Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ICC Announces New Tournament With No India Matches1
ఐసీసీ సంచలన ప్రకటన.. ఆ టోర్నీలో భారత్‌కు నో ఛాన్స్‌

జై షా నాయ‌క‌త్వంలోని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) చారిత్రత్మక నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళల‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు ముందు స‌రికొత్త టీ20 టోర్న‌మెంట్‌ను ఐసీసీ ప్ర‌క‌టించింది. ఇందుకు ఐసీసీ టీ20 ఛాలెంజ్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. అసోసియేట్ దేశాలకు చెందిన జ‌ట్ల‌కు తగిన గుర్తింపును కల్పించడమే ల‌క్ష్యంగా ఈ టోర్నీని ఐసీసీ నిర్వ‌హించ‌నుంది.అందుకే ఈ టోర్న‌మెంట్‌లో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ వంటి అగ్రశ్రేణి జట్లు పాల్గొనవు. ఈ చారిత్రాత్మక మొదటి సీజన్ రువాండాలోని కిగాలీ నగరంలో జరగనుంది. ఈ ఐసీసీ టీ20 ఛాలెంజ్ టోర్నీలో మొత్తం 5 జ‌ట్లు పాల్గోనున్నాయి.ఈ ఐసీసీ ఈవెంట్‌ ఏప్రిల్ 18 నుండి మే 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీని డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ప్రతి జట్టు ఇతర జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది. అంటే గ్రూప్ దశలో ఒక్కో జట్టుకు 8 మ్యాచ్‌లు లభిస్తాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది.ఈ టోర్నీలో పాల్గోనే జ‌ట్లు ఇవేనేపాల్ (ఆసియా)యూఎస్ఎ (అమెరికా)ఇటలీ (యూరప్)వనాటు (ఈస్ట్ ఆసియా-పసిఫిక్)రువాండా (ఆఫ్రికా - ఆతిథ్య జట్టు)

Sanju Samson likely lead the Indian team on the Ireland tour: Reports2
సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌?

ఐపీఎల్‌-2026 సీజన్ తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబీజీగా గడపనుంది. తొలుత జూన్‌లో స్వ‌దేశంలో మూడు వ‌న్డేలు, ఏకైక టెస్టు సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం మెన్ ఇన్ బ్లూ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది.అయితే జూలైలో ఇంగ్లండ్‌తో జ‌రిగే ప్ర‌ధాన సిరీస్ దృష్ట్యా ఐరీష్ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి యువ జట్టును పంపాలని బీసీసీఐ భావిస్తుందంట. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్న వైభవ్ సూర్యవంశీ ఆయూశ్ మాత్రే, ప్రిన్స్ యాదవ్ వంటి యువ ఆటగాళ్ల పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌, రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కూడా ఐర్లాండ్ టూర్ కోసం సెలెక్టర్లు పిలుపునిచ్చే ఛాన్స్ ఉంది.కెప్టెన్‌గా సంజూ!అయితే ఈ టూర్‌కు రెగ్యులర్ సారధి సూర్యకుమార్ యాదవ్ దూరం కావడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు పగ్గాలను సంజూ శాంసన్‌కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజూ ఇప్పటివరకు జాతీయ జట్టుకు నాయకత్వం వహించికపోయినప్పటికి.. కేరళ జట్టుతో పాటు రాజస్తాన్ రాయల్స్‌ను లీడ్ చేసిన అనుభవం అతడికి ఉంది.సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన సూర్య.. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం విఫలమవుతున్నాడు. అయినప్పటికి అతడిని కెప్టెన్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ సముఖత చూపుతోంది. ఇంగ్లండ్ టూర్‌లో సూర్య మెరుగైన ప్రదర్శన చేస్తే.. 2028 ఒలింపిక్స్ వ‌ర‌కు భార‌త కెప్టెన్‌గా కొనసాగించే అవ‌కాశ‌ముంది.చదవండి: నా భర్త గురించి తప్పుడు ప్రచారం: వినోద్‌ కాంబ్లీ భార్య

Vinod Kambli Wife Left Fuming Over Claims Over Ex Cricketer Health3
బ్రెయిన్‌స్ట్రోక్‌?.. స్పందించిన వినోద్‌ కాంబ్లీ భార్య

తన భర్త గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్‌ విజ్ఞప్తి చేసింది. దేవుడి దయ వల్ల వినోద్‌ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపింది. కాగా గత కొంతకాలంగా వినోద్‌ కాంబ్లీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో 2024, డిసెంబరులో థానే ఆస్పత్రిలో చికిత్స పొందాడు కాంబ్లీ. ఆ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్లు అతడికి ఆర్థికంగా అండగా నిలిచారు. అతిగా మద్యం సేవించడం, పొగ త్రాగడం వల్లే తనకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు కాంబ్లీ గతంలో స్వయంగా వెల్లడించాడు.మెదడులో రక్తం గడ్డకట్టిందని..ఈ పరిణామాల నేపథ్యంలో వినోద్‌ కాంబ్లీ స్నేహితుడు, ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌ మాజీ అంపైర్‌ మార్కస్‌ కౌట్‌ ఇటీవల హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. కాంబ్లీ మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఏ క్షణమైనా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నాడు.ఇక కాంబ్లీ ఇప్పటికీ పొగతాగే అలవాటు మానుకోలేకపోతున్నట్లు మార్కస్‌ వెల్లడించాడు. అంతేకాదు అతడికి ఆర్థికంగా సాయం అందించేందుకు తాను వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసినట్లు తెలిపాడు. ఇందులో ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఉన్నారని.. సచిన్‌ టెండుల్కర్‌ కూడా ఇందులో భాగమని తెలిపాడు.ఫీజు లేకుండా శిక్షణఅదే విధంగా.. ‘‘కాంబ్లీ కర్ర సాయంతో నడుస్తున్నాడు. అతడి కుమారుడు క్రిస్టియానో క్రికెటర్‌ కావాలని కోరుకుంటున్నాడు. ‍క్రిస్టియానోను అకాడమీలో చేర్చుకోవాల్సిందిగా జతిన్‌ పరాంజపేను కోరాను. అందుకు అతడు అంగీకరించాడు. కాంబ్లీ కుమారుడికి అతడికి అకాడమీలో ఫీజు లేకుండా శిక్షణ లభిస్తుంది’’ అని మార్కస్‌ పేర్కొన్నాడు.వినోద్‌ బాగానే ఉన్నాడుఈ క్రమంలో వినోద్‌ కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్‌ తాజాగా స్పందించింది. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. మార్కస్‌ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ‘‘దేవుడి దయవల్ల వినోద్‌ బాగానే ఉన్నాడు. కానీ అతడి ఆరోగ్యం గురించి ఎవరు ఇలా దుష్ఫ్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని ఆండ్రియా హెవిట్‌ వాపోయింది.చదవండి: T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

Delhi Rejected Virat Kohli For Sangwan In IPL Sehwag Reveals Full Story4
అతడి కోసం ఢిల్లీ విరాట్‌ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఇంత వరకు టైటిల్‌ గెలవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒకటి. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌ (2008)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుంది.తప్పటడుగు వేసి ఉండకపోతే..అయినా సరే ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో భారత విధ్వంసకర ఓపెనర్‌, ఢిల్లీ మాజీ ఆటగాడు వీరేందర్‌ సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఢిల్లీ ఫ్రాంఛైజీ గనుక ఆరోజు తప్పటడుగు వేసి ఉండకపోతే.. ఆ జట్టుకు మంచి క్రేజ్‌ అయినా దక్కి ఉండేదని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ వీరూ భాయ్‌ ఏం చెప్పాడంటే.. టాపార్డర్‌ కిక్కిరిసిపోయి ఉండేది‘‘ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ అంటే.. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో శిఖర్‌ ధావన్‌, తిలక్‌రత్నె దిల్షాన్‌ కూడా ఉన్నట్లు నాకు గుర్తు. వీరిద్దరు ఓపెనింగ్‌ బ్యాటర్లే. అయితే, నేను, గౌతమ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించేవాళ్లం.కాబట్టి ధావన్‌, దిల్షాన్‌ ఆలస్యంగా వచ్చేవాళ్లు. మనోజ్‌ తివారి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసేవాడు. అప్పుడ మా టాపార్డర్‌.. ఇలా కిక్కిరిసిపోయి ఉండేది. కాబట్టి కొత్తగా బ్యాటర్‌ను తీసుకునే అవకాశం లేకుండా పోయింది.కోహ్లికి బదులు జట్టులోకి అతడుఆ సమయంలో విరాట్‌ కోహ్లి వన్‌డౌన్‌ లేదంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసేవాడు. కాబట్టి అతడిని జట్టులోకి తీసుకోలేకపోయారు. అప్పుడు మాకు బౌలర్‌ అవసరం ఉంది. అందుకే కోహ్లికి బదులు ఢిల్లీ ప్రదీప్‌ సాంగ్వాన్‌ను జట్టులోకి తీసుకుంది’’ అని చాంపియన్స్‌ వాలీ కామెంట్రీలో జియోస్టార్‌ ఎక్స్‌పర్ట్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.కాగా ఆరోజు అలా ఢిల్లీ కోహ్లిని కెరీర్‌ తొలినాళ్లలో వదిలేసుకోగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజంగా ఎదిగినా.. కోహ్లి మాత్రం ఇప్పటికీ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా ట్రోఫీ గెలవలేకపోయినా.. గతేడాది రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో ఆర్సీబీ తరఫున కోహ్లి తొలిసారి కప్పును ముద్దాడాడు. మరోవైపు.. ఢిల్లీ టైటిల్‌ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.చదవండి: T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

We need to take some tough calls: Hardik Pandya after MI 4th Defeat5
పంజాబ్‌ చేతిలో ఓటమిపై హార్దిక్‌ కీలక వ్యాఖ్యలు

పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. పరాజయాలపై సమీక్ష నిర్వహిస్తామని.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదేమోనని వ్యాఖ్యానించాడు. మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్‌-2026లో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదుసొంతమైదానం వాంఖడేలో గురువారం పంజాబ్‌ కింగ్స్‌ (MI vs PBKS)తో మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మేము ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుసుకునేందుకు సమీక్ష నిర్వహిస్తాము.వ్యక్తిగత వైఫల్యమా? సమిష్టి వైఫల్యమా? మా ప్రణాళికల్లోనే లోపాలున్నాయా? అన్న అంశాలపై చర్చించాల్సి ఉంది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. లేదంటే ఇలాగే కొనసాగుతూ పరిస్థితులు చక్కదిద్దాలా అన్న విషయం గురించి ఆలోచిస్తాము. కొన్ని కఠినమైన ప్రశ్నలకు జవాబులు వెదకక తప్పదు. వైఫల్యాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు.ఆ ముగ్గురే టార్గెట్‌?ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ సీనియర్లు పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌.. మరో ప్లేయర్‌ తిలక్‌ వర్మ (Tilak Varma)ను ఉద్దేశించే హార్దిక్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచస్థాయి బౌలర్‌ అయిన బుమ్రా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.మరోవైపు.. సూర్య చేసిన పరుగులు వరుసగా 16, 51, 6, 33, 0. ఇక తిలక్‌ వర్మ రాబట్టిన రన్స్‌ 20, 0, 14, 1, 8. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ జట్టుకు ఈ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా క్రెడిట్‌ ఇచ్చాడు. ‘‘వాళ్లు మాకంటే మెరుగ్గా బౌలింగ్‌ చేశారు. మెరుగ్గా బ్యాటింగ్‌ చేశారు. ఫీల్డింగ్‌ అద్భుతం. వారి ప్రదర్శనకు మేము మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా 14 పరుగులు చేశాడు. మూడు ఓవర్ల బౌలింగ్‌లో 39 రన్స్‌ ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు.ముంబై వర్సెస్‌ పంజాబ్‌ స్కోర్లుముంబై- 195/6(20)పంజాబ్‌- 198/3(16.3)ముంబైపై ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ గెలుపు.The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026చదవండి: T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

Our Loss Not His: R Ashwin's Big Shreyas Iyer Warning To Agarkar6
‘అతడిని ఎంపిక చేయకపోతే టీమిండియాకే నష్టం’

ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని శ్రేయస్‌ సేన.. తాజాగా ముంబై ఇండియన్స్‌పై జయభేరి మోగించింది. వాంఖడే వేదికగా ముంబైని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి నాలుగో విజయం నమోదు చేసింది.పంజాబ్‌ గెలుపులో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ది కీలక పాత్ర. ముంబై విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 35 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి శ్రేయస్‌ అయ్యర్‌ 203 పరుగులు సాధించాడు.సారథిగా, బ్యాటర్‌గా సూపర్‌హిట్‌గతేడాది కూడా పంజాబ్‌ కెప్టెన్‌, బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా పదిహేడు మ్యాచ్‌లలో కలిపి 604 రన్స్‌ చేయడంతో పాటు.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతకు ముందు దేశీ క్రికెట్‌లో ముంబై తరఫునా అదరగొట్టాడు. అయినప్పటికీ 2023 తర్వాత మళ్లీ అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కలేదు.ఆటతోనే అందరికీ సమాధానంఈ పరిణామాల నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ను టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే నష్టపోయేది టీమిండియానే అని అన్నాడు. ఈ మేరకు.. ‘‘శ్రేయస్‌ తన ఆటతోనే అందరికీ సమాధానం చెబుతున్నాడు. అతడి ప్రతిభ ఏమిటో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు.అతడు షార్ట్‌ బాల్‌ను సరిగ్గా ఎదుర్కోలేడంటూ తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే, ముంబైతో మ్యాచ్‌లో అతడు జస్‌ప్రీత్‌ బుమ్రాను ఎలా ఎదుర్కొన్నాడో అందరూ చూశారు కదా!.. షార్ట్‌ బాల్‌నే మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. అంతకు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో రాణించాడు.ఇంకెన్నిసార్లుఇంకెన్నిసార్లు అతడు తనను తాను నిరూపించుకోవాలి? శ్రేయస్‌ లాంటి క్రికెటర్లను చూస్తే నాకెంతో ఆదర్శంగా ఉంటుంది. స్పిన్‌ బౌలింగ్‌లో హిట్టింగ్‌ ఆడుతున్నాడు. షార్ట్‌ బాల్‌ బలహీనతను అధిగమించాడు. గత రెండేళ్లుగా అతడి స్ట్రైక్‌రేటు కూడా 170కి పైగా ఉంది.He is HIM! He is Shreyas Iyer 🫡🎥 Here's how the #PBKS skipper took on the best to reach his FIFTY 👏Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/oG9HFySe8o— IndianPremierLeague (@IPL) April 16, 2026ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లో 300కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబడుతున్నాడు. మంచి బంతి కోసం ఎదురుచూడటం కాదు.. వాళ్లపై అటాకింగ్‌కు దిగుతూ పైచేయి సాధిస్తున్నాడు. అత్యద్భుతంగా ఆడినా సరే అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదు?టీమిండియాకే నష్టంశ్రేయస్‌ అయ్యర్‌ లాంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం వల్ల.. అతడి కంటే జట్టుకే ఎక్కువ నష్టం. అతడిని నాయకత్వ బృందంలో భాగం చేయకపోవడం కచ్చితంగా జట్టుకు నష్టదాయకం’’ అని అశ్విన్‌ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తీరును విమర్శించాడు. కాగా ఆసియా కప్‌-2025కి ముందు అయ్యర్‌ గురించి మాట్లాడుతూ... జట్టులో ఖాళీ లేనందు వల్లే అతడిని పక్కనపెట్టామని అగార్కర్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాలుగింట గెలిచి అగ్రస్థానానికి దూసుకువచ్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ మాత్రం వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: ‘ఓటములకు ఆ ఒక్కడినే బాధ్యుడిని చేయలేము’

T20 WC 2026 Hit By Match Fixing Allegations, ICC Launches Probe7
T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

భారత్‌ వేదికగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 ప్రపంచకప్‌-2026 జరిగింది. టైటిల్‌ పోరులో టీమిండియా- న్యూజిలాండ్‌ తలపడగా ఆతిథ్య జట్టు చాంపియన్‌గా నిలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో భారత్‌ ట్రోఫీని ముద్దాడింది.ఫిక్సింగ్‌ ఆరోపణలుఈ మెగా టోర్నీ ముగిసిన దాదాపు నెలన్నర తర్వాత సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఈవెంట్లో ఫిక్సింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగింది. గ్రూప్‌-డి మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌- కెనడా మధ్య జరిగిన పోరుపై ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణకు ఆదేశించింది.టీ20 ప్రపంచకప్‌-2026లో న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో కలిపి కెనడాను గ్రూప్‌-డిలో వేశారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా కెనడా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. చెన్నై వేదికగా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది.యువరాజ్‌ సమ్రా సంచలన సెంచరీఓపెనర్‌ యువరాజ్‌ సమ్రా సంచలన సెంచరీ (65 బంతుల్లో 110)తో మెరిశాడు. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ విధ్వంసకర ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (6), ఫిన్‌ అలెన్‌ (21) వెనువెంటనే పెవిలియన్‌ చేరారు. ఇలాంటి తరుణంలో కెనడా కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా పవర్‌ ప్లేలో భాగంగా ఐదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు.దిల్‌ప్రీత్‌ వ్యవహారశైలిపై అనుమానాలునిజానికి దిల్‌ప్రీత్‌ రెగ్యులర్‌ బౌలర్‌ కాదు. అలాంటిది అతడు బౌలింగ్‌కు రావడమే కాకుండా రెండు ఓవర్లు బౌల్‌ చేశాడు. మొత్తంగా 26 పరుగులు ఇచ్చుకుని వికెట్‌ తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ అతడు తేలిపోయాడు. 39 బంతుల్లో 36 పరుగులే చేశాడు.ఈ నేపథ్యంలో దిల్‌ప్రీత్‌ వ్యవహారశైలిపై అనుమానాలు రేకెత్తాయి. పటిష్ట న్యూజిలాండ్‌పై గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించే క్రమంలో మెరుగైన స్థానంలో ఉన్నా.. కెనడా ఆఖరికి ఓటమిపాలైంది. ఇందుకు దిల్‌ప్రీత్‌ కారణమనే ఆరోపణలు రాగా.. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణకు ఆదేశించింది.వెలుగులోకి ఎలా వచ్చింది?ది ఫిఫ్త్‌ స్టేట్‌ అనే కెనడా ఇన్వెస్టిగేటివ్‌ డాక్యుమెంటరీ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇటీవల.. ‘అవినీతి.. నేరం.. క్రికెట్‌’ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఇందులో కెనడా క్రికెటర్లు దేశీ, అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఐసీసీ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టింది. కాగా టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి కొన్ని వారాల ముందే దిల్‌ప్రీత్‌ బజ్వా కెనడా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. అంతకు ముందు కోచ్‌ ఖుర్రం చోహన్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. బుకీలతో అతడు సంబంధాలు కలిగి ఉన్నాడనే వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడా క్రికెట్‌ గనుక దోషిగా తేలితే ఐసీసీ నుంచి కఠిన చర్యలు తప్పవు.చదవండి: ‘ఏ క్షణమైనా బ్రెయిన్‌స్ట్రోక్‌.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’

Hardik Pandya Under Fire Over MI Winless Run Coach Jayawardene Responds8
‘ఓటములకు అతడిని బాధ్యుడిని చేయలేము’

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో హార్దిక్‌ సేన ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఈ సీజన్‌లో ఐదింట నాలుగో పరాజయం నమోదు చేసింది.హార్దిక్‌ పాండ్యాపై విమర్శలుఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)పై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పంజాబ్‌తో మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో తేలిపోవడంతో జట్టుపై ప్రభావం పడింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా 12 బంతుల్లో 14 పరుగులే చేసి మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.ఇక బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసిన పాండ్యా.. 39 పరుగులు ఇచ్చుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాపై విమర్శల దాడి పెరగగా.. హెడ్‌కోచ్‌ మహేళ జయవర్దనె మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ సీజన్‌లో ముంబై ఓటములకు కేవలం హార్దిక్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదన్నాడు.ఆ ఒక్కడినే బాధ్యుడిని చేయలేముపంజాబ్‌ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం హార్దిక్‌ పాండ్యా వైఫల్యం మాత్రమే కాదు. మా సమిష్టి వైఫల్యం. జట్టుగా విఫలమైనపుడు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేను... నాయకత్వ బృందంలో ఉన్న ప్రతి ఒక్కరు, యాజమాన్యం మొత్తం ఇందుకు బాధ్యత వహిస్తుంది.వ్యక్తిగతంగా ఎవరినీ బాధ్యులను చేయలేము. ఇకపై ఆటను మెరుగు పరచుకోవడం ఎలా అన్న అంశం మీద మాత్రమే మేము ప్రస్తుతం దృష్టి సారించాము’’ అని మహేళ జయవర్దనె హార్దిక్‌ పాండ్యాకు అండగా నిలిచాడు.తమ జట్టు బాగానే ఆడుతోందని.. అయితే, పూర్తి స్థాయిలో రాణించి ఫలితాన్ని రాబట్టలేకపోతుందని ఈ సందర్భంగా జయవర్దనె కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిగిలిన జట్లు మాత్రం అత్యద్భుతంగా ఆడుతూ ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నాడు.ప్రభ్‌సిమ్రన్‌,శ్రేయస్‌ మెరుపులుకాగా వాంఖడే వేదికగా టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ చేయగా.. ముంబై బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనింగ్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ అజేయ సెంచరీ (60 బంతుల్లో 112)తో చెలరేగగా.. నమన్‌ ధిర్‌ అర్ధ శతకం (50) బాదాడు.లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 16.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు సాధించింది. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (39 బంతుల్లో 80 నాటౌట్‌) దుమ్ములేపగా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌ (35 బంతుల్లో 66) ఆడాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా ముంబై విధించిన లక్ష్యాన్ని పంజాబ్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది.చదవండి: శ్రేయ‌స్ స్టన్నింగ్ క్యాచ్‌.. షాకైన‌ రోహిత్‌, సూర్య‌!The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026

Punjab Kings beat Mumbai by 7 wickets9
పంజాబ్‌ ‘టాప్‌’ షో

ముంబై: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల జోరు తోడవడంతో... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అజేయంగా సాగుతోంది. గురువారం జరిగిన పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసింది. నాలుగో విజయంతో పంజాబ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరగా... ముంబై వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (60 బంతుల్లో 112 నాటౌట్‌; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే డికాక్‌ దుమ్మురేపాడు. నమన్‌ ధీర్‌ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 68 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. గాయం కారణంగా రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... రికెల్టన్‌ (2), సూర్యకుమార్‌ యాదవ్‌ (0), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (14), రూథర్‌ఫోర్డ్‌ (1) విఫలమయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్ష్ దీప్ సింగ్‌ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (39 బంతుల్లో 80; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచి కొట్టడంతో లక్ష్యం చిన్నబోయింది. బాదుడే... బాదుడు బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్‌ బ్యాటర్లు తొలి ఓవర్‌ నుంచే ముంబై బౌలర్లపై చెలరేగారు. దీపక్‌ చహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ 2 ఫోర్లు కొడితే, ప్రియాన్ష్ ఆర్య (15; 2 ఫోర్లు, 1 సిక్స్‌) 6, 4 బాదాడు. దీంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్యతో పాటు కూపర్‌ కనోలి (17; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ని గజన్‌ఫర్‌ వరుస ఓవర్లలో అవుట్‌ చేయగా... ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది శ్రేయస్‌ తన ఉద్దేశం చాటాడు. పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ 61/2తో నిలిచింది. ఆ తర్వాత శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్‌ జోరు కనబర్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీపక్‌ ఓవర్‌లో 6, 4 కొట్టిన ప్రభ్‌సిమ్రన్‌... హార్దిక్‌ ఓవర్‌లో రెండు, శార్దుల్‌ ఓవర్‌లో రెండు ఫోర్లతో 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌ నుంచి శ్రేయస్‌ కూడా దూకుడు పెంచాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌లతో అలరించిన శ్రేయస్‌ 31 బంతుల్లో పిఫ్టీ మార్క్‌ అందుకున్నాడు. శార్దుల్‌ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన శ్రేయస్‌ మరో భారీ షాట్‌ కొట్టే యత్నంలో అవుటైనా... అప్పటికే పంజాబ్‌ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) శశాంక్‌ (బి) అర్ష్ దీప్ 2; డికాక్‌ (నాటౌట్‌) 112; సూర్యకుమార్‌ (సి) చాహల్‌ (బి) అర్ష్ దీప్ 0; నమన్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) శశాంక్‌ 50; హార్దిక్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) యాన్సెన్‌ 14; రూథర్‌ఫోర్డ్‌ (బి) అర్ష్ దీప్ 1; తిల్‌ (రనౌట్‌) 8; మయాంక్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–134, 4–175, 5–182, 6–193. బౌలింగ్‌: అర్ష్ దీప్ సింగ్‌ 4–0–22–3; యాన్సెన్‌ 4–0–30–1; బార్ట్‌లెట్‌ 4–0–39–0; వైశాక్‌ 3–0–36–0; యుజ్వేంద్ర చాహల్‌ 3–0– 45–0; శశాంక్‌ సింగ్‌ 2–0–19–1. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) దీపక్‌ (బి) గజన్‌ఫర్‌ 15; ప్రభ్‌సిమ్రన్‌ (నాటౌట్‌) 80; కూపర్‌ (సి) డికాక్‌ (బి) గజన్‌ఫర్‌ 17; శ్రేయస్‌ (సి) నమన్‌ (బి) శార్దుల్‌ 66; స్టొయినిస్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–27, 2–45, 3–184. బౌలింగ్‌: దీపక్‌ 2.3–0–45–0; బుమ్రా 4–0–41–0; గజన్‌ఫర్‌ 4–0–31–2; హార్దిక్‌ 3–0–39–0; శార్దుల్‌ 3–0–42–1. ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X కోల్‌కతా వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Indian womens cricket team will play a five match T20 series against South Africa 10
భారత్‌ X దక్షిణాఫ్రికా

టి20 ప్రపంచ కప్‌కు ముందు సన్నాహకాల్లో భాగంగా భారత మహిళల క్రికెట్‌ జట్టు నేటి నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడనుంది. ఇంగ్లండ్‌ వేదికగా ఈ ఏడాది జూన్‌లో ప్రపంచ కప్‌ జరగనున్న నేపథ్యంలో ఒక అగ్రశ్రేణి టీమ్‌తో సిరీస్‌ టీమిండియాకు ఉపయోగపడనుంది. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంకపై టి20 సిరీస్‌లు గెలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా... సఫారీతో సిరీస్‌ ద్వారా జట్టు కూర్పును సరిచూసుకోవాలని భావిస్తోంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో ఆంధ్ర అమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణి కీలకం కానున్నారు. ‘వరల్డ్‌కప్‌నకు ముందు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం. వన్డే ప్రపంచకప్‌ సాధించిన అనంతరం జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది’ అని హర్మన్‌ వెల్లడించింది. రాత్రి గం.9:30 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement