Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Indian batter sets new U19 World Cup final record1
చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. వ‌ర‌ల్డ్ రికార్డు బ్రేక్

అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న‌ ఫైనల్ మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు జూలు విధిల్చారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త యువ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 411 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్యవంశీ అయితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.హరారే స్పోర్ట్స్ క్ల‌బ్ మైదానంలో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. ఓపెన‌ర్ ఆరోన్ జార్జ్ త్వ‌ర‌గా ఔటైన‌ప్ప‌టికి వైభ‌వ్ మాత్రం కెప్టెన్ ఆయూష్ మాత్రేతో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. అతడి బ్యాటింగ్ చూసి ప్ర‌త్య‌ర్ది బౌల‌ర్లు గ‌జ‌గ‌జ వ‌ణికిపోయారు. ఈ క్ర‌మంలో అత‌డు కేవ‌లం 55 బంతుల్లోనే త‌న సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవ‌రాల్‌గా సూర్య‌వంశీ 80 బంతుల్లో 175 పరుగులు న‌మోదు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అత‌డితో పాటు మాత్రే(53), అభిజ్ఞాన్ కుండు(40), కనిష్క్ చౌహాన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జేమ్స్ మింటో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ త‌లా రెండు వికెట్లు సాధించారు.టీమిండియా స‌రికొత్త చ‌రిత్ర‌అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జ‌ట్టుగా భార‌త్ నిలిచింది. గ‌తంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఫైన‌ల్లో భార‌త్‌పై ఆసీస్ 253 ప‌రుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో 411 ప‌రుగులు చేసిన యంగ్ ఇండియా.. కంగారుల ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.అండర్-19 ప్రపంచకప్‌లో 400 పరుగుల మార్కును అత్య‌ధిక సార్లు దాటిన జ‌ట్టుగా భార‌త్ రికార్డులకెక్కింది. టీమిండియా మూడు సార్లు 400కు పైగా టోట‌ల్స్‌ను న‌మోదు చేసింది.

Despite Questioning ICC Ex England Captain In Commentary Panel T20 WC2
T20 WC: ఐసీసీని విమర్శించిన కామెంటేటర్‌కు చోటు

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) కామెంటేటర్ల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈసారి కూడా అత్యుత్తమ కామెంట్రీతో ఆకట్టుకునేందుకు ఐసీసీ టీవీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రేక్షకులకు వరల్డ్‌క్లాస్‌ అనుభూతిని అందించేందుకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని పేర్కొంది.బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌కు మద్దతుగాఅయితే, ఈ కామెంటేటర్ల లిస్టులో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హొసేన్‌కు చోటు ఇవ్వడం పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతూ.. భారత్‌, ఐసీసీని నాసిర్‌ హొసేన్‌ విమర్శించిన విషయం తెలిసిందే. బంగ్లా, పాక్‌లను ఒక విధంగా.. టీమిండియాను మరో విధంగా ఐసీసీ చూస్తోందని.. ఇదెక్కడి న్యాయం అని అతడు ప్రశ్నించాడు.భారత్‌ దగ్గర డబ్బు ఉందని ఆ జట్టు అభిమానులు అనుకోవచ్చని.. అయితే, ఐసీసీ అందరినీ సమానంగా చూడాలంటూ నాసిర్‌ హొసేన్‌ వ్యాఖ్యానించాడు. కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతం ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఐసీసీఐ బీసీసీఐ ఆధిపత్యం చెలాయిస్తోందనేలా నాసిర్‌ మాట్లాడాడు.మరచిపోతే ఎలా?అయితే, నెటిజన్లు అతడికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. జింబాబ్వే విషయంలో ఇంగ్లండ్‌ ఏం చేసిందో గుర్తు చేసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్‌.. తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది.అయినా సరే బంగ్లా పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో బంగ్లాకు మద్దతుగా నిలుస్తామంటూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్తాన్‌ ప్రకటించింది. అదే జరిగితే ఐసీసీతో పాటు ఐసీసీ సభ్య దేశాల ఆదాయం భారీగా తగ్గిపోతుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌​-2026 నిర్వహణకు షెడ్యూల్‌ ఖారారైంది. ఈ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి.ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌-2026 కామెంటేటర్లు వీరేరవిశాస్త్రి, నాసిర్‌ హుస్సేన్, ఇయాన్ స్మిత్, ఇయాన్ బిషప్, ఆరోన్ ఫించ్, దినేశ్‌ కార్తీక్, కుమార్ సంగక్కర, శామ్యూల్ బద్రీ, రాబిన్ ఉతప్ప, కార్లోస్ బ్రాత్‌వైట్, ఇయాన్ మోర్గాన్, వసీం అక్రమ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, డేల్ స్టెయిన్, మైఖేల్ అథర్టన్.....వకార్ యూనిస్, సైమన్ డౌల్, షాన్ పొలాక్, కేటీ మార్టిన్, హర్ష భోగ్లే, పుమెలెలో ఎంబంగ్వా, నటాలీ జర్మనోస్, డానీ మోరిసన్, అలాన్ విల్కిన్స్, ఇయాన్ వార్డ్, మార్క్ హోవార్డ్..నిక్ నైట్, అథర్ అలీ ఖాన్, కాస్ నైడూ, బాజిద్ ఖాన్, రౌనక్ కపూర్, నియాల్ ఓ'బ్రియన్, ప్రెస్టన్ మామ్సెన్, ఆండ్రూ లియోనార్డ్, రస్సెల్ ఆర్నాల్డ్, రోషన్ అబేసింఘే, ఏంజెలో మాథ్యూస్, టెంబా బావుమా.చదవండి: T20 WC 2026: సిరాజ్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌!

Suryakumar Yadav announces Ishan Kishans batting position for T20 World Cup3
శాంస‌న్‌పై వేటు..! టీమిండియా ఓపెన‌ర్‌గా అత‌డే?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2026లో భార‌త క్రికెట్ జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. టోర్నీ ఆరంభం రోజు(ఫిబ్ర‌వ‌రి 7)నే వాంఖ‌డే వేదిక‌గా అమెరికాతో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. అయితే భార‌త తుది జ‌ట్టులో వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్‌కు చోటు ద‌క్కుతుందా? లేదా? అన్న‌ది ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చానీయాంశ‌మైంది. సంజూ పేలవ ఫామ్ క‌న‌బ‌రుస్తుండ‌డంతో అత‌డి స్దానంలో ఓపెన‌ర్‌గా ఇషాన్ కిష‌న్ పంపాల‌ని చాలా మంది మాజీ క్రికెట‌ర్లు సూచించారు. దీంతో టీమ్ మెనెజ్‌మెంట్ శాంస‌న్‌పై వేటు వేసేందుకు సిద్ద‌మైందని వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జ‌రిగిన వార్మ‌ప్ మ్యాచ్‌ల‌లో సంజూ ఆడ‌క‌పోవ‌డం ఈ వార్త‌ల‌కు మ‌రింత ఊత‌మిచ్చాయి. తాజాగా కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్ చేసిన వాఖ్య‌లు బ‌ట్టి సంజూకు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు క‌ష్ట‌మే అన్పిస్తోంది.శాంస‌న్ స్దానంలో సూప‌ర్‌ ఫామ్‌లో ఉన్న కిష‌న్ భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్లే అన్పిస్తోంది. అమెరికాతో మ్యాచ్‌కు ముందు విలేక‌రుల స‌మావేశంలో సూర్య పాల్గోన్నాడు. ఈ సంద‌ర్భంగా ఇషాన్‌పై సూర్య‌కుమార్ యాద‌వ్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు.ఓపెన‌ర్‌గా ఇషాన్‌ కిష‌న్‌ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కేవ‌లం టీమిండియా త‌ర‌పునే కాదు, దేశ‌వాళీ క్రికెట్‌లో కూడా దుమ్ములేపాడు. అత‌డు కచ్చితంగా టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడు. ఇషాన్ త‌న‌కు ల‌భించిన అవ‌కాశాల‌ను చక్కగా వినియోగించుకున్నాడ‌ని సూర్య పేర్కొన్నాడు.కాగా రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ త‌ర్వాత ఓపెనర్‌గా వచ్చిన సంజూ.. వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో శుభ్‌మ‌న్ గిల్‌ను కాద‌ని సంజూకు వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో సెలెక్ట‌ర్లు చోటు ఇచ్చారు. కానీ ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో శాంస‌న్ దారుణ ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచాడు.ఈ కేరళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ 5 మ్యాచ్‌ల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే స‌మ‌యంలో రెండేళ్ల త‌ర్వాత జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చిన కిష‌న్ తన సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అంద‌రిని మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో కూడా 200పైగా స్ట్రైక్ రేట్‌తో సెంచరీ సాధించి, సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కూడా ఓపెన‌ర్‌గా వ‌చ్చి కిష‌న్ స‌త్తాచాటాడు. దీంతో ప్ర‌ధాన టోర్నీలో కూడా కిష‌న్‌కే ఓపెన‌ర్‌గా పంపాల‌ని గంభీర్ అండ్ కో నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.అమెరికాతో మ్యాచ్‌కు భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా)అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

Siraj to replace injured Harshit Rana in India T20 WC 2026 squad: Report4
T20 WC 2026: సిరాజ్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఫాస్ట్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ధ్రువీకరించాడు.కాగా శనివారం (ఫిబ్రవరి 7) నుంచి వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. భారత్‌- శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ టోర్నీలో టీమిండియా శనివారం నాటి మ్యాచ్‌లో యూఎస్‌ఏతో తలపడుతుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) శుక్రవారం మీడియాతో మాట్లాడాడు.భారీ ఎదురుదెబ్బేఈ సందర్భంగా హర్షిత్‌ రాణా గాయం గురించి అప్‌డేట్‌ అందిస్తూ. ‘‘హర్షిత్‌ టోర్నీ నుంచి తప్పుకొన్నాడని ఇప్పుడే చెప్పలేను. అయితే, అతడి పరిస్థితి ఏమాత్రం బాలేదు. గాయంపై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది.ఒకవేళ హర్షిత్‌ రాణా టోర్నీకి దూరమైతే నిజంగా మాకు అది భారీ ఎదురుదెబ్బే. కాంబినేషన్లను దృష్టిలో పెట్టుకునే మేము పదిహేను మందిని ఎంపిక చేసుకున్నాం. అయితే, కావాల్సినంత బెంచ్‌ స్ట్రెంత్‌ ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఆల్‌రౌండరే అక్కర్లేదుఅతడి స్థానంలో ఆల్‌రౌండర్‌నే తీసుకురావాలనే నిబంధన ఏమీ లేదు’’ అని ప్రి-మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో సూర్య పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్‌ రాణా స్థానంలో హైదరాబాదీ స్టార్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ప్రపంచకప్‌ జట్టులోకి రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.సిరాజ్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌!కాగా 2024 జూలైలో సిరాజ్‌ చివరగా టీమిండియా తరఫున టీ20 బరిలో దిగాడు. అయితే, గతేడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున సిరాజ్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. పదిహేను మ్యాచ్‌లలో కలిపి 16 వికెట్లు తీశాడు. కాగా సిరాజ్‌ ఇప్పటికి టీమిండియా తరఫున మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. హర్షిత్‌ రాణా స్థానంలో సిరాజ్‌కు బదులు ప్రసిద్‌ కృష్ణను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్‌లో 25 వికెట్లతో టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు ప్రసిద్‌. ఈ కర్ణాటక బౌలర్‌ చివరగా 2023లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు. చదవండి: ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు ఆసీస్‌కు మరో భారీ షాక్‌

Vaibhav Suryavanshi races to 55-ball century in U19 World Cup 2026 final5
వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో వైభవ్ విధ్వంసం.. జ‌స్ట్ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌

అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తుది పోరులో వైభ‌వ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్ర‌త్యర్ధి బౌల‌ర్లను ఉతికారేశాడు. అత‌డి బ్యాటింగ్ తుఫాను ముందు బౌండ‌రీలు చిన్న‌బోయాయి.ఈ క్రమంలో కేవ‌లం 55 బంతుల్లోనే వంద పరుగుల మార్కును వైభవ్ అందుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు. తొలి స్దానంలో ఆస్ట్రేలియాకు చెందిన విల్ మలాజ్జుక్(51) ఉన్నాడు. అయ‌తే ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో వైభ‌వ్ సునాయసంగా డ‌బుల్ సెంచ‌రీ సాధిస్తాడ‌ని అంతా భావించారు. కానీ ద్విశ‌తకానికి 25 పరుగుల దూరంలో అత‌డు నిలిచిపోయాడు. ఓ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి సూర్య‌వంశీ త‌న వికెట్‌ను కోల్పోయాడు. ఓవ‌రాల్‌గా 80 బంతులు ఎదుర్కొన్న వైభ‌వ్‌..15 ఫోర్లు, 15 సిక్స్‌ల‌తో 175 పరుగులు చేశాడు. అత‌డి విధ్వంసం ఫ‌లితంగా భార‌త్ స్కోర్‌ 25 ఓవ‌ర్ల‌కే 250 ప‌రుగుల మార్క్ దాటిపోయింది.కెప్టెన్ ఆయుష్ మాత్రేతో క‌లిసి వైభవ్ సూర్యవంశీ రెండో వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాగా ఈ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఈ బిహార్ ఆట‌గాడు ప‌లు వ‌ర‌ల్డ్ రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్‌అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆట‌గాడు మైఖేల్ హిల్(12) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మైఖేల్ హిల్ రికార్డును వైభ‌వ్(15) బ్రేక్ చేశాడు. అదేవిధంగా అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భార‌త ఆట‌గాడిగా 14 ఏళ్ల వైభ‌వ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రాజ్ అంగద్ బావా పేరిట ఉండేది. అత‌డు 2022లో ఉగాండాపై 69 బంతుల్లో సెంచరీ సాధించాడు.Carnage continues as Vaibhav Sooryavanshi brings up 150 in style! 🔥🤩The English bowlers have no answers as the Boss Baby is going all guns blazing with towering sixes! 🙌🏻😮‍💨ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/Dkh4YCXOEC— Star Sports (@StarSportsIndia) February 6, 2026

Harshit Rana Ruled Out Of T20 World Cup 2026 Due To Injury: Sources6
రేపటి నుంచే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్.. టీమిండియాకు భారీ షాక్‌!

టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం(ఫిబ్ర‌వ‌రి 5) దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ మోకాలికి గాయమైంది. దీంతో అత‌డు తీవ్ర‌మైన నొప్పితో విల్ల‌విల్లాడు.వెంట‌నే ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన‌ప్ప‌టికి ఏ మాత్రం ఫలితం లేదు. ఈ క్ర‌మంలో రాణా ఫిజియో సాయంతో ఆట మ‌ధ్య‌లోనే మైదానాన్ని వీడాడు. అనంత‌రం అత‌డిని అస్ప‌త్రికి త‌ర‌లించి స్కాన్లు నిర్వ‌హించారు. అయితే స్కాన్‌లో అతడి గాయం తీవ్ర‌మైన‌దిగా తేలిన‌ట్లు స‌మాచారం.రాణా గాయం నుంచి కోలుకోవ‌డానికి రెండు నుంచి మూడు వారాల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ దూర‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. శుక్ర‌వారం బీసీసీఐ నుంచి కూడా అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డే అవ‌కాశ‌ముంది. కెప్టెన్ల మీట్ సంద‌ర్భంగా భారత సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా హర్షిత్ అందుబాటుపై సందేహం వ్య‌క్తం చేశాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా త‌మ తొలి మ్యాచ్‌లో ఫిబ్ర‌వ‌రి 7న వాంఖ‌డే వేదిక‌గా అమెరికాతో త‌ల‌ప‌డ‌నుంది. ఒక‌వేళ హ‌ర్షిత్ టోర్నీ నుంచి త‌ప్పుకొంటే ప్రసిద్ధ్ కృష్ణను జ‌ట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.

women premier league 2026 statistics full details7
డ‌బ్ల్యూపీఎల్‌ 2026.. టాప్‌లో ఉంది వీరే..

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌(డ‌బ్ల్యూపీఎల్‌) విజ‌య‌వంతంగా ముగిసింది. స్మృతి మంధాన నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస‌గా రెండోసారి విజేత‌గా నిలిచింది. టోర్ని ఆరంభం నుంచి ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించిన ఆర్సీబీ అఖరిపోరులోనూ అదో జోరును కొన‌సాగించి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. వ‌రుస‌గా నాలుగోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశ ఎదురైంది. టైటిల్ విజేత ఆర్సీబీకి రూ. 6 కోట్ల ప్రైజ్‌మ‌నీ దక్కింది. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన డీసీకి రూ. 3 కోట్లు ద‌క్కాయి.ఫైన‌ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైంది. ఓవ‌రాల్‌గా 337 ప‌రుగుల‌తో అంద‌రి కంటే ముందు నిలిచిన ఆమెనే 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్ని' కిరీటం వ‌రించింది. ఈ టోర్న‌మెంట్‌లో ఎక్కువ ఫోర్లు (57) కొట్టింది కూడా ఆమెనే కావ‌డం విశేషం. బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ (68.40) మాత్రం ముంబై కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ న‌మోదు చేసింది. అంతేకాదు అత్య‌ధిక సిక్స‌ర్లు (13) కూడా ఆమెనే బాదింది.ఇక బౌలింగ్‌లోనూ ఢిల్లీ, బెంగ‌ళూరు బౌల‌ర్లు స‌త్తా చాటారు. టాప్‌-10లో న‌లుగురు డీసీ బౌల‌ర్లు, ముగ్గురు ఆర్సీబీ అమ్మాయిలు ఉన్నారు. ఢిల్లీ బౌల‌ర్లు నందినీ శ‌ర్మ 2, తెలుగు అమ్మాయి శ్రీచ‌ర‌ణి 5, చినెల్లే హెన్రీ 6, మారిజాన్ కాప్ 10 స్థానాల్లో నిలిచారు. గుజ‌రాత్ జెయింట్స్ (జీజీ) సోఫీ డివైన్ 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు ప‌డ‌గొట్టి టాప్‌లో నిలిచింది. 10 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసిన నందినీ శ‌ర్మ రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ బౌల‌ర్ న‌దైన్ డిక్లెర్క్ 9 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు ప‌డగొట్టి మూడో స్థానాన్ని ద‌క్కించుకుంది. అమీలియార్ కెర్ (ముంబై), శ్రీచ‌ర‌ణి(డీసీ), చినెల్లే హెన్రీ (డీసీ), లారెన్ బెల్‌(ఆర్సీబీ), రాజేశ్వ‌రి గైక్వాడ్‌(జీజీ), శ్రేయాంక పాటిల్‌(ఆర్సీబీ), మారిజాన్ కాప్(డీసీ) వ‌రుస‌గా త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఫెయిర్ ప్లే: ముంబై ఇండియ‌న్స్‌మోస్ట్ వాల్యుబుల్ ప్లేయ‌ర్‌: సోఫీ డివైన్ (గుజ‌రాత్‌)సూప‌ర్ స్టైక‌ర్ ఆఫ్ ది సీజ‌న్‌: గ్రేస్ హారిస్‌(ఆర్సీబీ)ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: గ్రేస్ హారిస్‌ (ఆర్సీబీ)ఫాస్టెస్ట్ సెంచ‌రీ: నాట్ స్కైవర్-బ్రంట్ (ముంబై)హ‌య్య‌స్ట్ స్కోర్: నాట్ స్కైవర్-బ్రంట్ (ముంబై)బెస్ట్ బ్యాటింగ్ స్టైక్ రేట్‌: ఆశా శోభ‌న (యూపీ వారియ‌ర్స్‌)బ్యాటింగ్‌లో ఇర‌గ‌దీసింది వీరే 1. స్మృతి మంధాన (377)- బెంగ‌ళూరు2. హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (342)- ముంబై3. నాట్ స్కైవర్-బ్రంట్ (321)- ముంబై4. లిజెల్ లీ (320)- ఢిల్లీ5. లారా వోల్వార్డ్ట్(317)- ఢిల్లీ6. జెమిమా రోడ్రిగ్స్ (264)-ఢిల్లీ7. షెఫాలీ వ‌ర్మ (259)- ఢిల్లీ8. బెత్ మూనీ (258)- గుజ‌రాత్‌9. మెగ్ లానింగ్(248)- యూపీ10. ఆష్లీ గార్డనర్ (244)- గుజ‌రాత్‌బౌలింగ్‌లో అద‌ర‌గొట్టింది వీరే..మోస్ట్‌ మేడిన్స్‌: లారెన్ బెల్ (ఆర్సీబీ)మోస్ట్ గ్రీన్ డాట్ బాల్స్‌: లారెన్ బెల్ (ఆర్సీబీ)మోస్ట్ డాట్ బాల్స్‌: లారెన్ బెల్ (ఆర్సీబీ)బెస్ట్ బౌలింగ్ యావ‌రేజ్‌: ప్రేమ రావ‌త్ (ఆర్సీబీ)బెస్ట్ ఎకాన‌మీ రేట్‌: లారెన్ బెల్ (ఆర్సీబీ)బెస్ట్ బౌలింగ్‌ ఎకాన‌మీ: మారిజాన్ కాప్ (డీసీ)బెస్ట్ బౌలింగ్‌ స్టైక్ రేట్‌: ప్రేమ రావ‌త్ (ఆర్సీబీ)బెస్ట్ ఫిగ‌ర్స్‌: శ్రేయాంక పాటిల్‌(ఆర్సీబీ)చ‌ద‌వండి: ఆర్సీబీ విన్‌.. విరాట్‌ కోహ్లి పోస్ట్ వైర‌ల్‌

U19 WC 2026 Final Ind vs Eng: Vaibhav Suryavanshi History World Record8
WC: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. వరల్డ్‌ రికార్డు

భారత యువ క్రికెట్‌ తరంగం వైభవ్‌ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన ఖాతాలో మరో ప్రపంచ రికార్డును జమ చేసుకున్నాడు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు.ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, యూత్‌ వన్డేల్లో అతి పిన్న వయసులోనే ఫాస్టెస్ట్‌ సెంచరీలు నమోదు చేసిన వైభవ్‌ సూర్యవంశీ ప్రస్తుతం అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్‌ ఫైనల్‌కు చేరింది.55 బంతుల్లో సెంచరీఇందులో భాగంగా శుక్రవారం నాటి టైటిల్‌ పోరులో ఇంగ్లండ్‌తో తలపడుతున్న ఆయుశ్‌ మాత్రే బృందం.. హరారే వేదికగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో ఆరోన్‌ జార్జ్‌ (9) విఫలం కాగా.. 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ నెమ్మదిగా ఆరంభించినా వేగం పెంచాడు. ఫలితంగా 32 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న పద్నాలుగేళ్ల ఈ చిచ్చర పిడుగు.. 55 బంతుల్లో సెంచరీ సాధించాడు.That's a BIGGIEEEE! 🤯🔥Vaibhav Sooryavanshi is unstoppable at the moment as he scores a MASSIVE SIX off Farhan Ahmed while the 100 run-stand between Boss Baby & Ayush! 🔥🙌🏻ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/O876Ot9LrZ— Star Sports (@StarSportsIndia) February 6, 2026ఈ క్రమంలో ఐదు సిక్సర్లు బాదిన వైభవ్‌ సూర్యవంశీ.. ఈ ఎడిషన్‌లో ఇరవై సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ చరిత్రకెక్కాడు. మొత్తంగా 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌ సూర్యవంశీ 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాది ఏకంగాఇ 175 పరుగులు సాధించాడు. అయితే, లమ్స్‌డన్‌ బౌలింగ్‌లో థామస్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ డబుల్‌ సెంచరీ చేయకుండానే నిష్క్రమించాడు.అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు🏏వైభవ్‌ సూర్యవంశీ- 2026లో 20*🏏డెవాల్డ్‌ బ్రెవిస్‌- 2022లో 18🏏ఫిన్‌ అలెన్‌- 2016, 2018లో కలిపి 18🏏జాక్‌ బర్న్‌హామ్‌- 2016లో 15🏏మైకేల్‌ హిల్‌-2008లో 14🏏నికోలస్‌ పూరన్‌- 2014లో 14.వరల్డ్‌కప్‌-2026 ఫైనల్‌ భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తుదిజట్లుభారత్‌ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్‌), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్‌ కీపర్‌), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ఇంగ్లండ్‌బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ రూ (వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్చదవండి: మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ

Huge Blow To Australia Another Star Ruled Out Of T20 WC 20269
ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో పేస్‌ బౌలర్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.హాజిల్‌వుడ్‌ అవుట్‌గత కొన్నాళ్లుగా తొడ కండరాల నొప్పి, చీలమండ గాయంతో బాధపడుతున్న జోష్‌ హాజిల్‌వుడ్‌ (Josh Hazlewood) ఇంకా కోలుకోలేదు. దీంతో వరల్డ్‌కప్‌ టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా శుక్రవారం ధ్రువీకరించింది. అయితే, ఇప్పటికే హాజిల్‌వుడ్‌కు బ్యాకప్‌గా ప్రకటించిన సీన్‌ అబాట్‌ను జట్టుతోనే కొనసాగించిన యాజమాన్యం.. ప్రధాన జట్టులో హాజిల్‌వుడ్‌ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని మాత్రం ఎంపిక చేయలేదు.కాగా గాయాల బెడద కారణంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కు హాజిల్‌వుడ్‌ దూరమైన సంగతి తెలిసిందే. నవంబరు నుంచి ఇప్పటివరకు అతడు మైదానంలో దిగనే లేదు. అయితే, వరల్డ్‌కప్‌ నాటికి కోలుకుంటాడని భావించిన సెలక్టర్లు అతడికి జట్టులో చోటిచ్చారు. కానీ హాజిల్‌వుడ్‌ పరిస్థితి మెరుగుపడలేదు.రిస్క్‌ తీసుకోలేముఈ విషయం గురించి ఆసీస్‌ సెలక్టర్‌ టోనీ డొడెమేడ్‌ మాట్లాడుతూ.. "జోష్‌ సూపర్‌-8 దశ వరకైనా ఫిట్‌నెస్‌ సాధిస్తాడని భావించాము. అయితే, ఇంకా అతడు కోలుకోలేదు.ఇందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఈ విషయంలో మేము రిస్క్‌ తీసుకోవాలని అనుకోవడం లేదు.అయితే, జోష​్‌ స్థానంలో ఇప్పుడే ఆటగాడిని ప్రకటించడం లేదు. ఆరంభమ్యాచ్‌లలో మాకంత అవసరం లేదనిపిస్తోంది. కొన్నాళ్ల తర్వాత జోష్‌ స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేసే విషయం గురించి ఆలోచిస్తాము’’ అని తెలిపాడు. కాగా వెన్నునొప్పి నుంచి కోలుకోని కారణంగా కమిన్స్‌ దూరం కాగా.. అతడి స్థానాన్ని బెన్‌ డ్వార్షుయిస్‌ భర్తీ చేసిన సంగతి తెలిసిందే.కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో ఆసీస్‌.. ఐర్లాండ్‌, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఒమన్‌లతో కలిసి గ్రూప్‌-బిలో ఉంది. కాగా ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో ఆసీస్‌ తమ తొలిమ్యాచ్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ట్రావెలింగ్ రిజర్వ్: సీన్ అబాట్చదవండి: మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ

Will ICC Knock Out India: Nasser Hussain Comment Draws Strong Reaction10
T20 WC: భారత్‌ను తొలగిస్తారా?: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఓవరాక్షన్‌

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హొసేన్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లకు మద్దతు ఇవ్వాలనుకుంటే పర్లేదని.. కానీ అనవసరంగా భారత్‌ను ఇందులోకి లాగితే సహించేది లేదని సోషల్‌ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నేపథ్యంలో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఆతిథ్య దేశమైన భారత్‌లో తమకు భద్రత లేదని.. పాక్‌తో పాటు తమ మ్యాచ్‌లను కూడా శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్‌ కోరింది. అయితే, బంగ్లా ఆరోపణల్లో నిజం లేదని తేల్చిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) పునరాలోచన చేయాల్సిందిగా బంగ్లాకు అవకాశం ఇచ్చింది.బంగ్లా మొండివైఖరికి భారీ మూల్యంఅయినప్పటికీ బంగ్లాదేశ్‌ మొండి వైఖరి వీడకపోవడంతో బంగ్లాను టోర్నీ నుంచి తొలగించిన ఐసీసీ.. రాంకింగ్స్‌ ఆధారంగా స్కాట్లాండ్‌ను టోర్నీలో చేర్చింది. ఈ నేపథ్యంలో తాము బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్‌ చేస్తామని పాక్‌ ప్రకటించింది.భారత్‌ను తొలగిస్తారా?ఈ పరిణామాలపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హొసేన్‌ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ద్వంద్వ వైఖరి మీకు మాత్రమే సాధ్యమంటూ టీమిండియా అభిమానులు అతడిని తిట్టిపోస్తున్నారు. స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. "ఒకవేళ టోర్నమెంట్‌ ఆరంభానికి నెల రోజుల ముందు.. ఇండియా.. 'మా ప్రభుత్వం ఆ దేశంలో వరల్డ్‌కప్‌ ఆడేందుకు ఒప్పుకోలేదు’ అని చెబితే..ఇదే ఐసీసీ.. 'మీకు నిబంధనలు తెలుసు కదా! బ్యాడ్‌ లక్‌.. మిమ్మల్ని టోర్నీ నుంచి తొలగిస్తున్నాం’ అని చెప్పగలదా?.. అందరినీ సమానంగా చూడాలని మాత్రమే నేను చెబుతున్నా. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, టీమిండియా.. అన్నింటినీ ఒకే విధంగా చూడాలి.మా దగ్గర డబ్బు ఉందిఇప్పుడు టీమిండియా అభిమానులు వచ్చి.. 'మాపై పడి ఏడవండి. మా దగ్గర డబ్బు ఉంది’ అంటే మనమేమీ చేయలేము. అధికారం ఉన్నవాళ్లే బాధ్యతగానూ ఉండాలి’’ అని నాసిర్‌ హొసేన్‌ అన్నాడు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.అపుడేమో గర్వంగా ఉందన్నావ్‌!"బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లపై మీకు సానుభూతి ఎందుకో మాకు బాగా తెలుసు. అయినా గతంలో జరిగిన విషయాలు మీకు గుర్తున్నాయా?.. 2003లో జింబాబ్వే జట్టును బాయ్‌కాట్‌ చేసింది ఇంగ్లండ్‌ కాదా? అప్పుడు తమరే కెప్టెన్‌గా ఉన్నారు కదా!ఆ సమయంలో.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా ఉన్నందుకు గర్వంగా ఉంది. జింబాబ్వేకు వెళ్లకపోవడమే మంచిది అని మీరు అనలేదా? 2009 టీ20వరల్డ్‌కప్‌ సమయంలో జింబాబ్వే ఆటగాళ్లకు వీసాలు నిరాకరించి... వారిని టోర్నీ నుంచి తప్పుకొనేలా చేసింది మీరు కాదా?మీరు చేస్తే ఒప్పు.. వేరే వాళ్లు చేస్తే తప్పా? ఇప్పుడు శుద్ధపూసలాగా క్రికెట్‌- రాజకీయం కలపవద్దు అని సూక్తులు వల్లిస్తున్నారు. మరి ఆరోజు ఏమైంది మీ పెద్ద మనసు. నాడు ఇంగ్లండ్‌ ఏం చేసిందంటేబంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ ఎలాంటి పనులు చేసినా మీకు నచ్చుతుందేమో! అందరూ మీలా ఉండరు’’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా 2003లో జింబాబ్వేలో రాబర్ట్‌ ముగాబే పాలనను నిరసిస్తూ హరారేలో ఆడాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ బహిష్కరించింది. రాజకీయ, భద్రతాపరమైన కారణాలు చూపుతూ ఇలా చేసింది.అందుకే నాసిర్‌ హొసేన్‌కు ఆ విషయాన్ని గుర్తుచేస్తూ అతడి ద్వంద్వ వైఖరిని నెటిజన్లు ఎండగడుతున్నారు. కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై హత్యాకాండ జరుగగా.. ఐపీఎల్‌ నుంచి ముస్తాఫిజుర్‌ను బీసీసీఐ తొలగించింది. దీనిని సాకుగా చూపి భద్రతా కారణాలంటూ బంగ్లాదేశ్‌ రాగం ఎత్తుకుని మూల్యం చెల్లించింది. మరోవైపు.. పాక్‌లో గతంలో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.చదవండి: మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement