Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND vs ENG: Deepak Chahar Joins Teamindia practice session1
రెండేళ్ల‌గా జ‌ట్టుకు దూరం.. క‌ట్ చేస్తే! స‌డ‌న్‌గా భార‌త జ‌ట్టుతో ప్రాక్టీస్‌

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో త‌ల‌ప‌డేందుకు టీమిండియా సిద్ద‌మైంది. గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం పెంచుకోవాలని భార‌త్ భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించింది. అయితే బుధ‌వారం జ‌రిగిన ప్రాక్టీస్ సెష‌న్‌లో భార‌త జ‌ట్టుతో పాటు ఓ ప్రత్యేక ఆతిథి క‌స‌ర‌త్త‌లు చేస్తూ క‌న్పించాడు. ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక కాన‌ప్ప‌టికి నెట్స్‌లో జ‌ట్టుకు త‌న సేవ‌ల‌ను అందించాడు. అత‌డే టీమిండియా, ముంబై ఇడియన్స్ స్టార్‌ పేస‌ర్ దీపక్ చాహ‌ర్‌. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వింబుల్డన్ టోర్న‌మెంట్‌ను వీక్షించేందుకు చాహ‌ర్ త‌న భార్య‌తో క‌లిసి లండ‌న్‌కు వెళ్లాడు.ఈ క్ర‌మంలో లండ‌న్‌లో ఉన్న భార‌త జ‌ట్టుతో చాహ‌ర్ క‌లిశాడు. ఈ రాజ‌స్తాన్ పేస‌ర్ జ‌ట్టుతో క‌ల‌వ‌డమే కాకుండా నెట్స్‌లో భార‌త బ్యాట‌ర్ల‌కు బౌలింగ్ చేశాడు. సాధ‌ర‌ణంగా దీప‌క్ చాహ‌ర్ కొత్త బంతిని అద్బుతంగా స్వింగ్ చేయ‌గ‌ల‌డు. ఈ క్ర‌మంలో లార్డ్స్ మైదానంలో బంతి ఎక్కువ‌గా స్వింగ్ అయ్యే అవ‌కాశ‌మున్నంద‌న‌.. చాహ‌ర్ బౌలింగ్‌లో భార‌త బ్యాట‌ర్లు ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసిన‌ట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఇంత‌కుముందు బ‌ర్మింగ్‌హామ్ టెస్టు సంద‌ర్భంగా పంజాబ్ స్పిన్న‌ర్ హర్‌ప్రీత్ బ్రార్ భార‌త నెట్ ప్రాక్టీస్ సెష‌న్‌లో క‌న్పించి ఆశ్చ‌ర్చ‌ప‌రిచాడు. ఇప్పుడు చాహ‌ర్ నెట్‌బౌల‌ర్‌గా మ‌రి అందరికి షాకిచ్చాడు. దీప‌క్ చాహ‌ర్ చివ‌ర‌గా 2023 డిసెంబ‌ర్‌లో భార‌త త‌ర‌పున ఆడాడు. వ‌న్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన చాహ‌ర్‌.. టెస్టుల్లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు.ఇంగ్లండ్ తుది జ‌ట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జామీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్​మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్Deepak Chahar trains with Team India at Lord’s ahead of the third Test match.[ Rahul Rawat ] pic.twitter.com/bqnASrkAJU— Jay Cricket. (@Jay_Cricket12) July 9, 2025

IND vs ENG: How have India performed at Lord's over the years?2
లార్డ్స్‌లో టీమిండియా రికార్డులు ఇవే.. 2021 ఫలితం రిపీట్ అవుతుందా?

ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో మ‌రో ర‌స‌వ‌త్త‌ర‌ పోరుకు స‌మ‌యం అస‌న్న‌మైది. క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానం వేదిక‌గా గురువారం ప్రారంభం కానున్న‌ మూడో టెస్టులో భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1 స‌మంగా ఉండ‌డంతో.. లార్డ్స్‌లో టెస్టులో ఎలాగైనా గెలిచి ఆధిక్యం పెంచుకోవాల‌ని ఇరు జ‌ట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.అందుకు త‌గ్గ‌ట్టు త‌మ ఆస్త్ర‌శాస్త్రాల‌ను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ జ‌ట్టులోకి స్టార్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత‌ తిరిగొచ్చాడు. అదేవిధంగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా.. లార్డ్స్‌లో ఆడ‌డం ఖాయ‌మైంది.అంతకుతోడు లార్డ్స్ మైదానంలో పచ్చికతో కూడిన వికెట్‌ను తాయారు చేయ‌డంతో ఫాస్ట్ బౌల‌ర్ల‌కు, బ్యాట‌ర్ల‌కు మ‌ధ్య గ‌ట్టి పోటీ నెల‌కోనుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భార‌త క్రికెట్ జ‌ట్టు టెస్టు రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.భయపెడుతున్న గత రికార్డులు..ఈ మైదానంలో గత రికార్డులు భారత అభిమానులను భయపెడుతున్నాయి. లార్డ్స్‌లో ఇప్పటివరకు 19 టెస్టులు ఆడిన టీమిండియా.. కేవలం మూడింట మాత్రమే గెలిచి 12 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత జట్టు 1986లో క‌పిల్‌దేవ్ నేతృత్వంలో లార్డ్స్‌లో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 2014 లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో గెలిచింది. అనంతరం చివరగా 2021లో విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచింది.గిల్ మ్యాజిక్ చేస్తాడా..?టీమిండియా లార్డ్స్‌లో చివ‌ర‌గా 2021లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్బుతం చేసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కోహ్లి సేన‌.. ఏడేళ్ల త‌ర్వాత లార్డ్స్‌లో టెస్టు విజ‌యాన్ని అందుకుంది. 272 పరుగుల లక్ష్య చేధ‌న‌లో ఇంగ్లండ్‌ను 120 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్ చేసి త‌మ స‌త్తాను చాటింది.ఇప్పుడు యువ సార‌థి శుబ్‌మ‌న్ గిల్ వంతు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడో టెస్టు 2021 నాటి ఫ‌లితాన్ని పున‌రావృతం చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. లార్డ్స్‌లో 2021 నాటి చారిత్రత్మక టెస్ట్ విజయంలో భాగమైన ఐదుగురు భారత ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో కూడా ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్‌, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ప్లేయర్లు అప్పుడు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోసారి ఈ సీనియర్ ప్లేయర్లు తమ స్దాయికి తగ్గట్టు రాణిస్తే ప్రత్యర్ధి జట్టుకు చెమటలు పట్టక తప్పుదు.ఇంగ్లండ్ తుది జ‌ట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జామీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్​మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్

Wanindu Hasaranga ruled out of Sri Lanka vs Bangladesh T20Is due to hamstring injury3
శ్రీలంకకు ఊహించని షాక్‌.. స్టార్ ప్లేయర్‌కు గాయం

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆజ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ వనిందు హసరంగా గాయం కార‌ణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని శ్రీలంకకు చెందిన ఓ స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్ ధ్రువీక‌రించాడు. మంగ‌ళ‌వారం(జూలై 8) బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో హ‌స‌రంగా తొడ కండ‌రాల గాయం బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది.మ్యాచ్ అనంతరం వనిందును స్కానింగ్ తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఎంఆర్‌ఐ స్కాన్‌ రిపోర్ట్స్‌ రానిప్పటికి.. సిరీస్‌ సమయానికి అతడు కోలుకునే అవకాశం లేనిట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో హసరంగా ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో 1.67 బౌలింగ్ సగటుతో 9 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. కాగా ఈ శ్రీలంక ఆల్‌రౌండర్‌ తొడకండరాల గాయం​ బారిన పడడం ఇదేమి తొలిసారి కాదు. ఇంతకుముందు 2023లో తన గాయానికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. దీంతో వన్డే వరల్డ్‌కప్‌-2023కు అతడు దూరమయ్యాడు.ఆ తర్వాత తిరిగి కోలుకుని మైదానంలో అడుగుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ అతడి గాయం తిరగబెట్టింది. ఇక బంగ్లా-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. అంతకుముందు బంగ్లాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో లంక కైవసం చేసుకుంది.బంగ్లాతో టీ20లకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కమిందు మెండిస్, అవిష్క ఫెర్నాండో, దసున్ షనక, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందేర్సే, చమీక కరుణా, చమీక కరుణా ఫెర్నాండో, ఎషాన్ మలింగచదవండి: రిష‌బ్ పంత్ ఏమి గిల్‌క్రిస్ట్ కాదు.. ద‌యచేసి ఇక‌ ఆపేయండి: అశ్విన్‌

England Playing XI 3rd Test: Jofra Archer returns to Test after 52 months4
టీమిండియాతో మూడో టెస్టు.. ఇంగ్లండ్ తుది జ‌ట్టు ప్ర‌కట‌న‌

ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య మూడో టెస్టు లార్డ్స్ వేదిక‌గా గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో లార్డ్స్ టెస్టు కోసం త‌మ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఇంగ్లండ్ బుధ‌వారం ప్ర‌క‌టించింది.స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్‌ 52 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంగ్లండ్ టెస్టు జెర్సీలో క‌న్పించ‌నున్నాడు. యువ పేస‌ర్ జోష్ టాంగ్ స్ధానంలో ఆర్చ‌ర్‌ను తుది జ‌ట్టులోకి ఇంగ్లీష్ జ‌ట్టు మెనెజ్‌మెంట్ తీసుకుంది. రెండో టెస్టుకు ఆర్చ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికి ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల కార‌ణంగా బెంచ్‌కే ప‌రిమితమ్యాడు.ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో టీమిండియాపై నిప్పులు చెరిగేందుకు ఈ స్పీడ్‌స్టార్ సిద్ద‌మ‌య్యాడు. ఆర్చ‌ర్ చివ‌ర‌గా 2021లో ఇంగ్లండ్ త‌ర‌పున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ ఒక మార్పు మిన‌హా రెండో టెస్టులో ఆడినే జ‌ట్టును ఇంగ్లండ్ కొన‌సాగించింది. తొలి రెండు టెస్టుల్లో విఫ‌ల‌మైన ఓపెన‌ర్ జాక్ క్రాలీకి ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ మ‌రో ఛాన్స్ ఇచ్చింది.ఈ మూడో టెస్టు కోసం లార్డ్స్ క్యూరేట‌ర్స్ పచ్చికతో కూడిన పిచ్‌ను తాయారు చేశారు. దీంతో ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు. దీంతో ఈ వికెట్‌పై భారత బ్యాటర్లకు ఆర్చర్ గట్టి సవాల్ ఎదురుకానుంది. అయితే భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా తిరిగి రానునుండడంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పిచ్ కండీషన్స్ దృష్టా‍ మూడో టెస్టులో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్ తుది జ‌ట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జామీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.

Rishabh Pant Is Not Gilchrist: Aswin5
రిష‌బ్ పంత్ ఏమి గిల్‌క్రిస్ట్ కాదు.. ద‌యచేసి ఇక‌ ఆపేయండి: అశ్విన్‌

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ ద‌మ్ములేపుతున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ శ‌త‌క్కొట్టిన రిష‌బ్‌.. రెండో టెస్టులో అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు.దీంతో చాలా మంది పంత్‌ను ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తున్నారు. ఈ క్ర‌మంలో టీమిండియా లెజెండ‌రీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. గిల్‌క్రిస్ట్‌తో పంత్‌ను పోల్చడం మానేయాలని అభిమానుల‌ను అశ్విన్ కోరాడు. చాలా ఆంశాల్లో ఆసీస్ దిగ్గ‌జం కంటే పంత్ మెరుగ్గా ఉన్నాడ‌ని అశ్విన్ అభిప్రాయ‌ప‌డ్డాడు."రిషబ్ పంత్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతడికి ఉన్న స్పెషల్ స్కిల్స్ మరొకరు వద్ద లేవు. చాలా మంది అతన్ని ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తున్నారు. దయచేసి ఇక పై పంత్‌ను గిల్‌క్రిస్ట్‌తో పోల్చొద్దు. గిల్ క్రిస్ట్ కు అంత మంచి డిఫెన్స్ ఆడే టెక్నిక్ లేదు.అదే రిష‌బ్ పంత్‌కు డిఫెన్స్ ఆడ‌డంలో అత్యుత్త‌మ స్కిల్స్ ఉన్నాయి. అయితే నేనేమి గిల్‌క్రిస్ట్‌ను త‌క్కువ చేసి మాట్లాడడం లేదు. వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో అత‌డికంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. విధ్వంసానికి మారు పేరు అత‌డు. గిల్లీ ఒక అద్బుత‌మైన వికెట్ కీప‌ర్‌. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి త‌న జ‌ట్టుకు ఎన్నో చారిత్ర‌త్మ‌క విజ‌యాలు అందించాడు. అయితే రిష‌బ్‌కు గిల్‌క్రిస్ట్‌కు మాత్రం చాలా తేడాలు ఉన్నాయి. అత‌డి ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వ‌స్తే.. పంత్ ఐదవ స్దానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. పంత్ చేసే ప‌నులు మ‌రో బ్యాట‌ర్ చేయ‌లేడు" అని త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో అశ్విన్ పేర్కొన్నాడు. కాగా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య మూడో టెస్టు గురువారం నుంచి లార్డ్స్ వేదిక‌గా ప్రారంభం కానుంది.చదవండి: ICC Test Rankings: వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్‌గా ఇంగ్లండ్ ఆట‌గాడు.. టాప్‌-10లోకి గిల్‌

Harry Brook new no. 1 Test batter, Shubman Gill storms into top 10 ICC rankings6
వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్‌గా ఇంగ్లండ్ ఆట‌గాడు.. టాప్‌-10లోకి గిల్‌

ఐసీసీ టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయ‌ర్ హ్యారీ బ్రూక్(Harry Brook) స‌త్తాచాటాడు. ఐసీసీ ప్ర‌క‌టించిన తాజాగా ర్యాకింగ్స్‌ల‌లో బ్రూక్ త‌న స‌హచ‌రుడు జో రూట్‌ను అధిగ‌మించి అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ 886 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొన‌సాగుతున్నాడు.అత‌డి త‌ర్వాతి స్దానంలో జో రూట్‌ 868 పాయింట్లతో ఉన్నాడు. భార‌త్‌తో ఇటీవ‌ల ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్‌(158) అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. అంతకుముందు తొలి టెస్టులోనూ బ్రూక్ రాణించాడు. ఈ క్ర‌మంలోనే వ‌రల్డ్ నెం1 టెస్టు బ్యాట‌ర్‌గా అత‌డు అవ‌త‌రించాడు.టాప్‌-10లో శుబ్‌మ‌న్ గిల్‌..ఇక ఎడ్జ్‌బాస్ట‌న్ టెస్టులో ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో డ‌బుల్ సెంచ‌రీ (269), రెండో ఇన్నింగ్స్‌లో భారీ శ‌త‌కం (161) సాధించిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ (Shubman Gill) సైతం తాజా ర్యాంకింగ్స్‌లో అద‌ర‌గొట్టాడు. గిల్ 807 పాయింట్లతో ఏకంగా 15 స్థానాలు మెరుగుప‌ర‌చుకుని త‌న కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ ఆరో స్థానానికి చేరుకున్నాడు.ఇక గిల్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు బ్యాట‌ర్లు టాప్‌-10లో చోటు ద‌క్కించుకున్నారు. యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ నాలుగో స్ధానంలో ఉండ‌గా.. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ ఎనిమిద‌వ స్దానంలో నిలిచాడు. మ‌రోవైపు భార‌త్‌తో రెండో టెస్టులో స‌త్తాచాటిన ఇంగ్లండ్ కీపర్ జెమీ స్మిత్ 753 పాయింట్లతో 16 స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరుకున్నాడు.టాప్‌లోనే బుమ్రా..అయితే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్ద‌గా మార్పులు చోటు చేసుకోలేదు. టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా(898) టాప్ ర్యాంక్‌లో కొన‌సాగుతుండ‌గా.. స‌ఫారీ పేస‌ర్ క‌గిసో ర‌బాడ(851) రెండో స్ధానంలో ఉన్నాడు. మ‌రోవైపు ఆల్‌రౌండ‌ర్ల ర్యాంకింగ్స్‌లో ర‌వీంద్ర జ‌డేజా అగ్ర‌స్దానంలో కొన‌సాగుతున్నాడు.చదవండి: ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్‌ పంత్‌

IND vs BAN Off, IND vs SL On: BCCI, SLC In Talks For Mid August White Ball Series7
రోహిత్‌, కోహ్లి అభిమానులకు గుడ్‌ న్యూస్‌

దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఆగస్ట్‌లో జరగాల్సిన భారత్‌-బంగ్లాదేశ్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌ ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్ట్‌లో టీమిండియా ఖాళీగా ఉండనుంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు బీసీసీఐ శ్రీలంక క్రికెట్‌ బోర్డుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్‌లో భారత్‌, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు (3 వన్డేలు, 3 టీ20లు) నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తుంది.ఇందుకు శ్రీలంక బోర్డు ఒకే చెబితే మరికొద్ది రోజుల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్ట్‌లో జరగాల్సిన లంక ప్రీమియర్‌ లీగ్‌ కూడా వాయిదా పడటంతో భారత్‌తో సిరీస్‌ ఆడేందుకు శ్రీలంక బోర్డుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఆగస్ట్‌ చివర్లో శ్రీలంక జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. ఆలోపే భారత్‌తో సిరీస్‌ జరిగే ఆస్కారం ఉంది. భారత్‌ చివరిసారిగా 2023లో శ్రీలంకలో పర్యటించింది. ఈ ఏడాది లంకలో టీమిండియా పర్యటన షెడ్యూల్‌ కాలేదు. అయితే అనుకోకుండా ఈ ప్రతిపాదన వచ్చింది.ఆగస్ట్‌లో బరిలోకి దిగనున్న దిగ్గజాలు..?భారత్‌, శ్రీలంక మధ్య ఆగస్ట్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌ల ప్రస్తావనకు రావడంతో టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఫ్యాన్స్‌ పట్టరాని సంతోషంతో తేలిపోతున్నారు. శ్రీలంక పర్యటనలో భారత్‌ మూడు వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌, కోహ్లి ఈ వన్డే సిరీస్‌లో తప్పక ఆడతారని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. ఈ సిరీస్‌ సాధాసాధ్యాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్‌లో రోహిత్‌, కోహ్లి పాల్గొనే దానిపై కూడా క్లారిటీ రానుంది.ఒకవేళ శ్రీలంకతో సిరీస్‌ సాధ్యపడకపోతే మాత్రం రోహిత్‌, కోహ్లి అభిమానులు వారి రాక కొరకు అక్టోబర్‌ వరకే వేచి చూడాల్సిందే. అక్టోబర్‌లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరుగనుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్‌లో భారత్‌ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌లో రోహిత్‌, కోహ్లి తప్పక ఆడే అవకాశం ఉంది. రోహిత్‌, కోహ్లి చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో కలిసి ఆడారు. ఆ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచి 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ టోర్నీ తర్వాతే రోహిత్‌, కోహ్లి రోజుల వ్యవధిలో టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. అంతకుముందు వీరిద్దరు ఒకేసారి (2024 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత) టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.

ENG VS IND 3rd Test: Rishabh Pant Needs 5 More Sixes To Become All Time Six Hitter Of Indian Test History8
ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్‌ పంత్‌

టీమిండియా డాషింగ్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో మరో 5 సిక్సర్లు బాదితే టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్‌ పేరిట ఉంది. వీరూ 103 టెస్ట్‌ల్లో 90 సిక్సర్లు బాదాడు. వీరూ తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ 67 టెస్ట్‌ల్లో 88 సిక్సర్లు కొట్టాడు. పంత్‌ విషయానికొస్తే.. ఇతగాడు కేవలం 45 మ్యాచ్‌ల్లోనే 86 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు మరో 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. పంత్‌ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్‌లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా కనినిస్తుంది.ఓవరాల్‌గా చూస్తే టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పంత్‌ 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో పంత్‌ 5 సిక్సర్లు కొడితే భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకుతాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ పేరిట ఉంది. స్టోక్స్‌ 113 మ్యాచ్‌ల్లో 133 సిక్సర్లు బాదాడు. స్టోక్స్‌ తర్వాతి స్థానాల్లో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (107), గిల్‌క్రిస్ట్‌ (100), టిమ్‌ సౌథీ (98), గేల్‌ (98), కల్లిస్‌ (97), సెహ్వాగ్‌ (91), ఏంజెలో మాథ్యూస్‌ (90), రోహిత్‌ శర్మ (88), లారా (88) ఉన్నారు (టాప్‌-10లో).కొద్ది రోజుల కిందట మరో భారీ సిక్సర్ల రికార్డు బద్దలు కొద్ది రోజుల కిందట జరిగిన ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో పంత్‌ మరో భారీ సిక్సర్ల రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో బెన్‌ స్టోక్స్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. పంత్‌ ఇంగ్లండ్‌లో (టెస్ట్‌ల్లో) 23 సిక్సర్లు బాదగా.. స్టోక్స్‌ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు కొట్టాడు. భీకర ఫామ్‌లో పంత్‌ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పంత్‌ రెండు ఇన్నింగ్స్‌లో శతకాలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (25) ఔటైనా, రెండో ఇన్నింగ్స్‌లో తనదైన శైలిలో మెరుపు అర్ద సెంచరీ (65) చేశాడు. రేపటి నుంచి లార్డ్స్‌ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. పంత్‌ మరోసారి చెలరేగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్‌ భారీ విజయం సాధించింది.

Stump Split In Half, Riley Meredith Fiery Spell Crackles Wicket In T20 Blast 20259
Viral Video: నిప్పులు చెరిగిన ఆసీస్‌ పేసర్‌.. దెబ్బకు రెండుగా చీలిన వికెట్‌

ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్‌లో ఆస్ట్రేలియా యువ ఫాస్ట్‌ బౌలర్‌ రిలే మెరిడిత్‌ చెలరేగిపోయాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ టోర్నీలో సోమర్‌సెట్‌కు ఆడుతున్న మెరిడిత్‌.. నిన్న (జులై 8) ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరివీర భయంకరంగా బౌలింగ్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ నాలుగో బంతికి ఎసెక్స్‌ ఓపెనర్‌ కైల్‌ పెప్పర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. వికెట్‌ మధ్యలో రెండు ముక్కలుగా చీలింది. ఇది చూసి మెడిరిత్‌ చాలా ఆనందపడ్డాడు. సహజంగానే ఏ ఫాస్ట్‌ బౌలర్‌కు అయినా ఇది గర్వంచదగ్గ సందర్భం. మెరిడిత్‌ కూడా దీన్ని ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.RILEY SNAPS THE STUMP DOWN THE MIDDLE 🤯Have you ever seen this before?!?#SOMvESS#WeAreSomerset pic.twitter.com/VQ244pq8RR— Somerset Cricket (@SomersetCCC) July 8, 2025కాగా, ఈ మ్యాచ్‌లో మెరిడిత్‌ జట్టు సోమర్‌సెట్‌ ఎసెక్స్‌పై 95 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సోమర్‌సెట్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. టామ్‌ కోహ్లెర్‌ కాడ్‌మోర్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (39 బంతుల్లో 90; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శన చేశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్‌.. సోమర్‌సెట్‌ ఫాస్ట్‌ బౌలర్లు మ్యాట్‌ హెన్రీ (4-0-21-4), రిలీ మెరిడిత్‌ (2-0-22-2), క్రెయిగ్‌ ఓవర్టన్‌ (3.1-0-32-2) ధాటికి 14.1 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. ఎసెక్స్‌ ఇన్నింగ్స్‌లో నోవా థైన్‌ (38) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Huge Blow For New Zealand, Finn Allen Ruled Out Of Zimbabwe T20I Tri Series10
న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌

జులై 14 నుంచి జింబాబ్వేలో జరుగబోయే ముక్కోణపు టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలెన్‌ ప్రస్తుతం జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ సందర్భంగా శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ఆడుతూ గాయపడ్డాడు (ఫుట్‌ ఇంజ్యూరి). అలెన్‌ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. మరోసారి పరీక్షలు జరిపిన అనంతరం క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు. అలెన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఇంకా ప్రకటించలేదు. ముక్కోణపు టోర్నీలో జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా పాల్గొంటుంది.భీకర ఫామ్‌లో అలెన్‌ప్రస్తుతం జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఫిన్‌ అలెన్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ లీగ్‌ తొలి మ్యాచ్‌లోనే అతను సుడిగాలి శతకం (51 బంతుల్లో 151) విరుచుకుపడ్డాడు. అనంతరం జరిగిన మ్యాచ్‌ల్లో మరో రెండు మెరుపు అర్ద సెంచరీలు చేశాడు. ఈ లీగ్‌లో అలెన్‌ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక స్ట్రయిక్‌రేట్‌ (225) అలెన్‌దే.అలెన్‌ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ ఈ సీజన్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. రేపు (భారతకాలమానం ప్రకారం) జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో యూనికార్న్స్‌ ఎంఐ న్యూయార్క్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ముక్కోణపు టోర్నీలో న్యూజిలాండ్‌ తమ తొలి మ్యాచ్‌ను జులై 16న ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కివీస్‌ సౌతాఫ్రికాతో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అతిథ్య జింబాబ్వే, సౌతాఫ్రికా పోటీ పడతాయి. ఈ టోర్నీ ఫైనల్‌ జులై 26న జరుగనుంది. టోర్నీ మొత్తం హరారేలో జరుగనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement