ప్రధాన వార్తలు
ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!
పశ్చిమాసియాలో భీకరయుద్ధం నేపథ్యంలో ఇరాన్ జట్టు జూన్లో జరగనున్న ఫిఫా వరల్డ్కప్లో పాల్గొనాలా వద్దా అనే సంశయంలో ఉంది. జూన్ 11 నుంచి జూలై 9 వరకు జరగనున్న 2026 ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే వరల్డ్కప్ ఆడేందుకు ఇరాన్ మా దేశంలో అడుగుపెడితే ఆ దేశ ఆటగాళ్లకు తాము భద్రత కల్పించలేమని, కాబట్టి ఇరాన్ ప్రపంచకప్ నుంచి వైదొలగడమే మంచిదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. అయితే ట్రంప్ కంటే ముందే అమెరికాలో వరల్డ్కప్ ఆడబోయేది లేదని ఇరాన్ ముందే భీష్ముంచుకుంది. తాజాగా ఫిఫా వరల్డ్కప్లో భాగంగా ముందస్తుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అమెరికాలో తాము ఆడాల్సిన మ్యాచ్లను మెక్సికోకు తరలించాలని ఇరాన్ ఫిఫా సమాఖ్యకు అర్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధం సమయంలో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, ఏక్షణం ఏమైనా జరిగే అవకాశముంటుందని, అందుకే మా మ్యాచ్లను అమెరికా నుంచి మెక్సికో లేదా కెనడాకు మార్చాలని ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా సమాఖ్యను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రతిపాదనపై ఫిఫా సమాఖ్య ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరాన్ ప్రతిపాదనకు అంగీకరిస్తూ మ్యాచ్ వేదికలను మార్చాలా లేక ఇరాన్ స్థానంలో వేరే జట్టుకు అవకాశమివ్వాలా అన్నది ఆలోచిస్తుంది. ఇదంతా గమనించిన క్రీడాభిమానులు ఇరాన్ ప్రతిపాదనను క్రికెట్ టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనతో పోలుస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్కు భారత్తో సంబంధాలు సఖ్యతగా లేవు. అప్పటికే బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిపోయింది. దీంతో భారత్లో తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని ఈ కారణంగా భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడలేమని, తమ మ్యాచ్ వేదికలను లంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు ప్రతిపాదనలు చేసింది. కానీ ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లకుండా తాము చూసుకుంటామని తెలిపిన ఐసీసీ వేదికలను మార్చే ప్రసక్తే లేదని బంగ్లా క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు మూర్కత్వానికి పోయి టీ20 ప్రపంచకప్ను బహిష్కరించింది. తాజాగా అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. అమెరికాలో ఆడబోమని ఇప్పటికే స్పష్టం చేసిన ఇరాన్ .. ఫిఫా సమాఖ్య వారి ప్రతిపాదనకు అంగీకరిస్తే తప్ప ఈసారి సాకర్ ప్రపంచకప్లో వారి ఆటను చూడలేమనుకుంటా!చదవండి: ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
’ఇంకా నేర్చుకుంటూనే ఉండు.. సెలక్టర్లకు బుద్ధి లేదు’
పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్పై ఆ దేశ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ విమర్శల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా నేర్చుకునే దశలోనూ ఉన్నాడంటూ చురకలు అంటించాడు. ఇప్పటికైనా ఆట తీరు మార్చుకోకపోతే జట్టులో కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డాడు.చేదు అనుభవం.. బంగ్లా చేతిలో చిత్తుటీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలోనూ చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్లో 2-1తో ఓడిపోయి దాదాపు పదకొండేళ్ల తర్వాత.. తొలిసారి బంగ్లాదేశ్కు సిరీస్ కోల్పోయింది.షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో బంగ్లాతో వన్డే సిరీస్ ఆడిన పాకిస్తాన్ జట్టులో రిజ్వాన్ ఒక్కటే సీనియర్ మోస్ట్ ప్లేయర్. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 58 పరుగులే చేశాడు.అసలు టెక్నికే సరిగ్గా లేదుఈ నేపథ్యంలో అహ్మద్ షెజాద్ రిజ్వాన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బంతులు నువ్వు ఆడగలిగేలానే పడుతున్నాయి రిజ్వాన్ సాబ్. నువ్వు చాలా సమయం తీసుకుంటున్నావు. అయినా సరే బంతిని బాదలేకపోతున్నావు.అసలు టెక్నికే సరిగ్గా లేదు. లెగ్ సైడ్ ఆడాల్సింది. ఇన్నేళ్లు గడిచినా నువ్వింకా నేర్చుకునే దశలోనే ఉన్నావు. అసలు నీ ఆటలో ఏమైనా పురోగతి ఉందా? టీ20 ప్రపంచకప్ జట్టులో నీకు స్థానమే లేదు.బుద్ధి రావడం లేదువన్డేల్లోనైనా అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్ వంటి జట్టుపై నువ్వు సెంచరీలు బాదాల్సింది. కానీ సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించేలా చెత్తగా ఆడావు. నిన్ను జట్టుకు ఎంపిక చేసే వాళ్లకు కూడా బుద్ధి రావడం లేదు’’ అని అహ్మద్ షెజాద్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2015లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన రిజ్వాన్.. ఇప్పటి వరకు 41 టెస్టుల్లో 2399, 103 వన్డేల్లో 2979, 106 టీ20లలో 3414 పరుగులు సాధించాడు.చదవండి: కోహ్లి, గేల్ కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
తొలి టీ20లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్లో సఫారీ జట్టును మట్టికరిపించి జయభేరి మోగించింది. టీ20 ప్రపంచకప్-2026లో రన్నరప్గా నిలిచిన కివీస్.. ప్రస్తుతం స్వదేశంలో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్తో బిజీగా ఉంది.ఇందులో భాగంగా ఆదివారం మౌంట్ మౌంగనీ వేదికగా ప్రొటిస్తో తొలి టీ20లో తలపడ్డ న్యూజిలాండ్.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా హామిల్టన్లో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన కివీస్.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.డెవాన్ కాన్వే అర్ధ శతకంటాపార్డర్లో ఓపెనర్ టామ్ లాథమ్ (11), వన్డౌన్ బ్యాటర్ టిమ్ రాబిన్సన్ (1) నిరాశపరచగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే అర్ధ శతకం (60)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో నిక్ కెలీ (12 బంతుల్లో 21), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించగా.. కోల్ మెకాంచి (12 బంతుల్లో 18), జోష్ క్లార్క్సన్ (9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో వియాన్ ముల్డర్ రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయెట్జి, ఒట్నీల్ బార్ట్మాన్, కెప్టెన్ కేశవ్ మహరాజ్, జార్జ్ లిండే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఆదిలోనే ఎదురుదెబ్బలులక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లలో కొన్నోర్ ఎస్తరూజెన్ (8)ను బెన్ సియర్స్ వెనక్కి పంపగా.. వియాన్ ముల్డర్ (16)ను సాంట్నర్ అవుట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన టోనీ జార్జి (1) మెకాంచీ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.107 పరుగులకే ఆలౌట్ మిగిలిన వారిలో రూబిన్ హెర్మాన్ (19) ఫర్వాలేదనిపించగా.. జార్జ్ లిండే 12 బంతుల్లో 33 పరుగులు చేశాడు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 15.3 ఓవర్లలో 107 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఫలితంగా న్యూజిలాండ్ 68 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది.కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, బెన్ సియర్స్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. సాంట్నర్ రెండు, మెకాంచి, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం నాటి మూడో టీ20కి ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదిక.చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్గా ఊహించని పేరు!
అక్కడ ముగింపు.. ఇక్కడ ప్రారంభం!
టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిధ్యం వహించనున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్న సంజూ శాంసన్ 2025 నవంబర్లో ట్రేడింగ్లో భాగంగా జడేజా, సామ్ కరన్లను రిలీజ్ చేసిన చెన్నై శాంసన్ను దక్కించుకుంది. మరో 10 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజస్థాన్తో బంధం ముగిసిందని, ఈ సీజన్ ద్వారా చెన్నై సూపర్కింగ్స్తో ప్రయాణం ప్రారంభమైందని పేర్కొ న్నాడు. శాంసన్ మాట్లాడుతూ..‘నేను ఆ జట్టులో సమయం ముగిసిందని భావించా.. అందుకే రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చా. నేను రాజస్థాన్ రాయల్స్కు ప్రత్యర్థిగా ఆడడం ఇదే తొలిసారి అనుకుంటా. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కానీ ఒకసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్ గురించే తప్ప వేరే దాని గురించి ఆలోచించను. రాజస్థాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా తెలిసినవాళ్లే. వారు ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతీ ఒక్కరికీ ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్తో నా సమయం ముగిసింది. నేను ముందుకు సాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నాటి నుంచి ఎక్కువగా రాజస్థాన్ రాయల్స్కే ఆడాడు. మధ్యలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడినప్పటికీ రాజస్థాన్తోనే శాంసన్కు అనుబంధమెక్కువ అని చెప్పొచ్చు. 2022లో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా ప్రమోషన్ పొందిన శాంసన్ ఆ సీజన్లో రాజస్థాన్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 2023 సీజన్లో రాజస్థాన్ ప్లేఆఫ్కు చేరడంలో విఫలమైనప్పటికీ బ్యాటర్గా మాత్రం శాంసన్ విజయవంతమయ్యాడు. ఆ తర్వాత 2024లో శాంసన్ నేతృత్వంలో రాజస్థాన్ జట్టు మరోసారి రెచ్చిపోయింది. తొలి 9 మ్యాచ్ల్లో ఎనిమిదింట గెలిచిన రాజస్థాన్ ప్లేఆఫ్స్కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో సన్రైజర్స్చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్ సంజూ శాంసన్ బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తం 16 మ్యాచ్ల్లో 5 హాఫ్సెంచరీల సాయంతో 531 పరుగులు సాధించి కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. 2025 సీజన్లో గాయాల సమస్యలతో ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు. శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించాడు.Sanju Samson just casually dropped a reality check for the professional language warriors.Knowing Hindi and Tamil along with Malayalam didn't make him less of a South Indian, it made him a better teammate. While the keyboard activists are busy gatekeeping, Sanju is busy winning… pic.twitter.com/AsggCsz7fP— Smita Deshmukh🇮🇳 (@smitadeshmukh) March 17, 2026చదవండి: సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి
సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి
న్యూజిలాండ్ పర్యటనలో సౌతాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ తజ్మిన్బ్రిట్స్ (43 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, లారా వోల్వర్ట్ (33 బంతుల్లో 41) పర్వాలేదనిపించింది. ఆఖర్లో కయ్లా రెనెకె (9 బంతుల్లో 28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో అమెలియా కెర్, జెస్ కెర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అమెలియా కెర్ (18 బంతుల్లో 32) టాప్ స్కోరర్గా నిలవగా ఇజీ షార్ప్ (29) పరుగులు చేసింది. అయితే సౌతాఫ్రికా బౌలర్లలో అయోబంగా ఖాకా 4 వికెట్లతో చెలరేగితే, లాబా 3 వికెట్లు తీసింది. కయ్లా రెనెకెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. చదవండి: కోహ్లి కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్
కోహ్లి కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఒకడు. జాతీయ జట్టు తరఫునే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్లలో ఆడిన ఘనత ఈ బ్యాటర్కు ఉంది.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఏబీడీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ జట్టు మాజీ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ప్రస్తుత లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లితోనూ డివిలియర్స్ బంధం విడదీయలేనిది. ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఐదేసిసార్లు చాంపియన్లుగా నిలిచిన జట్లతో ఏబీడీ మ్యాచ్లు ఆడాడు.ఇది వివాదాస్పదం కావొచ్చుటీ20 ఫార్మాట్లో అపార అనుభవం ఉన్న ఏబీ డివిలియర్స్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ ఆల్టైమ్ టీ20 క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు అతడు ఇచ్చిన జవాబు వైరల్గా మారింది. ‘‘ఇది వివాదాస్పదం కావొచ్చు.. కాదు కాదు.. వివాదానికి తావులేదు. ఇదొక చర్చనీయాంశమైన జవాబు కావొచ్చు.ఎందుకంటే.. అత్యుత్తమ టీ20 ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా అని నేను అనుకుంటున్నా. కానీ అతనెప్పుడూ నాకు బౌలింగ్ చేయలేదు. అయితే, నిలకడైన ఆటకు అతడు మారుపేరు. ముఖ్యంగా 20 ఓవర్ల ఆటలో ఏ సమయంలోనైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కొత్త బంతి లేదంటే పాత బంతితో అతడు అద్భుతాలు చేయగలడు.గెలుపును బహుమానంగా ఇవ్వగల సత్తాసూపర్ ఓవర్ అయినా.. మరి ఇంకేదైనా బంతి అతడికి చేతికి ఇస్తే గెలుపును బహుమానంగా ఇవ్వగల సత్తా అతడికి ఉంది. దటీజ్ జస్ప్రీత్ బుమ్రా’’ అని డివిలియర్స్ బుమ్రాను ఆకాశానికెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.పదిహేను పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లుకాగా టీ20 ప్రపంచకప్-2026లో బుమ్రా సత్తా చాటిన విషయం తెలిసిందే. టీమిండియా మరోసారి వరల్డ్కప్ చాంపియన్గా నిలవడంలో అతడి పాత్ర కీలకం. ముఖ్యంగా న్యూజిలాండ్తో ఫైనల్లో బుమ్రా.. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం పదిహేను పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఓవరాల్గా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పద్నాలుగు వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై ప్రశంసల వర్షం కొనసాగుతుండగా.. డివిలియర్స్ సైతం ఈ మేరకు కొనియాడటం గమనార్హం. సత్తా చాటుతున్న బుమ్రాఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీలో మరో భారత బౌలర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా పద్నాలుగు వికెట్లు తీసి బుమ్రా సరసన నిలిచాడు. కాగా బుమ్రా ఇప్పటికి 95 అంతర్జాతీయ టీ20లలో కలిపి 121 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 145 మ్యాచ్లు ఆడి 183 వికెట్లు కూల్చాడు. ఇక ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి సత్తా చాటేందుకు బుమ్రా సిద్ధయ్యాడు. View this post on Instagram A post shared by Nikhil Uttamchandani (@nikuttam)
టీమిండియా టీ20 కెప్టెన్గా ఊహించని పేరు!
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచి టీమిండియా సరికొత్త రికార్డు సాధించింది. మొత్తంగా మూడోసారి, సొంతగడ్డపై తొలిసారి పొట్టి క్రికెట్ కప్ ట్రోఫీని ముద్దాడిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది.ఇక ఈ విజయంతో భారత్కు ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ల జాబితాలో చేరాడు సూర్యకుమార్ యాదవ్. అయితే, ఈ టోర్నీ అనంతరం అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతాడని.. ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వచ్చాయి.ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంఅయితే, న్యూజిలాండ్పై ఫైనల్లో విజయం తర్వాత ఒలింపిక్స్-2028లో ఆడటమే తన లక్ష్యమని చెబుతూ సూర్య.. ఈ రూమర్లకు చెక్ పెట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టీమిండియా టీ20 కెప్టెన్గా ఎవరూ ఊహించని పేరును అతడు ప్రతిపాదించాడు. జట్టులో చోటే లేని ఆటగాడు సారథి కాగలడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడటం గమనార్హం.ఐపీఎల్లో సారథిగా సత్తాకాగా ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. గతేడాది పంజాబ్ కింగ్స్కు మారిన ఈ ముంబైకర్.. ఆ జట్టును ఫైనల్కు చేర్చాడు. సారథిగా, బ్యాటర్ అదరగొట్టి ప్రశంసలు అందుకున్నాడు. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ను సెలక్టర్లు కనికరించలేదు.శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉన్నప్పటికీ... జట్టులో స్థానం లేనందునే అతడికి చోటు ఇవ్వలేకపోతున్నామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా వెల్లడించాడు. ఆసియా టీ20 కప్-2025 టోర్నీకి జట్టు ప్రకటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2026 జట్టులోనూ శ్రేయస్కు స్థానం దక్కలేదు.టీ20 కెప్టెన్ ఎందుకు కాకూడదు?దేశీ టీ20 క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటినప్పటికీ శ్రేయస్ అయ్యర్ వేచిచూడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఆకాశ్ చోప్రా మాత్రం అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ ఎందుకు కాకూడదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, బ్యాటర్గా రాణిస్తే శ్రేయస్కు మరో అవకాశం దక్కుతుంది. అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడని నేను భావించాను. మిడిలార్డర్లో ఒకవేళ చోటు ఖాళీ అయితే కచ్చితంగా అది అతడికే దక్కుతుంది.కాబట్టి త్వరలోనే శ్రేయస్ భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే.. టీమిండియా తదుపరి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఉండకూడదు? అందుకు అవకాశం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
టీ20 క్రికెట్ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్గా జహీర్ ఖాన్
టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. EUT20 బెల్జియం క్రికెట్ లీగ్లో భాగమయ్యాడు. ఆంటెర్ప్ యాంకర్స్ ఫ్రాంఛైజీ సహ యజమానిగా జహీర్ ఖాన్ చేరినట్లు జట్టు యాజమాన్యం తాజాగా వెల్లడించింది.యూరోపియన్ దేశాల్లో క్రికెట్కు ప్రాధాన్యం పెంచే క్రమంలో EUT20 బెల్జియం క్రికెట్ లీగ్ పుట్టుకొచ్చింది. బ్రసెల్స్ వేదికగా జూన్ 4- 14 మధ్య ఈ లీగ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. తద్వారా కాంటినెంటల్ యూరోప్లో ఇదొక చారిత్రాత్మక ముందడుగు పడనుంది.ఇక ఆంటెర్ప్ యాంకర్స్ సహ యజమానిగా అధికారిక కార్యక్రమాలు, మార్కెటింగ్ కార్యకలాపాలు, మీడియా సమావేశాల్లో జహీర్ ఖాన్ భాగం కానున్నాడు. వ్యాపార భాగస్వామిగా మాత్రమే కాకుండా జట్టును తీర్చిదిద్దడంలోనూ ఈ మాజీ పేసర్ కీలక పాత్ర పోషించనున్నాడు.ఈ సందర్భంగా.. ‘‘యూరోప్లో క్రికెట్కు మంచి భవిష్యత్తు ఉంది. ఆరంభ దశలోనే ఆంటెర్ప్ యాంకర్స్ సహ యజమానిగా చేరడం కేవలం వ్యాపార దృష్ట్యానే కాకుండా జట్టును తీర్చిదిద్దడంలోనూ ఉపయోగపడుతుంది. కొత్త ప్రతిభను వెలికితీసి.. వాళ్లకు వేదిక కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.నా మనసుకు ఎంతో దగ్గరైన ఫ్రాంఛైజీ ఇది. బ్రసెల్స్లో జరిగే లీగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఆంటెర్ప్ యాంకర్స్లో వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ భాగం కావడంతో జట్టుకు పాపులారిటీ తెచ్చింది. ఇక జహీర్ ఖాన్ తమతో జట్టు కట్టడం పట్ల ఆంటెర్ప్ యాంకర్స్ యజమాని నాగేంద్ర సిద్దోటం హర్ష్యం వ్యక్తం చేశారు. కాగా గతేడాది ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్కు జహీర్ ఖాన్ మెంటార్గా ఉండగా.. 2026 సీజన్ ఆరంభానికి ముందే ఆ జట్టుతో బంధం తెంచుకున్నాడు.
నన్ను కావాలనే తప్పించారు: మెకల్లమ్పై సంచలన ఆరోపణలు
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్, యాజమాన్యంపై ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ సంచలన ఆరోపణలు చేశాడు. తనను జట్టు నుంచి అకస్మాత్తుగా తప్పించారని.. అందుకు గల కారణం అడిగితే వారి నుంచి స్పందనే లేదన్నాడు. తన ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు.ఎందుకు తప్పించారని అడిగితే..విధ్వంసకర ఆటగాడిగా పేరొందిన లివింగ్స్టోన్కు గతేడాది మార్చి నుంచి ఇంగ్లండ్ జట్టులో చోటు కరువైంది. ఈ విషయం గురించి తాజాగా ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నన్ను జట్టు నుంచి ఎందుకు తప్పించారని యాజమాన్యాన్ని అడిగాను. నా స్థానంలో వేరొకరిని ఆడించాలని అనుకుంటున్నట్లు వాళ్ల చెప్పారు.బజ్ (మెకల్లమ్), అప్పటి సెలక్టర్ ల్యూక్ రైట్ నిర్ణయమే అది. వారికి ఫోన్ చేస్తే స్పందనలేదు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ మెసేజ్ ద్వారా ఆఖరి నిమిషంలో నన్ను తప్పించిన విషయాన్ని చెప్పాడు. ఇక ఇంగ్లండ్ టీమ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ అయితే అసలు ఏమీ మాట్లాడలేదు.నిర్లక్ష్యం చేశాడునేను ఆయనకు కాల్ చేసినప్పుడు సమ్మర్లో తిరిగి కాల్ చేస్తా అని చెప్పాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా తాను బిజీగా ఉన్నానని నన్ను నిర్లక్ష్యం చేశాడు. సెప్టెంబరు వరకు నాతో మాట్లాడనేలేదు. అప్పుడే నాకు ప్రస్తుత యాజమాన్యం ఎలాంటిదన్న విషయంలో కనువిప్పు కలిగింది.ఎవరూ పట్టించుకోరని అర్థమైందివాళ్లకు నచ్చితేనే జట్టులో ఉంటాము. లేదంటే లేదు. నా గురించి ఎవరూ పట్టించుకోరని అర్థమైంది. కాబట్టి నాకు నచ్చినట్లు ఇకపై స్వేచ్ఛగా (లీగ్) ఆడుకునే అవకాశం దొరుకుతుంది అనిపించింది. భారత్, పాకిస్తాన్ పర్యటనలో ఉన్నపుడు నా ప్రదర్శన నాకే నచ్చలేదు.అపుడు మెకల్లమ్ దగ్గరికి వెళ్లి నాకు సలహాలు ఇవ్వమని అడిగాను. అప్పుడు అతను.. ‘నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానని.. అంతగా భయపడాల్సిన పనిలేదని.. అంతా అదే సర్దుకుంటుంది’ అని చెప్పాడు. కానీ నాకు మాత్రం ఏదో తేడాగా అనిపించింది.ఆటలోని లోపాలు సరిచేసుకోకపోతే నేనెలా ముందుకు సాగగలను? కానీ వాళ్లు మాత్రం నాకు సలహాలు, సూచనలు ఇచ్చే పరిస్థితిలో లేరని అర్థమైంది’’ అని లియామ్ లివింగ్స్టోన్ యాజమాన్యం తన పట్ల ఏమాత్రం సానుకూలంగా వ్యవహరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ఐపీఎల్లో ఇలా..కాగా ఇంగ్లండ్ తరఫున 39 వన్డేలు, 60 టీ20లు, ఒక టెస్టు ఆడిన లివింగ్స్టోన్.. వన్డేల్లో 932, టీ20లలో 955, టెస్టులో 16 పరుగులు చేశాడు. ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ ఖాతాలో 25 వన్డే, 33 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో ఇప్పటికి 49 మ్యాచ్లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ 1051 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2026 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. చదవండి: అత్యంత హేయమైన నేరం: పాకిస్తాన్పై రషీద్ ఖాన్ ఫైర్
సన్రైజర్స్కు భారీ షాక్!.. ఇషాన్కు గోల్డెన్ ఛాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. ఫలితంగా అతడు ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.నాలుగు మ్యాచ్లు కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్ తాజా ఎడిషన్ మొదలుకానున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్-2026కు సంబంధించి బీసీసీఐ తొలుత కేవలం ఇరవై మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది.ఇందులో భాగంగా సన్రైజర్స్ నాలుగు మ్యాచ్లలో ఒకటి మాత్రమే సొంత మైదానం ఉప్పల్ (Uppal)లో ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లోనూ కమిన్స్ తమ జట్టుకు సారథ్యం వహిస్తాడని సన్రైజర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వెన్ను నొప్పి కారణంగా యాషెస్లో కొన్ని మ్యాచ్లు సహా టీ20 ప్రపంచకప్-2026 మొత్తానికి దూరమైన కమిన్స్ (Pat Cummins).. గాయం నుంచి ఇంకా కోలుకోలేదని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం పేర్కొంది.వారిద్దరిలో ఒకరు సారథి?ఒకవేళ కమిన్స్ నిజంగానే ఆరంభ మ్యాచ్లకు దూరమైతే ఓపెనింగ్ జోడీ ట్రవిస్ హెడ్- అభిషేక్ శర్మలలో ఒకరు సన్రైజర్స్ను ముందుకు నడిపిస్తారని వార్తలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. దేశీ బాయ్, టీ20 వరల్డ్కప్ స్టార్ అభిషేక్ శర్మకే పగ్గాలు దక్కనున్నట్లు వార్తలు వచ్చాయి.ఇషాన్ వైపే యాజమాన్యం మొగ్గు?అయితే, తాజా సమాచారం ప్రకారం జార్ఖండ్ డైనమైట్, సన్రైజర్స్ వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు ఈ బంపరాఫర్ దక్కినట్లు తెలుస్తోంది. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో జార్ఖండ్ కెప్టెన్గా, బ్యాటర్గా రాణించి తొలి టైటిల్ అందించాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్.ఈ క్రమంలో జాతీయ జట్టులోకి తిరిగి వచ్చి.. టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇషాన్ కిషన్. మరోవైపు.. అభిషేక్ శర్మకు కూడా దేశీ క్రికెట్లో పంజాబ్కు సారథిగా వ్యవహరించిన అనుభవం ఉంది. అయితే, సన్రైజర్స్ యాజమాన్యం మాత్రం కమిన్స్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్గా ఇషాన్ కిషన్ను నియమించేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అభిషేక్పై అదనపు భారం పడకుండా ఉండేందుకు ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: టీమిండియా హెడ్కోచ్గా ధోని రావాలి: గంభీర్
అల్కరాజ్కు ఊహించని షాక్!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్వ...
ట్రంప్పై నిషేధం యోచనలో ఫిఫా!
పశ్చిమాసియాలోని ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదు...
గాయంతో వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ...
‘మమ్మల్ని ఎవరూ తప్పించలేరు’
జెనీవా: ‘ఫిఫా’ ప్రపంచకప్లో తమ జట్టు పాల్గొనకుండా ...
సన్రైజర్స్కు భారీ షాక్!.. ఇషాన్కు గోల్డెన్ ఛాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి...
అత్యంత హేయమైన నేరం: పాకిస్తాన్పై రషీద్ ఖాన్ ఫైర్
పాకిస్తాన్ తీరుపై అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్...
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు ‘సై’
బెంగళూరు: సందిగ్ధత వీడింది. బెంగళూరు క్రికెట్ అభి...
తిలక్ వర్మకు సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్, హైదరాబాద్ ప్ల...
క్రీడలు
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
వీడియోలు
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్లో హార్ట్ టచింగ్ మూమెంట్
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
SRH ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ
భారత్ దెబ్బకు షివరింగ్ వచ్చేసింది.. ఆఫ్రిది కామెంట్స్ వైరల్
ధోని, రోహిత్ తర్వాత శ్రీయాస్ అయ్యరే బెస్ట్ కెప్టెన్..
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
IPLపై నీలినీడలు.. గ్యాస్ కొరత, విమాన సమస్యలు తప్పవా?
క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
