Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Drop Abhishek Sharma: Kaif Suggestion Ahead Of IND v NZ T20 WC Final1
IND vs NZ: అభిషేక్‌ శర్మ వద్దు.. అతడిని ఆడించండి!

న్యూజిలాండ్‌తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్‌ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్‌కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.అయితే, టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్‌ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్‌ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.విశ్రాంతినివ్వాలి‘‘అభిషేక్‌ శర్మకు మేనేజ్‌మెంట్‌ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్‌లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్‌లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.టీమిండియాతో సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌.. ఫామ్‌లో లేని బ్రాండన్‌ కింగ్‌కు బదులు.. రోస్టన్‌ ఛేజ్‌ను ఓపెనర్‌గా ఆడించింది. బ్రాండన్‌రు ఐదు- ఆరు మ్యాచ్‌లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్‌ అయినా సరే అతడికి బ్రేక్‌ ఇచ్చారు.టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్‌లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.రింకూను ఆడించండిటెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్‌ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్‌లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్‌ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.అవును.. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్‌ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్‌ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్‌ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు. సంజూతో పోలిక వద్దుఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్‌-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్‌ కైఫ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఫైనల్‌లో అభిషేక్‌ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్‌ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భారత్‌- న్యూజిలాండ్‌ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

Goal to silence crowd Break Hearts: Santner On T20 WC Final Vs IND2
T20 WC Final: హృదయాలు ముక్కలు చేస్తాం: సాంట్నర్‌

అహ్మదాబాద్‌ పిచ్‌పై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఇప్పటి వరకు వికెట్‌ను పరిశీలించలేదని.. అయితే, ఫ్లాట్‌ పిచ్‌నే రూపొందించి ఉంటారని భావిస్తున్నామన్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల వరద ఖాయమని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్‌-2026 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం భారత్‌- న్యూజిలాండ్‌ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మిచెల్‌ సాంట్నర్‌ పలు విషయాలపై స్పందించాడు.హై స్కోరింగ్‌కు అవకాశంపిచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు మేము వికెట్‌ ఎలా ఉందో చూడలేదు. ఇప్పటికీ కవర్లు కప్పే ఉన్నాయి. అయితే, ఈ పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ హై స్కోరింగ్‌కు అవకాశం ఉంటుంది’’ అని సాంట్నర్‌ (Mitchell Santner) పేర్కొన్నాడు.మా లక్ష్యం అదే..అదే విధంగా.. ‘‘టీమిండియాకు మద్దతుగా వచ్చే ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం (Goal to silence the crowd). అందుకు అనుగుణంగానే మా ఆట ఉంటుంది. అయితే, క్రికెట్‌లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. టీ20 క్రికెట్‌ వైవిధ్యంతో కూడుకున్నది.హృదయాలు ముక్కలు చేస్తాంఏదేమైనా సొంతగడ్డపై ఫైనల్‌ గెలవాలన్న ఒత్తిడి టీమిండియాపై కచ్చితంగా ఉంటుంది’’ అని సాంట్నర్‌ అన్నాడు. టోర్నీ ఆసాంతం తాము నిలకడగా ఆడామని.. ట్రోఫీ గెలవడం సాధ్యమేనని పేర్కొన్నాడు. కొంతమంది హృదయాలు ముక్కలు చేసేందుకు తామేమీ వెనుకాడమని టీమిండియా అభిమానులను ఉద్దేశించి సాంట్నర్‌ కామెంట్‌ చేశాడు.కాగా సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరగా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై గెలిచి టీమిండియా టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు భారత్‌.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో 4-1తో ఏకపక్ష విజయం సాధించింది. చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

Cricketer Vaibhav Sooryavanshi uncle Abhishek Chauhan cracks UPSC exam3
వైభవ్‌ సూర్యవంశీ మామకు సివిల్స్‌లో బెస్ట్‌ ర్యాంక్‌

భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ.. మైదానంలో పరుగుల వరద పారించడం ఈ పిల్లాడికి పరిపాటి అయిపోయింది. పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నెన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు ఈ బిహారీ అబ్బాయి.యూత్‌ వన్డే, యూత్‌ టెస్టుల్లో అతి పిన్న వయసులోనే విధ్వంసకర శతకాలు బాదిన బ్యాటర్‌గా వైభవ్‌ చరిత్రకెక్కాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున మొదలైన అతడి పరుగుల ప్రవాహం.. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా కొనసాగుతోంది.ఇటీవల ముగిసిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులు చేసి.. భారత్‌ను గెలిపించాడు వైభవ్‌ (Vaibhav Suryavanshi). తద్వారా టీమిండియా వైపు తొలి అడుగు వేశాడు. ఇక ప్రస్తుతం వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌-2026 కోసం రాజస్తాన్‌ రాయల్స్‌తో కలిసి నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.పదో తరగతి పరీక్షలు డుమ్మాఇదిలా ఉంటే.. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఇటీవల వైభవ్‌ సూర్యవంశీ పేరు వైరల్‌ అవుతోంది. క్రికెట్‌తో బిజీగా ఉన్నందున అతడు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయలేకపోయాడు. ఈ విషయాన్ని వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ ధ్రువీకరించారు.102వ ర్యాంకుమరోవైపు.. తాజాగా సంజీవ్‌ సూర్యవంశీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వైభవ్‌ సూర్యవంశీకి వరుసకు మేనమామ అయిన అభిషేక్‌ చౌహాన్‌ (Abhishek Chauhan) యూపీఎస్‌సీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 102వ ర్యాంకు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే అభిషేక్‌ ఈ మేర ర్యాంకు సాధించడం మరో విశేషం. ఆయన ఐపీఎస్‌ సర్వీస్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఉన్నత విద్యావంతుల కుటుంబంబిహార్‌లోని సమస్తిపూర్‌లో గల మొహియుద్దీన్‌నగర్‌ బ్లాక్‌లో గల రాజాజన్‌ గ్రామంలో 1999లో అభిషేక్‌ చౌహాన్‌ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్‌ అభయ్‌ కుమార్‌ సింగ్‌, తల్లి అనురాధా రాజ్‌పుత్‌. అభయ్‌ కుమార్‌ సింగ్‌ నలంద ఓపెన్‌ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. ఇక ఎంటెక్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అభిషేక్‌ 2022 నుంచి సివిల్స్‌ పరీక్షకు సన్నద్ధం అయ్యారు. 2025లో తొలిసారి పరీక్ష రాయగా.. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. దీంతో సమస్తిపూర్‌లో సంతోషకర వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితుల రాకతో హడావుడిగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ.. అభిషేక్‌ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

Going to play both of them: Aakash Chopra on changes in India playing XI NZ4
T20 WC Final: ఆ ఇద్దరిపై వేటు!.. అతడికి చోటు?

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల, బౌలర్ల జాబితాలో అగ్రస్థానం టీమిండియా ఆటగాళ్లదే. ఓపెనింగ్‌ స్టార్‌ అభిషేక్‌ శర్మ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి నంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అయితే, టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అభిషేక్‌, వరుణ్‌ స్థాయి​కి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అభిషేక్‌ దారుణమైన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 89.ఏకంగా 64 పరుగులుమరోవైపు.. వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) ఆరంభ మ్యాచ్‌లలో రాణించినా.. కీలక నాకౌట్‌ దశలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఈ స్పిన్‌ బౌలర్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 64 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్‌ కూల్చాడు.ఆ ఇద్దరిపై వేటు వేయాలి!ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి వరుణ్‌ 8.85 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఫైనల్‌ నేపథ్యంలో అభిషేక్‌ శర్మ, వరుణ్‌ చక్రవర్తిలపై వేటు వేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.ముఖ్యంగా వరుణ్‌ను తప్పించి చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా.. అభిషేక్‌ శర్మ, వరుణ్‌ చక్రవర్తిలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశం గురించి స్పందించాడు.నలుగురు విఫలమైనా.. ‘‘ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్న. అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)ను ఎందుకు కొనసాగించవచ్చో చెబుతాను. మనకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. మరీ గ్రహచారం బాగాలేకపోతే నలుగురు విఫలమైనా.. మరో నలుగురు పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది.బౌలర్లలో ఒక్కరు విఫలమైనా..అభిషేక్‌ శర్మ పరుగులు చేయకుండానే టీమిండియా ఫైనల్‌ వరకూ వచ్చింది. అయితే, బౌలర్‌ ఒక్క ఓవర్‌లో విఫలమైనా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఐదుగురు బౌలర్లలో ఒక్కరు చెడ్డగా ఆడినా అంతే సంగతులు.ఇన్నింగ్స్‌లో ఓ బౌలర్‌కు 20 శాతం బౌలింగ్‌ కోటా ఉంటుంది. నిజానికి గత మ్యాచ్‌లో వరుణ్‌ పేలవంగా ఆడాడు. అందుకే కుల్దీప్‌ను తీసుకురావాలనే ఆలోచన రావొచ్చు. అనుభవజ్ఞుడైన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అందుబాటులో ఉంటే బాగుంటుంది.నేను మాత్రం ఆ ఇద్దరినీ కొనసాగిస్తాఅయితే, నేను మాత్రం తుదిజట్టును ఎంపిక చేసే స్థానంలో ఉంటే.. వరుణ్‌ చక్రవర్తినే కొనసాగిస్తా. అతడితో పాటు అభిషేక్‌ శర్మనూ కొనసాగిస్తా’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌లో తుదిజట్టులో మార్పులు అంతగా మంచిది కాదని.. తమదైన రోజున చెలరేగే సత్తా ఉన్న అభిషేక్‌, వరుణ్‌ వంటి స్టార్లపై వేటు వేయడం తగదని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం ఫైనల్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్‌ స్టార్‌

Monumental choke: Dale Steyn predicts result of IND vs NZ T20 WC final5
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. టీమిండియా- న్యూజిలాండ్‌ ఆదివారం టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్‌, డేల్‌ స్టెయిన్‌ ఫైనల్‌ విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. డివిలియర్స్‌ యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు సౌతాఫ్రికాను ‘చోకర్స్‌’ అని పిలవడానికి ఇష్టపడతారు. కీలక మ్యాచ్‌లలో మనం ఓడిపోవడం ఇందుకు కారణం.ఇది అసాధ్యంఅయితే, న్యూజిలాండ్‌ విషయంలోనూ నేను ఇదే మాట అంటాను. న్యూజిలాండ్‌ ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లు గెలవనేలేదు. సౌతాఫ్రికా మాదిరే ఎన్నోసార్లు ఫైనల్‌కు చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈసారైనా గెలిచేందుకు ప్రయత్నించండి.నిజానికి నాకు న్యూజిలాండ్‌ జట్టు అంటే చాలా ఇష్టం. కానీ వాళ్లు టీమిండియాను ఓడించలేరు. ఇది జరగాలంటే మాత్రం ఏదో ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని భారత జట్టు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది అసాధ్యం. కివీస్‌ గెలవాలనే కోరుకుంటున్నా. కానీ వాళ్లు భారత్‌ను ఓడించగలరా?.. అంటే లేదనే చెప్తాను’’ అని పేర్కొన్నాడు.జట్టు గెలవాలని నాకూ ఉందిఇందుకు డివిలియర్స్‌ బదులిస్తూ... ‘‘అవును.. న్యూజిలాండ్‌కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఆ జట్టు గెలవాలని నాకూ ఉంది. కానీ వారికి ఆ అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి’’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే నెగ్గింది.రెండుసార్లు టీమిండియాను ఓడించిఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని 2000 సంవత్సరంలో కైవసం చేసుకున్న కివీస్‌.. మొట్టమొదటి ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ విజేతగానూ 2021లో అవతరించింది. ఈ రెండుసార్లూ న్యూజిలాండ్‌ ప్రత్యర్థి టీమిండియానే కావడం విశేషం. అయితే, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్‌తో తలపడిన కివీస్‌కు ఈ సారి పరాజయమే ఎదురైంది. భారత్‌ విజేతగా అవతరించింది. అయితే, కివీస్‌ ఇంత వరకు ఒక్క వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలవకపోగా.. భారత్ మూడు ప్రపంచకప్‌ టోర్నీలు గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2024 టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీలను సొంతం చేసుకుంది.చదవండి: T20 WC Final: పిచ్‌ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?

South Africa West Indies Teams stranded in Kolkata Even charter flight planner6
T20 WC 2026: ఐసీసీ రంగంలోకి దిగినా.. తప్పని చిక్కులు

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో వెస్టిండీస్‌ ఫర్వాలేదనిపించగా.. సౌతాఫ్రికా సెమీస్‌ వరకు ప్రయాణం కొనసాగించింది. లీగ్‌ దశలో అదరగొట్టిన విండీస్‌ జట్టు.. సూపర్‌-8లో ​కీలక మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడి నిష్క్రమించింది.మరోవైపు.. సౌతాఫ్రికా లీగ్‌ దశలో అజేయంగా నిలవడంతో పాటు.. సూపర్‌-8లోనూ హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే, కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడి మరోసారి ‘చోకర్స్‌’ అన్న బిరుదును సార్థకం చేసుకుంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఇంకా ఇంటికి చేరుకోలేదు.భారత్‌లోనే చిక్కుకుపోయారుఇందుకు మధ్య ప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం కారణం. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు చేస్తుండగా.. అందుకు ఇరాన్‌ కూడా గట్టిగానే బదులిస్తోంది. దీంతో గల్ఫ్‌ దేశాల్లో గగనతలం మూసివేశారు. దీంతో వెస్టిండీస్‌, జింబాబ్వే, సౌతాఫ్రికా జట్ల ఆటగాళ్లు భారత్‌లోనే చిక్కుకుపోయారు. అయితే, జింబాబ్వే జట్టును ప్రత్యేక విమానంలో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)తరలించినట్లు సమాచారం.ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా..ఇక వెస్టిండీస్‌ జట్టు కోసం కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా.. ఎయిర్‌ ట్రాఫిక్‌ అధికారుల నుంచి ఇంత వరకు ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లలో మరోసారి ఆందోళన నెలకొంది. కాగా ఇప్పటికే వెస్టిండీస్‌ హెడ్‌కోచ్‌ డారెన్‌ సామీ (Daren Sammy).. తమను స్వదేశానికి చేర్చమంటూ దీనంగా అర్థించిన విషయం తెలిసిందే.ఇక బౌలర్‌ అకీల్‌ హొసేన్‌ సైతం క్రిస్టియాన్‌ రొనాల్డోనే ఈ పరిస్థితులలో తమను ఆదుకోగలడంటూ ట్వీట్‌ చేశాడు. అయితే, ఐపీఎల్‌లో భాగమైన షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌, రోవ్‌మన్‌ పావెల్‌, షిమ్రన్‌ హెట్‌మైర్‌ తదితరులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.సౌతాఫ్రికానూ వీడని చిక్కులుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా మరికొన్నాళ్లు భారత్‌లోనే ఉండాల్సి రావొచ్చు. అయితే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో దాదాపు నలుగురు ఆటగాళ్లు నేరుగా కివీస్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సెమీస్‌ మ్యాచ్‌లలో సౌతాఫ్రికాను న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌ను టీమిండియా ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి టైటిల్‌ పోరుకు అహ్మదాబాద్‌ వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్‌ స్టార్‌

T20 WC Final Pitch: Mixed Soil Used After India Intervention Means7
T20 WC Final: పిచ్‌ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?

టీమిండియా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టింది సూర్యకుమార్‌ సేన.సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్‌-2026 ఆడుతున్న భారత జట్టు లీగ్‌ దశలో అజేయంగా నిలిచింది. సూపర్‌-8లో తొలుత తడబడినా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సెమీస్‌ చేరింది. ఇక సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లోనూ ఏడు పరుగుల తేడాతో గెలిచి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.వరుసగా రెండుసార్లుతద్వారా వరుసగా రెండుసార్లు ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్‌కు చేరిన జట్టుగా నిలిచింది. ఇక ట్రోఫీ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కావడం సెంటిమెంట్‌ పరంగా టీమిండియాకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇదే వేదికపై 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో తాజా ఫైనల్‌కు సంబంధించిన పిచ్‌ విషయంలో కూడా టీమిండియా తీవ్రంగా ఆలోచిస్తోంది. నిజానికి పిచ్‌ ఎంపిక, తయారీ ఐసీసీ పరిధిలోని అంశం. కానీ ఎర్ర మట్టితో చేసిన పిచ్‌పై ఆడాలనే తమ ఉద్దేశాన్ని భారత జట్టు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎర్రమట్టితో చేసిన పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తోంది. ముంబైలో ఇదే జరిగింది.టీమిండియా కోరుకుంది ఇదేఇక అహ్మదాబాద్‌లో నల్లరేగడి మట్టితో చేసిన పిచ్‌పై సౌతాఫ్రికా జట్టుతో ‘సూపర్‌–8’ మ్యాచ్‌ ఆడిన సూర్యకుమార్‌ సేన‌ దారుణంగా ఓడిపోయింది. అది పునరావృతం కాకుండా టీమిండియా బ్యాటింగ్‌ పిచ్‌నే కోరుకుంటోంది. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..ఎర్ర మట్టితోనే‘‘నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు మిశ్రమ మట్టితో తయారైన పిచ్‌ లభించనుంది. స్పోర్టింగ్‌ పిచ్‌నే రూపొందిస్తున్నారు. అయితే, ఎక్కువ మటుకు ఇది ఎర్ర మట్టితోనే తయారు చేస్తారు. కాస్త బౌన్సీగా ఉండటంతో పాటు.. బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుంది’’ అని పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన తొలి ఐదు మ్యాచ్‌లలో పేస్‌ బౌలింగ్‌లో 762 బంతుల్లో బ్యాటర్లు 1062 పరుగులు సాధించారు. ఫాస్ట్‌ బౌలర్లకు 45 వికెట్లు దక్కాయి. ఇక స్పిన్‌ బౌలింగ్‌లో 421 బంతుల్లో బ్యాటర్లు 617 పరుగులు రాబట్టగా.. బౌలర్ల ఖాతాలో 20 వికెట్లు చేరాయి. చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్‌ స్టార్‌

Interesting facts about the Indian cricket team revealed8
హోటల్‌ మారితే అదృష్టం మారేనా!

అహ్మదాబాద్‌: నమ్మకం లేదా సెంటిమెంట్‌ అనుకోండి లేదా మూఢ విశ్వాసం అనుకోండి కానీ భారత క్రికెట్‌ జట్టుకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అనూహ్య, ఆసక్తికర విషయాలు బయటకు వస్తుంటాయి. జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తుంటాడని సమాచారం. ఏ నగరంలో మ్యాచ్‌కు వెళ్లినా అక్కడి ప్రఖ్యాత దేవాలయానికి ఆటగాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించడం ఆయనకు రివాజుగా మారిపోయింది. సెమీఫైనల్‌కు ముందు రోజు ప్రాక్టీస్‌ కోసం వాంఖెడే స్టేడియానికి జట్టు వచ్చినా... ఆ రోజు చంద్ర గ్రహణం కారణంగా ఆటగాళ్లంతా డ్రెస్సింగ్‌ రూమ్‌ దాటి బయటకు రాలేదు. గ్రహణం ముగిసిన తర్వాతే గంటసేపు ఆలస్యంగా టీమిండియా సాధన మొదలైంది. ఇప్పుడు కూడా ఫైనల్‌ కోసం మరో సెంటిమెంట్‌ అంశం వినిపిస్తోంది. అహ్మదాబాద్‌లో 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడినప్పుడు భారత జట్టు ఐటీసీ నర్మద హోటల్‌లో బస చేసింది. నాటి మ్యాచ్‌లో పరాజయం జట్టును తీవ్రంగా బాధించింది. ఇప్పుడు టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కోసం అక్కడ మాత్రం ఉండరాదని జట్టు అనుకుంది. అందుకే ఈసారి తాజ్‌ స్కైలైన్‌లో భారత బృందం దిగింది. దీంతో తమ అదృష్టం మారవచ్చని టీమ్‌ భావిస్తున్నట్లుంది. మరోవైపు మ్యాచ్‌ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా ‘హోం’ కాకుండా విజిటర్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ను వాడుకోవాలని కూడా టీమ్‌ నిర్ణయించింది. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో పాల్గొనే అధికారుల బృందాన్ని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్‌ అంపైర్లుగా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్‌ వార్ఫ్‌ వ్యవహరిస్తారు. థర్డ్, ఫోర్త్‌ అంపైర్లుగా దక్షిణాఫ్రికాకు చెందిన అలావుద్దీన్‌ పలేకర్, ఆడ్రియాన్‌ హోల్డ్‌స్టాక్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్‌ రిఫరీగా వరల్డ్‌ కప్‌ తుది పోరు జరుగుతుంది. సామ్సన్‌ నామినేట్‌... టి20 వరల్డ్‌ కప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు కోసం షార్ట్‌ లిస్ట్‌ చేసిన ఎనిమిది ఆటగాళ్ల జాబితాలో భారత్‌కు చెందిన సంజు సామ్సన్‌ పేరు కూడా ఉంది. సామ్సన్‌తో పాటు విల్‌ జాక్స్‌ (ఇంగ్లండ్‌), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (పాకిస్తాన్‌), రచిన్‌ రవీంద్ర, టిమ్‌ సీఫెర్ట్‌ (న్యూజిలాండ్‌), షాడ్లీ వాన్‌ షాల్‌విక్‌ (అమెరికా), మార్క్‌రమ్, ఎన్‌గిడి (దక్షిణాఫ్రికా) ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. బుమ్రా కూడా విఫలం కావచ్చు! భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ఒంటిచేత్తో అతను మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడు. ఈ విషయం న్యూజిలాండ్‌కు కూడా బాగా తెలుసు. అయితే ఫైనల్లో తమపై మాత్రం బుమ్రా విఫలం కావాలని కోరుకుంటున్నట్లు కివీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ అన్నాడు. ‘బుమ్రా అద్భుతమైన బౌలర్‌ అనడంలో సందేహం లేదు. అతని బౌలింగ్‌లో ఎంతో వైవిధ్యం ఉంది. యార్కర్లను గొప్పగా సంధించగలడు. అయితే అతను కూడా మానవమాత్రుడే. ఏదో ఒకరోజు విఫలం కావచ్చు కూడా. అది ఆదివారమే కావాలని ఆశిస్తున్నాం’ అని ఫిలిప్స్‌ చెప్పాడు. భారత్‌తో పోలిస్తే జనాభాలో ఎంతో చిన్నదైన తమ దేశం క్రికెట్‌లో ఇప్పటి వరకు సాధిస్తూ వచ్చిన ఘనత చిన్నదేమీ కాదని అతను అభిప్రాయపడ్డాడు. సుమారు 50 లక్షల జనాభా ఉన్న కివీస్‌ వరల్డ్‌ కప్‌లాంటి వేదికపై భారత్‌తో ఫైనల్లో తలపడే అవకాశం రావడం కూడా గొప్ప విషయమని అతను అన్నాడు.

India vs England semi final breaks records9
‘రికార్డులు’ బద్దలు కొట్టిన భారత్‌–ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌

ముంబై: భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగి రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారీ పరుగులు, బౌండరీలతో రికార్డుల మోత మోగింది. అయితే దీంతో పాటు డిజిటల్‌ వీక్షకుల సంఖ్య విషయంలో కూడా ఈ మ్యాచ్‌ కొత్త రికార్డులు నెలకొల్పింది. జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల (సుమారు 6 కోట్ల 25 లక్షలు) మంది చూడటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడా ఈవెంట్‌లోనైనా ప్రత్యక్ష ప్రసార సమయంలో ఇది అత్యధికం. తాజా గణాంకాలు క్రికెట్‌ స్థాయిని చూపిస్తున్నాయని, ఇది తమకు గర్వకారణమని ఐసీసీ చైర్మన్‌ జై షా పేర్కొన్నారు. తాజా రికార్డు ఆదివారం భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ఫైనల్‌తో చెరిగిపోతుందా అనేది ఆసక్తికరం.

He is Human: New Zealand Star Stunning Remark On Bumrah T20 WC Final10
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్‌ స్టార్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ టైటిల్‌ పోరుకు న్యూజిలాండ్‌, టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో భారత్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్‌ బౌలర్‌ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లోకాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్‌ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్‌ ఫిలిప్స్‌ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్‌ అని అన్నాడు.అతడు కూడా మనిషే కదా!‘‘ఇటీవల టీమిండియా సిరీస్‌లో భాగంగా బుమ్రా బౌలింగ్‌లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్‌ బౌలర్‌. వైవిధ్యభరితంగా బౌలింగ్‌ చేస్తాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్‌లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. ఆరోజు అతడు విఫలం అవుతాడు. అదే, అతడి మీద మాకు మంచి రోజు అవుతుంది. ఫైనలే ఆరోజు కావాలని ఆశిస్తున్నాం?’’ అని గ్లెన్‌ ఫిలిప్స్‌ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్‌ కివీస్‌తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్‌లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement