ప్రధాన వార్తలు
వైభవ్ కాదు!.. ఈ యువ ఆటగాడికి భారీ డిమాండ్!
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇప్పటికే 2027 సీజన్ కోసం కసరత్తు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా మినీ వేలం నేపథ్యంలో ట్రేడ్ విండో ఓపెన్ కావడంతో తమకు కావాల్సిన ఆటగాళ్లను చేర్చుకునే విధంగా చర్చలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పేరు హైలైట్ అవుతోంది.హార్దిక్ కోసం దాదాపు ఎనిమిది ఫ్రాంఛైజీలు ముంబై ఇండియన్స్తో బేరానికి దిగినట్లు తెలుస్తోంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. అయితే, ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా చెన్నై జట్టులోని ఓ యువ ఆటగాడి కోసం ముంబై పట్టుబడుతున్నట్లు సమాచారం.కెప్టెన్గా భారత్కు అండర్-19 ప్రపంచకప్ అందించిన ఆయుశ్ మాత్రేను దక్కించుకోవాలని ముంబై పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ముంబైతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీలు కూడా ఈ యువ ఓపెనర్ కోసం గాలం వేసినట్లు తెలుస్తోంది.గుజరాత్ టైటాన్స్.. ఆయుశ్ కోసం వాషింగ్టన్ సుందర్ను చెన్నైకి ఆఫర్ చేయగా.. లక్నో షాబాజ్ అహ్మద్ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ అశుతోశ్ శర్మ లేదంటే టి. నటరాజన్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. సన్రైజర్స్ ఆయుశ్ కోసం సలీల్ అరోరాను త్యాగం చేసేందుకు సిద్ధమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే.. చెన్నై హార్దిక్కు బదులుగా ముంబైకి శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్ను ఇస్తామని.. చెప్పగా ముంబై మాత్రం ఆయుశ్ను కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే, చెన్నై జట్టు మాత్రం ఆయుశ్ను తమ దీర్ఘకాలిక ఆస్తిగా భావిస్తూ ముంబైతో పాటు.. ఇతర ఫ్రాంఛైజీల ఆఫర్లను తిరస్కరించినట్లు తమిళ మీడియా పేర్కొంది. ఇక హార్దిక్కు ఇచ్చినందుకు మూల్యంగా దూబే, బ్రెవిస్లతో పాటు అదనంగా రూ. 10 కోట్లు ఇచ్చేందుకు చెన్నై ఫ్రాంఛైజీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.ఆయుశ్కు అంత డిమాండ్ ఉందా?దేశీ క్రికెట్లో ముంబైకి ఆడుతున్న ఆయుశ్ మాత్రే 2025లో ఐపీఎల్లో చెన్నై తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది ఏడు ఇన్నింగ్స్లో కలిపి 240 పరుగులు సాధించాడు. ఇక తాజా ఎడిషన్లోనూ ఆరు ఇన్నింగ్స్లో కలిపి 201 పరుగులు చేశాడు.అయితే, దురదృష్టవశాత్తూ గాయపడి టోర్నీ మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు ఆయుశ్. ఇప్పటి వరకు చెన్నై తరఫున మొత్తంగా 13 మ్యాచ్లలో కలిపి 441 పరుగులు చేసిన 19 ఏళ్ల ఆయుశ్.. స్ట్రైక్రేటు 177కు పైగానే ఉంది. రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, టీమిండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ మాదిరి దూకుడుగా ఆడగల సత్తా ఆయుశ్కు ఉంది.
చరిత్ర సృష్టించా.. నా రక్తం ధారపోశాను.. కానీ ఇప్పుడు!
బ్రెజిల్ ఫుట్బాల్ సూపర్స్టార్ నెయ్మార్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను జాతీయ జట్టు కోసం రక్తం ధారపోశానని.. అయితే, ఇకపై ఆ పనిచేయలేనంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్కు స్వస్తి పలికేశానంటూ రిటైర్మెంట్ గురించి పునరుద్ఘాటించాడు.గత కొన్నాళ్లుగా గాయాలతో సావాసం చేసిన నెయ్మార్.. ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీతో బ్రెజిట్ జట్టు తరఫున పునరాగమనం చేశాడు. అయితే, ఈ మెగా ఈవెంట్లో రౌండ్ 16లో నార్వే చేతిలో 2-1 గోల్ తేడాతో ఓడి బ్రెజిల్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో నెయ్మార్ ఒక గోల్ కొట్టాడు. ఓటమి అనంతరం మాట్లాడుతూ.. బ్రెజిల్ తరఫున తనకు ఇదే చివరి మ్యాచ్ అని రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.తాజాగా ఇదే విషయం గురించి మరోసారి ప్రస్తావన రాగా.. ‘‘జాతీయ జట్టుతో నా బంధం ముగిసిపోయింది. బ్రెజిల్ తరఫున నేను చరిత్ర సృష్టించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా జట్టు కోసం రక్తం ధారపోశాను. నా జీవితాన్ని, సర్వస్వాన్ని అర్పించాను.యెల్లో జెర్సీ ధరించడం కోసం ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ ఇకముందు ఆ పని చేయాల్సిన అవసరం లేదు’’ అని నెయ్మార్ గోల్.కామ్తో పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్ తర్వాత క్లబ్ కెరీర్ మీద దృష్టి సారించిన నెయ్మార్.. సారథిగా సాంటోస్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.ఈ క్రమంలో తాజా మ్యాచ్లో భాగంగా యూనివర్సిడాడ్ సెంట్రల్పై సాంటోస్ 4-2 గోల్ తేడాతో విజయం సాధించింది. తద్వారా కోపా సదమెరికానా రౌండ్ 16కు అర్హత సాధించింది. అనంతరం నెయ్మార్ మాట్లాడుతూ.. తన అంతర్జాతీయ రిటైర్మెంట్ విషయాన్ని పునరుద్ఘాటించాడు.కాగా బ్రెజిల్ తరఫున 130 మ్యాచ్లు ఆడిన నెయ్మార్.. 80 గోల్స్ సాధించాడు. తద్వారా బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన ఫుట్బాలర్గా 34 ఏళ్ల నెయ్మార్ చరిత్రకెక్కాడు. అంతేకాదు పదహారేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 59 అసిస్ట్లు కూడా అందించాడు. నెయ్మార్ ఘనతలుఅమెరికాతో ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా 2010లో నెయ్మార్ అరంగేట్రం చేశాడు. ఫిఫా ప్రపంచకప్ 2014, 2018, 2022, 2026 ఎడిషన్లలో బ్రెజిల్కు ప్రాతినిథ్యం వహించాడు. ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్-2013 విజేత. 2012 ఒలింపిక్స్లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు. 2016 ఒలింపిక్స్లో కెప్టెన్గా బ్రెజిల్కు స్వర్ణం అందించాడు.Neymar has officially announced that he will retire from international football. 😢He was visibly emotional walking off of a World Cup pitch for the final time. ❤️(🎥: @liberta___depre)pic.twitter.com/GcMIjvmpYt— theScore (@theScore) July 5, 2026
IND vs SL: అతడిని ఎలా ఎంపిక చేశారు: డివిలియర్స్
శ్రీలంకతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లంకతో టెస్టులకు రిషభ్ పంత్ను ఎంపిక చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. కాగా ఆగష్టు 15 నుంచి 27 వరకు భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్లు జరుగుతాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం తమ జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ కెప్టెన్సీలోని ఈ జట్టులో తొలిసారి సారాంశ్ జైన్ చోటు దక్కించుకున్నాడు.పంత్తో పాటు జురెల్..ఇదిలా ఉంటే.. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్టుల్లో పునరాగమనం చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం డివిలియర్స్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ పంత్ ఎంపికను ప్రశ్నించాడు.అతడిని ఎలా ఎంపిక చేశారు?ఈ మేరకు.. ‘‘శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో పంత్ ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడి ఫిట్నెస్ ఎలా ఉందో తెలిసిందే. అంతేకాదు.. అతడికి జట్టు తరఫున రాణించాలన్న కోరిక కూడా ఉందో లేదో చెప్పలేము.ఐపీఎల్లో అతడు ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. బాగా కుంగిపోయినట్లు అనిపించింది. అయితే, దేశం తరఫున ఆడినప్పుడు పంత్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని నమ్ముతున్నా. శ్రీలంకలో అతడు దూకుడుగా, తనదైన శైలిలో రాణిస్తాడనే ఆశిస్తున్నా’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.జడ్డూ రీఎంట్రీ సంతోషంఅదే విధంగా.. ‘‘రవీంద్ర జడేజా జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. ఇటీవలి కాలంలో అతడు జట్టులో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు తీసేస్తారో తెలుసుకోవడం కాస్త కష్టంగానే ఉంది.ఇక బుమ్రా పూర్తి ఫిట్గా మారితే జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అతడు జట్టులో ఉన్నాడంటే ప్రత్యర్థులకు వణుకే. బుమ్రా ఒక క్లాస్ ప్లేయర్’’ అని డివిలియర్స్ కొనియాడాడు. కాగా టీమిండియా చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు ఆడింది.ఐపీఎల్లో పంత్ విఫలంఈ మ్యాచ్ నుంచి జడేజా, బుమ్రాలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ 104 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో పదమూడు ఫోర్లు ఉండటం విశేషం. అయితే, అంతకుముందు ఐపీఎల్-2026లో మాత్రం పంత్ పూర్తిగా నిరాశపరిచాడు.లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, బ్యాటర్గా పంత్ విఫలమయ్యాడు. కేవలం 312 పరుగులు చేసిన పంత్ సారథ్యంలో లక్నో ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. గతేడాది 269 పరుగులు చేసిన పంత్ జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఈ పరిణామాల నేపథ్యలో 2027 సీజన్కు ముందే పంత్ లక్నోను వీడి ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.
అగ్రపీఠంపై గిల్.. వైభవ్ భారీ జంప్
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి కెరీర్లోనే అత్యుత్తమమైన 48వ ర్యాంక్కు చేరుకోగా, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ మళ్లీ ప్రపంచ నంబర్-1 బ్యాటర్గా నిలిచాడు.జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాజా ర్యాంకింగ్స్లో భారీగా లాభపడ్డాడు. ప్రస్తుతం అతను 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానంలో కొనసాగుతున్నాడు.అదే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ 916 రేటింగ్ పాయింట్లతో టీ20 బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (912 కెరీర్ బెస్ట్), విరాట్ కోహ్లీ (909 కెరీర్ బెస్ట్) వంటి భారత దిగ్గజాల కెరీర్ రేటింగ్లను కూడా అధిగమించాడు. టీ20 చరిత్రలో అత్యధిక బ్యాటింగ్ రేటింగ్ల జాబితాలో అభిషేక్ శర్మ (931), డేవిడ్ మలాన్ (919) తర్వాత ఇషాన్ కిషన్ (916 కెరీర్ బెస్ట్) మూడో స్థానంలో ఉన్నాడు.ఇతర భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో ర్యాంక్కు చేరుకోగా, శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో రవి బిష్ణోయ్ 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్ను దక్కించుకున్నాడు.మరోవైపు, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో డారిల్ మిచెల్ అగ్రస్థానాన్ని కోల్పోవడంతో శుభ్మన్ గిల్ తిరిగి ప్రపంచ నంబర్-1 బ్యాటర్గా అవతరించాడు. ఈ ఏడాది జనవరి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన మిచెల్ను వెనక్కి నెట్టి గిల్ మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించాడు.
CWG 2026: భారత్కు మరో పతకం ఖాయం చేసిన సాక్షి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్కు మరో పతకం ఖరారైంది. ఇప్పటికే 12 పతకాలతో (2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు) పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ మరో పతకం ఖాయం చేసుకొని పట్టికలో మరింత మెరుగైన స్థానానికి వెళ్లే దిశగా సాగుతోంది.మహిళల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి ఈ పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను 5-0 తేడాతో చిత్తు చేసి సెమీఫైనల్కు దూసుకెళ్లడంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖరారైంది.ఈ బౌట్లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సాక్షి మూడు రౌండ్లలోనూ ఏకగ్రీవంగా 5-0 స్కోరుతో విజయం సాధించింది. వేగవంతమైన కదలికలు, కచ్చితమైన పంచ్లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను తన ఆధీనంలో ఉంచుకుంది.ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే సెమీఫైనల్లో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్తో సాక్షి తలపడనుంది. అంతకుముందు ప్రీక్వార్టర్ఫైనల్లో బోట్స్వానాకు చెందిన లెథాబో మొడుకనెలెపై విజయం సాధించి సాక్షి క్వార్టర్ఫైనల్కు అర్హత సాధించింది.ఇదిలా ఉంటే, ఈ పోటీల్లో భారత బాక్సర్ల పోరు కొనసాగనుంది. మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి న్యూజిలాండ్కు చెందిన మోర్గాన్ హెండర్సన్తో క్వార్టర్ఫైనల్లో పోటీ పడనుండగా.. పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ బోట్స్వానాకు చెందిన ట్రెజర్ మోరెమితో.. 80 కేజీల విభాగంలో అంకుష్ యాదవ్ సీషెల్స్కు చెందిన జేడ్ మికాక్తో, 90 కేజీల విభాగంలో నరేందర్ బెర్వాల్ సమోవాకు చెందిన మైఖేల్ సెకోతో క్వార్టర్ఫైనల్ బరిలోకి దిగనున్నారు.
మంధాన ఒంటరి పోరాటం.. సూపర్ జెయింట్స్ ఉత్కంఠ విజయం
మహిళల హండ్రెడ్ టోర్నమెంట్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (88 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో తన జట్టు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్కు ఉత్కంఠభరిత విజయాన్నందించింది. సన్రైజర్స్ లీడ్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వీరోచిత ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.లక్ష్య ఛేదనలో మెగ్ లానింగ్ (24), మంధాన కలిసి తొలి వికెట్కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన జట్టు 61/1 నుంచి 71/5కు పడిపోవడంతో ఓటమి ముంగిట నిలిచింది.ఈ క్లిష్ట పరిస్థితుల్లో మంధాన ఒంటరి పోరాటం చేసింది. గ్రేస్ స్క్రివెన్స్తో 27 పరుగులు, కేథ్రిన్ బ్రైస్తో 48 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయపథంలో నడిపించింది. రెండు సార్లు లభించిన క్యాచ్ అవకాశాలను ప్రత్యర్థి జట్టు చేజార్చుకోవడంతో మంధాన హండ్రెడ్ లీగ్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది.చివరి 25 బంతుల్లో 44 పరుగులు అవసరమైన సమయంలో దూకుడు పెంచిన మంధాన వరుస సిక్సర్లతో మ్యాచ్ను మలుపు తిప్పింది. చివరి ఓవర్లో అవసరమైన ఎనిమిది పరుగులను రెండు భారీ సిక్సర్లతో పూర్తి చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ నిర్ణీత 100 బంతుల్లో నాలుగు వికెట్లకు 142 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్లాండ్ 35, లిచ్ఫీల్డ్ 31, బ్రయోనీ స్మిత్ 26 పరుగులతో రాణించగా, చివర్లో కెప్టెన్ డానియెల్ గిబ్సన్ ఆరు బంతుల్లోనే 18 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించింది.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన మంధాన మాట్లాడుతూ, డ్రాప్ క్యాచ్ రూపంలో కొంత అదృష్టం కలిసి వచ్చినా మ్యాచ్ను విజయవంతంగా ముగించగలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఇలాంటి విజయాలు జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని పేర్కొంది.
PAK vs WI: విధి రాసిన విజయం..! గ్యారీ సోబర్స్కు విండీస్ ఘన నివాళి
సొంత గడ్డపై పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను వెస్టిండీస్ విజయంతో ఆరంభించింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ను 90 పరుగుల తేడాతో విండీస్ చిత్తు చేసింది. ఈ అద్బుత విజయాన్ని లెజెండరీ ఆల్రౌండర్, దివంగత సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు విండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ అంకితమిచ్చాడు.యాదృచ్ఛికంగా సోబర్స్ 90వ పుట్టిన రోజు నాడే విండీస్ ఈ మ్యాచ్ గెలవడం గమనార్హం. అంతేకాకుండా కరేబియన్ జట్టు సరిగ్గా 90 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇంకా హైలెట్. కాగా గ్యారీ సోబర్స్ జులై 17న అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే."వెస్టిండీస్ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు తరఫున ఈ విజయాన్ని దివంగత దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు అంకితం ఇస్తున్నాం. ఆయన క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని మహారాజు. మా జట్టులోని ప్రతి ఒక్కరికీ ఆయనే ఆదర్శం. తన సుదీర్ఘ కెరీర్లో సోబర్స్ సాధించనిది లేదు. ఈ రోజు ఆయన 90వ బర్త్డే. సరిగ్గా మేము కూడా 90 పరుగుల తేడాతో గెలిచాం.ఇది ఆయన కోసం రాసిపెట్టినట్లే అనిపిస్తోంది. సోబర్స్ను గౌరవించుకోవడానికి ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఆయన పై నుంచి చూస్తూ సంతోషపడుతుంటారు అనుకుంటున్నా. గార్ఫీల్డ్ సోబర్స్ సర్... వెస్టిండీస్ క్రికెట్కు మీరు చేసిన సేవలకు ధన్యవాదాలు. మిమ్మల్ని గర్వపడేలా చేశామని ఆశిస్తున్నాం. మీ ఆత్మకు శాంతి కలగాలి" అని డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడుతూ చేజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.For the Legend With Love 🖤Historic win for the team on Sir Garry’s 90th. #WIvPAK pic.twitter.com/2yLXAkXQ6a— Windies Cricket (@windiescricket) July 28, 2026
రూ. 2,00,000 కోట్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఈ టీ20 లీగ్.. దినదినాభివృద్ధి చెందుతోంది. బీసీసీఐ, ఫ్రాంఛైజీలు, ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్గా కొనసాగుతోంది.సుమారుగా రూ. 2,00,000 కోట్లు!ఈ నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు హోలియాన్ లోకీ తాజాగా వెలువరించిన నివేదిక ఐపీఎల్ సత్తా ఏమిటో మరోసారి చాటిచెప్పింది. ఐపీఎల్-2026 బ్రాండ్ వాల్యూ స్టడీలో భాగంగా.. ఐపీఎల్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ విలువలో 11.4 శాతం పెరుగుదల నమోదైందని.. మొత్తం విలువ 20.6 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 1,97,024 కోట్లు)కు చేరిందని సదరు కథనం పేర్కొంది.రికార్డు ధరకుఅదే విధంగా లీగ్ బ్రాండ్ వాల్యూలో 10.3 శాతం పెరుగుదల కనిపించిందని.. ఇది 4.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 41,106 కోట్లు)కు చేరిందని కథనం తెలిపింది. కాగా 2026లో రెండు ఫ్రాంఛైజీల యాజమాన్యాలు చేతులు మారిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ని బ్లాక్స్టోన్, బోల్ట్ వెంటర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు రికార్డు స్థాయిలో 1.78 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాయి.ఇక రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని మిట్టల్ కుటుంబం, ఆదార్ పూనావాలా సంయుక్తంగా 1.65 బిలియన్ డాలర్ల మొత్తానికి దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా ఎగిసినట్లు సదరు కథనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్కు రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ కారణంగానే ఈ మేర బ్రాండ్ వాల్యూ పెరిగిందని హోలియాన్ లోకీ ఫైనాన్షియల్, వాల్యువేషన్ అడ్వైజరీ బిజినెస్ డైరెక్టర్ హర్ష్ తలికోటి తెలిపారు.నంబర్ వన్గా ఆర్సీబీఐపీఎల్ 2025, 2026లో వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ అమాంతంగా పెరిగింది. ఐపీఎల్లోనే అత్యంత విలువైన ఫ్రాంఛైజీగా ఆర్సీబీ అవతరించింది. అంతేకాదు బ్రాండ్ వాల్యూలో 300.0 మిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి క్రికెట్ జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఫ్రాంఛైజీ విజయాలు, అపారమైన అభిమానగణం ఇందుకు ప్రధాన కారణం.మిగిలిన స్థానాలు ఇలాఇక ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ 264 మిలియన్ డాలర్లకు చేరగా.. ఆర్సీబీ తర్వాతి స్థానాన్ని ముంబై ఆక్రమించింది. కోల్కతా నైట్ రైడర్స్ బ్రాండ్ వాల్యూ 245 మిలియన్ డాలర్లకు చేరింది. ఐపీఎల్-2024లో జట్టు విజేతగా నిలవడం ఇందులో కీలక పాత్ర పోషించింది. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ 244 మిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఆర్సీబీ, ముంబై, కోల్కతా తర్వాత నాలుగో స్థానంలో చెన్నై జట్టు నిలిచింది.అదే విధంగా ఆ తర్వాతి స్థానాల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (బ్రాండ్ వాల్యూ 168 మిలియన్ డాలర్లు), రాజస్తాన్ రాయల్స్ (161 మిలియన్ డాలర్లు), పంజాబ్ కింగ్స్ (158 మిలియన్ డాలర్లు), గుజరాత్ టైటాన్స్ (157 మిలియన్ డాలర్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (156 మిలియన్ డాలర్లు), లక్నో సూపర్ జెయింట్స్ (122 మిలియన్ డాలర్లు) నిలిచాయి.చదవండి: అర్జున్ టెండుల్కర్కు షాక్!
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే? అతడి అరంగేట్రం ఫిక్స్?
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్కు 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సారాన్ష్ జైన్ను ఎంపిక చేసి సెలక్టర్లు అందరని ఆశ్చర్యపరిచారు. వాషింగ్టన్ సుందర్ ఫిట్గా లేకపోవడంతో జైన్కు తొలిసారి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది.కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 54 ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన సారాన్ష్ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు అఫ్గాన్తో ఏకైక టెస్ట్కు దూరంగా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్లను ఎంపిక చేసినప్పటికి సిరీస్ ఆరంభానికి ముందు వారు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి లంకతో జరగబోయో తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేశాడు. అన్క్యాప్డ్స్ ఆటగాడు సారాన్ష్ జైన్ అరంగేట్రం చేసే అవకాశముందని అశ్విన్ తెలిపాడు."ప్లేయింగ్ ఎలెవన్లో రవీంద్ర జడేజా కచ్చితంగా ఉంటాడు. అదేవిధంగా అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ను కూడా తుది జట్టులో కొనసాగిస్తారు. వీరిద్దరితో పాటు కుల్దీప్ యాదవ్కు కూడా అవకాశమివ్వాలి. దీంతో జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. శ్రీలంక పిచ్లు ఎక్కువగా స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి సారాన్ష్ జైన్ను కూడా ఆడిస్తే బెటర్. అతడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంపాలి. ఎప్పటిలాగే ఓపెనర్లగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ ఉంటారు. మూడువ స్థానంలో దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్కు ఛాన్స్ దక్కనుంది. సాయి ఫిట్నెస్ సాధిస్తే దాదాపుగా అతడే తుది జట్టులో ఉంటాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా శుబ్మన్ గిల్, రిషబ్ పంత్ బ్యాటింగ్కు వస్తారు. ఆరో స్ధానంలో జడేజాను పంపాలి. ఇక చివరగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, మహ్మద్ సిరాజ్లను తీసుకోవాలి. బుమ్రా ఫిట్గా లేకపోతే ప్రసిద్ద్ కృష్ణకు ఛాన్స్ ఇవ్వాలని" తన య్యూటూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అశ్విన్ అంచనా వేసిన భారత తుది జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, సిరాజ్, సరాన్ష్ జైన్.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాన్ష్ జైన్.
అర్జున్ టెండుల్కర్కు షాక్?!
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు అర్జున్ టెండుల్కర్ చాన్నాళ్ల నుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశీ క్రికెట్లో తొలుత సొంత జట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు ఈ ఆల్రౌండర్.ముంబై నుంచి గోవాకు...అయితే, ముంబై జట్టులో పోటీ ఎక్కువగా ఉండటంతో 26 ఏళ్ల అర్జున్కు తగినన్ని అవకాశాలు రాలేదు. దీంతో 2022లో గోవా జట్టుకు మారిపోయాడు. ఆ జట్టు తరఫున మెరుగ్గానే రాణించాడు. అయితే, ఈ ఏడాది అతడు గోవా జట్టును వీడనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఒమన్ పర్యటనకుతాజాగా గోవా క్రికెట్ జట్టుకు సంబంధించి బయటకు వచ్చిన ఓ అప్డేట్ ఇందుకు కారణం. కాగా రంజీ ట్రోఫీ 2026-27 షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబరు నుంచి ఈ రెడ్బాల్ దేశీ టోర్నీ మొదలుకానుండగా.. గోవా తమ ప్రమాణాలు పెంచుకునే క్రమంలో ఒమన్కు వెళ్లనుంది.పదిరోజుల పాటు ఒమన్లో తమ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేసేందుకు వీలుగా గోవా అసోసియేషన్ ప్రణాళిక రచించినట్లు సమాచారం. స్పోర్ట్స్స్టార్ కథనం ప్రకారం.. ఆగష్టు 8- 18 మధ్య గోవా జట్టు ఒమన్లో గడుపనుంది. ఇందులో భాగంగా ఒమన్ సీనియర్ క్రికెట్ జట్టుతో మూడు వన్డేలతో పాటు రెండు టీ20 మ్యాచ్లు ఆడనున్నట్లు సమాచారం.హెడ్కోచ్గా దినేశ్ మోంగియాఈ పర్యటనలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ దినేశ్ మోంగియా గోవా జట్టు హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. మిలాప్ మేవాడా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో చేరడంతో.. మోంగియా గోవా హెడ్కోచ్గా అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అర్జున్ టెండుల్కర్కు షాకిచ్చారా?.. తప్పుకొన్నాడా?!అయితే, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అర్జున్ టెండుల్కర్ మాత్రం జట్టుతో పాటు ఈ టూర్కు వెళ్లడం లేదని తెలుస్తోంది. గోవా తరఫున కొనసాగేందుకు అతడు సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. తాజా ఎడిషన్లోనే అర్జున్ గోవా జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒమన్ టూర్ను సైతం అతడు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అటు గోవా క్రికెట్ గానీ.. ఇటు అర్జున్ టెండుల్కర్ గానీ స్పందించలేదు. కాగా గత రంజీ ఎడిషన్లో గోవా ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. చదవండి: పాకిస్తాన్ ఫైనల్ రేసు నుంచి అవుట్!
తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం
కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్లిఫ్టింగ్లో భార...
పతకాల జోరు.. డబుల్ డిజిట్ దాటిన భారత్
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్...
కబడ్డీ నుంచి వెయిట్లిఫ్టింగ్ వైపు...
రాజా ముత్తుపండి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోవిల్...
రజత రాజా... వెండి జ్ఞానేశ్వరి
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో...
రూ. 2,00,000 కోట్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న ఆదరణ గు...
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే? అతడి అరంగేట్రం ఫిక్స్?
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్...
అర్జున్ టెండుల్కర్కు షాక్?!
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన...
మిచెల్ మార్ష్ మాస్ ఇన్నింగ్స్.. సన్రైజర్స్ రికార్డు విజయం
ది హండ్రెడ్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మా...
క్రీడలు
ISSF World Cup: అదరగొట్టిన భారత షూటర్లు.. సింగ్కు స్వర్ణం, మనుకు కాంస్యం (ఫొటోలు)
గర్ల్ఫ్రెండ్తో టీమిండియా క్రికెటర్ అర్ష్దీప్ సింగ్ (ఫొటోలు)
జింబాబ్వేపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ మనదే (ఫోటోలు)
వైభవ్ విశ్వరూపం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం (ఫొటోలు)
FIFA World Cup 2026 : స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ (ఫొటోలు)
FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్ (ఫొటోలు)
శ్రీ తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న తిలక్ వర్మ (ఫొటోలు)
లండన్లో మా తమ్ముడి ఆట చూశా.. అది చాలు! (ఫొటోలు)
హైదరాబాద్ మారథాన్కు ‘సిల్వర్ స్టాండర్డ్’ గుర్తింపు (ఫొటోలు)
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్లో అల..సెయిలింగ్లో (ఫొటోలు)
వీడియోలు
టీమిండియాకు కొత్త కోచ్గా శుభదీప్ ఘోష్.. ఎవరీ ఈయన?
బుడ్డోడు దెబ్బకు అభిషేక్ పై వేటు.. వెళ్లి IPL ఆడుకో
నా కల నెరవేరింది.. వైభవ్ ఎమోషనల్ కామెంట్స్
మృణాల్ ఠాకూర్ తో యశస్వి జైస్వాల్ డేటింగ్?
లక్ష్మణ్ నే కావాలి గంభీర్ పై ఆటగాళ్లు తిరుగుబాటు
గాయపడిన వెనక్కి తగ్గని బుడ్డాడు.. వైభవ్ పై లక్ష్మణ్ ప్రశంసలు
శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను
చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై? కొత్త చీఫ్ ఎవరు?
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో పతకం
