Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Harbhajan Singh Joins BCCI1
బీసీసీఐలో చేరిన హర్భజన్‌ సింగ్‌

భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐలో చేరాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, యువ స్పిన్నర్లకు మార్గదర్శకత్వం చేయనున్నాడు. ఇప్పటికే మరో భారత మాజీ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ ఫాస్ట్ బౌలర్లతో పని చేస్తున్నాడు. తాజాగా హర్భజన్ సింగ్ ఈ జాబితాలో చేరాడు.బీసీసీఐ మార్చి మొదటి వారంలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో రెడ్ బాల్ స్పెషలైజ్డ్ క్యాంపులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ శిబిరాలు అండర్-19 మరియు ఇండియా A జట్లలో ప్రతిభ చూపిన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీరిని త్వరలోనే సీనియర్ జట్టులోకి తీసుకురావడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మరో దిగ్గజం కూడా..!యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత మాజీలు క్యూ కడుతున్నారు. జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌ ఇప్పటికే రంగంలోకి దిగగా.. మరో దిగ్గజ బౌలర్‌ కూడా తన స్పెషలైజేషన్‌లో యువ బౌలర్లకు శిక్షణ​ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే రిస్ట్‌ స్పిన్నర్ల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం కార్యక్రమాన్ని మరో భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సమన్వయం చేస్తున్నారు. ఇతర మాజీ ఆటగాళ్లను కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి అతను సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, బీసీసీఐలో ఇలాంటి శిక్షణా శిబిరాలు కొత్తవి కావు. జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మాజీ ఆటగాళ్లను యువ క్రికెటర్లకు మార్గదర్శకులుగా ఆహ్వానించే పద్ధతి ప్రారంభమైంది. అప్పట్లో చందు బోర్డే, ఎరపల్లి ప్రసన్న, సయ్యద్ కిర్మాణి వంటి ప్రముఖులు జోనల్ అకాడమీ శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు.

T20 WC 2026: India becomes the first team to reach 20 semi finals in ICC events2
T20 WC 2026: చరిత్ర సృష్టించిన టీమిండియా

భారత పురుషుల క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీస్‌కు చేరడంతో ఈ ఘనత సాధించింది. భారత్‌ తర్వాత అత్యధిక సార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్‌కు చేరిన జట్లుగా ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్‌ (18) ఉన్నాయి. ఆతర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్‌ (16), పాకిస్తాన్‌ (16), సౌతాఫ్రికా (15), శ్రీలంక (11), వెస్టిండీస్‌ (11), ఆఫ్ఘనిస్తాన్‌ (1), బంగ్లాదేశ్‌ (1), కెన్యా (1) జట్లు ఉన్నాయి.ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ సెమీస్‌కు చేరిన సందర్భాలు..వన్డే వరల్డ్‌కప్‌- 8 సార్లు (1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023)టీ20 వరల్డ్‌కప్‌- 6 సార్లు (1998, 2000, 2002, 2013, 2017, 2025)ఛాంపియన్స్‌ ట్రోఫీ- 6 సార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026*)కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (మార్చి 1) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్‌ (97 నాటౌట్‌) చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా శాంసన్‌ సహనం కోల్పోకుండా కడదాకా క్రీజ్‌లో ఉండి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్‌ 1 టాపర్‌ సౌతాఫ్రికా, గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా తలపడతాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.

If you are unable to score runs get out: Abhishek Nayar on India star3
Abhishek Sharma: పరుగులు చేయకుంటే.. అవుటైపో!

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. గ్రూప్‌ దశలో అమెరికా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లతో మ్యాచ్‌లలో ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక నమీబియాతో మ్యాచ్‌కు అనారోగ్యం వల్ల దూరం అయ్యాడు.జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రంఅనంతరం సూపర్‌-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో పోరులోనూ అభిషేక్‌ (Abhishek Sharma) విఫలమయ్యాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకం (30 బంతుల్లో 55) చేయగలిగాడు. అయితే, తాజాగా వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌లో మాత్రం మరోసారి అభిషేక్‌ తేలిపోయాడు.అవుటైపోవడం బెటర్‌ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేసి నిష్క్రమించాడు. అకీల్‌ హొసేన్‌ బౌలింగ్‌లో షిమ్రన్‌ హెట్‌మైర్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ అభిషేక్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్‌ ఎంత వేగంగా ఆడితే అంత మంచింది.తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. అయితే, విండీస్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ ఆ పని చేయలేకపోయాడు. ఒకవేళ పరుగులు రాబట్టడంలో విఫలమైతే అవుటైపోవడం బెటర్‌. టీ20 క్రికెట్‌లో ఇది కీలకం.పవర్‌ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడుపరుగులు తీయలేక ఇబ్బంది పడుతున్న బ్యాటర్‌ అవుటైతే వేరొకరికి అవకాశం వస్తుంది. నిజానికి వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయీ హోప్‌ ఈ నియమాన్ని పాటించకుండా పవర్‌ ప్లేలో మొత్తం క్రీజులో ఉండి జట్టును వెనుకపడేశాడు. పవర్‌ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడు.ఇక అభిషేక్‌ శర్మ తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులే చేసి.. ఆ తర్వాత మరీ వెనుకబడ్డాడు. ఆ వెంటనే అవుటైపోయాడు. జట్టు ప్రయోజనాల కోసం అతడు రిస్క్‌ తీసుకునే సాహసం చేయలేదు’’ అని అభిషేక్‌ నాయర్‌.. అభిషేక్‌ శర్మ ఆట తీరును విశ్లేషించాడు.కాగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే.. విండీస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ షాయీ హోప్‌ 33 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతడి స్లో బ్యాటింగ్‌ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. భారత్‌ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

women's cricket: pakistan beat south africa, sri lanka beat west indies4
సౌతాఫ్రికాపై పాకిస్తాన్‌.. వెస్టిండీస్‌పై శ్రీలంక..!

ఓ పక్క పురుషుల టీ20 ప్రపంచకప్‌ జరుగుతుండగా.. మహిళల విభాగంలో వన్డే, టీ20 సిరీస్‌లు జరుగుతున్నాయి. మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్‌ సౌతాఫ్రికాలో.. శ్రీలంక విండీస్‌లో పర్యటిస్తున్నాయి.క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆసీస్‌ఆసీస్‌ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడింది. వన్డే ప్రపంచ ఛాంపియన్‌ హోదాలో భారత జట్టు తమ తొలి సిరీస్‌లోనే ఆసీస్‌ చేతిలో 0-3 తేడాతో క్లీన్‌ స్వీప్‌ అయ్యింది. ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.నామమాత్రపు విజయంసౌతాఫ్రికా పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్‌.. వన్డే సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని (1-2) పునరావృతం చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో పాక్‌ ఆతిథ్య జట్టుపై 119 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, కంటితుడుపు విజయాన్ని సాధించింది.చమారీ ఆల్‌రౌండ్‌ షోవిండీస్‌ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న శ్రీలంక.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. చివరి టీ20 మార్చి 3న జరుగనుంది.

Not Sanju Bumrah Says Dube cameo turning point in India win vs WI5
సంజూ కాదు!;.. అతడి రెండు ఫోర్లే కీలకం: బుమ్రా

టీమిండియా అద్భుతం చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ కీలక పాత్ర పోషించాడు.ఆద్యంతం నిలకడగా ఆడిన సంజూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో సిక్స్‌, ఫోర్‌ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.వచ్చీ రాగానే వరుసగా రెండు ఫోర్లుఅయితే, టీమిండియా గెలుపునకు 10 బంతుల్లో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 17) ఐదో వికెట్‌గా వెనుదిరగగా.. శివం దూబే క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం ఏడు పరుగులుగా మారగా.. సంజూ తొలుత సిక్స్‌, ఆ తర్వాత ఫోర్‌ బాది గెలుపు ఖరారు చేశాడు.Shivam Dube wastes no time as India push to finish this in style to book their semi-final berth. 🔥ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/Ta4LWZ1VR2— Star Sports (@StarSportsIndia) March 1, 2026ఆ రెండు ఫోర్లు అత్యంత కీలకంనిజానికి దూబే బాదిన రెండు ఫోర్ల వల్ల సంజూపై ఒత్తిడి తగ్గి మరింత స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించగలిగాడు. భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘దూబే బాదిన ఆ రెండు ఫోర్లు అత్యంత కీలకం.క్రికెట్‌ రికార్డులలో వాటికి చోటు లేకపోవచ్చు. కానీ క్రికెట్‌ గురించి పూర్తి అవగాహన ఉన్న వారికి వాటి ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. ఆ రెండు ఫోర్లే ఒత్తిడిని తగ్గించాయి. చివరి ఓవర్లో 8-9 పరుగులు తీయడం కూడా ఒక్కోసారి కష్టం కావచ్చు.సంజూ విషయంలో హ్యాపీఏదేమైనా సంజూ విషయంలోనూ నేను సంతోషంగా ఉన్నాను. అతడు గత కొంతకాలంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వాటన్నింటినీ అధిగమించి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు రోజురోజుకీ మరింత గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. కాగా విండీస్‌తో మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

BCCI announces India next series after T20 WC Ro Ko Comeback date is6
T20 WC 2026: బీసీసీఐ కీలక ప్రకటన

టీమిండియా జూన్‌ షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. భారత క్రికెట్‌ జట్టు స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌లు ఆడనుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సెమీ ఫైనల్‌లో భారత్‌కాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన భారత్‌.. సూపర్‌-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో గురువారం (మార్చి 5) సెమీస్‌ మ్యాచ్‌లో తలపడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.మళ్లీ జూన్‌లోనేఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరితే మార్చి 8న టైటిల్‌ పోరులో టీమిండియా తలపడుతుంది. అనంతరం భారత జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్‌-2026 (IPL)తో బిజీ అవుతారు. ఈ క్రమంలో మళ్లీ జూన్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున విధుల్లో పాల్గొంటారు.అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా తదుపరి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుందని పేర్కొంది. జూన్‌ 6-10 మధ్య టెస్టు జరుగనుండగా.. ఇరుజట్ల మధ్య జూన్‌ 14, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్‌ జరుగనుంది. భారత్‌- అఫ్గన్‌ టెస్టుకు న్యూ చండీగఢ్‌ వేదిక కాగా.. వన్డే సిరీస్‌కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.రో-కో రీఎంట్రీ డేట్‌ ఫిక్స్‌.. అభిమానులు ఖుష్‌అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వన్డేలలో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చివరగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ బరిలో దిగారు.రోహిత్‌ శర్మ ఫర్వాలేదనిపించగా.. కోహ్లి వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో భారత్‌ కివీస్‌ చేతిలో ఓడిపోయింది. ఇక తదుపరి అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ సందర్భంగా జూన్‌ 14న రో-కో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్‌ అభిమానులను అలరించనున్నారు.భారత్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ షెడ్యూల్‌👉జూన్‌ 6- 10 టెస్టు మ్యాచ్‌, న్యూ చంఢీగఢ్‌ (ఉదయం 9. 30 నిమిషాలకు ఆరంభం)👉జూన్‌ 14- తొలి వన్డే, ధర్మశాల👉జూన్‌ 17- రెండో వన్డే, లక్నో👉జూన్‌ 20- మూడో వన్డే, చెన్నై.👉వన్డే మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం. చదవండి: T20 WC: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్‌!

He just plays for himself every match: Kris Srikkanth Lambasts WI batter Vs IND7
స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో ఆరంభం నుంచి అద్భుత ఆట తీరు కనబరిచిన వెస్టిండీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. సూపర్‌-8 దశలో జింబాబ్వేపై ఘన విజయం సాధించి సెమీస్‌ రేసులోకి దూసుకవచ్చిన విండీస్‌.. కీలక మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేసింది.విండీస్‌ అవుట్‌తొలుత సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన కరేబియన్‌ జట్టు.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా భారత్‌ సెమీస్‌కు దూసుకువెళ్లగా.. వెస్టిండీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌.. వెస్టిండీస్‌ సారథి షాయీ హోప్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అతడొక స్వార్థ పరుడు.. తుదిజట్టులో అతడికి చోటు దండగ అంటూ ఘాటుగా విమర్శించాడు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేయడం సరికాదని చురకలు అంటించాడు.స్వార్థపరుడు..‘‘ప్రతి మ్యాచ్‌లో కేవలం స్వార్థం కోసం మాత్రమే అతడు ఆడతాడు. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత.. తప్పునంతా పావెల్‌, హోల్డర్‌లపై నెట్టేసేందుకు ప్రయత్నించాడు. ఆఖర్లో సరిగ్గా ఆడలేదంటూ వారిని నిందించాడు.నిజానికి నీ చెత్త బ్యాటింగ్‌తో నువ్వే వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికావు. కానీ నిన్ను నువ్వు ఎప్పుడూ నిందించుకోవు. నిన్ను కెప్టెన్‌గా నియమించడమే వెస్టిండీస్‌ క్రికెట్‌ చేసిన అతి పెద్ద తప్పు.తుదిజట్టులో ఉండటమే దండగఅసలు తుదిజట్టులో షాయీ హోప్‌ ఉండటమే దండగ. అతడు కేవలం ఆదేశాలు ఇవ్వడానికి మాత్రమే ముందుంటాడు. బ్యాట్‌తో రాణించలేడు. అతడికి బదులు వేరొకరిని జట్టులోకి తీసుకుంటే బాగుండేదేమో! నీ బదులు రొమారియో షెఫర్డ్‌ను ఓపెనర్‌గా పంపి ఉంటే బాగుండేది హోప్‌’’ అంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ షాయీ హోప్‌ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా కోల్‌కతాలో భారత్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన విండీస్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ షాయీ హోప్‌ 33 బంతులు ఎదుర్కొని 32 పరుగులే చేయగలిగాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఇక మరో ఓపెనర్‌ రోస్టన్‌ ఛేజ్‌ 25 బంతుల్లో 40 పరుగులతో రాణించాడు.సంజూ శాంసన్‌ ధనాధన్‌ఆఖర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 34), జేసన్‌ హోల్డర్‌ (22 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు. ఫలితంగా 20 ఓవర్లలో విండీస్‌ 195 పరుగులు స్కోరు చేయగలిగింది.అయితే, సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌) విజృంభణ కారణంగా టీమిండియా 192. ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది.చదవండి: IND vs WI అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. అందుకే మద్దతు: గంభీర్‌Varun strikes, and Eden Gardens erupts! 🌪️The bowling change does the trick for #TeamIndia as skipper Shai Hope walks back! ☝️ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/rPIjxyNNaS— Star Sports (@StarSportsIndia) March 1, 2026

PCB imposes Huge fine on Pakistan players flopped in T20 WC: Report8
T20 WC: పీసీబీ సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్‌!

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో విఫలమైన కారణంగా ఆటగాళ్లకు ఊహించని షాకిచ్చినట్లు సమాచారం. బాగా ఆడినపుడు రివార్డులు తీసుకున్నట్లే.. చెత్త ప్రదర్శన కనబరిచినప్పుడు జరిమానా కట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.టీమిండియా చేతిలో చిత్తుటీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ జట్లతో కలిసి పోటీపడింది పాకిస్తాన్‌. గ్రూప్‌ దశలో నెదర్లాండ్స్‌, అమెరికా, నమీబియా జట్లపై గెలిచిన సల్మాన్‌ ఆఘా బృందం.. దాయాది టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది.అయితే, మిగిలిన జట్లపై విజయాల కారణంగా భారత్‌తో కలిసి సూపర్‌-8లో అడుగుపెట్టింది పాకిస్తాన్‌. సెమీస్‌ చేరాలంటే కీలకంగా మారిన ఈ దశలో న్యూజిలాండ్‌తో ఆడాల్సిన తొలి మ్యాచ్‌ వర్షం వల్ల టాస్‌ పడకుండానే రద్దై పోయింది. అనంతరం ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ ఓటమిపాలైంది.లంకపై గెలిచినా..సూపర్‌-8లో ఆఖరిదైన మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడి గెలిచినప్పటికీ నెట్‌ రన్‌రేటు కారణంగా వెనుకబడి.. పాక్‌ సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించింది. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ చేరగా.. శ్రీలంకతో కలిసి పాకిస్తాన్‌ ఇంటిబాట పట్టింది.అపుడు లీగ్‌ దశలోనేఇక గత ఎడిషన్‌లోనూ పాక్‌ సెమీస్‌ చేరకుండా లీగ్‌ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈసారి సూపర్‌-8కు చేరినా.. సెమీస్‌ రేసులో మాత్రం వెనుబడిపోయి తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్‌ మొహ్సిన్‌ నక్వీ సల్మాన్‌ ఆఘా బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.భారీ జరిమానా!ఈ నేపథ్యంలోనే విఫలమైన ఆటగాళ్లకు భారీ పనిష్‌మెంట్‌ ఇచ్చేందుకు పీసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ కథనం ప్రకారం.. పాక్‌ జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి పాక్‌ కరెన్సీలో యాభై లక్షల రూపాయలు (భారత కరెన్సీలో దాదాపు 16.28 లక్షలు) జరిమానా విధించనున్నట్లు సమాచారం.టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ మేరకు పీసీబీ నుంచి పాక్‌ ఆటగాళ్లకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ‘‘మెరుగైన ప్రదర్శనలు ఇచ్చినపుడు రివార్డులు తీసుకునే ఆటగాళ్లు.. చెత్త ప్రదర్శనలకు పెనాల్టీ కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు’’ అని సదరు కథనం పేర్కొంది. ముఖ్యంగా పీసీబీ వార్షిక కాంట్రాక్టులో అత్యధిక వేతనం అందుకుంటున్న ఆటగాళ్లకు జరిమానా ఇంకాస్త ఎక్కువే ఉండవచ్చని తెలిపింది.టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గొన్న పాకిస్తాన్‌ జట్టుసయీబ్‌ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్‌), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (వికెట్‌ కీపర్‌), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్, ఫఖర్‌ జమాన్‌, ఖవాజా నఫాయ్‌, నసీం షా, ఉస్మాన్‌ తారిఖ్‌.చదవండి: అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. అందుకే మద్దతు: గంభీర్‌

T20 WC 2026: Team India Reach Semis Scripts History World Record9
టీమిండియా ‘ప్రపంచ’ రికార్డు.. పాకిస్తాన్‌తో సమంగా

వెస్టిండీస్‌తో సూపర్‌-8 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత జట్టు సమం చేసింది.సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిశ్రీలంకతో కలిసి వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌.. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.వరుస విజయాలతో సెమీస్‌కుఅయితే, తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే (IND vs ZIM)ను భారీ తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌ రేసులో ముందుకు వచ్చిన భారత్‌.. ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ (IND vs WI)ను చిత్తు చేసి బెర్తును ఖరారు చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.విండీస్‌ బ్యాటర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 34), జేసన్‌ హోల్డర్‌ (22 బంతుల్లో 37) అజేయ ఇన్నింగ్స్‌తో అలరించగా.. ఓపెనర్‌ రోస్టన్‌ ఛేజ్‌ (25 బంతుల్లో 40) టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తి చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.సంజూ స్పెషల్‌ఇక లక్ష్య ఛేదనలో భారత్‌ ఆరంభంలో తడబడినా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) జట్టును విజయతీరాలకు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపును ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026పాక్‌ ప్రపంచ రికార్డు సమంకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సెమీస్‌ చేరడం ఇది ఆరోసారి. తద్వారా పాకిస్తాన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్‌ సమం చేసింది. ఇక ఇదే ఎడిషన్‌లో అందరి కంటే ముందే సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్‌ సైతం ఆరోసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టి.. పాక్‌, భారత్‌ సరసన నిలిచింది. ఇక గురువారం నాటిమ్యాచ్‌లో ఫైనల్‌ బెర్తు కోసం టీమిండియా ఇంగ్లండ్‌ మధ్యమ్యాచ్‌ జరుగుతుంది. ఇందుకు ముంబై వేదిక.టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధికసార్లు సెమీ ఫైనల్‌ చేరిన జట్లు ఇవే👉పాకిస్తాన్‌- ఆరుసార్లు (2007, 2009, 2010, 2012, 2021, 2022)👉టీమిండియా- ఆరుసార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026)👉ఇంగ్లండ్‌- ఆరుసార్లు (2010, 2016, 2021, 2022, 2024, 2026చదవండి: ఇది సరిపోతుందా బాస్‌!.. విమర్శలకు సంజూ ’స్టైల్‌’ కౌంటర్‌

World class player all about backing him: Gambhir praises Sanju after WI win10
అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. అందుకే మద్దతు: గంభీర్‌

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అంటూ ఆకాశానికెత్తాడు. సరైన సమయంలో రాణించి తన విలువను మరోసారి చాటుకున్నాడని కొనియాడాడు.టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభానికి ముందు ఫామ్‌లేమితో సతమతమైన సంజూ (Sanju Samson)తుదిజట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా అతడి స్థానాన్ని ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) భర్తీ చేశాడు. అయితే, మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కాగా సంజూ తొలిసారి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడాడు.బాధ్యతాయుత ఇన్నింగ్స్‌అనంతరం సూపర్‌-8లో జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆడిన సంజూ.. తాజాగా వెస్టిండీస్‌తో ఆదివారం నాటి కీలక మ్యాచ్‌లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఆట తీరుతో జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చాడు.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026కోల్‌కతా వేదికగా సహచర ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమైన వేళ సంజూ.. 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సంజూను ప్రశంసలతో ముంచెత్తాడు.అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. అందుకే మద్దతు‘‘సంజూ మంచి ఆటగాడు అని అందరికీ తెలుసు. అయితే, కొన్నిసార్లు విఫలమైనా అతడికి మద్దతుగా నిలవడం అవసరం. మేము అదే పని చేశాము. అందుకు తగ్గట్లుగానే జట్టుకు అతడి అవసరం ఉన్న కీలక సమయంలో రాణించాడు.అతడి పూర్తి స్థాయి నైపుణ్యాలను ఈరోజు ప్రదర్శించి.. జట్టుకు విజయం అందించాడు. అతడు వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అని నేను తరచూ చెబుతూ ఉంటాను. సంజుకు గొప్ప ప్రతిభ ఉంది. ఇప్పటి నుంచి అతడి నుంచి ఇలాంటి ఇంకెన్నో ఇన్నింగ్స్‌ చూడాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్‌ సంజూను కొనియాడాడు.ఐదు వికెట్ల తేడాతో విజయంకాగా వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతాలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 199 పరుగులు సాధించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికాతో పాటు సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ముంబై వేదికగా గురువారం సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.As soon as Sanju Samson smashed a match winning SIX, just look at the Celebration of Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Suryakumar Yadav and Jay Shah 💥- Most trolled and most hated Sanju Samson delivered at the biggest stage 👏🏻#INDvsWI pic.twitter.com/tYJmi4fxwC— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 1, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement