Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Ricky Ponting Reveals Why PBKS Signed Shreyas Iyer For Rs 26 75 Cr1
‘అందుకే శ్రేయస్‌ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాం’

ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ వరుస విజయాలతో దుమ్ములేపుతోంది. గతేడాది ఫైనల్‌కు చేరిన ఈ జట్టు.. ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన ఆరింటిలోనూ గెలిచి జైత్రయాత్ర కొనసాగిస్తోంది.రెండేళ్లుగా పంజాబ్‌ అద్భుత విజయాలు సాధించడంలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడి రాకతో జట్టు రాతే మారిపోయింది. ఒకప్పుడు పసలేని జట్టుగా ఉన్న పంజాబ్‌కు ఇప్పుడు అమితమైన క్రేజ్‌ ఏర్పడింది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా నీరాజనాలు అందుకుంటోంది.రూ. 26.75 కోట్ల భారీ ధరకుకాగా 2024లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను.. అనూహ్యంగా ఆ ఫ్రాంఛైజీ వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా రూ. 26.75 కోట్ల భారీ ధరకు అయ్యర్‌ను కొనుగోలు చేసింది. పంజాబ్‌ కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ పట్టుబట్టి మరీ ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా శ్రేయస్‌ను ఏరికోరి కొనుగోలు చేయించాడు.పైసా వసూల్‌ ప్రదర్శనపాంటింగ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శ్రేయస్‌ అయ్యర్‌ పైసా వసూల్‌ ప్రదర్శన ఇస్తున్నాడు. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన పంజాబ్‌.. 265 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనను సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (36 బంతుల్లో 71 నాటౌట్‌)తో మెరిశాడు.అందుకే శ్రేయస్‌ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాంఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఐపీఎల్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడొక గొప్ప వ్యక్తి. అందుకే వేలంలో అతడి కోసం ఎంత ఖర్చైనా పర్లేదని నేను కఠినంగా ముందుకు వెళ్తూనే ఉన్నాను.శ్రేయస్‌ ఒక గొప్ప నాయకుడు. పంజాబ్‌ జట్టును అతడు పునర్నిర్మిస్తాడని నేను గట్టిగా నమ్మాను. శ్రేయస్‌ ఆఖరి వరకు క్రీజులో ఉన్నాడంటే లక్ష్యం ఎంత పెద్దదైనా ఛేదించగలమని నాకు తెలుసు. ఇప్పుడు కూడా అతడు అద్భుతం చేశాడు. ‘నువ్వు ఆఖరి వరకు నిలబడ్డావంటే ఈ మ్యాచ్‌ మనం కచ్చితంగా గెలుస్తామని చెప్పాను’. అన్నట్లుగానే అతడు పని పూర్తి చేశాడు’’ అని రిక్కీ పాంటింగ్‌ శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా గతేడాది 604 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌.. ఈ సీజన్‌లో ఇప్పటికి ఆరు ఇన్నింగ్స్‌ ఆడి 279 పరుగులు పూర్తి చేసుకున్నాడు.చదవండి: Vaibhav Sooryavanshi: పర్సనల్‌గా అంటే నచ్చదు.. అందుకే చితక్కొట్టాWho would have thought chasing 264 in T20 Cricket. 🤷- Shreyas Iyer led PBKS chased down 264 runs in 18.5 overs against DC. pic.twitter.com/iith1lLgiW— Kashif (@KashifNdmCric) April 25, 2026

Virender Sehwag Shuts Down Shreyas Iyers Selection In Indias T20I Team2
వైభ‌వ్, శ్రేయ‌స్ కాదు.. ఎవ‌రికీ టీమిండియాలో చోటు లేదు: సెహ్వాగ్

ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాళ్లు దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్‌, ర‌జిత్ పాటిదార్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బరుస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో వీరిద్ద‌రిని భార‌త టీ20 జ‌ట్టులోకి తీసుకోవాల‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీని సూచిస్తున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ స్వ‌యంగా ప‌డిక్క‌ల్‌ను భార‌త జ‌ట్టు ఎంపిక చేయాల‌ని సిఫారస్సు చేశాడు.ఈ నేప‌థ్యంలో భార‌త దిగ్గ‌జ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌తీ సీజ‌న్‌లోనూ చాలా మంది మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తార‌ని, అంద‌రిని జాతీయ జ‌ట్టులోకి తీసుకోవాలంటే కుద‌ర‌దని సెహ్వాగ్ అన్నాడు. కాగా ప‌డిక్క‌ల్ ఎప్పుడో ఐదేళ్ల కింద భార‌త త‌ర‌పున రెండు టీ20లు ఆడ‌గా.. పాటిదార్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడ‌లేదు."ప‌డిక్క‌ల్‌ను క‌చ్చితంగా మ‌ళ్లీ భార‌త జ‌ట్టులోకి తీసుకోవాల‌ని దినేష్ కార్తీక్ అంటున్నాడు. అయితే ప్ర‌తీ సీజ‌న్‌లోనూ చాలా మంది అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసి టీమిండియాలో చోటు ఆశిస్తుంటారు. ఐపీఎల్‌లో బాగా ఆడిన ప్రతీ ఒక్క‌రికి తీసుకోవాలంటే ఎక్క‌డ అవుతోంది? భార‌త జ‌ట్టులో ప్ర‌స్తుతం అస్స‌లు ఖాళీ ఉందా? భార‌త టీ20 సెటాప్‌ ప్ర‌స్తుతం అద్భుతంగా ఉంది.ఇటీవ‌లే వారు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్‌గా నిలిచారు. కాబ‌ట్టి రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లకు ప్రస్తుతం జట్టులో స్థానం లేదు. వీరికే కాదు యువ ఆట‌గాళ్లు వైభ‌వ్ సూర్య‌వంశీ, య‌శ‌స్వి జైశ్వాల్‌కు కూడా చోటు లేదు. ఈ ఐదుగురికి అవ‌కాశ‌మివ్వాలంటే ఎవ‌రిని జట్టు నుంచి తీసేయాలి చెప్పండి?" అంటూ క్రిక్‌బజ్ చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: Rishabh Pant: ఐపీఎల్‌కే దిక్కు లేదు.. ఇంకా టీమిండియా కెప్టెన్ కావాలా?

IPL 2026: Rashid Khan Creates History Becomes 1st Player In IPL To3
చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. ఐపీఎల్‌లో ఒకే ఒక్కడు

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో పద్దెమినిదేళ్లుగా ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 2017లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.144వ మ్యాచ్‌దాదాపు ఆరేళ్ల పాటు సన్‌రైజర్స్‌తో కొనసాగిన రషీద్‌ ఖాన్‌ (Rashid Khan).. 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులో చేరాడు. అప్పటి నుంచి గుజరాత్‌కే ఆడుతున్న ఈ స్పిన్‌ బౌలర్‌... ఐపీఎల్‌-2026లో ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భాగమయ్యాడు. తద్వారా ఐపీఎల్‌లో తన 144వ మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాడు రషీద్‌ ఖాన్‌.ఏకైక ఆటగాడిగా రషీద్‌కాగా అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి దాకా రషీద్‌ ఖాన్‌ ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కాలేదు. తద్వారా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కాకుండా.. అత్యధికంగా 144 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా రషీద్‌ రికార్డులకెక్కాడు. తద్వారా భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.రైనా రికార్డు బద్దలుకాగా రైనా ఐపీఎల్‌లో మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 2008లో అరంగేట్రం చేసిన అతడు 2016లో తొలిసారి మ్యాచ్‌ మిస్‌ అయ్యాడు. తనకు కూతురు జన్మించిన సందర్భంగా అతడు జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అప్పుడు రైనా గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. నాడు ఆర్సీబీతో మ్యాచ్‌ అతడు మిస్సయ్యాడు.గుజరాత్‌ అలవోకగా..మ్యాచ్‌ విషయానికొస్తే.. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చచ్చీ చెడి 158 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్ల ధాటికి 12 ఓవర్లలో 50 పరుగుల మార్క్‌ దాటిన సూపర్‌ కింగ్స్‌... 16వ ఓవర్‌లో మూడంకెల స్కోరు అందుకుంది. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న గుజరాత్‌ ముందు ఈ లక్ష్యం మరీ చిన్నదైపోయింది. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్‌ మరోసారి దంచికొట్టడంతో 20 బంతులు మిగిలుండగానే టైటాన్స్‌ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ వికెట్లేమీ తీయలేకపోయాడు. ఒక్క ఓవర్లోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కాకుండా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు🏏రషీద్‌ ఖాన్‌- 144 మ్యాచ్‌లు- 2017-2026*- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌🏏సురేశ్‌ రైనా- 143 మ్యాచ్‌లు- 2008-2016- చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ లయన్స్‌ 🏏యూసఫ్‌ పఠాన్‌- 95 మ్యాచ్‌లు- 2008-2014- రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌🏏సుబ్రమణ్యం బద్రీనాథ్‌- 74 మ్యాచ్‌లు- 2008-2012- చెన్నై సూపర్‌ కింగ్స్‌🏏జితేశ్‌ శర్మ- 62 మ్యాచ్‌లు- 2022-2026*- పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం🎥 High & handsome from Jos Buttler to seal victory for @gujarat_titans 💙An emphatic chase and a very important 2⃣ points 👏Scorecard ▶️ https://t.co/zJBovAaCoM #TATAIPL | #KhelBindaas | #CSKvGT pic.twitter.com/rcc3CD7gqM— IndianPremierLeague (@IPL) April 26, 2026

Fans furious after Rishabh Pant departs for another low score in LSG vs KKR clash4
ఐపీఎల్‌కే దిక్కు లేదు.. ఇంకా టీమిండియా కెప్టెన్ కావాలా?

ఐపీఎల్‌-2026లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. ఆదివారం ఏకానా స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓట‌మి పాలైంది. ఈ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం కెప్టెన్ రిష‌బ్ పంత్ అనే చెప్పాలి. కెప్టెన్‌గా అత‌డు తీసుకున్న త‌లతిక్క నిర్ణయాలే ల‌క్నో కొంప‌ముంచాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రిష‌బ్ పంత్ తొలుత కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు అహ్హ‌నించాడు.పంత్ తీసుకున్న నిర్ణ‌యం స‌రైందే అని రెండో ఓవ‌ర్‌లోనే నిరూపించాడు పేస‌ర్ మోహ్సిన్ ఖాన్‌. మోహ్సిన్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్ టిమ్ సీఫ‌ర్ట్‌ను డ‌కౌట్‌గా పెవ‌లియ‌న్‌కు పంపాడు. మోహ్సిన్ అక్క‌డితో అక్క‌డ‌తో అగ‌లేదు. త‌న పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ టాపార్డ‌ర్‌, మిడిలార్డ‌ర్‌ను దెబ్బ‌తీశాడు.అత‌డి బౌలింగ్ ధాటికి కేకేఆర్ కేవలం 73 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన ర‌మ‌ణ్‌దీప్ సింగ్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇక క్రీజులో రెగ్యుల‌ర్ బ్యాట‌ర్ రింకూ సింగ్ ఒక్క‌డే మిగిలాడు. దీంతో కేకేఆర్ కనీసం వంద ప‌రుగులు మార్క్ అయినా దాటుతుందా అని అంతా భావించారు. రింకూ ఆచి తూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు.18 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌ 112 పరుగులుగా ఉండేది. 19 ఓవర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో రింకూ 17 పరుగులు పిండుకున్నాడు. దీంతో కేకేఆర్‌ స్కోర్‌ 129 పరుగులకు చేరింది. అయితే ఈ సమయంలో పంత్‌ తీసుకున్న ఓ నిర్ణయం లక్నోను దెబ్బతీసింది. పేస్‌ బౌలర్ల ఓవర్ల కోటా పూర్తి కావడంతో ఆఖరి ఓవర్‌ స్పిన్నర్‌తో వేయించాల్సి వచ్చింది.సౌతాఫ్రికా స్టార్‌ స్పిన్నర్‌ జార్జ్‌ లిండేతో పంత్‌ చివరి ఓవర్‌ వేయిస్తాడని అంతా భావించారు. కానీ పంత్‌ మాత్రం రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ అయిన దిగ్వేష్‌కు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంకేముంది రింకూలోని ఫినిషర్ బయటకు వచ్చాడు. వరుసగా నాలుగు సిక్స్‌లు బాది చివరి ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. మరో రెండు పరుగులు వైడ్ల రూపంలో వచ్చాయి. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగుల ఫైటింగ్ స్కోర్ చేయగల్గింది.జిడ్డు బ్యాటింగ్‌అనంతరం లక్ష్య చేధనలో రెండో ఓవర్‌లోనే లక్నోకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్‌ను వైభవ్ ఆరోరా పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌.. ఐడైన్ మార్‌క్రమ్‌(27 బంతుల్లో 31) కలిసి టెస్టు క్రికెట్ ఆడాడు.36 బంతుల్లో కేవలం 38 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలుత పంత్‌, మార్‌క్రమ్ నెమ్మదిగా ఆడడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. యాధావిథిగా నికోలస్ పూరన్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటయ్యాడు. అయితే ఆఖరిలో ఆయూశ్ బదోని, హిమత్ సింగ్‌, షమీ బ్యాట్ ఝూళిపించడంతో స్కోర్లు సమమయ్యాయి.సూపర్‌ ఓవర్‌లోనూ..దీంతో సూపర్ ఓవర్‌లో ఫలితాన్ని తేల్చాల్చి వచ్చింది. సూపర్ ఓవర్‌లో కూడా పంత్ పేలవ కెప్టెన్సీ కన్పించింది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న నికోలస్ పూరన్‌తో పాటు మార్‌క్రమ్‌లను ఓపెనర్లుగా లక్నో పంపింది. సునీల్ నరైన్ వేసిన సూపర్ ఓవర్‌లో తొలి బంతికి పూరన్ క్లీన్ బౌల్డ్ కాగా.. మూడో బంతికి మార్‌క్రమ్ ఔటయ్యాడు.దీంతో లక్నో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసింది. అనంతరం రింకూ సింగ్ తొలి బంతికే ఫోర్ బాది కేకేఆర్‌ను గెలిపించాడు. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి చేరుకుంది. ఈ క్రమంలో పంత్‌పై నెటిజన్లు ఫైరవతున్నారు. ఏ మాత్రం ఆటకేనా రూ.27 కోట్లు తీసుకుంటున్నావు అని పోస్ట్‌లు పెడుతున్నారు. ఐపీఎల్‌కే దిక్కులేదు.. నీకు ఇంకా టీమిండియా కెప్టెన్ కావాలా అంటూ ఓ యూజ‌ర్ పోస్ట్ పెట్టాడు. కాగా రిష‌బ్ పంత్ ప్ర‌స్తుతం టెస్టుల్లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌నొక దశ‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ పంత్ అవుతాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.చదవండి: Vaibhav Sooryavanshi: పర్సనల్‌గా అంటే నచ్చదు.. అందుకే చితక్కొట్టా

Someone Says Something Personally: Sooryavanshi On Revenge VS Hinge5
నన్నే అంటావా?.. అందుకే చితక్కొట్టా: వైభవ్‌ సూర్యవంశీ

రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. గతేడాది భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్‌-2026లోనూ ఆకట్టుకుంటున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శనివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌.. 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.బ్యాట్‌తోనే సమాధానంతద్వారా ఐపీఎల్‌లో తన రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌. గతేడాది గుజరాత్‌ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే వైభవ్‌ శతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే, సన్‌రైజర్స్‌పై కొట్టిన సెంచరీ తనకు అత్యంత ప్రత్యేకం అంటున్నాడు వైభవ్‌ సూర్యవంశీ. తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తే నచ్చదని.. అందుకే బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చానని తెలిపాడు. పరోక్షంగా సన్‌రైజర్స్‌ పేసర్‌ ప్రఫుల్‌ హింగేకు వైభవ్‌ కౌంటర్‌ వేశాడు.నన్ను వ్యక్తిగతంగా అంటే నచ్చదుసన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ అనంతరం వైభవ్‌ సూర్యవంశీ తమ మేనేజర్‌ రోమీ భిందర్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆ బౌలర్‌ (హింగే)ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన వ్యూహంతోనే బ్యాటింగ్‌కు దిగాను. గత మ్యాచ్‌లో నన్ను అతడు అవుట్‌ చేశాడు.ఆరోజు నేను నా ఫోన్‌ చెక్‌ చేశా. నా గురించి ఎవరు ఏమన్నారో చూశాను. సాధారణంగా నేను ఇలాంటి విషయాలు పట్టించుకోను. అయితే, ఎవరైనా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తే.. అది నాపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నాడు. తనను టార్గెట్‌ చేసిన ప్రఫుల్‌ హింగే బౌలింగ్‌లోనే విశ్వరూపం ప్రదర్శించడం పట్ల పదిహేనేళ్ల వైభవ్‌ ఈ మేరకు స్పందించాడు.గత మ్యాచ్‌లో తొలి బంతికేకాగా సన్‌రైజర్స్‌తో ఆడిన గత మ్యాచ్‌లో ప్రఫుల్‌ హింగే బౌలింగ్‌లో తొలి బంతికే అవుటైన వైభవ్‌ సూర్యవంశీ... ఈ సారి తొలి ఓవర్‌లోనే విశ్వరూపం కనబర్చాడు. నాలుగు సిక్స్‌లతో హింగేకు స్వాగతం పలికిన వైభవ్‌... కమిన్స్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికి సైతం భారీ సిక్స్‌ కొట్టాడు.మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (10) త్వరగా అవుట్‌ కాగా... వైభవ్‌ ఇచ్చిన క్యాచ్‌ను రైజర్స్‌ ఫీల్డర్‌ అనికేత్‌ వదిలేశాడు. ఇదే జోరులో మరో రెండు సిక్స్‌లు బాదిన సూర్యవంశీ 15 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వైభవ్‌పై హింగే కామెంట్స్‌సకీబ్‌ ఓవర్‌లో వరుసగా 6, 4, 6తో వైభవ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా వైభవ్‌ సెంచరీ వృథా అయింది.కాగా హైదరాబాద్‌లో వైభవ్‌ను అవుట్‌ చేసిన తర్వాత ప్రఫుల్‌ హింగే మాట్లాడుతూ.. ‘‘అతడికి (వైభవ్‌) బౌన్సర్‌ వేసి అవుట్‌ చేస్తానని మా వాళ్లకు ముందే చెప్పాను. అతడిని అవుట్‌ చేయాలన్నదే నా లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా జైపూర్‌లో వైభవ్‌ హింగేపై ప్రతీకారం తీర్చుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో.. ‘‘పిల్లాడే గానీ... మనసులో ఇంత పెట్టుకున్నాడా? వీడు మామూలోడు కాదు’’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాంA first-ball duck a few days ago to the fastest century by an Indian last night. Vaibhav Sooryavanshi just refuses to give up 👏💗 pic.twitter.com/IqDaWvkAu9— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2026

Marcus Stoinis Says Sorry To DC Net Bowler As His Shot Hits Player6
ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. సారీ చెప్పిన స్టొయినిస్‌

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్‌ బౌలర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు గిరి ప్రసాద్‌కు గాయమైంది. న్యూఢిల్లీలో శనివారం ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్, ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టొయినిస్‌ కొట్టిన షాట్‌ నెట్స్‌ వద్ద ఉన్న గిరి ప్రసాద్‌ ముఖానికి బలంగా తాకింది. పరామర్శఫలితంగా తీవ్రంగా గాయపడ్డ గిరి ప్రసాద్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేయించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ యజమాని గ్రంధి కిరణ్‌ కుమార్‌ ఆస్పత్రికి వచ్చి గిరి ప్రసాద్‌ను పరామర్శించారు. సారీ చెప్పిన స్టొయినిస్‌తన షాట్‌తో గాయపడ్డ గిరి ప్రసాద్‌ను పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ కూడా వచ్చి పరామర్శించాడు. పొరపాటుగా జరిగిన దానికి క్షమించాలని కోరాడు. యువ క్రికెటర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. అనంతరం గిరి ప్రసాద్‌తో సెల్ఫీ దిగిన స్టొయినిస్‌ టోపీపై తన ఆటోగ్రాఫ్‌ చేసి ఇచ్చాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన గిరి ప్రసాద్‌ గత సీజన్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్‌ బౌలర్‌గా ఉన్నాడు.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం

Rishabh Pant Reveals Why Sent out of form Pooran in Super Over vs KKR7
‘అందుకే సూపర్‌ ఓవర్లో అతడిని పంపించాం’

ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ వైఫల్యం కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో రిషభ్‌ సేన ఓటమిపాలైంది. ఏకనా స్టేడియంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇరుజట్లు సమానంగా 155 పరుగులు సాధించాయి. ఈ క్రమంలో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. లక్నో ఓటమి పాలైంది.సూపర్‌ ఓవర్‌ సాగిందిలా... ‘సూపర్‌ ఓవర్‌’లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో మూడు బంతుల్లో ఒక్కపరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ వేసిన తొలి బంతికే నికోలస్‌ పూరన్‌ (0) క్లీన్‌ బౌల్డ్‌ కాగా... బౌండరీ వద్ద పావెల్, రింకూ సింగ్‌ పట్టిన చక్కటి రిలే క్యాచ్‌కు ఐడెన్‌ మార్క్‌రమ్‌ (0) వెనుదిరిగాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (1 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు.అంతా రింకూ మయంఇక రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా తొలి బంతికే గెలుపు ఖాతాలో వేసుకుంది. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రింకూ (4 నాటౌట్‌) తొలి బంతికే ఫోర్‌ కొట్టి జట్టును గెలిపించాడు. చివరి ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు, సూపర్‌ ఓవర్‌లో నాలుగు పరుగులు ఇలా... కోల్‌కతా విజయంలో ఎక్కడ చూసిన రింకూ సింగ్‌ ప్రతిభే ప్రస్ఫుటించింది. అతడికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.#KKR win the first SUPER OVER of the season 🤩@kkriders with a hard earned win after 42 overs of topsy turvy cricket 👏Scorecard ▶️ https://t.co/elFxwvCeWO#TATAIPL | #KhelBindaas | #LSGvKKR pic.twitter.com/yIoX0vQOMv— IndianPremierLeague (@IPL) April 26, 2026అతడిని ఎలా ఆడిస్తారు?మరోవైపు.. ఫామ్‌లో లేని నికోలస్‌ పూరన్‌ను సూపర్‌ ఓవర్లో ఆడించడం పట్ల లక్నో నాయకత్వ బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ స్పందించిన తీరు కూడా వైరల్‌గా మారింది. ‘‘మాకు కచ్చితంగా విరామం కావాలి. మళ్లీ సరికొత్తగా తిరిగివస్తాం. ఇలాంటి మ్యాచ్‌లలో ఒత్తిడి సహజం.అయితే, మేము దీనిపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదు. అంతర్గతంగా కూర్చుని చర్చిస్తాం. ఒకరూ.. ఇద్దరూ కాదు.. ఇది సమిష్టి వైఫల్యం. కాబట్టి జట్టులోని ప్రతి ఒక్కరు ఇందుకు జవాబుదారీగా ఉండాల్సిందే.పంత్‌ స్పందన ఇదేఇక పూరన్‌ విషయంలోనూ మేమంతా కలిసికట్టుగానే నిర్ణయం తీసుకున్నాం. సూపర్‌ ఓవర్లో ఎవరిని పంపించాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నిక్కీ పేరునే సూచించారు. అతడు ఇప్పుడు అత్యుత్తమ ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే నిక్కీ వంటి స్టార్లపై నమ్మకం ఉంచాలి.అయితే, ఇక్కడ మా వ్యూహం ఫలించలేదు. మ్యాచ్‌లో సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. కానీ ఈరోజు మాకు అంతగా కలిసిరాలేదు. అయితే, విరామం తర్వాత మళ్లీ సరికొత్తగా తిరిగివస్తామనే నమ్మకం ఉంది’’ అని పంత్‌ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో నికోలస్‌ పూరన్‌ 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. పంత్‌ 38 బంతుల్లో 42 పరుగులు రాబట్టగలిగాడు. చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్‌ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'

Indian womens badminton team secured their first victory of the Uber Cup 2026 8
భారత్‌ మహిళల బ్యాడ్మింటన్‌ జట్టుకు తొలి విజయం

హోర్‌సెన్స్‌ (డెన్మార్క్‌): ఉబెర్‌ కప్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు తొలి విజయం అందుకుంది. ఉక్రెయిన్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 4–1తో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ఉన్నతి హుడా 21–19, 22–20తో పొలీనా బురోవాపై నెగ్గింది. రెండో మ్యాచ్‌లో తన్వీ శర్మ 21–12, 17–21, 21–10తో యెహెనియా కాంటిమిర్‌ను ఓడించింది. మూడో మ్యాచ్‌లో దేవిక సిహాగ్‌ 23–21, 21–13తో మరియా స్టొలియారెంకోపై గెలిచి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖరారు చేసింది. నాలుగో మ్యాచ్‌లో సెల్వం కవిప్రియ–సిమ్రన్‌ ద్వయం 11–21, 17–21తో పొలీనా బురోవా–యెహెనియా కాంటిమిర్‌ జోడీ చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌లో పీవీ సింధు–తనీషా క్రాస్టో జోడీ 21–18, 21–15తో మరియా స్టొలియారెంకో–సోఫియా లావ్రోవా జంటపై విజయం సాధించింది. గ్రూప్‌ ‘ఎ’లోని మరో మ్యాచ్‌లో చైనా 5–0తో డెన్మార్క్‌ జట్టును ఓడించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన చైనా జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోగా... రెండో బెర్త్‌ కోసం భారత్, డెన్మార్క్, ఉక్రెయిన్‌ జట్లు రేసులో ఉన్నాయి. నేడు జరిగే చివరిదైన మూడో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో చైనాతో భారత్‌; డెన్మార్క్‌తో ఉక్రెయిన్‌ తలపడతాయి.

Divyanshu Dewangan, Shambhavi Kshirsagar wins Medals9
అగ్రస్థానంతో ముగింపు 

కైరో: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నిలో చివరిరోజు భారత షూటర్లు ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి రెండు పతకాలు సాధించారు. ఓవరాల్‌గా భారత షూటర్లు 5 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలు సొంతం చేసుకొని ‘టాప్‌’ ర్యాంక్‌ను అందుకున్నారు. ఆఖరి రోజు పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో హేమంత్‌ బర్మన్‌ రజత పతకాన్ని నెగ్గాడు. హేమంత్‌ 351.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన వేదాంత్‌ నితిన్‌ వాఘ్మరే, రోహిత్‌ కన్యాన్‌ కూడా ఫైనల్లో పోటీపడినా పతకాలు సాధించలేకపోయారు. రోహిత్‌ 311.9 పాయింట్లతో ఆరో స్థానంలో, నితిన్‌ 300.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో జుహైర్‌ ఖాన్‌–ఆద్యా కత్యాల్‌ జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. జుహూర్‌–ఆద్యా ద్వయం 19 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు తేజల్, యుగేశ్వరి, అనుష్క, ఖ్వాయిష్‌ శర్మ ఫైనల్‌ చేరుకోవడంలో విఫలమయ్యారు.

Sabastian Sawe becomes the first man to win a marathon in under two hours10
సూపర్‌ సెబాస్టియన్‌ 

లండన్‌: ప్రతిష్టాత్మక లండన్‌ మారథాన్‌ రేసులో కెన్యా అథ్లెట్‌ సెబాస్టియన్‌ సావీ అద్భుతం చేశాడు. నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మారథాన్‌ రేసును 2 గంటల్లోపు ముగించిన తొలి అథ్లెట్‌గా సెబాస్టియన్‌ గుర్తింపు పొందాడు. ఇదే రేసులో రెండో స్థానంలో నిలిచిన యోమిఫ్‌ కెజెల్చా (ఇథియోపియా) 1 గంట 59 నిమిషాల 41 సెకన్లలో గమ్యానికి చేరాడు. తద్వారా 2 గంటల్లో మారథాన్‌ పూర్తి చేసిన రెండో అథ్లెట్‌గా నిలిచాడు. జేకబ్‌ కిప్లిమో (ఉగాండా) 2 గంటల 28 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచాడు. సెబాస్టియన్, కెజెల్చా, కిప్లియో ఒకేరోజు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. 2023 నుంచి కెల్విన్‌ కిప్టుమ్‌ పేరిట ఉన్న మారథాన్‌ ప్రపంచ రికార్డును (2 గంటల 35 సెకన్లు; చికాగో మారథాన్‌) ఆదివారం ఈ ముగ్గురూ సవరించారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement