Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Lionel Messi has reached another milestone1
మెస్సీ @ 900 గోల్స్‌

ఫోర్ట్‌ లాడెర్‌డేల్‌ (అమెరికా): అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లయోనల్‌ మెస్సీ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఫుట్‌బాల్‌ కెరీర్‌లో 900 గోల్స్‌ సాధించిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా ఇప్పటిదాకా మరో స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకే పరిమితమైన ‘900 గోల్స్‌’ జాబితాలో తానూ భాగమయ్యాడు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ నార్త్, సెంట్రల్‌ అమెరికా అండ్‌ కరీబియన్‌ అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌ (కాన్‌కకాఫ్‌) చాంపియన్స్‌ కప్‌లో ఇంటర్‌ మయామికి ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ... నష్ విల్లేతో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో గోల్‌ చేయడం ద్వారా ‘900’ క్లబ్‌లో చేరాడు. బ్రెజిలియన్‌ దివంగత దిగ్గజం పీలే 1000 గోల్స్‌ చేసినట్లుగా ఉన్నప్పటికీ అధికారిక గోల్స్‌ స్కోరు మాత్రం సుమారు 800 మాత్రమే! ఎందుకంటే పీలే చేసిన వెయ్యి గోల్స్‌లో దిగువ స్థాయి మ్యాచ్‌ల్లో చేసినవి కూడా కలిపారు. దీంతో ఫుట్‌బాల్‌ విశ్లేషకుల లెక్కల ప్రకారం 900 క్లబ్‌లో ప్రస్తుతం రొనాల్డో, మెస్సీలు మాత్రమే ఉన్నారు.

Tanvi Sharma has entered the quarter finals of the Orleans Masters Badminton Tournament2
క్వార్టర్స్‌లో తాన్వి, మాళవిక

ఓర్లియాన్స్‌ (ఫ్రాన్స్‌): ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్‌ తాన్వి శర్మ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో తాన్వి 21–14, 21–17తో భారత్‌కే చెందిన అన్‌మోల్‌ ఖర్బ్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌లలో ఇషారాణి బారువా 21–11, 14–21, 21–17తో వెన్‌ యు జాంగ్‌ (కెనడా)పై, మాళవిక బన్సోద్‌ 24–22, 21–13తో వాంగ్‌ లింగ్‌ చింగ్‌ (మలేసియా)పై, నెగ్గి ముందంజ వేశారు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి హరిహరన్‌ – ఎంఆర్‌ అర్జున్‌ 26–24, 21–14తో అలెగ్డాండర్‌ డున్‌ – ఆడమ్‌ ప్రింగిల్‌ (స్కాట్లాండ్‌)ని ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో 21–9, 18–21, 9–21 స్కోరుతో యుడై ఒకొమొటో (జపాన్‌) చేతిలో ఓటమితో ఆయుశ్‌ శెట్టి (భారత్‌), మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జంట గద్దె రుత్విక శివాని – రోహన్‌ కపూర్‌ 21–19, 9–21, 14–21తో టాప్‌ సీడ్‌ థామ్‌ గిక్వెల్‌ – డెల్‌ఫైన్‌ డెల్‌ర్యూ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడి నిష్క్రమించారు.

World Indoor Athletics in India in 20283
2028లో భారత్‌లో వరల్డ్‌ ఇండోర్‌ అథ్లెటిక్స్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న భారత్‌కు 2028లో వరల్డ్‌ ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహించే అవకాశం దక్కింది. నేటినుంచి పోలాండ్‌ వేదికగా ప్రపంచ ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2026 ప్రారంభం కానుండగా... అంతకంటే ఒక్క రోజు ముందు గురువారం 2028 ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కినట్లు వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. భువనేశ్వర్‌లో ఈ పోటీలు జరుగుతాయి. అయితే శుక్రవారం నుంచి జరిగే పోటీల్లో మన దేశం నుంచి ఒక్క అథ్లెట్‌ కూడా పాల్గొనడం లేదు! ఈ ఏడాది ఆరంభంలో ఈ ఆతిథ్య హక్కుల కోసం న్యూజిలాండ్‌తో పాటు భారత్‌ బిడ్‌ వేయగా... మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం సంతృప్తి చెందిన కౌన్సిల్‌ భువనేశ్వర్‌ను వేదికగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో జపాన్‌ (1999), ఖతర్‌ (2010), చైనా (2025) మాత్రమే ఈ చాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యమివ్వగా... ఇప్పుడు భారత్‌ నాలుగో దేశంగా నిలవనుంది.

Stopped That: PBKS Chahal Makes Big Revelation Ahead Of IPL 20264
మందు మానేశా...ఇక సత్తా చూపిస్తా!

గొప్పగొప్ప లక్ష్యాలు కూడా సమాధి కావడానికి చిన్న చిన్న వ్యసనాలు చాలు. కొండంత బలం వృధా కావడానికి గోరంత బలహీనత చాలు. మరీ ముఖ్యంగా అత్యంత క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమైన క్రీడా రంగంలో బలహీనతలు, దురలవాట్లు ఉండడం అంటే అది చేజేతులా భవిష్యత్తును పాడె ఎక్కించడమే అనాలి. మాజీ టాప్‌ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లి లాంటి వాళ్ల జీవితాలు దీనికో నిదర్శనంగా నిలుస్తున్నాయి కూడా!!ఈ నేపథ్యంలో తాను మద్యం అలవాటును మానుకున్నానని, ఇకపై తన పూర్తి సమయం క్రికెట్‌కే కేటాయిస్తానని ప్రముఖ భారత క్రికెటర్, స్పిన్నర్‌ ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ ప్లేయర్ అయిన యజ్వేంద్ర చహల్‌ చెబుతున్నాడు.ఇటీవల తన మాజీ ఐపీఎల్‌ సహచరుడు ఏబీ డివిలియర్స్‌ ఆధ్వర్యంలోని యూట్యూబ్‌ షోలో చహల్‌ ఈ విషయం గురించి మాట్లాడాడు. ఒకనాటి తన బలహీనతని, అది తనకు కలిగించిన నష్టాన్ని నిస్సంకోచంగా వెల్లడించాడు.తరచూ ఆరోగ్య సమస్యలుగతంలో తాను తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నానని చహల్‌ చెప్పాడు. మరీ ముఖ్యంగా గాయాల కారణంగా తన క్రీడా నైపుణ్యాలను తగిన విధంగా ప్రదర్శించలేకపోయానని పేర్కొన్నాడు. ‘‘కొన్ని సార్లు నా మీద నాకే నిరాశ కలిగిన మాట వాస్తవం. కేకేఆర్‌ మ్యాచ్‌ తర్వాత నా పక్కటెముక విరిగింది, ఆ తర్వాత నా కాలి వేలి కీలు కూడా విరిగింది. అందుకే సెమీఫైనల్, ఫైనల్‌లో నేను నా సరైన లెగ్‌–స్పిన్‌ బౌలింగ్‌ చేయలేకపోయాను’’ అని చహల్‌ గుర్తు చేసుకున్నాడు.‘‘ఈ ఏడాది నేను ముందుగా నా శరీరం గురించి జాగ్రత్త పడాలనుకుంటున్నాను. రాబోయే సీజన్ లో నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపైనే దృష్టి పెట్టా’’ అని చహల్‌ వెల్లడించాడు. మద్యం మానేశానుదీనికి అనుగుణంగా తీసుకున్న తన నిర్ణయాలను గురించి చెబుతూ... తాను మద్యం మానేసినట్లు తెలిపాడు. దానికి కారణం తన వయస్సు తో పాటు పంజాబ్‌ కింగ్స్‌ కోసం మరింత బాగా రాణించాలనే తన ఆలోచనే అని చహల్‌ ఈ సందర్భంగా చెప్పాడు.‘ఇప్పుడు కాదు.. నిజానికి నేను మద్యం తాగడం మానేసి ఆరు నెలలకు పైగా అయింది. నాకు ఇప్పుడు 35 ఏళ్లు, కాబట్టి నా చురుకుతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నా జట్టు కోసం నూటికి నూట యాభై శాతం ఇవ్వాలనుకుంటున్నాను. ఒక సీనియర్‌ ఆటగాడిగా, ఐపీఎల్‌లోని యువ ఆటగాళ్లు నా నుంచి ఏదైనా మంచి విషయం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను’ అని చహల్‌ తన ఆలోచనల్ని ఏకరవు పెట్టాడు.ఈ సందర్భంగా గత సీజన్ లో పంజాబ్‌ కింగ్స్‌ (PBKS) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఫైనల్‌పై కూడా చహల్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. యాన్సెన్‌ లేకపోవడం వల్లేఆ ఓటమికి గల కారణాలలో తమ బౌలింగ్‌ ఆల్‌–రౌండర్‌ మార్కో యాన్సెన్‌ లేకపోవడం కూడా ఒకటని అతను విశ్లేషించాడు. జాన్సెన్‌ 14 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టినప్పటికీ, జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ప్లేఆఫ్స్‌కు దూరమయ్యాడు.సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకుని ఐపీఎల్‌ జూన్ నెలకు వాయిదా పడటంతో, యాన్సెన్‌ క్యాంప్‌ విడిచిపెట్టి, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు దక్షిణాఫ్రికాతో చేరవలసి వచ్చింది.‘ఫైనల్‌లో మార్కో యాన్సెన్‌ గనక ఉండి ఉంటే, ఖచ్చితంగా టైటిల్‌ గెలిచి ఉండేవాళ్ళం. టోర్నమెంట్‌ అంతటా అతను బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం, బ్యాటింగ్‌లో కూడా చివరిలో రెండు మూడు సిక్సర్లు కొట్టగల సత్తా అతనికి ఉంది. అతను బౌలింగ్‌ చేస్తున్న తీరు వల్ల ఇప్పుడు మాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని చహల్‌ చెప్పాడు.చదవండి: IPL 2026: సీఎస్‌కేకు భారీ షాక్‌!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే!

IPL World Richest Cricket Event But not Best as per WCA Rankings5
‘క్యాష్‌ రిచ్‌’ లీగ్‌ ఐపీఎల్‌కు ఘోర అవమానం?

టీ20 క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే యూరోప్‌లో సైతం EUT20 Belgium పేరిట టోర్నీని ప్రవేశపెట్టారు. ఇక క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో పొట్టి క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగాదేశంలో 2008లో ప్రవేశపెట్టిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ఇప్పటికీ పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ ఉండటం ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్‌ ఆశపడతాడనటంలో సందేహం లేదు.ప్రతిభ ఉన్న యువ, అన్‌క్యాప్డ్‌ క్రికెటర్లపై కూడా కోట్ల వర్షం కురవడం ఇందుకు కారణం. ఐపీఎల్‌లో ఆడిన తర్వాత జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు కూడా కోకొల్లలు. అయితే, ప్రపంచ క్రికెటర్ల సమాఖ్య (WCA) మాత్రం ఐపీఎల్‌కు టాప్‌-10 ర్యాంకులలో మూడో స్థానం ఇవ్వడం గమనార్హం.ఫ్రాంఛైజీ క్రికెట్‌ లీగ్‌లకు సంబంధించి WCA గురువారం ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్‌’ లీగ్‌కు ప్రథమ స్థానం కట్టబెట్టిన సమాఖ్య.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు రెండో ర్యాంకు ఇచ్చింది. క్యాష్‌ రిచ్‌.. కానీ బెస్ట్‌ కాదు!క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను మూడో స్థానానికి పరిమితం చేసిన WCA.. బిగ్‌బాష్‌ లీగ్‌ (ఆస్ట్రేలియా), పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లకు టాప్‌-5లో చోటు ఇచ్చింది.ఆటగాళ్లకు చెల్లించే కనీస మొత్తం, సగటు, భద్రతా ప్రమాణాలు, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, వాణిజ్యపరమైన హక్కులు, ఆదాయంలో వాటా, ప్లేయర్‌/ఏజెంట్‌ అప్రూవల్‌ తదితర పదమూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని WCA ఈ ర్యాంకులు ఇచ్చింది.ఈ అంశాలలో మెరుగుపడాలి!ఇందులో భాగంగా ది హండ్రెడ్‌కు వందకు 75.2 మార్కులు రాగా.. సౌతాఫ్రికా లీగ్‌కు 68.0 మార్కులు వేశారు. ఇక ఐపీఎల్‌కు వందకు 62.6 మార్కులే పడ్డాయి. ఆటగాళ్లకు చెల్లింపు విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌గా ఐపీఎల్‌ను పేర్కొన్న WCA.. సెక్యూరిటీ రివ్యూ, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, ఆదాయంలో వాటా తదితర అంశాల్లో మాత్రం మెరుగుపడాలని సూచించింది. పాక్‌ పరిస్థితి ఇదీఇక బిగ్‌బాష్‌ లీగ్‌కు 62.5 మార్కులు రాగా.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌కు 48 మార్కులు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026 సీజన్‌ మార్చి 28న మొదలుకానుంది. పశ్చిమాసియాలో యుద్ధం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలుత 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేయడం గమనార్హం.అంతటా మనోళ్లదే పైచేయికాగా WCA ప్రకటించిన టాప్‌-2 ర్యాంకులలో ఉన్న.. ‘ది హండ్రెడ్‌’, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో అత్యధిక జట్లు ఐపీఎల్‌కు చెందిన ఫ్రాంఛైజీల యాజమాన్యంలోనే ఉండటం గమనార్హం. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు జట్లు ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీల ఓనర్లవే కావడం విశేషం. అంతేకాదు కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, ILT20లోనూ వీరి పెట్టుబడులే ఎక్కువ.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్‌

Big Blow For CSK Star Australian Fast Bowler Ruled Out Of IPL 20266
సీఎస్‌కేకు భారీ షాక్‌!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే!

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు భారీ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ నాథన్‌ ఎల్లిస్‌ తీవ్రంగా గాయపడ్డాడు. తొడకండరాల గాయం కారణంగా అతడు ఐపీఎల్‌-2026 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.పతిరణను వదిలేసి..కాగా 2026 మినీ వేలానికి ముందు శ్రీలంక స్టార్‌, తమ విజయాల్లో కీలకమైన యువ పేసర్‌ మతీశ పతిరణను సీఎస్‌కే విడిచిపెట్టింది. దీంతో పేస్‌ దళం బలహీనపడగా.. రూ. 2 కోట్లకు ఆసీస్‌ పేసర్‌ నాథన్‌ ఎల్లిస్‌ (Nathan Ellis)ను మాత్రం సీఎస్‌కే అట్టిపెట్టుకుంది.అయితే, సీజన్‌ ఆరంభానికి సమయం సమీపిస్తున్న వేళ ఎల్లిస్‌ గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా సీజన్‌ మొత్తానికి అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే సీఈఓ కేఎస్‌ విశ్వనాథన్‌ ధ్రువీకరించారు.మాకు ఇది భారీ ఎదురుదెబ్బ‘‘మాకు ఇది భారీ ఎదురుదెబ్బ. ఎల్లిస్‌ జట్టులో కీలక బౌలర్‌. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అతడు ప్రభావం చూపగలడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడి కోసం వెదుకుతున్నాము’’ అని విశ్వనాథన్‌ స్పోర్ట్స్‌స్టార్‌కు తెలిపారు. దీనిని బట్టి త్వరలోనే ఎల్లిస్‌ రీప్లేస్‌మెంట్‌ను సీఎస్‌కే ప్రకటించనున్నట్లు స్పష్టమైంది.ఇదిలా ఉంటే.. సీఎస్‌కే పేస్‌ విభాగంలో ప్రస్తుతం ఇద్దరు న్యూజిలాండ్‌ బౌలర్లు ఉన్నారు. మ్యాట్‌ హెన్రీని రూ. 2 కోట్లు, ఫౌల్క్స్‌ను రూ. 75 లక్షలకు సీఎస్‌కే మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఇక ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జేమీ ఓవర్టన్‌ కూడా ఈ జట్టులో ఉన్నాడు.ఐపీఎల్‌-2026 టోర్నీకి సీఎస్‌కే జట్టుMS ధోని (వికెట్‌ కీపర్‌), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్‌ ద్వారా, వికెట్‌ కీపర్‌), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్‌ (వికెట్‌ కీపర్‌), ఖలీల్‌ అహ్మద్‌, అకీల్‌ హొసేన్‌, ప్రశాంత్‌ వీర్‌, కార్తిక్‌ శర్మ, మాథ్యూ షార్ట్‌, అమన్‌ ఖాన్‌, జాక్‌ ఫౌల్క్స్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రాహుల్‌ చహర్‌, మ్యాట్‌ హెన్రీ.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్‌

IPL 2026: Tickets Cancelled: Mystery Surrounding KKR Rs 18 Cr Star7
రూ. 18 కోట్లు.. ఫిట్‌గా ఉన్నా అనుమతి లేదు?

ఐపీఎల్‌-2026 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను కేకేఆర్‌ జట్టు నుంచి తొలగించింది.పతిరణకూ గాయం!ఇక కేకేఆర్‌ మరో ఆటగాడు, టీమిండియా స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. పేస్‌ దళాన్ని పటిష్టం చేసే క్రమంలో రాణాతో పాటు రాణిస్తాడని భావించిన శ్రీలంక బౌలర్‌ మతీశ పతిరణ కూడా గాయపడ్డాడు.ఫిట్‌గా ఉన్నా అనుమతి లేదు?టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా పతిరణ కాలికి గాయం కాగా.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే అతడు ఫిట్‌నెస్‌ సాధించినట్లు సమాచారం. అయితే, శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) మాత్రం ఐపీఎల్‌లో ఆడేందుకు పతిరణకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో జాప్యం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పతిరణ ఫిట్‌నెస్‌ విషయంలో తమకు సంతృప్తికరమైన సమాచారం వచ్చినపుడే NOC ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి కేకేఆర్‌ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లు (SLC) అతడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.విమాన టికెట్లు బుకింగ్‌, రద్దుమేము వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. దాదాపుగా ప్రతిరోజు పతిరణ కోసం విమాన టికెట్లు బుక్‌ చేయడం, రద్దు చేయడం జరుగుతోంది’’ అని పేర్కొన్నాయి. కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన పతిరణ.. దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ప్రియ శిష్యుడిగా పేరొందాడు.చెన్నై వదిలేయగా.. రూ. 18 కోట్లకు కొనుగోలుఇప్పటి వరకు 32 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన 23 ఏళ్ల మతీశ పతిరణ.. 47 వికెట్లు తీశాడు. అయితే, 2026 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలివేయగా.. కేకేఆర్‌ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఓవైపు హర్షిత్‌ రాణా జట్టుకు దూరం కాగా.. పతిరణ విషయంలోనూ సస్పెన్స్‌ కొనసాగడం కేకేఆర్‌కు తలనొప్పిగా మారింది.మరోవైపు.. పతిరణ మేనేజర్‌ మాత్రం అతడు త్వరలోనే అందుబాటులోకి వస్తాడనేలా సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ముస్తాఫిజుర్‌ రహమాన్‌ స్థానంలో జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజర్‌బానీని కేకేఆర్‌ జట్టులో చేర్చుకున్న సంగతి తెలిసిందే.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్‌

Arjun Tendulkar leaves Pant impressed with Sachin style technique8
మా నాన్నలా కాదు కానీ..!: అర్జున్‌ టెండుల్కర్‌

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండుల్కర్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా ఏకంగా వంద సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇలాంటి ఇంకెన్నో చిరస్మరణీయ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెజెండరీ బ్యాటర్‌.ఇప్పటికీ గుర్తింపు అంతంతమాత్రమేఇక సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ కూడా తండ్రి బాటలో ‍క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కానీ ఇప్పటికీ తగినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడీ 26 ఏళ్ల ఆల్‌రౌండర్‌. దేశీ క్రికెట్‌లో తొలుత ముంబైకి ఆడిన అర్జున్‌.. తర్వాత గోవాకు మారిపోయి అక్కడ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఇక ఐపీఎల్‌లో తండ్రి సచిన్‌ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ (MI) తరఫున 2023లో అరంగేట్రం చేశాడు అర్జున్‌. ఇప్పటికి మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు అర్జున్‌ను వదిలేసిన ముంబై.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG)కు అతడిని ట్రేడ్‌ చేసింది.ఈసారి లక్నో తరఫున అయినా అవకాశాలు అందిపుచ్చుకోవాలని అర్జున్‌ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌తో అర్జున్‌ సంభాషించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో పంత్‌.. అర్జున్‌ టెండుల్కర్‌ బ్యాట్‌ బరువు గురించి అడుగగా..మా నాన్నలా కాదులే!.. ‘‘1220 గ్రాముల బరువు ఉండవచ్చు. ఇంతకంటే తక్కువ బరువున్న బ్యాట్‌తో నేను ఆడలేను. మా నాన్న అయితే 1301-1315 గ్రాముల బరువున్న బ్యాట్‌ వాడేవారు. నేను అలా కాకుండా 1220 గ్రాముల బరువు ఉన్నది వాడతాను. బ్యాట్‌ ఎలా ఉన్నా బంతిని బాదడమే అంతిమ లక్ష్యం’’ అని అర్జున్‌ సమాధానం ఇచ్చాడు.పెళ్లైన మరుసటి రోజే వచ్చేశావా?ఇక ఆట పట్ల అర్జున్‌ టెండుల్కర్‌ అంకిత భావం గురించి రిషభ్‌ పంత్‌ ప్రస్తావిస్తూ.. ‘‘యువరాజ్‌ సింగ్‌ పాజీతో కలిసి నువ్వు ప్రాక్టీస్‌ చేస్తున్నావు కదా! పెళ్లైన మరుసటి రోజే నెట్స్‌కి వచ్చేశావు. క్రికెట్‌ పట్ల నువ్వు అత్యంత ఆసక్తిగా, ఉత్సుకతతో ఉన్నావు సోదరా!’’ అని పేర్కొన్నాడు.కాగా మార్చి 5న సానియా చందోక్‌తో.. అర్జున్‌ టెండుల్కర్‌ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మార్చి 28 నుంచి ఐపీఎల్‌-2026 ఆరంభం కానుంది. లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్‌ రిక్వెస్ట్‌!Already loving this new Rishabh-Arjun bond 🥹❤️💙 pic.twitter.com/pa79YqebbU— Lucknow Super Giants (@LucknowIPL) March 18, 2026

Identity Weaponised: Gambhir Files Rs 2 5 Cr Lawsuit Delhi HC Details9
తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్‌

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధతో డీప్‌ఫేక్స్‌ తయారు చేసి కొంతమంది తన పరువుకు భంగం కలిగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అదే విధంగా నష్ట పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేసినట్లుగాసామాజిక మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ తదితర వేదికలపై 2025 నుంచి తనపై డీప్‌ఫేక్స్‌ పెరిగిపోయాయని గంభీర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో తాను హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేసినట్లు గంభీర్‌ చెప్పినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్‌ రావడం గమనార్హం.ఆయుధంలా వాడుకుంటూ అప్రతిష్టఇక మరో వీడియోలో గంభీర్‌ (Gautam Gambhir).. టీమిండియా సీనియర్‌ క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయి.. దీనిని 17 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో తన పేరు, గుర్తింపు, రూపం, గొంతుక ఇలా అన్నింటిని వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని గంభీర్‌ కోర్టును ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.చట్టబద్ధంగా రక్షణ కల్పించాలితన గుర్తింపును ఆయుధంగా వాడుకుని పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆదాయం కూడా ఆర్జిస్తున్నారని పేర్కొన్నాడు. కృత్రిమ మేధ యుగంలో తనపై డీప్‌ఫేక్‌ వీడియోలు పెరిగిపోతున్న తరుణంలో.. చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని గౌతీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇందులో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్‌ దాఖలు చేశాడు. తక్షణమే ఆ వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని గంభీర్‌ కోరాడు.కాగా 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు గంభీర్‌. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025.. ఆసియా టీ20 కప్‌-2025.. తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026 టైటిల్‌ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోచ్‌గా గంభీర్‌ విజయవంతమైనా.. టెస్టుల్లో మాత్రం అతడికి పేలవమైన రికార్డు ఉండటం గమనార్హం.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్‌ రిక్వెస్ట్‌!

Kneeling before: Pakistan Star Lambasts Naqvi PCB Recent Failures10
వాళ్ల ముందు మోకరిల్లారు: పీసీబీపై మాజీ క్రికెటర్‌ ఫైర్‌

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రస్తుత యాజమాన్యం తీరుపై ఆ దేశ వెటరన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకరిల్లిందని.. అందుకే పాక్‌ క్రికెట్‌ నాశనమైపోయిందని మండిపడ్డాడు.వరుస వైఫల్యాలుకాగా గత కొంతకాలంగా పాకిస్తాన్‌ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో 2023 నుంచి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ కూడా చేరకుండా ఇంటిబాట పట్టిన పాక్‌.. టీ20 ప్రపంచకప్‌-2024లో కనీసం సూపర్‌-8 చేరకుండానే నిష్క్రమించింది.తాజాగా 2026 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశ దాటినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. ఇక ఈ టోర్నీ తర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లిన పాక్‌ జట్టు.. వన్డే సిరీస్‌లో 2-1తో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. తద్వారా పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఈ మేరకు బంగ్లా చేతిలో పరాభవాన్ని మూటగట్టుకుంది.ఐదారు మందిపైనే ఫోకస్‌ఈ పరిణామాల నేపథ్యంలో పాక్‌ వెటరన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెబాజ్‌ పీసీబీ తీరును ఘాటుగా విమర్శించాడు. ‘‘మీ ఆటగాళ్ల స్థాయి మీరు ఊహించిన స్థాయిలో లేదు. పాకిస్తాన్‌ జట్టు, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) వేదికగా మీరు గత 5-7 ఏళ్ల నుంచి 6-8 మందినే ప్రధానంగా చూపిస్తూ హైలైట్‌ చేస్తున్నారు.పీఎస్‌ఎల్‌, పాక్‌ జట్టు ముఖచిత్రంగా వారిని ప్రమోట్‌ చేస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం మీ రాత మార్చలేకపోతున్నారు. వాళ్లకు స్పాన్సర్‌షిప్‌లు, ఎండార్స్‌మెంట్ల రూపంలో డబ్బులే డబ్బులు. వాళ్లకు పీఎస్‌ఎల్‌లో కెప్టెన్సీలు కూడా మీరే ఇప్పిస్తారు. పాక్‌ క్రికెట్‌ అంటే వాళ్లే అనేంతలా ఇమేజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు.కనక వర్షంకానీ వాళ్లు పాక్‌ క్రికెట్‌ వ్యవస్థలోని లోపాలు అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన ఎంజాయ్‌ చేస్తున్నారు. వాళ్ల జేబులు నిండుతున్నాయి. కానీ పాక్‌ జట్టు ఘోరమైన ఓటములు చవిచూస్తోంది. అయినా సరే అందులో ఒక్క ఆటగాడు కూడా బాధ్యత వహించేందుకు ముందుకు రాడు.జట్టు ఓటమికి ఏవేవో కుంటిసాకులు చెబుతూ తప్పు తమది కాదని పక్క వాళ్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీసీబీ చరిత్రలో ఇంతటి బలహీనమైన యాజమాన్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకర్లింది. మీరే దిక్కు అంటూ వారిని నెత్తినపెట్టుకుంది.కొత్త వాళ్లను ప్రోత్సహించే బదులు పాత వాళ్లను అందలం ఎక్కించింది. వాళ్లేమో ప్రతీ టోర్నీలో ఓడటం.. దానికి ఏదో ఒక సాకు చెప్పడం పరిపాటిగా మారింది. ప్రజలకు కూడా ఇది అలవాటైపోయింది’’ అని పీసీబీ చైర్మన్‌, పాక్‌ మంత్రి మొహ్సిన్‌ నక్వీని ఉద్దేశించి అహ్మద్‌ షెబాజ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.చదవండి: T20 WC 2026: జోస్ బ‌ట్ల‌ర్ రిటైర్మెంట్‌..?

Advertisement
Advertisement
 
Advertisement