Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India to face Australia women in second T20 today1
మరో విజయం లక్ష్యంగా... నేడు రెండో టి20లో ఆస్ట్రేలియాతో భారత్‌ ‘ఢీ’

కాన్‌బెర్రా: ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుపై తొలి టి20లో నెగ్గిన భారత జట్టు... మరో విజయం లక్ష్యంగా నేడు జరిగే రెండో టి20లో బరిలోకి దిగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1:45 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సిడ్నీలో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ పేసర్‌ అరుంధతి రెడ్డి (4/22) కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శన చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా 133 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత జట్టు 5.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. ఫలితం రావడానికి అవసరమైన కనీస ఐదు ఓవర్లు పూర్తి కావడంతో... ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతి ప్రకారం టీమిండియా 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌లో కనబరిచిన జోరును పునరావృతం చేసి సిరీస్‌లో 2–0తో ముందంజ వేయాలని హర్మన్‌ బృందం భావిస్తోంది.

Jammu and Kashmir team qualifies for Ranji Trophy final for the first time2
జమ్మూకశ్మీర్‌ కొత్త చరిత్ర

కల్యాణి (పశ్చిమ బెంగాల్‌): సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. రంజీ ట్రోఫీలో అడుగు పెట్టిన 67 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ జట్టు తొలిసారి ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. రెండుసార్లు చాంపియన్‌ బెంగాల్‌ జట్టుతో నాలుగు రోజుల్లో ముగిసిన సెమీఫైనల్లో పారస్‌ డోగ్రా సారథ్యంలోని జమ్మూకశ్మీర్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. బెంగాల్‌ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 43/2తో నాలుగో రోజు జమ్మూకశ్మీర్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించింది. 21.4 ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయి 83పరుగులు సాధించి జమ్మూకశ్మీర్‌ విజయఢంకా మోగించింది. శుభమ్‌ పుందిర్‌ (27), పారస్‌ డోగ్రా (9) పెవిలియన్‌ చేరుకున్నా... వన్షజ్‌ శర్మ (83 బంతుల్లో 43 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), అబ్దుల్‌ సమద్‌ (27 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) జమ్మూకశ్మీర్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు. తొమ్మిది వికెట్లు తీయడంతోపాటు 42 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్‌ ఆటగాడు ఆకిబ్‌ నబీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారంతోపాటు రూ. 50 వేలు ప్రైజ్‌మనీ దక్కింది. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు... జమ్మూకశ్మీర్‌ 302 పరుగులు చేశాయి. బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక, ఉత్తరాఖండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్‌ విజేత జట్టుతో ఈనెల 24 నుంచి హుబ్లీ వేదికగా జరిగే రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్‌ జట్టు తలపడుతుంది. 802 పరుగుల ఆధిక్యంలో కర్ణాటక లక్నోలో ఉత్తరాఖండ్‌ జట్టుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కర్ణాటక జట్టు 802 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 149/5తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఉత్తరాఖండ్‌ జట్టు 88.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్‌ పాటిల్, విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ మూడు వికెట్ల చొప్పున తీశారు. 503 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన కర్ణాటక ప్రత్యర్థి జట్టుకు ఫాలోఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ ఆడాలని నిర్ణయం తీసుకుంది. ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రవిచంద్రన్‌ స్మరణ్‌ (127; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధించడం విశేషం. కేఎల్‌ రాహుల్‌ (70 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), కృతిక్‌ కృష్ణ (52; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా కర్ణాటక జట్టు ఫైనల్‌ చేరుకుంటుంది.

Rutuja Bhosle lost in Dubai Open WTA 1000 tournament3
రుతుజా జోడీ ఓటమి

దుబాయ్‌: భారత మహిళల టెన్నిస్‌ డబుల్స్‌ నంబర్‌వన్‌ రుతుజా భోస్లే దుబాయ్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రుతుజా (భారత్‌)–పీంగ్‌టార్న్‌ ప్లిపుయెచ్‌ (థాయ్‌లాండ్‌) ద్వయం 3–6, 6–7 (4/7)తో నాలుగో సీడ్‌ అనా డానిలినా (కజకిస్తాన్‌)–అలెగ్జాండ్రా క్రునిక్‌ (సెర్బియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి రౌండ్‌లో రుతుజా–ప్లిపుయెచ్‌ 7–5, 6–2తో ఇరి హొజుమి (జపాన్‌)–ఫాంగ్‌ సియెన్‌ వు (చైనీస్‌ తైపీ)లపై గెలిచారు. ఈ విజయంతో సానియా మీర్జా (2022లో సిన్సినాటి ఓపెన్‌) తర్వాత డబ్ల్యూటీఏ–1000 లెవెల్‌ టోర్నీలో మ్యాచ్‌ గెలిచిన రెండో భారత ప్లేయర్‌గా రుతుజా గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిన రుతుజా–ప్లిపుయెచ్‌లకు 17,200 డాలర్ల (రూ. 15 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 120 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

T20 World Cup 2026: Team India wins against Netherlands4
అజేయంగా... అగ్రస్థానంతో

అహ్మదాబాద్‌: టి20 వరల్డ్‌ కప్‌లో లీగ్‌ దశను భారత జట్టు నాలుగు వరుస విజయాలతో అజేయంగా ముగించింది. గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన అన్ని మ్యాచ్‌లూ గెలిచి అగ్రస్థానంతో ‘సూపర్‌ ఎయిట్స్‌’కు సిద్ధమైంది. బుధవారం జరిగిన పోరులో భారత్‌ 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై నెగ్గింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శివమ్‌ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెపె్టన్‌ సూర్యకుమార్‌ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్స్‌లు) మెరిపించారు. అనంతరం నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసి ఓడిపోయింది. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడుతుంది. చివరి 5 ఓవర్లలో 75... భారత్‌ టాప్‌–3 కూడా ఎడంచేతివాటం బ్యాటర్లు కావడంతో ఆఫ్‌స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్‌తో తొలి ఓవర్‌ వేయించి నెదర్లాండ్స్‌ చేసిన ప్రయోగం బాగా పని చేసింది. మూడో బంతికే అభిషేక్‌ శర్మ (0) బౌల్డ్‌ కాగా, ఇషాన్‌ కిషన్‌ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా ఆర్యన్‌ రెండో ఓవర్లో బౌల్డ్‌ అయ్యాడు. మరోవైపు తిలక్‌ కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో స్కోరు 51/2కు చేరింది. అయితే ఈ దశలో డచ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వరుసగా 20 బంతుల పాటు బౌండరీనే రాలేదు! వ్యక్తిగత స్కోరు 13 వద్ద లెవిట్‌ క్యాచ్‌ వదిలేయడంతో సూర్యకు లైఫ్‌ లభించింది. అయితే అదే ఓవర్లో తిలక్‌ వెనుదిరిగాడు. అనంతరం 2 పరుగుల వద్ద ఎల్బీ అప్పీల్‌పై ‘అంపైర్స్‌ కాల్‌’తో బతికిపోయిన దూబే ఆపై చెలరేగిపోయాడు. అకెర్‌మన్‌ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు. నాలుగో వికెట్‌కు దూబేతో 76 పరుగులు (35 బంతుల్లో) జోడించిన తర్వాత సూర్య అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 118/4. ఇక్కడి నుంచి దూబే, పాండ్యా ధాటిగా ఆడటంతో చివరి 5 ఓవర్లలో భారత్‌ 8 సిక్స్‌లు, 3 ఫోర్లతో 75 పరుగులు జోడించడం విశేషం. వాన్‌ బీక్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదిన దూబే 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టపటపా... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్‌ బ్యాటింగ్‌లో ఏ దశలోనూ దూకుడు కనిపించలేదు. పవర్‌ప్లేలో 36/1తో ఉన్న జట్టు స్కోరు సగం ఓవర్లు ముగిసేసరికి 72/2కు చేరింది. అయితే తర్వాత 31 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 కీలక వికెట్లు కోల్పోయిన డచ్‌ వేగంగా ఓటమి వైపు సాగింది. కాషెట్‌ (26), క్రోస్‌ (25 నాటౌట్‌) చివర్లో 23 బంతుల్లో 47 పరుగులు జోడించి కొంత పోరాడినా...అప్పటికే ఆలస్యమైపోయింది.స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (బి) దత్‌ 0; ఇషాన్‌ (బి) దత్‌ 18; తిలక్‌ (సి) మెర్వ్‌ (బి) వాన్‌ బీక్‌ 31; సూర్య (సి) (సబ్‌) గగ్‌టెన్‌ (బి) క్లీన్‌ 34; దూబే (సి) (సబ్‌) గగ్‌టెన్‌ (బి) బీక్‌ 66; పాండ్యా (సి) మెర్వ్‌ (బి) బీక్‌ 30; రింకూ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–69, 4–110, 5–186, 6–193. బౌలింగ్‌: ఆర్యన్‌ దత్‌ 4–0–19–2, వాన్‌ బీక్‌ 4–0–56–3, అకెర్‌మన్‌ 3–0–36–0, కైల్‌ క్లీన్‌ 4–0–38–1, డి లీడ్‌ 4–0–28–0, వాన్‌డర్‌ మెర్వ్‌ 1–0–15–0. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: లావిట్‌ (సి) సుందర్‌ (బి) పాండ్యా 24; డౌడ్‌ (బి) వరుణ్‌ 20; డి లీడె (సి) వరుణ్‌ (బి) దూబే 33; అకెర్‌మన్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 23; దత్‌ (బి) వరుణ్‌ 0; ఎడ్వర్డ్స్‌ (బి) బుమ్రా 15; కాషెట్‌ (సి) వాషింగ్టన్‌ సుందర్‌ (బి) దూబే 26; క్రోస్‌ (నాటౌట్‌) 25; బీక్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–35, 2–51, 3–94, 4–94, 5–112, 6–125, 7–172. బౌలింగ్‌: అర్ష్ దీప్ 3–0–22–0, బుమ్రా 3–0–17–1, సుందర్‌ 4–0–36–0, వరుణ్‌ 3–0–14–3, పాండ్యా 3–0–40–1, అభిషేక్‌ 1–0–10–0, దూబే 3–0–35–2. అభిషేక్‌ శర్మ 0, 0, 0... వరల్డ్‌ కప్‌కు ముందు అసాధారణ ఫామ్‌తో రికార్డులు బద్దలు కొడుతూ వచ్చిన అభిషేక్‌ శర్మకు ఇక్కడ మాత్రం ఏదీ కలిసి రావడం లేదు. అమెరికాతో తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయిన అతను అనారోగ్యం కారణంగా నమీబియాతో బరిలోకి దిగలేదు. ఆపై వరుసగా పాక్, నెదర్లాండ్స్‌లపై కూడా ‘సున్నా’లే నమోదు చేయడం తీవ్ర నిరాశను కలిగించే అంశం. బుధవారం మ్యాచ్‌లో అతని జెర్సీ విషయంలో కొంత డ్రామా చోటు చేసుకోవడంతో ఇన్నింగ్స్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. తన జెర్సీని అభిషేక్‌ హోటల్‌లో మరచిపోవడంతో మరో జెర్సీ కోసం వెతకాల్సి వచ్చింది. ముందుగా అతను అర్ష్ దీప్ జెర్సీని తీసుకున్నాడు. అయితే అర్ష్ దీప్ కు తుది జట్టులో చోటు దక్కడంతో చివరకు సిరాజ్‌ జెర్సీ (73 నంబర్‌)తో బ్యాటింగ్‌ వచ్చాడు. అయితే జెర్సీ మారినా అదృష్టం మాత్రం మారలేదు. ఫీల్డింగ్‌ సమయంలో మాత్రం అతను తన జెర్సీ (4)తోనే కనిపించాడు. టి20 ప్రపంచకప్‌ సూపర్‌–8 మ్యాచ్‌ల షెడ్యూల్‌

T20 WC 2026: India set 194 runs target to Netherlands5
సిక్సర్లతో విరుచుకుపడిన శివమ్‌ దూబే.. టీమిండియా భారీ స్కోర్‌

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.శివమ్‌ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడి భారత్‌కు భారీ స్కోర్‌ అందించాడు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్‌లో 3 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్‌ ఓ సిక్సర్‌ బాది అజేయంగా నిలిచాడు.అంతకుముందు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్‌), తిలక్‌ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) నిదానంగా ఆడి విసుగు తెప్పించారు. వారికి ముందు ఇషాన్‌ కిషన్‌ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్‌) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఆర్యన్‌ దత్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.ఈ మెగా టోర్నీలో దారుణమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ ఈ మ్యాచ్‌లోనూ ఉసూరుమనిపించాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌటై టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు.నెదర్లాండ్స్‌ బౌలర్లలో లోగాన్‌ వాన్‌ బీక్‌ (4-0-56-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఆర్యన్‌ దత్‌ (4-0-19-2) కెరీర్‌లోనే అత్యుత్తమ స్పెల్‌ వేశాడు. బాస్‌ డి లీడ్‌ (4-0-28-0) పొదుపుగా బౌలింగ్‌ చేసి పర్వాలేదనిపించాడు. 19వ ఓవర్‌లో మాత్రమే 21 పరుగులిచ్చిన కైల్‌ క్లెయిన్‌ (4-0-38-1) అంతకుముందు ఓవర్లలో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశాడు. కొలిన్‌ ఆకెర్‌మన్‌ (3-0-36-0), వాన్‌ డర్‌ మెర్వ్‌ (1-0-15-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్‌ సూపర్‌-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌కు సైతం ఈ మ్యాచ్‌ ఫలితంతో ఎలాంటి ఉపయోగం లేదు. ఈ జట్టు ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

T20 WC 2026 IND VS NED: Abhishek sharma third duck out in a row6
T20 WC 2026: కొనసాగుతున్న అభిషేక్‌ శర్మ చెత్త ప్రదర్శన

టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ చెత్త ఫామ్‌ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తానాడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో (యూఎస్‌ఏ, పాకిస్తాన్‌) డకౌట్లైన అభిషేక్‌.. ఇవాళ (ఫిబ్రవరి 18) పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఖాతా తెరవలేక హ్యాట్రిక్‌ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ అయిన అభిషేక్‌ తన తొలి టీ20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడినా ఖాతా తెరవలేకపోవడం శోచనీయం. అభిషేక్‌కు చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో ఇది ఐదో డకౌట్‌ కావడం మరింత శోచనీయం.ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ను జెర్సీ మార్పు కూడా కాపాడలేకపోయిం​ది. అభిషేక్‌ తన రెగ్యులర్‌ జెర్సీ కాకుండా సిరాజ్‌ వేసుకునే 73వ నంబర్‌ జెర్సీ ధరించి బరిలోకి దిగినా ఖాతా తెరవలేకపోయాడు.తాజా డకౌట్‌ తర్వాత అభిషేక్‌ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ (2024) సరసన చేరాడు. సంజూ, అభిషేక్‌ ఇప్పుడు తలో ఐదు డకౌట్లతో ఉన్నారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ కష్టాల్లో ఉంది. పవర్‌ ప్లేలోనే (తొలి 6 ఓవర్లలో) ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (0), ఇషాన్‌ కిషన్‌ (18) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. 6 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 51-2గా ఉంది. తిలక్‌ వర్మ (26), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా కోల్పోయిన రెండు వికెట్లు స్పిన్నర్‌ ఆర్మన్‌ దత్‌కే దక్కాయి. అభిషేక్‌, ఇషాన్‌లను దత్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడం​ విశేషం.

T20 WC 2026: Spinners secure Pakistan Super Eight's berth after Farhan hundred7
T20 WC 2026: సూపర్‌-8లోకి పాకిస్తాన్‌

టీ20 ప్రపంచకప్‌ 2026లో పాకిస్తాన్‌ ఎట్టకేలకు సూపర్‌-8కు అర్హత సాధించింది. పసికూన నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల భారీ తేడాతో గెలిచి చివరి సూపర్‌-8 బెర్త్‌ దక్కించు​కుంది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు పసికూనలపై ప్రతాపం చూపించారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో చెలరేగి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పాక్‌ సూపర్‌-8కు అర్హత సాధించడంతో అప్పటిదాకా పోటీలో ఉన్న యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమించింది.టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (58 బంతుల్లో 100 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 36 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించగా.. సైమ్‌ అయూబ్‌ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), ఖ్వాజా నఫాయ్‌ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్‌ స్కోల్జ్‌ (4-0-33-0), రూబెన్‌ ట్రంపల్మెన్‌ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్‌ చేయగా.. జాక్‌ బ్రస్సెల్‌ (4-0-48-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (3-0-25-1), జేజే స్మిట్‌ (3-0-28-0) పర్వాలేదనిపించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా పాక్‌ స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసింది. ఉస్మాన్‌ తారిఖ్‌ (3.3-1-16-4), షాదాబ్‌ ఖాన్‌ (4-0-19-3), మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-22-1) దెబ్బకు 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ సల్మాన్‌ మీర్జా కూడా ఓ వికెట్‌ తీశాడు. నమీబియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ లారెన్‌ స్టీన్‌కాంప్‌ (23), మిడిలార్డర్‌ బ్యాటర్‌ అలెగ్జాండర్‌ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో నమీబియా ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

T20 WC 2026: India won the toss and choose to bat against Netherlands8
T20 WC 2026: పసికూనతో పోరు.. టీమిండియాలో రెండు మార్పులు

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌ ఇవాళ (ఫిబ్రవరి 18) తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. నామమాత్రపు ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ స్థానాల్లో అర్షదీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు నెదర్లాండ్స్‌ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. ఫ్రెడ్‌ క్లాసెన్‌ స్థానంలో నోవా క్రాస్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చాడు. కాగా, ఈ మెగా టోర్నీలో భారత్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించి, సూపర్‌-8కు చేరగా.. నెదర్లాండ్స్‌ 3 మ్యాచ్‌ల్లో రెండిట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), జాచ్ లయన్-కాచెట్, నోహ్ క్రోస్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్భారత్: ఇషాన్ కిషన్(w), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

Karnataka young batter smaran ravichandran sprinting towards team india, with sensational performances9
టీమిండియావైపు దూసుకొస్తున్న కర్ణాటక యువ సంచలనం

భారత దేశవాలీ క్రికెట్‌లో ప్రస్తుతం స్మరణ్‌ రవిచంద్రన్‌ అనే పేరు మార్మోగిపోతుంది. 22 ఏళ్ల ఈ కర్ణాటక యువ బ్యాటర్‌ ఫార్మాట్లకతీతంగా వరుస సెంచరీలు, డబుల్‌ సెంచరీలతో చెలరేగిపోతూ భారత క్రికెట్‌లో పెను సంచలనంగా మారాడు. ఎడమ చేతి వాటం అటాకింగ్‌ మిడిల్డార్‌ బ్యాటర్‌ అయిన స్మరణ్‌.. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు.13 ఇన్నింగ్స్‌ల్లో 2 డబుల్‌ సెంచరీలు, 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 950 పరుగులు (95 సగటున) చేసిన స్మరణ్‌.. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఢిల్లీ బ్యాటర్‌ ఆయుశ్‌ దొసేజాను (949 పరుగులు) అధిగమించాడు. స్మరణ్‌ భీకర ఫామ్‌ చూసి సహచర క్రికెటర్లు అవాక్కవుతున్నారు. విశ్లేషకులు సైతం అబ్బురపడుతున్నారు.ట్విన్‌ సెంచరీస్‌ప్రస్తుతం ఉత్తరాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో స్మరణ్‌ ఉగ్రరూపం దాల్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (135, 127) చేసి భీకర ఫామ్‌ను కొనసాగించాడు. స్మరణ్‌ సహా దేవదత్‌ పడిక్కల్‌ (232), కేఎల్‌ రాహుల్‌ (141, 70 నాటౌట్‌) శివాలెత్తడంతో ఈ మ్యాచ్‌లో కర్ణాటక బంపర్‌ విక్టరీ దిశగా సాగుతోంది. మొత్తం 3 డబుల్‌ సెంచరీలు, 3 సెంచరీలుతాజా ప్రదర్శనతో స్మరణ్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 1500 పరుగుల మైలురాయిని దాటాడు. 25 ఇన్నింగ్స్‌ల స్వల్ప కెరీర్‌లో 3 డబుల్‌ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీల సాయంతో 1500 పరుగుల మార్కును క్రాస్‌ చేశాడు. అతని కెరీర్‌ సగటు 72కు పైగా ఉండటం విశేషం.లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ తిరుగలేని మొనగాడే..!స్మరణ్‌ సెంచరీల మోత, పరుగుల ప్రవాహం ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు మాత్రమే పరిమితం​ కాలేదు. ఈ మైసూరు కుర్రాడు లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల (2024-25) కర్ణాటక విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ సాధించడంలో స్మరణ్‌ అత్యంత కీలకపాత్ర పోషించాడు. సెమీఫైనల్లో మ్యాచ్‌ విన్నింగ్‌ హాఫ్‌ సెంచరీతో (76) పాటు, ఫైనల్లో మెరుపు సెంచరీ (101) చేసి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో మొత్తం 14 ఇన్నింగ్స్‌లు ఆడిన స్మరణ్‌ 96.48 స్ట్రయిక్‌రేట్‌తో 50కి పైగా సగటున 2 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 604 పరుగులు చేశాడు.పొట్టి ఫార్మాట్‌లోనూ పర్వాలేదుఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఏ ఫార్మాట్లతో పోలిస్తే స్మరణ్‌ టీ20 ఫార్మాట్‌ రికార్డు ఓ మోస్తరుగా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో స్మరణ్‌ 13 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 162.45 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ద సెంచరీల సాయంతో 489 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.బౌలింగ్‌లోనూ మెరిపిస్తాడుస్మరణ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ మెరిపించగల సమర్దుడు. కుడి చేతి ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేసే స్మరణ్‌ కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్‌ చేయగలడు. లోకల్‌ క్రికెట్‌లో అతను బౌలింగ్‌లోనూ ప్రూవ్‌ చేసుకున్నాడు.అనుకోకుండా వచ్చిన ఐపీఎల్‌ అవకాశంస్మరణ్‌కు ఐపీఎల్‌ 2025లో ఊహించని విధంగా అవకాశం వచ్చింది. ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా గాయపడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్మరణ్‌కు అక్కున చేర్చుకుంది (30 లక్షలు). అయితే స్మరణ్‌కు ఆ సీజన్‌లో అవకాశాలు దక్కలేదు. స్మరణ్‌పై భారీ అంచనాలు ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ అతన్ని 2026 సీజన్‌కు కూడా రీటైన్‌ చేసుకుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో స్మరణ్‌కు అవకాశం దొరికి ఇదే తరహాలో చెలరేగితే, త్వరలోనే టీమిండియా తలుపులు తట్టడం ఖాయమని క్రికెట్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

T20 WC 2026: Sahibzada farhan slams hundred, pakistan set 200 runs target to Namibia10
T20 WC 2026: పసికూనపై పాక్‌ బ్యాటర్ల ప్రతాపం

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. సూపర్‌-8కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ముఖ్యంగా ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (58 బంతుల్లో 100 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఆఖర్లో షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 36 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.​ మధ్యలో కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఓపెనర్‌ సైమ్‌ అయూబ్‌ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు)కు కూడా మంచి ఆరంభమే లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో ఖ్వాజా నఫాయ్‌ (5) తొందరగా ఔటయ్యాడు. మొత్తంగా పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో నమీబియా బౌలర్లు తమ సామర్థ్యానికి మించి రాణించారు. వికెట్లు తీయలేకపోయినా, జోరుమీదున్న పాక్‌ బ్యాటర్లకు కళ్లెం వేశారు. బెర్నాల్డ్‌ స్కోల్జ్‌ 4 ఓవర్లలో 33 పరుగులు, రూబెన్‌ ట్రంపల్మెన్‌ 4 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చి పా​్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. జాక్‌ బ్రస్సెల్‌ (4-0-48-2) పరుగులు కాస్త ఎక్కువగానే సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (3-0-25-1), జేజే స్మిట్‌ (3-0-28-0) పర్వాలేదనిపించారు. మైబుర్గ్‌ (2-0-27-0) ఒక్కడే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో నమీబియా బౌలర్లు కేవలం​ 6 ఎక్స్‌ట్రాలు మాత్రమే ఇవ్వడం విశేషం.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement