Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Fans Troll PCB Selector Aaqib Javed Compares Bumrah With Usman Tariq1
బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సెలెక్టర్‌ ఆకిబ్‌ జావేద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను పాక్‌ వివాదాస్పద బౌలర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌తో పోల్చడం క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మీడియా సమావేశంలో ఆకిబ్‌ జావేద్‌ మాట్లాడుతూ.. ‘నేటి తరంలో బుమ్రా ఒక అసాధారణ బౌలర్‌. అతని బౌలింగ్‌ యాక్షన్‌ కూడా భిన్నంగానే ఉంటుంది. బుమ్రా బౌలింగ్‌ చేయడానికి వచ్చినప్పుడల్లా మా పాక్‌ ఫాస్ట్‌ బౌలర్లలో ఉస్మాన్‌ తారిఖ్‌లాగే కనిపిస్తాడు. బంతిని చాలా వేగంతో వేయడంలో దిట్ట అయినప్పటికీ అతని బౌలింగ్‌ శైలి ప్రత్యర్థి బ్యాటర్లను గందరగోళానికి గురి చేస్తుంది. ఉస్మాన్‌ తారిఖ్‌ కూడా బ్యాటర్లను తికమక పెట్టేందుకే బంతిని కాస్త ఆలస్యంగా విసురుతుంటాడు. ఈ టెక్నిక్‌ను ఉపయోగించే తారిఖ్‌ టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్ల పడగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా కాకుండా వేరే బౌలర్‌ ఎవరైనా మంచి ప్రదర్శన చేశారని చెప్పడం కష్టమే. ముఖ్యంగా టోర్నీ సెకండ్‌ హాఫ్‌లో భారీ స్కోర్లు నమోదైనప్పటికీ బుమ్రా మాత్రం తన వినూత్న బౌలింగ్‌తో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అంతేకాదు బుమ్రా తన బౌలింగ్‌తో మేటి బౌలర్లు వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ల ప్రతిబింబాన్ని గుర్తుకు తెచ్చాడని చెప్పొచ్చు. ఇకపై బుమ్రా లాంటి బౌలర్‌ దొరకడు’ అని పేర్కొన్నాడు. కాగా ఆకిబ్‌ జావేద్‌ బుమ్రాను పొగడడం వరకు బాగానే ఉన్నప్పటికీ తన స్థాయికి ఏమాత్రం తూగని ఉస్మాన్‌ తారిఖ్‌తో పోల్చడమే క్రికెట్‌ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘బుమ్రాతో అతడికి పోలికేంటి?’, ‘బుమ్రా ఎక్కడ.. తారిఖ్‌ ఎక్కడ? స్థాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో’, ‘బుమ్రా లాంటి నంబర్‌వన్‌ బౌలర్‌ను పెద్దగా గుర్తింపు లేని ప్లేయర్‌తో పోల్చడానికి సిగ్గు ఉండాలి’ అని కామెంట్లు చేశారు.ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 14 వికెట్లు పడగొట్టి మరో భారత స్పిన్నర్‌ వరుణ్‌చక్రవర్తితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు వివాదాస్పద బౌలర్‌గా పేరు పొందిన ఉస్మాన్‌ తారిఖ్‌ టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.Jasprit Bumrah Is The Usman Tariq Of Fast Bowling. Aqib Javed #pakistancricketteam pic.twitter.com/eEotIXvyt5— Shreyas Iyer Fan Page (@IyerFanPage) March 14, 2026చదవండి: ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్‌

ICC Reprimands Salman Agha On-field outburst Controversial Run-out2
ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్‌

పాకిస్థాన్‌ క్రికెటర్‌ సల్మాన్‌ అఘా రనౌట్‌ క్రికెట్‌లో పెను దుమారాన్ని రేపుతుంది. బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా సల్మాన్‌ ఔటైన తీరు క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తనను ఔట్‌ చేశాడన్న కోపంతో సల్మాన్‌ అఘా తన హెల్మెట్‌, గ్లౌవ్స్‌, బ్యాట్‌ను నేలకేసి కొట్టడమే గాక కెప్టెన్‌ మిరాజ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ లిట్టన్‌ దాస్‌తో గొడవపడ్డాడు. అఘా ఔటైన తీరు వివాదాస్పదమే అయినప్పటికీ అతడి చర్య మాత్రం క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ పలువురు క్రీడా నిపుణులు పేర్కొన్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కూడా సల్మాన్‌ అఘాపై చర్యలు తీసుకుంది. ఔట్‌ నిర్ణయం రాగానే మైదానంలో అనుచిత ప్రవర్తనకు దిగడమే గాక మ్యాచ్‌ రిఫరీ నీయముర్‌ రషీద్‌ ఫిర్యాదు మేరకు లెవల్‌ 1 నేరానికి అఘా పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది.‘క్రికెట్‌ పరికరాలను అగౌరవపరిచినట్లు పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ అఘాపై ఫిర్యాదు అందింది. మైదానంలోనే అతను హెల్మెట్‌, గ్లౌవ్స్‌, బ్యాట్‌ను విసిరేసినట్లు తేలింది. గతంలో సల్మాన్‌ అఘా నుంచి ఇలాంటి ప్రవర్తన ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అఘా చేసిన పనిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ జత చేశాం. అయితే బంగ్లాదేశ్‌ ఆటగాడు లిటన్‌ దాస్‌తో జరిగిన వాగ్వాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిని కేవలం అపార్థంగా పరిగణించాం. మేం చట్టం ప్రకారమే నడుచుకుంటూనే ఇలాంటి తీర్పును ఇచ్చాం’ అని ఐసీసీ స్పష్టం చేసింది.ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది.మాజ్‌ సదాఖత్‌ (75), సల్మాన్‌ అఘా (64) రాణించారు. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 243 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్‌ 23.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుతం ఇరుజట్లు చెరో వన్డే గెలవగా, మూడో వన్డే ఆదివారం జరగనుంది.చదవండి: ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్‌!Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026

Suryakumar Yadav Completed 5 Years In International Cricket This Day3
ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్‌!

క్రికెట్‌ అభిమానులంతా అతడిని ముద్దుగా మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అని పిలుస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్‌ ఏ యాంగిల్‌లో బంతి వేసినా బౌండరీ లేదా సిక్సర్‌ బాదడం అతడి నైజం. దూకుడైన ఆటతీరుకు మారుపేరు. ఐదేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన టీమిండియా జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో ఒకసారి కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్‌ అందుకొని దిగ్గజాల సరసన నిలిచి అరుదైన ఘనత సాధించాడు. అతడే భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. మార్చి 14 (శనివారం)తో సూర్యకుమార్‌ తన క్రికెట్‌ కెరీర్‌లో ఐదేళ్ల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియాతో ఐదేళ్ల ప్రయాణాన్ని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నాడు. ‘ఐదేళ్ల ఏళ్ల క్రితం టీమిండియాకు ఆడాలన్న ఒక కల నిజమైంది. భారత జెర్సీని ధరించడమనేది ఇప్పటికీ నేను మాటల్లో పూర్తిగా వర్ణించలేని ఒక అద్భుతమైన అనుభూతి. ఈ నేపథ్యంలో ఒక ఆటగాడిగా, జట్టు కెప్టెన్‌గా నేను పొందిన జ్ఞాపకాలను మరోసారి పంచుకుంటున్నా.’ అంటూ ట్వీట్‌ చేశాడు.టీ20 క్రికెట్‌లో భారత తరఫున అత్యుత్తమ ఆటగాడిగా పేరు పొందిన సూర్యకుమార్‌ యాదవ్‌ 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం విశేషం. మార్చి 14, 2021లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ద్వారా సూర్య తన కెరీర్‌లో తొలి టీ20 మ్యాచ్‌ ఆడాడు. సూర్యకుమార్‌ ఇప్పటివరకు టీమిండియా తరఫున 113 టీ20 మ్యాచ్‌లు ఆడి 162.94 స్ట్రైక్‌రేట్‌తో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 25 అర్థసెంచరీలున్నాయి.ప్రస్తుతం సూర్యకుమార్‌ టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రెండు స్థానాల్లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఉన్నారు. ఈ ఇద్దరు 2024 టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2024 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న సూర్యకుమార్‌ ఆ ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్‌లో బౌండరీ వద్ద క్యాచ్‌ అందుకోవడం ఎన్నటికీ మరిచిపోలేని సంఘటన. సూర్య క్యాచ్‌ అందుకోవడంతో మ్యాచ్‌ భారత్‌వైపు తిరగడం, ఆ తర్వాత టీమిండియా టైటిల్‌ గెలవడం చకచకా జరిగిపోయాయి.రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ అనంతరం కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్‌ జట్టును విజయపథంలో నడిపించడంలో విజయవంతమయ్యాడు. ఇప్పటివరకు సూర్య సారథ్యంలో 40 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం ఎనిమిదింట మాత్రమే ఓడిపోయింది. అంతేకాదు టీ20 క్రికెట్‌లో సూర్య చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వివిధ దేశాల్లో (భారత్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌) రావడం విశేషం. 2022 ఏడాదిలో సూర్యకుమార్‌ టీమిండియా తరఫున 31 మ్యాచ్‌ల్లో 187 స్ట్రైక్‌రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్‌ చరిత్రలో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా సూర్య రికార్డులకెక్కాడు. చదవండి: తూచ్‌.. అదంతా ఉత్తిదే!5 years ago, a dream turned into reality. Wearing the India jersey is a feeling I can still never fully put into words 🇮🇳Here’s to many more memories that we’re going to create, for team 🇮🇳 pic.twitter.com/qhis2f44tQ— Surya Kumar Yadav (@surya_14kumar) March 14, 2026

Litton Das Lambasts Salman Agha Over sportsmanship discussions4
అబ్బో క్రీడాస్ఫూర్తి!.. పాక్‌ క్రికెటర్లపై లిటన్‌ దాస్‌ ఫైర్‌

పాకిస్తాన్‌ క్రికెటర్ల తీరుపై బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లా- పాక్‌ మధ్య శుక్రవారం జరిగింది చారిటీ మ్యాచ్‌ కాదని.. అదొక ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ అంటూ చురకలు అంటించాడు. నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించామని స్పష్టం చేశాడు.కాగా మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్‌ వెళ్లిన పాకిస్తాన్‌ జట్టు తొలి వన్డేలో చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో మాత్రం సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును చిత్తు చేసిన పాక్‌ 1-1తో సిరీస్‌ను సమం చేసింది.రనౌట్‌పై వివాదంఇదిలా ఉంటే.. పాక్‌ బ్యాటర్‌ సల్మాన్‌ ఆఘా రనౌట్‌ (Salman Agha's run-out)పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బంగ్లా కెప్టెన్‌ మెహిదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో మొహ్మద్‌ రిజ్వాన్‌ స్ట్రెయిట్‌ షాట్‌ ఆడగా.. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న సల్మాన్‌కు బంతి తాకింది. అప్పటికే క్రీజును వీడిన అతడు బంతి అందుకుని మిరాజ్‌కు ఇచ్చే ప్రయత్నం చేయగా.. వేగంగా స్పందించిన మిరాజ్‌ బంతిని వికెట్లకు గిరాటేశాడు.మాటల యుద్ధంఈ క్రమంలో బంగ్లాదేశ్‌ రనౌట్‌కు అప్పీలు చేయగా.. సానుకూల ఫలితం వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన సల్మాన్‌ హెల్మెట్‌ను నేలకేసి కొట్టి అసంతృప్తి వెళ్లగక్కాడు. మిరాజ్‌తో కాసేపు మాటల యుద్ధం చేశాడు. ఇంతలో లిటన్‌ దాస్‌ జోక్యంచేసుకోగా.. రిజ్వాన్‌ అతడిని సముదాయించి పక్కకు తీసుకువెళ్లాడు.క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని అయితే, సల్మాన్‌ రనౌట్‌ అయిన విషయంపై పాక్‌ జట్టు, మాజీ క్రికెటర్లు రాద్దాంతం చేస్తున్నారు. సల్మాన్‌ ఆఘా మిరాజ్‌ స్థానంలో ఉండి ఉంటే ఇలా చేసి ఉండేవాడిని కాదన్నాడు. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని అన్నాడు.ఇక పాక్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా స్పందిస్తూ.. ‘‘నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్‌ చేసింది సరైందే కావచ్చు. కానీ క్రీడాస్ఫూర్తికి వారు భంగం కలిగించారు. బ్యాటర్‌ బౌలర్‌కు సాయం చేద్దామని చూశాడు. కానీ అతడు తనని రనౌట్‌ చేస్తాడని ఊహించలేదు’’ అని మిరాజ్‌ తీరును విమర్శించాడు.ఇదేమీ చారిటీ లీగ్‌ మ్యాచ్‌ కాదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ స్పందిస్తూ.. ‘‘ముందుగా అందరికీ ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇదేమీ చారిటీ లీగ్‌ మ్యాచ్‌ కాదు. ఇదొక అంతర్జాతీయ మ్యాచ్‌.క్రీడాస్ఫూర్తికి భంగమా?నిబంధనలకు అనుగుణంగానే మేము రనౌట్‌ చేశాము. ఇందులో క్రీడాస్ఫూర్తికి భంగం కలిగినట్లు నాకైతే ఎక్కడా కనిపించలేదు. ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, మైదానంలో ఆటగాళ్లుగా అది అవుట్‌ అంటే అవుటేనని మా అందరికీ తెలుసు’’ అని పాక్‌ క్రికెటర్లు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు.కాగా ఢాకాలో జరిగిన రెండో వన్డేలో టాస్‌ ఓడిన పాక్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (31), మాజ్‌ సదాకత్‌ (75)లతో పాటు రిజ్వాన్‌ (44), సల్మాన్‌ ఆఘా (64) రాణించారు. దీంతో 47.3 ఓవర్లలో 274 పరుగులు చేసి పాక్‌ ఆలౌట్‌ అయింది.బంగ్లా బౌలర్లలో రిషాద్‌ హొసేన్‌ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్‌ మిరాజ్‌ రెండు, టస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, నహీద్‌ రాణా తలా ఒక వికెట్‌ తీశారు. ఇక వర్షం వల్ల బంగ్లా టార్గెట్‌ను డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం 32 ఓవర్లలో 243 పరుగులకు కుదించగా.. 23.3 ఓవర్లలో 114 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.చదవండి: SRH: బెస్ట్‌ ప్లేయింగ్‌ XII.. రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు!Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026

PCB Breaks Silence Allegations PKR 50 Lakh Fine Players T20 WC Debacle5
తూచ్‌.. అదంతా ఉత్తిదే!

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చెత్త ఆటతీరుతో సూపర్‌-8లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పాక్‌ జట్టుపై ఆగ్రహంతో ఊగిపోయిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఒక్కో ఆటగాడికి పీకేఆర్‌ 50 లక్షలు (భారత కరెన్సీలో సుమారు రూ.16.5 లక్షలు) జరిమానా విధిస్తున్నట్లు కొన్ని రోజుల కిందట ఆ దేశ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ కఠిన నిర్ణయం స్వయంగా పీసీబీ చైర్మన్‌ మొహసీన్‌ నఖ్వీనే తీసుకున్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా పాక్‌ ఆటగాళ్లకు విధించిన జరిమానాల్లో నిజమెంత అనే దానిపై పీసీబీ ప్రతినిధి ఆమిర్‌మిర్‌ స్పందించారు. ‘టీ20 ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన కనబరిచినందుకు పాక్‌ ఆటగాళ్లకు జరిమానా విధించినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా సోషల్‌ మీడియా ప్రచారం చేస్తున్న గాసిఫ్‌ మాత్రమే. అలాంటి నిర్ణయాలు పీసీబీ ఎప్పుడూ తీసుకోదు. ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శనకుగానూ పాకిస్థాన్‌ ఆటగాళ్లను, కోచ్‌, సిబ్బందిని హెచ్చరించిన మాట నిజమే కావొచ్చు. కానీ ఆటగాళ్లపై మాత్రం ఎలాంటి క్రమశిక్షణా చర్యలు గానీ జరిమానా కానీ విధించలేదు.’ అని చెప్పుకొచ్చారు.ఇక సల్మాన్‌ అఘా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమైంది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై తడబడి గెలిచింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్థాన్‌ ఎలాగోలా సూపర్‌-8లో అడుగుపెట్టింది. అయితే సెమీస్‌కు చేరాలంటే శ్రీలంకను భారీ తేడాతో ఓడించాలి. కానీ కేవలం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 2024లోనూ పాక్‌ జట్టు సెమీస్‌ చేరడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా నాసిరకం ఆటతీరుతో నాకౌట్‌కు చేరకుండానే పాకిస్థాన్‌ వరుసగా రెండోసారి సూపర్‌-8 దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం కారణంగా ఆటగాళ్లకు జరిమానా విధించారన్న విషయంపై వెటరన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ స్పందించాడు. పాక్‌ ఆటగాళ్లకు విధించిన జరిమానా మొత్తాన్ని తాను కడుతానని, కానీ ఆ డబ్బులు జట్టును మళ్లీ మంచి ట్రాక్‌లోకి తెచ్చేందుకు ఉపయోగించాలని కోరడం గమనార్హం. ఇటీవలే బంగ్లాదేశ్‌లో మొదలైన వన్డే సిరీస్‌ను కూడా పాక్‌ ఓటమితోనే ప్రారంభించింది. తొలి వన్డేలో పాకిస్థాన్‌ 114 పరుగులకే కుప్పకూలింది. అయితే రెండో వన్డేలో మాత్రం బంగ్లాపై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డే ఆదివారం జరగనుంది.చదవండి: ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు!

MS Dhoni Clear-Cut Message Ex-CSK Teammate Ahead IPL 20266
ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు!

ఐపీఎల్‌ 18వ సీజన్‌ ప్రారంభానికి మరో 15 రోజుల సమయం మిగిలి ఉంది.ఇప్పటికే లీగ్‌లోని ఆయా జట్ల ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధం చేస్తున్నాయి. అయితే సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్‌గైక్వాడ్‌ పేరును ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. దీంతో ధోనీకి ఈ సీజన్‌ చివరిదని భావిస్తున్న అభిమానులు కెప్టెన్‌గా ఒక్క మ్యాచ్‌కైనా నాయకత్వం వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ ధోనీ కెప్టెన్సీ విషయమై వేరే వాళ్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని మేనేజ్‌మెంట్‌కు ఇది వరకే స్పష్టం చేశాడు. దీంతో ధోనీని ఈసారి కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. అయితే ఈసారి ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడతాడా లేదంటే కొన్నింటికే పరిమితమవుతాడా అన్నది చూడాలి. కాగా ధోనీ కెప్టెన్సీ విషయమై ఇది వరకే తనకు ఒక సందేశాన్ని పంపించాడని భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు.‘ఐపీఎల్‌ ప్రారంభమవు తుందంటే అందరి కళ్లు సీఎస్‌కే మీదకే మళ్లుతాయి. ఎందుకంటే భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోనీ ఐపీఎల్‌లోనూ నాయకుడిగా అంతే సక్సెస్‌ రేట్‌ను కలిగి ఉన్నాడు. ఈసారి కెప్టెన్సీకి ధోనీ దూరమైనప్పటికీ అతడి సలహాలు మాత్రం జట్టుకు ఉంటాయనడంలో సందేహం లేదు. కెప్టెన్‌గా కొనసాగడానికి బదులు ఆటగాడిగా ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు ధోనీ ఇది వరకే నాతో పేర్కొన్నాడు.’ అని పఠాన్‌ తెలిపాడు. ఇక ధోనీకి ఇదే చివరి సీజన్‌ అని భావిస్తున్న తరుణంలో అటు సీఎస్‌కే యాజమాన్యం కూడా మాజీ వికెట్‌కీపర్‌ విషయంలో భారీగానే ప్లాన్‌ చేస్తుంది. ఎలాగైనా టైటిల్‌ కొట్టి ధోనీకి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని సీఎస్కే భావిస్తోంది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2026లో భాగంగా తొలి విడతలో 20 మ్యాచ్‌లు జరగనున్నట్లు ఐపీఎల్‌ యాజమాన్యం పేర్కొంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే విడుదల చేసింది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.చదవండి: IPL 2026: ‘ప్రపంచం అతడిని మర్చిపోయింది’

Sanjay Bangar picks SRH best playing 12 Leaves out Rs 13 cr signing7
SRH: బెస్ట్‌ ప్లేయింగ్‌ XII.. రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌-2026 ప్రయాణాన్ని మార్చి 28న మొదలుపెట్టనుంది. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో తొలుత తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 2న కోల్‌కతాతో, ఏప్రిల్‌ 5న లక్నోతో, ఏప్రిల్‌ 11న పంజాబ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.తొలి విడతలో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌కు సంబంధించి ఈ నాలుగు మ్యాచ్‌ల షెడ్యూల్‌ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సన్‌రైజర్స్‌ తుదిజట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.టాప్‌-3లో వీరే‘‘నా దృష్టిలో సన్‌రైజర్స్‌ అత్యుత్తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే. ట్రవిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ టాప్‌-3లో ఆడతారు. నితీశ్‌ రెడ్డిని నాలుగో స్థానంలో ఆడించాలన్నది నా అభిప్రాయం.టీ20 క్రికెట్‌లో అత్యుత్తమంగా ఫినిషింగ్‌ ఇవ్వగల ఆటగాడు అతడు. లేదంటే హెన్రిచ్‌ క్లాసెన్‌ను నాలుగో స్థానంలో ఆడించి.. నితీశ్‌ను ఐదో ప్లేస్‌లో పంపవచ్చు.ఇక అనికేత్‌ వర్మ గతేడాది అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదాడు. అతడు ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడించాలి. వీరితో పాటు ఓ అన్‌క్యాప్డ్‌ ఇండియన్‌ బ్యాటర్‌కూ స్థానం దక్కుతుంది.కమిన్స్‌ ఎనిమిదో స్థానంలోబౌలర్ల విభాగానికి వస్తే కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఎనిమిదో స్థానంలో వస్తాడు. బ్యాట్‌తోనూ అతడు అద్భుతం చేయగలడు. ఇక ఆ తర్వాత క్రియాన్స్‌ ఫులేట్రా, జీషన్‌ అన్సారీ, ఇషాన్‌ మలింగలు ఉండాలి.భారత ఫాస్ట్‌బౌలర్లను తీసుకోవాలనుకుంటే జయదేవ్‌ ఉనాద్కట్‌, హర్షల్‌ పటేల్‌ బెటర్‌’’ అని సంజయ్‌ బంగర్‌ పేర్కొన్నాడు. కాగా మినీ వేలంలో సన్‌రైజర్స్‌ అనూహ్య రీతిలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను ఏకంగా రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, బంగర్‌ మాత్రం అతడికి తుదిజట్టులో చోటే దండగ అన్న రీతిలో అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా గతేడాది ఆర్సీబీ తరఫున లివింగ్‌స్టోన్‌ విఫలమయ్యాడు.ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ జట్టుసలీల్ అరోరా, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరణ్‌, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, నితీశ్‌ కుమార్ రెడ్డి, శివమ్ మావి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్‌), అమిత్ కుమార్, క్రియాన్స్‌ ఫులెట్రా, ప్రఫుల్‌ హింజ్‌, ఇషాన్‌ మలింగ, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, శివంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనాట్కట్‌, జీషన్ అన్సారీ.సంజయ్‌ బంగర్‌ ఎంచుకున్న బెస్ట్‌ ప్లేయింగ్‌ XIIట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్‌ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ఆర్ స్మరణ్‌, ప్యాట్ కమిన్స్, క్రెయిన్స్ ఫులెట్రా/జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ, జయదేవ్ ఉనాద్క ట్‌, హర్షల్ పటేల్.చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా వార్నింగ్‌!?

Aiden Markram set to lead Manchester Super Giants in The Hundred 20268
సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా మార్‌క్ర‌మ్‌

ఇంగ్లండ్ ది హాండ్ర‌డ్ లీగ్ వేలంలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్‌క్ర‌మ్‌పై కాసుల వ‌ర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. సుమారు రూ. 2.5 కోట్ల భారీ ధ‌ర‌కు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఓవర్సీస్ ప్లేయర్‌గా మార్‌క్ర‌మ్ నిలిచాడు.అయితే మార్‌క్ర‌మ్ ఇప్ప‌టికే ఐపీఎల్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల‌లో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు హాండ్ర‌డ్ లీగ్‌లోనూ సూప‌ర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో జ‌త‌క‌ట్టాడు. మొత్తం మూడు లీగ్‌ల‌లో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు.ఇక ఇది ఇలా ఉండ‌గా.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా మార్‌క్ర‌మ్‌ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఐడైన్ ఇప్ప‌టికే సౌతాఫ్రికా లీగ్ డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. మార్‌క్ర‌మ్ కెప్టెన్సీ స్కిల్స్‌పై మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు."మా మూడు జ‌ట్ల‌లోనూ మార్‌క్ర‌మ్ ఉండ‌డం చాలా సంతోషంగా ఉంది. అత‌డొక అద్బుత‌మైన ఆట‌గాడు. ఐడైన్‌లో గొప్ప నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. అత‌డిని వేలంలో ద‌క్కించుకున్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాము" ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో లాంగర్ పేర్కొన్నాడు. కాగా గ‌త సీజ‌న్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు మార్‌క్ర‌మ్ రాక‌తో మాంచెస్ట‌ర్ కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకోనుంది.

The world had forgotten him: Aakash Chopra on opportunities for DC Star9
IPL 2026: ‘ప్రపంచం అతడిని మర్చిపోయింది’

ఒకప్పుడు సచిన్‌ టెండుల్కర్‌ వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు ముంబై క్రికెటర్‌ పృథ్వీ షా. చిన్న వయసులోనే అద్భుతమైన ఆట తీరుతో అభిమానులను ఆకర్షించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. కెప్టెన్‌గా భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్‌ ట్రోఫీ అందించాడు.ఈ క్రమంలోనే టీమిండియా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన పృథ్వీ షా (Prithvi Shaw) తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆ తర్వాత వరుస వైఫల్యాలతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ముంబై జట్టులోనూ అతడి స్థానం గల్లంతైంది. దీంతో పొరపాట్లు సరిచేసుకున్న పృథ్వీ షా.. తిరిగి గాడిలో పడ్డాడు.రూ. 75 లక్షల కనీస ధరదేశీ క్రికెట్‌లో మరోసారి బ్యాట్‌తో మెరిసి తనను తాను నిరూపించుకున్నాడు. ముంబైని వీడి మహారాష్ట్ర జట్టులో చేరి సత్తా చాటాడు పృథ్వీ షా. ఈ క్రమంలో ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 75 లక్షల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది.ఒకప్పుడు ఐపీఎల్‌లో కోట్లు పలికిన పృథ్వీని.. అదే జట్టు ఇలా బేస్‌ ప్రైస్‌కు దక్కించుకోవడం విశేషం. నిజానికి ముందు రౌండ్లలో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోగా ఆఖర్లో ఢిల్లీ కనికరించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా పృథ్వీ షాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.ప్రపంచం అతడిని మర్చిపోయింది. ఈసారి‘‘పృథ్వీ షాకు ఇదొక గొప్ప అవకాశం. ఇప్పటికే ప్రపంచం అతడిని మర్చిపోయింది. ఇప్పుడతడు మునుపటి ఆటగాడే. కఠిన శ్రమతో తనను తాను సరిదిద్దుకుని పరుగులు రాబడుతున్నాడు.అందుకే ఇక్కడిదాకా చేరుకోగలిగాడు. ఒకవేళ తుదిజట్టులో ఆడే అవకాశం వస్తే అతడు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని ఆకాశ్‌ చోప్రా పృథ్వీకి సూచించాడు. కాగా పృథ్వీ షా ఇటీవలే తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన విషయం తెలిసిందే. మోడల్‌, నటి ఆకృతి అగర్వాల్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ మార్చి 28 నుంచి మొదలుకానుంది. కాగా అక్షర్‌ పటేల్‌ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ గతేడాది ఏడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ప్లే ఆఫ్స్‌ చేరకుండానే నిష్క్రమించింది.చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా వార్నింగ్‌!?

Maaz Sadaqat Creates History, Breaks Chris Gayles 24-Year-Old Record10
పాకిస్తాన్ ప్లేయ‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు

ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 128 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో యువ సంచ‌ల‌నం మాజ్ సదాకత్‌ది కీల‌క పాత్ర‌. ఈ మ్యాచ్‌లో స‌దాక‌త్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు. కెరీర్‌లో రెండో అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడిన స‌దాక‌త్ త‌న అద్భ‌త ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు.తొలుత బ్యాటింగ్‌లో ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన స‌దాక‌త్.. బంగ్లా బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. కేవ‌లం 46 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అనంత‌రం బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో స‌దాక‌త్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌పై వ‌న్డే మ్యాచ్‌లో ఆర్ధ సెంచ‌రీతో పాటు మూడు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా మాజ్ సదాకత్ రికార్డుల‌కెక్కాడు. కేవ‌లం 20 ఏళ్ల 302 రోజుల‌ వ‌య‌స్సులోనే స‌దాక‌త్ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం క్రిస్ గేల్(23) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గేల్‌ను స‌దాక‌త్ అధిగ‌మించాడు. ఓ ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఒకే వ‌న్డే మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించిన 14వ ఆట‌గాడిగా స‌దాక‌త్ నిలిచాడు. పాకిస్తాన్ నుంచి మాత్రం ఈ రికార్డు సాధించిన ఐదో ప్లేయ‌ర్‌గా స‌దాక‌త్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు హిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్ వంటి దిగ్గజాలు ఉన్నారు.చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా వార్నింగ్‌!?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement

వీడియోలు