Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: India Creates History Becomes 1st Team in World To1
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్‌ రికార్డు

టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జింబాబ్వేపై 256 పరుగులుభారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్‌-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.పొట్టి క్రికెట్లో తొలి జట్టుగాముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.Another must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్‌ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు👉టీమిండియా- ఆరు సార్లు👉సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ఐదు సార్లు👉వెస్టిండీస్‌- మూడు సార్లు👉జింబాబ్వే- మూడు సార్లు👉సర్రే- మూడు సార్లు.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్‌.. జట్టు నుంచి తీసేయండి!

PCB Reshuffles selection committee again after T20 WC exit2
పాకిస్తాన్‌ క్రికెట్‌లో కీలక పరిణామం.. ఈసారి..

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సెలక్టర్‌ పదవికి అలీం దర్‌ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో ఇద్దరిని సెలక్షన్‌ కమిటీలో చేర్చింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో పాకిస్తాన్‌ జట్టు విఫలమైన విషయం తెలిసిందే.సెమీ ఫైనల్‌ చేరకుండానేగ్రూప్‌ దశలో ఫర్వాలేదనిపించిన సల్మాన్‌ ఆఘా బృందం.. సూపర్‌-8లో మాత్రం చేతులెత్తేసింది. ఫలితంగా సెమీ ఫైనల్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టుపై.. ముఖ్యంగా సీనియర్లు బాబర్‌ ఆజం (Babar Azam), షాబాద్‌ ఖాన్‌, షాహిన్‌ ఆఫ్రిదిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అలీం దర్‌ రాజీనామాఈ క్రమంలో సెలక్టర్‌, మాజీ అంపైర్‌ అలీం దర్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. శ్రీలంకలో తమ మ్యాచ్‌ల దృష్ట్యా హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ (Mike Hesson), మరో సెలక్టర్‌ ఆకిబ్‌ జావేద్‌ బాబర్‌, షాదాబ్‌లను ఆడించాలని పట్టుపట్టగా.. అలీం మాత్రం వ్యతిరేకించినట్లు సమాచారం.అంతేకాదు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను ఎంపిక చేయాలని అలీం వాదించగా.. మిగతా వారు అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో నొచ్చుకున్న అలీం దర్‌ తన పదవికి రాజీనామా చేశాడు.సెలక్టర్లు మాజీ కెప్టెన్లు ఈ నేపథ్యంలో పీసీబీ ఇద్దరిని జాతీయ సెలక్షన్‌ కమిటీలో చేర్చింది. మాజీ కెప్టెన్లు మిస్బా ఉల్‌ హక్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌లకు మెన్స్‌ సెలక్షన్‌ కమిటీలో చోటు ఇచ్చింది. కాగా ఆకిబ్‌ జావేద్‌, అసద్‌ షఫీక్‌లతో కలిసి వీరిద్దరు సెలక్టర్లుగా పనిచేయనున్నారు. కాగా అలీం దర్‌ గతేడాది అక్టోబరులో పాక్‌ పురుషుల జట్టు కెప్టెన్‌గా వచ్చాడు. అయితే, హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ అతి జోక్యం, ఆకిబ్‌ జావేద్‌ అతడికే వంతపాడిన నేపథ్యంలో విసుగు చెంది రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా జియో సూపర్‌ వెల్లడించింది.గతంలో ఇలా..ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్‌ అహ్మద్‌ గతంలో పాకిస్తాన్‌ అండర్‌-19 జట్టు పాక్‌ షాహీన్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. మరోవైపు.. మిస్బా ఉల్‌ హక్‌ గతంలో పాక్‌ జట్టు హెడ్‌కోచ్‌గా, చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలే నిర్వర్తించాడు. అంతేకాదు.. పీసీబీ క్రికెట్‌ టెక్నికల్‌ కమిటీలో సభ్యుడిగానూ సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి సెలక్టర్‌గా తిరిగి వచ్చాడు. ఇక బాబర్‌, షాదాబ్‌ విఫలమైన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2026: రషీద్‌ ఖాన్‌పై వేటు.. అఫ్గనిస్తాన్‌కు కొత్త కెప్టెన్‌

T20 WC 2026 Semis IND vs ENG: Sanju Scripts History Breaks Rohit Record3
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌

టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ అదరగొట్టాడు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.Ohhhhh, Harry Brook! 😳Sanju Samson makes the most of the lifeline and sends it into the stands! 🚀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/zOWfIEAdUv— Star Sports (@StarSportsIndia) March 5, 2026మరోసారి సెంచరీ మిస్‌అయితే, దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ అతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు.అయితే, మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కాగా.. తొలిసారి సంజూకు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు.అనంతరం సూపర్‌-8 జింబాబ్వేతో మ్యాచ్‌ సందర్భంగా తిరిగి తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. 15 బంతుల్లో 24 రన్స్‌ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్‌మెంట్‌ ఈసారి సంజూపై నమ్మకం ఉంచింది. ఈ ‍క్రమంలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌ను గెలిపించి సెమీ ఫైనల్‌కు చేర్చాడు. అయితే, మూడు పరుగులతో అక్కడ సెంచరీ మిస్సయ్యాడు.8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టితాజాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ సంజూ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో పద్నాలుగో ఓవర్లో విల్‌ జాక్స్‌ బౌలింగ్‌కు దిగాడు. అతడి బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించిన సంజూ.. ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు సాధించి.. సెంచరీకి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Just Hardik Pandya things at the Wankhede Stadium! 🔥🚨 RECORD ALERT: 19 sixes by #TeamIndia - the most in an innings in ICC Men's T20 World Cup history!ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/JdGVdpz1B4— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఇక ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (9)తో కలిసి తొలి వికెట్‌కు 20 పరుగులు జోడించిన సంజూ.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (39)తో కలిసి రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం దూబేతో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు👉సంజూ శాంసన్‌- 16 సిక్స్‌లు- 2026లో👉రోహిత్‌ శర్మ- 15 సిక్స్‌లు- 2024లో👉శివం దూబే- 15 సిక్స్‌లు- 2026లో👉ఇషాన్‌ కిషన్‌- 14 సిక్స్‌లు- 2026లో👉హార్దిక్‌ పాండ్యా- 14 సిక్స్‌లు- 2026లో👉యువరాజ్‌ సింగ్‌- 12 సిక్స్‌లు- 2007లో.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్‌.. జట్టు నుంచి తీసేయండి!

T20 WC 2026 Semis IND vs ENG: Abhishek Sharma Flops Again Fans Slams4
IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్‌.. జట్టు నుంచి తీసేయండి!

టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ పేలవ ఆట తీరుతో తేలిపోయాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. దీంతో టీమిండియా అభిమానులు సైతం అభిషేక్‌ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభం నుంచి అభిషేక్‌ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ డకౌట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్‌-8 దశలో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పదిహేను పరుగులకే పెవిలియన్‌ చేరిన అభిషేక్‌.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకంతో రాణించాడు.పాత కథే పునరావృతంఅయితే, సూపర్‌-8లో కీలకమైన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మరోసారి తేలిపోయాడు అభిషేక్‌ శర్మ. పట్టుమని పది పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్లో అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, యాజమాన్యం మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. అతడు పాత కథనే పునరావృతం చేశాడు.తొమ్మిది పరుగులే చేసిముంబై వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఏడు బంతుల్లో రెండు ఫోర్లు బాది కేవలం తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఓవర్లో విల్‌ జాక్స్‌ బంతితో రంగంలోకి దిగి ఆఖర్లో స్లోబాల్‌ వేశాడు. ఈ క్రమంలో భారీ షాట్‌కు యత్నించిన అభిషేక్‌.. బంతిని గాల్లోకి లేపగా డీప్‌ మిడ్‌ వికెట్‌ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫిల్‌ సాల్ట్‌ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో అభిషేక్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. మరోసారి ఆఫ్‌ స్పిన్నర్‌ చేతికి చిక్కి నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు అభిషేక్‌ శర్మ ఈ టోర్నీలో చేసిన పరుగులు 89. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా అభిమానులు అభిషేక్‌పై భగ్గుమంటున్నారు. ‘‘ నువ్విక మారవా?.. అతడిని జట్టు నుంచి తీసేయండి’’ అని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట

T20 WC 2026 2nd Semis IND vs ENG: Toss Update Both Playing XIs 5
T20 WC 2nd Semis: ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో కీలక పోరు... రెండో సెమీ ఫైనల్లో భారత్‌- ఇంగ్లండ్‌ అమీతుమీ... ముంబైలోని వాంఖడే వేదికగా టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌... ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.భారత్‌ భారీ స్కోరునిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ భారీ హాఫ్‌ సెంచరీ (42 బంతుల్లో 89) బాదగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21),హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.UPDATES: పదిహేడు ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 209-515 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 185-5కర్రాన్‌ 5, బెతెల్‌ 81 పరుగులతో ఉ‍న్నారు.13.6: ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో జాక్స్‌ (35) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా పట్టిన శివం దూబే.పదమూడు ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 160-4విజయానికి 42 బంతుల్లో 94 పరుగులు కావాలి. బెతెల్‌ 65, విల్‌ జాక్స్‌ 35 పరుగులతో ఉన్నారు.పది ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 119-4నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌7.3: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో టామ్‌ బాంటన్‌ (5 బంతుల్లో 17) బౌల్డ్‌. క్రీజులోకి విల్‌ జాక్స్‌. స్కోరు: 95-4(7.3).బెతెల్‌ 39 పరుగులతో ఉన్నాడు. విజయానికి 75 బంతుల్లో 159 పరుగులు కావాలి.మూడో వికెట్‌ డౌన్‌5.5: వరుణ్‌ చక్రవర్తి అద్భుత రీతిలో బట్లర్‌ (25)ను బౌల్డ్‌ చేశాడు. స్కోరు: 64-3(5.5). బెతెల్‌ 26 పరుగులతో ఉన్నాడు.రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌4.1: బుమ్రా బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ (7) ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్‌పటేల్‌ అద్భుత రీతిలో అందుకున్నాడు. ఫలింగా ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జేకబ్‌ బెతెల్‌ క్రీజులోకి రాగా.. బట్లర్‌ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 38-2(4.2).తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌1.1: హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ (5) అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌. క్రీజులోకి బ్రూక్‌. బట్లర్‌ ఎనిమిది పరుగులతో ఉన్నాడు. స్కోరు: 14-1(1.2)భారత్‌ స్కోరు: 253-7ఏడో వికెట్‌ డౌన్‌19.5: ఆఖరి ఓవర్‌ఐదో బంతికి పాండ్యా రనౌట్‌ (12 బంతుల్లో 27). వరుణ్‌ చక్రవర్తి క్రీజులోకి రాగా.. అక్షర్‌ పటేల్‌ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌18.5: తిలక్‌ వర్మ రూపంలో ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌. ఆర్చర్‌ బౌలింగ్‌లో తిలక్‌ బౌల్డ్‌ (7 బంతుల్లో 21). అక్షర్‌ క్రీజులోకి రాగా.. పాండ్యా 14 రన్స్‌తో ఉన్నాడు. స్కోరు: 237-6(19)ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌17.3: సామ్‌ కర్రాన్‌ బౌలింగ్‌లో సింగిల్‌కు యత్నించి.. హార్దిక్‌ పాండ్యాతో సమన్వయ లోపం కారణంగా దూబే (25 బంతుల్లో 43) రనౌట్‌. తిలక్‌ వర్మ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్‌ డౌన్‌15.4: ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ స్టంపౌట్‌. స్కోరు: 190-4 (16). హార్దిక్‌ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. దూబే35 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 177-3సూర్య 5, దూబే 28 పరుగులతో ఉన్నారు.సంజూ శాంసన్‌ అవుట్‌13.1: సంజూ శాంసన్‌ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. విల్‌ జాక్స్‌బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించి.. ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. దూబే 18 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 160-3(13.1)రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా9.3: మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన ఇషాన్‌ కిషన్‌.. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో విల్‌ జాక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 18 బంతుల్లో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులో వచ్చాడు. సంజూ 66 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 117-2(9.3). 8.3: వంద పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియాAnother must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026సంజూ హాఫ్‌ సెంచరీవెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారీ హాఫ్‌ సెంచరీ బాదిన సంజూ.. తాజా మ్యాచ్‌లోనూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. డాసన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది మరీ ఈ మైలురాయి చేరుకున్నాడు.పవర్‌ ప్లేలో భారత్‌ స్కోరు: 67-1(6)సంజూ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 41 పరుగులతో ఉండగా.. ఇషాన్‌ కిషన్‌ 9 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు.తొలి వికెట్‌ డౌన్‌1.6: విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ (7 బంతుల్లో 9) అవుట్‌. సంజూ 11 పరుగులతో ఉండగా.. ఇషాన్‌ కిషన్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 20-1(2)సైలెంట్‌ చేసేస్తాంటాస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ బాగుంది. వికెట్‌ పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అనుకుంటున్నాం. అందుకే మేము ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాము.ఒక మార్పుతో బరిలోకిటీమిండియాకు ఈ పిచ్‌పై ఆడిన అనుభవం మాకంటే ఎక్కువే. అయితే, టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. టీమిండియా మద్దతుదారులు నిశ్శబ్దంగా ఉండేలా చేస్తాం. రెహాన్‌ అహ్మద్‌ స్థానంలో ఓవర్టన్‌ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.అదే జట్టు..ఇక టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘సెమీ ఫైనల్‌. బిగ్‌ గేమ్‌. మేము ముందుగా బ్యాటింగ్‌ చేయాలనే అనుకున్నాం. ఇక్కడ అంతగా డ్యూ ఉంటుందని అనుకోవడం లేదు. పిచ్‌ బాగుంది. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు ధన్యవాదాలు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.Harry Brook calls it right, and England will bowl first in the semi-final! ✌️What do you make of the decision? 👀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/Zabmv2MsVT— Star Sports (@StarSportsIndia) March 5, 2026భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఇంగ్లండ్‌ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట

West Indies Cricket still stuck in India despite T20 World Cup exit6
'మ‌మ్మ‌ల్ని పంపించండి మ‌హాప్ర‌భో'

టి20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వెస్టిండీస్ జ‌ట్టు త‌మ చివ‌రి మ్యాచ్ మార్చి 1న ఆడింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు చేరుకున్న విండీస్ టీమ్‌ కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్‌లో టీమిండియాతో త‌ల‌ప‌డి ఓట‌మి పాల‌యింది. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో త‌మ పోరాటం ముగియ‌డంతో స్వ‌దేశానికి ప‌య‌నం కావాల్సిన విండీస్ జ‌ట్టు అనూహ్యంగా ఇండియాలో చిక్కుబ‌డి పోయింది. ఐదు రోజుల నుంచి కోల్‌క‌తాలోనే ప‌డిగాపులు కాస్తోంది. ఈ నేప‌థ్యంలో వెస్టిండీస్ క్రికెట్ ప్ర‌ధాన కోచ్ డారెన్ సామీ త‌న బాధ‌ను ఎక్స్ వేదికగా వ్య‌క్తీక‌రించాడు.త‌మ‌ను ఎప్పుడు స్వ‌దేశానికి పంపిస్తారో చెప్పాల‌ని డారెన్ సామీ (Daren Sammy) వేడుకున్నాడు. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఈరోజా, వచ్చే వారమా అనేదానైనా చెప్పాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. ఇప్ప‌టికే 5 రోజులు గ‌డిచిపోయింద‌ని వాపోయాడు. కాగా, త‌మ జ‌ట్టు స‌భ్యులు భార‌త దేశంలో సుర‌క్షితంగా ఉన్నార‌ని క్రికెట్ వెస్టిండీస్ (CWI) అధికారిక ప్రకటనలో వెల్ల‌డించింది. అంత‌ర్జాతీయ గగనతల నియంత్ర‌ణ‌ల కార‌ణంగా త‌మ జ‌ట్టు స్వ‌దేశానికి రాలేక‌పోయింద‌ని తెలిపింది. ఇండియాలో త‌మ టీమ్‌కు త‌గిన వ‌స‌తి క‌ల్పించార‌ని పేర్కొంది.ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధ‌వాతావ‌ర‌ణం కార‌ణంగా గ‌గ‌న‌త‌లంలో ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. దీంతో గ‌ల్ప్ దేశాల‌తో స‌హా పలు మార్గాల్లో అంత‌ర్జాతీయ విమాన రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. ఫ‌లితంగా విమాన ప్ర‌యాణాల‌పై అనిశ్చితి కొన‌సాగుతోంది. జింబాబ్వే క్రికెట్ జ‌ట్టు కూడా ఇదే ర‌క‌మైన స‌మ‌స్య‌ను ఎదుర్కొంది.జ‌ట్టు కొంచెం ఆల‌స్యంగా స్వ‌దేశానికి వ‌చ్చినా ఫ‌ర్వాలేద‌ని, క్రికెటర్ల భ‌ద్ర‌త‌కే తాము ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని క్రికెట్ వెస్టిండీస్ స్ప‌ష్టం చేసింది. ఆట‌గాళ్ల‌ను సుర‌క్షితంగా తీసుకొచ్చేందుకు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో సమ‌న్వ‌యం చేసుకుంటున్నామ‌ని వివ‌రించింది. తొంద‌ర‌లోనే వారికి స్వ‌దేశానికి తీసుకొస్తామ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేసింది.చ‌ద‌వండి: 'థ్యాంక్స్ సంజు సామ్స‌న్‌.. ఇదీ రియ‌ల్ కేర‌ళ స్టోరీ'

Rashid Khan Sacked As Afghanistan Captain Replaced By This Player7
T20 WC: రషీద్‌ ఖాన్‌పై వేటు.. అఫ్గనిస్తాన్‌కు కొత్త కెప్టెన్‌

అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌పై వేటు పడింది. టీ20 కెప్టెన్సీ నుంచి అఫ్గన్‌ క్రికెట్‌ బోర్డు (ACB) అతడిని తొలగించింది. రషీద్‌ ఖాన్‌ స్థానంలో ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి ఏసీబీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి ఇబ్రహీం జద్రాన్‌ అఫ్గన్ టీ20 జట్టు సారథిగా (T20I New Captain) వ్యవహరిస్తాడని తెలిపింది. ఈ సందర్భంగా రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) కెప్టెన్సీలో జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాన్ని ఏసీబీ ప్రస్తావించింది.గుర్తుండిపోయే విజయాలు‘‘అఫ్గనిస్తాన్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా రషీద్‌ ఖాన్‌ పదవీ కాలంలో జట్టు గుర్తుండిపోయే విజయాలు సాధించింది. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఏకంగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఏసీబీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యంలో మార్పులు తీసుకువచ్చింది.కొత్త హెడ్‌కోచ్‌ వచ్చారు. అదే విధంగా కెప్టెన్‌ను కూడా మార్చాలని నిర్ణయించుకున్నాం. రషీద్‌ ఖాన్‌ డిప్యూటీగా పనిచేసిన ఇబ్రహీం జద్రాన్‌కు పగ్గాలు అప్పగించాము. రషీద్‌ ఖాన్‌ సేవలను మేము ప్రశంసిస్తున్నాం. అలాగే ఇబ్రహీం జద్రాన్‌ తన కొత్త,అతి ముఖ్యమైన పాత్రలో రాణించాలని కోరుకుంటున్నాం’’ అంటూ అఫ్గనిస్తాన్‌ చీఫ్‌ సెలక్టర్‌ అహ్మద్‌ షా సలీమనిఖిల్‌ ప్రకటన విడుదల చేశాడు.కాగా మార్చి 13, 15, 17 తేదీల్లో అఫ్గనిస్తాన్‌- శ్రీలంక మధ్య షార్జాలో మూడు టీ20లు, దుబాయ్‌లో మార్చి 20, 22, 25 మూడు వన్డేలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు సంబంధించి జట్లను ఏసీబీ తాజాగా ప్రకటించింది.టీ20 ప్రపంచకప్‌-2026లో అఫ్గనిస్తాన్‌ వైఫల్యంగత ఎడిషన్‌ ప్రభావంతో ఓ మోస్తరు అంచనాలతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌ ఈసారి నిరాశపరిచింది. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, యూఏఈ, కెనడా జట్లతో పోటీపడిన అఫ్గన్‌ జట్టు.. నాలుగింట కేవలం రెండు విజయాలే సాధించింది. ఫలితంగా సూపర్‌-8కు చేరకుండానే నిష్క్రమించింది.ఈ క్రమంలో జొనాథన్‌ ట్రాట్‌ హెడ్‌కోచ్‌గా తప్పుకోగా.. స్థానంలో కొత్త హెడ్‌ కోచ్‌గా రిచర్డ్‌ పైబస్‌ను నియమించింది ఏసీబీ. శ్రీలంకతో సిరీస్‌ సందర్భంగా కోచ్‌గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడు.‌శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అఫ్గన్‌ జట్టుఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), నూర్ రెహమాన్ (వికెట్‌ కీపర్‌), సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, షరాఫుద్దీన్ అష్రఫ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహ్మాన్, జియా ఉర్‌ రహ్మాన్‌ షరీఫీ, ఫరీద్‌ అహ్మద్‌, అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అఫ్గన్‌ జట్టుహష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మత్ షా (వైస్‌ కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), ఇక్రామ్ అలీఖిల్ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, సెదీఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, జియా ఉర్‌ రహ్మాన్‌ షరీఫీ, ఫరీద్‌ అహ్మద్‌, బిలాల్‌ సమీ.

Finally Zimbabwe Players Leave India In Batches Amid Middle East War8
T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట

జింబాబ్వే క్రికెట్‌ జట్టుకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే మార్గం సుగమమైంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో జింబాబ్వే చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిభారత్‌- శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీలో గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, ఒమన్‌లతో కలిసి జింబాబ్వే పోటీ పడింది. అనూహ్య రీతిలో మాజీ చాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి గ్రూప్‌ టాపర్‌గా సూపర్‌-8 చేరింది. అయితే, కీలక దశలో వెస్టిండీస్‌, టీమిండియా, సౌతాఫ్రికా చేతిలో ఓడి నిష్క్రమించింది.యుద్ధం కారణంగాఈ నేపథ్యంలో మార్చి 2న భారత్‌ నుంచి జింబాబ్వే జట్టు స్వదేశానికి పయనం కావాల్సింది. కానీ ఇరాన్‌- ఇజ్రాయెల్‌, అమెరికాల యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్‌ వేదికగా ప్రయాణించాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఫలితంగా జింబాబ్వే జట్టు బుధవారం వరకు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఈ క్రమంలో బ్యాచ్‌ల వారీగా భారత్‌ను వీడేందుకు జింబాబ్వే సిద్ధమైనట్లు ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. బుధవారం తొలి బ్యాచ్‌ స్వదేశానికి పయనం కాగా.. శుక్రవారం ఆఖరి బ్యాచ్‌ ఇండియా నుంచి బయల్దేరుతుందని తెలిపింది.అందుకే విడతల వారీగాఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పేర్కొంది. తగినన్ని విమానాలు అందుబాటులో లేనందున విడతల వారీగా ఆటగాళ్లు జింబాబ్వేకు చేరుకుంటాడని బోర్డు వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారం జింబాబ్వే జట్టు దుబాయ్‌ మీదుగా ఎమిరేట్స్‌ ఫ్లైట్‌లో వెళ్లాల్సింది. అయితే, యుద్ధ ప్రభావం కారణంగా అదిస్‌ అబాబా, ఇథియోపియా మీదుగా హరారేకు వారు చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు.. వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు సైతం భారత్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: మొయిన్‌ అలీపై నిషేధం..!

I can question Varun Chakaravarthy fielding position: Former India coach9
తప్పుడు ఫీల్డర్‌.. సూర్య ఇలా చేస్తాడా?: భారత మాజీ కోచ్‌ ఫైర్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం ఇందుకు వేదిక.అజేయంగా సూపర్‌-8కుఇక టోర్నీ ఆరంభం నుంచి టీమిండియా మెరుగ్గానే ఆడింది. ముఖ్యంగా గ్రూప్‌ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లూ గెలిచి అజేయంగా సూపర్‌-8కు చేరింది. అయితే, ఆ తర్వాత భారత జట్టు సౌతాఫ్రికా చేతిలో డెబ్బై ఆరు పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో తమ అతి పెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.ఫీల్డింగ్‌పై విమర్శలు అనంతరం జింబాబ్వే, వెస్టిండీస్‌లపై గెలిచిన సూర్యకుమార్‌ సేన సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, విండీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ ఫీల్డింగ్‌ చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెమీస్‌లోనూ ఇలాంటి తప్పులు పునరావృతం చేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.కాగా విండీస్‌తో మ్యాచ్‌లో వరుణ్‌ చక్రవర్తి రనౌట్‌ చాన్స్‌ మిస్‌ చేయగా.. అభిషేక్‌ శర్మ రెండు, తిలక్‌ వర్మ ఒక క్యాచ్‌ జారవిడిచారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్‌ మాజీ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.తప్పుడు ఫీల్డర్‌.. సూర్య ఇలాంటి తప్పు చేస్తాడా?‘‘బయటి నుంచి చూసి వరుణ్‌ ఫీల్డింగ్‌ పొజిషన్‌ గురించి నేను ఏదైనా మాట్లాడవచ్చు. అయితే, ఆ బంతిని వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ కోణం నుంచి చూస్తే.. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌, డీప్‌ మిడ్‌ వికెట్‌, షార్ట్‌ ఫైన్‌ లెగ్‌ కంటే వరుణ్‌ షార్ట్‌ కవర్‌ రీజియన్‌లో ఉండటమే మంచిదని అనుకున్నారేమో!అయినా సూర్యలాంటి తెలివైన కెప్టెన్లు ఇలాంటి ఎలిమెంటరీ స్కూల్‌ తరహా తప్పులు చేయకూడదు. తప్పుడు ఫీల్డర్‌ను తప్పుడు ఏరియాలో పెట్టినట్లు అనిపించింది. గతంతో పోలిస్తే వరుణ్‌ ఫీల్డింగ్‌ పరంగా మెరుగయ్యాడు. అయితే, ఈసారి మరోమారు తప్పు చేశాడు. అతడు సరైన స్థానంలో ఉన్నాడు. కానీ ఫీల్డింగ్‌ మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు.ఇక అభిషేక్‌ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయి క్యాచ్‌లు జారవిడిచినట్లు అనిపించింది’’ అని ఆర్‌. శ్రీధర్‌ విమర్శించాడు. కాగా విండీస్‌ స్కోరు 13/0గా ఉన్న వేళ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో రోస్టన్‌ ఛేజ్‌ కవర్‌ షాట్‌ ఆడి పరుగుకు ఉపక్రమించాడు. అయితే, షాయీ హోప్‌ మాత్రం బాల్‌ పొజిషన్‌ చూసి తిరిగి నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌కు వచ్చేశాడు.వరుణ్‌ వల్లే మిస్‌మరోవైపు.. ఛేజ్‌ పిచ్‌ మధ్య వరకు రాగా.. వరుణ్‌ వికెట్‌ కీపర్‌ వైపు కాకుండా.. బౌలర్‌ పొజిషన్‌ వైపు బంతిని విసిరాడు. దీంతో ఛేజ్‌ రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్‌ షాయీ హోప్‌ (32) రూపంలో ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. కాగా సంజూ శాంసన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌)తో మెరిసి విండీస్‌పై భారత్‌ను గెలిపించాడు.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

Arjun Tendulkar  Saaniya Chandhok Married Wedding Video Goes Viral10
ఘనంగా అర్జున్‌ టెండుల్కర్‌- సానియా వివాహం.. వీడియో వైరల్‌

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఇంట శుభకార్యం జరిగింది. సచిన్‌- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్‌ అర్జున్‌ టెండుల్కర్‌ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. యువ వ్యాపారవేత్త సానియా చందోక్‌తో గురువారం అతడి పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గతేడాది నిశ్చితార్థంకాగా గతేడాది ఆగష్టులో అర్జున్‌- సానియా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల నడుమ గోప్యంగా ఈ వేడుక జరుగగా.. కొన్నిరోజుల తర్వాత సచిన్‌ టెండుల్కర్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇక ఇటీవల అర్జున్‌- సానియా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.Saree, sunshine, and Sara’s signature glow."#SaraTendulkar #ArjunTendulkar #SachinTendulkar pic.twitter.com/cbNHRG0pR9— Nitika Sharma (@Nitika3012) March 5, 2026అంబానీ కుటుంబం ఆధ్వర్యంలోముకేశ్‌ అంబానీ కుటుంబం జామ్‌నగర్‌లో కాబోయే వధూవరుల కోసం పార్టీ ఏర్పాటు చేసింది. అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ వివాహం జరిగిన చోట అర్జున్‌- సానియాల పెళ్లి వేడుకలను ఆరంభించింది. గణేషుడి ఆశీర్వాదంతో పాటు అంబానీ కుటుంబం వీరికి శుభాకాంక్షలు అందజేసింది.ఈ సందర్భంగా నీతా అంబానీకి ధన్యవాదాలు తెలిపిన సచిన్‌ టెండుల్కర్‌.. కాబోయే కోడలిపై ప్రేమను కురిపించాడు. తన కుమారుడు అర్జున్‌.. అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకున్నాడని కొనియాడాడు. వారిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని.. కలకాలం ఇలాగే జీవించాలని ఆకాంక్షించాడు.ముంబైలో పెళ్లి వేడుకఅనంతరం ముంబైలో మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు జరుగగా.. పెళ్లి వేడుక (Arjun Tendulkar- Saaniya Chandhok Wedding)గురువారం జరిగింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలే సానియా చందోక్‌. ఆమె కూడా ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌. సచిన్‌ కుమార్తె సారా టెండుల్కర్‌కు సానియా ప్రాణ స్నేహితురాలు. అర్జున్‌ టెండుల్కర్‌ కంటే వయసులో ఓ ఏడాది పెద్ద.Sara Tendulkar dancing at the sangeet ceremony of her brother Arjun Tendulkar. 💃✨ pic.twitter.com/fltLHqIdYC— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 5, 2026ఇక అర్జున్‌ టెండుల్కర్‌ వివాహానికి దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని దంపతులు, సురేశ్‌ రైనా దంపతులు సహా భారత మాజీ క్రికెటర్లలో చాలా మంది సతీసమేతంగా విచ్చేశారు. బాలీవుడ్‌ ప్రముఖులు సైతం ఈ వివాహ వేడుక కోసం తరలివచ్చారు. వ్యాపార దిగ్గజం ముకేశ్- నీతా అంబానీ దంపతులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా స్టార్‌ Arjun Tendulkar, the son of Sachin Tendulkar, got married to Saaniya Chandhok today in Mumbai.❤️Congratulations to Arjun and Saaniya. Best wishes for a happy life together. 💐 pic.twitter.com/HhkU9is64F— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 5, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement