Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Mumbai Indians Coach-Explains Why Bumrah-Surya-Tilak-Struggling1
‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ ఆట దాదాపు ముగిసిన‌ట్లే. ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవ‌లం రెండు విజ‌యాలు మాత్ర‌మే న‌మోదు చేసిన ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్ చేరే అవ‌కాశాలు కోల్పోయింది. పాయింట్ల పట్టిక‌లో 9వ స్థానంలో కొన‌సాగుతుంది. శ‌నివారం సీఎస్‌కే చేతిలో ఓట‌మి చ‌విచూసిన త‌ర్వాత ముంబై ఇండియ‌న్స్ విష‌యంలో ఒక అంశం చ‌ర్చ‌కు దారి తీసింది. టీమిండియాకు ఆడుతున్న ఆట‌గాళ్ల‌లో ఎక్కువ మంది ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులోనే ఉన్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా స‌హా రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా, సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌లు కీల‌క ఆట‌గాళ్లు. ఇందులో రోహిత్ గాయంతో డ‌గౌట్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇక మిగిలిన ఆట‌గాళ్ల‌లో కెప్టెన్ పాండ్యా సంగ‌తి ప‌క్క‌న‌బెడితే సూర్య‌కుమార్‌, తిల‌క్ వ‌ర్మ‌, బుమ్రాలు దారుణంగా విఫ‌ల‌మ‌వ్వ‌డం ముంబై కొంప ముంచుతుంది. ఈ సీజ‌న్‌లో బుమ్రా ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున 9 మ్యాచ్‌లాడి కేవ‌లం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక సూర్య‌కుమార్ పేల‌వ ఫామ్ ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. తొమ్మిది మ్యాచ్‌లు క‌లిపి కేవ‌లం 20 స‌గ‌టుతో ప‌రుగులు సాధించాడు. తిల‌క్ వ‌ర్మ సెంచ‌రీ సాధించిన‌ప్ప‌టికీ ఆ మురిపెం ఒక్క మ్యాచ్‌కే ప‌రిమిత‌మైంది. ఈ ముగ్గురు అగ్ర‌శ్రేణి ఆట‌గాళ్లు విఫ‌లం కావ‌డంపై ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేల జ‌య‌వ‌ర్ద‌నే స్పందించాడు. సీఎస్‌కేతో మ్యాచ్ అనంత‌రం ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో జ‌య‌వ‌ర్ద‌నే మాట్లాడాడు. ‘నిజానికి ఈ ముగ్గురి వ‌ల్లే ముంబై ఇండియ‌న్స్ దారుణ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చెప్ప‌లేం. ఎందుకంటే సూర్య‌, తిల‌క్‌, బుమ్రాలు ఇప్ప‌టికే వారేంటో నిరూపించుకున్నారు. ఒక్క‌సారి సూర్య‌కుమార్ ట‌చ్‌లోకి వ‌స్తే ఎంత డేంజ‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే అత‌డు కుదురుకోవ‌డానికి రెండు, మూడు ఇ న్నింగ్స్‌లు చాలు. కానీ ఈ సీజ‌న్‌లో మాకు ఆ స‌మ‌యం దాటిపోయింది. ఇక తిల‌క్ వ‌ర్మ ఇంకా నేర్చుకునే ద‌శ‌లోనే ఉన్నాడు. త‌న‌దైన రోజున ధాటిగా ఆడ‌గ‌ల స‌త్తా ఉన్న తిల‌క్ వ‌ర్మ అనుభ‌వం పెరిగిన కొద్దీ ఆట‌లో మ‌రింత రాటుదేలుతాడ‌న్న నమ్మ‌కం నాకుంది. అయితే తిలక్ వ‌ర్మ టీ20 క్రికెట్‌లో అన్ని ర‌కాల పాత్ర‌ల‌ను పోషిస్తున్నాడు. టీ20 క్రికెట్ ఆడ‌డం అంత ఈజీ కాదు. ఒక్కోసారి ప‌రిస్థితి చేయి దాటిపోతుంది. బుమ్రా రాణించ‌క‌పోవ‌డం వ‌ల్ల ముంబై ఇండియ‌న్స్‌ను ఇబ్బంది పెట్టే అంశం. కానీ బుమ్రా ఒక్క‌డే కాదు ముంబై బౌల‌ర్లంతా క‌లిసిక‌ట్టుగా ఆడ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. మిగ‌తా బౌల‌ర్లు కూడా వికెట్లు తీస్తే బుమ్రాపై ఒత్తిడి త‌గ్గ‌డంతో పాటు వికెట్లు తీసే అవ‌కాశ‌ముంటుంది.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: అదే జ‌రిగితే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియ‌న్స్‌!

IPL 2026: Sunrisers Hyderabad vs kolkata knight Riders Match live updates2
సన్‌రైజర్స్‌ వర్సెస్‌ కేకేఆర్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

IPL 2026 SRH vs KKR Live Updates: ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో భాగంగా ఉప్ప‌ల్ మైదానం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ డౌన్‌అభిషేక్‌ శర్మ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ.. కార్తీక్‌ త్యాగీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 45/1దూకుడుగా ఆడుతున్న హెడ్‌ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ దూకుడుగా ఆడుతున్నాడు.హెడ్ కేవ‌లం 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 27 ప‌రుగులు చేశాడు. ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌ 3 ఓవ‌ర్ల‌కు 37/0ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో భాగంగా ఉప్ప‌ల్ మైదానం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు.అతడి స్ధానంలో స్మరణ్ రవిచంద్రన్ తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా హర్షల్ పటేల్ కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు కేకేఆర్ కూడా తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ఫిన్ అలెన్‌తో పాటు మనీశ్ పాండేకు అవకాశమిచ్చారు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్య రహానే(కెప్టెన్‌), అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్‌), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చకరవర్తిసన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ

Jitesh Sharma Justifies Unprofessional Comment On Vaibhav Sooryavanshi3
వైభవ్ సూర్యవంశీ 'అన్ ప్రొఫెషనల్'?.. తన వ్యాఖ్యలపై జితేష్‌ క్లారిటీ

రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ "అన్‌ప్రొఫెషనల్" అనడం సోషల్‌ మీడియాలో పెను దుమారం రేపింది. జితేష్ ఇటీవల సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జితీష్ మాట్లాడుతూ.. "వైభవ్‌కు అస్సలు ప్రొఫెషనలిజం లేదు. ప్రతీ ఒక్కరూ అతడిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడు మైదానంలో బాగానే ఉంటున్నాడు. కానీ ఆఫ్‌ది ఫీల్డ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాడు. నేనూ అతడిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. రాత్రిపూట ఐస్ క్రీమ్ తినవద్దని చెబుతూనే ఉన్నాను. అయినా నా మాట వినడం లేదు అని చెప్పుకొచ్చాడు.అయితే వైభవ్ పట్ల జితేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో విమర్శలకు దారితీశాయి. తను చేసిన కామెంట్స్‌పై తాజాగా జితేష్ స్పష్టత ఇచ్చాడు. వైభవ్ తనకు మంచి స్నేహితుడని, ఆన్‌ది ఫీల్డ్, ఆఫ్‌ది ఫీల్డ్ ఎలా ఉంటాడో అన్నది వివరించాని జితేష్ తెలిపాడు. తన వ్యాఖ్యలను తప్పు ఆర్ధంగా చేసుకున్నారని ఓ పాడ్‌కాస్ట్‌లో అతడు చెప్పుకొచ్చాడు."వైభవ్ 15 ఏళ్ల పిల్లవాడు. అతడికి ఐస్‌క్రీమ్ అంటే చాలా ఇష్టం. అతడు నా గదికి వచ్చి కూడా ఐస్‌క్రీమ్ తింటాడు. నేను తినను, అతడు మాత్రమే తింటాడు. ఒక చిన్న పిల్లాడు ఐస్‌క్రీమ్ కాకుండా ఇంకేం తింటాడు? వైభవ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. అతడు మా ఇంటికి కూడా వస్తాడు, నా భార్యతో మాట్లాడతాడు.యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తుంటాడు. అతడు నాకు తమ్ముడి లాంటి వాడు. బయట వ్యక్తులు ఏమునుకున్నా నేను పట్టించుకోను. నేను అతడి అల్లరిని ఉద్దేశించి ప్రొఫెషనల్‌గా లేడు అన్నా. అతడు అంత చిన్న వయస్సులో అద్బుతంగా రాణిస్తున్నాడు కాబట్టి, అందరూ అతడి నుంచి ఎక్కువగా క్రమశిక్షణను ఆశిస్తున్నారు. కానీ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే.. అతడికి ఇంకా 15 ఏళ్లే. ఒక చిన్నపిల్లాడిని చిన్నపిల్లాడిలాగే ఉండనివ్వండి. నేను అతడికి పూర్తి స్వేఛ్చ ఇస్తాను. నీకు ఇంకా పదిహేనేళ్లే కదా, టీవీ చూసుకో, నీకు నచ్చినవి తిను, కేవలం నీ బ్యాటింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టు అని చెబుతూ ఉంటా" అని జితీష్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 404 పరుగులు చేశాడు.

RCB take mid-season Maldives trip ahead of crucial IPL 2026 phase4
ఐపీఎల్ సీజ‌న్ మ‌ధ్య‌లో ఆర్సీబీ ఊహించ‌ని నిర్ణ‌యం

ఐపీఎల్‌-2026 సీజ‌న్ మ‌ధ్య‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు యాజ‌మాన్యం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. షెడ్యూల్‌లో వారం రోజ‌ల పాటు గ్యాప్ రావ‌డంతో ఆర్సీబీ త‌మ ఆట‌గాళ్ల‌ను విహారయాత్ర కోసం మాల్దీవులకు పంపింది. టోర్నమెంట్ కీలక దశ ప్రారంభమయ్యే ముందు తమ ప్లేయర్లను మానసిక ఉల్లాసంగా ఉంచేందుకు ఆర్సీబీ మేనెజ్‌మెంట్ ఈ ట్రిప్ ప్లాన్ చేసింది.ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆ జట్టు స్టార్ పేసర్ జాకబ్ డఫీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. రజత్ పాటిదార్ సేన ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరింట విజయం సాధించింది. ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది. అయితే అహ్మదాబాద్ వేదికగా తాము ఆడిన చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మే 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న తమ తదుపరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లి, పడిక్కల్‌, పాటిదార్ వంటి స్టార్‌ బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ దుమ్ములేపుతున్నాడు. బెంగళూరు జట్టు బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ పటిష్టంగా ఉంది. కాబట్టి మరోసారి ఆర్సీబీ టైటిల్ సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.చదవండి: అంతా అయిపోయింది.. మాకేది కలిసి రాలేదు: హార్దిక్‌ పాండ్యా

How Mumbai Indians Can Still Qualify For IPL 2026 Playoffs-7th Loss5
అదే జ‌రిగితే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియ‌న్స్‌!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో శ‌నివారం సీఎస్‌కేతో క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓట‌మి పాలైన ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్ అవ‌కాశాల‌ను మ‌రింత క్లిష్టం చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవ‌లం రెండు విజ‌యాలు మాత్ర‌మే సాధించిన ఐపీఎల్ మాజీ చాంపియ‌న్ ఇప్పుడు ప్లేఆఫ్ చేర‌డం దాదాపు అసాధ్య‌మే. అయితే కొంత అదృష్టం క‌లిసి రావ‌డంతో మిగిలిన 5 మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధిస్తే మాత్రం ముంబైకి ప్లేఆఫ్ అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్పొచ్చు. కానీ ప్లేఆఫ్స్ చేరే క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్‌ ముందున్న దారి చాలా కఠినమ‌ని చెప్పొచ్చు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో, 4 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది. జట్టు నెట్ రన్ రేట్ (-0.803) సైతం చాలా దారుణంగా ఉండటం గ‌మ‌నార్హం. ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. అయితే ప్రస్తుతం ముంబై వద్ద ఉన్నది కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే. అంటే, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై తన మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ క‌చ్చితంగా గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒకవేళ ముంబై అదృష్టం క‌లిసి వ‌చ్చి ఐదు మ్యాచ్‌లు గెలిచి న‌ప్ప‌టికీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి. అదే స‌మ‌యంలో ముంబై తాము ఆడ‌బోయే ఐదింటిలో ఒక్క‌టి ఓడినా సీజ‌న్‌లో వారి ప్ర‌యాణం ముగిసిన‌ట్లే. ముంబై త‌మ త‌ర్వాతి మ్యాచ్‌ల్లో భాగంగా సోమ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో, మే 10న రాయ్‌పూర్ వేదిక‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, మే 14న టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్‌తో ధర్మ‌శాల‌లో తలపడాల్సి ఉంది. ఆ తర్వాత మే 20న‌ కోల్‌క‌తా నైట్ రైడర్స్‌, మే 24న రాజస్తాన్ రాయ‌ల్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ ఐదింటిలో గెల‌వ‌డంతో పాటు ర‌న్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. గణాంకాల పరంగా అవకాశం ఉన్నప్పటికీ, ముంబై ప్రస్తుత ఫామ్ చూసుకుంటే మాత్రం అద్భుతం జరిగితే తప్ప ప్లేఆఫ్స్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.చదవండి: ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై.. వీడియో వైర‌ల్‌!

Hardik Pandya hints at MIs early exit after CSK defeat in IPL 20266
అంతా అయిపోయింది.. మాకేది కలిసి రాలేదు: హార్దిక్‌ పాండ్యా

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కథ దాదాపు ముగిసినట్లే. శనివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ విఫలం కావడంతో ముంబై ఈ ఘోర ఓటమిని మూట కట్టుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని సీఎస్‌కే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై బౌలర్లు మరోసారి విఫలమయ్యారు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ తాము మెరుగ్గా రాణించలేకపోయామని హార్దిక్ చెప్పుకొచ్చాడు."కేవలం ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు, సీజన్ మొత్తం మాకు కలిసిరాలేదు. ఈ రోజు సీఎస్‌కే అన్ని విభాగాల్లో మాకంటే మెరుగైన ప్రదర్శన చేశారు. ఒకానొక దశలో మా స్కోర్ ఈజీగా 190 దాటుతుందని అని అనుకున్నాము. కానీ 10 ఓవర్ల తర్వాత మా రిథమ్‌ను కోల్పోయాం. చివర్లో మెరుపులు మెరిపించడంలోనూ విఫలమయ్యాం.ఒకవేళ ఈ పిచ్‌పై 180 నుంచి 190 పరుగుల స్కోర్ వచ్చి పరిస్థితి మరో విధంగా ఉండేది. పిచ్ కాస్త స్లోగా ఉంది. అందుకే క్రీజులోకి రాగానే షాట్లు ఆడేందుకు కష్టమైంది. క్రీజులో సెటిల్ అయిన ప్రత్యర్ధి జట్టు బ్యాటర్లు సైతం ఇబ్బంది పడ్డారు. లెక్కలతో కూడిన క్రికెట్ ఆడటం చాలా అవ‌సరం. కానీ ఈ రోజు మా బ్యాట‌ర్లు బంతిని స‌రిగ్గా హిట్ చేయ‌లేక‌పోయారు. వారు మాకంటే బాగా బ్యాటింగ్ చేశార‌ని హార్దిక్ పేర్కొన్నాడు.అదేవిధంగా బౌలింగ్‌లో మీరు మరింత దూకుడుగా ఉండాల్సిందా? అన్న ప్ర‌శ్న కూడా పాండ్యాకు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో ఎదురైంది. అందుకు హార్దిక్ కాస్త వ్యంగ్యంగా స‌మాధ‌న‌మిచ్చాడు. "ఇంకా ఎంత దూకుడుగా ఉండాలో నాకు తెలియ‌దు. బహుశా వాళ్లను అవుట్ చేయడానికి నిప్పులు కురిపించే బంతులు వేయాలేమో. మా ద‌గ్గ‌ర ఉన్న ఆప్ష‌న్స్‌తోనే మేము బరిలోకి దిగాము" అని పాండ్యా వ్యాఖ్య‌నించాడు.చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’

Rumours CSK Star MS Dhoni Silently Retired From IPL Video Viral7
ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై.. వీడియో వైర‌ల్‌!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌ది చెర‌గ‌ని ప్ర‌స్థానం. ఐదుసార్లు ఐపీఎల్ చాంపియ‌న్ స‌హా అత్య‌ధిక సార్లు ఫైన‌ల్స్ ఆడిన జ‌ట్టుగా, ఎక్కువ‌సార్లు ప్లేఆఫ్ చేరిన జ‌ట్టుగా సీఎస్‌కే చ‌రిత్ర సృష్టించింది. వీట‌న్నింటికి మూల కార‌ణం ఎంఎస్ ధోని అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ధోని ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. గాయంతో తొలి అంచె పోటీల‌కు దూరంగా ఉన్న ధోని గాయం నుంచి కోలుకున్న‌ప్పటికీ రెండో అంచె పోటీల్లోనూ బ‌రిలోకి దిగ‌లేదు. దీంతో ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ట్లేనంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తూ ధోనికి సీఎస్‌కే జట్టు సభ్యులు గాడ్ ఆప్ ఆన‌ర్ ఇచ్చిన వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విష‌యంలోకి వెళితే.. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్ ముగిసిన త‌ర్వాత సీఎస్‌కే జ‌ట్టు స‌భ్యులు ధోనికి హార్డ్ ఆఫ్ గాన‌ర్ ఇవ్వ‌డం క‌నిపించింది. సీఎస్‌కే సాధించిన ఐదు ఐపీఎల్ ట్రోఫీలతో పాటు చాంపియ‌న్స్ లీగ్ ట్రోఫీలు, ధోని సాధించిన ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల‌ను స్టాండ్స్‌పై ఉంచారు. ఆ త‌ర్వాత ఆట‌గాళ్లంతా ధోనికి చ‌ప్ప‌ట్ల‌తో స్టేజీ మీద‌కు ఆహ్వానించారు.ఆ త‌ర్వాత ప్ర‌స్తుత సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌తో క‌లిసి ధోని తాను ఐపీఎల్‌లో సాధించిన ఐదు ట్రోఫీల‌తో ఫొటో సెష‌న్‌కు ఫోజిచ్చాడు. ఆ త‌ర్వాత సైలెంట్‌గా కింద‌కు దిగిన ధోని త‌ల‌ను కింద‌కు వేసుకుంటూ భారంగా అడుగులు వేయ‌డం క‌నిపించింది. ఇదంతా చూస్తుంటే ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లుగా అనిపిస్తోంది. సీఎస్‌కే సొంత‌గ‌డ్డ‌పై మ్యాచ్ ఆడ‌డం మ‌రో ముఖ్య విష‌యం. ఇదే మంచి త‌రుణ‌మ‌ని భావించిన ధోని సీఎస్‌కే అభిమానుల స‌మ‌క్షంలో ఐపీఎల్‌కు గుడ్‌బై ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ధోని సీజ‌న్‌లో ఒక్క మ్యాచ్ ఆడ‌కుండానే వీడ్కోలు ప‌ల‌క‌డంపై సీఎస్‌కే అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇది నిజం కాద‌ని, క‌చ్చితంగా ధోని మాకోసం ఒక మ్యాచ్ ఆడి తీరుతాడ‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేశారు. 2023లో ఆఖ‌రిసారి ధోని నేతృత్వంలో ఐపీఎల్ చాంపియ‌న్‌గా నిలిచిన సీఎస్‌కే ఆ త‌ర్వాత రెండు సీజ‌న్ల‌లో లీగ్ ద‌శ‌కే ప‌రిమిత‌మైంది. ఐపీఎల్‌లో ధోని ఇప్ప‌టివ‌ర‌కు 278 మ్యాచ్‌లాడి 5,439 ప‌రుగులు సాధించాడు. ఇందులో 24 అర్థశ‌త‌కాలు ఉన్నాయి. 2023 సీజ‌న్ త‌ర్వాత ధోని నుంచి రుతురాజ్ గైక్వాడ్ పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్య‌తలు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో సీఎస్‌కే ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌ల్లో మూడు విజ‌యాలు మాత్ర‌మే సాధించి ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది.ప్లేఆఫ్ చేరాలంటే ఇక‌పై సీఎస్‌కే మిగిలిన ఐదు మ్యాచ్‌లు క‌చ్చితంగా గెల‌వాల్సిందే. ఏ ఒక్క‌టి ఓడినా సీఎస్‌కే ప్లేఆఫ్ అవ‌కాశాలు మరింత సంక్లిష్టమవుతాయి. ఇక శనివారం ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.Bro silently retired and we didn't notice it 💔 pic.twitter.com/nOygR2qcaB— GOAT¹⁸ 🇬🇧 (@SaviorKohli) May 2, 2026చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’

France Beat India 3-0 in Thomas Cup Semis-Settle For Bronze Medal 8
​కాంస్యంతో సరి.. సెమీస్‌లో భారత్‌ పరాజయం!

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. ఫ్రాన్స్‌తో జరిగిన ఈ పోరులో 0–3తో వరుస సింగిల్స్‌ మ్యాచ్‌లలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో ఆయుశ్‌ శెట్టి 11–21, 9–21 స్కోరుతో క్రిస్టో పొపోవ్‌ చేతిలో ఓడిపోయాడు. 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. రెండో సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ కూడా ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు. 16–21, 18–21తో వరుస గేమ్‌లలో అలెక్స్‌ లేనియర్‌ చేతిలో పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్‌ కూడా 41 నిమిషాల్లో ముగిసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో సింగిల్స్‌లో కూడా హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టోమా జూనియర్‌ పొపోవ్‌ 21–19, 21–16తో ప్రణయ్‌ను 48 నిమిషాల్లో చిత్తు చేశాడు. సెమీస్‌లో ఓటమితో భారత్‌ కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. ఫలితం తేలిపోవడంతో తర్వాతి రెండు డబుల్స్‌ మ్యాచ్‌ల అవసరం రాలేదు. మోచేతి గాయం కారణంగా లక్ష్య సేన్‌ ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’

Former Cricketer Manoj Tiwary Says No One Supports Hardik Pandya9
‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ అత్యధిక టైటిల్స్ విషయంలో సీఎస్‌కేతో కలిసి సమానంగా ఉంది. అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో మాత్రం ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే 9 మ్యాచ్‌లాడిన ముంబై ఏడు పరాజయాలు చవిచూసింది. శనివారం సీఎస్‌కేతో మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు గల్లంతు చేసుకున్నట్లే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముంబై ప్లేఆఫ్ చేరడం కష్టం. ఇక కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. మ్యాచ్ ఓటములను తట్టుకోలేక సహచరులపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ జట్టులో విద్వేశం పెరిగిపోయిందని, అతడికి జట్టులో కనీస మద్దతు కరువయిందంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. జట్టు పేలవ ప్రదర్శనకు పాండ్యాను ఒక్కడినే నిందించడం తగదని పేర్కొన్నాడు. క్రిక్‌బజ్‌తో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. జట్టు వైఫల్యాలకు కెప్టెన్ పాండ్యాను విమర్శిస్తున్నారు. కానీ అతడికి జట్టు నుంచి సరైన మద్దతు లేదనిపిస్తోంది. కెప్టెన్‌గా పాండ్యా చేయాల్సింది చేస్తున్నాడు. జట్టులో ఆటగాళ్లు సరిగ్గా ఆడడం లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో సూపర్‌స్టార్‌గా పేరుపొందిన సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమవుతున్నాడు. తిలక్ వర్మ ఒక్క మ్యాచ్ మినహా మళ్లీ రాణించింది లేదు. జట్టులో నిలకడ ప్రదర్శన లేనప్పుడు పాండ్యాను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం లేదు. కలిసికట్టుగా ఆడినప్పుడే జట్టుకు విజయాలు లభిస్తాయి. కానీ ముంబై ఇండియన్స్‌లో ఇప్పుడు అది మిస్సయింది. రోహిత్ గాయంతో డగౌట్‌కు పరిమితమవ్వడం, బుమ్రా, సూర్య, తిలక్ వంటి ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం ముంబైని దెబ్బ​కొట్టాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ పాండ్యాను విమర్శించడం తగదు. అతడి ప్రవర్తనతో ఆటగాళ్లు క్రమంగా విద్వేషం పెంచుకుంటున్నారనిపిస్తుంది. అందుకే అతడికి జట్టు నుంచి మద్దతు కరువయ్యింది. ఇక 9 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలను వదిలేసుకున్న ముంబై ఇండియన్స్‌కు అదృష్టం తోడవ్వాలి. ఎందుకంటే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. మరోవైపు టాప్‌-4లో ఉన్న పంజాబ్‌కు ఆరు మ్యాచ్‌లు, ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ఐదేసీ మ్యాచ్‌లు, రాజస్తాన్‌కు నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ముంబై ప్లేఆఫ్ చేరాలంటే ఈ జట్లు తమ మ్యాచ్‌లన్నీ ఓడిపోవాలి. కానీ 99 శాతం ఇది జరగని పని. కాబట్టి ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ప్లేఆఫ్ ఆశలు పక్కనబెట్టి విజయాలు సాధించి గౌరవంగా నిష్క్రమించడం మంచిది’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ‘నేను క్రెడిట్‌ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్‌’

CSK Captain Ruturaj Gaikwad Winning Comments I Wont Take Credit10
‘నేను క్రెడిట్‌ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్‌’

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ త‌మ ప్లేఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ అజేయ అర్థ‌సెంచ‌రీ సాధించి జ‌ట్టును గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన‌ కార్తిక్ శ‌ర్మ కూడా అజేయ హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. సీజ‌న్‌లో నాలుగో విజ‌యం అందుకున్న సీఎస్‌కే 8 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో ఉంది. మ్యాచ్ ముగిసిన అనంత‌రం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. నిజానికి ఈ మ్యాచ్ విన్నర్ తాను కాదని, ఇంపాక్ట్‌గా వచ్చి అజేయ అర్థసెంచరీతో అదరగొట్టిన కార్తిక్ శర్మకు క్రెడిట్ ఇవ్వాలని రుతురాజ్ తెలిపాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని చెప్పాడు. రుతురాజ్‌ మాట్లాడుతూ..'చాలా సంతోషంగా ఉంది. మేం మొదట బాగానే ప్రారంభించాం. కానీ మధ్యలో ముంబై ఇండియన్స్ పుంజు కుంది. అయితే మేం మళ్లీ మ్యాచ్‌ను మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం. మొదటి కొన్ని ఓవర్లను తట్టుకుని నిలబడటం.. ఆపై టాప్ త్రీ బ్యాటర్లలో ఒకరు చివరి వరకు ఉండటం కీలకమని మేం భావించాం. ఇక అన్షుల్‌ కంబోజ్‌ చాలా నిలకడగా రాణిస్తున్నాడు. తన ప్రక్రియను అనుసరిస్తున్నాడు. అతని ఆలోచనా తీరు ఒక బ్యాటర్ లాగా ఉంటుంది. నూర్ కూడా కొన్ని మార్పులు చేసుకుని బాగా రాణిస్తున్నాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే అఖీల్ హుస్సేన్‌ను ఆడించలేదు. 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని, అదనపు బౌలర్ ఉండాలని ఆలోచించాం. ప్రశాంత్ వీర్, ఘోష్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలరు. మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ చెబుతున్నట్లుగా.. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. అయితే ఇది టీ20 క్రికెట్. సరైన సమయం కోసం వేచి చూశాను. కార్తీక్ శర్మకు ఈ ఇన్నింగ్స్ మంచి బూస్ట్‌లాంటిది. అతను సిక్సర్లు కొట్టగలడు. కానీ అతను బంతులను ఎంచుకొని ఆడిన తీరు బాగుంది. అతను ఫామ్ కొనసాగిస్తే జట్టుకు ప్రయోజనం. మేం ఆటను చాలా సింపుల్‌గా ఉంచుతున్నాం. తప్పులు జరుగుతుంటాయి కానీ బలంగా తిరిగి రావాలి. ఈ జెర్సీ, అభిమానుల కోసం మా సర్వస్వం ఇస్తాం.’ అని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.Trusting the process and letting the bat do the talking 💛🎥 Skipper Ruturaj Gaikwad talks about finding his rhythm and the match-winning knock 🗣️#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL | @Ruutu1331 pic.twitter.com/VZ2T0hqcYZ— IndianPremierLeague (@IPL) May 2, 2026చదవండి: ముంబై ఇండియ‌న్స్ ప్రపంచ రికార్డు!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement