ప్రధాన వార్తలు
'సెంచరీలు కొట్టండి.. లేదంటే అంతే మీ పని'
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 103 పరుగుల తేడాతో ముంబై చిత్తు అయింది. ఐపీఎల్ చరిత్రలో పరుగుల తేడా పరంగా ముంబై ఇండియన్స్కు ఇదే అతి పెద్ద ఓటమి.దీంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై ఆ జట్టు యజమాని ఆకాశ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ముంబై డౌగౌట్కు దగ్గరలో ఉన్న ఆకాశ్.. సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చూస్తూ స్టేడియాన్ని వీడారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ అంబానీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై వరుస వైఫల్యాలపై ఆకాశ్ గుర్రుగా ఉన్నారని బసిత్ అలీ అన్నాడు.ఆకాష్ అంబానీకి గనుక కోపం వస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. అప్పుడు ఆటగాళ్లను ఆయన దండిస్తాడు. భాయ్ ఇకపై మ్యాచ్లు గెలవండి, సెంచరీలు కొట్టండి అని తమ ఆటగాళ్లకు ఆకాష్ గట్టిగా చెబుతాడు అని బసిత్ అలీ ఎగతాళిగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ముంబై జట్టు సెలక్షన్పై కూడా అతడు విమర్శలు కురిపించాడు. ముఖ్యంగా వరుసగా రెండు మ్యాచ్లలో విఫలమైన యువ ఆటగాడు డానిష్ మలేవార్ను జట్టులోకి తీసుకోవడాన్ని అతడు తప్పబట్టాడు. "ఈ కొత్త ఓపెనర్ ఎవరు? అతడిని ముంబై ఎందుకు ఆడిస్తోంది? అతనేమన్నా సిఫార్సుతో జట్టులోకి వచ్చాడా? అని అలీ మండిపడ్డాడు. అయితే ముంబై ఫ్యాన్స్ మాత్రం బసిత్ అలీకి కౌంటరిస్తున్నారు. ముందు మీ పీఎస్ఎల్ సంగతి చూసుకోండి, ఆ తర్వాత ఐపీఎల్ గురుంచి మాట్లాడు అంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. కాగా ఐపీఎల్కు పోటీగా ప్రారంభమైన పీఎస్ఎల్-2026 సీజన్ అట్టర్ ప్లాప్ అయింది.
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ లైవ్ అప్డేట్స్
IPL 2026 GT vs RCB Live updates: ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి.గుజరాత్ తొలి వికెట్ డౌన్128 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్మన్ గిల్.. సుయాశ్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.7 ఓవర్లకు గుజరాత్ స్కోర్:61/07 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(48), శుభ్మన్ గిల్(11) ఉన్నారు.ఆచితూచి ఆడుతున్న గుజరాత్2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(8), శుభ్మన్ గిల్(1) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో జాకబ్ బెతల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు వెస్టిండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ గుజరాత్ టైటాన్స్ తరపున అరంగేట్రం చేశాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్
ఆర్సీబీ జట్టులోకి విధ్వంసకర వీరుడు?
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఆర్సీబీ తలపడనుంది. తమ ఆఖరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ఓటమిపాలైన ఆర్సీబీ తిరిగి పుంజుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో బెంగళూరు తుది జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు బెంచ్కే పరిమితమైన ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్.. గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగే అవకాశముంది. రొమారియో షెపర్డ్ స్దానంలో బెతల్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బెతల్ మూడు రోజులుగా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తూ కన్పించాడు.బెతల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సెమీఫైనల్లో భారత్పై సంచలన సెంచరీతో మెరిశాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 105 పరుగులు చేసి టీమిండియాను వణికించాడు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా అదే దూకుడును కనబరిచేందుకు జాకబ్ సిద్దమయ్యాడు.ఇక జోష్ హాజిల్వుడ్ స్ధానంలో కివీస్ పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. డఫీ తను ఆడిన ప్రతీ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ హాజిల్వుడ్ రావడంతో అతడు గత రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు.ఇప్పుడు అతడిని తిరిగి మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకొచ్చేందుకు ఆర్సీబీ మేనెజ్మెంట్ సిద్దమైంది. ఇక ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది.ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జాకబ్ బెతల్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, డఫీ, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్పోర్ట్ ఉందా?
కివీస్ క్రికెట్లో ప్రకంపనలు.. డ్రగ్స్ టెస్టులో దొరికిపోయిన బ్రేస్వెల్
న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ డౌగ్ బ్రేస్వేల్ డ్రగ్స్ టెస్టులో పట్టుబట్టాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో అతడు కోకైన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతడిపై ఇంగ్లండ్ అండర్ వేల్స్ క్రికెట్ బోర్డు రెండేళ్ల నిషేధం విధించింది. 2025 కౌంటీ ఛాంపియన్షిప్లో బ్రేస్వెల్ ఎసెక్స్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించాడు.అయితే ఈ టోర్నీలో భాగంగా సోమర్సెట్తో జరిగిన మ్యాచ్ అనంతరం సెప్టెంబర్ 24న బ్రేస్వెల్ నమూనాలను సేకరించారు. లండన్లోని వాడా (WADA) గుర్తింపు పొందిన ల్యాబొరేటరీలో జరిపిన పరీక్షల్లో, అతడు కోకైన్ వాడినట్లు తేలింది. బ్రేస్వెల్ కూడా తను కోకైన్ తీసుకున్నట్లు తన తప్పును అంగీకరించాడు.దీంతో ఎలాంటి విచారణ అవసరం లేకుండానే ఈ కేసును ఈసీబీ ముగించింది. అయితే ఈ నిషేదం గతేడాది నవంబర్ 27 నుంచి అమలులోకి వస్తోంది. అంటే నవంబర్ 23, 2027 వరకు అతడు ఎలాంటి అధికారిక క్రికెట్లో పోటీల్లో పాల్గోనలేడు.కాగా 35 ఏళ్ల బ్రేస్వెల్.. న్యూజిలాండ్ తరపున ఆడిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్లోకి చేసిన బ్రేస్వేల్.. తన మూడవ టెస్టులోనే 9 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు టెస్ట్ల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26, టీ20ల్లో 20 వికెట్లు తీశాడు.
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్పోర్ట్ ఉందా?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, డేవిడ్ లాయిడ్, అలస్టైర్ కుక్, అలెక్స్ హార్ట్లీప్రశంసల వర్షం కురిపించారు. ఈ దిగ్గజ క్రికెటర్లు తాజాగా వైభవ్ ప్రదర్శనపై 'స్టిక్ టు క్రికెట్' (Stick to Cricket) పాడ్కాస్ట్లో ఆసక్తికర చర్చ జరిపారు.ఈ సందర్భంగా వీరంతా వైభవ్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఐర్లాండ్తో టూర్తో వైభవ్ సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేస్తాడని వాన్ జోస్యం చెప్పాడు. వైభవ్ ఒక అద్బుతమైన ఆటగాడని, అతడి టాలెంట్ చూస్తుంటే ముచ్చటెస్తుందని అలెక్స్ హార్ట్లీ అభిప్రాయపడ్డాడు.కాగా తన అరంగేట్ర ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీతో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2026లో కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ, 220.87 స్ట్రైక్ రేటుతో 256 పరుగులు చేశాడు.ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల మధ్య జరిగిన సంబాషణ ఇదేమైఖల్ వాన్: సూర్యవంశీ నిజంగా ఒక సంచలన ఆటగాడు, ఈ ఏడాది ఐపీఎల్లో అతడి స్ట్రైక్ రేట్ 236గా ఉంది.డేవిడ్ లాయిడ్: అతడు ఇప్పుడు స్కూల్కి వెళ్లాలి కదా? మధ్యలో స్కూల్ అలా మానేయకూడదు కదా వాన్!వాన్: అతడు మళ్లీ స్కూల్కు వెళ్తాడని నేను అనుకోను డేవ్. వైభవ్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో ఉంటాడని నేను అనుకుంటా? ఒకవేళ నేను సెలక్టర్ అయితే ఇంగ్లండ్ సిరీస్ కోసం వైభవ్ను కచ్చితంగా ఎంపిక చేస్తాను.టఫ్నెల్: అవును కచ్చితంగా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు అతడు అర్హుడు.అలస్టైర్ కుక్: ఇంతకి వైభవ్ దగ్గర పాస్పోర్ట్ ఉందా?(నవ్వుతూ)వాన్: అతడికి 20 ఏళ్లు ఉంటే మనందరం ఆశ్చర్యపోయేవాళ్లం కాదు. కానీ 15 ఏళ్లలోనే ఇలా ఆడుతున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. బుమ్రాను సైతం అతడు వదల్లేదు.హార్ట్లీ: వైభవ్కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు అత ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా, నిర్భయంగా ఆడుతున్నాడు. కచ్చితంగా అతడిని భారత జట్టుకు ఎంపిక చేయాలి.వాన్: భారత టీ20 జట్టుకు కొత్త ఓపెనర్ అతడే. మరో ఎండ్లో జైస్వాల్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ వైభవ్ ప్రదర్శనల కారణంగా జైశ్వాల్ వెలుగులోకి రాలేకపోతున్నాడు.
‘అందుకే శ్రేయస్ అయ్యర్ను వదులుకున్నాం’
భారత దేశీ క్రికెట్లో కోచ్గా చంద్రకాంత్ పండిట్కు మంచి పేరుంది. అతడి మార్గదర్శనంలోనే మధ్యప్రదేశ్ తొలి రంజీ టైటిల్ అందుకుంది. రంజీ 2021-22 సీజన్లో చాంపియన్గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్ హెడ్కోచ్గా చంద్రకాంత్ పండిట్ బాధ్యతలు చేపట్టాడు.చంద్రకాంత్ మార్గ నిర్దేశనం, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలో కేకేఆర్ 2024లో చాంపియన్గా అవతరించింది. అయితే, వీరి కంటే నాటి మెంటార్ గౌతం గంభీర్కే క్రెడిట్ ఎక్కువగా వచ్చింది. ఇక 2024 తర్వాత కేకేఆర్ శ్రేయస్ను వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.ఏకంగా ఫైనల్కుఅందుకు తగినట్లుగానే శ్రేయస్ అయ్యర్ బ్యాటర్గా, కెప్టెన్గా రాణించి పంజాబ్ను గతేడాది ఫైనల్కు చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలో పంజాబ్ ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు.. శ్రేయస్ను వదులుకున్న కేకేఆర్ వరుస పరాజయాలతో డీలా పడి.. విమర్శలు మూటగట్టుకుంటోంది.ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ హెడ్కోచ్ చంద్రకాంత్ పండిట్ శ్రేయస్ అయ్యర్ను వదులుకోవడంపై తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ ఆరోజు మేము అతడి సేవలు కోల్పోయాము. శ్రేయస్ అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్గా కేకేఆర్కు ట్రోఫీ అందించాడు.అతడు జట్టును నడిపించే విధానానికి నేను అభిమానిని. అయితే, కొన్నిసార్లు దీర్ఘకాల ప్రయోజనాలు, వ్యూహాల దృష్ట్యా కొంతమంది ప్లేయర్లను వదులుకోవాల్సి వస్తుంది. నిజానికి ఆరోజు కేకేఆర్ కోచ్గా నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను.అందుకే అతడిని వదులుకున్నాముఅయితే, కావాలని మేము అతడిని వదులుకోలేదు. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. శ్రేయస్ ఒక్కడినే కాదు.. ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లను కూడా మేము వదిలేశాము. ఏదేమైనా కోచ్గా ఉన్న సమయంలో కేకేఆర్ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా, సీఈఓ వెంకీ మైసూర్ నాకు అండగా ఉన్నారు’’ అని చంద్రకాంత్ పండిట్ రెవ్స్పోర్ట్స్తో పేర్కొన్నాడు.కాగా 2025 సీజన్ తర్వాత చంద్రకాంత్ పండిట్కు ఉద్వాసన పలికిన కేకేఆర్.. 2026కు గానూ అభిషేక్ నాయర్ను హెడ్కోచ్గా ప్రకటించింది. గతేడాది అజింక్య రహానే కెప్టెన్సీలో పద్నాలుగింట కేవలం ఐదు గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ మహిళా క్రికెట్ దిగ్గజం, వెటరన్ ఆల్రౌండర్ సూజీ బేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్-జూలైలో ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఉమెన్స్ టీ20 వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు బేట్స్ ప్రకటించింది.2006లో భారత్పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బేట్స్.. తన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. 38 ఏళ్ల బేట్స్ ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతోంది. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో బేట్స్ తొడ కండరాల గాయం బారిన పడింది. ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకుంటున్న బేట్స్.. వరల్డ్ కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించాలని పట్టుదలతో ఉంది.20 ఏళ్ల పాటు న్యూజిలాండ్ జెర్సీ ధరించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ కాలం ఇంత వేగంగా గడిచిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన యూకే గడ్డపై మరో ప్రపంచకప్ గెలవడమే నా చివరి లక్ష్యం. అందుకోసం నా శక్తి మొత్తాన్ని ధారపోస్తాను.ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాను అని బేట్స్ న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసిన వీడియోలో పేర్కొంది. సూజీ బేట్స్ వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఉమెన్స్ క్రికెటర్గా కొనసాగుతోంది. 181 వన్డేల్లో బేట్స్ 5,964 పరుగులు చేసింది.అదేవిధంగా ఓవరాల్గా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా బేట్స్ (4,717 పరుగులు) కొనసాగుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో 350 మ్యాచ్లు ఆడిన మొదటి మహిళా క్రికెటర్ సూజీనే కావడం గమనార్హం.చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?
అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథే: సెహ్వాగ్
ఐపీఎల్-2026లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మూడింట గెలిచింది. ముంబై ఇండియన్స్తో గురువారం నాటి మ్యాచ్లో ఏకపక్ష విజయం సాధించి పాయింట్ల సంఖ్యను ఆరుకు పెంచుకుంది. సొంతమైదానం వాంఖడేలో ముంబైని చెన్నై చిత్తు చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.మూడు మ్యాచ్లలో రెండు శతకాలుఅయితే, టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) మాత్రం చెన్నై విషయంలో భిన్నంగా స్పందించాడు. ఒక్కరిపై ఆధారపడితే చెన్నై ఈసారి కూడా గట్టెక్కలేదని అభిప్రాయపడ్డాడు. కాగా చెన్నై ఇప్పటికి మూడు విజయాలు సాధించగా.. ఈ మూడింటిలో సంజూ శాంసన్ రెండు అజేయ సెంచరీలతో జట్టును గెలిపించాడు.ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 115 పరుగులు చేసిన సంజూ.. తాజాగా ముంబైపై 101 పరుగులు సాధించాడు. ఈ రెండు మ్యాచ్లలో మిగతా బ్యాటర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. ఇక కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లోనూ సంజూ 48 పరుగులతో టాప్రన్స్కోరర్గా నిలిచి జట్టుకు విజయం అందించాడు.అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథేఈ నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం చెన్నై జట్టును అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ ఆ జట్టు గెలిచిన ప్రతి సందర్భంలోనే ఒకే ఒక్క బ్యాటర్ పరుగులు రాబట్టాడు. అతడు పరుగులు చేయడంలో విఫలమైన రోజు కథ వేరుగా ఉంటోంది.ఒకవేళ అతడు మళ్లీ గనుక ఫెయిలైతే పాత కథే పునరావృతం అవుతుంది. కాబట్టి ఒకే ఒక్క బ్యాటర్పై ఆధారపడటం సరికాదు. సంజూతో పాటు పరుగులు రాబట్టే ఆయుశ్ మాత్రే దురదృష్టవశాత్తూ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్ మీద చెన్నై ఆశలు పెట్టుకుంది. సంజూతో కలిసి వాళ్లు కూడా రాణిస్తేనే సీఎస్కే ప్రయాణం ముందుకు సాగుతుంది’’ అని క్రిక్బజ్ షోలో పేర్కొన్నాడు. ఏదేమైనా సంజూ శాంసన్ సంచలన ఇన్నింగ్స్తో ముంబైపై చెన్నైకి విజయం అందించాడని సెహ్వాగ్ ప్రశంసించాడు.కాగా రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై.. కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?What composure. What striking 💛𝐒𝐚𝐧𝐣𝐮 𝐒𝐦𝐚𝐬𝐡𝐢𝐧𝐠 𝐒𝐚𝐦𝐬𝐨𝐧 🔥Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL | @IamSanjuSamson pic.twitter.com/2Hr9Ui0UEn— IndianPremierLeague (@IPL) April 23, 2026
ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 99 పరుగుల తేడాతో గెలిచిన హార్దిక్ సేన.. అదే జోరు కొనసాగించలేకపోయింది. సొంత మైదానం వాంఖడే వేదికగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా సీజన్లో ఏడింట ఐదో పరాజయాన్ని నమోదు చేసింది.సంజూ సెంచరీతో గెలిపించాడుటాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అడపాదడపా వికెట్లు తీసినా.. ఓపెనర్ సంజూ శాంసన్ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆచితూచి ఆడుతూనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ (29 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యకుమార్ (30 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించారు. అకీల్ హొసీన్కు 4 వికెట్లు దక్కాయి.ముంబై బ్యాటర్లు పెవిలియన్కు క్యూఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆది నుంచే తడబడటం తీవ్ర ప్రభావం చూపింది. ఓపెనర్లు డానిష్ మలేవార్ (0), క్వింటన్ డికాక్ (7).. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. సూర్య, తిలక్ కాసేపు పోరాడిన ఫలితం లేకుండా పోయింది. మిగిలిన వారిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, రూథర్ఫర్డ్ 0, శార్దూల్ ఠాకూర్ 6, క్రిష్ భగత్ 7, జస్ప్రీత్ బుమ్రా 2 పరుగులు చేశారు.ఆకాశ్ అంబానీ ఆగ్రహంఈ క్రమంలో వరుసగా వికెట్లు పడుతూ.. ఓటమి దిశగా ముంబై వెళ్తున్న వేళ.. ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబానీ తీవ్రంగా స్పందించారు. బ్లూ సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చేస్తూ స్టేడియాన్ని వీడారు. There is absolutely nothing going right for Mumbai Indians right now. Just look at Akash Ambani walking off mid-game and he walked right in front of the dugout and didn’t even look at the players. He literally asked the fans to leave the stadium as well. The lack of unity is… pic.twitter.com/8nplMjRYLN— OldMonkOfCricket (@OldMonkOfCric) April 24, 2026ఆ సమయంలో మైదానంలోని ఆటగాళ్ల వైపు ఆకాశ్ అంబానీ కోపంగా చూసినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి. అందుకే ఆకాశ్ అంబానీ ఎన్నడూ లేని విధంగా అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.చదవండి: PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్
PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో కొనసాగేందుకు తమ ఇద్దరు ప్రధాన ఆటగాళ్లకు ఇచ్చిన నిరంభ్యంతర పత్రాల్ని (NOC) రద్దు చేసింది. కాగా ఐపీఎల్-2026 నుంచి తొలగించిన తర్వాత బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ పీఎస్ఎల్లో చేరిన సంగతి తెలిసిందే.జట్టు విజయాల్లో కీలక పాత్రలాహోర్ ఖలందర్స్తో జట్టుకట్టిన ముస్తాఫిజుర్.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం ముస్తాఫిజుర్ను బీసీబీ వెనక్కి పిలిపించింది. కానీ గాయం వల్ల అతడు మొదటి రెండు వన్డేలకు దూరం కాగా.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో బరిలోకి దిగాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టుకు విజయం అందించడంలో తోడ్పడ్డాడు.పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్లు ఆడడుఅయితే, ఈ మ్యాచ్ తర్వాత బీసీబీ కీలక ప్రకటన చేసింది. పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్లకు ముస్తాఫిజుర్ రహమాన్ పంపబోమని తెలిపింది. ఫిట్నెస్ సమస్యల భయం దృష్ట్యా అతడికి ఇచ్చిన NOCని రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)కి సమాచారం ఇచ్చింది.కాగా తొలుత మార్చి 26- ఏప్రిల్ 12 వరకు... తర్వాత ఏప్రిల్ 24- మే 3 వరకు ముస్తాఫిజుర్కు బీసీబీ NOC జారీ చేసింది. ఇక ముస్తాఫిజుర్తో పాటు మరో పేసర్ నహీద్ రాణా NOCని కూడా బీసీబీ రద్దు చేయడం గమనార్హం. నహీద్ రాణా NOC కూడా రద్దుకాగా నహీద్ రాణా పీఎస్ఎల్లో పెషావర్ జెల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. వన్డే సిరీస్ ఆడేందుకు నహీద్ స్వదేశానికి తిరిగి వచ్చాడు.న్యూజిలాండ్తో రెండో వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లాదేశ్ను గెలిపించాడు నహీద్. అయితే, అతడిని కివీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు బీసీబీ. దీంతో పీఎస్ఎల్లో ప్లే ఆఫ్స్ ఆడేందుకు నహీద్ వెళ్తాడని భావించగా.. బీసీబీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కారణం ఇదేపీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్లకు అతడు రాడని స్పష్టం చేసింది. కాగా పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు నహీద్ను సన్నద్ధం చేసేందుకే బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా పీఎస్ఎల్లో తమదైన ముద్రవేస్తూ లీగ్కు కాస్త ఊపు తెచ్చిన ఇద్దరు ప్లేయర్లను కీలక సమయంలో తప్పించడం ద్వారా బీసీబీ.. పీసీబీకి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. కాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను 2-1తో బంగ్లా కైవసం చేసుకుంది. అంతకుముందు వెస్టిండీస్, పాకిస్తాన్లపై కూడా వన్డే సిరీస్లు గెలిచి సత్తా చాటింది. చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగేళ్ల కాలానికి తెలంగ...
కేడీ జాదవ్కు ‘పద్మవిభూషణ్’పై తేల్చండి!
ముంబై: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో భారత్కు ...
నా ఫేవరెట్ నేనే...
సాధారణంగా ఏ రంగంలో అయినా... ఉన్నత లక్ష్యాలను నిర్ద...
భారత 95వ గ్రాండ్మాస్టర్గా అరోణ్యక్ ఘోష్
రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్కు చెందిన య...
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ మహిళా క్రికెట్ దిగ్గజం, వెటరన్ ఆల్...
అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథే: సెహ్వాగ్
ఐపీఎల్-2026లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుక...
ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనస...
PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం...
క్రీడలు
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
వీడియోలు
మ్యాచ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన ఆకాష్ అంబానీ..
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
చేటా దెబ్బకి చేతులెత్తిసిన ముంబై.. IPL చరిత్రలోనే MIకి ఘోర ఓటమి
సామ్సన్ జిగేల్.. ముంబై ఢమాల్
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
అభిషేక్ సిక్సర్లు .. వెంకీ మామ స్టెప్పులు కావ్య పాప నవ్వులే నవ్వులు
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు
హైదరాబాద్ లో ఢిల్లీ చిత్తు.. శతక్కొట్టిన అభిషేక్
పిచ్చి కూతలు కూసారు.. పిక్చర్ చూపించాడు.. తెలుగోడి విశ్వరూపం
