Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Such a talent Ignored neglected: Dilip Vengsarkar on Indian batter1
నిజంగా ఇది సిగ్గుచేటు.. అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయరు?

దేశవాళీ క్రికెట్‌లో చాలాకాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. సొంత జట్టు తరఫున రంజీ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుకున్నాడు.తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గోవాతో బుధవారం నాటి మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. యాభై ఆరు బంతుల్లోనే శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. మొత్తంగా 75 బంతుల్లో 157 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లతో పాటు ఏకంగా 14 సిక్సర్లు ఉండటం విశేషం.మరోవైపు.. కర్ణాటక బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (Devdutt Padikkal) ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏకంగా మూడు సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌, మాజీ సారథి దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.నిజంగా ఇది సిగ్గుచేటు‘‘మూడు ఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. టీమిండియా తరఫున వచ్చిన అవకాశాలనూ సద్వినియోగం చేసుకున్నాడు. అయినప్పటికీ ఏ ఫార్మాట్‌కు కూడా సెలక్టర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడం నన్ను విస్మయానికి గురిచేస్తోంది.అంతటి ప్రతిభ ఉన్న ఆటగాడిని తరచూ ఇలా ఎలా పక్కనపెట్టగలుగుతున్నారు. నిజంగా ఇది సిగ్గుచేటు. ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టులో పడిక్కల్‌తో కలిసి సర్ఫరాజ్‌ ఖాన్‌ కీలక సమయంలో 132 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.మిమ్మల్ని మీరే నిందించుకోవాలికానీ సెలక్టర్లు ఈ విషయాన్ని మర్చిపోయారు. ఆ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించిన ఇద్దరిని పక్కనపెట్టారు. సర్ఫరాజ్‌ మ్యాచ్‌ విన్నర్‌. అతడి బ్యాటింగ్‌ అద్బుతం. మానసికంగానూ అతడు బలవంతుడు.ఏ ఫార్మాట్లోనైనా.. ఎక్కడైనా చితక్కొట్టగలడు. అలాంటి ఆటగాడిని సెలక్ట్‌ చేయకుండా.. పరాజయాల పాలైతే వేరే ఎవరినీ మీరు నిందించకూడదు. మిమ్మల్ని మీరే నిందించుకోవాల్సి ఉంటుంది’’ అని దిలీప్‌ వెంగ్‌సర్కార్‌.. టీమిండియా సెలక్టర్లకు చురకలు అంటించాడు. కాగా తీవ్ర స్థాయిలో విమర్శల అనంతరం సర్ఫరాజ్‌ ఖాన్‌ను 2024లో అరంగేట్రం చేయించింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. ఇప్పటికి ఆరు టెస్టుల్లో కలిపి అతడు 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.చదవండి: వారితో టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’.. మరి పంత్‌, నితీశ్‌ రెడ్డి సంగతి?

Smriti Mandhana Shares cryptic Lord Krishna quote from Gita Post Viral2
ఉన్నదంతా కోల్పోయామంటే..: స్మృతి మంధాన పోస్ట్‌ వైరల్‌

భారత మహిళా స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధానకు గతేడాది గొప్ప అనుభూతితో పాటు.. చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముఖ్యంగా 2025 సంవత్సరాంతం ఆమె జీవితంలో మరుపురానిదిగా మిగిలిపోనుంది. ఇప్పటికే మహిళల క్రికెట్‌లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు వరల్డ్‌కప్‌ను ముద్దాడాలన్న చిరకాల కోరిక నవంబరులో తీరింది.ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌-2025 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. భారత మహిళా జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది. ఈ విజయంలో ఓపెనర్‌గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. కెరీర్‌లోని అత్యుత్తమ గెలుపు తర్వాత.. అదే నెలలో వ్యక్తిగత జీవితంలోనూ స్మృతి మంధాన (Smriti Mandhana) కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.అనూహ్య రీతిలో వాయిదా.. ఆపై రద్దుదాదాపు ఆరేళ్లుగా తనతో ప్రేమ బంధం కొనసాగించిన బాలీవుడ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో ఏడడుగులు వేసేందుకు స్మృతి సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ఇరు కుటుంబాల సమక్షంలో హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మరికొన్ని గంటల్లో (నవంబరు 23) పెళ్లి తంతు మొదలుకానుండగా అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.స్మృతి తండ్రికి తొలుత గుండెపోటు రాగా.. పలాష్‌ సైతం ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో పెళ్లి వాయిదా పడింది. అయితే, ఆ తర్వాత సోషల్‌ మీడియాలో పలాష్‌ గురించి పెద్ద ఎత్తు చర్చ మొదలైంది. స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా.. తనతో అతడు చాట్‌ చేశాడంటూ ‘ప్రైవేటు’ సంభాషణను ఓ అమ్మాయి షేర్‌ చేసింది. పలాష్‌ స్త్రీలోలుడు అనేలా ఆ మెసేజ్‌లు ఉన్నాయి.అధికారికంగా ప్రకటించి..ఈ నేపథ్యంలో చాన్నాళ్ల వరకు ఈ విషయంపై ఇరు కుటుంబాలు మౌనం వహించగా.. పలాష్‌పై ట్రోలింగ్‌ ఎక్కువైంది. ఈ క్రమంలో తాము పెళ్లిని రద్దు చేసుకున్నామంటూ స్మృతి- పలాష్‌ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు ఆటే ముఖ్యమని.. ఇకపై క్రికెట్‌ మీద మాత్రమే దృష్టి పెడతానంటూ స్మృతి పేర్కొంది.అందుకు అనుగుణంగానే ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో పది వేల పరుగుల క్లబ్‌లో చేరింది. ఇక 2025లో ఓవరాల్‌గా 1703 పరుగులు సాధించి.. క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాన్ని దిగమింగి.. టీ20 ప్రపంచకప్‌-2026లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.2025కు గుడ్‌బై.. ఉన్నదంతా కోల్పోయామంటే..ఈ నేపథ్యంలో 2025కు సంబంధించిన జ్ఞాపకాలతో కూడిన వీడియోను షేర్‌ చేసిన స్మృతి మంధాన.. గీతలో కృష్ణుడు చెప్పిన మాటలను పంచుకుంది. ‘‘ఏదైనా గొప్ప విషయం, మంచి జరిగే ముందు.. అప్పటి వరకు ఉన్నదంతా కోల్పోతాము. కాబట్టి ఓపికగా ఎదురుచూడటమే ఉత్తమం’’ అని స్మృతి పేర్కొంది. ఇక ఈ వీడియోలో తన స్నేహితులు, సహచర ఆటగాళ్లు.. అమ్మానాన్న, అన్నయ్య, మేనల్లుడితో ఉన్న ఫొటోలను కూడా ఆమె జత చేసింది. ఈ మేరకు 2025కు గుడ్‌బై చెబుతూ స్మృతి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: 2026: ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న కోహ్లి పోస్ట్‌ View this post on Instagram A post shared by Smriti Mandhana (@smriti_mandhana)

VHT 2025 Padikkal Ruturaj Sarfraz Message To Selectors Knock Doors3
టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’గా మారిన ప్లేయర్లు

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌, ముంబై సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. పడిక్కల్‌ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లలో మూడుసార్లు శతక్కొట్టాడు. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో 147 పరుగులతో దుమ్ములేపిన పడిక్కల్‌.. కేరళపై 124 పరుగులు సాధించాడు.టీమిండియా సెలక్టర్లకు తలనొప్పిఅనంతరం పుదుచ్చేరిపై 113 పరుగులతో పడిక్కల్‌ ఆకట్టుకున్నాడు. మరోవైపు.. సర్ఫరాజ్‌ బుధవారం విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. గోవాతో మ్యాచ్‌లో 75 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు బాది 157 పరుగులు సాధించాడు. నిలకడైన ప్రదర్శనతో రాణిస్తూ వన్డేలకూ తాను సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నాడు.వీరిద్దరితో పాటు మహారాష్ట్ర బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) సైతం దేశీ వన్డే టోర్నీలో అదరగొడుతున్నాడు. ఉత్తరాఖండ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ రుతు అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 113 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 124 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 331 పరుగులు చేయడంలో రుతుది కీలక పాత్ర.మరోవైపు.. సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ సైతం మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బెంగాల్‌ తరపున బుధవారం నాటి మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసిన షమీ.. జమ్మూ కశ్మీర్‌పై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా వీరంతా అదరగొడుతుంటే.. టీమిండియా రెగ్యులర్‌ జట్టులో భాగమైన ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, ఆంధ్ర సారథి నితీశ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం నిరాశపరుస్తున్నారు.ఆంధ్ర జట్టుకు మూడో పరాజయంనితీశ్‌ కెప్టెన్సీలోని ఆంధ్ర జట్టు (Andhra Cricket Team).. బ్యాటర్ల వైఫల్యం కారణంగా విజయ్‌ హజారే ట్రోఫీలో మూడో పరాజయం మూటగట్టుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో సౌరాష్ట్ర చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్విక్‌ దేశాయ్‌ (81 బంతుల్లో 61; 7 ఫోర్లు), చిరాగ్‌ జానీ (96 బంతుల్లో 69; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రుచిత్‌ అహిర్‌ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు.ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 3 వికెట్లు పడగొట్టగా... కలిదిండి రాజు 2 వికెట్లు తీశాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, జాగర్లపుడి రామ్‌ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు తడబడింది. బ్యాటర్లంతా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవడంతో... ఆంధ్ర జట్టు 47.2 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది.జ్ఞానేశ్వర్‌ (33; 6 ఫోర్లు), హేమంత్‌ రెడ్డి (29; 4 ఫోర్లు), కెప్టెన్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (30; 4 ఫోర్లు), రాజు (30; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయగా... శ్రీకర్‌ భరత్‌ (4), రికీ భుయ్‌ (4), యారా సందీప్‌ (0) విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అంకుర్‌ పన్వర్‌ 5 వికెట్లతో సత్తాచాటాడు. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక విజయం, మూడు పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆంధ్ర జట్టు పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శనివారం గుజరాత్‌తో ఆంధ్ర జట్టు తలపడనుంది.మరి పంత్‌, నితీశ్‌ రెడ్డి సంగతి?అంతకు ముందు.. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లోనూ నితీశ్‌ రెడ్డి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన నితీశ్‌ రెడ్డి.. ఒకే ఒక్క వికెట్‌ తీయగలిగాడు. అయితే, రైల్వేస్‌తో మ్యాచ్‌లో మాత్రం నితీశ్‌ రెడ్డి బ్యాట్‌తో రాణించారు. ఐదో స్థానంలో వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఓ వికెట్‌ కూడా పడగొట్టాడు.అనంతరం ఒడిషాతో మ్యాచ్‌లో మాత్రం నితీశ్‌ రెడ్డి మరోసారి నిరాశపరిచాడు. ఆరు పరుగులు చేసి.. ఒకే ఒక వికెట్‌ తీయగలిగాడు. తాజాగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు.. రిషభ్‌ పంత్‌ నాలుగు మ్యాచ్‌లలో కలిపి 121 (ఆంధ్రపై 5, గుజరాత్‌పై 70, సౌరాష్ట్రపై 22, ఒడిశాపై 24)పరుగులు చేయగలిగాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు పంత్‌ ఇలా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది.చదవండి: 2026: ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న కోహ్లి పోస్ట్‌

Australia announce Squad for T20 WC 2026 3 injured players selected4
టీ20 వరల్డ్‌కప్‌-2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. గాయం నుంచి కోలుకుని ఇటీవలే పునరాగమనం చేసిన టెస్టు కెప్టెన్‌, స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.ఆ ఇద్దరికీ చోటుకమిన్స్‌తో పాటు గాయాల బెడదతో ఆటకు దూరంగా ఉన్న మరో కీలక పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ (Josh Hazlewood)తో పాటు హార్డ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌ (Tim David) కూడా వరల్డ్‌కప్‌ జట్టులో చోటు సంపాదించారు. అయితే, ఫిట్‌నెస్‌ ఆధారంగానే ఈ ముగ్గురు జట్టులో ఉంటారా? లేదా? అనేది త్వరలోనే తేలనుంది.జనవరి ఆఖరి వారంలో కమిన్స్‌ స్కానింగ్‌కు వెళ్లనున్నాడు. యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన అతడికి వెన్నునొప్పి తిరగబెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు.. తొడ కండరాల గాయం, కాలి నొప్పితో బాధ పడుతున్న హాజిల్‌వుడ్‌ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనేలేదు.డ్వార్షుయిస్‌కు మొండిచేయిఇక బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా టిమ్‌ డేవిడ్‌ గాయపడిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌ నాటికి అతడు కోలుకోకపోతే ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ తప్పదు. కాగా లెఫ్టార్మ్‌ సీమర్‌, గతేడాది నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న బెన్‌ డ్వార్షుయిస్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు.ఒకవేళ టోర్నీ నాటికి కమిన్స్‌, హాజిల్‌వుడ్‌లలో ఎవరో ఒకరు అందుబాటులో లేకుంటే డ్వార్షుయిస్‌కు ఛాన్స్‌ రావొచ్చు. అతడు కూడా గాయం వల్ల కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్నా.. వేగంగానే కోలుకుంటున్నట్లు సమాచారం.వారికి నిరాశేమరోవైపు.. స్పిన్‌ బౌలింగ్‌ ఆప్షన్‌గా కూపర్‌ కన్నోలి ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌గా జోష్‌ ఇంగ్లిస్‌ ఒక్కడినే సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఫిలిప్‌లకు నిరాశతప్పలేదు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న మొదలయ్యే ఈ టోర్నీ మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్లో 2021లో తొలిసారి చాంపియన్లుగా నిలిచిన ఆసీస్‌.. ఈసారి మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో గత ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీకి ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కన్నోలీ, ప్యాట్‌ కమిన్స్‌, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: రిషభ్‌ పంత్‌ ఫెయిల్‌.. ఇలా అయితే కష్టమే!

Virat Kohli heartfelt tribute to Anushka with New Year post breaks internet5
2026: ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న కోహ్లి పోస్ట్‌

సరికొత్త ఆశలతో మానవాళి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టింది. నవ్వులతో నవ వసంతానికి నాంది పలుకుతూ నూతన ఏడాది ఆగమనాన్ని వేడుకగా జరుపుకొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సోషల్‌ మీడియా నిండిపోయింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి (Virat Kohli) పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లి గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్‌ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma)తో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాన్నాళ్ల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.లైట్‌ ఆఫ్‌ మై లైఫ్‌ఆ తర్వాత చాలాకాలానికి తాజాగా కోహ్లి న్యూ ఇయర్‌ సందర్భంగా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. ‘‘నా జీవితాన్ని కాంతులతో నింపే అత్యంత ముఖ్యమైన, విలువైన వ్యక్తితో కలిసి 2026లోకి అడుగుపెడుతున్నాను’’ అంటూ అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. భార్యపై ప్రేమను చాటుకున్నాడు. ఈ పోస్టు నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. పది మిలియన్లకు పైగా దూసుకుపోతూ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. లండన్‌లోనేకాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను ప్రేమించిన కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌ సంతానం. పిల్లలను సెలబ్రిటీ లైఫ్‌ నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో విరుష్క జోడీ ఎక్కువగా లండన్‌లోనే నివాసం ఉంటోంది. ఇంతవరకు వారి ఫొటోలను కూడా రివీల్‌ చేయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక ఈ జంట ఇటీవలే ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంది.టెస్టులకు బైబైఇదిలా ఉంటే.. కోహ్లికి 2025 మిశ్రమంగా గడిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో అతడు వరుసగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో మే నెలలో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సంప్రదాయ ఫార్మాట్లో పదివేల పరుగులు చేయకుండానే ‘టెస్టు కింగ్‌’ నిష్క్రమించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, వన్డేల్లో మాత్రం కోహ్లి మరోసారి సత్తా చాటాడు.వన్డే రారాజుగానే..రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిల్‌ను భారత్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన కోహ్లి.. ఆసీస్‌ టూర్‌లో మాత్రం వరుస మ్యాచ్‌లలో డకౌట్‌ అయ్యాడు. అయితే, అదే పర్యటనలో మూడో వన్డేతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లో వరుస శతకాలతో చెలరేగాడు. తద్వారా 53వ వన్డే సెంచరీ నమోదు చేసి అత్యధిక సెంచరీల వీరుడిగా తన రికార్డు తానే సవరించాడు. ఇక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్‌.. ఇక్కడా శతక్కొట్టాడు. కాగా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవాలనే కోహ్లి చిరకాల కోరిక గతేడాది నెరవేరినా.. ఆర్సీబీ విజయోత్సవాలకు వచ్చిన అభిమానులు తొక్కిసలాటలో మృతి చెందడంతో విషాదం నెలకొంది. చదవండి: 2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)

VHT 2025 26: Rishabh Pant fails ahead of NZ ODI series selection6
రిషభ్‌ పంత్‌ ఫెయిల్‌.. ఇలా అయితే కష్టమే!

టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ మరోసారి పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో... మెరుగైన ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడనుకున్న ఈ వికెట్‌ కీపర్‌.. అంచనాలు అందుకోలేకపోతున్నాడు.దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంత్‌ (Rishabh Pant)... కీలక పోరులో బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 79 పరుగుల తేడాతో ఒడిశా (Delhi Vs Odisha) చేతిలో ఓడింది. సమంత్రాయ్‌ హాఫ్‌ సెంచరీమొదట బ్యాటింగ్‌ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బిప్లబ్‌ సమంత్రాయ్‌ (72; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హాఫ్‌ సెంచరీ సాధించగా... తక్కినవాళ్లంతా తలాకొన్ని పరుగులు చేశారు. పంత్‌ సహా వారంతా విఫలంఢిల్లీ బౌలర్లలో హృతిక్‌ షోకీన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ తడబడింది. 42.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్‌ (28 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ రాణా (2), ప్రియాన్ష్‌ ఆర్య (5), సార్థక్‌ రంజన్‌ (1) విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.ఒడిశా బౌలర్లలో దేబబ్రత ప్రధాన్, సంబిత బరల్‌ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రైల్వేస్‌ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై... హర్యానా 7 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందాయి.చదవండి: IND vs NZ: టీమిండియా వికెట్‌ కీపర్‌ రేసులో ఆ ముగ్గురు.. బెస్ట్‌ ఆప్షన్‌ ఎవరంటే?

Prime Minister Modi praised the Indian chess player7
అర్జున్‌ దేశ యువతకు స్ఫూర్తి

న్యూఢిల్లీ: ‘ఫిడే’ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ప్‌ బ్లిట్జ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్‌ ఇరిగేశిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. దోహా వేదికగా జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో ఓడిన అర్జున్‌ కాంస్యం దక్కించుకున్నాడు. అంతకుముందు ర్యాపిడ్‌ విభాగంలోనూ అర్జున్‌ కాంస్యం గెలిచాడు. తద్వారా విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఒకే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ రెండు విభాగాల్లో పతకాలు సాధించిన తొలి భారత ఆటగాడిగా అర్జున్‌ నిలిచాడు. సెమీఫైనల్‌కు ముందు 19 రౌండ్‌లలో కలిపి 15 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచిన అర్జున్‌... వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లపై విజయాలు సాధించాడు. అయితే సెమీస్‌లో మాత్రం ఉజ్బెకిస్తాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ అబ్దుసత్తొరోవ్‌ నొదిర్‌బెక్‌ చేతిలో ఓడి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ‘చదరంగంలో భారత్‌ జోరు కొనసాగుతోంది. వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ బ్లిట్జ్‌ విభాగంలో కాంస్యం నెగ్గిన అర్జున్‌ ఇరిగేశికి అభినందనలు. ఇటీవల ర్యాపిడ్‌ విభాగంలోనూ కాంస్యం నెగ్గిన అర్జున్‌... బ్లిట్జ్‌లోనూ సత్తా చాటాడు. అతడి విజయం దేశ యువతకు స్ఫూర్తి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ‘ఫిడే’ బుధవారం పతకాలు అందజేసింది. అర్జున్‌ రెండు కాంస్య పతకాలు అందుకోగా, మహిళల ర్యాపిడ్‌లో కాంస్యం గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి కోనేరు హంపికి కాంస్యం అందించారు. కార్ల్‌సన్‌ అటు ర్యాపిడ్, ఇటు బ్లిట్జ్‌ రెండు విభాగాల్లోనూ విజేతలుగా నిలిచాడు. ముగింపు కార్యక్రమంలో ‘ఫిడే’ అధికారులతో పాటు భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ పాల్గొన్నాడు. ‘నాకౌట్‌లో నమ్మకం కలిగింది’ వరల్డ్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌లలో రెండు టైటిల్స్‌ సాధించడం పట్ల నార్వే స్టార్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు సంబంధించి ఆరంభంలో టోర్నీ కఠినంగా సాగినా...చివరకు గెలవగలనని నమ్మానని అతను చెప్పాడు. ‘ఈ టోర్నమెంట్‌ ఆశించినంత సులువుగా సాగలేదు. ఫలితం ప్రతికూలంగా కూడా వచ్చి ఉండేది. అయితే నాకౌట్‌కు వెళ్లిన తర్వాత నాపై నమ్మకం పెరిగింది. ఈ దశలో మరింత ఉత్సాహంగా, బాగా ఆడగలనని అనిపించింది. చివరకు అది బాగా పని చేసింది’ అని విజయానంతరం కార్ల్‌సన్‌ వ్యాఖ్యానించాడు. మరో వైపు రెండు టైటిల్స్‌ నెగ్గినా కార్ల్‌సన్‌ క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించాడంటూ వివాదం రేగింది. స్విస్‌ విభాగం 14వ రౌండ్‌లో హైక్‌ మారి్టరోస్యాన్‌ (ఆర్మేనియా)తో అతను తలపడిన సందర్భంలో అనూహ్య ఘటన జరిగింది. వేగంగా ఆడే ప్రయత్నంలో అతని చేతులు తగిలి బోర్డుపై ఉన్న పావులు కొన్ని కింద పడిపోయాయి. అప్పటికి అతని వద్ద రెండు సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. పావులను సరైన స్థానంలో పెట్టే ప్రయత్నంలో అతను టైమింగ్‌ క్లాక్‌ను నిలిపివేశాడు. ఫలితంగా అతనికి ఆ రెండు సెకన్ల అదనపు సమయం కలిసొచ్చింది. ఇది నిబంధనలకు విరుద్ధం. దాంతో ఆర్బిటర్స్‌ జోక్యం చేసుకొని మాగ్నస్‌పై చర్య తీసుకున్నారు. మార్టిరోస్యాన్‌ను విజేతగా ప్రకటించారు. దీనికి అంగీకరిస్తూ అతను వైదొలిగాడు.

Hyderabad lost to Baroda in the Vijay Hazare Trophy8
అభిరత్, ప్రజ్ఞయ్‌ సెంచరీలు వృథా

రాజ్‌కోట్‌: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్‌... వరుసగా నాలుగో పోరులోనూ పరాజయం పాలైంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా బుధవారం పరుగుల వరద పారిన పోరులో బరోడా 37 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. మొదట బరోడ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా (63 బంతుల్లో 109 నాటౌట్‌; 18 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకంతో విజృంభించగా... ఓపెనర్లు నిత్య పాండ్యా (110 బంతుల్లో 122; 12 ఫోర్లు, 1 సిక్స్‌), అమిత్‌ పసీ (93 బంతుల్లో 127; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు. ఆఖర్లో భాను పనియా (27 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో... బరోడా బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదిన బరోడా బ్యాటర్లు... ఈ మ్యాచ్‌లో 44 ఫోర్లు, 11 సిక్స్‌లు కొట్టడం విశేషం. మన బౌలర్లలో చామా మిలింద్‌ 2 వికెట్లు పడగొట్టగా... తనయ్‌ త్యాగరాజన్, వరుణ్‌ గౌడ్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ 49.5 ఓవర్లలో 380 పరుగులకు ఆలౌటైంది. అభిరత్‌ రెడ్డి (90 బంతుల్లో 130; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రజ్ఞయ్‌ రెడ్డి (98 బంతుల్లో 113; 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. అమన్‌ రావు (39; 6 ఫోర్లు, 1 సిక్స్‌), తన్మయ్‌ అగర్వాల్‌ (32; 5 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ రెడ్డి (33; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. బరోడా బౌలర్లలో అతిత్‌ సేత్, మహేశ్‌ పితియా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అమిత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి 5 సెంచరీలు నమోదు చేశారు. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్‌ పాయింట్ల ఖాతా తెరవలేక పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శనివారం చండీగఢ్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. చండీగఢ్‌ కూడా ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓడింది.

Mumbai beats Goa in Vijay Hazare Trophy9
సర్ఫరాజ్‌ సునామీ

జైపూర్‌: భారత ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (75 బంతుల్లో 157; 9 ఫోర్లు, 14 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 87 పరుగుల తేడాతో గోవాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సర్ఫరాజ్‌ భారీ సెంచరీతో కదం తొక్కగా... ముషీర్‌ ఖాన్‌ (60; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్‌ తమోర్‌ (53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటారు. యశస్వి జైస్వాల్‌ (46; 6 ఫోర్లు), కెప్టెన్‌ శార్దుల్‌ ఠాకూర్‌ (27; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షమ్స్‌ ములానీ (22; 2 సిక్స్‌లు), తనుశ్‌ కొటియాన్‌ (23 నాటౌట్‌; 3 ఫోర్లు) కూడా బ్యాట్‌లకు పనిచెప్పారు. ఫలితంగా ముంబై జట్టు భారీ స్కోరు చేయగలిగింది. మొత్తంగా ముంబై బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో 35 ఫోర్లు, 25 సిక్స్‌లు బాదారు. గోవా బౌలర్లలో దర్శన్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో తుదికంటా పోరాడిన గోవా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ (24; 5 ఫోర్లు), కశ్యప్‌ (21; 4 ఫోర్లు), స్నేహల్‌ (27; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (31; 2 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయగా... అభినవ్‌ (70 బంతుల్లో 100; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీ బాదగా... కెప్టెన్‌ దీప్‌రాజ్‌ (28 బంతుల్లో 70; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), లలిత్‌ యాదవ్‌ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలు బాదారు. ముంబై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 3, యశస్వి జైస్వాల్‌ రెండు వికెట్లు పడగొట్టారు. గ్రూప్‌ ‘సి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ముంబై జట్టు 16 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్‌ 229 పరుగుల తేడాతో సిక్కింపై... పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌పై... మహారాష్ట్ర 129 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలుపొందాయి. నిప్పులు చెరిగిన ముకేశ్, ఆకాశ్, షమీభారత పేసర్లు మొహమ్మద్‌ షమీ (2/14), ముకేశ్‌ కుమార్‌ (4/16), ఆకాశ్‌దీప్‌ (4/32) సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా బెంగాల్‌ జట్టు విజయ్‌ హాజారే ట్రోఫీలో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 9 వికెట్ల తేడాతో జమ్మూకశ్మీర్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జమ్మూకశ్మీర్‌ జట్టు 20.4 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (19), శుభమ్‌ ఖజురియా (12) రెండంకెల స్కోరు చేయగా... మిగిలినవాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అంతర్జాతీయ స్థాయి బౌలర్ల ముందు జమ్మూ ప్లేయర్లు నిలవలేకపోయారు. షమీ వికెట్ల వేట ప్రారంభించగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముకేశ్, ఆకాశ్‌ దాన్ని కొనసాగించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగాల్‌ 9.3 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 64 పరుగులు చేసి గెలిచింది. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన బెంగాల్‌ 12 పాయింట్లతో పట్టిక మూడో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఉత్తరప్రదేశ్‌ 58 పరుగుల తేడాతో అస్సాంపై... విదర్భ 8 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై నెగ్గాయి.

A feast for sports fans in 202610
ప్రపంచకప్‌లు... ప్రతిష్టాత్మక ఈవెంట్లు...

జూనియర్, సీనియర్, మహిళల వరల్డ్‌ కప్‌లతో పరుగుల లెక్కలు... మెస్సీ, రొనాల్డోల మెరుపులను చివరిసారి చూసేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూపులు... భిన్న క్రీడాంశాల్లో సత్తా చాటి అందరి దృష్టినీ ఆటగాళ్లు తమ వైపు తిప్పుకునేే కామన్వెల్త్, ఆసియా క్రీడల రూపంలో రెండు నెలల వ్యవధిలో రెండు చాన్స్‌లు... ఇక స్వదేశంలో మన షట్లర్ల స్థాయిని ప్రదర్శించేందుకు 17 ఏళ్ల తర్వాత వచ్చిన బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌ నిర్వహణావకాశం... ఇలా 2026లో పలు ప్రతిష్టాత్మక ఈవెంట్లు క్రీడాభిమానులను అలరించనున్నాయి. జనవరి నుంచి అక్టోబర్‌ వరకు నిరంతరాయంగా పది నెలల పాటు ఫుల్‌ స్పోర్ట్స్‌ జోష్‌ కనిపించడం ఖాయం.కామన్వెల్త్‌ క్రీడలు23 జులై–2 ఆగస్టు(వేదిక: గ్లాస్గో, స్కాట్లండ్‌)అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఆటగాళ్లు సత్తా చాటేందుకు కామన్వెల్త్‌ క్రీడలు సరైన వేదికగా నిలుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మన వర్ధమాన ఆటగాళ్లు ఈ క్రీడల ద్వారా గుర్తింపు దక్కించుకుంటున్నారు. 2022 క్రీడల్లో భారత్‌ 22 స్వర్ణాలు సహా మొత్తం 61 పతకాలు గెలిచి నాలుగో స్థానంతో ముగించింది. అయితే ఆర్థికపరమైన, నిర్వహణాపరమైన ఇతర సమస్యల కారణంగా 2026 పోటీలను కేవలం 10 క్రీడాంశాలకే పరిమితం చేశారు. భారత ఆటగాళ్లు కచ్చితంగా పతకం గెలిచే అవకాశం ఉన్న హాకీ, బ్యాడ్మింటన్, టి20 క్రికెట్, రెజ్లింగ్, టేబుల్‌ టెన్నిస్‌లను తప్పించడంతో ఈ సారి భారత్‌ పతకాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అన్నీ కలిపి 215 ఈవెంట్లలో దాదాపు 3 వేల మంది ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. 2014లోనే కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన గ్లాస్గో తక్కువ వ్యవధిలో మరోసారి ఈ పోటీలకు వేదిక కానుండటం విశేషం. గతంలో బ్రిటీష్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న 74 దేశాలు తలపడే ఈ పోటీలు ఎలిజబెత్‌ మహరాణి–2 మరణించిన తర్వాత జరుగుతున్న తొలి గేమ్స్‌ కానున్నాయి. టి20 వరల్డ్‌ కప్‌7 ఫిబ్రవరి–8 మార్చి(వేదిక: భారత్, శ్రీలంక)బౌండరీ వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌ అత్యద్భుత క్యాచ్‌... రోహిత్‌ శర్మ మెస్సీ స్టయిల్‌లో ట్రోఫీని అందుకున్న క్షణాలు ఇంకా మనసునుంచి చెరిగిపోక ముందే మరో టి20 వరల్డ్‌ కప్‌ వచ్చేసింది. ఈ సారి డిఫెండింగ్‌ చాంపియన్‌గా, అదీ సొంతగడ్డపై బరిలోకి దిగుతుండటం ఇప్పటికే బలంగా ఉన్న భారత జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. ఈ ఏడాది క్రికెట్‌ అభిమానులను ఎక్కువగా అలరించే అవకాశం ఉన్న టి20 వరల్డ్‌ కప్‌కు భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. గతంలో తరహాలోనే 20 జట్లు టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలతో పాటు ఫైనల్‌ జరిగే అహ్మదాబాద్‌ కూడా మన దేశంలో వేదికలుగా ఉన్నాయి. 2024 వరల్డ్‌ కప్‌తో పోలిస్తే రోహిత్, కోహ్లిలాంటి స్టార్లు ఈ టోర్నీలో కనిపించరు కానీ అభిõÙక్, తిలక్‌లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలిసారి ఇటలీ జట్టు వరల్డ్‌ కప్‌ ఆడే అవకాశం దక్కించుకోవడం విశేషం. ఇప్పటి వరకు జరిగిన 9 టి20 వరల్డ్‌ కప్‌లలో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌ రెండేసి సార్లు విజేతలుగా నిలవగా... పాకిస్తాన్, శ్రీలంక, ఆ్రస్టేలియా ఒక్కో టైటిల్‌ గెలిచాయి. మహిళల టి20 వరల్డ్‌ కప్‌12 జూన్‌–5 జులై(వేదిక: ఇంగ్లండ్‌)తొలిసారి వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి శిఖరాన నిలిచిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు ఈ సారి టి20 వరల్డ్‌ కప్‌పై గురి పెట్టింది. 2020లో జరిగిన టోర్నీలో అత్యుత్తమంగా రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు మిగతా 8 ప్రయత్నాల్లోనూ పేలవ ప్రదర్శనతో విఫలమైంది. అయితే ఇటీవల జట్టులో వచ్చిన మార్పులు, టి20 స్పెషలిస్ట్‌ల ప్రదర్శన మన టీమ్‌లో ఆశలు పెంచుతున్నాయి. దానికి తగినట్లుగా ఇప్పటినుంచి వరల్డ్‌ కప్‌ కోసం జట్టు సన్నాహకాలు కొనసాగుతున్నాయి. 2009లో తొలి టోర్నీని నిర్వహించిన తర్వాత ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్‌ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఫైనల్‌ నిర్వహిస్తారు. టి20 వరల్డ్‌ కప్‌లో ఆ్రస్టేలియా ఏకంగా 6 సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌ ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌. పురుషుల అండర్‌–19 వరల్డ్‌ కప్‌ 15 జనవరి–6 ఫిబ్రవరి(వేదిక: జింబాబ్వే, నమీబియా)యువ క్రికెటర్లు చెలరేగి భవిష్యత్తులో సీనియర్‌ జట్టుకు ప్రమోట్‌ అయ్యేందుకు అండర్‌–19 ప్రపంచ కప్‌ చక్కటి అవకాశం కల్పిస్తోంది. భారత జట్టులో అలాంటి యువ ఆటగాళ్లకు కొదవ లేదు. తమ ప్రతిభతో ఐపీఎల్‌లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రే, భారత జట్టుకు వరల్డ్‌ కప్‌ అందించేందుకు అండర్‌–19 స్థాయిలో బరిలోకి దిగుతున్నారు. కొత్త ఏడాదిలో అన్నింటికంటే ముందుగా క్రికెట్‌ అభిమానులకు అలరించే సిద్ధమైన ఈ కుర్రాళ్ల పోరులో మొత్తం 16 టీమ్‌లు బరిలోకి దిగుతున్నాయి. 2024లో టైటిల్‌ సాధించిన ఆ్రస్టేలియా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... ఫైనల్లో ఓడిన భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. అయితే మొత్తం 15 సార్లు జరిగిన అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో 5 సార్లు కప్‌ గెలుచుకొని భారత్‌ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఆసియా క్రీడలు19 సెప్టెంబర్‌–4 అక్టోబర్‌(వేదిక: నగోయా, జపాన్‌)కామన్వెల్త్‌ గేమ్స్‌ ముగిసిన రెండు నెలల లోపే మన భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆసియా గేమ్స్‌ రూపంలో మరో అవకాశం దక్కుతోంది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌ విభాగంలో ఆసియా క్రీడల్లో సుదీర్ఘ కాలంగా భారత్‌ బలమైన ముద్ర వేసింది. కోవిడ్‌ కారణంగా ఏడాది కాలం వాయిదా పడటంతో 2022లో జరగాల్సిన గేమ్స్‌ను 2023లో నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల ఈవెంట్‌గా షెడ్యూల్‌ ప్రకారం 2026లో నిర్వహిస్తున్నారు. జపాన్‌లోని నగోయా నగరం ప్రధాన వేదిక కాగా, ఐచి రాష్ట్రంలోని ఇతర వేదికల్లో కూడా పోటీలు జరుగుతాయి. 41 క్రీడాంశాల్లో కలిపి 45 దేశాల నుంచి సుమారు 15 వేల మంది అథ్లెట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఆసియా క్రీడలను జపాన్‌ నిర్వహించడం ఇది మూడో సారి. 2023 ఏషియాడ్‌లో 28 స్వర్ణాలు సహా 106 పతకాలు నెగ్గిన భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ 12 జూన్‌–20 జులై(వేదిక: అమెరికా, కెనడా, మెక్సికో)ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ అభిమానులను అలరించేందుకు ఈ ఏడాది వరల్డ్‌ కప్‌ వచ్చేసింది. మూడు దేశాలు కలిసి టోర్నీని నిర్వహిస్తుండటం ఇదే మొదటిసారి కాగా, మొత్తం 16 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ చరిత్రలో 2022 వరకు 32 జట్లతోనే టోర్నమెంట్‌ను నిర్వహించగా... తొలిసారి 48 జట్లు బరిలోకి దిగుతుండటం ఈ సారి అన్నింటికంటే పెద్ద విశేషం. కేప్‌ వెర్డె, క్యురాకో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్‌ తొలిసారి ప్రపంచ కప్‌ ఆడనున్నాయి. అర్జెంటీనా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో దిగ్గజ స్థాయి ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన లయోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో చివరి సారిగా వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 2026 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను మైదానంలో చూసేందుకు దాదాపు 70 లక్షల టికెట్లు అందుబాటులో ఉండగా...తొలి 15 రోజుల్లోనే 15 కోట్లకు పైగా టికెట్‌ దరఖాస్తులు రావడం ఈ టోర్నీ స్థాయికి చూపిస్తోంది. ఎప్పటిలాగే భారత్‌ మాత్రం ప్రపంచకప్‌ టోర్నీలో కనిపించదు. ఆసియా నుంచి క్వాలిఫై అయ్యేందుకు 9 జట్లకు అవకాశం ఉండగా... అతి పేలవమైన ఆటతో భారత్‌ అర్హతకు సుదూరంగా ఉండిపోయింది. వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ఆగస్టు 17–23(వేదిక: న్యూఢిల్లీ)బ్యాడ్మింటన్‌లో గత కొన్నేళ్లుగా తమదైన ముద్ర వేసిన భారత్‌ రెండో సారి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ టాప్‌ షట్లర్లంతా పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌ ఢిల్లీలో జరుగుతుంది. గతంలో భారత్‌లో ఒకే ఒకసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (2009లో హైదరాబాద్‌లో) జరిగింది. వాస్తవానికి 2023లో భారత్‌ సుదిర్మన్‌ కప్‌ను నిర్వహించాల్సి ఉండగా... కోవిడ్‌ కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పలు వేదికల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో భారత్‌కు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ అవకాశం దక్కింది. 2025లో పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో భారత్‌ తరఫున సాత్విక్‌–చిరాగ్‌ కాంస్యపతకం గెలుచుకున్నారు. స్వదేశంలో మన ఆటగాళ్లు ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement