Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Revealed: Why Mumbai Indians Players Are Wearing Black Armbands vs SRH1
ముంబై ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ఎందుకు ధరించారో తెలుసా..?

ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఓ హృదయ విదారక కారణం ఉంది.జట్టు సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె ఇటీవల అకాల మరణం చెందింది. ఆమె స్మారకార్థం, అలాగే ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఆటగాళ్లు నల్ల ఆర్మ్‌బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు.ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. "మా సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె అకాల మరణం చెందింది. వారి కుటుంబానికి మద్దతుగా, ఆమె జ్ఞాపకార్థం ఈరోజు మా ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు" అని వెల్లడించారు.ఈ విషాద సమయంలో ఆ కుటుంబ గోప్యతను గౌరవిస్తూ, సంబంధిత సిబ్బంది వివరాలను ముంబై ఇండియన్స్ వెల్లడించలేదు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 15 ఓవర్ల అనంతర​ం ఆ జట్టు స్కోర్‌ 181-3గా ఉంది. ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ 44 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా హార్దిక్‌ పాండ్యా (2) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22 పరుగులు చేసి ఔటయ్యారు. హింగే, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలో వికెట్‌ తీశారు.

IPL 2026, MI vs SRH: No Rohit Sharma again, Hardik Pandya gives big comeback update2
రోహిత్‌ శర్మ అభిమానులకు చేదు వార్త

ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న కీలక పోరులో కూడా రోహిత్ ఆడటం లేదు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతడు వరుసగా నాలుగో మ్యాచ్‌కు దూరమయ్యాడు.టాస్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా రోహిత్‌ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. "రోహిత్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. అతడు తిరిగి రావడానికి ఇంకొన్ని మ్యాచ్‌లు పట్టొచ్చు" అని స్పష్టం చేశాడు. దీంతో ముంబై అభిమానులు అతని రీ-ఎంట్రీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.రోహిత్ గైర్హాజరీ ముంబైకి భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. అతని అనుభవం, ఆరంభ ఓవర్లలో దూకుడు జట్టుకు ఎంతో అవసరం. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.ఆరంభ ఓవర్లలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్‌, రికెల్టన్‌ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 78-0గా ఉంది. జాక్స్‌ 38, రికెల్టన్‌ 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఎసాన్‌ మలింగ ఒక్కడే జాక్స్‌-రికెల్టన్‌ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్‌, హింగే, హర్ష్‌ దూబే, సాకిబ్‌ హుసేన్‌ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది.ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. డికాక్‌ స్థానంలో రికెల్టన్‌, సాంట్నర్‌ స్థానంలో రాబిన్‌ మింజ్‌ బరిలోకి దిగారు. ఎస్‌ఆర్‌హెచ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పు చేసింది. శివాంగ్‌ కుమార్‌ స్థానంలో హర్ష్‌ దూబే తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్, అశ్వనీ కుమార్

Vaibhav Sooryavanshi forgot to wear his shoes Vs Punjab Match3
వైభ‌వ్ సూర్య‌వంశీ పొర‌పాటు.. వీడియో వైరల్‌!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్నపేరు వైభ‌వ్ సూర్య‌వంశీ. ఈ సీజ‌న్‌లో సూర్య‌వంశీ ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లాడి 400 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. మంగ‌ళ‌వారం సీజ‌న్‌లో వ‌రుస విజ‌యాల‌తో ఎదురులేకుండా సాగుతున్న పంజాబ్ కింగ్స్‌కు చెక్‌పెట్టిన రాజ‌స్తాన్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. కాగా జైస్వాల్‌, వైభ‌వ్ మ‌రోసారి మెరుపు ఆరంభం ఇచ్చారు. చివ‌ర్లో ఫెరీరా, శుభ‌మ్ దూబే ఫినిషింగ్ ట‌చ్‌తో రాజ‌స్తాన్‌ను గెలిపించారు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. వైభ‌వ్ సూర్య‌వంశీ ఫీల్డింగ్‌కు వెళ్లే స‌మ‌యంలో షూ వేసుకోకుండానే మైదానంలోకి వ‌చ్చాడు. అయితే పొర‌పాటును గ్ర‌హించిన వైభ‌వ్ వెంట‌నే త‌న షూ పంపించాలంటూ డ్రెసింగ్ రూమ్‌కు సైగ‌లు చేయ‌డం క‌నిపించింది. ప‌క్క‌నే ఉన్న‌ రోమి భింద‌ర్ కూడా వైభ‌వ్‌కు స‌హాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 6 విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.Vaibhav Sooryavanshi forgot to wear his shoes and then asked someone to bring them onto the ground 😭Romi Bhinder is literally taking care of him like a father 🫡 pic.twitter.com/3TayVsGf78— TEJASH (@Tejashyyyyy) April 29, 2026చదవండి: లంక క్రికెట్‌లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా!

IPL 2026, Match 41: Mumbai Indians Vs SRH Updates4
ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌

ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ర్యాన్‌ రికెల్టన్‌ (123 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22, హార్దిక్‌ పాండ్యా 31, తిలక్‌ వర్మ 7, రాబిన్‌ మింజ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హింగే 2, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సాకిబ్‌ తలో వికెట్‌ తీశారు. నమన్‌ ధిర్‌ ఔట్‌13.4వ ఓవర్‌- 165 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. హింగే బౌలింగ్‌లో హర్ష్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి నమన్‌ ధిర్‌ (22) ఔటయ్యాడు.రెండో వికెట్‌ డౌన్‌8.3వ ఓవర్‌- 110 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్‌ కోల్పోయింది. ఎషాన్‌ మలింగ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి సూర్యకుమార్‌ యాదవ్‌ (5) ఔటయ్యాడు. తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై7.1వ ఓవర్‌- 93 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ కోల్పోయింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి విల్‌ జాక్స్‌ (46) ఔటయ్యాడు.దుమ్మురేపుతున్న ముంబై ఓపెనర్లుముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్‌, రికెల్టన్‌ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 78-0గా ఉంది. జాక్స్‌ 38, రికెల్టన్‌ 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఎసాన్‌ మలింగ ఒక్కడే జాక్స్‌-రికెల్టన్‌ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్‌, హింగే, హర్ష్‌ దూబే, సాకిబ్‌ హుసేన్‌ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన ముంబై ఈ ఎడిషన్‌లో చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. సన్‌రైజర్స్‌ విషయానికొస్తే.. ఈ జట్టు మధ్యమధ్యలో తడబడినా, ఓ మోస్తరు ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించింది.తుది జట్లు..సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్, అశ్వనీ కుమార్

Bangladesh vs New Zealand 2nd T20I Abandoned Due To Rain5
రెండో టీ20 వర్షార్పణం

న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 29) జరగాల్సిన రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. దీంతో ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఆధిక్యం 1-0తో కొనసాగుతోంది. ఏప్రిల్‌ 27న జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో టీ20 ఢాకా వేదికగా మే 2న జరుగనుంది.కాగా, 3 మ్యాచ్‌ల వన్డే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌చట్టోగ్రామ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ న్యూజిలాండ్‌ను 182 పరుగులకు పరిమితం చేసింది. అనంతరం 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కేటీన్‌ క్లార్క్‌ (51), డేన్‌ క్లీవర్‌ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో జోష్‌ క్లార్క్‌సన్‌ (27 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్‌ హొసేన్‌ 2, షోరిఫుల్‌ ఇస్లాం, తంజిమ్‌ హసన్‌ సకీబ్‌, మెహిది హసన్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. తౌహద్‌ హృదోయ్‌ (51 నాటౌట్‌) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హృదోయ్‌కు పర్వేజ్‌ హొసేన్‌ (28), షమీమ్‌ హొసేన్‌ (31 నాటౌట్‌) సహకరించారు. మిగతా ఆటగాళ్లలో సైఫ్‌ హసన్‌ 17, తంజిద్‌ హసన్‌ 20, కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఐష్‌ సోధి 2, జోష్‌ క్లార్క్‌సన్‌, నాథన్‌ స్మిత్‌ తలో వికెట్‌ తీశారు.

Sri Lanka Cricket President Shammi Silva-Board Members Massive Resign6
లంక క్రికెట్‌లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా!

శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) బోర్డు సంక్షోభంలో కూరుకుపోయింది. లంక క్రికెట్ అధ్యక్షుడు షమీ సిల్వా సహా బోర్డు సభ్యులంతా తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో వీరు తమ రాజీనామా లేఖలను శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, క్రీడల శాఖ మంత్రి సునీల్ కుమార గమాగేలకు పంపినట్లు తెలుస్తోంది. అయితే జాతీయ జట్టు వరుస వైఫల్యాలు, బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో షమీ సిల్వాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇటీవల భారత్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకోలేకపోయింది. ఈ పేలవ ప్రదర్శనే అనూహ్య రాజీనామాలకు కారణమని తెలుస్తోంది.65 ఏళ్ల షమీ సిల్వా 2019 నుంచి శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2021, 2023, 2025 సంవత్సరాల్లో ఆయన ఏకగ్రీ వమయ్యారు. 2025లో జై షా తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగానూ సిల్వా బాధ్యతలు చేపట్టారు. అయితే షమీ సిల్వా హయాంలో శ్రీలంక క్రికెట్ బోర్డు వివాదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్‌లో జట్టు దారుణంగా విఫలం కావడంతో అప్పటి క్రీడల మంత్రి బోర్డును రద్దు చేశారు. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలకు విరుద్ధం కావడంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తాత్కాలికంగా రద్దు చేసింది. దీని ఫలితంగా శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు.ఇక శ్రీలంక 1973 క్రీడా చట్టం ప్రకారం క్రీడా సమాఖ్యలను రద్దు చేసే అధికారం మంత్రికి ఉన్నప్పటికీ, ఎన్నికైన సంస్థలలో ప్రభుత్వ జోక్యాన్ని ఐసీసీ అంగీకరించదు. ప్రస్తుత పరిణామాలపై ఐసీసీకి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Afghanistan Ban 3 Cricketers For Playing In Indian T20 League7
ముగ్గురు ఆఫ్ఘన్‌ క్రికెటర్లపై నిషేధం

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో జరిగిన ఓ టీ20 లీగ్‌లో అనుమతి లేకుండా పాల్గొన్న ముగ్గురు స్వదేశీ క్రికెటర్లపై నాలుగు నెలల నిషేధం విధించింది. నిషేధానికి గురైన వారి పేర్లు సమీవుల్లా షిన్వారి, అఫ్తాబ్‌ ఆలం, మొహమ్మద్‌ షెహజాద్‌. వీరు భారత్‌లో ఇటీవల జరిగిన లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో సొంత దేశ క్రికెట్‌ బోర్డు అనుమతి లేకుండా ఆడారు.వీరు బోర్డు నుంచి 'నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండింది. అయితే వీరు అలా చేయలేదు. దీంతో బోర్డు ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంది.ఈ నాలుగు నెలల కాలంలో షిన్వారి, ఆఫ్తాబ్‌, షెహజాద్‌ దేశీయ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఎక్కడా క్రికెట్‌ ఆడలేరు. నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ శిక్ష విధించినట్లు ఆఫ్ఘన్‌ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌కు ఐసీసీ లేదా బీసీసీఐ అధికారిక గుర్తింపు లేదని, అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉందని ఆఫ్ఘన్‌ బోర్డు అభిప్రాయపడింది.ఈ లీగ్‌లో మరో ఆఫ్ఘన్‌ ఆటగాడు, ఆ దేశ మాజీ కెప్టెన్‌ అస్గర్‌ అఫ్గాన్‌ కూడా పాల్గొన్నప్పటికీ, అతను ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అందుకే అతనిపై చర్యలు తీసుకోలేదని బోర్డు వివరణ ఇచ్చింది.కాగా, ACB ఇటీవలే తమ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు ఏడాదిలో గరిష్టంగా మూడు విదేశీ లీగ్‌లలో మాత్రమే పాల్గొనేలా పరిమితులు విధించింది. రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌ వంటి స్టార్ ఆటగాళ్లపై కూడా ఈ నిబంధన ప్రభావం చూపింది.

Arjun Tendulkar to enter T20 Mumbai League auction pool highest base price8
అర్జున్‌ టెండుల్కర్‌ కీలక నిర్ణయం

టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌కు ఐపీఎల్‌లో ఈ ఏడాది కూడా కలిసి రావడం లేదు. గతేడాది వరకు అతడు ముంబై ఇండియన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఆ జట్టు తరఫున అర్జున్‌ కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.ఇక్కడా బెంచ్‌కే పరిమితంఅయితే, 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ టెండుల్కర్‌ (Arjun Tendulkar)ను లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసింది. కానీ.. ముంబై ఇండియన్స్‌ మాదిరే ఇక్కడ కూడా ఈ ఆల్‌రౌండర్‌ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఈ సీజన్‌లో లక్నో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా.. అర్జున్‌కు ఒక్కసారి కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు.అర్జున్‌ టెండుల్కర్‌ కీలక నిర్ణయంఇక ఇప్పటికి ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా ఆరు ఓడి లక్నో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో అర్జున్‌ టెండుల్కర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లక్నో జట్టులో ఆడే పరిస్థితి లేని తరుణంలో టీ20 ముంబై లీగ్‌ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు జర్నలిస్టు గౌరవ్‌ గుప్తా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రూ. 5 లక్షల కనీస ధరతోకాగా మే 2న ముంబైలో టీ20 ముంబై లీగ్‌ వేలం జరుగనుంది. ఇందులో రూ. 5 లక్షల కనీస ధరతో అర్జున్‌ టెండుల్కర్‌ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర గల కేటగిరీ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ ఆల్‌రౌండర్‌ దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.బీసీసీఐ అనుమతితోనే..అయినప్పటికీ ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) అర్జున్‌కు ఈ టీ20 లీగ్‌ వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చింది. నిబంధనల ప్రకారం.. సంవత్సర కాలం పాటు కూలింగ్‌ పీరియడ్‌ పూర్తైన తర్వాత స్థానిక ఆటగాళ్లు ఈ లీగ్‌లో తిరిగి పాల్గొనవచ్చని తెలిపింది.ఈ విషయం గురించి ఎంసీఏ కార్యదర్శి ఉన్మేష్‌ ఖన్వీకర్‌ స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు (అర్జున్‌).. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అసోసియేషన్‌ తరఫున టీ20 లీగ్‌లో ఆడటం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్లు వేరే లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. అలా అర్జున్‌ టెండుల్కర్‌, సిద్ధాంత్‌ అద్ధాత్‌రావు టీ20 ముంబై లీగ్‌ సీజన్‌-4లో ఆడేందుకు అనుమతి లభించింది’’ అని పేర్కొన్నాడు. చదవండి: సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు!

Vaibhav Sooryavanshi Stunning Reply Pakistan Expert AI Chip Remark9
పాక్‌ ‘ఏఐ’ చిప్‌.. వైభ‌వ్ అదిరిపోయే రిప్లై!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. 15 ఏళ్ల వ‌య‌సులోనే అద్భ‌త బ్యాటింగ్‌తో అద‌ర‌గొడుతున్న వైభ‌వ్ ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లాడి 400 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాటింగ్‌పై అనుమాన‌ముంద‌ని, ఏఐ చిప్ ఇన్‌స్టాల్ చేసి ఉండొచ్చ‌ని, వెంట‌నే డోపింగ్ టెస్టుకు పంపించాలంటూ పాక్ క్రికెట్ అనలిస్ట్ నౌమ‌న్ నియాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పాక్ క్రికెట్ అన‌లిస్ట్‌కు వైభ‌వ్ త‌న స్టైల్లో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘దేవుడే నా బ్యాట్‌కు ఆ ఏఐ చిప్‌ను జోడించాడు. ఆ భగవంతుడే నా బ్యాట్‌కు దానిని జత చేసినట్లు నాకు స్వయంగా చెప్పాడు. అందుకే నేను ఆ బ్యాట్‌ను ఉపయోగించి పరుగులు సాధిస్తున్నా’ అని నవ్వుతూ పేర్కొన్నాడు.అసలేం జరిగింది?ఐపీఎల్ 2026 సీజన్‌లో అగ్ర‌శ్రేణి బౌల‌ర్లంద‌రినీ ఉతికారేస్తున్న వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాట్‌లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అత‌డి మెద‌డులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అన‌లిస్ట్ నౌమ‌న్ నియాజ్ సరదాగా పేర్కొన్నారు. వైభవ్‌కు డోపింగ్‌ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు. ‘వ‌ర‌ల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒక‌సారి వైభ‌వ్‌ను చెక్ చేస్తే బాగుంటుంది. అత‌డి బుర్ర‌లో ఏదైనా ఏఐ చిప్ ఇన్‌స్టాల్ చేసారా అన్న‌ది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్‌కు పంపించి ప‌రీక్షించాల్సిందే. వైభ‌వ్ నాకు మ‌నిషిలా అనిపించ‌డం లేదు. అయితే అత‌డి మీద అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభ‌వ్ సూర్య‌వంశీ ఒక అద్భుత‌మైన ప్లేయ‌ర్‌. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అత‌డి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండ‌లు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్య‌వంశీ 18 ఏండ్లు నిండ‌కుండానే అత‌డి దేహ‌దారుఢ్యం బ‌లంగా క‌నిపిస్తోంది. రాబోయే సంవ‌త్స‌రాల్లో వైభ‌వ్ ఆట‌లో మ‌రింత రాటు దేల‌డం ఖాయం.’ అని చెప్పుకొచ్చారు.ఐపీఎల్ 19వ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 400 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. అయితే ఈ మార్క్‌ను అందుకునేందుకు వైభవ్‌కు అవసరమైన బంతులు కేవలం 167 మాత్రమే. ఈ నేపథ్యంలో పరుగుల పరంగా అతి తక్కువ బంతుల్లో 400 పరుగుల మార్క్ చేరుకున్న వేగవంతమైన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు సాధించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రీ రసెల్ పేరిట ఉంది. 2019 సీజన్‌లో రసెల్ 188 బంతుల్లో 400 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 2024 సీజన్‌లో అభిషేక్ శర్మ (195 బంతులు), 2025 సీజన్‌లో నికోలస్ పూరన్ (197 బంతులు), 2014 సీజన్‌లో మ్యాక్స్‌వెల్ (200 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.𝘉𝘢𝘵 𝘱𝘦 𝘈𝘐 𝘤𝘩𝘪𝘱 𝘩𝘢𝘪 𝘬𝘺𝘢 𝘵𝘶𝘮𝘩𝘢𝘳𝘦?Vaibhav answers 😂💗 pic.twitter.com/uZcqABbaGS— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2026చదవండి: ‘వైభ‌వ్‌పై అనుమానముంది.. డోపింగ్‌ టెస్ట్ చేయాల్సిందే!’

England Player Who Once Fought Madly With Virat Kohli, Leads The Race To Become Chief Selector10
చీఫ్‌ సెలెక్టర్‌ పదవి రేసులో కోహ్లితో గొడవపడిన వ్యక్తి

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి యుక్త వయసులో ఉన్నప్పుడు అతనితో కయ్యానికి కాలు దువ్విన ఓ ఇంగ్లీష్‌ క్రికెటర్‌ ఇప్పుడు అతని దేశ క్రికెట్‌ బోర్డు (ECB) చీఫ్‌ సెలెక్టర్‌ పదవి రేసులో ముందున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన 37 ఫాస్ట్‌ బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ 2012లో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లీతో తీవ్రస్థాయిలో గొడవ పడ్డాడు. ఆ సందర్భంగా కోహ్లి-ఫిన్‌ మధ్య వాగ్వాదం తారాస్థాయికి వెళ్లింది. తనను రెచ్చగొట్టిన ఫిన్‌కు కోహ్లీ బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఫిన్‌ సైతం తనకు అవకాశం వచ్చినప్పుడు కోహ్లిని ఔట్‌ చేశాడు. వీరిద్దరి మధ్య వైరం అప్పట్లో కొంతకాలం సాగింది.అయితే ఫిన్‌ 2023లో మోకాలి గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కామెంటేటర్‌ అవతరామెత్తాడు. ఇంగ్లండ్ తరఫున 36 టెస్టులు, 21 టీ20లు ఆడిన ఫిన్‌, కామెంటేటర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తాజాగా ఫిన్‌ ఇంగ్లండ్ క్రికెట్‌లో అత్యంత కీలకమైన చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ప్రధాన పోటీదారుడిగా మారాడు. ఈ పదవి రేసులో ఫిన్‌ పేరు ప్రధానంగా వినినిస్తుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ లూక్‌ రైట్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ నిరాశాజనక ప్రదర్శన తర్వాత రైట్‌ తన పదవికి రాజీనామా చేశాడు.ఈ క్రమంలో చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ఎన్నిక అనివార్యం​ కాగా.. ఫిన్‌తో పాటు ఇంగ్లండ్‌ మాజీ ఆటగాళ్లు డారెన్‌ గాఫ్‌, నిక్‌ నైట్‌ కూడా పోటీపడుతున్నారు. వీరిలో ఫిన్‌కు ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 4న ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభానికి ముందే కొత్త సెలెక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. తుది నిర్ణయం ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబర్ట్‌ కీ తీసుకోనున్నారు. ఇంగ్లండ్‌ చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి సంవత్సరానికి సుమారు 150,000 పౌండ్ల వేతనం లభించనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement