ప్రధాన వార్తలు
రసెల్ రికార్డు బద్దలు కొట్టిన రింకూ సింగ్
కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్ ఓ అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన నాన్ వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. ఆండ్రీ రసెల్ పేరిట ఉండిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఎస్ఆర్హెచ్తో ఇవాళ (ఏప్రిల్ 2) జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో రింకూ రెండు క్యాచ్లు పట్టాడు. తొలుత ముజరబానీ బౌలింగ్ ఇషాన్ కిషన్ క్యాచ్ను, ఆతర్వాత అనుకూల్ రాయ్ బౌలింగ్లో అనికేత్ వర్మ క్యాచ్ పట్టాడు.ఈ రెండు క్యాచ్ల తర్వాత కేకేఆర్ తరఫున రింకూ క్యాచ్ల సంఖ్య 41కి చేరింది. ఈ క్యాచ్లను అతను కేవలం 61 మ్యాచ్ల్లోనే పట్టాడు. 40 క్యాచ్లు పట్టేందుకు రసెల్కు ఏకంగా 133 మ్యాచ్లు అవసరమయ్యాయి. ఈ విభాగంలో రింక, రసెల్ తర్వాతి స్థానంలో సునీల్ నరైన్ ఉన్నాడు. నరైన్ 191 మ్యాచ్ల్లో 36 క్యాచ్లు పట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించిన కేకేఆర్, ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఢీలా పడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి ఓవర్లోనే ఏకంగా 24 పరుగులు రాబట్టి మెరుపు ఆరంభాన్ని అందించాడు. అలెన్ ఔటయ్యాక అదే జోరును అంగ్కృష్ రఘువంశీ (52) కూడా కొనసాగించినప్పటికీ.. దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. అంతకుముందు గ్రీన్ (2) కూడా రనౌటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 137-5గా ఉంది. రింకూ సింగ్ (34) కేకేఆర్ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా రమన్దీప్ సింగ్ (8) క్రీజ్లో ఉన్నాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్ (46), అభిషేక్ (48), క్లాసెన్ (52), నితీశ్ కుమార్ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్ ఆరోరా 2, కార్తీక్ త్యాగి ఓ వికెట్ తీశారు.
ఫిన్ అలెన్ ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధికం
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఇవాళ (ఏప్రిల్ 2) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ చెలరేగిపోయాడు. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో డేవిడ్ పేన్ వేసిన తొలి ఓవర్లో ఉగ్రరూపం దాల్చాడు. 2 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 24 పరుగులు పిండుకొని, ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. జైస్వాల్ 2023 ఎడిషన్లో కేకేఆర్పై తొలి ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఫిన్ అలెన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షాతో కలిసి ఈ రికార్డును షేర్ చేసుకున్నాడు. షా 2021 ఎడిషన్లో కేకేఆర్పై తొలి ఓవర్లో 24 పరుగులు రాబట్టాడు.ఐపీఎల్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు26 - యశస్వి జైస్వాల్ (RR) vs KKR, 202324 - పృథ్వీ షా (DC) vs KKR, 202124 - ఫిన్ అలెన్ (KKR) vs SRH, 2026*22 - యశస్వి జైస్వాల్ (RR) vs PBKS, 202521 - నమన్ ఓజా (RR) vs KKR, 200921 - సునీల్ నరైన్ (KKR) vs RR, 2018మ్యాచ్ విషయానికొస్తే.. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనను కేకేఆర్ ధాటిగా ప్రారంభించింది. అలెన్ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్లో ఉన్నంత సేపు అలజడి సృష్టించి ఔటయ్యాడు. అనంతరం అంగ్క్రిష్ రఘువంశీ బ్యాట్ ఝులిపించడం ప్రారంభించాడు. అయితే ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కేకేఆర్కు కోలుకోని లేని దెబ్బ తగిలింది. దురదృష్టవశాత్తు గ్రీన్ రనౌటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 79-3గా ఉంది. రఘువంశీ (35), రింకూ సింగ్ (1) క్రీజ్లో ఉన్నారు. హర్ష్ దూబే, ఉనద్కత్కు తలో వికెట్ దక్కింది.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్ (46), అభిషేక్ (48), క్లాసెన్ (52), నితీశ్ కుమార్ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్ ఆరోరా 2, కార్తీక్ త్యాగి ఓ వికెట్ తీశారు.
అభిషేక్ శర్మ ఖాతాలో భారీ రికార్డు
సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతాలో మరో భారీ సిక్సర్ల రికార్డు చేరింది. ఇప్పటికే ఎన్నో సిక్సర్ల రికార్డులను తన పేరిట లిఖించుకున్న అభిషేక్.. తాజాగా సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకొని, మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. వార్నర్ ఎస్ఆర్హెచ్ తరఫున 143 సిక్సర్లు బాదాడు. ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్, అభిషేక్ తర్వాతి స్థానాల్లో క్లాసెన్ (89), కేన్ విలియమ్సన్ (64), ట్రవిస్ హెడ్ (50) ఉన్నారు.కాగా, ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) సన్రైజర్స్-కేకేఆర్ తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సన్రైజర్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్లోనే అభిషేక్ ఎస్ఆర్హెచ్ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. కేకేఆర్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ తొలి బంతి నుంచి ప్రత్యర్దిపై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (21 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (21 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆతర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (14) అదే జోరును కొనసాగించే క్రమంలో ఔటయ్యాడు. అనికేత్ వర్మ ఒక్క పరుగుకే ఔటై, నిరాశపరిచాడు. క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30) క్రీజ్లో ఉన్నారు. 17 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 184-4గా ఉంది. ముజరబానీ 2, కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్ తలో వికెట్ తీశారు.
IPL 2026: డబుల్ సెంచరీ కొట్టిన రహానే
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే తన ఐపీఎల్ కెరీర్లో అరుదైన మైలురాయిని తాకాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్తో ఇవాళ (ఏప్రిల్ 2) జరుగుతున్న మ్యాచ్ అతనికి 200వది. ఐపీఎల్ చరిత్రలో ఈ మైలురాయిని ఇప్పటివరకు కేవలం 11 మంది (రహానేతో కలుపుకొని) మాత్రమే చేరుకున్నారు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని (278) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (273, విరాట్ కోహ్లీ (268), దినేష్ కార్తీక్ (257), రవీంద్ర జడేజా (255), శిఖర్ ధవన్ (222), రవిచంద్రన్ అశ్విన్ (221), సురేష్ రైనా (205), రాబిన్ ఉతప్ప (205), అంబటి రాయుడు (204), అజింక్య రహానే (200) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2008లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రహానే.. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణే సూపర్జెయింట్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ప్రస్తుతం కేకేఆర్కు ఆడుతున్నాడు. రహనే తన 18 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణంలో 2 శతకాలు, 34 అర్ద శతకాల సాయంతో 5099 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో కేకేఆర్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగించింది. సన్రైజర్స్ విషయానికొస్తే.. ఓ మార్పు చేసింది. యువ స్పిన్నర్ శివాంగ్ కుమార్ జట్టులోకి వచ్చాడు. తొలి 3 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 43-0గా ఉంది. ట్రవిస్ హెడ్ (14 బంతుల్లో 34; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (8) ఆచితూచి ఆడుతున్నాడు.తుది జట్లు..కేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీఇంపాక్ట్ సబ్లు: ఫిన్ అలెన్, మనీష్ పాండే, తేజస్వి సింగ్, సౌరభ్ దూబే, రోవ్మన్ పావెల్సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w/c), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్ఇంపాక్ట్ సబ్లు: హర్షల్ పటేల్, లియామ్ లివింగ్స్టోన్, ఎషాన్ మలింగ, ఆర్ స్మరన్, సాకిబ్ హుస్సేన్
ఆర్సీబీ స్టార్ సంచలన నిర్ణయం!
శ్రీలంక పేసర్ నువాన్ తుషార సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తీరుపై అసంతృప్తితో అతడు కోర్టుకెక్కినట్లు సమాచారం. రైటార్మ్ పేసర్ అయిన 31 ఏళ్ల తుషార.. శ్రీలంక తరఫున ఇప్పటికి 30 టీ20 మ్యాచ్లు ఆడి 36 వికెట్లు కూల్చాడు.తొలి టైటిల్ఇంతవరకు అతడు టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేయనేలేదు. అయితే, టీ20లో మంచి గుర్తింపు పొందిన తుషారను ఐపీఎల్-2025 మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు ఒక్క మ్యాచే ఆడినప్పటికీ జట్టు టైటిల్ గెలవడంతో సంతోషంలో మునిగిపోయాడు.NOC ఇవ్వలేదని..ఈ క్రమంలో ఐపీఎల్-2026 సీజన్కు గానూ ఆర్సీబీ నువాన్ తుషారను అట్టిపెట్టుకుంది. అయితే, ఆర్సీబీతో చేరేందుకు శ్రీలంక బోర్డు అతడికి ఇంత వరకు నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వలేదు. ఫిట్నెస్ పరీక్షలో ప్రమాణాలకు తగినవిధంగా లేడనే కారణంగా అతడికి NOC ఇవ్వలేదని సమాచారం.అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై?అయితే, స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని తుషార బోర్డుకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మార్చి 31తో తన సెంట్రల్ కాంట్రాక్టు ముగిసిపోయినందున.. కాంట్రాక్టును పునరుద్ధరించాల్సిన అవసరం లేదని లేఖ రాసినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో తాను జట్టు మారే యోచనలో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.కోర్టుకెక్కిన తుషారకానీ బోర్డు తన అభ్యర్థనను పట్టించుకోకపోవడం, ఐపీఎల్లో ఆడేందుకు NOC ఇవ్వకపోవడంతో తుషార న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ, కార్యదర్శి బందులా దిస్సానాయకే, కోశాధికారి సుజీవ గొడలియాడ, సీఈఓ ఆష్లే డి సిల్వలను ప్రతివాదులుగా చేరుస్తూ కొలంబో జిల్లా కోర్టులో తుషార పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 9న విచారణ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఐపీఎల్-2026ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి జయకేతనం ఎగురవేసింది.చదవండి: అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే.. అందుకే తప్పుకొన్నా: ఇంగ్లండ్ దిగ్గజ పేసర్
6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్
మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్5.6వ ఓవర్- 74 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. గ్రీన్ (2) రనౌటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్4.6వ ఓవర్- 67 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ఉనద్కత్ బౌలింగ్లో రహానే (8) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హర్ష్ దూబే బౌలింగ్లో ఫిన్ అలెన్ (28) క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్ (46), అభిషేక్ (48), క్లాసెన్ (52), నితీశ్ కుమార్ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్ ఆరోరా 2, కార్తీక్ త్యాగి ఓ వికెట్ తీశారు. వరుస బంతుల్లో వికెట్లు18.2వ ఓవర్- ఎస్ఆర్హెచ్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. వైభవ్ ఆరోరా బౌలింగ్లో సలీల్ అరోరా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఐదో వికెట్ కోల్పోయిన సన్రైజర్స్18.1వ ఓవర్- 200 పరుగుల వద్ద సన్రైజర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. వైభవ్ ఆరోరా బౌలింగ్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి నితీశ్ కుమార్ రెడ్డి (39) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్9.2వ ఓవర్- 118 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అనుకూల్ రాయ్ బౌలింగ్లో రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి అనికేత్ వర్మ (1) ఔటయ్యాడు.ఒకే ఓవర్లో 2 వికెట్లుఅప్పటిదాకా జోరుగా సాగుతున్న ఎస్ఆర్హెచ్ ఆట ఒక్కసారిగా మందగించింది. ముజరబానీ ఒకే ఓవర్లో (8.2, 8.4) 2 వికెట్లు (ఇషాన్ (14), అభిషేక్ (48)) వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. 9 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 116-3గా ఉంది. అనికేత్, క్లాసెన్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. హెడ్ (46) ఔట్5.4వ ఓవర్- 82 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. ట్రవిస్ హెడ్ (46) విధ్వంసం సృష్టించి కార్తీక్ త్యాగి బౌలింగ్లో గ్రీన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) జరుగుతున్న ఆరో మ్యాచ్లో కేకేఆర్, సన్రైజర్స్ తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ ఎలాంటి మార్పులు చేయకపోగా.. సన్రైజర్స్ ఓ మార్పు చేసింది. శివాంగ్ కుమార్ కొత్తగా జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..కేకేఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీఇంపాక్ట్ సబ్లు: ఫిన్ అలెన్, మనీష్ పాండే, తేజస్వి సింగ్, సౌరభ్ దూబే, రోవ్మన్ పావెల్సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w/c), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్ఇంపాక్ట్ సబ్లు: హర్షల్ పటేల్, లియామ్ లివింగ్స్టోన్, ఎషాన్ మలింగ, ఆర్ స్మరన్, సాకిబ్ హుస్సేన్
వైభవ్ను చూసి నేర్చుకో పంత్..!
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ వ్యక్తిగతంగా, కెప్టెన్గా దారుణంగా నిరాశపరిచాడు. ఓపెనర్గా బరిలోకి దిగి 9 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలర్లు అద్భుతమైన బ్రేక్ ఇచ్చినా, పంత్ తన పేలవ నిర్ణయాలతో గెలిచే అవకాశమున్న మ్యాచ్ను జారవిడిచాడు. పంత్ వ్యక్తిగతంగా, కెప్టెన్గా విఫలం కావడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఘాటుగా స్పందించాడు. ఓ పక్క సలహాలు ఇస్తూనే, మరోపక్క తలంటాడు.వాన్ మాటల్లో.. పంత్కు ఉన్న ప్రతిభతో ఏ దేశ క్రికెట్ జట్టులోనైనా స్థానం సంపాదించగలడు. టీమిండియాలోనే కాస్త కష్టం. ఎందుకంటే, ప్రస్తుత భారత జట్టులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, జితేష్ శర్మ లాంటి మెరికలు ఉన్నారు. వీరితో పోటీ పడి నెగ్గుకు రావడం పంత్కు అంత ఈజీ కాదు.పంత్ మరో నిరుత్సాహకరమైన ఐపీఎల్ సీజన్ను భరించలేడు. అతను బ్యాటింగ్, కెప్టెన్సీ రెండింటిలోనూ మెరుగుపడాలి. నేను అతని స్థానంలో ఉంటే వైభవ్ సూర్యవంశీని గమనించేవాడిని. వైభవ్ ఆడే తీరు పంత్ను గుర్తు చేస్తుంది. పంత్ కెరీర్ తొలినాళ్లలో చాలా ధైర్యంగా ఆడేవాడు. ఇప్పుడా ధైర్యం కనిపించడం లేదు.ముందుగా పంత్ తన మైండ్ సెట్ను మార్చుకోవాలి. ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా 40-45 బంతుల్లో సెంచరీ చేయగలననే ధీమాతో ఆడాలి.నెక్స్ట్ టాస్క్ ఎస్ఆర్హెచ్లక్నో సూపర్ జెయింట్స్కు నెక్స్ట్ టాస్క్ ఎస్ఆర్హెచ్. ఏప్రిల్ 5న హైదారాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లోనైనా పంత్ ఫామ్లోకి రావాలి. లేని ప్రయోగాలకు పోకుండా తన రెగ్యులర్ బ్యాటింగ్ స్థానంలోనే బరిలోకి దిగాలి. కెప్టెన్సీలోనూ చాలా మెరుగుపడాలి. ఒకవేళ తొలి మ్యాచ్ ప్రదర్శనే ఆ మ్యాచ్లో కూడా కొనసాగితే, పంత్కు కష్టాలు తప్పవు.వైభవ్ సూర్యవంశీ విషయానికొస్తే.. ఈ రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు తమ తొలి మ్యాచ్లోనే ఉగ్రరూపం ప్రదర్శించాడు. సీఎస్కేపై 15 బంతుల్లోనే అర్ద సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు.
అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే: జేమ్స్ ఆండర్సన్
ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ది హండ్రెడ్’ లీగ్లో ఉన్నంతకాలం ప్రతి క్షణాన్ని ద్వేషించానన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో.. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో ఆండర్సన్ తిరుగులేని బౌలర్.ఇంగ్లండ్ తరఫున 2002- 2024 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆండర్సన్.. 188 టెస్టుల్లో ఏకంగా 704 వికెట్లు కూల్చాడు. ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఖాతాలో 269 వన్డే వికెట్లు కూడా ఉండగా.. 19 టీ20లలో కలిపి 18 వికెట్లు పడగొట్టాడు. ఏదేమైనా రెడ్బాల్ క్రికెట్లో నేటికీ అత్యధిక వికెట్ల వీరుడిగా ఆండర్సన్ కొనసాగుతన్నాడు.మాంచెస్టర్ ఒరిజినల్స్కు ప్రాతినిథ్యంఇక 2024లో ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్.. తాత్కాలిక కాలానికి గానూ ఇంగ్లండ్ జట్టు మెంటార్గానూ పనిచేశాడు. గతేడాది ది హండ్రెడ్తో పొట్టి ఫార్మాట్లో గతేడాది రీఎంట్రీ ఇచ్చాడు ఆండర్సన్. ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా యాజమాన్యంలోని మాంచెస్టర్ ఒరిజినల్స్కు ఆండర్సన్ ప్రాతినిథ్యం వహించాడు.మొత్తంగా మూడు మ్యాచ్లు ఆడి కేవలం రెండు వికెట్లు తీయగలిగాడు. అయితే, తాజా ఎడిషన్ నుంచి ఆండర్సన్ ముందుగానే తప్పుకొన్నాడు. ఇందుకు గల కారణం గురించి తాజాగా మాట్లాడాడు.ప్రతి క్షణాన్ని నేను ద్వేషిస్తూనే ఉన్నా‘‘గతేడాది ది హండ్రెడ్ లీగ్లో కొనసాగినంత కాలం ప్రతి క్షణాన్ని నేను ద్వేషిస్తూనే ఉన్నాను. ఆ టోర్నీ మొదలుకాగానే.. సెలవుపెట్టి ఎక్కడికైనా వెళ్లిపోతే బాగుండు అనిపించింది. అదొక గొప్ప టోర్నీ. ఇందులో కూడా అనుభవం సంపాదించాలనే జట్టులో చేరాను.కానీ నాకు ఇది సరైంది కాదు. ముఖ్యంగా లంకాషైర్ కెప్టెన్గా నేను చేయాల్సింది చాలా ఉంది. నాలుగు రోజుల మ్యాచ్ ఫార్మాట్ నాకు సెట్ అవుతుంది’’ అని ఆండర్సన్ అన్నాడు. తనకు రెడ్బాల్ క్రికెట్లోనే అనుభవం, ఆనందం ఉన్నాయని చెప్పకనే చెప్పాడు.పూర్తిగా న్యాయం చేసేందుకేకాగా 43 ఏళ్ల ఆండర్సన్ కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా లంకాషైర్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సారథిగా, బౌలర్గా లంకాషైర్కు పూర్తిగా న్యాయం చేసేందుకే ది హండ్రెడ్ నుంచి వైదొలిగినట్లు సంకేతాలు ఇచ్చాడు. వయసు మీద పడుతున్న తరుణంలో ఫిట్నెస్పై మరింత దృష్టి సారించాలి కాబట్టే తనకు నచ్చిన ఫార్మాట్కే పూర్తిగా అంకితం కావాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు
కుదరదు: ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గత పద్దెమినిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న టీ20 లీగ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా పేరొందింది. 2008లో మొదలైన ఈ టోర్నీ.. 2021 వరకు ఎనిమిది జట్లతో కొనసాగింది. ఈ క్రమంలో 2022లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా చేరడంతో జట్ల సంఖ్య పదికి చేరింది.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్లతో పాటు లక్నో (LSG), గుజరాత్ (GT) నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ను మరింత విస్తృతం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లుఐసీసీ ఈవెంట్లతో సమానంగా ఐపీఎల్ క్రేజ్ సంపాదించిందనడంలో అతిశయోక్తి లేదు. గతేడాది పది ఫ్రాంఛైజీలు వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయం పొందడం.. ఐపీఎల్ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోవడం ఇందుకు నిదర్శనం.74 మ్యాచ్లతోనేఈ నేపథ్యంలో క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు మరో రెండు జట్లు చేర్చి.. మ్యాచ్ల సంఖ్య పెంచుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023, 2024లో 74 మ్యాచ్లు నిర్వహించగా.. 2025, 2026 సీజన్లలో 84 మ్యాచ్లు.. 2027 నాటికి వీటి సంఖ్య 94కు పెంచుతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. నేటికీ 74 మ్యాచ్లతోనే టోర్నీ కొనసాగుతోంది.కుదరదుతాజాగా మరోసారి ఈ అంశం మీద చర్చ జరుగుతుండగా.. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో ఐపీఎల్ జట్లు, మ్యాచ్ల సంఖ్య పెంచే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు. ‘‘మ్యాచ్ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచడం కష్టం. ఎందుకంటే అంతర్జాతీయ షెడ్యూల్తో మ్యాచ్ చేయలేము.మార్చి- మే వరకు దీనిని పరిమిత విండోలో మాత్రమే నిర్వహించగలము. ఒకవేళ జూన్ వరకు కొనసాగిస్తే.. దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో అప్పటికే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. వర్షాల ప్రభావం ఉంటుంది. కాబట్టి అప్పుడు మ్యాచ్ల నిర్వహణ కష్టం.వారికి ప్రయోజనం ఉండదుఒకవేళ ఒకేసారి డబుల్ హెడర్ మ్యాచ్లు అంటే ఒకేరోజు ఒకే వేదికపై రెండు మ్యాచ్లు నిర్వహించాలనుకున్నా బ్రాడ్కాస్టర్లకు ఇది అంతగా నచ్చదు. వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి బ్రాడ్కాస్టర్ల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టేకునే మేము 74 మ్యాచ్లకు విండోను పరిమితం చేవాము’’ అని అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చాడు.కాగా ఇప్పటికే టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ విరామం లేని బిజీ షెడ్యూల్తో కిక్కిరిసిపోయింది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ విస్తృతిని పెంచడం సాధ్యం కాదని అరుణ్ ధుమాల్ పరోక్షంగా స్పష్టం చేశాడు.చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు
న్యూజిలాండ్ ప్లేయర్ ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కెర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్- ఓపెనర్ బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించింది. కాగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్ వైట్బాల్ సిరీస్లు ఆడుతోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా ఆతిథ్య న్యూజిలాండ్ 4-1 తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా గెలవగా.. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం రెండో వన్డే జరిగింది.346 పరుగులుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. కెప్టెన్ వాల్వర్ట్ (69; 8 ఫోర్లు, 1 సిక్స్), అనికె బాష్ (91; 12 ఫోర్లు), ట్రియాన్ (25 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్సెంచరీలతో రాణించారు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసి.. రెండు వికెట్ల తేడాతో గెలిచింది. మహిళల వన్డే క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగాగతేడాది ఆస్ట్రేలియాపై టీమిండియా ఛేజ్ చేసిన 339 పరుగుల స్కోరు రెండో స్థానానికి చేరింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కివీస్ సారథి అమేలియా కెర్ (Amelia Kerr) ఆకాశమే హద్దుగా చెలరేగింది. వన్డౌన్లో బ్యాటింగ్ చేసిన ఆమె మొత్తంగా 139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగా నిలిచింది.కెర్ ఇన్నింగ్స్లో 23 ఫోర్లు, 1 సిక్స్ ఉండటం విశేషం. ఇలా కెప్టెన్ ఇన్నింగ్స్తో కెర్ న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చగా... ఆమెకు ఇసాబెల్లా (68;11 ఫోర్లు) చక్కటి సహకారం అందించింది. సఫారీ బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టింది. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా... ప్రస్తుతం సిరీస్ 1–1తో సమమైంది.అమేలియా కెర్ ప్రపంచ రికార్డుసౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా అమేలియా కెర్ 179 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా.. మహిళల వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్- ఓపెనింగ్ ప్లేయర్గా రికార్డు సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం చమరి ఆటపట్టు పేరిట ఉండేది.బ్రిస్టల్ వేదికగా 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆటపట్టు 178 పరుగులతో అజేయంగా నిలిచింది. తాజాగా ఆమె కంటే ఒక్క పరుగు ఎక్కువ చేసిన అమేలియా కెర్.. ఆటపట్టును అధిగమించింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (171), న్యూజిలాండ్ స్టార్లు సుజీ బేట్స్ (168), బీఎమ్ హైల్డే (157) కెర్, ఆటపట్టు తర్వాతి స్థానాల్లో నిలిచారు.చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు
మాజీ సీఎం కూతురికి వేధింపులు
భారత ఫుట్బాల్ సమాఖ్య (AIFF) అధ్యక్షుడు కల్యాణ్ ...
టైగర్వుడ్స్కు ట్రంప్ మాజీ భార్య వార్నింగ్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ ప్రస్తుతం డొనాల్డ్ ...
సూపర్ సబలెంకా
ఫ్లోరిడా: ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ ప...
ఆంటోనెల్లి మళ్లీ...
సుజుకా: ఇటలీ టీనేజర్ కిమీ ఆంటోనెల్లి తాజా ఫార్ముల...
వైభవ్ను చూసి నేర్చుకో పంత్..!
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 1) జరిగిన మ్...
అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే: జేమ్స్ ఆండర్సన్
ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన వ్య...
కుదరదు: ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. భారత క్రికెట...
న్యూజిలాండ్ ప్లేయర్ ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కెర్ సరికొత్త చరి...
క్రీడలు
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
వీడియోలు
తొలి మ్యాచ్ లోనే ఓడిపోయినా.. కప్ మాత్రం సీఎస్కేదేనా..?
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
చెన్నై చిత్తు.. రాయల్స్ రాజసం
ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు
IPL 2026: RR vs CSK ఎవరు గెలుస్తారు?
కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం
RCB Vs SRH: అదరగొట్టిన RCB.. SRHపై 6 వికెట్ల తేడాతో RCB గెలుపు
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
మ్యాచ్ మొదలవ్వక ముందే RCBకి 3 బిగ్ షాక్ లు ..
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
