Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Telangana Cricket Association Press Meet Over HCA U14 Selections1
కోర్టు చెప్పినా మారరా?.. హెచ్‌సీఏపై టీసీఏ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవినీతి జరుగుతూనే ఉందని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. ప్రీమియర్ లీగ్ పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తే హెచ్‌సీఏ అధికారులను బయట తిరగనివ్వబోమని హెచ్చరించింది. హెచ్‌సీఏలో అక్రమాల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది.అండర్ -14 టీమ్‌ అనే ప్రస్తావన లేదుఈ సందర్భంగా.. ‘‘ప్రీమియర్ లీగ్ పేరుతో మళ్లీ మోసం చేయాలని చూస్తే హెచ్‌సీఏ అధికారులను బయట తిరగ నివ్వం. ప్రీమియర్ లీగ్ కూడా TCA నిర్వహిస్తుంది. అండర్ 14 సెలక్షన్ పేరుతోనూ అవినీతి కి పాల్పడ్డారు. 3500 మంది క్రీడాకారులను ఇబ్బంది పెట్టారు. BCCIలో అసలు అండర్ -14 టీమ్‌ అనే ప్రస్తావన లేదు.అయినా సెలక్షన్‌కు అని పిలిచి జింఖాన గ్రౌండ్ లో కనీసం సౌకర్యాలు కల్పించలేదు. సొంతం గా అసోసియేషన్‌లు పెట్టుకొని.. 15 మంది ని సెలెక్ట్ చేయడానికి ఐదు వేల మంది ని నిలబెట్టారు. HCA అవకతవకలపై హ్యూమన్ రైట్స్‌​తో పాటు డీజీపి కి ఫిర్యాదు చేస్తాం. ఎన్నిసార్లు కోర్టు మొట్టకాయలు వేసినా HCA తీరులో మార్పు లేదు. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం’’ అని టీసీఏ పేర్కొంది.BCCI గుర్తింపు కోసంటీసీఏ జనరల్‌ సెక్రటరీ గురువా రెడ్డి మాట్లాడుతూ.. BCCI గుర్తింపు కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి సుమోటోగా HCAపై విచారణ జరపాలి. BCCI నిబంధనలను HCA పాటించడం లేదు’’ అని పేర్కొన్నారు. ఇక అడ్వకేట్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్‌ పేరిట పిల్లల్ని, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. ఈ విషయంపై జాతీయ, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తున్నాం’’ అని తెలిపారు.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?

U19 Asia Cup 2025: Vaibhav Suryavanshi Ton Powers IND set 434-run target Uae2
Asia Cup 2025:: భారత్‌ 433 పరుగుల భారీ స్కోర్‌

అండ‌ర్‌-19 ఆసియాక‌ప్‌లో భాగంగా దుబాయ్ వేదిక‌గా యూఏఈతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు జూలు విదిల్చారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త యువ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 433 ప‌రుగులు చేసిది. యువ‌సంచ‌ల‌నం, టీమిండియా ఓపెనర్‌ వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్‌ను వైభవ్ అందుకున్నాడు. మొత్తంగా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో డబుల్‌ సెంచరీ చేసేలా వైభవ్‌ కన్పించాడు. దూకుడుగా ఆడే క్రమంలో తన వికెట్‌ను కోల్పోయాడు.వైభవ్‌తో పాటు ఆరోన్‌ జార్జ్‌(69), విహాన్‌ మల్హోత్రా(69) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో అభిజ్ఞాన్ కుండు(32), కన్షిక్‌ చౌహన్‌(28) మెరుపులు మెరిపించారు. వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) మాత్రం సింగిల్ డిజిట్ స్కోర్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. యూఏఈ బౌలర్లలో యూగ్‌ శర్మ, సూరి తలా రెండు వికెట్లు సాధించాడు. కాగా యూత్‌ వన్డేల్లో భారత్‌ 400 ప్లస్‌ పైగా పరుగులు సాధించడం ఇదే మూడో సారి. తద్వారా ఈ ఫీట్‌ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?[node:field_tags]A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025

Nitish Kumar Reddy rattles MP with hat-trick in Syed Mushtaq Ali Trophy Super League3
నితీశ్ రెడ్డి హ్యాట్రిక్‌.. అయినా త‌ప్ప‌ని ఓట‌మి

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద‌ర‌గొట్టాడు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్‌.. శుక్రవారం మధ్యప్రదేశ్‌తో జరిగిన సూపర్ లీగ్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో దుమ్ములేపాడు.తొలుత బ్యాటింగ్‌లో 25 ప‌రుగులతో స‌త్తాచాటిన నితీశ్‌.. అనంత‌రం బౌలింగ్‌లో హ్యాట్రిక్ వికెట్ల‌తో మెరిశాడు. 19.1 ఓవర్లలో కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో శ్రీకర్‌ భరత్‌(39), నితీశ్‌ రెడ్డి(25) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఎంపీ బౌలర్లలో శివమ్‌ శుక్లా నాలుగు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్‌ మూడు, రాహుల్‌ బాథమ్‌ రెండు వికెట్లు సాధించారు.నితీశ్‌ హ్రాట్రిక్‌ షో..113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌కు నితీశ్‌ ఆరంభంలోనే షాక్‌ ఇచ్చాడు. మూడో ఓవర్‌ వేసిన నితీశ్‌ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి ఎంపీని కష్టాల్లో​కి నెట్టాడు. నితీష్‌ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా హర్ష్ గవాలి క్లీన్ బౌల్డ్ కాగా.. ఆ తర్వాత డెలివరీకి హర్‌ప్రీత్ సింగ్ రిక్కీ భుయ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఇక చివరగా నితీశ్‌ ఎంపీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రిషబ్‌ చౌహన్‌(47), రాహుల్‌ బాథమ్‌(35 నాటౌట్‌) ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆంధ్రపై 4 వికెట్ల తేడాతో ఎంపీ ఘన విజయం సాధించింది.చదవండి: Asia Cup: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో

Vaibhav Suryavanshi misses record 200, scores 95-ball 171 in U19 Asia Cup4
వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో

అండర్‌-19 ఆసియాకప్ 2025ను టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ భారీ సెంచరీతో చెలరేగాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకు వైభవ్ చుక్కలు చూపించాడు.తొలుత కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తనదైన స్టైల్లో బౌండరీల వర్షం కురిపించాడు. అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమం‍లో కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్‌ను వైభవ్ అందుకున్నాడు.సెంచరీ పూర్తి అయిన తర్వాత కూడా తన జోరును కొనసాగించాడు. అతడి దూకుడు చూస్తే సునాయసంగా డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని అంతాభావించారు. స్పిన్నర్ ఉద్దీష్ సూరి బౌలింగ్‌లో అనవసరంగా రివర్స్ స్కూపు షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. ఓవరాల్‌గా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఏడాది అతడికి అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది ఆరో సెంచరీ కావడం విశేషం.ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ దిశ‌గా భార‌త్ సాగుతోంది. 44 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త యువ జ‌ట్టు 4 వికెట్లు కోల్పోయి 353 ప‌రుగులు చేసింది. విధ్వంసంక‌ర సెంచ‌రీతో మెరిసిన వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) సింగిల్ డిజిట్ స్కోర్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్‌A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025

Wrestler Vinesh Phogat makes retirement U-turn5
రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకున్న వినేశ్‌ ఫొగాట్‌

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంది. ఒలింపిక్స్‌లో పతకం గెలవాలనే తన కలను నేరవేర్చుకునేందుకు మనసు మార్చుకుంటున్నట్లు ఫొగాట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా 31 ఏళ్ల వినేశ్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. పతకం ఖాయమైన వేళ అనుహ్యంగా ఆమెపై వేటు పడింది. 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో నిర్దేశించిన బరువు కంటే వినేష్ ఫొగాట్ 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో ఆమెపై వేటు వేశారు. దీంతో ఆమె తన ఒలింపిక్ కల నేరవేరకుండానే భారత్‌కు తిరిగిచ్చింది. ఆ తర్వాత ఉమ్మడి రజత పతకం ఇవ్వాలని వినేష్ ఫొగాట్.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీల్ చేసింది. అయితే సీఏఎస్ వినేష్ ఫొగాట్‌ అభ్యర్థనను సీఏఎస్ తోసిపుచ్చడంతో ఆమెకు తీవ్ర నిరాశే ఎదురైంది.ఈ క్రమంలో ఆమె రి సోషల్ మీడియా వేదికగా టైర్మెంట్ ప్రకటిస్తూ అందరికి షాకిచ్చింది. ఆ తర్వాత ఫొగాట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేసి జులనా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ఎంపికైంది. ఇప్పుడు లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఆడేందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది."పారిస్ ఒలింపిక్స్‌తో నా రెజ్లింగ్ జర్నీ ముగిసిందా అని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఆ ప్రశ్నకు ఇప్పటివరకు నేను సమాధానం చెప్పలేకపోయాను. నేను రెజ్లింగ్ మ్యాట్‌, ఆ ఒత్తిడి, నా ల‌క్ష్యాల నుంచి కొన్నాళ్ల‌పాటు దూరంగా ఉండిపోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ బ‌రిలోకి దిగాల‌ని అనుకుంటున్నారు. నేను ఇప్పటికీ ఈ క్రీడను(రెజ్లింగ్‌) ప్రేమిస్తున్నాను" అని రిటైర్మెంట్ యూట‌ర్న్ ప్ర‌క‌ట‌న‌లో ఫోగాట్ పేర్కొంది.

New Zealand Secure Nine Wicket Win Over West Indies In Wellington Test6
విండీస్‌తో​ రెండో టెస్టు.. న్యూజిలాండ్‌ ఘన విజయం

వెల్లింగ్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకెండ్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. 56 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని బ్లాక్‌క్యాప్స్ కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి చేధించింది. డెవాన్ కాన్వే(28), కేన్ విలియ‌మ్స‌న్‌(16) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 205 ప‌రుగుల‌కు ఆలౌటైంది. విండీస్ బ్యాట‌ర్ల‌లో షాయ్ హోప్‌(47) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. క్యాంప్‌బెల్‌(44) , కింగ్‌(33) రాణించారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో టిక్న‌ర్ నాలుగు, రే మూడు వికెట్లు సాధించారు.అనంత‌రం కివీస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 278/9 వద్ద ముగించింది. ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడ్డ పేసర్‌ టిక్నర్‌ బ్యాటింగ్‌కు రాలేదు. మిచెల్‌ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్‌), డెవాన్‌ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు 73 పరుగుల ఆధిక్యం లభించింది. కరీబియన్‌ బౌలర్లలో అండర్సన్‌ ఫిలిప్‌ 3, రోచ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో విండీస్‌ కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. కివీ పేసర్‌ జాకబ్‌ డఫీ 5 వికెట్లు పడగొట్టి కరేబియన్ల పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మిచెల్ రే మూడు వికెట్లు సాధించాడు. కవీమ్‌ హోడ్జ్‌(35) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో విండీస్‌ ఆతిథ్య జట్టు ముందు కేవలం 56 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మౌంట్ మంగునూయ్ వేదికగా డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?

Suryakumar, Shubman Gill hurting India Ahead T20 worldcup 20267
‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?

టీ20 వరల్డ్‌కప్‌-2026కు కౌంట్‌డౌన్ మొద‌లైంది. మ‌రో 55 రోజుల్లో భార‌త్‌, శ్రీలంక వేదిల‌క‌గా ఈ మెగా టోర్న‌మెంట్ షూరూ కానుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఇద్ద‌రు ప్లేయ‌ర్ల పేల‌వ ఫామ్‌ భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. అందులో ఒకరు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాగా.. మరొకరు అతడి డిప్యూటీ శుభ్‌మన్ గిల్‌.టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వీరిద్ద‌రూ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు.సూర్యకు ఏమైంది..?ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా పేరున్న సూర్యకుమార్.. 2025లో మాత్రం ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఐపీఎల్‌-2025లో రాణించిన‌ప్ప‌టికి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పూర్తిగా తేలిపోయాడు. కెప్టెన్‌గా జ‌ట్టును విజ‌యప‌థంలో న‌డిపిస్తున్న‌ప్ప‌టికి వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌రంగా మాత్రం తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు.ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 18 అంత‌ర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 స‌గ‌టుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సంవత్సరం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతడి టాప్ స్కోర్ 38 పరుగులగా ఉంది. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సూర్య తన చెత్త ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారుతున్నాడు. తనపై తనకే నమ్మకం లేక ఒక మ్యాచ్‌లో మూడో స్ధానంలో.. మరో మ్యాచ్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఒకప్పుడు సూర్య క్రీజులో ఉంటే బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడేవారు. కానీ ఇప్పుడు అతడి వీక్‌నెస్‌ను పసిగట్టిన బౌలర్లు.. అతడిని చాలా ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఇంకా 8 మ్యాచ్‌లు ఆడనుంది. సౌతాఫ్రికాతో మూడు, న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లలో సూర్య తిరిగి తన ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. లేదంటే భారత్‌కు బ్యాటింగ్‌ కష్టాలు తప్పవు. ఈ సిరీస్‌లో తొలి టీ20లో కేవలం 12 పరుగులు చేసిన సూర్యకుమార్‌.. రెండో టీ20లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మూడో మ్యాచ్‌లోనైనా ఈ ముంబై ఆటగాడు తన బ్యాట్‌కు పనిచెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.గిల్ ఢమాల్‌..ఇక మొన్నటివర​కు టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో అస్సలు శుభ్‌మన్ గిల్ లేడు. టీ20ల్లో భారత జట్టు ఓపెనర్లగా సంజూ శాంసన్‌, అభిషేక్ శర్మ ఉండేవారు. కానీ ఆసియాకప్ 2025కు ముందు గిల్‌ను టీ20ల్లో అనూహ్యంగా తీసుకొచ్చారు. అంతేకాకుండా అప్పటివరకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను తప్పించి ఆ బాధ్యతలను గిల్‌కు బీసీసీఐ అప్పగించింది.అయితే ఆల్‌ఫార్మాట్‌గా గిల్‌కు పేరు ఉన్నప్పటికి.. తన టీ20 రీ ఎంట్రీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియాకప్‌, ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20ల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్‌.. రెండో టీ20ల కనీసం తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను తప్పించి మరి అతడికి ఓపెనర్‌గా అవకాశమిచ్చారు. కానీ అతడు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాపరుస్తున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్‌లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాబోయో మ్యాచ్‌లలోనైనా కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ ఇద్దరూ తమ ఫామ్‌ను అందుకుంటారో లేదో చూడాలి.చదవండి: IND Vs SA: అర్ష్‌దీప్‌ 13 బంతుల ఓవర్‌.. గంభీర్ రియాక్షన్‌ వైరల్‌

Gautam Gambhir Left Fuming As India Star Scripts Unwanted Record With Marathon Over8
అర్ష్‌దీప్‌ 13 బంతుల ఓవర్‌.. గంభీర్ రియాక్షన్‌ వైరల్‌

ముల్లాన్‌పూర్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండో టీ20లో టీమిండియాకు ఘోర ప‌రాభవం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 51 ప‌రుగుల తేడాతో టీమిండియా చిత్తు అయింది. ముఖ్యంగా బౌలింగ్‌లో అయితే మెన్ ఇన్ బ్లూ పూర్తిగా తేలిపోయింది. ఒక్క వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌ప్ప మిగితా బౌల‌ర్లు అంద‌రూ అట్ట‌ర్‌ప్లాప్ అయ్యారు. స్టార్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అయితే దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ప‌దేప‌దే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ స‌ఫారీ బ్యాట‌ర్ల‌కు టార్గెట్‌గా మారాడు. అస్స‌లు ఏ మాత్రం రిథ‌మ్‌లో కన్పించ‌లేదు.ఒక ఓవ‌ర్‌లో 13 బంతులుప్రోటీస్ ఇన్నింగ్స్ 11వ‌ ఓవ‌ర్ వేసిన అర్ష్‌దీప్ త‌న చెత్త‌ బౌలింగ్‌తో అంద‌రికి చిరాకు తెప్పించాడు. 6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1.. ఆ ఓవ‌ర్‌లో అర్ష్‌దీప్ వేసిన బంతుల వ‌రుస ఇది. ఈ పంజాబీ పేస‌ర్ త‌న ఓవ‌ర్‌ను పూర్తిచేసేందుకు ఏకంగా 13 బంతులు వేయాల్సి వ‌చ్చింది. తొలి బంతిని డికాక్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదగా... మిగతా 5 లీగల్‌ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్‌లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి. డగౌట్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సైతం అర్ష్‌దీప్‌పై సీరియ‌స్ అయ్యాడు. ఇదేమి బౌలింగ్ అన్న‌ట్లు రియాక్ష‌న్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.చెత్త రికార్డు..అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన ఆఫ్ఘనిస్తాన్ పేస‌ర్‌ నవీన్-ఉల్-హక్ రికార్డును అర్ష్‌దీప్ సమం చేశాడు. నవీన్ గత ఏడాది హరారేలో జింబాబ్వేపై ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు. అయితే భార‌త్ త‌ర‌పున ఈ చెత్త ఫీట్ సాధించిన తొలి బౌల‌ర్ మాత్రం అర్ష్‌దీపే కావ‌డం గ‌మ‌నార్హం.Gautam Gambhir angry at Arshdeep as he bowled 7 wide bowls in an over 💀 pic.twitter.com/EqUa7nFqW5— ••TAUKIR•• (@iitaukir) December 11, 2025చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్‌

ICC Ceo hails success of World Test Championship9
'డబ్ల్యూటీసీ ఫైనల్స్.. మా అంచనాలను అందుకున్నాయి'

దుబాయ్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌ టెస్టు క్రికెట్‌లో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయిలో ఉండాలని తాము ఆశించామని... మూడు ఫైనల్‌ మ్యాచ్‌లు కూడా తమ అంచనాలను అందుకున్నాయని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సీఈఓ సంజోగ్‌ గుప్తా అభిప్రాయ పడ్డారు. 2025లో జరిగిన ఫైనల్స్‌ కోసం లార్డ్స్‌ స్టేడియం పూర్తిగా నిండిపోవడం ఐసీసీ చరిత్రలో నిలిచిపోయే క్షణమని ఆయన అన్నారు. ఇప్పటి వరకు మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ జరగ్గా... వరుసగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా విజేతలుగా నిలిచాయి."డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ అంటే మిగతా టెస్టుల తరహాలో కాదు. ఈ ఫార్మాట్‌లో రెండేళ్ల శ్రమ తర్వాత రెండు అత్యుత్తమ జట్లు తలపడే సందర్భం. టెస్టు క్రికెట్‌ విలువ ఏమిటో ఈ మ్యాచ్‌లు చూపించాయి. డబ్ల్యూటీసీ మొదలు పెట్టినప్పుడు మేం ఆశించిన స్పందన ఇక్కడ వచ్చింది. మా అంచనాలు ఫైనల్స్‌ అందుకున్నాయి. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ గానీ ఇంగ్లండ్‌ గానీ ఆడలేదు. అయినా సరే స్టేడియం నిండిపోయింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌పై అభిమానులు ఎంత ఆసక్తిని ప్రదర్శించారో ఇది చూపించింది. అన్నింటికి మించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరో ఆరు నెలల సమయం ఉన్నా కూడా ఎవరు ఫైనల్‌ చేరతారనే చర్చ అన్ని జట్లలో కనిపిస్తోంది. దీనికి అర్హత సాధించే క్రమంలో ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల ప్రాధాన్యం ఎంతో పెరిగింది" అని సంజోగ్‌ వ్యాఖ్యానించారు.చదవండి: నేను.. అత‌డే ఈ ఓట‌మికి కార‌ణం! ప్ర‌తీసారి కూడా: సూర్యకుమార్‌

South Africa Creates History Becomes First Team In The World 10
చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. బుధవారం ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో భారత్‌ను దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు.తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌((46 బంతుల్లో 7 సిక్స్‌లు, 5 ఫోర్లతో 90) విధ్వంసం సృష్టించగా.. డొనవాన్‌ ఫెరీరా(16 బంతుల్లో 30), మిల్లర్‌(12 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో సౌతాఫ్రికా బౌలర్ల దాటికి భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ బార్ట్‌మన్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. ఎంగిడీ, సిప్లమా, జాన్సెన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది.ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్‌..ఇక ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. టీ20ల్లో టీమిండియాపై సఫారీలకు ఇది పదమూడో విజయం.ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ రెండు జట్లు భారత్‌పై ఇప్పటివరకు 12 సార్లు టీ20 విజయాలు నమోదు చేశాయి. తాజా గెలుపుతో ఈ రెండు జట్లను సౌతాఫ్రికా అధిగమించింది.భారత్‌పై అత్యధిక టీ20 విజయాలు సాధించిన జట్లుదక్షిణాఫ్రికా-13ఆస్ట్రేలియా-12ఇంగ్లాండ్‌-12న్యూజిలాండ్-10వెస్టిండీస్10చదవండి: నేను.. అత‌డే ఈ ఓట‌మికి కార‌ణం! ప్ర‌తీసారి కూడా: సూర్యకుమార్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement