ప్రధాన వార్తలు
టీమ్లకు గాయాల బెడద.. స్టార్ ప్లేయర్లు దూరం?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు జట్లకు గాయాల బెడద మొదలైంది. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లు తమ కీలక ఆటగాళ్లను కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యే అవకాశమున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.కేకేఆర్కు డబుల్ షాక్..!ఈ ఏడాది సీజన్కు ముందు మూడు సార్లు ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ మోకాలి గాయం సర్జరీ కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఆకాశ్ మధ్వాల్ లేదా చేతన్ సకారియాను తీసుకునే అవకాశముంది.మరోవైపు వేలంలో రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరాన సైతం పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. అతడు కూడా ఈ ఏడాది సీజన్లో ఆడేది అనుమానమే. అంతేకాకుండా రాజకీయ ఉద్రిక్తల కారణంగా బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను కూడా కేకేఆర్ కోల్పోవల్సి వచ్చింది. అయితే అతడి స్దానంలో జింబాబ్వే స్పీడ్ గన్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి తీసుకున్నారు.ఆర్సీబీ ఆందోళనఈ టోర్నీ ఫస్ట్ హాఫ్కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్, ఆర్సీబీ కీలక బౌలర్ జోష్ హాజిల్వుడ్ కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. హేజిల్వుడ్ ప్రస్తుతం పక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకున్న పేసర్ యశ్ దయాల్ ఆడడంపై కూడా సందిగ్ధం నెలకొంది. ఓ మహిళ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యశ్ మోసం చేశాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.కెప్టెన్ సాబ్ వస్తాడా?సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ప్యాట్ కమ్మిన్స్ అందుబాటుపై కూడా ఇంకా క్లారిటీ లేదు. కమ్మిన్స్ గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ సమయానికి తను పూర్తిగా కోలుకుంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమ్మిన్స్ తెలిపాడు.అదేవిధంగా మరో ఆసీస్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. అంతేకాకుంగా గత సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున దుమ్ములేపిన శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ సైతం గాయంతో పోరాడుతున్నాడు. అతడు కూడా టీ20 వరల్డ్కప్కు దూరమయ్యాడు.న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ ఆడమ్ మిల్నే కూడా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో రూ.2.25 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ వనిందు హసరంగా కూడా ఈ జాబితాలో ఉన్నాడు.గాయం కారణంగా పొట్టి ప్రపంచకప్ మధ్యలోనే వైదొలిగాడు. సీఎస్కే యువ ఆటగాడు ప్రశాంత్ వీర్ అందుబాటుపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. మార్చి 28 నుంచి ఐపీఎల్-19వ సీజన్ ప్రారంభం కానుంది.చదవండి: ఐపీఎల్ సృష్టికర్త రీ ఎంట్రీ!?
ఐపీఎల్ సృష్టికర్త రీ ఎంట్రీ!?
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ.. తిరిగి ఈ క్యాష్ రిచ్ లీగ్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి పాలకమండలి సభ్యునిగా కాకుండా.. ఓ జట్టు సహా యజమానిగా రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో మోదీ భాగస్వామిగా చేరేందుకు ఆసక్తి చూపుతున్నాండంట. రాజస్తాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బడాలే జట్టులోని తన వాటాను విక్రయించేందుకు సిద్దమయ్యాడు. రాయల్స్లో ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ ఆధినేత అయిన మనోజ్ బడాలే 65 శాతం వాటాను కలిగి ఉన్నాడు.మరో 35 శాతం వాటాను గెర్రీ కార్డినాల్(15 శాతం) , లాచ్లాన్ ముర్డోక్(13), కల్ సోమాని, టైగర్ గ్లోబల్, సంస్థ కలిగి ఉన్నాయి. అయితే లలిత్ మోదీ ఇప్పటికే మైనారిటీ వాటా కలిగిన కల్ సోమానితో కలిసి బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.ఈ విక్రయానికి సంబంధించి మార్చి 16న లండన్లో కీలకమైన చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో మోదీ,సోమాని బృందం పాల్గొనే అవకాశం ఉంది. కాగా లలిత్ మోదీపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఒకవేళ అతడు రాజస్తాన్ జట్టును కొనుగోలు చేయాలంటే కచ్చితంగా కచ్చితంగా ప్రభుత్వం, బీసీసీఐ నుంచి అడ్డంకులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఇక రాజస్తాన్ జట్టును కొనుగోలు చేయాలంటే సుమారు రూ.9,200 కోట్ల నుండి రూ. 11,000 కోట్లు వరకు వెచ్చించాలి. రాయల్స్ జట్టును కొనుగోలు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఇంటర్నెట్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.చదవండి: Gautam Gambhir: అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు
'అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు'
ఢిల్లీలో బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక( ‘నమన్ అవార్డ్స్-2026’) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గతేడాది నుంచి ఇప్పటివరకు ఐసీసీ టైటిల్స్ గెలిచిన భారత సీనియర్, జూనియర్ జట్లను బీసీసీఐ సత్కరించింది. ఇందులో వన్డే వరల్డ్కప్-2026 గెలిచిన మహిళల జట్టు, 2026 టీ20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సీనియర్ పురుషుల జట్టు, అండర్-19 ప్రపంచకప్-2026, ఉమెన్స్ అండర్-19 వరల్డ్కప్ గెలిచిన జట్లు ఉన్నాయి.అదేవిధంగా భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్కు అత్యున్నత పురస్కారం ‘కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రాధానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత పురుషల జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు వరల్డ్కప్ హీరోలు సందడి చేశారు. ఈ సందర్భంగా టీ20 వరల్డ్కప్లో ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.సంజు సామ్సన్ ఒక్కసారి చెలరేగడం మొదలు పెడితే ఆరు ఓవర్లలోనే మ్యాచ్ను గెలిపించగలడని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్లను నిలువరించే వ్యూహంలో భాగంగా కాకుండా... విధ్వంసకర రీతిలో ఆడే మరో బ్యాటర్ కావాలనే శాంసన్కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లు అతను వెల్లడించాడు. "సంజు మెరుపు బ్యాటింగ్ శైలిపై మాకు ఎలాంటి సందేహాలు లేవు. అతను ఏం చేయగలడో మాకు బాగా తెలుసు.ఒక్కసారి జోరు మొదలైతే ఆరు ఓవర్లలో మ్యాచ్ గెలిపించగలడు. జిమ్లో కలిసి వర్కౌట్ చేస్తున్నప్పుడే జింబాబ్వేతో మ్యాచ్లో నువ్వు ఆడుతున్నావని చెప్పాను. టాప్–3 ఎడంచేతి బ్యాటర్లు ఉన్నారు కాబట్టి మార్పు కోసం శాంసన్ను మళ్లీ ఆడించామని కొందరు చేస్తున్న విశ్లేషణలు తప్పు. టాపార్డర్లో చెలరేగిపోయే మరో బ్యాటర్ ఉంటే బాగుంటుందని భావించే శాంసన్ను తీసుకొచ్చాం" అని గంభీర్ స్పష్టం చేశాడు.చదవండి: బంగ్లాదేశ్దే వన్డే సిరీస్
‘ఇది ఆరంభం మాత్రమే’
న్యూఢిల్లీ: భారత జట్టు వచ్చే కొన్నేళ్లలో అన్ని విధాలుగా ప్రపంచ క్రికెట్ను శాసిస్తుందని బ్యాటర్ సంజు సామ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన జట్టు చూపిస్తున్న ప్రదర్శన అన్ని చోట్లా పునరావృతమవుతుందని అతను అన్నాడు. 321 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సామ్సన్... భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మన దేశంలో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరిని చూస్తే మన విజయపరంపర కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో మరింత గొప్ప ఆటను మన క్రికెటర్ల నుంచి చూడవచ్చు. ఇటీవల వరల్డ్ కప్ విజయం ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని విజయాలు దక్కడం ఖాయం’ అని ఆదివారం జరిగిన బీసీసీఐ వార్షిక పురస్కారాల సందర్భంగా సామ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరిందని అతను ఉద్వేగంగా చెప్పాడు. ‘ఎవరికైనా పెద్ద కలలు ఉంటాయి. అయితే అవి అంత సులువుగా నిజం కావు. రెండేళ్ల క్రితమే దేశానికి ప్రపంచ కప్ను అందించాలని అనుకున్నా.నేను బలంగా కోరుకున్న సమయంలో ఒక్కసారిగా కెరీర్లో ఇబ్బందులు వచ్చాయి. మానసికంగా సమస్యల్లో ఉన్నా. కానీ జట్టుకు నేను అవసరమై పిలుపు వచ్చినట్లుగా మళ్లీ అవకాశం దక్కింది. టీమ్లో ప్రతీ ఒక్కరి నేను బాగా ఆడాలని, జట్టుకు ఉపయోగపడాలని కోరుకున్నారు. దాంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగా. ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగి నిజంగా మారింది’ అని సామ్సన్ వివరించాడు. ప్రతిభ ఫలితాలను ఇస్తోంది: ద్రవిడ్వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్ను గెలుచుకున్న భారత జట్టును మాజీ కెప్టెన్ , రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించాడు. గత మూడు దశాబ్దాల్లో మన క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించి అత్యుత్తమ స్థాయికి చేరిందని అతను అభిప్రాయపడ్డాడు. మన దేశంలో ప్రతిభకు ఏనాడూ కొదవ లేదని, ఇప్పుడు అలాంటి ప్రతిభ ఫలితాలను అందించడం సంతోషంగా ఉందని ద్రవిడ్ అన్నాడు. భారత్ ఇటీవల వరుసగా సీనియర్, అండర్–19 విభాగాల్లో కలిసి ఐదు ఐసీసీ టోర్నీల్లో గెలుచుకున్న విషయాన్ని ‘ది వాల్’ గుర్తు చేశాడు. ‘మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎప్పుడూ కొరత లేదు. మైదానం బయట వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ బోర్డు అందించింది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో పాటు మంచి కోచ్లు, సరైన పరిపాలకులు ఉన్నారు. జూనియర్ స్థాయిలో, దేశవాళీ క్రికెట్లో మెరుగైన వ్యవస్థ ఉంది. కానీ కొన్నిసార్లు మైదానంలో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అద్భుతంగా సాగుతోంది. ప్రతిభకు తగిన విధంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల టి20 వరల్డ్ కప్ను చూస్తే మన జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగింది. ఈ ఒత్తిడి, సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్, గంభీర్ బృందం దానిని చేసి చూపించింది’ అని ద్రవిడ్ విశ్లేషించాడు. సామ్సన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ద్రవిడ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్సన్ వరల్డ్ కప్ చివరి మూడు మ్యాచ్లలో ఆడిన తీరు అసాధారణం. సుదీర్ఘ కాలంగా అతను టీమ్లో ఉన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినా మరికొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అలాంటి ఆటగాడు భారత్కు ఎంతో అవసరమైన కీలక సమయంలో సత్తా చాటి విజయంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని అతను స్పందించాడు.
ఉల్లాసంగా... ఉత్సాహంగా...
న్యూఢిల్లీ: సీనియర్, జూనియర్, పురుషులు, మహిళలు, మాజీలు... భారత క్రికెటర్లంతా ఒక్క చోట చేరే బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్ –2026’ ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు ఐసీసీ టైటిల్స్ గెలిచిన వేర్వేరు జట్లను బోర్డు సత్కరించగా... గత ఏడాది వ్యక్తిగత ప్రదర్శనలకుగాను క్రికెటర్లు అవార్డులు అందుకున్నారు. భారత క్రికెట్కు సేవలు అందించిన మాజీ ఆటగాళ్లు రోజర్ బిన్నీ, రాహల్ ద్రవిడ్, మిథాలీ రాజ్లకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారం (కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ) లభించింది. పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ క్రికెటర్ అవార్డు టెస్టు, వన్డే కెపె్టన్ శుబ్మన్ గిల్కు దక్కింది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో 754 పరుగులు చేసి అటు బ్యాటర్గా, ఇటు కెపె్టన్గా గిల్ అత్యుత్తమ ఆటతీరు కనబర్చాడు. తనకు ఈ అవార్డు లభించడంలో సహచర ఆటగాళ్ల పాత్ర ఎంతో ఉందన్న గిల్ వారికి కృతజ్ఞతలు తెలిపాడు. మహిళల విభాగంలో స్మృతి మంధానకు ఉత్తమ క్రికెటర్ అవార్డు దక్కింది. స్మృతి దీనిని గెలుచుకోవడం ఐదోసారి కావడం విశేషం. 2025 వన్డే వరల్డ్ కప్ టోర్నీ టైటిల్ను భారత జట్టు సాధించడంలో స్మృతి (434 పరుగులు) కీలక పాత్ర పోషించింది. 2025లో ఆమె 1703 అంతర్జాతీయ పరుగులు చేసింది. 2026 టి20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సీనియర్ పురుషుల జట్టు, 2025లో వన్డే వరల్డ్ కప్ సాధించిన సీనియర్ మహిళల జట్టుతో పాటు అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన పురుషుల, మహిళల టీమ్లను బీసీసీఐ ప్రత్యేకంగా సత్కరించింది.ఇతర ప్రధాన అవార్డుల వివరాలుఅరంగేట్రంలో ఉత్తమ ప్రదర్శన: హర్షిత్ రాణా (పురుషులు–ఢిల్లీ), శ్రీచరణి (మహిళలు–ఆంధ్రప్రదేశ్) దేశవాళీ సీనియర్ మహిళల్లో ఉత్తమ క్రికెటర్: షఫాలీ వర్మ (హరియాణా) దేశవాళీ జూనియర్ మహిళల్లో ఉత్తమ క్రికెటర్: ఇరా జాదవ్ (ముంబై) రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్రౌండర్ (పురుషులు): హర్్ష దూబే (విదర్భ) దేశవాళీ వన్డే, టి20ల్లో ఉత్తమ ఆల్రౌండర్ (పురుషులు): ఆయుశ్ మాత్రే (ముంబై)
బంగ్లాదేశ్దే వన్డే సిరీస్
ఢాకా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్ జట్టు 2–1తో పాకిస్తాన్పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఆఖరి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా... రెండో మ్యాచ్లో పాకిస్తాన్ 128 పరుగుల తేడాతో నెగ్గింది. నిర్ణయాత్మక పోరులో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ చేజిక్కించుకుంది. కీలక మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్... నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జిద్ హసన్ (107 బంతుల్లో 107; 6 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీతో కదంతొక్కగా... తౌహిద్ హృదయ్ (48 నాటౌట్; 4 ఫోర్లు), లిటన్ దాస్ (41; 1 ఫోర్, 1 సిక్స్), సైఫ్ హసన్ (36; 3 ఫోర్లు) అతడికి సహకరించారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 50 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సల్మాన్ ఆగా (98 బంతుల్లో 106; 9 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో పోరాడగా... అబ్దుల్ సమద్ (34; 5 ఫోర్లు), సాద్ మసూద్ (38; 5 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాహిబ్జాదా ఫర్హాన్ (6), మాజ్ (6), రిజ్వాన్ (4) విఫలమయ్యారు. పాకిస్తాన్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు అవసరమైన దశలో రెండు సిక్స్లు కొట్టిన కెప్టెన్ షాహీన్ అఫ్రిది (38 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఆశలు రేపినా ఫలితం లేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా... ముస్తఫిజుర్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ ప్లేయర్లు ఘాజి ఘోరి, సాద్ మసూద్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశారు.
ఆంటోనెల్లి అదరహో
షాంఘై: ఈ ఏడాది ఫార్మాలావన్ (ఎఫ్1)లో మెర్సిడెస్ డ్రైవర్ల జోరు సాగుతోంది. సీజన్ ఆరంభ రేసు ఆ్రస్టేలియా గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రసెల్ విజేతగా నిలవగా... తాజాగా రెండో రేసు చైనా గ్రాండ్ప్రిలో అదే జట్టుకు చెందిన కిమీ ఆంటోనెల్లి అగ్రస్థానం దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్ రేసులో మెరుపు వేగంతో దూసుకెళ్లి... గ్రాండ్ప్రి రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించిన అతిపిన్న వయసు్కడిగా రికార్డు సృష్టించిన ఈ 19 ఏళ్ల డ్రైవర్... ఆదివారం ప్రధాన రేసులో సైతం అదే దూకుడు కొనసాగించాడు. 56 ల్యాప్ల ఈ రేసును ఆంటోనెల్లి అందరికంటే వేగంగా అందరికంటే ముందుగా 1 గంటా 33 నిమిషాల 15.607 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కెరీర్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఇటలీ డ్రైవర్... ఫార్ములావన్ చరిత్రలో ఒక రేసులో విజయం సాధించిన రెండో అతిపిన్న వయసు్కడిగా నిలిచాడు. 2016లో మ్యాక్స్ వెర్స్టాపెన్ 18 ఏళ్ల వయసులోనే రేసు నెగ్గాడు. జార్జ్ రసెల్ 1 గంట 33 నిమిషాల 21.122 సెకన్లతో రెండో స్థానం దక్కించుకోగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (1 గంట 33 నిమిషాల 40.874 సెకన్లు) మూడో స్థానంతో పోడియంపై చోటు దక్కించుకున్నాడు. 2024 తర్వాత ఫెరారీ డ్రైవర్ పోడియంపై నిలవడం ఇదే తొలిసారి. పదకొండేళ్ల ప్రాయం నుంచి రేసింగ్ చేస్తున్న ఆంటోనెల్లి... గతేడాదే మెర్సిడెస్ జట్టుతో చేరాడు. 2025 సీజన్లో దిగ్గజ డ్రైవర్ హామిల్టన్ మెర్సిడెస్ను వీడి ఫెరారీతో జట్టు కట్టడంతో అతడి స్థానాన్ని ఆంటోనెల్లి భర్తీ చేశాడు. ఇప్పుడు అతడినే వెనక్కి నెడుతూ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. చార్లెస్ లెక్లెర్క్ (1 గంట 33 నిమిషాల 44.501 సెకన్లు; ఫెరారీ), ఒలీవర్ బియర్మన్ (1 గంట 34 నిమిషాల 12.875 సెకన్లు; హాస్) వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లోనిలిచారు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ రేసును పూర్తి చేయలేకపోగా... గతేడాది వరుస విజయాలతో హోరెత్తించిన మెక్లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్, ఆస్కార్ పియాస్ట్రి సాంకేతిక కారణాలతో అసలు రేసులోనే పాల్గొనలేదు. మొత్తం 22 మంది డ్రైవర్లలో ఏడుగురు రేసును పూర్తి చేయలేకపోయారు.బహ్రెయిన్, సౌదీ అరేబియా రేసులు రద్దు పశి్చమాసియాలో యుద్ధం కొనసాగుతుండటంతో... ఈ సీజన్లో నాలుగో రేసు బహ్రెయిన్ గ్రాండ్ప్రి (ఏప్రిల్ 12న), ఐదో రేసు సౌదీ అరేబియా గ్రాండ్ప్రి (ఏప్రిల్ 19న)లను రద్దు చేస్తున్నట్లు ఫార్ములావన్ పాలక మండలి ఆదివారం ప్రకటించింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో... ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ప్రస్తుతానికి ఆ రెండు రేసులను నిలిపివేస్తున్నాం. భద్రతే అన్నిటికన్నా ముఖ్యం. ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఏప్రిల్ వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది.
అల్కరాజ్కు మెద్వెదెవ్ షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో మూడోసారి టైటిల్ సాధించాలని ఆశించిన ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 7–6 (7/3)తో టాప్ సీడ్ అల్కరాజ్ను ఓడించి ఈ టోర్నీలో మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ఏడాది అల్కరాజ్కిదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఆ్రస్టేలియన్ ఓపెన్, ఖతర్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్ ఈ ఏడాది 16 వరుస విజయాల తర్వాత తొలి పరాజయం చవిచూశాడు. 2023, 2024లలో ఈ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకున్న మెద్వెదెవ్ ఈసారి టైటిల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో తలపడతాడు.
రహానేకు మరోసారి అవకాశం!
ఐపీఎల్ 2025 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) దారుణ ప్రదర్శన కనబరిచింది. 14 మ్యాచ్ల్లో ఐదు విజయాలకు మాత్రమే పరిమితమయిన కేకేఆర్ 8వ స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో కేకేఆర్ కెప్టెన్గా అజింక్యా రహానే వ్యవహరించాడు. నాయకుడిగా జట్టును నడిపించడంలో విఫలైనప్పటికీ బ్యాటర్గా మాత్రం రహానే సూపర్ సక్సెస్అయ్యాడని చెప్పొచ్చు. 37 ఏళ్ల రహానే 13 మ్యాచ్లాడి 390 పరుగులు సాధించాడు. కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా రహానేనే కావడం విశేషం. గత సీజన్లో ఎక్కువగా వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన రహానే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడడం అలవాటు చేసుకున్నాడు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు సాధించే స్ట్రాటజీతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అందుకే ఈసారి కూడా రహానేకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే కృతనిశ్చయంతో కేకేఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో 13 రోజులు సమయం ఉండడంతో ఈలోగా కేకేఆర్ కెప్టెన్ పేరును ఖరారు చేయనుంది. అయితే రహానే ఈ సీజన్లోనూ వన్డౌన్లోనే బ్యాటింగ్కు రానున్నాడు. ఐపీఎల్లో రెండు పర్యాయాలు (2012, 2014) గంభీర్ సారధ్యంలో ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన కేకేఆర్ 2024లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో మూడో టైటిల్ అందుకుంది. అయితే అనూహ్యంగా గతేడాది సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వేలంలో శ్రేయస్ అయ్యర్ సహా పలు కీలక ఆటగాళ్లను వదులుకొని కేకేఆర్ మూల్యం చెల్లించుకుంది. కానీ ఈసారి మాత్రం ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో తమ బ్యాటింగ్ లైనప్ను బలోపేతం చేసుకుంది. ఇటీవలే టీ20 వరల్డ్కప్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ సహా టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, కామెరున్ గ్రీన్లను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే విదేశీ కోటాలో సునీల్ నరైన్, బ్లెస్సింగ్ ముజరబాని, రోవ్మెన్ పావెల్, పతిరానా ఉన్నారు. మరి ఇంతమందిలో ఎవరికి అవకాశం వస్తుందనేది చూడాలి. ఇక పేసర్ హర్షిత్ రాణా గాయంతో ఈ సీజన్కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ కేకేఆర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్తో ఆడనుంది.చదవండి: కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్ అతడే!
కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్ అతడే!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం లండన్లోనే మకాం పెట్టాడు. మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుండడంతో కోహ్లీ తన ప్రాక్టీస్ను ఇప్పటికే మొదలెట్టిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. తాజాగా కోహ్లీ తన బెస్ట్ టీ20 ఓపెనర్గా విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ను ఎంచుకున్నాడు. విషయంలోకి వెళితే బెస్ట్ టీ20 ఓపెనర్గా టీమిండియా నుంచి కానీ, అంతర్జాతీయ క్రికెటర్ల నుంచి ప్రస్తుత, మాజీల్లో ఎవరిని ఎన్నుకుంటారని విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రశ్న వేసింది. అయితే మొదట సచిన్, సెహ్వాగ్లలో ఎవరిని ఎన్నుకుంటారని అడగ్గా.. ‘టీ20 ఓపెనర్ కాబట్టి నా మొదటి ప్రాధాన్యత సెహ్వాగ్’ అని కోహ్లీ జవాబిచ్చాడు. ఆ తర్వాత ఫైనల్ చాయిస్లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ పేర్లు వచ్చాయి. కానీ ఇక్కడ కోహ్లీ రోహిత్ను కాదని ఆర్సీబీ మాజీ సహచర ఆటగాడు గేల్కే ఓటేశాడు. రోహిత్, సెహ్వాగ్ కూడా నా దృష్టిలో గొప్ప టీ20 ఓపెనర్లే అని పేర్కొన్నాడు. కానీ ఆర్సీబీ తరఫున ఆడేటప్పుడే ఓపెనర్గా గేల్ విధ్వంసాన్ని కళ్లారా చూశానని తెలిపాడు. ఆరంభం నుంచే బంతిని బౌండరీ లేదా సిక్సర్గా మలవాలన్న కోరిక గేల్లో బలంగా కనిపించేదదన్నాడు. అందుకే గేల్ టీ20ల్లో అత్యుత్తమ ఓపెనర్ అని చెప్పగలనని స్పష్టం చేశాడు. ఇక గతేడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్లో 267 మ్యాచ్ల్లో 132 స్ట్రైక్రేట్ తో 8,661 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలున్నాయి. 2025 సీజన్లో కోహ్లీ 15 మ్యాచ్ల్లో 657 పరుగులు సాధించాడు. గతేడాది ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో పంజాబా్ కింగ్స్పై విజయం సాధించి తొలిసారి టైటిల్ను ముద్దాడింది.చదవండి: ‘అభిషేక్ను అందుకే వెనుకేసుకొచ్చా’
ఇరాన్ ఆడకపోవడమే మంచిది.. ట్రంప్ వార్నింగ్!
మరో రెండు నెలల్లో ఫుట్బాల్ సాకర్ ఫీవర్ మొదలుకా...
భారత ఫుట్బాల్లో తీవ్ర విషాదం!
భారత్ ఫుట్బాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్బా...
క్వార్టర్స్కు సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ల...
ఫైనల్పై అమ్మాయిల గురి
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచకప్–2026కు ఇప్పటిక...
న్యూజిలాండ్పై సౌతాఫ్రికా ఘన విజయం
న్యూజిలాండ్ పర్యటనను సౌతాఫ్రికా ఘనంగా ఆరంభించింది...
కుప్పకూలిన న్యూజిలాండ్.. 91 పరుగులకే ఆలౌట్
మౌంట్ మౌంగానుయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న త...
న్యూ లుక్లో విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు టీమిండియా స్టార్, రా...
తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రి క...
క్రీడలు
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
వీడియోలు
ధోని, రోహిత్ తర్వాత శ్రీయాస్ అయ్యరే బెస్ట్ కెప్టెన్..
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
IPLపై నీలినీడలు.. గ్యాస్ కొరత, విమాన సమస్యలు తప్పవా?
క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
World Cup: తుఫాన్ బ్యాటింగ్.. ఫైనల్లో గెలుపుకు కారణం అతనే
