Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Ayush Mhatre to lead India in U19 World Cup, BCCI names Vaibhav Suryavanshi interim captain for SA tour1
టీమిండియా కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న అండర్‌-19 ప్రపంచకప్‌-2026 భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా ఆయూష్ మాత్రే ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా విహాన్ మల్హోత్రా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.అయితే అండర్-19 ఆసియా కప్ 2025 జట్టులో భాగమైన యువరాజ్ హోగిల్, నమన్ పుష్పక్‌లపై సెలక్టర్లు వేటు వేశారు. వారిద్దరి స్ధానంలో మహ్మద్ ఎనాన్, ఆర్.ఎస్. అంబ్రిష్‌లకు చోటు దక్కింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో యువ భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో జనవరి 15న అమెరికాతో తలపడనుంది.కెప్టెన్‌గా వైభవ్‌..ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మాత్రే, వైస్ కెప్టెన్ మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో మాత్రే స్ధానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ జట్టును నడిపించనున్నాడు. మాత్రే, మల్హోత్రా నేరుగా ప్రపంచకప్ జట్టులో చేరనున్నారు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.అండర్‌-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు:ఆయుష్ మాత్రే (కెప్టెన్‌), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, విహాన్ మల్హోత్రా, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది.సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టువైభవ్ సూర్యవంశీ(కెప్టెన్‌), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వేదాంత్ త్రివేది.

Probable India ODI squad for NZ series: Call-up for Devdutt Padikkal?2
టీమిండియాలోకి ఉహించ‌ని ప్లేయ‌ర్‌.. ఎవ‌రంటే?

భారత పురుషల క్రికెట్ జట్టు.. కొత్త ఏడాదిని సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తో ప్రారంభించనుంది. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్‌-భారత జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. మరో నాలుగైదు రోజుల్లో వన్డే జట్టును కూడా ఖరారు చేయనుంది. టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా వ‌న్డే సిరీస్‌కు దూరమైన గిల్.. తిరిగి టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ గాయ‌ప‌డ‌డంతో సిరీస్ మ‌ధ్య‌లోనే వైదొలిగాడు. అయితే గిల్ ప్ర‌స్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో కివీస్‌తో వ‌న్డే సిరీస్‌లో జ‌ట్టును గిల్ న‌డిపించ‌నున్నాడు.శ్రేయ‌స్ అయ్య‌ర్ రీ ఎంట్రీ?ఇక ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ భార‌త మిడిలార్డ‌ర్ శ్రేయస్ అయ్య‌ర్ కూడి తిరిగి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయ్య‌ర్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు.అతడు త‌న ప్రాక్టీస్‌ను కూడా మొద‌లు పెట్టాడు. అత‌డికి రెండు మూడు రోజుల్లో ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. అందులో అత‌డు ఉత్తీర్ణ సాధిస్తే కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక కానున్నాడు.ప‌డిక్క‌ల్‌కు చోటు..!ఒక‌వేళ అయ్య‌ర్ ఫిట్‌నెస్ సాధించ‌క‌పోతే అత‌డి స్ధానంలో క‌ర్ణాట‌క ఆట‌గాడు దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప‌డిక్క‌ల్ ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. విజ‌య్ హ‌జారే ట్రోఫీ-2025లో ప‌డిక్క‌ల్ దుమ్ములేపుతున్నాడు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లోనూ ప‌డిక్క‌ల్ శ‌త‌క్కొట్టాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ప‌డిక్క‌ల్ స‌గ‌టు దాదాపు 83. 64గా ఉంది. దీంతో అత‌డిని వ‌న్డే జ‌ట్టులోకి తీసుకోవాల‌ని మాజీ క్రికెట‌ర్లు సూచిస్తున్నారు. మ‌రోవైపు 2026 టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా కివీస్‌తో వ‌న్డేల‌కు స్టార్ ప్లేయ‌ర్లు హార్దిక్ పాండ్యా, జ‌స్ప్రీత్ బుమ్రాల‌కు విశ్రాంతి ఇచ్చే అవ‌కాశ‌ముంది.న్యూజిలాండ్‌తో వ‌న్డేల‌కు భార‌త జ‌ట్టు(అంచనా)శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్‌)/ ప‌డిక్క‌ల్‌, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌

Marnus Labuschagne Frustrated, Huge Umpiring Controversy Erupts In Ashes 4th Test3
ఇది ఔటా? అంపైర్‌పై లబుషేన్‌ సీరియస్‌! వీడియో

యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇం‍గ్లండ్ విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ చేధించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లీష్ జట్టుకు 15 ఏళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు విజయం. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆసీస్ ఆట‌గాడు ల‌బుషేన్ ఔట్ విష‌యంలో థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది.అస‌లేం జ‌రిగిందంటే?ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 18 ఓవ‌ర్‌లో ఇంగ్లండ్ పేస‌ర్ జోష్ టంగ్ తొలి బంతిని.. ల‌బుషేన్‌కు గుడ్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ డిఫెండ్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశ‌గా వెళ్లింది. ఈ క్ర‌మంలో ఫ‌స్ట్ స్లిప్‌లో ఉన్న జో రూట్ ఆ బంతిని అందుకున్నాడు.వెంట‌నే ఇంగ్లండ్ ఆట‌గాళ్లు సెల‌బ్రేట్ చేసుకోగా.. ల‌బుషేన్ మాత్రం బంతి నేల‌కు త‌గిలి చేతిలోకి వ‌చ్చిందా లేదా నేరుగా రూట్ అందుకున్నాడా సందేహంతో క్రీజులో ఉండిపోయాడు. ఈ క్ర‌మంలో ఫీల్డ్ అంపైర్‌లు థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేశారు.థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన తర్వాత, రూట్ వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ ల‌బుషేన్‌ను ఔట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో ఈ ఆసీస్ షాక‌య్యాడు. ఎందుకంటే ఓ కోణంలో బంతి నేల‌కు తాకిన‌ట్లు అన్పించింది. థ‌ర్డ్ అంపైర్ అసహ‌నం వ్య‌క్తం చేస్తూ ల‌బుషేన్ మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు అది క్లియ‌ర్‌గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నాయి. ఇప్పటికే మూడో టెస్టులో స్నికో లోపాలపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.చదవండి: గంభీర్‌కు పదవీ గండం!.. అత‌డితో చ‌ర్చ‌లు జ‌రిపిన బీసీసీఐ?What did you make of this catch? Out or not out?#Ashes | #DRSChallenge | @Westpac pic.twitter.com/pnWo2qt6qc— cricket.com.au (@cricketcomau) December 27, 2025

BCCI Approached Cricket Great For Test Team Coaching After South Africa Loss: Reports4
గంభీర్‌కు పదవీ గండం!.. అత‌డితో చ‌ర్చ‌లు జ‌రిపిన బీసీసీఐ?

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విజయవంతమైనప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గంభీర్ పర్యవేక్షణలో సేనా(సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా) దేశాలపై భారత్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా గత నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో గంభీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అతడిని వెంటనే ప్రధాన కోచ్‌గా తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో బీసీసీఐ కూడా హెడ్ కోచ్ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. టెస్టు జట్టు కోసం ప్రత్యేకంగా కోచ్‌ను నియమించాలన్న యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలో హెడ్ కోచ్ పదవి కోసం లెజెండరీ బ్యాటర్‌ వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు ప్రతినిధులు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ ఆఫర్‌ను లక్ష్మణ్‌ను తిరష్కరించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE) హెడ్‌గా ఉన్నాడు. అయితే ప్రస్తుత బాధ్యతలతోనే తను సంతోషంగా ఉన్నానని, సీనియర్ జట్టు కోచింగ్‌పై ఆసక్తి లేదని బోర్డుకు తెలియజేశాడంట. కానీ మరోసారి లక్ష్మణ్‌తో చర్చలు జరిపేందుకు బోర్డు పెద్దలు సిద్దమైనట్లు సమాచారం. గంభీర్ మెడపై కత్తి..కాగా వన్డే ప్రపంచకప్‌-2027 ముగిసే వర​కు బీసీసీఐతో గంభీర్ కాంట్రాక్ట్ ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శన బట్టి అతడి కాంట్రాక్ట్‌ను బోర్డు పునః సమీక్షించే అవకాశముంది. గంభీర్ కోచింగ్‌లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది.గంభీర్‌ ముందు పొట్టి ప్రపంచకప్‌తో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ 2025-27లో టీమిండియా ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అత్యంత కీలకం. మిగిలిన మ్యాచ్‌లలో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత క్రికెట్‌ జట్టుకు మరో ఎనిమిది నెలల వరకు ఎటువంటి టెస్టు సిరీస్‌లు లేవు.చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. శుభ్‌మన్‌ గిల్‌ కీలక నిర్ణయం

Stokes delighted by Ashes Test win but pitch was not ideal5
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం.. క్రెడిట్ వారికి దక్కాల్సిందే: స్టోక్స్‌

యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ జ‌యం సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై 14 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ తొలి యాషెస్ టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్టు కేవ‌లం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్‌పై ఇరు జట్లు బౌలర్లు నిప్పులు చెరిగారు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. దీని బట్టి ఎంసీజీ వికెట్ బ్యాటర్లకు ఎంతకష్టతరంగా మారిందో ఆర్ధం చేసుకోవచ్చు. కేవలం రెండు రోజుల్లోనే మొత్తం 36 వికెట్లు నేలకూలాయి.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లండ్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించిన స్మిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్‌లో విఫలమైంది.ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరగడంతో కేవలం 132 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచిగల్గింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది.ఇక ఈ చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. తమ జట్టుపై స్టోక్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదేవిధంగా ఇటువంటి పిచ్‌ను తను ఇప్పటివరకు చూడలేదని అతడు చెప్పుకొచ్చాడు.చాలా సంతోషంగా ఉన్నా.."ఆస్ట్రేలియాలో సుదీర్ఘ కాలం త‌ర్వాత విజ‌యం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్ప‌టికే సిరీస్ కోల్పోయిన‌ప్ప‌టికి ఎట్ట‌కేల‌కు స‌రైన ట్రాక్‌లో ప‌డ్డాము. చివ‌రి మ్యాచ్‌లో కూడా ఇదే జోరును కొన‌సాగిస్తాము. ఈ మ్యాచ్‌లో మా కుర్రాళ్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. కేవ‌లం జ‌ట్టు కోస‌మో, మా కోస‌మో ఆడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా మా వెన్నంటి ఉండి ప్రోత్సహించే లక్షలాది మంది అభిమానుల కోసం ఆడుతున్నాం. ఎక్క‌డికి వెళ్లినా మాకు ల‌భించే మ‌ద్దుతు మాలో కొత్త ఉత్స‌హాన్ని నింపుతోంది. ఈ విజయం మా అభిమానులందరికీ ఎంతో సంతోషాన్నిస్తుందని భావిస్తున్నాను. గత కొన్ని రోజులగా మా జట్టుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఆటగాళ్లు, మా కోచింగ్ స్టాప్ ఏకాగ్రతను కోల్పోకుండా కేవలం ఆటపై దృష్టి పెట్టారు. ఇంత ఒత్తిడిలో కూడా అద్భుత ప్రదర్శన చేసినందుకు ఆటగాళ్లకు, సపోర్ట్‌ స్టాప్‌కు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే.ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది. మెల్‌బోర్న్ వికెట్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉంది. అందుకే మా బ్యాటర్లను పాజిటివ్‌గా ఆడమని, బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలని సూచించాను. మా బ్యాటర్లు ఎంతో ధైర్యంగా ఆడి లక్ష్యాన్ని అందుకున్నారు. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా జోష్‌ టంగ్‌ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. బాక్సింగ్‌ డే రోజుల వేలాది మంది ప్రేక్షకుల ముందు 5 వికెట్లు తీయడం చిన్న విషయం కాదని స్టోక్స్‌ పేర్కొన్నాడు.అదేవిధంగా ఎంసీజీ పిచ్‌పై కూడా స్టోక్స్ ఘాటుగా స్పందించాడు. ఇటువంటి పిచ్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు. ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటి పిచ్‌ను తాయారు చేసి ఉంటే పెద్ద రచ్చ జరిగి ఉండేది. బాక్సింగ్ డే టెస్టు కోసం లక్షలాది మంది అభిమానులు ఎదుచూస్తుంటారు. అటువంటి మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసి పోవడం చాలా బాధాకరం అని స్టోక్స్ అన్నాడు.చదవండి: Ashes: ఇదేంటో ఇలా ఉంది.. స్టీవ్‌ స్మిత్‌ విమర్శలు

Adi Ashok to Josh Clarkson: Lesser Known players NZ ODI squad vs Ind6
IND vs NZ: ‘మనోడి’తో పాటు మరో ముగ్గురు.. గోల్డెన్‌ ఛాన్స్‌!

టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది. వన్డే సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ దూరంగా ఉండగా.. అతడి స్థానంలో మైకేల్‌ బ్రేస్‌వెల్‌ సారథ్యం వహించనున్నాడు.అయితే, టీ20 సిరీస్‌ సందర్భంగా సాంట్నర్‌ తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఇక జనవరి 11- 31 వరకు కివీస్‌ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో టీ20 జట్టు స్టార్లతో నిండి ఉండగా.. వన్డే జట్టులో కొత్త ముఖాలే ఎక్కువగా ఉన్నాయి. ఆది అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, జోష్‌ కార్ల్‌సన్‌, జేడన్‌ లెనాక్స్‌ ఈసారి ఇండియా టూర్‌కు రానున్నారు.ఆది అశోక్‌భారత సంతికి చెందిన కివీస్‌ క్రికెటర్‌ ఆదిత్య అశోక్‌. తమిళనాడులో 2002, సెప్టెంబరు 5న జన్మించాడు. అశోక్‌ లెగ్‌ స్పిన్నర్‌. వైవిధ్య భరితమైన బంతులు వేయడంలో దిట్ట.భారత సంతతికే చెందిన ఇష్‌ సోధి కెరీర్‌ చరమాంకానికి చేరుకుంటున్నాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో అతడి వారసుడిగా కివీస్‌ బోర్డు అశోక్‌ను తీర్చిదిద్దుతోంది. ఇప్పటికి న్యూజిలాండ్‌ తరఫున అశోక్‌ రెండు వన్డేలు, ఒక టీ20 ఆడి.. మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.క్రిస్టియన్‌ క్లార్క్‌దేశీ క్రికెట్‌లో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్టియన్‌ క్లార్క్‌ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌. ఇప్పటి వరకు అతడు కివీస్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అయితే, టీమిండియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 34 మ్యాచ్‌లు ఆడిన క్లార్క్‌ 52 వికెట్లు తీశాడు. అయితే, అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. 23 ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 373 పరుగులు సాధించాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటర్‌గానూ రాణించగల సత్తా ఉన్న క్లార్క్‌ వైపు కివీస్‌ మొగ్గుచూపవచ్చు.జోష్‌ క్లార్క్‌సన్‌ఆరడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉండే సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జోష్‌ క్లార్క్‌సన్‌. లోయర్‌ ఆర్డర్‌లో ఫినిషర్‌గా రాణించగల సత్తా కూడా ఉంది. ఇప్పటికి 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్లార్క్‌సన్‌.. 92 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 98 మ్యాచ్‌లలో అతడి పేరిట 2214 పరుగులు ఉన్నాయి.జేడన్‌ లెనాక్స్‌భారత పర్యటనలో భాగంగా ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 31 ఏళ్ల లెనాక్స్‌.. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 54 మ్యాచ్‌లలో కలిపి 69 వికెట్లు కూల్చాడు. ఎకానమీ 4.86. అతడి బౌలింగ్‌ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. సాంట్నర్‌కు వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు కాబట్టి.. లెనాక్స్‌ స్పిన్‌ విభాగంలో కీలకమయ్యే ఛాన్స్‌ ఉంది.చదవండి: IND vs NZ: కివీస్‌ జట్ల ప్రకటన.. గాయాల వల్ల కీల​క ప్లేయర్లు దూరం

36 Wickets in 2 Days: Smith Lashes Out At MCG Pitch After 4th Test Defeat7
మా ఓటమికి కారణం అదే: స్టీవ్‌ స్మిత్‌ విమర్శలు

హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. బాక్సింగ్‌ డే టెస్టులో ఇంగ్లండ్‌ చేతిలో ఆసీస్‌కు ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్నారు.3-0తో సిరీస్‌ సొంతంపెర్త్, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ టెస్టుల్లో గెలుపొంది.. ఇంగ్లండ్‌పై మరోసారి ఆధిపత్యం చాటుతూ.. మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే వరుసగా రెండోసారి యాషెస్‌ సిరీస్‌ గెలుచుకుంది. తొలి రెండు టెస్టులకు రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ దూరం కాగా.. స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం వహించాడు.మూడో టెస్టుకు కమిన్స్‌ తిరిగి వచ్చి జట్టుకు గెలుపు అందించగా.. అనారోగ్యం వల్ల స్మిత్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టు నుంచి కమిన్స్‌ విశ్రాంతి తీసుకోగా.. స్మిత్‌ తిరిగి పగ్గాలు చేపట్టాడు.అయితే, ఈ మ్యాచ్‌లోనూ ఆది నుంచి ఆధిపత్యం కనబరిచిన ఆసీస్‌... శనివారం నాటి రెండో రోజు ఆటలో బోల్తా పడింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై ఇంగ్లండ్‌ తొలి టెస్టు విజయాన్ని అందుకుంది.ఇదిలా ఉంటే.. మెల్‌బోర్న్‌ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తొలిరోజే ఇరవై వికెట్లు కూలి ఇరుజట్లు ఆలౌట్‌ అయ్యాయి. రెండో రోజు సైతం పదహారు వికెట్లు పడ్డాయి. ఇక ఈ విషయంపై స్మిత్‌ స్పందించాడు. ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడుతూ..మా ఓటమికి కారణం అదే‘‘కష్టతరమైన మ్యాచ్‌. తొందరంగా ముగిసిపోయింది. మేము అదనంగా కనీసం 50- 60 పరుగులు చేసి ఉంటే మంచి పోటీ ఉండేది. ఏదేమైనా చివరి వరకు మేము పట్టువీడలేదు.ఇదేంటో ఇలా ఉందివికెట్‌ ముందుగా ఊహించినట్లుగానే ఉంది. అయితే, బంతి పాతబడే కొద్ది పూర్వపు రూపాన్ని కోల్పోయింది. వాళ్లు బ్యాటింగ్‌కు వచ్చినపుడు కొన్ని ఓవర్లు దూకుడుగానే ఆడారు. ఏదేమైనా ఈ పిచ్‌ బౌలర్లకు అతిగా సహకరించింది.రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడ్డాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పచ్చికను కాస్త మెరుగుపరిచి ఉంటే బాగుండేది. అయితే, వికెట్‌ ఎలా ఉన్నా అందుకు తగ్గట్లుగా మేము ఆడాల్సింది’’ అని స్మిత్‌ చెప్పుకొచ్చాడు. పరోక్షంగా పిచ్‌పై విమర్శలు గుప్పించాడు.ఆసీస్‌- ఇంగ్లండ్‌ యాషెస్‌ బాక్సింగ్‌ డే టెస్టు సంక్షిప్త స్కోర్లు👉ఆస్ట్రేలియా: 152 &132👉ఇంగ్లండ్‌: 110 &178/6👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపు

Shubman Gill to play 2 Vijay Hazare Trophy matches to prepare for IND vs NZ ODIs8
శుభ్‌మన్‌ గిల్‌ కీలక నిర్ణయం..!

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆఖ‌రి రెండు మ్యాచ్‌ల‌కు గాయం కార‌ణంగా దూరమైన టీమిండియా వ‌న్డే కెప్టెన్ శుభ్‌మ‌న్‌ గిల్‌.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌లో భార‌త జ‌ట్టును ముందుండి న‌డిపించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు. అంత‌కంటే ముందు విజ‌య్ హజారే ట్రోఫీ-2025లో గిల్ ఆడనున్నాడు.టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాదిరిగానే కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే గిల్ అందుబాటులో ఉండనున్నాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 18 మంది సభ్యుల జట్టులో గిల్ ముందే చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ టోర్నీలో పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు గిల్ దూరంగా ఉన్నాడు.దీంతో అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, నేరుగా కివీస్ సిరీస్‌లోనే ఆడనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ గిల్ మాత్రం ఈ దేశవాళీ వన్డేలో టోర్నీలో ఆడేందుకు సిద్దమయ్యాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 3న సిక్కిం, జనవరి 6న గోవాతో పంజాబ్ ఆడనున్న మ్యాచ్‌లలో గిల్ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం మొహాలీలో ఉన్న శుభ్‌మన్.. జనవరి 1న జైపూర్‌లో పంజాబ్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. అదేవిధంగా ముంబైతో జరిగే ఫైనల్ గ్రూపు లీగ్ మ్యాచ్ ఆడేందుకు కూడా గిల్ ఆసక్తిచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 8న పంజాబ్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైతో తలపడనుంది.అయితే అక్కడికి రెండు రోజుల తర్వాత భారత్‌-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ క్యాంపును ఏర్పాటు చేసే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ముంబైతో మ్యాచ్‌కు గిల్ దూరం కానున్నాడు. కాగా గిల్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతవుతున్నాడు. దీంతో అతడికి టీ20 వరల్డ్‌కప్‌-2026 జట్టులో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు.చదవండి: రికెల్టన్‌ సుడిగాలి శతకం వృథా.. మార్క్రమ్‌ మెరుపులతో బోణీ

SA20: Rickelton Maiden ton in vain as Super Kings Edge MI Cape Town9
రికెల్టన్‌ సుడిగాలి శతకం వృథా

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26 సీజన్‌కు తెరలేచింది. కేప్‌టౌన్‌ వేదికగా డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌- ఎంఐ కేప్‌టౌన్‌ మధ్య శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన సూపర్‌ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో డెవాన్‌ కాన్వే మెరుపు అర్ధ శతకం (33 బంతుల్లో 64) సాధించగా.. కేన్‌ విలియమ్సన్‌ ధనాధన్‌ (25 బంతుల్లో 40) దంచికొట్టాడు.వన్‌డౌన్‌లో వచ్చిన జోస్‌ బట్లర్‌ (12 బంతుల్లో 22), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (14 బంతుల్లో 22) ఆకట్టుకోగా.. కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (17 బంతుల్లో 35), ఇవాన్‌ జోన్స్‌ (14 బంతుల్లో 33 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. ఆఖర్లో డేవిడ్‌ వీస్‌ (5 బంతుల్లో 9) మెరపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.కేప్‌టౌన్‌ బౌలర్లలో జార్జ్‌ లిండే రెండు వికెట్లు తీయగా.. కార్బిన్‌ బాష్‌, ట్రిస్టన్‌ లూస్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో కేప్‌టౌన్‌ ఆదిలోనే ఓపెనర్‌ రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌ (2) వికెట్‌ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. 𝗧𝗵𝗮𝘁 𝗛𝘂𝗻𝗱𝗿𝗲𝗱 𝘁𝗵𝗼𝘂𝗴𝗵!#MICTvDSG #BetwaySA20 #WelcomeToIncredible pic.twitter.com/MnE3BizcLO— Betway SA20 (@SA20_League) December 27, 2025 కేవలం 63 బంతుల్లోనే ఐదు ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లు బాదిన రికెల్టన్‌ 113 పరుగులు సాధించాడు. మిగతా వారిలో రీజా హెండ్రిక్స్‌ (28) ఫర్వాలేదనిపించగా.. జేసన్‌ స్మిత్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (14 బంతుల్లో 41)తో మెరిశాడు. 𝗔𝗯𝗼𝘂𝘁 𝗹𝗮𝘀𝘁 𝗻𝗶𝗴𝗵𝘁 #MICTvDSGThis Season is going to be 🔥Tickets are going fast, don’t miss your chance to be part of the action: https://t.co/VuPOMrokgY#BetwaySA20 #WelcomeToIncredible pic.twitter.com/R3X4Jdj9m1— Betway SA20 (@SA20_League) December 27, 2025అయితే, మిగిలిన వారి నుంచి అతడికి సహకారం లభించలేదు. నికోలస్‌ పూరన్‌ (15) నిరాశపరచగా.. డ్వేన్‌ ప్రిటోరియస్‌ (5) తేలిపోయాడు. జార్జ్‌ లిండే డకౌట్‌ కాగా.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ 1, కార్బిన్‌ బాష్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఏడు వికెట్లు నష్టపోయిన కేప్‌టౌన్‌ 217 పరుగులకు పరిమితమై.. 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.డేవిడ్‌ వీస్‌, సైమన్‌ హార్మర్‌, క్వెనా మఫాకా తలా ఒక వికెట్‌ పడగొట్టగా.. ఎథాన్‌ బాష్‌ నాలుగు వికెట్లతో చెలరేగి కేప్‌టౌన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తొలి శతకం బాదిన రికెల్టన్‌ ఇన్నింగ్స్‌ వృథాగా పోయింది.

Dhaka Capitals coach Mahbub Ali Zaki's shocking death rocks BPL 2025-2610
కొద్ది నిమిషాల్లో మ్యాచ్‌.. గ్రౌండ్‌లోనే ప్రాణాలు విడిచిన కోచ్‌

బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫ్రాంచైజీ ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ (59) ఆకస్మికంగా మరణించారు. శనివారం సిల్హెట్ వేదికగా రాజ్‌షాహి రాయల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు మహబూబ్ అలీ మైదానంలోనే కుప్పకూలారు.వెంటనే స్పందించిన ఫిజియోలు ఆయనకు సీపీఆర్ (CPR) నిర్వహించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహబూబ్ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషీయన్ దేబాశిష్ చౌదరి ధృవీకరించారు. ఈ విషాద ఘటన మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా చోటు చేసుకుంది. అయితే మహబూబ్ అలీ జాకీ మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే ఆయనకు గుండెపోటు (Cardiac Arrest) వచ్చినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అంతకుముందు వరకు ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఫిట్‌గానే ఉన్నారని సహచరులు తెలిపారు. ఈ వార్త తెలియగానే మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే సిల్హెట్ టైటాన్స్, నోవాఖాలీ ఎక్స్‌ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ జట్లకు చెందిన ప్లేయర్లు, కోచ్‌లు తమ ప్రాక్టీస్ ఆపేసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయ‌న మృతి పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.ఒక దిగ్గజ కోచ్‌గా..బంగ్లాదేశ్ పేస్ బౌలింగ్ విభాగంలో జాకీ ఒక లెజెండరీ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అండర్-19 వరల్డ్ కప్(2020)ను బంగ్లాదేశ్ సొంతం చేసుకోవడంలో బౌలింగ్ కోచ్‌గా ఆయనది కీలక పాత్ర. అదేవిధంగా టాస్కిన్ అహ్మద్‌, షోర్‌ఫుల్ ఇస్లాం వంటి స్టార్ పేస‌ర్లు జాకీ కోచింగ్‌లోనే రాటుదేలారు. ఆయ‌న బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా, బౌలింగ్ యాక్షన్ రివ్యూ కమిటీ సభ్యుడిగా సేవ‌లందించారు.చదవండి: టీమిండియా కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement