ప్రధాన వార్తలు
టీమిండియా టార్గెట్ 196
కోల్కతా: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో భారత్కు 196 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది వెస్టిండీస్, ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఆది నుంచి బ్యాట్ ఝుళిపించింది. ఓపెనర్లు షాయ్ హోప్( 32: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రోస్టన్ ఛేజ్(40: 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత హెట్ మెయిర్ ( 27: 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు) చెలరేగి ఆడే యత్నం చేశాడు. విండీస్ స్కోరు బోర్డు వేగం పుంజుకునే క్రమంలో బూమ్రా బౌలింగ్ లో హెట్ మెయిర్ అవుటయ్యాడు. బూమ్రా బౌలింగ్ లో సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెట్ మెయిర్. అప్పటికి విండీస్ స్కోరు 11.3 ఓవర్లలో 102 పరుగులుగా ఉంది. అయితే హెట్ మెయిర్ రెండో వికెట్గా ఔటైన తర్వాత విండీస్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది. అయితే రావెన్ పావెల్(34 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), జాసన్ హోల్డర్(37 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.భారత బౌలర్లలో బుమ్రా మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బుమ్రా నాలుగు ఓవర్లలో 36 పరుగులే ఇవ్వగా, హార్దిక్ పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు, అర్షదీప్ 43 పరుగులు, వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చారు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.పావెల్ అరుదైన ఘనతఈ మ్యాచ్లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా రోవ్మాన్ పావెల్ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్ తరుఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పావెల్ టీ20ల్లో 150 సిక్సర్లు మార్కును చేరుకోవడంతో విండిస్ తరుఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో నికోలస్ పూరన్ 149 సిక్సర్లు కొట్టిన జాబితాలో ఉండగా, వెవిన్ లూయిస్ 136 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్ గేల్ 124 సిక్సర్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.పొలార్డ్, హెట్మెయిర్లు 99 సిక్సర్లతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
T20 WC 2026: విండీస్తో డూ ఆర్ డై మ్యాచ్.. టీమిండియా ఇదే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 1) డూ ఆర్ డై మ్యాచ్ జరుగుతుంది. కోల్కతా వేదికగా జరుగనున్న ఈ సూపర్-8 మ్యాచ్లో భారత్, వెస్టిండీస్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్-1 నుంచి సెమీస్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్లో జింబాబ్వేపై ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం వెస్టిండీస్ ఓ మార్పు చేసింది. బ్రాండన్ కింగ్ స్థానంలో అకీల్ హొసేన్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్: సంజూ శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్వెస్టిండీస్: షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్
T20 WC 2026: నామమాత్రపు మ్యాచ్లోనూ సౌతాఫ్రికాదే గెలుపు
టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో అజేయ జట్టుగా నిలిచిన ఈ జట్టు.. సూపర్-8 దశను కూడా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్కు చేరిన సౌతాఫ్రికా.. ఇవాళ (మార్చి 1) జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్లో న్యూజిలాండ్తో పోటీకి రెడీ అయ్యింది.ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్ రజా ఆదుకున్నాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ప్లేయర్ క్లైవ్ మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్ బెన్నెట్ 15, డియాన్ మైర్స్ 11, ర్యాన్ బర్ల్ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్ ఈవాన్స్ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్ బాష్ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్ తీశారు.అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్తో సత్తా చాటిన సికందర్ రజా (4-0-29-3) బాగా ఇబ్బంది పెట్టాడు. అయితే మధ్య వరుస బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు మార్క్రమ్ (4), డికాక్ (0) విఫలమైనా.. రికెల్టన్ (31), బ్రెవిస్ (42), మిల్లర్ (22), స్టబ్స్ (21 నాటౌట్), లిండే (30 నాటౌట్) రాణించి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. జింబాబ్వే బౌలర్లలో రజాతో పాటు ముజరబానీ (3.5-0-32-1), బ్రాడ్ ఈవాన్స్ (3-0-22-1) వికెట్లు తీశారు. ఈ ఓటమితో ప్రపంచకప్లో జింబాబ్వే పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో జింబాబ్వే గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకపై సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.
T20 WC 2026: సౌతాఫ్రికాతో మ్యాచ్.. సికందర్ రజా విధ్వంసం
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 1) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్కు అర్హత సాధించగా.. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీలోకి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ అప్రధానమైన మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్ రజా, క్లైవ్ మదండే (26 నాటౌట్) ఆదుకున్నారు. ముఖ్యంగా సికందర్ రజా ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రజా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్ బెన్నెట్ 15, డియాన్ మైర్స్ 11, ర్యాన్ బర్ల్ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్ ఈవాన్స్ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్ బాష్ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్ తీశారు.అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్తో సత్తా చాటిన సికందర్ రజా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్లు మార్క్రమ్ (4), డికాక్ (0)ను ఔట్ చేశాడు. 5 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 30-2గా ఉంది. రికెల్టన్ (19), బ్రెవిస్ (7) క్రీజ్లో ఉన్నారు.
విశ్వవిజేత భారత్కు భారీ షాక్
మహిళల వన్డేల్లో విశ్వవిజేత అయిన భారత్కు ఊహించని షాక్ తగిలింది. జగజ్జేతగా అవతరించిన తర్వాతి సిరీస్లోనే మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.హోబర్ట్ వేదికగా ఇవాళ (మార్చి 1) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో 185 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అంతకుముందు రెండు వన్డేలను కూడా ఆస్ట్రేలియానే గెలిచింది. అయితే దీనికి ముందు ఆసీస్లోనే జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మాత్రం భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.ఇవాళ జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ అలైస్సా హీలీ (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. జార్జియా వాల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించింది. మిగతా ప్లేయర్లలో ఫోబ్ లిచ్ఫీల్డ్ 14, అన్నాబెల్ సదర్ల్యాండ్ 23, ఆష్లే గార్డ్నర్ 4, తహ్లియా మెక్గ్రాత్ 2, జార్జియా వేర్హమ్ ఒక్క పరుగు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్, కశ్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో భారత్ చేతులెత్తేసింది. అలానా కింగ్ (10-1-33-4), జార్జియా వేర్హమ్ (1.1-0-3-2) ధాటికి 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. నికోలా కేరీ, సదర్ల్యాండ్, ఆష్లే గార్డ్నర్ తలో వికెట్ తీశారు. భారత ప్లేయర్లలో స్మృతి మంధన, కశ్వీ గౌతమ్ డకౌట్ కాగా.. ప్రతీకా రావల్ 27, జెమీమా 42, కెప్టెన్ హర్మన్ 25, హర్లీన్ డియోల్ 14, దీప్తి శర్మ 29, రిచా ఘోష్ 18, శ్రీ చరణి 11 పరుగులు చేశారు. ఓటమి ఖరారయ్యాక స్నేహ్ రాణా (44) ప్రతిఘటించింది. కాగా, ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్తో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన ముగుస్తుంది.
ఇరాన్ దాడులు.. దుబాయ్లో చిక్కుకున్న పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం దుబాయ్లో చిక్కుకుపోయింది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులు కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె ప్రయాణానికి అంతరాయం కలిగింది. సింధు బర్మింగ్హామ్లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్ కోసం దుబాయ్ మీదుగా లండన్కు బయల్దేరింది.దుబాయ్ ట్రాన్సిట్లో ఉన్న సమయంలో గల్ఫ్ ఎయిర్స్పేస్లో మిసైల్ దాడుల కారణంగా అన్ని విమాన సర్వీసులు నిలిపి వేయబడ్డాయి. దీంతో సింధు విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులపై సింధు తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. తాము ఉన్న ప్రాంతానికి అతి సమీపంలో ఓ భారీ పేలుడు సంభవించింది. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశాము. ఇక్కడి పరిస్థితులు క్రమేపీ భయానకంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి తామంతా క్షేమంగా ఉన్నాము. ఎయిర్పోర్ట్ సిబ్బంది తమను సురక్షిత ప్రాంతానికి తరలించారు అని ఎక్స్లో పేర్కొంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేస్తూ.. ప్రయాణికులు అనిశ్చితిలో వేచి ఉన్న దృశ్యాలను చూపించింది.కాగా, అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భారీ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీ మృతి చెందగా, పలువురు భద్రతా అధికారులు ప్రాణాలు కోల్పోయారు.ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్ మరియు డ్రోన్ దాడులు చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు పామ్ జుమైరా ప్రాంతాలు ఇరాన్ మిసైల్ దాడులకు గురయ్యాయి. బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల కారణంగా గల్ఫ్ ఎయిర్స్పేస్ మూసివేయబడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అమెరికా-ఇరాన్ యుద్దం.. క్రికెట్ సిరీస్ రద్దు
అమెరికా-ఇరాన్ యుద్ద ప్రభావం క్రికెట్ ప్రపంచంపై కూడా పడింది. పాకిస్తాన్ షాహీన్స్తో (ఏ జట్టు) జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డేల సిరీస్ను ఇంగ్లండ్ లయన్స్ (ఏ జట్టు) రద్దు చేసుకుంది. ఈ సిరీస్ యూఏఈలోని అబుదాబీ వేదికగా జరుగుతుంది. అబుదాబీ నగరం ప్రస్తుతం ఇరాన్ దాడులతో అట్టుడికిపోతుంది.అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ అమెరికా ఎయిర్బేస్ల్లో ఒకటైన అబుదాబీని టార్గెట్ చేసింది. శక్తివంతమైన బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేస్తుంది. అక్కడే ఇంగ్లండ్ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ చిక్కుకుపోయారు. భారతకాలం ప్రకారం ఇవాళ (మార్చి 1) ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ లయన్స్-పాకిస్తాన్ షాహీన్స్ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది.అయితే భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచ్తో పాటు మిగతా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.“జట్టు భద్రత మా ప్రాధాన్యత. పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం” ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లండ్ కోచింగ్ బృందంలో ఆ దేశ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ సహా విధ్వంసకర వికెట్కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, ఇంగ్లండ్ లయన్స్-పాకిస్తాన్ షాహీన్స్ మధ్య 3 టీ20లు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అబుదాబీ వేదికగా షెడ్యూలైంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్లో తొలుత టీ20లు జరగగా.. ఇంగ్లండ్ 3-0 తేడాతో ఆ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 27న జరిగిన తొలి వన్డేలోనూ ఇంగ్లండే విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3, 4, 5 వన్డేలు మార్చి 4, 6, 9 తేదీల్లో జరగాల్సి ఉంది.
హీలీ, మూనీ విధ్వంసకర శతకాలు.. ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా భారత్తో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు అతి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి టీమిండియా కెప్టెన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 409 పరుగులు చేసింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ అలైస్సా హీలీ (మిచెల్ స్టార్క్ భార్య) (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. జార్జియా వాల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించింది. మిగతా ప్లేయర్లలో ఫోబ్ లిచ్ఫీల్డ్ 14, అన్నాబెల్ సదర్ల్యాండ్ 23, ఆష్లే గార్డ్నర్ 4, తహ్లియా మెక్గ్రాత్ 2, జార్జియా వేర్హమ్ ఒక్క పరుగు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్, కశ్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. రేణుకా, రాణా మినహా మిగతా ముగ్గురు భారత బౌలర్లను ఆసీస్ ప్లేయర్లు చెడుగుడు ఆడుకున్నారు. కశ్వీ గౌతమ్ 10 ఓవర్లలో 83, దీప్తి శర్మ 10 ఓవర్లలో 90 పరుగులు ఇవ్వగా.. శ్రీచరణి 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులు సమర్పించుకుంది. రేణుకా, రాణా తలో 10 ఓవర్లలో చెరో మెయిడిన్ వేసి 64, 66 పరుగులు ఇచ్చారు.కాగా, ఆసీస్ ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఇదివరకే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆసీస్ తొలి రెండు వన్డేల్లో గెలవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో వన్డే తర్వాత ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.
వరల్డ్కప్ నుంచి నిష్క్రమించిన కొద్ది గంటల్లోనే పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం
టీ20 వరల్డ్కప్ 2026 నుంచి పాక్ సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. నిన్న (ఫిబ్రవరి 28) తమ చివరి సూపర్-8 మ్యాచ్లో శ్రీలంకపై గెలిచినా, న్యూజిలాండ్తో పోలిస్తే మెరుగైన రన్రేట్ లేని కారణంగా సెమీస్కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ఇదివరకే సెమీస్ బెర్త్ సాధించగా.. పాక్ శ్రీలంకపై గెలిచినా, మెరుగైన రన్రేట్ సాధించలేకపోవడంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్కు చేరుకోగా.. రెండో బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 1) రాత్రి జరుగబోయే మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ఆ జట్టు సెమీస్కు చేరకుంటుంది. సెమీస్లో గ్రూప్-1 టాపర్గా ఉన్న సౌతాఫ్రికా గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్తో తలపడాల్సి ఉండగా.. వెస్టిండీస్, భారత్ మ్యాచ్లో విజేత గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్తో సెమీస్లో తలపడుతుంది.ఇదిలా ఉంటే, పాక్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన గంటల వ్యవధిలో ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కొడుకు, పాక్ మాజీ స్పిన్నర్ అయిన ఉస్మాన్ ఖాదిర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2024 అక్టోబర్లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ఆయన, ఇప్పుడు మళ్లీ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఉస్మాన్ ఖాదిర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పాకిస్తాన్ క్రికెట్లో సంచలనంగా మారింది.32 ఏళ్ల ఉస్మాన్ ఖాదిర్.. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ లాంటి వారు జట్టులోకి రాక ముందు పాక్ టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నారు. అయితే యువ స్పిన్నర్ల రాకతో అతనికి అవకాశాలు కరువయ్యాయి. దీంతో 2024లో రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వైదొలిగాక ఉస్మాన్ ఖాదిర్ తన మనసు మార్చుకున్నాడు.రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడానికి కారణాలుఉస్మాన్ ఇటీవల ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు 41 వికెట్లు తీశాడు. అలాగే స్థానిక లీగ్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో రాణించాడు. ఇంటాబయటా మంచి స్పందన రావడంతో ఉస్మాన్కు అంతర్జాతీయ వేదికపై తిరిగి రాణించగలనన్న నమ్మకం కలిగింది. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత, తన తండ్రి అబ్దుల్ ఖాదిర్ వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఎక్స్ వేదికగా.. “నా ప్రయాణం ఇంకా ముగియలేదు. పాకిస్తాన్ క్రికెట్ కోసం మళ్లీ సిద్ధంగా ఉన్నాను” అని ప్రకటించాడు.తండ్రి తరహాలోనే రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన ఉస్మాన్ ఖాదిర్ పాక్ తరఫున 25 వన్డేల్లో 31 వికెట్లు.. ఒక వన్డే ఓ వికెట్ తీశాడు. 2020లో జింబాబ్వేపై టీ20తో పాక్ తరఫున అరంగేట్రం చేసిన ఉస్మాన్.. 2023 ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్పై తన చివరి మ్యాచ్ ఆడాడు.
సెమీఫైనల్ లక్ష్యంగా...
టి20 ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ టైటిల్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో కఠిన పరీక్షకు సిద్ధమైంది. సెమీస్లో చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో మాజీ చాంపియన్, హిట్టర్లకు మారుపేరైన వెస్టిండీస్తో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లు ‘సూపర్ ఎయిట్స్’ దశలో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయి జింబాబ్వేపై ఘన విజయాలు సాధించి సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. 2024 టి20 వరల్డ్ కప్నుంచి ఇరు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. అయితే అనుభవంలో మేటిగా ఉన్న టీమిండియా ఎలా పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరంకోల్కతా: టి20 వరల్డ్ కప్లో రెండు సార్లు విజేతలుగా నిలిచిన జట్లు ఈ సారి టోర్నీ కీలక దశలో ముఖాముఖీకి సన్నద్ధమయ్యాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ‘క్వార్టర్ ఫైనల్’లాంటి పోరులో నేడు (ఆదివారం) వెస్టిండీస్ను భారత్ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు సెమీస్ చేరుకుంటుంది. ఓడిన టీమ్ టోర్నీనుంచి నిష్క్రమిస్తుంది. అయితే రన్రేట్లో ప్రత్యర్థికంటే భారత్ కాస్త వెనుకబడి ఉంది. ఒక వేళ ఊహించని విధంగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం జరిగితే విండీస్ ముందంజ వేస్తుంది. అయితే ఈ అంచనాలను పక్కనపెడితే... వరల్డ్ కప్లో రెండు టీమ్లూ సిక్సర్లతో చెలరేగాయి. మరోసారి మైదానంలో భారీ మోత ఖాయంగా కనిపిస్తోంది. మార్పుల్లేకుండా... జింబాబ్వేపై చెలరేగిన భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. మేనేజ్మెంట్ కూడా అదే వ్యూహాన్ని కొనసాగించాలని భావిస్తోంది. తండ్రి మరణం తర్వాత రింకూ సింగ్ మళ్లీ జట్టుతో చేరినా...అతనికి అవకాశం దక్కకపోవచ్చు. మరో సారి అభిషేక్, సామ్సన్ ఓపెనర్లుగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. గత భారీ స్కోర్ల మ్యాచ్లో ఫర్వాలేదనిపించిన సామ్సన్ మరింత పెద్ద స్కోరు చేయాల్సి ఉంది.జింబాబ్వేపై కాస్త తగ్గి ఆడిన అభిషేక్ మళ్లీ తనదైన శైలిలో చెలరేగితే జట్టుకు శుభారంభం ఖాయం. తర్వాతి బ్యాటింగ్ భారాన్ని ఇషాన్, సూర్య మోస్తారు. పాండ్యా, దూబేల దూకుడు అదనపు బలం కాగా, అక్షర్ కూడా తన బ్యాటింగ్తో జట్టుకు కీలకం కాగలడు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం జట్టు ప్రధాన బలం. బౌలింగ్లో కూడా మన టీమ్ పదునుగా ఉంది. స్పిన్ను పెద్దగా ఆడలేని విండీస్పై వరుణ్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించగలడు. బుమ్రా, అర్ష్ దీప్ లు విండీస్ హిట్టర్లను ఆరంభంలో నిలువరిస్తే తిరుగుండదు. బౌలింగ్లో రాణించేనా! వెస్టిండీస్ టీమ్ మొదటినుంచి తమ బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. ఒకరితో పోటీ పడి మరొకరు సిక్సర్లు బాదగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన మ్యాచ్లో కూడా ఎక్కువ పరుగులు సిక్సర్ల ద్వారానే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లీగ్లు ఆడే హిట్టర్లు బౌలర్లు ఎవరైనా ప్రత్యర్థి ఎవరైనా లెక్క చేయకుండా బౌండరీ దాటించడమే పనిగా ఆడుతున్నారు. హెట్మైర్, పావెల్, రూథర్ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్... ఇలా అంతా భారీ షాట్లు ఆడేవారే. అంతా సమష్టిగా చెలరేగితే భారత్పై ఒత్తిడి పెరగడం ఖాయం. అయితే భారత్తో పోలిస్తే విండీస్ బౌలింగ్ చెప్పుకోదగినట్లుగా లేదు. ఒక్క షామర్ జోసెఫ్ ఫర్వాలేదనిపించే బౌలర్ కాగా...ఫోర్డ్, మోతీ, హోల్డర్, ఛేజ్ మన బ్యాటర్లను నిలువరించలేరు. అందుకే జట్టు భారీ స్కోరు సాధించడంపైనే గురి పెట్టింది. 2016 టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వెస్టిండీస్ మరే ఐసీసీ ఈవెంట్లో కూడా సెమీఫైనల్ చేరలేకపోయింది.పిచ్, వాతావరణం ఈడెన్ గార్డెన్స్ పిచ్ బాగా పొడిగా ఉంది. బ్యాటింగ్కు ఎంతో అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. రద్దు గురించి భారత అభిమానులు భయపడుతున్నా... మ్యాచ్ రోజున ఎలాంటి వర్ష సూచన లేదు. 1983 నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి భారత్తో 11 మ్యాచ్లలో తలపడిన వెస్టిండీస్ ఒక్కటీ గెలవలేదు. 2 టెస్టులు డ్రా కాగా మిగతా 9 సార్లు (4 టి20లు) ఓడింది.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్ , బుమ్రా, వరుణ్. వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్), కింగ్, హెట్మైర్, పావెల్, ఛేజ్, రూథర్ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్, ఫోర్డ్, మోతీ, జోసెఫ్. టి20 ప్రపంచకప్లో నేడుజింబాంబ్వే X దక్షిణాఫ్రికావేదిక: ఢిల్లీ, మ. 3 గంటల నుంచి భారత్ X వెస్టిండీస్వేదిక: కోల్కతా, రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
మరోసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: ప్రొ హాకీ లీగ్లో భారత పురుషుల హాకీ జట్ట...
ఈసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: వేదిక మారినా... ప్రత్యర్థులు మారినా... క...
సింగిల్స్ రన్నరప్ వైష్ణవి
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ...
మెయిన్ ‘డ్రా’కు రామ్–జీవన్ జోడీ
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ చాం...
వరల్డ్కప్ నుంచి నిష్క్రమించిన కొద్ది గంటల్లోనే పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం
టీ20 వరల్డ్కప్ 2026 నుంచి పాక్ సూపర్-8 దశలోనే ...
సెమీఫైనల్ లక్ష్యంగా...
టి20 ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ తమ ట...
ఆఖరి వన్డే గెలుస్తారా!
హోబర్ట్: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్ నెగ్గి...
హిమ శిఖరాన
ఒకవైపు ఆహ్లాదాన్ని పంచే మంచు కొండలు... మరోవైపు కవ్...
క్రీడలు
అర్జున్ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
వీడియోలు
నేడు కోల్ కతా వేదికగా హై ఓల్టేజ్ ఫైట్
T20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్
దుబాయ్ లో తాజా పరిణామాలపై పీవీ సింధు వీడియో విడుదల
సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్
రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
జింబాబ్వేపై భారత్ విజయం
టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి
Analyst Venkatesh : టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే..
టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు పరీక్షా సమయం
నేడు కీలక మ్యాచ్.. నిలవాలంటే గెలవాల్సిందే..
