ప్రధాన వార్తలు
ఆరోసారి భారత్కు ప్రపంచకప్.. ప్రధాని మోదీ ప్రశంసలు
కుర్రాళ్లు కుమ్మేశారు. ఏకంగా ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియా నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ని 100 పరుగుల తేడాతో యువ భారత్ ఓడించింది. అలా ఆరో వరల్డ్కప్ని టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. యువ జట్టుని అభినందిస్తూ ట్వీట్ చేశారు.'భారత క్రికెట్ ప్రతిభ మెరిసింది. మన అండర్-19 జట్టు ప్రపంచకప్ సాధించినందుకు గర్వంగా ఉంది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలానే ఆకట్టుకునే ప్రతిభ చూపించింది. ఈ విజయం చాలామంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. గెలిచిన ఆటగాళ్లకు నా అభినందనలు' అని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా యువ టీమిండియాని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఇంగ్లండ్ కష్టపడినప్పటికీ 311 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో వరల్డ్కప్ సొంతం చేసుకుంది.టీమిండియా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఈ టోర్నీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్.. ఫైనల్లో ఆడాడు. 14 ఏళ్ల వైభవ్.. తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. India’s cricketing talent shines! Proud of our U-19 team for bringing home the World Cup. The team has played very well through the tournament, showcasing exceptional skill. This win will inspire several young sportspersons too. Best wishes to the players for their upcoming…— Narendra Modi (@narendramodi) February 6, 2026
రియాన్ పరాగ్ విధ్వంసం.. పసికూనను చిత్తు చేసిన భారత్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో చివరి వార్మప్ మ్యాచ్లో భారత్-ఎ జట్టు 130 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు.పరాగ్ కేవలం 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 69 పరుగులు చేశాడు. అతడితో పాటు నమన్ ధీర్ (39), అశుతోష్ శర్మ (35) మెరుపులు మెరిపించారు. గెర్హార్డ్ ఎరాస్మస్, రూబెన్ ట్రంపెల్మాన్ ,మాక్స్ హీంగో తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా, భారత బౌలర్ల ధాటికి కేవలం 12.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది.నమీబియా బ్యాటర్లలో డైలాన్ లీచర్(22) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్, మయాంక్ యాదవ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ తలా రెండు వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాసించారు.
వైభవ్ విశ్వరూపం.. వరల్డ్ రికార్డులు బద్దలు
అండర్-19 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన యంగ్ ఇండియా.. రికార్డుస్దాయిలో ఆరోసారి వరల్డ్కప్ టైటిల్ను ముద్దాడింది. ఈ విజయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీది కీలక పాత్ర. తుది పోరులో వైభవ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 150 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. అతడి విధ్వంసం ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 412 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 311 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీ పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వరల్డ్ రికార్డులు బద్దలు👉అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(175) సాధించిన ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఉన్మక్త్ చంద్(111*) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో చంద్ను వైభవ్ అధిగమించాడు.👉అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో 55 బంతుల్లోనే వైభవ్ సెంచరీ సాధించాడు.👉అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ బాదిన అతని పిన్న వయస్కుడు కూడా సూర్యవంశీనే కావడం విశేషం.👉అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు మైఖేల్ హిల్(12) పేరిట ఉండేది.👉అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా వైభవ్ (30) నిలిచాడు.
ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు.. వరల్డ్ ఛాంపియన్స్గా భారత్
అండర్-19 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ను 100 పరుగుల తేడాతో ఓడించిన యువ భారత్.. ఆరో వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది.భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 14 ఏళ్ల వైభవ్ తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ అయూశ్ మాత్రే(53), కనిష్క్ చౌహాన్ (37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు.ఫాల్కనర్ విరోచిత పోరాటం..అనంతరం భారీ లక్ష్య చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కాలేబ్ ఫాల్కనర్ వీరోచిత పోరాటం కనబరిచాడు. ఓవైపు క్రమం తప్పుకొండా వికెట్లు పడుతున్నప్పటికి ఫాల్కనర్ మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. ఫాల్కనర్ బంతుల్లో 115 పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు.అతడితో పాటు బెన్ డాకిన్స్ (66),థామస్ రెవ్(31) తమ వంతు ప్రయత్నం చేశారు. మిగితా బ్యాటర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ మూడు వికెట్లు పడగొట్టగా.. కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఫైనల్లో భారీ సెంచరీతో చెలరేగిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.
భారత్-పాక్ మ్యాచ్పై ఐసీసీ కీలక నిర్ణయం
టీ20 ప్రపంచకప్-2026లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దాదాపుగా లేనట్టే. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు సంబంధించి టికెట్ల అమ్మకాలను ఐసీసీ (ICC) తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడాల్సి ఉంది. కానీ రాజకీయ ఉద్రిక్తల కారణంగా భారత్తో మ్యాచ్ను బాయ్కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.కానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటికీ ఐసీసీకి ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ మ్యాచ్ను బాయ్కట్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించినప్పటకి పాక్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి లేఖ రాసింది.ఈ మ్యాచ్ రద్దయితే అన్ని విధాలగా తమ దేశం భారీగా నష్టపోతుందని ఆ లేఖలో శ్రీలంక క్రికెట్ పేర్కొంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని లంక బోర్డు కోరింది. అయినా కూడా పీసీబీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ సందిగ్ధత వల్లే టికెట్లు విక్రయించిన తర్వాత ఒకవేళ మ్యాచ్ రద్దయితే, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఐసీసీ బుకింగ్స్ను నిలిపివేసింది. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఇతర ఎనిమిది మ్యాచ్ల టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం బుకింగ్ పోర్టల్లో కనిపించడం లేదు. ఈ మెగా టోర్నీ శనివారం(ఫిబ్రవరి 7) నుంచి ప్రారంభం కానుంది.
'పాక్కు చుక్కలు చూపిస్తాం'.. పసికూన బౌలర్ వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో కొలంబో వేదికగా పాకిస్తాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టుకు నెదర్లాండ్స్ సీనియర్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వాన్ మీకెరెన్ తాజాగా క్రిక్స్ అనే స్పోర్ట్స్ వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వాన్ మీకెరెన్కు పాక్తో మ్యాచ్ కోసం ఏమైనా ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నారా? అన్న ప్రశ్న ఎదురైంది."పాకిస్థాన్తో మ్యాచ్ను మేము ప్రత్యేకంగా చూడడం లేదు. ఇది కూడా మిగిలిన మ్యాచ్ల్లాగే. మా గ్రూపులో భారత్ వంటి బలమైన జట్టుతో పాటు అమెరికా, నమీబియా వంటి టీమ్స్ కూడా ఉన్నాయి. మా దృష్టి కేవలం పాక్ మ్యాచ్పైనే లేదు. టోర్నీ తొలి మ్యాచ్లో పాక్ ఓడించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. 2009 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో మేము సంచలన విజయం సాధించాము. ఇప్పుడే అదే ఫలితాన్ని పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉన్నాము" అని వాన్ మీకెరెన్ పేర్కొన్నాడు.అదేవిధంగా పాక్ పేస్ బౌలింగ్ చూసి భయపడుతున్నారా? అన్న ప్రశ్నకు వాన్ మీకెరెన్ బదులిస్తూ: ఒకప్పుడు పాక్ బౌలర్లను చూసి భయపడేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్లో పాక్ జట్టుతో మ్యాచ్లు ఆడాము. పాక్ బలాలు, బలహీనతలపై మాకు ఒక అవగహన ఉందని చెప్పుకొచ్చాడు.కాగా డచ్ జట్టుతో మ్యాచ్కు పాక్కు చాలా కీలకం. భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్తో మ్యాచ్ పాయింట్లు కోల్పోనుండటంతో.. పాక్ తదుపరి రౌండ్కు వెళ్లాలంటే నెదర్లాండ్స్, అమెరికా, నమీబియాలతో జరిగే మిగిలిన మూడు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాల్సిందే.
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అయితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ త్వరగా ఔటైనప్పటికి వైభవ్ మాత్రం కెప్టెన్ ఆయూష్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి బ్యాటింగ్ చూసి ప్రత్యర్ది బౌలర్లు గజగజ వణికిపోయారు. ఈ క్రమంలో అతడు కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు మాత్రే(53), అభిజ్ఞాన్ కుండు(40), కనిష్క్ చౌహాన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు.టీమిండియా సరికొత్త చరిత్రఅండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్పై ఆసీస్ 253 పరుగులు చేసింది. తాజా మ్యాచ్లో 411 పరుగులు చేసిన యంగ్ ఇండియా.. కంగారుల ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.అండర్-19 ప్రపంచకప్లో 400 పరుగుల మార్కును అత్యధిక సార్లు దాటిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. టీమిండియా మూడు సార్లు 400కు పైగా టోటల్స్ను నమోదు చేసింది.
T20 WC: ఐసీసీని విమర్శించిన కామెంటేటర్కు చోటు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కామెంటేటర్ల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈసారి కూడా అత్యుత్తమ కామెంట్రీతో ఆకట్టుకునేందుకు ఐసీసీ టీవీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రేక్షకులకు వరల్డ్క్లాస్ అనుభూతిని అందించేందుకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని పేర్కొంది.బంగ్లాదేశ్- పాకిస్తాన్కు మద్దతుగాఅయితే, ఈ కామెంటేటర్ల లిస్టులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్కు చోటు ఇవ్వడం పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్- పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతూ.. భారత్, ఐసీసీని నాసిర్ హొసేన్ విమర్శించిన విషయం తెలిసిందే. బంగ్లా, పాక్లను ఒక విధంగా.. టీమిండియాను మరో విధంగా ఐసీసీ చూస్తోందని.. ఇదెక్కడి న్యాయం అని అతడు ప్రశ్నించాడు.భారత్ దగ్గర డబ్బు ఉందని ఆ జట్టు అభిమానులు అనుకోవచ్చని.. అయితే, ఐసీసీ అందరినీ సమానంగా చూడాలంటూ నాసిర్ హొసేన్ వ్యాఖ్యానించాడు. కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతం ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఐసీసీఐ బీసీసీఐ ఆధిపత్యం చెలాయిస్తోందనేలా నాసిర్ మాట్లాడాడు.మరచిపోతే ఎలా?అయితే, నెటిజన్లు అతడికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. జింబాబ్వే విషయంలో ఇంగ్లండ్ ఏం చేసిందో గుర్తు చేసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా భారత్లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్.. తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది.అయినా సరే బంగ్లా పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో బంగ్లాకు మద్దతుగా నిలుస్తామంటూ భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. అదే జరిగితే ఐసీసీతో పాటు ఐసీసీ సభ్య దేశాల ఆదాయం భారీగా తగ్గిపోతుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 నిర్వహణకు షెడ్యూల్ ఖారారైంది. ఈ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి.ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్-2026 కామెంటేటర్లు వీరేరవిశాస్త్రి, నాసిర్ హుస్సేన్, ఇయాన్ స్మిత్, ఇయాన్ బిషప్, ఆరోన్ ఫించ్, దినేశ్ కార్తీక్, కుమార్ సంగక్కర, శామ్యూల్ బద్రీ, రాబిన్ ఉతప్ప, కార్లోస్ బ్రాత్వైట్, ఇయాన్ మోర్గాన్, వసీం అక్రమ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, డేల్ స్టెయిన్, మైఖేల్ అథర్టన్.....వకార్ యూనిస్, సైమన్ డౌల్, షాన్ పొలాక్, కేటీ మార్టిన్, హర్ష భోగ్లే, పుమెలెలో ఎంబంగ్వా, నటాలీ జర్మనోస్, డానీ మోరిసన్, అలాన్ విల్కిన్స్, ఇయాన్ వార్డ్, మార్క్ హోవార్డ్..నిక్ నైట్, అథర్ అలీ ఖాన్, కాస్ నైడూ, బాజిద్ ఖాన్, రౌనక్ కపూర్, నియాల్ ఓ'బ్రియన్, ప్రెస్టన్ మామ్సెన్, ఆండ్రూ లియోనార్డ్, రస్సెల్ ఆర్నాల్డ్, రోషన్ అబేసింఘే, ఏంజెలో మాథ్యూస్, టెంబా బావుమా.చదవండి: T20 WC 2026: సిరాజ్కు గోల్డెన్ ఛాన్స్!
శాంసన్పై వేటు..! టీమిండియా ఓపెనర్గా అతడే?
టీ20 వరల్డ్కప్-2026లో భారత క్రికెట్ జట్టు తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. టోర్నీ ఆరంభం రోజు(ఫిబ్రవరి 7)నే వాంఖడే వేదికగా అమెరికాతో టీమిండియా తలపడనుంది. అయితే భారత తుది జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్కు చోటు దక్కుతుందా? లేదా? అన్నది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చానీయాంశమైంది. సంజూ పేలవ ఫామ్ కనబరుస్తుండడంతో అతడి స్దానంలో ఓపెనర్గా ఇషాన్ కిషన్ పంపాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచించారు. దీంతో టీమ్ మెనెజ్మెంట్ శాంసన్పై వేటు వేసేందుకు సిద్దమైందని వార్తలు వస్తున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లలో సంజూ ఆడకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. తాజాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వాఖ్యలు బట్టి సంజూకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కష్టమే అన్పిస్తోంది.శాంసన్ స్దానంలో సూపర్ ఫామ్లో ఉన్న కిషన్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించడం దాదాపు ఖాయమైనట్లే అన్పిస్తోంది. అమెరికాతో మ్యాచ్కు ముందు విలేకరుల సమావేశంలో సూర్య పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఇషాన్పై సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఓపెనర్గా ఇషాన్ కిషన్ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కేవలం టీమిండియా తరపునే కాదు, దేశవాళీ క్రికెట్లో కూడా దుమ్ములేపాడు. అతడు కచ్చితంగా టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడు. ఇషాన్ తనకు లభించిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడని సూర్య పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్గా వచ్చిన సంజూ.. వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో శుభ్మన్ గిల్ను కాదని సంజూకు వరల్డ్కప్ జట్టులో సెలెక్టర్లు చోటు ఇచ్చారు. కానీ ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 5 మ్యాచ్ల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే సమయంలో రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కిషన్ తన సంచలన ప్రదర్శనలతో అందరిని మంత్రముగ్ధులను చేస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో కూడా 200పైగా స్ట్రైక్ రేట్తో సెంచరీ సాధించి, సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో కూడా ఓపెనర్గా వచ్చి కిషన్ సత్తాచాటాడు. దీంతో ప్రధాన టోర్నీలో కూడా కిషన్కే ఓపెనర్గా పంపాలని గంభీర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అమెరికాతో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
T20 WC 2026: సిరాజ్కు గోల్డెన్ ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించాడు.కాగా శనివారం (ఫిబ్రవరి 7) నుంచి వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ టోర్నీలో టీమిండియా శనివారం నాటి మ్యాచ్లో యూఎస్ఏతో తలపడుతుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) శుక్రవారం మీడియాతో మాట్లాడాడు.భారీ ఎదురుదెబ్బేఈ సందర్భంగా హర్షిత్ రాణా గాయం గురించి అప్డేట్ అందిస్తూ. ‘‘హర్షిత్ టోర్నీ నుంచి తప్పుకొన్నాడని ఇప్పుడే చెప్పలేను. అయితే, అతడి పరిస్థితి ఏమాత్రం బాలేదు. గాయంపై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది.ఒకవేళ హర్షిత్ రాణా టోర్నీకి దూరమైతే నిజంగా మాకు అది భారీ ఎదురుదెబ్బే. కాంబినేషన్లను దృష్టిలో పెట్టుకునే మేము పదిహేను మందిని ఎంపిక చేసుకున్నాం. అయితే, కావాల్సినంత బెంచ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఆల్రౌండరే అక్కర్లేదుఅతడి స్థానంలో ఆల్రౌండర్నే తీసుకురావాలనే నిబంధన ఏమీ లేదు’’ అని ప్రి-మ్యాచ్ కాన్ఫరెన్స్లో సూర్య పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా స్థానంలో హైదరాబాదీ స్టార్ మొహమ్మద్ సిరాజ్ ప్రపంచకప్ జట్టులోకి రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.సిరాజ్కు గోల్డెన్ ఛాన్స్!కాగా 2024 జూలైలో సిరాజ్ చివరగా టీమిండియా తరఫున టీ20 బరిలో దిగాడు. అయితే, గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున సిరాజ్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. పదిహేను మ్యాచ్లలో కలిపి 16 వికెట్లు తీశాడు. కాగా సిరాజ్ ఇప్పటికి టీమిండియా తరఫున మొత్తంగా 16 మ్యాచ్లు ఆడి పద్నాలుగు వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. హర్షిత్ రాణా స్థానంలో సిరాజ్కు బదులు ప్రసిద్ కృష్ణను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్లో 25 వికెట్లతో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు ప్రసిద్. ఈ కర్ణాటక బౌలర్ చివరగా 2023లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. చదవండి: ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు ఆసీస్కు మరో భారీ షాక్
లవ్లీనా శుభారంభం
అలికాంటె (స్పెయిన్): బాక్సమ్ ఎలైట్ అంతర్జాతీయ బ...
భారత్ను గెలిపించిన శ్రీకాంత్
కింగ్డావో (చైనా): ఆసియా సీనియర్ బ్యాడ్మింటన్ టీమ...
పెర్ల్ ఫెర్నాండెజ్ ‘హ్యాట్రిక్’
పొఖారా (నేపాల్): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శ...
ఇషా సింగ్కు రెండు స్వర్ణ పతకాలు
ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్ప్లో భారత్కు ప్...
T20 WC: ఐసీసీని విమర్శించిన కామెంటేటర్కు చోటు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు సంబంధించి అంతర్...
శాంసన్పై వేటు..! టీమిండియా ఓపెనర్గా అతడే?
టీ20 వరల్డ్కప్-2026లో భారత క్రికెట్ జట్టు త...
T20 WC 2026: సిరాజ్కు గోల్డెన్ ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భ...
వరల్డ్కప్ ఫైనల్లో వైభవ్ విధ్వంసం.. జస్ట్ డబుల్ సెంచరీ మిస్
అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత యువ సంచలనం వ...
క్రీడలు
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
వీడియోలు
ఈ సాలా కూడా కప్ నమ్దే.. కుమ్మేసిన RCB..
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
కుర్రాళ్లు కుమ్మేశారు
ఎలిమినేటర్ లో ఢిల్లీ సత్తా.. సెమీస్ లో గుజరాత్ ఔట్
దడపుట్టించిన భారత్.. పాకిస్తాన్ సంచలన ప్రకటన..
పాక్ పై భారత్ ఘన విజయం
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
