ప్రధాన వార్తలు
‘ఆ ఫీట్ను శ్రేయస్ మాత్రమే సాధిస్తాడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్లు విజయవంతమైన కెప్టెన్లుగా ముద్రపడ్డారు. ఇందులో ధోని, రోహిత్లు ఐదేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా.. గంభీర్ సారథ్యంలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తాజాగా వీరి సరసన చేరేందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిద్ధమవుతున్నాడు. 2024లో కేకేఆర్కు మూడోసారి టైటిల్ అందించిన శ్రేయస్ లక్కీ కెప్టెన్గా మారిపోయాడు. జట్లు మారినప్పటికీ తన కెప్టెన్సీ, ఆటతీరుతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా అయ్యర్ పేరు సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ను అయ్యర్ విజేతగా నిలబెడితే ధోని, రోహిత్ శర్మను కూడా అధిగమిస్తాడని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జియో హాట్స్టార్కు ఇంటర్య్వూ ఇచ్చిన పఠాన్ మాట్లాడుతూ.. 'ధోని, రోహిత్, గంభీర్ వంటి అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్లను దాటుకొని మరీ తొలి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే ధోని, రోహిత్, గంభీర్లు ఒకే జట్టుకు టైటిల్స్ అందించారు. కానీ అయ్యర్ మాత్రం ఇప్పటికే కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు కూడా టైటిల్ అందిస్తే వేర్వేరు జట్లకు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్గా అయ్యర్ నిలవనున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ ఇలా మూడు వేర్వేరు జట్లను కూడా ఐపీఎల్లో ఫైనల్ చేర్చిన ఘనత అయ్యర్ సొంతం. ఒకవేళ అయ్యర్ ఈ సీజన్లో అది సాధిస్తే మాత్రం అతడి రికార్డు చెరిగిపోనిదిగా మిగిలిపోతుంది' అని పఠాన్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న అయ్యర్ 2020 సీజన్లో ఆ జట్టును రన్నరప్గా నిలిపాడు. ఆ తర్వాత కేకేఆర్కు మారిన శ్రేయస్ అయ్యర్ 2024 సీజన్లో ఆ జట్టును చాంపియన్గా నిలిపాడు. 2025 సీజన్లో పంజాబ్ను ఫైనల్ చేర్చిన అయ్యర్ 2026 సీజన్లోనూ ఆ జట్టును టైటిల్ దిశగా అడుగులు వేయిస్తున్నాడు. పంజాబ్ తరఫున 33 మ్యాచ్లు, ఢిల్లీ తరఫున 41 మ్యాచ్లు, కేకేఆర్ తరఫున 29 మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా పనిచేశాడు. అతని సక్సెస్ రేటు 90 శాతం ఉండడం గమనార్హం.చదవండి: ‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ!’
IPL 2026: అభిషేక్ శర్మ (35) ఔట్.. తొలి వికెట్ డౌన్
ఐపీఎల్ 2026 సీజన్లో హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా 49వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి.అభిషేక్ శర్మ (35) ఔట్పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతుల్లో 35 పరుగులతో దూకుడు ప్రదర్శించిన అభిషేక్ శర్మ ఫెర్గూసన్ బౌలింగ్లో అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.టాస్ పంజాబ్దేటాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. ఎస్ఆర్హెచ్ జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వగా.. పంజాబ్ జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో ఎస్ఆర్హెచ్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఎస్ఆర్హెచ్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 25 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 17 సార్లు, పంజాబ్ 8 సార్లు నెగ్గింది. ఇక హైదరాబాద్లో పంజాబ్తో ఆడిన 10 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ 9 సార్లు నెగ్గితే.. పంజాబ్ ఒకసారి మాత్రమే గెలిచింది.తుదిజట్లు:పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రియాంష్ ఆర్య, హర్ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్సన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్లు: అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్
ప్రపంచ కప్ జట్టు ప్రకటన
తమ తొలి టీ20 ప్రపంచకప్ కోసం నెదర్లాండ్స్ మహిళల క్రికెట్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా బాబెట్ డి లీడేను ఎంపికైంది. బాబెట్కు క్రికెట్ వారసత్వం ఉంది. ఆమె మామ టిమ్ డి లీడే, కజిన్ బాస్ డి లీడే ఇప్పటికే పురుషుల వరల్డ్ కప్లలో నెదర్లాండ్స్ తరఫున ఆడారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన బాబెట్ డి లీడే మహిళల టీ20 ప్రపంచకప్ జట్టుకు నాయకత్వం వహించనుండటం విశేషం.కాగా, మహిళల టీ20 ప్రపంచకప్ 2026 జూన్ 12 నుంచి ఇంగ్లండ్లోని వివిధ వేదికల్లో జరుగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడనున్నాయి. నెదర్లాండ్స్ జట్టు భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లాంటి పటిష్టమైన జట్లు ఉన్న గ్రూప్-ఏలో ఉంది. ఈ జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 14న బంగ్లాదేశ్తో ఆడనుంది. అనంతరం భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్లతో ఆడనుంది. కాగా, నెదర్లాండ్స్ జట్టు ఈ ఏడాది నేపాల్లో జరిగిన గ్లోబల్ క్వాలిఫయర్లో కీలక విజయాలు సాధించి, తొలిసారి వరల్డ్ కప్కు అర్హత సాధించింది.నెదర్లాండ్స్ జట్టు: బాబెట్ డి లీడే (సి), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, హన్నా లంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్హూయిస్, మిర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్బోర్, రాబిన్ రిజ్కే, రోస్లీ లారెన్స్, సాన్యా ఖురానా, సిల్వర్ సీగర్స్, స్టెర్రే కాలిస్
‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ!’
బ్యాడ్మింటన్లో థామస్ కప్కు ఉండే ప్రత్యేకత వేరు. చైనా, మలేషియా, జపాన్ లాంటి దేశాల్లో బ్యాడ్మింటన్ ఆటకు ఉన్న క్రేజ్ కూడా వేరు. భారత్లోనూ పీవీ సింధు, సైనా నెహ్వాల్, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ జోడి చిరాగ్-సాత్విక్ జోడి బ్యాడ్మింటన్లో అంచనాలు అందుకుంటూ పతకాలు సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా కూడా భారత్లో క్రికెట్ను మినహాయించి ఏ క్రీడను అంతగా పట్టించుకోరన్నది చాలాసార్లు రుజువైంది. తాజాగా జర్మనీ వేదికగా జరిగిన థామస్ కప్లో భారత పురుషుల బృందం కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే థామస్ కప్లో పతకం సాధించి భారత్కు తిరిగి వస్తే తమను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదంటూ భారత ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. జర్మనీ ఎయిర్పోర్టులో భారతీయులు ఉన్నా కూడా తమ దగ్గరకు రాలేదని, ఇక భారత్లో అయితే కనీసం తమ ముఖాలు కూడా చూడలేదని డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ బాధను వ్యక్తం చేశాడు. దేశానికి పతకాలు సాధించినా తమకు తగిన గుర్తింపు లేకపోవడం షట్లర్లుగా తమకు నిరాశ కలిగించిందన్నాడు. ఇలాంటి అవమానాలతో భారత్లో బ్యాడ్మింటన్ వంటి క్రీడను వృత్తి పరంగా కొనసాగించాలా వద్దా అనేది ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నట్లు తెలిపాడు. సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ.. ‘జర్మనీ నుంచి ఏడు గంటల పాటు విమాన ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నాం. మేము జర్మనీ ఎయిర్పోర్టులో ఉన్నప్పుడు మా కాంస్య పతకాలు చూసిన కొందరు.. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడగలేదు. అందులో భారతీయులతో పాటు చాలా మంది తెలుగువాళ్లు కూడా ఉన్నారు. మేమంతా థామస్ కప్ జెర్సీలు ధరించి ఉన్నప్పటికీ, వాళ్లంతా ఐపీఎల్, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. 2022లో ఇదే థామస్ కప్లో స్వర్ణం సాదించినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలాంటి ఘనతలు సాధించినప్పుడు సంబరాలు చేసుకోవాలి. ఇలాంటి అవకాశాలు తరచూ రావని మన అభిమానులకు తెలియడం లేదు. థామస్ కప్ గెలవడం చాలా కష్టం, పతకాలు సాధించడం కూడా కష్టతరం. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత ప్రణయ్, శ్రీకాంత్, ధ్రువ్ క్యాబ్లు బుక్ చేసుకోవడం చూశాను. అభినందించడానికి ఒక్కరు కూడా మా దగ్గరికి రాలేదు. నా స్నేహితులు నన్ను పిక్ చేసుకునేందుకు వచ్చారు. కానీ ఎయిర్పోర్ట్లో నా సహచర ఆటగాళ్లు క్యాబ్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నాలు సాగించడం బాధగా అనిపించింది. టోర్నీల్లో బరిలోకి దిగి గాయపడితే.. మన బదులు ఆడేందుకు ఎవరూ ఉండరు. టీమ్ ఈవెంట్స్లోనూ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. బయట నుంచి పెద్దగా సపోర్ట్ లేకుండా ఆడతాం. పతకాలు గెలిచినా సరిపోవడం లేదు. ఓ సందర్భంలో ప్రణయ్తో.. 'ఈ క్రీడకు ఎలాంటి గుర్తింపులేదు. నేను నా పిల్లలను బ్యాడ్మింటన్ వైపు రానివ్వను' అని చెప్పా. మానసికంగా దృఢంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే మనం ఎంత ప్రదర్శన చేసినా గుర్తించకపోతే చాలా బాధేస్తుంది. హైదరాబాద్ అకాడమీలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం వరకే ఆశిస్తున్నాం’అని సాత్విక్ బాధాతప్త హృదయంతో వెల్లడించాడు.చదవండి: పాక్తో ఆడేది లేదు.. వాళ్లకు మాత్రం మినహాయింపు!
భారత్ లేకుండా టోర్నీ.. పాక్ అభ్యర్ధనకు శ్రీలంక అంగీకారం
అంతర్జాతీయ వేదికపై భారత్కు వ్యతిరేకంగా శ్రీలంక క్రికెట్ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. టీమిండియా లేకుండా పాకిస్తాన్తో వన్డే ట్రై సిరీస్ ఆడేందుకు అంగీకారం తెలిపింది. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం భారత్కు కాస్త కటువగా ఉండనుంది. ఎందుకంటే శ్రీలంక లాంటి మిత్రదేశం పాక్తో క్రికెట్ సంబంధాలు కొనసాగించడం బీసీసీఐకి ఇష్టం ఉండదు. పాక్ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో మూడో జట్టుగా ఇంగ్లండ్ ఉండనుంది. ఈ టోర్నీ అక్టోబర్-నవంబర్లో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీకి వేదికలు ఖరారు కావాల్సి ఉంది. లాహోర్, కరాచీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా ఈ టోర్నీని ప్లాన్ చేసుకున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పాక్లో ట్రై సిరీస్ కంటే ముందే శ్రీలంకతో టీ20 సిరీస్ జరుగనుంది. ట్రై సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా జరగాల్సి ఉంది. ఈ టెస్ట్ సిరీస్ నవంబర్లో జరిగే అవకాశం ఉంది.బంగ్లాదేశ్లో పర్యటించనున్న పాక్రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మే 8 నుంచి ఢాకా వేదికగా జరుగనుంది. అనంతరం రెండో టెస్ట్ మే 16 నుంచి సిల్హెట్ వేదికగా జరుగనుంది.బంగ్లాదేశ్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (సి), అబ్దుల్లా ఫజల్, అమద్ బట్, అజాన్ అవాయిస్, బాబర్ ఆజం, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), సాజిద్ ఖాన్, నౌమాన్ అలీ, సల్మాన అఘా, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది
ముంబై ఇండియన్స్కు మరో బిగ్ షాక్
ముంబై ఇండియన్స్కు మరో భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో గత మ్యాచ్లో (లక్నో) కెప్టెన్గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్ క్యాంప్ను వీడాడని సమాచారం. హార్దిక్ గాయం కారణంగా ఆర్సీబీతో జరుగబోయే తదుపరి మ్యాచ్కు (మే 10న) కూడా దూరమయ్యాడని తెలుస్తోంది. హార్దిక్ ఇవాళ (మే 6) జట్టుతో కలిసి రాయ్పూర్కు (ఆర్సీబీ మ్యాచ్కు వేదిక) వెళ్లే ఫ్లైట్ ఎక్కలేదు. దీంతో అతను ఆర్సీబీ మ్యాచ్లో ఆడే అవకాశం కనిపించడం లేదు.మరోవైపు ఆర్సీబీ మ్యాచ్కు సూర్యకుమార్ కూడా అందుబాటులో ఉండడని సమాచారం. సూర్యకుమార్ త్వరలో తండ్రి కానున్న నేపథ్యంలో భార్యకు దగ్గరగా ఉండేందుకు జట్టును వీడినట్లు తెలుస్తోంది. ఇద్దరు కెప్టెన్లు ఒకేసారి జట్టుకు అందుబాటులో లేకపోవడం మినుకుమినుకుమంటున్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేయనుంది.వీరి గైర్హాజరీలో కెప్టెన్సీ ఎవరు చేపడతారన్న అంశం ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అభిమానులను సందిగ్దంలో పడేస్తుంది. రోహిత్ శర్మ కాకుండా బుమ్రా, తిలక్ వర్మ, రికెల్టన్ రూపంలో మూడు ఆప్షన్లు ఉన్నా, ఎవరన్నదే ప్రశ్నార్థకం.ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్ గత మ్యాచ్లో లక్నోపై గెలిచినా, ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్లే అనుకోవాలి. టెక్నికల్గా రేసులో ఉన్నా, ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే చాలా అద్భుతాలు జరగాలి. ఇప్పటివరకు ఆ జట్టు 10 మ్యాచ్ల్లో మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్ల కోసం ఇప్పటికే 6 జట్ల మధ్య ప్రధాన పోటీ జరుగుతుంది. ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ సహా ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, గుజరాత్, సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్ల కొసం నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. ఈ జట్లను దాటి తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై ప్లే ఆఫ్స్ రేసులోకి రావడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి.
పాక్తో ఆడేది లేదు.. వాళ్లకు మాత్రం మినహాయింపు!
పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లకు సంబంధించి భారత ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడేది లేదని క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. అయితే భారత్లో జరిగే మల్టీ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లో మాత్రం పాకిస్తాన్ అథ్లెట్లు పాల్గొనేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ క్రీడా సమాఖ్య, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సంయుక్తంగా సర్క్యులర్ విడుదల చేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్తో పాటు 2036 ఒలింపిక్స్ను నిర్వహణకు భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్ చార్టర్, అంతర్జాతీయ క్రీడా మార్గదర్శకాలను అనుసరించనున్నట్లు తెలిపింది. అయితే పాకిస్తాన్తో మాత్రం ఎలాంటి ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు ఉండవని, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఐసీసీ, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ వంటి టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్తాన్తో తలపడుతుందని క్రీడాశాఖ పునరుద్ఘాటించింది. తాజాగా విడుదల చేసిన సర్క్యులర్తో పాకిస్తాన్తో ప్రస్తుతం ఉన్న క్రీడా విధానం యథాతథంగా కొనసాగనుంది. దీంతో సమీప భవిష్యత్తులో అటు భారత్లో కానీ, ఇటు పాకిస్తాన్లో కానీ ఇరు దేశాల మధ్య క్రికెట్, హాకీ సహా ఇతర క్రీడా సిరీస్లు జరగవు. అయితే పాకిస్తాన్ అథ్లెట్లకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుందని, ఎందుకంటే వారి వ్యక్తిగత కెరీర్ను దెబ్బతీసే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని పేర్కొంది. భారత్లో జరిగే అథ్లెటిక్స్ ఈవెంట్లు ఏవైనా పాక్ అథ్లెట్లు పాల్గొనడానకి అవకాశమిస్తామని కేంద్ర క్రీడాశాఖ నొక్కి చెప్పింది. గతేడాది ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడి ఘటనలో 26 మంది అమాయక ప్రాణాలు బలిగొన్న తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. నిజానికి 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రీడా సిరీస్లు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్, పాకిస్తాన్లు తలపడుతున్నాయి. చివరగా 2026 టీ20 ప్రపంచకప్లో పాక్తో మ్యాచ్ ఆడిన భారత్ ఘన విజయాన్ని సాధించింది.చదవండి: బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు!
కోహ్లి సహచరుడు, పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్ ఆకస్మిక మృతి
ఐపీఎల్ 2026 మధ్యలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ పంజాబ్ క్రికెటర్, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి అండర్ 19 జట్టు సహచరుడు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) మాజీ ఆటగాడు అమన్ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మికంగా కన్నుమూశాడు. ఆతని వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. గిల్ మృతికి గల కారణాలు తెలియరాలేదు.Punjab Cricket Association deeply mourns the sad demise of Amanpreet Singh Gill, former Punjab cricketer and Member, Senior Selection Committee Punjab.He served Punjab cricket with dedication and passion, representing teams including India Under-19s, Kings XI Punjab and Punjab.… pic.twitter.com/tpr0EwEprk— Punjab Cricket Association (@pcacricket) May 6, 2026చండీగఢ్లో జన్మించిన అమన్ప్రీత్ సింగ్ గిల్, పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు భారత అండర్-19 జట్టు తరఫున కూడా ఆడాడు. అలాగే ఐపీఎల్ ప్రారంభ దశలో పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) జట్టులో భాగంగా ఉన్నాడు.క్రికెట్కు రిటైర్మెంట్ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.కోహ్లీతో కలిసి అండర్-19లోఅమన్ప్రీత్ గిల్, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లితో కలిసి 2007లో అండర్-19 ప్రపంచకప్లో ఆడాడు. ఆ టోర్నీలో 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి మంచి ప్రతిభ చాటాడు.అమన్ప్రీత్ గిల్ మృతిపై పంజాబ్ క్రికెట్ అసోసిచయేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. "పంజాబ్ క్రికెట్కు అంకితభావంతో సేవలందించిన అమన్ప్రీత్ సింగ్ గిల్ మరణం చాలా బాధాకరం" అని పేర్కొంది. అమన్ప్రీత్ అంత్యక్రియలు ఇవాళ (మే 6) చండీగఢ్లోని మణిమజ్రా శ్మశానవాటికలో నిర్వహించారు. అమన్ప్రీత్ గిల్ మృతికి సంతాపంగా ఇవాళ జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్బ్యాండ్లు ధరించే అవకాశం ఉంది.
బిగ్ న్యూస్.. జట్టుకు దూరంగా హార్దిక్
ఐపీఎల్ 2026 నేపథ్యంలో ముంబై ఇండియన్స్కు సంబంధించి బిగ్ న్యూస్ అందుతుంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుతో కలిసి తదుపరి మ్యాచ్కు (ఆర్సీబీ) వేదిక అయిన రాయ్పూర్కు వెళ్లలేదు. ఈ విషయం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ ఉద్దేశపూర్వకంగా జట్టుకు దూరంగా ఉన్నాడా.. లేక యాజమాన్యమే అతన్ని దూరం పెట్టిందా అని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.కాగా, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక జట్టు ప్రదర్శన దారుణంగా మారిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ముంబై ప్రదర్శన మరీ ఘోరంగా ఉంది. కెప్టెన్గా, ఆటగాడిగా హార్దిక్ పూర్తిగా చేతులెత్తేశాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఏకంగా 7 పరాజయాలు ఎదుర్కొని ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా అసాధ్యం చేశాడు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.వ్యక్తిగతంగానూ హార్దిక్ దారుణ ప్రదర్శనలు చేశాడు. 8 మ్యాచ్ల్లో కేవలం 146 పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీశాడు. వరుస పరాజయాల తర్వాత హార్దిక్ గత మ్యాచ్లో (లక్నో) ఆడలేదు. ఆ మ్యాచ్లో సూర్యకుమార్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి జట్టును గెలిపించాడు. టాస్ సమయంలో స్కై హార్దిక్ గురించి మాట్లాడుతూ.. అనారోగ్యం అని సర్ది చెప్పాడు. అయితే అప్పుడు హార్దిక్ గైర్హాజరీకి కారణం వేరని తెలుస్తుంది.మేనేజ్మెంట్ ఘాటుగా మందలించడంతో హర్ట్ అయ్యి జట్టుకు దూరంగా ఉంటున్నాడని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా హార్దిక్ జట్టుతో కలిసి ప్రయాణించకపోవడం పై ప్రచారానికి మరింత బలాన్నిస్తుంది. హార్దిక్ త్వరలో జట్టుతో కలుస్తాడని సహచరులు చెబుతున్నా, అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ముంబై పని దాదాపుగా అయిపోయినట్లే. అధికారకంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నా, అది జరిగే పని కాదు. దీంతో హార్దిక్ ముందే జట్టు నుంచి తప్పుకుని ఉండవచ్చు. కాగా, మే 10న రాయ్పూర్ వేదికగా జరుగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.
ఇక ధోని కెరీర్ ముగిసినట్లే..!
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా విజయాల బాట పట్టి, అమాంతం ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. తాజాగా ఢిల్లీపై విజయానంతరం ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా మెరుగయ్యాయి. ప్రస్తుతం సీఎస్కే మెరుగైన రన్రేట్ కలిగి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో 4 మ్యాచ్లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ప్లే ఆఫ్స్ బెర్త్పై ధీమాగా ఉంది. ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుంది.అన్నీ సవ్యంగా సాగుతున్న తరుణంలో సీఎస్కే అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడు ధోనిని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. తలైవా ఇంకెప్పుడు బరిలోకి దిగుతాడంటూ గుసగుసలాడుకుంటున్నారు. అసలు వస్తాడా..? అని చర్చించుకుంటున్నారు. పరిస్థితిపై వాకబు చేస్తే వారనుకున్నదే నిజమయ్యేలా కనిపిస్తుంది.సీఎస్కేలోని ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు, ధోనీ ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. అందుకే ఢిల్లీతో మ్యాచ్కు అతను జట్టుతో ప్రయాణించలేదు. ధోనీ స్వయంగా చెప్పిన మాట ప్రకారం.. పూర్తి ఫిట్నెస్ సాధించే వరకు బరిలోకి దిగడు. అనధికారికంగా ధోని మరో మాట కూడా చెప్పినట్లు తెలుస్తుంది. జట్టు మంచి లయలో ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టనని అన్నట్లు సమాచారం.పైనున్న సమాచారం మేరకు.. ధోని ఈ సీజన్లో ఆడటం కష్టమే అని తేలిపోయింది. కేవలం జట్టులో స్పూర్తి నింపేందుకే అతను నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. సీజన్ మొదలై ఐదు వారాలైనా రిటర్న్ డేట్పై ఎలాంటి క్లూ లేకపోవడం ధోని ఐపీఎల్ కెరీర్ ఎండింగ్పై కూడా సంకేతాన్ని ఇస్తుంది. ఒకవేళ ధోని ఇదే సీజన్తో ఐపీఎల్కు గుడ్బై చెప్పాలనుకుంటే మాత్రం, ఈ సీజన్లోనే ఏదో ఒక మ్యాచ్లో అతన్ని చూడవచ్చు.
చైనాదే థామస్ కప్ టైటిల్
హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ క...
చరిత్ర సృష్టించాడు!
మాడ్రిడ్: పురుషుల టెన్నిస్లో ప్రపంచ నంబర్వన్ య...
చైనాకు కొరియా షాక్
హోర్సెన్స్ (డెన్మార్క్): నాలుగేళ్ల విరామం తర్వా...
కాంస్యంతో సరి.. సెమీస్లో భారత్ పరాజయం!
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ థామస్ కప్ బ్యాడ్మింట...
కోహ్లి సహచరుడు, పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్ ఆకస్మిక మృతి
ఐపీఎల్ 2026 మధ్యలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మా...
ఇక ధోని కెరీర్ ముగిసినట్లే..!
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా వి...
భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్!
వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బ...
IPL 2026: ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ ఎక్కడంటే?
ఐపీఎల్-2026 సీజన్ సంబంధించిన ఫ్లే ఆఫ్స్ షెడ్యూల్...
క్రీడలు
మళ్లీ విజయం వేటలో..ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్..సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
వీడియోలు
19 ఏళ్లలో ఒకే ఒక్కడు చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్..
వాడికి 50 కోట్లు ఇస్తే వంటిచెతొ గెలిపిస్తాడు, పంత్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫాన్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
భయం పుట్టిస్తున్న వైభవ్ బ్యాటింగ్..
IPLలో నేడు డబుల్ ధమాకా
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
IPL గేమ్ ఛేజింగ్ రూల్, IPL 2026లో 200+ పరుగుల వరద
వైభవ్ బ్యాటింగ్ పై గర్ల్ ఫ్రెండ్ ప్రశంసలు.. మొహం మాడ్చుకున్న అర్షదీప్
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
