Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: India Break Australia World Record1
T20 WC 2026: వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా

ముంబైలోని వాంఖడే స్టేడియం​ వేదికగా నిన్న (మార్చి 5) జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్‌ 7 పరుగుల తేడాతో విజయం​ సాధించి వరుసగా రెండో ఎడిషన్‌లో (2024, 2026), ఓవరాల్‌గా నాలుగోసారి (2007, 2014, 2024, 2026) ఫైనల్‌కు చేరింది.ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తాజా ఫైనల్స్‌తో భారత్‌ ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌ సంఖ్య 15కు చేరింది. గతంలో ఈ వరల్డ్‌ రికార్డు భారత్‌, ఆస్ట్రేలియా పేరిట సంయుక్తంగా ఉండేది. తాజాగా భారత్‌ ఆసీస్‌ ఆధిపత్యానికి తెరదించి, హోల్‌ అండ్‌ సోల్‌గా ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది.టీమిండియా ఫైనల్స్‌కు చేరిన ఐసీసీ టోర్నీలు.. భారత్ ఇప్పటివరకు 14 ఫైనల్స్‌లో 6 గెలిచింది, 7 ఓడింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా రద్దవగా, భారత్‌..శ్రీలంకతో పాటు సంయుక్తంగా ట్రోఫీని పంచుకుంది. - వన్డే వరల్డ్ కప్: 1983, 2011 విజయాలు, 2003, 2023 (రన్నరప్‌) - టీ20 వరల్డ్ కప్: 2007, 2024 విజయాలు, 2026 (లోడింగ్‌) - ఛాంపియన్స్ ట్రోఫీ: 2002 (సంయుక్త విజేత), 2013, 2025 విజయాలు, 2002, 2017 (రన్నరప్‌) - వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్: 2021, 2023 (రన్నరప్‌) ఐసీసీ టోర్నీల్లోఅత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన జట్లు 1. భారత్ – 15 2. ఆస్ట్రేలియా – 14 3. ఇంగ్లాండ్ – 9 4. న్యూజిలాండ్ – 8 5. వెస్టిండీస్ – 8 6. శ్రీలంక – 8 7. పాకిస్తాన్ – 7 8. దక్షిణాఫ్రికా – 3ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఢీ2026 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న జరుగనుంది. న్యూజిలాండ్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫిన్ అలెన్ 33 బంతుల్లో విధ్వంసకర సెంచరీ చేసి కివీస్‌ను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు.చరిత్రాత్మక అవకాశం టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఏ జట్టు టైటిల్‌ను రక్షించుకోలేదు. భారత్‌కు ఈసారి ఆ అవకాశం వచ్చింది. గత ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌.. చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, న్యూజిలాండ్ తమ తొలి టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతుంది.

T20 WC 2026 IND VS ENG Semis: Dhoni Humbles Sakshi Dhoni In Front Of Millions On LIVE TV After Brain Fade2
వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఆసక్తికర సంఘటన

టీ20 ప్రపంచకప్‌ 2026 రెండో సెమీఫైనల్లో భారత్‌ ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖడే స్టేడియం జరిగిన ఈ కీలక సమరాన్ని వీక్షించేందుకు అతిరథ మహారథులంతా తరలివచ్చారు. వీరిలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని జంట హైలైటైంది. వీరికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో సాక్షి (ధోని సతీమణి) ఆనందంతో ఎగిరి గంతులేస్తుండగా.. ధోని వారిస్తాడు. Sakshi Thought It Was Out And Jumped Outta Seat, MS Dhoni Had To Calm Her Down 🤌😭Moment hai ! 🥹💛pic.twitter.com/E3ZLz9xuLv https://t.co/2LJZGzyYzV— Abhinav MSDian™ (@Abhinav_hariom) March 5, 2026అసలేం జరిగిందంటే.. భారత్‌ నిర్దేశించిన 254 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఛేదించే దిశగా సాగుతోంది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా సామ్ కర్రన్‌కు బౌలింగ్ చేస్తుండగా, బంతి బ్యాట్ దిగువ భాగాన్ని తాకి నేలపై పడి పైకి ఎగిరింది. బుమ్రా చురుకుగా వ్యవహరించి ఆ బంతిని క్యాచ్ పట్టాడు. ఇది ఔట్ కాదని అందరికీ తెలుసు. అయితే ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న సాక్షి ధోని, కర్రన్‌ ఔటయ్యాడన్న ఆనందంతో లేచి చప్పట్లు కొడుతూ, ఎగురుతూ గంతులేసింది.ఆ సమయంలో ఆమె వెనుకే ఉన్న ధోని అది ఔట్‌ కాదంటూ సాక్షిని శాంతపరిచాడు. ఈ సన్నివేశం చుట్టూ ఉన్న వారిలో నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోను చూసిన వారంతా మిస్టర్‌ కూల్‌ ఇంకా కూల్‌గానే ఉన్నాడంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. భారత్‌ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడం ఒక ఎత్తైతే ఈ సన్నివేశం మరో ఎత్తుగా నిలిచింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌,.. సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (39), శివమ్‌ దూబే (43), హార్దిక్‌ పాండ్యా (27), తిలక్‌ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ జేకబ్‌ బేతెల్‌ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు.అయితే బేతెల్‌ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్‌ ముందు భారత్‌కు బ్రేక్‌ దొరికింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు.19వ ఓవర్‌ బంతిని అందుకున్న హార్దిక్‌ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్‌ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్‌ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినా (ఆర్చర్‌) అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపో​యింది.కాగా, భారత్‌ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

T20 WC 2026: Team India captain Surya Kumar Yadav comments after win over England in semis3
T20 WC 2026: ఇంగ్లండ్‌ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన సూర్యకుమార్‌

ముంబైలోని వాంఖడే స్టేడియం​ వేదికగా నిన్న (మార్చి 5) జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్‌ 7 పరుగుల తేడాతో విజయం​ సాధించి, వరుసగా రెండో ఎడిషన్‌లో, ఓవరాల్‌గా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది.నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడినా, భారత శిబిరంలో గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్‌ జేకబ్‌ బేతెల్‌ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్ల విరుచుకుపడిన బేతెల్‌.. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు.బేతెల్‌ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్‌ ముందు భారత్‌కు బ్రేక్‌ దొరికింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు.19వ ఓవర్‌ బంతిని అందుకున్న హార్దిక్‌ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్‌ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్‌ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినా (ఆర్చర్‌) అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపో​యింది.అంతకుముందు సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు) ఇరగదీయడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (39), శివమ్‌ దూబే (43), హార్దిక్‌ పాండ్యా (27), తిలక్‌ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు.మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సహచరులతో పాటు ఇంగ్లండ్‌ ఆటగాళ్లపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. స్కై మాటల్లో..స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండగా, ఇంతటి అద్భుతమైన జట్టును నడిపించడం, ఈ జట్టుతో ఫైనల్‌కు చేరడం ప్రత్యేక అనుభూతి. సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌పై అతను క్రీజులోకి వచ్చిన వెంటనే ఏం చేయాలో తెలుసుకున్నాడు. వికెట్ బాగుందని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. గతేడాది నుంచి పడిన కష్టానికి ఫలితం ఇది. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లక్ష్య ఛేదనపైవారి లక్ష్య ఛేదన ప్రయత్నం అద్భుతం. హ్యారీ బ్రూక్‌ను చూసి, ఇంకెంత స్కోర్‌ చేయాలయ్యా అని అడిగాను. వారు చివరి వరకు ఆటలో ఉన్నారు. కానీ బుమ్రా, అర్షదీప్ సింగ్, హార్దిక్‌ పాండ్యా మ్యాచ్‌ను మలుపు తిప్పారు. బుమ్రా మరోసారి తన ప్రతిభను చూపాడు.ఫీల్డింగ్‌పై ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కృషిని గుర్తించాలి. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఫీల్డ్‌లో పదారసంలా కదిలారు. అద్బుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు పరుగులను నియంత్రించగలిగారు. ప్రాక్టీస్ సెషన్లలో దిలీప్‌ చేసిన కృషి ఫలించింది.బ్యాటింగ్ కాంబినేషన్‌పై మూడో స్థానం వరకు అన్ని స్థిరంగా ఉన్నాయి. రషీద్ బౌలింగ్ చేస్తున్నప్పుడు శివమ్ దూబేను పంపడం సరైన నిర్ణయం. జట్టు అవసరమైతే నా స్థానాన్ని మార్చడం కూడా సరైనదే. ఫైనల్‌పై ఆలోచనలు ఫైనల్‌ ఒత్తిడి సహజంగానే ఉంటుంది. కానీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. టైటిల్ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ముగించాడు. కాగా, భారత్‌ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

T20 WC 2026: Jasprit Bumrah hits golden milestone, scripts history in India vs England semi final4
T20 WC 2026: ఇంగ్లండ్‌పై కీలక ప్రదర్శన.. చరిత్ర సృష్టించిన బుమ్రా

భారత ప్రీమియం ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా టీ20 ప్రపంచకప్‌ 2026 సందర్భంగా ఓ చరిత్రాత్మక మైలురాయిని తాకాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో నిన్న (మార్చి 5) జరిగిన రెండో సెమీఫైనల్లో హ్యారీ బ్రూక్‌ వికెట్‌ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌లో తన స్పెల్‌ తొలి బంతికే ఈ ఘనత సాధించాడు. 32 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు 52 టెస్ట్‌ల్లో 234 వికెట్లు.. వన్డేల్లో 89 మ్యాచ్‌ల్లో 149.. టీ20ల్లో 94 మ్యాచ్‌ల్లో 117 వికెట్లు తీశాడు.2016 జనవరి 23న అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుమ్రా.. అతి తక్కువ వ్యవధిలోనే 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదవ భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బుమ్రాకు ముందు అనిల్‌ కుంబ్లే, అశ్విన్‌, హర్భజన్‌, కపిల్‌ దేవ్‌, రవీంద్ర జడేజా, జహీర్‌ ఖాన్‌, జవగల్‌ శ్రీనాథ్‌ ఈ ఘనత సాధించారు.ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సామర్థ్యం మేరకు సత్తా చాటుతున్న బుమ్రా.. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ గెలుపు దిశగా పయనిస్తున్న వేల ఓ పొదుపైన ఓవర్‌తో మ్యాచ్‌ను భారత్‌వైపు మల్లించాడు.18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్‌ బంతిని అందుకున్న హార్దిక్‌ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్‌ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్‌ వేసిన దూబే తొలి బంతికే విధ్వంసకర సెంచరీతో (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరంగం సృష్టించిన బేతెల్‌ను ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్‌) అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపో​యింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అత్యంత పొదుపైన బౌలర్‌గా నిలవడంతో పాటు మ్యాచ్‌ మలుపు తిప్పే ఓవర్‌ వేసి అత్యంత​ కీలకమైన హ్యారీ బ్రూక్‌ వికెట్‌ తీశాడు.ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌, సూపర్‌-8లో విండీస్‌.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కీలక ప్రదర్శనలు చేసి మొత్తం 10 వికెట్లు తీశాడు.వరుసగా రెండో మ్యాచ్‌లో సంజూ హిట్‌ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. సంజూ శాంసన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (39), శివమ్‌ దూబే (43), హార్దిక్‌ పాండ్యా (27), తిలక్‌ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. కాగా, భారత్‌ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

T20 WC 2026: I made a big mistake dropping Sanju Samson: Harry Brook reveals key reason behind England semi-final heartbreak5
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్‌ ఆవేదన

క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అన్న నమ్మకాన్ని నిన్నటి భారత్‌-ఇంగ్లండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ మరోసారి రుజువు చేసింది. ఈ మ్యాచ్‌ కీలక దశలో శివమ్‌ దూబే (అక్షర్‌ పటేల్‌ సాయంతో), తిలక్‌ వర్మ పట్టిన రెండు అద్భుతమైన క్యాచ్‌లు మ్యాచ్‌ గతినే మార్చేశాయి. అప్పటివరకు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉన్న సమీకరణలు.. ఆ రెండు క్యాచ్‌ల తర్వాత భారత్‌పైపు మళ్లాయి.254 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న వేల, అక్షర్‌ పటేల్‌-శివమ్‌, తిలక్‌ వర్మ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదకరంగా ఉన్న విల్‌ జాక్స్‌, సామ్‌ కర్రన్‌ను అద్భుతమైన క్యాచ్‌లతో పెవిలియన్‌కు పంపారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలుపుకు ఈ రెండు క్యాచ్‌లు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.లక్ష్య ఛేదనలో జేకబ్‌ బేతెల్‌ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ గెలుపు వాకిటి వరకు వచ్చి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓటమికి మరో క్యాచ్‌ కూడా కారణమైంది. అదేంటంటే.. భారత ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ (జోఫ్రా ఆర్చర్‌) రెండో బంతికి సంజూ శాంసన్‌ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ నేలపాలు చేశాడు. ఇక్కడే ఇంగ్లండ్‌ ఓటమికి మొదటి బీజం పడింది. లైఫ్‌ లభించడంతో చెలరేగిపోయిన సంజూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి భారత్‌ భారీ స్కోర్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. సంజూకు లైఫ్‌ లభించే సమయానికి అతని స్కోర్‌ కేవలం 15 పరుగులే. లైఫ్‌ లభించాక పేట్రేగిపోయిన సంజూ మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒకవేళ సంజూ క్యాచ్‌ను బ్రూక్‌ ఆదిలోనే పట్టి ఉంటే, టీమిండియా ఈ స్థాయి స్కోర్‌ చేసుండకపోయేదేమో. ఏదిఏమైనా సంజూ క్యాచ్‌ వదలి బ్రూక్‌ సహా యావత్‌ ఇంగ్లండ్‌ టీమ్‌ మూల్యం చెల్లించుకుంది.ఈ మ్యాచ్‌లో మరో టర్నింగ్‌ పాయింట్‌ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 18, 19వ ఓవర్లు. అప్పటివరకు గెలుపుపై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్‌ను భారత పేసర్లు బుమ్రా, హార్దిక్‌ పాండ్యా దారుణంగా దెబ్బకొట్టారు. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో 18వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్‌ బంతిని అందుకున్న హార్దిక్‌ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్‌ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్‌ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్‌) అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపో​యింది.మొత్తంగా సంజూ శాంసన్‌ డ్రాప్‌ క్యాచ్‌, శివమ్‌ దూబే (అక్షర్‌ పటేల్‌ సాయంతో), తిలక్‌ వర్మ క్యాచ్‌లు, బుమ్రా, హార్దిక్‌ పొదుపైన ఓవర్లు, చివరి ఓవర్‌ తొలి బంతికి రనౌట్‌ కావడం వంటి అంశాలు భారత్‌ గెలుపుకు కీలక కారణాలుగా నిలిచాయి.అయితే వీటిలో సంజూ డ్రాప్‌ క్యాచే ఇంగ్లండ్‌ కొంపముంచిందని హ్యారీ బ్రూక్‌ అభిప్రాయపడ్డాడు. సంజూ క్యాచ్‌ వదలి చాలా పెద్ద తప్పు చేశానని మ్యాచ్‌ అనంతరం ఆవేదన వ్యక్తం చేశాడు.

T20 WC 2026: Jacob Bethell Creates history with massive ton against india in semi finals6
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ చిచ్చరపిడుగు

నిన్న (మార్చి 5) జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్‌ 7 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో, ఓవరాల్‌గా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడినా, భారత శిబిరంలో గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్‌ జేకబ్‌ బేతెల్‌ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన బేతెల్‌.. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. బేతెల్‌ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్‌ ముందే భారత్‌కు బ్రేక్‌ దొరకింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్‌ బంతిని అందుకున్న హార్దిక్‌ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్‌ కర్రన్‌ను ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌కు గెలుపుపై ధీమా వచ్చింది. చివరి ఓవర్‌ వేసిన దూబే తొలి బంతికే బేతెల్‌ను ఔట్‌ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్‌) అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపో​యింది.ఇంత భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు, ముఖ్యంగా జేకబ్‌ బేతెల్‌ ఎక్కడా వెనకడుగు వేయలేదు. 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అతను.. విల్‌ జాక్స్‌, సామ్‌ కర్రన్‌ సహకారాలతో గెలుపు తీరాల వరకు తీసుకెళ్లాడు. 18,19 ఓవర్లు బుమ్రా, హార్దిక్‌ కంట్రోల్‌ చేయకపోయుంటే పరిస్థితి వేరే ఉండేది. ఈ వీరోచిత శతకంతో బేతెల్‌ పలు భారీ రికార్డులను సొంతం చేసుకున్నాడు.టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్‌ (105) చేసిన ఆటగాడిగా, నిన్ననే ఫిన్‌ అలెన్‌ (100) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. బేతెల్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇదే తొలి సెంచరీ. ప్రపంచంలో ఏ క్రికెటర్‌ తన తొలి ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఏ, టీ20 ఫార్మాట్‌ సెంచరీని అంతర్జాతీయ స్థాయిలో సాధించలేదు. చరిత్రలో జేకబ్‌ మొదటివాడు. ఇంగ్లండ్‌ తరఫున ప్రపంచకప్‌ టోర్నీల్లో సెంచరీలు చేసిన వారిలో జేకబ్‌ నాలుగో వాడు. వీరిలో రెండో అత్యధిక స్కోర్‌ జేకబ్‌దే. ఇంగ్లండ్‌ తరఫున టీ20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక స్కోర్‌ రికార్డు అలెక్స్‌ హేల్స్‌ (116 నాటౌట్‌) పేరిట ఉంది.అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. సంజూ శాంసన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (39), శివమ్‌ దూబే (43), హార్దిక్‌ పాండ్యా (27), తిలక్‌ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. కాగా, భారత్‌ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

India in the final battle of the T20 World Cup 20267
IND Vs ENG: పరుగుల వరదతో ఫైనల్లోకి

భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్‌లు.. వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్‌ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్‌ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్‌లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్‌ బృందం గట్టెక్కింది. గత మ్యాచ్‌ తరహాలోనే సంజు సామ్సన్‌ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్‌ తరఫున జాకబ్‌ బెతెల్‌ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్‌ భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. టి20 వరల్డ్‌ కప్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్‌కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది. ముంబై: టి20 వరల్డ్‌ కప్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్‌ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్‌ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజు సామ్సన్‌ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా... శివమ్‌ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్‌ బెతెల్‌ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది. భారత్, కివీస్‌ మధ్య టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరగడం ఇదే తొలిసారి. పోటీ పడి సిక్సర్లు బాది... ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్‌ భాగస్వామ్యంతో భారత్‌ దూసుకుపోయింది. ఆర్చర్‌ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్‌ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. మరోవైపు ఇషాన్‌ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్‌ ఓవర్లో భారీ సిక్స్‌తో 26 బంతుల్లో సామ్సన్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్‌ కరన్‌ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్‌ను రషీద్‌ అవుట్‌ చేశాడు. అయితే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్‌లో ముందుగా దూబేను పంపిన భారత్‌ ఫలితం రాబట్టింది. రషీద్‌ ఓవర్లో 2 భారీ సిక్స్‌లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్‌ ఓవర్లో మరో రెండు సిక్స్‌లు బాదిన సామ్సన్‌ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్‌ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్‌ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్‌ వేసిన 19వ ఓవర్లో తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్‌లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్‌లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్‌ 76 పరుగులు సాధించడం విశేషం. టాపార్డర్‌ విఫలం... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఆరంభంలోనే ఫిల్‌ సాల్ట్‌ (5) వికెట్‌ కోల్పోయింది. జోస్‌ బట్లర్‌ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హ్యారీ బ్రూక్‌ (7), టామ్‌ బాంటన్‌ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్‌ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన అతను వరుణ్‌ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టాడు. మరోవైపు విల్‌ జాక్స్‌ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా బెతెల్‌కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్‌ అవుటైన తర్వాత స్యామ్‌ కరన్‌ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు మళ్లింది. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్‌... శివమ్‌ దూబే వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికి రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్‌ (19 నాటౌట్‌) మూడు సిక్స్‌లు బాదినా లాభం లేకపోయింది. 17 ఓవర్ల వరకు ఇంగ్లండ్‌దే పైచేయి... దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్‌ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్‌లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్‌ ముందంజలో ఉంది. 17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్‌ వేసిన 19వ ఓవర్లో తిలక్‌ కొట్టిన 3 సిక్స్‌లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్‌ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది. సామ్సన్‌ క్యాచ్‌ వదిలేసి... గత మ్యాచ్‌ తరహాలో ఈసారి కూడా సామ్సన్‌ దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్‌ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్‌ బౌలింగ్‌లో మిడాన్‌ వద్ద కెప్టెన్‌ బ్రూక్‌ అతి సునాయాస క్యాచ్‌ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్‌ ఫలితం అనుభవించింది. క్యాచ్‌ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఇంగ్లండ్‌ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్‌ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్‌ను బ్రూక్‌ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్‌ లభించిన తర్వాత సామ్సన్‌ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే... భారత్‌ ఇన్నింగ్స్‌లో ఆటగాళ్లంతా ఏ బౌలర్‌ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్‌ వేసిన ఒక్క 14వ ఓవర్‌ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్‌ తొలి బంతికే సామ్సన్‌ వికెట్‌ తీశాడు. అక్షర్‌ అదరహో... మైదానంలో అక్షర్‌ పటేల్‌ ఫీల్డింగ్‌ భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్‌ అందుకొని సాల్ట్‌ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్‌ ఆ తర్వాత అసాధారణ క్యాచ్‌తో బ్రూక్‌ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్‌ షాట్‌ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్‌ నుంచి అక్షర్‌ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్‌ క్యాచ్‌ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్‌తో మ్యాచ్‌ పూర్తిగా భారత్‌ వైపు మొగ్గింది.5 టి20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్‌ సంజు సామ్సన్‌. గతంలో యువరాజ్‌ సింగ్‌ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్‌ పఠాన్‌ (2007లో పాకిస్తాన్‌పై ఫైనల్లో), విరాట్‌ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్‌ పటేల్‌ (2024లో ఇంగ్లండ్‌పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.4 ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్‌–న్యూజిలాండ్‌ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.4 టి20 ప్రపంచకప్‌లో భారత్‌ నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్‌ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.105 టి20 వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బెతెల్‌ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్‌ అలెన్‌ (100 నాటౌట్‌) స్కోరును బెతెల్‌ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) సాల్ట్‌ (బి) జాక్స్‌ 89; అభిషేక్‌ (సి) సాల్ట్‌ (బి) జాక్స్‌ 9; ఇషాన్‌ కిషన్‌ (సి) జాక్స్‌ (బి) రషీద్‌ 39; దూబే (రనౌట్‌) 43; సూర్యకుమార్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 11; పాండ్యా (రనౌట్‌) 27; తిలక్‌ (బి) ఆర్చర్‌ 21; అక్షర్‌ (నాటౌట్‌) 2; వరుణ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–61–1, జాక్స్‌ 4–0–40–2, ఒవర్టన్‌ 3–0–36–0, స్యామ్‌ కరన్‌ 4–0–53–0, ఆదిల్‌ రషీద్‌ 4–0–41–2, లియామ్‌ డాసన్‌ 1–0–19–0. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) అక్షర్‌ (బి) పాండ్యా 5; బట్లర్‌ (బి) వరుణ్‌ 25; హ్యారీ బ్రూక్‌ (సి) అక్షర్‌ పటేల్‌ (బి) బుమ్రా 7; బెతెల్‌ (రనౌట్‌) 105; బాంటన్‌ (బి) అక్షర్‌ 17; జాక్స్‌ (సి) శివమ్‌ దూబే (బి) అర్ష్ దీప్ 35; స్యామ్‌ కరన్‌ (సి) తిలక్‌ వర్మ (బి) హార్దిక్‌ పాండ్యా 18; ఒవర్టన్‌ (నాటౌట్‌) 2; ఆర్చర్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్‌: అర్ష్ దీప్ సింగ్‌ 4–0–51–1, హార్దిక్‌ పాండ్యా 4–0–38–2, జస్‌ప్రీత్‌ బుమ్రా 4–0–33–1, వరుణ్‌ 4–0–64–1, అక్షర్‌ పటేల్‌ 3–0–35–1, శివమ్‌ దూబే 1–0–22–0.

Indias only day night pink ball Test against Australia begins today8
ఏకైక ‘టెస్టు’కు భారత్‌ రె‘ఢీ’

పెర్త్‌: ఆ్రస్టేలియా పర్యటనను టి20 సిరీస్‌ విజయంతో మొదలుపెట్టిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ మొదలవడంతోనే కంగారు పడింది. అన్నీ ఓడి వైట్‌వాష్‌ అయ్యింది. ఇప్పుడు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత్‌కు మిగిలిందల్లా ఈ ‘టెస్టే’. నాలుగు రోజులపాటు జరిగే ఏకైక డే అండ్‌ నైట్‌ పింక్‌బాల్‌ టెస్టును గెలుచుకొని అత్యంత సంతృప్తికరంగా స్వదేశం చేరవచ్చు. ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌లో ఇరు జట్లు చెరో సిరీస్‌ గెలుచుకున్నాయి. అయితే పాయింట్ల పరంగా చూస్తే భారత అమ్మాయిలు బాగా వెనుకబడి ఉన్నారు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ విజేతకు 2 పాయింట్లు లభించడంతో ఒక టి20, అన్నీ వన్డేలు గెలుపొందిన ఆ్రస్టేలియా 8 పాయింట్లతో పైచేయిగా ఉంది. రెండు టి20 విజయాలతో భారత్‌ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. ఇప్పుడు టెస్టు గెలిస్తేనే 4 పాయింట్లు వస్తాయి. అప్పుడే భారత్‌ 8–8 పాయింట్లతో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను పంచుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’ చేసుకున్నా... ఆతిథ్య జట్టుకే ట్రోఫీ దక్కుతుంది. అజేయమే కానీ... ఇక్కడి వన్డే సిరీస్‌ను పక్కనబెడితే సంప్రదాయ ఫార్మాట్‌లో హర్మన్‌ బృందం అజేయంగా ఉంది. 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై వరుసగా గెలిచింది. అయితే ఈ మూడు సొంతగడ్డపై జరిగాయి. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన ఫామ్‌లో ఉంది. ప్రతీకతో కలిసి చక్కని ఆరంభం ఇవ్వగలిగితే జెమీమా, హర్మన్, షఫాలీ వర్మ మిగతా బ్యాటింగ్‌ భారాన్ని పంచుకుంటారు. దీప్తి, రిచా ఘోష్‌లు కూడా ఆతిథ్య బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటే బ్యాటింగ్‌లో ఏ బెంగా ఉండదు. బౌలింగే మెరుగు పడాల్సి ఉంది. క్రాంతి, స్నేహ్‌ రాణా, సయాలీ, కాశీ్వలు సమష్టిగా రాణించాలి. ఆత్మవిశ్వాసంతో ఆసీస్‌ ఓడినా, గెలిచినా... సొంతగడ్డపై ఆ్రస్టేలియా దుర్బేధ్యమైన ప్రత్యర్థి. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు ‘పింక్‌ బాల్‌’ టెస్టులు ఇక్కడే జరిగాయి. డేనైట్‌ టెస్టులో ఈ జట్టుకున్నంత అనుభవం ఇంకే జట్టుకు లేదు. ఫోబీ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్‌ పెరీ, కెప్టెన్ అలీసా హీలీ సొంతగడ్డపై తప్పకుండా రాణిస్తారు. తాలియా, ల్యూసీ హామిల్టన్, అలనా కింగ్, డార్సీ బ్రౌన్‌లతో కూడిన బౌలింగ్‌ దళమైతే మనకంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్‌ తర్వాత అన్ని ఫార్మాట్‌ల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న అలీసా హీలీకి గెలుపు బహుమతి అందించాలని ఆసీస్‌ బృందం భావిస్తోంది. పిచ్, వాతావరణం ఇది పోటాపోటీ పిచ్‌. నాణ్యమైన బౌలింగ్‌కు... పాతుకుపోతే బ్యాటింగ్‌కు సమాన అవకాశముంది. దేశవాళీ షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో సీజన్‌ అంతా అదే జరిగింది. పచ్చికతో తొలిరోజు బౌలింగ్‌కు బాగా అనుకూలించడంతో బ్యాటర్లకు కష్టాలు తప్పవు. పిచ్‌ పాతబడే కొద్దీ స్పిన్నర్లు మాయ చేస్తారు. తుది జట్లు (అంచనా) భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్ ), స్మృతి మంధాన, ప్రతీక, షఫాలీ, జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జోత్‌/సయాలీ, కాశ్వీ గౌతమ్, స్నేహ్‌ రాణా, క్రాంతి గౌడ్‌. ఆ్రస్టేలియా: అలీసా హీలీ (కెప్టెన్ ), ఫోబీ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్‌ పెరీ, అనాబెల్‌ సదర్లాండ్, బెత్‌ మూనీ, యాష్లీ గార్డ్‌నర్, తాలియా, అలానా కింగ్, ల్యూసీ హామిల్టన్, డార్సీ బ్రౌన్‌.

Arjun Tendulkar wedding in grand style9
ఘనంగా అర్జున్‌ టెండూల్కర్‌ వివాహం

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు, యువ క్రికెటర్‌ అర్జున్‌ టెండూల్కర్‌ ఒక ఇంటి వాడయ్యాడు. 26 ఏళ్ల అర్జున్‌ వివాహం గురువారం సానియా చందోక్‌తో ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన దేశంలోని ప్రముఖులంతా ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ కుటుంబం, భారత మాజీ క్రికెటర్లు ధోని, రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్‌ సింగ్, హర్భజన్‌ సింగ్, కైఫ్, జహీర్‌ ఖాన్, ఐసీసీ చైర్మన్‌ జై షా, సినీ తారలు అమితాబ్‌ బచ్చన్, షారుఖ్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌ తదితరులంతా అతిథులుగా పెళ్లిలో పాల్గొన్నారు. ఆల్‌రౌండర్‌ అర్జున్‌ దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 77 మ్యాచ్‌లు ఆడాడు.

Lakshya Sen in the quarterfinals of the All England Badminton Championship10
క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ షి యుకీ (చైనా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్‌... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్‌ ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 81 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–19, 21–23, 21–10తో గెలుపొందాడు. గతంలో లాంగ్‌ అంగుస్‌తో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్‌ నాలుగో ప్రయత్నంలో విజయం అందుకోవడం విశేషం. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌ (చైనా)తో ఆడతాడు. టాంగ్‌ చున్‌ మన్‌–సె యింగ్‌ సుయెట్‌ (హాంకాంగ్‌)లతో జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో తొలి గేమ్‌ను 19–21తో కోల్పోయారు. రెండో గేమ్‌లో 8–9తో వెనుకబడిన దశలో భారత జోడీ గాయంతో వైదొలిగింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement