Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Jason Holder becomes the highest wicket taker in T20 cricket in a single calendar year1
చరిత్ర సృష్టించిన జేసన్‌ హోల్డర్‌

విండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ (Jason Holder) చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో (2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హోల్డర్‌ ఈ ఏడాది 69 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో భాగంగా గల్ఫ్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోల్డర్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో హోల్డర్‌ (అబుదాబీ నైట్‌రైడర్స్‌) 2 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.హోల్డర్‌కు ముందు ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ పేరిట ఉండేది. రషీద్‌ 2018లో 61 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశాడు. ఈ విభాగంలో హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తర్వాతి స్థానాల్లో డ్వేన్‌ బ్రావో, నూర్‌ అహ్మద్‌ ఉన్నారు.బ్రావో 2016లో 72 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు తీయగా.. నూర్‌ అహ్మద్‌ ఇదే ఏడాది 64 మ్యాచ్‌ల్లో 85 వికెట్లు తీశాడు.డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌హోల్డర్‌ ఇటీవలికాలంలో డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా రాటుదేలాడు. ఈ ఏడాది అతను తీసిన 97 వికెట్లలో 45 వికెట్లు డెత్‌ ఓవర్లలో తీసినవే. 2022లో 59 వికెట్లు తీసిన హోల్డర్‌.. ఈ ఏడాది తన వికెట్ల శాతాన్ని భారీగా మెరుగుపర్చుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్‌ అయిన హోల్డర్‌ను ఐపీఎల్‌ 2026 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 7 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.హోల్డర్‌ ఈ ఏడాది తన జాతీయ జట్టుతో (విండీస్‌) పాటు ఐదు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడాడు. ఈ ఏడాది అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హోల్డర్‌ తర్వాతి స్థానాల్లో నూర్ అహ్మద్‌ (85), హసన్ అలీ (71), హారిస్ రౌఫ్‌ (66) ఉన్నారు. రషీద్ ఖాన్‌ ఈ ఏడాది గాయాల కారణంగా కేవలం 63 వికెట్లకే పరిమితమయ్యాడు.చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ బ్రేస్‌వెల్‌

Special story on vice captains position in recent days, particularly in Indian cricket2
సిరీస్‌కు ఒకరు.. నామమాత్రంగా మారిన టీమిండియా "వైస్‌ కెప్టెన్‌"

క్రీడ ఏదైనా అందులో కెప్టెన్‌ పాత్ర ఎంత ఉంటుందో, వైస్‌ కెప్టెన్‌ పాత్ర కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే ఏ నిర్ణయంలో అయినా ఈ ఇద్దరి పాత్ర చాలా కీలకం. తుది నిర్ణయం కెప్టెన్‌దే అయినా, వైస్‌ కెప్టెన్‌ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.అయితే ఇటీవలికాలంలో క్రికెట్‌ లాంటి క్రీడల్లో వైస్‌ కెప్టెన్ల పాత్ర నామమాత్రంగా మారింది. పేరుకే వైస్‌ కెప్టెన్‌ను ప్రకటిస్తున్నారు కానీ, మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో పెత్తనం మొత్తం కెప్టెన్‌దే. మేనేజ్‌మెంట్‌ కెప్టెన్లకు అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వైస్‌ కెప్టెన్లు కూడా పట్టీపట్టనట్లు ఉంటున్నారు.భారత క్రికెట్‌లో ఈ పోకడ మరీ విపరీతంగా ఉంది. వైస్‌ కెప్టెన్లు పేరుకే పరిమితమవుతున్నారు. మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో వీరి పాత్ర సున్నా. వైస్‌ కెప్టెన్లు ఇలా పవర్‌ లేకుండా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది జట్టులో వీరి స్థానానికి భరోసా ఉండకపోవడం.ఓ సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక​ చేసి, ఆ సిరీస్‌లో విఫలమైతే మరుసటి సిరీస్‌ అతను జట్టులో ఉండడు. తమ స్థానానికే గ్యారెంటీ లేనప్పుడు ఏ ఆటగాడు కూడా జట్టు వ్యూహాల్లో తలదూర్చడానికి ఇష్టడడు.వైస్‌ కెప్టెన్లు పవర్‌లెస్‌గా మారిపోవడానికి సిరీస్‌కు ఒకరిని మార్చడం మరో కారణం. భారత క్రికెట్‌లో ఇటీవలికాలంలో ఇలా తరుచూ జరుగుతుంది. వ్యక్తిగతంగా రాణిస్తున్నా, సిరీస్‌కు ఓ వైస్‌ కెప్టెన్‌ను ఎంపిక చేస్తున్నారు. మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు, కెప్టెన్ల సంప్రదాయం ఎప్పుడు మొదలైందో, అప్పటి నుంచి వైస్‌ కెప్టెన్లను తరుచూ మారుస్తున్నారు.భారత టీ20 జట్టును తీసుకుంటే, ఇటీవలికాలంలో చాలామంది వైస్‌ కెప్టెన్లు మారారు. తాజాగా ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన జట్టుకు అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయబడగా.. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.దీనికి ముందు కొన్నాళ్లు హార్దిక్‌ పాండ్యా.. కొన్నాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, ఓ సిరీస్‌కు (సౌతాఫ్రికా) రవీంద్ర జడేజా, ఓ సిరీస్‌కు (జింబాబ్వే) సంజూ శాంసన్‌ ఉప సారథులుగా వ్యవహరించారు.టీ20ల పరిస్థితి ఇలా ఉంటే.. టెస్ట్‌ల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సిరీస్‌కు ఒకరు.. కొన్ని సందర్భాల్లో సిరీస్‌ ఇద్దరు, ముగ్గురు కూడా వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు. 2022 నుంచి చూసుకుంటే.. శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, పంత్‌, జడేజా, పుజారా, రహానే వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు.టెస్ట్‌లు, టీ20లతో పోల్చుకుంటే, వన్డేల్లో పరిస్థితి కాస్త బెటర్‌గా ఉంది. మొన్నటి వరకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉండగా.. అతనికి డిప్యూటీగా శుభ్‌మన్‌ గిల్‌, పంత్‌, కేఎల్‌ రాహుల్‌ లాంటి వారు వ్యవహరించారు. ప్రస్తుతం గిల్‌ వన్డే జట్టు కెప్టెన్‌గా ఉండగా.. డిప్యూటీ పోస్ట్‌ శ్రేయస్‌ అ‍య్యర్‌ కోసం కేటాయించబడింది. టెస్ట్‌ జట్టుకు కూడా గిల్‌ కెప్టెన్‌గా ఉండగా.. అతనికి డిప్యూటీగా రిషబ్‌ పంత్‌ వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో పంత్‌ గైర్హాజరీలో రవీంద్ర జడేజా ఓ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.సాధారణంగా ఏ క్రీడలో అయినా భవిష్యత్త్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైస్‌ కెప్టెన్లను ఎంపిక​ చేస్తుంటారు. కెప్టెన్‌ అండలో వైస్‌ కెప్టెన్‌ పాఠాలు నేర్చుకొని కెప్టెన్‌ స్థాయికి ఎదుగుతాడని అలా చేస్తారు. ఆనవాయితీగా ఇలాగే జరుగుతూ వచ్చింది. భారత క్రికెట్‌లో ఇటీవలికాలంలో చూసుకుంటే.. గంగూలీ తర్వాత ధోని.. ధోని తర్వాత విరాట్‌ కోహ్లి వైస్‌ కెప్టెన్లుగా ఉండి కెప్టెన్లుగా అవతరించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆటగాళ్లకు వైస్‌ కెప్టెన్‌గా అనుభవం లేకుండానే కెప్టెన్లుగా ఎంపిక చేస్తున్నారు. భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంపిక ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఈ పరిస్థితి భారత క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని జట్లలో పరిస్థితి ఇలాగే ఉంది. వైస్‌ కెప్టెన్ల పాత్ర నామమాత్రంగా మారింది. కెప్టెన్ల పెత్తనం మాత్రమే నడుస్తుంది.

Doug Bracewell retires from all forms of cricket3
రిటైర్మెంట్‌ ప్రకటించిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ బ్రేస్‌వెల్‌

న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ డౌగ్ బ్రేస్‌వెల్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 18 ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతన్నట్లు స్పష్టం చేశాడు. 35 ఏళ్ల బ్రేస్‌వెల్‌ న్యూజిలాండ్‌ తరఫున 2011-23 మధ్యలో 28 టెస్ట్‌లు, 21 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. కుడి చేతి వాటం బ్యాటర్‌, మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ అయిన బ్రేస్‌వెల్‌ బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో మెరుగ్గా రాణించాడు. టెస్ట్‌ల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26, టీ20ల్లో 20 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో బ్రేస్‌వెల్‌ ఒకే ఒక హాఫ్‌ సెంచరీ (వన్డేల్లో) చేశాడు.2008లో అండర్‌-19 విభాగం నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రేస్‌వెల్‌.. అన్ని విభాగాల్లో ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రేస్‌వెల్‌ ఐపీఎల్‌లోనూ ఆడాడు. 2012 డ్రాఫ్ట్‌లో అతన్ని ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఎంపిక చేసుకుంది. ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన బ్రేస్‌వెల్‌ 3 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసినా అతనికి ఎందుకో అవకాశాలు రాలేదు.డౌగ్‌ బ్రేస్‌వెల్‌ కుటుంబంలో చాలామంది క్రికెటర్లు ఉన్నారు. అతని తండ్రి (బ్రెండన్‌ బ్రేస్‌వెల్‌), అంకుల్‌ (జాన్‌ బ్రేస్‌వెల్‌) కూడా న్యూజిలాండ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం డౌగ్‌ బ్రేస్‌వెల్‌ కజిన్స్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, మెలానీ బ్రేస్‌వెల్‌ న్యూజిలాండ్‌ సీనియర్‌ పురుష, మహిళల జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.డౌగ్‌ బ్రేస్‌వెల్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే ఘట్టం: 2011లో హోబార్ట్‌లో ఆస్ట్రేలియాపై టెస్టులో ఆరు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగా ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఏడు పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. చదవండి: పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం

Bhutan Sonam Yeshey scripts history, becomes first bowler to take 8 wicket haul in T20Is4
పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం

పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. ఈ ఫార్మాట్‌ చరిత్రలో తొలిసారి ఓ బౌలర్‌ 8 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమంగా 7 వికెట్ల ప్రదర్శనలు మాత్రమే నమోదయ్యాయి.తాజాగా మయన్మార్‌తో జరిగిన అంతర్జాతీయ టీ20లో భూటాన్‌ బౌలర్‌ సోనమ్‌ ఎషే (22 ఏళ్ల లెఫ్డ్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌) 8 వికెట్ల చారిత్రక ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో సోనమ్‌ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి (ఓ మెయిడిన్‌) ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. సోనమ్‌ నమోదు చేసిన ఈ గణాంకాలు యుగయుగాలు గుర్తుండిపోతాయి.ఎషే చారిత్రక ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో మయన్మార్‌పై భూటాన్‌ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భూటాన్‌ 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల ఛేదనలో మయన్మార్‌ 9.2 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో భూటాన్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం​ చేసుకుంది.పొట్టి క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు..సోనమ్‌ ఎషే (భూటాన్‌)- మయన్మార్‌పై 4-1-7-8శ్యాజ్రుల్‌ ఇద్రుస్‌ (మలేషినా)- చైనాపై 4-1-8-7అలీ దావూద్‌ (బహ్రెయిన్‌)- భూటాన్‌పై 4-0-19-7హర్ష భరద్వాజ్‌ (సింగపూర్‌)- మంగోలియాపై 4-2-3-6పీటర్‌ అహో (నైజీరియా)- సియెర్రా లియోన్‌పై 3.4-1-5-6దీపక్‌ చాహర్‌ (భారత్‌)- బంగ్లాదేశ్‌పై 3.2-0-7-6చదవండి: న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్‌ కోహ్లి

Shan Masood breaks Inzamam-Ul-Haq record for fastest double century by Pakistan batter5
ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ చేసిన పాకిస్తాన్‌ కెప్టెన్‌

పాకిస్తాన్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (Shan Masood) స్వదేశీ ఫస్ట్‌ క్లాస్‌ ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. ప్రెసిడెంట్స్‌ కప్‌ 2025-26లో భాగంగా సహారా అసోసియేట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. సూయ్‌ నార్త్రన్‌ గ్యాస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షాన్‌.. 177 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. గతంలో పాకిస్తాన్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు ఆ దేశ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హాక్‌ పేరిట ఉండేది. ఇంజమామ్‌ 1992లో ఇంగ్లండ్‌పై 188 బంతుల్లో డబుల్‌ సెంచరీ చేశాడు. 33 ఏళ్ల తర్వాత షాన్‌ ఇంజమామ్‌ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.అయితే, పాకిస్తాన్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ చేసిన విదేశీ ఆటగాడి రికార్డు మాత్రం నేటికీ భారత మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఖాతాలో ఉంది. సెహ్వాగ్‌ 2006లో జ‌రిగిన‌ లాహోర్ టెస్టులో 182 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ కొట్టాడు.కాగా, యావత్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు షఫీకుల్లా షిన్వారి ఖాతాలో ఉంది. షిన్వారి ఆఫ్ఘనిస్తాన్‌ దేశవాలీ టోర్నీలో 89 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. షిన్వారి తర్వాత ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు ఇంగ్లండ్‌ ఆటగాడు కే కింబర్‌ పేరిట ఉంది. ఇంగ్లండ్‌ కౌంట్లీ అతను 100 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. షిన్వారి, కింబర్‌ తర్వాత ఈ రికార్డు భారత ఆటగాడు తన్మయ్‌ అగర్వాల్‌ పేరిట ఉంది. హైదరాబాద్‌కు చెందిన తన్మయ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌పై 119 బంతుల్లో డబుల్‌ పూర్తి చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. రవి రంజీ ట్రోఫీలో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లోనే డబుల్‌ పూర్తి చేశాడు.

A Top DDCA official has confirmed that Virat Kohli will play the Vijay Hazare Trophy match against Railways on January 6th6
న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్‌

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందే మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇటీవలే విజయ్‌ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌, ఇదే టోర్నీలో మరో మ్యాచ్‌ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. జనవరి 6న ఆలుర్‌లో రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్‌ బరిలో ఉంటాడని ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ అత్యున్నత అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కు లీక్‌ ఇచ్చారు. ఈ మ్యాచ్‌ ముగిసిన వెంటనే విరాట్‌ న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ కోసం జనవరి 7న భారత జట్టుతో పాటు బరోడాలో కలుస్తాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును అతి త్వరలో ప్రకటిస్తారు. ఈ జట్టులో విరాట్‌ ఉండటం లాంఛనమే. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ ఫార్మాట్‌లో విరాట్‌ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. ఓ సెంచరీ (ఆంధ్రపై 131), ఓ హాఫ్‌ సెంచరీ (గుజరాత్‌పై 77) చేశాడు. విరాట్‌ రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ సత్తా చాటితే న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు అదనపు ధైర్యం వస్తుంది.విరాట్‌ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు (135, 102), ఓ హాఫ్‌ సెంచరీ (65 నాటౌట్‌) చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన విరాట్‌.. చివరి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ (74 నాటౌట్‌) చేసి ఫామ్‌లోకి వచ్చాడు. విరాట్‌ ఢిల్లీ జట్టులో ఉండటం వల్ల విజయ్‌ హజారే ట్రోఫీలో ఆ జట్టుకు కూడా అదనపు బలం చేకూరుతుంది.చదవండి: మ‌హ్మద్ ష‌మీకి బీసీసీఐ భారీ షాక్‌..!

CSK boy Ramakrishna Ghosh took 7 wickets against Himachal Pradesh in Vijay Hazare Trophy7
7 వికెట్లతో చెలరేగిన సీఎస్‌కే ఫాస్ట్‌ బౌలర్‌

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర బౌలర్‌ రామకృష్ణ ఘోష్‌ చెలరేగిపోయాడు. 9.4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. విజయ్‌ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది పదో అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు 8 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. ఘోష్‌తో పాటు 10 మంది 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.తాజా మ్యాచ్‌లో ఘోష్‌ చెలరేగడంతో హిమాచల్‌ ప్రదేశ్‌ 49.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్‌ మన్‌ (110) సెంచరీ చేయడంతో హెచ్‌పీ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. హెచ్‌పీ ఇన్నింగ్స్‌లో మన్‌కు వైభవ్‌ అరోరా (40), అమన్‌ప్రీత్‌ సింగ్‌ (30), నితిన్‌ శర్మ (21) ఓ మోస్తరుగా సహకరించారు.అనంతరం ఛేదనలో మహారాష్ట్ర కూడా తడబడుతుంది. 11.3 ఓవర్లలో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, అంకిత్‌ బావ్వే (4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వైభవ్‌ అరోరా, ధలివాల్‌ తలో వికెట్‌ తీశారు.కాగా, ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగిన రామకృష్ణ ఘోష్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2026 వేలానికి ముందు రీటైన్‌ చేసుకుంది. ఘెష్‌ను సీఎస్‌కే 2025 వేలంలో 30 లక్షల బేస్‌ ధరకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం ఫాస్ట్‌ మీడియ​ం బౌలర్‌ అయిన 28 ఏళ్ల ఘోష్‌ గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అయినా సీఎస్‌కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్‌ చేసుకుంది. ఘోష్‌ లోయర్‌ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్‌ కూడా. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అతను 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్‌ సెంచరీ చేశాడు.

YS Jagan congratulate Chess champions Koneru Humpy, Arjun8
హంపి, అర్జున్‌లకు వైఎస్ జ‌గ‌న్ అభినందనలు

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌-2025లో కాంస్య పతకాలు గెలిచిన ఇరిగేశి అర్జున్‌, కోనేరు హంపిల‌ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ అభినందించారు. వారి దృఢ సంకల్పం, ఆటతీరు, పోరాట స్ఫూర్తి అందరికీ గర్వకారణం అంటూ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న కొనియాడారు.కాగా దోహా వేదిక‌గా జరిగిన ఈ వ‌ర‌ల్డ్ మెగా ఈవెంట్‌లో హంపి మహిళల విభాగంలో ఆఖరి వరకు పోరాడింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హంపి, జు జినెర్‌ (చైనా), అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా) 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. కానీ టైబ్రేక్‌ స్కోరులో ఆమె మూడో స్దానంతో సరిపెట్టుకుంది. దీంతో కాంస్య పతకం హంపి దక్కించుకుంది.మరోవైపు ఓపెన్ విభాగంలో అర్జున్ 9.5 పాయింట్లతో మూడో స్దానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్‌కు ఇదే తొలి పతకం. ఇక 10.5 పాయింట్లతో అగ్రస్దానంలో నిలిచిన నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్‌ కార్ల్‌సన్‌.. ఆరోసారి ప్రపంచ ర్యాపిడ్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

Dhruv Jurel smashes maiden List A hundred during UP vs Baroda VHT 2025-26 match9
సెల‌క్ట‌ర్లకు వార్నింగ్‌.. భారీ సెంచరీతో చెలరేగిన ధ్రువ్‌ జురెల్‌

న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ మ‌రో నాలుగు రోజుల్లో ప్ర‌క‌టించ‌నుంది. ఈ నేప‌థ్యంలో సెల‌క్ట‌ర్ల‌కు టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ధ్రువ్ జురెల్ సూప‌ర్‌ సెంచ‌రీతో స‌వాల్ విసిరాడు. విజ‌య్ హజారే ట్రోఫీ 2025-26లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ధ్రువ్ జురెల్‌.. రాజ్‌కోట్‌లో బ‌రోడా జ‌రుగుతున్న మ్యాచ్‌లో భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు.మూడో స్దానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ధ్రువ్.. టీ20 త‌ర‌హాలో ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఓ వైపు వికెట్లు ప‌డ‌తున్న‌ప్ప‌టికి అత‌డు మాత్రం త‌న జోరును త‌గ్గించ‌లేదు. యూపీ కెప్టెన్ రింకూ సింగ్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో జురెల్ కేవ‌లం 78 బంతుల్లోనే త‌న‌ తొలి లిస్ట్‌-ఎ క్రికెట్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవ‌రాల్‌గా ఓవరాల్‌గా 101 బంతులు ఎదుర్కొన్న జురెల్‌.. 15 ఫోర్లు, 8 బంతుల్లో 160 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రింకూ సింగ్‌ 67 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 369 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. బరోడా బౌలర్లలో యువ పేసర్‌ రాజ్‌ లింబానీ నాలుగు వికెట్లతో చెలరేగాడు.రేసులో కిషన్‌-డిజేకాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎవరికి చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ మెయిన్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉండగా.. అతడికి బ్యాకప్‌గా కిషన్‌-పంత్‌-జురెల్ మధ్య పోటీ నెలకొంది. అయితే పంత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో కిషన్‌-జురెల్‌లో ఎవరికో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ఇద్దరూ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జురెల్ గత కొన్ని సిరీస్‌ల‌కు వ‌న్డే జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికి.. ఇప్ప‌టివ‌ర‌కు మాత్రం ఇంకా డెబ్యూ చేయ‌లేదు. కిష‌న్ కూడా ఈ దేశ‌వాళీ వ‌న్డే టోర్నీ తొలి మ్యాచ్‌లోనే శ‌త‌క్కొట్టాడు. దీంతో సెల‌క్ట‌ర్లు మ‌రి ఎవ‌రి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.చదవండి: ఆస్ట్రేలియా బ్యాటర్‌ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ!

Laura Harris Slams Joint-Fastest Half-Century In Womens T20 Cricket10
ఆస్ట్రేలియా బ్యాటర్‌ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ!

మహిళల టీ20 క్రికెట్‌లో మరో వేగవంతమైన అర్ధసెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన లౌరా హారిస్‌ న్యూజిలాండ్‌లో జరుగుతున్న టి20 లీగ్‌లో ఈ ఘనత సాధించింది. కేవలం 15 బంతుల్లో ఆమె ఫిఫ్టీ బాదింది. కివీస్‌ లీగ్‌ టోర్నీ ఉమెన్‌ సూపర్‌ స్మాష్‌ (డబ్ల్యూఎస్‌ఎస్‌)లో ఒటాగో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఆదివారం కాంటర్‌బరీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగింది.అలెగ్జాండ్రాలోని మోలినెక్స్‌ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లౌరా (15 బంతుల్లో 52; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేసింది. తద్వారా 2022లో వారి్వక్‌షైర్‌ తరఫున మేరి కెల్లీ చేసిన (15 బంతుల్లో ఫిఫ్టీ) రికార్డును సమం చేసింది. లౌరా వీరబాదుడుతో 146 పరుగుల లక్ష్యాన్ని 15వ ఓవర్లోనే ఛేదించిన ఒటాగో ఈ మ్యాచ్‌లో బోనస్‌ పాయింట్‌తో గెలిచింది.ఈ సీజన్‌ మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌)లో నిరాశపరిచిన లౌరా.. న్యూజిలాండ్‌లో మెరుపులు మెరిపించింది. అయితే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ ఆమెకిదే మొదటిది కాదు. ఓవరాల్‌ టి20 లీగ్‌లలోనే ఆరుసార్లు 50 పైచిలుకు (ఫిఫ్టీలు) పరుగులు చకచకా చేసిన ఘనత ఆమెకు ఒక్కరికే దక్కుతుంది.మూడుసార్లు 18 బంతుల్లో, ఒకసారి 19 బంతుల్లో, ఇంకోసారి 17 బంతుల్లో, ఇప్పుడేమో 15 బంతుల్లో ధనాధన్‌ అర్ధశతకాల్ని బాదింది. ప్రత్యేకించి మహిళల టి20 క్రికెట్, లీగ్‌లలో ఆమె తప్ప ఇంకెవరూ ఒకసారి మించి వేగవంతమైన అర్ధసెంచరీల్ని బాదలేకపోయారు. చదవండి: మ‌హ్మద్ ష‌మీకి బీసీసీఐ భారీ షాక్‌..!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement