Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Axar Patel Holds These Players Responsible For Worst Ever IPL Record1
పంజాబ్‌ చేతిలో ఓటమిని సహచరులపైకి నెట్టిన అక్షర్‌ పటేల్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ తన ఫీల్డర్ల ఖాతాలోకి వేశాడు.మ్యాచ్‌ అనంతరం ఓటమిపై స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు."మేము మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాం. ఇలాంటి పిచ్‌పై బౌలర్లకు ఫీల్డర్లు సహకరించకపోతే, ఓడిపోవడమే సరైన ఫలితం" అంటూ కఠినంగా వ్యాఖ్యానించాడు.ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యమే మ్యాచ్‌ను చేజార్చిందని స్పష్టం చేశాడు. కరుణ్‌ నాయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇచ్చిన రెండు కీలక క్యాచ్‌లను వదిలేయడం జట్టుకు భారీ మూల్యం చెల్లింపజేసిందని అన్నాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అయ్యర్ 36 బంతుల్లో అజేయమైన 71 పరుగులు చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడని తెలిపాడు.అక్షర్ తన బౌలర్లపైనా అసహనం వ్యక్తం చేశాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి పరుగుల వేగాన్ని నియంత్రించడంలో బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నాడు. ఢిల్లీ బౌలర్లందరూ ఓవరుకు 11కి పైగా పరుగులు సమర్పించడం జట్టు పరిస్థితిని మరింత దయనీయంగా మార్చిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.కుల్దీప్‌ రెండు వికెట్లు తీసినా 46 పరుగులు ఇచ్చాడు. తాను, నటరాజన్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకిబ్‌ నబీ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నామని అన్నాడు. ఈ వికెట్‌పై 264 పరుగుల స్కోర్‌ చాలా మంచిదని అభిప్రాయపడ్డాడు. లక్‌ మా పక్షాన ఉండి, క్యాచ్‌లు పట్టుంటే ఈజీగా గెలిచేవాళ్లమని తెలిపాడు. ఈ సీజన్‌లో మేం ఓడిన మ్యాచ్‌లు చూస్తే చాలా వరకు క్లోజ్‌ మ్యాచ్‌లు. వాటిలో కొన్ని అవకాశాలను ఓడిసి పట్టుకుని ఉంటే, రెండు-మూడు అదనపు విజయాలు మా ఖాతాలో ఉండేవని అని అభిప్రాయపడ్డాడు. తప్పులు పదేపదే రిపీట్‌ చేస్తుంటే, అవకాశాలు మళ్లీమళ్లీ రావని అసహనం వ్యక్తం చేశాడు.కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌ చేసి కేఎల్‌ రాహుల్‌ (152 నాటౌట్‌), నితీశ్‌ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్‌ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (43), ‍ప్రభ్‌సిమ్రన్‌ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (71 నాటౌట్‌) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్‌ ఈ సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది.

IPL 2026: SRH Captain Cummins comments after win against RR2
ఇలాంటి స్కోర్లను మా బ్యాటర్లు ఊదేస్తారు.. కమిన్స్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. అభిషేక్‌ శర్మ (57), ఇషాన్‌ కిషన్‌ (74), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (36) మెరుపు విన్యాసాల కారణంగా ఎస్‌ఆర్‌హెచ్‌ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది.ఈ గెలుపుపై మ్యాచ్‌ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఇలా స్పందించాడు. సీజన్‌లో తొలి మ్యాచ్ (ఈ సీజన్‌లో కమిన్స్‌కు ఇదే తొలి మ్యాచ్‌) ఎలా సాగుతుందో ఎప్పుడూ కొంత అనిశ్చితి ఉంటుంది. కానీ మా సన్నాహాలు అద్భుతంగా జరిగాయి. అనుభవంతో ఆటను త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నాను.ప్రస్తుతం టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారిపోయింది. ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్‌లు బౌలర్లకు పెద్ద సవాలే. కానీ రెండు ఖరీదైనా ఓవర్లు వేసినా, మళ్లీ తిరిగి వచ్చి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే టీ20 అందం.యువ బౌలర్ల ప్రదర్శనపై కమిన్స్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. ప్రఫుల్‌ హింగే ప్రస్తావన తీసుకొచ్చాడు. వీరిని ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హర్షల్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ లాంటి సీనియర్లు ఉండనే ఉన్నారని అన్నాడు. డగౌట్‌ బౌలర్లతో కలకలలాడుతుందని తెలిపాడు. యువ బౌలర్లు స్పష్టమైన ప్రణాళికలతో రాణిస్తున్నారని కొనియాడాడు.మధ్య విరామ సమయంలో జట్టు చాలా ప్రశాంతంగా ఉందని వెల్లడించాడు. ప్రత్యర్థి స్కోరు 250 దాటే అవకాశముండగా, 220 వద్ద నిలిపేయడం కీలకమైందని చెప్పాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌పై పట్టుసాధించాలని భావించామని తెలిపాడు. ప్రస్తుతమున్న ఫామ్‌లో మా బ్యాటర్లు ఇలాంటి లక్ష్యాలను సులభంగా ఊదేయగలరని విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, కమిన్స్‌ వ్యాఖ్యల్లో తన బృందంపై నమ్మకం, ధీమా కొట్టొచ్చినట్లు కనిపించింది. తన గైర్హాజరీలో ఇషాన్‌ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని అభిప్రాయపడ్డాడు. అలాగే బౌలర్లు, ముఖ్యంగా యువ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటర్ల మెరుపు విన్యాసాలపై ధీమా కనిపించింది. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.

IPL 2026: RR Captain Riyan Parag Comments after losing to SRH3
అదే మా కొంపముంచింది.. సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి అనంతరం రియాన్‌ పరాగ్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. వైభవ్‌ సూర్యవంశీ (103) శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా, సన్‌రైజర్స్‌ ఇషాన్‌ కిషన్‌ (74), అభిషేక్‌ శర్మ (57) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌ రాయల్స్‌ను వెనక్కు నెట్టి (నాలుగో స్థానానికి) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఇలా స్పందించాడు.భారీ స్కోరు చేసినప్పటికీ, క్యాచ్‌లు వదిలేయడం జట్టుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నైపుణ్య పరంగా చూస్తే మేం బాగా ఆడాం. కానీ కీలక సమయంలో చాలా క్యాచ్‌లు వదిలేశాం. అభిషేక్‌ శర్మ లాంటి నాణ్యమైన ఆటగాళ్లకు రెండో అవకాశం ఇస్తే, అతను దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు. అదే జరిగింది.228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, ఇంకా 10 నుంచి 15 పరుగులు వెనుకపడ్డాం. చివరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో పరుగులను నియంత్రించారు.బౌలింగ్ మార్పులపై వివరణ ఇస్తూ.. ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో తాను, మరో స్పిన్నర్ కలిసి వికెట్ కోసం ప్రయత్నించాం. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా లేకపోవడంతో మా ప్రణాళిక ఫలించలేదు.ఆర్చర్‌ ప్రదర్శన చాలా అద్భుతం. ఈ సీజన్ అంతా అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా క్లాసిక్ స్పెల్ వేశాడు. కొన్ని టాప్ ఎడ్జ్‌లు ఫీల్డర్ల మధ్య పడటం అతని దురదృష్టం.తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఎదుర్కొననుండటంపై స్పందిస్తూ.. ప్రతి వేదిక కొత్త సవాల్. చండీగఢ్ పిచ్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం సిద్ధం చేసుకుంటాము.ఒక రోజు విరామం ఉంది. మానసికంగా ఫ్రెష్ అయి, తప్పులను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఫీల్డింగ్‌ వైఫల్యాలను అధిగమిస్తే రాజస్థాన్ రాయల్స్ మరింత ప్రమాదకర జట్టుగా మారడం ఖాయమని రియాన్‌ అభిప్రాయపడ్డాడు.కాగా, ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ ఓటమికి ఫీల్డింగ్‌ వైఫల్యాలు, క్యాచ్‌లు జారవిడచడమే ప్రధాన కారణమైనప్పటికీ.. బ్యాటింగ్‌లో లోపాలు సైతం గమినించదగ్గవే. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఇంకా భారీ స్కోర్‌ చేసుండాల్సింది. సూర్యవంశీ క్రీజ్‌లో ఉన్నంత సేపు సునాయాసంగా 250 ప్లస్‌ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔటైన వెంటనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఫెరియెరా మెరుపులు మినహా మధ్య వరుస బ్యాటర్లెవ్వరూ రాణించలేదు. అలాగే ఈ మ్యాచ్‌లో రియాన్‌ కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. స్ట్రయిట్‌ స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, రవీంద్ర జడేజాతో తలో ఓవర్‌ మాత్రమే వేయించి మూల్యం చెల్లించుకున్నాడు. మొత్తంగా ఈ ఓటమితో రాయల్స్‌ చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.

Deepti Sharma Maiden T20I five Wicket Hual India Beat South Africa4
తొలిసారి 5 వికెట్లు.. భార‌త్‌ను గెలిపించిన దీప్తి శ‌ర్మ‌

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఎట్ట‌కేల‌కు విజ‌యాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శ‌నివారం జోహ‌న్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల‌తో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా వుమెన్ 14 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. దీప్తిశ‌ర్మ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. రోడ్రిగ్స్ (43), దీప్తిశ‌ర్మ (36 నాటౌట్‌), రిచా ఘోష్ (34 నాటౌట్‌) రాణించారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో మారి మార్స్, యాలా రెనెకి చెరో 2 వికెట్లు తీశారు. అనంత‌రం 186 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌ఫారీలు 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగుల‌కు ప‌రిమితమ‌యింది. ఓపెన‌ర్ సునె లుస్ (40) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా, తంజిమ్ బ్రిట్జ్ 30 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ 5 వికెట్లు తీయ‌గా, క్రాంతి, చ‌ర‌ణి, క‌శ్వీ గౌత‌మ్‌, షెఫాలీ త‌లా ఒక వికెట్ తీశారు. సిరీస్‌లో భాగంగా చివ‌రి టీ20 సోమ‌వారం జ‌ర‌గ‌నుంది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన దీప్తి శ‌ర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. కాగా దీప్తి శర్మ టీ20ల్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.4⃣ Overs1⃣9⃣ Runs5⃣ fantastic wickets 👏Deepti Sharma picks up her 𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗙𝗜𝗩𝗘-𝗪𝗜𝗖𝗞𝗘𝗧 𝗛𝗔𝗨𝗟 in T20Is 🫡Scorecard ▶️ https://t.co/92BPfF0bsf#TeamIndia | #SAvIND | @Deepti_Sharma06 pic.twitter.com/Kj1CzmR8M7— BCCI Women (@BCCIWomen) April 25, 2026𝗦𝘁𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝘁𝗮𝗹𝗹 𝗮𝗻𝗱 𝘀𝗵𝗶𝗻𝗶𝗻𝗴 𝗯𝗿𝗶𝗴𝗵𝘁 ✨Deepti Sharma is adjudged the Player of the Match for her fabulous all-round performance as #TeamIndia clinch victory 🔝👌Scorecard ▶️ https://t.co/92BPfF0bsf#SAvIND | @Deepti_Sharma06 pic.twitter.com/sYwLVZ2cUm— BCCI Women (@BCCIWomen) April 25, 2026

Punjab Kings registered the highest-ever run chase in IPL history5
ప్రపంచ రికార్డుపై ‘పంజా’బ్‌

ఆహా ఏమా మ్యాచ్‌... ఏమా కొట్టుడు! ఒకరిని మించి ఒకరు వంతులు వేసుకున్నట్లు... ప్రత్యర్థి బౌలర్లపై ఏదో పగ పట్టినట్లు... బంతిమీద ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లు... ఫోర్లు, సిక్స్‌లు ఒకటే మోత! మొదట కేఎల్‌ రాహుల్, నితీశ్‌ రాణా దంచి కొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ చరిత్రలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసుకుంటే... పంజాబ్‌ కింగ్స్‌ మరో 7 బంతులు మిగిలుండగానే దాన్నిఊదేసింది.ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ప్లేయర్‌గా కేఎల్‌ రాహుల్‌ రికార్డు సృష్టిస్తే... మేమేం తక్కువా అన్నట్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, శ్రేయస్‌ అయ్యర్‌ విశ్వరూపం చూపారు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్‌ తమ పేరిటే ఉన్న రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. రెండు జట్లు కలిపి 49 ఫోర్లు, 33 సిక్స్‌లు బాదిన ఈ మ్యాచ్‌లో మొత్తం 529 పరుగులు నమోదు కాగా... శనివారం అభిమానులు పైసా వసూల్‌ పరుగుల పండగను వీక్షించారు.న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని పంజాబ్‌ ఖాతాలో ఆరో విజయం చేరింది. శనివారం జరిగిన పోరులో పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేఎల్‌ రాహుల్‌ (67 బంతుల్లో 152 నాటౌట్‌; 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదం తొక్కగా... నితీశ్‌ రాణా (44 బంతుల్లో 91; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు.వీరిద్దరు రెండో వికెట్‌కు 220 పరుగులు జోడించడంతో... ఢిల్లీ కొండంత స్కోరు చేయగలిగింది. ఐపీఎల్‌ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో మూడో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రాహుల్‌ నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 265 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (26 బంతుల్లో 76; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (36 బంతుల్లో 71 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో విజృంభించగా... ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టాడు. రాహుల్‌ రాక్స్‌... ఈ సీజన్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆరంభం నుంచే... దూకుడుగా ఆడింది. మూడో ఓవర్‌లో నిసాంక (11) వెనుదిరగగా... అక్కడి నుంచి రాహుల్, రాణా మోత మొదలైంది. ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 68/1తో నిలిచింది. ఈ క్రమంలో రాహుల్‌ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... బార్ట్‌లెట్‌ వేసిన 12వ ఓవర్‌లో రాణా వరుసగా 6, 4, 4, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. అర్‌‡్షదీప్‌ ఓవర్‌లో 4, 6, 4, 4 కొట్టిన రాహుల్‌ యాన్సెన్‌ ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వైశాక్‌ వేసిన 16వ ఓవర్‌లో రాహుల్‌ 6, 6, 6, 4తో విజృంభించాడు. సెంచరీకి సమీపించిన నితీశ్‌ రాణా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్‌ కాగా... రాహుల్‌ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 6 ఓవర్లలో 116 పరుగులు కొండంత లక్ష్యం ముందున్నా పంజాబ్‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ , ప్రభ్‌సిమ్రన్‌ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించింది. అక్షర్‌ వేసిన మూడో ఓవర్‌లో రెండు సిక్స్‌లు ఒక ఫోర్‌తో ఆర్య 20 పరుగులు రాబట్టుకోగా... అఖీబ్‌ ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ 3 సిక్స్‌లు బాదాడు. ఐదో ఓవర్‌లో నటరాజన్‌ 9 పరుగులే ఇవ్వగా... ముకేశ్‌ వేసిన ఆరో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ 6 ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి పంజాబ్‌ 116 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా... శ్రేయస్‌ మిగిలిన పని పూర్తిచేశాడు. శ్రేయస్‌ క్యాచ్‌ మిస్‌ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఫీల్డింగ్‌ పేలవంగా సాగింది. విప్రాజ్‌ నిగమ్‌ వేసిన 15వ ఓవర్‌ చివరి బంతికి శ్రేయస్‌ ఇచ్చిన క్యాచ్‌ను కరుణ్‌ నాయర్‌ వదిలేశాడు. అదే ఓవర్‌లో నేహల్‌ వధేరా (25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) క్యాచ్‌ను ఒడిసి పట్టిన కరుణ్‌... శ్రేయస్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటికి పంజాబ్‌ విజయానికి 31 బంతుల్లో 63 పరుగులు అవసరం కాగా... శ్రేయస్‌ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. తదుపరి ఓవర్‌ రెండో బంతికి సైతం శ్రేయస్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మరోసారి కరుణ్‌ నాయర్‌ జారవిడిచాడు. దీన్ని సది్వనియోగ పరుచుకున్న అయ్యర్‌... అదే ఓవర్‌లో 6, 4, 6, 6 కొట్టి సమీకరణాన్ని సులభతరం చేశాడు. నటరాజన్‌ ఓవర్‌లోనూ 6, 4 బాదిన శ్రేయస్‌ 26 బంతుల్లో పిఫ్టీ మార్క్‌ దాటడంతో పాటు... శశాంక్‌ సింగ్‌ (19 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.152 ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ చేసిన స్కోరు. ఐపీఎల్‌లో ఓ భారత బ్యాటర్‌ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. అభిõÙక్‌ శర్మ (141) రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా క్రిస్‌ గేల్‌ (175; 2013లో), మెక్‌కల్లమ్‌ (158; 2008లో) తర్వాత లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌ రాహుల్‌.ఎన్‌గిడికి గాయం... పంజాబ్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్‌ ఎన్‌గిడి గాయపడ్డాడు. మిడాఫ్‌ ప్రాంతంలో బంతిని క్యాచ్‌ పట్టే క్రమంలో ఎన్‌గిడి కిందపడ్డాడు. దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో విప్రాజ్‌ నిగమ్‌ ‘కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌’గా మైదానంలోకి వచ్చాడు. కాగా మ్యాచ్‌ అనంతరం ఎన్‌గిడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది.⇒ 1 ఐపీఎల్‌లో ఇదే (265) అత్యధిక పరుగుల ఛేదన. 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పంజాబ్‌ కింగ్స్‌... ఇప్పుడు దానికంటే కాస్త ఎక్కువ స్కోరును ఛేదించింది.⇒ 220 రెండో వికెట్‌కు రాహుల్, నితీశ్‌ రాణా జోడించిన పరుగులు. ఐపీఎల్‌లో ఏ వికెట్‌కైనా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 2016లో విరాట్‌ కోహ్లి–ఏబీ డివిలియర్స్‌ జోడీంచిన 229 పరుగుల భాగస్వామ్యం ‘టాప్‌’లో ఉంది.⇒ 2 ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 5.2 ఓవర్లలో 100 పరుగుల మార్క్‌ అందుకుంది. ఐపీఎల్‌లో ఇది రెండో వేగవంతమైంది. 2024లో ఢిల్లీపైనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. ఓవరాల్‌గా పవర్‌ప్లే (6 ఓవర్లలో) పంజాబ్‌ 116 పరుగులు చేసి రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ 125తో అగ్ర స్థానంలో ఉంది.స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: నిసాంక (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) అర్‌‡్షదీప్‌ 11; రాహుల్‌ (నాటౌట్‌) 152; నితీశ్‌ (సి) శ్రేయస్‌ (బి) బార్ట్‌లెట్‌ 91; మిల్లర్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–28, 2–248. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–49–1; బార్ట్‌లెట్‌ 4–0–69–1; యాన్సెన్‌ 4–0–45–0; వైశాక్‌ 3–0–48–0; చాహల్‌ 4–0–42–0; స్టొయినిస్‌ 1–0–11–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ ఆర్య (సి) రిజ్వీ 43; ప్రభ్‌సిమ్రన్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 76; కూపర్‌ (బి) కుల్దీప్‌ 17; శ్రేయస్‌ (నాటౌట్‌) 71; నేహల్‌ (సి) (సబ్‌) కరుణ్‌ (బి) విప్రాజ్‌ 25; శశాంక్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–126, 2–132, 3–145, 4–201. బౌలింగ్‌: అఖీబ్‌ 2–0–41–0; ముకేశ్‌ 3–0–55–0; అక్షర్‌ 4–0–44–1; నటరాజన్‌ 3.5–0–54–0; కుల్దీప్‌ 4–0–46–2; విప్రాజ్‌ నిగమ్‌ 2–0–24–1.

IPL 2026: Sunrisers Hyderabad Beat Rajasthan Royals By 5 Wickets6
ఎస్ఆర్‌హెచ్ ఘన విజ‌యం.. పలు రికార్డులు బద్దలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్‌ జురేల్‌ (51) అర్థసెంచరీతో రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా, ప్రఫుల్ హింగే, కెప్టెన్ కమిన్స్‌, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు విజయాలు సాధించగా.. ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 10 పాయింట్లు సాధించి రాజస్తాన్‌తో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్తాన్‌ మూడో ఓటమితో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. 2023 సీజ‌న్ నుంచి రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఎస్ఆర్‌హెచ్‌కు ఇది వ‌రుస‌గా ఆరో విజ‌యం కావ‌డం విశేషం. గ‌తంలో సీఎస్‌కే (2010 నుంచి 2013 మధ్య‌) రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఆరు వ‌రుస విజ‌యాలు సాధించింది. 2019 నుంచి 2022 మ‌ధ్య ఆర్సీబీ.. రాజ‌స్తాన్‌పై 5 వ‌రుస విజ‌యాలు అందుకుంది. 2018 నుంచి 2020 మ‌ధ్య ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఐదు వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసింది.ఐపీఎల్‌లో 200 ప్ల‌స్ ప‌రుగుల ల‌క్ష్యాన్ని విజ‌య‌వంతంగా ఛేదించ‌డం ఎస్ఆర్‌హెచ్‌కు ఇది ఐదోసారి. ఇక పంజాబ్ కింగ్స్ 11 సార్లు 200 ప్ల‌స్ స్కోర్లు ఛేదించి తొలి స్థానంలో ఉండ‌గా, ముంబై ఇండియ‌న్స్ (ఆరు సార్లు) రెండో స్థానంలో కొన‌సాగుతోంది. రాజ‌స్తాన్‌, ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌లు ఐదేసి సార్లు ఛేదించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు ఛేదించిన జట్ల‌లో ఎస్ఆర్‌హెచ్ చోటు ద‌క్కించుకుంది. రాజ‌స్తాన్‌పై 229 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్‌హెచ్ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాలు పంజాబ్ కింగ్స్ (ఢిల్లీపై 265, కేకేఆర్‌పై 262 ప‌రుగుల టార్గెట్‌), ఎస్ఆర్‌హెచ్ (పంజాబ్‌పై 246 ప‌రుగుల టార్గెట్‌) మూడో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఆర్సీబీ (ల‌క్నోపై 228 ప‌రుగుల టార్గెట్‌) ఉంది.జైపూర్ వేదిక‌పై రాజ‌స్తాన్‌పై 228 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించిన ఎస్ఆర్‌హెచ్ త‌న రికార్డును తానే మెరుగుప‌రుచుకుంది. 2023లో ఇదే రాజ‌స్తాన్‌పై 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ఆ రికార్డును స‌వ‌రించింది.4️⃣h consecutive win ✅4️⃣th highest successful chase in #TATAIPL history ✅#SRH paint the Pink City ORANGE with a clinical win 🎨🧡Scorecard ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @SunRisers pic.twitter.com/bKWZOIAgZo— IndianPremierLeague (@IPL) April 25, 2026

Vaibhav Sooryavanshi is off the field due to injury7
వైభవ్ సూర్యవంశీకి తీవ్ర గాయం.. ఐపీఎల్‌ నుంచి అవుట్‌?

ఐపీఎల్‌-2026లో భాగంగా జైపూర్ వేదికగా సన్‌రైజర్స్‌​ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్యవంశీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో వైభవ్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు.వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయినా కొంచెం అతడికి నొప్పి తగ్గలేదు. వైభవ్ నడిచేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇది నిజంగా రాజస్తాన్ రాయల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. వైభవ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా భారీ సెంచరీతో సూర్యవంశీ చెలరేగాడు. కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే టోర్నీ కీలక సమయంలో వైభవ్ గాయపడడం రాజస్తాన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఒక‌వేళ వైభ‌వ్ గ్రేడ్‌-3లో ఉన్న‌ట్ల‌యితే పూర్తిగా కోలుకోవ‌డానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జరిగితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ను వైభవ్‌ వైదొలగనున్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు అతడితో పాటు పాటు ధ్రువ్‌ జురెల్‌(51), ఫెరీరా(33) రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్‌, షకీబ్‌ హసన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలా వికెట్‌ సాధించారు.

PL 2026: Runs rack up, catches go down, records tumble in PBKS vs DC Match8
ఒకే మ్యాచ్‌లో 529 పరుగులు.. 33 సిక్స్‌లు, 49 ఫోర్లతో

ఐపీఎల్‌-2026లో భాగంగా శ‌నివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అభిమానుల‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో మైదానంలో సంతోషం, ఉత్కంఠ‌, భ‌యం అన్నీ క‌న్పించాయి.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఐపీఎల్‌లో ఢిల్లీకి ఇదే అత్య‌ధిక స్కోర్‌. దీంతో ఢిల్లీ విజ‌యం ఖాయ‌మ‌ని అంతా భావించారు. కానీ యువ ఆట‌గాళ్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడుతూ ఢిల్లీపై ఒత్తిడి పెంచారు. అయితే ఓ వైపు పంజాబ్ ఓపెన‌ర్లు విధ్వంసం కొన‌సాగుతుండ‌గా.. మ‌రోవైపు మైదానం మొత్తం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ బౌల‌ర్ లుంగి ఎంగిడీ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బంతిని అందుకునే క్ర‌మంలో ఎంగిడీ త‌ల‌కు బ‌ల‌మైన గాయమైంది. అంబులెన్స్‌లో అత‌డిని ఆస్ప‌త్రికి త‌రలించారు.దీంతో మైదానంలో కాసేపు టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మ‌ళ్లీ మ్యాచ్ ప్రారంభ‌మ‌య్యాక పంజాబ్ విధ్వంసం కొన‌సాగింది. ఓపెన‌ర్లు ఔట‌య్యాక శ్రేయ‌స్ అయ్య‌ర్ (71 నాటౌట్‌; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఫ‌లితంగా ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. టీ20 క్రికెట్‌లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్‌ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది.49 ఫోర్లు.. 33 సిక్స‌ర్లు.. 529 ర‌న్స్‌మొత్తంగా ఈ మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర్షం కురిసింది. ఇరు జ‌ట్లు క‌లిపి మొత్తంగా 529 ప‌రుగులు చేశాయి. అదేవిధంగా పంజాబ్‌, ఢిల్లీ బ్యాట‌ర్లు క‌లిసి 49 ఫోర్లు, 33 సిక్సర్లు బాదారు. కాగా లెక్కలేనన్ని డ్రాప్ క్యాచ్‌లు ఈ మ్యాచ్ ఫ‌లితాన్ని నిర్ణ‌యించాయి. తొలుత కేఎల్ రాహుల్ క్యాచ్‌ను 12 ప‌రుగుల వ‌ద్ద శ‌శాంక్ సింగ్ విడిచిపెట్టాడు.ఫ‌లితంగా రాహుల్ భారీ సెంచ‌రీతో కదం తొక్కాడు. ఆ త‌ర్వాత పంజాబ్ ఇన్నింగ్స్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇచ్చిన రెండు ఈజీ క్యాచ్‌ల‌ను క‌రుణ్ నాయ‌ర్ జార‌విడిచాడు. దీంతో అయ్య‌ర్ అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.చదవండి: IPL 2026: లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్‌ అప్‌డేట్‌

Vaibhav Sooryavanshi Scripts IPL History, Breaks Multiple Records With 36-Ball Hundred9
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు వరల్డ్‌ రికార్డ్స్‌ బ్రేక్‌

ఐపీఎల్‌-2026లో జైపూర్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌లనం వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసక‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. వైభవ్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఉతికారేశాడు.గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సైతం చుక్కలు చూపించాడు. సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.వైభవ్ మొత్తంగా 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే మ్యాచ్‌లో తన హాఫ్ సెంచరీని వైభవ్ కేవలం 15 బంతుల్లోనే సాధించాడు. వైభవ్ ఈ ఏడాది సీజన్‌లో హాఫ్ సెంచరీ కేవలం 15 బంతుల్లో పూర్తి చేయడం ఇది మూడోసారి. ఈ క్రమంలో వైభవ్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్‌ సాధించిన సంచలన రికార్డులు ఇవే👉ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. వైభవ్ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(గేల్ 21 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.👉టీ20 ఫార్మాట్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ వరల్డ్ రికార్డు సాధించాడు. కేవలం 26 ఇన్నింగ్స్‌ల్లోనే సూర్యవంశీ ఈ రికార్డును అందుకున్నాడు.👉ఐపీఎల్‌లో 20 ఏళ్ల లోపు వయసులో 5 కంటే ఎక్కువసార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.👉ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు. వైభవ్ మూడు సార్లు ఈ ఘనతను అందుకున్నాడు.👉అదేవిధంగా ఇది ఐపీఎల్‌లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. తొలి స్ధానంలో క్రిస్ గేల్‌(30) ఉండగా.. సెకెండ్ ప్లేస్‌లో సూర్యవంశీ(35)నే ఉన్నాడు.Records under threat every time he bats 🔥Vaibhav Sooryavanshi hits a 36-ball century, third-fastest in #TATAIPL history. #TATAIPL 2026 | #RRvSRH | LIVE NOW 👉https://t.co/HHSiOA288w pic.twitter.com/NggaHKljUS— Star Sports (@StarSportsIndia) April 25, 2026

Lungi Ngidi stable after head injury at Arun Jaitley Stadium10
లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్‌ అప్‌డేట్‌

ఐపీఎల్‌-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్పీడ్ స్టార్ లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. తలకు బ‌ల‌మైన గాయం కావ‌డంతో అత‌డిని వెంట‌నే అంబులెన్స్‌లో పూసా రోడ్డులోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా అత‌డి ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఎంగిడీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, త్వ‌ర‌లోనే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ కానున్న‌ట్లు ఢిల్లీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, ఆర్‌సీబీ వంటి ఫ్రాంచైజీలు కూడా ఎంగిడీ త్వ‌రంగా కోలుకోవాల‌ని పోస్ట్‌లు పెట్టారు.అస‌లేమి జ‌రిగిందంటే?ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో అక్షర్ పటేల్ వేసిన మూడో బంతిని ప్రియాన్ష్‌ ఆర్య మిడాఫ్‌ భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కాక‌పోవ‌డంతో బంతికి గాల్లోకి లేచింది. మిడాఫ్‌లో ఉన్న ఎంగిడీ బంతిని అందుకునేందుకు వెనుకకు పరిగెత్తాడు. బంతిని అందుకు క్ర‌మంలో ఎంగిడీ బ్యాలెన్స్ కోల్పోయి కింద‌ప‌డిపోయాడు. ఈ క్ర‌మంలో అత‌డి త‌ల వెనుక భాగం మైదానంకు బ‌లంగా తాకింది. మెడ నొప్పి, తీవ్రమైన తలనొప్పితో బాధ‌ప‌డ్డాడు. వెంట‌నే ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన‌ప్ప‌టికి అతడికి ఏ మాత్రం రీలీఫ్ రాలేదు. దీంతో మైదానం నుంచి నేరుగా ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల్సి వ‌చ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓట‌మి పాలైంది. పంజాబ్ రికార్డు ఛేజింగ్ చేసింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement