ప్రధాన వార్తలు
వైభవ్, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్!
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం సమీర్ రిజ్వీ తన మెరుపు బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్ విఫలమవుతున్న చోట రిజ్వీ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ యూపీ ఆటగాడు వరుసగా రెండు మ్యాచ్ల్లో ఒంటి చేత్తో ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించాడు.లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఢిల్లీ 6 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిజ్వీ(70 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అదే పరిస్థితి. 163 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ 8 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మళ్లీ రిజ్వీనే తన సంచలన బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేసి ఢిల్లీకి రెండో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వచ్చి అత్యధిక స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా రిజ్వీ రికార్డులెక్కాడు. రిజ్వీ ప్రస్తుతం 160 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్లలో కూడా రిజ్వీకే ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కడం గమనార్హం.భారత జట్టులోకి ఎంట్రీ?మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్న సమీర్ రిజ్వీని భారత జట్టుకు ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ప్రస్తుత భారత టీ20 జట్టులో టాపార్డర్ పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి మిడిలార్డర్ కొంచెం వీక్గానే ఉంది. దీంతో రిజ్వీ లాంటి ధీటైన బ్యాటర్ జట్టులోకి వస్తే భారత మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారనుంది.అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజ్వీ ప్రదర్శలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత జట్టు ఈ ఏడాది జూన్లో భారత్ రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.దీంతో భారత జట్టులో రిజ్వీకి చోటు దక్కే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత కొంత కాలంగా ఫార్మాట్తో సంబంధం లేకుండా దమ్ములేపుతున్న వైభవ్ సూర్యవంశీని కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ యువ సంచలనం ఇటీవల తన 15వ ఏట అడుగుపెట్టడంతో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అర్హత సాధించాడు. అతడితో పాటు భారత అండర్-19 కెప్టెన్ అయూశ్ మాత్రే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ఏడాది జూన్లో భారత అండర్-19 జట్టు రెడ్ బాల్ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఒకవేళ ఈ టూర్కు మాత్రే, వైభవ్ ఎంపిక అయితే సీనియర్ జట్టులో వచ్చేందుకు వేచి ఉండక తప్పదు. అంతేకాకుండా భారత సీనియర్ జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో ముగ్గురు ఓపెనర్లుగా ఉన్నారు. వీరి ముగ్గరు కూడా ఓపెనర్లగా విజయవంతమయ్యారు. వీరి గైర్హజారీలో వైభవ్కు భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. ఏదేమైనప్పటికి సమీర్ రిజ్వీ అంతర్జాతీయ అరంగేట్రం మాత్రం ఖాయమైనట్లు తెలుస్తోంది.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!
కలిసిపోయిన స్మృతి- పలాష్ కుటుంబాలు?.. త్వరలోనే పెళ్లి?!
భారత మహిళా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది స్మృతి మంధాన. టీమిండియా ఓపెనర్గా, వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఎన్నో ఘనతలు సాధించిన ఈ ముంబైకర్ ఖాతాలో గతేడాది ప్రపంచకప్ కూడా చేరింది. సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్కప్-2025లో భారత్ గెలవడంతో స్మృతి చిరకాల కోరిక నెరవేరింది.ఘనంగా హల్దీ, మెహందీఆ ఆనందంలోనే మెగా టోర్నీ ముగిసిన కొన్నిరోజులకే పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్ ముచ్చల్తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టేందుకు ఆమె కుటుంబం ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి హల్దీ, మెహందీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.చిరకాల స్నేహితులు, భారత క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పటేల్, రాధా యాదవ్ తదితరులు స్మృతి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. అంతా సజావుగా సాగిపోతుందనుకున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.వివాహం రద్దైనట్లు ప్రకటనలుపెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కాగా.. పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. అయితే, ఆ వెంటనే పలాష్ తనతో అసభ్యకరంగా చాటింగ్ చేశాడని.. అందులో స్మృతిని కించపరిచేలా మాట్లాడినట్లు ఉన్న స్క్రీన్షాట్లను ఓ అమ్మాయి షేర్ చేయడం కలకలం రేపింది.ఈ పరిణామాల క్రమంలో స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ తమ వివాహం రద్దైనట్లు విడివిడిగా అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ద్వారా స్మృతి- పలాష్ల వివాహానికి మార్గం సుగమమైందనే ఊహాగానాలకు ఊతమిచ్చింది.కలిసిపోయిన కుటుంబాలు?పలాష్ సోదరి, బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ ముంబైలోని ఓ రెస్టారెంట్ బయటకు రాగా.. అక్కడే స్మృతి తండ్రి శ్రీనివాస్ కూడా ఉన్నారు. వెంటనే పాలక్.. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాత తన భర్త మిథున్తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్మృతి- పలాష్ల పెళ్లి జరుగబోతుందనే వదంతులు పుట్టుకొచ్చాయి.అయితే, చాలా మంది నెటిజన్లు మాత్రం ఇది పాత వీడియో అయి ఉంటుందని కొట్టిపారేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత స్మృతి అతడిని క్షమించే ప్రసక్తే లేదని పేర్కొంటున్నారు. అయితే, స్మృతి అభిమానులు మాత్రం ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంతోషంగా ఉంటే చాలని కామెంట్లు చేస్తున్నారు.కాగా పలాష్ నిజస్వరూపం తెలిసిన తర్వాత స్మృతి స్నేహితురాళ్లు అతడికి చితక్కొట్టారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, పలాష్ మాత్రం తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. మరోవైపు.. పెళ్లి రద్దైన తర్వాత స్మృతి ఆటపై దృష్టి పెట్టి.. వుమెన్ ప్రీమియర్ లీగ్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విజేతగా నిలిపింది. తద్వారా ఆర్సీబీకి రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్గా ఘనత సాధించింది.చదవండి: పాపం.. గర్ల్ఫ్రెండ్ చేసిన పనికి సిన్నర్ ఏమవుతాడో! View this post on Instagram A post shared by Bollywood pap king (@bollywoodpapking)
బుమ్రా ఖాతాలో అరుదైన హ్యాట్రిక్
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. తిరుగులేని టీ20 కెరీర్లో అతను అరుదైన హ్యాట్రిక్ సాధించాడు. 273 మ్యాచ్ల పొట్టి క్రికెట్ ప్రస్తానంలో కేవలం నాలుగోసారి మాత్రమే వికెట్ లేకుండా వరుసగా మూడు టీ20లను (హ్యాట్రిక్) ముగించాడు. నిన్న (ఏప్రిల్ 7) రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో వికెట్ లేకుండా పోవడంతో బుమ్రా ఖాతాలో ఈ అనవసర రికార్డు చేరింది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్లో బుమ్రా వరుసగా కేకేఆర్ (4-0-35-0), ఢిల్లీ (4-0-21-0), రాజస్థాన్ (3-0-32-0) మ్యాచ్ల్లో వికెట్ తీయలేకపోయాడు.బుమ్రా టీ20 కెరీర్లో ఇలాంటి సందర్భాలు.. - 2016 IPL: SRH, RCB, KXIPతో వరుసగా జరిగిన మ్యాచ్ల్లో వికెట్లు తీయలేకపోయాడు. - 2014 IPL: CSK, SRH, KKR, RRతో వరుసగా జరిగిన నాలుగు మ్యాచ్ల్లో వికెట్లు తీయలేకపోయాడు. - 2017/18 T20Is: శ్రీలంక, దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు మ్యాచ్ల్లో వికెట్లు తీయలేకపోయాడు. పై నాలుగు సందర్భాలు మినహా, బుమ్రా తన యావత్ టీ20 కెరీర్లో మరెప్పుడు వరుసగా 3 మ్యాచ్ల్లో వికెట్లు లేకుండా ఉండలేదు. 273 మ్యాచ్ల పొట్టి క్రికెట్ కెరీర్లో బుమ్రా 6.92 సగటున 345 వికెట్లు తీశాడు. ఐపీఎల్ కెరీర్ మాత్రమే తీసుకుంటే.. ఈ లీగ్లో 148 మ్యాచ్ల్లో 7.26 సగటున 183 వికెట్లు పడగొట్టాడు.బుమ్రాను సైతం వదలని సూర్యవంశీరాజస్థాన్ రాయల్స్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అతను ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం చుక్కలు చూపించాడు. బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్గా మలిచిన వైభవ్.. అదే ఓవర్లో నాలుగో బంతిని మరోసారి స్టాండ్స్కు పంపించాడు. ఈ మ్యాచ్లో వైభవ్ దెబ్బకు బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు.వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో రాయల్స్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. వైభవ్తో పాటు యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.జైశ్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్, రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్లతో 20) మెరుపులు మెరిపించారు. అనంతరం బరిలోకి దిగిన ముంబై 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. వైభవ్, జైస్వాల్ ధాటికి బుమ్రా వికెట్ లేకుండానే ఇన్నింగ్స్ను ముగించాడు.
‘ధోనికి ఇప్పుడంత సీన్ లేదు.. ఒత్తిడిలోనూ నావి సరైన నిర్ణయాలే’
సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఒత్తిడిలోనూ తాను సరైన నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఓ కంటి డాక్టర్ ఉన్నారన్నాడు. ఐపీఎల్-2026లో సన్రైజర్స్ తరఫున నిలకడైన బ్యాటర్గా క్లాసెన్ కొనసాగుతున్నాడు.రెండు హాఫ్ సెంచరీలుగతంలో వికెట్ కీపర్గానూ సేవలు అందించిన క్లాసెన్కు.. ఇషాన్ కిషన్ (Ishan Kishan) రాకతో ఈ బాధ్యతల నుంచి విముక్తి లభించింది. ఇక ఈసారి నాలుగు లేదంటే ఐదో స్థానంలోనే అతడు బ్యాటింగ్కు వస్తున్నాడు. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లలో వరుసగా 31, 52, 62 పరుగులు సాధించాడు.కాగా సౌతాఫ్రికాకు చెందిన క్లాసెన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తాను విజయవంతమైన, నిలకడైన ఆటగాడిగా కొనసాగడం వెనుక కంటి డాక్టర్ ఉన్నారని క్లాసెన్ తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు స్పోర్ట్స్స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఒత్తిడిలో ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు‘‘కేప్టౌన్లో షెరిల్లీ అనే పేరు గల కంటి డాక్టర్ సూచనలతో నన్ను నేను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ మేము దీనిని EyeGym అని పిలుస్తాము. ఒత్తిడిలో ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది.గత ఏడాది కాలంగా నాకు ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగింది. ఏ విషయంలోనైనా త్వరితగతిన స్పందించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను’’ అని హెన్రిచ్ క్లాసెన్ చెప్పుకొచ్చాడు.ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ ఒక్కటి మాత్రమే గెలిచింది. తదుపరి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే దిగ్గజం, గాయం వల్ల ఆరంభ మ్యాచ్లకు దూరమైన మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రస్తావన రాగా..ధోనికి ఇప్పుడంత సీన్ లేదు‘‘సాధారణంగా అతడు మైదానంలోకి వస్తున్నాడంటే ప్రేక్షకుల నుంచి స్పందన కారణంగా మనం చుట్టుపక్కల ఏం జరుగుతుందో వినలేము. అయితే, ఈసారి అతడు లేడు కాబట్టి ప్రేక్షకులు కాస్త నిశ్శబ్దంగానే ఉంటారు.అది మాకు కలిసి వస్తుంది. అయితే, కెప్టెన్గా ధోని గతేడాది కాస్తైనా ప్రభావం చూపినా ఆటగాడిగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం ఐదు నుంచి పది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. కాబట్టి ఒకవేళ ఈసారి కూడా జట్టుతో ఉన్నా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు’’ అని క్లాసెన్ అభిప్రాయపడ్డాడు.చదవండి: PSL: ‘దుప్పటి, దిండు తెచ్చుకుని ఇక్కడే నిద్రపోవాల్సింది’
పాకిస్తాన్ క్రికెటర్లకు సువర్ణావకాశం
నలుగురు పాకిస్తాన్ క్రికెటర్లు లక్కీ ఛాన్స్ కొట్టారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ దేశవాలీ సీజన్ కోసం వేర్వేరు జట్లకు ఎంపికయ్యారు. మొహమ్మద్ అబ్బాస్, సుఫియాన్ ముఖీమ్ను డెర్బీషైర్.. ఉసామా మిర్ను వార్సెస్టర్షైర్ జట్లు ఎంపిక చేసుకున్నాయి. మొహమ్మద్ నవాజ్ టీ20 బ్లాస్ట్ (జట్టు ఖరారు కాలేదు) ఆడేందుకు అనుమతి పొందాడు. వీరందరికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు NOCలు జారీ చేసింది. వీరిలో నవాజ్, ఉసామా మిర్కు దీర్ఘకాలిక అనుమతి లభించగా.. సుఫియాన్ ముఖీమ్ జూన్ 7 వరకు మాత్రమే అనుమతి పొందాడు. మరో క్రికెటర్ అబ్బాస్కు సీజన్ మొత్తానికి అనుమతి లభించింది.స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన మొహమ్మద్ నవాజ్, స్పిన్ బౌలర్ సుఫియాన్ ముఖీమ్ T20 బ్లాస్ట్లో మాత్రమే ఆడనుండగా.. ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ కౌంటీ ఛాంపియన్షిప్తో పాటు అన్ని ఫార్మాట్లలో ఆడతాడు. ఉసామా మిర్ విషయానికొస్తే.. ఈ వైవిధ్యభరితమైన స్పిన్ బౌలర్ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు అనుమతి పొందాడు. నవాజ్, ముఖీమ్, ఉసామా మిర్ T20 బ్లాస్ట్లో ప్రతిభను చూపి, పాకిస్తాన్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు వీరికి ఇది సువర్ణావకాశం.
పాకిస్తాన్ సూపర్ లీగ్లో ప్రమాదకర ఘటన
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో భయంకర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ బౌలర్ మిర్ హమ్జా సజ్జాద్ తలకు బంతి బలంగా తగలడంతో ఆసుపత్రిలో చేరాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మార్క్ చాప్మన్ బలంగా కొట్టిన ఓ షాట్ సజ్జాద్ తల వెనుక భాగానికి తగిలింది. దీంతో అతను స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సజ్జాద్ స్పృహలోకి వచ్చి స్థిరంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. గాయ తీవ్రతను అంచనా వేసేందుకు CT స్కాన్ చేయనున్నట్లు వెల్లడించారు. మిర్ హమ్జా సజ్జాద్ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ దేశవాలీ క్రికెటర్ ఇప్పటివరకు 6 టీ20 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు తీశాడు. 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. సజ్జాద్ను ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్లోనే ఇస్లామాబాద్ యునైటెడ్ 70 లక్షలకు (పాక్ కరెన్సీ) కొనుగోలు చేసింది. సజ్జాద్ ఇంతవరకు పీఎస్ఎల్ అరంగేట్రం చేయలేదు. ఈ గాయం అతని అరంగేట్రాన్ని మరింత ఆలస్యం చేయవచ్చు. కాగా, ప్రస్తుత పీఎస్ఎల్ సీజన్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. ఇటీవల లాహోర్ ఖలందర్స్కు చెందిన ఓ బౌలర్ కూడా ఇలాగే గాయపడ్డాడు. తాజాగా సజ్జాద్ గాయం నెట్స్లో ప్రాక్టీస్ అంటేనే భయం పుట్టేలా చేస్తుంది. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు నెట్స్లో ప్రాక్టీస్ చేసేందుకు భయపడుతున్నారు. లీగ్ నిర్వహకులు నెట్స్లో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్ పీఎస్ఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. నిర్వహకులు ఏ విషయంలోనూ ప్రమాణాలు పాటించడం లేదని విదేశీ ఆటగాళ్ల నుంచి ప్రతి రోజు ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఈ లీగ్ ఇంధన కొరత కారణంగా ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే.
పాపం.. గర్ల్ఫ్రెండ్ చేసిన పనికి సిన్నర్ ఏమవుతాడో!
ప్రస్తుతం టెన్నిస్లో జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్లు ఒకరితో ఒకరు పోటీ పడడం మస్తు మజాను అందిస్తుంది. ఈ ఇద్దరు టెన్నిస్ ర్యాంకింగ్స్లో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒకప్పుడు నాదల్, ఫెదరర్, జొకోవిచ్ మధ్య పోటీ ఎంత రసవత్తరంగా ఉండేదో అదే తరహాలో ఇప్పుడు సిన్నర్, అల్కరాజ్లు ఎక్కడ తలపడినా ఆ మ్యాచ్కు యమా క్రేజ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు మాంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో ఆడుతున్నారు. ప్రస్తుతం జానిక్ సిన్నర్ డెన్మార్క్కు చెందిన మోడల్ లైలా హసనోవిక్తో లవ్లో ఉన్న సంగతి తెలిసిందే. సిన్నర్ ఏ టోర్నీ ఆడినా అక్కడ హసనోవిక్ ప్రత్యక్షమయ్యేది. అయితే తాజాగా మాంటే కార్లో టెన్నిస్ టోర్నీలో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.హసనోవిక్ తన ప్రియుడి మ్యాచ్కు కాకుండా సిన్నర్ చిరకాల ప్రత్యర్థి అల్కరాజ్ మ్యాచ్కు హాజరవ్వడమే ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్. టోర్నీలో భాగంగా అల్కరాజ్ తన తొలి మ్యాచ్లో సెబాస్టియన్ బేజ్ను 6-1, 6-3తో ఓడించాడు. కేవలం 70 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో హసనోవిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే అల్కరాజ్ ఆడుతున్నంత సేపు హసనోవిక్ అతడిని కళ్లార్పకుండా చూసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతకముందు రోజు తన బాయ్ఫ్రెండ్ సిన్నర్ మ్యాచ్కు కూడా హసనోవిక్ హాజరయ్యింది. కాగా తొలి రౌండ్ మ్యాచ్లో సిన్నర్ 6-3, 6-0తో హ్యూగో హంబర్ట్ను సులువుగా ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. మరి ఈ ఇద్దరు ఈ టోర్నీలో తలపడినప్పుడు హసపనోవిక్ ఎవరి ఆట చూస్తుందో తెలియడానికి కొద్ది రోజులు ఆగాల్సిందే.Laila Hasanovic watching alcaraz today pic.twitter.com/6J7vuRdATj— Kieza (@Czekoladka32904) April 7, 2026చదవండి: జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా!
BCCI: త్వరలోనే టీమిండియా ఎంట్రీ పక్కా!
రాజస్తాన్ రాయల్స్ స్టార్, భారత అండర్-19 వరల్డ్కప్ విజేత వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్లో.. అటు భారత జూనియర్ జట్టు తరఫున ఈ బిహారీ పిల్లాడు ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరుగా మారి.. ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు వైభవ్.మెరుపులు మెరిపించాడుఇక ఐపీఎల్-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లూ గెలవడంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ది కీలక పాత్ర. అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 17 బంతుల్లో 52, 18 బంతుల్లో 31, 14 బంతుల్లో 39 పరుగులు.ఈ నేపథ్యంలో భారత జాతీయ జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో వరల్డ్క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సిక్సర్తో వైభవ్ ఆహ్వానం పలికిన తీరు దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటోంది.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026డెస్టినీ చైల్డ్ఈ క్రమంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘సూర్యవంశీ డెస్టినీ చైల్డ్. అతడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. పదిహేనేళ్ల వయసులోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ప్రదర్శన చూసి ఆశ్చర్యంగా ఉంది.చితక్కొడతాను అని చెప్పి మరీ కొట్టాడుఇంతకు ముందు ఎవరూ ఇలాంటి ప్రదర్శన ఇవ్వలేదు. ఈ పిల్లాడు ఏం చెప్పాడో గుర్తుందా?.. ‘నేను జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. గతేడాది అవుటయ్యాను. ఈసారి మాత్రం కచ్చితంగా అతడి బౌలింగ్లో చితక్కొడతాను’ అని చెప్పాడు.అన్నట్లుగానే మొదటి బంతికే బుమ్రా బౌలింగ్లో సిక్సర్ బాదాడు. దీంతో బుమ్రా సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన వ్యూహం మార్చుకుని స్లో బాల్ వేయాల్సి వచ్చింది. అసలు పరిమిత ఓవర్ల క్రికెట్లో బుమ్రా కంటే అత్యుత్తమ బౌలర్ ఎవరూ లేరు. అలాంటిది బుమ్రా బౌలింగ్లోనే వైభవ్ అదరగొట్టాడు.20 ఏళ్లు ధనాధన్దయచేసి వైభవ్ను ఇంకా ఎదురుచూసేలా చేయకండి. త్వరలోనే అతడికి టీమిండియా క్యాప్ ఇవ్వండి. అతడు ఇరవై ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలడు. బౌలర్లకు ఇక చుక్కలే. వారిని భయపెడుతున్న పేరు వైభవ్’’ అంటూ టీమిండియాకు వైభవ్ను ఎంపిక చేయాలని ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐకి సూచించాడు. చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’
వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక రికార్డు
రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ ఎడిషన్లో 3 మ్యాచ్ల్లోనే 11 సిక్సర్లు బాదిన అతను.. ఓ చరిత్రాత్మక రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 5 సిక్సర్లు బాదిన అనంతరం ఈ ఘనతను సాధించాడు.ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..?సూర్యవంశీ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 10 ఇన్నింగ్స్ల్లో 171 బంతులు ఎదుర్కొని 35 సిక్స్లు బాదాడు. అంటే ప్రతి 4.88 బంతులకు ఓ సిక్సర్ బాదినట్లు లెక్క. ఇది ఐపీఎల్ చరిత్రలో కనీస బంతుల్లో సిక్స్ కొట్టిన రికార్డు. ఈ విభాగంలో రొమారియో షెపర్డ్, ఉర్విల్ పటేల్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆండ్రీ రసెల్ లాంటి విధ్వంసకర బ్యాటర్లను సూర్యవంశీ అధిగమించాడు.- వైభవ్ సూర్యవంశీ – 4.88 - రొమారియో షెపర్డ్ – 5.1 - ఉర్విల్ పటేల్ – 5.3 - జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ – 6.4 - ఆండ్రీ రసెల్ – 6.8 ఆకాశమే హద్దుప్రస్తుత ఎడిషన్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసిన అతను.. ఆతర్వాత గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 31 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్పై కూడా అదే జోరును కొనసాగించి 14 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు.ఈ సీజన్లో వైభవ్.. యశస్వి జైస్వాల్తో కలిసి అందిస్తున్న మెరుపు ఆరంభాలు రాజస్తాన్ రాయల్స్ను అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగిస్తున్నాయి. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో విజయాలు సాధించి, టేబుల్ టాపర్గా కొనసాగుతుంది.తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్స్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్ (77 నాటౌట్) పరుగులతో సత్తా చాటగా.. వైభవ్ (39) రాణించాడు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ సైతం పోరాడినప్పటికీ.. లక్ష్యానికి 28 పరుగుల దూరంలో (123-9) నిలిచిపోయింది.
జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ గురించి ఒక కీలక విషయం బయటకొచ్చింది. మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్కు జైస్వాల్ క్రాక్ వచ్చిన బ్యాట్తోనే బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పంచుకున్నాడు. నిజానికి ముంబైతో మ్యాచ్కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే జైస్వాల్ భారీ షాట్లు ఆడాడు. ఈ నేపథ్యంలో బ్యాట్కు చిన్న క్రాక్ వచ్చింది. బ్యాట్కు క్రాక్ వచ్చిన విషయాన్ని జైస్వాల్ కోచ్ విక్రమ్కు చూపించాడు. అయితే విక్రమ్ మాత్రం ఏం పర్లేదు.. విరిగిన బ్యాట్తో ఆడితే ఫలితం బాగుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై విక్రమ్ రాథోర్ స్పందిస్తూ.. ‘నిజానికి జైస్వాల్ బ్యాట్కు చిన్న పగులు మాత్రమే వచ్చింది. ఎంత గట్టి షాట్లు ఆడినా బ్యాట్కు తట్టుకునే సామర్థ్యముంది. అందుకే నేను జైస్వాల్ను అదే బ్యాట్తో బరిలోకి దిగమని చెప్పాను. అతడి నమ్మకమే అతడి బలం.’ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్లో పుంచుకోవడంతో వైరల్గా మారింది. అలా జైస్వాల్ చిన్నపాటి క్రాక్ వచ్చిన బ్యాట్తోనే ముంబైతో మ్యాచ్లో బరిలోకి దిగి ఇరగదీశాడు. అసలే ముంబై ఇండియన్స్పై మంచి రికార్డు కలిగి ఉన్న జైస్వాల్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే వర్షం అంతరాయంతో 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్ (77), సూర్యవంశీ (39), పరాగ్ (20) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమైంది. View this post on Instagram A post shared by IPL (@iplt20) View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: సెలెక్షన్ కమిటీపై షమీ సంచలన వ్యాఖ్యలు!
వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!
భారత్కు చెందిన మినర్వా ఫుట్బాల్ క్లబ్ సంచల...
నిఖత్కు నిరాశ
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్...
‘పసిడి’ రేసులో లలిత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లిం...
వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ ...
BCCI: త్వరలోనే టీమిండియా ఎంట్రీ పక్కా!
రాజస్తాన్ రాయల్స్ స్టార్, భారత అండర్-19 వరల్డ్...
వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక రికార్డు
రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్...
చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్!
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను కష్టాలు వె...
PSL: పాక్ క్రికెట్ బోర్డు పరువు తీసిన ఆసీస్ స్టార్!
ఆస్ట్రేలియా స్టార్, ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన...
క్రీడలు
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
వీడియోలు
విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్!
ఏం గుండెరా బుడ్డోడు? బుమ్రానే చిత్తకొట్టేశావ్ కదరా..
హ్యాట్రిక్ కొట్టిన RR
CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
ఈజీ రన్అవుట్ మిస్ చేసిన ఇషాన్... అదితి రియాక్షన్ వైరల్
కష్టాల్లో టీమిండియాను గెలిపించాడు.. ప్రచారంలో సంజూ ని ఆకాశానికి ఎత్తేసిన మోడీ
అయ్యర్ కు మ్యాచ్ గెలిచిన ఆ సంతోషం దక్కలేదు..!
5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం
