Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

I See Glimpses Of Brian Lara But: Vaibhav Sooryavanshi Wows Allan Border1
‘లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ అది నేర్చుకోకుంటే కష్టమే’

భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ ప్రశంసలు కురిపించాడు. ఇంత చిన్న వయసులో అతడు అంతలా బంతిని బాదడం తనను ఆశ్చర్యపరుస్తోందన్నాడు. ఇంత వరకు తాను ఇలాంటి ఆటగాడిని చూడలేదంటూ కొనియాడాడు. అయితే, అదే సమయంలో వైభవ్‌ చేస్తున్న తప్పును కూడా బోర్డర్‌ ఎత్తి చూపాడు.పరుగుల వరదపద్నాలుగేళ్ల వయసులోనే వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుతాలు సృష్టించిన సంగతి తెలిసిందే. బిహార్‌కు చెందిన ఈ పిల్లాడు దేశీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌ గతేడాది రూ. 1.10 కోట్లకు వైభవ్‌ను కొని అరంగేట్రం చేయించింది.విధ్వంసకర భారీ సెంచరీయాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటూ పద్నాలుగేళ్లకే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో) చేసి.. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా అదరగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై విధ్వంసకర భారీ సెంచరీ (175)తో రాణించి జట్టుకు ట్రోఫీ అందించాడు.ఇక ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ తరఫున ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ విధ్వంస కొనసాగుతోంది. జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌ను కూడా చితక్కొడుతూ... ఇప్పటికి ఏడు మ్యాచ్‌లలో 254 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌లలో టాప్‌-5లో కొనసాగుతున్నాడు.అత్యద్భుతమైన ఆటగాడుఈ నేపథ్యంలో ఆసీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ వైభవ్‌ సూర్యవంశీని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను చూస్తే తనకు వెస్టిండీస్‌ లెజెండ్‌ బ్రియన్‌ లారా గుర్తుకువస్తున్నాడని తెలిపాడు.‘‘అతడు అత్యద్భుతమైన ఆటగాడు. గొప్ప ప్రతిభ. 14-15 ఏళ్ల వయసులోనే బంతిని ఇంత గొప్పగా బాదిన ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. అతడొక పవర్‌ హిట్టర్‌. అయితే, ఇప్పుడే అతడి భవిష్యత్తు గురించి అంచనా వేయలేము.లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీటెస్టు క్రికెటర్‌గా విజయవంతం అవుతాడా? లేడా? అనేది చెప్పలేను. అయితే, అతడిని చూస్తే మాత్రం నాకు బ్రియన్‌ లారా గుర్తుకువస్తున్నాడు. వైభవ్‌ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మైదానంలో నలువైపులా అతడు బంతిని బాదగలగాలి. అంతేకాదు.. డిఫెన్స్‌ను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అలెన్‌ బోర్డర్‌ మిడ్‌-డేతో పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్‌ వదిలి ఇక్కడికి వచ్చెయ్‌: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Pakistan Withdraw From SAFF Womens Championship In India2
భారత్‌కు రాలేము.. కీల‌క టోర్నీ నుంచి పాకిస్తాన్‌ అవుట్‌

భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సౌత్ ఏషియ‌న్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) మ‌హిళ‌ల ఛాంపియ‌న్‌షిప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫుట్‌బాల్ సమాఖ్య ధ్రువీక‌రించింది. ఇరు దేశాల మ‌ధ్య‌ రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. పాక్‌ వైదొలగడంతో ఈ టోర్నమెంట్‌ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు.ఈ ఫుట్‌బాల్ టోర్నీ మే 25 నుండి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదిక‌గా జరగనుంది. మొత్తం ఆరు జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు-లో నేపాల్‌, శ్రీలంక‌, భూటాన్‌.. గ్రూపు-బిలో భార‌త్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగ‌నుంది. అయితే సాఎఫ్‌ఫ్ టోర్నీలో భార‌త్‌కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భార‌త్ వేదిక‌గా జ‌రిగే టోర్నీల‌కు పాక్ దూరంగా ఉండ‌డం ఇదేమి తొలిసారి కాదు. గ‌తేడాది తమిళ‌నాడులో జ‌రిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుండి పాక్ వైదొలిగింది. అంత‌కుముందు రాజ్‌గిర్‌లో ఆసియా కప్‌-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్‌ పంపలేదు.భార‌త్ కూడా పాక్ వేదిక‌గా క్రీడా ఈవెంట్ల‌ను బాయ్‌కాట్ చేస్తూ వ‌స్తుంది. ఆసియా టీ20 క‌ప్‌తో పాటు, ఛాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భార‌త క్రికెట్ జ‌ట్టు పాక్‌కు వెళ్ల‌లేదు. త‌మ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంక‌, దుబాయ్ వేదిక‌ల‌గా ఆడింది.చదవండి: IPL 2026: సీఎస్‌కే జట్టులోకి యార్కర్ల కింగ్‌

 CSK bring in Akash Madhwal as replacement for Ayush Mhatre in IPL 20263
సీఎస్‌కే జట్టులోకి యార్కర్ల కింగ్‌

ఐపీఎల్‌-2026 సీజ‌న్ మధ్య‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గాయం కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్ మ‌ధ్య‌లోనే వైదొలిగిన యువ ఆట‌గాడు ఆయుష్ మాత్రే స్ధానాన్ని సీనియ‌ర్ పేస‌ర్ ఆకాశ్ మ‌ధ్వాల్‌తో సీఎస్‌కే భ‌ర్తీ చేసింది. ఈ విష‌యాన్ని సీఎస్‌కే ఎక్స్ వేదిక‌గా గురువారం ప్ర‌క‌టించింది. రూ.30 ల‌క్ష‌ల బేస్‌ప్రైస్‌కు మ‌ధ్వాల్‌ను చెన్నై జ‌ట్టులోకి తీసుకుంది.మ‌ధ్వాల్‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభ‌వం ఉంది. గ‌తంలో అతడు ముంబై ఇండియ‌న్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వంటి జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ముఖ్యంగా డెత్ ఓవ‌ర్ల‌లో యార్క‌ర్లు వేయ‌డంలో దిట్ట. ఇప్పటివరకు 17 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్‌ 23 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల మధ్వాల్‌కు దేశవాళీ క్రికెట్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది.ఇక సీఎస్‌కే విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్‌లో కూడా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్ జట్టుకు భారంగా మారింది. అంతకుతోడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మాత్రే కూడా గాయం కారణంగా దూరం కావడం జట్టుకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది.రూ.28 కోట్లు ఖర్చు పెట్టి జట్టులోకి తీసుకున్న యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్‌, కార్తీక్ శ‌ర్మ ఏ మాత్రం ప్ర‌భావం చూపలేక‌పోయారు. దీంతో గ‌త రెండు మ్యాచ్‌ల‌కు వారిని సీఎస్‌కే బెంచ్‌కే ప‌రిమితం చేసింది. గురువారం వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో ప్రశాంత్ వీర్ తిరిగి తుది జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.చదవండి: SRH: కమిన్స్‌కు షాక్‌.. కెప్టెన్‌గా ఇషాన్‌ కొనసాగింపు!

Jacob Bethell should leave IPL play County instead: Alastair Cook Know Why4
ఐపీఎల్‌ వదిలి ఇక్కడికి వచ్చెయ్‌: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

టీ20 ప్రపంచకప్‌-2026లో ఇంగ్లండ్‌ తరఫున సత్తా చాటాడు యువ క్రికెటర్‌ జేకబ్‌ బెతెల్‌. టీమిండియాతో సెమీ ఫైనల్లో 105 పరుగులతో దుమ్ములేపాడు. ఓ దశలో సూర్యకుమార్‌ సేన నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నట్లు అనిపించినా.. ఆఖరికి భారత్‌ పైచేయి సాధించింది.బెంచ్‌కే పరిమితంఇక ఈ టోర్నీ తర్వాత బెతెల్‌ ఐపీఎల్‌-2026 కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టుతో చేరాడు. ఇప్పటికి ఆర్సీబీ ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లకు నాలుగు గెలిచింది. అయితే, ఇంత వరకు బెతెల్‌కు మాత్రం ఆడే అవకాశం రాలేదు. తుదిజట్టులో అతడికి ఒక్కసారి కూడా చోటు ద​‍క్కనేలేదు.కాగా బెతెల్‌ సాధారణంగా టాపార్డర్‌లో ఆడతాడు. ఆర్సీబీలో ఇప్పటికే ఓపెనర్లుగా దిగ్గజ విరాట్‌ కోహ్లి, ఫిల్‌ సాల్ట్‌ పాతుకుపోయారు. ఇతర స్లాట్లు కూడా ఖాళీగా లేవు. ఇక విదేశీ ఆటగాళ్ల జాబితాలో సాల్ట్‌, టిమ్‌ డేవిడ్‌, రొమారియో షెఫర్డ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌లకే ఆర్సీబీ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో బెతెల్‌ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు.ఓపెనర్‌గా బెస్ట్‌ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ బెతెల్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ను వీడి ఇంగ్లండ్‌ దేశీ క్రికెట్‌ ఆడేందుకు తిరిగి రావాలని సూచించాడు. ‘‘సిడ్నీలో బౌలర్ల అటాక్‌ను ఎదుర్కొని టాపార్డర్‌లో అతడు అదరగొట్టాడు.ఓపెనర్‌గా లేదంటే వన్‌డౌన్‌ బ్యాటర్‌గా రాణించగల సత్తా అతడికి ఉంది. కానీ అక్కడ ఏం జరుగుతోంది? బెతెల్‌కు ఓపెనింగ్‌ చేసే అవకాశం రావడం లేదు. అతడు బెంచ్‌ మీదే ఉండాల్సిన పరిస్థితి. పూర్తిగా ఖాళీగా ఉంటున్నాడు.తిరిగి వచ్చెయ్‌స్వదేశానికి తిరిగి వచ్చి కౌంటీ చాంపియన్‌షిప్‌లో వర్విక్‌షైర్‌ తరపున ఆడితే బాగుంటుంది’’ అని అలిస్టర్‌ కుక్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో భాగంగా తన అభిప్రాయం పంచుకున్నాడు. టెస్టులకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ ప్రాక్టీస్‌ ఉపయోగపడుతుందన్నాడు.కాగా బెతెల్‌ ఇంగ్లండ్‌ దేశీ టోర్నీలో వర్విక్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో వర్విక్‌షైర్‌ మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని డివిజన్‌ వన్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: SRH: కమిన్స్‌కు షాక్‌.. కెప్టెన్‌గా ఇషాన్‌ కొనసాగింపు!

Dedicate the award to Gujarat Education minister: Ravindra Jadeja5
రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌-2026లో రాజస్తాన్ రాయల్స్‌ తరపున తొలిసారి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు రవీంద్ర జడేజా. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టాడు జడ్డూ.కఠినమైన లక్నో పిచ్‌పై 29 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 43 పరుగులతో అజేయంగా నిలిచిన జడ్డూ.. రాయల్స్‌ తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌. ఇక బౌలింగ్‌ పరంగానూ ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రాణించాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి.. నికోలస్‌ పూరన్‌ రూపంలో కీలక వికెట్‌ పడగొట్టాడు.రెండేళ్లలో తొలిసారిఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 159 పరుగులే స్కోరు చేసినప్పటికీ.. బౌలర్ల విజృంభణ కారణంగా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఇందులో జడ్డూ కీలక పాత్ర పోషించి.. గత రెండేళ్లలో తొలిసారి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.రివాబాకు అంకితంఈ సందర్భంగా రవీంద్ర జడేజా తన భార్య రివాబాపై ప్రేమ కురిపించాడు. అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘‘జట్టు విజయం కోసం కృషి చేసి అవార్డు అందుకున్న అనుభూతి చాలా బాగుంది. ఈ అవార్డును గుజరాత్‌ విద్యాశాఖా మంత్రికి అంటే నా భార్య రివాబాకు అంకితం చేస్తున్నా.మ్యాచ్‌ ఆరంభానికి ముందే.. నేను ఈరోజు అద్భుతం చేయగలగనని ఆమె చెప్పింది. ఆ మాటలే నిజమయ్యాయి. ఇందుకు ఆమెకు కృతజ్ఞతలు. నిజానికి ఈ వికెట్‌ చాలా కఠినంగా ఉంది.చివరి ఓవర్లోనూ..బంతి బాగా స్వింగ్‌ అయింది. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని భావించాను. అందుకు తగ్గట్లే ఆడాను. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. చివరి ఓవర్లోనూ మేము పరుగులు రాబట్టగలిగాము’’ అని జడేజా పేర్కొన్నాడు. కాగా లక్నోతో చివరి మ్యాచ్‌లో రాజస్తాన్‌ 20 పరుగులు రాబట్టింది.Rockstar player, rockstar performance 🎸🔥@imjadeja delivers an all-round masterclass to win his 1st player of the match award for Rajasthan Royals in #TATAIPL. 🩷#TATAIPL #LSGvRR pic.twitter.com/EeQtxbuTl3— Star Sports (@StarSportsIndia) April 22, 2026మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన రాజస్తాన్‌.. లక్నోను 119 పరుగులకే ఆలౌట్‌ చేసింది. తద్వారా 40 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్‌కు ఇది ఐదో గెలుపు. చదవండి: సీఎస్‌కే శిబిరంలో తీవ్ర విషాదం​

End Of SRH Captaincy For Cummins; Harbhajan's Ishan Remark Stirs Debate6
SRH: కమిన్స్‌కు షాక్‌.. కెప్టెన్‌గా ఇషాన్‌ కొనసాగింపు!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు పూర్వ వైభవం తెచ్చిన ఘనత ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు దక్కుతుంది. మూడు సీజన్లుగా చతికిల పడిన ఎస్‌ఆర్‌హెచ్‌కు కమిన్స్‌ తన అద్భుతమైన కెప్టెన్సీతో జీవం పోశాడు. అతడి సారథ్యంలో 2024లో సన్‌రైజర్స్‌ ఫైనల్‌కు చేరింది.వెన్నునొప్పితో..ఇక గతేడాది పద్నాలుగింట ఆరు విజయాలతో.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో ముగించింది ఎస్‌ఆర్‌హెచ్‌. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది వెన్నునొప్పి కారణంగా కమిన్స్‌ సన్‌రైజర్స్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్‌, టీ20 ప్రపంచకప్‌ విజేత ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) కమిన్స్‌ స్థానంలో కెప్టెన్సీ చేపట్టాడు.ఐపీఎల్‌-2026లో ఇషాన్‌ సారథ్యంలో ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ నాలుగు గెలిచింది. ముఖ్యంగా సొంతమైదానం ఉప్పల్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లలో ఇషాన్‌ కెప్టెన్సీకి మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే.. ఫిట్‌నెస్‌ సమస్యలను అధిగమించి కమిన్స్‌ (Pat Cummins) ఇటీవలే జట్టుతో చేరాడు.ఈ క్రమంలో శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌తో సన్‌రైజర్స్‌ తరఫున కమిన్స్‌ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ అంశం చర్చనీయాంశంగా మారగా.. టీమిండియా మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ఇషాన్‌నే సారథిగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.ఇషాన్‌ కిషన్‌నే కొనసాగించాలిఇక టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ కూడా తాజాగా ఇషాన్‌కే మద్దతుగా నిలిచాడు. జియోహాట్‌స్టార్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ప్యాట్‌ కమిన్స్‌ తిరిగి వచ్చినా ఇషాన్‌ కిషన్‌నే సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా కొనసాగించాలి. యువ నాయకుడికి మద్దతుగా నిలబడాలని యాజమాన్యం భావిస్తే ఇలా చేయడమే సరైంది.కారణం ఇదేకమిన్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ను 2024లో ఫైనల్‌కు చేర్చిన మాట నిజమే. అయితే, ప్రస్తుతం ఇషాన్‌ నాయకత్వంలోనూ జట్టు మంచి ఫలితాలు సాధిస్తోంది. బౌలర్లు, ఇతర ఆటగాళ్లకు అతడితో మంచి సమన్వయం కుదిరింది. కాబట్టి ఇషాన్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తే సన్‌రైజర్స్‌కు ప్రయోజనం చేకూరుతుంది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా చాన్నాళ్లుగా గాయం వల్ల ఆటకు దూరమైన కమిన్స్‌ పునరాగమనం చేయనున్నాడు. దీంతో అతడిపై కెప్టెన్సీ రూపంలో అదనపు భారం పడకుండా మేనేజ్‌మెంట్‌ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.చదవండి: BCCI: డబ్బు కక్కుర్తి.. టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?

Nuwan Thushara Leaves RCB In Troubled Waters With Shocking U Turn7
ఆర్సీబీకి షాక్‌.. కేసు వెనక్కు తీసుకున్న బౌలర్‌

శ్రీలంక ఆటగాడు నువాన్‌ తుషార వ్యవహారం ప్రస్తుత ఐపీఎల్‌ ఛాంపియన్‌ ఆర్సీబీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్‌ 2026లో పాల్గొనేందుకు తుషారకు అతని సొంత దేశ క్రికెట్‌ బోర్డు (శ్రీలంక క్రికెట్‌) అనుమతి నిరాకరించింది. ఫిట్‌నెస్‌ లేని కారణంగా తుషారకు ఎన్‌వోసీ జారీ చేయలేమని తెలిపింది.ఈ విషయమై కోర్టును ఆశ్రయించిన తుషార.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అకస్మాత్తుగా కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కోర్టు శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ పరిణామం తర్వాత తుషార ఇక ఐపీఎల్ ఆడటం కష్టమేనని తేలిపోయింది.తుషార వ్యవహారంలో కోర్టు తీర్పు ఆర్సీబీని ఇరకాటంలో పడేసింది. ఆ జట్టు ఈ సీజన్‌లో తుషారపై ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే, గత సీజన్‌లో అతను హాజిల్‌వుడ్‌ గైర్హాజరీలో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతని యార్కర్లు, స్లో బంతులు డెత్ ఓవర్లలో ఆర్సీబీ​కి కీలకంగా మారే అవకాశం ఉండింది.ప్రస్తుతం ఆర్సీబీకి హాజిల్‌వుడ్‌, డఫీ, ఎంగిడి వంటి విదేశీ పేస్‌ బౌలింగ్‌ ఆప్షన్స్‌ ఉన్నప్పటికీ.. తుషార లాంటి డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ ఉంటే అదనపు బలంగా మారే అవకాశం ఉండింది. మొత్తంగా తుషార న్యాయపోరాటం చేస్తూ మధ్యలోనే యూ-టర్న్‌ తీసుకోవడం ఆర్సీబీకి వ్యూహాత్మక నష్టంగా పరిగణించాలి. ప్లే ఆఫ్స్‌ రేసులో పోటీ తీవ్రంగా ఉన్న దశలో ఇలాంటి మార్పులు జట్టు సమతుల్యతను దెబ్బతీస్తాయి.కాగా, తుషార లేకపోయినా ఆర్సీబీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగానే రాణిస్తుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఏప్రిల్‌ 24న జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

Stop This outrageous You Dont Need Money: Lalit Modi Lambasts BCCI8
BCCI: టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ మండిపడ్డాడు. ‘డబ్బు కోసం కక్కుర్తి పడి.. ఆటగాళ్లను చంపకండి’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. బోర్డు మెదడుతో కాకుండా మనసుతో స్పందించి తమ ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.బిజీ షెడ్యూల్‌కాగా గత కొన్నేళ్లుగా టీమిండియా బిజీ షెడ్యూల్‌తో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌-2026 ముగిసిన వెంటనే స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌ తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌, జింబాబ్వే తదితర టూర్లు.ఇక ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ మే 31న ముగియనుండగా.. జూన్‌ 6న అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) బిజీ షెడ్యూల్‌పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ‘‘జట్టులోని చాలా మంది ఆటగాళ్లు మే 31 వరకు ఐపీఎల్‌తోనే బిజీగా గడపుతారు.స్వల్ప వ్యవధిలోనే జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరడం ఒత్తిడిని పెంచుతుంది’’ అని గంభీర్‌ బోర్డు వద్ద తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తను ఓ యూజర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. లలిత్‌ మోదీ తీవ్రంగా స్పందించాడు.టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?‘‘గంభీర్‌ వాదనతో నేను ఏకీభవిస్తాను. విరామం లేని షెడ్యూల్‌తో బీసీసీఐ తమ ఆటగాళ్లను చంపినంత పని చేస్తోంది. ఇలాంటి భయంకరమైన విధానాన్ని ఆపేయండి. ఆటగాళ్లను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కాస్త ఆనందంగా గడపనివ్వండి.భారీ ఆదాయానికి బీజం వేశానుఅయినా మీకు ఇప్పుడు అంతగా డబ్బు అవసరం ఏముంది? నేను ఇప్పటికే ఐపీఎల్‌ ద్వారా ఏడాదికి కావాల్సినంత ఆదాయం వచ్చేలా బీజం వేశాను కదా! ప్రపంచంలో అందరి కంటే బీసీసీఐ సంపన్న బోర్డు కావడానికి ఇదో కారణం. కాబట్టి మీరు డబ్బు గురించి బెంగ పడకండి.ఆటగాళ్ల క్షేమం గురించి కూడా ఆలోచించండి. ప్రొఫెషనల్‌ సీఈఓను నియమించండి. భారీగా జీతం ఇచ్చి HRను పెట్టుకోండి. ఆటగాళ్ల సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌పై కూడా కొంచెం ఖర్చు చేయండి. స్టేడియాలను మరింత గొప్పగా తీర్చిదిద్దండి. ప్రేక్షకులకు వరల్డ్‌క్లాస్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించండి.మనసుతో ఆలోచించండిఆటగాళ్లేమీ యంత్రాలు కాదు. మీరు మెదడుతో కాకుండా మనసుతో కూడా ఆలోచించండి’’ అని ఎక్స్‌ వేదికగా లలిత్‌ మోదీ బీసీసీఐ తీరును తూర్పారబట్టాడు. కాగా లలిత్‌ మోదీ ఆలోచనతో 2008లో ఐపీఎల్‌ రూపుదిద్దుకోగా.. లీగ్‌ తొలి చైర్మన్‌గా అతడే వ్యవహరించాడు. కానీ కొన్నేళ్లకే మనీ లాండరింగ్‌ ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్థిక నేరగాడిగా ముద్రపడి.. లండన్‌కు పారిపోయి దశాబ్దకాలానికిపైగా అక్కడే నివాసం ఉంటున్నాడు. చదవండి: ఇప్పటికీ బాధపడుతున్నా: రోహిత్‌కు మాజీ కెప్టెన్‌ క్షమాపణలు

IPL 2026: Rajasthan Royals Pacer Handed Big Punishment By BCCI9
రాజస్తాన్‌ పేసర్‌కు భారీ షాక్‌

రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ నండ్రీ బర్గర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అతడి మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. ఐపీఎల్‌ పాలక మండలి ఈ విషయాన్ని తాజాగా ధ్రువీకరించింది. ఐపీఎల్‌-2026లో భాగంగా రాజస్తాన్‌ బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే.40 పరుగుల తేడాతోఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. అయితే, బౌలర్ల విజృంభణ కారణంగా లక్నోను 119 పరుగులకే ఆలౌట్‌ చేసి.. 40 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు తీయగా.. నండ్రీ బర్గర్‌, బ్రిజేశ్‌ శర్మ తలా రెండు.. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయి చెరో వికెట్‌ దక్కించుకున్నారు.అయితే, లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా నండ్రీ బర్గర్‌ ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా శిక్ష పడింది. అతడు ఆర్టికల్‌ 2.5లోని లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడటం.. దురుసుగా ప్రవర్తిస్తే ఈ నిబంధన కింద చర్యలు తీసుకుంటారు.2⃣ good catches by the #RR captain 🫡Nandre Burger 🤝 Brijesh Sharma with the wickets ✌️Updates ▶️ https://t.co/5SaPY8wfsc#TATAIPL | #KhelBindaas | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/bS8yT5QFYh— IndianPremierLeague (@IPL) April 22, 2026మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోతఈ నేపథ్యంలో తప్పును అంగీకరించిన నండ్రీ బర్గర్‌కు మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో డీమెరిట్‌ పాయింట్‌ చేర్చింది ఐపీఎల్‌ పాలక మండలి. ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్‌లో నండ్రీ బర్గర్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను డకౌట్‌ చేసిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (55) రూపంలో మరో కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌

Mitchell Starc Cleared To Play IPL 2026 For Delhi Capitals10
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇకపై మంచి రోజులు

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో 3 విజయాలు, 3 అపజయాలతో నాట్‌ గుడ్‌ నాట్‌ బ్యాడ్‌ అన్నట్లుగా సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇకపై మంచి రోజులు రానున్నాయి. స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ టోర్నీలో పాల్గొనేందుకు తన జాతీయ బోర్డు (క్రికెట్‌ ఆస్ట్రేలియా) నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ పొందాడు. స్టార్క్‌ మే 1 నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.స్టార్క్‌ గాయాలు, వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ కారణంగా ఐపీఎల్‌ 2026 ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను గాయాల నుంచి పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా ధృవీకరించింది. స్టార్క్‌ పూర్తిగా కోలుకొని, ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది.స్టార్క్‌ రాక ఢిల్లీ బౌలింగ్‌ విభాగానికి మరింత బూస్టప్‌ ఇస్తుంది. ఆ జట్టు ఇప్పటికే ఎంగిడి, ముకేశ్‌ కుమార్‌, నటరాజన్‌ వంటి పేసర్లతో కలకలలాడుతుంది. స్పిన్‌ విభాగంలోనూ ఢిల్లీ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ వంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఈ జట్టులోనే ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీకి బౌలింగ్‌ విభాగంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. బౌలర్లు సమిష్టిగా రాణిస్తూ జట్టు విజయాలకు దోహదపడ్డారు. బ్యాటింగ్‌లోనే ఢిల్లీ కాస్త తడబడుతుంది. కేఎల్‌ రాహుల్‌, డేవిడ్‌ మిల్లర్‌, సమీర్‌ రిజ్వి పర్వాలేదనిపిస్తున్నా.. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శలను ఇవ్వలేకపోతున్నారు. ఈ జట్టు తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన పంజాబ్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 25న మధ్యాహ్నం జరుగనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement