (ఒక వన్డే, 5 టీ20లు) మ్యాచ్‌లు మాత్రమే ఆడారు.మిలర్‌ (36), డస్సెన్‌ (37) వయసు పైబడుతున్న కారణంగా కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. అయితే ఆశ్చర్యకరంగా మరో వెటరన్‌ సైమన్‌ హార్మర్‌కు (37) కాంట్రాక్ట్‌ దక్కింది. ఈసారి కొత్తగా కాంట్రాక్ట్‌లు పొందిన ఆటగాళ్ల జాబితాలో ఓట్నీల్‌ బార్ట్‌మన్‌, కార్బిన్‌ బాష్‌, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్‌ బ్రెవిస్‌ తదితరులు ఉన్నారు.వార్షిక కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్ల జాబితా..టెంబా బవుమా, డేవిడ్ బెడింగ్‌హామ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రీవిస్, టోనీ డి జోర్జి, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, ర్యాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కైల్‌ వెర్రిన్‌, సైమన్ హార్మర్రాయల్స్‌ హీరోగా మారిన బర్గర్‌ ఐపీఎల్‌ 2026లో భాగంగా తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌తో నండ్రే బర్గర్‌ చెలరేగిపోయాడు. కీలకమైన సంజూ శాంసన్‌ వికెట్‌ సహా పొదుపుగా బౌలింగ్‌ చేసి, ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో బర్గర్‌ రాయల్స్‌ హీరోగా ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. అతను సంజూ వికెట్‌ తీసిన తీరు రాయల్స్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

No One Wants To Sit On Bench: Arjun Tendulkar After Mumbai Indians Exit6
‘బెంచ్‌ మీద ఉండలేను.. దానికి నేను వ్యతిరేకం’

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో తొలుత సొంత జట్టు ముంబైకి ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినప్పటికీ 26 ఏళ్ల అర్జున్‌ టెండుల్కర్‌ ఇంతవరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.తండ్రి సచిన్‌ పదహారేళ్లకే భారత జట్టులో అరంగేట్రం చేసి.. లెక్కకు మిక్కిలి రికార్డులు సాధిస్తే.. అర్జున్‌ టీమిండియా ఇప్పటికీ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ అతడికి అవకాశాలు కరువయ్యాయి.ఐదు మ్యాచ్‌లు ఆడి..సచిన్‌ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ జట్టుతో చాలాకాలం కొనసాగిన అర్జున్‌ టెండుల్కర్‌ (Arjun Tendulkar).. ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీయగలిగాడు. చివరగా 2024లో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. ఆ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.లక్నో సూపర్‌ జెయింట్స్‌లోకిఈ క్రమంలో 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ టెండుల్కర్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026లో భాగంగా లక్నో బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. అర్జున్‌కు తుదిజట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో శుభంకర్‌ మిశ్రా పాడ్‌కాస్ట్‌కు హాజరైన అర్జున్‌ టెండుల్కర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ముంబై ఇండియన్స్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడారు కదా! మీరు బాగా బౌలింగ్‌ చేశారు. స్వింగ్‌ కూడా బాగుంది. కాబట్టి మరికొన్ని అవకాశాలకు మీరు అర్హులు అని భావించారా?’’ అని హోస్ట్‌ అర్జున్‌ టెండుల్కర్‌ను అడిగాడు.బెంచ్‌ మీద కూర్చోవాలని ఎవరు కోరుకుంటారు?ఇందుకు బదులిస్తూ.. ‘‘ఎవరైనా సరే అలాగే ఫీలవుతారు. బెంచ్‌ మీద కూర్చోవాలని ఎవరికి మాత్రం ఆశగా ఉంటుంది. అయితే, అవకాశం వచ్చినపుడు కఠినంగా శ్రమించి అద్భుతంగా ఆడటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది’’ అని అర్జున్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు. అదే విధంగా ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌పై అభిప్రాయం పంచుకుంటూ.. పదకొండు మంది ఆటగాళ్లతోనే తుదిజట్టు ఉంటే బాగుంటుందని అర్జున్‌ పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే ఇంపాక్ట్‌ సబ్‌ నిబంధనకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు.చదవండి: సిరాజ్‌ జట్టులో ఎందుకున్నట్లు?.. టీమిండియా దిగ్గజం

Arshdeep Singh Bowls Joint-Longest Over In IPL After Numerous Wides7
అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. మంగ‌ళ‌వారం చండీగఢ్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పంజాబ్‌ విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రిచాడు. టీ20ల్లో టీమిండియా లీడింగ్ వికెట్ టేక‌ర్ ఉన్న అర్ష్‌దీప్‌.. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు.త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 42 ప‌రుగులు స‌మ‌ర్పించుకుని వికెట్ లెస్‌గా వెనుదిరిగాడు. అత‌డి ఎకానమీ రేటు 10.50గా ఉంది. వైశాఖ్ విజ‌య్‌కుమార్ వంటి యువ బౌల‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టి త‌న స‌త్తాచాటితే, అర్ష్‌దీప్ వంటి స్టార్ పేస‌ర్ తేలిపోవ‌డం పంజాబ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రిచింది.కాగా గుజ‌రాత్ ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను అర్ష్‌దీప్ సింగ్‌కు కెప్టెన్ అప్ప‌గించాడు. అయితే ఆ ఓవ‌ర్‌ను పూర్తి చేసేందుకు అర్ష్‌దీప్ ఏకంగా 11 బంతులు వేయాల్సి వ‌చ్చింది. ఇందులో 5 వైడ్‌లు, 1 నో-బాల్ ఉన్నాయి. ఈ పంజాబీ స్పీడ్ స్టార్ త‌న చెత్త బౌలింగ్‌తో అంద‌రిని విసిగించాడు. ఈ క్ర‌మంలో అర్ష్‌దీప్ ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్ర‌లో లాంగెస్ట్ ఓవ‌ర్ వేసిన బౌల‌ర్‌గా మ‌హ్మ‌ద్ సిరాజ్‌, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యాల స‌ర‌స‌న అర్ష్‌దీప్ చేరాడు. వీరంతా అర్ష్‌దీప్ కంటే ముందు 11 బంతుల ఓవ‌ర్లు వేశారు. కాగా ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ నిర్దేశించిన 163 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ 19.1 ఓవ‌ర్లలో 7 వికెట్ల కోల్పోయి చేధించింది. కూప‌ర్ కొన్నోలీ అజేయంగా నిలిచి జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చాడు.చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయ‌స్..! ఓపెన‌ర్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ?

Shreyas Iyer likely to captain India in Zimbabwe tour8
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయ‌స్..! ఓపెన‌ర్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ?

భార‌త పురుష‌ల క్రికెట్ జ‌ట్టు ఈ ఏడాది జూలైలో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ బోర్డు బుధ‌వారం విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది.అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్‌, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి. అయితే అంత‌కంటే ముందు భార‌త జ‌ట్టు.. ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, అఫ్గానిస్తాన్‌ల‌తో వైట్‌బాల్ సిరీస్‌ల‌లో త‌ల‌ప‌డ‌నుంది. అంతేకాకుండా జింబాబ్వే ప‌ర్య‌ట‌న ముగిసిన వెంట‌నే టీమిండియా శ్రీలంక‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది.అయితే ఈ వరుస సిరీస్‌ల నేపథ్యంలో ఐర్లాండ్‌, జింబాబ్వే టూర్‌ల‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవ‌కాశ‌ముంది. ఈ సిరీస్‌లో వైభ‌వ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే వంటి యువ ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్కేందుకు అస్కారం ముంది. ఐపీఎల్‌-2026లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచే యంగ్ క్రికెట‌ర్ల‌ను కూడా సెలెక్ట‌ర్లు ప‌రిగణ‌లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదేమైన‌ప్ప‌టికి 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి మాత్రం భార‌త సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌పున పిలుపు రావ‌డం దాదాపు ఖాయ‌మ‌న్పిస్తోంది.కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌?మ‌రోవైపు గ‌త కొంత‌కాలంగా కేవ‌లం వ‌న్డేల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన శ్రేయ‌స్ అయ్య‌ర్ తిరిగి టీ20 జ‌ట్టులోకి వ‌చ్చే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఇంగ్లండ్ టూర్ ముగిసిన త‌ర్వాత టీమిండియా టీ20 రెగ్యుల‌ర్ కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. సూర్య ప్ర‌స్తుతం స్వ‌ల్ప గ‌జ్జ గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో అత‌డికి ముఖ్య‌మైన సిరీస్‌లోనే అత‌డిని ఆడించాల‌ని బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ భావిస్తుందంట‌. ఈ క్ర‌మంలో ఐర్లాండ్ లేదా జింబాబ్వే టూర్‌లో భార‌త జ‌ట్టు ప‌గ్గాల‌ను శ్రేయ‌స్ చేప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని క్రికెట్ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. శ్రేయ‌స్ చివ‌ర‌గా రెండేళ్ల కింద‌ట టీమిండియా త‌ర‌పున టీ20ల్లో ఆడాడు. లక్నో స్పీడ్ స్టార్ యయాంక్ యాదవ్‌ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తుందంట.చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ లెజెండ్‌

GT vs PBKS This is beyond my understanding: Indian legend on Siraj9
సిరాజ్‌ జట్టులో ఎందుకున్నట్లు?.. టీమిండియా దిగ్గజం

ఐపీఎల్‌-2026 టోర్నీ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్‌ కింగ్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో గిల్‌ సేన మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యంపై టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ముఖ్యంగా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ నాయకత్వ బృందాన్ని భజ్జీ తప్పుబట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన గుజరాత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.రెండు ఓవర్లు వేసి అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత కీలక పేసర్లలో ఒకడైన గుజరాత్‌ బౌలర్‌ సిరాజ్‌ రెండు ఓవర్లు వేసి పదిహేను పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కొత్త బంతితో రంగంలోకి దిగిన అతడు.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు రాలేదు.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హర్భజన్‌ సింగ్‌ టైటాన్స్‌ యాజమాన్య వైఖరిని విమర్శించాడు. ‘‘ఈ మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ ఎక్కువగా బౌలింగ్‌ చేయనేలేదు. ఇలా ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు.సిరాజ్‌ జట్టులో ఎందుకున్నట్లు?అతడితో కేవలం రెండు ఓవర్లే వేయించారు. నిజానికి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయించాల్సింది. గాయం కారణంగానా? లేదంటే మరే ఇతర కారణాల వల్ల అతడిని పక్కనపెట్టారో తెలియదు. ఏదేమైనా అతడు మరో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్‌ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, అశోక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అయితే, పంజాబ్‌ బ్యాటర్‌ కూపర్‌ కన్నోలి మెరుపు ఇన్నింగ్స్‌ (44 బంతుల్లో 72 నాటౌట్‌)తో జట్టును విజయతీరాలకు చేర్చడంతో గుజరాత్‌కు పరాభవం తప్పలేదు. చదవండి: ‘అందుకే IPL వద్దనుకుని PSLలో ఆడుతున్నా’

England batter Bopara calls time on county career10
రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ లెజెండ్‌

ఇంగ్లండ్ వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ ర‌వి బొపారా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. బొపారా తన 23 ఏళ్ల సుదీర్ఘ కౌంటీ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికాడు. 2026 ఇంగ్లండ్‌ డొమెస్టిక్ సీజన్‌కు ముందే త‌న నిర్ణ‌యాన్ని బొపారా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. 40 ఏళ్ల బొపారా గత కొంతకాలంగా కేవలం ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్, వన్డే కప్‌లలో మాత్రమే ఆడుతున్నాడు. బొపారా 2002లో ఎసెక్స్ త‌ర‌పున త‌న కౌంటీ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు 18 ఏళ్ల పాటు ఎసెక్స్ క్ల‌బ్‌కు అత‌డు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఆ త‌ర్వాత 2020లో ససెక్స్‌తో అత‌డు ఒప్పం కుదుర్చుకున్నాడు. కానీ మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ నార్తాంప్టన్‌షైర్ జ‌ట్టులో బొపారా చేరాడు. గ‌త రెండు సీజ‌న్‌ల‌లో అత‌డు నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. గత సీజన్‌లో నార్తాంప్టన్‌షైర్ జట్టు ఫైనల్‌కు చేరడంలో బొపారా కీల‌క పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్లో సర్రే జట్టుపై కేవలం 46 బంతుల్లోనే 105 పరుగుల చేసి త‌న జ‌ట్టుకు అద్భుత‌మైన‌ విజయాన్ని అందించాడు. ఈ ఏడాది కూడా కౌంటీ క్రికెట్ ఆడేందుకు అత‌డికి ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికి అత‌డు తిరస్క‌రించాడు. కానీ ఇప్పుడు పూర్తిగా రిటైర్మెంట్‌ ప్రకటించి అంద‌రికి షాకిచ్చాడు. ప్ర‌స్తుతం కరాచీ కింగ్స్ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొపారా.. త్వరలో కౌంటీ సీజ‌న్‌లో కామెంటేటర్‌గా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ జాతీయ సెలెక్టర్‌ కావాలని బొపారా ఆశిస్తున్నాడు. కాగా బొపారా ఇంగ్లండ్‌ తరపున చివరగా 2015లో ఆడాడు.అప్పటి నుంచి కేవలం డొమాస్టిక్‌ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్స్‌లో ఆడుతూ వచ్చాడు. అతడు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (2009, 2010), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2015) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్‌ తరపున అతడు 13 టెస్టులు, 120 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.రవి బొపారా టెస్టు క్రికెట్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు బాదిన ఆటగాడిగా అరుదైన రికార్డును కలిగి ఉన్నాడు. 2009లో వెస్టిండీస్‌పై అతడు ఈ ఫీట్ సాధించాడు. ఫస్ట్ క్రికెట్‌లో కూడా అతడి పేరిట దాదాపు 13,000 వేల పరుగులు ఉన్నాయి.చదవండి: NZ vs SA: చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Advertisement
Advertisement
 
Advertisement