Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Indian batsman Thakur Tilak Varma about Test cricket1
టెస్టులు ఆడే సత్తా ఉంది: తిలక్‌ వర్మ

న్యూఢిల్లీ: సంప్రదాయ టెస్టు క్రికెట్‌ సైతం ఆడే సత్తా తనలో ఉందని భారత బ్యాటర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ అన్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు రాబట్టేందుకు విరాట్‌ కోహ్లి సలహా తీసుకున్నానని ఈ స్టార్‌ హైదరాబాదీ క్రికెటర్‌ చెప్పాడు. భారత్‌ తరఫున అంతర్జాతీయ వన్డేలు ఆడిన 23 ఏళ్ల బ్యాటర్‌కు ఇంకా టెస్టులు ఆడే అవకాశమైతే రాలేదు. అయితే భారత టి20 జట్టులో మాత్రం పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియా టి20 క్రికెట్‌ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపేందుకు అజేయ పోరాటం చేశాడు. డిజిటల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిలక్‌ మాట్లాడుతూ ‘వన్డేలు, టెస్టులు కూడా నాకు నప్పుతాయి. సంప్రదాయ ఫార్మాట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. మరిన్ని వన్డేలు ఆడేందుకు నేనెంతగానో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఒకే జట్టులో రోహిత్, విరాట్‌ ఉంటే ఆ జట్టులో ఆత్మవిశ్వాసం మరోస్థాయిలో ఉంటుంది. వాళ్లిద్దరికి ఎంతో అనుభవముంది. వారి పరుగుల పరిజ్ఞానం అద్భుతం. నేనైతే వీలైనప్పుడల్లా వారి సలహాలు తీసుకుంటూనే ఉంటాను. ముఖ్యంగా ఫిట్‌నెస్‌లో కోహ్లి సూపర్‌. అందుకే వికెట్ల మధ్య చురుగ్గా పరుగులు తీసేందుకు అతని చిట్కాలే పాటిస్తా’ అని అన్నాడు. హైదరాబాద్‌ స్టార్‌ బ్యాటర్‌ టీమిండియా తరఫున కేవలం నాలుగే వన్డేలు ఆడాడు. ఫిఫ్టీ (52) సహా 68 పరుగులు చేశాడు. రెండేళ్ల క్రితం 2023లో దక్షిణాఫ్రికా పర్యటనలో చివరిసారిగా వన్డే ఆడిన అతనికి మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో బరిలోకి దిగే అవకాశం లభించలేదు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకుంటానని చెప్పాడు.

Australian all rounder withdraws from IPL2
మ్యాక్స్‌వెల్‌ కూడా...

సిడ్నీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నుంచి తప్పుకుంటున్న సీనియర్‌ ఆటగాళ్ల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా స్టార్‌ ఫాఫ్‌ డుప్లెసిస్, వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రె రసెల్‌ లీగ్‌కు దూరం కాగా... ఇప్పుడా జాబితాలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ చేరారు. ఈ నెల 16న అబుదాబి వేదికగా ఐపీఎల్‌ మినీ వేలం జరగనుండగా... ఇప్పటికే దాదాపు అన్నీ ఫ్రాంచైజీల వద్ద సరిపడా విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో తమకు అవకాశం దక్కదని భావించిన పలువురు సీనియర్‌ ప్లేయర్లు లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. 2012 నుంచి ఐపీఎల్‌లో కొనసాగుతున్న మ్యాక్స్‌వెల్‌... చాలా సీజన్‌లలో భారీ అంచనాలతో అత్యధిక ధర దక్కించుకున్నా... మైదానంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. లీగ్‌లో నాలుగు ఫ్రాంచైజీలకు (పంజాబ్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు) ప్రాతినిధ్యం వహించిన 37 ఏళ్ల మ్యాక్స్‌వెల్‌... తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఐపీఎల్‌లో 141 మ్యాచ్‌లాడి 2819 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ 41 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో... ఇక ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో నా పేరు నమోదు చేసుకోలేదు. లీగ్‌ నాకు ఎంతో ఇచ్చింది. ఇక్కడ ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. కేవలం ఒక క్రికెటర్‌గానే కాకుండా... వ్యక్తిగానూ నన్ను ఐపీఎల్‌ ఎంతో మార్చింది. ఎంతోమంది అంతర్జాతీయ స్టార్‌లతో కలిసి ఆడే అవకాశం దక్కింది. ఇక అభిమానుల ఆదరణ అమోఘం. ఇలాంటి ఎన్నో తీపి గుర్తులను ఎప్పటికీ దాచుకుంటా’ అని మ్యాక్స్‌వెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. ఓవరాల్‌గా 13 సీజన్‌ల పాటు ఐపీఎల్‌ ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2021లో మాత్రమే 500 పైచిలుకు పరుగులు చేశాడు. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ జట్టు అతడిని రూ. 4 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేయగా... ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మ్యాక్స్‌వెల్‌ దానికి న్యాయం చేయలేకపోయాడు. దీంతో ఈసారి వేలంలో అతడిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాకొపోవచ్చనే ఉద్దేశంతో అతడు లీగ్‌కు దూరం అవుతున్నట్లు ప్రకటించాడు. పీఎస్‌ఎల్‌ బరిలో మొయిన్‌ అలీ ఇక 8 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్న ఇంగ్లండ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కూడా ఐపీఎల్‌ను వీడి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మొయిన్‌ అలీ రెండుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గాడు. నవంబర్‌ 30తోనే ఆటగాళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగియగా... మినీ వేలంలో అత్యధికంగా 77 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అందులో 31 మంది విదేశీ ఆటగాళ్లకు చాన్స్‌ ఉంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వద్ద అత్యధికంగా రూ. 64.3 కోట్లు ఉండగా... చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఖాతాలో రూ. 43.4 కోట్లు ఉన్నాయి. గత వేలంలో రూ. 23.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ సహా మొత్తం 9 మంది ఆటగాళ్లను కోల్‌కతా ఫ్రాంచైజీ వేలానికి వదిలేసింది. 2025 మెగా వేలానికి దూరంగా ఉన్న ఆ్రస్టేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌కు ఈసారి భారీ మొత్తం దక్కే అవకాశం ఉంది. వేలం బరిలో ఉన్న వారిలో రవి బిష్ణోయ్, స్టీవ్‌ స్మిత్, మెక్‌గుర్క్, ఇన్‌గ్లిస్, అట్కిన్సన్, డకెట్, లివింగ్‌స్టోన్, డెవాన్‌ కాన్వే, జెమీసన్, డేవిడ్‌ మిల్లర్, పతిరణ, తీక్షణపై అందరి దృష్టి నిలవనుంది. రూ. 2 కోట్ల ప్రాథమిక ధర గల ఆటగాళ్ల జాబితా రవి బిష్ణోయ్, వెంకటేశ్‌ అయ్యర్‌ (భారత్‌), ముజీబ్, నవీన్‌ ఉల్‌ హక్‌ (అఫ్గానిస్తాన్‌), సీన్‌ అబాట్, అస్టన్‌ అగర్, కూపర్‌ కొనొల్లీ, జేక్‌ ఫ్రెజర్‌ మెక్‌గుర్క్, కామెరూన్‌ గ్రీన్, జోష్‌ ఇన్‌గ్లిస్, స్టీవ్‌ స్మిత్‌ (ఆ్రస్టేలియా), ముస్తఫిజుర్‌ రహమాన్‌ (బంగ్లాదేశ్‌), అట్కిన్సన్, టాప్‌ బాంటన్, టామ్‌ కరన్, లియామ్‌ డాసన్, బెన్‌ డకెట్, డాన్‌ లారెన్స్, లివింగ్‌స్టోన్, టైమల్‌ మిల్స్, జేమీ స్మిత్‌ (ఇంగ్లండ్‌), ఫిన్‌ అలెన్, మైకేల్‌ బ్రేస్‌వెల్, డెవాన్‌ కాన్వే, జాకబ్‌ డఫీ, మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జెమీసన్, ఆడమ్‌ మిల్నె, డారిల్‌ మిచెల్, విల్‌ ఓ రూర్కె, రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌), గెరాల్డ్‌ కోట్జీ, డేవిడ్‌ మిల్లర్, ఇన్‌గిడి, అన్రిచ్‌ నోర్జే, రిలీ రూసో, తబ్రేజ్‌ షమ్సీ, డేవిడ్‌ వీస్‌ (దక్షిణాఫ్రికా), హసరంగ, మతీశ పతిరణ, మహేశ్‌ తీక్షణ (శ్రీలంక), జేసన్‌ హోల్డర్, షై హోప్, అకీల్‌ హుసేన్, అల్జారీ జోసెఫ్‌ (వెస్టిండీస్‌).

Indias second ODI against South Africa today3
సిరీస్‌ విజయంపై భారత్‌ గురి

రాయ్‌పూర్‌: వన్డే క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికాపై గత మ్యాచ్‌లో పైచేయి సాధించిన భారత్‌ ఇప్పుడు మరో విజయంపై గురి పెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే రెండో వన్డేలో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, దక్షిణాఫ్రికా కోలుకోవాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో 349 పరుగులు చేసిన తర్వాత కూడా కేవలం 17 పరుగుల తేడాతో భారత్‌ గెలవడం ఇరు జట్ల మధ్య బలమైన పోటీని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయం. మార్పుల్లేకుండా... భారత్‌ ఆడిన గత వరుస రెండు వన్డేల్లో ఒక మ్యాచ్‌లో (ఆ్రస్టేలియాతో) రోహిత్‌ శర్మ, మరో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి సెంచరీలు సాధించి తమ విలువేంటో చూపించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి ప్రదర్శనపై చర్చ అనవసరం. భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఇలాంటి స్థితిలో జట్టు సిరీస్‌ సాధించడంపైనే పూర్తిగా దృష్టి పెట్టింది. తొలి మ్యాచ్‌లో మన జట్టు ఆటను చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రిషభ్‌ పంత్‌ మరోసారి పెవిలియన్‌కే పరిమితం కావచ్చు. యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్‌ తమ సత్తాను ప్రదర్శించే ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. రాంచీ వన్డే ప్రదర్శన తర్వాత పేసర్‌ హర్షిత్‌ రాణాపై విమర్శలు తగ్గాయి. బరిలోకి బవుమా... తొలి వన్డేతో పోలిస్తే దక్షిణాఫ్రికా జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ తెంబా బవుమాతో పాటు స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ కూడా బరిలోకి దిగుతున్నాడు. రికెల్టన్, సుబ్రాయెన్‌ స్థానాల్లో వీరు ఆడతారు. రాంచీలో ఓడినా దక్షిణాఫ్రికా చివరి వరకు పట్టుదలను ప్రదర్శించింది. అంచనాలకు తగినట్లు బ్రీట్‌కీ, బ్రెవిస్‌ రాణించగా, మార్క్‌రమ్‌ వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. ఆల్‌రౌండర్లు యాన్సెన్, కార్బిన్‌ బాష్‌ బ్యాటింగ్‌ జట్టుకుఅదనపు బలంగా మారింది.

Indian hockey team in the quarterfinals4
క్వార్టర్‌ ఫైనల్లో భారత హాకీ జట్టు

మదురై: సొంతగడ్డపై భారత జూనియర్‌ పురుషుల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అండర్‌–21 ప్రపంచకప్‌ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు వరుసగా మూడో విజయంతో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్విట్జర్లాండ్‌ జట్టుతో మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 5–0తో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున మన్‌మీత్‌ సింగ్‌ (2వ, 11వ నిమిషాల్లో), శార్దానంద్‌ తివారి (13వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చొప్పున చేయగా... అర్‌‡్షదీప్‌ సింగ్‌ (28వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు రాగా, రెండింటిని మాత్రమేసద్వినియోగం చేసుకుంది. స్విట్జర్లాండ్‌ జట్టు ఐదు పెనాల్టీ కార్నర్‌లతోపాటు ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను వృథా చేసింది. నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘బి’లో భారత జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 29 గోల్స్‌ చేసిన భారత్‌ ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్‌ కూడా ఇవ్వలేదు. భారత్‌తోపాటు జర్మనీ, అర్జెంటీనా, స్పెయిన్, నెదర్లాండ్స్, స్పెయిన్‌ జట్లు కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాయి.

hyderabad cricket association security Failed in mustak ali trofi match5
అభిషేక్‌ శర్మ షాక్‌.. అభిమానమా... దురభిమానమా!

సాక్షి, హైదరాబాద్‌: 42 ఫోర్లు... 20 సిక్సర్లు... ఇరు జట్లు కలిపి 446 పరుగులు నమోదు చేశాయి... ఒక టి20 మ్యాచ్‌లో అభిమానుల వినోదానికి ఇంతకంటే ఏం కావాలి! చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఐపీఎల్‌ తరహాలో ఒక టి20 మ్యాచ్‌ను మైదానంలో ఫుల్‌ జోష్‌తో ఆస్వాదించారు. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో పంజాబ్, బరోడా జట్ల మధ్య జరిగిన ముస్తాక్‌ అలీ ట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌లో ఈ పరుగుల పండగ కనిపించింది. ప్రవేశం ఉచితమైనా సరే... సాధారణంగా దేశవాళీ మ్యాచ్‌లకు ప్రేక్షకులు మైదానానికి రావడం తక్కువ. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్న ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ మ్యాచ్‌లలో అన్ని చోట్లా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అయితే అభిషేక్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యాలు ఆడుతుండటంతో పంజాబ్, బరోడా మ్యాచ్‌పై బాగా ప్రచారం జరిగింది. దాంతో పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు. ఈస్ట్, వెస్ట్‌ గ్యాలరీలలోకి వారిని అనుమతించారు. ఇక్కడి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అసలు సమస్య అభిమానులు చప్పట్లతో సరిపెట్టకుండా మైదానంలోకి దూసుకుపోవడంలోనే కనిపించింది! ఒకటి కాదు, రెండు కాదు నాలుగు సార్లు కొందరు ఫ్యాన్స్‌ గ్యాలరీల్లోంచి దూకి గ్రౌండ్‌లోకి వచ్చేశారు. ఇక్కడ భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గ్రౌండ్‌ సెక్యూరిటీతో పరిమిత సంఖ్యలోనే పోలీసులు ఉండటంతో నియంత్రణ సాధ్యం కాలేదు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఈ మ్యాచ్‌ల కోసం కనీస ఏర్పాట్లు చేయలేకపోయిందనేది స్పష్టం. భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పేలవ రీతిలో నిర్వహిస్తున్నట్లు ఇది చూపించింది. ఆటగాళ్లకు చేరువగా వెళ్లడం, చేతులు కలపడం, కాళ్లు మొక్కడం మాత్రమే కాదు ఏకంగా సెల్ఫీలు తీసుకోవడం, కౌగిలించుకునే ప్రయత్నం చేయడం అభిషేక్‌ శర్మను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది! ఇది నిజంగా దురభిమానంగా మారి ఏదైనా ప్రమాదం తలెత్తి ఉంటే బాధ్యత ఎవరిది?

Smat 2025: Arjun Tendulkar Stars Against IPL Winner-Led Side With Stunning All-Round Show6
అద‌ర‌గొట్టిన అర్జున్ టెండూల్క‌ర్‌.. వణికిపోయిన బ్యాటర్లు

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో మంగ‌ళ‌వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌చిన్ త‌న‌యుడు, గోవా ఆల్‌రౌండ‌ర్ అర్జున్ టెండూల్క‌ర్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలుత బౌలింగ్‌లో 3 వికెట్ల‌తో సత్తాచాటిన అర్జున్‌.. అనంత‌రం బ్యాటింగ్‌లో 16 ప‌రుగులు చేశాడు. అర్జున్‌ పవర్‌ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. మధ్యప్రదేశ్‌ ఓపెనర్లు అంకుష్ సింగ్, శివాంగ్‌ కుమార్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత డేంజరస్‌ బ్యాటర్‌ వెంకటేష్‌ అయ్యర్‌ను అద్భుతమైన బంతితో జూనియర్‌ టెండూల్కర్‌ బోల్తా కొట్టించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అర్జున్‌ దూకుడుగా ఆడి గోవాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సీజన్‌లో అతడిని గోవా టీమ్‌ మెనెజ్‌మెంట్‌ ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసింది. కానీ బౌలింగ్‌లో రాణిస్తున్న అర్జున్‌.. బ్యాటింగ్‌లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.ల‌క్నోలోకి అర్జున్‌కాగా అర్జున్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. రాబోయో ఐపీఎల్ సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు అత‌డు ప్రాతినిథ్యం వ‌హించ‌నున్నాడు. ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియ‌న్స్ నుంచి అర్జున్‌ను ల‌క్నో ట్రేడ్ చేసుకుంది. అర్జున్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో వున్నప్పటికి.. 2023 సీజ‌న్‌లో అరంగేట్రం చేశాడు. ఈ జూనియర్ టెండూల్కర్ ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ తరపున కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. జ‌ట్టులో బుమ్రా, బౌల్ట్ వంటి బౌల‌ర్లు ఉండ‌డంతో అర్జున్‌కు పెద్ద‌గా అవ‌కాశాలు ద‌క్క‌లేదు. ఇప్పుడు ల‌క్నో త‌ర‌పున అర్జున్‌కు ఎక్కువ‌గా ఛాన్స్ ల‌భించే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.గోవా ఘ‌న విజ‌యం..ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌పై గోవా 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఎంపీ నిర్ధేశించిన 173 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గోవా కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.3 ఓవ‌ర్ల‌లో చేధించింది.కెప్టెన్‌ సుయాష్‌ ప్రభుదేశాయ్‌(50 బంతుల్లో 75) అజేయ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు అభినవ్‌ 55 పరుగులతో రాణించాడు.చదవండి: సర్ఫరాజ్‌ మెరుపు సెంచరీ.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో

Sarfaraz Khans maiden T20 ton puts him in spotlight for IPL Auction 20267
సర్ఫరాజ్‌ మెరుపు సెంచరీ.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో

ఐపీఎల్‌-2025 మినీ వేలానికి ముందు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్‌, ముంబై స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫరాజ్‌.. మంగళవారం లక్నో వేదికగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టాడు.దాదాపు రెండేళ్ల తర్వాత టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ తన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టిం‍చాడు. కేవలం 47 బంతుల్లో తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ముంబైక‌ర్‌ స‌రిగ్గా వంద ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.సర్ఫరాజ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అతడితో వెటరన్ అజింక్య రహానే 42 పరుగులతో రాణించాడు. కాగా గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో వేలం అన్‌సోల్డ్‌గా మిగిలిన స‌ర్ఫరాజ్ ఈసారి ఎలాగైనా ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఐదేసిన శార్థూల్‌..ఇక 221 పరుగుల భారీ లక్ష్య చేధనలో అస్సాం జట్టు కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ముంబై కెప్టెన్ శార్ధూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో అస్సాం పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అథర్వ అంకోలేకర్, సాయిరాజ్ పాటిల్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్‌ స్మిత్‌ హఠాన్మరణం

Will Jacks included in England playing XI for 2nd Ashes Test vs AUS8
ఇంగ్లండ్ తుది జట్టు ప్ర‌క‌ట‌న‌.. మూడేళ్ల త‌ర్వాత స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుది జట్టుని ప్రకటించింది. తొలి టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ డే-నైట్ పింక్ బాల్ టెస్ట్ కోసం ఒకే ఒక్క మార్పు చేసింది. గాయపడిన పేసర్ మార్క్ వుడ్ స్థానంలో ఆల్‌రౌండర్‌ విల్ జాక్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.జాక్స్ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇంగ్లడ్ తరపున టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జాక్స్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఇంగ్లండ్ జట్టుకు అతడు రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. అతడిని జ‌ట్టులోకి తీసుకురావ‌డం వెనుక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ మాస్ట‌ర్ మైండ్ ఉంది. జాక్స్‌ను కేవలం స్పిన్ ఎంపికగా కాకుండా, అతని బ్యాటింగ్‌ సామర్థ్యం కారణంగానే తుది జ‌ట్టులో చోటు ఇచ్చారు. బ్యాటింగ్ డెప్త్‌ను పెంచుకోవ‌డం కోస‌మే రెగ్యూల‌ర్ స్పిన్న‌ర్ బ‌షీర్ కాకుండా జాక్స్ వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపింది. గురువారం(డిసెంబ‌ర్ 4) నుంచి బ్రిస్బేన్ వేదిక‌గా ఈ యాషెస్ రెండో టెస్టు ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ తుది జ‌ట్టు ఇదేజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్చదవండి: క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్‌ స్మిత్‌ హఠాన్మరణం

Englands unsung Test wall Robin Smith passes away unexpectedly at 62 in Perth9
క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్‌ స్మిత్‌ హఠాన్మరణం

ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు దిగ్గజ ఆటగాడు రాబిన్ స్మిత్(62) హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని రాబిన్ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. సౌత్ పెర్త్‌లోని తమ ఇంట్లోనే ఆయన ప్రాణాలు విడిచారని వారు చెప్పుకొచ్చారు.కానీ ఆయన మరణానికి గల కారణాన్ని మాత్రం ప్రస్తుతం వెల్లడించలేదు. పోస్ట్‌మార్టమ్ దర్యాప్తులో మరణ కారణం నిర్ధారించబడుతుందని తెలిపారు. 2004లో రిటైర్మెంట్ తర్వాత ఆయన మద్యానికి బానిసై మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కానీ స్మిత్ మరణానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రసారం చేయవద్దని మీడియాను ఆయన కుటుంబ సభ్యులు అభ్యర్ధించారు.'ది జడ్జ్'గా పేరొందిన స్మిత్‌.. మాల్కమ్ మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్ , కోర్ట్నీ వాల్ష్ వంటి పేస్ దళంతో కూడిన వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేశారు. 1988 నుంచి 1996 మధ్య ఇంగ్లండ్ తరఫున 62 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 43.67 సగటుతో 4236 టెస్టు పరుగులు చేశారు. ఆయన కెరీర్‌లో తొమ్మిది టెస్టు సెంచరీలు ఉన్నాయి.అదేవిధంగా ఆయన 71 వన్డేలలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1992 ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంగ్లండ్ చేరడంలో స్మిత్‌ది కీలక పాత్ర. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లను సైతం ధైర్యంగా ఎదుర్కోవడంలో ఆయన దిట్ట. 1993లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో స్మిత్ ఆడిన ఇన్నింగ్స్‌(167 నాటౌట్) ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదుర్స్‌..రాబిన్ స్మిత్ డర్బన్‌లో జన్మించినప్పటికీ 1983లో ఇంగ్లండ్‌కు వచ్చి హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో చేరారు. మొత్తంగా 17 సీజన్లలో ఆయన 18,984 ఫస్ట్-క్లాస్ పరుగులు సాధించారు. స్మిత్ మృతిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

Vaibhav Suryavanshi puts Ajit Agarkar on notice with maiden century in Syed Mushtaq Ali Trophy10
వండ‌ర్ కిడ్ వ‌చ్చేస్తున్నాడు.. సైడ్ ప్లీజ్‌!

మొన్న ఐపీఎల్‌.. నిన్న ఆసియాక‌ప్.. నేడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. ఆ 14 ఏళ్ల యువ సంచల‌నం దూకుడును ఎవ‌రూ ఆప‌లేక‌పోతున్నారు. త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో చిన్న‌నాటి స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లిల‌ను గుర్తు చేస్తున్నాడు. అవ‌తలి ఎండ్‌లో బౌల‌ర్ ఎవ‌రైన డోంట్ కేర్‌. అత‌డికి తెలిసిందల్లా బంతి బౌండ‌రీకి త‌ర‌లించ‌డ‌మే.అత‌డు క్రీజులో ఉన్నాడంటే సీనియ‌ర్ బౌల‌ర్ల‌కు సైతం గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తాల్సిందే. వయస్సుతో సంబంధం లేకుండా సీనియ‌ర్ బౌల‌ర్ల‌ను అత‌డు ఎదుర్కొంటున్న తీరు అత్య‌ద్భుతం. 15 ఏళ్ల నిండ‌క‌ముందే రికార్డుల‌కు కేరాఫ్ అడ్రాస్‌గా మారిన ఆ చిచ్చ‌రపిడుగు ఎవ‌రో ఈపాటికే మీకు ఆర్ధ‌మైపోయింటుంది. అత‌డే భార‌త అండ‌ర్‌-19 స్టార్ ఓపెన‌ర్‌, బిహార్ యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ.స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మంగ‌ళ‌వారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా మ‌హారాష్ట్ర‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సూర్య‌వంశీ విధ్వంసక‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. మందకొడి పిచ్‌పై ఇతర బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది ప‌డిన చోట.. వైభ‌వ్ మాత్రం ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.31 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన బిహార్ జ‌ట్టును వైభ‌వ్ త‌న అద్బుత బ్యాటింగ్‌తో ఓ యోధుడిలా పోరాడాడు. ఆకాష్ రాజ్‌, అయూష్‌తో విలువైన భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో సూర్య‌వంశీ కేవ‌లం 58 బంతుల్లో సెంచ‌రీని పూర్తి చేశాడు. అయితే ఇది అత‌డి స్టాండ‌ర్డ్స్ ప్ర‌కారం "స్లో నాక్" అనే చెప్పాలి. ఎందుకంటే టీ20లలో అతని సగటు స్ట్రైక్ రేట్ 217.88. అంతకుముందు వైభ‌వ్ టీ20ల్లో 32, 35 బంతుల్లో రెండు శతకాలు బాదాడు. ఓవ‌రాల్‌గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 108 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 176 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఆ ల‌క్ష్యాన్ని మ‌హారాష్ట్ర 7 వికెట్లు కోల్పోయి చేధించింది.తొలి ప్లేయ‌ర్‌గా..ఈ సెంచ‌రీతో వైభ‌వ్ సూర్య‌వంశీ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. . సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు. వైభవ్‌కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్‌ జోల్‌ పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో జోల్ ఆల్‌టైమ్ రికార్డును ఈ బిహారీ బ్రేక్ చేశాడు.సీనియర్ జట్టు ఎంట్రీ ఎప్పుడు?వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీకి ముందు జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈపై 42 బంతుల్లో 144 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అదేవిధంగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో బిహార్ సీనియర్ ఆటగాళ్లు తడబడినప్పటికీ వైభవ్ మాత్రం మేఘాలయపై 93 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా ఈ ఏడాదిలో వైభవ్ కేవలం 15 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడి మూడు సెంచరీలు సాధించాడు. దీంతో అతడు త్వరలోనే భారత సీనియర్ టీ20 జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇంత చిన్న వయస్సులో అతడి నిలకడైన ఆట తీరు, సీనియర్ బౌలర్లపై అతను చూపిస్తున్న ఆధిపత్యం బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌ను ఖచ్చితంగా ఆలోచింపజేస్తోంది. అతడు వయస్సు తక్కువ కావడం వల్ల టీ20 ప్రపంచ కప్ 2026 నాటికి జట్టులోకి రాకపోయినా.. 15 ఏళ్ల నిండ‌గానే జాతీయ జ‌ట్టు త‌ర‌పున డెబ్యూ చేయ‌డం ఖాయం.గిల్ చోటుకు ఎస‌రు?అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) రూల్స్ ప్ర‌కారం.. ఓ ఆట‌గాడు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరేంగ్ర‌టం చేయ‌డానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి. వైభవ్‌ మార్చి 27, 2011 న జన్మించాడు. కాబట్టి అతడు మార్చి 27, 2026 తర్వాతే సీనియర్ జాతీయ జట్టు త‌ర‌పున‌ ఆడేందుకు అర్హత సాధిస్తాడు. అంటే వ‌చ్చే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సైకిల్‌లో భార‌త జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హించాడు. ఒక‌వేళ అత‌డు రాబోయో రోజుల్లో కూడా ఇదే జోరును కొన‌సాగిస్తే వైస్ కెప్టెన్ గిల్ స్ధానం డెంజ‌ర్‌లో ప‌డిన‌ట్లే. ప్ర‌స్తుతం టీ20ల్లో భార‌త జట్టు ఇన్నింగ్స్‌ను అభిషేక్ శ‌ర్మ‌, గిల్ ప్రారంభిస్తున్నారు. అభిషేక్ దుమ్ములేపుతున్న‌ప్ప‌టికి గిల్ ఆశించినంత మేర రాణించ‌లేక‌పోతున్నాడు. త‌దుప‌రి మ్యాచ్‌లో కూడా గిల్ ఇదే పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తే అత‌డి స్ధానాన్ని శాంస‌న్ లేదా వైభ‌వ్‌తో భ‌ర్తీ చేసే అవ‌కాశ‌ముంది.స్పీడ్ గ‌న్స్‌ను ఎదుర్కోగ‌ల‌డా?అయితే సూర్య‌వంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ఇది సరైన వయస్సు కాదు అని, జోష్ హాజిల్‌వుడ్, కగిసో రబాడ లేదా మార్క్ వుడ్ వంటి ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవడం అతనికి చాలా కష్టమని కొంత‌మంది మాజీలు వాదిస్తున్నారు. కానీ సూర్య‌వంశీ ఇప్ప‌టికే ఐపీఎల్‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, వెటరన్ ఇషాంత్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్ వంటి స్పీడ్‌స్టార్ల‌ను ఉతికారేశాడు. కాబ‌ట్టి అత‌డికి ప్రీమియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొవ‌డం పెద్ద టాస్క్ ఏమి కాదు.చదవండి: IND vs SA: అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? మ‌రెందుకు సెలెక్ట్‌ చేశారు?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement