Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Suryakumar Yadav smashes fastest to 3,000 T20I runs record in final innings before T20 World Cup1
చ‌రిత్ర సృష్టించిన సూర్యకుమార్‌..

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో సూర్య మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఒకప్పటి సూర్యను గుర్తు చేశాడు. మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ ముంబైకర్‌.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో సూర్యకు ఇది మూడో అర్ధశతకం. రాయపూర్‌, గువహటి వేదికగా జరిగిన టీ20ల్లోనూ హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఏదేమైనప్పటికీ టీ20 ప్రపంచకప్‌కు ముందు సూర్యకుమార్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో టీమ్ మెనెజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య ఓ అరుదైన ఘనత సాధించాడు.అంతర్జాతీయ టీ20ల్లో బంతులు పరంగా అత్యంతవేగంగా 3000 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా సూర్య చ‌రిత్ర సృష్టించాడు. ఈ ఫీట్‌ను స్కై కేవలం 1822 బంతుల్లోనే సాధించాడు. ఇంతుకుముందు ఈ రికార్డు యూఏఈ ఆటగాడు ముహమ్మద్ వసీమ్(1947) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వసీంను సూర్య అధిగమించాడు. ఈ రికార్డును విరాట్‌ కోహ్లి (2169 బంతులు), రోహిత్ శర్మ (2149 బంతులు) వంటి దిగ్గజాల కంటే త్వరగా సూర్య అందుకోవడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 271 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు) అద్భుతమైన శతకంతో మెరిశాడు.

Ishan Kishans Sensational Ton Propels India To 271-5 vs NZ2
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్‌ టార్గెట్‌ 272

తిరువ‌నంత‌పురం వేదిక‌గా న్యూజిలాండ్ జ‌రుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 271 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. సంజూ శాంస‌న్ ఆరంభంలోనే ఔటైన‌ప్ప‌టికి మిగితా బ్యాట‌ర్లు మాత్రం కివీస్ బౌల‌ర్ల‌ను ఉతికారేశారు.వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో మెరిశాడు. సంజూ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన ఇషాన్ ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై భారీ షాట్ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఓవ‌రాల్‌గా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్‌.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అత‌డితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్‌(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), అభిషేక్‌ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు, శాంట్నర్‌, జేమిసన్‌, డఫీ తలా వికెట్ సాధించారు.

India vs New Zealand 5th T20I: Ishan Kishan Slams 1st Ton In 42 Balls,3
ఇషాన్‌ కిషన్‌ ఊచకోత.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో వీర విహారం

తిరువ‌నంత‌పురం వేదిక‌గా న్యూజిలాండ్ జ‌రుగుతున్న ఐదో టీ20లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ విధ్వంసం సృష్టించాడు. గ్రీన్ ఫీల్డ్ మైదానం‍లో కిషన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. బౌలర్ ఎవరైనా తనకు తెలిసింది హిట్టింగ్ ఒక్కటే అన్నట్లగా కిషన్ ఇన్నింగ్స్ కొనసాగింది.ఈ క్రమంలో కిషన్ కేవలం 42 బంతుల్లోనే తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్‌.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అతడి మెరుపు బ్యాటింగ్‌కు ప్రత్యర్ధి ప్లేయర్లు సైతం ఫిదా అయిపోయారు.అత‌డితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్‌(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), అభిషేక్‌ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) దూకుడుగా ఆడారు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 271 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

Sanju Samson Fails In First Game In Front Of Home Fans4
తీరు మార‌ని సంజూ శాంస‌న్‌.. హోం గ్రౌండ్‌లోనూ

టీ20 వరల్డ్‌కప్‌-2026కు ముందు టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో కూడా సంజూ దారుణ ప్రదర్శన కనబరిచింది. సొంత ప్రేక్షకుల ముందు శాంసన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయ్యాడు.6 బంతులు ఎదుర్కొన్న శాంసన్‌ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో జాకబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజూ ఔటయ్యాడు. ఈ సిరీస్ మొత్తంగా శాంస‌న్ కేవ‌లం 46 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో అత‌డిని నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.తిల‌క్ వ‌ర్మ పున‌రాగ‌మ‌నం చేస్తే తుది జ‌ట్టులో సంజూ స్ధానం గ‌ల్లంతే అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాయం కార‌ణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ.. త్వ‌ర‌లోనే జ‌ట్టులో చేర‌నున్నాడు. తిల‌క్ జ‌ట్టులోకి వ‌స్తే ఇషాన్ కిష‌న్ లేదా సంజూ శాంస‌న్‌లో ఎవ‌రో బెంచ్‌కే ప‌రిమిత‌మ‌వ్వాలి. అయితే ఇషాన్ త‌న రీఎంట్రీలో స‌త్తాచాటుతున్నాడు. శాంస‌న్ కంటే ఈ జార్ఖండ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెన‌ర్‌గా కూడా కిష‌న్‌కు మంచి రికార్డు ఉంది. ఈ నేప‌థ్యంలో సంజూపై వేటు ప‌డ‌డం ఖాయ‌మ‌న్పిస్తోంది. ఇషాన్‌ కిష‌న్.. అభిషేక్‌తో కలిసి భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవ‌కాశ‌ముంది.అంతకుముందు శుభ్‌మన్‌ గిల్‌ టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సంజూను బెంచ్‌కే పరిమితం చేశారు. ఆసియాకప్‌, సౌతాఫ్రికా సిరీస్‌లో ఇదే సీన్‌ రిపీట్‌ అయింది. దీంతో టీమ్‌మెనెజ్‌మెంట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో గిల్‌ను టీ20ల నుంచి తప్పించి మళ్లీ ఓపెనర్‌గా శాంసన్‌కు అవకాశమిచ్చారు. కానీ తనకు వచ్చిన ఛాన్స్‌ను ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఉపయోగించుకోలేకపోయాడు.

IND vs NZ LIVE, 5th T20I: India opt to bat, Axar Patel return5
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. స్టార్‌ ప్లేయర్‌ రీఎంట్రీ

తిరువనంతపురం వేదికగా ఐదో టీ20లో భారత్‌-న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ ఆఖరి పోరులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.అదేవిధంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్‌, వరుణ్ చక్రవర్తిలు కూడా పునరాగమనం చేశారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి టీమ్‌మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. తన సొంతమైదానంలో సంజూ సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు కివీస్ ఏకంగా తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. లాకీ ఫెర్గూసన్‌, అలెన్‌, నీషమ్‌,జాకబ్స్ జట్టులోకి వచ్చారు.తుది జ‌ట్లున్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీభారత్‌: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్(వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

Sam Curran hat-trick Helps England win in rain-shortened series opener6
సామ్ కరన్ హ్యాట్రిక్‌.. శ్రీలంక‌పై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు ముందు ఇంగ్లండ్ జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. శుక్ర‌వారం ప‌ల్లెకెలె వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో 11 ప‌రుగుల తేడాతో(డ‌క్ వ‌ర్త్ లూయిస్‌) ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. తొలుత వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను 17 ఓవ‌ర్లకు కుదించారు. ఈ క్ర‌మంలో మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 16.2 ఓవ‌ర్ల‌లో 133 ప‌రుగుల‌కు ఆలౌటైంది.శ్రీలంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ మెండిస్(37) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. పాతుమ్ నిస్సంక (23), ష‌న‌క‌(20) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సామ్ కరన్ హ్యాట్రిక్ వికెట్ల‌తో మెరిశాడు. 16 ఓవ‌ర్ వేసిన క‌ర‌న్ దాసున్ షనక, మహీష్ తీక్షణ, మతీష పతిరాణ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచాడు.అత‌డితో పాటు అదిల్ ర‌షీద్ మూడు, డాస‌న్ రెండు, ఓవ‌ర్ట‌న్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంత‌రం ల‌క్ష్య చేధ‌నలో ఇంగ్లండ్ 15 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అయితే 15 ఓవర్ల తర్వాత భారీ వర్షం పడటంతో ఆట సాధ్యం కాలేదు.అప్పటికే డక్‌వర్త్ లూయిస్ పార్ స్కోర్ కంటే ఇంగ్లండ్ 11 పరుగులు ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (46) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. టామ్ బాంటన్ (29), బ‌ట్ల‌ర్‌(17) రాణించాడు. శ్రీలంక బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ రెండు వికెట్లు సాధించాడు.

If I Take Virat Kohli's Wicket, I Will Touch His Feet: Vishal Nishad7
విరాట్ కోహ్లి వికెట్ తీస్తే.. ఏం చేస్తానంటే?

ఐపీఎల్‌-2026లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ స్పిన్నర్ విశాల్‌ నిషాద్‌ సత్తాచాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నిషాద్‌ను రూ. 30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన అనుభవం లేనప్పటికి అతడిపై పంజాబ్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది.అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నిషాద్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. 2024 యూపీ టీ20 ప్రిమియర్‌ లీగ్‌ విశాల్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో గోరఖ్‌పూర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.గతేడాది సీజన్‌లో అతడు ఐపీఎల్‌లో ఆడుతాడని అంతా భావించారు. కానీ దురుదృష్టవశాత్తూ అప్పుడు అవకాశం​ లభించలేదు. అయితే ఇప్పుడు మాత్రం పంజాబ్ కింగ్స్ సువర్ణ అవకాశం కల్పించింది. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిషాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనకు రోల్‌మోడల్ అని అతడు చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లి నాకు ఆదర్శం. అతడు ఆడే ఫియర్ లెస్ క్రికెట్‌, కవర్ డ్రైవ్ షాట్లు నాకెంతో ఇష్టం. ఒకవేళ నేను కోహ్లి వికెట్ తీస్తే, సెలబ్రేషన్స్ చేసుకోను. అతడు నా రోల్ మోడల్ కాబట్టి నేరుగా వెళ్లి తన పాదాలకు నమస్కరిస్తాను. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్దాయికి చేరుకున్నాను. మా నాన్నతో పాటు పనికి వెళ్లేవాడిని. ఒకనొక సమయంలో క్రికెట్ వదిలేయాలని కూడా అనుకున్నాను. క్రికెటర్ కావడం చాలా కష్టమని, వేరే ఏదైనా వర్క్ చేసుకోమని మా అమ్మ సూచించింది. కానీ నేను మాత్రం నా ఆశయాన్ని వదులుకోలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధిస్తాను అని మా అమ్మతో అన్నాను. ఆ తర్వాత నా కుటంబం కూడా సపోర్ట్ చేసింది. అందరి సహకరంతో ఇప్పుడు నా కలను నేరవేర్చుకున్నా అని 20 ఏళ్ల నిషాద్ పేర్కొన్నాడు.

PCB cancel Pakistan kit launch event, raises doubts over T20 World Cup participation8
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడేది డౌటే?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు రంగం సిద్ద‌మైంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి భార‌త్, శ్రీలంక వేదిక‌ల‌గా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా? లేదా అన్నది? ఇంకా క్లారిటీ లేదు. ఓ వైపు వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం త‌మ జ‌ట్టును శ్రీలంక‌కు పంపేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని ర‌కాల ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌గా.. మ‌రోవైపు ప్ర‌భుత్వ‌ అనుమతి కోసం ఇంకా పీసీబీ ఎదురు చూస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గుతోంది.ఒక‌వేళ ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వ‌స్తే ఫిబ్ర‌వ‌రి 2న శ్రీలంక‌కు పాక్ ప‌య‌నం కానుంది. అయితే ఈ మెగా టోర్నీ కోసం త‌మ కొత్త జెర్సీని ఆసీస్‌తో రెండో టీ20 సంద‌ర్భంగా విడుద‌ల చేస్తామ‌ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుగా ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు త‌మ జెర్సీ కిట్ లాంచ్‌ కార్య‌క్ర‌మాన్ని పీసీబీ ర‌ద్దు చేసింది.ఇందుకు ప్రధాన కారణం పాక్ ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి లభించకపోవడమేనని తెలుస్తోంది. పాక్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొన‌డంపై తుది నిర్ణయం సోమవారం(ఫిబ్ర‌వ‌రి 2) వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ ఇప్ప‌టికే త‌ప్పుకొన్న సంగ‌తి తెలిసిందే.అయితే బంగ్లాదేశ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తూ పీసీబీ కూడా టోర్నీని బ‌హిష్క‌రిస్తుమ‌ని ఉడత బెదరింపులకు దిగింది. కానీ ఐసీసీ జోక్యం చేసుకోవడంతో పీసీబీ వెనుక్కి తగ్గింది. కానీ టోర్నీలో పాల్గోనడంపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది.వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీకి పాక్ జ‌ట్టు ఇదేసల్మాన్ అఘా (కెప్టెన్‌), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మహ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్‌

I Lied: Brook Makes Shocking Admission Over Nightclub Incident9
ఆరోజు అందుకే అబద్ధం చెప్పాను: హ్యారీ బ్రూక్‌

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ మాట మార్చాడు. నైట్‌క్లబ్‌ గొడవ విషయంలో గతంలో తాను అబద్ధం చెప్పినట్లు అంగీకరించాడు. సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే తాను ఆరోజు అలా మాట్లాడినట్లు తాజాగా స్పష్టం చేశాడు.దెబ్బలు తిన్న బ్రూక్‌గతేడాది ఇంగ్లండ్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మూడో వన్డేకు ముందు (అక్టోబరు 31 రాత్రి) హ్యారీ బ్రూక్‌ (Harry Brook) ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లాడు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మద్యం తాగాడనే అనుమానంతో ఓ బౌన్సర్‌ అతడిని అడ్డుకున్నాడు. దీంతో బ్రూక్‌ వాగ్వాదానికి దిగగా.. సదరు బౌన్సర్‌ అతడిని కొట్టినట్లు వార్తలు వచ్చాయి.హద్దుమీరి ప్రవర్తించానుఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత.. యాషెస్‌ టెస్టు సిరీస్‌ సమయంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘ఆరోజు నేను హద్దుమీరి ప్రవర్తించాను. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. నా ప్రవర్తన నా జట్టు, దేశానికి తలవంపులు తీసుకువచ్చింది.కెప్టెన్‌గా నాకు దక్కిన గౌరవానికి భంగం కలగకుండా ఇకపై ఇలాంటి తప్పులు చేయబోను’’ అని బ్రూక్‌ మీడియా ముఖంగా తెలియజేశాడు. ఆ సమయంలో నైట్‌క్లబ్‌కు తాను ఒక్కడినే వెళ్లినట్లు పేర్కొన్నాడు. అయితే, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు.. బ్రూక్‌కు రూ. 33 లక్షల మేర జరిమానా విధించింది. అంతేకాదు.. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.జేకబ్‌ బెతెల్‌, జోష్‌ టంగ్‌ కూడాఅయితే, ఈ విషయంపై టెలిగ్రాఫ్‌ తాజాగా ఓ కథనం ప్రచురించింది. బ్రూక్‌తో పాటు జేకబ్‌ బెతెల్‌, జోష్‌ టంగ్‌ కూడా ఉన్నారని.. వారికి కూడా ఫైన్‌ పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో శుక్రవారం నాటి తొలి టీ20లో విజయం తర్వాత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ స్పందించాడు.‘‘వెల్లింగ్‌టన్‌లో నా చర్యలకు నేనే పూర్తి బాధ్యత వహిస్తాను. ఆరోజు నాతో పాటు ఇతరులు కూడా ఉన్నారని నేను అంగీకరిస్తున్నా. గతంలో నేను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా.గుణపాఠాలు నేర్చుకుంటున్నాఅయితే, ఆరోజు నా సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే అలా అబద్ధం చెప్పాను. వారిని వివాదంలోకి లాగవద్దని భావించాను. ఈ విషయంలో నేను మళ్లీ క్షమాపణలు కోరుతున్నా. నా కెరీర్‌లో ఇప్పుడు కఠిన, సవాలుతో కూడిన దశ నడుస్తోంది. దీని నుంచి నేను ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటున్నా’’ అని హ్యారీ బ్రూక్‌ వెల్లడించాడు.చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌

Big Blow For Australia: Pat Cummins Ruled Out Of T20 WC 202610
T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడితో పాటు టాపార్డర్‌ బ్యాటర్‌ మాథ్యూ షార్ట్‌ కూడా అందుబాటులో లేకుండా పోయాడు.కమిన్స్‌ స్థానంలో అతడేకమిన్స్‌, షార్ట్‌ గాయాల నుంచి కోలుకోని కారణంగా టోర్నీకి దూరమైనట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) శనివారం ధ్రువీకరించింది. ఈ విషయం గురించి సెలక్టర్‌ టోనీ డోడ్‌మేడ్‌ మాట్లాడుతూ.. ‘‘వెన్నునొప్పి నుంచి కోలుకోవడానికి ప్యాట్‌ కమిన్స్‌కు ఇంకాస్త సమయం పడుతుంది. అందుకే టోర్నీలో పాల్గొనడం లేదు.కమిన్స్‌ స్థానంలో లెఫ్టార్మ్‌ పేసర్‌ బెన్‌ డ్వార్షుయిస్‌ను ఎంపిక చేశాము. ఫీల్డింగ్‌లో రాణించడంతో పాటు లోయర్‌ ఆర్డర్‌లో హిట్టింగ్‌ కూడా చేయగలడు. బంతి బాగా స్వింగ్‌ చేయగల బెన్‌ రాక పేస్‌ దళానికి మరింత వైవిధ్యం తీసుకువస్తుంది’’ అని తెలిపాడు.మాథ్యూ షార్ట్‌కు బదులు అతడేఅదే విధంగా.. మాథ్యూ షార్ట్‌ స్థానంలో మ్యాట్‌ రెన్షాను వరల్డ్‌కప్‌ జట్టులో చేర్చినట్లు టోనీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘‘ఆస్ట్రేలియా తరఫున వైట్‌బాల్‌ క్రికెట్‌లో, బిగ్‌బాష్‌ లీగ్‌లో రెన్షా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్‌లో అతడు జట్టుకు బలంగా మారుతాడు’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో ఆసీస్‌ ఈ మెగా టోర్నీ బరిలో దిగనుంది.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు (Updated)మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మ్యాట్‌ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement