Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

He is Human: New Zealand Star Stunning Remark On Bumrah T20 WC Final1
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్‌ స్టార్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ టైటిల్‌ పోరుకు న్యూజిలాండ్‌, టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో భారత్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్‌ బౌలర్‌ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లోకాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్‌ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్‌ ఫిలిప్స్‌ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్‌ అని అన్నాడు.అతడు కూడా మనిషే కదా!‘‘ఇటీవల టీమిండియా సిరీస్‌లో భాగంగా బుమ్రా బౌలింగ్‌లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్‌ బౌలర్‌. వైవిధ్యభరితంగా బౌలింగ్‌ చేస్తాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్‌లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. అయితే, అతడి మీద మాకు మంచి రోజు అయ్యేది ఫైనలే ఎందుకు కాకూడదు?’’ అని గ్లెన్‌ ఫిలిప్స్‌ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్‌ కివీస్‌తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్‌లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

IND W vs AUS W Only Test: Australia Steady After Sutherland Sinks India2
IND v AUS: భారత్‌ ఆలౌట్‌.. ఆసీస్‌ స్కోరెంతంటే?

ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు మొదటి రోజు తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ వుమెన్‌ టీమ్‌తో మూడు టీ20, మూడు వన్డేలు.. ఒక టెస్టు ఆడేందుకు హర్మన్‌ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియాటీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో దక్కించుకోగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం డే- నైట్‌ టెస్టు మ్యాచ్‌ మొదలైంది. పెర్త్‌లోని WACA స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) నాలుగు పరుగులకే వెనుదిరిగింది. లూసీ హోమిల్టన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రతికా రావల్‌ (18) సైతం నిరాశపరిచింది.హాఫ్‌ సెంచరీతో రాణించిన జెమీమాఇక మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues) అర్ధ శతకం (84 బంతుల్లో 52, 7 ఫోర్లు)తో రాణించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (19) విఫలం కాగా.. లోయర్‌ ఆర్డర్‌లో కశ్వీ గౌతం (34 నాటౌట్‌) మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.మిగిలిన వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీప్తి శర్మ (7), రిచా ఘోష్‌ (11), స్నేహ్‌ రాణా (5), సయాలీ సత్‌గరే (7), క్రాంతి గాడ్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా భారత్‌ 62.4 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.అనాబెల్‌కు నాలుగు వికెట్లుఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. లూసీ హోమిల్టన్‌ మూడు వికెట్లు పడగొట్టింది. డార్సీ బ్రౌన్‌ రెండు, ఆష్లే గార్డ్‌నర్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.ఇక తొలి రోజే బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఆసీస్‌కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లలో జార్జియా వోల్‌ (2)ను సయాలీ బౌల్డ్‌ చేయగా.. ఫోబే లిచిఫీల్డ్‌ (9)ను క్రాంతి గాడ్‌ పెవిలియన్‌కు పంపింది. కెప్టెన్‌ అలెసా హీలీ (13) వికెట్‌ను సయాలీ తన ఖాతాలో వేసుకోగా.. ఎలిస్‌ పెర్రీ, అనాబెల్‌ పట్టుదలగా నిలబడ్డారు.నిలకడగా పెర్రీ, అనాబెల్‌శుక్రవారం నాటి మొదటిరోజు ఆట పూర్తయ్యేసరికి ఎలిస్‌ పెర్రీ 62 బంతుల్లో 43, అనాబెల్‌ 29 బంతుల్లో 20 పరుగులతో క్రీజులో నిలిచారు. మొత్తంగా ఆసీస్‌ 27 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కంటే ఆసీస్‌ 102 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్‌గా తొలి రోజు ఆసీస్‌దే పైచేయి అని చెప్పవచ్చు. చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Some Headless batting: Ashwin Lambasts Abhishek Sharma IND vs ENG3
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్‌ శర్మపై అశ్విన్‌ ఆగ్రహం

అభిషేక్‌ శర్మ.. తొలిసారి ప్రపంచకప్‌ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లు ఆడి డకౌట్‌ అయినా యాజమాన్యం అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్‌గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ తేలిపోయాడు. తొందరపడి వికెట్‌ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్‌మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్‌ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‌‘‘ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్‌ చేశాడు. నిజానికి అభిషేక్‌ గేమ్‌ప్లాన్‌కు నేను వీరాభిమానిని. విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్‌ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్‌ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్‌ తీసి మరో ఎండ్‌కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్‌ అభిషేక్‌పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్‌తో ఫైనల్‌ నేపథ్యంలో.. ‘‘అభిషేక్‌ మంచి బ్యాటర్‌. న్యూజిలాండ్‌తో ఇటీవలి సిరీస్‌లో సూపర్‌ ఫామ్‌ కనబరిచాడు. మిచెల్‌ సాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్‌, హెడ్‌కోచ్‌ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్‌మెంట్‌ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌.. అభిషేక్‌ కోసం లెగ్‌సైడ్‌లో ఒకే ఒక్క ఫీల్డర్‌ను ఉంచాడు. అతడికి క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ పెవిలియన్‌ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య టీ20 ప్రంచకప్‌-2026 ఫైనల్‌కు షెడ్యూల్‌ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

ICC names umpires match officials IND vs NZ T20 WC final Fans Reacts4
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్‌.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్‌ ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య మార్చి 8 (ఆదివారం) ఫైనల్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మెగా ఫైనల్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.అంపైర్లు వీరే..టీమిండియా- కివీస్‌ (IND vs NZ Final) మధ్య టైటిల్‌ పోరుకు అంపైర్లను శుక్రవారం ప్రకటించింది. ఫీల్డ్‌ అంపైర్లుగా రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, అలెక్స్‌ వార్ఫ్‌లకు చోటు ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరు ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌కు కూడా అంపైర్లుగా వ్యవహరించారు.ఆ రెండుసార్లూ గెలిచినా..ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫైనల్‌లలో అంపైర్‌గా పని చేసిన అనుభవం ఇల్లింగ్‌వర్త్‌కు ఉంది. వన్డే వరల్డ్‌కప్‌-2023, టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్స్‌లో ఆయనే అంపైర్‌.అయితే, 2023లో తప్ప 2024, 2025 టైటిల్‌ పోరులో టీమిండియానే విజయం వరించింది. అన్నట్లు 2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది.ఆందోళనలో అభిమానులు.. కారణం ఇదేఅయితే, 2024లో వెస్టిండీస్‌ వేదికగా సౌతాఫ్రికాను.. 2025లో దుబాయ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, 2023 మాదిరే ఈసారి కూడా అదే అంపైర్‌ (ఇల్లింగ్‌వర్త్‌), అదే వేదిక (అహ్మదాబాద్‌)పై ఫైనల్‌ కావడంతో అభిమానులు కాస్త సెంటిమెంట్‌ ఫీలవుతున్నారు. దురదృష్టం వెంటాడకూడదని ప్రార్థిస్తున్నారు.టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌- న్యూజిలాండ్‌ ఫైనల్‌కు అంపైర్లు వీరే👉ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు- రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, అలెక్స్‌ వార్ఫ్‌👉థర్డ్‌ అంపైర్‌- అల్లాఉద్దీన్‌ పలేకర్‌👉ఫోర్త్‌ అంపైర్‌- అడ్రియాన్‌ హోల్డ్‌స్టక్‌👉మ్యాచ్‌ రిఫరీ- ఆండీ పైక్రాఫ్ట్‌.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Not Sanju He Should Have Been Player Of The Match: Ex India Star5
సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్‌

టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్‌ దొరకడం భారత జట్టు చేసుకున్న అదృష్టం అని కొనియాడాడు. టీమిండియాలో ఇంత వరకు ఇలాంటి బౌలర్‌ను ఎన్నడూ చూడలేదంటూ ఆకాశానికెత్తాడు.టైటిల్‌ పోరుకు అర్హతటీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా వాంఖడేలో జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు పరుగుల తేడాతో గెలిచిన సూర్య సేన.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 89) బ్యాట్‌తో రాణిస్తే.. బుమ్రా తన అద్భుత స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ చిచ్చర పిడుగు జేకబ్‌ బెతెల్‌ (48 బంతుల్లో 105) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వేళ.. బుమ్రా తన మ్యాజిక్‌ చూపించాడు.కీలక సమయంలో రాణించిపద్దెనిమిదవ ఓవర్లో 0,1,1,2,1,1 మాత్రమే ఇచ్చిన బుమ్రా.. టీమిండియా వైపు మ్యాచ్‌ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘బుమ్రా గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతడు తరానికొక్క బౌలర్‌. టీమిండియాలో ఇలాంటి బౌలర్‌ను చూడటం అరుదు.సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడుయార్కర్లు, స్లో బాల్స్‌ వేస్తాడు.. అవుట్‌ స్వింగ్‌, ఇన్‌స్వింగ్‌ రాబడతాడు. బౌన్సర్లు సంధిస్తాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ఎలా బౌలింగ్‌ చేయాలో అతడికి బాగా తెలుసు. నా దృష్టిలో ఈ మ్యాచ్‌కు సంబంధించి బుమ్రాకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఇవ్వాల్సింది.ఈ పిచ్‌పై బౌలర్లందరి ఎకానమీ దాదాపుగా 10 దాటి పోయింది. రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలా బౌలింగ్‌ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇంతటి కఠినమైన ఓవర్‌ను బుమ్రా మాత్రమే వేయగలడు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పేర్కొన్నాడు.అక్షర్‌ పటేల్‌ సైతంకాగా ఈ మ్యాచ్‌లో సంజూకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. సంజూ సైతం బుమ్రానే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుమ్రా ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. మరోవైపు.. అక్షర్‌ పటేల్‌ అద్భుతమైన క్యాచ్‌లతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

This Is World Cup: Gavaskar Fumes At Stadium Organiser For Bumrah Chants6
ఇది వరల్డ్‌కప్‌.. గుర్తుందా?: గావస్కర్‌ ఫైర్‌

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్‌ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. ఏడు పరుగుల తేడాతో గట్టెక్కింది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీస్‌ మ్యాచ్‌ గురువారం జరిగిన విషయం తెలిసిందే.సంజూ భారీ అర్ధ శతకంటాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ భారీ అర్ధ శతకం (42 బంతుల్లో 89) తో ఆకట్టుకున్నాడు.ఇక లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియాకు శుభారంభం లభించింది. హార్దిక్‌ పాండ్యా ఫిల్‌ సాల్ట్‌ (5) రూపంలో తొలి వికెట్‌ దక్కించుకోగా.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా హ్యారీ బ్రూక్‌ (7)ను అవుట్‌ చేసి కీలక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.బెతెల్‌ విధ్వంసకర శతకంఅయితే, జేకబ్‌ బెతెల్‌ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 105)తో విరుచుకుపడి.. భారత శిబిరంలో గుబులు రేపాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా ఊపిరి పీల్చుకుంది.ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ కూల్చాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా బౌలింగ్‌ వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాంఖడే డీజే బృందం.. ‘‘బూమ్‌ బూమ్‌ బుమ్రా’’ అంటూ బుమ్రా నామస్మరణ చేయాలని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ బుమ్రా పేరును గట్టిగా పలుకుతూ స్టేడియం దద్దరిల్లేలా చేశారు.Every Team India fan after watching Jasprit Bumrah’s masterclass! 🇮🇳🔥ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/My9xx2WPyt— Star Sports (@StarSportsIndia) March 6, 2026బుమ్రా ఏంటి బుమ్రా?ఈ విషయంపై స్పందిస్తూ భారత మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బుమ్రా బౌలింగ్‌ చేసేందుకు సిద్ధపడినపుడు.. ‘బూమ్‌ బూమ్‌ బుమ్రా’ అని అరవాలని చెప్పడం సరికాదు.బుమ్రా నామస్మరణ చేయాలనుకుంటే అతడు ఫ్రీగా ఉన్నపుడు చేయాలి. ఇది వరల్డ్‌కప్‌ అన్న విషయం గుర్తుంచుకోవాలి’’ అని గావస్కర్‌ ఫైర్‌ అయ్యాడు. కాగా కీలక సెమీ ఫైనల్లో బుమ్రా బౌలింగ్‌ చేస్తున్నపుడు.. అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదన్నది గావస్కర్‌ అభిప్రాయం.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో సూపర్‌-8లో టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) చేసిన ఏర్పాట్లపై కూడా గావస్కర్‌ ఇదే విధంగా స్పందించాడు. మ్యాచ్‌ మధ్యలో లేజర్‌ షో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రవిశాస్త్రి కూడా అతడికి మద్దతు పలికాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

IND vs ENG Mahieka Epic Reaction As Hardik Pandya Son Schools Him7
చూసుకోవా?.. హార్దిక్‌ కుమారుడి రియాక్షన్‌.. మహీక షాక్‌!

ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆకట్టుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 27 పరుగులు సాధించాడు. తద్వారా తన మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా 250 పరుగులు మార్కు దాటడంలో సహాయపడ్డాడు.రెండు వికెట్లుఇక బంతితోనూ హార్దిక్‌ పాండ్యా రాణించాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (5)తో పాటు ప్రమాదకర ఆటగాడు సామ్‌ కర్రాన్‌ (18) వికెట్‌ను కూడా హార్దిక్‌ పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ముంబై వేదికగా వాంఖడే మైదానంలో టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు సెలబ్రిటీలు తరలివచ్చిన విషయం తెలిసిందే. అంబానీ కుటుంబంతో పాటు దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని దంపతులు సహా బాలీవుడ్‌ ప్రముఖులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించారు.నీతా అంబానీతో కలిసిఇక హార్దిక్‌ పాండ్యా ప్రేయసి మహీక శర్మ కూడా మరోసారి స్టాండ్స్‌లో సందడి చేసింది. నీతా అంబానీతో కలిసి మహీక ఒకే వరుసలో కూర్చుంది. అయితే, ఆమెతో పాటు హార్దిక్‌ కుమారుడు అగస్త్య ఉండటం విశేషం. తండ్రి బ్యాటింగ్‌ను ఆస్వాదించిన అగస్త్య.. అతడు అవుటైన తీరును మాత్రం తట్టుకోలేకపోయాడు.ఆ మాత్రం చూసుకోవా?భారత ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి.. విల్‌జాక్స్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యా పరుగు పూర్తి చేసి రనౌట్‌ అయ్యాడు. మరో పరుగుకు యత్నిస్తున్న క్రమంలో జేకబ్‌ బెతెల్‌ బంతిని అందుకుని వికెట్ల వైపు త్రో చేయగా.. వికెట్‌ కీపర్‌ బట్లర్‌ పని పూర్తిచేశాడు. దీంతో హార్దిక్‌ అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐదేళ్ల అగస్త్య కోపంతో ఊగిపోయాడు. ‘‘ఛ.. అంత బాగా ఆడి.. ఇంత చెత్తగా అవుటయ్యావేంటి నాన్నా.. ఆ మాత్రం చూసుకోవా?’’ అన్నట్లుగా గట్టిగా అరిచినట్లు కనిపించింది.ఆమె చేయి పట్టుకుని ఆ సమయంలో మహీక అగస్త్య భుజాలు పట్టుకుని కూల్‌ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం మహీక తనతో పాటు అగస్త్యను తీసుకువెళ్లింది. అగస్త్య ఆమె చేయి పట్టుకుని కారు ఎక్కుతున్న వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.Hardik’s Girl Friend Mahieka with His Son Agasthya pic.twitter.com/oJwx1mxUU6— Ajit Samachar (@SamacharAj10350) March 6, 2026 Hardik Pandya's son Agastya pandya with his dad's girlfriend Mahieka Sharma 😭♥️#INDvsENG pic.twitter.com/5U5DejxvKj— Chota Don (@choga_don) March 5, 2026కాగా సెర్బియా మోడల్‌ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్‌ పాండ్యాకు.. ఆమె ద్వారా కుమారుడు అగస్త్య కలిగాడు. అయితే, నటషాకు విడాకులు ఇచ్చిన పాండ్యా ప్రస్తుతం మహీకతో ప్రేమలో ఉన్నాడు. ఇక సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో గెలిచి భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.చదవండి: T20 WC 2026: ఇంగ్లండ్‌ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన సూర్యకుమార్‌

IND vs ENG: It was the difference in game: McCullum recalls turning point8
T20 WC: మా ఓటమికి కారణం అతడే: మెకల్లమ్‌

ఇంగ్లండ్‌ కల చెదిరింది. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో అడుగుపెట్టాలనుకున్న బ్రూక్‌ బృందాన్ని టీమిండియా గట్టి షాకిచ్చింది. ముంబై వేదికగా గురువారం నాటి సెమీ ఫైనల్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి భారత్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.ఆఖరి వరకు పోరాడినా ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఇక టీమిండియా గెలుపులో అక్షర్‌ పటేల్‌ (Axar Patel)దీ కీలక పాత్రే. సంజూ శాంసన్‌ బ్యాట్‌తో రాణించగా.. జస్‌ప్రీత్‌ బుమ్రా బంతితో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు అక్షర్‌ అందుకున్న క్యాచ్‌లే గెలుపును టీమిండియా వైపు తిప్పాయి.ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ (Brendon McCullum) కూడా ఇదే మాట అంటున్నాడు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. అక్షర్‌ అందుకున్న అద్భుత క్యాచ్‌లే మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాయని పేర్కొన్నాడు. స్కై స్పోర్ట్స్‌ క్రికెట్‌తో మాట్లాడుతూ..అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని‘‘నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో అక్షర్‌ అందుకున్న ఆ రెండు క్యాచ్‌ల గురించి మాట్లాడాలి. వాంఖడే మైదానంలో ఇలాంటి క్యాచ్‌లు అంత సులువేమీ కాదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసింది.ముఖ్యంగా అక్షర్‌ అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశాడు. కీలక సమయంలో అతడు రాణించాడు. నిజానికి చాన్నాళ్లుగా వాళ్ల ఫీల్డింగ్‌ అంత గొప్పగా ఏమీ లేదు.. ఈ రోజు మా వాళ్లే ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండే బాగుండేది. ఏదేమైనా వాళ్లకి (టీమిండియా) క్రెడిట్‌ ఇవ్వాల్సిందే’’ అని మెకల్లమ్‌ చెప్పుకొచ్చాడు.𝗕𝗮𝗽𝘂 𝗯𝗮𝘁𝘁𝗲𝗿𝘀 𝗸𝗲 𝗹𝗶𝘆𝗲 𝗵𝗮𝗻𝗶𝗸𝗮𝗿𝗮𝗸 𝗵𝗮𝗶. 🥵ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/4e06e0SYAv— Star Sports (@StarSportsIndia) March 5, 2026అక్షర్‌ ఫీల్డింగ్‌.. భారత్‌ విజయానికి బాటలుకాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అక్షర్‌ పటేల్‌ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. తొలుత హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ (5) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే, కెప్టెన్‌, డేంజరస్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ బుమ్రా బౌలింగ్‌లో బంతిని గాల్లోకి తరలించగా.. పాయింట్‌ నుంచి చాలా దూరం పరిగెత్తి అక్షర్‌ బంతిని అందుకున్నాడు.అయితే, అన్నింటికంటే విల్‌ జాక్స్‌ (35) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్నా పట్టు కోల్పోయినట్లు అనిపించగా.. అక్కడే ఉన్న దూబే వైపు విసరగా అతడు బంతిని క్యాచ్‌ పట్టాడు. ఇలా మ్యాచ్‌ను మలుపుతిప్పిన కీలక క్యాచ్‌లోనూ అక్షర్‌ భాగమయ్యాడు.చదవండి: టీమిండియా గెలుపునకు ప్రధాన కారణాలు ఇవే

Will India drop Abhishek Sharma in T20 World cup 2026 final against New Zealand?9
T20 WC 2026 Final: అభిషేక్‌పై వేటు పడుతుందా..?

టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడతుంది. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎన్ని అవకాశాలు ఇచ్చినా గాడిలో పడలేకపోవడంతో యావత్‌ భారతం ఆందోళన చెందుతుంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్లైన అతను.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌తో జరిగిన కీలక సమరాల్లోనూ చేతులెత్తేశాడు. టోర్నీ మొత్తంలో జింబాబ్వే మ్యాచ్‌ మినహాయించి ఒక్క మ్యాచ్‌లో కూడా కనీస ప్రదర్శనలు చేయలేకపోయాడు. మొత్తంగా 7 ఇన్నింగ్స్‌ల్లో 12.71 సగటున 89 పరుగులు మాత్రమే చేశాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో మార్చి 8న న్యూజిలాండ్‌తో జరుగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో అభిషేక్‌కు ఆడించాలా వద్దా అన్న చర్చ భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో జోరుగా సాగుతుంది. మేనేజ్‌మెంట్‌ అభిషేక్‌ను వెనకేసుకొస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం వేటు వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. భారత దేశ పరువు సమస్య కాబట్టి, ఛాన్స్‌లు తీసుకోవద్దని సూచిస్తున్నారు.క్లిష్ట సమయంలో మేనేజ్‌మెంట్‌తో పాటు సహచరులు, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిషేక్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. భారత జట్టు అభిషేక్‌పై నమ్మకం కోల్పోలేదని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా పాజిటివ్‌గా ఉంది. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమే అని వెనకేసుకొచ్చాడు. ఒకట్రెండు మంచి షాట్లు ఆడితే ఫామ్‌ తిరిగి వస్తుంది. ఫైనల్‌ అతని రోజు కావచ్చని సహచరుడికి పూర్తి స్థాయి మద్దతు తెలిపాడు.వాస్తవానికి అభిషేక్‌ వరుస వైఫల్యాలకు అతనిపై ఉన్న అధిక అంచనాలే కారణమని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి అధికం కావడం వల్ల అభిషేక్‌ తడబడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు. అతనికి ఫ్రీ హ్యాండ్‌ ఇస్తే సత్ఫలితాలు రావచ్చని అంటున్నారు. పరుగులు రాబట్టేందుకు కష్టపడుతున్న మాట కూడా వాస్తమే అయినప్పటికీ.. ఒక్కసారి లైన్‌లోకి వచ్చాడంటే, అతన్ని ఆడపం కష్టమని అంటున్నారు. ఆఫ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడంలో లోపాలు సరిదిద్దుకుంటే రాణించగలడని అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, కీలకమైన ఫైనల్లో రాణిస్తే మాత్రం అభిషేక్‌ భారత క్రికెట్‌లో చిరస్థాయిగా గుర్తుండిపోతాడు.ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్‌ ప్రదర్శనలు..యూఎస్‌ఏపై 0 (1)నమీబియాపై ఆడలేదుపాకిస్తాన్‌పై 0 (4)నెదర్లాండ్స్‌పై 0 (3)సౌతాఫ్రికాపై 15 (12 బంతులు; 2 ఫోర్లు, సిక్స్‌)జింబాబ్వేపై 55 (30 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)వెస్టిండీస్‌పై 10 (11 బంతులు; 2 ఫోర్లు)ఇంగ్లండ్‌పై 9 (7 బంతులు; 2 ఫోర్లు)కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026 తుది అంకానికి చేరింది. భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్స్‌కు చేరాయి. న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను.. భారత్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ సమర​​ం మార్చి 8న అహ్మదా​బాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం​ వేదికగా జరుగనుంది.

Only 1 Indian and 1 Pakistani, Player Of The Tournament Nominees For T20 World Cup Announced10
T20 WC 2026: ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ నామినీల పేర్లు ప్రకటన

2026 టీ20 ప్రపంచకప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ నామినీల పేర్లను ఐసీసీ ఇవాళ (మార్చి 6) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఒక టీమిండియా ప్లేయర్‌, ఓ పాకిస్తానీ ప్లేయర్‌ ఉన్నారు.భారత్‌ తరఫున ఈ అవార్డుకు నామినేట్‌ అయిన ఆ ఒకే ఒక్కడు సంజూ శాంసన్‌. సంజూ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 232 పరుగులు చేశాడు. అతని సగటు 77.33, స్ట్రైక్ రేట్ 201.73గా ఉంది. ఈ టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు చేరడంలో సంజూది కీలకపాత్ర. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఉగ్రరూపం (50 బంతుల్లో 97 నాటౌట్‌) దాల్చాడు. ఆపై సెమీస్‌లో ఇంగ్లండ్‌పై మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ 89 (42 బంతులు) ఆడి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.పాకిస్తాన్‌ తరఫున ఈ అవార్డుకు నామినేట్‌ అయిన ప్లేయర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌. ఫర్హాన్‌ తన జట్టు సూపర్‌-8 దశ దాటలేకపోయినా, అద్బుత ప్రదర్శనలతో అలరించాడు. శ్రీలంక, నమీబియాపై శతకాలు సాధించి, ఒకే వరల్డ్ కప్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన ఫర్హాన్‌.. 76.63 సగటున, 160.25 స్ట్రైక్ రేట్‌తో 383 పరుగులు చేశాడు.ఇతర నామినీలువిల్ జాక్స్ (ఇంగ్లండ్) – 226 పరుగులు, 9 వికెట్లు.రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) – 128 పరుగులు, 11 వికెట్లు.ఏయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా కెప్టెన్) – 286 పరుగులు, కీలక వికెట్లు.టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్) – 274 పరుగులు, సెమీఫైనల్‌లో 58.లుంగి ఎంగిడి (దక్షిణాఫ్రికా) – 12 వికెట్లు, ఎకానమీ 7.19.షాడ్లీ వాన్ స్కాల్క్విక్ (అమెరికా) – 13 వికెట్లు, టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు.కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026 తుది అంకానికి చేరింది. భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్స్‌కు చేరాయి. న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను.. భారత్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. అంతిమ సమరం మార్చి 8న అహ్మదా​బాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం​ వేదికగా జరుగనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement