ప్రధాన వార్తలు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్-2026లో మరో హైవోల్టేజ్ పోరుకు తెరలేచింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్కడ వరల్డ్ రికార్డు
ఐపీఎల్ 2026 నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో లాహోర్ ఖలందర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ తన అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. శుక్రవారం ముల్తాన్ సుల్తాన్తో జరిగిన మ్యాచ్లో ముస్తాఫిజుర్.. షాన్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్ వంటి కీలక వికెట్లు పడగొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు. తద్వారా టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం పేసర్గా చరిత్ర సృష్టించాడు. అతడు ఇప్పటివరకు టీ20 క్రికెట్ (లీగ్, అంతర్జాతీయ మ్యాచ్లు)లో 416 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్(415) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో అమీర్ను ముస్తాఫిజుర్ అధిగమించాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్లుముస్తాఫిజుర్ రెహ్మాన్ - 416 బంగ్లాదేశ్ మహమ్మద్ అమీర్ -415 పాకిస్థాన్ వహాబ్ రియాజ్- 413 పాకిస్థాన్సోహైల్ తన్వీర్-389 పాకిస్థాన్డేవిడ్ విల్లీ -ఇంగ్లాండ్అయితే వాస్తవానికి ముస్తాఫిజుర్ ఐపీఎల్-2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తరపున ఆడాల్సి ఉండేది. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.9.20 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ రాజకీయ ఉద్రిక్తల కారణంగా అతడిని ఐపీఎల్ నుంచి బీసీసీఐ తప్పించింది. దీంతో అతడు పీఎస్ఎల్లో ఆడేందుకు లాహోర్ ఖలందర్స్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.కేకేఆర్ ముస్తాఫిజుర్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. అతడి స్ధానంలో జట్టులోకి వచ్చిన జింబాబ్వే బౌలర్ ముజుర్బానీ వికెట్లు పడగొడతున్నప్పటికి, భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. మరోవైపు హర్షిత్ రాణా, పతిరానా కూడా అందుబాటులో లేరు. కీలక బౌలర్లు లేకపోవడంతో కేకేఆర్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2026: ఓటమి బాధలో ఉన్న కేకేఆర్కు గుడ్ న్యూస్
రోహిత్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్పై రోహిత్ శర్మ ఇప్పటివరకు 37 మ్యాచ్ల్లో 1057 పరుగులు సాధించాడు. కాగా రోహిత్ కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ 30 ఇన్నింగ్స్ల్లో 1,130 పరుగులు సాధించాడు. కోహ్లీ కంటే 73 పరుగులు వెనుకబడి ఉన్న రోహిత్ ఢిల్లీతో మ్యాచ్లోనే ఆ ఫీట్ను సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సీజన్ను రోహిత్ శర్మ మంచి ఈజ్తో ప్రారంభించాడు. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లోనే రోహిత్ 38 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కేకేఆర్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఫేవరెట్గా కనిపిస్తోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై 21-16 విజయాలతో ఢిల్లీపై ఆధిక్యతను కలిగి ఉంది. గత ఐదు మ్యాచ్ల్లో ఢిల్లీపై ముంబై నాలుగు విజయాలు సాధించడం విశేషం.చదవండి: ‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’
ఓటమి బాధలో ఉన్న కేకేఆర్కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2026లో కోల్కతా నైట్రైడర్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన కేకేఆర్.. ఆ తర్వాతి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. కేకేఆర్ బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి, బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోతోంది.ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజర్బానీ ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో అతడు మూడు వికెట్లు పడగొట్టినప్పటికి, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.అతడితో పాటు వైభవ్ ఆరోరా, కార్తీక్ త్యాగి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. కేకేఆర్ బౌలింగ్ ఎటాక్లో యువపేసర్ హర్షిత్ రాణా లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. రాణా స్ధానంలో జట్టులోకి వచ్చిన నవ్దీప్సైనీకి ఇప్పటివరకు ఇంకా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అయితే వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన బాధలో ఉన్న కేకేఆర్కు గుడ్ న్యూస్. శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరానా త్వరలోనే కేకేఆర్తో జట్టుతో చేరే అవకాశముంది. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.18 కోట్ల భారీ ధరకు పతిరానాను కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే టీ20 వరల్డ్కప్-2026 సమయంలో గాయపడిన పతిరానా.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో అతడు ఇంకా శ్రీలంకలోనే ఉన్నాడు. ఐపీఎల్లో ఆడేందుకు అతడికి శ్రీలంక క్రికెట్ ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అతడికి మరో వారం రోజుల్లో శ్రీలంక క్రికెట్ ఫిట్నెస్ టెస్టును నిర్వహించే అవకాశముంది. ఇందులో అతడు పాసైతే ఐపీఎల్ ఆడేందుకు లైన్ క్లియర్ అయినట్లే.ప్రాక్టీస్ మొదలు పెట్టిన పతిరానా..కాగా పతిరానా కూడా నెట్స్లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. త్వరలోనే వచ్చేస్తున్నా అనే క్యాప్షన్తో తన ప్రాక్టీస్ వీడియాను పతిరానా షేర్ చేశాడు. అతడు పోస్ట్ చేసిన వీడియో కేకేఆర్ శిబిరంలో ఆశలు ఆశలు చిగురింపజేసింది. అయితే అతడు ఇంకా పూర్తి వేగంతో బౌలింగ్ మాత్రం చేయడం లేదు. ఏప్రిల్ మూడో వారంలో అతడు జట్టుతో చేరే ఛాన్స్ ఉంది. చదవండి: తెలంగాణపై కావ్య మారన్ చిన్న చూపు
టీమిండియాకు శుభవార్త: నితీశ్ రెడ్డిపై గావస్కర్ ప్రశంసలు
సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. అతడి బౌలింగ్ బాగా మెరుగుపడిందని.. టీమిండియాకు ఇదొక శుభవార్త అని పేర్కొన్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో నితీశ్ రెడ్డి (Nitish Kumar Reddy) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.తొలి మ్యాచ్లో విఫలంగాయాల కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ ఆంధ్ర క్రికెటర్.. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)తో మ్యాచ్లో నితీశ్ రెడ్డి బ్యాట్, బంతితో రాణించడంలో విఫలమయ్యాడు. నాలుగో నంబర్లో బ్యాటింగ్కు వచ్చి ఆరు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే నిష్క్రమించిన ఈ పేస్బౌలింగ్ ఆల్రౌండర్.. రెండు ఓవర్లు బౌల్ చేసి 19 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.కేకేఆర్తో మ్యాచ్లో సూపర్ హిట్ఇక సన్రైజర్స్ తమ రెండో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడగా.. ఈసారి నితీశ్ రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన నితీశ్ 24 బంతుల్లో 39 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.తద్వారా సన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా నితీశ్ రెడ్డి మాట్లాడుతూ.. బౌలింగ్లో తాను మెరుగుపడటానికి ‘ప్రత్యేక’ వ్యక్తి శిక్షణ కారణమని పేర్కొన్నాడు. స్లో బౌన్సర్లతోనే కేకేఆర్తో మ్యాచ్లో ఫలితం రాబట్టానని తెలిపాడు.టీమిండియాకు శుభవార్తేఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ సునిల్ గావస్కర్ నితీశ్ కుమార్ రెడ్డిని ప్రశంసించాడు. ‘‘అతడు వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్కు మరికొంత పేస్ కూడా జతచేశాడు. అతడి బౌలింగ్ శైలి, లయ మెరుగుపడ్డాయి. పూర్తి ఫిట్గా ఉన్నందు వల్లే అతడికి ఇది సాధ్యమైంది.తన ఫిజికల్ ట్రెయినర్కు అతడు క్రెడిట్ ఇచ్చాడు. అతడు ఫిట్గా ఉండటమే అతిపెద్ద సానుకూలాంశం. అతడు బౌన్స్ కూడా రాబట్టగలుగుతున్నాడు. నితీశ్ రెడ్డి ఇలా రాణించడం టీమిండియాకు శుభవార్తే అవుతుంది’’ అని గావస్కర్ కొనియాడాడు.కాగా సన్రైజర్స్ తరఫున సత్తా చాటి వెలుగులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. అనతికాలంలోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న హార్దిక్ పాండ్యా వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు. ఇలాంటి దశలో గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా కాస్త వెనుకబడినా.. తిరిగి నిలదొక్కుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు.చదవండి: ‘ధోని ఎక్కడి నుంచో వచ్చాడు.. రో-కోలకు ముఖం మీదే చెప్పేయండి’: యువీ
‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్.. రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే దశాబ్దంలో వైభవ్ ప్రపంచ క్రికెట్ను శాసించే అవకాశముందని జోస్యం చెప్పాడు. 15 ఏళ్ల సూర్యవంశీ ఆటతీరుకు తాను ముగ్దుడినయ్యానని బట్లర్ పేర్కొన్నాడు. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బట్లర్ సూర్యవంశీతో సరదాగా సంభాషించిన వీడియోను రాజస్తాన్ యాజమాన్యం షేక్ చేసుకుంది. వీడియోలో బట్లర్ మాట్లాడుతూ.. ‘నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో వైభవ్ ఒకడు. వైభవ్కు 21 లేదా 25 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచం అతని పాదాల చెంత ఉంటుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో మీరు మా ఇంగ్లండ్ జట్టు హృదయాన్ని ముక్కలు చేశారు. హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో నువ్వు ఆడిన 175 పరుగుల ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్ ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆరోజు నువ్వు చాలా బాగా ఆడావు. నీ ఆట చాలా బాగుంది. ఇదే స్వేచ్ఛతో కష్టపడి ఆడే తత్వాన్ని కొనసాగించు. భవిష్యత్తులో నువ్వు గొప్ప క్రికెటర్ అవుతావు. అందులో ఎలాంటి సందేహం లేదు.’ వైభవ్ను పొగడ్తల్లో ముంచడంతో పాటు విలువైన సూచనలు కూడా ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బట్లర్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 33 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 122 మ్యాచ్లు ఆడిన బట్లర్, దాదాపు 40 సగటుతో, 149 స్ట్రైక్ రేట్తో 4,158 పరుగులు చేశాడు. బట్లర్ ఫామ్పై విమర్శలు వస్తున్న వేళ ఒక్క ఇన్నింగ్స్తో వాటికి సమాధానం చెబుతాడేమో చూడాలి.Two generations of the Royals 💗🥹 pic.twitter.com/d8y76RbGaT— Rajasthan Royals (@rajasthanroyals) April 3, 2026చదవండి: పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే!
BCCI: రోహిత్, కోహ్లికి ముఖం మీదే చెప్పేయండి: యువీ
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఉద్దేశించి లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2027లో ఆడించే విషయంలో యాజమాన్యం (బీసీసీఐ) వీరిద్దరికి ఇప్పుడే స్పష్టతనిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగాకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రో-కో (Rohit Sharma- Virat Kohli) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో గతేడాది రోజుల వ్యవధిలోనే వీరిద్దరు టెస్టులకూ గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్- కోహ్లి ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.అయితే, రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన క్రమంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రో-కో భవితవ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరు వరల్డ్కప్ ఆడేందుకు కట్టుబడి ఉన్నారో లేదో తమకు తెలియదన్నాడు. అయితే, రో-కో మాత్రం ఇందుకు భిన్నంగా సూపర్ ఫామ్తో ముందుకు సాగుతూ తమ లక్ష్యం ఏమిటో ఆటతోనే చెప్పకనే చెబుతున్నారు.తుది నిర్ణయం సెలక్టర్లదేఈ పరిణామాల గురించి యువరాజ్ సింగ్ తాజాగా స్పందించాడు. స్పోర్ట్స్ తక్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్- కోహ్లి ఆలోచన ఏమిటో నాకైతే తెలియదు. అయితే, ఈ ఇద్దరూ కూడా వరల్డ్కప్ ఆడేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, వారిని ఆడించాలా? లేదా? అన్న నిర్ణయం మాత్రం సెలక్టర్లదే.నిజం నిష్ఠూరంగా ఉన్నా.. వీరిద్దరి భవితవ్యాన్ని నిర్ణయించేంది సెలక్టర్లే. నా అభిప్రాయం ప్రకారం వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. అయితే, వరల్డ్ ఆడించే విషయంలో మేనేజ్మెంట్ వారికి స్పష్టతనిస్తే మంచిది. ఇలాంటి విషయాల గురించి ఆటగాళ్లతో మనస్ఫూర్తిగా చర్చించాలి.ముఖ్యంగా ఇద్దరూ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. కాబట్టి వారి విషయంలో నిజం నిష్ఠూరంగా ఉన్నా.. ముందుగానే ముఖం మీద చెప్పేస్తే బాగుంటుంది. కాకపోతే భారత క్రికెట్లో ఇలా జరగడం లేదు’’ అని యువీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఎక్కడి నుంచో వచ్చి ధోనీ కెప్టెన్ అయ్యాడు ఇక టీమిండియా యాజమాన్య వైఖరిని ఈ సందర్భంగా యువీ గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ ఎంపిక అంచనాలకు అందకుండా సాగుతుందని పేర్కొన్నాడు. తాను టీమిండియాకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ... అనూహ్యంగా ధోనీని భారత జట్టు కెప్టెన్గా ఎంపిక చేసిన విషయాన్ని యువీ గుర్తు చేసుకున్నాడు.తాజాగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్... ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్కు అప్పగించిన నేపథ్యంలో యువీ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఈ నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. దీన్ని ఒక ఆటగాడి కోణం నుంచి చూస్తే... ఉదాహరణకు ఒక ఆటగాడు ప్రపంచకప్నకు ముందు చక్కటి ఫామ్తో తన రాష్ట్ర జట్టు తరఫున సత్తా చాటి వరల్డ్కప్నకు ఎంపికయ్యాడు.అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనతో జట్టుకు వరల్డ్కప్ అందించాడు. అలాంటి ప్లేయర్ను ఫ్రాంచైజీ కెప్టెన్గా ఎంపిక చేసింది. మరోవైపు ఏడేళ్లుగా ఒక ప్లేయర్ ఆ ఫ్రాంచైజీ కోసం ప్రాణం పెట్టి అద్భుతంగా ఆడుతున్నాడు. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగిందిఅయినప్పటికీ అతడికి జట్టు కెప్టెన్ పదవి కాకుండా వైస్కెప్టెన్ పదవి దక్కింది. మైదానంలో అడుగు పెట్టినప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగింది.నేను భారత జట్టుకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో హర్భజన్, సెహ్వాగ్ వంటి సీనియర్లు జట్టులో ఉన్నా... ఎక్కడి నుంచో వచ్చి ధోని కెపె్టన్ అయ్యాడు. కారణాలు ఏవైనా మీరు భారత కెప్టెన్గా ఉంటారా లేదా అనేది ఫ్రాంచైజీ క్రికెట్ నిర్ణయించదు. కానీ ఆటగాడి కోణం నుంచి చూస్తే ఇది నిరాశ కలిగించే అంశం’ అని యువరాజ్ అన్నాడు. 2007లో జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ధోనీకి అనూహ్యంగా జట్టు పగ్గాలు అప్పజెప్పడంపై యువీ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్!
పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ దూకుడు మీద ఉంది. బలమైన బ్యాటింగ్ శక్తితో లీగ్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లోనూ అదే జోరును ప్రదర్శిస్తోంది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసిన పంజాబ్ శుక్రవారం చెన్నై సూపర్కింగ్స్ను మట్టికరిపించింది. రెండు మ్యాచ్లు కలిపి పంజాబ్ మొత్తం 23 సిక్సర్లు బాదింది. ఇందులో గుజరాత్పై 14, చెన్నైపై 9 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు అన్ని సీజన్లు కలిపి 1,686 సిక్సర్లు బాదింది. దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్న పంజాబ్ ఇంత బలంగా తయారవ్వడం వెనుక దాగున్న రహస్యాన్ని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బయటపెట్టాడు. పంజాబ్ వరుస విజయాల్లో జట్టు హెడ్కోచ్ రికీ పాంటింగ్కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్నాడు. పవర్ హిట్టింగ్ కోసం పాంటింగ్ ఉపయోగించిన స్క్వాష్ బాల్ టెక్నిక్ ఇప్పుడు పంజాబ్ బ్యాటర్లకు వరంగా మారిందని తెలిపాడు. పాంటింగ్ కోచ్గా వచ్చిన తర్వాత పంజాబ్ బ్యాటింగ్లో బలం పెరిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రబ్సిమ్రన్ సింగ్లు సిక్సర్లు కొట్టడంలో మరింత రాటుదేలారు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘పాంటింగ్తో ఉన్న అనుబంధం గురించి ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. నేను ముంబై ఇండియన్స్కు ఆడినప్పుడు అతడు మా కోచ్గా ఉన్నాడు. నా హిట్టింగ్ స్పీడ్ను పెంచేందుకు పాంటింగ్ కొత్త పద్దతిని ఉపయోగించాడు. ప్రాక్టీస్ సమయంలో పాంటింగ్ నా చేతి గ్లోవ్స్ మధ్యలో స్క్వాష్బాల్ను ఉంచేవాడు. దీనివల్ల చేతి కింది భాగంలో బ్యాట్ను గట్టిగా పట్టుకోవడానికి ఆస్కారముండదు. దీంతో మన హిట్టింగ్లో స్పీడ్ పెరుగుతుంది. ఈ టెక్నిక్ వల్లే అప్పట్లో నేను చాలా మ్యాచ్ల్లో సులువుగా సిక్సర్లు కొట్టేవాడిని. తాజాగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఈజీగా సిక్సర్లు కొట్టడం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే అక్కడ పాంటింగ్ హెడ్కోచ్గా ఉన్నాడు. వాస్తవానికి ఎవరైనా సిక్సర్లు కొడతారు. కానీ స్వ్కాష్బాల్ టెక్నిక్ వల్ల బ్యాట్ స్పీడ్ పెరిగి బంతి ఎంత వేగంగా వచ్చినా సులువుగా సిక్సర్లు బాదేందుకు ఇది ఉపయోగపడుతుంది.’ అని చెప్పుకొచ్చాడు.ఏమిటీ స్క్వాష్బాల్ టెక్నిక్?పాంటింగ్ ఉపయోగించే స్క్వాష్బాల్ టెక్నిక్లో స్వ్కాష్ బంతిని బ్యాటర్ చేతి గ్లోవ్స్ మధ్య ఉంచుతారు. దీనివల్ల చేతి కింది బాగంలో ఖాళీ ఏర్పడి బ్యాట్ గట్టిగా పట్టుకోలేము. దీనివల్ల బ్యాట్కు గ్రిప్ రావడంతో పాటు హిట్టింగ్ స్పీడ్ పెరుగుతుంది. 2007 వన్డే ప్రపంచకప్ సమయంలో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ సహా ఓపెనర్ ఆడమ్ గిల్క్రిస్ట్లు వారి కోచ్ బాబ్ మ్యూల్మన్ సలహా మేరకు ఇలాంటి టెక్నిక్ను ఉపయోగించే అలవోకగా సిక్సర్లు బాదడం నేర్చుకున్నారు. ఇప్పుడదే టెక్నిక్ను పాంటింగ్ పంజాబ్ బ్యాటర్లపై ప్రయోగించి విజయవంతమయ్యాడు.చదవండి: ‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచ రికార్డు
పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు ఛేదించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పంజాబ్ తానే బద్దలు కొట్టింది.ఐపీఎల్-2026 టోర్నీలో తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన పంజాబ్ కింగ్స్.. రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.209 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. ఆయుశ్ మాత్రే (73), శివం దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.పంజాబ్ బ్యాటర్ల ధనాధన్ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. తద్వారా ఐదు వికెట్లతేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39), ప్రభ్సిమ్రన్ సింగ్ (43), కూపర్ కన్నోలి (36), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50) మెరుపు ఇన్నింగ్స్తో అలరించారు.ప్రపంచంలోనే తొలి జట్టుగా పంజాబ్పంజాబ్ కింగ్స్ 200కు పైగా పరుగుల స్కోరును ఛేదించడం ఇది తొమ్మిదోసారి. పొట్టి క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది. టీ20 క్రికెట్లో అత్యధికసార్లు 200కు పైగా పరుగుల స్కోరు ఛేదించిన జట్లు ఇవే🏏పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్)-తొమ్మిది సార్లు🏏ఆస్ట్రేలియా- ఏడుసార్లు🏏ముంబై ఇండియిన్స్ (ఐపీఎల్)- ఆరు సార్లు🏏టీమిండియా- ఆరు సార్లు🏏రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఐపీఎల్)- ఆరు సార్లు🏏సౌతాఫ్రికా- ఆరుసార్లు చదవండి: IPL 2026: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్!🔙 to 🔙 victories ✌️@PunjabKingsIPL complete the chase in an authoritative fashion ❤️A win by 5⃣ wickets in Chennai 🥳Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/S9EEawsaZk— IndianPremierLeague (@IPL) April 3, 2026
‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆ జట్టు ఓడిపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగానే పంజాబ్తో మ్యాచ్లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. మ్యాచ్ ఓటమి అనంతరం రుతురాజ్ మాట్లాడాడు.‘ఇది చాలా కఠినమైన మ్యాచ్. అయినప్పటికి కూడా ఈ మ్యాచ్ నుంచి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. మా బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ముఖ్యంగా ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే శివమ్ దూబే కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా బ్యాటింగ్ విభాగం బాగా ఆడింది. మా బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉంది. జట్టుకు ఏది అవసరమో, ఆ పాత్రకు అనుగుణంగా మారడమే ముఖ్యం. ఈరోజు వికెట్ కొంచెం గ్రిప్ అవుతున్నందున, బహుశా మరికొంత సేపు క్రీజులో నిలదొక్కుకోవాలని నాకు అనిపించింది. ఆ తరువాత వేగంగా ఆడాలని అనుకున్నాను. అయితే.. దురదృష్టవశాత్తు తప్పుడు సమయంలో ఔట్ అయ్యాను. నిజానికి 209 అనేది చాలా మంచి స్కోరు. పిచ్ నుంచి పేసర్లకు మంచి సహకారం అందింది. రాహుల్ చాహర్ను ఇంపాక్ట్గా తీసుకోవడంపై నేను ఒక్కటే ఆలోచించాను. ముగ్గురు సీమర్లు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లతో ఆడాలని అనుకున్నాము. ఈ కాంబినేషన్ జట్టుకు ఉపయోగపడుతుందనుకున్నా. కానీ మా స్పిన్నర్లకు ఈ రోజు అసలు కలిసిరాలేదు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయాము. అయితే మాది యువ జట్టు. అనవసరమైన అంచనాలతో ఒత్తిడి పెంచుకోకూడదని భావిస్తున్నాం’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్!
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ ఖాతాలో రెండో ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఫుట్బాల్ లీగ్ (ఐఎఫ...
‘మేం మోసగాళ్లలా కనిపిస్తున్నామా’
పెయియా (సైప్రస్): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చె...
రూ.10.23 లక్షలకు ఒక్క టికెట్
జ్యూరిక్: గతంలో తల తాకట్టు పెట్టి అయినా ఫుట్బాల్...
గోల్ఫ్తో ఎంతో ప్రయోజనం: యువీ
న్యూఢిల్లీ: గోల్ఫ్ ఆడటం ద్వారా ఒత్తిడి తగ్గుతుందన...
ఐపీఎల్లో నేడు ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్లో తొలి ‘డబుల్ హెడర్’క...
పంజాబ్ బల్లే బల్లే...
చెన్నై సూపర్కింగ్స్కి కోట లాంటి చెపాక్ మైదానంలో...
‘ప్రత్యేక వ్యక్తి’ కృషి వల్లే...
కోల్కతా: తన బౌలింగ్ మెరుగుపడటం వెనుక ఒక ప్రత్యేక...
సత్తా చాటిన శ్రేయస్.. పంజాబ్ ఖాతాలో వరుసగా రెండో విజయం
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్య...
క్రీడలు
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
వీడియోలు
దూసుకెళ్తున్న పంజాబ్
కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం
తొలి మ్యాచ్ లోనే ఓడిపోయినా.. కప్ మాత్రం సీఎస్కేదేనా..?
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
చెన్నై చిత్తు.. రాయల్స్ రాజసం
ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు
IPL 2026: RR vs CSK ఎవరు గెలుస్తారు?
కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం
RCB Vs SRH: అదరగొట్టిన RCB.. SRHపై 6 వికెట్ల తేడాతో RCB గెలుపు
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
