Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Suryakumar Yadav, Ishan Kishan make short work of Kiwis in record chase1
ఇషాన్‌, సూర్య విధ్వంసం.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్‌

రాయ్‌పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. లక్ష్య చేధనలో 7 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్‌, అభిషేక్ శర్మ వికెట్లను భారత్ కోల్పోయింది.అయితే ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. కేవ‌లం కిషన్‌ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేశాడు. కిషన్‌ ఔటయ్యాక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత ఆచితూచి ఆడిన సూర్య.. క్రీజులో సెటిల్ అయ్యాక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20ల్లో ఏడాది త‌ర్వాత త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను సూర్య అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 37 బంతులు ఎదుర్కొన్న స్కై.. 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్‌ దూబే (18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లతో 36 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ, డఫీ తలా వికెట్ సాధించారు. టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇదే అత్యధిక విజయవంతమైన రన్‌ చేజ్‌ కావడం విశేషం.Let me tell to today's Generation, Ishan Kishan was our Abhishek Sharma before Abhishek Sharma existed. pic.twitter.com/wtwZ7D4bVu— Selfless⁴⁵ (@SelflessCricket) January 23, 2026కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర (44), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (47 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెం‍డు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.

New zealand set 209 runs target for team india in second T20I2
IND VS NZ 2nd T20I: న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌

రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.న్యూజిలాండ్‌ ఈ స్కోర్‌ చేసేందుకు ప్రతి ఒక్కరి దోహదపడ్డారు. రచిన్‌ రవీంద్ర (44), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (47 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. కాన్వే (19), సీఫర్ట్‌ (24), ఫిలిప్స్‌ (19), డారిల్‌ మిచెల్‌ (18), మార్క్‌ చాప్‌మన్‌ (10), జకరీ ఫౌల్క్స్‌ (15 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నంతసేపు బ్యాట్‌ ఝులిపించారు. ఆఖర్లో సాంట్నర్‌, ఫౌల్క్స్‌ క్యామియో న్యూజిలాండ్‌ను 200 పరుగుల మార్కును దాటించింది.భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 2, హార్దిక్‌ పాండ్యా, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ దూబే తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్‌ సింగ్‌ (4-0-53-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్‌ రాణాను ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో తెచ్చారు.మరోవైపు న్యూజిలాండ్‌ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్‌ స్థానంలో టిమ్‌ సీఫర్ట్‌.. క్రిస్టియన్‌ క్లార్క్‌ స్థానంలో జకరీ ఫౌల్క్స్‌, జేమీసన్‌ స్థానంలో మ్యాట్‌ హెన్రీ తుది జట్టులో​కి వచ్చారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Virat Kohli Test return on the cards, Senior BCCI officials contemplating historic move3
టెస్ట్‌ క్రికెట్‌లోకి విరాట్‌ కోహ్లి రీఎంట్రీ..?

టీమిండియాకు సంబంధించిన ఓ సంచలన వార్త ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది. టీ20 వరల్డ్‌కప్‌-2026 తర్వాత ఈ విషయం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీసీసీఐ అధికారులు కోహ్లిని మళ్లీ టెస్ట్‌ల్లో ఆడమని సంప్రదించారు. ఈ విషయంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. టెస్ట్‌ రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకునే విషయంలో కోహ్లి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే భారత క్రికెట్‌లో పెను సంచలనంగా మారుతుంది.కోహ్లి గతేడాది మే 12న అనూహ్యంగా 14 ఏళ్ల టెస్ట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. సరిగ్గా ఐదు రోజుల ముందే నాటి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఐదు రోజుల వ్యవధిలో టెస్ట్‌ల నుంచి తప్పుకోవడాన్ని భారత క్రికెట్‌ అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. రో-కో టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకోవడం​ వెనుక భారత క్రికెట్‌లో ఓ కీలక వ్యక్తి హస్తం ఉందని టాక్‌ నడిచింది.సదరు వ్యక్తితో విభేదాల కారణంగా రో-కో టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకున్నట్లు అ‍ప్పట్లో ప్రచారం జరిగింది. రో-కో అప్పటికే టీ20ల నుంచి వైదొలిగారు. టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన తర్వాత వారిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం రో-కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. గత కొంతకాలంగా భారత్‌ టెస్ట్‌ల్లో ఆశాజనకమైన ప్రదర్శన చేయకపోవడంతో కోహ్లి తిరిగి రావాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ చొరవ తీసుకొని కోహ్లితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగి కోహ్లి టెస్ట్‌ల్లో రీఎంట్రీ ఇస్తే.. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం అతను అతి త్వరలోనే 10000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం కోహ్లి 123 టెస్ట్‌ల్లో 30 శతకాలు, 31 అర్ధశతకాల సాయంతో 9230 పరుగులు చేశాడు. అతను మరో 770 పరుగులు చేస్తే అరుదైన 10000 క్లబ్‌లో చేరతాడు. కోహ్లి టెస్ట్‌ రీఎంట్రీపై సానుకూల వార్తలు ఎన్ని వినిపిస్తున్నా, ఇది అంత ఈజీ విషయమైతే కాదు. ఎందుకంటే 37 ఏళ్ల వయసులో కోహ్లి టెస్ట్‌ల్లోకి తిరిగి రావడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. శారీకంగా అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ.. మెంటల్‌ ఫిట్‌నెస్‌ సాధించడం అంత సులువు కాదు. కోహ్లి లాంటి వ్యక్తికి ఇది అసాధ్యం కాకపోయినా, రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకోవడం లాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇటీవలికాలంలో కోహ్లి బహిరంగా చేసిన వ్యాఖ్యలను అనలైజ్‌ చేస్తే, అతని ఫోకస్‌ అంతా కేవలం 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉన్నట్లు సుస్పష్టమవుతుంది. ఈ ప్రణాళిక ఉన్న కోహ్లి టెస్ట్‌ల్లో రీఎంట్రీ ఇచ్చి తన లాంగ్‌ టర్మ్‌ ప్లానింగ్‌ను డిస్టర్బ్‌ చేసుకోకపోవచ్చు. ఏదిఏమైనా టీ20 ప్రపంచకప్‌ పూర్తయ్యేలోపు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

team india won the toss and choose to bowl in second T20I vs new zealand4
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్‌ రాణాను ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో తెచ్చారు. మరోవైపు న్యూజిలాండ్‌ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్‌ స్థానంలో టిమ్‌ సీఫర్ట్‌.. క్రిస్టియన్‌ క్లార్క్‌ స్థానంలో జకరీ ఫౌల్క్స్‌, జేమీసన్‌ స్థానంలో మ్యాట్‌ హెన్రీ తుది జట్టులో​కి వచ్చారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Pakistan accused of match fixing in Under 19 World Cup 20265
పాకిస్తాన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుపై మరోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అండర్‌-19 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఫిక్స్‌ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ 8 వికెట్ల తేడాతో, 181 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనతో జింబాబ్వే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించగా.. స్కాట్లాండ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 35.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 26.2 ఓవర్లలో ఛేదించింది. వాస్తవానికి పాక్‌ ఈ లక్ష్యాన్ని 20 ఓవర్లలోపే ఛేదించి ఉండవచ్చు. ఇలా జరిగితే జింబాబ్వే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించి, స్కాట్లాండ్‌ తదుపరి దశకు అర్హత సాధించేది.అయితే, ఇలా జరగడం పాక​్‌కు వ్యూహాత్మకంగా కరెక్ట్‌ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడి జింబాబ్వేకి లబ్ది చేకూర్చి, వారు కూడా లబ్ది పొందారు. 16వ ఓవర్లోనే 96 పరుగులు చేసిన పాక్‌.. 16 నుంచి 25 ఓవర్ల మధ్యలో ఏకంగా 50 డాట్ బాల్స్ ఆడి, విజయాన్ని ఆలస్యం చేసింది.పాక్‌కు కలిగే లబ్ది ఏ​ంటి.. టోర్నీ నియమాల ప్రకారం సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించిన జట్టు, అదే గ్రూప్‌ నుంచి సూపర్‌ సిక్స్‌కు క్వాలిఫై అయిన మిగతా జట్లపై సాధించిన పాయింట్లు, నెట్‌ రన్‌రేట్‌ను మాత్రమే సూపర్ సిక్స్‌కి తీసుకెళ్లుంది.ఈ లెక్కన జింబాబ్వేతో పోలిస్తే స్కాట్లాండ్‌ సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధిస్తే పాక్‌కు రన్‌రేట్‌ కాస్త తక్కువవుతుంది. అందుకనే చాకచక్యంగా స్కాట్లాండ్‌ను సైడ్‌ చేసి, జింబాబ్వేకు, తమకు లబ్ది చేక్చూకుంది.పాక్‌ చేసిన ఈ పని అవినీతి కిందికి రాకపోయిన ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రక్రియ కిందికి వస్తుంది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని మార్చి, నెట్‌ రన్‌రేట్‌ను ప్రభావితం చేస్తే కెప్టెన్‌పై చర్యలు తీసుకోవచ్చు. పై ఉదంతంలో పాక్‌ చేసింది అవినీతి కిందికి రాకపోయినా, ఆట ఆత్మను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. అందువల్ల పాకిస్తాన్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, గ్రూప్‌-సి నుంచి పాక్‌, జింబాబ్వేతో పాటు ఇంగ్లండ్‌ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. తదుపరి దశలో పాక్‌ భారత్‌తో తలపడనుంది. భారత్ జనవరి 24న జింబాబ్వేపై గెలిస్తే, ఫిబ్రవరి 1న బులావయోలో పాకిస్తాన్–భారత్ పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ సెమీఫైనల్స్ అర్హతను నిర్ణయించే కీలక పోరాటంగా భావిస్తున్నారు.

Pakistan T20 squad vs Australia announced6
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాక్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్ల రీఎంట్రీ

టీ20 వరల్డ్‌కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్‌ జట్టును ఇవాళ (జనవరి 23) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్‌ అఘా కొనసాగనున్నాడు. ఈ సిరీస్‌తో స్టార్‌ ప్లేయర్లు బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది రీఎంట్రీ ఇచ్చారు.వీరిద్దరు ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉండి, బిగ్‌బాష్‌ లీగ్‌లో పాల్గొన్నారు. మరో స్టార్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్‌ విభాగంలో అబ్రార్‌ అహ్మద్‌, మొహమ్మద్‌ నవాజ్‌, ఉస్మాన్‌ తారిక్‌కు చోటు దక్కింది.లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో జరుగబోయే ఈ సిరీస్‌ కోసం పాక్‌ జట్టు శనివారం (జనవరి 24) లాహోర్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌లు జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగనున్నాయి. పాక్‌ గడ్డపై ఆస్ట్రేలియా ఆడబోతున్న రెండో టీ20 సిరీస్‌ ఇది. చివరిగా ఆసీస్‌ 2022లో పాక్‌లో పర్యటించి, ఏకైక టీ20 ఆడింది.ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా పరిగణించబడుతోంది. ఈ సిరీస్‌ ముగిసిన వారం రోజుల్లోపే ప్రపంచకప్‌ మొదలవుతుంది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో పాక్‌ గ్రూప్‌-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, భారత్‌ మిగతా జట్లుగా ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్‌లో శ్రీలంక, ఐర్లాండ్, ఒమాన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాక్‌ జట్టుసల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, మొహమ్మద్ వసీమ్ జూనియర్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్

Management doesnt want Rohit to play ODI WC 2027: Manoj Tiwary7
WC 2027: రోహిత్‌ శర్మ వరల్డ్‌కప్‌ ఆడకుండా కుట్ర!?

టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్‌ శర్మది. హిట్‌మ్యాన్‌ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిళ్లను భారత్‌ కైవసం చేసుకుంది.అయితే, కోరుకున్నట్లుగానే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకొన్న రోహిత్‌ శర్మ.. అనూహ్య రీతిలో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వన్డే కెప్టెన్సీ నుంచి మేనేజ్‌మెంట్‌ అతడిని తొలగించింది.అగార్కర్‌ అలారోహిత్‌ శర్మ స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు వన్డే పగ్గాలూ అప్పగించగా.. వరుసగా రెండు సిరీస్‌లలో టీమిండియా ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2027లో రోహిత్‌ ఆడే విషయంపై స్పష్టత లేనందనే అతడిని కెప్టెన్‌గా తప్పించామని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చెప్పాడు.ఆస్ట్రేలియా గడ్డ మీద హిట్‌ఈ క్రమంలో.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద రోహిత్‌ శర్మ అదరగొట్టాడు. సెంచరీ చేసి మరీ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అనంతరం బీసీసీఐ ఆదేశాల మేరకు ముంబై తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ బరిలో దిగి అక్కడా శతక్కొట్టాడు.అయితే, తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మాత్రం రోహిత్‌ శర్మ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. మూడు వన్డేలలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ చేసిన స్కోర్లు వరుసగా.. 26, 24, 11. ఈ నేపథ్యంలో రోహిత్‌ ఆట తీరుపై విమర్శలు రాగా.. అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే కూడా ఇందుకు మద్దతు ఇచ్చినట్లుగానే వ్యాఖ్యలు చేశాడు.డష్కాటే కామెంట్స్‌‘‘తొలి వన్డేలో రోహిత్‌ స్థాయికి తగినట్లు ఆడలేదు. ఆ తర్వాతి మ్యాచ్‌లూ అతడికి సవాలుగా మారాయి. ఈ సిరీస్‌కు ముందు పెద్దగా క్రికెట్‌ ఆడకపోవడం వల్లే ఇలా జరిగింది’’ అని డష్కాటే పేర్కొన్నాడు. నిజానికి ఆసీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన రోహిత్‌.. దేశీ క్రికెట్‌లోనూ ఆడాడు. అయినప్పటికీ డష్కాటే ఇలా వ్యాఖ్యానించాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి డష్కాటే తీరును ఎండగట్టాడు. కోచ్‌ చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆటగాళ్ల మానసిక స్థితి ప్రభావితం అవుతుందని.. అతడిని ఒత్తిడిలోకి నెట్టివేయాలనే ప్రయత్నం తగదని చురకలు అంటించాడు.కోచ్‌కు ఇచ్చిపడేసిన మనోజ్‌ తివారిటీమిండియా సహాయక సిబ్బందిలో భాగమై ఉండి ఇలా మాట్లాడటం సరికాదని మనోజ్‌ తివారి డష్కాటేను విమర్శించాడు. రోహిత్‌తో నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్‌ చేయిస్తూనే.. మీడియా ముందుకు వచ్చి అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని మండిపడ్డాడు. రోహిత్‌ ఫామ్‌ గురించి అడిగినపుడు నోరు మూసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.మరోవైపు.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఓపెనింగ్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మను వన్డే జట్టులోకి తీసుకుని.. వరల్డ్‌కప్‌-2027లోనూ ఆడిస్తే బాగుంటుందని ఇర్ఫాన్‌ పఠాన్‌ వ్యాఖ్యానించాడు. అతడి కంటే యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ముందు వరుసలో ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ప్రస్తుతం గిల్‌- రోహిత్‌ ఓపెనర్లుగా ఉన్నారు.వరల్డ్‌కప్‌ ఆడకుండా కుట్ర!?ఓవైపు అగార్కర్‌, డష్కాటే కామెంట్స్‌.. మరోవైపు ఇర్ఫాన్‌ పఠాన్‌ అంచనాలు.. వీటన్నింటిని చూసి రోహిత్‌ శర్మ అభిమానులు చిర్రెత్తిపోతున్నారు. హిట్‌మ్యాన్‌ను వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విరాట్‌ కోహ్లి విషయంలోనూ అగార్కర్‌ ఇలాగే మాట్లాడాడని.. అయితే, అతడు వరుస సెంచరీలు చేయడంతో ఇప్పట్లో అతడికి జోలికి వెళ్లరని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా డష్కాటేకు మనోజ్‌ తివారి చివాట్లు పెట్టిన తీరు బాగుందని.. దిగ్గజ ఆటగాడి పట్ల ఒక కోచ్‌ ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నారు.చదవండి: IND vs NZ: అతడు అవుట్‌!.. భారత తుదిజట్టులో మార్పు!

JALAJ SAXENA COMPLETED 500 WICKETS IN FIRST CLASS CRICKET8
500 వికెట్లు.. 7000కు పైగా పరుగులు

భారత క్రికెట్‌లో అత్యంత అన్‌ లక్కీ ఆటగాళ్లలో మధ్యప్రదేశ్‌కు చెందిన జలజ్‌ సక్సేనా ఒకరు. 39 ఏళ్ల ఈ రైట్‌ హ్యాండ్‌ స్పిన్‌ బౌలింగ్‌ (ఆఫ్ స్పిన్) ఆల్ రౌండర్ దేశవాలీ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నా, ఒక్కసారి కూడా టీమిండియా తలుపులు తట్టలేకపోయాడు.20 ఏళ్లకు పైగా స్థిరంగా రాణిస్తున్నా జలజ్‌ను టీమిండియా సెలెక్టర్లు ఏనాడూ గుర్తించలేదు. జలజ్‌ కంటే తక్కువ స్థాయి ప్రదర్శనలు చేసిన చాలామంది ఆటగాళ్లు టీమిండియా ఛాన్స్‌లు కొట్టి, కెరీర్‌లు మలచుకున్నారు. కానీ జలజ్‌ మాత్రం దేశవాలీ క్రికెట్‌లో పరిమితమయ్యాడు.టెస్ట్‌ ఫార్మాట్‌లో జలజ్‌ సూపర్‌గా సెట్‌ అయ్యే ఆటగాడు. అతని కుడి చేతి ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌.. మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ టీమిండియాకు చాలా ఉపయోగపడి ఉండేది. రవీంద్ర జడేజా జట్టులో నాటుకు పోయినందుకో లేక ఇతరత్రా కారణాలో తెలియదు కానీ, జలజ్‌కు ఏనాడూ టీమిండియా అవకాశానికి నోచుకోలేకపోయాడు.2005లో మధ్యప్రదేశ్‌ తరఫున ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్రం చేసిన జలజ్‌.. ఇప్పటివరకు 150 మ్యాచ్‌ల్లో 500 వికెట్లు తీసి, 7000కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 34 హాఫ్‌ సెంచరీలు సహా 35 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 10 పది వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. జలజ్‌కు లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లోనూ మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. ఈ ఫార్మాట్‌లో 109 మ్యాచ్‌ల్లో 2000కు పైగా పరుగులు (3 సెంచరీలు, 7 హాఫ్‌ సెంచరీలు) చేసి, 123 వికెట్లు తీశాడు. జలజ్‌ టీ20 ఫార్మాట్‌లోనూ ఓ మోస్తరు ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో 73 మ్యాచ్‌ల్లో 77 వికెట్లు (2 ఐదు వికెట్ల ప్రదర్శనలు) తీసి, 688 పరుగులు చేశాడు.మూడు ఫార్మాట్లలో ఇంత ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉన్నా జలజ్‌ భారత-ఏ జట్టు స్థాయి వరకే వెళ్లగలిగాడు. అక్కడు కూడా స్థిరమైన ప్రదర్శనలు చేసినా, భారత సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. 2013లో జలజ్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌-ఏ జట్లపై అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనలు చేశాడు.జలజ్‌ అరంగేట్రం నుంచి దాదాపు ప్రతి రంజీ సీజన్‌లో స్థిరమైన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడు. 39 ఏళ్ల వయసులోనే జలజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు.ప్రస్తుత రంజీ సీజన్‌కు ముందే కేరళ నుంచి మహారాష్ట్రకు మారిన జలజ్‌.. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటడు. ఈ క్రమంలోనే జలజ్‌ ఓ చారిత్రక మైలురాయిని తాకాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకొని, అత్యంత అరుదైన జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.జలజ్‌ కెరీర్‌లో అత్యుత్తమ రికార్డులు..రంజీ ట్రోఫీ చరిత్రలో 6000 పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడుఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు, 8 వికెట్లు తీసిన తొలి భారతీయుడుగోవా-మహారాష్ట్ర మ్యాచ్‌ విషయానికొస్తే.. జలజ్‌ చెలరేగడంతో (34-6-79-6) తొలుత బ్యాటింగ్‌ చేసిన గోవా 209 పరుగులకే ఆలౌటైంది. జలజ్‌తో పాటు రామకృష్ణ ఘోష్‌ (15.1-4-34-2), విక్కీ ఓస్వాల్‌ (22-5-47-2) కూడా రాణించారు. గోవా ఇన్నింగ్సలో కెప్టెన్‌ స్నేహల్‌ కౌతాంకర్‌ (73) ఒక్కడే రాణించాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మహారాష్ట్ర 67 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రుతరాజ్‌ గైక్వాడ్‌ (66) అర్ద సెంచరీతో రాణించి మహారాష్ట్రను ఆదుకున్నాడు. ప్రస్తుతం సౌరభ్‌ నవలే (46), జలజ్‌ సక్సేనా (4) క్రీజ్‌లో ఉన్నారు. లలిత్‌ యాదవ్‌ 3 వికెట్లతో మహారాష్ట్రను దెబ్బతీశాడు.

Sarfaraz Khan Sends Reminder To BCCI Selectors With Double Century9
టీమిండియాలో చోటిస్తారా? లేదా?.. సెలక్టర్లకు వార్నింగ్‌!

ముంబై క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో దుమ్ములేపాడు. తద్వారా టెస్టు జట్టు నుంచి తనను తప్పించిన సెలక్టర్లకు మరోసారి బ్యాట్‌ ద్వారానే గట్టి హెచ్చరికలు జారీ చేశాడు.కాగా ఫార్మాట్లకు అతీతంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfaraz Khan) దేశీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవల టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా డిసెంబరు 2న శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 31న మరోసారి సెంచరీ బాదాడు.ఈసారి ద్విశతకంతో తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డిలో భాగంగా గురువారం హైదరాబాద్‌- ముంబై మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన సిరాజ్‌ సేన.. ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.227 పరుగులుఈ క్రమంలో తొలిరోజు శతక్కొట్టిన సర్ఫరాజ్‌.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 219 బంతులు ఎదుర్కొన్న అతడు 227 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, రక్షణ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో సర్ఫరాజ్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.ఇక సర్ఫరాజ్‌కు తోడు కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ (104) శతక్కొట్టాడు. సువేద్‌ పార్కర్‌ 75, అథర్వ అంకోలేకర్‌ 35 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 560 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. హైదరాబాద్‌ బౌలర్లలో రక్షణ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రోహిత్‌ రాయుడు రెండు, నితిన్‌ సాయి యాదవ్‌, కొడిమెల హిమతేజ, కెప్టెన్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.టీమిండియాలో పునరాగమనం చేసేనా?దేశీ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి సత్తా చాటాడు. అయితే, చివరగా 2024లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడిన సర్ఫరాజ్‌ను సెలక్టర్లు మళ్లీ జట్టుకు ఎంపిక చేయలేదు.ఈ క్రమంలో దేశీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో రాణిస్తూ సర్ఫరాజ్‌ సెలక్టర్లకు సవాల్‌ విసురుతున్నాడు. కాగా ఇప్పటి వరకు అతడు టీమిండియా తరఫున టెస్టులు మాత్రమే ఆడాడు. వన్డే, టీ20 జట్లలో అరంగేట్రం చేయలేదు.ఇదిలా ఉంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఐపీఎల్‌-2026తో బిజీ కానున్నారు భారత ఆటగాళ్లు. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్‌ పర్యటనతో మళ్లీ టీమిండియా విధుల్లో చేరతారు. చదవండి: ODI WC 2027: ‘గిల్‌పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ’

ICC Under 19 world cup 2026: Sri Lanka collapsed for 58 runs against Australia10
నిప్పులు చెరిగిన ఆసీస్‌ పేసర్‌.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక

అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్‌, జపాన్‌పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్‌ (ఏ) మ్యాచ్‌లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం​ విజయాన్ని సొంతం చేసింది.విండ్హోక్‌లోని నమీబియా క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. పేసర్‌ విల్‌ బైరోమ్‌ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్‌కు జతగా ఛార్లెస్‌ లచ్‌మండ్‌ (5-1-19-2), కేసీ బార్టన్‌ (4-0-13-2), హేడెన్‌ ష్కిల్లర్‌ (3-0-11-1) కూడా రాణించారు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్‌ దిమంత మహావితన డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ విరాన్‌ చముదిత, దుల్నిత్‌ సిగెరా, ఆడమ్‌ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్‌ విమత్‌ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్‌ రింసర, కుగథాస్‌ మథులాన్‌ తలో 6 పరుగులు చేశారు. కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ల్లో జపాన్‌, ఐర్లాండ్‌పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement