ప్రధాన వార్తలు
ఆ తప్పే మా కొంపముంచింది: సన్రైజర్స్ కెప్టెన్
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. శనివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఈ భారీ టార్గెట్ను పంజాబ్ కింగ్స్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ప్రియాన్ష్ ఆర్య(57), ప్రభ్సిమ్రాన్ సింగ్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. సన్రైజర్స్ బౌలర్లలో స్పిన్నర్లు శివాంగ్ కుమార్ మూడు, హర్ష్ దూబే ఓ వికెట్ సాధించారు. ఫాస్ట్ బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని కిషన్ తెలిపాడు."మేము సాధించిన 219 పరుగుల భారీ స్కోర్ ఈ రోజు సరిపోలేదు. మేము ఆరంభించిన తీరు చూస్తే కనీసం 250 పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ మధ్య ఓవర్లలో తడబడ్డాం. అయినప్పటికి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని అందించాము.కానీ పంజాబ్ ఓపెనర్లు కూడా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ప్లేలో భారీగా పరుగులు రాబట్టుకున్నారు. జట్టులో ఆరు నుండి ఏడుగురు బౌలర్లు ఉన్నప్పటికీ, ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. టీ20 క్రికెట్లో సరైన లైన్ అండ్ లెంగ్త్లో వేయడం ముఖ్యం. కానీ ఈ రోజు ఆ విషయంలో విఫలమయ్యారు. ప్రస్తుత క్రికెట్లో మ్యాచ్కు ముందే ప్లానింగ్ అంతా పూర్తవుతుంది. ఏ బ్యాటర్ ఎక్కడ హిట్టింగ్ చేస్తాడు? మైదానంలో ఏ వైపు బౌండరీ లాంగ్ ఉంది? వంటి విషయాలన్నీ మాకు తెలుసు. వీటిన్నటి దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేశాము. కానీ ప్లానింగ్ సరిగ్గా ఉన్నా, వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యామని" కిషన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్లో పేర్కొన్నాడు.
అభిషేక్ మెరుపులు వృధా.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన పంజాబ్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ సన్రైజర్స్కు ధీటుగా జవాబిచ్చింది. తొలి బంతి నుంచి పంజాబ్ ఓపెనర్లు ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ప్రియాంశ్ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రభ్సిమ్రన్ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆతర్వాత శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం కొనసాగించారు. ఫలితంగా పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఊదేసింది. సన్రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ (4-0-33-3) రాణించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సీఎస్కే లైవ్ అప్డేట్స్
Chennai super kings vs delhi capitals live Updates: ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. 12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 119-1, క్రీజులో సంజూ శాంసన్(77), ఆయూశ్ మాత్రే(25) ఉన్నారు.శాంసన్ హాఫ్ సెంచరీఐపీఎల్-2026 సీజన్లో సీఎస్కే సూపర్ స్టార్ సంజూ శాంసన్ తొలి హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 52 పరుగులతో సంజూ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 8.5 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 77/1సీఎస్కే తొలి వికెట్ డౌన్సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6.2 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 62/. క్రీజులో సంజూ శాంసన్(46), అయూశ్ మాత్రే ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న సంజూసంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్ను అందుకున్నాడు. 22 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 3 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 27/1టాస్ గెలిచిన ఢిల్లీ..ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి అకిబ్ నబీ, అశుతోష్ శర్మ తుది జట్టులోకి వచ్చారు.జమ్మూ కాశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. సీఎస్కే కూడా రెండు మార్పులు చేసింది. విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ తిరిగి పునరాగమనం చేశాడు. అదేవిధంగా గుర్జప్నీత్ సింగ్ సీఎస్కే తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ఏకైక ప్లేయర్గా
పాకిస్తాన్ సూపర్ స్టార్, పెషావర్ జెల్మీ కెప్టెన్ బాబర్ ఆజం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో 4000 పరుగుల మార్క్ అందుకున్న తొలి ప్లేయర్గా ఆజం చరిత్ర సృష్టించాడు. శనివారం కరాచీ వేదికగా లహోర్ ఖలంధర్స్తో జరిగిన మ్యాచ్లో 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ ఈ ఫీట్ను అందుకున్నాడు. బాబర్ కేవలం 102 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అతడి పీఎస్ఎల్ కెరీర్లో 37 ఫిప్టీలతో పాటు రెండు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుత పీఎస్ఎల్ సీజన్లో బాబర్ అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో 70.67 సగటుతో 212 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రనస్కోరర్గా బాబర్ కొనసాగుతున్నాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లహోర్పై 76 పరుగుల తేడాతో కరాచీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. పెషావర్ ఇన్నింగ్స్లో కుశాల్ మెండిస్(48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 74) టాప్ స్కోరర్గా నిలవగా.. మైఖల్ బ్రేస్వెల్(21), మహ్మద్ హ్యారిస్(18) రాణించారు.లహోర్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్ రెహ్మన్ రెండు, ఉబైడ్ షా, ఉసమా మీర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లహోర్.. పెషావర్ బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. పెషావర్ బౌలర్లలో స్పిన్నర్లు మైఖల్ బ్రేస్వెల్, సుఫియన్ ముఖియమ్ తలా మూడు వికెట్లతో లహోర్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు షోర్ఫుల్ ఇస్లాం, అమీర్ జమీల్ ఓ వికెట్ సాధించారు.చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఎప్పుడంటే?
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి ప్రపంచస్ధాయి బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. వైభవ్ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు.దీంతో వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ 200 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసల వర్షం కురిపించాడు."వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఇంత చిన్న వయసులో ఇలాంటి టాలెంట్ను చూడడం ఇదే తొలిసారి. అతి పిన్న వయస్కుడిగా టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి వైభవ్ కచ్చితంగా అర్హుడు" అని ధుమాల్ ఎక్స్వేదికగా కొనియాడాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే తన 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు అర్హత సాధించాడు.ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత జట్టు రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్కు వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశముంది. వైభవ్ ప్రదర్శనలను అజిత్ అగార్కర్ అండ్ కో నిశితంగా పరిశీలిస్తోంది.ఒకవేళ త్వరలో జరగనున్న ఐర్లాండ్ సిరీస్కు వైభవ్ ఎంపికైతే, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ ఆల్-టైమ్ రికార్డును వైభవ్ తిరగరాసే అవకాశం ఉంది. టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.చదవండి: ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (ఏప్రిల్ 11) జరుగుతున్న మ్యాచ్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో ఐపీఎల్ చరిత్రలో 20 లోపు బంతుల్లో 5 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తన ఐపీఎల్ కెరీర్లో 16 బంతుల్లో ఓసారి.. 18 బంతుల్లో రెండు సార్లు, 19 బంతుల్లో మరో రెండు సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు.ఈ విభాగంలో అభిషేక్ తర్వాతి స్థానంలో నికోలస్ పూరన్ ఉన్నాడు. పూరన్ 4 సార్లు ఐపీఎల్లో 20 లోపు బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. అభిషేక్, పూరన్ తర్వాతి స్థానాల్లో జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (3), వైభవ్ సూర్యవంశీ (3) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ తీశారు.
వైభవ్ మరో 'చరిత్ర'
రాజస్థాన్ రాయల్స్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026 ఎడిషన్లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తన జట్టుకు తిరుగులేని విజయాన్నందించిన వైభవ్.. ఈ ఎడిషన్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో (15 ఏళ్లు) ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.గతంలో ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ పేరిట ఉండేది. సాయి 23 ఏళ్ల 231 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. వైభవ్, సాయి తర్వాతి స్థానాల్లో శుభ్మన్ గిల్ (23 ఏళ్ల 263 రోజులు), రుతురాజ్ గైక్వాడ్ (24) ఉన్నారు.ఈ ఏడిషన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన వైభవ్ 266.67 స్ట్రయిక్రేట్తో 50 సగటున 2 హాఫ్ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 18 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్లో వైభవ్ చేసిన రెండు అర్ద సెంచరీలు 15 బంతుల్లోనే (సీఎస్కే, ఆర్సీబీ) చేయడం మరో విశేషం. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో టాప్-3 రన్ స్కోరర్లు రాయల్స్ ఆటగాళ్లే (వైభవ్ (200), జైస్వాల్ (183), జురెల్ (176)) కావడం మరో విశేషం.ఇదిలా ఉంటే, గత ఎడిషన్లో (2025) 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వైభవ్ మరిన్ని రికార్డులపై కన్నేశాడు. వైభవ్ ప్రస్తుతమున్న జోరును కొనసాగిస్తే ఈ సీజన్లో చాలా అల్టైమ్ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అతి చిన్నవయసులో ఐపీఎల్ అరంగేట్రంతో పాటు ఐపీఎల్ చరిత్రలో భారత ఆటగాడిచే అత్యంత వేగవంతమైన సెంచరీ (35) రికార్డులు కలిగిన వైభవ్.. ఈ సీజన్లో ఓవరాల్గా (ఐపీఎల్ చరిత్రలో) ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది.
సన్రైజర్స్పై పంజాబ్ గెలుపు
సన్రైజర్స్పై పంజాబ్ గెలుపుసన్రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్ కింగ్స్.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్10.2వ ఓవర్- 128 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్లో అనికేత్ వర్మ (11)కు క్యాచ్ ఇచ్చి కూపర్ కన్నోల్లీ (11) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్6.2వ ఓవర్- 99 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్లో నితీశ్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (57) ఔటయ్యాడు. ధీటుగా బదులిస్తున్న పంజాబ్220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ధీటుగా బదులిస్తుంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (51), ప్రభ్సిమ్రన్ (41) చెలరేగి ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 93-0గా ఉంది. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్20 ఓవర్లలో 218-6 (అభిషేక్ శర్మ (74), ట్రవిస్ హెడ్ (38), ఇషాన్ కిషన్ (27), క్లాసెన్ (39), అనికేత్ వర్మ (18)).మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్13.6వ ఓవర్-169 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (27) ఔటయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్అప్పటిదాకా పరుగుల వరద పారించిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ఒకే ఓవర్లో ఔటైపోయారు.ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల ఊచకోతటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 84 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (59), ట్రవిస్ హెడ్ (18) శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అభిషేక్ పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. కేవలం18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెడ్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు రఫ్ఫాడిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్-సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ముల్లాన్పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ రెండు మార్పులు చేయగా.. పంజాబ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఎస్ఆర్హెచ్ తరఫున లివింగ్స్టోన్ స్థానంలో సలీల్ అరోరా బరిలోకి దిగుతున్నాడు. అలాగే ప్రఫుల్ హింజ్ (ఉనద్కత్ స్థానంలో) అరంగేట్రానికి సిద్దమయ్యాడు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, హర్ప్రీత్ బ్రార్సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగఇంపాక్ట్ సబ్స్: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్స్టోన్, శివమ్ మావి, ప్రఫుల్ హింగే, కమిందు మెండిస్
చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..?
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేసి రాయల్స్కు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో వైభవ్ చేసిన ఓ పని అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది.మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైభవ్ డగౌట్లో కూర్చొని జట్టు మేనేజర్ రోమీ భిందర్తో కలిసి మొబైల్ ఫోన్ చూస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరలైంది. బీసీసీఐ నియమాల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతుండగా మొబైల్ చూడరాదు, వాడరాదు. మేనేజర్కు ఈ విషయంలో వెసులుబాటు ఉన్నా, అతనికి కూడా డగౌట్లో మొబైల్ వాడే పర్మిషన్ లేదు. మేనేజర్కు డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఫోన్ వినియోగించే వెసులుబాటు ఉంది.ఇప్పుడు డగౌట్లో మొబైల్ వాడినందుకు మేనేజర్తో పాటు వైభవ్ కూడా చిక్కుల్లో పడినట్లైంది. వైభవ్ స్వతహాగా మొబైల్ వాడనప్పటికీ, దానివైపు చూస్తున్నట్లు సోషల్మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మేనేజర్తో పాటు వైభవ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాడేమో చూడాలి.ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ నియమాలు (PMOA – Minimum Standards for Players and Match Officials Areas) ఇలా ఉన్నాయి.- మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ డివైజ్లు డగౌట్లో అనుమతించబడవు. - టీమ్ మేనేజర్ డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఫోన్ వాడవచ్చు, డగౌట్లో కాదు. - అనలిస్టులు కంప్యూటర్లు వాడవచ్చు, కానీ కేవలం ప్రత్యేకంగా కేటాయించిన అనలిస్ట్ టేబుల్ వద్ద మాత్రమే. - ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ స్టేడియంలోకి వచ్చిన వెంటనే తమ డివైజ్లను ఆఫ్ చేసి సురక్షితంగా భద్రపరచాలి. - అటెండెంట్స్, క్యాటరింగ్ వర్కర్స్ వంటి సిబ్బంది కూడా కమ్యూనికేషన్ డివైజ్లు తీసుకురావడానికి అనుమతి లేదు.
సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పెను సంచలనం నమోదైంది. భారత యువ షట్లర్ అయుష్ శెట్టి ప్రపంచ నంబర్ 1 షట్లర్ కున్లావుట్ విటిడ్సార్న్ (థాయ్లాండ్)ను మట్టికరిపించి చరిత్ర సృష్టించాడు. కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుష్.. ఈ టోర్నీ సెమీస్లో కున్లావుట్పై 10-21, 21-19, 21-17 తేడాతో గెలిచి పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా భారత తరఫున ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్కు (సింగిల్స్) చేరిన రెండో పురుష షట్లర్గా (దినేశ్ ఖన్నా (1965), ఓవరాల్గా మూడో భారత షట్లర్గా రికార్డుల్లోకెక్కాడు.75 నిమిషాల పాటు సాగిన సెమీస్లో ఆయుష్ మొదటి గేమ్ కోల్పోయినా, ఆతర్వాత అద్భుత పోరాటపటిమతో వరుసగా రెండు సెట్లు గెలిచి గేమ్ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆయుష్.. షి యు కీ (చైనా), చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో తలపడతాడు. అయుష్ 2023 వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన తర్వాత వార్తల్లోకెక్కాడు.
భారత మహిళల పంచ్ అదుర్స్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్...
సింధు పరాజయం... క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్...
భారత్కు రెండో ఓటమి
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియాని...
కాంస్యాలు గెలిచిన హన్సిక, నేహా
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లిం...
వైభవ్ మరో 'చరిత్ర'
రాజస్థాన్ రాయల్స్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవ...
సన్రైజర్స్పై పంజాబ్ గెలుపు
సన్రైజర్స్పై పంజాబ్ గెలుపుసన్రైజర్స్పై 6 వికె...
చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..?
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ...
‘భారత్ వ్యతిరేక సెంటిమెంట్తో కొంపముంచిన నిర్ణయం’
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ సమయంలో బంగ్లాదేశ్...
క్రీడలు
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
వీడియోలు
ఎవడైతే నాకేంటి .. I DONT CARE
15 ఏళ్ల కుర్రాడు ..15 బంతుల్లో RCB కి చుక్కలు చూపించాడు
RCB కి చుక్కలు చూపించాడు.. ఈ బుడ్డోడి కొట్టుడికి కోహ్లి రియాక్షన్ చూస్తే
చుక్కలు చూపించిన బుడోడు.. బిత్తరపోయిన కోహ్లి!
వైభవ్ విధ్వంసం.. బుడ్డోడు బాదుడే బాదుడు
టీమిండియాలో దక్కని చోటు..!వైభవ్, ఆయుష్ మాత్రే కు షాకిచ్చిన BCCI
ఉత్కంఠ పోరులో లక్నో విజయం
మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?
కేకేఆర్ ఫ్యాన్స్ ఫైర్.. స్పందించిన అయ్యర్ సోదరి
పరుగు తేడాతో బోణీ కొట్టిన GT
