ప్రధాన వార్తలు
వెస్టిండీస్ చిత్తు.. వన్డే సిరీస్ ఆస్ట్రేలియాదే
కరేబియన్ గడ్డపై ఆస్ట్రేలియా మహిళల జట్టు జోరును కొనసాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా ఖాతాలో వేసుకుంది. సోమవారం సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఆసీస్ చిత్తు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో కంగారులు కైవసం చేసుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన బెత్ మూనీ (65) టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెతో పాటు జార్జియా వేర్హమ్ (39), లిచ్ఫీల్డ్(46), నికోలా కేరీ (30*), అలానా కింగ్ (26*) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.కుప్పకూలిన విండీస్అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు క్వీనా జోసెఫ్ (29), హేలీ మాథ్యూస్ (45) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో విండీస్.. 46 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. గత మ్యాచ్లో సెంచరీతో సత్తాచాటిన సీనియర్ బ్యాటర్ టేలర్ సైతం రెండో వన్డేలో రాణించలేకపోయింది.ఆస్ట్రేలియా స్పిన్నర్లు జార్జియా వేర్హమ్, యాష్ గార్డనర్ తలా మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు స్టాండ్ ఇన్ కెప్టెన్ మెక్గ్రాత్ రెండు వికెట్లు సాధించింది. మూడు వికెట్లతో సత్తాచాటిన జార్జియాకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2026: సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..?
టైగర్వుడ్స్కు ట్రంప్ మాజీ భార్య వార్నింగ్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాజీ భార్య వెనెస్సా ట్రంప్తో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఇటీవలే టైగర్వుడ్స్ను డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ (డీయూఐ) కింద ఫ్లోరిడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టైగర్వుడ్స్ను మార్టిన్ కౌంటీ జైలుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయిన టైగర్వుడ్స్పై అతడి భాగస్వామి వెనెస్సా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా టైగర్వుడ్స్ తన ప్రవర్తన, పద్దతులను మార్చుకోకపోతే విడిచిపెట్టి వెళ్లిపోతానంటూ బెదిరింపులకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. డైలీమెయిల్ కథనం ప్రకారం.. వెనెస్సా ట్రంప్ టైగర్వుడ్స్కు ఇదే అతడికి చివరి అవకాశమని, ఒకవేళ మళ్లీ ఎలాంటి తప్పు చేసి జైలుకెళితే మాత్రం తమ రిలేషన్షిప్కు ఎండ్కార్డ్ పడినట్లేనని అర్థం చేసుకోవాలని తెలిపింది. ‘ఇది కచ్చితంగా టైగర్వుడ్స్కు రెడ్ ఫ్లాగ్ వంటిది. సమస్యలన్నింటిని పరిష్కరించుకొని సక్రమంగా ఉంటే మంచిది. లేదంటే రిలేషన్షిప్కు ఎండ్కార్డ్ వేసి నా దారి నేను చూసుకోవాల్సి ఉంటుంది. ’ అని వెనెస్సా ఘాటుగానే హెచ్చరించినట్లు డైలీమెయిల్ పేర్కొంది.కాగా అమెరికన్ మోడల్ అయిన వెనెస్సా ట్రంప్ 2005 నవంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ను పెళ్లాడింది. 2018లో విడాకులు తీసుకున్న ఈ జంటకు కాయ్ ట్రంప్ సంతానం. ఆ తర్వాత గోల్ప్ దిగ్గజం టైగర్వుడ్స్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు 2024లో తొలిసారి వార్తలు బయటకొచ్చాయి. టైగర్వుడ్స్ మార్చి 2025లో వెనెస్సాను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా పోస్టు పెట్టాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. తాజాగా టైగర్వుడ్స్ ప్రవర్తనతో విసిగిపోయిన వెనెస్సా మరోసారి ఇలా చేస్తే మాత్రం రిలేషన్ బ్రేకప్ చేసుకుంటానని బెదిరింపులకు దిగడం ఆసక్తిగా మారింది.
గర్ల్ ఫ్రెండ్కు బెంజ్ కారు గిఫ్ట్గా ఇచ్చిన హార్దిక్.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. హార్దిక్ తన ప్రేయసి మహికా శర్మకు అత్యంత ఖరీదైన కారును గిఫ్ట్గా ఇచ్చాడు. ఆమెపై ఉన్న ప్రేమను చాటుకుంటూ సుమారు రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ లగ్జరీ కారును కానుకగా అందించాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవలే పాండ్యా తన కోసం రూ.12 కోట్ల విలువైన లగ్జరీ రును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన గర్ల్ఫ్రెండ్ కోసం ఏకంగా మెర్సిడెస్ బెంజ్ను కొనుగోలు చేసి అందరిని ఆశ్యర్యపరిచాడు. కాగా ఈ బరోడా క్రికెటర్ నటాషా స్టాంకోవిక్తో విడిపోయిన తర్వాత మహికా శర్మతో ప్రేమలో పడ్డాడు. హార్దిక్ ఆడే ప్రతీ మ్యాచ్లోనూ ఆమె మైదానంలో ఉండి ఉత్సహపరుస్తుంటుంది. తన విజయాల్లో మహికా కీలక పాత్ర పోషిస్తుందని హార్దిక్ ఇదివరకే పలుమార్లు పేర్కొన్నాడు. అయితే హార్దిక్ గత నెలలో తన మాజీ భార్య నటాషాకు కూడా ఖరీదైన కారును గిఫ్ట్గా ఇచ్చాడు. నటాషా, అగస్త్య కోసం రూ. 4 కోట్ల విలువైన లాండ్ రోవర్ డిఫెండర్ను పాండ్యా కొనుగోలు చేశాడు.ముంబై గ్రాండ్ విక్టరీఇక ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది.రోహిత్ శర్మ(78), ర్యాన్ రికెల్టన్ (81) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి.చదవండి: PSL: వద్దు అన్నా.. హోటల్కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు
సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..?
ఐపీఎల్-2026 సీజన్ను ముంబై ఇండియన్స్ ఘనంగా ఆరంభించింది. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై విజయాన్ని అందుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(78), ర్యాన్ రికెల్టన్(81) తమ అద్భుత ఇన్నింగ్స్లతో జట్టుకు విజయాన్ని అందించారు. కాగా ఈ మ్యాచ్లో ముంబై గెలిచినప్పటికి.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు స్టార్టింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. అతడు ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ సబ్గా కేవలం బ్యాటింగ్కు వచ్చింది. దీంతో సూర్య గాయపడ్డాడా? అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే సూర్యను పక్కన పెట్టడానికి గల అసలు కారణాన్ని మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్దనే వెల్లడించాడు. సూర్యను కేవలం ఫిట్నెస్ జాగ్రత్తలలో భాగంగానే తుది జట్టులో ఆడించలేదని"మేము అనవసరమైన కథనాలను సృష్టించకూడడు అనుకుంటున్నాము. మా జట్టులోని ప్రతీ ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. సూర్య కాస్త ఆలస్యంగా మా జట్టుతో చేరాడు. అయితే అతడి కాలి గజ్జల్లో స్వల్పంగా పట్టేసినట్లు ఉంది. దీంతో ఫీల్డింగ్ చేసేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఈ రోజు అతడికి విశ్రాంతి ఇచ్చాము. చివరి నాలుగు ఓవర్లలో తను ఫీల్డింగ్కు వచ్చేందుకు స్కై సిద్దమయ్యాడు. కానీ నేనే వద్దన్నాను. మా తదుపరి మ్యాచ్కు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. అప్పటికి సూర్య పూర్తి సిద్దంగా ఉంటాడని" జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు వచ్చిన సూర్య కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ముంబై తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 4న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్లతో తలపడనుంది. చదవండి: PSL: వద్దు అన్నా.. హోటల్కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు
అంతుచిక్కని శార్దూల్ ఠాకూర్!
శార్దూల్ ఠాకూర్.. ఆల్రౌండర్గా టీమిండియాకు కొన్ని మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే శార్దూల్ ఒక ఫాస్ట్ బౌలర్ కాదు.. స్వింగ్ బౌలర్ అంతకన్నా కాదు. అతడి బౌలింగ్లోనూ పెద్దగా వైవిధ్యత కనిపించదు. కానీ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీస్తూ విజయాల్లో భాగమవుతూ వస్తున్నాడు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టడంలో శార్దూల్ ఠాకూర్ కీలకపాత్ర పోషించాడు. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లో స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ తేలిపోయిన చోట శార్దూల్ మాత్రం 3 కీలక వికెట్లు పడగొట్టి కేకేఆర్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకొని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.అయితే శార్దూల్ ఠాకూర్ టీ20 క్రికెట్లో పవర్ ప్లే, మిడిల్, డెత్ ఓవర్లలో ఎక్కడైనా బౌలింగ్ చేయడంలో సమర్థుడు. కేకేఆర్తో మ్యాచ్లనూ పవర్ ప్లేలో ఒకటి, మిడిల్ ఓవర్లలో ఒకటి, డెత్ ఓవర్లలో ఒకటి ఇలా మూడు వికెట్లు తీశాడు. సాధారణంగా ఒక బౌలర్ వికెట్లు తీస్తూ ఫామ్లో ఉన్నట్లయితే అతడితో వరుస ఓవర్లు వేయించి ప్రత్యర్థిని దెబ్బతీయాలని చూస్తారు. కానీ శార్దూల్ మాత్రం తాను ఆడే జట్టు కెప్టెన్కు బౌలింగ్ విషయమై ముందే క్లారిటీ ఇస్తాడట. అందుకే కెప్టెన్లకు అవసరమైనప్పుడు బౌలింగ్కు వచ్చి వికెట్లు తీయడం శార్దూల్లో ఉన్న ప్రత్యేకత. అంతేకాదు శార్దూల్ తన బౌలింగ్లో ఒకే రకం శైలిని ఎక్కువసార్లు ఉపయోగించు. సీమ్, పేస్ను మిక్స్ చేస్తూ వచ్చే స్లోపేస్ బంతులను ప్రత్యర్థి బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా కేకేఆర్తో మ్యాచ్లోనూ శార్దూల్ దానినే ఫాలో అయ్యాడు. అందుకే ఫిన్ అలెన్, అజింక్యా రహానే, కామెరూన్ గ్రీన్లు ఔటైన విధానం పరిశీలిస్తే శార్దూల్ బౌలింగ్పై మరింత స్పష్టత వస్తుంది. ఇక 2012 వరకు ముంబై ఇండియన్స్కు నెట్బౌలర్గా ఉన్న శార్దూల్ ఇప్పుడు అదే జట్టుకు బుమ్రా తర్వాత ప్రధాన బౌలర్గా మారిపోయాడు. 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శార్దూల్ పదేళ్లలో ఆరుజట్లు మారాడు. పదేళ్ల తర్వాత కానీ సొంత జట్టుకు ఆడే అవకాశం రాలేదు. తాజాగా వచ్చిన అవకాశాన్ని శార్దూల్ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ టీమిండియా తరఫున 13 టెస్టుల్లో 377 పరుగులు, 33 వికెట్లు; 47 వన్డేల్లో 329 పరుగులు, 65 వికెట్లు; 25 టీ20ల్లో 69 పరుగులు సహా 33 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో 106 మ్యాచ్లాడి 325 పరుగులు చేయడంతో పాటు 110 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: ‘ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి’
వద్దు అన్నా.. హోటల్కు తీసుకెళ్లారు! చిక్కుల్లో స్టార్ క్రికెటర్లు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం లహోర్ వేదికగా కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఖలందర్స్ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే.. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది, ఆల్ రౌండర్ సికందర్ రజా ఓ వివాదంలో చిక్కుకున్నారు.భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిద్దరిపై స్థానిక పోలీసులు సీరియస్ అయ్యారు. లహోర్ డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్కు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఏమి జరిగిదంటే?షాహీన్ అఫ్రిది సారథ్యంలోని ఖలందర్స్ జట్టు లహోర్లోని ఓ హోటల్లో బస చేస్తోంది. అయితే సికిందర్ రజా తన ఉండే గదిలోకి నలుగురు గెస్ట్లను అనుమతించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరాడు. కానీ అతడు చేసిన విన్నపాన్ని పీసీబీ తిరస్కరించింది. ఈ విషయంలో లాహోర్ ఖలందర్స్ యజమాని సమీన్ రాణా కూడా జోక్యం చేసుకున్నారు. ఆ నలుగురును అనుమతించాలని సీఈఓ నసీర్ను సమీన్ అభ్యర్ధించాడు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ విన్నపాన్ని అధికారులు తోసిపుచ్చారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను పక్కన పెట్టిమరి షాహీన్, రజా ఆ నలుగురిని హోటల్ లోపలికి తీసుకెళ్లారు.ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో వీరిద్దరూ వాగ్వాదానికి దిగారు. ఇదే విషయాన్ని సీఈఓ సల్మాన్ నసీర్కు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై లాహోర్ ఖలందర్స్ మీడియా హెడ్ ఉమర్ ఫరూక్ స్పందించారు.మా ఇద్దరు ఆటగాళ్లకు సంబంధించిన ఈ ఘటనపై మాకు స్పష్టత ఉంది. మేమే పీఎస్ఎల్ మేనెజ్మెంట్తో చర్చలు జరపుతున్నాము అని ఉమర్ ఫరూక్ తెలిపారు. అయితే షాహీన్, రజాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.
‘ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి’
ఐపీఎల్ 2026 సీజన్ను కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఓటమితో ప్రారంభించింది. బ్యాటింగ్ బాగానే చేసినప్పటికీ బౌలింగ్ వైఫల్యంతో ఓటమి చవిచూసింది. అధిక ధరకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్తో బౌలింగ్ చేయించకపోవడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ దీనికి సమాధానం క్రికెట్ ఆస్ట్రేలియానే దీనికి జవాబు చెప్పాలి అని తెలిపాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మ్యాచ్ ఓటమి అనంతరం స్పందించాడు. ‘ఇప్పుడు అంతా బాగానే ఉంది. మ్యాచ్ సమయంలో కాస్త కండరాలు పట్టేశాయనిపించింది. ప్రస్తుతం బాగానే ఉన్నా. ముంబై ఇండియ న్స్కు నిర్దేశించిన 220 ప్లస్ స్కోరు సరిపోతుందని భావించాము. మా వరకు మేము మెరుగ్గానే ఆడాం. బౌలింగ్ అనుకున్నంత స్ట్రాంగ్గా లేకపోవడం మాకు కలిసిరాలేదు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైని అడ్డుకోవడం సవాల్తో కూడుకున్నది. ముజరబానికి ఇదే తొలి ఐపీఎల్ కావడం, అనుభవజ్ఞులు లేకపోవడం పెద్ద లోటు. ఇక కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరాలు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. ఇద్దరు స్టార్ స్పిన్నర్లు ఉన్నప్పటికీ ముంబై బ్యాటర్లు అద్భుతంగా ఆడడంతో ఓటమి తప్పలేదు. రూ. 25 కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం నేను కాదు క్రికెట్ ఆస్ట్రేలియానే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్లో బౌలింగ్లో కాస్త భిన్నశైలిని ఎంచుకున్నాం. బ్యాటింగ్లో ఇబ్బందులు లేనప్పటికీ రాబోయే మ్యాచ్ల్లో బౌలింగ్ యూనిట్ను మెరుగుపరుచుకుంటాం. 37 ఏళ్ల వయసున్నా నన్ను నేను ఇప్పటికీ ఒక కుర్రాడిలాగే భావించుకుంటా.’ అని చెప్పుకొచ్చాడు.కేకేఆర్కు ముందే చెప్పాం: క్రికెట్ ఆస్ట్రేలియాకాగా గ్రీన్ విషయంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే చేసిన కామెంట్స్పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పందించింది. ‘కొద్దికాలం కామెరూన్ గ్రీన్ బౌలింగ్కు దూరంగా ఉంటాడు. అతడు నడుంనొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల పాటు బౌలింగ్ చేయకూడదని సూచించాం. ఈ విషయం ఇప్పటికే కేకేఆర్తో చర్చించాం. గ్రీన్ పరిస్థితిపై వారికి పూర్తి అవగాహన ఉంది’ అని పేర్కొంది.చదవండి: పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్ వివాదం!
పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్ వివాదం!
ఐపీఎల్కు పోటీగా ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2026)లో తొలి రోజునే తెల్లబంతి కాస్తా గులాబీ రంగులోకి మారిపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై చర్చ జరుగుతుండగానే తాజాగా బాల్ టాంపరింగ్ వివాదం పీఎస్ఎల్లో కలకలం రేపుతోంది. ఆదివారం లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బాల్ టాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో, లాహోర్ ఖలందర్స్ బంతిని ట్యాంపరింగ్ చేసినట్లు అంపైర్లు అనుమానించారు. దీని ఫలితంగా ఐదు పరుగుల పెనాల్టీ విధించబడింది. కరాచీ ఇన్నింగ్స్ చివరి ఓవర్ను హారిస్ రవూఫ్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అంపైర్ ఫైసల్ అఫ్రిది బంతిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో బంతి ఆకారం ఉద్దేశపూర్వకంగా మార్పు చెందిందని నిర్ధారణకు వచ్చిన అంపైర్ లాహోర్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో లక్ష్యం ఒక్కసారిగా 14 పరుగుల నుంచి 9 పరుగులకు తగ్గింది. దీనిపై లాహోర్ కెప్టెన్ షహీన్ అఫ్రిది మైదానంలో అసహనం వ్యక్తం చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం అఫ్రిది స్పందిస్తూ.. ‘అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కెమెరా ఫుటేజీని చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఐదు పరుగులు పెనాల్టీ విధించారు, ఇప్పుడు మేము చేయగలిగేది ఏమీ లేదు’ అని అఫ్రిది పేర్కొన్నాడు. దీంతో ఇప్పటికే వివాదాల నడుమ మొదలైన పీఎస్ఎల్లో బాలా టాంపరింగ్ అంశంతో మరింత రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మ్యాచ్లో కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (33) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం కరాచీ కింగ్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ముహమ్మద్ వసీమ్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.This is so Shameful pic.twitter.com/DqTWMk1Mbg— Ehtisham Siddique (@iMShami_) March 29, 2026చదవండి: IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!
IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై రెండు రోజులే అయినప్పటికీ రెండు మ్యాచ్ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం అభిమానులకు కిక్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇస్తున్న వార్త ఏదైనా ఉందంటే.. టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 40 ఏండ్లకు దగ్గర్లో ఉన్న ఈ ముగ్గురు మొనగాళ్లు బ్యాటింగ్లో అద్భుతాలు చేస్తున్నారు. ఈ సీజన్లో తాము ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ త్రయం తమ ప్రదర్శనతో అదరగొట్టారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలు పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికితే.. జట్టులో అవకాశాల్లేక టీ20 క్రికెట్ ఆడే అవకాశం రహానే ఎప్పుడో కోల్పోయాడు. కానీ తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ముగ్గురూ ఇలాగే ఆడుతూ పోతే రాబోయే మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే అని చెప్పొచ్చు.రోహిత్ శర్మ..భారత కెప్టెన్గా 2024 టీ20 ప్రపంచకప్ను అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేదు. మూడు వన్డేలు కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇవాళ ఐపీఎల్లో మాత్రం తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. కేకేఆర్తో మ్యాచ్లో 38 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్ అలవోకగా బంతులను బౌండరీ అవతలకు పంపిస్తూ పాత హిట్మ్యాన్ను గుర్తు చేశాడు. రికిల్టన్ కంటే ముందే ఔటైనప్పటికీ ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా మ్యాచ్లో రోహిత్ ఫుట్వర్క్ అద్భుతమని చెప్పొచ్చు. ఎక్కడా చిన్న తప్పిదం లేకుండా ఇన్నింగ్స్ ఆసాంతం మంచి టైమింగ్తో షాట్లు ఆడాడు. తొలి మ్యాచ్తోనే ఫామ్ అందుకున్న రోహిత్ నుంచి సీజన్ ముగిసేలోపు మరిన్ని అద్భుత ఇన్నింగ్స్లు వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ కోహ్లీ..కోహ్లీది కూడా అచ్చం రోహిత్ స్టోరీనే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన కోహ్లీ రోహిత్తో కలిసి ఏకకాలంలో టీ20లకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ కోహ్లీ అదరగొట్టాడు. ఆ సిరీస్లో కోహ్లీ 3 మ్యాచ్ల్లో 240 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. తాజాగా అదే ఫామ్ను ఐపీఎల్లోనూ కంటిన్యూ చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో బెంగళూరు స్టార్ కోహ్లీ చివరి వరకు నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) చేజింగ్లో తనను కొట్టేవారు లేరని మరోసారి నిరూపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సీజన్ ఆద్యంతం కోహ్లీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఆరెంజ్ క్యాప్ కూడా సొంయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అజింక్యా రహానే..రోహిత్, కోహ్లీలు రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికితే రహానే టీమిండియా తరఫున తన చివరి టీ20 ఆడి దాదాపు పదేళ్లు కావొస్తోంది. రహానే 2016లో వెస్టిండీస్తో చివరి టీ20 ఆడాడు. అప్పటి నుంచి టెస్టుల్లో కొన్నాళ్లు ఆడిన రహానే ఇప్పుడు అవకాశాలు లేవు. దీంతో ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్న రహానే గత రెండు, మూడు సీజన్లలో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. రహానేను ఎక్కువగా టెస్టు క్రికెట్లో చూడడం వల్ల అతడి నుంచి నెమ్మదైన ఆటనే అభిమానులు ఊహించేవారు. కానీ ఐపీఎల్లో రహానే ఆడుతున్న తీరు షాక్ కలిగిస్తోందని చెప్పొచ్చు. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రహానే కేకేఆర్ కెప్టెన్గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన రహానే ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. గతంలో చెన్నై సూపర్కింగ్స్కు ఆడినప్పుడు కూడా రహానే ఇదే దూకుడును ప్రదర్శించి సరికొత్త ఆటను రుచి చూపించాడు. మొత్తంగా టీమిండియా సీనియర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు ఒక్క మ్యాచ్తోనే ఆటలో మొనగాళ్లమని నిరూపించుకున్నారు.చదవండి: ‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’
‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో విజయం సాధించడం పట్ల ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. గత 13 సీజన్లలో తొలి మ్యాచ్లో తమను ఓటములే పలకరించాయని, కానీ 14 ఏండ్ల తర్వాత ఆ దేవుడు తమను కరుణించాడని పేర్కొన్నాడు. సీజన్లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో కేకేఆర్పై సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ పాండ్యా మాట్లాడాడు. ‘ఇది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయం. గత 13 సీజన్లను ఓటమితోనే ప్రారంభించాం. కానీ ప్రతీ సీజన్ ప్రారంభ మ్యాచ్ను గెలవాలనే బలమైన సంకల్పంతోనే బరిలోకి దిగేవాళ్లం. 2013 నుంచి 2025 వరకు మాకు ఓటములే ఎదురయ్యాయి. కేకేఆర్పై విజయం పట్ల మా జట్టు పూర్తి సంతోషంగా ఉంది. ఎందుకంటే భారీ లక్ష్యాలను ఛేధించడం అంత సులువు కాదు. తొలి ఇన్నింగ్స్లో కేకేఆర్ పవర్ ప్లేలో మా బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో భారీగా పరుగులు వచ్చాయి. కానీ పవర్ ప్లే తర్వాత మా బౌలర్లు గాడిన పడి కేకేఆర్ మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. లేదంటే కేకేఆర్ 240 లేదా 250కి పైగా స్కోరు చేసి ఉండేదేమో. కళ్ల ముందు భారీ టార్గెట్ కనిపిస్తున్నప్పటికీ మా టాప్ ఓపెనర్లు రోహిత్- రికిల్టన్లు తమ బ్యాటింగ్తో అదరగొట్టారు. ముఖ్యంగా రోహిత్ భాయ్ బ్యాట్ నుంచి కొన్ని అద్భుతమైన షాట్లు వచ్చాయి. అదే సమయంలో రికిల్టన్ కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే డికాక్ను కాదని రికిల్టన్కు అవకాశమివ్వడం రిస్క్ అనిపించినా అతడు తన బ్యాటింగ్తో మా అనుమానాలను పటాపంచలు చేశాడు. ఇక రోహిత్ భయ్యా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. టీ20 క్రికెట్కు గ్యాప్ వచ్చినప్పటికీ గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడుతూ పాత రోహిత్ను గుర్తుకుతెచ్చాడు. రోహిత్ శర్మ కేవలం మా జట్టు ఆటగాడు మాత్రమే కాదు అతను మాకు మార్గనిర్దేశకుడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ శార్దూల్ ఠాకూర్ తన సొంత జట్టుకు ఆడడం లేదన్న ఫీలింగ్ అతనికి ఉండేది. నాకు తెలిసి ఇవాళ్టితో శార్దూల్కు ఆ ఫీలింగ్ పోయి ఉండాలి (నవ్వుతూ). ఒక నిఖార్సైన ఆల్రౌండర్కు అర్థం శార్దూల్ ఠాకూర్. ఇవాళ మ్యాచ్ హీరో శార్దూల్ అని కచ్చితంగా చెప్పగలను’ అంటూ ముగించాడు. కేకేఆర్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన శార్దూల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్
గోల్ఫ్ దిగ్గజం టైగర్వుడ్స్ అరెస్ట్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్వుడ్స్ను ఫ్లోరిడా పోలీసులు...
గాయాలతో సతమతం.. ఆటకు గుడ్బై
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్...
చికిత ఖాతాలో స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్...
‘ఉత్తమ ప్లేయర్లు’ హార్దిక్, నవ్నీత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కనబరుస్తున్న...
ముంబై మెరిసె... నిరీక్షణ ముగిసె...
గత 13 సీజన్లుగా ఐపీఎల్ తొలి మ్యాచ్లో విజయం సాధి...
ముంబై ఇండియన్స్ ‘ట్రిపుల్ సెంచరీ’
ముంబై: కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన ఐపీ...
రోహిత్, రికెల్టన్ విధ్వంసం.. కేకేఆర్పై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా కేకేఆర్తో ఇవాళ (మార్చి 29) ...
IPL 2026: రోహిత్ శర్మ ఉగ్రరూపం.. సరికొత్త చరిత్ర
ఐపీఎల్ 2026లో భాగంగా కేకేఆర్తో ఇవాళ (మార్చి 29) ...
క్రీడలు
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
వీడియోలు
IPL 2026: RR vs CSK ఎవరు గెలుస్తారు?
కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం
RCB Vs SRH: అదరగొట్టిన RCB.. SRHపై 6 వికెట్ల తేడాతో RCB గెలుపు
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
మ్యాచ్ మొదలవ్వక ముందే RCBకి 3 బిగ్ షాక్ లు ..
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
ఐపీఎల్ తొలి మ్యాచ్ లో RCBతో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
అభిషేక్, ఇషాన్ కాదు.. SRH X ఫ్యాక్టర్ అతనే
బెంగళూరులో ల్యాండ్ అయిన పాట్ కమ్మిన్స్.. ఇక RCB కి చుక్కలే
