Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sachin Tendulkar gifts his shirt to U19 World Cup hero Ayush Mhatre 1
‘ఎంతో ఎత్తుకు ఎదగాలి’

అండర్‌–19 ప్రపంచ కప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన కెపె్టన్‌ ఆయుశ్‌ మాత్రేకు అరుదైన ప్రత్యేక ప్రశంస లభించింది. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ స్వయంగా మాత్రేను అభినందించి అతని విజయంపై శుభాకాంక్షలు చెప్పాడు. 2013లో తాను ఆడిన ఆఖరి టెస్టు సిరీస్‌లో ధరించిన జెర్సీని కూడా సచిన్‌ బహుమతిగా అందజేశాడు. ముంబైకి చెందిన మాత్రే కెరీర్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్ని విజయాలు సాధించాలని సచిన్‌ ఆకాంక్షించాడు. మాత్రే ఇప్పటికే రెండు సీజన్లలో కలిపి ముంబై తరఫున 13 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు.

Play the match against India: Government orders the Pakistan team2
భారత్‌తో మ్యాచ్‌ ఆడండి: పాకిస్తాన్‌ జట్టుకు ప్రభుత్వ ఆదేశం

టి20 వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌ ఆడమంటూ మొండికేసిన పాకిస్తాన్‌ జట్టు వెనక్కి తగ్గింది. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌లో టీమిండియాతో తలపడాలని ఆ దేశ ప్రభుత్వం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ను ఆదేశించింది. క్రికెట్‌ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లనుంచి వచ్చిన అభ్యర్థనలకు స్పందిస్తూ భారత్‌తో మ్యాచ్‌కు పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ఓకే చెప్పారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతక ముందు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ), పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సంజోగ్‌ గుప్తా వెల్లడించారు. వరల్డ్‌ కప్‌నుంచి దూరమైన బంగ్లాదేశ్‌కు మద్దతు పలకడంతో పాటు పలు డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది. వీటిపై ఐసీసీ సానుకూలంగా స్పందించింది. బంగ్లా బోర్డుపై ఎలాంటి జరిమానాలు, ఆంక్షలు విధించమని హామీ ఇవ్వడంతో పాటు 2028 నుంచి 2031 మధ్య ఒక ఐసీసీ ఈవెంట్‌కు బంగ్లా ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని కూడా ఐసీసీ చెప్పింది.

Icc Meeting Latest Update And No Action On Bangladesh Cricket Board3
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్

భారత్‍-శ్రీలంక వేదికగా ప్రస్తుతం టీ20 ప్రస్తుతం జరుగుతోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా.. మన దేశానికి రాకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవడంతో.. బంగ్లా జట్టు ప్రపంచకప్ నుంచి తప్పుకొంది. దీని స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలో అడుగుపెట్టింది. మరోవైపు 15వ తేదీన భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ మీటింగ్ జరగ్గా.. ఇందులో బంగ్లాదేశ్ జట్టుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనకపోవడంపై నిరాశ వ్యక్తం చేసిన ఐసీసీ.. ప్రస్తుత అంశానికి సంబంధించి బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడాపరమైన, పరిపాలానా జరిమానా విధించబోమని ధ్రువీకరించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు.. బంగ్లా బోర్డుకి ఉందని స్పష్టం చేసింది. దీని వల్ల ఆ హక్కుకి ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. అలానే బంగ్లాదేశ్‌లో 2031 పురుషుల ప్రపంచకప్ జరగడానికి ముందు ఓ ఐసీసీ ఈవెంట్‌కి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో తెలియజేసింది.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లో పాల్గొనాలని పాక్ జట్టుని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. భారతదేశం బయట తమ మ్యాచ్‌లని నిర్వహించాలనే అభ్యర్థనని ఐసీసీ తిరస్కరించిన తర్వాత బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ సమయంలో తమకు మద్ధతుగా నిలిచిన పాకిస్తాన్‌కి బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం కృతజ్ఞతలు చెప్పారు.

South Africa Won Against Canada T20 World Cup 20264
దక్షిణాఫ్రికా శుభారంభం 

అహ్మదాబాద్‌: టి20 ప్రపంచ కప్‌ గత టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికా ఈ సారి టోర్నీలో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం గ్రూప్‌ ‘డి’లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కెపె్టన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (32 బంతుల్లో 59; 10 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగాడు. అన్‌‡్ష పటేల్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనలో కెనడా పోరాటంతో ఆకట్టుకున్నా...చివరకు ఓటమి తప్పలేదు. కెనడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఓడింది. నవనీత్‌ దలివాల్‌ (49 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, హర్‌‡్ష ఠాకెర్‌ (29 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టగా, యాన్సెన్‌కు 2 వికెట్లు దక్కాయి. మార్క్‌రమ్‌ ఫిఫ్టీ... ఓపెనర్లు మార్క్‌రమ్, డికాక్‌ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు) అనుభవం లేని కెనడా బౌలర్లపై చెలరేగారు. కెపె్టన్‌ మార్క్‌రమ్‌ బౌండరీలతో వేగం పెంచాడు. దీంతో 4.3 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. డికాక్‌ వెనుదిరిగిన తర్వాత ర్యాన్‌ రికెల్టన్‌ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కెపె్టన్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించడంతో పదో ఓవర్‌ ముగియకముందే సఫారీ స్కోరు 100 దాటింది. మార్క్‌రమ్‌ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మార్క్‌రమ్, రికెల్టన్, బ్రెవిస్‌ (6) అవుటయ్యారు. డేవిడ్‌ మిల్లర్‌ (23 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (19 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెరోవైపు నుంచి దూకుడుగా ఆడటంతో జట్టు స్కోరు 200 దాటింది. మెరిపించిన నవ్‌నీత్‌ దక్షిణాఫ్రికాలాంటి గట్టి ప్రత్యరి్థపై 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం ఎవరికైనా కష్టం. కెనడాలాంటి కూనకైతే అసాధ్యం! లుంగి ఇన్‌గిడి దెబ్బకు ఆరంభంలోనే ఓపెనర్లు దిల్‌ప్రీత్‌ (0), యువరాజ్‌ (12) సహా నికోలస్‌ కిర్టన్‌ (4) వికెట్లను కోల్పోయింది. పవర్‌ప్లేలోనే మొవ్వ శ్రేయస్‌ (9) కూడా అవుట్‌ కావడంతో ఏకపక్షమే అనిపించింది. అయితే నవ్‌నీత్‌ దలివాల్, హర్‌‡్ష ఠాకెర్‌ కాసేపు సఫారీ బౌలర్లకు సవాలుగా నిలిచారు. చక్కని సమన్వయంతో జట్టు స్కోరును వందకు తీసుకెళ్లారు. ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించాక హర్‌‡్ష అవుటయ్యాడు. 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన నవ్‌నీత్‌ ఆఖరి ఓవర్లో ని్రష్కమించాడు.

T20 WC 2026: south africa scored 213 runs vs canada5
మార్క్రమ్‌ మెరుపులు.. సౌతాఫ్రికా భారీ స్కోర్‌

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా కెనడాతో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కెప్టెన్‌ మార్క్రమ్‌ (59) విధ్వంసకర హాఫ్‌ సెంచరీ చేయగా.. ఆఖర్లో స్టబ్స్‌ (34 నాటౌట్‌), మిల్లర్‌ (39 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. డికాక్‌ (25), రికెల్టన్‌ (33) కూడా తలో చేయి వేశారు. బ్రెవిస్‌ (6) ఒక్కడే నిరాశపరిచాడు. కెనడా బౌలర్లలో అన్ష్‌ పటేల్‌ (4-0-31-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కలీమ్‌ సనా (4-0-38-0) వికెట్లు తీయలేకపోయినా పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లందరినీ సఫారీ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. జస్కరన్‌ సింగ్‌ 4 ఓవర్లలో 49 పరుగులు, కెప్టెన్‌ దీల్‌ప్రీత్‌ బజ్వా 4 ఓవర్లలో 40 పరుగులు (ఓ వికెట్‌), సాద్‌ బిన్‌ జాఫర్‌ 3 ఓవర్లలో 38 పరుగులు, డిలాన్‌ హెలిగర్‌ ఓ ఓవర్‌లో 13 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 8 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతోంది. దిల్‌ప్రీత్‌ (0), యువరాజ్‌ సమ్రా (12), నికోలస్‌ కిర్టన్‌ (4), శ్రేయస్‌ మొవ్వ (9) ఔట్‌ కాగా.. నవ్‌నీత్‌ ధలీవాల్‌ (25), హర్ష్‌ థాకర్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కెనడా గెలవాలంటే మరో 72 బంతుల్లో 150 పరుగులు చేయాలి. కెనడాను లుంగి ఎంగిడి (3-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. రబాడ (2-0-16-1) కూడా ఇబ్బంది పెట్టాడు.

Virat Kohli, Rohit Sharma Demoted To Grade B In BCCI Central Contract List For 2025-266
‘ఎ’ గ్రేడ్‌లో గిల్, బుమ్రా, జడేజా

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్‌ జట్టు ఆటగాళ్లకు సంబంధించి 2025–26కు గాను వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గత సీజన్‌ వరకు ఉన్న ‘ఎ ప్లస్‌’ గ్రేడ్‌ను తొలగించిన బోర్డు... ఈ సారి ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్‌లతోనే జాబితాను ఖరారు చేసింది. భారత టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో పాటు ఆల్‌ ఫార్మాట్‌ స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు ‘ఎ’ గ్రేడ్‌లో స్థానం లభించగా...భారత టెస్టు జట్టులో అందరికంటే ఎక్కువ అనుభవజు్ఞడైన రవీంద్ర జడేజాకు కూడా ‘ఎ’ గ్రేడ్‌ దక్కడం విశేషం. ఇప్పుడు కేవలం వన్డేలకే పరిమితమైన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిను ‘బి’ గ్రేడ్‌లో చేర్చగా, టి20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ‘బి’లోనే ఉన్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌కు ‘సి’ నుంచి ‘బి’కు ప్రమోషన్‌ లభించగా...వన్డే, టి20ల్లో రెగ్యులర్‌ సభ్యుడైన అక్షర్‌ పటేల్‌ స్థాయిని తగ్గించి ‘సి’లోకి చేర్చారు. 2024–25 కాంట్రాక్ట్‌తో పోలిస్తే ఎవరినీ అదనంగా చేర్చలేదు. నాడు 34 మందితో జాబితా ఉండగా...ఇప్పుడు నలుగురు ఆటగాళ్లు షమీ, సర్ఫరాజ్, రజత్‌ పాటీదార్, ముకేశ్‌ కుమార్‌లను కాంట్రాక్ట్‌నుంచి తప్పించి 30 మందికి పరిమితం చేశారు. అక్టోబర్‌ 1, 2025 నుంచి 26 సెప్టెంబర్, 2026 మధ్య కాలానికి కొత్త కాంట్రాక్ట్‌లు వర్తిస్తాయి. గ్రేడ్‌ ‘ఎ’ – శుబ్‌మన్‌ గిల్, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్‌ ‘బి’ – రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, వాషింగ్టన్‌ సుందర్, కేఎల్‌ రాహుల్, సిరాజ్, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్, కుల్దీప్‌ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్‌. గ్రేడ్‌ ‘సి’ – అక్షర్‌ పటేల్, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, శివమ్‌ దూబే, సంజు సామ్సన్, అర్‌‡్షదీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్, ధ్రువ్‌ జురేల్, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిõÙక్‌ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్‌ గైక్వాడ్‌. ‘ఆ నలుగురు’ టాప్‌ గ్రేడ్‌లో...భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌ కప్‌ విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్లేయర్లకు ‘ఎ’ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ లభించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ, బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ‘ఎ’ జాబితాలో ఉన్నారు. గ్రేడ్‌ ‘బి’లో నలుగురు ప్లేయర్లు ఉండగా, గ్రేడ్‌ ‘సి’లో 13 మంది కలిపి మొత్తం 21 మంది సీనియర్‌ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్ట్‌ ఇచి్చంది. గ్రేడ్‌ ‘ఎ’ – హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ గ్రేడ్‌ ‘బి’ – రేణుకా ఠాకూర్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ్‌ రాణా గ్రేడ్‌ ‘సి’ – రాధ యాదవ్, అమన్‌జోత్‌ కౌర్, ప్రతీక రావల్, క్రాంతి గౌండ్, ఉమా ఛెత్రి, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, యస్తిక భాటియా, హర్లీన్‌ డియోల్, కాశ్వీ గౌతమ్, కమలిని, వైష్ణవి శర్మ, తేజల్‌ హసబ్నిస్‌. 🚨 BCCI ANNUAL CONTRACT 2025-26 🚨 pic.twitter.com/UxNOSYkEnE— Johns. (@CricCrazyJohns) February 9, 2026ఆయా కాంట్రాక్ట్‌ల్లో ఉన్న వారికి వార్షిక వేతనం కింద ఎంత మొత్తం అందనుందో తెలియరాలేదు. గత వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉండిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజాకు రూ. 7 కోట్లు లభించేవి. గ్రేడ్‌-ఏలో ఉండిన వారికి రూ. 5 కోట్లు, గ్రేడ్‌-బిలో ఉండిన వారికి రూ. 3 కోట్లు, గ్రేడ్‌-సిలో ఉండిన ప్లేయర్లకు రూ. కోటి రూపాయలు లభించేవి.

PCB keeps 5 demands in front of ICC to revoke their stand of not play against india in T20 world cup 20267
భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు 5 డిమాండ్లు చేసిన పాక్‌ క్రికెట్‌ బోర్డు

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సిన భారత్‌-పాక్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ మ్యాచ్‌ జరగడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన వెలువడలేదు. తాజా పరిస్థితి చూస్తే, ఈ మ్యాచ్‌ దాదాపుగా రద్దైయ్యేట్లే కనిపిస్తుంది. ఇదే జరిగితే పాక్‌ క్రికెట్‌ బోర్డు భారీ పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొద్ది రోజుల కిందట పాక్‌ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాక్‌ క్రికెట్‌ బోర్డుతో ఇవాళ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. భారత్‌తో మ్యాచ్‌ ఆడాలంటే పీసీబీ ఐసీసీ ముందు ఐదు గొంతెమ్మ కోర్కెలను ఉంచినట్లు తెలుస్తుంది. వీటిలో ఏ ఒక్క దానికి ఐసీసీ అంగీకరించలేదని సమాచారం. భారతీయ క్రీడా జర్నలిస్ట్‌ విక్రాంత్‌ గుప్తా సోషల్‌మీడియా పోస్ట్‌ ఆధారంగా.. పీసీబీ ఐసీసీ ముందు ఈ ఐదు డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తుంది. - బంగ్లాదేశ్‌పై శిక్షలు విధించకూడదు - భారత్–పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ - టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాలి - భారత్‌-పాక్‌-బంగ్లాదేశ్‌తో ప్రత్యేక ట్రై-సిరీస్ - అదనపు ఐసీసీ టోర్నమెంట్ కేటాయింపు అయితే, ఈ ఐదు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించిందని తెలుస్తుంది. ఈ ఐదు తమ పరిధిలోకి రావని ఐసీసీ తేల్చినట్లు సమాచారం. ఈ ఐదు కాకుండా పాక్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీని ప్రత్యేక ఫండింగ్‌ కోసం కూడా డిమాండ్‌ చేసిందని తెలుస్తుంది. ఈ పాక్‌ డిమాండ్లు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి రావడంతో భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. పాక్‌తో మ్యాచ్‌ అవసరం లేదని అంటున్నారు. పాక్‌పై ఐసీసీ శాశ్వత బహిష్కరణ విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాక్‌ తమతో మ్యాచ్‌ ఆడకపోతే తమకు కలిగే నష్టమేమీ లేదని అంటున్నారు.కాగా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్‌ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. ఇది సాధ్యపడదని ఐసీసీ చెప్పడంతో బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది. దీంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ వరల్డ్‌కప్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ తతంగం జరుగుతుండగానే పాక్‌ క్రికెట్‌ బోర్డు బంగ్లాదేశ్‌కు కొమ్ముకాస్తూ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్‌ నుంచి తప్పించిన తర్వాత పాక్‌ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌ ఆడమని ప్రకటించింది.

Donald Trump enters T20 World Cup 2026, announces open support to USA team8
క్రికెట్‌ ప్రపంచంలోకి ఎంటరైన ట్రంప్‌

అనునిత్యం వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, తాజాగా క్రికెట్‌ ప్రపంచంలోకి కూడా ఎంటరయ్యాడు. భారత్‌, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న తమ జట్టుకు (యూఎస్‌ఏ) ట్రంప్‌ మద్దతు ప్రకటించాడు. సోషల్‌ ట్రూత్‌లో ఓ ప్రత్యేక సందేశం పోస్ట్ చేస్తూ.. టీమ్‌ యూఎస్‌ఏ చాలా బలమైంది. అమెరికా మొత్తం మీ వెనుకే ఉంది అని పేర్కొన్నాడు. ట్రంప్‌ ఇచ్చిన మద్దతు యూఎస్‌ఏ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. రేపు (ఫిబ్రవరి 10) పాకిస్తాన్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ట్రంప్ సందేశం యూఎస్‌ఏ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ట్రంప్‌ మద్దతు అమెరికాలో క్రికెట్ ఎదుగుదలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్‌కు క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేదు. గోల్ఫ్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ వంటి క్రీడలపై అతనికి ప్రత్యేక ఆసక్తి ఉంది. అయితే ట్రంప్‌కు 2020లో అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం (ప్రస్తుతం నరేంద్ర మోడి స్టేడియం) ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనుభవం ఉంది. భారత్‌తో వాణజ్యపరమైన సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్న వేల, ట్రంప్‌ ప్రకటన భారతీయుల్లోనూ ఆసక్తి కలిగిస్తుంది. ట్రంప్‌ మద్దతు ఉంటే క్రికెట్‌ కూడా విశ్వక్రీడగా మారిపోయే అవకాశం ఉంది.అమెరికాలో క్రికెట్ అభివృద్ధి 2023లో ప్రారంభమైన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌తో మొదలైంది. ఆ టోర్నీలో భారత్‌ తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్‌ క్రికెటర్లందరూ పాల్గొంటారు. 2024 టీ20 ప్రపంచకప్‌కు సహ-ఆతిథ్యం ఇవ్వడంతో అమెరికా ప్రజలకు క్రికెట్‌ మరింత చేరువైంది. యూఎస్‌ఏలో ఇప్పటికే 150 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ జట్టు గత ఎడిషన్‌ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుత ఎడిషన్‌లోనూ ఆ జట్టు మరో సంచలనం సాధించే అవకాశం ఉంది. టోర్నీ ఓపెనర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆటగాళ్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చారు. ఈ మ్యాచ్‌లో వారి పోరాటానికి క్రికెట్‌ అభిమానులంతా ముగ్దులయ్యారు. టీమిండియా ఆ మ్యాచ్‌ను మాత్రమే గెలిచింది కానీ, యూఎస్‌ఏ జట్టు మాత్రం క్రికెట్‌ ప్రపంచాన్నంతా గెలిచింది.

T20 WC 2026: Zimbabwe beat Oman by 8 wickets9
చెలరేగిన బౌలర్లు.. మరో పసికూనను వణికించిన జింబాబ్వే

టీ20 ప్రపంచకప్‌ 2026లో జింబాబ్వే ఘనంగా బోణీ కొట్టింది. ఒమన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. రిచర్డ్‌ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.5-0-18-3), సికందర్‌ రజా (4-0-17-1) ధాటి​కి ఒమన్‌ 103 పరుగులకే (19.5 ఓవర్లలో) కుప్పకూలింది.ఒమన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్‌ మెహమూద్‌ 25, వినాయక్‌ శుక్లా 28, నదీద్‌ ఖాన్‌ 20 పరుగులు చేయడంతో ఒమన్‌ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. మిగతా ఆటగాళ్లలో ఆమిర్‌ కలీమ్‌, కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌, షా ఫైసల్‌ తలో 5 పరుగులు, షకీల్‌ అహ్మద్‌ 4, జితెన్‌ రామనంది 1, వసీం అలీ 3 పరుగులు చేయగా.. హమ్మద్‌ మీర్జా, కరన్‌ సోనావలే డకౌట్లయ్యారు.అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూపాడుతూ ఛేదించింది. 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (48 నాటౌట్‌), బ్రెండన్‌ టేలర్‌ (31 రిటైర్డ్‌ హర్ట్‌) రాణించారు. మరుమని 21, సికందర్‌ రజా 5 (నాటౌట్‌) పరుగులు చేయగా.. డియాన్‌ మైర్స్‌ డకౌటయ్యాడు. ఒమన్‌ బౌలర్లలో సఫ్యాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెస్సింగ్‌ ముజరబానీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Oman veteran Aamir Kaleem scripts T20 World Cup history10
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఒమన్‌ ఆటగాడు

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒమన్‌ ఆటగాడు ఆమిర్‌ కలీమ్‌ 44 ఏళ్ల 81 రోజుల వయసులో పొట్టి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడి, టోర్నీ చరిత్రలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒమన్‌ ఇవాళ (ఫిబ్రవరి 9) కొలంబో వేదికగా జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో కలీమ్‌ ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు హాంగ్‌కాంగ్‌కు చెందిన ర్యాన్‌ క్యాంప్‌బెల్‌ పేరిట ఉండేది. క్యాంప్‌బెల్‌ 2016 ప్రపంచకప్‌లో 44 ఏళ్ల 30 రోజుల వయసులో బరిలోకి దిగాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 40లు దాటిన వారు చాలామంది ఉన్నారు. ఒమన్‌కే చెందిన మొహమ్మద్‌ నదీమ్‌ 43 వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. ఇటలీ కెప్టెన్‌ వేన్‌ మ్యాడ్‌సన్‌ 42, ఆఫ్ఘనిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ, నెదర్లాండ్స్‌ ఆటగాడు వాన్‌డర్‌ మెర్వ్‌ 41 ఏళ్ల వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌ బరిలో ఉన్నారు.కలీమ్‌ విషయానికొస్తే.. ఇతను పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించి క్రికెట్‌ కెరీర్‌ కోసం ఒమన్‌కు వలస వెళ్లాడు. ఈ జట్టు తరఫున అతను 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 15 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన కలీమ్‌.. ఫిబ్రవరి 3న శ్రీలంక-ఏతో జరిగిన ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను 47 బంతుల్లో 80 పరుగులు చేసి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ప్రస్తుతం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కలీమ్‌ (5) తేలిపోయాడు. అతనితో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్‌ మెహమూద్‌ 25, వినాయక్‌ శుక్లా 28, నదీద్‌ ఖాన్‌ 20 పరుగులు చేయడంతో ఒమన్‌ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.5-0-18-3), సికందర్‌ రజా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. వీరి ధాటికి ఒమన్‌ జట్టు విలవిలలాడింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే గెలుపు దిశగా సాగుతోంది. 7.3 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి, లక్ష్యానికి 75 పరుగుల దూరంలో మాత్రమే ఉంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement