Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Indias last T20 against Australia womens team today1
పైచేయి కోసం...

అడిలైడ్‌: పొట్టి ఫార్మాట్‌లో మిగిలిపోయిన ఆఖరి పోరులో గట్టిగా పోరాడి పైచేయి సాధించేందుకు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు ‘సై’ అంటున్నాయి. ఇరుజట్ల మధ్య శనివారం ఇక్కడ ఆఖరి టి20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ ఒక్క టి20లకే పరిమితం కాని ఈ పర్యటనలో సిరీస్‌ గెలవాలంటే ఇంకా రెండు ఫార్మాట్లలోనూ సత్తా చాటాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుత టి20ల్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ గెలిచి 1–1తో సమంగా నిలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఓవరాల్‌ సిరీస్‌లో 4–2 పాయింట్లతో (మ్యాచ్‌ విజేతకు 2 పాయింట్లు) ఆధిక్యం సంపాదిస్తుంది. దీంతో తదుపరి మూడు వన్డేలు, ఏకైక టెస్టు సిరీస్‌లకు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని టీమిండియా లక్ష్యం కూడా సిరీస్‌ కాదు... నేటి మ్యాచ్‌ విజయమే! ఇదే జట్టులో స్థయిర్యాన్ని పెంచుతుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. బ్యాటర్లదే భారం తొలి మ్యాచ్‌లో వర్షంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో నెగ్గిన హర్మన్‌ బృందం... పూర్తిస్థాయిలో జరిగిన రెండో టి20లో చేతులెత్తేసింది. ఆతిథ్య ఆసీస్‌ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, వైస్‌ కెపె్టన్‌ స్మృతి మంధాన ఇద్దరే 30 పైచిలుకు పరుగులు చేస్తే... ప్రధాన బ్యాటింగ్‌ బలం క్రీజులోకి దిగిన వారంతా ఆసీస్‌ బౌలింగ్‌కు దాసోహమయ్యారు. అదే ఈ మ్యాచ్‌లో పునరావృతం చేస్తే వన్డే సిరీస్‌కు ముందే టీమిండియా వెనుకబడిపోతుంది. ఇది మరింత ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి టాపార్డర్, మిడిలార్డర్‌ మరింత బాధ్యతగా ఆడాలి. అప్పుడే ఈ సుదీర్ఘ ఓవరాల్‌ సిరీస్‌ (టి20, వన్డే, టెస్టు)లో భారత్‌ పుంజుకోగలుగుతుంది. లేదంటే పరాజయాలతో, పాయింట్లతో ఆఖరికి మూల్యం చెల్లించు కోవాల్సి ఉంటుంది. జెమీమా రోడ్రిగ్స్, హిట్టర్లు రిచా ఘోష్, అమన్‌జోత్‌లు దంచేసే పనిలో ముందుంటే భారత్‌ కూడా ఈ ఓవరాల్‌ సిరీస్‌లో ముందంజ వేస్తుంది. బ్యాటర్లతో పోల్చితే రేణుక, క్రాంతి, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణిలు బౌలింగ్‌లో కాస్త మెరుగ్గానే రాణిస్తున్నారు. మరోవైపు ఫామ్‌లోకి వచి్చన ఆతిథ్య జట్టు వరుసగా ఈ మ్యాచ్‌లోనూ రాణించి పైచేయి సాధించాలని ఆశిస్తోంది.

Key matches in the T20 World Cup from today2
‘సూపర్‌–8’ సమయం

టి20 ప్రపంచ కప్‌లో మరింత వినోదానికి నేటితో తెర లేవనుంది. పసికూనలు, పస లేని జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా టాప్‌–8 టీమ్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ తలపడుతుంది. గ్రూప్‌ ‘ఎ’లో మూడు మ్యాచ్‌లు గెలిచి పాక్‌ ముందంజ వేయగా, గ్రూప్‌ ‘డి’ నుంచి కూడా మూడు విజయాలతో కివీస్‌ తర్వాతి దశకు అర్హత సాధించింది. కొలంబో: పాకిస్తాన్, న్యూజిలాండ్‌ జట్లు ఇటీవల వన్డేలు, టి20 ఫార్మాట్‌లలో తరచుగా తలపడ్డాయి. రెండున్నరేళ్ల వ్యవధిలో ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్‌లు జరగ్గా... ఇందులో 17 వన్డేలు, 24 టి20లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి బలాబలాల గురించి ఇరు జట్లకు మంచి అవగాహన ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లను మినహాయిస్తే... 2022 టి20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత రెండు జట్లు ఒక పెద్ద టోర్నీలో పోటీకి దిగడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌ జట్టు లీగ్‌ దశను దాటినా... అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోతోంది. సీఫెర్ట్, అలెన్‌ మాత్రమే బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించగా... రచిన్‌ రవీంద్ర, ఫిలిప్స్, డరైల్‌ మిచెల్‌ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బౌలింగ్‌లో కూడా డఫీ, సోధి భారీగా పరుగులిస్తున్నారు. కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ వైఫల్యం కూడా వరల్డ్‌ కప్‌లో జట్టును ఇబ్బంది పెట్టింది. ఇలాంటి స్థితిలో వరల్డ్‌ కప్‌ ఆశలు మిగలాలంటే కివీస్‌ బృందం సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు పాకిస్తాన్‌కు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడటం కాస్త కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో మ్యాచ్‌ ఆడిన ఆ జట్టుకు పిచ్‌ పరిస్థితిపై మంచి అవగాహన ఉంది. అందుకే తమ స్పిన్‌ బలగాన్ని జట్టు నమ్ముకుంది. ప్రధాన పేసర్‌ షాహిన్‌ అఫ్రిది ఘోరంగా విఫలం కాగా... మరో పేసర్‌ ఫహీమ్‌ ఒక్క ఓవర్‌ కూడా బౌలింగే చేయలేదు. స్పిన్నర్లు ఉస్మాన్‌ తారిఖ్, అబ్రార్, షాదాబ్, నవాజ్‌లపై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే బ్యాటింగ్‌లో ఫర్హాన్‌ మినహా సయీమ్‌ అయూబ్, సల్మాన్, బాబర్‌ ఆజమ్‌ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఇరు జట్లు ఫామ్‌లో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఆసక్తికర పోరు ఖాయం. మ్యాచ్‌ రోజున వర్షసూచన ఉంది.

Aaqib Nabis rise in domestic cricket3
‘కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌’

దాదాపు ఆరు నెలల క్రితం... నార్త్‌జోన్, ఈస్ట్‌జోన్‌ మధ్య దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌... నార్త్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మూ కశ్మీర్‌ పేస్‌ బౌలర్‌ ఆఖిబ్‌ నబీ సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. ‘హ్యాట్రిక్‌’ సహా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ఈస్ట్‌ను కుప్పకూల్చాడు. తన 30వ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లోనే అతను 9వసారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ‘భారత్‌ తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడటమే నా లక్ష్యం’ అని ఆఖిబ్‌ అప్పుడే చెప్పుకున్నాడు. వరుసగా రెండు సీజన్లలో నబీ వికెట్లు పడగొట్టిన తీరు, అతని ఓవరాల్‌ ప్రదర్శన చూస్తే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. తాజాగా రంజీ సీజన్‌లో కూడా పలువురుసీనియర్లు, మాజీల అభిప్రాయం ప్రకారం భారత్‌ తమ తర్వాతి టెస్టు మ్యాచ్‌ను ఎప్పుడు ఆడినా... నిస్సందేహంగా అందులో నబీకి అవకాశం కల్పించవచ్చు. 29 ఏళ్ల వయసులో ఈ పేసర్‌కు టీమిండియా అవకాశం వస్తేనే అతని నిలకడైన ప్రదర్శనకు గుర్తింపు దక్కినట్లుగా భావించవచ్చు. సాక్షి క్రీడా విభాగం : జమ్మూ కశ్మీర్‌ తమ 67 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఇప్పుడు ఫైనల్‌కు చేరింది. గత ఏడాది కూడా చక్కటి ప్రదర్శనతో నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. అయితే అనుభవలేమితో ముందంజ వేయడంలో కశ్మీర్‌ విఫలమైంది. ఈ రెండు సీజన్లలో కూడా వారి విజయ గాథలో ఒకే ఒక్క ఆటగాడు బలంగా కనిపిస్తాడు. అతనే ఆఖిబ్‌ నబీ. 2024–25 సీజన్‌లో 8 మ్యాచ్‌లలో కలిపి నబీ కేవలం 13.93 సగటుతో 44 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. స్పిన్నర్‌ హర్ష్ దూబే (69) మినహాయిస్తే పేసర్లలో అతనిదే అగ్రస్థానం. ఈసారి కూడా దాదాపు అదే తరహా ప్రదర్శనతో అతను ఆకట్టుకున్నాడు. 9 మ్యాచ్‌లలో కలిపి కేవలం 12.72 సగటుతో నబీ 55 వికెట్లు తీయడం విశేషం. ఇప్పుడు కూడా స్పిన్నర్‌ మయాంక్‌ మిశ్రా (59) కాకుండా పేస్‌ బౌలర్‌గా నబీ మొదటి స్థానంలో నిలిచాడు. తాజా సీజన్‌లో అతను ఏకంగా 6 సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మరోవైపు బ్యాటింగ్‌లో కూడా అతను తగ్గలేదు. 2 అర్ధసెంచరీలు సహా 243 పరుగులు నమోదు చేసి కీలక సమయాల్లో జట్టుకు అండగా నిలిచాడు. ఫుట్‌బాల్‌ నుంచి క్రికెట్‌ వైపు... క్రికెట్‌కు సంబంధించి బొటాబొటీ సౌకర్యాలు మాత్రమే ఉన్న బారాముల్లా పట్టణం నబీ స్వస్థలం. అక్కడి నుంచి 50 కిలో మీటర్ల దూరంలో శ్రీనగర్‌ ఉంటుంది. అత్యుత్తమ స్థాయి క్రికెట్‌ ప్రాక్టీస్‌ కావాలంటే ఎవరైనా శ్రీనగర్‌కు వెళ్లాల్సిందే. ‘కెరీర్‌లో ఎదగాలంటే ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా కష్టపడాలి. పరిమిత వనరులనే వాడుకోవాలి తప్ప ఫిర్యాదులు చేయకూడదు. దేశం కోసం ఆడాలంటే దేనికైనా సిద్ధపడాలి’ అని కెరీర్‌ ఆరంభంలో చెప్పిన నబీ దానికి తగినట్లుగా తనను తాను మలచుకుకున్నాడు. కశ్మీర్‌లో స్థానికంగా కనిపించే పరిస్థితులను బట్టి ఆరంభంలో నబీ ఫుట్‌బాల్‌ను ఎంచుకున్నాడు. అయితే వేగాన్ని అమితంగా ఇష్టపడే అతని నైజం చివరకు పేస్‌ బౌలింగ్‌ వైపు మార్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన తండ్రి నబీకి ఆటలో అన్ని విధాలా అండగా నిలిచాడు. అవుట్‌స్వింగర్‌ ప్రధాన బలమైన నబీ తన ప్రతిభను మరింత తీర్చిదిద్దుకునేందుకు కెరీర్‌ ఆరంభంలో బెంగళూరుకు వెళ్లాడు. ఒక మిత్రుడు సహాయం అందించడంతో స్థానికంగా కర్ణాటక లీగ్‌లో చింతామణి క్లబ్‌ తరఫున మూడు నెలలు ఆడి ఆ టీమ్‌ తర్వాతి సీజన్‌లో ఫస్ట్‌ డివిజన్‌కు ప్రమోట్‌ కావడంలో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరులో ఆడిన ఆట తనకు ఎంతో మేలు చేసిందని, పెద్ద స్థాయిలో కూడా సత్తా చాటగలననే ఆత్మవిశ్వాసం అందించిందని నబీ చెప్పాడు. ముంబైతో మ్యాచ్‌లో చెలరేగి... జార్ఖండ్‌తో ఆడిన తన తొలి రంజీ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టడంతో నబీ గురించి అందరికీ తెలిసింది. అయితే అదే సీజన్‌లో కర్ణాటకతో మ్యాచ్‌లో ఒక చక్కటి బంతితో కరుణ్‌ నాయర్‌ను అవుట్‌ చేయడంతో అందరి దృష్టీ అతనిపై పడింది. ఇక సీనియర్‌ పర్వేజ్‌ రసూల్‌ ప్రోత్సాహం, భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మార్గనిర్దేశనంలో నబీ బౌలింగ్‌ మరింత పదునెక్కింది. గత సీజన్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌ నిస్సందేహంగా అతని స్థాయిని పెంచింది. 42 సార్లు చాంపియన్‌ అయిన ముంబైని ఓడించడం ఒక ఘనత కాగా... ఈ మ్యాచ్‌లో నబీ 6 వికెట్లు పడగొట్టాడు. రోహిత్‌ శర్మ కూడా ఆడిన ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, శ్రేయస్‌ అయ్యర్, శివమ్‌ దూబే, శార్దుల్‌ ఠాకూర్‌లను నబీ అవుట్‌ చేశాడు. తాజా సీజన్‌లోనైతే క్వార్టర్‌ ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై 12 వికెట్లు, సెమీస్‌ లో బెంగాల్‌పై 9 వికెట్లు... రెండు నాకౌట్‌ మ్యాచ్‌లలోనూ అతనే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కావడం విశేషం. ఇదే జోరు కొనసాగించే తన టీమ్‌ను తొలిసారి రంజీ చాంపియన్‌గా నబీ నిలుపుతాడా అనేది ఆసక్తికరం. మరోవైపు హుబ్లీలో కర్ణాటకతో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ కోసం పేస్‌కు ఏమాత్రం అనుకూలించని పిచ్‌ను తయారు చేసి నబీ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే... మైదానంలోకి దిగకముందే అతని ప్రభావం కనిపించడం నిజంగా నబీకి లభించిన పెద్ద అవార్డుగా చెప్పవచ్చు. రూ.8.40 కోట్లతో... ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా వరుసగా తన పేరు రావడం, ఎవరో పట్టించుకోకపోవడం అలవాటుగా మారిపోయిందని 2026 సీజన్‌ వేలానికి ముందు నబీ వ్యాఖ్యానించాడు. అయితే ఈసారి తన ప్రదర్శన చూస్తే కొంత నమ్మకం కలుగుతోందని కూడా అతను చెప్పాడు. చివరకు నబీ నమ్మకం నిజమైంది. ఏకంగా రూ.8.40 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ వేలంలో నబీని తీసుకుంది. ఇన్నేళ్ల శ్రమకు అతనికి భారీ మొత్తంతో గుర్తింపు దక్కింది. ఏడేళ్ల దేశవాళీ కెరీర్‌లో నబీ 40 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో 151 వికెట్లు పడగొట్టాడు. అతని సగటు 18.62 మాత్రమే కావడం చెప్పుకోదగ్గ అంశం. వీటిలో మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శనలు నాలుగు ఉన్నాయి. 36 వన్డేల్లో 56...34 టి20ల్లో అతను 43 వికెట్లు తీశాడు.

An interesting rivalry in the India vs South Africa match4
అటు ఆల్బీ... ఇటు మోర్నీ...

అహ్మదాబాద్‌: టి20 వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, గత రన్నరప్‌ మధ్య రేపు జరిగే ‘సూపర్‌ ఎయిట్స్‌’ మ్యాచ్‌పై అందరి దృష్టీ నిలిచింది. తమ ఆధిక్యాన్ని కొనసాగించాలని భారత్‌ భావిస్తుండగా, ప్రతీకారం తీర్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. ఇరు జట్లు తమ గ్రూప్‌లలో అన్ని మ్యాచ్‌లూ గెలిచి టాపర్లుగా ముందంజ వేశాయి. అయితే మైదానం లోపలే కాకుండా బౌండరీ బయట కూడా ఒక ‘పోరు’ ఆసక్తిని రేపుతోంది. ఇరు జట్ల సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న సొంత అన్నదమ్ములు ఆల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్‌ ప్రత్యర్థులుగా తమ వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు.రేపు మ్యాచ్‌ జరిగే సమయంలో వేర్వేరు డగౌట్లలో వీరు కనిపించనున్నారు. మోర్నీ గత కొంతకాలంగా భారత బౌలింగ్‌ కోచ్‌గా పని చేస్తుండగా, ఈ టోర్నీ కోసమే ఆల్బీని ‘ప్రత్యేక సలహాదారుడు’గా దక్షిణాఫ్రికా తీసుకుంది. శుక్రవారం ఇరు జట్ల ప్రాక్టీస్‌ సందర్భంగా ఆల్బీ, మోర్నీ గ్రౌండ్‌లోకి వచ్చినా ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదు! ‘ఇప్పటి పరిస్థితుల్లో మా గురించి కాదు. మా అమ్మ గురించే అసలు ఆలోచన. ఆమెనే మా ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలా అని ఎక్కువగా ఆందోళన చెందుతోంది’ అని ఆల్బీ వెల్లడించాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆల్బీ దక్షిణాఫ్రికా తరఫున 58 వన్డేలు, 50 టి20 మ్యాచ్‌లు ఆడగా... స్ట్రయిక్‌ పేస్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన మోర్నీ 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20ల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు ఈ వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ తరఫున స్యామ్‌ కరన్‌ బరిలోకి దిగగా... అతని సోదరుడు బెన్‌ కరన్‌ జింబాబ్వే జట్టులో ఉన్నాడు.

The stage is set for the prestigious Delhi Marathon 5
ఢిల్లీ మారథాన్‌ దిగ్గజాలతో షురూ

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రతిష్టాత్మక ‘ఢిల్లీ మారథాన్‌’కు రంగం సిద్ధమైంది. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం జరిగే ఈ సుదీర్ఘ పరుగును భారత బాక్సింగ్‌ దిగ్గజం విజేందర్‌ సింగ్, టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. సుమారు 30 వేల పైచిలుకు మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ), అంతర్జాతీయ మారథాన్, డిస్టెన్స్‌ రేస్‌ (ఏఐఎంఎస్‌), ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) గుర్తింపు పొందిన ఈ సుదీర్ఘ పరుగులో కేవలం భారతీయులే కాదు విదేశీ మారథాన్‌ రన్నర్లు, పలువురు క్రీడాకారులు కూడా పాల్గొనేందుకు నగరానికి విచ్చేసినట్లు ఈవెంట్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్‌ నాలుగు విభాగాల్లో జరుగుతోంది. ఇందులో మొదటిది పూర్తి మారథాన్‌. 42.195 కిలోమీటర్ల దూరం పరుగెత్తడం. దీంతో పాటు హాఫ్‌ మారథాన్‌ (21.09 కి.మీ.), 10కే (10 కిలో మీటర్లు), 5కే (5 కిలో మీటర్లు) పరుగు పందెంలు కూడా నిర్వహిస్తారు. అంటే సుదీర్ఘ పరుగు (42.21 కి.మీ) చేయలేని వారుసైతం నిరాశచెందకుండా 10కే, 5కే ఈవెంట్లో పరుగు పూర్తిచేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లోని 490 నగరాలకు చెందిన ఔత్సాహికులు ఇందులో పాల్గొంటున్నారు. భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మారథాన్‌ ప్రియులు పరుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. దేశీ క్రీడాకారులు అనిశ్‌ థాపా, బెలియప్ప, మన్‌ సింగ్, అక్షయ్‌ సైని, గోపీ, భాగిరథి బిస్త్, నిర్మాబెన్‌ ఠాకూర్, అశ్విని మదన్‌ జాదవ్, దిస్కెట్‌ డోల్మా, స్టాన్‌జిన్‌ డోల్కర్‌ తదితరులు కూడా పోటీపడుతున్నారు. ఆసియా క్రీడల క్వాలిఫయింగ్‌ టైమింగ్‌ను నమోదు చేసిన రన్నర్లకు ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో పోటీపడేందుకు అర్హత కూడా లభిస్తుంది. ఈ మారథాన్‌ పరుగు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తుంది. సమగ్ర వ్యర్థాల విభజన, ఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్‌ను నిషేధించి... రీ సైక్లింగ్‌కు ఉపయోగపడే ప్లాస్టిక్‌ ఉత్పత్తులను ప్రోత్సహించడం... ఇందుకోసం పర్యావరణ సంస్థలు, కలిసి వచ్చే స్థానికులు, అధికారులతో మారథాన్‌ ఆర్గనైజర్లు చేతులు కలుపుతారు.

T20 WC 2026: Australia beat Oman in their last group stage match6
మార్ష్‌ విధ్వంసం.. పసికూనను చిదిమేసిన ఆసీస్‌

టీ20 ‍ప్రపంచకప్‌ 2026 చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా పసికూన ఒమన్‌పై ప్రతాపం చూపింది. తొలుత బౌలింగ్‌లో 104 పరుగులకే (16.2 ఓవర్లలో) ఒమన్‌ను ఆలౌట్‌ చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని 9.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ ఇదివరకే సూపర్‌-8కి చేరాయి. సూపర్‌-8 మ్యాచ్‌లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.ఒమన్‌ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్‌ జంపా (3.2-0-21-4), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్‌ బార్ట్‌లెట్‌ (4-0-27-2), నాథన్‌ ఇల్లిస్‌ (2-0-14-1), మార్కస్‌ స్టోయినిస్‌ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఒమన్‌ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ (17), హమ్మద్‌ మీర్జా (16), కరణ్‌ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ చెలరేగిపోయాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 64 పరుగులు చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి ట్రవిస్‌ హెడ్‌(32), ఇంగ్లిస్‌ (12 నాటౌట్‌) సహకరించారు. హెడ్‌ వికెట్‌ షకీల్‌ అహ్మద్‌కు దక్కింది.

T20 WC 2026: Aussies restricted Oman to just 104 runs7
అంతా అయిపోయాక లైన్‌లోకి వచ్చిన ఆసీస్‌.. పసికూనపై ప్రతాపం

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా జట్టు అంతా అయిపోయాక లైన్‌లోకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో ఇదివరకే నిష్క్రమించిన ఈ మాజీ ఛాంపియన్‌.. ఇవాళ (ఫిబ్రవరి 20) పసికూన ఒమన్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో సామర్థ్యం మేరకు సత్తా చాటింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఆసీస్‌.. ఒమన్‌ను 104 పరుగులకే (16.2 ఓవర్లలో) కుప్పకూల్చింది.ఒమన్‌ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్‌ జంపా (3.2-0-21-4), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్‌ బార్ట్‌లెట్‌ (4-0-27-2), నాథన్‌ ఇల్లిస్‌ (2-0-14-1), మార్కస్‌ స్టోయినిస్‌ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఒమన్‌ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ (17), హమ్మద్‌ మీర్జా (16), కరణ్‌ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్‌కు ముందు ఒమన్‌ కెప్టెన్‌ జతిందర్‌ ఆసీస్‌కు చుక్కలు చూపిస్తామని బీరాలు పలికి ఏమీ చేయలేకపోయాడు. ఈ టోర్నీ నుంచి ఆసీస్‌తో పాటు ఒమన్‌ కూడా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ గ్రూప్‌ దశ మొత్తంలో చివరిది. ఈ టోర్నీలో భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ ఇదివరకే సూపర్‌-8కి చేరాయి.

CM’s Cup 2025 State Finals Kick Off at Gachibowli.. 21,500 Athletes Compete After Record 5 Lakh Registrations8
సీఎం కప్‌ ఫైనల్స్‌ ఘనంగా ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ 2025 (తెలంగాణ) రెండో ఎడిషన్‌ రాష్ట్ర స్థాయి ఫైనల్స్‌ పోటీలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిన్న (ఫిబ్రవరి 19) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ చైర్మన్‌ శివసేన రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. ఏ. సోనిబాలా దేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.. ఈ పోటీలను తెలంగాణ క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా అభివర్ణించారు.రికార్డు స్థాయిలో దరఖాస్తులు - ఈ టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా 5,15,936 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. - మండల, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన 21,500 మంది అథ్లెట్లు రాష్ట్ర ఫైనల్స్‌కు అర్హత సాధించారు. - ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు జరిగే ఈ పోటీల్లో 44 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ ప్రధాన ఉద్దేశం.. - గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం. - రాష్ట్ర క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం. - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించడం. - క్రీడాకారుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడం.- భవిష్యత్తులో ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికలకు ప్రతిభను సిద్ధం చేయడం.

Rahul Chahar Announces Separation from Ishani Johar in Emotional Instagram Post9
విడాకులు తీసుకున్న మరో టీమిండియా క్రికెటర్‌

ఇటీవలికాలంలో టీమిండియా క్రికెటర్లు (శిఖర్‌ ధవన్‌, మహ్మద్‌ షమీ, యుజ్వేంద్ర చహల్‌, హార్దిక్‌ పాండ్యా) వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. వివాహ బంధంలో ఇమడలేక భార్యలతో తెగదెంపులు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో తాజాగా మరో భారత క్రికెటర్‌ కూడా చేరాడు.26 ఏళ్ల లెగ్‌ స్పిన్నర్‌, మరో టీమిండియా ఆటగాడు దీపక్‌ చాహర్‌ సోదరుడు అయిన రాహుల్‌ చాహర్‌ తన భార్య ఇషానీ జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 20) ప్రకటించాడు. ఈ విషయాన్ని చాహర్‌ ఓ భావోద్వేగపూర్వక నోట్‌తో ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.చిన్న వయసులోనే వివాహం చేసుకున్నానని, అప్పట్లో తనను తాను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని, అది తనకు జీవిత పాఠాలు నేర్పిందని చాహర్‌ పేర్కొన్నాడు. గత కొన్ని సంవత్సరాలు అనుకోని పాఠాలు నేర్పాయని, గత పదిహేను నెలలు కోర్టు ప్రక్రియలతో గడిచాయని వివరించాడు. ఈ సమయం తనకు సహనం, ధైర్యం నేర్పిందని అన్నాడు. ఈ అధ్యాయం ఇప్పటికి ముగిసిందని.. ఇకపై స్వాభిమానంతో, శాంతితో, మంచి నిర్ణయాలతో కొత్త జీవితం ప్రారంభిస్తానని తెలిపాడు.ప్రేమించి పెళ్లి చేసుకొని..!- రాహుల్‌–ఇషానీ జోహర్‌ 2019 డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. - 2022 మార్చిలో గోవాలో ఓ ప్రైవేట్‌ వేడుకలో వీరి వివాహం జరిగింది. - ఇషానీ ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తూ, తరచూ రాహుల్‌ మ్యాచ్‌లకు హాజరై మద్దతు ఇచ్చేది. - వారి బంధం సోషల్‌ మీడియాలో అభిమానుల ప్రశంసలు కూడా అందుకుంది.- స్పష్టమైన కారణాలేమో తెలియరాలేదు కానీ, చాహర్‌ ఇవాళ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.విడాకుల తర్వాత రాహుల్‌ చాహర్‌ తిరిగి క్రికెట్‌పై దృష్టి కేంద్రీకరించనున్నాడు. ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీసిన చాహర్‌.. తిరిగి ఫామ్‌లోకి రావాలని కృషి​ చేస్తున్నాడు. చాహర్‌ను 2026 ఐపీఎల్‌ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటి తిరిగి టీమిండియా రీఎంట్రీ ఇవ్వాలని చాహర్‌ భావిస్తున్నాడు.

STAR SPORTS EXPERTS PICKS TOP 4 SEMI FINALISTS IN THIS T20 WORLD CUP 202610
T20 WC 2026: అందరిది ఒకే మాట.. సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 మ్యాచ్‌లు రేపటి నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏ జట్లు సెమీస్‌కు చేరతాయనే చర్చ జోరుగా సాగుతోంది. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయి.. పలానా జట్లు నిష్క్రమిస్తాయని ఎవరి అంచనాలను వారు సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు. తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ నిపుణులు కూడా ఈ టాపిక్‌పై తమ అంచనాలను షేర్‌ చేశారు.స్టార్‌ స్పోర్ట్స్‌ ప్యానెల్‌లో టీమిండియా మాజీలు యుజ్వేంద్ర చహల్‌, ఛతేశ్వర్‌ పుజారా, మొహమ్మద్‌ కైఫ్‌, వరుణ్‌ ఆరోన్‌, సబా కరీం, సంజయ్‌ బాంగర్‌ నిపుణులుగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో అంచనా కలిగి ఉన్నారు. అయితే అందరి అంచనాల్లో ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అదే టీమిండియా. ఈ ఆరుగురు సెమీస్‌కు చేరే జట్లలో టీమిండియాకు అవకాశం ఇచ్చారు.చహల్‌ భారత్‌తో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అంచనా వేయగా.. పుజారా భారత్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకకు ఛాన్స్‌ ఇచ్చాడు.కైఫ్‌ భారత్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అంచనా వేయగా.. వరున్‌ ఆరోన్‌ పై ముగ్గురికి భిన్నంగా భారత్‌తో పాటు వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయిని అభిప్రాయపడ్డాడు.సబా కరీం విషయానికొస్తే.. ఈ టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ భారత్‌తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయని గెస్‌ చేస్తున్నాడు. మాజీ టీమిండియా ఆల్‌రౌండర్‌ బాంగర్‌.. భారత్‌తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఈ నిపుణుల అంచనాల్లో ఎవరి అంచనాలు కరెక్ట్‌ అవుతాయో కామెంట్‌ చేయండి.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement