ప్రధాన వార్తలు
టాపార్డర్ నుంచి తీసేశారు.. మెరుపులతో ఇరగదీశాడు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ తిలక్ వర్మ తనదైన మూడో స్థానంలోనే బ్యాటింగ్కు వచ్చాడు. సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్లోనూ వన్డౌన్లో దిగాడు. అయితే, ఐదు మ్యాచ్లలోనూ తిలక్ వర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.తిలక్ ప్రదర్శన ఇలా..ముఖ్యంగా ఈ హైదరాబాదీ బ్యాటర్ స్ట్రైక్రేటుపై విమర్శలు వచ్చాయి. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై తిలక్ వర్మ వరుసగా.. 25, 25 , 25, 31 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.టాపార్డర్ నుంచి తీసేశారు!అయితే, తాజాగా జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్లో మాత్రం తిలక్ వర్మ ఇరగదీశాడు. నిజానికి ఈ మ్యాచ్కు ముందు ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు తుదిజట్టులో చోటు దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాపార్డర్లో ముగ్గురూ లెఫ్లాండర్లే (ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ) ఉన్న కారణంగా.. ఒకరిపై వేటు తప్పదనే విశ్లేషణలు వినిపించాయి.ఊహించినట్లుగానే టాపార్డర్ మారింది. అభిషేక్ శర్మకు జోడీగా.. ఓపెనర్గా రైట్ హ్యాండర్ సంజూ శాంసన్ తిరిగి రాగా.. ఇషాన్ను వన్డౌన్లో ఆడించారు. అయితే, ఊహించని రీతిలో తిలక్ వర్మను లోయర్ ఆర్డర్కు పంపించారు. ఐపీఎల్లో ఆడిన అనుభవం ఇప్పటికే తిలక్కు ఉంది.16 బంతుల్లోనే ఇక జింబాబ్వేతో మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ వర్మ మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్ట్రైక్రేటు 275. ఇలా మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం ఫలించి.. తిలక్ వర్మ విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు.డౌన్ ఆర్డర్కు పంపడం మంచిదైందిఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘‘తిలక్ వర్మను డౌన్ ఆర్డర్కు పంపి టీమిండియా మంచి పని చేసింది. లోయర్ ఆర్డర్లో అతడు బ్యాటింగ్ చేయడం నేను ఇప్పటికే చూశాను.నిజానికి ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక రావడం వల్ల.. టాపార్డర్తో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఐదు, తిలక్ ఆరో స్థానంలో రావడం వారితో పాటు జట్టుకు మేలు చేసింది. నిజానికి సౌతాఫ్రికాతో మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ను ఐదు, హార్దిక్ను ఏడో స్థానంలో సూర్య పంపడం చూసి నేను షాకయ్యాను. ఏదేమైనా ఈ మ్యాచ్లో తిలక్, హార్దిక్లను సరైన స్థానాల్లో ఆడించి ఫలితం రాబట్టారు’’ అని సంజయ్ మంజ్రేకర్ టీమిండియా నాయకత్వ బృందాన్ని అభినందించాడు. కాగా జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్ అవకాశాలు మెరుగుపరచుకుంది.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
డిఫెన్స్ ఆఫీసర్ కాబోయి.. క్రికెటర్గా: టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ జితేశ్ శర్మ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అసలు తాను క్రికెటర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. ఊహించని రీతిలో తన ప్రయాణం అంతర్జాతీయ స్థాయి వరకు చేరిందన్నాడు.భారత టీ20 జట్టులోమహారాష్ట్రకు చెందిన జితేశ్ శర్మ (Jitesh Sharma) దేశీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. నేపాల్తో మ్యాచ్ సందర్భంగా 2023లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 16 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 162 పరుగులు చేశాడు.చివరగా సౌతాఫ్రికా (IND vs SA)తో గతేడాది జరిగిన టీ20 సిరీస్లో టీమిండియాకు ఆడిన 32 ఏళ్ల జితేశ్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఆర్సీబీ స్టార్ఇక ఐపీఎల్లో గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన జితేశ్.. తొలిసారి ట్రోఫీ ముద్దాడిన జట్టులో సభ్యుడు. రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ గైర్హాజరీలో పలు మ్యాచ్లకు సారథిగానూ జితేశ్ వ్యవహరించడం విశేషం.డిఫెన్స్ ఆఫీసర్ కావాలని కలలు కనేవాడినిఇదిలా ఉంటే.. ఆర్సీబీ మాజీ స్టార్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ పాడ్కాస్ట్లో జితేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘నా కెరీర్లో క్రికెట్ అనే ప్రణాళికే అస్సలు లేదు. నేను ఎల్లప్పుడూ డిఫెన్స్ ఆఫీసర్ కావాలని కలలు కనేవాడిని. రక్షణ రంగంలో సేవలు అందించాలని కోరుకునేవాడిని.మార్కుల కోసమే క్రికెట్లోకిఅది కుదరకపోతే ఆర్మీ లేదంటే ఎయిర్ ఫోర్స్లో చేరాలనుకున్నాను. ఇందుకోసం నిర్వహించే పరీక్షలో రాష్ట్రం తరఫున ఏదేని క్రీడలో రాణిస్తే అదనంగా 25 మార్కులు వేస్తారనే నిబంధన ఉండేది. అందుకే నేను పాఠశాల స్థాయిలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను.అప్పుడు వికెట్ కీపర్ కోటాలో నాకు అవకాశం వచ్చింది. అప్పుడే తొలిసారి గ్లోవ్స్ తొడుక్కున్నా. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. మా చిన్నప్పటి కోచ్ ప్రీతం గాంధీ నాలోని ప్రతిభను గుర్తించారు. ఆయనే నన్ను ప్రోత్సహించారు.ఆ ఇద్దరిది కీలక పాత్రఆ తర్వాత ఓసారి నేను దినేశ్ కార్తిక్ను కలిశాను. వీరిద్దరే నా క్రికెట్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. నేను మొండివాడిని. ఏదైనా సాధించాలని అనుకుంటే అందుకోసం ఎంత కష్టమైనా భరిస్తాను. అయితే, ఆ మొండితనమే ఒక్కోసారి నా బలహీనతగానూ మారుతుంది.ఏదేమైనా ఆర్సీబీలో చేరకముందు నా ప్రతిభను అంతగా ఎవరూ నమ్మేవారు కాదు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం మాత్రం నాపై నమ్మకం ఉంచి వరస అవకాశాలు ఇచ్చింది. అదే నా కెరీర్లో గొప్ప టర్నింగ్ పాయింట్ అని చెప్పగలను’’ అని జితేశ్ శర్మ ఆర్సీబీ పట్ల ప్రేమను చాటుకున్నాడు. చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
IND vs AUS: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్
ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ఆరంభించిన భారత మహిళా క్రికెట్ జట్టు అదే జోరు కొనసాగించలేకపోయింది. టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టుపై 2-1తో ఆధిపత్యం కనబరిచిన హర్మన్ సేన.. వన్డే సిరీస్లో మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ఆసీస్కు సమర్పించుకుంది.తొలుత బ్యాటింగ్మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలోనూ భారత్ను ఓడించింది. హోబర్ట్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (52), స్మృతి మంధాన (31) శుభారంభం అందించగా.. జెమీమా రోడ్రిగ్స్ (11) మాత్రం విఫలమైంది.హర్మన్ప్రీత్ కౌర్ అర్ద శతకంకెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అర్ద శతకం (54)తో రాణించగా.. రిచా ఘోష్ (22), కశ్వీ గౌతం (25) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 251 పరుగులు మేర మెరుగైన స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, ఆష్లే గార్డ్నర్ రెండేసి వికెట్లు కూల్చగా.. మేగన్ షట్, నికోలా క్యారీ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడినా.. 36.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. టాపార్డర్లో కెప్టెన్ అలిసా హేలీ (6) విఫలం కాగా.. మరో ఓపెనర్ ఫోబే లిచిఫీల్డ్, వన్డౌన్ బ్యాటర్ జార్జియా వోల్ అదరగొట్టారు.Georgia Voll had us all nervous on 99 😅 She's got her second ODI ton 👏 #AUSvIND pic.twitter.com/eP41Tfx5Qp— cricket.com.au (@cricketcomau) February 27, 2026జార్జియా శతకంతో..లిచిఫీల్డ్ 62 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ బాది 80 పరుగులు చేయగా.. జార్జియా శతక్కొట్టింది. మొత్తంగా 82 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 101 పరుగులు సాధించింది. మిగిలిన వారిలో బెత్ మూనీ 31 పరుగులు చేయగా.. అనాబెల్ (10) విఫలమైంది.అయితే, ఆష్లే గార్డ్నర్ 19 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేసింది. భారత బౌలర్లలో కశ్వీ గౌతం, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గాడ్కు ఒక వికెట్ దక్కింది. ఇక భారత్- ఆసీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. ఇందుకు హోబర్ట్ వేదిక. తదుపరి ఇరుజట్లు ఏకైక టెస్టు ఆడతాయి.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
జింబాబ్వేపై గెలిచాం.. కానీ: సూర్యకుమార్ అసంతృప్తి
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత జట్టు సెమీస్ అవకాశాలు మెరుగుపడ్డాయి. సూపర్-8 దశలో తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన సూర్యకుమార్ సేన.. జింబాబ్వేపై గురువారం నాటి మ్యాచ్లో 72 పరుగుల తేడాతో గెలిచి నష్టాన్ని పూడ్చుకుంది.ఇక తదుపరి ఆదివారం నాటి మ్యాచ్లో వెస్టిండీస్పై గెలిచిందంటే టీమిండియా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. ఒకవేళ వర్షం పడి ఆటంకం కలిగితే.. అపుడు నెట్ రన్రేటు కీలకం అవుతుంది. ప్రస్తుతానికి భారత్ (-0.100) కంటే విండీస్ (+1.791) ఈ విషయంలో మెరుగ్గా ఉంది.భారీ తేడాతో గెలిచి ఉంటే బాగుండేదినిజానికి జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ గెలిచినప్పటికీ.. ఇంకాస్త భారీ తేడాతో గెలిచి ఉంటే రన్రేటు మెరుగయ్యేది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత బౌలర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్లో ఆరుగురు బ్యాటర్లు కలిసి 150కి పైగా స్ట్రైక్రేటుతో ఏకంగా 256 పరుగులు రాబట్టారు. అయితే, జింబాబ్వేను తక్కువ స్కోరుకే అవుట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026ముఖ్యంగా అక్షర్ పటేల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో జింబాబ్వే బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. ఇక శివం దూబే వేసిన రెండు ఓవర్లలోనే ఏకంగా 46 పరుగులు పిండుకున్నారు. మొత్తానికి 20 ఓవర్లలో జింబాబ్వే ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేయగలిగింది.మా బ్యాటర్లు సూపర్.. కానీ బౌలర్లేఈ నేపథ్యంలో జింబాబ్వేపై విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క బ్యాటర్ తమ వంతుగా పరుగులు ఇచ్చి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఇంతకంటే ఏ ఆటగాడు ఎక్కువగా ఏమీ చేయలేడు. అయితే, బంతితో మా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సింది’’ అని బౌలర్ల ఆటతీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఏదేమైనా గెలుపు గెలుపేనని.. వెస్టిండీస్తో మ్యాచ్లో మాత్రం తాము బౌలింగ్ పరంగా మరింత స్మార్ట్గా ఉంటేనే అనుకున్న ఫలితం సులువుగా రాబట్టగలమని సూర్య పేర్కొన్నాడు. కోల్కతాకు వెళ్లిన తర్వాతే తుదిజట్టు కూర్పు గురించి ఆలోచిస్తామని.. సెమీస్ చేరే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని అన్నాడు.అదరగొట్టిన అర్ష్దీప్కాగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్- వెస్టిండీస్ మధ్య మ్యాచ్కు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. గ్రూప్-1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. ఈ మ్యాచ్ ఫలితంతో రెండో సెమీ ఫైనలిస్టు ఎవరో తేలుతుంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో మ్యాచ్లో పేసర్ అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దూబే తలా ఒక్క వికెట్ తీశారు.భారత్ వర్సెస్ జింబాబ్వే స్కోర్లు👉వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై👉భారత్: 256/4(20)👉జింబాబ్వే: 184/6(20) 👉ఫలితం: 72 పరుగుల తేడాతో భారత్ గెలుపు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్
అదేం బౌలింగ్?.. అతడు అవసరమా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియా ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశలో పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై వేదికగా పసికూన జింబాబ్వేను 72 పరుగులతో చిత్తు చేసింది. తద్వారా రెండు పాయింట్లు సాధించడంతో పాటు.. నెట్రన్రేటును మెరుగుపరుచుకుంది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్లో వెస్టిండీస్పై గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది భారత్.ఏకంగా 256 పరుగులుఇక గురువారం నాటి మ్యాచ్లో చెపాక్ బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలించడంతో భారత బ్యాటర్లు చెలరేగిన విషయం తెలిసిందే. జింబాబ్వే బౌలింగ్ను చితక్కొడుతూ టీమిండియా ఏకంగా 256 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే సైతం ఈ బ్యాటింగ్ పిచ్పై 184 పరుగులు చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత బౌలింగ్ వ్యూహంపై పెదవి విరిచాడు. ముఖ్యంగా ఆల్రౌండర్ శివం దూబే (Shivam Dube)తో ఎందుకు బౌలింగ్ చేయించారో అర్థం కాలేదన్నాడు. కాగా జింబాబ్వే (IND vs ZIM)తో మ్యాచ్లో దూబే రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకుని.. ఒకే ఒక్క వికెట్ తీశాడు. నోబాల్, వైడ్లతో ప్రత్యర్థికి అదనపు పరుగులు ఇచ్చుకున్నాడు.ఇది బ్యాటింగ్ పిచ్ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అసలు ఈ మ్యాచ్లో బౌలింగ్ గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇది బ్యాటింగ్ పిచ్. అలాంటపుడు టీమిండియా ఆరో బౌలింగ్ ఆప్షన్ గురించి ఎందుకు ఆలోచించిందో అర్థం కాలేదు.ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడో చూశారా?అసలు దూబే ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడో చూశారా? అతడు సిక్స్త్ స్టంప్ మీదకు బాల్ వేస్తున్నాడు. ఇలాంటి బౌలింగ్ నేనెప్పుడూ చూడనేలేదు. టీమిండియా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే బరిలోకి దిగింది. ఒకవేళ దూబే వంటి వాళ్లతో బౌలింగ్ చేయించాలనుకుంటే ముందుగా ప్రాక్టీస్ చేయించాలి.ఇది కేవలం నెట్రన్రేటును మెరుగుపరచుకోవడం గురించి కాదు. ముందుగా మ్యాచ్ గెలవాలి. అప్పుడే పాయింట్లు వస్తాయి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. ఏదేమైనా భారత జట్టు సెమీ ఫైనల్కు చేరుకుంటుందని.. అప్పుడు అవసరమైతే ఆరో బౌలింగ్ ఆప్షన్ను వాడుకోవచ్చని చిక్కా సూచించాడు.చదవండి: T20 WC 2026: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ రోజు వర్షం పడితే..?
టీ20 ప్రపంచకప్లో నేడు మరో కీలక సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో నేడు (ఫిబ్రవరి 27) కీలక సమరం జరుగనుంది. గ్రూప్-2 నుంచి ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్.. మరో బెర్త్ కోసం రేసులో ఉన్న న్యూజిలాండ్తో తలపడనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆ జట్టు నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. తద్వారా పాక్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ రెండో బెర్త్ కోసం పోటీ సజీవంగా ఉంటుంది. పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధిస్తే, అప్పుడు పాక్, న్యూజిలాండ్ తలో 3 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్రేట్ కీలకమవుతుంది. ప్రస్తుత గణాంకాలు చూస్తే.. న్యూజిలాండ్ ఇంగ్లండ్ చేతిలో సాధారణంగా ఓడినా, పాక్ శ్రీలంకపై నామమాత్రంగా గెలిచినా న్యూజిలాండే సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్ రన్ రేట్ 3.050గా ఉంది. అదే పాక్ రన్రేట్ -0.461గా ఉంది. పాక్ మైనస్ నుంచి ప్లస్ రన్రేట్లోకి రావాలంటేనే శ్రీలంకపై భారీ విజయం సాధించాలి. అదే న్యూజిలాండ్ రన్రేట్ను అధిగమించాలంటే అతి భారీ విజయం సాధించాలి. కాబట్టి, నేటి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా, న్యూజిలాండ్కు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉంటాయి. వాస్తవానికి న్యూజిలాండ్ పరిస్థితిని అంతవరకు తీసుకుపోకపోవచ్చు. ఎందుకంటే, ఈ ఎడిషన్లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది. గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి మినహా మిగతా మ్యాచ్ల్లో సామర్థ్యం మేరకు రాణించింది. పాక్తో జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ రద్దు కావడంతో పరిస్థితి ఇంత వరకు వచ్చింది. అదే మ్యాచ్ జరిగి ఉంటే, న్యూజిలాండ్ సునాయాసంగా పాక్ను చిత్తు చేసి, దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునేది.బలాబలాల ప్రకారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ సమతూకంగా కనిపించినా ఎడ్జ్ న్యూజిలాండ్వైపే మొగ్గు చూపుతోంది. ఆ జట్టులో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి టచ్లో ఉన్నారు. అదే ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఓపెనర్ జోస్ బట్లర్, జేకబ్ బేతెల్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్లో ఆదిల్ రషీద్ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. ఫామ్ విషయాన్ని కూడా పక్కన పెడితే, 40 ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే జట్టే అంతిమ విజేతగా నిలుస్తుంది.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/జాకబ్ డఫీఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్/రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
ఆసీస్తో రెండో వన్డే.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసింది. హోబర్ట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. తొలి వన్డేలో డకౌటైన ఓపెనర్ ప్రతీక రావల్ (52) ఈ మ్యాచ్లో అర్ద సెంచరీతో రాణించింది. మరో ఓపెనర్ స్మృతి మంధన (31) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించింది. ఆతర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 11 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ (54) వరుసగా రెండో మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో మెరిసింది. దీప్తి శర్మ (1) వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలం కాగా.. ఆఖర్లో అమన్జోత్ కౌర్ (13), రిచా ఘోష్ (22), కశ్వీ గౌతమ్ (25), క్రాంతి గౌడ్ (19), వైష్ణవి శర్మ (10 నాటౌట్) నామమాత్రపు స్కోర్లు చేసి 250 పరుగుల మార్కు దాటించారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్ల్యాండ్, అలానా కింగ్ తలో 2 వికెట్లు తీయగా.. మెగాన్ షట్, నికోలా క్యారీ చెరో వికెట్ పడగొట్టాడు.కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్, సిరీస్లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్లో చివరి వన్డే హోబర్ట్ వేదికగానే మార్చి 1న జరుగుతుంది. అనంతరం మార్చి 6న టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆకిబ్ నబీ
ప్రస్తుత రంజీ సీజన్లో జమ్మూ అండ్ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రతి మ్యాచ్లో అదిరిపోయే ప్రదర్శనలతో ప్రత్యర్ది బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్లోనూ అదే పునరావృతం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేశాడు. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించి, ఆట కట్టించాడు. ఈ క్రమంలో మరో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నబీ విజృంభించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 293 పరుగులకే ఆలౌటై, జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు (584) చాలా వెనుకపడి పోయింది. జమ్మూ బౌలర్లలో నబీతో పాటు సునీల్ కుమార్ (19-6-51-2), యుద్ద్వీర్ సింగ్ (14.3-3-55-2), సాహిల్ లోత్రా (12-1-50-1) సత్తా చాటారు. కర్ణాటక తరఫున ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (160) ఒంటరిపోరాటం చేసినా తన జట్టు పటిష్ట స్థితికి చేర్చలేకపోయాడు. అతనికి మరో ఎండ్ నుంచి ఎవరి సహకారం లభించలేదు. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (13), దేవ్దత్ పడిక్కల్ (11), కరుణ్ నాయర్ (0), స్మరణ్ రవిచంద్రన్ (0) దారుణంగా విఫలమయ్యారు.అంతకుముందు షుభమ్ పుండిర్ (121) అద్భుత సెంచరీతో, యావర్ హస్సన్ (88), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య వధావన్ (70), సాహిల్ లోత్రా (72) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో జమ్మూ టీమ్ తొలి ఇన్నింగ్స్లో 584 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్లో జమ్మూ అండ్ కశ్మీర్ ఫైనల్కు చేరడంలో ఆకిబ్ నబీ పాత్ర చాలా కీలకం. అతను దాదాపుగా ప్రతి మ్యాచ్లో సత్తా చాటి జమ్మూను తొలిసారి రంజీ ఫైనల్కు చేర్చాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ల్లో (క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ తొలి ఇన్నింగ్స్) నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు.. సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు, ఇప్పుడు ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. తాజా ప్రదర్శన తర్వాత నబీ ఈ రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. నబీ ఈ సీజన్లో ఏకంగా 60 వికెట్లు తీశాడు.ఎలా ఎంపిక చేయరో చూస్తా..!ఈ ప్రదర్శనల తర్వాత నబీ టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపిచినట్లైంది. ఇంతటి అద్భుత ప్రదర్శన కనబర్చిన నన్ను టీమిండియాకు ఎలా ఎంపిక చేయరో చూస్తా అన్న సందేశాన్ని పంపాడు. 29 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. స్వింగ్ బౌలింగ్లో దిట్ట. ఎంతటి బ్యాటర్నైనా ఇబ్బంది పెట్టగలిగే శక్తి అతని దగ్గర ఉంది. అలాగే యార్కర్లు సంధించడంలోనూ అతను దిట్ట. కేఎల్ రాహుల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ నబీని ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడంటే అతను ఎంత ప్రమాదకారో అర్దమవుతుంది. భారత సెలెక్టర్లు షమీలా కాకుండా నబీకి అవకాశాలు ఇచ్చి టీమిండియాకు మేలు చేయాలని ఆశిద్దాం.
T20 WC 2026, IND VS ZIM: అభిషేక్ ఖాతాలో అనవసర రికార్డు
టీ20 ప్రపంచకప్ 2026లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. అంచనాలను తల్లకిందులు చేస్తూ హ్యాట్రిక్ డకౌట్లు సహా నాలుగో మ్యాచ్లోనూ తక్కువ స్కోర్కే (15) ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో నిన్నటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్కు ముందు అభిషేక్పై భారీ ఒత్తిడి ఉండింది. అయితే ఈసారి అతను ఒత్తిడిని అధిగమించి 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసినా, ఓ అనవసర రికార్డు మూటగట్టుకున్నాడు. అభిషేక్కు ఇది తన టీ20 కెరీర్లో రెండో నిదానమైన (బంతుల పరంగా) హాఫ్ సెంచరీగా నిలిచింది. అభిషేక్ కెరీర్లో అత్యంత నిదానమైన హాఫ్ సెంచరీ కూడా జింబాబ్వేపైనే రావడం విశేషం. 2024లో హరారే వేదికగా జరిగిన ఓ మ్యాచ్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 33 బంతులు తీసుకున్నాడు. వాస్తవానికి సాధారణ ప్లేయర్లకు 26 బంతుల్లో అర్ద శతకం అంటే చాలా పెద్ద అఛీవ్మెంట్. అయితే అభిషేక్ లాంటి విధ్వంసకర ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాడికి మాత్రం ఇది అనవసర రికార్డుగా మిగిలిపోయింది.తాజా ప్రదర్శనలతో అభిషేక్ మరో ఘనత కూడా సాధించాడు. భారత ఓపెనర్లలో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధవన్తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. శిఖర్, అభిషేక్ తమ టీ20 కెరీర్లలో 11 సార్లు ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (32 ఫిఫ్టి ప్లస్), కేఎల్ రాహుల్ (21) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. పై జాబితాలోని ఆటగాళ్లలో అభిషేకే అతి తక్కువ మ్యాచ్లు ఆడాడు. అతని కెరీర్ ఇంకా ఆరంభ దశలోనే ఉండటంతో రోహిత్ శర్మను కిందకు దించి ఈ విభాగంలో టాప్ ప్లేస్కు చేరే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ సహా జట్టులోని ప్రతి ఒక్క బ్యాటర్ సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్కు ఇదే అత్యధిక స్కోర్గా నిలిచింది. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ 55, సంజూ శాంసన్ 24, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33, హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 నాటౌట్ పరుగులు చేశారు. భారత ఇన్నింగ్స్ మొత్తంలో 17 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఇది కూడా ఓ ప్రపంచకప్ రికార్డు.అనంతరం ఛేదనలో జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (97 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా, తన జట్టును విజయతీరాలు దాటించలేకపోయాడు. కెప్టెన్ సికందర్ రజా (31) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. అంతిమంగా జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 184 పరుగులకే పరిమితమై 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో అర్షదీప్ 3, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో జరుగబోయే మ్యాచ్ భారత్కు డూ ఆర్ డై మ్యాచ్గా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడినా, మ్యాచ్ రద్దైనా విండీస్కే సెమీస్ బెర్త్ దక్కుతుంది. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్కు అర్హత సాధించింది.
T20 WC 2026: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్కప్-2026లో టీమిండియా లెఫ్డ్ అర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన సూపర్-8 మ్యాచ్లో 3 వికెట్లు తీసిన అర్షదీప్.. టీ20 ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించాడు. అర్షదీప్ తన టీ20 వరల్డ్కప్ కెరీర్లో 19 మ్యాచ్ల్లో 14.25 సగటున, 7.33 ఎకానమీతో 35 వికెట్లు తీయగా.. బుమ్రా తన 19 మ్యాచ్ల వరల్డ్కప్ కెరీర్లో 14.00 సగటున 33 వికెట్లు తీశాడు. ఓవరాల్గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్కు (50) దక్కుతుంది.సూపర్ ఫామ్లో అర్షదీప్ప్రస్తుత ప్రపంచకప్లో అర్షదీప్ సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. టీమిండియా గత ఎడిషన్ టీ20 ప్రపంచకప్ సాధించడంలోనూ అర్షదీప్సింగ్ కీలకపాత్ర పోషించాడు. ఆ ఎడిషన్లో 17 వికెట్లు తీసి జాయింట్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇప్పటివరకు 81 టీ20లు ఆడిన అర్షీదప్.. 126 వికెట్లు తీసి భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో అర్షదీప్ సహా జట్టులోని ప్రతి ఒక్కరు సత్తా చాటడంతో జింబాబ్వేపై టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో జరుగబోయే మ్యాచ్ భారత్కు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడినా, మ్యాచ్ రద్దైనా విండీస్కే సెమీస్ బెర్త్ దక్కుతుంది.భారత్ వర్సెస్ జింబాబ్వే స్కోర్ వివరాలు..భారత్: 256-4 (అభిషేక్ (55), హార్దిక్ (50 నాటౌట్)జింబాబ్వే: 184-6 (బ్రియాన్ బెన్నెట్ 97 నాటౌట్, అర్షదీప్ 4-0-24-3)
మెయిన్ ‘డ్రా’కు రామ్–జీవన్ జోడీ
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ చాం...
షకీల్పై నిషేధం ఎత్తివేత
లాహోర్: పాకిస్తాన్ హాకీలో సంక్షోభం ముదురుతున్న వ...
ఢిల్లీ మారథాన్ దిగ్గజాలతో షురూ
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రతిష్టాత్మక ‘ఢిల్...
సీఎం కప్ ఫైనల్స్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: చీఫ్ మినిస్టర్ కప్ 2025 (తె...
ఆసీస్తో రెండో వన్డే.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా...
టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆకిబ్ నబీ
ప్రస్తుత రంజీ సీజన్లో జమ్మూ అండ్ కశ్మీర్ ఫాస్ట్...
T20 WC 2026, IND VS ZIM: అభిషేక్ ఖాతాలో అనవసర రికార్డు
టీ20 ప్రపంచకప్ 2026లో భారీ అంచనాల మధ్య బరిలోకి ది...
T20 WC 2026: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్కప్-2026లో టీమిండి...
క్రీడలు
అర్జున్ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
వీడియోలు
తీవ్ర విషాదం.. రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
జింబాబ్వేపై భారత్ విజయం
టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే & వెస్టిండీస్ పై ఎంత రన్ రేట్ గెలవాలి
Analyst Venkatesh : టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే..
టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు పరీక్షా సమయం
నేడు కీలక మ్యాచ్.. నిలవాలంటే గెలవాల్సిందే..
భారత్ సెమీస్ చేరాలంటే..? 11 ఓవర్లలో ఎంత ఛేజ్ చేయాలంటే..!
రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!
కొంపముంచిన గంభీర్
