ప్రధాన వార్తలు
మా ఓటమి కారణమదే.. మళ్లీ బలంగా తిరిగొస్తాం: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ ఓటమికి బౌలర్ల కంటే బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని సూర్య చెప్పుకొచ్చా డు."మ్యాచ్ ఆరంభంలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 20 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును బ్యాక్ఫుట్లో ఉంచాం. కానీ ఆ తర్వాత వారు ఆడిన తీరు నిజంగా అద్బుతం. పవర్ప్లే ముగిసిన తర్వాత దాదాపు 15 ఓవర్లకు మాపై పైచేయి సాధించారు.తర్వాత మళ్లీ వరుసగా వికెట్లు పడగొట్టి మేము తిరిగి గేమ్లోకి వచ్చాము. చివరి ఓవర్లో మళ్లీ పరుగులు వచ్చాయి. ఓవరాల్గా బౌలింగ్ పరంగా ఫర్వాదేన్పించాము. బుమ్రా, అర్ష్దీప్ జోడీ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఇద్దరూ కలిసి 5 వికెట్లు పడగొట్టారు.అయితే బ్యాటింగ్ కాస్త మెరుగ్గా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. 180 పరుగులు పైగా లక్ష్యాన్ని చేధిస్తున్నప్పుడు పవర్ప్లే అనేది చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తూ పవర్ప్లేలో మేము రాణించలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోవడంతో చిన్న చిన్న భాగస్వామ్యాలు కూడా నెలకొల్పలేకపోయాం. కచ్చితంగా ఈ ఓటమిని నుంచి పాఠాలు నేర్చుకుంటాము. మళ్లీ బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకుంది. చెన్నైలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగిస్తాము . సరైన ప్రణాళికతో బరిలోకి దిగి మళ్ళీ గెలుపు బాట పడతాము" అని పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సూర్య పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. శివమ్ దూబే మినహా మిగితా ప్లేయర్లంతా ఘోరంగా విఫలమయ్యారు.
టీమిండియా జోరుకు బ్రేక్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా జోరుకు సౌతాఫ్రికా బ్రేక్లు వేసింది. అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, సఫారీ బౌలర్ల ధాటికి విల్లవిల్లాడింది.లక్ష్య చేధనలో సూర్య కుమార్ సేన 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే(42) టాప్ స్కోరర్గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లోనూ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్లో సఫారీలు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ అదరగొట్టారు.మిల్లర్ అదుర్స్..ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఇక భారత్ సెమీఫైనల్కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో తలపడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్తో భారత్ ఆడనుంది.
అభిషేక్ మరో 'సారీ'.. సౌతాఫ్రికాపై అట్టర్ ప్లాప్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. లీగ్ స్టేజ్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో డకౌటైన అభిషేక్ ఇప్పుడు సూపర్-8 దశలోనూ అదే తీరును కనబరుస్తున్నాడు.అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 2 ఫోర్లు, ఒక సిక్సర్తో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ అవుట్గా అభిషేక్ వెనుదిరిగాడు. టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న అభిషేక్పై భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అభిషేక్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తూ అందరిని నిరాశపరిచాడు. దీంతో అభిషేక్ను పక్కన పెట్టి సంజూ శాంసన్కు అవకాశమివ్వాలని క్రికెట్ నిపుణులు టీమ్మెనెజ్మెంట్ను సూచిస్తున్నారు.అదరగొట్టిన మిల్లర్, బ్రెవిస్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భారత బౌలర్గా
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటాడు. తన సూపర్ బౌలింగ్తో ఇన్నింగ్స్ ఆరంభంలోనే దక్షిణాఫ్రికాను బుమ్రా దెబ్బ తీశాడు. ఇన్ఫామ్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, రికెల్టన్ను బుమ్రా ఔట్ చేశాడు.మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో జస్ప్రీత్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా రికార్డులకెక్కాడు. బుమ్రా ఇప్పటివరకు పొట్టి ప్రపంచకప్ హిస్టరీలో 33 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(32), అర్ష్దీప్ సింగ్(32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో వీరిద్దిరిని బుమ్రా అధిగమించాడు.టీ20 ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరేజస్ప్రీత్ బుమ్రా-33 రవిచంద్రన్ అశ్విన్- 32అర్ష్దీప్ సింగ్- 32హార్దిక్ పాండ్యా-29రవీంద్ర జడేజా-22
వారెవ్వా బుమ్రా.. లెగ్ స్టంప్ ఎగిరిపోయిందిగా? వీడియో
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ప్రోటీస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ను బుమ్రా ఔట్ చేసిన తీరు గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే.జస్ప్రీత్ అద్భుతమైన బంతితో డికాన్ను బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన బంతికి డికాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 2 ఓవర్ వేసిన బుమ్రా.. ఐదో బంతిని నిప్-బ్యాకర్ డెలివరీగా సంధించాడు. అయితే ఆ బంతిని డి కాక్ ఎటువంటి ఫుట్ వర్క్ లేకుండా స్లాగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి కాస్త లో-బౌన్స్గా వచ్చి బ్యాట్ను మిస్స్ అయ్యి లెగ్ స్టంప్ను గిరాటేసింది. ఇది చూసిన డికాక్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. జస్ప్రీత్ దెబ్బకు డికాక్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ను కూడా బుమ్రా పెవిలియన్కు పంపాడు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడిJasprit Bumrah wastes no time and removes the danger man, Quinton de Kock, in this all-important Super 8 clash. 🔥ICC Men's #T20WorldCup | SUPER 8 | #INDvSA | LIVE NOW 👉 https://t.co/dZWPZfqfbO pic.twitter.com/23RqtAxaoq— Star Sports (@StarSportsIndia) February 22, 2026
భారత్పై సౌతాఫ్రికా ఘన విజయం
India vs South Africa Super 8 live updates: అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. సఫారీ బౌలర్ల దాటికి 111 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే(42) టాప్ స్కోరర్గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు.ఓటమికి చేరువలో భారత్15 ఓవర్ వేసిన కేశవ్ మహారాజ్ బౌలింగ్లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్దీప్ సింగ్ ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.భారత్ ఆరో వికెట్ డౌన్86 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత విజయానికి 34 బంతుల్లో 102 పరుగులు కావాలి.పీకల్లోతు కష్టాల్లో భారత్.. కెప్టెన్ సూర్య ఔట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కార్భిన్ బాష్ బౌలింగ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18) ఔటయ్యాడు. క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. భారత్ విజయానికి 64 బంతుల్లో 134 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్43 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. బాష్ బౌలింగ్లో ఔటయ్యాడు.అభిషేక్ శర్మ ఔట్అభిషేక్ శర్మ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. జాన్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 42/3తిలక్ వర్మ ఔట్5 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన తిలక్ వర్మ.. జాన్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.భారత్ తొలి వికెట్ డౌన్188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఐడైన్ మార్క్రమ్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ డౌకటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. అదేవిధంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫోరుతో తన ఖాతా తెరిచాడు.భారత్ టార్గెంట్ ఎంతంటే?అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు.డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు.సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్157 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన మార్కో జాన్సెన్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్.. మిల్లర్ ఔట్డేవిడ్ మిల్లర్ రూపంలో సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన మిల్లర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్డెవాల్డ్ బ్రెవిస్ రూపంలో సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న మిల్లర్, బ్రెవిస్30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు మిల్లర్, బ్రెవిస్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 64 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్రికెల్టన్ రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రికెల్టన్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 6 ఓవర్లకు ప్రోటీస్ స్కోర్: 41/3సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్12 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్(4).. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 ఓవర్లకు ప్రోటీస్ స్కోర్: 10/1టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సూపర్-8 పోరులో ప్రోటీస్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.గత మ్యాచ్కు దూరమైన లుంగీ ఎంగిడి, జాన్సెన్, కేశవ్ మహారాజ్ జట్టులోకి వచ్చారు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. వాషింగ్టన్ సుందర్ను జట్టులో కొనసాగించారు. దీంతో అక్షర్ పటేల్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి
ఆసియా కప్ 2026 విజేతగా భారత్
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ను భారత్ వరుసగా రెండో ఎడిషన్లోనూ కైవసం చేసుకుంది. బ్యాంకాక్ వేదికగా జరిగిన 2026 ఎడిషన్లో భారత-ఏ జట్టు విజేతగా అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 22) జరిగిన ఫైనల్లో టీమిండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్-ఏపై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి ఎడిషన్ (2023) ఫైనల్లోనూ భారత-ఏ జట్టు బంగ్లాదేశ్-ఏపైనే విజయం సాధించే టైటిల్ను చేజిక్కించుకుంది.నేటి ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్), కెప్టెన్ రాధా యాదవ్ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల చేసింది. వీరిద్దరు కాకుండా భారత ఇన్నింగ్స్లో వ్రింద దినేశ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేసింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్ 1, ప్రేమా రావత్ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.బంగ్లా బౌలర్ ఫాహిమ ఖాతూన్ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసింది. మరో బౌలర్ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఫర్జానా ఎస్మిన్ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్, సదియా అక్తర్ తలో ఓవర్ వేసి 14, 9 పరుగులిచ్చారు.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్-ఏ జట్టు తడబడింది. భారత బౌలర్లు ప్రేమా రావత్ (4-0-12-3), తనూజా కన్వర్ (3.1-0-11-2), సోనియా మెంధియా (4-0-21-2), కెప్టెన్ రాధా యాదవ్ (4-0-16-1), సైమా ఠాకోర్ (2-0-11-1), మిన్నూ మణి (2-0-17-1) ధాటికి 19.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. బంగ్లా ఇన్నింగ్స్లో 20 పరుగులు చేసిన షమీమా సుల్తానా టాప్ స్కోరర్గా నిలిచింది. సర్మిన్ సుల్తానా (18), కెప్టెన్ ఫాతిమా ఖాతూన్ (14), సదియా అక్తర్ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. ప్రేమా రావత్ 3 వికెట్లు తీయడంతో పాటు 3 క్యాచ్లు కూడా పట్టి భారత గెలుపులో కీలకపాత్ర పోషించింది.
ఆసియా కప్ ఫైనల్.. స్వల్ప స్కోర్కే పరిమితమైన టీమిండియా
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీ ఫైనల్లో భారత-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్లు తలపడుతున్నాయి. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల స్కోర్కు మాత్రమే పరిమితమైంది. బంగ్లా బౌలర్ ఫాహిమ ఖాతూన్ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసింది. మరో బౌలర్ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఫర్జానా ఎస్మిన్ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్, సదియా అక్తర్ తలో ఓవర్ వేసి 14, 9 పరుగులిచ్చారు.భారత్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్), కెప్టెన్ రాధా యాదవ్ (36) చలవ వల్లే. వీరిద్దరు కాకుండా వ్రింద దినేశ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్ 1, ప్రేమా రావత్ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ మాత్రమే కోల్పోయి 26 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 109 పరుగులు చేయాలి. కాగా, సెమీఫైనల్స్లో భారత్ శ్రీలంకపై, బంగ్లాదేవ్ పాకిస్తాన్పై విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి.
టాపర్లంతా ఒకే గ్రూప్లో.. ఏంటీ సూపర్-8 ప్రీ-సీడింగ్ గోల..?
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 బెర్త్లు ఖరారైనప్పటి నుంచి క్రికెట్ అభిమానులు ఓ పదాన్ని తరుచూ వింటూ ఉన్నారు. ఏంటా పదం అంటే.. ప్రీ-సీడింగ్. ఈ ప్రీ-సీడింగ్ పద్దతిని ఐసీసీ ప్రస్తుత ప్రపంచకప్ ఎడిషన్ నుంచే ప్రవేశ పెట్టింది.రెండు దేశాల్లో (భారత్, శ్రీలంక) మ్యాచ్లు జరగాల్సి ఉన్నందున టికెట్లు, ప్రసారాలు, లాజిస్టిక్స్, అభిమానుల ప్రయాణ ఏర్పాట్లను సులభతరం చేయడానికి ప్రీ-సీడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం, జట్లకు ముందే స్లాట్లు కేటాయించబడ్డాయి. పలానా జట్టు సూపర్-8కి చేరితే పలానా గ్రూప్లో ఉంటుందని ముందే నిర్ణయించబడింది.ఐసీసీ ఈ ప్రీ-సీడింగ్ విధానాన్ని అభిమానులు, ఆటగాళ్ల సౌకర్యార్థం ప్రవేశపెడితే, దీని పర్యవసనాలు విమర్శలకు దారి తీశాయి. ముందుగా కేటాయించబడిన స్లాట్ల ప్రకారం ఆయా గ్రూప్ల్లో టాపర్లుగా ఉన్న జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్, భారత్ సూపర్-8 గ్రూప్-1లోకి వచ్చాయి. అదే గ్రూప్ల్లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంక సూపర్-8 గ్రూప్-2లోకి చేరాయి.గ్రూప్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి టాపర్లుగా సూపర్-8కి చేరిన జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్, భారత్కు అదనపు ప్రయోజనాలు ఏమీ దక్కకపోవడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. గ్రూప్ దశలో టాపర్లుగా నిలిచిన ఆ జట్లకు అదనపు ప్రయోజనాలు (రెండో స్థానంలో నిలిచిన జట్లతో మ్యాచ్లు) కల్పించాల్సి ఉండిందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఈ విధానంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు సూపర్-8 బెర్త్లను డీల్ చేసే అధికారాలే వస్తే, తప్పక సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని అన్నాడు.ఈ అశాస్త్రీయ ప్రీ-సీడింగ్ విధానం వల్ల ఇప్పుడు గ్రూప్ దశలో టాపర్ జట్లు సూపర్-8 దశలో ఒకదానితో ఒకటి పోటీపడనున్నాయి. గ్రూప్ దశలో రెండో స్థానంలో నిలిచిన జట్లంతా ఒక దానితో ఒకటి తలపడనున్నాయి. నిన్న న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరగాల్సి తొలి సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తి తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ (ఫిబ్రవరి 22) మరో రెండు సూపర్-8 మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం గ్రూప్-2లో శ్రీలంక-ఇంగ్లండ్, రాత్రి గ్రూప్-1లో భారత్-సౌతాఫ్రికా తలపడనున్నాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్ చేరాడు. ఈ లీగ్లో ఇప్పటికే చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటుండగా.. తాజాగా యువ వికెట్కీపర్ బ్యాటర్ రూబిన్ హెర్మన్ వీరి సరసన చేరాడు. హెర్మన్ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఖలందర్స్తో జతకట్టిన అనంతరం హెర్మన్కు ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది.ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత ఖలందర్స్కు ప్రాతినిథ్యం వహించిన రెండో సౌతాఫ్రికన్గా హెర్మన్ గుర్తింపు పొందాడు. గతేడాది చివర్లో డుప్లెసిస్ ఐపీఎల్ వేలం నుంచి తప్పుకొని పీఎస్ఎల్లో చేరాడు. 14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో దాదాపు 4,800 పరుగులు చేసిన డుప్లెసిస్, పీఎస్ఎల్ ఆడటం అప్పట్లో సంచలనం. ఈ ఏడాది ఐపీఎల్ విండోలో మరో సౌతాఫ్రికా ఆటగాడు పీఎస్ఎల్లో పాల్గొంటుండటం ఆసక్తికరం.హెర్మన్ ప్రదర్శనలు 29 ఏళ్ల హెర్మన్ CSA T20 ఛాలెంజ్ 2023-24లో 436 పరుగులు చేసి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత SA20లో పార్ల్ రాయల్స్ తరఫున ఆడాడు. 2025 ఎడిషన్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్పై ఒత్తిడిలో 81* పరుగులు చేసి ప్రతిభను చాటుకున్నాడు. ఆ ఎడిషన్లో 226 పరుగులు చేశాడు. మొత్తం టీ20 కెరీర్లో హెర్మన్ 1,497 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 8 అర్ద శతకాలు ఉన్నాయి.లాహోర్ జట్టు వ్యూహం లాహోర్ జట్టు ఇప్పటికే ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, ఉసామా మిర్, హసీబుల్లా ఖాన్ వంటి స్థానిక ఆటగాళ్లను కలిగి ఉంది. హెర్మన్ చేరికతో ఆ ఫ్రాంచైజీ బ్యాటింగ్ బలం మరింత పెరుగనుంది. హెర్మన్ మిడిలార్డర్లో కీలకమైన బ్యాటర్. అతన్ని 5 లేదా 6వ స్థానంలో ఉపయోగించుకోవచ్చు. స్ట్రైక్ రొటేట్ చేయడం, డెత్ ఓవర్లలో బౌండరీలు కొట్టడం హెర్మన్ ప్రత్యేకత.
బెల్జియం చేతిలో భారత్ ఓటమి
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భారత జట్టుక...
సూపర్ స్నేహిత్...
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చె...
మన ముకేశ్ గురి బంగారం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ జూనియర్...
నేటి నుంచి ఐఎస్ఎల్
కోల్కతా: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నెలలపాటు క...
ఆసియా కప్ 2026 విజేతగా భారత్
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్న...
ఆసియా కప్ ఫైనల్.. స్వల్ప స్కోర్కే పరిమితమైన టీమిండియా
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర...
టాపర్లంతా ఒకే గ్రూప్లో.. ఏంటీ సూపర్-8 ప్రీ-సీడింగ్ గోల..?
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 బెర్త్లు ఖరారైనప్పట...
పాకిస్తాన్ సూపర్ లీగ్లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026లోకి మరో సౌతాఫ్రిక...
క్రీడలు
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
వీడియోలు
సూపర్ 8లో హై ఓల్టేజ్ ఫైట్..! ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
టీ20 ప్రపంచ కప్ లో నేడు కీలక మ్యాచ్
ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
భారత్ కు మహాశివరాత్రి.. పాక్ కు కాళరాత్రి...
కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ
