ప్రధాన వార్తలు
కేకేఆర్ ఘోర వైఫల్యాలకు కారణాలు ఇవే..!
ఐపీఎల్ 2026లో కేకేఆర్ జట్టు చెత్తగా ఆడుతుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు. వారికి లభించిన ఏకైక పాయింట్ పంజాబ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం వల్ల వచ్చింది. తాజాగా గుజరాత్ చేతిలో పరాజయం అనంతరం ఆ జట్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే మిగిలిన 8 మ్యాచ్ల్లో కనీసం 7 గెలవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం ఇది అంత ఈజీగా జరిగే పని కాదు. వరుస పరాజయాలతో ఆ జట్టు నీరసించిపోయింది. కాన్ఫిడెన్స్ లోపించి అపజయాలను అలవాటు చేసుకుంది.కేకేఆర్కు ఈ దుస్థితి రావడానికి కారణాలేంటా అని పరిశీలిస్తే ఛాంతాడం చిట్టా బయటపడుతుంది. వీరికి దెబ్బలు సీజన్ ప్రారంభానికి ముందే పడ్డాయి. కోట్లు పోసి కొనుక్కున్న బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రాజకీయ కారణాల చేత తొలగించబడ్డాడు. ఆతర్వాత దేశీయ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్దీప్ గాయాల కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యారు. దీనికంటే ముందే యాజమాన్యం వ్యూహాత్మక తప్పిదం చేసింది. కెప్టెన్ను ఎంచుకునే విషయంలో తప్పులో కాలేసింది. గత సీజన్ చేదు అనుభవాలను పట్టించుకోకుండా రహానేను కెప్టెన్గా కొనసాగించి ఘోర తప్పిదం చేసింది. ఖచ్చితంగా మాట్లాడుకుంటే, రహానే టీ20 ఆటగాడు కాదు. పైగా అతను నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్నాడు. ఇలాంటి ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ కనీసం జట్టులో కూడా తీసుకోదు. అలాంటి కేకేఆర్ ఏకంగా కెప్టెన్గా కొనసాగించి చేతులు కాల్చుకుంటుంది. ఇక్కడ రహానేను నిందించడం పాయింట్ కాదు. అతని ఔట్ డేటెడ్ కెప్టెన్సీ వూహ్యాలు ప్రస్తుత టీ20 యుగానికి పనికిరావన్నదే విషయం. ఇప్పటికీ అతను శక్తివంచన లేకుండా జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నా, ఇతర ఆటగాళ్ల నుంచి అతనికి సహకారం లభించడం లేదు. గ్రీన్ లాంటి అత్యంత ఖరీదైన ఆటగాడు దారుణంగా విఫలమవుతున్నారు. కోట్లు పోసి కొనుక్కున్న మతీష పతిరణ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫిన్ అలెన్ మంచి ఆరంభాలు లభిస్తున్నా, సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. మిడిలార్డర్ బ్యాటింగ్లో రింకూ సింగ్ చేతులెత్తేశాడు. రహానే వ్యక్తిగతంగానూ శ్రమిస్తున్నప్పటికీ సఫలం కాలేకపోతున్నాడు. ఊరట కలిగించే ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అది అంగ్కృష్ రఘువంశీ, సునీల్ నరైన్, అడపాదడపా కార్తీక్ త్యాగి మాత్రమే.ఇవి కాకుండా కేకేఆర్ వ్యూహాత్మకమైన ఎన్నో తప్పిదాలు చేస్తుంది. బౌలింగ్–బ్యాటింగ్ కాంబినేషన్లో లోపాలు స్పష్టంగా కనినిస్తున్నాయి. పవర్ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, మిడిల్ ఓవర్లలో ఒత్తిడి పెంచలేకపోవడం, డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ప్రధాన సమస్యగా మారింది. మిడిలార్డర్ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేదు. దీన్ని వల్ల ఓ మోస్తరు ఆరంభాలు లభించినా ఉపయోగం లేకుండా పోతుంది.మొత్తంగా వరుస ఓటములతో ఆ జట్టు మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఆటగాళ్లు ఒత్తిడిలో కూరుకుపోయారు. సాహసించి ఏ అడుగు వేయలేకపోతున్నారు. మరికొద్ది మ్యాచ్ల వరకు పరిస్థితిలో మార్పు వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. కేకేఆర్ అభిమానులు మరో బ్యాడ్ సీజన్ అనుకొని సరిపెట్టుకోవడం తప్పించి చేసేదేమీ ఉండదు. ఏదైనా మార్పు రావాలంటే, బ్యాటింగ్-బౌలింగ్ కాంబినేషన్ను సరి చేయాలి. పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలి. వికెట్లు తీయగలగాలి. డెత్ ఓవర్లలో ప్రత్యర్దిని కట్టడి చేయగలగాలి. మిడిలార్డర్ నిలకడ ప్రదర్శించాలి. మొత్తంగా మానసిక స్థితి మెరుగుపడాలి. ఇలా జరిగితే, మిగతా మ్యాచ్ల్లో అయినా సత్ఫలితాలు రావచ్చు.
నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!
వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ గురించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త లలిత్ మోదీ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన వల్ల గేల్కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఆడే అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత గేల్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదని.. ఆర్థికంగానూ బాగానే స్థిరపడ్డాడని తెలిపాడు.వేలంలో అమ్ముడుపోలేదుకాగా ఐపీఎల్ 2008లో మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరంభ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఆడిన క్రిస్ గేల్.. 2009, 2010 ఎడిషన్లలో కూడా అదే జట్టుతో కొనసాగాడు. అయితే, నిలకడలేని ప్రదర్శనల కారణంగా 2011 వేలంలో ఎవరూ అతడిని కొనుగోలు చేయలేదు.ఆ సమయంలో తానే క్రిస్ గేల్కు సాయం చేసినట్లు లలిత్ మోదీ తాజాగా వెల్లడించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను ఐపీఎల్ వదిలేసి లండన్కు వచ్చిన రోజులు అవి. నాకు ఇష్టుడైన నా స్నేహితుడు గేల్ అప్పట్లో వేలంలో అమ్ముడుపోలేదు.అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!అప్పుడు నాకు అతడు కాల్ చేశాడు. తనను ఎవరూ కొనలేదని చెప్పాడు. అందుకు బదులుగా.. ‘నువ్వు బాగా ఆడలేదు కాబట్టే ఎవరూ కొనలేదు. నిజానికి నువ్వు మంచి ఆటగాడికి. కానీ బద్దకం వల్ల ఇలా తయారయ్యావు’ అని చెప్పాను.ఇందుకు సమాధానంగా.. ‘నాకు భారీగా అప్పులు ఉన్నాయి. బిల్స్ కట్టాలంటే నేను ఐపీఎల్లో తప్పక ఆడాల్సిందే’ అని గేల్ తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాడు. అప్పుడు చాలా మందికి కాల్ చేశాను. గేల్ను జట్టులోకి తీసుకోమని కోరాను.కానీ ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు నేను విజయ్ మాల్యా ఇంటికి వెళ్లాను. గేల్కు ఒక్క అవకాశం ఇవ్వమని కోరాను. డిరిక్ నాన్స్ గాయపడినట్లు తెలిసింది. అతడి స్థానంలో గేల్ను ఆడించమన్నాను.ఖాళీ చెక్కుపై తలరాతఅప్పుడు విజయ్ ఓ కండిషన్ పెట్టాడు. గేల్ బాగా ఆడితేనే డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. అయితే, గేల్ మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అద్భుత ఆట తీరుతో అలరించి.. తనకు ఇచ్చిన ఖాళీ చెక్కుపై తన తలరాతను రాసుకున్నాడు. కోట్లాది రూపాయల విలువ గల కాంట్రాక్టులు దక్కించుకున్నాడు’’ అని లలిత్ మోదీ చెప్పుకొచ్చాడు.కాగా 2011లో 12 మ్యాచ్లు ఆడిన గేల్ 608 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా యూనివర్సల్ బాస్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2017 వరకు ఆర్సీబీతోనే గేల్ కొనసాగాడు. ఇదిలా ఉంటే.. ఇటు లలిత్ మోదీ.. అటు విజయ్ మాల్యా ఆర్థిక నేరగాళ్లుగా ముద్రపడి ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.చదవండి: ‘ఏ క్షణమైనా బ్రెయిన్స్ట్రోక్.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’
అందుకే IPL కాదని.. PSLలో ఆడుతున్నా: మొయిన్ అలీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అమ్ముడుపోని విదేశీ క్రికెటర్లలో చాలా మంది పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో చేరతారు. ఒకవేళ మళ్లీ ఐపీఎల్ నుంచి గనుక ఆఫర్ వస్తే భారత్కు వచ్చేస్తారు. తాజా ఎడిషన్లో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ, శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, ఆస్ట్రేలియా స్టార్ స్పెన్సర్ పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరారు.నాకిప్పుడు 38 ఏళ్లుఅయితే, తాను మాత్రం ఈ కోవకు చెందినవాడిని కాదంటున్నాడు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మొయిన్ అలీ (Moeen Ali). తాను కావాలనే IPLను కాదని PSLను ఎంచుకున్నట్లు తెలిపాడు. ‘‘నాకిప్పుడు 38 ఏళ్లు. అయినప్పటికీ నేనింకా క్రికెట్ ఆడాలనే అనుకుంటున్నాను. వీలైనంతగా నా కెరీర్ను పొడిగించుకోవాలని భావిస్తున్నాను.షార్ట్టైమ్ టోర్నీకరాచీ కింగ్స్లో నాకు ఈ స్వేచ్ఛ దొరికింది. ముఖ్యంగా పీఎస్ఎల్ తక్కువ వ్యవధిలోనే ముగిసిపోయే టోర్నీ. కాబట్టి ఆటగాడిగా నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూనే కుటుంబానికి తగిన సమయం కేటాయించే వీలు దొరుకుతుంది.గతేడాది నేను ఐపీఎల్లో ఆడాను. అయితే సగం మ్యాచ్లలో కూడా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బహుశా రెండుసార్లు నేను బ్యాటింగ్ చేసి ఉంటాను. నిజానికి నాకు బ్యాటింగ్ చేయడం ఇష్టం. నా కెరీర్ చరమాంకంలోనూ ఎక్కువగా బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా.అయితే, ఏ జట్టులోనైనా ప్లేయింగ్ ఎలెవన్లో చోటుకు గ్యారెంటీ ఉండదు. పీఎస్ఎల్లో కూడా అంతే. అయితే, ఆటను వీలైనంతగా ఆస్వాదించాలని భావిస్తున్నా. ఒక్కసారైనా పీఎస్ఎల్ ఆడాలని అనుకున్నా.షెడ్యూల్ క్లాష్ కానీ.. దురదృష్టవశాత్తూ ఐపీఎల్తో పీఎస్ఎల్ షెడ్యూల్ క్లాష్ అవుతోంది. అందుకే ఈ సారి ఐపీఎల్కు దూరమయ్యాను’’ అని మొయిన్ అలీ తన నిర్ణయానికి గల కారణాలు వెల్లడించాడు.కాగా ఐపీఎల్- 2025 మెగా వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఈ ఏడాది పీఎస్ఎల్లో కరాచీకి ఆడుతున్న అతడు రూ. 2 కోట్లకు పైగా జీతం అందుకుంటున్నాడు. కాగా ఈ సీజన్లో అతడు ఇప్పటికి 126 పరుగులు చేసి.. మూడు వికెట్లు తీయగలిగాడు. ఇక 2024లో మొయిన్ అలీ అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
సన్రైజర్స్లోకి సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం గెరాల్డ్ కొయెట్జీకి ఊహించని విధంగా ఐపీఎల్ 2026 ఆఫర్ దక్కింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గాయపడిన డేవిడ్ పేన్ స్థానంలో కొయెట్జీని జట్టులోకి తీసుకుంది. గతంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్కు ఆడిన కొయెట్జీని ఈ సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోగా.. సీజన్ మధ్యలో సన్రైజర్స్ రూ. 2 కోట్ల మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది.కొయెట్జీ ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు సాధించాడు. ఇతని రాక సన్రైజర్స్లో కొత్త జోష్ నింపింది. ఈ సీజన్లో సన్రైజర్స్ బౌలింగ్లో చాలా బలహీనంగా ఉంది. బ్యాటింగ్లో పటిష్టంగా ఉన్నా బౌలింగ్లో తేలిపోవడంతో గెలవాల్సిన మ్యాచ్ల్లోనూ ఓడింది. కొయెట్జీ రాక సన్రైజర్స్ బౌలింగ్ కష్టాలను తీరుస్తుందని అంతా భావిస్తున్నారు. త్వరలో ఈ జట్టులో ఫుల్ టైమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా జట్టులోకి చేరనున్నాడు. దీంతో సన్రైజర్స్ బౌలింగ్ మరింత బలపడనుంది.సన్రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 2 విజయాలు, 3 పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు రన్రేట్ 0.576గా ఉంది. తాజాగా పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్ను సొంతగడ్డపై మట్టికరిపించిన సన్రైజర్స్ ఇవాళ (ఏప్రిల్ 18) సొంతగడ్డపైనే సీఎస్కేతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
దిగ్గజాలు విరాట్, రోహిత్ను అధిగమించిన మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన టీ20 క్రికెట్లో చారిత్రాత్మక ఘనత సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున (పురుషులు, మహిళలు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో పురుషుల విభాగంలో దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను అధిగమించింది. విరాట్ 125 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4188 పరుగులు.. రోహిత్ తన 159 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4231 పరుగులు చేయగా.. మంధాన 161 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4244 పరుగులు చేసింది.భారత మహిళల విభాగం ఒక్కటే తీసుకుంటే.. మంధన తర్వాతి స్థానాల్లో హర్మన్ప్రీత్ కౌర్ (191 మ్యాచ్ల్లో 3854 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (119 మ్యాచ్ల్లో 2587 పరుగులు), షఫాలీ వర్మ (99 మ్యాచ్ల్లో 2553 పరుగులు) ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సూజీ బేట్స్ (181 మ్యాచ్ల్లో 4717 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కొనసాగుతుండగా.. మంధాన రెండో స్థానంలో ఉంది. పురుషుల విషయానికొస్తే.. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (145 మ్యాచ్ల్లో 4596 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (5), కాశ్వి గౌతమ్ (10) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది.అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ లారా వోల్వార్ట్డ్ (51), అన్నెరీ డెర్క్సన్ (44 నాటౌట్) సౌతాఫ్రికాను గెలిపించారు. సూన్ లస్ 13, తజ్మిన్ బ్రిట్స్ 10, అన్నెకే బాష్ 8, క్లో ట్రయాన్ 18 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలో వికెట్ తీశారు. రెండో టీ20 ఏప్రిల్ 19న ఇదే డర్బన్ వేదికగా జరుగనుంది.
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఐపీఎల్ 2026లో కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. తన ఫ్రాంచైజీ చరిత్రలో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా చారిత్రక ఘనత సాధించాడు. నిన్న (ఏప్రిల్ 17) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో అతను 2 వికెట్లు తీయగా.. అందులో మొదటి వికెట్తోనే ఈ ఘనత సాధించాడు. జోస్ బట్లర్ వికెట్ వరుణ్కు ఐపీఎల్లో 100వ వికెట్. వరుణ్ కాకుండా కేకేఆర్ తరఫున 100 వికెట్లు తీసిన బౌలర్లుగా సునీల్ నరైన్ (214), ఆండ్రీ రసెల్ (124) ఉన్నారు. వీరిద్దరూ విదేశీ క్రికెటర్లే. వరుణ్ తన ఐపీఎల్ కెరీర్లో (పంజాబ్, కేకేఆర్ తరఫున) ఇప్పటివరకు 87 మ్యాచ్లు ఆడి అందులో 102 వికెట్లు (పంజాబ్ తరఫున ఒకటి) తీశాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్తో కలిసి సంయుక్తంగా 28వ స్థానంలో ఉన్నారు. స్పిన్నర్ల విభాగంలో 11వ లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు.దారుణ ఫామ్వరుణ్ గత కొంతకాలంగా దారుణమైన ఫామ్లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ రెండో అర్దభాగంలో మొదలైన పేలవ ప్రదర్శన గుజరాత్ మ్యాచ్ ముందు వరకు కొనసాగింది. ఈ ఐపీఎల్ సీజన్లో వరుణ్ తొలి 3 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గుజరాత్ మ్యాచ్తోనే అతను వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ మ్యాచ్లో వరుణ్ ఓ మోస్తరు ప్రదర్శన (4-0-34-2) చేసినప్పటికీ కేకేఆర్ ఓటమిపాలైంది.కోల్'కథ' కంచికే..!వరుణ్ ఫ్రాంచైజీ కేకేఆర్ ఈ సీజన్లో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఏకంగా 5 పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోల్'కథ' కంచికి చేరినట్లే.తాజాగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేస్తూ.. గ్రీన్ (79) సీజన్లో తొలి సారి రాణించడంతో 180 పరుగులు చేసిన కేకేఆర్.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. శుభ్మన్ గిల్ (86) సత్తా చాటి గుజరాత్ను గెలిపించాడు. గుజరాత్ మరో 2 బంతులు మిగిలుండగానే సగం వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది.
కోల్ ‘కథ’ మారలేదు
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ల్లో ఓడిన రహానే సారథ్యంలోని నైట్రైడర్స్... మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కోల్కతాను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. పాతిక కోట్ల విలువైన ప్లేయర్ కామెరాన్ గ్రీన్ (55 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్స్లు) ఎట్టకేలకు రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. రషీద్ ఖాన్ను లక్ష్యంగా చేసుకున్న గ్రీన్ భారీ షాట్లతో పరుగులు రాబట్టాడు. గుజరాత్ ఫీల్డింగ్ లోపాలు కూడా అతడికి కలిసి రావడంతో ఈ సీజన్లో తొలి అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. పావెల్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ అజింక్యా రహానే (0), రఘువంశీ (8), సీఫెర్ట్ (19), అనుకూల్ రాయ్ (9), రింకూ సింగ్ (1) పెవిలియన్కు క్యూ కట్టారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, అశోక్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (50 బంతుల్లో 86; 8 ఫోర్లు, 4 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో టైటాన్స్కిది మూడో విజయం. శుబ్మన్ దూకుడు... ఓపెనర్లు చెలరేగడంతో గుజరాత్కు శుభారంభం దక్కింది. తొలి ఓవర్లో ఓ ఫోర్ కొట్టిన శుబ్మన్, రెండో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో గిల్, సాయి సుదర్శన్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్) కలిసి 3 సిక్స్లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా గిల్ దూకుడు కొనసాగడంతో పవర్ప్లేలో గుజరాత్ 71 పరుగులు చేసి సుదర్శన్ వికెట్ కోల్పోయింది. వచ్చీ రావడంతోనే 4, 6, 4 కొట్టిన బట్లర్ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు)... వరుణ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఈ క్రమంలో గిల్ 27 బంతుల్లో హాఫ్సెంచరీ సాధించాడు. బట్లర్, సుందర్ (13) వెనుదిరిగినా... ఛేదించాల్సిన లక్ష్యం పెద్దది కాకపోవడంతో గుజరాత్కు ఇబ్బంది లేకుండా పోయింది. సెంచరీ చేసేలా కనిపించిన గిల్... గ్రీన్ పట్టిన చక్కటి క్యాచ్కు పెవిలియన్ బాటపట్టాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సైఫెర్ట్ (సి) ఫిలిప్స్ (బి) రబాడ 19; రహానే (సి) రబాడ (బి) సిరాజ్ 0; రఘువంశీ (సి) బట్లర్ (బి) రబాడ 8; గ్రీన్ (సి) బట్లర్ (బి) రషీద్ 79; పావెల్ (సి) సిరాజ్ (బి) అశోక్ 27; రాయ్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 9; రింకూ (సి) బట్లర్ (బి) రబాడ 1; రమణ్దీప్ (సి) సిరాజ్ (బి) అశోక్ 17; నరైన్ (సి) ఫిలిప్స్ (బి) సిరాజ్ 0; కార్తీక్ (రనౌట్) 6; వైభవ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–32, 4–87, 5–147, 6–148, 7–165, 8–166, 9–173, 10–180. బౌలింగ్: సిరాజ్ 4–0–23–2; రబాడ 4–0–29–3; ప్రసిధ్ 4–0–32–1; అశోక్ 4–0–45–2; రషీద్ 4–0–44–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) కార్తీక్ (బి) నరైన్ 22; గిల్ (సి) గ్రీన్ (బి) అరోరా 86; బట్లర్ (సి) గ్రీన్ (బి) వరుణ్ 25; సుందర్ (సి) కార్తీక్ (బి) వరుణ్ 13; ఫిలిప్స్ (సి) రింకూ (బి) రమణ్దీప్ 19; తెవాటియా (నాటౌట్) 7; షారుక్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–57, 2–95, 3–141, 4–158, 5–177. బౌలింగ్: వైభవ్ 4–0–35–1; కార్తీక్ 4–0–40–0; అనుకూల్ రాయ్ 3–0–37–0; నరైన్ 4–0–28–1; వరుణ్ 4–0–34–2; రమణ్దీప్ 0.4–0–5–1.
సన్రైజర్స్ x సూపర్ కింగ్స్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (శనివారం) జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. సొంత మైదానంలో గత మ్యాచ్లో చెలరేగి రాజస్తాన్ను చిత్తు చేసిన రైజర్స్ అదే జోరును కొనసాగించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరో వైపు తొలి మూడు మ్యాచ్లలో ఓటముల తర్వాత కోలుకున్న సీఎస్కే వరుస రెండు విజయాలతో ఫామ్లోకి వచ్చింది. ఇరు జట్లు ఐదు మ్యాచ్ల తర్వాత రెండేసి విజయాలతో సమంగా ఉన్న నేపథ్యంలో పైచేయి ఎవరు సాధిస్తారనేది చూడాలి. 2025 సీజన్లో హైదరాబాద్, చెన్నై మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగలేదు. కుర్రాళ్లు మళ్లీ చెలరేగేనా... గత మ్యాచ్లో యువ బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ పదునైన బౌలింగ్తో సన్రైజర్స్ను గెలిపించారు. ఉప్పల్ స్టేడియంలో వీరిద్దరు మళ్లీ అదే తరహా ప్రదర్శనను పునరావృతం చేయాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్నర్లు శివాంగ్, హర్ష్ దూబే కూడా ప్రత్యర్థిని నిలువరించగలరు. అయితే మెరుగైన బౌలింగ్ వనరులు కనిపిస్తున్నా...టీమ్ మళ్లీ తమ బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. ఈ సీజన్లో సొంతగడ్డపై రెండు మ్యాచ్లలో ‘డకౌట్’ అయిన అభిషేక్ శర్మ ఈ సారైనా చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. హెడ్ కూడా ఇంకా తన స్థాయి ప్రదర్శనను చూపించలేదు. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్లో ఉండటం సానుకూలాంశం. రెండు మ్యాచ్లలో కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్న క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి మళ్లీ సత్తా చాటాల్సి ఉంది. ముఖ్యంగా క్లాసెన్ స్ట్రయిక్రేట్లో గతంతో పోలిస్తే తక్కువగా ఉంటోంది. దీనిని అతను అధిగమిస్తే భారీ ఇన్నింగ్స్ ఖాయం. నితీశ్ మాత్రం ప్రతీ మ్యాచ్లో అంచనాలను అందుకుంటున్నాడు. రుతురాజ్ రాణించేనా... చెన్నై గత రెండు విజయాల్లో ఓపెనర్గా సంజు సామ్సన్ కీలక పాత్ర పోషించగా, యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రమే చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు. బ్రెవిస్, సర్ఫరాజ్ కూడా అంచనాలకు అనుగుణంగా దూకుడుగా ఆడుతున్నారు. టాప్–5లో ఈ నలుగురు బ్యాటింగ్తోనే సీఎస్కే మెరుగైన ఫలితాలు రాబట్టగలిగింది. అయితే జట్టును ఆందోళనపరుస్తున్న అంశం కెప్టెన్ రుతురాజ్ ఫామ్ మాత్రమే. ఐదు మ్యాచ్లలో రుతురాజ్ వరుసగా 6, 28, 7, 15, 7 పరుగులు మాత్రమే సాధించాడు. ఇలాంటి స్థితిలో కెప్టెన్నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ను జట్టు కోరుకుంటోంది. చివర్లో దూబే, ఒవర్టన్ కూడా ధాటిగా ఆడితే చెన్నై భారీ స్కోరు చేయడం ఖాయం. బౌలింగ్లో సీఎస్కే కొంత బలహీనంగానే కనిపిస్తోంది. స్పిన్నర్లు నూర్, అకీల్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నా...పేసర్లు గుర్జప్నీత్ సింగ్, ఒవర్టన్, కంబోజ్ భారీగా పరుగులిస్తున్నారు. ఈ సీజన్లో మెరుగ్గా ఆడిన ఖలీల్ అహ్మద్ గాయంతో టోర్నీకి దూరం కావడం చెన్నైని ఇబ్బంది పెట్టే అంశం. అతని స్థానంలో ఎవరికి చోటిస్తారనేది చూడాలి. ఐపీఎల్లో నేటి మరో మ్యాచ్బెంగళూరు X ఢిల్లీ వేదిక: బెంగళూరుమధ్యహ్నం 3: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
హర్మన్ మెరుపులు
డర్బన్: టి20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్లో భారత మహిళల జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐదు మ్యాచ్లో సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. మూడో వికెట్కు జెమీమాతో కలిసి హర్మన్ 71 పరుగులు జోడించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (5), కాశ్వి గౌతమ్ (10) విఫలమయ్యారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన హర్మన్ బృందం... టి20లకు అవసరమైనంత వేగంగా ఆడటంలో విఫలమైంది. ఆఖరి ఐదు ఓవర్లలో టీమిండియా 33 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా కడపటి వార్తలు అందేసరికి 10 ఓవర్లలో 2 వికెట్లకు 88 పరుగులు చేసింది.
ఉబెర్ కప్నుంచి తప్పుకున్న గాయత్రి – ట్రెసా జోడి
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ ఉబెర్ కప్లో భారత అవకాశాలకు దెబ్బ పడింది. భారత డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి – ట్రెసా జాలీ ఈ టోర్నీనుంచి తప్పుకుంది. ట్రెసా మడమకు గాయం కావడంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసియా చాంపియన్షిప్కు బయల్దేరే ముందు ప్రాక్టీస్లో తన సహచర ప్లేయర్ పాదంపై ట్రెసా కాలు పడటంతో ఆమెకు గాయమైందని భారత డబుల్స్ కోచ్ బి. సుమీత్ రెడ్డి వెల్లడించాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ట్రెసా రీహాబిలిటేషన్ తర్వాత కోలుకునే అవకాశం ఉంది. గాయత్రి – ట్రెసా స్థానంలో ఉబెర్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు శ్రుతి మిశ్రా – ప్రియ కొంజెన్బమ్లను ఎంపిక చేశారు. 2023లో జాతీయ చాంపియన్గా నిలిచిన ఈ జోడి 2024లో ఆసియా చాంపియన్షిప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. డెన్మార్క్లోని హార్సెన్స్ వేదికగా ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు థామస్, ఉబెర్ కప్ టోర్నీలు జరుగుతాయి. మరో వైపు ఈ టోర్నీలో సాధన కోసం భారత పురుషుల డబుల్స్ జోడి సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి డెన్మార్క్ బయల్దేరుతున్నారు.
ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల కాంప...
అథ్లెటిక్స్లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు!
ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే రేసింగ్ ట్రాక్ మీద...
అదరగొట్టిన భారత రెజ్లర్లు..
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లిం...
సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పెను సంచలనం న...
కోల్ ‘కథ’ మారలేదు
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 1...
సన్రైజర్స్ x సూపర్ కింగ్స్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడ...
హర్మన్ మెరుపులు
డర్బన్: టి20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా దక్షి...
సంచలనం.. వైభవ్ సూర్యవంశీకి రూ.150 కోట్లు!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త లలిత్ మోదీ మరోస...
క్రీడలు
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
#SRHvsRR మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
హైదరాబాద్ లో వైభవ్ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్ (ఫొటోలు)
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
వీడియోలు
మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR
టైగర్ కి టైం వచ్చింది.. సూర్యకి టైం దగ్గర పడింది
కెలికి మరి చితకొట్టించుకున్నారు, ముంబైను చీల్చిచెండాడిన శ్రీయస్ అయ్యర్..
శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు
ముంబై చిత్తు.. పంజాబ్ ఘనవిజయం..
15ఏళ్లుగా ధోనీకి సాధ్యం కాని రికార్డును మూడు మ్యాచుల్లో లేపేసాడు
నొప్పితో అల్లాడిపోయిన పంత్.. హాజెల్వుడ్ దెబ్బకి కన్నీళ్లు
టీమిండియాలోకి బుడ్జోడు ఎంట్రీ ఖరారు
ఆయా షేర్.. SRH ఊపిరి పీల్చుకో.. పాట్ కమ్మిన్స్ తిరిగివస్తునాడు ..
వైభవ్ సూర్యవంశీ 'గోల్డెన్ డక్'.. కావ్యపాప కాంతార సెలబ్రేషన్స్
