Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: Chennai Super Kings Beat Mumbai Indians By 8 Wickets 1
సీఎస్‌కేను గెలిపించిన కార్తిక్ శర్మ.. ముంబై ఓటమి

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై సీఎస్‌కే ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. తొలి అంచె పోటీల్లో ముంబైని చిత్తుగా ఓడించిన సీఎస్‌కే శ‌నివారం రెండో అంచె పోటీలోనూ మ‌రోసారి ముంబైని ఓడించింది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.160 ప‌రుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే మరో 11 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్‌), ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వచ్చిన కార్తిక్‌ శ‌ర్మ (54 నాటౌట్‌) అజేయంగా నిలిచి సీఎస్‌కేను గెలిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గ‌జ‌న్‌ఫ‌ర్ చెరొక వికెట్ తీశారు. అంత‌క‌ముందు ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్‌టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.అజేయ అర్థ‌సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజ‌యం కాగా.. ముంబైకి ఇది ఆరో ఓట‌మి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవ‌కాశాలు మ‌రింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో సీఎస్‌కే 8 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉండ‌గా.. ముంబై ఇండియ‌న్స్ 4 పాయింట్ల‌తో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది.An unorthodox finishing touch to a classic rivalry! 🎬🎥 @ChennaiIPL complete the double over their arch-rivals #MI in style 💛Scorecard ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/yeBWsXZ6Lu— IndianPremierLeague (@IPL) May 2, 2026

Jamie Overton Breaks Tilak Varma's Wrist Watch In Half Days After Heated Face2
తిలక్‌ వర్మకు చేదు అనుభవం!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ క్రికెట‌ర్ తిలక్ వ‌ర్మకు చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. ముంబై ఇన్నింగ్స్ స‌మ‌యంలో సీఎస్కే బౌల‌ర్ జేమీ ఓవ‌ర్ట‌న్ వేసిన బంతి తిల‌క్ వ‌ర్మ చేతికున్న రిస్ట్ వాచ్‌ను రెండు ముక్క‌లు చేసింది. ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్లో ఇది చోటుచేసుకుంది. ఓవ‌ర్ట‌న్ వేసిన షార్ట్ పిచ్ బంతిని షాట్ ఆడే క్ర‌మంలో తిల‌క్ వ‌ర్మ మిస్ చేశాడు. దీంతో బంతి తిల‌క్ వ‌ర్మ చేతికి బ‌లంగా తాకింది. నొప్పితో బాధ‌ప‌డిన తిల‌క్‌ను ఫిజియో వ‌చ్చి ప‌రిశీలించాడు. అదే స‌మ‌యంలో చేతికున్న రిస్ట్ వాచ్ రెండు ముక్క‌లు కావ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తిలక్‌ వర్మ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన తిలక్‌ వర్మ నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (57) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా.. రికెల్‌ట‌న్ 37 ప‌రుగులు చేశాడు.𝗧𝗜𝗠𝗘 𝗢𝗨𝗧 ⌚🤐#TilakVarma’s wrist-watch, too, now has a #BiggestRivalry story to tell 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvMI | LIVE NOW 👉https://t.co/wLcMjiCsSi pic.twitter.com/cCLwL6SYux— Star Sports (@StarSportsIndia) May 2, 2026చదవండి: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్

Ish Sodhi Creates Record-Became Highest Wicket-Taker For New Zealand3
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్

టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోదీ చరిత్ర సృష్టించాడు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో ​టీ20 మ్యాచ్‌లో వికెట్ తీయడం ద్వారా సోదీ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బంగ్లా బ్యాటర్ షమ్మీ హొసేన్‌ను ఔట్ చేయడం ద్వారా ఇష్ సోదీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 141 మ్యాచ్‌ల్లో 8.16 ఎకానమీ రేటుతో 165 వికెట్లు తీశాడు. అంతేకాదు కివీస్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గానూ ఇష్ సోదీ నిలిచాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇక రెండో స్థానంలో టిమ్ సౌతీ ఉన్నాడు. సౌతీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు పడగొట్టాడు.ఆ తర్వాతి ‍స్థానంలో మిచెల్ సాంట్నర్ (138 మ్యాచ్‌ల్లో 142 వికెట్లు), నాలుగో స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (83 వికెట్లు), లోకి ఫెర్గూసన్ (76 వికెట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 14.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదోయ్ (33) టాప్ స్కోరర్‌. కివీస్ బౌలర్లలో జోష్ క్లార్క్‌సన్ 3 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్‌, బెన్ సియర్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. బెవన్ జాకబ్స్ (62 నాటౌట్‌) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించాడు. మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ వర్షంతో రద్దుకాగా, ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేశాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బెవన్ జాకబ్స్‌, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా తౌహిద్ హృదోయ్ నిలిచాడు. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బం‍గ్లాదేశ్ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..

Sehwag Tells BCCI Selectors To Consider 36-Year-Old-Pacer In Team India 4
సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ భువనేశ్వర్‌ కుమార్‌ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 36 ఏళ్ల వయసులోనూ తన పేస్‌ పదును చూపిస్తూ ఐపీఎల్‌ 2026 సీజన్లో‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున వికెట్లు తీస్తోన్న భువనేశ్వర్‌ను టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుందని మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. వయసును కాకుండా ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు వయసు కేవలం ఒక అంకె మాత్రమే అనిపిస్తుంది. అతనికి 35-36 ఏళ్లు ఉంటే ఏంటి? అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు, టీ20 ఫార్మాట్‌లో తన పునరాగమనం గురించి అతను ఆలోచించాలి లేదా సెలక్టర్లు ఆలోచించాలి. మనం పాత భువనేశ్వర్‌ను మళ్లీ చూస్తున్నాం. అతని బౌలింగ్‌లో ఆ వాడి, వేడి స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త బంతితో, పాత బంతితో కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు’ అని ప్రశంసించాడు.ఈ ఐపీఎల్ సీజన్‌లో భువనేశ్వర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీ తరఫున ఆడిన కేవలం 9 మ్యాచ్‌లలోనే 17 వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. గ‌తేడాది (2025) ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన సీజన్ మొత్తం మీద అతను 17 వికెట్లు తీయగా, ఈసారి కేవలం 9 మ్యాచ్‌లలోనే ఆ మార్కును అందుకోవడం అతని ఫామ్‌కు నిదర్శనం. ఆర్‌సీబీ ఆడిన గత ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో అతను కనీసం మూడు వికెట్లు తీశాడు.ఇటీవలే అతను టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన మైలురాయిని కూడా అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 350 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్‌గా, రెండో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 325 టీ20 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్, 24.51 సగటుతో 352 వికెట్లు పడగొట్టాడు. అతని కంటే ముందు భారత్ నుంచి స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (391 వికెట్లు) మాత్రమే ఉన్నాడు.చదవండి: చిక్కుల్లో పడిన క్రికెటర్‌ షమీ సోదరుడు!

David Warner Daughters Wear Gharara and Hijab Pic Viral5
పాకిస్తాన్‌పై వార్నర్‌ ప్రేమ?.. హిజాబ్‌ ధరించిన కుమార్తెలు!

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇటీవల అతడు ఐపీఎల్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల పాటు ఐపీఎల్‌లో ఆడి పేరుకు పేరు.. డబ్బు, అభిమానం దండిగా సంపాదించుకున్నాడు వార్నర్‌.ఆరెంజ్‌ ఆర్మీకి ఫేవరెట్‌ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా 2016లో టైటిల్‌ అందించడంతో.. ఆరెంజ్‌ ఆర్మీకి ఫేవరెట్‌గా మారిపోయాడు వార్నర్‌. ఆ తర్వాత జట్టును వీడినా ఇప్పటికీ ఆరెంజ్‌ ఆర్మీ వార్నర్‌ను తమ వాడిలానే భావిస్తుంది. ఇక 2024లో చివరగా ఐపీఎల్‌ ఆడిన ఈ ఆసీస్‌ బ్యాటర్‌ను ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.దీంతో వార్నర్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో చేరాడు. ఈ ఏడాది కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఆరంభంలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించినా.. ఆ తర్వాత వరుస పరాజయాల నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ చేరుకుండానే కరాచీ నిష్క్రమించింది.పాక్‌ బోర్డుకు వార్నర్‌ ధన్యవాదాలుఈ నేపథ్యంలో కరాచీ కింగ్స్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. చక్కటి ఆతిథ్యం ఇచ్చారంటూ పాక్‌ బోర్డుకు వార్నర్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు స్పందిస్తూ భారతీయ నెటిజన్‌ ఒకరు.. ‘‘పీఎస్‌ఎల్‌ను వదిలేసి.. ఐపీఎల్‌కు వచ్చేసెయ్‌’’ అని కామెంట్‌ పెట్టారు. ఇందుకు వార్నర్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘ఇప్పుడు ఆ అవసరం ఏమీలేదు’’ అని పేర్కొన్నాడు.దీంతో వార్నర్‌ పట్ల టీమిండియా, ఐపీఎల్‌ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వార్నర్‌ మరోసారి పాకిస్తాన్‌ పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. తన కూతుళ్లలో ఇద్దరికి పాకిస్తానీ తరహా డ్రెస్సులు (ఘెరారా) వేసి మురిసిపోయాడు. అంతేకాదు ఇద్దరూ హిజాబ్‌ మాదిరి చున్నీ కూడా ధరించడం విశేషం. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31)హిజాబ్‌ ధరించిన కుమార్తెలు!ఈ ఫొటోలను పంచుకుంటూ.. ‘‘పిల్లలకు సంప్రదాయ దుస్తులు ఇచ్చినందుకు హైదర్‌కు థాంక్యూ. తమకు తాముగా పిల్లలు ఇలా రెడీ అయ్యారు. ఫీడ్‌బ్యాక్‌ సూపర్‌గా ఉంది. మీ బెస్ట్‌ అవుట్‌ఫిట్‌ ఏమిటో జత చేయండి’’ అని వార్నర్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ దుస్తుల్లో తన కుమార్తెలు అత్యంత అందంగా ఉన్నారని కొనియాడాడు.ఇందుకు బదులుగా... ‘‘పిల్లలు చక్కగా ఉన్నారు వార్నర్‌ భాయ్‌’’ అంటూ కొంతమంది కితాబులిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం.. ‘‘ఇప్పుడు డ్రెస్సులు.. ఆ తర్వాత సంప్రదాయాలు.. కాస్త ఆలోచించు వార్నర్‌ భయ్యా.. తప్పుగా తీసుకోవద్దు.. కానీ జాగ్రత్తగా ఉండాలి’’ అని హెచ్చరిస్తున్నారు. వార్నర్‌పై ద్వేషం తగదుఇంకొందరేమో వార్నర్‌పై ద్వేషం తగదని.. ఐపీఎల్‌-2026 ఆరంభానికి ముందు.. సన్‌రైజర్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ.. ఆరెంజ్‌ ఆర్మీ పట్ల అతడు ప్రేమను చాటుకున్న తీరును గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా వార్నర్‌ షేర్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌గా మారింది.కాగా డేవిడ్‌ వార్నర్‌- కాండిస్‌ దంపతులుకు ఇవీ మే, ఇండీ రే, ఇస్లా రోస్‌ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్‌డేట్లను వార్నర్‌, కాండిస్‌ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. చదవండి: ‘భారీ’ ధరకు అమ్ముడుపోయిన అర్జున్‌ టెండుల్కర్‌

IPL 2026: Chennai Super Kings Vs Mumbai Indians Match Live Updates6
IPL 2026: ముంబైపై సీఎస్‌కే ఘ‌న విజ‌యం

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ నాలుగో విజ‌యాన్ని సాధించింది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 18.1 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్‌), ఇంపాక్ట్ ప్లేయ‌ర్ కార్తిక్ శ‌ర్మ (54 నాటౌట్‌) అజేయంగా నిలిచి సీఎస్‌కేను గెలిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గ‌జ‌న్‌ఫ‌ర్ చెరొక వికెట్ తీశారు. అంత‌క‌ముందు ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది.గైక్వాడ్ హాఫ్ సెంచరీముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర్థసెంచరీ సాధించాడు. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్‌కే 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే160 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 63 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 24 ప‌రుగులు చేసిన ఉర్విల్ ప‌టేల్ గ‌జ‌న్‌ఫ‌ర్ బౌలింగ్‌లో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్ర‌స్తుతం సీఎస్‌కే 7 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 69 ప‌రుగులు చేసింది.సంజూ శాంస‌న్ (11) ఔట్‌.. తొలి వికెట్ డౌన్‌160 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ 13 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 ప‌రుగులు చేసిన శాంస‌న్ బుమ్రా బౌలింగ్‌లో రికెల్‌ట‌న్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్‌కే టార్గెట్ 160 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్‌టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.ఆరో వికెట్‌ డౌన్‌..5 పరుగులు చేసిన రాబిన్‌ మింజ్‌ అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ముంబై ఇండియన్స్‌ 139 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. 16 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (48), పాండ్యా (9) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ముంబైసీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నమన్ ధిర్ 44, పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నమన్ ధిర్ 42, తిలక్ వర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నమన్‌ ధిర్‌ 25, సూర్యకుమార్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టానికి 29 పరుగులు చేసింది. రికిల్‌టన్‌ 15, నమన్‌ ధిర్‌ 13 పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబైసీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన ఓపెన‌ర్ విల్‌జాక్స్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో రామ‌క్రిష్ణ ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై ఒక ప‌రుగు వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ర‌ఘుశ‌ర్మ సీజ‌న్‌లో తొలి మ్యాచ్ ఆడ‌నుండ‌గా, అశ్వ‌నీ స్థానంలో క్రిష్ భ‌గ‌త్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక చెన్నై సూప‌ర్‌కింగ్స్ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. అకిల్ హొసేన్ స్థానంలో ప్ర‌శాంత్ వీర్‌, గుర్జప్‌నీత్ సింగ్ స్థానంలో రామ‌క్రిష్ణ ఘోష్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఈ సీజ‌న్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోరులో సీఎస్‌కే 103 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్‌పై విజ‌యం సాధించింది.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరిముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, గజన్‌ఫర్

Mohammed Shami Brother-Mohammed Kaif In Trouble Woman Allegations7
చిక్కుల్లో పడిన క్రికెటర్‌ షమీ సోదరుడు!

టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్‌ మహమ్మద్ కైఫ్‌ చిక్కుల్లో పడ్డాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఒక మహిళ షమీ సోదరుడిపై ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. ఉమ్మడి స్నేహితుడు ఇమ్రాన్‌ ద్వారా మహమ్మద్ కైఫ్‌ను బాధితురాలు కలిసింది. వారి తొలి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేయడం మొదలుపెట్టిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొంతకాలం తర్వాత బాధితురాలు కైఫ్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పటినుంచి కైఫ్ ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇక మహ్మద్ షమీ సోదరుడైన మహమ్మద్ కైఫ్ దేశవాలీ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ సహా విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీయ టోర్నమెంట్లలో ఆడాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన కైఫ్ తన కెరీర్‌లో మొత్తం మహమ్మద్ కైఫ్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 43 వికెట్లు, 9 లిస్ట్ -ఏ మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. షమీ కుటుంబానికి వివాదాలు కొత్త కాదు. షమీ భార్య హసీన్ జహాన్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ భారత క్రికెటర్ తరచూ వార్తల్లో నిలిచాడు. గత జనవరిలో ఓటర్ల జాబితాలో అవకతవకల కారణంగా షమీతో పాటు కైఫ్‌ను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇక నిలకడైన ఆటతీరుకు మారుపేరైన షమీ 2023 వన్మింన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు. అయితే ఐపీఎల్ 19వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున ఆడుతున్న షమీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడి 7 వికెట్లు తీశాడు.చదవండి: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

Arjun Tendulkar Joins New Team Huge Salary 400 Percent Base Price8
‘భారీ’ ధరకు అమ్ముడుపోయిన అర్జున్‌ టెండుల్కర్‌

భారత ‍క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ ‘భారీ’ ధరకు అమ్ముడుపోయాడు. టీ20 ముంబై లీగ్‌ తాజా వేలంలో ARCS అంధేరి ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసింది. కనీస ధర కంటే అతడి కోసం ఫ్రాంఛైజీ ఏకంగా 400 శాతం ఎక్కువగా ఖర్చు చేయడం గమనార్హం.ఐపీఎల్‌లో ముంబై నుంచి లక్నోకుకాగా ఆటలో తండ్రి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోతున్నాడు అర్జున్‌ టెండుల్కర్‌ (Arjun Tendulkar). ఇప్పటికీ క్రికెటర్‌గా అతడికి పూర్తి స్థాయి గుర్తింపులేదు. దేశీ క్రికెట్‌లో కొన్నాళ్లు సొంత జట్టు ముంబైకి ఆడిన అర్జున్‌.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినా ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు పెద్దగా గుర్తింపు రావడం లేదు.బెంచ్‌కే పరిమితంఇక ఐపీఎల్‌లో చాలా కాలం ముంబై ఇండియన్స్‌లో ఉన్నాడు అర్జున్‌. ఈ జట్టుకు సచిన్‌ మెంటార్‌గా ఉండగా.. అర్జున్‌ను కనీస ధర రూ. 30 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. ఇటీవలే అతడిని లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసింది. అయితే, లక్నో తుదిజట్టులోనూ అతడికి స్థానం దక్కడం లేదు. దీంతో బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి.ధర ఎంతంటే?ఇలాంటి తరుణంలో తొలిసారి టీ20 ముంబై లీగ్‌లో ఆడేందుకు అర్జున్‌ టెండుల్కర్‌ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వేలంలో కనీస ధర రూ. 2 లక్షలతో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం నాటి వేలంలో అంధేరీ ఫ్రాంఛైజీ అర్జున్‌ కోసం పోటీపడింది. ఆఖరికి రూ. 10 లక్షల ధరకు అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ జీతంలో ఇది దాదాపు 33 శాతం.కాగా టీమిండియా స్టార్‌, 2024, 2026 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్లలో సభ్యుడైన శివం దూబే కూడా అంధేరీ జట్టుకే ఆడుతున్నాడు. అతడి ధర రూ. 20 లక్షలు. ఇక తాజా వేలంలో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ను అంధేరీ రూ. 11 లక్షలకు కొనుగోలు చేసింది.అనుమతి వచ్చిందిలా..ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA)తో సంబంధం లేకున్నా.. ఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు అర్జున్‌ టెండుల్కర్‌కు ప్రత్యేక అనుమతి లభించింది. స్వతహాగా ముంబైకర్‌ అయిన అర్జున్‌.. గతేడాది వేరే రాష్ట్ర టీ20 లీగ్‌లో ఆడనందున బీసీసీఐ నిబంధన ప్రకారం అతడు ముంబై టీ20 లీగ్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది.కాగా ఐపీఎల్‌ కాకుండా కేవలం ఒకే ఒక్క స్థానిక లీగ్‌లో ఆడేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇదలా ఉంటే.. జూన్‌ మొదటి వారంలో టీ20 ముంబై లీగ్‌ జరుగనున్నట్లు సమాచారం.👉టీ20 ముంబై లీగ్‌.. రిటైన్‌ ప్లేయర్ల జాబితా ప్రకటనచదవండి: ద్రవిడ్‌ ‘ది గ్రేట్‌’ అన్నాడు!.. పాక్‌ పేసర్‌కు షాకిచ్చిన పీసీబీ!

BCCI Announces Women Team For ICC T20 World Cup 20269
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సంబంధించి బీసీసీఐ శ‌నివారం భారత జ‌ట్టును ప్ర‌క‌టించింది. అమితా శ‌ర్మ నేతృత్వంలోని సెలెక్ష‌న్ క‌మిటీ, బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ్‌జిత్ సైకియా, మ‌హిళల జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ అమోల్ మ‌జుందార్‌, కెప్టెన్ హర్మ‌న్‌ప్రీత్ కౌర్‌ల‌తో స‌మావేశ‌మైంది. సుదీర్ఘ చ‌ర్చ అనంత‌రం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు.హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ రికార్డు స్థాయిలో ఐదోసారి కెప్టెన్‌గా జ‌ట్టును న‌డిపించ‌నుండ‌డం విశేషం. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్‌, స్మృతి మంధాన‌, జేమీమా రోడ్రిగ్స్‌, ష‌ఫాలీ వ‌ర్మ‌, రిచా ఘోష్‌లు బ్యాటింగ్ భారాన్ని మోయ‌నున్నారు. ఇక ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ‌, రేణుకాసింగ్‌లు బౌలింగ్ ద‌ళాన్ని ముందుండి నడిపించ‌నున్నారు. తెలుగు క్రికెట‌ర్లు శ్రీచ‌ర‌ణి, అరుంధ‌తి రెడ్డి జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. ఇక గాయం కార‌ణంగా దూర‌మైన అమ‌న్‌జ్యోత్ కౌర్ స్థానంలో భార‌తి పుల్మాలిని ఎంపిక చేసిన‌ట్లు సెలెక్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. బ్యాట‌ర్ హ‌ర్లీన్ డియోల్‌, స్పిన్న‌ర్ స్నేహ్‌రాణాలకు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.15 మందితో కూడిన జ‌ట్టుకు హర్మ‌న్‌ప్రీత్ కౌర్ నాయ‌కత్వం వ‌హించ‌నున్నారు. జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. గ్రూప్‌-ఏలో భారత్‌తో పాటు పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది.ఆ తర్వాత 17న నెదర్లాండ్స్‌, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్‌, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక గ్రూప్‌-బిలో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, స్కాట్లాండ్‌, ఐర్లాండ్ ఉన్నాయి. కాగా జూన్ 30న తొలి సెమీఫైనల్‌, జూలై 2న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక జూలై 5న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ ఆతిథ్యమివ్వనుంది.ఇక గతేడాది భారత్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని టీమిండియా ఆనాటి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ వివరాలు..జూన్‌ 14: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌, వేదిక: ఎడ్జ్‌బాస్టన్‌జూన్‌ 17: భారత్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌, వేదిక: హెడ్డింగేజూన్‌ 21: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా, వేదిక: ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌జూన్‌ 25: భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌, వేదిక: ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌జూన్‌ 28: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, వేదిక: లార్డ్స్‌భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్‌, రాధా యాద‌వ్‌. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) చదవండి: ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా!

Pakistan Pacer Who Quoted The Great Rahul Dravid Fined By PCB10
ద్రవిడ్‌ ‘ది గ్రేట్‌’ అన్నాడు!.. పాక్‌ పేసర్‌కు పీసీబీ షాక్‌

పాకిస్తాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ అలీ టీమిండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ను ‘ది గ్రేట్‌’గా అభివర్ణించాడు. ద్రవిడ్‌ చెప్పినట్లే కష్టపడే వాళ్లకు అదృష్టం కూడా కలిసి వస్తుందన్నాడు. తమ విషయంలోనూ ఇదే జరిగిందని హర్షం వ్యక్తం చేశాడు. అయితే, అనూహ్య రీతిలో అతడు జరిమానా బారిన పడ్డాడు. అసలు విషయమేమిటంటే..అరంగేట్ర సీజన్‌లోనేపాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) తుది అంకానికి చేరుకుంది. పెషావర్‌ జల్మీ తొలుత ఫైనల్‌ చేరగా.. తాజాగా హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. కాగా హైదరాబాద్‌ జట్టు ఈ ఏడాదే పీఎస్‌ఎల్‌లో అరంగేట్రం చేసింది.ఆరంభంలో వరుస ఓటములతో విమర్శలపాలైన హైదరాబాద్‌ జట్టు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని ప్లే ఆఫ్స్‌ చేరింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ను శుక్రవారం ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. హైదరాబాద్‌ విజయాల్లో మొహమ్మద్‌ అలీది కీలక పాత్ర. ఇప్పటికి ఈ సీజన్‌లో అతడు పదిహేడు వికెట్లు కూల్చాడు.ది గ్రేట్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నట్లుగాఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు అలీ. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ది గ్రేట్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నట్లుగా.. కష్టపడే వాళ్లకు అదృష్టం కూడా కచ్చితంగా కలిసి వస్తుంది’’ అని పేర్కొన్నాడు.షాకిచ్చిన పీసీబీఇదిలా ఉంటే.. అలీపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) కఠిన చర్యలు చేపట్టింది. అతడి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఇస్లామాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా అలీ.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌తో గొడవపడటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద పీసీబీ ఈ మేరకు శిక్ష విధించింది. కాగా ఎలిమినేటర్‌-1లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి.. 184 పరుగులు చేసింది. దీంతో నరాలు తెగే ఉత్కంఠ పోరులో రెండు పరుగుల స్వల్ప తేడాతో హైదరాబాద్‌ గట్టెక్కి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement