Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

All Credit Goes to Him: Ishan Kishan Lauds Abhishek Sharma Klassen1
క్రెడిట్‌ మొత్తం అతడికే.. క్లాసెన్‌ అదరగొట్టాడు: ఇషాన్‌ కిషన్‌

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ గెలుపు నమోదు చేసింది. సొంతమైదానం ఉప్పల్‌లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి.. వరుసగా మూడోసారి జయభేరి మోగించింది. తద్వారా ఏడింట నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) సంతృప్తి వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. ‘‘అభిషేక్‌ మ్యాచ్‌ ఆసాంతం అదరగొట్టాడు. క్లాసెన్‌ మంచి ఫినిషింగ్‌ ఇచ్చాడు. ఇలాంటి వికెట్‌ మీద 200కు పైగా స్కోరు చేయడం గొప్ప విషయం.క్రెడిట్‌ మొత్తం అతడికే.. నిజానికి ఈ పిచ్‌ మీద ఆరంభంలో బ్యాటర్లకు తడబాటు తప్పదు. అయినా సరే అభిషేక్‌ అదరగొట్టాడు. మా విజయంలో క్రెడిట్‌ మొత్తం అతడికే దక్కుతుంది. ప్రణాళికలకు తగినట్లుగా ఆడుతూ ఫలితాలు రాబడుతున్నాము’’ అని ఇషాన్‌ కిషన్‌ పేర్కొన్నాడు.ఇక ఆఖరి ఓవర్లో హర్ష్‌ దూబేకు బంతి ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘అతడు మెరుగా బౌలింగ్‌ చేయగలడని నాకు తెలుసు. అతడొక తెలివైన బౌలర్‌. కీలక ఓవర్లు నువ్వే వేయాల్సి ఉంటుందని నేను ముందుగానే అతడికి చెప్పాను. సరైన సమయంలో మనం అత్యుత్తమం అనుకున్న బౌలర్లను రంగంలోకి దించాలి. ఈరోజు మాకు ఇది కలిసి వచ్చింది’’ అని ఇషాన్‌ కిషన్‌ పేర్కొన్నాడు.కాగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు సాధించింది. అభిషేక్‌ శర్మ 68 బంతుల్లో 10 ఫోరు​, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 37 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.మలింగ అద్భుతస్పెల్‌లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 195 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఇషాన్‌ మలింగ అద్భుత స్పెల్‌ వేశాడు. నాలుగు కీలక వికెట్లు కూల్చి ఢిల్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. హర్ష్‌ దూబే ఆఖరి ఓవర్లోఇక హర్ష్‌ దూబే ఆఖరి ఓవర్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో దిల్షాన్‌ మధుషాంక, సకీబ్‌ హుసేన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీకి ఆరింట ఇది మూడో పరాజయం.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026

Phil Hughes Moment In West Indies, Match Suspended As Batter Survives Close Call2
ఫిల్‌ హ్యూస్‌ తరహా ఘటన

క్రికెట్‌ వెస్టిండీస్‌ ఆథ్వర్యంలో జరుగుతున్న వెస్టిండీస్‌ ఛాంపియన్‌షిప్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. సర్‌ వివియన్‌ స్టేడియం వేదికగా లీవార్డ్ ఐలాండ్స్–ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పిచ్‌ ప్రమాదకరంగా మారడంలో మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు.ట్రినిడాడ్ పేసర్ జేడన్‌ సీల్స్‌ వేసిన బంతి, లీవార్డ్ ఐలాండ్స్ బ్యాటర్‌ జెర్మియా లూయిస్‌ హెల్మెట్‌ను బలంగా తాకింది. అసమాన బౌన్స్ కారణంగా బంతి ఒక్కసారిగా తలపైకి దూసుకువచ్చి లూయిస్‌ను కిందపడేసింది. ఈ ఘటనతో మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.Jayden Seales has claimed the first seven wickets to fall in an innings for Trinidad & Tobago against Leeward Islands, but looks set to be denied the chance to take 10 with the game halted due to a dangerous pitch. The last ball before the suspension is not for the faint-hearted pic.twitter.com/o4G5ULiSAh— Ben Gardner (@Ben_Wisden) April 21, 2026లూయిస్ కొద్దిసేపటి తర్వాత లేచినప్పటికీ, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హెల్మెట్‌ను కాలితో తన్నడం, పిచ్‌ను కొట్టడం కనిపించింది. అనంతరం అతడిని స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన తర్వాత మ్యాచ్ అధికారులతో పాటు అంపైర్లు చర్చలు జరిపి పిచ్ ప్రమాదకరంగా ఉందని తేల్చారు. ఆట కొనసాగితే ఆటగాళ్లకు గాయాలు తప్పవని తెలిసి మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.మూడో రోజు వరకు పిచ్ అస్థిరంగా ఉండటం వల్ల ఇప్పటికే అనేక వికెట్లు పడిపోయాయి. బంతి ఎలా బౌన్స్ అవుతుందో అంచనా వేయడం బ్యాటర్లకు కష్టమైంది.ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్‌ హ్యూస్‌ ఘటనను గుర్తు చేసింది. హ్యూస్ మెడకు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి ఘటనలో లూయిస్ సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించినప్పటికీ, పిచ్ పరిస్థితులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈ ఘటన ఆటగాళ్ల భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు మెరుగుపడినా పిచ్ నాణ్యతలో లోపాలు ఉంటే ప్రమాదాలు తప్పవని స్పష్టం చేసింది.

Cost Us Dearly: Axar Patel Criticize KL Rahul DC Star Blunders After Loss SRH3
SRH vs DC: ఆ రెండు తప్పులే మా కొంపముంచాయి

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో పరాజయంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ స్పందించాడు. అభిషేక్‌ శర్మ విషయంలో తాము చేసిన ఫీల్డింగ్‌ తప్పిదాలే కొంపముంచాయని పేర్కొన్నాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ మంగళవారం సన్‌రైజర్స్‌తో తలపడింది.సొంతమైదానంలో టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌ ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో చెలరేగగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ మెరుపులు (13 బంతుల్లో 37 నాటౌట్‌) మెరిపించాడు. ఫలితంగా సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.రెండుసార్లు మిస్‌అయితే, తొమ్మిదో ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో తొలి బంతికి అభిషేక్‌ను రనౌట్‌ చేసే అవకాశం రాగా.. ఢిల్లీ వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ ఛాన్స్‌ మిస్‌ చేశాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్‌.. 14వ ఓవర్లో నటరాజన్‌ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపగా.. నితీశ్‌ రాణా క్యాచ్‌ మిస్‌ చేశాడు.ఆ రెండు తప్పులే మా కొంపముంచాయిఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 195 పరుగులే చేసింది. దీంతో 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఢిల్లీ సారథి అక్షర్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ను రనౌట్‌ చేసే అవకాశం వదులుకున్నాం. క్యాచ్‌ కూడా జారవిడిచాము. ఈ రెండు తప్పిదాల వల్లే మేము మూల్యం చెల్లించాల్సి వచ్చింది.ఒకవేళ ఈ రెండింటిలో ఒక్క సందర్భంలో మేము అవకాశం సద్వినియోగం చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే, అతడు మా తప్పిదాలను తనకు అనుకూలంగా మలచుకుని పరుగులు రాబట్టాడు. మేము ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్‌ చేయాల్సింది. కానీ ఈరోజు అలా చేయలేకపోయాము’’ అని అక్షర్‌ పటేల్‌ విచారం వ్యక్తం చేశాడు.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’𝐀𝐛𝐡𝐢-cadabra… & it’s a HUNDRED off just 47 balls 🪄🤯2nd TATA IPL Century ✅9th century in T20s - also the joint-most centuries by an Indian ✅Fastest Indian to 9 T20 hundreds (184 innings) ✅#AbhishekSharma | #TATAIPL 2026 | #SRHvDC | LIVE NOW 👉… pic.twitter.com/YHeoeyyahv— Star Sports (@StarSportsIndia) April 21, 2026

Abhishek sharma 100 Just 47 Balls In IPL Against DC4
అభిషేక్‌ విధ్వంసం.. సెంచరీతో ఉప్పల్‌లో ఉప్పెన!

ఐపీఎల్‌లో అభిషేక్‌ మళ్లీ విధ్వంసం సృష్టించాడు. తనకే సాధ్యమైన రీతిలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను సెంచరీతో ఉప్పల్‌ మైదానంలో ఉప్పెన సృష్టించాడు. బౌండరీలతోనే సరిగ్గా 100 పరుగులు రాబట్టిన అభిషేక్‌కు క్లాసెన్, ఇషాన్‌ కిషన్, హెడ్‌ కూడా అండగా నిలవడంతో హైదరాబాద్‌ భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. అయితే ఢిల్లీ బ్యాటింగ్‌ ఏమాత్రం రైజర్స్‌కు సరితూగలేకపోయింది. ఏ దశలోనూ కావాల్సిన దూకుడును ప్రదర్శించని క్యాపిటల్స్‌ లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. సమష్టి బౌలింగ్‌తో రైజర్స్‌ ఢిల్లీని పడగొట్టి వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్‌; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఐపీఎల్‌లో తన రెండో సెంచరీతో చెలరేగగా... హెన్రిచ్‌ క్లాసెన్‌ (13 బంతుల్లో 37 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రవిస్‌ హెడ్‌ (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా (30 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... సమీర్‌ రిజ్వీ (28 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (23 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్‌ బౌలర్‌ ఇషాన్‌ మలింగకు 4 వికెట్లు దక్కాయి. THE HUNDRED CELEBRATION BY ABHISHEK SHARMA. 🔥- Proud father and Kavya Maran cheering. ❤️ pic.twitter.com/pbBYLZViiL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2026భారీ భాగస్వామ్యాలు... తొలి నాలుగు ఓవర్లలో 6 ఫోర్లతో 36 పరుగులు రాబట్టిన రైజర్స్‌ ఇన్నింగ్స్‌ నితీశ్‌ రాణా వేసిన ఐదో ఓవర్‌తో ఊపందుకుంది. ఈ ఓవర్లో అభిషేక్, హెడ్‌ కలిసి 3 సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో టీమ్‌ 67 పరుగులు సాధించింది. అనంతరం 25 బంతుల్లో అభిõÙక్‌ అర్ధసెంచరీ పూర్తి కాగా, అక్షర్‌ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి హెడ్‌ వెనుదిరిగాడు. అయితే మరోవైపు అభిషేక్‌ దూకుడు కొనసాగగా, ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా తన ధాటిని ప్రదర్శించాడు. వీరిద్దరు కలిసి కుల్దీప్‌ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 పరుగులు రాబట్టారు. 86 పరుగుల వద్ద డీప్‌ బ్యాక్‌వర్డ్‌లెగ్‌లో రాణా క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్‌ శర్మ... రాణా ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. అయితే అదే ఓవర్లో దురదృష్టవశాత్తూ రిటర్న్‌లో బౌలర్‌ చేతికి తగిలిన బంతి నాన్‌స్ట్రయికింగ్‌ స్టంప్స్‌ను పడగొట్టడంతో కిషన్‌ రనౌటయ్యాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో అభిషేక్‌ ను ఆపడంలో ఢిల్లీ సఫలం అయింది. ఈ 30 బంతుల్లో 17 బంతులు ఆడిన అభిషేక్‌ 2 ఫోర్లతో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు ఉన్న క్లాసెన్‌ మాత్రం తనదైన శైలిలో చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఎన్‌గిడి ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు కొట్టిన అతను... ముకేశ్‌ వేసిన చివరి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. మిల్లర్‌ విఫలం... ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అడుగు పెట్టిన పేసర్‌ మదుషంక చక్కటి బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. తన 3 ఓవర్ల తొలి స్పెల్‌లో 24 పరుగులే ఇచి్చన అతను నిసాంక (8) వికెట్‌ తీశాడు. మరోవైపు నితీశ్‌ రెడ్డి వేసిన రెండు ఓవర్లలో రాణా, రాహుల్‌ కలిసి 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 29 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 59 పరుగులకు చేరింది. శివాంగ్‌ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాణా 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రాహుల్‌ను సాకిబ్‌ వెనక్కి పంపించగా, తర్వాతి ఓవర్లో మలింగ వరుస బంతుల్లో రాణా, మిల్లర్‌ (0)లను అవుట్‌ చేయడంతో రైజర్స్‌ పైచేయి సాధించింది. ఆ తర్వాత రిజ్వీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌ (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి పోరాడినా లాభం లేకపోయింది. 26 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన దశలో స్టబ్స్‌ అవుట్‌ కావడంతో ఢిల్లీ గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలుసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (నాటౌట్‌) 135; హెడ్‌ (సి) రిజ్వీ (బి) అక్షర్‌ 37; ఇషాన్‌ కిషన్‌ (రనౌట్‌) 25; క్లాసెన్‌ (నాటౌట్‌) 37; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–97, 2–176. బౌలింగ్‌: ముకేశ్‌ కుమార్‌ 4–0–53–0, నితీశ్‌ రాణా 4–0–55–0, ఎన్‌గిడి 4–0–41–0, అక్షర్‌ పటేల్‌ 2–0–23–1, కుల్దీప్‌ 2–0–30–0, నటరాజన్‌ 4–0–40–0. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: నిసాంక (సి) (సబ్‌) లివింగ్‌స్టోన్‌ (బి) మదుషంక 8; రాహుల్‌ (సి) అభిషేక్‌ (బి) సాకిబ్‌ 37; నితీశ్‌ రాణా (సి) అభిషేక్‌ (బి) మలింగ 57; రిజ్వీ (సి) మదుషంక (బి) దూబే 41; మిల్లర్‌ (బి) మలింగ 0; స్టబ్స్‌ (సి) సాకిబ్‌ (బి) మలింగ 27; అశుతోష్‌ (సి) అనికేత్‌ (బి) మలింగ 14; అక్షర్‌ (సి) నితీశ్‌ (బి) దూబే 2; కుల్దీప్‌ (నాటౌట్‌) 1; ఎన్‌గిడి (సి) మదుషంక (బి) దూబే 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–21, 2–107, 3–107, 4–107, 5–166, 6–186, 7–192, 8–195, 9–195. బౌలింగ్‌: మదుషంక 4–0–36–1, నితీశ్‌ రెడ్డి 4–0–57–0, ఇషాన్‌ మలింగ 4–0–32–4, సాకిబ్‌ 4–0–29–1, శివాంగ్‌ 2–0–28–0, హర్‌‡్ష దూబే 2–0–12–3.

Carlos Alcaraz and Aryna Sabalenka led the winners at the Laureus Awards 20265
బెస్ట్‌ అల్‌కరాజ్, సబలెంకా

మాడ్రిడ్‌: క్రీడా ప్రపంచంలో అస్కార్‌ అవార్డులుగా భావించే లారియస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ కార్యక్రమం జరిగింది. 2025 సంవత్సరానికి గాను పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌... మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా బెలారూస్‌ టెన్నిస్‌ స్టార్‌ సబలెంకా పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరం నుంచి లారియస్‌ అవార్డులు ప్రతియేటా ఇస్తున్నారు. గత ఏడాది అల్‌కరాజ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తోపాటు మరో ఆరు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన ఈ స్పెయిన్‌ స్టార్, వింబుల్డన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా 71 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 2026 సీజన్‌ను కూడా అల్‌కరాజ్‌ ఘనంగా ప్రారంభించాడు. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో తొలిసారి టైటిల్‌ గెలిచి టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సొంతం చేసుకొని ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనత సాధించాడు. గతవారం బార్సిలోనా ఓపెన్‌ టోర్నీలో మణికట్టు గాయానికి గురైన అల్‌కరాజ్‌ మాడ్రిడ్‌ మాస్టర్స్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటేనే ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోకి దిగుతానని 22 ఏళ్ల అల్‌కరాజ్‌ వ్యాఖ్యానించాడు. రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) తర్వాత ‘లారియస్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు గెల్చుకున్న నాలుగో టెన్నిస్‌ ప్లేయర్‌గా అల్‌కరాజ్‌ గుర్తింపు పొందాడు. మరోవైపు మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్‌ సబలెంకా కూడా గతేడాది నిలకడగా రాణించింది. యూఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ నెగ్గిన సబలెంకా ఆ్రస్టేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్నీలోనూ రన్నరప్‌ ట్రోఫీ అందుకుంది. ఓవరాల్‌గా సీజన్‌లో నాలుగు టైటిల్స్‌ సొంతం చేసుకున్న ఆమె 63 మ్యాచ్‌ల్లో గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ‘వరల్డ్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ఫ్రాన్స్‌కు చెందిన ఫుట్‌బాల్‌ క్లబ్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ) గెల్చుకుంది. గత ఏడాది పీఎస్‌జీ జట్టు తొలిసారి ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ను సాధించింది. ‘టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు విభాగంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు కూడా నామినేట్‌ అయింది. గత ఏడాది హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను సాధించింది. అయితే తుదకు ఈ అవార్డు పీఎస్‌జీ జట్టుకు లభించింది. రొమేనియా దిగ్గజ జిమ్నాస్ట్‌ నాడియా కొమనెసికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. 64 ఏళ్ల నాడియా ఒలింపిక్స్‌ క్రీడల్లో 10కి 10 పాయింట్లు స్కోరు చేసిన తొలి జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పింది. 1976 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో ఆల్‌ అరౌండ్, అన్‌ఈవెన్‌ బార్స్, బ్యాలెన్స్‌ బీమ్‌ ఈవెంట్లలో నాడియా ‘పర్‌ఫెక్ట్‌ 10’ స్కోరుతో స్వర్ణ పతకాలు సాధించింది. అంతర్జాతీయ కెరీర్‌లో నాడియా మొత్తం తొమ్మిది ఒలింపిక్‌ పతకాలు, నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలు, మూడు వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పతకాలు గెలుచుకుంది. లారియస్‌ అవార్డు విజేతల జాబితావరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్, టెన్నిస్‌) వరల్డ్‌ స్పోర్ట్స్‌ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: సబలెంకా (బెలారూస్, టెన్నిస్‌) వరల్డ్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (ఫ్రాన్స్, ఫుట్‌బాల్‌) వరల్డ్‌ బ్రేక్‌థ్రూ ఆఫ్‌ ద ఇయర్‌: లాండో నోరిస్‌ (బ్రిటన్, ఫార్ములావన్‌) వరల్డ్‌ కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌: రోరీ మెకిల్రాయ్‌ (నార్తర్న్‌ ఐర్లాండ్, గోల్ఫ్‌) వరల్డ్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (దివ్యాంగులు): గాబ్రియెల్‌ అరుజో సాంతోస్‌ (బ్రెజిల్, స్విమ్మింగ్‌) వరల్డ్‌ యాక్షన్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: చోల్‌ కిమ్‌ (అమెరికా, స్నో బోర్డ్‌) వరల్డ్‌ యంగ్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: లామినె యామల్‌ (స్పెయిన్, ఫుట్‌బాల్‌) స్పోర్టింగ్‌ ఇన్‌స్పిరేషన్‌ అవార్డు: టోనీ క్రూస్‌ (జర్మనీ, ఫుట్‌బాల్‌) లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు: నాడియా కొమనెసి (రొమేనియా, జిమ్నాస్టిక్స్‌) స్పోర్ట్‌ ఫర్‌ గుడ్‌ అవార్డు: ఫుట్‌బాల్‌ మాస్‌

Tilak Varma on his batting in gujarat titans match6
‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ జట్టులో చాలా మంది ప్రపంచకప్‌ విజేతలు ఉన్నారని... వారు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే తమ జట్టును ఆపడం ఎవరి వల్లా కాదని మిడిలార్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అన్నాడు. ఐపీఎల్‌లో భాగంగా సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జయభేరి మోగించడంలో తిలక్‌ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ హైదరాబాదీ లెఫ్ట్‌ హ్యాండర్‌... ఆ తర్వాత భారీ షాట్‌లతో రెచ్చిపోయి అజేయ సెంచరీతో ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత బౌలర్లు సమష్టి కృషితో సత్తాచాటడంతో గుజరాత్‌పై ముంబై ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం తిలక్‌ మాట్లాడుతూ... ‘ఈ ప్రదర్శన నాకు, జట్టుకు ఎంతో ముఖ్యమైంది. గత నాలుగైదు మ్యాచ్‌ల్లో ఏదీ కలిసిరాలేదు. ఎక్కువ సమయం క్రీజులో గడిపేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో గుజరాత్‌తో మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని అనుకున్నా... అది ఫలితాన్నిచ్చింది’ అని అన్నాడు. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన ముంబై ఇండియన్స్‌... తిలక్‌ మెరుపులతో తిరిగి గెలుపు బాట పట్టింది. తిలక్‌ వర్మకు ఐపీఎల్‌లో ఇదే తొలి శతకం కాగా... ఈ జోరు సీజన్‌ మొత్తం కొనసాగించాలనుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ‘అహ్మదాబాద్‌ వేదికగా ముంబై మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా... ఇలాంటి పిచ్‌పైనే సాగుతుంది. ఇతర పిచ్‌లతో పోల్చుకుంటే అది కాస్త నెమ్మదిగా ఉంది. బంతి తక్కువ ఎత్తులో వస్తుండటంతో స్ట్రెయిట్‌గా ఆడాలని నిర్ణయించుకున్నా. దీంతో సులువుగా పరుగులు రాబట్టగలిగా. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయడాన్ని ఇష్టపడతా. కానీ జట్టుకు అవసరమైనప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చిన్నప్పటి నుంచి దీని కోసం ఎంతో సాధన చేశా. ఎక్కువ ఆలోచించడం లేదు. చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అందుకోవడమే మా పని. ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం. మా సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. జట్టులో చాలా మంది ప్రపంచకప్‌ గెలిచిన ప్లేయర్లు ఉన్నారు. అనుభవం, నైపుణ్యానికి కొదవలేదు. మేమంతా కలిసికట్టుగా రాణిస్తే... ముంబై ఇండియన్స్‌ను ఆపడం ఎవరి తరం కాదు. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో హార్దిక్‌ పాండ్యా ఉత్సాహపరిచాడు. ‘నువ్వు చేయగలవు’ అని పదే పదే చెప్తూ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఆ సమయంలో ‘ప్రశాంతంగా ఉండు... మిగిలిందంతా నేను చూసుకుంటా’ అని చెప్పాను. మొత్తానికి ఈ విజయం జట్టులో జోష్‌ నింపింది’ అని తిలక్‌ వివరించాడు.

Shafali ranked sixth in ICC Womens T20 rankings7
ఆరో స్థానంలో షఫాలీ

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనలో ఆకట్టు కుంటున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ... అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ముందంజ వేసింది. సఫారీ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్న షఫాలీ వర్మ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి... ఆరో ర్యాంక్‌కు చేరింది. డర్బన్‌ వేదికగా జరిగిన రెండో టి20లో షఫాలీ 38 బంతుల్లోనే 57 పరుగులు చేసింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో షఫాలీ 34 పరుగులతో మెరిసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. ఈ ప్రదర్శనతో తాజా ర్యాంకింగ్స్‌లో షఫాలీ 731 పాయింట్లతో ఆరో ‘ప్లేస్‌’కు చేరింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (762 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పరిమితమైంది. టాప్‌–10 ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ఈ ఇద్దరే చోటు దక్కించుకున్నారు. ఆ్రస్టేలియా ప్లేయర్‌ జార్జియా వాల్‌ (815 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... బెత్‌ మూనీ (788 పాయింట్లు; ఆ్రస్టేలియా), హేలీ మాథ్యూస్‌ (767 పాయింట్లు; వెస్టిండీస్‌) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (639 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 11వ ర్యాంక్‌కు చేరగా... జెమీమా రోడ్రిగ్స్‌ (637 పాయింట్లు) నాలుగు ర్యాంక్‌లు కోల్పోయి 14వ స్థానంలో ఉంది. బౌలర్ల విభాగంలో దీప్తి శర్మ (705 పాయింట్లు) రెండు స్థానాలు కోల్పోయి ఐదో ర్యాంక్‌కు చేరగా... రేణుక సింగ్‌ (699 పాయింట్లు) నాలుగు స్థానాలు చేజార్చుకొని 9వ ర్యాంక్‌లో నిలిచింది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది.

Indian shooter Shiv Narwal wins gold medal8
శివ నర్వాల్‌ పసిడి గురి

కైరో: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నీలో తొలి రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ శివ నర్వాల్‌ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చిరాగ్‌ శర్మ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో శివ నర్వాల్‌ 241.8 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. 240 పాయింట్లతో సోదిక్‌జోన్‌ అబ్దుల్లాయెవ్‌ రజత పతకం... 218.9 పాయింట్లతో చిరాగ్‌ శర్మ కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో పోటీపడ్డ భారత మూడో షూటర్‌ అభినవ్‌ దేశ్వాల్‌ 136.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. జూనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ పనాహ్‌ బుగ్రా రజత పతకం సంపాదించింది. ఫైనల్లో పనాహ్‌ 250.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది.

Punjab CM Bhagwant Mann meets former Netherlands player9
పంజాబ్‌ క్రీడాకారులకు హాకీ దిగ్గజం బోవెలాండర్‌ పాఠాలు!

చండీగఢ్‌: నెదర్లాండ్స్‌ హాకీ దిగ్గజం ఫ్లోరిస్‌ జాన్‌ బోవెలాండర్‌తో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ భేటీ అయ్యారు. ప్రతిష్టాత్మక ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు రాష్ట్రంలో హాకీని మరింత బలోపేతం చేయడానికి బోవెలాండర్‌ సేవలను వినియోగించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌ పర్యటనలో ఉన్న భగవంత్‌ మాన్‌... ఇందులో భాగంగా హాకీపై బోవెలాండర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. హాకీకి పునరై్వభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా బోవెలాండర్‌ అసాధారణ ప్రతిభను మాన్‌ ప్రశంసించారు. ఆయన క్రీడా ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి పంజాబ్‌ ఆతిథ్యమివ్వనుంది. ప్లేయర్ల నైపుణ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు పంజాబ్‌కు రావాల్సిందిగా బోవెలాండర్‌ను భగవంత్‌ మాన్‌ ఆహ్వానించారు. దీనికి డచ్‌ దిగ్గజం సుముఖత వ్యక్తం చేశాడు. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు బోవెలాండర్‌ భారత్‌కు రానున్నట్లు మాన్‌ వెల్లడించారు. ‘క్రీడా ప్రతిభను పెంపొందించడానికి, హాకీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పంజాబ్‌ కట్టుబడి ఉంది. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి తొలిసారి పంజాబ్‌ ఆతిథ్యమివ్వనుంది. భారత హాకీలో ఎప్పటి నుంచో పంజాబ్‌ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. 50 మందికి పైగా పంజాబ్‌ ప్లేయర్లు హాకీలో ఒలింపిక్‌ పతకాలు సాధించారు. పది మందికిపైగా పంజాబ్‌ ప్లేయర్లు విశ్వక్రీడల్లో దేశానికి నాయకత్వం వహించారు. పంజాబీ ప్లేయర్‌ లేకుండా భారత హాకీ జట్టును ఊహించడం కష్టం. పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులోనూ పది మంది పంజాబీ ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఘనచరిత్ర ఉన్న ప్లేయర్లకు దిశానిర్దేశం చేసేందుకు నెదర్లాండ్స్‌ హాకీ దిగ్గజం బోవెలాండర్‌ అంగీకరించారు. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఆయన మన ప్లేయర్లలో స్ఫూర్తినింపనున్నారు’ అని భగవంత్‌ మాన్‌ వెల్లడించారు.

Sony Network wins Asian Games broadcasting rights10
ఆసియా క్రీడల ప్రసార హక్కులు సోనీ నెట్‌వర్క్‌కు

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌ వేదికగా జరగనున్న 20వ ఆసియా క్రీడల ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ కైవసం చేసుకుంది. దీంతో ఏషియన్‌ గేమ్స్‌ను సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ చానల్స్‌తో పాటు సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. చైనా వేదికగా జరిగిన గత ఆసియా క్రీడల్లో భారత్‌ 107 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ‘ఆసియా క్రీడా మహోత్సవ ప్రసార హక్కులు దక్కించుకోవడం గర్వంగా ఉంది. సోనీ టీవీకి ఈ అవకాశం రావడం ఇది మూడోసారి’ అని సోనీ నెట్‌వర్క్‌ ప్రతినిధి రాజేశ్‌ కౌల్‌ అన్నారు. జపాన్‌ వేదికగా జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌లో మొత్తం 41 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో 32 ఒలింపిక్‌ క్రీడలు ఉన్నాయి. వీటితో పాటు మిక్స్‌డ్‌ మార్షల్, సర్ఫింగ్‌ వంటి కొత్త క్రీడలను సైతం ఇందులో చేర్చారు. ఈ క్రీడల్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, కబడ్డీ, సెపక్‌తక్రా, కురాశ్‌ వంటి పలు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ‘గత ఆసియా క్రీడల్లో భారత్‌ అద్భుత ప్రదర్శన కనబర్చంది. తొలిసారి వంద పతకాల మైలురాయిని దాటింది. ఇది దేశంలో పెరుగుతున్న క్రీడా సంస్కృతికి నిదర్శనం. ఈసారి అంతకుమించిన ప్రదర్శనతో రికార్డులు తిరగరాయడం ఖాయమే. అలాంటి స్ఫూర్తిదాయక క్షణాలను ప్రసారం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని రాజేశ్‌ వెల్లడించారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement