Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

RCB becomes the First team to win 6 Consecutive matches in WPL history1
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

మహిళల ఐపీఎల్‌లో (WPL) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్‌ చరిత్రలో వరుసగా ఆరు విజయాలు సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. నిన్న (జనవరి 19) గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించిన ఈ జట్టు.. అంతకుముందు ఇదే ఎడిషన్‌లో (2026) ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్జ్‌, ముంబై ఇండియన్స్‌పై వరుస విజయాలు సాధించింది. FIRST TEAM TO PLAYOFFS - ITS RCB...!!!!- The Historic moment with 6 consecutive wins. 💥 pic.twitter.com/ufVqDnuPZq— Johns. (@CricCrazyJohns) January 19, 2026అంతకుముందు ఎడిషన్‌లో (2025) తమ చివరి మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. లీగ్‌ చరిత్రలో ఏ జట్టు వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించలేదు. గతంలో ముంబై ఇండియన్స్‌ రెండు సార్లు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఆర్సీబీనే గతంలో ఓ సారి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీతాజాగా గుజరాత్‌ జెయింట్స్‌పై విజయంతో ఆర్సీబీ ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కన్ఫర్మ్‌ చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 24న ఢిల్లీతో, 26న ముంబై ఇండియన్స్‌తో, 29న యూపీతో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఓడినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో ఉంటుంది.నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటి గుజరాత్‌ను 61 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి, అనామక ప్లేయర్‌ గౌతమి నాయక్‌ (55 బంతుల్లో 73; 7 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మంధన (26), రిచా ఘోష్‌ (27) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో రాధా యాదవ్‌ (17), శ్రేయాంక పాటిల్‌ (8 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించారు. గుజరాత్‌ బౌలర్లలో కశ్వీ గౌతమ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ తలో 2, రేణుకా సింగ్‌, సోఫి డివైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.అనంతరం 179 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ పూర్తిగా చేతులెత్తేసింది. సయాలి సత్ఘరే (4-0-21-3), డి క్లెర్క్‌ (4-0-17-2), లారెన్‌ బెల్‌ (4-1-23-1), రాధా యాదవ్‌ (4-0-34-1), శ్రేయాంక పాటిల్‌ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఆష్లే గార్డ్‌నర్‌ (54) ఒంటరిపోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. అనుష్క శర్మ (18), భారతి ఫుల్మాలి (14), తనుజా కన్వర్‌ (11 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

Rasooli, Zadran star as Afghanistan cruise past West Indies2
వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌

ఇటీవలికాలంలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు వెస్టిండీస్‌కు వరుసగా షాకులిస్తుంది. తాజాగా అదే సీన్‌ రిపీటైంది.దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ జట్టు విండీస్‌పై 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇబ్రహీం జద్రాన్‌ (56 బంతుల్లో 87 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), దర్విష్‌ రసూలీ (59 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ అందించారు. వీరిద్దరూ చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌ డకౌట్‌ కాగా.. సెదిఖుల్లా అటల్‌ 2 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, మాథ్యూ ఫోర్డ్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్‌ తడబడింది. జియా ఉర్‌ రెహ్మాన్‌ (4-0-36-3), రషీద్‌ ఖాన్‌ (4-0-19-2), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (4-0-29-2), నూర్‌ అహ్మద్‌ (3-0-34-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో సాంప్సన్‌ (30) టాప్‌ స్కోరర్‌గా కాగా.. జాన్సన్‌ ఛార్లెస్‌ (27), మోటీ (28), ఫోర్డ్‌ (25) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటరల్లో ఎవిన్‌ లూయిస్‌, బ్రాండన్‌ కింగ్‌ చెరో 4, జాంగూ, హెట్‌మైర్‌, పియెర్రీ తలో 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 రేపు (జనవరి 21) ఇదే వేదికగా జరుగనుంది.

Shreyas Iyer may not needed for T20 WC Tilak Varma set to return soon3
శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌!

చాన్నాళ్లుగా టీమిండియా తరఫున వన్డేలకే పరిమితమయ్యాడు శ్రేయస్‌ అయ్యర్‌. దేశవాళీ టీ20 టోర్నీలో పరుగుల వరద పారించినా.. జట్టులో ఇప్పటికే పాతుకుపోయిన ఆటగాళ్ల కారణంగా అతడికి భారత టీ20 జట్టులో స్థానం కరువైంది.అయితే, తిలక్‌ వర్మ గాయం కారణంగా అనూహ్య రీతిలో ఇటీవలే శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో పునరాగమనం చేసే అవకాశం దక్కించుకున్నాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (Tilak Varma)గాయపడిన విషయం తెలిసిందే.శస్త్రచికిత్స విజయవంతంపొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడికి టెస్టిక్యులర్‌ టార్షన్‌ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సైతం ధ్రువీకరించింది.వేగంగా కోలుకుంటున్న తిలక్‌స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్‌ వర్మ దూరమయ్యాడని బోర్డు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ హైదరాబాదీ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం తిలక్‌ వర్మ వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం.బరిలోకి దిగేందుకు సైటైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. తిలక్‌ వర్మకు నొప్పి నుంచి విముక్తి లభించింది. ఇప్పటికే అతడు ఫిజికల్‌ ట్రెయినింగ్‌ మొదలుపెట్టాడు. ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం అతడు మంగళవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)కి చేరుకుంటాడు.ఒకవేళ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే కివీస్‌తో నాలుగో టీ20 (జనవరి 28)కి తిలక్‌ వర్మ అందుబాటులోకి వస్తాడు. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ స్థానం గల్లంతు కావడం ఖాయం. అదే విధంగా.. తిలక్‌ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌-2026లో ఆడాలన్న ఈ ముంబైకర్‌ ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లు అవుతుంది. కాగా గత రెండేళ్లుగా భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన తిలక్‌ వర్మ.. ఆసియా కప్‌-2025 ఫైనల్లో జట్టును గెలిపించి ప్రశంసలు అందుకున్నాడు.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవి బిష్ణోయి.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్‌!

Is Gambhir Listening R Ashwin Pinpoints Big Flaws In Gill Captaincy4
గిల్‌ కెప్టెన్సీపై అశ్విన్‌ ఘాటు విమర్శలు

టెస్టులకు రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ టీమిండియా సారథిగా పగ్గాలు చేపట్టాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి మరీ ఆ బాధ్యతలను గిల్‌కు అప్పగించింది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI).అయితే, పూర్తి స్థాయి కెప్టెన్‌గా గిల్‌ (Shubman Gill) ఇంత వరకు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ సాధించలేదు. ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగాడు. అయితే, స్వదేశంలో వెస్టిండీస్‌ను 2-0తో టెస్టుల్లో వైట్‌వాష్‌ చేసినా.. సౌతాఫ్రికా చేతిలో పాతికేళ్ల తర్వాత భారత్‌ తొలిసారి 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.అశూ స్పందన ఇదేతాజాగా గిల్‌ సేనకు న్యూజిలాండ్‌ చేతిలోనూ ఘోర పరాభవం ఎదురైంది. కివీస్‌ జట్టు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) కూడా ఈ విషయంపై స్పందించాడు.ధోని, రోహిత్‌లను చూసి నేర్చుకోకివీస్‌ సిరీస్‌లో ముఖ్యంగా ఇండోర్‌లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్‌ అనుసరించిన వ్యూహాలను అశూ తప్పుబట్టాడు. ఈ మేరకు.. ‘‘మహేంద్ర సింగ్‌ ధోని, రోహిత్‌ శర్మలను గొప్ప కెప్టెన్లు అని ఎందుకు ప్రశంసిస్తారో తెలుసు కదా!వారిద్దరికి ఏ సమయంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో బాగా తెలుసు. తమకు ఉన్న వనరులను వారు ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకుంటారు. ఏ బ్యాటర్‌కు ఏ బౌలర్‌తో బౌలింగ్‌ వేయించాలో వాళ్లకు బాగా తెలుసు. అయితే, కివీస్‌తో సిరీస్‌లో ఇది మిస్సయింది.ఎంతమాత్రం సరికాదుఈ విషయంలో గిల్‌ కెప్టెన్సీలో లోపాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో బాగా ఆడకపోయినంత మాత్రాన నీ బౌలర్లపై నమ్మకం కోల్పోతావా? కెప్టెన్‌కు ఇది ఎంతమాత్రం సరికాదు. ముఖ్యంగా మూడో వన్డేలో గ్లెన్‌ ఫిలిప్స్‌ ఫాస్ట్‌ బౌలర్లను చితకబాదుతుంటే.. మధ్య ఓవర్లలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఎందుకు బరిలోకి దించలేదు.అతడితో రెండు ఓవర్లు వేయించి ఉంటే మ్యాచ్‌ వేరే విధంగా ఉండేది. డారిల్‌ మిచెల్‌ విషయంలోనూ అనుకున్న ఫలితం రాబట్టగలిగేవాళ్లు. అందుబాటులో ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అన్నింటికంటే పెద్ద వైఫల్యం. ఒకవేళ అన్ని సరిగ్గా చేసినా ఓడిపోతే అదివేరు. కానీ ఇక్కడ మీ బెస్ట్‌ బౌలర్ల సేవలను సరైన సమయంలో ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు’’ అని అశ్విన్‌.. గిల్‌ కెప్టెన్సీపై ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: భారత్‌ నెత్తిన మిచెల్‌ పిడుగువాళ్లను పక్కనపెడతారా?: గిల్‌పై రహానే, జహీర్‌ ఖాన్‌ ఫైర్‌!

BCCI Plans Rs 7 Cr Shock To Kohli Rohit To Axe On A+ Grade: Report5
బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్‌!

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల విషయంలో పెను మార్పులు చేయాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం సెంట్రల్‌ కాంట్రాక్టులో నాలుగు కేటగిరీలు ఉన్న విషయం తెలిసిందే. A+, A, B, C అనే గ్రేడ్‌లు ఉన్నాయి. చివరగా గతేడాదికి గానూ ఏప్రిల్‌లో బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులను ప్రకటించింది. దీని ప్రకారం..రూ. 7 కోట్ల వార్షిక వేతనంA+ గ్రేడ్‌లో బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మతో పాటు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రధాన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉన్నారు. వీరికి రూ. 7 కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది.వీరికి ఐదు.. వారికి మూడుఇక A గ్రేడ్‌లో ఉన్న రిషభ్‌ పంత్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, మొహమ్మద్‌ షమీ, కేఎల్‌ రాహుల్‌, శుబ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యాలు రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నారు. అదే విధంగా.. B గ్రేడ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌లకు రూ. 3 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది.వీళ్లందరికి కోటిఇక C గ్రేడ్‌లో ఉన్న రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, శివం దూబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్‌ సుందర్‌, ముకేశ్‌ కుమార్‌, సంజూ శాంసన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ, రజత్‌ పాటిదార్‌, ధ్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ, ఆకాశ్‌ దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణాలకు రూ. కోటి వేతనం అందుతోంది.A+ గ్రేడ్‌ను ఎత్తివేసే యోచనతాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది వార్షిక క్రాంటాక్టుల విషయంలో అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. A+ గ్రేడ్‌ను ఎత్తివేసి.. A, B, C అనే మూడు గ్రేడ్‌లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, వార్షిక వేతనం విషయంలోనూ ఈ మార్పులు వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.రో-కోకు భారీ షాక్‌తదుపరి అపెక్స్‌ మీటింగ్‌లో ఈ విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్‌ అండ్‌ కో ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపితే.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు భారీ షాక్‌ తప్పదు. ప్రస్తుతం వీరిద్దరు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి ఈసారి వీరిని B గ్రేడ్‌లోకి వేసే అవకాశం ఉంది.ఈ నలుగురు అంతేకాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత రో-కోలతో పాటు జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇక గతేడాది రో-కో టెస్టులకూ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ప్రధాన పేసర్‌ బుమ్రా పనిభారం తగ్గించుకునే క్రమంలో పలు కీలక సిరీస్‌లకు దూరమవుతున్నాడు. ఇలా A+ గ్రేడ్‌లో ఉన్న నలుగురు ఆటగాళ్లు గత కొంతకాలంగా జాతీయ విధుల్లో ఏదో ఒక ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.చదవండి: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి

IND vs NZ: Debutant who dismissed Kohli twice Added to NZ T20I squad6
కోహ్లికే షాకిచ్చాడు!.. కివీస్‌ యంగ్‌స్టార్‌కి గోల్డెన్‌ ఛాన్స్‌

భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ కీలక ప్రకటన చేసింది. తమ జట్టులో ఓ మార్పు చేసినట్లు మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో వన్డే సిరీస్‌లో సత్తా చాటిన యువ పేసర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌ (Kristian Clarke)కు టీ20 జట్టులోనూ చోటు ఇచ్చినట్లు తెలిపింది.మూడు మ్యాచ్‌లకుఅయితే, తొలి మూడు టీ20లకు మాత్రమే క్లార్క్‌ను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ వెల్లడించింది. స్టార్‌ ఆటగాడు మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (Michael Bracewell) గాయపడిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘ఇండియాలో పర్యటిస్తున్న బ్లాక్‌కాప్స్‌ (న్యూజిలాండ్‌)తో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌ అక్కడే ఉండిపోతాడు.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడు. ఇండోర్‌లో ఆదివారం నాటి ఆఖరి వన్డే సందర్భంగా మైకేల్‌ బ్రేస్‌వెల్‌ గాయపడ్డాడు. అయినప్పటికీ నాగ్‌పూర్‌లో తొలి టీ20 కోసం అతడు జట్టుతో ప్రయాణిస్తాడు.అయితే, పిక్కల్లో గాయంతో బాధపడుతున్న అతడి పరిస్థితిని వైద్యులు పర్యవేశక్షిస్తున్నారు. అతడు పూర్తి టూర్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని న్యూజిలాండ్‌ క్రికెట్‌ తమ ప్రకటనలో పేర్కొంది.అరంగేట్రంలోనే..కాగా మైకేల్‌ బ్రేస్‌వెల్‌ కెప్టెన్సీలో టీమిండియాతో వన్డే సిరీస్‌ ఆడిన కివీస్‌ జట్టు.. భారత గడ్డపై తొలిసారి సిరీస్‌ కైవసం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతోనే 2-1 తేడాతో గిల్‌ సేనను ఓడించి సత్తా చాటింది. ఇక ఈ సిరీస్‌ సందర్భంగానే క్రిస్టియన్‌ క్లార్క్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.కోహ్లికే షాకిచ్చాడుభారత్‌తో తొలి వన్డేలో హర్షిత్‌ రాణాను అవుట్‌ చేసి తన ఖాతాలో తొలి వికెట్‌ జమచేసుకున్న క్లార్క్‌.. రెండు, మూడో వన్డేల్లో దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. రెండో వన్డేలో మొత్తంగా 3 వికెట్లు తీసిన 24 ఏళ్ల ఈ రైటార్మ్‌ మీడియం పేసర్‌.. మూడో వన్డేలోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు.ఈ క్రమంలోనే టీ20 సిరీస్‌ జట్టులోనూ క్రిస్టియన్‌ క్లార్క్‌ స్థానం సంపాదించగలిగాడు. ఈ విషయం గురించి న్యూజిలాండ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ మాట్లాడుతూ.. ‘‘వన్డే సిరీస్‌లో తన ప్రతిభ ఏమిటో అతడు నిరూపించుకున్నాడు.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ రాణించి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అందుకే టీ20 సిరీస్‌ జట్టులోనూ అతడికి చోటు దక్కింది’’ అని పేర్కొన్నాడు.టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు (అప్‌డేటెడ్‌)మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జెమీషన్‌, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ (మొదటి 3 మ్యాచ్‌లకు).షెడ్యూల్‌: జనవరి 21, 23, 25, 28, 31టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి న్యూజిలాండ్‌ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: Sunil Gavaskar: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి

Mum inappropriate Dance Humiliated Me Brooklyn Beckham Sensational Allegations7
అంతా అమ్మే చేసింది.. నా కాపురం కూల్చేసే కుట్ర

ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం డేవిడ్‌ బెక్‌హామ్‌ దంపతులపై వారి కుమారుడు బ్రూక్లిన్‌ బెక్‌హామ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. ముఖ్యంగా తల్లి విక్టోరియా బెక్‌హామ్‌ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి. బ్రూక్లిన్‌ పెళ్లి సమయంలో అతడికి తల్లిదండ్రులతో తలెత్తిన విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి.కుటుంబంతో కలిసే ప్రసక్తే లేదుఈ క్రమంలోనే భార్య, అమెరికన్‌ నటి నికోలా పెల్జ్ట్‌తో కలిసి అమెరికాకు వెళ్లిపోయిన బ్రూక్లిన్‌ అక్కడే నివసిస్తున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెంచుకునేందుకు సిద్ధమైనట్లు తాజాగా అతడు పునరుద్ఘాటించాడు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సుదీర్ఘ పోస్టులు పెడుతూ సంచలన ఆరోపణలకు దిగాడు.‘‘చాలా ఏళ్లుగా నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. దురదృష్టవశాత్తూ నా తల్లిదండ్రులు, వారి టీమ్‌ పదే పదే నన్ను విసిగిస్తూ పబ్లిక్‌గా మాట్లాడేలా చేశారు. నా గురించి వస్తున్న అబద్ధాలకు సమాధానంగా.. ఇప్పటికైనా నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను.ఇకపై నా కుటుంబంతో తిరిగి కలిసేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేను. ఇతరుల నియంత్రణ, ఆధీనంలో బతకడం నాకు ఇష్టం లేదు. జీవితంలో తొలిసారి నాకోసం నేను నిలబడ్డాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని నా తల్లిదండ్రులే కంట్రోల్‌ చేశారు. మీడియాలో నా గురించి ఏదేదో రాసేలా చేశారు.మరీ హద్దులు దాటి..ఇటీవలి కాలంలో వాళ్లు సోషల్‌ మీడియాలో మరీ హద్దులు దాటి.. నాపై ప్రేమ ఉ‍న్నట్లుగా.. తమను తాము అమాయకులుగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేశారు. సమాజంలో వారి ప్రతిష్ట కోసమే ఇదంతా చేశారు. అయినా నిజం ఎన్నటికీ దాగదు.పెళ్లికి ముందు నుంచే నికోలాతో నా బంధాన్ని తెంచాలని నా తల్లిదండ్రులు గట్టిగా ప్రయత్నించారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. పెళ్లికి కొన్ని గంటల ముందు మా అమ్మ కావాలనే నికోలా వెడ్డింగ్‌ గౌను రెడీ కాకుండా చేసింది. అత్తగారు డిజైన్‌ చేసిన డ్రెస్‌ వేసుకోవాలని నికోలా ఎంతగానో ఆశపడింది. ‘లంచం’ ఇచ్చికానీ మా అమ్మ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. అప్పటికప్పుడు తను ఏదో ఒక డ్రెస్‌ వేసుకోవాల్సి వచ్చింది. పెళ్లికి కొన్ని వారాల ముందు నాకు ‘లంచం’ ఇచ్చి నా హక్కులను రాయించుకోవాలని నా తల్లిదండ్రులు ప్లాన్‌ చేశారు. తద్వారా నా భార్య, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలను కంట్రోల్‌ చేయవచ్చనేది వారి ఆలోచన.కానీ నేను వినలేదు. అప్పటి నుంచి నా పట్ల వారి వైఖరి మారిపోయింది. నా పెళ్లికి ప్రణాళికలు రచిస్తున్న సమయంలో మా అమ్మ నన్ను .. ‘ఈవిల్‌’ అన్నది. నికోలా, నేను మా నానమ్మలను మాతో పాటు కూర్చోబెట్టుకుంటామని చెప్పడమే ఇందుకు కారణం.వివాహానికి కొన్ని గంటల ముందు నా కుటుంబం నా దగ్గరికి వచ్చి.. ‘నికోలా మన రక్తం కాదు. మన కుటుంబం కాదు. ఆమె కోసం ఎందుకిదంతా?’ అని ప్రశ్నించారు. అప్పటి నుంచి నా మీద, నా భార్య మీద ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉన్నారు. నా తమ్ముళ్లు కూడా నాపై సోషల్‌ మీడియాలో దాడికి దిగారు.మా అమ్మ అంతా చెడగొట్టిందిఇక పెళ్లి సమయంలో మా అమ్మ నా భార్యను, నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదటిసారి నా భార్యతో రొమాంటిక్‌ సాంగ్‌కు డాన్స్‌ చేయాలని ప్లాన్‌ చేసుకున్నాను. కానీ మా అమ్మ అంతా చెడగొట్టింది. దాదాపుగా 500 మంది అతిథుల ముందు మా అమ్మ నాతో అభ్యంతరకర రీతిలో, అసలు సంబంధమే లేనివిధంగా డాన్స్‌ చేసింది.నాకు అదెంతో ఇబ్బందిగా అనిపించింది. అప్పటి వరకు జీవితంలో నేను అంత చెడు అనుభవాన్ని, అవమానాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే మేము న్యూయార్క్‌లో మరోసారి పెళ్లి చేసుకున్నాము. ఈసారి నా తల్లిదండ్రుల బాధ లేదు. ప్రశాంతంగా సంతోషంగా వేడుక జరుపుకొన్నాము. నా పాత గర్ల్‌ఫ్రెండ్‌ను పిలిచినా భార్యను వాళ్లు ఎప్పటికప్పుడు అవమానిస్తూనే ఉన్నారు. నా పాత గర్ల్‌ఫ్రెండ్‌ను మా అమ్మ పదే పదే ఇంటికి ఆహ్వానిస్తూ మా ఇద్దరికి ఇబ్బంది కలిగేలా చేసింది. అయినా సరే మా నాన్న యాభైవ పుట్టినరోజు కోసం మేము లండన్‌కి వెళ్లాము. కానీ వారం రోజుల పాటు మమ్మల్ని అక్కడికి రానివ్వలేదు. దీంతో మేము హోటల్‌లోనే ఉండిపోయాము.మా నాన్నతో కాస్త ఎక్కువ సమయం గడపాలని భావించాను. కానీ ఆయన ఇందుకు తిరస్కరించారు. ఆఖరికి నికోలా లేకుండా వస్తేనే నన్ను అక్కడికి అనుమతినిస్తానని చెప్పాడు. ఆ మాట నా చెంప మీద కొట్టినట్లు అనిపించింది. ఆ తర్వాత వాళ్లు లాస్‌ ఏంజెలిస్‌కు వచ్చినపుడు కూడా నన్ను కలవడానికి ఇష్టపడలేదు.బెక్‌హామ్‌ బ్రాండ్‌తో వచ్చే పేరు నాకు, నా భార్యకు అవసరం లేదు. నాకు, నా భార్యకు ప్రశాంతత, గోప్యత, సంతోషం మాత్రమే కావాలి. మా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలి’’ అని బ్రూక్లిన్‌ బెక్‌హామ్‌ చెప్పుకొచ్చాడు.సంబంధిత వార్త: David Beckham: భార్యే సర్వస్వం.. తండ్రిని కాదని.. మామగారికి విషెస్‌..

A Century Of Wins At AO 2026: Novak Djokovic Scripts History8
చరిత్ర సృష్టించిన జొకోవిచ్‌

మెల్‌బోర్న్‌: కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ లక్ష్యంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలో దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 10 సార్లు చాంపియన్‌ జొకోవిచ్‌ 6–3, 6–2, 6–2తో పెడ్రో మారి్టనెజ్‌ (స్పెయిన్‌)పై గెలిచి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌కిది 100 విజయం కావడం విశేషం. ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌–102) తర్వాత ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ ‘సెంచరీ’ విజయాలు సాధించిన రెండో ప్లేయర్‌గా ఈ సెర్బియా స్టార్‌ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా మూడు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో 100 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలిచిన ఏకైక ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు నెలకొల్పాడు. జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 101 మ్యాచ్‌ల్లో... వింబుల్డన్‌లో 102 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అత్యధికసార్లు ఆడిన ప్లేయర్‌గా ఫెడరర్‌ (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేసిన జొకోవిచ్‌... అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో (81 సార్లు) ఆడిన ప్లేయర్లుగా ఫెడరర్, ఫెలిసియానో లోపెజ్‌ (స్పెయిన్‌) పేరిట ఉన్న రికార్డునూ అందుకున్నాడు. పెడ్రో మార్టినెజ్‌తో 2 గంటల్లో ముగిసిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ 14 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయలేదు. 49 విన్నర్స్‌ కొట్టిన అతను 21 అనవసర తప్పిదాలు చేశాడు. తన సరీ్వస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని ఈ సెర్బియా యోధుడు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. వావ్రింకా బోణీ... ఈ ఏడాది తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన 2014 చాంపియన్, స్విట్జర్లాండ్‌ స్టార్‌ వావ్రింకా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో వావ్రింకా 5–7, 6–3, 6–4, 7–6 (7/4)తో లాస్లో జెరె (సెర్బియా)పై గెలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజయం సాధించిన రెండో అతిపెద్ద వయసు్కడిగా వావ్రింకా (40 ఏళ్ల 296 రోజులు) గుర్తింపు పొందాడు. ఈ రికార్డు ఇవో కార్లోవిచ్‌ (క్రొయేషియా–40 ఏళ్ల 326 రోజులు) పేరిట ఉంది. మరోవైపు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్‌ (రష్యా) కూడా గెలుపు బోణీ కొట్టాడు. తొలి రౌండ్‌లో 11వ సీడ్‌ మెద్వెదెవ్‌ 7–5, 6–2, 7–6 (7/2)తో జెస్పెర్‌ డి జాంగ్‌ (నెదర్లాండ్స్‌)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా) 6–2, 6–2, 6–3తో మెక్‌డొనాల్డ్‌ (అమెరికా)పై, 12వ సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) 6–1, 6–2, 6–4తో మటియా బెలూచి (ఇటలీ)పై, 13వ సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6–4, 6–2, 6–3తో మటియో అర్నాల్డి (ఇటలీ)పై, 14వ సీడ్‌ డేవిడోవిచ్‌ ఫొకీనా (స్పెయిన్‌) 6–2, 6–3, 6–3తో ఫిలిప్‌ మిసోలిచ్‌ (ఆస్ట్రియా)పై గెలిచారు.

Pak dont: PCB backtracks on skipping T20 WC 2026 supporting Bangladesh9
అబ్బే అదేం లేదు!.. మాట మార్చిన పాక్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో ఆడే విషయమై బంగ్లాదేశ్‌ ఇంత వరకు తమ నిర్ణయాన్ని స్పష్టం చేయలేదు. ఈ అంశంలో బుధవారం (జనవరి 21) వరకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) తమ వైఖరి ఏమిటో చెప్పాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) డెడ్‌లైన్‌ విధించినట్లు తెలుస్తోంది.ముదిరిన వివాదంకాగా భారత్‌- బంగ్లాదేశ్‌ దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌పై బంగ్లా నేతలు అవాకులు, చెవాకులు పేలడం.. ఆ దేశంలో మైనారిటీ హిందువులపై దాడులు జరగడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తొలగించింది.దీనిని అవమానంగా భావించిన బంగ్లాదేశ్‌ బోర్డు.. ప్రపంచకప్‌ టోర్నీ ఆడేందుకు భారత్‌కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ కొత్తరాగం ఎత్తుకుంది. తాము ఆడే మ్యాచ్‌లను మరో వేదికైన శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. కుదరదుఅయితే, ఇప్పటికే భారత్‌- శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లకు ఆయా జట్లు టికెట్లు బుక్‌ చేసుకోవడం, టోర్నీ ఆరంభానికి తక్కువ సమయం ఉన్నందున బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చినట్లు సమాచారం.డెడ్‌లైన్‌అయినా సరే బంగ్లాదేశ్‌ మాత్రం తమ మొండి వైఖరి వీడటం లేదు. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు సంకల్పించిన ఐసీసీ డెడ్‌లైన్‌ విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తలదూర్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. పాక్‌ మీడియా కథనాల ప్రకారం..బంగ్లాదేశ్‌ అభ్యర్థనను ఐసీసీ గనుక మన్నించకపోతే.. తాము సైతం టోర్నీ నుంచి వైదొలగాలని పాక్‌ బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఐసీసీ వైఖరిని గట్టిగా వ్యతిరేకించేందుకు పాక్‌ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, పీసీబీ వర్గాలు తాజాగా ఈ విషయంపై స్పందించాయి.అబ్బే అదేం లేదు.. మాకేం అవసరంరెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అబ్బే అదేం లేదు. బంగ్లాదేశ్‌ విషయంలో అసలు పీసీబీ ఎలాంటి స్టాండ్‌ తీసుకోలేదు. అలా చేయడానికి పాకిస్తాన్‌కు అధికారం కూడా లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం పాకిస్తాన్‌ ఇప్పటికే తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడేందుకు సిద్ధమైంది. మరి అలాంటపుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏముంది?..తటస్థ వేదికలపైనే భారత్‌- పాక్‌ మ్యాచ్‌లుబంగ్లాదేశ్‌- బీసీసీఐ- ఐసీసీ మధ్య జరుగుతున్న విషయాలకు ఆజ్యం పోసేలా కొంతమంది కావాలని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు’’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు.తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడి చాంపియన్‌గా నిలిచింది. ఐసీసీ చెప్పిన ప్రకారం చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌కు తటస్థ వేదికను ఏర్పాటు చేసినట్లుగానే.. ఈసారి టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండటంతో పాక్‌ మ్యాచ్‌లకు శ్రీలంకను వేదికగా ఖరారు చేశారు. అంతకుముందు మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 టోర్నీ భారత్‌లో జరుగగా.. పాక్‌ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7- మార్చి8 వరకు భారత్‌-శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీ జరుగనుంది.చదవండి: బంగ్లాదేశ్‌ T20 WC 2026లో ఆడకపోతే స్కాట్లాండ్‌కు అవకాశం!

IND vs NZ: Gavaskar blames poor starts urges batters to learn from Kohli10
ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి!

న్యూజిలాండ్‌ చేతిలో మరోసారి టీమిండియాకు భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై కివీస్‌కు తొలిసారి భారత్‌ వన్డే సిరీస్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా ఓటమికి కారణం అదేన్యూజిలాండ్‌తో మ్యాచ్‌లలో సరైన ఆరంభాలు లేకపోవమే భారత్‌ సిరీస్‌ కోల్పోయేందుకు కారణమని గావస్కర్‌ అభిప్రాయ పడ్డారు. భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ఇన్నింగ్స్‌లు ఎలా నిర్మించాలో విరాట్‌ కోహ్లి (Virat Kohli)ని చూసి సహచరులు నేర్చుకోవాలని సూచించాడు. ‘కోహ్లికి సరైన సహకారం లభించకపోతే లక్ష్య ఛేదన చాలా కష్టమని అర్థమైపోయింది. చివరకు అదే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సిరీస్‌లో మనకు సరైన ఆరంభాలు లభించలేదు. అదే జరిగితే సగం పని సులువయ్యేది. రాహుల్‌లాంటి బ్యాటర్‌ అవుటైన తర్వాత నితీశ్ (Nitish Kumar Reddy), హర్షిత్‌ (Harshit Rana)లాంటి ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకే పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది’ అని గావస్కర్‌ విశ్లేషించారు. సెంచరీతో చివరి వరకు పోరాడిన కోహ్లిపై సన్నీ ప్రశంసలు కురిపించారు. ఓటమిని అంగీకరించకుండా‘కోహ్లి ఆలోచనధోరణి, అతని నిలకడను అందరూ అందిపుచ్చుకోవాలి. ఒకే శైలికి కట్టుబడకుండా పరిస్థితులకు తగినట్లుగా కోహ్లి తన ఆటను మార్చుకున్నాడు. చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా అతను ప్రయత్నించాడు. ఇది యువ ఆటగాళ్లకు మంచి పాఠం అవుతుంది’ అని దిగ్గజ క్రికెటర్‌ పేర్కొన్నారు. చదవండి: భారత్‌ నెత్తిన మిచెల్‌ పిడుగు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement