ప్రధాన వార్తలు
బాహుబలి పాటతో స్ఫూర్తి పొందాం
ముుంబై: భారత్కు టి20 వరల్డ్ కప్ను అందించిన మూడో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఘనత సాధించాడు. ఫైనల్ ముగిసిన రోజునుంచి అతను ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో పలు అంశాలపై అతను మీడియాతో మాట్లాడాడు. విశేషాలు సూర్యకుమార్ మాటల్లోనే... కెప్టెన్సీ, వరల్డ్ కప్ గెలిపించడంపై... రోహిత్ తప్పుకున్న తర్వాత నన్ను కెప్టెన్ను చేస్తారని ఊహించలేదు. ఏడాదిన్నర క్రితం శ్రీలంక వెళ్లడానికి వారం రోజుల ముందు నిన్ను కెప్టెన్గా నియమిస్తున్నామని జై షా చెప్పారు. అప్పుడే కోచ్ గంభీర్తో మాట్లాడి వరల్డ్ కప్ గెలవాలనే ఏకైక లక్ష్యంతో రోడ్మ్యాప్ను సిద్ధం చేశాం. ఆటగాడిగా, కెప్టెన్గా కూడా ప్రపంచ కప్ గెలిస్తే అది చాలా గొప్ప విషయం అవుతుందని అనుకున్నా. ఇప్పుడు అదే జరగడం చాలా సంతోషంగా ఉంది. 2024 ప్రపంచకప్తో పోలిక...అప్పటికంటే మా బ్రాండ్ క్రికెట్కు మార్చాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టుగా గెలవడం ముఖ్యం అని అందరికీ చెప్పాం. సెమీస్ చేరే వరకు కూడా అత్యధిక పరుగుల, వికెట్ల జాబితాలో మన ఆటగాళ్లెవరూ లేరు. ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించడంతో వరుసగా విజయాలు వచ్చాయి. చాలా మంది మన జట్టు ద్వైపాక్షిక సిరీస్లలో దూకుడుగా ఆడుతుంది. ఐసీసీ ఈవెంట్లలో జాగ్రత్త పడుతుంది అని విమర్శించేవారు. కానీ దీనిని కూడా మార్చాలని, ఇక్కడా అదే ధాటిని కొనసాగించాలని భావించాం. వరల్డ్ కప్లో కీలక మలుపు... దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం మమ్మల్ని మార్చేసింది. మా ఆటగాళ్ల ప్రదర్శనపై ఎప్పుడూ సందేహాలు లేకున్నా సఫారీ టీమ్ బాగా దెబ్బ కొట్టింది. దాంతో తర్వాతి ప్రతీ మ్యాచ్ను నాకౌట్గా భావిస్తూ వచ్చాం. తొలి నాలుగు మ్యాచ్లలో మా ప్రదర్శన కోచ్ గంభీర్కు సంతృప్తినివ్వలేదు. ఆయనలో అసహనం కనిపిస్తూనే ఉంది. కానీ ఆ తర్వాత మా బ్యాటింగ్, స్కోర్లు చూసి గంభీర్ మొఖంలో చిరునవ్వు వచ్చింది. ఫైనల్కు ముందు మీరు గెలవాల్సింది ఇది మాత్రమే. ఇది కాకుండా 100 మ్యాచ్లు నెగ్గినా ఎవరూ గుర్తు పెట్టుకోరు అని గంభీర్ మాకు మార్గనిర్దేశనం చేశాడు. ఆరంభంలో సామ్సన్ వైఫల్యంపై... తుది జట్టులో సామ్సన్కు చోటు ఇవ్వలేనప్పుడు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇది కఠిన సమయం కావచ్చు కానీ దేవుడు దయతలిస్తే నీకూ అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వేంటో చూపించాలి అన్నాను. దాని కోసం మాత్రం అతను ఎప్పుడూ సిద్ధమవుతూనే వచ్చాడు. చివరి వరుస మూడు మ్యాచ్లలో సామ్సన్ ప్రతాపం ఏమిటో చూశాం. అతను అనుకుంటే ఈ మూడు ఇన్నింగ్స్లు కూడా సెంచరీలుగా మారేవి. కానీ అతను మాత్రం జట్టు కోసమే ఆడాడు. మర్చిపోలేని క్షణాలు... వరల్డ్ కప్ ట్రోఫీని కెప్టెన్గా అందుకోవడం కంటే గొప్ప క్షణం ఏముంటుంది. ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నట్లుగా నా చెంపపై రెండు సార్లు దెబ్బ వేసి మరీ ముందుకు సాగాను. మైదానంలో చూస్తే అక్షర్ పట్టిన క్యాచ్ అద్భుతం. నేను 2024 ఫైనల్లో అందుకున్న క్యాచ్ లాంటిదే ఇది కూడా. దక్షిణాఫ్రికా మ్యాచ్ తర్వాత ‘సాహోరే...బాహుబలి’ పాటతో ప్రత్యేకంగా పది నిమిషాల రీల్ చేసి మా వీడియో అనలిస్ట్ మాలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.
క్వార్టర్స్కు సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం హోరాహోరీగా జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో టాప్ సీడ్ భారత జంట 21–15, 15–21, 28–26తో హిరోకి ఒకముర–క్యొహే యామషిత (జపాన్) ద్వయంపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో తరుణ్ మన్నెపల్లి ప్రిక్వార్టర్స్ చేరగా, మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్కు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. ప్రపంచ 43వ ర్యాంకర్ తరుణ్ 16–21, 21–16, 7–2తో తనకన్నా మెరుగైన ప్రత్యర్థి, ఐదో సీడ్ కెంట నిషిమొటో (జపాన్)పై ఆధిక్యంలో ఉండగా భుజం గాయంతో జపాన్ ఆటగాడు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ప్రిక్వార్టర్స్లో కిరణ్ జార్జ్ 18–21, 21–16, 16–21తో జాసన్ గునవన్ (హాంకాంగ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో మాళవిక బన్సోద్ 11–21, 15–21తో థాయ్లాండ్కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ పొర్న్పవీ చొచువాంగ్ చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో ఎమ్.ఆర్.అర్జున్–హరిహరన్ జోడీ 17–21, 11–21తో చెన్ చెంగ్ కున్–లిన్ బింగ్ వీ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది.
ఫైనల్పై అమ్మాయిల గురి
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచకప్–2026కు ఇప్పటికే అర్హత సాధించిన భారత మహిళల జట్టు క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్ చేరడంపై దృష్టి పెట్టింది. టోర్నీ లో భాగంగా నేడు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే సెమీఫైనల్ పోరులో ఇటలీతో భారత్ తలపడుతుంది. చీఫ్ కోచ్గా జోయెర్డ్ మరీన్ పునరాగమనంతోనే మన అమ్మాయిల జట్టు ఘన విజయాలు సాధిస్తోంది. పూల్ ‘బి’లో ఉన్న భారత్ లీగ్ దశను అగ్ర స్థానంతో ముగించింది. మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచి, ఒక డ్రా ఫలితంతో 7 పాయింట్లు సాధించింది. అయితే స్కాట్లాండ్ కూడా 7 పాయింట్లతో ఉన్నప్పటికీ గోల్స్ తేడాతో రెండో స్థానంలో ఉంది. తాజా సెమీస్లో ఎదురుపడుతున్న ఇటలీ ఈ టోర్నీ లో మనలాగే అత్యంత నిలకడను ప్రదర్శించింది. అటాకింగ్లో ఫెడెరికా కార్టా అసాధారణ నైపుణ్యం కనబరిచింది. ఆమె మూడు గోల్స్ సాధించింది. 2012 నుంచి ఇప్పటివరకు భారత్, ఇటలీ జట్లు ఏడుసార్లు ముఖాముఖీగా తలపడితే... భారత్ ఐదింట గెలుపొందింది. ఇటలీ మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ విజయంతో సరిపెట్టుకుంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ ఏడాది మహిళల ప్రపంచకప్ హాకీ ఈవెంట్ పురుషుల ప్రపంచకప్తో పాటే జరుగనుంది. ఈ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ఈ రెండు మెగా ఈవెంట్లకు నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అర్హత సాధించిందిలా... హైదరాబాద్తో పాటు చిలీలోని సాంటియాగోలో కూడా మరో వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ జరుగుతోంది. ఈ రెండు టోర్నమెంట్ల ద్వారా మొత్తం 7 జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది. టాప్–3 స్థానాల్లో నిలిచిన ఆరు టీమ్లు క్వాలిఫై అవుతాయి. దీంతో పాటు రెండు టోర్నీ ల్లో నాలుగో స్థానాల్లో నిలిచిన రెండు జట్ల మధ్య వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎవరు మెరుగైన స్థానంలో ఉంటే వారికి అవకాశం దక్కుతుంది. భారత్ ఒక వేళ ఫైనల్ చేరకపోయినా మూడో స్థానం కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది. ఆ మ్యాచ్లోనూ ఓడితే నాలుగో స్థానం దక్కుతుంది. మరో వైపు చిలీలో టోర్నీ లో జపాన్ నాలుగో స్థానంతో ముగించింది. ప్రస్తుతం భారత్ 9వ ర్యాంక్లో, జపాన్ 15వ ర్యాంక్లో ఉన్నాయి. కాబట్టి బుధవారం చివరి లీగ్ మ్యాచ్ తర్వాతే భారత్ వరల్డ్ కప్కు అర్హత సాధించింది.
యూకీ బాంబ్రీ తొలిసారి ఏటీపీ మాస్టర్స్ సెమీస్లోకి...
ఇండియన్వెల్స్ (అమెరికా): భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ తొలిసారి ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. స్వీడెన్ ప్లేయర్ గొరన్సన్తో జోడీ కట్టిన భారత ఆటగాడు క్వార్టర్ ఫైనల్స్లో ప్రత్యర్థి జంటపై గెలుపొందింది. గురువారం ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్–స్వీడెన్ ద్వయం 6–3, 7–6తో అలెగ్జాండర్ ఎర్లెర్ (ఆ్రస్టేలియా)–అండ్రియా వవసొరి (ఇటలీ) జంటపై విజయం సాధించింది. సరిగ్గా గంటన్నర పాటు జరిగిన ఈ పోరులో యూకీ జోడీ అద్భుతంగా రాణించింది. రెండో సెట్లో ఆసీస్–ఇటాలీయన్ జంట పుంజుకోవడంతో పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. కీలకమైన సమయంలో వరుసగా పాయింట్లు సాధించడంతో టైబ్రేక్కు దారితీయకుండా మ్యాచ్లో విజయం సాధించారు. గతంలో ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో క్వార్టర్స్ దశలోనే యూకీ వెనుదిరిగాడు. రెండు సార్లు క్వార్టర్స్తోనే సరిపెట్టుకున్న యూకీ ఇప్పుడు స్వీడెన్ ఆటగాడితో కలిసి సెమీస్ చేరాడు.
సౌత్జోన్ జట్టులో ప్రణవి
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్జోన్ జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతోకూడిన సౌత్జోన్ జట్టులో తెలుగమ్మాయి ప్రణవి చంద్రకు చోటు లభించింది. గతంలో హైదరాబాద్కు ఆడిన ప్రణవి ప్రస్తుతం కేరళకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 3 వరకు పుదుచ్చేరిలో ఈ టోర్నీని నిర్వహిస్తారు. సౌత్జోన్ జట్టుకు నిక్కీ ప్రసాద్ (కర్ణాటక) కెప్టెన్గా, మమత (హైదరాబాద్) వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. వంకా పూజ (హైదరాబాద్), షబ్నమ్, హెన్రిటా పెరీరా (ఆంధ్ర) కూడా సౌత్జోన్ జట్టులోకి ఎంపికయ్యారు.
జాక్పాట్ కొట్టిన ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్
తొలిసారి నిర్వహించిన హండ్రెడ్ లీగ్ వేలంలో ఓ అనామక ఆటగాడు జాక్పాట్ కొట్టాడు. క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ససెక్స్ బ్యాటింగ్ ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్ను లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ ఏకంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 4.8 కోట్లు) సొంతం చేసుకుంది. 75 వేల పౌండ్ల బేస్ప్రైజ్ విభాగంలో వేలంలో బరిలోకి దిగిన 21 ఏళ్ల కోల్స్ కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు (బర్మింగ్హామ్ ఫీనిక్స్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ట్రెంట్ రాకెట్స్, సన్రైజర్స్ లీడ్స్) తీవ్రంగా పోటీపడ్డాయి. 35 బిడ్డింగ్ రౌండ్ల అనంతరం లండన్ స్పిరిట్ అతన్ని ఊహించని ధరకు దక్కించుకుంది.లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ కమ్ డాషింగ్ బ్యాటర్ అయిన కోల్స్ సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్లో అతను టైటిల్ గెలిచిన సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 16 ఏళ్లకే ససెక్స్ తరఫున అరంగేట్రం చేసిన కోల్స్.. ఈ కౌంటీ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.చిన్న వయసులోనే 51 మ్యాచ్ల ఫస్ట్క్లాస్ కెరీర్ కలిగిన కోల్స్.. 82 ఇన్నింగ్స్ల్లో 38.42 సగటున పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 3.75 ఎకానమీతో 57 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఓ మోస్తరు రికార్డు కలిగిన కోల్స్.. ఈ ఫార్మాట్లో 21 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీశాడు. హండ్రెడ్ లీగ్లో ఇంతకుముందే ప్రవేశమున్న కోల్స్.. ఈ లీగ్లో 16 మ్యాచ్లు ఆడి ఓ మోస్తరు ప్రభావం చూపించాడు. గత ఎడిషన్ సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ తరఫున ఆడిన కోల్స్.. 152 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. 2024-25లో ఇంగ్లండ్ లయన్స్ తరఫున భారత్, ఆస్ట్రేలియాల్లో పర్యటించిన కోల్స్ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. హండ్రెడ్ లీగ్లో జాక్పాట్ కొట్టడంతో, విదేశీ లీగ్ ఫ్రాంచైజీల కన్ను కోల్స్పై పడింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో కోల్స్ తన పేరు నమోదు చేసుకోలేదు. త్వరలో జరుగబోయే హండ్రెడ్ లీగ్లో కోల్స్ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తే ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం అతని కోసం ఎగబడే అవకాశం ఉంది. హండ్రెడ్ వేలంలో కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్కు దక్కింది. అతన్ని వెల్ష్ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.హెండ్రెడ్ లీగ్ వేలంలో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ లీగ్లోని తమ సిస్టర్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ లీడ్స్ కోసం పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను (1.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు)) ఎంపిక చేసుకుంది.ఈ లీగ్ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్తో పాటు వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్ తారిక్ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.
చరిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్
న్యూజిలాండ్ వెటరన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్కు ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన అవకాశం దక్కింది. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో ప్రతి ఫ్రాంచైజీకి ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్.. మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన బౌల్ట్.. తాజాగా ద హండ్రెడ్ లీగ్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ లండన్కు ఎంపికయ్యాడు. బౌల్ట్ను ఇవాళ (మార్చి 12) జరిగిన వేలంలో ఎంఐ లండన్ లక్ష స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.23 కోట్లు) సొంతం చేసుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బౌల్ట్ ఇప్పటివరకు ప్రాతినిథ్యం వహించిన ప్రతి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో టైటిల్ నెగ్గాడు. ఇందులో మరో విశేషమేమిటంటే.. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల తరఫున అతనాడిన ప్రతి ఫైనల్లోనూ అతని జట్టు నెగ్గింది.ఇదిలా ఉంటే, హండ్రెడ్ లీగ్లో తొలిసారి ఆటగాళ్ల వేలం జరుగుతుంది. ఈ సీజన్ (2026) నుంచే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్ ద్వారా జరిగేది. ఈ సీజన్తో తొలిసారి ఐపీఎల్ తరహా వేలం జరుగుతుంది. నిన్న (మార్చి 11) మహిళల విభాగం వేలం పూర్తి కాగా.. ఇవాళ (మార్చి 12) పురుషుల వేలం జరుగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి.ఇప్పటివరకు జరిగిన పురుషుల వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు (లండన్ స్పిరిట్) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్కు దక్కింది. అతన్ని వెల్ష్ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.ఈ వేలంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ లీగ్లోని తమ సిస్టర్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ లీడ్స్ కోసం పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను (1.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు)) ఎంపిక చేసుకుంది. ఈ లీగ్ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్తో పాటు వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్ తారిక్ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.
ధోని అలా బ్యాటింగ్ చేయడంలో అర్థం లేదు: పుజారా
గత పద్దెమినిదేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొనసాగుతున్నాడు టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్గా.. ఆ జట్టుకు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. ఇక నలభై నాలుగేళ్ల వయసులోనూ తలా ఐపీఎల్-2026 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు.ఎనిమిదో స్థానంలోటోర్నీ ఆసాంతం ధోని ఆడతాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గతేడాది ఐదు మ్యాచ్ల తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో ధోని పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్గా ఎనిమిదో స్థానంలో వచ్చిన ధోని.. 135కు పైగా స్ట్రైక్రేటుతో 14 మ్యాచ్లలో కలిపి కేవలం 196 పరుగులే చేశాడు.ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చెన్నై జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారా ధోనిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం అర్థం లేని విషయం అని అభిప్రాయపడ్డాడు.ధోని అలా బ్యాటింగ్ చేయడంలో అర్థం లేదు‘‘ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఎంఎస్ ధోని (MS Dhoni) సొంతం. సీఎస్కే జట్టులోనూ ఎవరూ ఆయనకు సాటిరారు. అలాంటి ధోని ఎనిమిది లేదంటే తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు రావడంలో అర్థం లేదు.ఒకవేళ ఆయన కేవలం ఐదు లేదంటే పది బంతుల్లోనే పరుగులు రాబట్టగలిగినపుడు.. కనీసం 25 నుంచి 30 బంతులు ఎదుర్కొంటే ఫలితం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఫినిషర్గా గొప్ప పేరున్న ధోని మరీ లోయర్ ఆర్డర్లో రావడం ఏమాత్రం సరికాదు’’ అని పుజారా జియోస్టార్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.విశ్వసనీయత ఎక్కువఅదే విధంగా సీఎస్కేతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నేను గతంలో చెన్నైకి ఆడాను. ఆ జట్టులో వాతావరణం ఎంతో బాగుంటుంది. ఆటగాళ్లంతా సొంత కుటుంబంలా కలిసి ఉంటారు. ఆటగాడిగా మన నుంచి ఫ్రాంఛైజీ ఏం కోరుకుంటుందో ప్రతీ ఆటగాడికి తెలసు.సీఎస్కే ఫ్రాంఛైజీకి విశ్వసనీయత ఎక్కువ. ఫ్రాంఛైజీ పట్ల ఆటగాళ్లకు అభిమానం మెండు. ధోని మాత్రమే కాకుండా ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఆ జట్టుతో చాన్నాళ్లు కొనసాగిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆ జట్టులో మార్పులు జరుగుతున్నాయి. వెటరన్ ప్లేయర్లకు బదులు యువ ఆటగాళ్లతో జట్టును నింపేశారు’’ అని పుజారా పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2026 తొలి విడత షెడ్యూల్ బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్కే మార్చి 30న రాజస్తాన్ రాయల్స్తో, ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్తో, ఏప్రిల్ 5న ఆర్సీబీతో, ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.ఐపీఎల్-2026 సీఎస్కే జట్టుఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజు శాంసన్ (RR నుండి ట్రేడింగ్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రూయిస్✈️, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్✈️, నాథన్ ఎల్లిస్✈️, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, జేమీ ఓవర్టన్✈️, గుర్జప్నీత్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అకేల్ హోసేన్✈️, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్✈️, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ✈️, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్క్స్✈️చదవండి: పాకిస్తాన్కు ఘోర పరాభవం.. షాహిన్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు
వివాదంలో కావ్యా మారన్.. సన్రైజర్స్లోకి పాక్ ఆటగాడు
సన్రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్వా మారన్ వివాదంలో చిక్కుకుంది. హండ్రెడ్ లీగ్-2026 వేలంలో పాక్ ఆటగాడిని కొనుగోలు చేసి, భారత క్రికెట్ అభిమానుల నుంచి భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటుంది. కావ్యా మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ ఇటీవలే హండ్రెడ్ లీగ్లోని సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో మెజార్టీ శాతం వాటాను సొంతం చేసుకుంది.ఈ క్రమంలో తొలిసారి జరుగుతున్న వేలంలో పాల్గొన్న ఆమె.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను 1.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు) కొనుగోలు చేసింది. మరో ఫ్రాంచైజీతో (ట్రెంట్ రాకెట్స్) పోటీపడి మరీ అబ్రార్ను దక్కించుకుంది. ఈ చర్యతో కావ్వా భారత క్రికెట్ అభిమానుల పాలిట విలన్గా మారిపోయింది. అబ్రార్ అహ్మద్ ఇటీవలికాలంలో టీమిండియాతో ఆడిన మ్యాచ్ల్లో ఓవరాక్షన్ చేశాడు. ఓ సందర్భంలో భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ను ఔట్ చేసి చాలా అతి చేశాడు. ఇందుకు భారత ఆటగాళ్లు కూడా తగిన కౌంటర్లు ఇచ్చినప్పటికీ భారతీయుల కసి తీరలేదు. అలాంటి అబ్రార్ను కావ్యా మారన్ జట్టులో చేర్చుకోవడం భారతీయులకు మింగుడుపడటం లేదు.దీనికి ముందే కావ్యా మరో పాక్ ఆటగాడు (హరీస్ రౌఫ్) వేలానికి రాగా, అతన్ని రిజెక్ట్ చేసింది. అప్పుడు శభాష్ అనుకున్న భారత క్రికెట్ అభిమానులు, అబ్రార్ తీసుకున్న వెంటనే సోషల్మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ ప్రారంభించారు. ఇదే వేలంలో మరో పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. వేలంలో ఇప్పటివరకు అమ్ముడుపోయిన పాక్ ఆటగాళ్లు ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్ మాత్రమే. మరో పాక్ ఆటగాడు షాదాబ్ ఖాన్ కూడా వేలానికి వచ్చినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. కాగా, కొద్ది గంటల ముందే పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఈ వేలం బరి నుంచి వైదొలిగాడు. ఈ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్లో తొలిసారి ఆటగాళ్ల వేలం జరుగుతుంది. ఈ సీజన్ (2026) నుంచే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్ ద్వారా జరిగేది. ఈ సీజన్తో తొలిసారి ఐపీఎల్ తరహా వేలం జరుగుతుంది. నిన్న (మార్చి 11) మహిళల విభాగం వేలం పూర్తి కాగా.. ఇవాళ (మార్చి 12) పురుషుల వేలం జరుగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి.ఇప్పటివరకు జరిగిన పురుషుల వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు (లండన్ స్పిరిట్) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్కు దక్కింది. అతన్ని వెల్ష్ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.
IPL 2026: సన్రైజర్స్కు కష్టమే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి రంగం సిద్దమైంది. మార్చి 28న క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్కు తెరలేవనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి తొలి విడత షెడ్యూల్ను బుధవారం ప్రకటించింది.ఇరవై మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమేఓవైపు ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మరోవైపు.. తమిళనాడు, అసోం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది.ఇందులో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తొలి మ్యాచ్లో మార్చి 28న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది. ఇందుకు బెంగళూరు వేదిక. ఇక రెండో మ్యాచ్లో ఏప్రిల్ 2న కోల్కతా నైట్ రైడర్స్తో కోల్కతాలో.. తదుపరి ఏప్రిల్ 5న హైదరాబాద్తో లక్నో సూపర్ జెయింట్స్తో.. అనంతరం ఏప్రిల్ 11న పంజాబ్ కింగ్స్తో న్యూ చండీగఢ్లో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్రైజర్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి విడత షెడ్యూల్లో భాగంగా మూడు మ్యాచ్లు సొంత మైదానం వెలుపల ఆడటం తలనొప్పిగా మారుతుందన్నాడు.సన్రైజర్స్కు కష్టమే!‘‘గుజరాత్ టైటాన్స్తో పాటు సన్రైజర్స్ తొలి నాలుగు మ్యాచ్లలో మూడు సొంత మైదానంలో కాకుండా.. ఇతర వేదికలపై ఆడాల్సి ఉంది. నాకైతే సన్రైజర్స్ గురించే బాధంతా!వాళ్లకు ఫ్లాట్ పిచ్లు కావాలి. కానీ ఆయా వేదికల్లో వీరి కోసం ఎవరూ ఇలాంటి పిచ్ను తయారు చేయలేరు. సొంత మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్.. అది కూడా మధ్యాహ్నం షెడ్యూల్ చేశారు. నిజానికి సన్రైజర్స్కు హోం గ్రౌండ్లో సీజన్ ఆరంభించడమే మంచిది.అక్కడైతే వారు శుభారంభం అందుకోగలరు. వారి విజయాలు, ఆత్మవిశ్వాసంపై ఇది కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా సన్రైజర్స్లో అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర వీరులు ఉన్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2026: సన్రైజర్స్ షెడ్యూల్ ఇదే..!
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుష...
‘డ్రా’ చేసుకుంటే సెమీస్ బెర్త్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ మహిళల హాకీ క్వాలిఫయ...
ఫిట్నెస్ కీలకం
న్యూఢిల్లీ: ఆధునిక బ్యాడ్మింటన్ ప్రమాణలకు తగినట్ల...
ట్రయల్స్కు అంతిమ్, అమన్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు అమన్ సెహ్రావత్...
IPL 2026: సన్రైజర్స్కు కష్టమే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి...
పాక్ వివాదాస్పద బౌలర్కు జాక్పాట్
హండ్రెడ్ లీగ్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న వ...
పాక్కు ఘోర ఓటమి.. షాహిన్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్లోనే పాకిస...
టీ20 ప్రపంచకప్ 2026 హీరోకు ఘోర అవమానం
తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్-2026లో న్యూజిలాండ్...
క్రీడలు
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా వివాహంలో క్రికెట్, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్-సానియా మెహందీ.. తరలివచ్చిన క్రికెటర్లు (ఫొటోలు)
సంజూ భాయ్ ఆట... సెమీస్ బాట... అంతేగా.. అంతేగా (ఫొటోలు)
వీడియోలు
క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
World Cup: తుఫాన్ బ్యాటింగ్.. ఫైనల్లో గెలుపుకు కారణం అతనే
భయమేసింది పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup 2026: టీమిండియా కు వైఎస్ జగన్ అభినందనలు
గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర
చరిత్ర సృష్టించిన భారత్
