ప్రధాన వార్తలు
‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2026 సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైవిధ్యమైన ఆటతో శ్రేయస్ తన ముద్ర ఎప్పుడో వేశాడు. టీమిండియా తరఫున వన్డేల్లో నిలకడగా మారుపేరుగా నిలిచిన శ్రేయస్ టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం అదే టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు అతనొక కెప్టెన్ మాత్రమే కాదు.. బ్యాటర్గా, ఫినిషర్గానూ సత్తా చాటుతూ అన్ని పాత్రలను సమర్థంగా పోషిస్తున్నాడు. అయితే ఈ మార్పు వెనుక తనను చికాకు పెట్టేలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తన మైండ్లో ఉన్నట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఆ వ్యాఖ్యలతో తనను రెచ్చగొట్టారని, జనాలు అనుకుంటున్నది తప్పు అని నిరూపించాలని నిర్ణయించుకున్నట్లు అయ్యర్ తెలిపాడు. జియో హాట్స్టార్ నిర్వహించిన బిలీవ్ కార్యక్రమానికి హాజరైన అయ్యర్ మాట్లాడాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ ను అద్భుతమైన సిక్సర్గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.అయ్యర్ మాట్లాడుతూ.. ‘నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్గా దానిని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నా’ అని తెలిపాడు.ఇక వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా తనపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలపై కూడా అయ్యర్ స్పందించాడు. ‘గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు అన్న మాటలు బాగా వినిపించాయి. అయితే గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో నాకు స్పష్టత ఉంది. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించాను. గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్సెట్ పూర్తిగా మారింది. నా జోన్లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఆడుతున్నా. దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్లోకి రావడం (రిథమ్ను) నేర్చుకున్నాను. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలలో కనిపించే ఆ రిథమ్ను నేను కూడా అలవర్చుకున్నాను’ అని అయ్యర్ తన నిలకడైన ఆటతీరు వెనుక ఉన్న రహస్యాలను వివరించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్ల్లో నెగ్గి 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పంజాబ్ కింగ్స్ మొదట ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోనుంది. ఇక అయ్యర్ ఏడు మ్యాచ్ల్లో 186 స్ట్రైక్రేట్తో 279 పరుగులు సాధించాడు.చదవండి: చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు
PSL: డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు!
ఒకప్పుడు ఐపీఎల్లో స్టార్గా వెలుగొందాడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానుల మనసులో అతడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్నర్ సైతం ఆరెంజ్ ఆర్మీని అంతే ప్రేమించాడు.కెప్టెన్గా 2016లో సన్రైజర్స్కు ట్రోఫీ అందించిన వార్నర్.. ఆ తర్వాత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. క్రమక్రమంగా జట్టులో అతడి స్థానం గల్లంతైంది. బెంచ్కే పరిమితమై వాటర్బాయ్గానూ అతడు సేవలు అందించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆరెంజ్ ఆర్మీకి సోషల్ మీడియా ద్వారా అతడు దగ్గరగానే ఉన్నాడు.తెలుగు పాటలకు రీల్స్ చేస్తూతెలుగు పాటలకు రీల్స్ చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం కూడా చూరగొన్నాడు వార్నర్. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్కు మారిన అతడు.. 2024లో చివరగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో వార్నర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.కరాచీ కింగ్స్ కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించాడు వార్నర్. పీఎస్ఎల్-2026 ఆరంభంలో కరాచీ కింగ్స్ వరుస విజయాలు సాధించినా.. ఆ తర్వాత పరాజయాలతో చతికిలపడింది. ఫలితంగా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.జట్టుగా మనం ఎంతో సాధించాముఈ నేపథ్యంలో జట్టును ఉద్దేశించి వార్నర్ ఉద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ‘‘మనం ఆశించిన ఫలితం రాలేదు. అయితే, ఆట పట్ల మన అంకితభావం, నిబద్ధత నాకు తెలుసు. జట్టుగా మనం ఎంతో సాధించాము.కరాచీ అభిమానులకు ధన్యవాదాలు. మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు. మాకు భద్రత కల్పించిన పోలీసులకూ థాంక్యూ. త్వరలోనే మళ్లీ కలుద్దాం’’ అంటూ కరాచీ కింగ్స్తో దిగిన ఫొటోలను వార్నర్ పంచుకున్నాడు.పీఎస్ఎల్ వదిలేసి ఐపీఎల్కు రాఈ నేపథ్యంలో ఓ భారత నెటిజన్.. ‘‘నువ్వు పీఎస్ఎల్ వదిలేసి ఐపీఎల్లో పునరాగమనం చేయడం మంచిది’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు వార్నర్ ఘాటుగా బదులిచ్చాడు.వార్నర్ రిప్లై వైరల్‘‘ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గట్టిగానే కౌంటర్ ఇచ్చావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు భారత నెటిజన్లు సైతం కౌంటర్లు ఇస్తున్నారు.‘‘ఆటకు స్వస్తి చెప్పిన తర్వాత వార్నర్ ఐపీఎల్ కోచ్గా వస్తాడే కానీ.. పీఎస్ఎల్లో ఉండడు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు కాబట్టే అక్కడ ఉన్నాడు’’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా వార్నర్ ఐపీఎల్లో 184 మ్యాచ్లు ఆడి 6565 పరుగులు చేశాడు.చదవండి: ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు!
బాధపడుతూ కూర్చోలేదు.. తప్పులు రిపీట్ చేయను: ఇషాన్
భారత క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు దూరమైన సమయంలో తాను కుంగిపోలేదన్నాడు. అందుకు బదులు దేశవాళీ టోర్నమెంట్లలో నిలకడగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. రెండున్నరేళ్లుకాగా క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా బీసీసీఐ దాదాపు రెండున్నరేళ్లు ఇషాన్ను పక్కనపెట్టింది. దీంతో జాతీయ జట్టుకు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... ఆ తర్వాత దేశవాళీల్లో భారీగా పరుగులు సాధించాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్గా వ్యవహరించిన ఇషాన్... 500 పైచిలుకు పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాడు. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్నకు ముందు న్యూజిలాండ్తో సిరీస్లో అతడికి అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్రసెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ కివీస్పై సత్తా చాటిన ఇషాన్.. ఆ తర్వాత వరల్డ్కప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు.. టీమిండియా వరుసగా రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకోవడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించిన ఇషాన్ జట్టుకు హ్యాట్రిక్ విజయాలు అందించాడు.ఇక రాజస్తాన్ రాయల్స్తో నివారం జరిగిన మ్యాచ్లో 31 బంతుల్లో 74 పరుగులు చేసిన ఇషాన్ జట్టును గెలిపించాడు. ఇందుకు గానూ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా పునరాగమనంపై స్పందించాడు.బాధపడుతూ కూర్చుంటే ఏమీ రాదు‘నేను భారత జట్టుకు దూరంగా ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదని నాకు నేను సర్ది చెప్పుకున్నా. బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. తిరిగి జట్టులో చోటు దక్కాలంటే పరుగులు సాధించడమే మార్గం. అందుకే ఆటపై దృష్టి పెట్టా. మరింత మెరుగవుతూ నిలకడగా పరుగులు సాధించడం అలవాటు చేసుకున్నా.జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో మరింత అంకితభావంతో ఆడా. ఒక సీజన్లో 300 పరుగులు చేసినా పిలుపు రాకపోతే... 400, 500 ఇలా పరుగుల సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నా. చాన్నాళ్లుగా మూడో స్థానంలో ఆడటం అలవాటైంది. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.చేసిన తప్పులు పునరావృతం కాకుండా... ఒక్కో మ్యాచ్పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నా’ అని ఇషాన్ కిషాన్ పేర్కొన్నాడు. ఇక 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో రెండు సెంచరీలు నమోదు చేసిన వైభవ్పై ఇషాన్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. అతడు బంతిని బాదుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నాడు.చదవండి: ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు!
ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు!
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు ఇటీవలే వెల్లడించారు. నిజానికి మైదానంలో ఎంగిడి పరిస్థితి చూసిన అభిమానులు మాత్రం వణికిపోయారు. ప్రాణాలతో బయటపడితే చాలు దేవుడా అంటూ ప్రార్థించారు. ఐపీఎల్-2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం పంజాబ్ కింగ్స్తో తలపడ్డ సంగతి తెలిసిందే.తల బలంగా నేలకు తాకిఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ రికార్డు స్థాయిలో 264 పరుగులు చేయగా.. పంజాబ్ లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్ ఎంగిడి గాయపడ్డాడు. మిడాఫ్ ప్రాంతంలో బంతిని క్యాచ్ పట్టే క్రమంలో అతడు కిందపడ్డాడు.దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించింది. అయితే అతడి పరిస్థితి దిగజారినట్లు కనిపించడంతో అంబులెన్స్ను మైదానంలోకి రప్పించి.. మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఏసీపీ సంజయ్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి.. ఒక రకంగా ఎంగిడి ప్రాణం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.Lungi Ngidi got Injured while going for a catch Looks very serious 😰. Ambulance was called on ground 🚨. pic.twitter.com/GgU9g68Zsw— Jeet (@JeetN25) April 25, 202611 నిమిషాల్లోనే ఢిల్లీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, మ్యాచ్ జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియం నుంచి సాయంత్రం 6.16 గంటలకు బయల్దేరిన అంబులెన్స్.. రాజేంద్ర నగర్లో ఉన్న మాక్స్ ఆస్పత్రికి కేవలం 11 నిమిషాల్లోనే చేరుకుంది. సాధారణంగా ఈ ప్రయాణానికి 25-30 నిమిషాల సమయం పడుతుంది.Full marks to Delhi Traffic Police for creating a Green Corridor for seamless travel for the ambulance carrying Lungi Ngidi from Kotla to Max Hospital, Rajendra Nagar in just 11 minutes This was initiated by ACP Traffic Central District Sanjay Singh pic.twitter.com/ZRsZwdVzeZ— Vikrant Gupta (@vikrantgupta73) April 25, 2026అయితే, సంజయ్ సింగ్ చొరవ వల్ల ఎంగిడిని తీసుకువెళ్తున్న అంబులెన్స్ త్వరితగతిన ఆస్పత్రికి చేరుకుంది. గూగుల్ మ్యాప్స్పై ఆధారపడకుండా.. మెయిన్ రోడ్డు నుంచే వెళ్లాలని సంజయ్ సింగ్ అంబులెన్స్ డ్రైవర్కు సూచించారట. మొత్తంగా 60 మంది పోలీసులు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా సమన్వయం చేసుకుని.. ఎంగిడి వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరడంలో కీలక పాత్ర పోషించారు.ఎవరీ సంజయ్ సింగ్?ఢిల్లీలో ప్రస్తుతం ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్నారు సంజయ్ సింగ్. ఆయనకు క్రికెట్ బ్యాగ్రౌండ్ ఉంది. గౌతం గంభీర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలతో ఆయన దేశీ క్రికెట్ ఆడారు.ఇక ఎంగిడి గురించి మీడియా సంజయ్ సింగ్ను అడుగగా.. ‘‘నేనూ ఓ క్రికెటర్నే. మైదానంలో తగిలే గాయాలు ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయో నాకు బాగా తెలుసు. ఎంగిడి అంతర్జాతీయ క్రికెటర్. అతడు కుప్పకూలిన విధానం చూస్తే గాయం ఎంత తీవ్రమైందో నాకు అర్థమైంది’’ అని సహానుభూతి ప్రదర్శించారు.ఇదిలా ఉంటే.. ఢిల్లీ విధించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఊదేసింది. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఇక తాజాగా ఢిల్లీకి మరో పరాజయం ఎదురైంది. ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.చదవండి: మీకసలు బుద్ధుందా?.. వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?Lungi Ngidi has suffered a serious injury, and for the first time in IPL history, an ambulance has come onto the ground. This looks very serious—possibly a neck fracture, but hopefully it’s nothing that severe. 😱It is also quite shameful for the Arun Jaitley Stadium DJ to play… pic.twitter.com/CrFFc3grvB— Sonu (@Cricket_live247) April 25, 2026
వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్టాపిక్గా ఉన్న పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్న ఈ పదిహేనేళ్ల పిల్లాడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ జోరు కొనసాగుతోంది.36 బంతుల్లోనే శతక్కొట్టి.. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్లో మ్యాచ్లో వైభవ్ 36 బంతుల్లోనే శతక్కొట్టి.. విధ్వంసకర బ్యాటింగ్కు తాను పెట్టింది పేరని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లు సైతం అతడి ప్రతిభను కొనియాడుతూ కాబోయే సూపర్ స్టార్ అంటూ కితాబులిస్తున్నారు.వయసు అసలు లెక్కలోకే రాదుఈ నేపథ్యంలో ఒలింపిక్ పతకాల విజేత, భారత షూటర్ మనూ భాకర్కు ఓ కార్యక్రమం సందర్భంగా వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్న ఎదురైంది. ఢిల్లీలో జరిగిన జాతీయ రైఫిల్ సమాఖ్య 75వ వార్షికోత్సవానికి హాజరైన ఆమె ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడి చుట్టూ ఉన్న వాళ్లు.. మార్గదర్శనం చేసే వాళ్లు గొప్పగా ఉంటే.. వయసు అసలు లెక్కలోకే రాదు.అయినా ప్రతిభకు వయసుతో పనిలేదు. కొంతమంది అరవై ఏళ్లలో అద్భుతాలు చేస్తే.. మరికొందరికి ఆరేళ్లకే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్లు సరైన దారిలో నడిపిస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం కాస్త సులువు అవుతుంది. టీమిండియా తదుపరి బిగ్ స్టార్ అతడే’’ అని పేర్కొంది.VIDEO | India's double Olympic medallist shooter Manu Bhaker says, “With the right mentorship, Vaibhav (Sooryavanshi) can be the next big star of Indian cricket.”(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/UZwA8iZwSk— Press Trust of India (@PTI_News) April 27, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మనూ భాకర్ను ప్రశ్న అడిగిన విలేకరుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు.ఆమె ఒలింపిక్ పతకాల విజేత‘‘ఆమె ఒలింపిక్ పతకాల విజేత. ఆమె క్రీడ, విజయాల గురించి కాకుండా వైభవ్ సూర్యవంశీ గురించి అడగడం ఎందుకు? మన దేశంలో క్రికెట్నే సర్వస్వంగా భావించేవాళ్లు ఉన్నారని తెలుసు. కానీ ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో స్పోర్ట్స్ ఎడిటర్లకు తెలియదా?సూర్యవంశీ గురించి ఆమెను అడగాల్సిన అవసరం ఏముంది?.. హెడ్లైన్ కోసమే కదా ఇదంతా!.. ఒకవేళ మీరు వైభవ్ సూర్యవంశీని కలిస్తే అప్పుడు మనూ భాకర్ గురించి అడగండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి’’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిగ్గుపడండిమరికొందరు నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘యువ షూటర్ల గురించి దిగ్గజ క్రికెటర్లు ఎప్పుడైనా మాట్లాడారా? మరి మనూ భాకర్ వైభవ్ గురించి ఎందుకు మాట్లాడాలి? మీ ద్వంద్వ ప్రమాణాలకు సిగ్గుపడండి’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా పారిస్ ఒలింపిక్స్లో మనూ భాకర్ రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర భారత్లో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు నెలకొల్పింది.చదవండి: సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త
‘కనీసం ఒక్క బ్యాటర్ ఆడినా కథ వేరుగా ఉండేది’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్లో ఘోర పరాభవంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. అసలేం జరిగిందో తనకు ఇంకా అర్థం కావడం లేదని.. ఇంకా షాక్ నుంచి కోలుకోలేదని తెలిపాడు. ఐపీఎల్-2026లో భాగంగా సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ సోమవారం ఆర్సీబీతో తలపడింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అక్షర్ సేన.. 75 పరుగులకే కుప్పకూలింది. 1/0, 2/2, 3/2, 4/7, 5/7, 6/8... ఒక్కో వికెట్ పడుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లు ఇవి. టాప్–6 బ్యాటర్లంతా వరుసగా 0, 1, 1, 0, 5, 0 పరుగులతో చేతులెత్తేశారు... భువనేశ్వర్, హాజల్వుడ్ నిప్పులు చిమ్ముతుండగా సొంతగడ్డపై ఢిల్లీ విలవిల్లాడింది. టెస్టు మ్యాచ్ను తలపించేలాటెస్టు మ్యాచ్ను తలపించేలా బంతి అద్భుతంగా స్వింగ్ అవుతుండగా ఇద్దరు పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లను ఆడుకున్నాడు. తొలి 23 బంతుల్లో ఢిల్లీ 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా, ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు (49) నమోదు కావడం ఖాయమనిపించింది. అయితే, అభిషేక్ పొరేల్ పట్టుదలతో ఎలాగోలా ఆ మార్క్ను అధిగమించినా ఢిల్లీ చివరకు 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్సీబీకి కేవలం 39 బంతులు సరిపోయాయి. ఒక వికెట్ కోల్పోయి పని పూర్తి చేసిన ఆర్సీబీ ఢిల్లీపై తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఇప్పటికీ అర్థం కావడం లేదుఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ స్పందిస్తూ.. ‘‘అసలేం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందుకే టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము అంటారు. ఏదేమైనా మేమే ఈ పరాభవం నుంచి కోలుకుని ముందుకు సాగాల్సి ఉంది.ఐపీఎల్ చాలా కఠినమైన టోర్నమెంట్. ఒక్కరోజులోనే అంతా తారుమారై పోవచ్చు. ప్రతి మ్యాచ్లోనూ మెరుగ్గా రాణిస్తేనే రేసులో ఉంటాము. అయితే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేము. ప్రతికూల ఆలోచనలతో ఉంటే తదుపరి మ్యాచ్పై కూడా ఆ ప్రభావం పడుతుంది.మా బ్యాటర్లను తప్పు పట్టాల్సిన పనిలేదుఈరోజు మాది కాదు. మా జట్టుతో కూడా ఇదే మాట చెబుతాను. ఈరోజు మా బ్యాటర్ల వైపు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి జట్టులో వరల్డ్క్లాస్ బౌలర్లు ఉన్నారు. వాళ్లు ఎక్కడైనా బంతిని స్వింగ్ చేయగలరు. కాబట్టి మా పవర్ప్లేలో వాళ్లు వికెట్లు తీసిన తీరు నన్ను పెద్దగా ఆశ్చర్యపరచలేదు.Done in style, Done with conviction ✅✅@rcbtweets claim 2️⃣ points registering a record chase in New Delhi 🔥Scorecard ▶️ https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB pic.twitter.com/IWcxJ3PLkV— IndianPremierLeague (@IPL) April 27, 2026 ఏదేమైనా మా ఓపెనర్లు, లేదంటే టాపార్డర్లో కనీసం ఒక్క బ్యాటర్ అయినా క్రీజులో కుదురుకుని ఉంటే కథ కాస్త వేరుగా ఉండేది. ఏదేమైనా క్రెడిట్ ఆర్సీబీ బౌలర్లకు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాడు. ఈ అవమానకర ఓటమి నుంచి కోలుకుని తాము ముందుకు సాగుతామని అక్షర్ పటేల్ ఈ సందర్భంగా తెలిపాడు.చదవండి: అటు కోహ్లి... ఇటు అజితేశ్... ప్లేయర్, అంపైర్గా నాటి సహచరులు
పీవీ సింధు కొత్త ప్రయాణం.. ఇకపై
హోర్సెన్స్ (డెన్మార్క్): భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కౌన్సిల్ సభ్యురాలిగా ఆమె కొత్త పాత్రలో కనిపించనుంది. నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్లోకి ఎంపిక కావడంతోనే సింధు అడుగులు ఈ వైపు పడ్డాయి. అయితే ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఆమెకు అధికారికంగా గుర్తింపు లభించింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో ప్రస్తుతం చురుగ్గా ఆడుతూనే ఈ తరహాలో ఓటు హక్కుతో సహా పరిపాలన బృందంలో భాగం కావడం సింధు ఎంపికను ప్రత్యేకంగా మార్చింది. ఇక శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సింధు తన కొత్త హోదాలో పాల్గొనడం విశేషం. ప్లేయర్ల తరఫున ఆమె ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. ఇకపై జరిగే బీడబ్ల్యూఎఫ్ అధికారిక సమావేశాలు, చర్చల్లో పాల్గొని సింధు షట్లర్ల తరఫున తగు సూచనలిస్తూ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. ‘బీడబ్ల్యూఎఫ్లో ఇంత పెద్ద బాధ్యతను తీసుకొని ఆటగాళ్లను ప్రాతినిధ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. బ్యాడ్మింటన్ నాకు ఎంతో ఇచ్చింది. నా వైపునుంచి ఆటకు ఉపయోగపడే అవకాశం రావడం అదృష్టం’ అని సింధు వ్యాఖ్యానించింది.
లక్ష్యం నాకౌట్ బెర్త్
లండన్: రెండేళ్ల క్రితం సాధించిన ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత పురుషుల, మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లున్నాయి. నేటి నుంచి మొదలయ్యే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్ష్ప్లో భారత జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించడమే తొలి లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మహిళల విభాగంలో భారత నంబర్వన్, ప్రపంచ 41వ ర్యాంకర్ ఆకుల శ్రీజ ఈ మెగా ఈవెంట్కు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఆశలన్నీ మరో స్టార్ ప్లేయర్ మనిక బత్రా (ప్రపంచ 49వ ర్యాంకర్)తోపాటు యశస్విని ఘోర్పడే (ప్రపంచ 88వ ర్యాంకర్), దియా చిటాలె (ప్రపంచ 92వ ర్యాంకర్), సుతీర్థ ముఖర్జీ (ప్రపంచ 120వ ర్యాంకర్), సిండ్రెల్లా దాస్ (ప్రపంచ 175వ ర్యాంకర్)లపై ఆధారపడి ఉన్నాయి. బెంగాల్కు చెందిన 16 ఏళ్ల సిండ్రెల్లా దాస్ ఈ మెగా ఈవెంట్కు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపిన్న వయసు్కరాలిగా గుర్తింపు పొందనుంది. గ్రూప్–6లో ఉక్రెయిన్, ఉగాండా, రువాండా జట్లతో భారత్ ఆడనుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో ఉగాండా జట్టుతో భారత్ తలపడుతుంది. అనంతరం బుధవారం ఉక్రెయిన్ జట్టుతో, గురువారం రువాండా జట్టుతో టీమిండియా పోటీపడుతుంది. నేరుగా నాకౌట్ దశకు అర్హత పొందాలంటే భారత్ గ్రూప్ ‘టాపర్’గా నిలవాల్సి ఉంటుంది. స్థాయికి తగ్గట్టు ఆడితే భారత జట్టుకు అంత కష్టమేమీ కాదు. మరోవైపు దిగ్గజం ఆచంట శరత్ కమల్ రిటైర్ కావడంతో... ఈసారి భారత పురుషుల జట్టు ఆశలన్నీ మానవ్ ఠక్కర్ (ప్రపంచ 38వ ర్యాంకర్), సత్యన్ జ్ఞానశేఖరన్ (ప్రపంచ 42వ ర్యాంకర్), మనుశ్ షా (ప్రపంచ 51వ ర్యాంకర్), హరీ్మత్ దేశాయ్ (ప్రపంచ 80వ ర్యాంకర్), పాయస్ జైన్ (ప్రపంచ 127వ ర్యాంకర్) ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి. గ్రూప్–7లో స్లొవేకియా, ట్యూనిషియా, గ్వాటెమాలా జట్లతో భారత్ పోటీపడుతుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో ట్యూనిష్యాతో టీమిండియా ఆడుతుంది. అనంతరం బుధవారం స్లొవేకియా జట్టుతో, గురువారం గ్వాటెమాలా జట్టుతో భారత్ తలపడుతుంది. నేరుగా నాకౌట్ దశకు చేరాలంటే భారత్ గ్రూప్ ‘టాపర్’గా నిలవాలి. 2024 ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్ష్ప్లో భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు అర్హత పొంది తొలి రౌండ్లో వెనుదిరిగాయి. ఒకవేళ భారత జట్లు గ్రూప్ విజేతలుగా నిలవకపోతే... రెండో స్థానంలో నిలిచిన టాప్–6లో ఉండాలి. లేదంటే ఆఖరి అవకాశంగా నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో విజేతగా ఉండాలి.
తొలిసారి మహిళల రగ్బీ లీగ్
న్యూఢిల్లీ: గత ఏడాది మొదటిసారి పురుషుల కోసం భారత్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) జరగ్గా... రెండో ఏడాది ఏకకాలంలో పురుషులతోపాటు మహిళల రగ్బీ లీగ్ను నిర్వహించనున్నారు. జూన్ 16 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం రగ్బీ ప్రీమియర్ లీగ్కు ఆతిథ్యమిస్తుంది. క్రితంసారి పురుషుల విభాగంలో ఆరు జట్లు పోటీపడ్డాయి. ఆ ఆరు పురుషుల జట్లలో నుంచి నాలుగు జట్లతో (చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్కతా బంగా టైగర్స్) మహిళల విభాగం పోటీలు నిర్వహిస్తారు. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సహకారంతో రగ్బీ ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఈనెల 30న హైదరాబాద్లో వేలం కార్యక్రమం జరగనుంది. చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్కతా బంగా టైగర్స్తోపాటు హైదరాబాద్ హీరోస్, బెంగళూరు బ్రేవ్హార్ట్స్ ఆర్పీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. గత ఏడాది ముంబైలో జరిగిన తొలి సీజన్లో చెన్నై బుల్స్ టైటిల్ సాధించింది. ‘మహిళల విభాగంలోనూ రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని కల కన్నాం. రెండో ఏడాదే మా కల నిజమవుతోంది. ఈ విషయంలో జీఎంఆర్ స్పోర్ట్స్ను, మా ఫ్రాంచైజీలను అభినందించాలి’ అని రగ్బీ ఇండియా అధ్యక్షుడు, సినీ నటుడు రాహుల్ బోస్ తెలిపాడు.
అటు కోహ్లి... ఇటు అజితేశ్... ప్లేయర్, అంపైర్గా నాటి సహచరులు
న్యూఢిల్లీ: 2008 అండర్–19 వరల్డ్ కప్... విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత్ ఈ టోర్నీ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 5 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన పేస్ బౌలర్ అజితేశ్ అర్గల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ 18 ఏళ్లలో ఇద్దరి ప్రస్థానం వేర్వేరుగా సాగింది. కోహ్లి దిగ్గజ క్రికెటర్ స్థాయికి చేరుకోగా, అజితేశ్ కెరీర్ పెద్దగా సాగలేదు. అండర్–19 స్థాయిలో ప్రతిభ చూపి ఆ తర్వాత కనుమరుగైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీలో 19 మ్యాచ్లకే పరిమితమైన అతడిని ఐపీఎల్లో పంజాబ్ జట్టు తీసుకున్నా... ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత అజితేశ్ అంపైరింగ్ వైపు మళ్లాడు. ఈ నెల 22న తొలిసారి ఐపీఎల్లో అంపైరింగ్ చేసిన అజితేశ్ తన మూడో మ్యాచ్లో కోహ్లిని కలుసుకున్నాడు. సోమవారం ఢిల్లీ, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో కోహ్లి ఆడుతుండగా, అజితేశ్ అంపైరింగ్ చేశాడు. మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆత్మీయత, ముచ్చట్లు ఆసక్తికర దృశ్యానికి చిరునామాగా నిలిచాయి.
భారత్ మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు తొలి విజయం
హోర్సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ టీమ్ బ్యా...
అగ్రస్థానంతో ముగింపు
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్...
సూపర్ సెబాస్టియన్
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ రేసులో కెన్య...
సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రస...
అటు కోహ్లి... ఇటు అజితేశ్... ప్లేయర్, అంపైర్గా నాటి సహచరులు
న్యూఢిల్లీ: 2008 అండర్–19 వరల్డ్ కప్... విరాట్...
చెలరేగిన బౌలర్లు.. ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) జరిగిన 39...
చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు...
ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతూ, పాయింట్ల ...
క్రీడలు
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
వీడియోలు
IPLల్లో ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం
SRHపై బుడ్డోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్
GTపై RCB ఘన విజయం
మ్యాచ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన ఆకాష్ అంబానీ..
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
చేటా దెబ్బకి చేతులెత్తిసిన ముంబై.. IPL చరిత్రలోనే MIకి ఘోర ఓటమి
సామ్సన్ జిగేల్.. ముంబై ఢమాల్
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
అభిషేక్ సిక్సర్లు .. వెంకీ మామ స్టెప్పులు కావ్య పాప నవ్వులే నవ్వులు
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
