ప్రధాన వార్తలు
చితక్కొట్టాడు.. యువీ దెబ్బకు అల్లాడినా..
ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు స్టువర్ట్ బ్రాడ్. టెస్టుల్లో ఏకంగా 604 వికెట్లు కూల్చి.. సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 178 వన్డే, 65 అంతర్జాతీయ టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.ఇంతటి గొప్ప రికార్డు కలిగి ఉన్న స్టువర్ట్ బ్రాడ్కు కెరీర్ ఆరంభంలోనే ఓ చేదు అనుభవం ఎదురైంది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007లో టీమిండియా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) బ్రాడ్కు పీడకల మిగిల్చాడు. అతడి బౌలింగ్లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది.. అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్గా చరిత్రకెక్కాడు.21 ఏళ్ల వయసులో..మరోవైపు.. ఇలా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా బ్రాడ్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 క్రికెట్లో యువీ ఐకానిక్ ఫీట్ నమోదు చేసిన ఆ సమయంలో.. ఈ రైటార్మ్ పేసర్ వయసు 21 ఏళ్లే. అయితే, ఆ చేదు అనుభవం నుంచి బ్రాడ్ త్వరగానే కోలుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి మేటి బౌలర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.యువీ దెబ్బకు అల్లాడినా..తాజాగా... గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న స్టువర్ట్ బ్రాడ్.. యువీ దెబ్బకు అల్లాడినా.. ఆ తర్వాత ఎలా నిలదొక్కుకున్నాడో చెప్పుకొచ్చాడు. ‘‘అప్పటికి నేను ఏడు నుంచి ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడి ఉంటాను. ఇంకా టెస్టు క్రికెట్లో అరంగేట్రమే చేయలేదు. అప్పుడు నా జట్టు పొడవుగా.. బంగారు వర్ణంలో ఉండేది.ఐదేళ్ల కెరీర్ సేవ్ అయింది20-21 ఏళ్ల మధ్య వయసు. ఉరకలెత్తే ఉత్సాహం. అలాంటపుడు ఊహించని విధంగా.. నా ముఖం మీద కొట్టినట్లుగా బ్యాటర్ బాదుతూ ఉంటే నేను ఏమైపోవాలి?.. అయితే, ఆట ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆరంభంలోనే అంతా సజావుగా సాగిపోతే 26-27 ఏళ్లకే అంతా సాధించేశాము అన్న భావన వచ్చేస్తుంది. అంకితభావం కొరవడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.వారియర్ మోడ్ఫామ్లో లేకుంటే జట్టు నుంచి తప్పించనూ వచ్చు. 31 ఏళ్లు వచ్చే సరికి అంతా ముగిసిపోతుంది. కానీ నాకు 21 ఏళ్ల వయసులో తగిలిన ‘దెబ్బ’ నాలో కసిని రగిల్చింది. మరుసటి ఐదేళ్లు ఎలా ఆడాలో.. ఆటను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలిసేలా చేసింది. నన్ను ‘వారియర్ మోడ్’లోకి తీసుకువెళ్లింది.ప్రతి మ్యాచ్కు ముందు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా చేసింది. అలా 25-26 ఏళ్ల వయసు వచ్చే సరికి ఎలైట్ పర్ఫార్మర్ కావాలనే కోరిక పెరిగింది. అందకు తగినట్లుగా కృషి చేశా. కానీ ఒక్కోసారి నా శరీరం ఇందుకు సహకరించలేదు. కాబట్టి అనుకున్నది అనుకున్న సమయంలో సాధించకలేకపోయాను.అందుకే ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేనింకా మెరుగ్గా ఆడాల్సింది అని అనిపిస్తుంది’’ అని మాథ్యూ హెడెన్ పాడ్కాస్ట్లో స్టువర్ట్ బ్రాడ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా 344 మ్యాచ్లలో కలిపి 847 వికెట్లు కూల్చిన 39 ఏళ్ల బ్రాడ్.. 2023లో ఆటకు గుడ్బై చెప్పాడు.చదవండి: బంగ్లాదేశ్కు భారీ షాక్
బంగ్లాదేశ్ అంత పని చేసిందా?.. నేనే తప్పుకొన్నా!
భారత్- బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ వివాదం ముదురుతోంది. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాళ్లను తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ తమ జట్టులో ఉన్న ముస్తాఫిజుర్ రహమాన్ను విడుదల చేసింది.షాకిచ్చిన ఐసీసీఈ క్రమంలో బంగ్లాదేశ్ టీమిండియా టూర్కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయగా.. ఈ పర్యటనపై తాము నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్కు రాబోమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు ప్రగల్భాలు పలకగా.. ఐసీసీ ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైనందున యథావిధిగా మ్యాచ్లు సాగుతాయని స్పష్టం చేసింది.బంగ్లాదేశ్ అంత పని చేసిందా?ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నుంచి భారత స్పోర్ట్స్ ప్రజెంటర్ రిధిమా పాఠక్ (Ridhima Pathak)ను తొలగించారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ఆమె స్వయంగా స్పందించింది. తనకు దేశమే మొదటి ప్రాధాన్యం అని.. అందుకే తానే లీగ్ నుంచి వైదొలిగినట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.దేశం కోసం నేనే తప్పుకొన్నా!‘‘నన్ను బీపీఎల్ నుంచి తొలగించారని గత కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. ఈ లీగ్ నుంచి తప్పుకోవాలనే నేనే నిర్ణయించుకున్నాను. దేశ ప్రయోజనాలే నాకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం.అదే విధంగా ఆట పట్ల కూడా నాకు నిబద్ధత ఉంది. ఇన్నాళ్లుగా స్పోర్ట్స్ ప్రజెంటర్గా నిజాయితీ, అంకితభావం, గౌరవం, ప్యాషన్తో పనిచేశాను. దీనిలో ఇక ముందు కూడా ఎలాంటి మార్పూ ఉండదు. క్రికెట్ సమగ్రత కోసం నేను ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఉంటాను.ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. క్రికెట్ విషయంలో నిజం చెప్పడం ముఖ్యం. ఇకపై ఈ అంశం గురించి నేను స్పందించను. జై హింద్’’ అని రిధిమా పాఠక్ పేర్కొంది. చదవండి: సచిన్ కొడుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్మనీ రూ. 675 కోట్లు
మెల్బోర్న్: ఈ సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో పోటీపడే టెన్నిస్ ప్లేయర్ల ప్రైజ్మనీ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. టోర్నీ మొత్తం ప్రైజ్మనీ 111.5 మిలియన్ ఆసీస్ డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ. 675 కోట్లు. గత ఏడాది ప్రైజ్మనీ 96.5 మిలియన్ ఆసీస్ డాలర్ల (రూ.584 కోట్లు)తో పోల్చితే 16 శాతం పెరిగిందని టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ క్రెయిగ్ టిలే వెల్లడించారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 4.15 మిలియన్ ఆసీస్ డాలర్లు (రూ.25.15 కోట్లు) చొప్పున అందజేస్తారు. సింగిల్స్ విజేతల ప్రైజ్మనీ ఏకంగా 19 శాతం పెంచారు. అలాగే మెయిన్ డ్రా ఆడే సింగిల్స్, డబుల్స్ ఆటగాళ్ల ప్రైజ్మనీ కూడా 10 శాతం మేర పెంచినట్లు నిర్వాహకులు ఆయన తెలిపారు. 2023 నుంచి టెన్నిస్ ప్లేయర్లకు ప్రోత్సాహకాలను భారీ పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 18 నుంచి మెల్బోర్న్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ జరుగుతుంది. క్వార్టర్స్లో సాకేత్ జోడీ బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకెత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మంగళవారం సాకేత్ మైనేని–ఆదిల్ కల్యాణ్పూర్ జోడీ 7–6 (7/3), 4–6, 13–11తో సుమిత్ నగాల్ (భారత్)–లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయంపై పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్లో సాకేత్ జంట 3 ఏస్లు బాదగా... సుమిత్ నగాల్ ద్వయం 8 ఏస్లు సంధించింది. 3 డబుల్ ఫాల్ట్లు చేసిన సాకేత్–ఆదిల్ జోడీ... ఒక బ్రేక్ పాయింట్ సాధించింది. సాకేత్ జంట మొత్తం 78 పాయింట్లు గెలుచుకోగా... నగాల్ ద్వయం 69 పాయింట్లకు పరిమితమైంది. గురువారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో ఆర్థర్ రేమాండ్–లుకా సాంచెజ్ (ఫ్రాన్స్) ద్వయంతో... సాకేత్–ఆదిల్ జంట అమీతుమీ తేల్చుకోనుంది.
కొనసాగుతున్న వైభవ్ సూర్యవంశీ విధ్వంసాల పర్వం
భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. ఈ ఫార్మాట్, ఆ ఫార్మాట్ అన్న తేడా లేకుండా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం భారత అండర్-19 జట్టులో భాగంగా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న అతను.. ఇవాళ (జనవరి 7) జరుగుతున్న మూడో యూత్ వన్డేలో మెరుపు అర్ద శతకం (24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 11 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. వైభవ్ (29 బంతుల్లో 57), ఆరోన్ జార్జ్ (38 బంతుల్లో 53) అర్ద సెంచరీలు పూర్తి చేసుకుని ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 2-0తో కైవసం చేసుకుంది.గత మ్యాచ్లోనూ ఇంతే..!వైభవ్ గత మ్యాచ్లోనూ (రెండో వన్డే) ఇదే తరహాలో మెరుపు అర్ద సెంచరీ (68) చేశాడు. అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై ఉగ్రరూపం దాల్చి (190) తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దానికి ముందు అండర్-19 ఆసియా కప్లో యూఏఈపై విధ్వంసకర శతకం (171) బాదాడు. అదే టోర్నీలో మలేషియాపై మెరుపు అర్ద సెంచరీ చేశాడు.ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవలికాలంలో వైభవ్ ప్రతి రెండు, మూడు ఇన్నింగ్స్లకు ఓ సుడిగాలి అర్ద శతకం కానీ మెరుపు శతకం కానీ చేశాడు. త్వరలో జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్కు వైభవే కెప్టెన్.అండర్-19 ప్రపంచకప్ జింబాబ్వే, నమీబియా వేదికలుగా జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆయుశ్ మాత్రే సారథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల భారత యువ జట్టు ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతిలో ఓడిపోయి కసితో రగిలిపోతుంది.
సచిన్ కొడుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంటి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి ఏకైక కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ ముహూర్తం ఖరారయ్యింది. ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు సానియా ఛందోక్ను అర్జున్ మనువాడనున్నాడు. వీరి వివాహం మార్చి 5న జరుగనుందని నివేదికలు చెబుతున్నాయి. అధికారిక సమాచారమైతే లేదు. వివాహ వేడుకలు మార్చి 3న ప్రారంభమవుతాయని తెలుస్తుంది. ఎక్కువ భాగం కార్యక్రమాలు ముంబైలోనే జరగనున్నట్లు సమాచారం. అతిథుల జాబితాను కూడా ఇరు కుటుంబాలు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అర్జున్–సానియా చిన్ననాటి నుంచి స్నేహితులు. టెండూల్కర్–ఘై కుటుంబాల మధ్య ఉన్న బంధం వారి స్నేహాన్ని మరింత బలపరిచింది. గతేడాది ఆగస్ట్లో అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడకను ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. కొద్ది రోజుల తర్వాత సచిన్ ఓ వ్యక్తిగత కార్యక్రమంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. సానియా Mr. Paws అనే లగ్జరీ పెట్ స్పా వ్యవస్థాపకురాలు. అదే సంస్థకు ఆమె డైరెక్టర్గానూ ఉన్నారు.అర్జున్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను గోవా తరఫున విజయ్ హజారే ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో అతను ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. అర్జున్ను ఇటీవల ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్ ద్వారా 30 లక్షల బేస్ ధరకే ముంబై ఇండియన్స్ నుంచి దక్కించుకుంది. లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన 26 ఏళ్ల అర్జున్ దేశవాలీ క్రికెట్లో, ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాకు ఎంపిక కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే అతని కల సాకారం కావడం లేదు.
చరిత్ర సృష్టించిన డుప్లెసిస్
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పొట్టి క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని (429 మ్యాచ్ల్లో) తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన పదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అత్యంత లేటు వయసులో (41 ఏళ్ల 178 రోజులు) ఈ మార్కును తాకిన ఆటగాడిగా షోయబ్ మాలిక్ రికార్డును (40 ఏళ్ల 315 రోజులు) బద్దలు కొట్టాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో భాగంగా ఎంఐ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసిన అనంతరం ఈ ఘనత సాధించాడు.పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు.. - క్రిస్ గేల్ – 14,562 - కీరన్ పోలార్డ్ – 14,462 - అలెక్స్ హేల్స్ – 14,449 - డేవిడ్ వార్నర్ – 13,836 - షోయబ్ మాలిక్ – 13,571 - జోస్ బట్లర్ – 13,554 - విరాట్ కోహ్లీ – 13,543 - జేమ్స్ విన్స్ – 12,854 - రోహిత్ శర్మ – 12,248 - ఫాఫ్ డుప్లెసిస్ – 12,002పొట్టి క్రికెట్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు.. - ఫాఫ్ డుప్లెసిస్ – 12,002 - క్వింటన్ డి కాక్ – 11,813 - డేవిడ్ మిల్లర్ – 11,631 - రిల్లీ రొస్సో – 9,705 - ఏబీ డివిలియర్స్ – 9,424 మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్ రాణించినా సూపర్ కింగ్స్పై ఎంఐ కేప్టౌన్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 44 పరుగులు చేసిన డుప్లెసిస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. కేప్టౌన్ బౌలర్లలో కార్బిన్ బాష్ 3 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఎంఐ జట్టు 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పూరన్ (33, 5 సిక్సర్లు), జేసన్ స్మిత్ (22, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడి ఎంఐని గెలిపించారు. ఆదిలో డస్సెన్ (35) పర్వాలేదనిపించాడు. ఈ గెలుపుతో ఎంఐ సీజన్లో బోణీ కొట్టింది.
తొలి శతకంతోనే చరిత్రపుటల్లోకెక్కిన ఇంగ్లండ్ యువ ఆటగాడు
సిడ్నీ వేదికగా జరుగుతున్న యాషెస్ చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ సెంచరీతో కదంతొక్కాడు. 22 ఏళ్ల బేతెల్కు టెస్ట్ల్లో ఇది తొలి శతకం. ఈ శతకంతో అతడు రికార్డుపుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియాపై 22 ఏళ్లలోపు శతకం చేసిన తొమ్మిదో ఇంగ్లండ్ బ్యాటర్ అయ్యాడు. ఈ జాబితాలో జానీ బ్రిగ్స్, జాక్ హెర్న్, పటౌడి, కాలిన్ కౌడ్రే, డేవిడ్ గోవర్, మైక్ అథర్టన్, అలిస్టర్ కుక్, బెన్ స్టోక్స్ ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. బేతెల్ తన అద్భుత శతకంతో ఇంగ్లండ్ను ఆధిక్యం దిశగా నడిపించాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఏడు డాట్ బాల్స్ ఆడిన బేతెల్ వెబ్స్టర్ బౌలింగ్లో బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు (162 బంతుల్లో). బేతెల్ సెంచరీ చేసిన అనంతరం అక్కడే మైదానంలో ఉన్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.నాలుగో రోజు చివరి సెషన్ సమయానికి బేతెల్ 131 పరుగుల వద్ద ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా బ్రైడన్ కార్స్ (11) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి పోరాడుతుంది. బేతెల్ పుణ్యమా అని ఆ జట్టు 107 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఈ ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బేతెల్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. డకెట్, బ్రూక్ తలో 42 పరుగులు చేయగా.. జేమీ స్మిత్ 26, జాక్ క్రాలే 1, రూట్ 6, స్టోక్స్ 1, విల్ జాక్స్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో వెబ్స్టర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, బోలాండ్, నెసర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు హెడ్ (163), స్టీవ్ స్మిత్ (138) సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 567 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా బ్యాటరల్లో వెబ్స్టర్ 71 (నాటౌట్), వెదర్లాడ్ 21, లబూషేన్ 48, మైఖేల్ నెసర్ 24, కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా 17, అలెక్స్ క్యారీ 16, గ్రీన్ 37 , స్టార్క్ 5, బోలాండ్ డకౌయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, టంగ్ తలో 3, స్టోక్స్ 2, జాక్స్, బేతెల్ తలో వికెట్ తీశారు. దీనికి ముందు జో రూట్ (160) సెంచరీతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు. కాగా,ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్కు భారీ షాక్
భారత్లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో తమ మ్యాచ్లను ఇతర దేశానికి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్, వేదికల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. భారత్లో ఆడకపోతే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఈ విషయాలను ఐసీసీ వర్చువల్ సమావేశం ద్వారా బీసీబీకి తెలియజేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..?ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రతరమయ్యాయి. కొన్ని రాజకీయ ప్రేరేపిత శక్తులు ఏకంగా ఆరుగురు హిందువులను కిరాతకంగా చంపేశాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ ప్లేయర్ను ఐపీఎల్లో ఆడించకూడదని భారత్లో నిరసనలు వెల్తువెత్తాయి. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగి ముస్తాఫిజుర్ను ఐపీఎల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించాలని కేకేఆర్కు అల్టిమేటం జారీ చేసింది. తప్పేదేమీ లేక కేకేఆర్ ముస్తాఫిజుర్ను కాంట్రాక్ట్ నుంచి తొలిగించింది.తమ దేశ ఆటగాడిని ఐపీఎల్ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్ను బ్యాన్ చేసింది. భారత్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అలాగే తమ దేశానికి చెందిన అంపైర్లు భారత్లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్ల్లో పాల్గొనరని స్పష్టం చేసింది.ప్రపంచకప్ మ్యాచ్ల వేదికల మార్పుకు ఐసీసీ ససేమిరా అంటున్న నేపథ్యంలో బీసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ సాహసం చేసి భారత్లో మ్యాచ్లు ఆడకపోతే, ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.
టీ20 ప్రపంచకప్ 2026కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 7) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. ఉపఖండపు పరిస్థితుల దృష్ట్యా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పిన్ హెవీ టీమ్ను ఎంపిక చేసింది. జట్టులో నలుగురు స్పిన్నర్లకు (సాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్, రచిన్) అవకాశం కల్పించింది.ఆర్సీబీ స్టార్ బౌలర్, గతేడాది లీడింగ్ వికెట్ టేకర్ జేకబ్ డఫీ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కైల్ జేమీసన్ ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపికయ్యాడు. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ పితృత్వ సెలవుల కారణంగా కొన్ని మ్యాచ్లు మిస్ అవుతారు. వీరిద్దరు గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.ఈ జట్టుకు ఎంపికైన మరో ముగ్గురు (ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, సాంట్నర్) కూడా గాయాల నుంచి కోలుకునే క్రమంలో ఉన్నారు. కాగా, ప్రపంచకప్లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ గ్రూప్-డిలో ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 8న చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది.దీనికి ముందు న్యూజిలాండ్ భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతుంది. ఈ సిరీస్ల్లో భాగంగా జనవరి 11 నుంచి మూడు వన్డేలు జరుగుతాయి. తొలి వన్డే వడోదరలో.. రెండో వన్డే రాజ్కోట్లో (జనవరి 14), మూడో వన్డే ఇండోర్లో (జనవరి 18) జరుగనున్నాయి. అనంతరం జనవరి 21 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్పూర్, రాయ్పూర్, గౌహతి, వైజాగ్, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో నలుగురిని మార్చి ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసింది.టీ20 ప్రపంచకప్కు న్యూజిలాండ్ జట్టు- మిచెల్ సాంట్నర్ (కెప్టెన్) - ఫిన్ అలెన్ - మైఖేల్ బ్రేస్వెల్ - మార్క్ చాప్మన్ - డెవాన్ కాన్వే - జేకబ్ డఫీ - లాకీ ఫెర్గుసన్ - మ్యాట్ హెన్రీ - డారిల్ మిచెల్ - ఆడమ్ మిల్నే - జేమ్స్ నీషమ్ - గ్లెన్ ఫిలిప్స్ - చిన్ రవీంద్ర - టిమ్ సీఫర్ట్ - ఇష్ సోధీ ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ జేమిసన్
విడాకుల తర్వాత మళ్లీ కలవనున్న చహల్, ధనశ్రీ వర్మ..?
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్–ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మ విడాకుల తర్వాత మళ్లీ కలవనున్నారని తెలుస్తుంది. ‘ది 50’ అనే రియాలిటీ షోలో ఇద్దరూ జంటగా ఒకే వేదికపై కనిపించబోతున్నారని సమాచారం. ఈ విషయంపై అధికారిక సమాచారం లేనప్పటికీ.. సోషల్మీడియా కోడై కూస్తుంది.‘ది 50’ షోలో చహల్, ధనశ్రీ పేర్లు టెంటేటివ్ లైనప్లో ఉన్నాయని సమాచారం. ఈ షోలో ఒర్రీ, ఎమివే బంటై, నిక్కీ తంబోలి, శ్వేతా తివారి, అంకితా లోఖండే, శివ్ ఠాకరే, కుషా కపిలా, శ్రీశాంత్, ఊర్ఫీ జావేద్, తాన్యా మిట్టల్, ఫైసల్ షేక్ వంటి ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ ది 50 షోలో చహల్, ధనశ్రీ కనిపిస్తే విడాకుల తర్వాత ఈ ఇద్దరు పబ్లిక్ ప్లాట్ఫామ్పై కలిసి కనిపించడం మొదటిసారి అవుతుంది. చహల్, ధనశ్రీ 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆతర్వాత కొద్దికాలం పాటు వీరి వివాహ బంధం సజావుగా సాగింది. కలిసి ఉన్నంతకాలం వీరు అనునిత్యం సోషల్మీడియాలో ఉండేవారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ వీరిద్దరు విడాకులకు అప్లై చేశారు. 18 నెలలు వేర్వేరుగా నివసించిన తర్వాత 2025లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. బాంద్రా ఫ్యామిలీ కోర్టు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. చహల్ రూ. 4.75 కోట్ల భరణం చెల్లించినట్లు సమాచారం.విడాకుల తర్వాత వీరిద్దరి మధ్య కొంతకాలం పాటు సోషల్మీడియా వార్ జరిగింది. ఒకరి వ్యాఖ్యలకు ఒకరు కౌంటర్లిస్తూ పోయారు. ఈ క్రమంలో చహల్ RJ మహ్వష్తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ పబ్లిక్లో కనిపించడం, ఐపీఎల్ మ్యాచ్ల్లో మహ్వష్ చహల్కు సపోర్ట్ చేయడం ఈ రూమర్స్కు బలం చేకూరుస్తున్నాయి.ఇదిలా ఉంటే, ధనశ్రీ వర్మ-చహల్ ఒకే వేదికపై జంటగా కలిసిన తర్వాత, మనసుల మార్చుకొని తిరిగి ఒకటైతే ఆర్జే మహ్వశ్ పరిస్థితి ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ధనశ్రీతో విడాకుల తర్వాత చహల్ మహ్వశ్తో చట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఇప్పుడు మాజీ భార్య మళ్లీ దగ్గరైతే మహ్వశ్ ఏం చేస్తుంది..? ఈ అంశంపై సోషల్మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
నేటి నుంచి ‘ఎలైట్’ జాతీయ బాక్సింగ్
న్యూఢిల్లీ: భారత అత్యుత్తమ బాక్సర్లు పాల్గొంటున్న ...
జోయెర్డ్ మరీన్ మళ్లీ వచ్చాడు...
న్యూఢిల్లీ: నెదర్లాండ్స్కు చెందిన జోయెర్డ్ మరీన్...
అమన్, అంతిమ్పై నజర్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు అమన్ సెహ్రావత్...
టాప్స్లో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స...
బంగ్లాదేశ్కు భారీ షాక్
భారత్లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 20...
టీ20 ప్రపంచకప్ 2026కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయ...
విడాకుల తర్వాత మళ్లీ కలవనున్న చహల్, ధనశ్రీ వర్మ..?
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్–ఇ...
ముస్తాఫిజుర్ రహ్మాన్ సంచలన నిర్ణయం
ఐపీఎల్-2026 నుంచి తొలగించబడ్డ బంగ్లాదేశీ ఆటగాడు మ...
క్రీడలు
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
నా సూపర్స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
వీడియోలు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!
సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్
భారత్ సిరీస్ క్లీన్ స్వీప్.. శ్రీలంక చిత్తు..
మహిళా క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్
సిరీస్ పై భారత్ ఫోకస్
ఇషాన్ ఊచకోత.. MS ధోని రికార్డు బ్రేక్
