ప్రధాన వార్తలు
దిగ్గజ క్రికెటరన్న గౌరవం లేదా?
హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ పాకిస్థాన్ క్రికెటర్లను కొనుగోలు చేయడంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ సన్రైజర్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాక్ ఆటగాళ్లకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణాలు తీస్తుందని వ్యాఖ్యానించారు. అయితే సునీల్ గావస్కర్ వ్యాఖ్యలను పాక్ సంతతికి చెందిన ఇంగ్లీష్ క్రికెటర్ అజీమ్ రఫిక్ ఖండించడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక దిగ్గజ క్రికెటర్ అనే కనీసం గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడి కొత్త వివాదానికి తెరలేపాడు. ‘సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవే. అసలు ఆయన మాట్లాడిన మాటలను ఎవరైనా అంగీకరించగలరా చెప్పండి? అయినా మీరు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్ని పరుగులు చేశారన్నది నాకు అనవసరం. కానీ సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు మాత్రం అర్థరహితం’ అని పేర్కొన్నాడు. అయితే అజీమ్ రఫిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం లేదన్న విషయం నిరూపించగలవా? అక్కడ నాన్ ముస్లింలనే లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించడం ఎంతవరకు సమంజసం’..‘భారత్పై పడి ఏడ్వడం మానండి. సునీల్ గావస్కర్ ఒక దిగ్గజ క్రికెటర్ అన్న కనీస మర్యాద కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. ఆయన అనుభవమంత వయసు కూడా నీకు లేదు. ముందు ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆ తర్వాత ఉపన్యాసాలు ఇవ్వొచ్చు’.. ‘పాక్ క్రికెటర్లు సుద్దపూసలైతే ఆసియా కప్లో ఆ జట్టు బోర్డు చైర్మన్ ప్రవర్తించిన తీరు సరైనదేనా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది?’ అని కామెంట్లు పెట్టారు.This is absolutely ridiculous & should be condemned ..How are these comments acceptable? I don’t care how many runs you have scoredVile stuff from Gavaskar https://t.co/sLYtUKmGnZ— Azeem Rafiq (@AzeemRafiq30) March 16, 2026చదవండి: క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్!
క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్!
క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్ వేసిన ఘనతను పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అసద్ అక్తర్ మూటగట్టుకున్నాడు. విషయంలోకి వెళితే.. పాకిస్థాన్ దేశవాలీ టీ20 క్రికెట్ పోటీల సందర్భంగా పెషావర్ వేదికగా కరాచీ బ్లూస్, లాహోర్ బ్లూస్కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కరాచీ బ్లూస్ తరఫున ఆడిన అసద్ అక్తర్ అతిపెద్ద నోబాల్ వేశాడు. క్రీజు లైన్ దాటిన అసద్ తన కాలిని చాలా ముందుకు పెట్టి బంతిని విసిరాడు. కావాలని విసిరాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ ఈ వింత నోబాల్ మాత్రం ఇప్పుడు వివాదంగా మారిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. అంతేకాదు ఇదే ఓవర్లో అసద్ రెండు నోబాల్స్, రెండు వైడ్స్ కలిపి మొత్తం 21 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. అయితే చాలా మంది అసద్ అక్తర్ వేసిన నోబాల్ను 2010లో ఇంగ్లండ్పై పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ వేసిన నోబాల్తో పోల్చుతున్నారు. అయితే అది స్పాట్ ఫిక్సింగ్లో భాగమని తర్వాత తేలడంతో ఆమిర్ సహా అప్పటి కెప్టెన్ సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్లపై ఐసీసీ నిషేధం విధించింది. ఈ ముగ్గురికీ తర్వాత జైలుశిక్ష కూడా పడింది. తాజాగా అసద్ అక్తర్ వేసిన నోబాల్తో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మరోసారి తెరమీదకు వచ్చింది. A 25 year old Pakistani pacer, Asad Akhtar, bowled a shocking no ball in their ongoing premium domestic T20 tournament and it looked ridiculously suspicious. Spot fixing again. pic.twitter.com/zFRzScLFLx— Kakarot (@MidOffMind) March 15, 2026ఈ ఘటన నేపథ్యంలో 2010 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం గురించి అబ్దుల్ రజాక్ ఓ పాకిస్థానీ టీవీ షోలో మాట్లాడుతూ కీలక విషయాలు బయటపెట్టాడు. ఆ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర ఒక మొబైల్ ఫోన్ రిపేర్ వల్ల యాదృచ్ఛికంగా ఎలా తెలిసిందో ఆయన వివరించాడు."లండన్లో నాకు తెలిసిన ఒక స్నేహితుడు పార్ట్టైమ్గా మొబైల్ ఫోన్లు రిపేర్ చేసేవాడు. స్పాట్ ఫిక్సింగ్ సూత్రధారి మజార్ మజీద్ తన ఫోన్ను రిపేర్ కోసం నా స్నేహితుడికి ఇచ్చాడు. ఆ ఫోన్ను బాగు చేసిన తర్వాత అందులో మజార్కు, ముగ్గురు పాక్ ఆటగాళ్లకు మధ్య జరిగిన మెసేజ్లను నా స్నేహితుడు చూశాడు. మ్యాచ్లో స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ మెసేజ్లలో ఉన్నాయి" అని రజాక్ తెలిపాడు.చదవండి: ఫ్యాన్ ఆర్మీ భారత క్రికెట్ను నాశనం చేస్తోంది!
ఫ్యాన్ ఆర్మీ భారత క్రికెట్ను నాశనం చేస్తోంది!
భారత క్రికెట్లో ఇటీవలి కాలంలో ఫ్యాన్ ఆర్మీ,సూపర్ హీరో సంస్కృతి బాగా పెరిగిపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇది భారత క్రికెట్ను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపాడు. ఆటగాళ్ల కంటే వారి పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, దీనివల్ల ఫ్యాన్వార్ పెరిగిపోతుందన్నాడు. కోల్కతాలో జరిగిన రేవ్ స్పోర్ట్స్ కాన్క్లేవ్ కార్యక్రమానికి హాజరైన అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ ఆటగాడికి ఆ ఆటగాడితో సమస్య ఉంది. అందుకే ఆ ఆటగాడు జట్టులో లేడు.. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటివే తరచుగ2ఆ కనబడితే సహజంగానే ఏదో జరుగుతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఇది మానవసహజం. కోచ్ గౌతమ్ గంభీర్ చేయాల్సిన పని చాలా ఉంది. జట్టులో నుంచి నేను, కోహ్లీ, రోహిత్ వెళ్లిపోవాలని అతడు భావించినా పర్వాలేదు. అది అతడి పని. నేను ఎప్పుడూ అహాన్ని వదిలించుకోవాలనే చూశాను. ఇక 25 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాపై వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ మ్యాచ్లో భారత్ గెలిచింది కాబట్టి లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. అది కేవలం లక్ష్మణ్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాదు.. జట్టు విజయం కూడా. అభిమానులు క్రికెటర్లను ఆరాధించవచ్చు, కానీ డ్రెస్సింగ్రూమ్లో వ్యక్తులకన్నా జట్టుకే అధిక ప్రాధాన్యం ఉంటుంది’ అని అశ్విన్ వెల్లడించాడు. చదవండి: అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!
అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్ను కేవలం జట్టుకు ఉపయోగిస్తే సరిపోదని, అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ముందుకు పంపితేనే ప్రయోజనం ఉంటుందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు సంజూ శాంసన్ లాంటి క్రికెటర్ సీఎస్కేలో చేరడం ఆ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనుందని, ధోని స్థానంలో ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగల సత్తా శాంసన్కు ఉందని తెలిపాడు. ‘సీఎస్కేకు ధోని పేరు అదనపు బ్రాండ్ అని చెప్పొచ్చు. సీఎస్ేపేరు చెప్పగానే అందరి నోటి నుంచి వచ్చే మొదటి పేరు ధోనిదే. అయితే గత కొన్నేళ్లుగా ధోని తూతూమంత్రంగానే జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో లోయర్ ఆర్డర్ లోరావడంతో ఎక్కువగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని బ్యాట్తో ఇప్పటికీ ప్రభావం చూపగలడు. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో 8,9వ స్థానంలో ధోని బ్యాటింగ్కు దిగితే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో కచ్చితంగా ముందుగానే క్రీజులోకి రావాలి. కనీసం ఆరో స్థానంలో అయినా బ్యాటింగ్కు వస్తే బాగుంటుంది.నేనైతే మాత్రం ధోని నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా. గత సీజన్ల మాదిరి ఈసారి అలా జరగకూడదని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ తన తొలి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 3న ఆర్సీబీతో, ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: పెషావర్కు వెళ్లొద్దు.. ఆసీస్ ఆటగాళ్లకు హెచ్చరిక!
పెషావర్కు వెళ్లొద్దు.. ఆసీస్ ఆటగాళ్లకు హెచ్చరిక!
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో మార్చి 26 నుంచి మొదలుకావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సందిగ్ధంలో పడింది. తాజాగా అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మంది చనిపోగా, మరో 250 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధంతో పశ్చిమాసియా ఇప్పటికే రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా పాల్గొనాల్సి ఉంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్వెల్ సహా చాలా మంది ఆసీస క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలపై నిషేధముంది. తాజాగా ఆసీస్ ఆటగాళ్లు పీఎస్ఎల్లో పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు కొన్ని షరతుల మీద అనుమతి ఇచ్చింది. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పెషావర్కు దూరంగా ఉండాలని తెలిపింది. అయితే పెషావర్ జాల్మీ పేరుతో పీఎస్ఎల్లో ఒక జట్టు ఉండడంతో కచ్చితంగా మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. అయితే పాక్-ఆఫ్గన్ యుద్ధం కారణంగా పెషావర్ ప్రస్తుతం ‘నో ట్రావెల్ జోన్’లో ఉంది. ఈ కారణంగానే ఒకవేళ మ్యాచ్లు ఆడేందుకు పెషావర్కు వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందని ఆసీస్ క్రికెట్ బోర్డు భయపడుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 28న పెషావర్ జాల్మీ, రావల్పిండి మధ్య జరగనున్న మ్యాచ్కు పెషావర్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. పెషావర్ జాల్మీ జట్టులోనే ఆరోన్ హర్డీ ఉండగా, రావల్పిండి జట్టులో జేక్ ప్రేజర్ మెక్గుర్క్ ఉన్నాడు. అంతేకాదు ఒకవేళ ఏదైనా భద్రతా సమస్యలు తలెత్తినా ఆటగాళ్లను ప్రత్యేక ఫ్లైట్ో తరలించేందుకు సిద్ధంగా ఉంటామని పీఎస్ఎల్ నిర్వాహకులు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి రెండు రోజుల మందు మార్చి 26న పీఎస్ఎల్ సీజన్కు తెరలేవనుంది.చదవండి: ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!
ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!
పశ్చిమాసియాలో భీకరయుద్ధం నేపథ్యంలో ఇరాన్ జట్టు జూన్లో జరగనున్న ఫిఫా వరల్డ్కప్లో పాల్గొనాలా వద్దా అనే సంశయంలో ఉంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న 2026 ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే వరల్డ్కప్ ఆడేందుకు ఇరాన్ మా దేశంలో అడుగుపెడితే ఆ దేశ ఆటగాళ్లకు తాము భద్రత కల్పించలేమని, కాబట్టి ఇరాన్ ప్రపంచకప్ నుంచి వైదొలగడమే మంచిదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. అయితే ట్రంప్ కంటే ముందే అమెరికాలో వరల్డ్కప్ ఆడబోయేది లేదని ఇరాన్ ముందే భీష్ముంచుకుంది. తాజాగా ఫిఫా వరల్డ్కప్లో భాగంగా ముందస్తుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అమెరికాలో తాము ఆడాల్సిన మ్యాచ్లను మెక్సికోకు తరలించాలని ఇరాన్ ఫిఫా సమాఖ్యకు అర్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధం సమయంలో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, ఏక్షణం ఏమైనా జరిగే అవకాశముంటుందని, అందుకే మా మ్యాచ్లను అమెరికా నుంచి మెక్సికో లేదా కెనడాకు మార్చాలని ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా సమాఖ్యను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రతిపాదనపై ఫిఫా సమాఖ్య ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరాన్ ప్రతిపాదనకు అంగీకరిస్తూ మ్యాచ్ వేదికలను మార్చాలా లేక ఇరాన్ స్థానంలో వేరే జట్టుకు అవకాశమివ్వాలా అన్నది ఆలోచిస్తుంది. ఇదంతా గమనించిన క్రీడాభిమానులు ఇరాన్ ప్రతిపాదనను క్రికెట్ టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనతో పోలుస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్కు భారత్తో సంబంధాలు సఖ్యతగా లేవు. అప్పటికే బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిపోయింది. దీంతో భారత్లో తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని ఈ కారణంగా భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడలేమని, తమ మ్యాచ్ వేదికలను లంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు ప్రతిపాదనలు చేసింది. కానీ ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లకుండా తాము చూసుకుంటామని తెలిపిన ఐసీసీ వేదికలను మార్చే ప్రసక్తే లేదని బంగ్లా క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు మూర్కత్వానికి పోయి టీ20 ప్రపంచకప్ను బహిష్కరించింది. తాజాగా అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. అమెరికాలో ఆడబోమని ఇప్పటికే స్పష్టం చేసిన ఇరాన్ .. ఫిఫా సమాఖ్య వారి ప్రతిపాదనకు అంగీకరిస్తే తప్ప ఈసారి సాకర్ ప్రపంచకప్లో వారి ఆటను చూడలేమనుకుంటా!చదవండి: ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
’ఇంకా నేర్చుకుంటూనే ఉండు.. సెలక్టర్లకు బుద్ధి లేదు’
పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్పై ఆ దేశ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ విమర్శల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా నేర్చుకునే దశలోనూ ఉన్నాడంటూ చురకలు అంటించాడు. ఇప్పటికైనా ఆట తీరు మార్చుకోకపోతే జట్టులో కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డాడు.చేదు అనుభవం.. బంగ్లా చేతిలో చిత్తుటీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలోనూ చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్లో 2-1తో ఓడిపోయి దాదాపు పదకొండేళ్ల తర్వాత.. తొలిసారి బంగ్లాదేశ్కు సిరీస్ కోల్పోయింది.షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో బంగ్లాతో వన్డే సిరీస్ ఆడిన పాకిస్తాన్ జట్టులో రిజ్వాన్ ఒక్కటే సీనియర్ మోస్ట్ ప్లేయర్. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 58 పరుగులే చేశాడు.అసలు టెక్నికే సరిగ్గా లేదుఈ నేపథ్యంలో అహ్మద్ షెజాద్ రిజ్వాన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బంతులు నువ్వు ఆడగలిగేలానే పడుతున్నాయి రిజ్వాన్ సాబ్. నువ్వు చాలా సమయం తీసుకుంటున్నావు. అయినా సరే బంతిని బాదలేకపోతున్నావు.అసలు టెక్నికే సరిగ్గా లేదు. లెగ్ సైడ్ ఆడాల్సింది. ఇన్నేళ్లు గడిచినా నువ్వింకా నేర్చుకునే దశలోనే ఉన్నావు. అసలు నీ ఆటలో ఏమైనా పురోగతి ఉందా? టీ20 ప్రపంచకప్ జట్టులో నీకు స్థానమే లేదు.బుద్ధి రావడం లేదువన్డేల్లోనైనా అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్ వంటి జట్టుపై నువ్వు సెంచరీలు బాదాల్సింది. కానీ సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించేలా చెత్తగా ఆడావు. నిన్ను జట్టుకు ఎంపిక చేసే వాళ్లకు కూడా బుద్ధి రావడం లేదు’’ అని అహ్మద్ షెజాద్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2015లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన రిజ్వాన్.. ఇప్పటి వరకు 41 టెస్టుల్లో 2399, 103 వన్డేల్లో 2979, 106 టీ20లలో 3414 పరుగులు సాధించాడు.చదవండి: కోహ్లి, గేల్ కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
తొలి టీ20లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్లో సఫారీ జట్టును మట్టికరిపించి జయభేరి మోగించింది. టీ20 ప్రపంచకప్-2026లో రన్నరప్గా నిలిచిన కివీస్.. ప్రస్తుతం స్వదేశంలో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్తో బిజీగా ఉంది.ఇందులో భాగంగా ఆదివారం మౌంట్ మౌంగనీ వేదికగా ప్రొటిస్తో తొలి టీ20లో తలపడ్డ న్యూజిలాండ్.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా హామిల్టన్లో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన కివీస్.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.డెవాన్ కాన్వే అర్ధ శతకంటాపార్డర్లో ఓపెనర్ టామ్ లాథమ్ (11), వన్డౌన్ బ్యాటర్ టిమ్ రాబిన్సన్ (1) నిరాశపరచగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే అర్ధ శతకం (60)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో నిక్ కెలీ (12 బంతుల్లో 21), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించగా.. కోల్ మెకాంచి (12 బంతుల్లో 18), జోష్ క్లార్క్సన్ (9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో వియాన్ ముల్డర్ రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయెట్జి, ఒట్నీల్ బార్ట్మాన్, కెప్టెన్ కేశవ్ మహరాజ్, జార్జ్ లిండే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఆదిలోనే ఎదురుదెబ్బలులక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లలో కొన్నోర్ ఎస్తరూజెన్ (8)ను బెన్ సియర్స్ వెనక్కి పంపగా.. వియాన్ ముల్డర్ (16)ను సాంట్నర్ అవుట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన టోనీ జార్జి (1) మెకాంచీ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.107 పరుగులకే ఆలౌట్ మిగిలిన వారిలో రూబిన్ హెర్మాన్ (19) ఫర్వాలేదనిపించగా.. జార్జ్ లిండే 12 బంతుల్లో 33 పరుగులు చేశాడు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 15.3 ఓవర్లలో 107 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఫలితంగా న్యూజిలాండ్ 68 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది.కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, బెన్ సియర్స్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. సాంట్నర్ రెండు, మెకాంచి, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం నాటి మూడో టీ20కి ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదిక.చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్గా ఊహించని పేరు!
అక్కడ ముగింపు.. ఇక్కడ ప్రారంభం!
టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిధ్యం వహించనున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్న సంజూ శాంసన్ 2025 నవంబర్లో ట్రేడింగ్లో భాగంగా జడేజా, సామ్ కరన్లను రిలీజ్ చేసిన చెన్నై శాంసన్ను దక్కించుకుంది. మరో 10 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజస్థాన్తో బంధం ముగిసిందని, ఈ సీజన్ ద్వారా చెన్నై సూపర్కింగ్స్తో ప్రయాణం ప్రారంభమైందని పేర్కొ న్నాడు. శాంసన్ మాట్లాడుతూ..‘నేను ఆ జట్టులో సమయం ముగిసిందని భావించా.. అందుకే రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చా. నేను రాజస్థాన్ రాయల్స్కు ప్రత్యర్థిగా ఆడడం ఇదే తొలిసారి అనుకుంటా. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కానీ ఒకసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్ గురించే తప్ప వేరే దాని గురించి ఆలోచించను. రాజస్థాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా తెలిసినవాళ్లే. వారు ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతీ ఒక్కరికీ ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్తో నా సమయం ముగిసింది. నేను ముందుకు సాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నాటి నుంచి ఎక్కువగా రాజస్థాన్ రాయల్స్కే ఆడాడు. మధ్యలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడినప్పటికీ రాజస్థాన్తోనే శాంసన్కు అనుబంధమెక్కువ అని చెప్పొచ్చు. 2022లో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా ప్రమోషన్ పొందిన శాంసన్ ఆ సీజన్లో రాజస్థాన్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 2023 సీజన్లో రాజస్థాన్ ప్లేఆఫ్కు చేరడంలో విఫలమైనప్పటికీ బ్యాటర్గా మాత్రం శాంసన్ విజయవంతమయ్యాడు. ఆ తర్వాత 2024లో శాంసన్ నేతృత్వంలో రాజస్థాన్ జట్టు మరోసారి రెచ్చిపోయింది. తొలి 9 మ్యాచ్ల్లో ఎనిమిదింట గెలిచిన రాజస్థాన్ ప్లేఆఫ్స్కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో సన్రైజర్స్చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్ సంజూ శాంసన్ బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తం 16 మ్యాచ్ల్లో 5 హాఫ్సెంచరీల సాయంతో 531 పరుగులు సాధించి కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. 2025 సీజన్లో గాయాల సమస్యలతో ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు. శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించాడు.Sanju Samson just casually dropped a reality check for the professional language warriors.Knowing Hindi and Tamil along with Malayalam didn't make him less of a South Indian, it made him a better teammate. While the keyboard activists are busy gatekeeping, Sanju is busy winning… pic.twitter.com/AsggCsz7fP— Smita Deshmukh🇮🇳 (@smitadeshmukh) March 17, 2026చదవండి: సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి
సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి
న్యూజిలాండ్ పర్యటనలో సౌతాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ తజ్మిన్బ్రిట్స్ (43 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, లారా వోల్వర్ట్ (33 బంతుల్లో 41) పర్వాలేదనిపించింది. ఆఖర్లో కయ్లా రెనెకె (9 బంతుల్లో 28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో అమెలియా కెర్, జెస్ కెర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అమెలియా కెర్ (18 బంతుల్లో 32) టాప్ స్కోరర్గా నిలవగా ఇజీ షార్ప్ (29) పరుగులు చేసింది. అయితే సౌతాఫ్రికా బౌలర్లలో అయోబంగా ఖాకా 4 వికెట్లతో చెలరేగితే, లాబా 3 వికెట్లు తీసింది. కయ్లా రెనెకెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. చదవండి: కోహ్లి కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్
అల్కరాజ్కు ఊహించని షాక్!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్వ...
ట్రంప్పై నిషేధం యోచనలో ఫిఫా!
పశ్చిమాసియాలోని ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదు...
గాయంతో వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ...
‘మమ్మల్ని ఎవరూ తప్పించలేరు’
జెనీవా: ‘ఫిఫా’ ప్రపంచకప్లో తమ జట్టు పాల్గొనకుండా ...
సన్రైజర్స్కు భారీ షాక్!.. ఇషాన్కు గోల్డెన్ ఛాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి...
అత్యంత హేయమైన నేరం: పాకిస్తాన్పై రషీద్ ఖాన్ ఫైర్
పాకిస్తాన్ తీరుపై అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్...
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు ‘సై’
బెంగళూరు: సందిగ్ధత వీడింది. బెంగళూరు క్రికెట్ అభి...
తిలక్ వర్మకు సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్, హైదరాబాద్ ప్ల...
క్రీడలు
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
వీడియోలు
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్లో హార్ట్ టచింగ్ మూమెంట్
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
SRH ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ
భారత్ దెబ్బకు షివరింగ్ వచ్చేసింది.. ఆఫ్రిది కామెంట్స్ వైరల్
ధోని, రోహిత్ తర్వాత శ్రీయాస్ అయ్యరే బెస్ట్ కెప్టెన్..
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
IPLపై నీలినీడలు.. గ్యాస్ కొరత, విమాన సమస్యలు తప్పవా?
క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
