ప్రధాన వార్తలు
భారీ ఇన్నింగ్స్ దగ్గర్లోనే ఉంది: రుతురాజ్
ఐపీఎల్ 2026లో సీఎస్కే జట్టు హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండో విజయం సాధించింది. నిన్న (ఏప్రిల్ 14) కేకేఆర్పై 32 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ గెలుపు తర్వాత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా ఆనందంగా కనిపించాడు. ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ గెలుపుపై విశ్లేషణ ఇచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్పై సంతృప్తి వ్యక్తపరుస్తూ, ఫీల్డింగ్లో లోపాలను ఒప్పుకున్నాడు. రుతురాజ్ మాటల్లో..పిచ్ మారిపోయిందిమేము 220–210 పరుగులు చేయాలని అనుకున్నాం. కానీ పిచ్ 7–8 ఓవర్ల తర్వాత మారిపోయింది. బంతి స్లో అయ్యి, స్పిన్కు అనుకూలించింది. అందుకే 190–180 పరుగులు సరిపోతాయని భావించాం. ఆ తర్వాత పవర్ప్లేలో బౌలింగ్ బాగుంటే, రన్రేట్ కంట్రోల్ చేయవచ్చని అనుకున్నాం. మ్యాచ్మ్యాచ్కు మెరుగవుతున్నారుమా బౌలర్లు తమ పాత్రలను అర్థం చేసుకుంటున్నారు. ఏ ఓవర్లలో ఏ లెంగ్త్ వేయాలో తెలుసుకుంటున్నారు. మ్యాచ్మ్యాచ్కు మెరుగవుతున్నారు. ఇది మంచి సంకేతం. నూర్ అహ్మద్, అకీల్ హొసేన్ బౌలింగ్ వ్యూహం చాలా బాగుంది. వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఫీల్డింగ్లో లోపాలు మేము చాలా క్యాచ్లు డ్రాప్ చేశాం. వాతవరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగింది. అలాగని ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంలో చాలా మెరుగుపరచుకోవాలి. శక్తి, సంకల్పం, గెలవాలన్న పట్టుదల ఉంటే, కొన్ని డ్రాప్లు జరిగినా పర్వాలేదు. భారీ ఇన్నింగ్స్ దగ్గరలో ఉంది చాలా రోజుల తర్వాత గెలిచిన జట్టులో ఉండటం ఆనందంగా ఉంది. గత మ్యాచ్ తర్వాత రిలాక్స్గా అనిపించింది. ఇప్పుడు పాజిటివ్గా ఉన్నాను. భారీ ఇన్నింగ్స్ దగ్గరలోనే ఉంది.రుతురాజ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రెండు వరుస విజయాల తర్వాత రిలాక్డ్స్గా కనిపించాడు. ప్లస్లు, మైనస్ల గురించి బహిరంగంగా మాట్లాడాడు. త్వరలో అతని నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని విశ్వాసంగా ఉన్నాడు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో సన్రైజర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 18న సన్రైజర్స్ సొంత ఇలాకా హైదరాబాద్లో జరుగునుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని సీఎస్కే పట్టుదలగా ఉంది.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. సంజూ శాంసన్ (48), డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ నూర్ అహ్మద్ (4-0-21-3), అన్షుల్ కంబోజ్ (4-0-32-2), అకీల్ హొసేన్ (4-0-26-1) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఇన్నింగ్స్లో 35 పరుగులు చేసిన రమన్దీప్ టాప్ స్కోరర్గా నిలిచాడు.
గ్రీన్పై దుమ్మెత్తిపోస్తున్న కేకేఆర్ అభిమానులు
ఐపీఎల్ 2026లో కేకేఆర్ ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ వైఫల్యాల పరంపరం కొనసాగుతోంది. నిన్న (ఏప్రిల్ 14) సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో అతను గోల్డెన్ డకౌటై, తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టుకు తన అనవసరం చాలా ఉన్నప్పుడు కూడా చేతులెత్తేయడాన్ని కేకేఆర్ అభిమానులు జీర్ణంచుకోలేకపోతున్నారు. తొలి నాలుగు మ్యాచ్ల్లో వైఫల్యాలను పెద్దగా పట్టించుకోని వారు కూడా సీఎస్కే మ్యాచ్ వైఫల్యం తర్వాత విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.తాజా వైఫల్యం తర్వాత కేకేఆర్ కోర్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వారి ఆగ్రహజ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. వాడొక మోసగాడు అంటూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు కాకపోతే అతనికి రూ. 5 కోట్లు కూడా దక్కేవి కావని అంటున్నారు. కొందరు ఆతన్ని గతంలో విఫలమైన ఆటగాళ్లతో పోలుస్తూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు. గ్రీన్ కంటే 20-30 లక్షలు పెట్టి కొన్న స్వదేశీ ఆటగాళ్లు చాలా మేలని అభిప్రాయపడుతున్నారు.కాగా, గ్రీన్ను కేకేఆర్ ఈ సీజన్ వేలంలో రూ. 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గ్రీన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఇంత భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన గ్రీన్ వరుసగా విఫలమవుతుంటే ఏ ఫ్రాంచైజీ అభిమానులకైనా కడుపులో మండుతుంది. పైగా గ్రీన్ ఈ సీజన్లో మొదటి మూడు మ్యాచ్ల్లో గాయాన్ని సాకుగా చూపుతూ బౌలింగ్ కూడా చేయలేదు. మొత్తంగా గ్రీన్ వైఫల్యాలు కేకేఆర్ కొంపముంచాయి. అతని బదులు ఏ స్వదేశీ ఆల్రౌండర్ను నమ్ముకున్నా, ఇంతకంటే మెరుగైన ఫలితాలే వచ్చేవి.తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో గ్రీన్ బౌలింగ్ను సీఎస్కే యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే చెడుగుడు ఆడుకున్నాడు. అతను వేసిందే 2 ఓవర్లు, అందులోనే 20 పరుగులు రాబట్టాడు. మొత్తంగా గ్రీన్ తాను వేసిన 2 ఓవర్లలో వికెట్ లేకుండా 30 పరుగులు సమర్పించుకున్నాడు.బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో అతను చేసింది ఎంతమాత్రం కూడా న్యాయం కాదనిపించింది. జట్టుకు తన అవసరం చాలా ఉన్నప్పుడు (85-4) క్రీజ్లోకి వచ్చి గోల్డెన్ డకౌటయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలా ఔట్ కావడాన్ని ఏ కేకేఆర్ అభిమాని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. సోషల్మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. వాడికి 25 కోట్లు కాదు, 25 లక్షలు కూడా ఎక్కువే అని కామెంట్లు చేస్తున్నారు.ఈ సీజన్లో గ్రీన్ ప్రదర్శనలు..ముంబై ఇండియన్స్పై 18 (10)ఎస్ఆర్హెచ్పై 2 (2)పంజాబ్ కింగ్స్పై 4 (2)లక్నోపై 32 నాటౌట్ (24), (2-0-28-1)సీఎస్కేపై (2-0-20-0), 0 (1)గ్రీన్ వైఫల్యాలు ప్రత్యక్షంగా కేకేఆర్ విజయావకాశాలను ప్రభావితం చేశాయి. ఆ జట్టు ఈ సీజనలో ఇప్పటివరకు ఖాతా కూడా తెరవలేదు. ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింట ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.నిన్నటి మ్యాచ్లో కేకేఆర్ సీఎస్కే చేతిలో 32 పరుగుల తేడాతో పరాజయం ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. సంజూ శాంసన్ (48), డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ నూర్ అహ్మద్ (4-0-21-3), అన్షుల్ కంబోజ్ (4-0-32-2), అకీల్ హొసేన్ (4-0-26-1) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన రమన్దీప్ టాప్ స్కోరర్గా నిలిచాడు.
రహానేపై చర్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్లో సీఎస్కే చేతిలో కేకేఆర్ ఘోర పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఓటమి బాధ నుంచి తేరుకోకముందే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ అజింక్య రహానేపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. సీఎస్కే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్లో మొదటి తప్పిదం కావడంతో కేవలం జరిమానాతోనే సరిపెట్టింది. ప్రస్తుత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించబడిన నాలుగో కెప్టెన్ రహానే.కాగా, ప్రస్తుత సీజన్లో కేకేఆర్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగు పరాజయాలు ఎదర్కొంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం ఆ జట్టు అత్యల్ప రన్రేట్తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.ఈ సీజన్లో కేకేఆర్కు ఏదీ కలిసి రావడం లేదు. సీజన్ ప్రారంభానికి ముందే కీలక బౌలర్లంతా దూరం కాగా.. భారీ అంచనాలు పెట్టుకున్న గ్రీన్ తుస్సుమనిపిస్తున్నాడు. కెప్టెన్ రహానే సహా మిగతా ఆటగాళ్లంతా నామమాత్రపు ప్రదర్శనలతో మమ అనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క ఆటగాడి నుంచి కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన రాలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కేకేఆర్ ఈ సీజన్ను గెలుపు లేకుండా ముగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఈ జట్టు తమ తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 17న అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్ సీఎస్కే చేతిలో 32 పరుగుల తేడాతో పరాజయం ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. సంజూ శాంసన్ (48), డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ నూర్ అహ్మద్ (4-0-21-3), అన్షుల్ కంబోజ్ (4-0-32-2), అకీల్ హొసేన్ (4-0-26-1) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన రమన్దీప్ టాప్ స్కోరర్గా నిలిచాడు.
సీఎస్కే చేతిలో ఓటమి అనంతరం రహానే వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో 20 మ్యాచ్లు గడిచినా మూడు సార్లు ఛాంపియన్ అయిన కేకేఆర్ ఫేట్ మారలేదు. ఆ జట్టు ఇంకా గెలుపు కోసం ఎదురు చూస్తూనే ఉంది. నిన్న (ఏప్రిల్ 14) సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో ఇది నాలుగో ఓటమి. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అత్యల్ప రన్రేట్తో ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.నిన్నటి మ్యాచ్లో కేకేఆర్ తొలుత బౌలింగ్లో పర్వాలేదనిపించినా, బ్యాటింగ్లో పూర్తిగా తేలిపోయింది. 193 లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడి, 32 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. 25 కోట్లు పెట్టి కొన్న గ్రీన్ మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. ఆదుకోవాల్సిన సమయంలో గోల్డెన్ డకౌటయ్యాడు. కాంబినేషన్లు మార్చినా ఆ జట్టుకు కలిసి రాలేదు. కెప్టెన్ రహానే డిమోషన్ తీసుకొని సునీల్ నరైన్ను ఓపెనర్గా ప్రమోట్ చేసినా వర్కౌట్ కాలేదు. ప్రతి మ్యాచ్లో ఆదుకునే రఘువంశీ కూడా ఈ మ్యాచ్లో చేతులెత్తేశాడు. మిగతా బ్యాటర్లంతా షరామామూలుగానే విఫలమయ్యారు. మొత్తంగా కేకేఆర్ మరో మ్యాచ్లో ఓటమి చవిచూసి, వైఫల్యాల పరంపరను కొనసాగించింది.మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే తమ జట్టు ప్రదర్శనపై స్పష్టమైన విశ్లేషణ ఇచ్చాడు. బౌలింగ్, బ్యాటింగ్, కాంబినేషన్, ఆటగాళ్ల ఫామ్ గురించి మాట్లాడాడు. బౌలింగ్ యూనిట్పై ప్రశంస 190 పరుగులకే వారిని ఆపడం సంతృప్తినిచ్చింది. పవర్ప్లేలో 70 పరుగులు ఇచ్చినా, చాలా బాగా కమ్బ్యాక్ ఇవ్వగలిగాం. కార్తిక్ త్యాగిని ప్రత్యేకంగా ప్రశంసించాలి. నెట్స్లో చాలా కష్టపడుతున్నాడు. అతని పేస్ అద్భుతంగా ఉంది. ప్రతి మ్యాచ్తో మెరుగవుతున్నాడు. బ్యాటింగ్లో లోపాలు పవర్ప్లేలో 36–37 పరుగులు మాత్రమే చేశాం. ఈ దశలో చేసే పరుగులే కీలకం. మధ్య దశలో స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టంగా అనిపించింది. ఎవరైనా చివరి వరకు ఆడితే ఫలితం వేరేలా ఉండేది. సీఎస్కే స్పిన్నర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. కాంబినేషన్ సమస్య గత మ్యాచ్లో మా కాంబినేషన్ బాగానే ఉంది. అయినా ఫలితాలు రాకపోతే కాంబినేషన్ మార్చుకోవాల్సి వస్తుంది. కష్ట సమయాల్లో ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలి, కానీ జట్టు గెలవకపోతే ఆలోచించాలి. జట్టులో పాజిటివ్ మైండ్ సెట్ అవసరం. తల ఎత్తుకొని, సెల్ఫ్ బిలీఫ్తో ముందుకు సాగిలి.స్పిన్నర్ల ప్రదర్శన మా స్పిన్నర్లు, సీఎస్కే స్పిన్నర్లు ఇద్దరూ బాగా బౌలింగ్ చేశారు. బంతిని పూర్తిగా ఫుల్గా వేయకపోతే పెద్ద సిక్స్ కొట్టడం కష్టమే. మొత్తంగా వరుస ఓటములు ఎదురైనా రహానే మాటల్లో ఇంకా సానుకూల దృక్పదం కనిపించింది. కష్ట సమయాల్లో తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇదే రిపీటైతే మార్పులు కూడా తప్పవని సంకేతం ఇచ్చాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పవర్ ప్లేలో, ఆతర్వాత కొద్ది ఓవర్ల పాటు ఆ జట్టు ఆడిన విధానం బట్టి చూస్తూ ఇది తక్కువ స్కోరే అని చెప్పాలి. కేకేఆర్ బౌలర్లు అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చి సీఎస్కే స్కోర్ను అదుపు చేశారు. సీఎస్కే ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ (48), బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు.అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ ఆదిలోనే మ్యాచ్పై పట్టు కోల్పోయింది. పవర్ప్లేలో చాలా తక్కువ పరుగులు చేసి లక్ష్యాన్ని భారీగా పెంచేసుకుంది. మధ్య ఓవర్లలో ధాటిగా ఆడదామనే ప్రయత్నంలో వికెట్లు పారేసుకుంది. అంతిమంగా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో రోవ్మన్ పావెల్ (31 నాటౌట్), రమణ్దీప్ సింగ్ (35) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-21-3), అన్షుల్ కంబోజ్ (4-0-32-2), అకీల్ హొసేన్ (4-0-26-1) సత్తా చాటారు.
‘గోపాల్గంజ్ కా రబాడ’
సాక్షి క్రీడా విభాగం: రెండేళ్ల క్రితం కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. అయితే ఆ సీజన్లో జట్టులో భాగంగా ఉన్న పేసర్ సాకిబ్ హుస్సేన్కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఫైనల్ మ్యాచ్ తర్వాత సాకిబ్ తల్లిదండ్రులు జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ను కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన గంభీర్ ‘మీ వాడిలో చాలా ప్రతిభ ఉంది. జట్టు కూర్పులో భాగంగా అవకాశం ఇవ్వలేకపోయాం కానీ మున్ముందు అతను ఐపీఎల్లో తప్పక రాణిస్తాడు’ అని భరోసానిచ్చాడు. తర్వాతి సీజన్లో కేకేఆర్ అతడిని కొనసాగించకపోగా, ఈ ఏడాది సన్రైజర్స్ అతడిని ఎంచుకుంది. అతి సాధారణ నేపథ్యం ఉన్నా... కేవలం శ్రమ, పట్టుదలతో దూసుకొచ్చిన సాకిబ్ గాథ స్ఫూర్తిదాయకం. పేదరికం నుంచి వచ్చి... బిహార్లో బాగా వెనుకబడిన జిల్లాల్లో గోపాల్గంజ్ కూడా ఒకటి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన సాకిబ్కు ఎప్పటికైనా ఆర్మీలో చేరాలనేది కోరిక. అందుకే 15 ఏళ్ల వయసులో స్థానిక ఆర్మీ గ్రౌండ్లో రన్నింగ్, ఎక్సర్సైజ్లు అలవాటుగా మార్చుకున్నాడు. అయితే తన స్నేహితుల ద్వారా క్రికెట్పై కొంత ఆసక్తి పెంచుకొని టెన్నిస్ బంతితో బౌలింగ్ ప్రారంభించిన అతను అదే బంతిపై పట్టు పెంచుకొని రాటుదేలాడు. స్థానికంగా జరిగే లేదా దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నాకు వెళ్లి టోర్నీలు ఆడి వచ్చేవాడు. మ్యాచ్ ఆడిన రోజు రూ.500–1000 వరకు లభించేవి.తమ టీమ్కు వరుస విజయాలు అందిస్తున్న సాకిబ్ను అంతా ‘గోపాల్గంజ్ కా రబాడ’ అని పిలిచేవాళ్లు. మరోవైపు వ్యవసాయదారుడు అయిన తండ్రి ఆదాయం చాలా స్వల్పం. క్రికెటర్గా శిక్షణ అందించే స్థాయి లేదు. ఇదే సమయంలో అతనికి మోకాలికి దెబ్బ తగలడంతో వ్యవసాయం కూడా కష్టంగా మారిపోయింది. ఇలాంటి స్థితిలో సాకిబ్ తెచ్చే చిన్న మొత్తం కూడా కుటుంబానికి ఉపయోగపడ్డాయి. క్రికెట్లో ఎదగాలని ప్రయతి్నస్తున్న సమయంలో రూ. 10 వేల విలువైన బౌలింగ్ స్పైక్స్ కొనే స్థోమత లేకపోగా...ఏదైతే అది అవుతుందని తల్లి తన వద్ద ఉన్న కాస్త నగలు అమ్మి స్పైక్స్ కొనిచ్చింది. లోపాలు సరిదిద్దుకొని... సాకిబ్ గురించి బాగా విన్న పట్నాలోని జెన్ నెక్ట్స్ అకాడమీ కోచ్ రాబిన్ సింగ్ ఈ కుర్ర పేసర్కు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. కోచ్ మార్గనిర్దేశనంలో అతని బౌలింగ్ ఎంతో మెరుగైంది. ఈ క్రమంలో వరుసగా వేర్వేరు వయో విభాగాల్లో అవకాశాలు వచ్చాయి. అండర్–19 స్థాయిలో ఆకట్టుకున్న తర్వాతి 18 ఏళ్ల వయసులో ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ తరఫున టి20ల్లో అరంగేట్రం జరిగింది. అయితే నిలకడ లేక జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ ఎరుపు బంతితో మరింత కష్టపడిన సాకిబ్ 2024లో తొలి రంజీ మ్యాచ్ ఆడాడు.ఇక్కడా కర్ణాటకపై ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 13 నోబాల్స్ వేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కానీ తన లోపాల నుంచి పాఠాలు నేర్చుకొని అతను ఎంతో మెరుగయ్యాడు. టి20ల్లో బౌలింగ్పై మరింత దృష్టి పెట్టిన అతనికి చెన్నై నెట్ బౌలర్గా అవకాశం లభించింది. ఆ తర్వాత కోల్కతా టీమ్లోకి తీసుకుంది. మ్యాచ్ ఆడలేకపోయినా... ఈ అనుభవాలు అతనికి తన ఆటను తీర్చిదిద్దుకునేందుకు పనికొచ్చాయి. రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సాకిబ్ బౌలింగ్లో వైవిధ్యం కనిపించింది. ఆరంభంలో, డెత్లో కూడా పదునైన బంతులు వేయగల నైపుణ్యాన్ని అతను ప్రదర్శించాడు. ఇదే ఆటను కొనసాగిస్తే మున్ముందు సాకిబ్కు మంచి భవిష్యత్తు ఉండవచ్చు.
చెన్నై గెలుపు చమక్
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నై సూపర్కింగ్స్దే పైచేయి అయింది. సొంతగడ్డ చెపాక్లో అసాధారణ ప్రదర్శన లేకపోయినా... ప్రత్యర్థితో పోలిస్తే మెరుగైన ఆటతీరు కనబర్చిన సీఎస్కే మరో రెండు పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. సామ్సన్, బ్రెవిస్ తమ బ్యాటింగ్తో చెప్పుకోదగ్గ స్కోరును అందించగా, బౌలింగ్లో నూర్ అహ్మద్ మూడు వికెట్లతో జట్టు విజయానికి బాటలు వేశాడు. మరోవైపు కోల్కతా ప్రతీ మ్యాచ్కు దిగజారుతున్న ఆటతో అట్టడుగున తాము నిలిచిన స్థానాన్ని మరింత స్థిరపర్చుకున్నట్లయింది. అన్ని రంగాల్లో విఫలమైన మాజీ చాంపియన్ ఐదు మ్యాచ్ల తర్వాత కూడా ఒక్కటీ గెలవలేక చతికిలపడింది. చెన్నై: వరుసగా మూడు ఓటముల తర్వాత కోలుకొని గత మ్యాచ్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు ఐపీఎల్ 19వ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో చెన్నై 32 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (32 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్లు), బ్రెవిస్ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు), ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 38; 6 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ (3/21) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. కెప్టెన్ మళ్లీ విఫలం... అరోరా వేసిన ఇన్నింగ్స్ తొలి మూడు బంతులను ఫోర్లుగా మలచి సామ్సన్ శుభారంభం అందించగా, మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) వైఫల్యం కొనసాగింది. ఆ తర్వాత గ్రీన్ ఓవర్లో మాత్రే చెలరేగిపోయాడు. రెండో బంతికి ఫోర్ కొట్టిన అతను, చివరి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6, బాదాడు. అరోరా ఓవర్లో కూడా తొలి మూడు బంతుల్లో వరుసగా ఫోర్లు కొట్టిన మాత్రే అదే ఓవర్ చివరి బంతికి వెనుదిరిగాడు.పవర్ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 72/2కు చేరింది. ఈ దశలో సామ్సన్, బ్రెవిస్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే త్యాగి బౌలింగ్లో అద్భుత సిక్స్ కొట్టిన సామ్సన్ 148.1 కిలోమీటర్ల వేగంతో దూసుకొచి్చన తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. అనంతరం వరుణ్, అరోరా ఓవర్లలో కలిపి సర్ఫరాజ్ ఖాన్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు), బ్రెవిస్ 3 ఫోర్లు, 3 సిక్స్లతో 35 పరుగులు రాబట్టడంతో జట్టు కోలుకుంది. అయితే వీరిద్దరు 9 పరుగుల వ్యవధిలో అవుట్ కాగా... సీఎస్కే చివరి 4 ఓవర్లలో కేవలం 3 ఫోర్లతో 30 పరుగులు మాత్రమే సాధించగలిగింది! టపటపా... ఛేదనలో కోల్కతా పూర్తిగా తడబడింది. ఫిన్ అలెన్ (1) మళ్లీ విఫలం కాగా, సునీల్ నరైన్ (17 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్ప్లేలో కేకేఆర్ 36 పరుగులు మాత్రమే సాధించింది. ప్రత్యర్థి పవర్ప్లేతో పోలిస్తే ఇవి సగం పరుగులు మాత్రమే! ఇక్కడే జట్టు విజయావకాశాలకు దెబ్బ పడింది. ఆ తర్వాత కూడా టీమ్ ఏమాత్రం కోలుకోలేకపోయింది. నూర్ వరుస బంతుల్లో రహానే (22 బంతుల్లో 28; 2 సిక్స్లు), గ్రీన్ (0)లను అవుట్ చేశాడు. నూర్ తర్వాతి ఓవర్లో రింకూ సింగ్ (6) కూడా డగౌట్ చేరడంతో కోల్కతా గెలుపు ఆశలు ముగిసిపోయాయి. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) త్యాగి 48; రుతురాజ్ (సి) పావెల్ (బి) రాయ్ 7; మాత్రే (సి) రమణ్దీప్ (బి) అరోరా 38; బ్రెవిస్ (సి) అరోరా (బి) త్యాగి 41; సర్ఫరాజ్ (బి) నరైన్ 23; దూబే (నాటౌట్) 13; ఒవర్టన్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–25, 2–72, 3–111, 4–162, 5–171. బౌలింగ్: అరోరా 4–0–55–1, గ్రీన్ 2–0– 30–0, అనుకూల్ 3–0–21–1, నరైన్ 4–0–21–1, వరుణ్ 3–0–26–0, త్యాగి 4–0–35–2. కోల్కతానైట్రైడర్స్ ఇన్నింగ్స్: అలెన్ (సి) దూబే (బి) కంబోజ్ 1; నరైన్ (సి) గుర్జప్నీత్ (బి) ఖలీల్ 24; రహానే (సి) రుతురాజ్ (బి) నూర్ 28; రఘువంశీ (సి) బ్రెవిస్ (బి) హొసీన్ 27; రింకూ (సి) దూబే (బి) నూర్ 6; గ్రీన్ (బి) నూర్ 0; పావెల్ (నాటౌట్) 31; రమణ్దీప్ (సి) సర్ఫరాజ్ (బి) కంబోజ్ 35; రాయ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–13, 2–29, 3–79, 4–85, 5–85, 6–90, 7–153. బౌలింగ్: ఖలీల్ 3.5–0–24–1, కంబోజ్ 4–0– 32–2, హొసీన్ 4–0–26–1, నూర్ 4–0– 21–3, గుర్జప్నీత్ 1.1–0–23–0, ఒవర్టన్ 3–0–32–0.
రాత మారని కేకేఆర్.. సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. సీజన్లో కేకేఆర్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. మంగళవారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 32 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు శాంసన్, బ్రెవిస్, ఆయుశ్ మాత్రేలు రాణించడంతో సీఎస్కే సునాయాస విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48), బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకు పరిమితమైంది. ఆఖర్లో పావెల్ (31 నాటౌట్), రమణ్దీప్ (35) పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో లాభం లేకపోయింది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు. సీజన్లో సీఎస్కేకు ఇది రెండో విజయం కాగా, కేకేఆర్ నాలుగు పరాజయాలతో ఇప్పటికీ ఖాతా తెరవలేదు.
కోహ్లికి గాయం.. లక్నోతో ఆడేది అనుమానమే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లాడిన ఆర్సీబీ మూడు విజయాలతో పట్టికలోమూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం లక్నో సూపర్జెయింట్స్తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. అయితే సోమవారం ట్రైనింగ్ సెషన్లో కోహ్లీ కాలికి బ్యాండేజ్తో కనిపించాడు. ప్రాక్టీస్ అనంరతం కోహ్లీ మాజీ క్రికెటర్ కేన్ విలియమ్సన్, కెప్టెన్ రిషబ్ పంత్లను నవ్వుతూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో ఫ్రాంచైజీ తమ ఎక్స్లో షేర్ చేసుకుంది. అయితే వీడియోలో కోహ్లీ కుంటుతూ నడుస్తున్నట్లుగా కనిపించింది. దీంతో చీలమండ గాయం నుంచి కోహ్లి ఇంకా కోలుకోలేదని క్లియర్గా తెలుస్తోంది. అందుకే లక్నోతో మ్యాచ్లో కోహ్లి ఆడుతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ ఆడినా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశముంది. ఇక ఈ సీజన్లో కోహ్లి నాలుగు మ్యాచ్లు కలిపి 179 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలున్నాయి. ఇక ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లోనూ కోహ్లీ కేవలం బ్యాటింగ్కే పరిమితమయ్యాడు.Yaari dosti 🥹🤌 pic.twitter.com/lgdcrCTITI— Lucknow Super Giants (@LucknowIPL) April 14, 2026చదవండి: ‘రుతురాజ్ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్కు చాన్స్ ఇవ్వు’
‘రుతురాజ్ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్కు చాన్స్ ఇవ్వు’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్లోనూ రుతురాజ్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ ఏడు పరుగులు చేసి అనుకుల్ రాయ్ బౌలింగ్లో రోవ్మెన్ పావెల్కు క్యాచ్ ఇచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్ల్లో 12.6 సగటుతో 63 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్గానే గాక కెప్టెన్గానూ రుతురాజ్ ఫెయిలవుతున్నాడు. సీఎస్కే ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించి మూడింట ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో రుతురాజ్ కెప్టెన్సీ సహా వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు పెరిగిపోతున్నాయి. దీంతో రుతురాజ్ తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకుంటే బాగుంటుందని క్రీడా పండితులు సూచిస్తున్నారు. వన్డౌన్లో వస్తున్న ఆయుశ్ మాత్రేకు ప్రమోషన్ ఇచ్చి ఓపెనర్గా పంపితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే మ్యాచ్ల్లోనైనా రుతురాజ్ తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకుంటాడేమో చూడాలి. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48) టాప్ స్కోరర్గా నిలవగా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్లు తలా ఒక వికెట్ తీశారు. View this post on Instagram A post shared by THE ADULT SOCIETY (@adultsociety) చదవండి: IPL 2026: నల్ల రిబ్బన్లతో బరిలోకి.. కారణమదే!
IPL 2026: నల్ల రిబ్బన్లతో బరిలోకి.. కారణమదే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా 22వ మ్యాచ్లో సీఎస్కే, కేకేఆర్ తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్కు ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం ఆసక్తి కలిగించింది. అయితే ఇరుజట్ల ఆటగాళ్లు ఏకకాలంలో నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం వెనుక ఒక కారణముంది. గత వారం (ఏప్రిల్ 9న) భారత అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా సీఎస్కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు నివాళి ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్ మరణం పట్ల గౌరవసూచకంగా ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. కాగా 1951లో ఇంగ్లండ్పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ తన కెరీర్లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మద్రాస్ తరపున ఆడన 83 మ్యాచ్లు ఆడారు. గోపీనాథ్ తన అరంగేట్ర మ్యాచ్లోనే మెరుపుగలు మెరిపించాడు. తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మొదటి ఇన్నింగ్స్లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయన 8 మ్యాచ్లలో 242 పరుగులు చేశారు. .@ChennaiIPL and @KKRiders are wearing black armbands as a mark of respect to former India cricketer C.D. Gopinath, who breathed his last on April 9.#TATAIPL | #CSKvKKR pic.twitter.com/Zv9NxNjAp6— IndianPremierLeague (@IPL) April 14, 2026
విజేత నైశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గోండ్వానా కప్ అఖిల భారత టెన్న...
అనూహ్య మార్పు.. జూనియర్ హాకీ జట్టుకు కొత్త కోచ్
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు టిమ్...
ఆయుశ్ సంచలనం
నింగ్బో (చైనా): బరిలోకి దిగిన తొలిసారే భారత రైజింగ...
‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్కప్లో భారత జట్టును చూడాలి’
క్రికెట్తో పోలిస్తే భారత్లో ఫుట్బాల్కు ఆదరణ...
SRHకు అదిరిపోయే శుభవార్త
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త. రెగ్యులర...
KKR పేసర్పై రెండేళ్ల నిషేధం
జింబాబ్వే క్రికెటర్ బ్లెస్సింగ్ ముజర్బానీపై నిష...
సూర్యకుమార్ యాదవ్పై వేటు!
టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్గా భ...
ఇండియాలోనే ఆ సంక్షోభం?.. పీసీబీ చీఫ్నకు చివాట్లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ...
క్రీడలు
#SRHvsRR మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
హైదరాబాద్ లో వైభవ్ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్ (ఫొటోలు)
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
వీడియోలు
KKR ఓటమి.. దుమ్మురేపిన CSK
ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
హీరో నుంచి జీరో, బొక్క బోర్ల పడ్డ బుడోడు....
అదరగొట్టిన SRH వైభవ్ డకౌట్...
ముంబై ఇండియన్స్.. హ్యాట్రిక్ ఓటమి
ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...
ఢిల్లీపై చెన్నై అద్భుత విజయం
ఎవడైతే నాకేంటి .. I DONT CARE
15 ఏళ్ల కుర్రాడు ..15 బంతుల్లో RCB కి చుక్కలు చూపించాడు
RCB కి చుక్కలు చూపించాడు.. ఈ బుడ్డోడి కొట్టుడికి కోహ్లి రియాక్షన్ చూస్తే
