Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Indian Wrestlers Won Medals In Asia Senior Wrestling Championship1
అద‌రగొట్టిన భార‌త రెజ్ల‌ర్లు..

బిష్‌కెక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత రెజ్లర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో సుజీత్‌ కల్కాల్‌ (65 కేజీలు), అభిమన్యు (70 కేజీలు) పసిడి పతకాలతో మెరిపించగా... సందీప్‌ సింగ్‌ మాన్‌ (79 కేజీలు) రజతం... అంకుశ్‌ (57 కేజీలు) కాంస్యం దక్కించుకున్నారు. ఈ ఏడాది అజేయంగా ఉన్న సుజీత్‌ ఫైనల్లో 8–1 పాయింట్ల తేడాతో ఉమిద్‌జాన్‌ జలోలోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను అలవోకగా ఓడించాడు. ఈ విజయంతో సుజీత్‌ 2019లో బజరంగ్‌ పూనియా తర్వాత 65 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించిన భారత రెండో రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. మరోవైపు అభిమన్యు 5–3తో తుల్గా తుముర్‌ ఒచిర్‌ (మంగోలియా)పై గెలుపొందాడు. 79 కేజీల ఫైనల్లో సందీప్‌ సింగ్‌ 1–2తో కీవన్‌ ఘరెదాగి (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. 57 కేజీల కాంస్య పతక బౌట్‌లో అంకుశ్‌ 8–2తో ఫుగా ససాకి (జపాన్‌)పై విజయం సాధించాడు. 97 కేజీల కాంస్య పతక బౌట్‌లో విక్కీ 5–7తో షెర్జాద్‌ పొయోనోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో అమన్, ముకుల్‌ టోర్నీ చివరిరోజు ఆదివారం భారత్‌కు మరో రెండు స్వర్ణ పతకాలు లభించే అవకాశం ఉంది. 61 కేజీల విభాగంలో అమన్‌ సెహ్రావత్, 86 కేజీల విభాగంలో ముకుల్‌ దహియా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో అమన్‌ 11–9తో అహ్మద్‌ (ఇరాన్‌)పై, ముకుల్‌ 12–6తో బొలాత్‌ సకాయెవ్‌ (కజకిస్తాన్‌)పై గెలిచారు. 125 కేజీల విభాగం సెమీఫైనల్లో దినేశ్‌ 0–2తో షరిపోవ్‌ (బహ్రెయిన్‌) చేతిలో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం పోటీపడతాడు.

Ayush Mhatre Joins Elite List After Retired Out Vs Delhi Capitals2
ట్విస్ట్ అదుర్స్‌.. అరుదైన జాబితాలో ఆయుశ్ మాత్రే!

ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో భాగంగా శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఆట‌గాడు ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయుశ్ రిటైర్డ్ ఔట్ వెనుక సీఎస్‌కే మేనేజ్‌మెంట్ హ‌స్తం ఉంది. మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేస్తున్న ఆయుశ్ మాత్రేను అర్థంత‌రంగా రిటైర్డ్ ఔట్‌గా వెళ్లిపోవడం వెనుక విమ‌ర్శ‌లు వచ్చాయి. కానీ సీఎస్‌కే నిర్ణ‌యం స‌రైన‌దే అని కాసేప‌టికే తెలిసొచ్చింది. ఆయుశ్ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన హార్డ్ హిట్ట‌ర్ శివ‌మ్ దూబే త‌న పాత్ర‌కు న్యాయం చేస్తూ వేగంగా ప‌రుగులు రాబ‌ట్టాడు. ఫ‌లితంగా సీఎస్‌కే భారీ స్కోరు సాధించింది. ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్ వెనుక కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ పాత్ర కీల‌కం. అందుకే మాత్రే పెవిలియ‌న్ చేరుకున్న స‌మ‌యంలో అత‌డికి స్టాండింగ్ ఒవేష‌న్ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ఆయుశ్ మాత్రే ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔట్‌లు చాలా త‌క్కువ‌గా జ‌రుగుతుంటాయి. గ‌తంలో రవిచంద్రన్ అశ్విన్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, డెవాన్ కాన్వే వంటి క్రికెట‌ర్లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. తాజాగా ఈ జాబితాలో ఆయుశ్ మాత్రే కూడా చేరిపోయాడు. కాగా ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఆయుశ్‌ మాత్రేదే తొలి రిటైర్డ్‌ ఔట్‌.సాధార‌ణంగా క్రికెట్‌లో రిటైర్డ్ హ‌ర్ట్‌, రిటైర్డ్ ఔట్ వేర్వేరు. రిటైర్డ్ హర్ట్' అంటే గాయం కారణంగా ఆటగాడు మైదానం విడిచిపెట్టడం. అదే రిటైర్డ్ ఔట్ అనేది జ‌ట్టు ప్రయోజనాల కోసం స్వచ్చందంగా మైదానం విడిచిపెట్టడం. రిటైర్డ్ హ‌ర్ట్ అయితే స‌ద‌రు మ్యాచ్‌లో మళ్లీ మైదానంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అలా కాదు. ఒక్క‌సారి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగితే మళ్లీ క్రీజులోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉండ‌దు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. View this post on Instagram A post shared by IPL (@iplt20) చదవండి: అంపైర్‌తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్‌!

Tristan Stubbs Asked To Change Gloves But Umpire Refused Video Viral3
అంపైర్‌తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్‌!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో ఊగిపోతూ హెల్మెట్‌ను నేలకేసి కొట్టడంతో పాటు గ్లోవ్స్‌ను విసిరేయడం కెమెరాలకు చిక్కింది. మరి స్టబ్స్ కోపానికి కారణమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో స్టబ్స్ తన గ్లోవ్స్‌ను మార్చుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే గ్లోవ్స్ మొత్తం చెమటతో తడిసిపోవడంతో స్టబ్స్ పదే పదే బ్యాట్ గ్రిప్‌ను కోల్పోయాడు. దీంతో గ్లోవ్స్‌ను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని అంపైర్‌ను కోరాడు. కానీ అంపైర్ ససేమీరా అనడంతో చేసేదేం లేక స్టబ్స్ అదే గ్లోవ్స్‌తో కంటిన్యూ అయ్యాడు. అయితే 19వ ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడే యత్నంలో మిడాఫ్‌లో నూర్ అహ్మద్ చేతికి చిక్కాడు. దీంతో పెవిలియన్ చేరిన స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా కోపంతో ఊగిపోతూ బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేయడంతో పాటు గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టబ్స్‌ ఔటైన తర్వాత డగౌట్‌లో ఉన్న ఢిల్లీ ఆటగాడు నితీశ్‌ రానా స్టబ్స్‌ను సమర్థించాడు. తడిగా ఉన్న గ్లోవ్స్‌తో ఆడడం వల్ల బ్యాటింగ్‌కు ఆటంకం కలుగుతుందని, స్టబ్స్‌కు గ్లోవ్స్ మార్చుకునేందుకు అవకాశమెందుకు ఇవ్వలేదంటూ థర్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు. కోచ్‌ హేమంగ్‌ బదాని కూడా అంపైర్‌తో ఇదే విషయమై వాదనకు దిగడం కనిపించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.Stubbs asked to change his gloves just before the wicket ball and Umpire didn't allow it, now DC management is furious and ofcourse CSK is involved in another spooky decision. pic.twitter.com/jkkImLB5Bq— Avay Sha (@avay_69) April 11, 2026🚨 DC Camp Angry on Umpire Decision 🚨DC coach Hemang Badani and Nitish Rana were angry on umpire after Tristan Stubbs was not allowed to change his gloves during the over.The decision upset the DC camp, and on the very next ball, Stubbs got out. pic.twitter.com/qGHdCe6tQL— Cricket Vaira (@ramgaming242) April 11, 2026Stubs wanted to change his gloves, but the umpire did not allow it, and he got out on the very next ball.#CSKvsDC pic.twitter.com/BAHX9zhURM— Vivek Gupta (@VIVEK1888) April 12, 2026చదవండి: ‘విజయానికి వాళ్లే కారణం.. సంజూ కాదు’

CSK Captian Ruturaj Says Bowlers Play Key Role-Match Won Vs DC4
‘విజయానికి వాళ్లే కారణం.. సంజూ కాదు’

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ విజయంలో సంజూ శాంసన్, ఆయుశ్ మాత్రేలు కీలకపాత్ర పోషించారు. అయితే సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం బౌలర్ల వల్లే తమ జట్టు విజయం సాధించిదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు సీజన్‌లో తొలి విజయం సాధించడం, సంతోషంతో మాట్లాడేందుకు మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ మేము ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది. చెపాక్ స్టేడియంలో మేము ఎప్పుడు మొదట బ్యాటింగ్ చేసినా 200 నుంచి 210 స్కోరు చేయాలని అనుకునేవాళ్లం. కానీ స్లో పిచ్ కారణంగా ఆ స్కోరు చేయడం కాస్త కష్టంగా అనిపించేంది. గత మ్యాచ్‌లతో పోలిస్తే అన్ని విషయాల్లో మెరుగయ్యాం. ఈరోజు సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ఆయుష్ కూడా అద్భుతంగా రాణించాడు. కానీ ఇవాళ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలుపులో బౌలింగ్ పాత్రే కీలకం. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం మా విజయానికి కలిసొచ్చింది. మా బౌలర్ల కృషిని చూసి గర్వపడుతున్నా. నిజానికి మా బౌలింగ్ లైనప్‌లో 'ఎక్స్-ఫ్యాక్టర్' బౌలర్ లేకపోయి ఉండవచ్చు. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ ఎంత ప్రభావవంతంగా ఉండాలి, ముందస్తుగా ఎలా ఆలోచించాలి, అదనపు బౌండరీలను ఎలా ఆపాలి అనే విషయాలపై మేం చర్చించుకుంటూనే ఉన్నాం. తొలి మూడు మ్యాచ్‌ల్లో మేము విజయానికి చేరువగా వచ్చినప్పటికీ ఒకటి రెండు ఓవర్లలో 20-25 పరుగులు సమర్పించుకోవడం గెలుపును దూరం చేశాయి. పవర్‌ప్లేలో మేం కొంచెం వెనకంజలో నిలిచినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాం. చెన్నై ఫ్యాన్స్ ఎప్పుడూ మాకు అండగా ఉంటారు. మేం ఎక్కడికి వెళ్లినా వారి మద్దతు, సందేశాలు మమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దేశంలో ఈ ప్రాంతం ప్రత్యేకం. ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే ఫ్రాంచైజీని అమితంగా ప్రేమిస్తుంటారు.’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.చదవండి: ‘నా సెంచరీ వెనుక ఆ 50 సెకన్లు.. అతడికే అంకితం’

CSK Player Sanju Samson Comments After Match Won Vs Delhi Capitals5
‘నా సెంచరీ వెనుక ఆ 50 సెకన్లు.. అతడికే అంకితం’

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఐదుసార్లు చాంపియ‌న్ అయిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఎట్ట‌కేల‌కు బోణీ చేసింది. హ్యాట్రిక్ ప‌రాజ‌యాల త‌ర్వాత గెలుపు రుచి చూసింది. శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై 23 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. సెంచ‌రీతో చెల‌రేగిన సంజూ శాంస‌న్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. మూడు వ‌రుస ఓట‌ముల త‌ర్వాత‌ సెంచ‌రీతో జ‌ట్టును గెలిపించ‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. వ‌రుస‌గా విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ జ‌ట్టు మేనేజ్‌మెంట్ త‌న‌పై న‌మ్మ‌కం ఉంచడం గొప్ప విష‌య‌మ‌న్నాడు. తన సెంచ‌రీని సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్‌కు అంకిత‌మిస్తున్న‌ట్లు శాంస‌న్ తెలిపాడు. శాంస‌న్ మాట్లాడుతూ.. ‘ఈసెంచ‌రీ నాకు ఎంతో ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే నాపై న‌మ్మ‌కంతో చెన్నై ఫ్రాంచైజీ ట్రేడింగ్‌లో న‌న్ను ద‌క్కించుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైనప్పుడు వారి న‌మ్మ‌కాన్ని కోల్పోతున్నానేమోననిపించింది. కానీ ఇవాళ బాధ్య‌తా యుతంగా ఆడి సెంచ‌రీ చేయ‌డంతో పాటు వారు నాపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిజం చేశాను. ఇంత‌కాలం ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వ‌హించి ఇప్పుడు మ‌రో కొత్త ఫ్రాంచైజీకి ఆడ‌డం కొంత క‌ష్ట‌మే. కానీ నాకు చెన్నై విష‌యంలో అది ఏనాడు క‌నిపించ‌లేదు. చెన్నైకి ఆడుతుంటే నేను మ‌రో సొంత ఇంటికి వ‌చ్చాన‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఇక్క‌డి ప్ర‌జ‌లు చాలా మంచివారు. అంద‌రూ ప్ర‌శాంతంగా క‌నిపిస్తున్నారు. అయితే వ‌రుస‌గా మూడు ఓట‌ములు చ‌విచూసిన‌ప్ప‌టికీ ఇవాళ మ్యాచ్‌కు ముందు మేమంతా కేవలం 50 సెకన్లు మాత్రమేమీటింగ్ పెట్టుకున్నాం. ఆ యాబై సెక‌న్లు నేను ఒక టీమ్‌తో ఎంత క‌నెక్ట్ అయ్యాన‌నేది చూపించింది. నేను గతంలో చాలాసార్లు విఫలమయ్యాను. అలాంటప్పుడు మనసు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. కానీ నా బేసిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని పాటించడమే ముఖ్యం. అందుకోసం మా సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాను. మ్యాచ్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా అవసరం. ఆయుష్ చాలా పరిణతితో ఆడాడు. మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోసమే నా సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాను. పరిస్థితులు ఎంత సవాలుగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఈ ఇన్నింగ్స్‌ను ఆయనకు అంకితం చేయాలనుకున్నాను.’ అని తెలిపాడు.🗣️🗣️ 𝙄𝙩 𝙛𝙚𝙚𝙡𝙨 𝙡𝙞𝙠𝙚 𝙘𝙤𝙢𝙞𝙣𝙜 𝙩𝙤 𝙖𝙣𝙤𝙩𝙝𝙚𝙧 𝙝𝙤𝙢𝙚 🏠Sanju Samson reflects on his match-winning knock and the love from the Chennai crowd 💛 Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC | @IamSanjuSamson | @ChennaiIPL pic.twitter.com/H4X2sug3sB— IndianPremierLeague (@IPL) April 11, 2026#CSK fans, bring out the whistles 💛A first win of the season for the 5⃣-time #TATAIPL champions 👏Scorecard ▶️ https://t.co/BzGc6O65jX #KhelBindaas | #CSKvDC | @ChennaiIPL pic.twitter.com/tS2xyOWgdj— IndianPremierLeague (@IPL) April 11, 2026చదవండి: చరిత్ర సృష్టించిన శాంసన్‌.. ధోని కూడా సాధ్యం కాలేదు

Sanju Samson Creates History for CSK, Achieves Record MS Dhoni Never Managed6
చరిత్ర సృష్టించిన శాంసన్‌.. ధోని కూడా సాధ్యం కాలేదు

ఐపీఎల్‌-2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమైన సంజూ.. ఢిల్లీపై మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. శాంసన్‌ కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సెంచరీ బాదిన మొట్టమొదటి వికెట్ కీపర్-బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.2008 నుండి సీఎస్‌కే పూర్తిస్థాయి కీపర్‌గా ఉన్న ఎంఎస్ ధోనికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనీ అత్యధిక స్కోరు 84 పరుగులుగా ఉంది. అయితే ధోని దాదాపుగా లోయార్డర్‌లోనే బ్యాటింగ్‌కు రావడంతో ఒక్కసారి మూడంకెల స్కోర్‌ను అందుకోలేకపోయాడు. కానీ సంజూ మాత్రం సీఎస్‌కే తరపున తొలి ఎడిషన్‌లో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌🚨 SANJU SAMSON SCORED THE FIRST HUNDRED IN IPL 2026 🚨Chetta at Chepauk. 🔥 pic.twitter.com/XXWiX1P3nP— Johns. (@CricCrazyJohns) April 11, 2026

Punjab Kings defeated Sunrisers Hyderabad by six wickets7
పంజాబ్‌ ప్రతాపం

న్యూ చండీగఢ్‌: ఐపీఎల్‌ 19వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా రెండో పరాజయం మూట గట్టుకుంది. బ్యాటింగ్‌లో ఆశించిన స్కోరు చేయలేకపోయిన రైజర్స్‌... పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. శనివారం ‘డబుల్‌ హెడర్‌’లో భాగంగా జరిగిన తొలి పోరులో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓడింది. మొదట హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 74; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచికొట్టగా... ట్రావిస్‌ హెడ్‌ (23 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్‌), క్లాసెన్‌ (33 బంతుల్లో 39; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. లక్ష్యఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్‌ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు హాఫ్‌ సెంచరీలు సాధించగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ అయ్యర్‌ (33 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. పవర్‌ప్లేలో 105 పరుగులు రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమైన తీరు చూస్తే ఈ మ్యాచ్‌లో 300 పరుగుల రికార్డు స్కోరు ఖాయనిపించింది. తొలి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్‌.. అర్ష్ దీప్‌ వేసిన మూడో ఓవర్‌లో 4, 4, 6, 6తో మొత్తం 24 పరుగులు రాబట్టాడు. యాన్సెన్‌ వేసిన తదుపరి ఓవర్‌లో హెడ్‌ 4, 6, 4 కొట్టగా... వైశాక్‌ వేసిన ఐదో ఓవర్‌లో అభిషేక్‌ నాలుగు సిక్స్‌లతో విజృంభించాడు. ఈ క్రమంలో అభిషేక్‌ 18 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్‌లో హెడ్‌ ‘హ్యాట్రిక్‌’ ఫోర్లు బాదగా... అభిషేక్‌ ఓ సిక్స్‌ కొట్టాడు. దీంతో ఆరు ఓవర్ల పవర్‌ ప్లే ముగిసేసరికి రైజర్స్‌ వికెట్‌ కోల్పోకుండా 105 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ గాడితప్పింది. శశాంక్‌ ఒకే ఓవర్‌లో హెడ్, అభిషేక్‌లను పెవిలియన్‌కు చేర్చగా... కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఓ మాదిరిగా ఆడినా... మరో ఎండ్‌లో క్లాసెన్‌ ధాటి కనబర్చలేకపోయాడు. అనికేత్‌ (18) అనూహ్యంగా రనౌట్‌ కాగా... నితీశ్‌ రెడ్డికి (0 నాటౌట్‌)ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం దక్కింది. పవర్‌ప్లే తర్వాత 14 ఓవర్లలో హైదరాబాద్‌ 114 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది. ధనాధన్‌ ఆరంభం సన్‌రైజర్స్‌ ఓపెనర్లను మరిపించే స్థాయిలో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభమైంది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ప్రతి బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించారు. ఆర్య తొలి ఓవర్‌లో 4, 6, 4 కొట్టగా... తర్వాతి రెండు ఓవర్‌లలో ప్రభ్‌సిమ్రన్‌ రెండేసి ఫోర్లు, రెండేసి సిక్స్‌లు బాదాడు. ఈ జంట ఏ బౌలర్‌ను వదలకుండా విరుచుకుపడటంతో... పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ వికెట్‌ కోల్పోకుండా 93 పరుగులు చేసింది. ఈ క్రమంలో హర్షల్‌ పటేల్‌ ఓవర్‌లో వరుసగా 6, 6, 4, 4 కొట్టిన ఆర్య 16 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికి ప్రభ్‌సిమ్రన్‌ 24 బంతుల్లో ఈ ఫీట్‌ అందుకున్నాడు. వీరిద్దరు అవుటయ్యాక ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత శ్రేయస్‌ తీసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ ముందుకు సాగిన అయ్యర్‌ 24 బంతుల్లో ‘ఫిఫ్టీ’ కొట్టడంతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు.స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) అర్ష్ దీప్‌ (బి) శశాంక్‌ 74; హెడ్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) శశాంక్‌ 38; ఇషాన్‌ (సి) యాన్సెన్‌ (బి) అర్ష్ దీప్‌ 27; క్లాసెన్‌ (సి) కూపర్‌ (బి) బార్ట్‌లెట్‌ 39; అనికేత్‌ (రనౌట్‌) 18; సలీల్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) అర్ష్ దీప్‌ 9; నితీశ్‌ రెడ్డి (నాటౌట్‌) 0; హర్ష్ దూబే (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–120, 2–122, 3–169, 4–195, 5–214, 6–218. బౌలింగ్‌: అర్ష్ దీప్‌ 4–0–50–2; బార్ట్‌లెట్‌ 4–0–42–1; యాన్సెన్‌ 4–0–40–0; వైశాక్‌ 2–0–33–0; శశాంక్‌ 3–0–20–2; చాహల్‌ 3–0–33–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ఆర్య (సి) నితీశ్‌ రెడ్డి (బి) శివాంగ్‌ 57; ప్రభ్‌సిమ్రన్‌ (సి) క్లాసెన్‌ (బి) శివాంగ్‌ 51; కూపర్‌ (సి) అభిషేక్‌ (బి) శివాంగ్‌ 11; శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 69; నేహల్‌ వధేరా (బి) హర్ష్ 14; శశాంక్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–99, 2–117, 3–128, 4–197. బౌలింగ్‌: హర్ష్ దూబే 4–0– 38–1; జైదేవ్‌ ఉనాద్కట్‌ 3–0–40–0; ఇషాన్‌ మలింగ 3–0–46–0; హర్షల్‌ 2–0–39–0; శివాంగ్‌ కుమార్‌ 4–0–33–3; నితీశ్‌ రెడ్డి 2–0–20–0; అభిషేక్‌ 0.5–0–7–0.

 IPL 2026: Chennai register maiden win of season8
శతక్కొట్టిన సంజూ.. బోణీ కొట్టిన సీఎస్‌కే

ఐపీఎల్‌-2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్‌(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్‌ నిస్సాంక(41), అశుతోష్‌ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్‌ మూడు, నూర్‌ అహ్మద్‌, ఖలీల్‌ తలా వికెట్‌ సాధించారు.సంజూ సూపర్ సెంచరీఅంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 52 బంతుల్లోనే తన నాలుగో ఐపీఎల్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా సంజూ 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆయూశ్ మాత్రే(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.చదవండి: IPL 2026: చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్‌ సెంచరీ

Sanju Samsons back, Shuts critics with first century of IPL 20269
చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్‌ సెంచరీ

ఐపీఎల్‌-2026లో తొలి సెంచరీ నమోదైంది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో సంజూ ఉతికారేశాడు.కేవలం 52 బంతుల్లోనే నాలుగో ఐపీఎల్‌ సెంచరీ మార్కును సంజూ అందుకున్నాడు. సీఎస్‌కే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగా కోల్పోయినప్పటికి.. సంజూ మాత్రం యువ ఆటగాడు ఆయూశ్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వారిద్దరూ రెండో వికెట్‌కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగినప్పటికి, సంజూ మాత్రం తన జోరును కొనసాగించాడు.మొత్తంగా 56 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్‌ పటేల్‌ ఒక్కడే ఓ వికెట్‌ సాధించాడు.అయూశ్‌ మాత్రే రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్‌-2026 వేలానికి ముందు సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ నుంచి సీఎస్‌కే ట్రేడ్‌చేసుకుంది. అయితే తొలి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే (6, 7, 9 పరుగులు) అవుట్ అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు తన సూపర్ సెంచరీతోనే విమర్శలకు సమాధనమిచ్చాడు.చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

IPL 2026: Ishan Kishan reflects on SRHs loss to PBKS10
ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

ఐపీఎల్-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రో ఓట‌మి చ‌విచూసింది. శ‌నివారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలైంది. 220 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్లు కాపాడుకోలేక‌పోయారు. ఈ భారీ టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.5 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ 69 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ప్రియాన్ష్‌ ఆర్య(57), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. సన్‌రైజర్స్ బౌలర్లలో స్పిన్నర్లు శివాంగ్ కుమార్ మూడు, హర్ష్ దూబే ఓ వికెట్ సాధించారు. ఫాస్ట్ బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని కిషన్ తెలిపాడు."మేము సాధించిన 219 పరుగుల భారీ స్కోర్ ఈ రోజు సరిపోలేదు. మేము ఆరంభించిన తీరు చూస్తే కనీసం 250 పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ మధ్య ఓవర్లలో తడబడ్డాం. అయినప్పటికి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని అందించాము.కానీ పంజాబ్ ఓపెనర్లు కూడా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో భారీగా పరుగులు రాబట్టుకున్నారు. జట్టులో ఆరు నుండి ఏడుగురు బౌలర్లు ఉన్నప్పటికీ, ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌లేక‌పోయాము. టీ20 క్రికెట్‌లో సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో వేయడం ముఖ్యం. కానీ ఈ రోజు ఆ విషయంలో విఫలమయ్యారు. ప్రస్తుత క్రికెట్‌లో మ్యాచ్‌కు ముందే ప్లానింగ్ అంతా పూర్తవుతుంది. ఏ బ్యాటర్ ఎక్కడ హిట్టింగ్ చేస్తాడు? మైదానంలో ఏ వైపు బౌండరీ లాంగ్ ఉంది? వంటి విషయాలన్నీ మాకు తెలుసు. వీటిన్న‌టి దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేశాము. కానీ ప్లానింగ్ సరిగ్గా ఉన్నా, వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యామని" కిషన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement