Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Rahul Dravid gets emotional as Chinnaswamy stadium stands named 1
‘చిన్నస్వామి’లో కుంబ్లే, ద్రవిడ్‌ స్టాండ్స్‌

బెంగళూరు: చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియం కొత్త స్టాండ్‌లతో ముస్తాబవుతోంది. భారత దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే పేర్లతో చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్‌లను ఏర్పాటు చేయాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) నిర్ణయించింది. మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో కమిటీ భారత్‌ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన కుంబ్లే, టెస్టు క్రికెట్లో సచిన్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచిన పరుగుల వీరుడు ద్రవిడ్‌లు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ స్టాండ్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మాజీ మహిళా క్రికెటర్‌ శాంతా రంగస్వామి పేరిట మరో స్టాండ్‌ను ఏర్పాటు చేస్తారు. అనిల్‌ కుంబ్లే కేఎస్‌సీఏ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సహచరులు ద్రవిడ్, శాంతా రంగస్వామిలతో స్టాండ్లను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు.

Indian polo team prevails2
భారత పోలో జట్టు పైచేయి

సాక్షి, హైదరాబాద్‌: రాధా టీఎంటీ అంతర్జాతీయ ఎరీనా పోలో చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. లక్సెంబర్గ్‌ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 15–5 గోల్స్‌ తేడాతో నెగ్గింది. తొలి చక్కర్‌ ముగిశాక భారత్‌ 6–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్‌ తరఫున యూసుఫ్‌ అజ్మీ 2 గోల్స్, కున్వల్‌ విశాల్‌ సింగ్‌ 3 గోల్స్, మొహమ్మద్‌ నయీముద్దీన్‌ ఒక గోల్‌ చేశారు. రెండో చక్కర్‌లో భారత్‌ ఐదు గోల్స్‌ చేసి, రెండు గోల్స్‌ సమరి్పంచుకుంది. ఈ చక్కర్‌లో భారత్‌కు చెతానియా 2 గోల్స్, యూసుఫ్‌ అజ్మీ 2 గోల్స్‌ చేయగా, పెనాల్టీ ద్వారా మరో గోల్‌ వచి్చంది. చివరిదైన మూడో చక్కర్‌లో భారత్‌ నాలుగు గోల్స్‌ సాధించింది. చెతానియా, యూసుఫ్‌ అజ్మీ రెండు గోల్స్‌ చొప్పున చేశారు.

Zimbabwe beat Australia by 23 runs in T20 World Cup3
వారెవ్వా జింబాబ్వే

ఆ్రస్టేలియా సొంతగడ్డపై ఆడినా... గడప దాటినా... ఫార్మాట్‌ ఏదైనా... చాంపియన్‌ జట్టు. ప్రొఫెషనలిజానికిమారుపేరు. అలాంటి జట్టు జింబాబ్వేలాంటి చిన్న జట్టుతో ఓడటం ఎవరి అంచనాలకూ అందని సంచలనమే! ఓ దుర్బేధ్యమైన జట్టు మళ్లీ అదే ప్రత్యర్థి చేతిలో రెండోసారి ఓడితే సంచలనానికి సీక్వెలే కదా! అవును... దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే... ఆస్ట్రేలియాపై సీక్వెల్‌ బొమ్మ చూపించింది. 2007లో మొదలైన టి20 వరల్డ్‌కప్‌లో అప్పటి వన్డే వరల్డ్‌ చాంపియన్‌ను కంగుతినిపించి ఔరా అనిపించిన జింబాబ్వే... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రస్తుత వన్డే విశ్వవిజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించి తాజా టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. కొలంబో: జింబాబ్వే జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియాను మరోసారి ‘0’ను చేసింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో జింబాబ్వే తమ ఆధిక్యాన్ని ‘2’తో రెట్టింపు చేసుకుంది. 2007 టి20 ప్రపంచకప్‌లో కంగారూ జట్టుపై సాధించిన సంచలన విజయాన్ని 19 ఏళ్ల తర్వాత జింబాబ్వే తాజాగా రిపీట్‌ చేసింది. అప్పుడు మొదటి ప్రపంచకప్‌ అయితే ఇది పదోది. మధ్యలో 8 మెగా ఈవెంట్లు జరిగినా... ఇరుజట్లు తలపడలేదు. శుక్రవారం గ్రూప్‌ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (56 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన ముగ్గురు బ్యాటర్లు తదివనషె మరుమని (21 బంతుల్లో 35; 7 ఫోర్లు), రియాన్‌ బర్ల్‌ (30 బంతుల్లో 35; 4 ఫోర్లు), కెప్టెన్‌ సికందర్‌ రజా (13 బంతుల్లో 25 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. స్టొయినిస్, కామెరాన్‌ గ్రీన్‌ చెరో వికెట్‌ తీశారు. ఆసీస్‌ ఈ 120 బంతులు ఆడలేదా? జింబాబ్వే లాంటి కూన జట్టు బ్యాటర్లు 120 బంతులెదుర్కొని ఇద్దరే అవుటైతే... జగజ్జేత కంగారు పడటమేంటి? పది మంది బ్యాటర్లు 117 బంతులకే అవుట్‌ కావడమేంటి? హెడ్‌ బృందానికి 170 లక్ష్యఛేదన ఏమాత్రం కష్టమైంది కాదు. కఠినమైంది కాదు. కానీ 19.3 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే పేసర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బ్లెసింగ్‌ ముజరబాని (4/19), బ్రాడ్‌ ఇవాన్స్‌ (3/23) ధాటికి ఓపెనర్లు ఇన్‌గ్లిస్‌ (8), కెప్టెన్ హెడ్‌ (17) గ్రీన్‌ (0), టిమ్‌ డేవిడ్‌ (0)... ఇలా టాప్‌–4 స్పెషలిస్టు బ్యాటర్లంతా పవర్‌ప్లేలో 29 పరుగులకే పెవిలియన్‌కు వెళ్లి ప్రేక్షకులైపోయారు.ఒకే ఒక్కడు మ్యాట్‌ రెన్‌షా (44 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్‌), మ్యాక్స్‌వెల్‌ (32 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్‌) ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించడంతో 100 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే తర్వాతి బ్యాటర్లు స్టొయినిస్‌ (6), డ్వార్షుయిస్‌ (6), ఎలిస్‌ (7 నాటౌట్‌), జంపా (2), కునెమన్‌ (0)ల స్కోర్లు చూస్తే ఏ అత్యల్ప స్కోరుకో పరిమితమయ్యేదేమో! ఔరా మన్యొంగా... జింబాబ్వే ఫీల్డర్‌ మన్యొంగా కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఇవాన్స్‌ వేసిన 18వ ఓవర్లో డ్వార్షుయిస్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. మున్యొంగా దూరంగానే ఉన్నప్పటికీ డీప్‌ మిడ్‌వికెట్‌ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో డైవ్‌ చేసి అందుకున్న క్యాచ్‌ ఔరా అనిపించింది. టేలర్‌ స్థానంలో బెన్‌ కరన్‌... జింబాబ్వే సీనియర్‌ ప్లేయర్‌ బ్రెండన్‌ టేలర్‌ గాయం కారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో గాయపడిన అతను ఆసీస్‌తో పోరులో బరిలోకి దిగలేదు. టేలర్‌ స్థానంలో ఐసీసీ అనుమతితో బెన్‌ కరన్‌కు జింబాబ్వే చోటు కల్పించింది. బెన్‌ కరన్‌ తమ్ముడు స్యామ్‌ కరన్‌ ఇప్పటికే వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ తరఫున ఆడుతున్నాడు.2 ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టుతో జింబాబ్వే నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. ఆసీస్‌పై జింబాబ్వే సాధించిన రెండు విజయాలు ప్రపంచకప్‌లోనే రావడం విశేషం.టి20 ప్రపంచకప్‌లో నేడుఐర్లాండ్‌ X ఒమన్‌వేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి ఇంగ్లండ్‌ X స్కాట్లాండ్‌వేదిక: కోల్‌కతా; మ.గం. 3 నుంచి దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్‌ వేదిక: అహ్మదాబాద్‌; రాత్రి గం. 7 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Snehit sensational performance at the World Table Tennis Chennai Star Contenders Tournament4
సూపర్‌ స్నేహిత్‌...

చెన్నై: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్‌ కంటెండర్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ సూరావజ్జుల స్నేహిత్‌ సంచలన ప్రదర్శనతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 100వ ర్యాంకర్‌ స్నేహిత్‌ 9–11, 15–17, 11–4, 11–6, 18–16తో ప్రపంచ 61వ ర్యాంకర్‌ మిజుకి ఒయ్‌కావా (జపాన్‌)ను బోల్తా కొట్టించాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో తొలి రెండు గేమ్‌లు కోల్పోయినప్పటికీ స్నేహిత్‌ పట్టువదలకుండా పోరాడాడు. వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. నిర్ణాయక ఐదో గేమ్‌లో స్నేహిత్‌ 8–10తో రెండు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకున్నాడు. వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన స్నేహిత్‌ 10–10తో స్కోరును సమం చేశాక 11–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆరుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 16–16 వద్ద స్నేహిత్‌ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

Andhra Pradesh shooter shines with 8 medals at Asian Championship5
మన ముకేశ్‌ గురి బంగారం

న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ జూనియర్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన పిస్టల్‌ షూటర్‌ ముకేశ్‌ నేలవల్లి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. చివరిరోజు శుక్రవారం గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్‌ రెండు పతకాలు సాధించాడు. 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో రజత పతకం నెగ్గిన ముకేశ్‌... టీమ్‌ విభాగంలో సూరజ్‌ శర్మ (మధ్యప్రదేశ్‌), అభినవ్‌ దేశ్వాల్‌ (ఉత్తరాఖండ్‌)లతో కలిసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్‌లో ముకేశ్‌ ఎనిమిది పతకాలు సాధించిన ముకేశ్‌ జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. సూరజ్‌ శర్మ 585 పాయింట్లతో స్వర్ణం, ముకేశ్‌ 582 పాయింట్లతో రజతం, అభినవ్‌ దేశ్వాల్‌ 573 పాయింట్లతో కాంస్యం నెగ్గారు. సూరజ్, ముకేశ్, అభినవ్‌లతో కూడిన భారత జట్టు టీమ్‌ విభాగంలో 1740 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ధవళిక ఖాతాలో 2 పతకాలు ఇదే టోర్నీ జూనియర్‌ మహిళల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి ధవళిక దేవి రెండు పతకాలు సాధించింది. వ్యక్తిగత విభాగంలో ధవళిక 614.1 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలిచింది. టీమ్‌ విభాగంలో ధవళిక, ప్రాచి, అనుష్కలతో కూడిన భారత జట్టు 1835.6 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది. గచి్చ»ౌలిలోని గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీలో గత మూడేళ్లుగా కోచ్‌ వినోద్‌ కనోజియా వద్ద ధవళిక శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో సీనియర్, జూనియర్‌ విభాగాల్లో కలిపి భారత షూటర్లు 39 స్వర్ణాలు, 18 రజతాలు, 19 కాంస్యాలతో 76 పతకాలు నెగ్గి ‘టాప్‌’లో నిలిచారు.

Indian Super League 12th season football tournament starts today6
నేటి నుంచి ఐఎస్‌ఎల్‌

కోల్‌కతా: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నెలలపాటు కొనసాగిన సందిగ్ధత వీడింది. నేటి నుంచి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 12వ సీజన్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ మొదలుకానుంది. మొత్తం 14 (బెంగళూరు, చెన్నైయిన్, ఈస్ట్‌ బెంగాల్, గోవా, ఇంటర్‌ కాశీ, జంషెడ్‌పూర్, కేరళ బ్లాస్టర్స్, మొహమ్మదాన్‌ స్పోరి్టంగ్, మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్, ముంబై సిటీ, నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్, ఒడిశా, పంజాబ్, స్పోరి్టంగ్‌ క్లబ్‌ ఢిల్లీ) జట్లు టైటిల్‌ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఒక్కో జట్టు 13 మ్యాచ్‌లు ఆడుతుంది. నాకౌట్‌ దశ లేకుండా మూడు నెలలపాటు సాగే ఈ లీగ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు విజేతగా అవతరిస్తుంది. సాల్ట్‌లేక్‌ స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ జట్టుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ మోహన్‌బగాన్‌ సూపర్‌ జెయింట్‌ జట్టు తలపడుతుంది. రెండో మ్యాచ్‌లో ఇంటర్‌ కాశీ జట్టుతో ఎఫ్‌సీ గోవా జట్టు పోటీపడుతుంది.

Srivalli Rashmika in the final of the doubles category of the ITF W75 tournament7
ఫైనల్లో రష్మిక జోడీ

పుణే: భారత మహిళల టెన్నిస్‌ రెండో ర్యాంకర్, హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తన కెరీర్‌లో ఏడో డబుల్స్‌ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 టోర్నమెంట్‌ డబుల్స్‌ విభాగంలో శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్‌) ద్వయం 7–5, 6–3తో పొలీనా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జంటపై విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక–అంకిత తమ తొలి సర్వీస్‌లో 27 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 9 పాయింట్లు సంపాదించారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశారు. నేడు జరిగే ఫైనల్లో మిసాకి మత్సుదా–ఇరి షిమిజు (జపాన్‌)లతో రష్మిక–అంకిత తలపడతారు.

usa won The T20 world cup Match Against Netherlands 8
రాణించిన సాయితేజ, హర్మీత్‌

చెన్నై: దాయాది జట్లు భారత్, పాకిస్తాన్‌ చేతిలో ఓడిన అమెరికా ఎట్టకేలకు నెదర్లాండ్స్‌పై గెలిచి ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో బోణీ చేసింది. గ్రూప్‌ ‘ఎ’లో శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మోనాంక్‌ పటేల్‌ సారథ్యంలోని అమెరికా 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై జయభేరి మోగించింది. టాస్‌ నెగ్గిన డచ్‌ టీమ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మోనాంక్‌ (22 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జహాంగీర్‌ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడే క్రమంలో అవుటయ్యారు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్‌ సాయితేజ ముక్కామల (51 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభమ్‌ రంజనే (24 బంతుల్లో 48 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. బాస్‌ డి లీడె 3 వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ 15.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. బాస్‌ డి లీడె (23), కెపె్టన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (20)లు మాత్రమే రెండు పదుల స్కోరు చేయగలిగారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్మీత్‌ సింగ్‌ 21 పరుగులిచ్చి 4 వికెట్లు, వాన్‌ షాల్‌విక్‌ 3 వికెట్లు, మోసిన్‌ 2 వికెట్లు తీశారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో నమీబియాతో అమెరికా తలపడుతుంది.

T20 WC 2026: USA set 197 runs target to netherlands9
T20 WC 2026: సత్తా చాటిన సాయితేజ.. యూఎస్‌ఏ భారీ స్కోర్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 13) రాత్రి మొదలైన మ్యాచ్‌లో యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి నెదర్లాండ్స్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌ఏ.. సాయితేజ ముక్కామల (79), శుభ్‌మ్‌ రంజనే (48 నాటౌట్‌) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.మిగతా యూఎస్‌ఏ ఆటగాళ్లలో మొనాంక్‌ పటేల్‌ (36), షయాన్‌ జహంగీర్‌ (20) కూడా రాణించారు. సంజయ్‌ కృష్ణమూర్తి (1), మిలింగ్‌ కుమార్‌ (3), హర్మీత్‌ సింగ్‌ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొహమ్మద్‌ మొహిసిన్‌ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బాస్‌ డి లీడ్‌ (4-0-37-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. లొగాన్‌ వాన్‌ బీక్‌ (4-0-28-1), కైల్‌ క్లెయిన్‌ (4-0-35-1), ఫ్రెడ్‌ క్లాసెన్‌ (3-0-32-1) కూడా పర్వాలేదనిపించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను నెదర్లాండ్స్‌ ధాటిగా ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు చేసింది. అయితే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మైఖేల్‌ లెవిట్‌ 3 పరుగులు చేసి కెంజిగే బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. మ్యాక్స్‌ ఒడౌడ్‌ 13 పరుగులు చేసి హర్మీత్‌ సింగ్‌ బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన​్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గెలవాలంటే 90 బంతుల్లో మరో 156 పరుగులు చేయాలి.

T20 WC 2026: If Zimbabwe, Australia sentiment work out, team india will be the winner10
ఈ సెంటిమెంట్‌ రిపీటైతే టీమిండియాదే వరల్డ్‌కప్‌..!

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 13) పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. 2021 ఎడిషన్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.వాస్తవానికి టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది మొదటిసారి కాదు. పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభ ఎడిషన్‌లోనే (2007) జింబాబ్వే ఆసీస్‌కు ఊహించని షాక్‌ ఇచ్చింది. ప్రపంచకప్‌ల పరంగా చూసుకుంటే, జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది ‍కూడా తొలిసారి కాదు. 1983 వన్డే ప్రపంచకప్‌లోనే జింబాబ్వే తొలిసారి ఆసీస్‌ను ఓడించింది. మొత్తంగా జింబాబ్వే తమ క్రికెట్‌ చరిత్రలో వారికంటే చాలా రెట్లు మెరుగైన ఆస్ట్రేలియాను ఐదు సార్లు ఓడించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో రెండు సార్లు (2007, 2026), వన్డే వరల్డ్‌కప్‌లో ఒకసారి (1983), సాధారణ వన్డేల్లో రెండు సార్లు (2014, 2022) జింబాబ్వే ఆసీస్‌కు షాకిచ్చింది.అయితే జింబాబ్వే ఆసీస్‌పై సాధించిన విషయాల్లో ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. అది భారత క్రికెట్‌ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. అదేంటంటే.. జింబాబ్వే ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆసీస్‌పై విజయం సాధించిన తొలి రెండు సందర్భాల్లో భారత్‌ జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే తొలిసారి ఆసీస్‌పై విజయం సాధించిన సందర్భంలో భారత్‌ తొలిసారి జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే ఆసీస్‌పై రెండోసారి విజయం సాధించిన సందర్భంలో భారత్‌ రెండో సారి జగజ్జేతగా నిలిచింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ సెంటిమెంట్‌ రిపీటైతే, భారత్‌ మరోసారి జగజ్జేతగా అవతరించడం ఖాయమని టీమిండియా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గూగుల్‌ ఇండియా కూడా విశ్లేషించింది. తాజా ప్రపంచకప్‌లో ఆసీస్‌పై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ఈ విషయం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈసారి కూడా టీమిండియానే టీ20 ప్రపంచ ఛాంపియన్‌ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ సెంటిమెంట్‌కు అభిమానులు ప్రస్తుత జట్టు బలాన్ని, ఇటీవలి ఫామ్‌ను కూడా జోడిస్తున్నారు. భారత జట్టు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని, గత రెండేళ్లలో టీమిండియా ఫామ్‌ అద్వితీయంగా ఉందని, పై సెంటిమెంట్‌కు ఈ రెండు కలిస్తే భారత్‌కు తిరుగే ఉండదన్న విషయం స్పష్టమవుతుందని చర్చించుకుంటున్నారు. పై ఫ్యాక్టర్స్‌ అన్నీ వర్కౌటై భారత్‌ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్‌ కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఇన్ని శుభ శకునాల మధ్య భారతీయులను ఓ చెడు శనుకం కూడా పలకరిస్తుంది. అదేంటంటే.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఉండి, మరోసారి ప్రపంచకప్‌ గెలవలేదు. ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ఏమైనా వర్కౌటవుతుందేమోనని టీమిండియా ఫ్యాన్స్‌ అందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement