Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Shreyas Iyer reflects on PBKSs defeat versus RR1
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్‌

ఐపీఎల్‌-2026లో పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓట‌మి ఎదురైంది. మంగ‌ళ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ప‌రాజ‌యం పాలైంది. 223 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని పంజాబ్ బౌల‌ర్లు కాపాడుకోలేక‌పోయారు. ఈ కొండంత ల‌క్ష్యాన్ని రాజ‌స్తాన్ కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 19.2 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది.రాయ‌ల్స్‌ బ్యాట‌ర్ల‌లో యశస్వి జైస్వాల్ (51), డోనోవన్ ఫెరీరా ( 26 బంతుల్లో 52*), వైభ‌వ్ సూర్య‌వంశీ(43), శుభమ్ దూబే(12 బంతుల్లో 31) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. త‌మ‌కు ఎదురైన తొలి ప‌రాజ‌యంపై మ్యాచ్ అనంత‌రం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. బౌలింగ్ వైఫ‌ల్యం కార‌ణంగానే తాము ఓడిపోయామ‌ని అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు."ఈ వికెట్‌పై 222 ప‌రుగులు చేయ‌డం చాలా గొప్ప విష‌యం. పిచ్ కాస్త నెమ్మ‌దిగా ఉన్న‌ప్ప‌టికి మా బ్యాట‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. క‌చ్చితంగా వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయిన‌ప్ప‌టికి ఈ భారీ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోలేక‌పోవ‌డం నిరాశ క‌లిగించింది. బౌలింగ్‌లో మా ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమలు చేయ‌లేక‌పోయాము. మేము ఎక్కువగా స్లో బాల్స్, యార్కర్లు వేయాలని ప్లాన్ చేసుకున్నాం.కానీ మేము అనుకున్న‌ది చేయ‌లేక‌పోయాము. మిడిల్ ఓవ‌ర్ల‌లో రాజ‌స్తాన్ బ్యాట‌ర్లు అద్భుత‌మైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఫెరీరా, శుభమ్ దుబే చివ‌రి ఓవ‌ర్ల‌లో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. వారిద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్ని భాగ‌స్వామ్యమే మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది. ప్ర‌స్తుతం టీ20 ఫార్మాట్‌లో బ్యాట‌ర్లు మొద‌టి బంతి నుంచే విరుచుకుప‌డుతున్నారు.కాబ‌ట్టి బౌల‌ర్లు పక్కా ప్లాన్‌తో రావడం కష్టమైన పని. ఈ రోజు మాకు బౌలింగ్‌లో క‌లిసిరాలేదు అంతే. ఇక నిరంత‌ర ప్ర‌యాణాలు, మ్యాచ్‌ల వ‌ల్ల మేము కాస్త అలిసిపోయాము. కానీ దాన్ని సాకుగా చెప్పలేము. మా త‌దుప‌రి మ్యాచ్‌కు కాస్త విరామం దొరికింది. మ‌ళ్లీ మా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుని బ‌లంగా తిరిగి వ‌స్తాం.ఈ సీజ‌న్‌లో మాకు ఇది తొలి ఓట‌మి. ఈ ఓట‌మి నుచి చాలా పాఠాలు నేర్చుకున్నాము. మేము ఇప్పటికే 200 పరుగులకు పైగా ఛేజ్ చేశాం, అదే టార్గెట్‌ను డిఫెండ్ కూడా చేశాం. కాబ‌ట్టి ఈ మ్యాచ్ ఫ‌లితం గురుంచి పెద్దగా ఆలోచించం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో మా స్పిన్న‌ర్లు హ‌ర్‌ప్రీత్ బ్రార్‌, చాహ‌ల్ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హ‌ర్‌ప్రీత్‌కు ఈ సీజ‌న్‌లో ఇదే తొలి మ్యాచ్. అయిన‌ప్ప‌టికి అత‌డు త‌న 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి మా టీమ్‌లో బెస్ట్‌ బౌలర్‌గా నిలిచాడు"అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో అయ్య‌ర్ పేర్కొన్నాడు. పంజాబ్ త‌మ త‌దుపరి మ్యాచ్‌లో మే 3న అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.చదవండి: IPL 2026: జైలుకు రియాన్ ప‌రాగ్‌?

Riyan Parag Vaping Video- RR Captain To Be Jailed Mid IPL?2
జైలుకు రియాన్ ప‌రాగ్‌?

రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్‌-2026లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (ఇ-సిగరెట్ తాగడం) చేస్తూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ప్రస్తుతం ఇది పెను సంచలనంగా మారింది. సాధరణంగా డ్రెస్సింగ్ రూమ్, స్టేడియం ఆవరణలో ధూమపానం చేయడం నిషిద్ధం. అంతేకాకుండా 2019 నుంచి భారత్‌లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల విక్రయం, వాడకంపైనా నిషేదం ఉంది. 'ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం' ప్రకారం.. మొదటిసారి తప్పు చేస్తే ఒక ఏడాది జైలు శిక్ష లేదా లక్ష వరకు జరిమానా విధించే అవకాశముంది.కొన్ని సందర్భాల్లో కేవలం జైలు శిక్ష మాత్ర‌మే విధించవచ్చు. కాగా ఇప్పుడు అతడు ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో నిబంధనలను ఉల్లఘించినందుకు బీసీసీఐ కూడా కఠిన చర్యలు తీసు​కోనుంది. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు బీసీసీఐ అతడిపై మ్యాచ్‌ల నిషేధంతో పాటు భారీ జరిమానా విధించే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరాగ్ ఇ-సిగరెట్ వాడకంకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉండి, ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన చూపడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజస్తాన్ ఘన విజయంఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్‌కు రాజస్తాన్ ఓటమి రుచిని చూపించింది. పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో రాజ‌స్తాన్ ఘ‌న విజ‌యం సాధించింది. 223 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్తాన్ కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 19.2 ఓవ‌ర్ల‌లో ఊదిపడేసింది.రాజ‌స్తాన్ విజ‌యంలో (51), డోనోవన్ ఫెరీరా (52*) కీల‌క పాత్ర పోషించారు. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 222/4 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (59), మార్కస్ స్టోయినిస్ (62*) రాణించారు.చదవండి: ఫెరియెరా ఊచకోత.. పంజాబ్‌కు ఓటమి రుచి చూపించిన రాజస్థాన్‌Riyan parag was caught vaping in dressing room ,how it's allowed inside dressing room bcci whats happening pic.twitter.com/BsYHuunBuj— cherry_gems (@Introvert2core) April 28, 2026 Mann did anyone of you noticed this? Parag was caught vaping during the match between RR and PBKS pic.twitter.com/MXuEipsD0O— U' (@toxifyxe) April 28, 2026

India Uber Cup journey concludes with a disappointing 0-5 loss to China3
లీగ్‌ దశలోనే భారత్‌ అవుట్‌

హోర్‌సెన్స్‌ (డెన్మార్క్‌): ఉబెర్‌ కప్‌ మహిళల బ్యాడ్మింట్‌ టీమ్‌ టోర్నీలో ఈసారి భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గత మూడు పర్యాయాల్లో నాకౌట్‌ దశకు అర్హత పొందిన టీమిండియా ఈసారి మాత్రం లీగ్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే 16 సార్లు చాంపియన్‌ చైనా జట్టుపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు 0–5తో పరాజయం పాలైంది.గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన చైనా... భారత్, ఉక్రెయిన్‌ జట్లపై గెలిచిన డెన్మార్క్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాయి. చైనాతో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 78 నిమిషాల్లో 16–21, 21–19, 19–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ జి యి చేతిలో పోరాడి ఓడిపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒకదశలో 18–12తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత సింధు ఒక పాయింటే నెగ్గగా... వాంగ్‌ జి యి తొమ్మిది పాయింట్లు గెలిచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా 11–21, 8–21తో లియు షెంగ్‌ షు–టాన్‌ నింగ్‌ చేతిలో ఓడిపోయారు.మూడో మ్యాచ్‌లో ఇషారాణి బారువా 20–22, 13–21తో చెన్‌ యుఫె చేతిలో... నాలుగో మ్యాచ్‌లో తనీషా క్రాస్టో–సెల్వం కవిప్రియ 21–10, 12–21, 19–21తో లువో జు మిన్‌–జాంగ్‌ షు జియాన్‌ చేతిలో... ఐదో మ్యాచ్‌లో దేవిక సిహాగ్‌ 21–19, 17–21, 10–21తో జు వెన్‌ జింగ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014, 2016 ఉబెర్‌ కప్‌ టోరీ్నల్లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు గెలిచిన భారత జట్టు... 2018లో లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఆ తర్వాత 2020, 2022, 2024లలో క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం పాలైంది.

Asian Games could soon be moved to odd-numbered years4
బేసి సంవత్సరాల్లో ఆసియా క్రీడలు!

న్యూఢిల్లీ: నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడల నిర్వహణలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌ వేదికగా ఏషియన్‌ గేమ్స్‌ జరగనుండగా... ఇక తదుపరి క్రీడలను ఐదేళ్ల తర్వాత నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 2014, 2018, 2022, 2026 ఇలా సరి సంఖ్య సంవత్సరాల్లో ఈ క్రీడలు నిర్వహిస్తుండగా... 2026 ఏషియన్‌ గేమ్స్‌ ముగిసిన అనంతరం బేసి సంఖ్య సంవత్సరంలో ఈ పోటీలు జరిపే దిశగా నిర్వాహకులు చర్యలు జరుపుతున్నారు. దీంతో ఒలింపిక్‌ క్రీడలకు ముందు ఇవి అర్హత పోటీలుగా ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం చైనాలో ఆసియా బీచ్‌ గేమ్స్‌ జరుగుతుండగా... ఈ సందర్భంగా ఆసియా ఒలింపిక్స్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) కార్యవర్గం ఈ అంశంపై చర్చించింది. ప్రస్తుతం 2020, 2024, 2028, 2032 ఇలా సరి సంఖ్య సంవత్సరాల్లో ఒలింపిక్స్‌ జరుగుతుండగా... ఆసియా క్రీడలను బేసి సంఖ్యకు మార్చితే విశ్వక్రీడలకు ఒక్క ఏడాది ముందు వాటిని నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏషియన్‌ గేమ్స్‌ ముగిసిన అనంతరం 2030లో ఖతర్‌లోని దోహాలో ఈ క్రీడలు జరగాల్సి ఉంది. కానీ వాటిని ఒక ఏడాది వాయిదా వేసి 2031లో నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. ‘ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఈ అంశంపై చర్చిస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసియా క్రీడల నిర్వహణ చేపడుతూనే ప్రేక్షకాదరణ, స్పాన్సర్‌షిప్‌ విలువ పెంచే దిశగా చర్చిస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చితే ఖతర్‌లోని దోహాలో జరగాల్సిన 2030 ఆసియా క్రీడలు 2031కి వాయిదా పడతాయి. ఇదే జరిగితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు ఇవి అర్హత క్రీడలుగానూ ఉపయోగపడతాయి. దీంతో అన్నీ దేశాల అథ్లెట్లు ఇందులో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. తద్వారా క్రీడలకు మరింత ఆదరణ పెరుగుతుంది’ అని అంతర్జాతీయ క్రీడా నిపుణుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Allyson Felix targets Olympic return at LA 20285
ఫెలిక్స్‌ మళ్లీ వస్తోంది

లాస్‌ ఏంజెలిస్‌: ఒలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన అలీసన్‌ ఫెలిక్స్‌ విశ్వక్రీడల్లో పునరాగమనం చేయనుంది. నాలుగేళ్ల క్రితమే ట్రాక్‌కు టాటా చెప్పి తల్లి అయిన ఫెలిక్స్‌... మరో రెండేళ్లలో అమెరికా వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనాలని భావిస్తోంది. 2004 ఎథెన్స్‌ ఒలింపిక్స్‌ నుంచి మొదలుకొని 2020 టోక్యో ఒలింపిక్స్‌ వరకు తన హవా కొనసాగించిన ఈ అమెరికా స్టార్‌... 2022లో కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అయితే 40 ఏళ్ల వయసులో మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించిన తర్వాత తిరిగి ట్రాక్‌పై పరుగు తీయాలని నిర్ణయించుకుంది.ఇప్పటి వరకు ఒలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో 11 పతకాలు (7 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) సాధించిన ఫెలిక్స్‌... ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా రన్నర్‌గా రికార్డు సృష్టించింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ మహిళల 200 మీటర్ల విభాగంలో పసిడి గెలిచిన ఫెలిక్స్‌... మిగిలిన ఆరు స్వర్ణాలను రిలేలో సాధించింది. 2004 ఎథెన్స్‌ ఒలింపిక్స్‌ 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం సాధించడంతో ప్రారంభమైన ఆమె జోరు... 2020 టోక్యో ఒలింపిక్స్‌ వరకు సాగింది. ట్రాక్‌పై అడుగు పెడితే తిరుగు లేకుండా దూసుకెళ్లే ఫెలిక్స్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) చేజిక్కించుకుంది.ఇప్పటి వరకు ఐదు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ అమెరికా అథ్లెట్‌... 2028లో లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ నిర్వహణ కమిటీలో సభ్యురాలిగానూ కొనసాగుతోంది. సొంతగడ్డపై విశ్వక్రీడలు జరుగుతుండటంతో చివరి ప్రయత్నం చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. ‘సాహసోపేతమైన పనులు చేయొద్దని మనం చాలా మందికి చెబుతుంటాం.ఈ వయసులో నేను ఇంట్లోనే ఉండి పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలి. కానీ అలాగే ఎందుకు చేయాలి. దీన్ని ఎందుకు మార్చకూడదు. లక్ష్యాన్ని చేరేందుకు మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు. ఫలితం ఎలా వచ్చినా నేను నా పిల్లలతోనే ఉంటాను. వాళ్లతో కలిసి సరదాగా గడుపుతూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాను. కానీ స్వదేశంలో జరిగిన ప్రధాన పోటీల్లో పాల్గొనలేకపోయాను అనే భావన మాత్రం ఉండదు కదా’ అని ఫెలిక్స్‌ వివరించింది.

IPL 2026 Match 40: Rajasthan Royals beat Punjab Kings6
ఫెరియెరా ఊచకోత.. పంజాబ్‌కు ఓటమి రుచి చూపించిన రాజస్థాన్‌

ఐపీఎల్‌ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతూ, ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతున్న పంజాబ్‌ కింగ్స్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ ఓటమి రుచి చూపించింది. సొంతగడ్డ ముల్లాన్‌పూర్‌ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో స్టోయినిస్‌ (22 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రిజేష్‌ శర్మ వేసిన చివరి ఓవర్‌లో స్టోయినిస్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు. అంతకుముందు ప్రభ్‌సిమ్రన్‌ (59) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా పంజాబ్‌ ఆటగాళ్లలో ప్రియాంశ్‌ ఆర్య (29), కూపర్‌ కన్నోల్లీ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో యశ్‌ రాజ్‌ పుంజా 2, ఆర్చర్‌, బర్గర్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. డొనోవన్‌ ఫెరియెరా (52 నాటౌట్‌), షుభమ్‌ దూబే (31 నాటౌట్‌) ఊచకోత కోసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు యశస్వి జైస్వాల్‌ (51), వైభవ్‌ సూర్యవంశీ (43) తమ సహజశైలిలో రెచ్చిపోయి రాయల్స్‌ గెలుపుకు గట్టి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన ధృవ్‌ జురెల్‌ (16) కాస్త తడబడినప్పటికీ.. అతని తర్వాత వచ్చిన రియాన్‌ పరాగ్‌ (29) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇతని తర్వాత క్రీజ్‌లో కుదురుకున్న ఫెరియెరా, షుభమ్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. పంజాబ్‌ బౌలర్లలో చహల్‌ 3, అర్షదీప్‌ ఓ వికెట్‌ తీశారు.

HCA TG20 League Logo Unveiling on April 297
ఏప్రిల్ 29న హెచ్‌సీఏ TG20 లీగ్ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తన ప్రతిష్ఠాత్మక T20 లీగ్ ‘TG20’ ను ఏప్రిల్ 29న నగరంలో ఘనంగా ఆవిష్కరించనుంది. ఈ లీగ్ రాష్ట్రంలోని దేశీయ క్రికెట్‌కు కొత్త దిశను చూపే కీలక అడుగుగా భావిస్తున్నారు.గ్రాస్‌రూట్ స్థాయి నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ వరకు వారధిగా TG20 రూపుదిద్దుకుంటోంది. పారదర్శకత, పోటీ వాతావరణం, ప్రతిభా వికాసం అనే లక్ష్యాలతో ఈ లీగ్ రూపొందించబడింది. Board of Control for Cricket in India (BCCI) దృష్టికోణానికి అనుగుణంగా, జిల్లా స్థాయి ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి ఉన్నత స్థాయి వేదికల వరకు చేరుకునే మార్గాన్ని ఇది సృష్టిస్తుంది.ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) ప్రక్రియకు కార్పొరేట్ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. తొలి సీజన్ జూన్–జూలై 2026లో ప్రారంభం కానుంది. మ్యాచ్ షెడ్యూల్ మరియు జట్ల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.అగ్రశ్రేణి లీగ్‌ల తరహాలో రూపొందించిన TG20, ఆటగాళ్లకు అధిక స్థాయి పోటీ వాతావరణాన్ని కల్పిస్తూ, వారి ప్రతిభను మెరుగుపరచడానికి మరియు గుర్తింపు పొందడానికి సహాయపడుతుంది.TG20 vs డొమెస్టిక్ లీగ్స్•​పోటీ స్థాయి: TG20 – అధికం | క్లబ్ క్రికెట్ – మధ్యస్థం​•​మ్యాచ్ ఒత్తిడి: ప్రొఫెషనల్ | సెమీ-ప్రొఫెషనల్​•​గుర్తింపు (Exposure): విస్తృతం | పరిమితం​•​ఆటగాళ్ల అభివృద్ధి: వేగంగా | క్రమంగాఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు పాల్గొని, 32 మ్యాచ్‌లు నిర్వహించబడతాయి. అన్ని మ్యాచ్‌లు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రౌండ్-రోబిన్ మరియు ప్లేఆఫ్ పద్ధతిలో జరుగుతాయి.హెచ్‌సీఏ అధికారులు TG20 ను కేవలం లీగ్‌గా కాకుండా, జిల్లా స్థాయి ప్రతిభను గుర్తించి, పెంపొందించి, ప్రదర్శించే ఒక సమగ్ర ప్రతిభా వేదికగా అభివర్ణించారు.పారదర్శకత, నిష్పక్షపాతత, ప్రొఫెషనలిజం వంటి విలువలతో ఈ లీగ్ నిర్వహించబడనుంది. ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు, మరియు ఇతర భాగస్వాముల నుంచి విస్తృత స్పందన లభించే అవకాశముంది.క్రికెట్‌కే పరిమితం కాకుండా, ప్రేక్షకులకు ఉత్సాహభరితమైన మ్యాచ్‌లు, వినోదాత్మక కార్యక్రమాలతో పండుగ వాతావరణాన్ని TG20 అందించనుంది. ఈ లీగ్‌లో విజయాన్ని సాధించాలంటే ప్రొఫెషనల్ సిద్ధత, క్రమశిక్షణ, మరియు స్థిరత్వం అత్యంత ముఖ్యమైనవి.ధన్యవాదాలుఎచ్ సి ఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి

Babar Azam sets all time PSL record during Qualifiers against United8
విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌

ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026లో ఆ దేశ స్టార్‌ బ్యాటర్‌, పెషావర్‌ జల్మీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (ఏప్రిల్‌ 28) మరో సెంచరీ బాదాడు. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో బాబర్‌ ఉగ్రరూపం దాల్చాడు. 59 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఫలితంగా అతని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మిగతా పెషావర్‌ బ్యాటర్లలో మొహమ్మద్‌ హరీస్‌ (35), కుసాల్‌ మెండిస్‌ (41), ఆరోన్‌ హార్డీ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బ్రేస్‌వెల్‌ (2), అబ్దుల్‌ సమద్‌ (0), ఫర్హాన్‌ (0) నిరాశపరిచారు. ఇస్లామాబాద్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్‌ గ్లీసన్‌ 2, సల్మాన్‌ మీర్జా, ఫహీమ్‌ అష్రాఫ్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.ఇదిలా ఉంటే, ఈ సెంచరీతో బాబర్‌ ఓ ఆల్‌టైమ్‌ పీఎస్‌ఎల్‌ రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్‌ చరిత్రలో నాలుగు సీజన్లలో (2021, 2023, 2024, 2026) 500 ప్లస్‌ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డుకు సంబంధించి బాబర్‌ తర్వాతి స్థానంలో మొహమ్మద్‌ రిజ్వాన్‌ ఉన్నాడు. రిజ్వాన్‌ పీఎస్‌ఎల్‌లో మూడు సీజన్లలో (2021, 2022, 2023) 500 ప్లస్‌ పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ 598 పరుగులు చేసి, పీఎస్‌ఎల్‌ చరిత్రలో ఓ సింగిల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు లాహోర్‌ ఖలందర్స్‌ ప్లేయర్‌ ఫకర్‌ జమాన్‌ పేరిట ఉండేది. జమాన్‌ 2022 ఎడిషన్‌లో 588 పరుగులు చేశాడు.

Why Are Punjab Kings Players Wearing Black Armbands vs Rajasthan Royals?9
పంజాబ్‌ ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌ ధరించడం వెనుక హృదయ విదారక కారణం

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 28) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు నల్లటి ఆర్మ్‌ బ్యాండ్స్‌ ధరించి కనిపించారు. దీని వెనుక హృదయ విదారక కారణం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ నిన్న తన తల్లిని కోల్పోయారు.ఇందుకు సంతాపంగా పంజాబ్‌ కింగ్స్‌ బృంద సభ్యులు మొత్తం నల్ల బ్యాండ్‌లు ధరించారు. ఈ మ్యాచ్‌ టాస్‌ సందర్భంగా పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒమర్‌జాయ్‌ తల్లి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పంజాబ్‌ కింగ్స్‌ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో కూడా పోస్ట్‌ చేసింది."అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి మరణం పట్ల మా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ కింగ్స్ కుటుంబం మొత్తం అతనితో పాటు అతని కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది" అని పేర్కొంది.ఒమర్‌జాయ్‌ తన తల్లి అంత్యక్రియల నిమిత్తం స్వదేశానికి వెళ్లాడు. జట్టు కూర్పు సమస్యల కారణంగా ఒమర్‌జాయ్‌కు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా రాలేదు. గత సీజన్‌లో పంజాబ్ తరఫున అతడు కొన్ని కీలక ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తనదైన ముద్ర వేశాడు.ఒమర్జాయ్ ఐపీఎల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2024లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున అరంగేట్రం చేసిన అతడు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌లో చేరాడు.ఇదిలా ఉంటే, ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పంజాబ్‌ 18 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ (59), ప్రియాంశ్‌ ఆర్య (29), కూపర్‌ కన్నోల్లీ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (30) ఔట్‌ కాగా.. స్టోయినిస్‌ (24), సూర్యంశ్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో పంజాబ్‌ అజేయ జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Preity Zinta Epic Response For Chahal Wants-To Open For Punjab Kings10
ప్రీతి జింటా దిమ్మతిరిగే కౌంటర్‌.. షాక్‌లో చాహల్‌!

ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ క్యాంపులో ప్రస్తుతం సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు స్పిన్నర్ య‌జ్వేంద్ర చాహల్, ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండటంతో, య‌జ్వేంద్ర చాహల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రీతి జింటాను ఉద్దేశించి స‌ర‌దాగా పోస్టు పెట్టాడు. ‘మేడమ్.. నాకు ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా?’ అని సరదాగా అడిగాడు. దీనికి ప్రీతి జింటా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘తప్పకుండా చాహల్‌.. నీ కోసం ఏదైనా చేస్తాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత నీకు నచ్చిన మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయొచ్చు. అప్పుడు ప్రబ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్‌ ఆర్య కూడా ఏమీ అనుకోరని నాకు తెలుసు’ అంటూ లాఫింగ్‌ ఎమోజీ జత చేస్తూనే తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్‌ ఇవ్వడంతో చాహల్‌ షాక్‌ తినక తప్పలేదు.ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసిన పంజాబ్ పలు రికార్డులు తన పేరిట లిఖించింది. ఇప్పటికే పట్టికలో టాప్ స్థానంలో కొనసా గుతున్న పంజాబ్ ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే తొలి జట్టుగా కూడా నిలవనుంది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌కే పరిమితమైన పంజాబ్ ఈసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది.Mam ek match mein open batting karne ka chance mil jaaye toh 🥹🤣🤣😁 #pzchat— Yuzvendra Chahal (@yuzi_chahal) April 27, 2026చదవండి: వైరల్‌గా మారిన జితేశ్‌ శర్మ చర్య!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement