ప్రధాన వార్తలు
'షమీకి అన్యాయం.. ఇది నిజంగా సిగ్గు చేటు'
టీమిండియా స్టార్ మహ్మద్ షమీకి జాతీయ సెలెక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో షమీకి చోటు దక్కలేదు. కివీస్తో వన్డే సిరీస్కు షమీని ఎంపిక చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం షమీని పరిగణలోకి తీసుకోలేదు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో మహ్మద్ సిరాజ్కు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లకు చోటు దక్కింది. అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్న షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. భారత జట్టుకు తిరిగి ఆడాలంటే అతడు ఇంకా ఏమి చేయాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ జట్టు హెడ్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా సెలెక్టర్లపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డాడు.దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికి, షమీని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదని అతడు ఫైరయ్యాడు. షమీ చివరగా భారత్ తరపున గతేడాది మార్చిలో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం క్రమం తప్పకుండా ఆడుతున్నాడు.షమీకి అన్యాయం..సెలక్షన్ కమిటీ మరోసారి మహమ్మద్ షమీకి అన్యాయం చేసింది. ఇటీవలి కాలంలో ఏ అంతర్జాతీయ ఆటగాడు కూడా షమీ అంత పట్టుదలతో దేశవాళీ క్రికెట్ ఆడలేదు. డొమెస్టిక్ క్రికెట్లో అతడు అద్భుతంగా రాణిస్తున్నప్పటికి సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడం నిజంగా సిగ్గు చేటు అని రేవ్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుక్లా పేర్కొన్నాడు. షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో సీజన్లో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా కొనసాగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలోన అతడు అదరగొట్టాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు దాదాపు 45 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అయితే షమీ ఫామ్ లేదా ఫిట్నెస్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ లాంటి బౌలర్లను సిద్దం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే షమీకి అవకాశమివ్వడం లేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడతున్నారు.న్యూజిలాండ్ వన్డేలకు భారత జట్టు : శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కె.ఎల్. రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
బీసీసీఐ కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్కు భారీ షాక్!
భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్లో మూడు వన్డేలు, టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉంది. అయితే మరోసారి ఈ పరిమిత ఓవర్ల సిరీస్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టీమిండియా పర్యటనను బీసీసీఐ తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు."బంగ్లాదేశ్ టూర్ను మేము ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది కూడా మా జట్టు బంగ్లా పర్యటనకు వెళ్లలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ సిరీస్ క్యాలెండర్ను విడుదల చేసినప్పటికి.. టీమిండియా పర్యటించేది మాత్రం అనుమానమే. ఈ టూర్పై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నాము.ఎందుకంటే దేశం వెళ్లి ఆడాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసారి. ఇక టీ20 ప్రపంచకప్ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారమే.. బంగ్లాదేశ్ మ్యాచ్లు భారత్లో జరగనున్నాయి" అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా భారత్-బంగ్లా జట్టు వైట్బాల్ సిరీస్ షెడ్యూల్ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. కానీ అంతలోనే బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. వాస్తవానికి గతేడాది ఆగస్టులో జరగాల్సి ఉంది. కానీ అప్పట్లో అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత వల్ల అది ఈ ఏడాది సెప్టెంబర్కు వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు అదే కథ పునరావృతమయ్యేలా ఉంది. పొట్టి ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు ఫిబ్రవరిలో రానుంది. ముస్తాఫిజుర్ ఔట్..అదేవిధంగా బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్కతా నైట్ రైడర్స్ను బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్ల భారీ ధరకు ముస్తాఫిజుర్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్లో రోజు రోజుకు హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్లో ఆడకుండా చాలా మంది డిమాండ్ చేశారు.అయితే కేకేఆర్ యాజమాని షారుఖ్ ఖాన్పై విమర్శలు వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ముస్తాఫిజుర్ను జట్టు విడుదల చేయాలని కేకేఆర్ను సూచించింది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
వైభవ్ విఫలమైనా.. టీమిండియా భారీ స్కోర్
బెనోని వేదికగా దక్షిణాఫ్రికా అండర్-19తో జరుగుతున్న మొదటి యూత్ వన్డేలో భారత్ అండర్-19 జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ(11), వైస్ కెప్టెన్ ఆరోన్ జార్జ్(11), త్రివేది(21) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి.. మిడిలార్డర్, లోయార్డర్ బ్యాటర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.ముఖ్యంగా 19 ఏళ్ల హర్వంశ్ సింగ్ పంగాలియా అసాధరణ పోరాటం కనబరిచాడు. క్లిష్ట సమయంలో హర్వంశ్.. అంబరీష్తో కలిసిఐదో వికెట్కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పంగాలియా 95 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంబరిష్(65), కన్షిక్ చౌహన్(32), ఖిలాన్ పటేల్(26) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో బాసన్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. సోనీ,బాసన్, మబాతా తలా వికెట్ సాధించారు. కాగా ఈ సిరీస్ అండర్-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతోంది. ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ అయూష్ మాత్రే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే వైభవ్కు జట్టు పగ్గాలను అప్పగించారు. కానీ కెప్టెన్గా తన తొలి మ్యాచ్లో సూర్యవంశీ విఫలమయ్యాడు.తుది జట్లుభారత్ అండర్19: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ వర్గీస్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వంశ్ పంగాలియా, ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, మహమ్మద్ ఎనాన్, ఖిలన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్.దక్షిణాఫ్రికా అండర్ -19:మొహమ్మద్ బుల్బులియా (కెప్టెన్), జోరిచ్ వాన్ షాల్క్వైక్, అద్నాన్ లగాడియన్, జేసన్ రౌల్స్, అర్మాన్ మనక్, పాల్ జేమ్స్, బండిల్ మబాతా, లెతాబో పహ్లామోహ్లాకా (కీపర్), జెజె బాసన్, బయండా మజోలా, నితాండో సోని.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులోకి తిరిగొచ్చారు. అయితే అయ్యర్ ఇంకా బీసీసీఐ వైద్యబృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సింది. జనవరి 6 న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున శ్రేయస్ ఆడనున్నాడు. దీంతో అతడు ఫిట్నెస్ లెవల్స్ వైద్యులు అంచనా వేయనున్నారు. అతడు ఎటువంటి సమస్య లేకుండా ఆడితే కివీస్తో వన్డే సిరీస్లో కూడా భాగం కానున్నాడు. ఒకవేళ ఈ ముంబై బ్యాటర్కు ఏదైనా సమస్య తలెత్తితే తిరిగి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు వెళ్లనున్నాడు.రుతురాజ్పై వేటు..ఇక అయ్యర్ రీ ఎంట్రీతో మహారాష్ట్ర కెప్టెన్, స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్పై వేటు పడింది. సౌతాఫ్రికాతో సిరీస్లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో సత్తాచాటినప్పటికి.. జట్టు కూర్పు దృష్ట్యా అతడిని సెలక్టర్లు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక టీ20 ప్రపంచకప్-2026ను దృష్టిలో ఉంచుకుని జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు. దీంతో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణాలతో కూడిన పేస్ దళాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు.షమీకి నో ఛాన్స్..ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. అతడిని కివీస్తో సిరీస్కు ఎంపిక చేయనున్నారని వార్తలు వచ్చినప్పటికి.. సెలక్టర్లు మాత్రం మొగ్గు చూపలేదు. షమీ గతేడాది మార్చి నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు.పంత్కే ఓటు..అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నారని వార్తలకు సెలక్టర్లు చెక్ పెట్టారు. కివీస్తో వన్డే సిరీస్కు పంత్ను ఎంపిక చేశారు. అతడిని తప్పించి ఇషాన్ కిషన్కు చోటు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం పంత్కే ఓటేశారు. కేఎల్ రాహుల్ బ్యాకప్గా పంత్ ఉండనున్నాడు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ఇక కివీస్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.కివీస్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్నెస్కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్, అర్ష్దీప్
5 మ్యాచ్ల్లో 4 సెంచరీలు.. సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన ఆర్సీబీ స్టార్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాది ఔరా అనిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తమిళనాడు, కేరళపై సెంచరీల(147, 124)తో సత్తాచాటిన పడిక్కల్.. తర్వాత తమిళనాడు మ్యాచ్లో విఫలమైనప్పటికీ పుదుచ్చేరిపై సూపర్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు త్రిపురతో జరుగుతున్న మ్యాచ్లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కర్ణాటకు త్రిపుర బౌలర్లు గట్టి షాకిచ్చారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(5), కరుణ్ నాయర్(0) ఆరంభంలోనే పెవిలియన్కు చేరారు. ఈ క్రమంలో పడిక్కల్ నిలకడగా ఆడి తన 13వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.సెలక్టర్లకు హెడ్ ఎక్..అయితే పడిక్కల్ ఫామ్ జాతీయ జట్టు సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు పడిక్కల్ను ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో పడిక్కల్కు ఓపెనర్గా మంచి రికార్డు ఉంది. అయితే భారత జట్టులో ప్రస్తుతం ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీగా లేవు. రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ భారత జట్టు ఓపెనర్లగా ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఇప్పటికే రేసులో ముందున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో గిల్ స్ధానంలో జట్టులోకి వచ్చిన యశస్వి సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికి గిల్ తిరిగి రావడంతో యశస్వి బెంచ్కే పరిమితం కానున్నాడు. అలా అని మిడిలార్డర్లో చూసుకున్నా ప్రతీ ఒక్కరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఒకవేళ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి వస్తే రుతురాజ్, తిలక్ వర్మలపై కూడా వేటు పడే అవకాశముంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు కూడా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఎవరిని తప్పించి పడిక్కల్కు అవకాశం ఇవ్వాలనేది సెలెక్టర్లకు పెద్ద ప్రశ్నగా మారింది.లిస్ట్-ఎ క్రికెట్లో అదుర్స్..లిస్ట్-ఏ క్రికెట్లో పడిక్కల్ గణాంకాలు చూస్తే మతిపోవాల్సిందే. కేవలం 38 మ్యాచ్ల్లోనే 80కి పైగా సగటుతో 2585 పైగా పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉండటం విశేషం. పడిల్క్ భారత తరపున ఇప్పటివరకు టెస్టులు, టీ20లు ఆడినప్పటికి.. వన్డేల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పడిక్కల్ 514 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇకఇక కివీస్తో వన్డేలకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించనుంది. అయితే భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేటు వేయాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.చదవండి: IND vs SA: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
IND vs NZ: సెలక్షన్ రోజే విఫలమైన ఇషాన్ కిషన్!
స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్లు ముగించుకున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్తో వన్డే, టీ20లు ఆడనుంది. జనవరి 11 - జనవరి 31 మధ్య భారత్- కివీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగుతాయి. అయితే, ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టునే కివీస్తో టీ20 సిరీస్కూ ఫైనల్ చేసింది బీసీసీఐ.వన్డేల్లోనూ పునరాగమనం!అయితే, వన్డేలకు మాత్రం శనివారం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. అనూహ్య రీతిలో టీ20 ప్రపంచకప్తో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన జార్ఖండ్ డైనమైట్.. వన్డేల్లోనూ పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్ కోటాలోని రిషభ్ పంత్ వరుస వైఫల్యాల(VHT) నేపథ్యంలో.. కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఇషాన్ రేసులోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో.. శనివారం నాటి మ్యాచ్లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రదర్శన ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. కర్ణాటకతో మ్యాచ్లో 33 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా కేరళతో మ్యాచ్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.సెలక్షన్ రోజు విఫలంకివీస్తో వన్డేలకు భారత జట్టు సెలక్షన్ రోజు ఇషాన్ (Ishan Kishan).. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. జార్ఖండ్ తరఫున కెప్టెన్ ఇషాన్ విఫలం కాగా.. కుమార్ కుశాగ్రా అజేయ, భారీ శతకం (143)తో అదరగొట్టగా.. అనుకూల్ రాయ్ (72) కూడా ఆకట్టుకున్నాడు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. కాగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఫెయిలైనా కివీస్తో వన్డేలకు అతడు ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ ఇరగదీసిన విషయం తెలిసిందే.ఏకంగా ప్రపంచకప్ జట్టులోకిజార్ఖండ్ సారథిగా.. బ్యాటర్గా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్.. జట్టుకు తొలి దేశీ టీ20 టైటిల్ అందించాడు. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి రిషభ్ పంత్ను కాకుండా ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారు సెలక్టర్లు. సంజూ శాంసన్కు బ్యాకప్ కీపర్, ఓపెనర్గా అతడు ఉపయోగపడతాడన్న ఆలోచనతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించారు. కాగా క్రమశిక్షణా రాహిత్యం కారణంగా రెండేళ్లకు పైగా ఇషాన్ టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, తన అద్భుత ఆట తీరు, నైపుణ్యాలతో తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ!
అదరగొట్టిన తిలక్ వర్మ.. సెంచరీతో సెలెక్టర్లకు వార్నింగ్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తను ఆడిన తొలి మ్యాచ్లోనే శతక్కొట్టాడు. రాజ్కోట్ వేదికగా చండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.ఓపెనర్లు అమన్ రావ్(13), తన్మయ్ అగర్వాల్(16) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు.తొలుత ఆచి తూచి ఆడిన వర్మ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అభిరత్ రెడ్డి (71) తో కలిసి 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తంగా 118 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. చండీగఢ్ బౌలర్లలో జగజీత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. రోహిత్ దండా,హర్తేజస్వి కపూర్, విశూ కశ్యప్ తలా రెండు వికెట్లు సాధించారు.కివీస్తో వన్డేలకు తిలక్కు చోటిస్తారా?కాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టును శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. అయితే ఈ జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో తిలక్ భారత జట్టులో భాగమైనప్పటికి.. ఇప్పుడు కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రానుండడంతో అతడిపై వేటు పడే అవకాశముంది.మరోవైపు కర్ణాటక ఆటగాడు దేవ్దత్త్ పడిక్కల్ కూడా సెంచరీలో మోత మోగిస్తున్నాడు. అతడు కూడా సెలక్టర్లు దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై కూడా వేటు వేయనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ!
IND vs SA: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పేలవ బ్యాటింగ్తో నిరాశపరిచాడు. భారీ అంచనాల నడుమ సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు.. తొలి మ్యాచ్లోనే విఫలమయ్యాడు. గతేడాది ఐపీఎల్లో సంచలన సెంచరీతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)... ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో భారత అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు.సెంచరీల మోతఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగి యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో సెంచరీల మోత మోగించాడు. ఇటీవల ఆసియా అండర్-19 వన్డే కప్లోనూ రాణించిన వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుత ప్రదర్శనలకు గానూ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నాడు. ఇక అంతకు ముందే విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీలో బిహార్ తరఫున వైస్ కెప్టెన్ హోదాలో భారీ శతకం బాదాడు.తాత్కాలిక కెప్టెన్గాఅనంతరం సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో (IND U19 Vs SA U19) యూత్ వన్డేలతో వైభవ్ సూర్యవంశీ బిజీ అయ్యాడు. కొత్త ఏడాదిలోని ఈ తొలి టూర్లో భాగంగా భారత అండర్-19 జట్టు సౌతాఫ్రికా యువ జట్టుతో మూడు యూత్ వన్డేలు ఆడనుంది. తొలి మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ఆయుశ్ మాత్రే దూరం కాగా.. వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.బెనోని వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత యువ జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఇటీవలి కాలంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడుతూ ఫామ్లో ఉన్న ఆరోన్ జార్జ్ (5) ఓపెనర్గా వచ్చి విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో.. తన దూకుడైన శైలికి భిన్నంగా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.11 పరుగులు చేసిఅయితే, 12 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసిన వైభవ్.. జేజే బాసన్ బౌలింగ్లో లెథాబోకు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ఇలా వైభవ్ విఫలం కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి వన్డౌన్లో వచ్చిన వేదాంత్ త్రివేది (21), వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు (21) కూడా చేతులెత్తేశారు. ఈ క్రమంలో 15 ఓవర్ల ఆట ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 68 పరుగులే చేసి కష్టాల్లో కూరుకుపోయింది.చదవండి: టీ20 ప్రపంచకప్-2026: అభిషేక్ శర్మపై కూడా వేటు వేస్తారా?
శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర శతకం బాదాడు. బరోడా తరఫున కేవలం 68 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మరీ హార్దిక్ పాండ్యా ఈ మేర తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటం విశేషం.భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాలకు అనుగుణంగా టీమిండియా తరఫున విధుల్లో లేని స్టార్లంతా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సైతం శనివారం బరోడా తరఫున రంగంలోకి దిగాడు. రాజ్కోట్ వేదికగా విదర్భతో మ్యాచ్లో టాస్ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్కు దిగింది.టాపార్డర్ విఫలంఅయితే, విదర్భ పేసర్ నచికేత్ భూటే ఆరంభంలోనే బరోడాకు షాకిచ్చాడు. ఓపెనర్లలో అమిత్ పాసీ (0) డకౌట్ చేసిన ఈ రైటార్మ్ బౌలర్.. నిత్యా పాండే (15)ను సైతం పెవిలియన్కు పంపాడు.ఇక వన్డౌన్లో వచ్చిన ప్రియాన్షు మొలియా (16).. ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన అతిత్ షేత్ (21), కెప్టెన్ కృనాల్ పాండ్యా (23) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (9) విఫలమయ్యాడు.ఎనిమిది ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతోఇలాంటి దశలో హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై దాడికి దిగాడు. మొత్తంగా 92 బంతులు ఎదుర్కొన్న ఈ పేస్ ఆల్రౌండర్.. ఎనిమిది ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో విష్ణు సోలంకి (17 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. రాజ్ లింబాని (10) తేలిపోయాడు.ఆఖర్లో మహేశ్ పతియా 18, కరణ్ ఉమాట్ 13 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా బరోడా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 293 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్.. అతిత్, జితేశ్, హార్దిక్, రాజ్ రూపంలో నాలుగు కీలక వికెట్లు కూల్చగా.. నచికేత్ భూటే, పార్థ్ రేఖడే చెరో రెండు, ప్రఫుల్ హింగే ఒక వికెట్ పడగొట్టారు.లిస్ట్-ఎ క్రికెట్లో తొలి సెంచరీహార్దిక్ పాండ్యాకు లిస్-ఎ క్రికెట్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. విదర్భతో మ్యాచ్లో అర్ధ శతకానికి 44 బంతులు తీసుకున్న ఈ ఆల్రౌండర్.. మరో 24 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని ఆశ్చర్యపరిచాడు.కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 94 వన్డేలు ఆడిన హార్దిక్ పాండ్యా.. వీటితో కలిపి 119 లిస్ట్-ఎ మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. కాన్బెర్రాలో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో 2020లో 92 పరుగులతో అజేయంగా నిలిచిన హార్దిక్ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో ఆగిపోయాడు. ఇప్పుడు ఆ లోటును తీర్చేసుకున్నాడు.మొత్తంగా ఇప్పటికి తన ఖాతాలో 2350 లిస్ట్-ఎ పరుగులు జమచేసుకున్నాడు. అతడి ఖాతాలో 110 వికెట్లు కూడా ఉండటం విశేషం. న్యూజిలాండ్తో స్వదేశంలో వన్డే సిరీస్కు ముందు పాండ్యా ఇలా శతక్కొట్టడం టీమిండియాకు శుభవార్త. అయితే, కివీస్తో ఐదు టీ20లు, టీ20 ప్రపంచకప్-2026 దృష్ట్యా హార్దిక్ పాండ్యాకు వన్డేల నుంచి సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IND vs NZ: పంత్పై వేటు.. దేశీ ‘హీరో’ ఎంట్రీ!.. సిరాజ్కు చోటిస్తారా?6⃣,6⃣,6⃣,6⃣,6⃣,4⃣ 🔥A maiden List A 💯 brought up in some style 🔥Hardik Pandya was on 66 off 62 balls against Vidarbha...and then he went berserk in the 39th over to complete his 100, smashing five sixes and a four 💪Scorecard ▶️ https://t.co/MFFOqaBuhP#VijayHazareTrophy… pic.twitter.com/pQwvwnI7lb— BCCI Domestic (@BCCIdomestic) January 3, 2026
నిప్పులు చెరిగిన అర్ష్దీప్.. ప్రభ్సిమ్రన్ ధనాధన్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా సిక్కింతో మ్యాచ్లో టీమిండియా స్టార్, పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఐదు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అర్ష్దీప్తో పాటు సుఖ్దీప్ బజ్వా (Sukhdeep Bajwa), మయాంక్ మార్కండే, గుర్నూర్ బ్రార్ రాణించడంతో సిక్కిం 75 పరుగులకే ఆలౌట్ అయింది.ప్రభ్సిమ్రన్ సారథ్యంలో..బీసీసీఐ ఆదేశాల మేరకు దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలో దిగాడు అర్ష్దీప్ సింగ్. సొంతజట్టు పంజాబ్ తరపున శనివారం ఈ లెఫ్టార్మ్ పేసర్ దర్శనమివ్వగా.. భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) మాత్రం అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.మరో టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ కూడా బెంచ్కే పరిమితమయ్యాడు. ఇలాంటి తరుణంలో సిక్కింతో మ్యాచ్లో అర్ష్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. జైపూర్ వేదికగా టాస్ గెలిచిన పంజాబ్.. సిక్కింను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. కెప్టెన్ ప్రభ్సిమ్రన్ సింగ్ నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్ బౌలర్లు దుమ్ములేపారు.నిప్పులు చెరిగిన అర్ష్దీప్సిక్కిం ఓపెనర్లలో అమిత్ రజేరా (8) వికెట్ కూల్చి సుఖ్దీప్ శుభారంభం అందించగా.. ప్రాణేశ్ ఛెత్రీ (8)ని పెవిలియన్కు పంపి అర్ష్దీప్ తన వికెట్ల వేట మొదలుపెట్టాడు. వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆశిష్ తాపా (0)ను సుఖ్దీప్ డకౌట్ చేయగా.. క్రాంతి కుమార్ (6), పల్జోర్ తమాంగ్ (13), కెప్టెన్ లీ యోంగ్ లెప్చా (0), అంకుర్ మాలిక్ (2) వికెట్లను అర్ష్దీప్ కూల్చాడు.మిగిలిన వారిలో రాహుల్ కుమార్ ప్రసాద్ (6), ఎండీ సప్తుల్లా (10)లను మయాంక్ మార్కండే అవుట్ చేశాడు. ఇక గుర్నూర్ బ్రార్.. గురిందర్ సింగ్ (10) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా సిక్కిం 22.2 ఓవర్లలో కేవలం 75 పరుగులు చేసి కుప్పకూలింది. టీ20 తరహా బ్యాటింగ్స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ వికెట్ నష్టపోకుండా 6.2 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. హర్నూర్ సింగ్ (13 బంతుల్లో 22), ప్రభ్సిమ్రన్ సింగ్ (26 బంతుల్లో 53) టీ20 తరహా బ్యాటింగ్తో చెలరేగి పంజాబ్ను సునాయాసంగా గెలిపించారు.చదవండి: T20 WC: జింబాబ్వే అనూహ్య నిర్ణయం.. సంచలన ఎంపికలు
గుగులోత్ సౌమ్య ‘హ్యాట్రిక్’
కోల్కతా: భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్...
ముందుగా వ్యవస్థను మార్చండి!
న్యూఢిల్లీ: క్రీడల్లో విజేతల్ని చూడాలంటే ఇప్పుడున్...
అర్జున్కు కాంస్యం
దోహా: ‘ఫిడే’ వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ ర్యాపిడ...
20వ సారి ప్రపంచ చాంపియన్గా...
దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) బ్లిట్...
అదరగొట్టిన తిలక్ వర్మ.. సెంచరీతో సెలెక్టర్లకు వార్నింగ్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ కెప్...
IND vs SA: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పేలవ బ్యాటింగ...
శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వి...
నిప్పులు చెరిగిన అర్ష్దీప్.. ప్రభ్సిమ్రన్ ధనాధన్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా సిక్కింతో మ్య...
క్రీడలు
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
నా సూపర్స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
వీడియోలు
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!
సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్
భారత్ సిరీస్ క్లీన్ స్వీప్.. శ్రీలంక చిత్తు..
మహిళా క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్
సిరీస్ పై భారత్ ఫోకస్
ఇషాన్ ఊచకోత.. MS ధోని రికార్డు బ్రేక్
శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..
దుఃఖాన్ని దిగమింగుకొని స్మృతి మంధాన విశ్వరూపం
