ప్రధాన వార్తలు
18 కోట్ల క్రికెటర్ ఆగమనం.. కేకేఆర్ భవిష్యత్తు మారేనా!
ఐపీఎల్ 2026 సీజన్లోకి మరో ఇద్దరు విదేశీ స్టార్లు త్వరలోనే అడుగుపెట్టనున్నారు. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ, మతీశా పతీరానాలు త్వరలోనే ఫిట్నెస్ టెస్టులో పాసయ్యి లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్లో హసరంగ లక్నో సూపర్జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పతీరానా కోల్కతా నైట్రైడర్స్కు ఆడనున్నాడు. హసరంగను రూ. 2 కోట్ల కనీస ధరకు లక్నో దక్కించుకోగా, పతీరానాకు కేకేఆర్ రూ. 18 కోట్ల భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది. పతీరానా రాకతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ ఫుంజుకునే అవకాశముంది. నిఖార్సైన బౌలర్ లేక కేకేఆర్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనే పరాజయాలనే మూటగట్టుకుంది. కాగా టీ20 ప్రపంచకప్కు ముందు గాయాలతో హసరంగ, పతీరానాలు మేజర్ టోర్నీకి దూరమయ్యారు. ఐర్లాండ్తో మ్యాచ్ సందర్భంగా తొడ వెనుక కండరాల్లో చీలిక రావడంతో హసరంగ టోర్నీ నుంచి తప్పుకోగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ముందు పతీరానా కండరాల గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు కొలంబోలోని ఫిట్నెస్ అకాడమీలో చికిత్స పొందుతున్నారు. లంక క్రికెట్లో సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న 15 మంది ఆటగాళ్ల జాబితాలో హసరంగ, పతీరానాలు చోటు దక్కడంతో బయటి లీగుల్లో ఆడాలంటే లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ తప్పనిసరి. ప్రస్తుతం గాయంతో కోలుకున్న ఈ ఇద్దరు ఫిట్నెస్ టెస్టు పాసయ్యేందుకు శ్రమిస్తున్నారు. అయితే వీరిలో హసరంగా ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీకి దరఖాస్తు చేసుకోకపోవడంతో అతడు ఐపీఎల్ ఆడేది అనుమానమే. పతీరానా మాత్రం ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో రెండు రోజుల్లో అతను ఫిట్నెస్ టెస్టుకు హాజరవనున్నాడు. ఫిట్నెస్ టెస్టులో క్లియరన్స్ వచ్చిన మరుక్షణం లేదా ఏప్రిల్ మూడో వారంలో పతీరానా కేకేఆర్తో కలిసే అవకాశముంది. ఇక పతీరానా ఐపీఎల్లో 32 మ్యాచ్లాడి 47 వికెట్లు పడగొట్టాడు. ఇక హసరంగ ఐపీఎల్లో 37 మ్యాచ్లాడి 46 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 19వ సీజన్లో కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు ఓటములు ఎదురవ్వగా.. పంజాబ్తో మ్యాచ్ వర్షార్పణమయింది. ఇక లక్నో సూపర్జెయింట్స్ తొలి మ్యాచ్లో ఓటమి చెందినప్పటికీ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో గెలిచి సీజన్లో బోణీ చేసింది.చదవండి: అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం!
BCCI: ‘అమ్మిన మోడల్ ఇది కాదు.. ఏటా రూ. 2400 కోట్ల నష్టం’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోదీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధానాలను విమర్శించాడు. బోర్డు అనుచిత నిర్ణయం కారణంగా ఏటా రూ. 2400 కోట్ల మేర ఐపీఎల్కు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నాడు. కాగా 2008లో లలిత్ మోదీ ఆలోచనతో ఐపీఎల్ రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.రికార్డు స్థాయి అమ్మకాలుఅనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ టీ20 లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా పేరొందింది. ఇటీవలి కాలంలో ఐపీఎల్ (IPL) ప్రసార హక్కులు ఏకంగా రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోయాయంటే దీనికున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.అంతేకాదు ఇటీవల రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లను అమ్మకానికి పెట్టగా.. రికార్డు స్థాయిలో రాయల్స్ రూ. 15 వేల కోట్లు, బెంగళూరు జట్టు రూ. 16 వేల కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. అయితే, బీసీసీఐ అనుసరిస్తున్న విధానం వల్ల ఐపీఎల్కు అదనంగా రావాల్సిన ఆదాయం రాకుండాపోతోందని లలిత్ మోదీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మోడల్ను మేము అమ్మలేదు‘‘ఐపీఎల్లో ప్రతి మ్యాచ్కు బీసీసీఐకి యాభై శాతం, జట్లకు యాభై శాతం ఆదాయాన్ని పంచుతారు. అయితే, మొదట్లో ఎనిమిది జట్లు మాత్రమే ఉండేవి. ప్రతి జట్టు సొంతమైదానంతో పాటు బయటి గ్రౌండ్లో ఒకే ప్రత్యర్థితో రెండు మ్యాచ్లు తప్పనిసరిగా ఆడేది. కానీ ఇప్పుడు లీగ్లో పది జట్లు ఉన్నాయి.అయినప్పటికీ మ్యాచ్ల సంఖ్య 74గానే ఉంది. నిజానికి ఈ సంఖ్య 94కు చేరాల్సింది. ఇది కాంట్రాక్టు తప్పిదం. నిజానికి ఈ మోడల్ను మేము అమ్మలేదు. ప్రతి జట్టుకు హోం అండ్ అవే మ్యాచ్ ఆడేలా ఫార్మాట్ రూపొందించాము.రూ. 2400 కోట్ల నష్టంఒకవేళ 94 మ్యాచ్లు నిర్వహించేందుకు క్యాలెండర్ సహకరించకపోతే.. అప్పుడు జట్ల సంఖ్య పెంచుకుండా ఉండాల్సింది. నిజానికి 94 మ్యాచ్ల ఫార్మాట్ అమలైతే ఒక్కో మ్యాచ్కు అదనంగా రూ. 118 కోట్లు వస్తాయి.అంటే మీడియా హక్కుల ద్వారా అదనంగా మరో రూ. 2400 కోట్లు వస్తాయి. ఇందులో బీసీసీఐకి రూ. 1200 కోట్లు, జట్లకు రూ. 1200 కోట్ల వాటా దక్కుతుంది’’ అని లలిత్ మోదీ స్పోర్ట్స్స్టార్తో చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ రూపకర్తగా ప్రసిద్ది చెందిన లలిత్ మోదీ మనీ లాండరింగ్ ఆరోపణలతో.. ఆర్థిక నేరగాడిగా ముద్రపడి.. దేశం విడిచిపారిపోయాడు. చదవండి: ‘త్వరలోనే టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడు’
అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్కింగ్స్కు (సీఎస్కే) అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్గా నిలవడంతో పాటు 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టుగా చెన్నై రికార్డు సొంతం. ధోని నేతృత్వంలో అద్భుత ఆటను ప్రదర్శించిన సీఎస్కే 2023లో చివరిసారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. ఆ తర్వాతి సీజన్ నుంచి సీఎస్కే ఆటతీరు దారుణంగా పడిపోతు వస్తోంది. గత నాలుగేళ్లుగా ధోనీ జట్టులో ఉన్నా అతడి పాత్ర అంతంతమాత్రమే. ఇక ఈ సీజన్లో సీఎస్కే ఆటతీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త ఆటతీరుతో హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది.దారుణమైన నెట్ రన్రేట్తో పట్టికలో సీఎస్కే ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. అయితే గతంలో ఇలా వరుస ఓటములు చవిచూసినప్పటికీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన సీఎస్కేకు ఈసారి మాత్రం ఆ చాన్స్ లేదనిపిస్తోంది.గతంలో సీఎస్కే అంటే వయసు మీరిన ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తుండేవారు. దీంతో ఆ జట్టుకు వృద్ధాప్య జట్టుగా పేరుండేది. కానీ అదే వెటరన్ టీంతోనే ధోని ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టాడు. కానీ ఈసారి సీఎస్కే కూడా గేర్ మార్చింది. జట్టును మొత్తం యువ ఆటగాళ్లతో నింపే ప్రయత్నం చేసింది. అందుకు జడేజా, సామ్ కరన్ వంటి సీనియర్లను విడుదల చేసిన సీఎస్కే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ లాంటి కుర్రాళ్ల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసి జట్టులోకి తీసుకొచ్చింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. యువ రక్తంతో నిండిన జట్టు ఈసారి అద్భుతాలు చేస్తుందని ఆశించారు చెన్నై అభిమానులు. కానీ ఆ జట్టు తొలి మూడు మ్యాచ్లో పేలవ ప్రదర్శనతో చతికిలపడింది. రాజస్తాన్తో తొలి మ్యాచ్లో 127 పరుగులకే కుప్పకూలిన సీఎస్కే.. రెండో మ్యాచ్లో ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ లాంటి కుర్రాళ్ల ప్రదర్శనతో 209 పరుగులు చేసి కూడా పంజాబ్ బ్యాటర్లను నిలువరించలేక ఓటమి చవిచూసింది. ఇక మూడో మ్యాచ్లో సీఎస్కే బౌలర్లను ఆర్సీబీ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. 251 పరుగుల కొండంత లక్ష్యం ఛేదించే క్రమంలో చతికిలపడి హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది.కెప్టెన్గా రుతురాజ్ విఫలం..2024 సీజన్లో సీఎస్కే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం కూడా సీఎస్కేను ఇబ్బందుల్లో పడేసింది. 2024 సీజన్లో 583 పరుగులు సాధించి రెండో టాప్ స్కోరర్గా నిలిచిన రుతురాజ్ 2026 సీజన్లో మాత్రం అటు బ్యాటర్గా.. ఇటు కెప్టెన్గా దారుణంగా విఫలమవుతున్నాడు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిలువున్న రుతురాజ్ ఆర్సీబీతో మ్యాచ్లో ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పడం ఆసక్తి కలిగించింది. గత సీజన్లలో కెప్టెన్సీ ఎలా ఉన్నా బ్యాటర్ రాణించేవాడు రుతురాజ్. కానీ ఈసారి అదీ లేదు. 6, 28, 7.. ఇవీ మూడు ఇన్నింగ్స్ ల్లో అతడి స్కోర్లు. వేగంగా ఆడలేని బలహీనతను అతను అధిగమించలేకపోతున్నాడు. కెప్టెన్గా జట్టును సమష్టిగా నడిపించడంలోనూ రుతురాజ్ విఫలమవుతున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ పకడ్బందీగా సాగలేదు. ధోనిలా అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను రుతురాజ్ సమర్థంగా ఉపయోగించుకోలేకపోతున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది.సంజూకు ఏమైంది?రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్కింగ్స్కు ట్రేడ్ అయిన సంజూ శాంసన్ ఈసారి సీఎస్కే తలరాతను మారుస్తాడని అంతా ఊహించారు. కానీ టీ20 ప్రపంచకప్లో సంచలన ఇన్నింగ్స్లతో హీరో మారిన శాంసన్ ఐపీఎల్కు వచ్చేసరికి మాత్రం జీరో అయిపోయాడు. శాంసన్ బ్యాటింగ్లో నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఓపెనింగ్ భాగస్వామ్యం ఏ జట్టుకైనా అత్యంత కీలకం. కానీ శాంసన్, రుతురాజ్లు ఏకకాలంలో విఫలం కావడం కూడా సీఎస్కేను దెబ్బతీస్తోంది. సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ 6,7,9.. సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఓపెనర్లిద్దరూ ఆరంభంలోనే ఔటవ్వడంతో తర్వాత వచ్చేవారిపై ఒత్తిడి పెరిగి సరిగ్గా ఆడలేకపోతున్నారు. మిడిలార్డర్లో ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. కోట్లు ఖర్చు చేసిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు దారుణంగా విఫలమవుతున్నారు. ఆల్రౌండర్ శివమ్ దూబే ఎప్పుడు ఎలా ఆడతాడో అర్థం కాని స్థితి నెలకొంది.పసలేని బౌలింగ్..బ్యాటింగ్లో సమస్యలు ఇలా ఉంటే బౌలింగ్లో పరిస్థితి మరోలా ఉంది. అన్షుల్ కాంబోజ్ మినహా చెన్నైకి చెప్పుకోదగ్గ బౌలర్లు పెద్దగా కనిపించడం లేదు. జేమీ ఓవర్టర్, నూర్ అహ్మద్లు ఉన్నా వారు పెద్దగా ప్రభావం చూపడం లేదు. శివమ్ దూబే బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు సీఎస్కే బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమానత్వం కనిపించేది. కానీ ఇప్పటి జట్టులో అది కరువైంది.అదంతా గతం..ఇక కెప్టెన్గా సీఎస్కేకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోని జట్టుకు దూరమవ్వడం కూడా సీఎస్కేను డీలా పడేలా చేసింది. ధోని ఆడకున్నా సరే అతడు జట్టుతో పాటు ఉంటే అదే కొండంత బలం. బ్యాటింగ్లో ఊపు తగ్గినప్పటకీ వికెట్ల వెనుక ఉండి అతడిచ్చే సలహాలు జట్టుకు ఎన్నోసార్లు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు అదంతా గతం. ధోని ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చినా సీఎస్కేకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే గత రెండు సీజన్లలో ధోని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ సీఎస్కే లీగ్ దశకే పరిమితమైంది. మరి ఇప్పుడు ధోని వచ్చినా జట్టును ఏం మార్చగలడు అనే అభిప్రాయయాలు బలంగా వినిపిస్తున్నాయి.చదవండి: ‘తప్పు చేశావ్.. కెప్టెన్గా అదొక చెత్త నిర్ణయం’
‘తప్పు చేశావ్.. కెప్టెన్గా అదొక చెత్త నిర్ణయం’
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఇంకా బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైన కేకేఆర్ పంజాబ్ కింగ్స్తో పోరులో ఎలాగైనా గెలిచి ఖాతా తెరవాలని భావించింది. కానీ వరుణుడి అడ్డంకితో మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో పాయింట్ల ఖాతా తెరిచినప్పటికీ విజయం మాత్రం ఇంకా దరిచేరలేదు. అయితే తాజాగా పంజాబ్తో మ్యాచ్లో టాస్ గెలిచిన రహానే బౌలింగ్కు బదులు బ్యాటింగ్ తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. బహుశా తాను టాస్ గెలిచి ఉంటే బౌలింగ్కు మొగ్గు చూపేవాడినని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేర్కొనడంతో రహానేపై విమర్శలు పెరిగిపోయాయి. ఇదే విషయమై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ఫించ్ సైతం రహానే నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఫించ్ మాట్లాడుతూ.. ‘కేకేఆర్ కెప్టెన్ రహానే తీసుకున్న నిర్ణయం ఒక రకంగా అర్థం లేనిది. మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందన్న సంగతి రహానేకు ముందే తెలుసు. పిచ్ను కవర్లతో కప్పి ఉంచడం, వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంలో అర్థం లేదు. రహానే చేసింది ఎంత పెద్ద తప్పు అనేది కాసపటికే కేకేఆర్కు తెలిసొచ్చింది. 25 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పిచ్పై ఉండే పచ్చికను ఉపయోగించుకోవాల్సింది పోయి రహానే గుడ్డిగా బ్యాటింగ్ ఎంచుకోవడం విమర్శలకు తావిచ్చింది. రహానే ఇటీవల తన కెప్టెన్సీపై అసూయ పడేవారు పెరిగిపోయారని పేర్కొన్నాడు. కానీ రహానే వ్యాఖ్యలు నన్ను నిరాశపరిచాయి. ఒక జట్టుకు నాయకుడిగా ఉన్న ఆటగాడికి ఏకాగ్రత దెబ్బతిన్నప్పుడే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. మనల్ని విమర్శించివారిని తిరిగి దూషించడం కెప్టెన్గా సరైన చర్య ఎంతమాత్రం కాదు. రహానే నువ్వు చాలా మంచి ఆటగాడివి. ఓపెనర్గా కొనసాగిస్తున్న దూకుడు అలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. తొలి మ్యాచ్లో 220 పరుగులు చేసి కూడా ఓటమి పాలవ్వడం, రెండో మ్యాచ్లో ఛేదనలో చతికిలపడడం చూస్తుంటే జట్టులో సమతుల్యం దెబ్బతిన్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆటతో పాటు నాయకత్వంపై కూడా దృష్టి పెడితే బాగుంటుంది’ అని పించ్ పేర్కొన్నాడు.చదవండి: వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!
వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!
భారత్కు చెందిన మినర్వా ఫుట్బాల్ క్లబ్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అండర్-15 మెడిటేరియన్ ఇంటర్నేషనల్ కప్ (ఎంఐసీ) టోర్నీలో తొలిసారి ఆడుతున్నప్పటికీ మినర్వా ఫుట్బాల్ క్లబ్ తమ ప్రదర్శనతో అదరగొట్టింది. క్వార్టర్స్లో ఓటమి పాలైనప్పటికీ మినర్వా ఫుట్బాల్ క్లబ్ తమ ఆటతో ఫుట్బాల్ అభిమానుల మనసులను దోచేసింది. గ్రూప్ దశలో మినర్వా క్లబ్ తొలి మ్యాచ్లో 3-0తో కెనెడా బ్రేవ్స్ను, ఆ తర్వాత బొకా ఎఫ్సీపై 4-1తో, ఈఎఫ్ సాంటాపై 1-0తో విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్లో బలమైన లివర్పూల్ ఎఫ్సీ జూనియర్స్ జట్టును 0-6తో ఓడించి మినర్వా ఫుట్బాల్ క్లబ్ సంచలన విజయాన్ని అందుకొని క్వార్టర్స్లో అడుగుపెట్టింది. అయితే క్వార్టర్స్లో స్పానిష్ క్లబ్ యూఈ ఫిగర్స్ చేతిలో 2-1 తేడాతో ఓడిన మినర్వా క్లబ్ ఇంటిబాట పట్టింది. అయితే ప్రిక్వార్టర్స్లో లివర్పూల్ను 6-0తో చిత్తు చేయడం ద్వారా మినర్వా ఫుట్బాల్ క్లబ్ అరుదైన ఘనత సాధించింది. మెడిటేరియన్ ఇంటర్నేషనల్ కప్లో ఇంగ్లీష్ జెయింట్స్ను చిత్తు చేసిన తొలి భారత ఫుట్బాల్ క్లబ్గా మినర్వా జట్టు చరిత్రకెక్కింది. లివర్పూల్తో మ్యాచ్లో మినర్వా ఫుట్బాల్ క్లబ్ తరఫున మొహమ్మద్ ఆజమ్ ఖాన్ (ఆట రెండో నిమిషం, 36 వ నిమిషం), అమర్సన్ సింగ్ (11వ నిమిషం), సింగ్ (25, 28వ, 47వ నిమిషం)లో గోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో మినర్వా ఫుట్బాల్ క్లబ్ ప్రదర్శనపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘భారత ఫుట్బాల్లో ఇది కొత్త ఆరంభం. అంతర్జాతీయంగా భారత ఫుట్బాల్ మరింత దేదీప్యమానంగా వెలుగొందాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.ఇక గతేడాది మినర్వా ఫుట్బాల్ క్లబ్ మూడో ట్రోఫీలను సొంతం చేసుకుంది. స్వీడన్లో జరిగిన గోతియా కప్, డెన్మార్క్లో జరిగిన డానా కప్, నార్వేలో జరిగిన నార్వే కప్లను గెలుచుకుంది.pic.twitter.com/MYMO4G8A83— Follow @barcanation6 (@barcanationvid1) April 3, 2026చదవండి: ‘త్యాగాలు చేశా.. ఐపీఎల్ వల్ల కెరీర్ నాశనమైంది’
‘త్యాగాలు చేశా.. ఐపీఎల్ వల్ల కెరీర్ నాశనమైంది’
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఐపీఎల్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వల్ల తన కెరీర్ నాశనమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. యూట్యూబర్ రన్వీర్ అల్లాబ్దియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ మొదలైన 2008లో ఒకేఒక్క ఇంగ్లండ్ క్రికెటర్ డిమిత్రి మస్క్రెనాస్ మాత్రమే ఆనాటి లీగ్లో ఆడాడు. కేంద్ర కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొనకుండా ఈసీబీ నిషేధించడమే అందుకు కారణం. 2009లో బ్రిటిష్ ఆటగాళ్లు ఐపీఎల్ బరిలో దిగేందుకు ఈసీబీ అనుమతించినా..దాన్ని మూడు వారాలకే పరిమితం చేసింది. దాంతో కెవిన్ పీటర్సన్ ఐపీఎల్ లీగ్కే తొలి ప్రాధాన్యమిచ్చాడు. ఫలితంగా ఈసీబీతో అతడికి అంతరం పెరిగింది. ఈ నేపథ్యంలో పీటర్సన్ను ఈసీబీ జాతీయ జట్టుకు దూరం చేసింది. పీటర్సన్ మాట్లాడుతూ..‘2008లో ఐపీఎల్ ప్రాచుర్యం పొందుతున్న సమయంలో, ఇంగ్లండ్ బోర్డు మమ్మల్ని ఈ లీగ్లో ఆడేందుకు అనుమతించేది కాదు. కానీ అప్పట్లో బోర్డు నిర్ణయానికి నేను వ్యతిరేకంగా గళం విప్పాను. అందుకోసం నేను పెద్ద త్యాగమే చేశాను. అలా ఐపీఎల్ కోసం నా కెరీర్ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ కారణం చేతనే అప్పట్లో బోర్డులోని ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకంగా మారారు. దీంతో 33 ఏళ్లకే నా కెరీర్ ముగిసిపోయింది. నిజానికి నేను ఇంగ్లండ్ తరఫున 150 నుంచి 160 టెస్టులు ఆడి ఉండాల్సింది. ఇంగ్లండ్ బోర్డుతో విభేదాల కారణంగా అది సాధ్యం కాలేదు. అంతేకాదు ఆ సమయంలో నాపై వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బోర్డు కొన్ని వార్తా సంస్థలను కూడా వాడుకుంది. ఇప్పుడు ఆ గతాన్ని తవ్వుకోవడం నాకు ఇష్టం లేదని, ప్రస్తుతం నేను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నా. నేను పడ్డ ఇబ్బందుల వల్లే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇవాళ స్వేచ్ఛగా ఐపీఎల్ సహా ఇతర ప్రైవేటు లీగుల్లో ఆడుతున్నారు. ఇటీవల జోస్ బట్లర్ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయమై నాకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. నేను చేసిన పోరాటం వల్లే ఇప్పుడు మా ఆటగాళ్లంతా ఐపీఎల్ ఫలాలను అనుభవిస్తున్నారు’ అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2009 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున పీటర్సన్ తొలిసారి బరిలోకి దిగాడు. 2011లో డెక్కన్ చార్జర్స్కు, 2012 సీజన్కు ఢిల్లీ డేర్డెవిల్స్కు పీటర్సన్ ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ ఆల్టైమ్ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పీటర్సన్ ఇంగ్లీష్ జట్టు తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్లు ఆడాడు. 2010లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో పీటర్సన్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.చదవండి: కేకేఆర్ ప్లాఫ్ షో.. షారుక్ ఖాన్ అసంతృప్తి🔥 Kevin Pietersen said it LOUD & CLEAR“If you come to India as a cricketer and don’t enjoy it… something’s wrong with you.”And then dropped the mic 🎤“The level of service here is better than anywhere else in the world.”#KevinPietersen #India #IPL #Cricket pic.twitter.com/H36dAlVkBF— ND Sport (@SportsByND) April 5, 2026
కేకేఆర్ ప్లాఫ్ షో.. షారుక్ ఖాన్ అసంతృప్తి
ఐపీఎల్లో మూడుసార్లు చాంపియన్ అయిన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) 2026 సీజన్లో మాత్రం ఇంకా బోణీ చేయలేదు. సోమవారం పంజాబ్తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఒక పాయింట్ సాధించినప్పటికీ విజయం మాత్రం ఇంకా ఆ జట్టు దరి చేరలేదు. ఆడిన రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయిన సమయంలో కెమెరాలు ఒక్కసారిగా డ్రెసింగ్ రూమ్వైపు తిరిగాయి. అప్పటికే అక్కడ షారుక్ ఖాన్ కేకేఆర్ సీఈవో వైంకీ మైసూర్తో సుదీర్ఘ చర్చలో మునిగినట్లు కనిపించింది. ముఖ్యంగా సీజన్లో కేకేఆర్ ఆటతీరుపై, కామెరున్ గ్రీన్ వైఫల్యంపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పంజాబ్తో మ్యాచ్లో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంపై కూడా షారుక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అనిపిస్తోంది. మ్యాచ్ జరిగి ఉంటే కేకేఆర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగేదేమో అని భావించినట్లు తెలుస్తోంది.ఇక తొలి రెండు మ్యాచ్ల్లో కేకేఆర్ ఓటములపై కూడా విశ్లేషించినట్లుగా అర్థమవుతోంది. మొత్తంగా కేకేఆర్ ప్లాఫ్ షోపై షారుక్ ఖాన్ అసం తృప్తిగా ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 220 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ కేకేఆర్ ఓడిపోయింది. బౌలింగ్ వైఫల్యంతో పరాజయాన్ని మూటగ ట్టుకుంది. ఇక సొంత మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఈసారి బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి చవిచూసింది. 227 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ 161 పరుగులకే ఆలౌటైంది. కనీసం మూడో మ్యాచ్ ద్వారానైనా సీజన్లో బోణీ కొట్టాలని భావించిన కేకేఆర్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ లభించినప్పటికీ ఉపయోగం లేదు. కనీసం ఏప్రిల్ 9న లక్నో సూపర్జెయింట్స్తో జరగనున్న మ్యాచ్లోనైనా కేకేఆర్ విజయం సాధించి సీజన్లో ఖాతా తెరవడంతో పాటు షారుక్ ఖాన్ శాంతించేలా చేస్తుందేమో చూడాలి. pic.twitter.com/HaBuw3lHz8— Nihari Korma (@NihariVsKorma) April 6, 2026చదవండి: హ్యాట్రిక్ కొట్టాడు.. ఇంకెన్ని దారుణాలు చూడాలో!
హ్యాట్రిక్ కొట్టాడు.. ఇంకెన్ని దారుణాలు చూడాలో!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరున్ గ్రీన్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ బ్యాటింగ్లో విఫలమై హ్యాట్రిక్ నమోదు చేశాడు. సోమవారం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమయింది. ఓపెనర్ ఫిన్ అలెన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రీన్ తన పేలవ ఫామ్ను కొనసాగించాడు. మొదటి బంతికి ఫోర్ కొట్టినప్పటికీ ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. జేవియర్ బార్ట్లెట్ వేసిన అవుట్ స్వింగర్ బంతిని బ్యాట్తో ముద్దాడి కీపర్ ప్రభ్సిమ్రన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో వరుసగా 18, 2, 4 పరుగులు సాధించాడు. మొత్తంగా ఈ సీజన్లో ఆడిన మ్యాచ్ల్లో గ్రీన్ కేవలం 24 పరుగులు మాత్రమే చేసి 10 కంటే తక్కువ సగటు నమోదు చేయడం కోల్కతా మేనేజ్మెంట్ను తీవ్రంగా కలవరపెడుతోంది. ఆల్రౌండర్గా జట్టుకు సమతుల్యత ఇస్తాడని భావించి భారీ ధర పెట్టి కొనుగోలు చేసినందుకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా సందేశం మేరకు బౌలింగ్కు దూరంగా ఉన్న కామెరున్ గ్రీన్ ఇప్పుడు బ్యాటింగ్లోనూ దారుణంగా ఆడుతూ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రూ. 25.2 కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన గ్రీన్ ఇప్పుడు కేకేఆర్కు భారంగా మారిపోయాడు. కనీసం తర్వాతి మ్యాచ్లోనైనా ఫుంజుకొని తనకు పెట్టిన ధరకు న్యాయం చేస్తాడేమో చూడాలి. మరోవైపు కేకేఆర్ అభిమానులు మాత్రం గ్రీన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు పెట్టి కొనుక్కున్న కేకేఆర్కు పంగనామం పెడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి కామెరున్ గ్రీన్ పెద్ద ని ఖార్సైన ఆల్రౌండర్ కాదన్న సంగతి అతని గణాంకాలు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 37 టెస్టులాడిన గ్రీన్ 1736 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 7 అర్థసెంచరీలున్నాయి. 31 వన్డేల్లో 782 పరుగులు, 28 టీ20ల్లో 638 పరుగులు సాధించాడు. ఈ మాత్రానికే కేకేఆర్ అంత డబ్బులు పెట్టి గ్రీన్ను ఎందుకు కొనుగోలు చేసిందన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. ఇక వర్షం పడే సమయానికి కేకేఆర్ 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. వర్షం తెరిపినిచ్చినప్పటికీ ఔట్ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ నిర్వహణ కష్టమైంది. దీంతో మ్యాచ్ను రద్దు చేసిన అంపైర్లు ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 5 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంటే, సీజన్లో ఇప్పటికీ బోణీ చేయని కేకేఆర్ ఒక పాయింట్తో 8వ స్థానంలో కొనసాగుతుంది.చదవండి: ‘ఇష్టం లేకపోతే తప్పుకో’.. సీఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహం
‘హ్యాట్రిక్’పై రాజస్తాన్ గురి
గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ ‘హ్యాట్రిక్’ విజయంపై గురి పెట్టింది. నేడు జరిగే పోరులో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్తో రియాన్ పరాగ్ బృందం తలపడనుంది. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై చివరి వరకు పోరాడి గెలిచిన రాయల్స్... అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో పటిష్టంగా కనిపిస్తోంది. 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, కెపె్టన్ రియాన్ పరాగ్, హెట్మైర్, రవీంద్ర జడేజాతో రాయల్స్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్లో ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, జడేజా, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు. మరోవైపు సీజన్ను విజయంతో ఆరంభించిన ముంబై ఇండియన్స్ గత మ్యాచ్లో ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి టచ్లో ఉండగా... తిలక్ వర్మ, రూథర్ఫోర్డ్, నమన్ ధీర్ రాణించాల్సిన అవసరముంది. అస్వస్థతతో గత మ్యాచ్కు దూరమైన కెపె్టన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతాడా చూడాలి. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, కార్బిన్ బాష్, మయాంక్ మార్కండే బౌలింగ్ భారం మోయనున్నారు. ఐపీఎల్లో ముంబై, రాజస్తాన్ జట్ల మధ్య 31 మ్యాచ్లు జరిగాయి. 16 మ్యాచ్ల్లో ముంబై, 14 మ్యాచ్ల్లో రాజస్తాన్ గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది. రాజస్తాన్పై ముంబై అత్యధిక స్కోరు 214 పరుగులుకాగా, అత్యల్ప స్కోరు 92. ముంబై ఇండియన్స్పై రాజస్తాన్ రాయల్స్ అత్యధిక స్కోరు 212 పరుగులుకాగా, అత్యల్ప స్కోరు 90 పరుగులుగా ఉంది.
వరుణుడి ఖాతాలో...
కోల్కతా: ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఆట ప్రారంభమైన 15 నిమిషాలకే వర్షం ముంచెత్తింది. మైదానం మొత్తాన్ని కవర్స్తో కప్పినా... ఎంతకూ వరుణుడు తెరిపినివ్వకపోవడంతో ఆట సాధ్యపడలేదు. పలుమార్లు పిచ్ను పరిశీలించిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్ధ ఉన్న ఈడెన్ గార్డెన్స్లో కటాఫ్ సమయానికి ముందే వరుణుడు శాంతించాడు. అయితే బౌండరీకి దగ్గర నీరు ఎక్కువగా నిలిచింది. దాంతో ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు కటాఫ్ సమయానికల్లా మైదానం సిద్ధమయ్యే పరిస్థితి కనిపించలేదు. ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి కాగా... ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. గతేడాది కూడా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్, కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. సొంతగడ్డపై టాస్ గెలిచిన కోల్కతా మొదట బ్యాటింగ్ ఎంచుకోగా... వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (6), కామెరాన్ గ్రీన్ (4) విఫలం కాగా... కెప్టెన్ అజింక్య రహానే (8 నాటౌట్), అంగ్క్రిష్ రఘువంశీ (7) అజేయంగా నిలిచారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో పంజాబ్ పేసర్ జేవియర్ బార్ట్లెట్ ఈ ఇద్దరినీ కీపర్ క్యాచ్ల ద్వారా వెనక్కి పంపాడు.
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ ఖాతాలో మరో ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఫుట్బాల్ లీగ్ (ఐఎఫ...
వైశాలికి రెండో గెలుపు
పెయియా (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్...
కార్ల్సన్ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్కు అవమానం!
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ తన తోటి ప్లేయర...
సత్తా చాటిన పంకజ్ అద్వానీ
లూథియానా: దిగ్గజ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ పూల్ ...
పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్లు.. ఫోటోలు వైరల్
ఇంగ్లండ్ మహిళల జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట...
ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు
ఐపీఎల్-2026లో కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ కా...
అవేశ్ అత్యుత్సాహం.. బీసీసీఐకి సన్రైజర్స్ ఫిర్యాదు?
లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేష్ ఖాన్కు పేరుక...
వర్షం కారణంగా పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ రద్దు
IPL 2026 KKR vs PBKS Live Updates: ఐపీఎల్-2026లో ...
క్రీడలు
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
వీడియోలు
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
ఈజీ రన్అవుట్ మిస్ చేసిన ఇషాన్... అదితి రియాక్షన్ వైరల్
కష్టాల్లో టీమిండియాను గెలిపించాడు.. ప్రచారంలో సంజూ ని ఆకాశానికి ఎత్తేసిన మోడీ
అయ్యర్ కు మ్యాచ్ గెలిచిన ఆ సంతోషం దక్కలేదు..!
5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం
దూసుకెళ్తున్న పంజాబ్
కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం
తొలి మ్యాచ్ లోనే ఓడిపోయినా.. కప్ మాత్రం సీఎస్కేదేనా..?
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
చెన్నై చిత్తు.. రాయల్స్ రాజసం
