ప్రధాన వార్తలు
విరాట్ కోహ్లి కాదు.. వారిద్దరి వల్లే గెలిచాము: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జోరును కొనసాగిస్తోంది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండ్షో తో అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో లక్నోను 146 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. అనంతరం ఆ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 15.1 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. లక్నోను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేసిన తమ బౌలర్లపై పాటిదార్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ మ్యాచ్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాకు కలిసొచ్చింది. తొలుత ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండీషన్స్ను ఉపయోగించుకుని బౌలింగ్ చేసిన తీరు అమోఘం. ఇక కృనాల్ ఒక ధైర్యవంతుడైన బౌలర్. అతడు బంతికి బంతికి వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. అతడు తర్వాత ఏ బంతి వేస్తాడో కెప్టెన్గా నేను కూడా అంచనా వేయలేకపోతున్నా. అతడితో పాటు సుయాశ్ శర్మ కూడా స్టంప్ టూ స్టంప్ బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా టీ20 లీగ్లలో భువనేశ్వర్, హాజిల్వుడ్ వంటి స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్ పని మరింత సులువు అవుతోంది. వారి అనుభవం జట్టులోని ఇతర బౌలర్లకు కూడా ఎంతో మేలు చేస్తోంది. ఐపీఎల్ ప్రారంభం నుంచే ఆర్సీబీ ఫీల్డింగ్పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పుడు అదే స్పూర్తిని ఫిల్ సాల్ట్ కొనసాగిస్తున్నాడు. సాధారణంగానే అతడు ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్లను అందుకుంటాడు. ఈ రోజ్ కూడా సంచలన క్యాచ్ అందుకున్నాడు. మేము ప్రస్తుతానికి టైటిల్ గురించి ఆలోచించడం లేదన్నాడు. ఇదొక సుదీర్ఘ టోర్నీ. ప్రస్తుతం మా దృష్టి అంతా ఒక్కో మ్యాచ్పైనే ఉందని" పాటిదార్ పేర్కొన్నాడు. కాగా 49 పరుగులతో సత్తాచాటిన కోహ్లి గురుంచి పాటిదార్ మాట్లడకపోవడం గమనార్హం.చదవండి: IPL 2026: సీఎస్కేకు ఘోర అవమానం.. ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు
సీఎస్కేకు ఘోర అవమానం.. ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉన్న రైవలరీ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా మైదానం హాస్ ఫుల్ అవ్వాల్సిందే. అయితే ఈ వైర్యం ఇప్పుడు మైదానం దాటి భారత క్రికెట్ బోర్డు వరకు వెళ్లింది.ఐపీఎల్-2026లో భాగంగా ఏప్రిల్ 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 43 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే.. స్టేడియంలో తమ ఆటగాళ్లను, తమిళ సంస్కృతిని కించపరిచేలా ప్రవర్తించారంటూ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.ఏమి జరిగిందంటే?సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ’దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అంటూ ఓ ట్రాక్ను డీజే ప్లే చేశారు. అయితే ఇవి దక్షిణాదికి చెందిన ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు. ఈ ట్రాక్పై సీఎస్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ" అనే పదాలను వాడుతూ తమిళనాడు గుర్తింపును ఎగతాళి చేశారని సీఎస్కే తమ ఫిర్యాదులో పేర్కొంది.సాధారణంగా డీజేలు హోమ్ టీమ్కు మద్దతుగా ఉంటారు. ఆ విషయాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మా ఆటగాళ్లు అవుట్ అయినప్పుడు డీజే కించపరిచాడు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఈ విషయం పై మేము బీసీసీఐకి లేఖ రాశాము" అని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపాడు. కాగా ఈ "దోశ, ఇడ్లీ" పాట వివాదం గత ఏడాది నుంచే నడుస్తోంది. గత సీజన్లో ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ ఈ పాట పాడటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అప్పట్లో చెపాక్ స్టేడియంలో జితేష్ అవుట్ అయినప్పుడు అదే పాటను ప్లే చేసి సీఎస్కే డీజే బదులిచ్చారు. కానీ సీఎస్కే మేనెజ్మెంట్ జోక్యం చేసుకుని ప్రత్యర్థి ఆటగాళ్లను టార్గెట్గా చేసుకుని కించపరచొద్దని ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ఈ పాట వివాదం వెలుగులోకి వచ్చింది.చదవండి: సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ.. ఐపీఎల్ నుంచి రూ. 4 కోట్ల ప్లేయర్ అవుట్
ముంబై ఇండియన్స్లోకి కొత్త ఆల్రౌండర్
ముంబై ఇండియన్స్లోకి కొత్త ఆల్రౌండర్ వచ్చాడు. గాయపడిన అథర్వ అంకోలేకర్ స్థానంలో జట్టులో చేరాడు. అతని పేరు కృష్ణ్ భగత్. 21 ఏళ్ల కృష్ పంజాబ్కు చెందిన ఆల్రౌండర్. ఇతన్ని ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల బేస్ప్రైజ్కు సొంతం చేసుకుంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన అంకోలేకర్ స్థానాన్ని కృష్ భర్తీ చేశాడు. ముంబైకి చెందిన అంకోలేకర్ను ఈ సీజన్ వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైజ్కు దక్కించుకున్నారు. అయితే అతను గాయం కారణంగా సీజన్ మొత్తం నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో కృష్ జట్టులోక వచ్చాడు.కృష్ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు. కృష్ పంజాబ్ తరఫున 7 ఫస్ట్క్లాస్, 9 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు. గత రెండు సీజన్లలో అతను ముంబై ఇండియన్స్ ట్రైల్స్లో పాల్గొన్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఎంఐ బృందంలో నెట్ బౌలర్గా ఉన్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవుతుంది. సీజన్ను గెలుపుతో బోణీ కొట్టిన ఈ మాజీ ఛాంపియన్, ఆతర్వాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొంది. తాజాగా ఆర్సీబీ చేతిలో చతికిలబడిన ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇవాళ (ఏప్రిల్ 16) జరుగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ వారి సొంత ఇలాకా వాంఖడేలో జరుగనుంది. ఈ మ్యాచ్కు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని తెలుస్తుంది. ఆర్సీబీ మ్యాచ్లో గాయపడిన రోహిత్ పూర్తిగా కోలుకోలేదని సమాచారం.
సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ.. ఐపీఎల్ నుంచి రూ. 4 కోట్ల ప్లేయర్ అవుట్
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఏప్రిల్ 14న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఖలీల్ గాయపడ్డాడు.17వ ఓవర్ చివరి బంతిని వేయడానికి రన్-అప్ తీసుకుంటున్న సమయంలో అతడి కుడి తొడ కండరాలు పట్టేశాయి. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడికి నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో ఖలీల్ మైదానాన్ని వీడాడు. ఆ ఓవర్లోని మిగిలిన బంతిని గుర్జాపనీత్ సింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతడిని స్కానింగ్కు తరలించారు.అయితే వైద్య పరీక్షలలో ఖలీల్ అహ్మద్కు గ్రేడ్ 2 క్వాడ్రిసెప్స్ టియర్ (కండరాల పగుళ్లు) అయినట్లు నిర్ధారణ అయింది. అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 10 నుండి 12 వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో అతడు మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఖలీల్ స్ధానాన్ని మరో ఫాస్ట్ బౌలర్తో సీఎస్కే భర్తీ చేయనుంది.ఇప్పటికే ఎంఎస్ ధోని సేవలను కోల్పోయిన సీఎస్కే నిజంగా ఇదొక భారీ షాక్ అనే చెప్పాలి. ఖలీల్ తన పేస్ బౌలింగ్తో పవర్ప్లే స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. ఖలీల్ ఈ ఏడాది సీజన్లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టినప్పటికి.. తన అద్భుత బౌలింగ్తో పవర్ప్లేలో పరుగులు రాకుండా కట్టడి చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు ఖలీల్ను రూ.4.8 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.చదవండి: గాయంపై అప్డేట్ ఇచ్చిన కోహ్లి
రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ మధ్య తేడా ఇదే..!
క్రికెట్లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ అన్న పదాలు తరుచూ వినిపిస్తుంటాయి. ఈ రెండు పదాలు ఒకేలా అనిపించినా వాటి నియమాలు, ప్రభావం తేడాగా ఉంటాయి. రిటైర్డ్ హర్ట్ అంటే బరిలోకి దిగిన ఆటగాడు గాయపడినప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు క్రీజ్ వదిలి వెళ్తాడు. రిటైర్డ్ ఔట్ విషయానికొస్తే.. వ్యూహాత్మక కారణాల వల్ల బరిలో ఉన్న ఆటగాడు స్వచ్ఛందంగా క్రీజ్ వదిలి వెళ్తాడు. టీ20ల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఏవరైనా ఆటగాడు వేగంగా పరుగులు చేయలేకపోతుంటే సంబంధిత జట్లు అతన్ని రిటైర్డ్ ఔట్గా క్రీజ్ వదిలి రమ్మని ఆదేశిస్తాయి. ఈ విధానం గతంలో ఎక్కువగా కనిపించకపోయినా, ఇటీవల బాగా ఎక్కువైంది.ఒక్కసారి ఆటగాడు రిటైర్డ్ ఔట్గా క్రీజ్ వదిలితే తిరిగి బ్యాటింగ్ చేయడానికి వీలుండదు. అదే రిటైర్డ్ హర్ట్ అయితే మాత్రం వికెట్ పడినప్పుడు లేదా ఇన్నింగ్స్ చివర్లో తిరిగి బ్యాటింగ్కు రావచ్చు. రిటైర్డ్ హర్ట్గా క్రీజ్ వదిలితే నాటౌట్గా పరిగణిస్తారు. దీని వల్ల ఆటగాడి బ్యాటింగ్ సగటుపై నెగిటివ్ ప్రభావం ఉండదు. అదే రిటైర్డ్ ఔట్గా క్రీజ్ వదిలితే సదరు ఆటగాడు ఔట్గా పరిగణించబడతాడు. దీని వల్ల అతని బ్యాటింగ్ సగటుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఐసీసీ నియమాల ప్రకారం ఆటగాడు ఎప్పుడైనా రిటైర్ కావచ్చు. కానీ గాయం లేదా అనారోగ్యం కాకుండా ఇతర కారణాల వల్ల రిటైర్ అయితే, ప్రత్యర్థి కెప్టెన్ అనుమతి లేకుండా తిరిగి రావడం సాధ్యం కాదు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత రిటైర్డ్ హర్ట్గా క్రీజ్ వదిలి తిరిగి బ్యాటింగ్ చేశాడు. అయినా దురదృష్టవశాత్తు అతని వెంటనే ఔటయ్యాడు. పంత్ ఎపిసోడ్ నేపథ్యంలోనే ఈ రిటైర్డ్ హర్ట్-రిటైర్డ్ ఔట్ ప్రస్తావన వచ్చింది. ఈ సీజన్లో రిటైర్డ్ హర్ట్ అయిన రెండో ఆటగాడు పంత్. కొద్ది రోజుల కిందట ఆర్సీబీతోనే జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అయితే అతను పంత్లా తిరిగి బ్యాటింగ్కు రాలేదు.ఐపీఎల్లో ఇప్పటివరకు రిటైర్ట్ హర్ట్, రిటైర్డ్ ఔటైన ఆటగాళ్లు..రిటైర్డ్ హర్ట్2008- డొమినిక్ థోర్న్లీ (ముంబై ఇండియన్స్)2010- వీవీఎస్ లక్ష్మణ్ (డెక్కన్ ఛార్జర్స్)2010- హర్భజన్ సింగ్ (ముంబై ఇండియన్స్)2012- సచిన్ టెండూల్కర్ (ముంబై ఇండియన్స్)2013- సచిన్ టెండూల్కర్ (ముంబై ఇండియన్స్)2014- హర్భజన్ సింగ్ (ముంబై ఇండియన్స్)2015- ఆరోన్ ఫించ్ (ముంబై ఇండియన్స్)2016- కెవిన్ పీటర్సన్ (రైజింగ్ పూణే జెయింట్స్)2017- కృనాల్ పాండ్యా (ముంబై ఇండియన్స్)2018- శిఖర్ ధవన్ (సన్రైజర్స్ హైదరాబాద్)2018- నితీశ్ రాణా (కేకేఆర్)2021- అంబటి రాయుడు (సీఎస్కే)2022- రాహుల్ త్రిపాఠి (సన్రైజర్స్)2023- భానుక రాజపక్స (పంజాబ్)2025- సంజూ శాంసన్ (రాజస్థాన్)2026- రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)2026- రిషబ్ పంత్ (లక్నో)రిటైర్డ్ ఔట్2022- రవిచంద్రన్ అశ్విన్ (రాజస్థాన్)2023- సాయి సుదర్శన్ (గుజరాత్)2023- అథర్వ తైడే (పంజాబ్)2025- తిలక్ వర్మ (ముంబై ఇండియన్స్)2025- డెవాన్ కాన్వే (సీఎస్కే)2026- ఆయుశ్ మాత్రే (సీఎస్కే)
విరాట్ ఖాతాలో మరో భారీ రికార్డు
దిగ్గజ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఏప్రిల్ 15) లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో విరాట్ ఓ సిక్సర్ కొట్టి ఐపీఎల్లో ఓపెనర్గా తన సిక్సర్ల సంఖ్యను 185కు పెంచుకున్నాడు. విరాట్ ఈ రికార్డు సాధించే క్రమంలో కేఎల్ రాహుల్ను అధిగమించాడు. రాహుల్ ఐపీఎల్లో ఓపెనర్గా 184 సిక్సర్లు బాదాడు. రాహుల్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (148) ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత టాప్-5 ఓపెనర్లువిరాట్ కోహ్లి- 185కేఎల్ రాహుల్- 184రోహిత్ శర్మ- 148శిఖర్ ధవన్- 143శుభ్మన్ గిల్- 118ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఓపెనర్ (ఓవరాల్గా) రికార్డు క్రిస్ గేల్ (326) పేరిట ఉంది. గేల్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (210), విరాట్ కోహ్లి (185), కేఎల్ రాహుల్ (184) ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఓపెనర్లుక్రిస్ గేల్- 326డేవిడ్ వార్నర్- 210విరాట్ కోహ్లి- 185కేఎల్ రాహుల్- 184ఫాఫ్ డుప్లెసిస్- 159కాగా, నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 34 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 49 పరుగులు చేశాడు. విరాట్ బాదిన సిక్సర్ దిగ్వేశ్ రాఠీ బౌలింగ్లో వచ్చింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. రసిక్ సలామ్ దార్ 4, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2, హాజిల్వుడ్ ఓ వికెట్ తీశారు. లక్నో ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39), ఆయుశ్ బదోని (38), మార్క్రమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. సాల్ట్ (7), పడిక్కల్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. విరాట్ (49), కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్కీపర్ జితేశ్ శర్మ (23) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపును సునాయాసం చేశారు. టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.
రేపే కమిన్స్ రాక
సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ రేపు (ఏప్రిల్ 17) భారత్కు వస్తున్నాడు. అయితే అతను వచ్చీ రాగానే ఏప్రిల్ 18న సీఎస్కేతో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉండడు. ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్కు కూడా అనుమానమే అని తెలుస్తుంది. అయితే, ఏప్రిల్ 25న రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో మాత్రం తప్పక ఆడే అవకాశం ఉంటుంది. కాగా, కమిన్స్ గాయం (recurring back injury) కారణంగా లీగ్ ప్రారంభానికి ముందే స్కాన్ల కోసం స్వదేశానికి వెళ్లాడు. బుధవారం చేసిన స్కాన్లు అతని గాయం పూర్తిగా పరిష్కారమైందని నిర్ధారించాయి. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి ఐపీఎల్ 2026లో ఆడేందుకు అనుమతినిచ్చింది.గాయం కారణంగా కమిన్స్ గతేడాది యాషెస్ సిరీస్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20 ప్రపంచకప్ను కూడా మిస్ అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ రెండో అర్ధభాగంలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఎస్ఆర్హెచ్ తాజాగా ఓటమెరుగని రాజస్థాన్ రాయల్స్పై సంచలన విజయం సాధించి, ఈ సీజన్లో వారికి ఓటమి రుచి చూపించింది. ఆ మ్యాచ్లో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అనే అరంగేట్రం పేసర్లు చెలరేగిపోయారు. తలో 4 వికెట్లు తీసి పటిష్టమైన రాయల్స్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు.ఈ మ్యాచ్కు ముందు వరకు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా బలహీనంగా ఉండింది. హింగే, సకీబ్ రాక.. త్వరలో కమిన్స్ చేరిక తదుపరి మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఫేట్ను మార్చే అవకాశం ఉంది. బ్యాటింగ్లో ఇషాన్, క్లాసెన్ ఫామ్ సంతృప్తినిస్తున్నా.. అభిషేక్, హెడ్ నిలకడలేమి కలవరపెడుతుంది. స్టాండ్ ఇన్ కెప్టెన్గా ఇషాన్ మంచి మార్కులు సాధించాడు. గత మ్యాచ్లో అతను హింగే, సకిబ్ లాంటి యువ టాలెంట్ను పరిచయం చేసి మార్కులు కొట్టేశాడు.
చారిత్రక మైలురాయిని తాకిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పొట్టి క్రికెట్లో చారిత్రక మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్లో 100 అర్ద సెంచరీల (341 ఇన్నింగ్స్ల్లో) అత్యంత అరుదైన ఫీట్ను సాధించాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో డేవిడ్ వార్నర్ (117) అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి (107), జోస్ బట్లర్ (100) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా బాబర్ వీరి సరసన చేరాడు.పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్తో నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్లో బాబర్ 100 హాఫ్ సెంచరీల ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అతను 51 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు (పెషావర్ జల్మీ) విజయంలోనూ ప్రధానపాత్ర పోషించాడు. పాక్ తరఫున సెంచరీ హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్గా బాబర్ చరిత్రకెక్కాడు.తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 341 ఇన్నింగ్స్లు ఆడిన బాబర్ 100 హాఫ్ సెంచరీలతో పాటు 11 సెంచరీలు కూడా చేశాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వార్నర్ (126), విరాట్ (116) మాత్రమే బాబర్ (111) కంటే ముందున్నారు.బాబర్ టీ20 గణాంకాలు- 341 ఇన్నింగ్స్ల్లో 12,206 పరుగులు - సగటు – 42.38 - స్ట్రైక్ రేట్ – 128.41 - 100 ఫిఫ్టీలు, 11 సెంచరీలుఇటీవలే బాబర్ పీఎస్ఎల్లోనూ ఓ చారిత్రక ఘనత సాధించాడు. ఈ లీగ్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. పీఎస్ఎల్లో 106 మ్యాచ్లు ఆడిన బాబర్ 127.86 స్ట్రయిక్రేట్తో 45.98 సగటున 4093 పరుగులు చేశాడు. పీఎస్ఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ తర్వాతి స్థానాల్లో ఫకర్ జమాన్ (3039), మహ్మద్ రిజ్వాన్ (2853), రిలీ రొస్సో (2392), షోయబ్ మాలిక్ (2350) ఉన్నారు.
గాయంపై అప్డేట్ ఇచ్చిన కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను 146 పరుగులకే (20 ఓవర్లు) కుప్పకూల్చారు. రసిక్ సలామ్ దార్ 4, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2, హాజిల్వుడ్ ఓ వికెట్ తీశారు. హాజిల్వుడ్ తీసింది ఓ వికెటే అయినా అత్యంత పొదుపుగా (4-0-20-1) బౌలింగ్ చేసి ఆర్సీబీ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. లక్నో ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39), ఆయుశ్ బదోని (38), మార్క్రమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన కోహ్లి 49 పరుగులతో రాణించాడు. సాల్ట్ (7), పడిక్కల్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్కీపర్ జితేశ్ శర్మ (23) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపును సునాయాసం చేశారు. టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి తన గాయం (knee injury)పై అప్డేట్ ఇచ్చాడు. మోకాలి నొప్పితో ఇంకా ఇబ్బందిగానే ఉందని అన్నాడు. అయితే గత మ్యాచ్తో పోలిస్తే కాస్త బెటర్ అని తెలిపాడు. గేమ్ ఫినిష్ చేయాలనుకున్నా, పిచ్ స్లో కావడంతో కాస్త కష్టమైందని వివరించాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హెస్సేన్ ఏప్రిల్ 15, 2026న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. 36 ఏళ్ల రూబెల్ తన 15 ఏళ్ల కెరీర్లో 159 మ్యాచ్లు ఆడి 193 వికెట్లు తీశాడు. 27 టెస్ట్ల్లో 36 వికెట్లు, 104 వన్డేల్లో 129 వికెట్లు, 28 టీ20ల్లో 28 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తరఫున 2021 ఏప్రిల్లో తన చివరి మ్యాచ్ (టీ20) ఆడిన రూబెల్.. ఐదేళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూసి చివరికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇకపై దేశీయ క్రికెట్లో కొనసాగుతూ, యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా ఉంటానని స్పష్టం చేశాడు. రిటైర్మెంట్ సందేశంలో అభిమానులు, కుటుంబం, మీడియాకు కృతజ్ఞతలు తెలిపాడు.పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్గా పేరు గడించిన రూబెల్ రివర్స్ స్వింగింగ్ యార్కర్లు వేయడంలో దిట్ట. 2015 వన్డే వరల్డ్కప్లో పటిష్టమైన ఇంగ్లండ్ను మట్టికరిపించడంలో రూబెల్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో అతను వేసిన 4-53 స్పెల్ బంగ్లాదేశ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
అదరగొట్టిన భారత రెజ్లర్లు..
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లిం...
సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పెను సంచలనం న...
సాకర్ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్!
మరో రెండు నెలల్లో సాకర్ మహాసంగ్రామం మొదలుకాను...
విజేత నైశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గోండ్వానా కప్ అఖిల భారత టెన్న...
రేపే కమిన్స్ రాక
సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త. ఆ జట్...
చారిత్రక మైలురాయిని తాకిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పొట్టి క...
గాయంపై అప్డేట్ ఇచ్చిన కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ...
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హెస్సేన్ ఏప్రిల...
క్రీడలు
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
#SRHvsRR మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
హైదరాబాద్ లో వైభవ్ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్ (ఫొటోలు)
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
వీడియోలు
నొప్పితో అల్లాడిపోయిన పంత్.. హాజెల్వుడ్ దెబ్బకి కన్నీళ్లు
టీమిండియాలోకి బుడ్జోడు ఎంట్రీ ఖరారు
ఆయా షేర్.. SRH ఊపిరి పీల్చుకో.. పాట్ కమ్మిన్స్ తిరిగివస్తునాడు ..
వైభవ్ సూర్యవంశీ 'గోల్డెన్ డక్'.. కావ్యపాప కాంతార సెలబ్రేషన్స్
KKR ఓటమి.. దుమ్మురేపిన CSK
ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
హీరో నుంచి జీరో, బొక్క బోర్ల పడ్డ బుడోడు....
అదరగొట్టిన SRH వైభవ్ డకౌట్...
ముంబై ఇండియన్స్.. హ్యాట్రిక్ ఓటమి
ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...
