ప్రధాన వార్తలు
ఆస్ట్రేలియాకు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
యాషెస్ సిరీస్ 2025-26లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజల్వుడ్ హ్యామ్స్ట్రింగ్, కాలి మడమ గాయం కారణంగా మిగిలిన సిరీస్ మొత్తాన్ని దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ ధ్రువీకరించాడు. టీ20 ప్రపంచకప్-2026 సమయానికి జోష్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.ఈ స్టార్ రైట్ఆర్మ్ పేసర్ గత నెలలో షెఫీల్డ్ షీల్డ్లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడుతున్నప్పుడు తొడ కండరాల గాయం బారినపడ్డాడు.. దీంతో మ్యాచ్ మధ్యలోనే హాజిల్వుడ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం చిన్నదే, యాషెస్ ఆరంభ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని అంతా భావించారు. కానీ స్కాన్లో గాయం తీవ్రమైనది తేలింది. దీంతో అతడు మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అయితే అతడు తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో కనీసం ఆఖరి మూడు టెస్టులకైనా అందుబాటులో వస్తాడని టీమ్మెనెజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. కానీ ప్రాక్టీస్ సెషన్లలో అతడి కాలి మడమకు గాయమైంది. దీంతో ఇప్పుడు అతడు పూర్తిగా సిరీస్ నుంచే వైదొలిగాడు."జోష్ హాజిల్వుడ్ దురదృష్టవశాత్తు యాషెస్ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇది నిజంగా చాలా చాలా బాధాకరం. ఈ సిరీస్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని మేము అనుకున్నాం. హ్యామ్స్ట్రింగ్ గాయం నుంచి కోలుకునే క్రమంలో కాలి మడమకు గాయమైంది. అతడు తిరిగి పునరావసంకు వెళ్లనుర్నాడు. టీ20 ప్రపంచకప్కు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాము అని డోనాల్డ్ పేర్కొన్నాడు. అదేవిధంగా మూడో టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి రానున్నట్లు డోనాల్డ్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్-2026 వేలంలో బిగ్ ట్విస్ట్..! ఫైనల్ లిస్ట్ ఖరారు
ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేలంలో పాల్గోనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం కోసం మొత్తం 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 350 మంది షార్ట్లిస్ట్ అయినట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. ఈ లిస్ట్లో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన 35 మంది ఆటగాళ్లు ఉండటం గమనార్హం. సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తొలుత తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో మొదటి ప్రకటించిన జాబితాలో అతడు పేరు లేదు. కానీ చివరి నిమిషంలో తన మనసును మార్చుకుని వేలంలో పాల్గోవాలని నిర్ణయించుకున్నాడు.దీంతో కొన్ని ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు డి కాక్ను తుది జాబితాలో చేర్చారు. డికాక్ తన బేస్ ధరను 50 శాతం తగ్గించుకున్నాడు. కనీస ధర రూ. రూ.కోటి రూపాయలతో అతడు వేలం బరిలోకి దిగనున్నాడు. ఈ 35 మంది క్రికెటర్లలో శ్రీలంక, సౌతాఫ్రికా ప్లేయర్లతో పాటు భారత దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇక వేలానికి సంబంధించిన విదివిధానాలు బీసీసీఐ ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలను మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.వేలం రూల్స్ ఇవే..ఈ మినీ వేలం మొదట క్యాప్డ్ (Capped) ఆటగాళ్లతో ప్రారంభమవుతుంది. ఇందులో బ్యాటర్లు, ఆల్-రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉంటారు. తరువాత అన్క్యాప్డ్ (Uncapped) ఆటగాళ్లతో పూర్తి రౌండ్ కొనసాగుతుంది.మొదటి 70 మంది ఆటగాళ్ల పేక్లు పూర్తయిన తర్వాత మిగిలిన ప్లేయర్ల కోసం యాక్సిలరేటెడ్ రౌండ్ను నిర్వహించనుంది. చివగా తొలి మూడు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాళ్లు ఆఖరిలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అయితే ఈసారి మార్క్యూ లిస్ట్ రౌండ్ ఉండదు. తొలి రౌండ్లో కెమెరూన్ గ్రీన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, డేవిడ్ మిల్లర్ వంటి విదేశీ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. అదే విధంగా వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్కు కూడా భారీ ధర దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ వేలంలో అన్ని జట్లు కలిపి మొత్తం 77 స్లాట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 31 విదేశీ స్థానాలు ఉన్నాయి.ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్లువిదేశీ ఆటగాళ్లు: అరబ్ గుల్ (ఆఫ్ఘనిస్తాన్), మైల్స్ హమ్మండ్ (ఇంగ్లండ్), డాన్ లాటెగాన్ (ఇంగ్లండ్), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కానర్ ఎస్టర్హూజెన్ (దక్షిణాఫ్రికా), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), బయాండా మజోలా (దక్షిణాఫ్రికా), ట్రావీన్ మాథ్యూ (శ్రీలంక), డిసురి లంకాల్ (పెర్నాగెసల్ వెల్సాల్ లంకా), డిసురి లంకాల్ (శ్రీలంక), అకీమ్ అగస్టే (వెస్టిండీస్).భారత ఆటగాళ్లు: సాదేక్ హుస్సేన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేష్ శర్మ, కనిష్క్ చౌహాన్, ఆరోన్ జార్జ్, జిక్కు బ్రైట్, శ్రీహరి నాయర్, మాధవ్ బజాజ్, శ్రీవత్స ఆచార్య, యష్రాజ్ పుంజా, సాహిల్ పరాఖ్, రోషన్ వాఘ్సారే, యష్ డిచోల్కర్, అయాజ్క్ వల్కర్, ధుర్మిల్త్ ఖాన్, ధుర్మిల్త్ ఖాన్ పురవ్ అగర్వాల్, రిషబ్ చౌహాన్, సాగర్ సోలంకి, ఇజాజ్ సవారియా, అమన్ షెకావత్.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..!
టీమిండియాకు భారీ షాక్..!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పాండ్యా.. తిరిగి మంగళవారం కటక్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న తొలి టీ20ల్లో ఆడనున్నాడు.పునరాగమనంలో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే ముందు పాండ్యా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యాడు. ఈ టోర్నీలో బరోడా తరపున రెండు మ్యాచ్లు ఆడాడు. ఈ రెండింటిలోనూ అతడు తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేశాడు.ఎడమ క్వాడ్రిసెప్స్(తొడ కండరాలు) గాయం నుంచి పాండ్యా పూర్తిగా కోలుకున్నట్లు కన్పిస్తున్నాడు. హార్దిక్ షెడ్యూల్ ప్రకారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం రెండు మ్యాచ్లు సరిపోతాయని నిర్ణయించింది. దీంతో పాండ్యా నేరుగా తొలి మ్యాచ్ జరిగే కటక్కు చేరుకున్నాడు.బారాబతి స్టేడియంలో ఈ ఆల్రౌండర్ ఒంటరిగా ట్రైనింగ్ పాల్గోన్నాడు. వార్మప్, స్ట్రెచింగ్, రన్నింగ్ డ్రిల్స్తో పాటు, త్రోడౌన్ స్పెషలిస్టులు నువాన్ సెనెవిరత్నే, దయానంద్ గారానితో కలిసి 20 నిమిషాలు బౌలింగ్ చేశాడు.ప్రాక్టీస్కు దూరం!ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికి.. సోమవారం జరిగిన భారత్ చివరి ప్రాక్టీస్ సెషన్కు హార్దిక్ గైర్హాజరయ్యాడు. దీంతో అతడు మళ్లీ గాయపడ్డాడా? అన్న ఆందోళన అభిమానులలో నెలకొంది. అయితే హార్దిక్కు ఎటువంటి గాయం లేదని, ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే శిక్షణకు దూరమయ్యాడని క్రిక్ బజ్ తెలిపింది. టీ20 ప్రపంచకప్-2026కు సమయం అసన్నమవుతుండడంతో హార్దిక్ లాంటి అద్భుతమైన ఆటగాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే బౌలింగ్ చేసే క్రమంలో పాండ్యా కాస్త ఆసౌకర్యంగా కన్పించడాని, అందుకే ట్రైనింగ్ సెషన్కు దూరంగా ఉన్నాడని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం హార్దిక్ ట్రైనింగ్ స్కిప్పై ఎటువంటి ప్రకటన చేయలేదు.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్
కుటుంబం తోడుగా... ప్రతిభే నిచ్చెనగా...
వేలు పట్టి నడక నేర్పించిన నాన్నే... చేయి పట్టుకొని రేసింగ్కు తీసుకెళ్లాడు. పిల్లలకు కిక్ ఇచ్చే గో కార్టింగ్ రేసులో రయ్ రయ్ మనిపించే తనయుని ఉత్సాహాన్ని కళ్లారా చూశాక తండ్రి తన కుమారుడి తపనే తన తపన అనుకున్నాడు. ఏడేళ్ల ప్రాయం నుంచి టీనేజ్కొచ్చాక ఫార్ములావన్లో అరంగేట్రం చేసే వరకు ప్రతి పైసా తండ్రే వెచ్చించాడు. ఇలా తండ్రి ఆడమ్ చేయూత, లాండో నోరిస్ రాతను మార్చింది. ఎఫ్1 చాంపియన్ను చేసింది. సాక్షి క్రీడా విభాగంఇప్పుడు ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ మంతా నోరిస్ వైపే చూస్తోంది. తాజా ఎఫ్1 వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్గా అతను ఘనతకెక్కాడు. 18 ఏళ్ల తర్వాత మెక్లారెన్ రేసింగ్ టీమ్ను విజేతగా నిలిపాడు. చివరిసారిగా హామిల్టన్ 2008లో మెక్లారెన్కు టైటిల్ అందించాడు. దిగ్గజ రేసర్ హామిల్టన్, తాజా చాంపియన్ నోరిస్ ఇద్దరు బ్రిటన్ డ్రైవర్లే కావడం గమనార్హం. ఇక మెక్లారెన్ టీమ్ను కాకుండా దేశం గురించే చెప్పుకుంటే బ్రిటన్ తరఫున 11వ ఫార్ములావన్ చాంపియన్ నోరిస్. 26 ఏళ్ల వయసులో తొలి టైటిల్ సాధించాడు. ఆఖరి రేసుదాకా ఉత్కంఠ రేపినా... స్టార్ రేసర్ వెర్స్టాపెన్ వెనకే ఉండి (రెండో స్థానం) వెంటాడినా తను మాత్రం తక్కువేం కాదని, సర్క్యూట్లో దిగితే తగ్గేదే లేదని తన విజయంతో చాటి చెప్పాడు. బాల్యంలోనే రేసింగ్ బాట ఏడేళ్ల పసి ప్రాయంలో రేసింగ్ బాట పట్టిన నోరిస్ తాజాగా ఏడో సీజన్లో ప్రపంచ చాంపియన్గా నిలవడం విశేషం. నోరిస్ తండ్రి ఆడమ్ కోటీశ్వరుడు కావడంతో డబ్చుకు కొదవేం లేదు. పైగా ధైర్యం కూడా ఎక్కువే! లేదంటే కోట్లకు వారసుణ్ని ఏ తండ్రి అయిన ప్రమాదకర రేసింగ్కు తీసుకెళ్తాడా. కానీ ఆడమ్ చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టుకొని మరీ కార్టింగ్కు పరిచయం చేశాడు. అలా మొదలైన ప్రయాణంలో ఓ ఏడాది గడిచేసరికే చిన్న చితక పోటీల్లో గెలవడం కూడా మొదలుపెట్టాడు. ఇలా మూడు, నాలుగేళ్లు గడిచే సరికి 11 ఏళ్ల వయసులో ‘ఎంఎస్ఏ బ్రిటిష్ క్యాడెట్ కార్ట్ చాంపియన్షిప్’లో పోటీలకు దిగాడు. మెరుపు వేగం అందిపుచ్చుకొని పలుమార్లు విజేతగా నిలిచాడు. లాండో నోరిస్ రోజు రోజుకి కాదు... కానీ రేసు రేసుకి జోరు పెంచుతున్నాడు. టీనేజ్లో పాల్గొన్న పోటీల్లో తన సత్తా జూనియర్ రేసింగ్ జట్లను ఆకట్టుకునేలా చేసింది. 14 ఏళ్లకే అవార్డు కూడా... నోరిస్కు బాగా తెలిసిన ప్రపంచం రేసింగ్. తనని దూసుకెళ్లేలా చేస్తున్న ప్రపంచం కూడా రేసింగే! అందుకేనేమో అతని ‘వేగం’ అంతే వేగంగా అవార్డును తెచ్చిపెట్టింది మరి! 14 ఏళ్ల టీనేజ్లోనే నోరిస్ తొలి అవార్డు అందుకున్నాడు. మూడుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన సర్ జాకీ స్టివార్ట్ చేతుల మీదుగా 2013లో ఆ ఏడాదికి సంబంధించి ‘ఆటో స్పోర్ట్’ అవార్డు అందుకున్నాడు. ఇలా అవార్డుతో పాటు ఆ రేసు, ఈ రేసు గెలుచుకుంటూ సర్క్యూట్పై దుమ్మురేపే ప్రతిభనే ఆలంబనగా చేసుకొని రేసర్లంతా కలలు గనే ఎఫ్1 గడప తొక్కాడు. 2018, జనవరిలో 18 ఏళ్ల నోరిస్ మెక్లారెన్ రేసింగ్ టీమ్ సభ్యుడయ్యాడు. టీమ్ సీఈవో బ్రౌన్ ఆ యువ రేసర్కు అవకాశమివ్వాలని నిర్ణయించాడు. అప్పటికే సీనియర్గా ఉన్న డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో స్థానంలో రేసు మొదలుపెట్టిన నోరిస్ ఆ తర్వాత కొంతకాలానికి పోల్ పొజిషన్లు సాధిస్తూ ముందంజ వేశాడు. అలా ఏకబికిన ఏడేళ్ల పాటు తన టీమ్ మెక్లారెన్ పెట్టిన నమ్మకానికి న్యాయం చేస్తూ ఏ సీజన్లోనూ, ఏ రేసులోనూ నమ్మకం కోల్పోకుండా తన రేసింగ్ జోరు చూపాడు. ఎట్టకేలకు తనకు అవకాశమిచ్చిన మెక్లారెన్ను గెలిపించాడు. ఎఫ్1 అరంగేట్రం నుంచి టైటిల్ గెలిచేదాకా మెక్లారెన్ రేసింగ్ జట్టుతోనే తన ఏడేళ్ల పయనం మొత్తానికి ఇలా విజయవంతంగా సాగిపోతోంది.వాడికేమో ఇష్టం, నాకేమో కష్టం ఎవరో చెబితేనో... సరదాకో రేసింగ్కు వెళ్లలేదు. ఎంతో ఇష్టపడే కార్టింగ్ కార్ స్టీరింగ్ పట్టాడు. మా ఆడమ్ (నోరిస్ నాన్న) కూడా ప్రోత్సహించాడు. దీని వల్ల ఏడేళ్ల ప్రాయం నుంచి ఇప్పటి వరకు నా కుమారుడిని మిస్ అవుతూనే ఉన్నా. మొదట్లో కార్టింగ్ అంటూ ఇంటికి దూరంగా... సర్క్యూట్కు దగ్గరగా ఎక్కువ సమయం గడిపాడు. అనంతరం జూనియర్ స్థాయి పోటీల కోసమని అటు ఇటూ తిరిగాడు. కొన్నేళ్లుగా ప్రొ సర్క్యూట్ రేసర్గా మరింత బిజీ అయిపోయాడు. ఏం చేస్తాం. వాడికేమో అదే ఇష్టం. వాణ్నిలా రోజులు, నెలల తరబడి విడిచి ఉండటం నాకేమో కష్టం. –నోరిస్ తల్లి సిస్కా
SMAT: సూపర్ లీగ్కు హైదరాబాద్, ఆంధ్ర జట్లు
దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సూపర్ లీగ్ దశకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్ మ్యాచ్లలో ఓడినా... ఈ రెండు టీమ్లు ముందంజ వేయడంలో సఫలమయ్యాయి. గ్రూప్ ‘బి’లో ఆడిన 7 మ్యాచ్లలో 5 గెలిచి, 2 ఓడిన హైదరాబాద్ మొత్తం 20 పాయింట్లతో అగ్ర స్థానం సాధించగా, గ్రూప్ ‘ఎ’లో ఆడిన 7 మ్యాచ్లలో 5 గెలిచి, 2 ఓడిన ఆంధ్ర 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫై అయ్యాయి.సోమవారం జరిగిన చివరి లీగ్లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో చండీగఢ్ చేతిలో పరాజయం పాలైంది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ప్రజ్ఞయ్ రెడ్డి (43; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అమన్ రావు (33; 2 ఫోర్లు, 2 సిక్స్లు), తనయ్ త్యాగరాజన్ (27; 2 సిక్స్లు) రాణించారు. అనంతరం చండీగఢ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు సాధించింది. సత్యనారాయణ రాజుకు 4 వికెట్లువిదర్భతో లక్నోలో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర 19 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా విదర్భ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమన్ మోఖడే (35 బంతుల్లో 50; 7 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (41; 2 సిక్స్లు) రాణించగా... ఆంధ్ర బౌలర్ సత్యనారాయణ రాజు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. పైలా అవినాశ్ (44; 3 ఫోర్లు, 2 సిక్స్లు), రికీ భుయ్ (26; 2 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. యశ్ ఠాకూర్ 4 వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు. పుణేలో ‘సూపర్ లీగ్’ మ్యాచ్లుటోరీ్నలో భాగంగా ‘సూపర్ లీగ్’ దశకు చేరిన 8 జట్లను 2 గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్లతో ఆంధ్ర తలపడనుండగా... గ్రూప్ ‘బి’లో ముంబై, రాజస్తాన్, హరియాణాలతో హైదరాబాద్ తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్లు వరుసగా ఈ నెల 12, 14, 16 తేదీల్లో జరుగుతాయి. రెండు గ్రూప్ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు 18న ఫైనల్లో తలపడతాయి. ‘సూపర్ లీగ్’ మ్యాచ్లు పుణేలో నిర్వహిస్తారు.చదవండి: SMAT 2025: సాయి సుదర్శన్ విధ్వంసకర శతకం
చికిత ‘పసిడి’ గురి
తైపీ ఓపెన్ వరల్డ్ సిరీస్ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల అండర్–21 కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత చాంపియన్గా అవతరించింది. చైనీస్ తైపీలోని తావోయువాన్ సిటీలో జరిగిన ఈ టోరీ్నలో చికిత ఫైనల్లో 148–141 పాయింట్ల తేడాతో జిట్మున్ ఖెమనిత్ (థాయ్లాండ్)పై గెలుపొందింది. సెమీఫైనల్లో చికిత 147–145తో యోన్సియో కాంగ్ (దక్షిణ కొరియా)పై, క్వార్టర్ ఫైనల్లో 149–138తో సియోయూన్ కాంగ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్లో జ్యోతి సురేఖ 149–143తో సో చేవన్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ కూడా కాంస్యం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతక మ్యాచ్లో అభిషేక్ వర్మ 148–146తో మార్కో బ్రునో (ఇటలీ)పై గెలిచాడు. మహిళల రికర్వ్ అండర్–21 కాంస్య పతక మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కొండపావులూరి యుక్తశ్రీ 5–6తో షు యాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది.
ఇక ధనాధన్ షురూ...
టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఇప్పటి వరకు 32 టి20లు ఆడితే 26 గెలిచి, 4 మాత్రమే ఓడిపోయింది. ఇలాంటి అద్భుత ఫామ్ మాత్రమే కాదు జట్టులో అనూహ్య మార్పులేమీ లేకుండా చాలా కాలంగా ఒకే పటిష్టమైన బృందంతో సాగుతోంది. మరోవైపు భారత్ చేతిలో టి20 వరల్డ్కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా 9, గెలిచి 16 ఓడిపోయింది.పైగా నిలకడ లేని టీమ్తో పదే పదే మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఐదు మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై తమ స్థాయిని ప్రదర్శించేందుకు టీమిండియా సిద్ధం కాగా... వచ్చే టి20 వరల్డ్ కప్కు ముందు ఇక్కడ ఐదు మ్యాచ్లు ఆడటం సన్నాహకంగా ఉపయోగపడుతుందని సఫారీలు భావిస్తున్నారు. కటక్: భారత గడ్డపై చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్లు జరుగుతుండగా... టెస్టుల్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్ విజయంపై గురి పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా వరల్డ్ కప్ బరిలోకి దిగడానికి ముందు భారత్ 10 మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్తో కూడా ఐదు టి20 మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పటికే సిద్ధమైన జట్టును అన్ని రకాలుగా పరీక్షించుకోవడంతో పాటు స్వల్ప లోపాలేమైనా ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్లు అవకాశం కల్చిస్తాయి. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్ ఫలితంకంటే కూడా తమ జట్టును పునరి్నరి్మంచుకోవటంపై దృష్టి పెట్టింది. ఇలాంటి సమీకరణాల మధ్య బారాబతి స్టేడియంలో నేడు తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. గిల్, పాండ్యా సిద్ధం... ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ గెలిచిన తర్వాత భారత్ ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతోంది. సంచలన ఎంపికలు ఏమీ లేవు కాబట్టి తుది కూర్పుపై కూడా స్పష్టత ఉంది. గాయాల నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ గిల్, హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. కాబట్టి వీరిద్దరు ఆడటం ఖాయం. అభిషేక్ శర్మతో పాటు గిల్ ఓపెనింగ్ చేయనుండగా సూర్య, తిలక్ వర్మ స్థానాలపై ఎలాంటి సందేహం లేదు. వికెట్ కీపర్గా సంజూ సామ్సన్, జితేశ్ శర్మలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. రెగ్యులర్ స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఉంటారు. అక్షర్ పటేల్తో పాటు ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ పోటీలో ఉన్నాడు. పేస్ ఆల్రౌండర్ కావాలంటే హర్షిత్ రాణాకు కూడా అవకాశం దక్కవచ్చు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ మాత్రమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. పూర్తి స్థాయిలో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాతి నుంచి సూర్య ఆడిన 15 ఇన్నింగ్స్లలో 15.33 సగటుతో కేవలం 184 పరుగులే చేశాడు. అంతకుముందు నుంచి కలిపి చూస్తే గత 20 ఇన్నింగ్స్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్లలో ఒక్క హాఫ్ సెంచరీ చేయకుండా పూర్తిగా విఫలయ్యాడు. ప్రస్తుత స్థితిలో అతని స్థానానికి వచ్చిన ముప్పేమీ లేకున్నా... ఈ సిరీస్లోనైనా స్థాయికి తగినట్లుగా చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బ్రెవిస్పై దృష్టి... దక్షిణాఫ్రికా టీమ్ పరిస్థితి ఇటీవల అంతంత మాత్రంగానే ఉంది. ఆ్రస్టేలియా, పాకిస్తాన్ల చేతిలో సిరీస్లు ఓడటంతో పాటు నమీబియా చేతిలో మ్యాచ్ కూడా కోల్పోయింది. పైగా ఇంగ్లండ్తో జరిగిన టి20లో 300కు పైగా పరుగులిచ్చి ఇలాంటి చెత్త రికార్డు నమోదు చేసిన పెద్ద జట్టుగా నిలిచింది. దూకుడైన ఆటగాడు డేవిడ్ మిల్లర్, పేసర్ నోర్జే గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేయడం సానుకూలాంశం కాగా కెప్టెన్గా మళ్లీ బాధ్యతలు తీసుకున్న మార్క్రమ్ మెరుగైన ఫామ్లో ఉండటం కలిసి రావచ్చు. ఇప్పటికీ తుది జట్టు విషయంలో టీమ్లో గందరగోళమే ఉంది. అయితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించగల డెవాల్డ్ బ్రెవిస్పై మాత్రం అందరి దృష్టీ ఉంది. ఐపీఎల్తో పాటు ఇటీవల వన్డేల్లో కూడా అతని దూకుడు కనిపించింది. బ్రెవిస్ చెలరేగితే సఫారీలకు మంచి గెలుపు అవకాశం ఉంటుంది. యాన్సెన్ ఆల్రౌండ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిచ్, వాతావరణం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమంగా అనుకూలించే అవకాశం ఉన్న స్పోరి్టంగ్ పిచ్. ప్రతీ ఆటగాడు సత్తా చూపించేందుకు సరైంది. అయితే ఇక్కడా మంచు ప్రభావం చాలా ఉంది కాబట్టి టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన ఉన్నా మ్యాచ్కు ఇబ్బంది లేకపోవచ్చు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, గిల్, తిలక్, జితేశ్ శర్మ/సామ్సన్, పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షిత్/సుందర్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెన్డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బాష్/లిండే, యాన్సెన్, మహరాజ్, ఎన్గిడి, మహరాజ్.
కరుణ్ నాయర్కు అక్కడ కూడా చుక్కెదురు
పేలవ ఫామ్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన టీమిండియా అవకాశాన్ని చేజార్చుకున్న కరుణ్ నాయర్.. తాజాగా అదే ఫామ్ లేమి కారణంగా దేశవాలీ అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఇటీవలే విదర్భ నుంచి తన సొంత జట్టు కర్ణాటక పంచన చేరిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో దారుణంగా విఫలమై జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ టోర్నీలో తొలి 6 మ్యాచ్ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసిన కరుణ్.. త్రిపురతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్ నుంచి తప్పించబడ్డాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు మంచి ఫామ్లో ఉండిన కరుణ్ పొట్టి ఫార్మాట్కు వచ్చే సరికి చాలా ఇబ్బంది పడ్డాడు. కరుణ్ గత ఎడిషన్ SMAT ఫామ్ ఇందుకు భిన్నంగా ఉండింది. గత ఎడిషన్లో విదర్భకు ఆడిన కరుణ్ 6 ఇన్నింగ్స్ల్లో 177.08 స్ట్రయిక్రేట్తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. కరుణ్ను ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నెల కూడా కాకముందే కరుణ్ ఇంత చెత్త ప్రదర్శనలు చేయడం ఢిల్లీ యాజమాన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.కరుణ్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై అదరగొట్టి (40 బంతుల్లో 89 పరుగులు), ఆతర్వాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడు. అయినా కరుణ్పై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నమ్మకముంచి రీటైన్ చేసుకోవడం ఆశ్చర్యకరం.ఇదిలా ఉంటే, కరుణ్ లేని మ్యాచ్లో కర్ణాటకపై త్రిపుర సంచలన విజయం సాధించింది. సూపర్ ఓవర్లో ఆ జట్టు కర్ణాటకకు షాకిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు తలో 197 పరుగులు చేయగా.. సూపర్ ఓవర్లో త్రిపుర ఊహించని విధంగా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేయగా.. కర్ణాటక వికెట్ కోల్పోయి 18 పరుగులకే పరిమితమైంది. దీంతో త్రిపుర సంచలన విజయం నమోదు చేసింది.
సాయి సుదర్శన్ విధ్వంసకర శతకం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ-2025లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. ఫలితంగా తమిళనాడు 3 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. సాయి సుదర్శన్ ఒంటిచేత్తో తమిళనాడును విజయతీరాలకు చేర్చాడు. లక్ష్య ఛేదనలో మిగతా బ్యాటర్లు వరుసగా ఔటైనా, టెయిలెండర్ సన్నీ సంధు (30) సాయంతో తన జట్టును గెలిపించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. విశ్వరాజ్ జడేజా (70), సమ్మద్ గజ్జర్ (66) మెరుపు అర్ద శతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో వీరిద్దరు మినహా ఎవరూ రాణించలేకపోయారు. తమిళనాడు బౌలర్లలో సిలంబరసన్ 3, ఎసక్కిముత్తు 2, సన్నీ సంధు, రాజ్కుమార్ తలో వికెట్ తీశారు.అనంతరం ఛేదనలో తమిళనాడు కూడా తడబడింది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే సాయి సుదర్శన్ ఒక్కడు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలుత రిత్విక్ ఈశ్వరన్ (29), ఆఖర్లో సన్నీ సంధు సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. సుదర్శన్ దెబ్బకు తమిళనాడు 18.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జయదేవ్ ఉనద్కత్ (4-0-30-3), అంకుర్ పవార్ (3.4-0-26-2) తమిళనాడు ఆటగాళ్లను ఇరుకున పెట్టినప్పటికీ సాయి సుదర్శన్ వారిపై ఎదురుదాడి చేసి విజయం సాధించాడు.
షమీ చేసిన నేరం ఏంటి.. ఎందుకు రీఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు..?
భారత క్రికెట్లో షమీ ఉదంతం ఇటీవలికాలంలో తరుచూ హాట్ టాపిక్గా మారుతుంది. అతను దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా.. అతని అనుభవం టీమిండియాకు అవసరమైనా, సెలెక్టర్లు ఫిట్నెస్, ఇతరత్రా కారణాలు చెప్పి అవకాశాలు ఇవ్వడం లేదు. షమీని పక్కకు పెట్టడానికి పై కారణాలు కాకుండా చర్చించుకోలేని వేరే కారణముందన్నది చాలా మందికి తెలుసు. అయినా ఎవరూ నోరు విప్పే సాహసం చేయలేరు. ఓ ఆటగాడి కెరీర్ను ఆటతో ముడిపెట్టకూడని విషయాల పేర్లు చెప్పి నాశనం చేయడం సమంజసం కాదని కొన్ని గొంతులకు వినిపిస్తున్నా, వాటిని పట్టించుకునే నాథుడు లేడు. ఆటగాడిగా షమీకి అన్యాయం జరుగుతున్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. భారత సెలెక్టర్ల వద్ద మాత్రం దాన్ని సమర్దించుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి.సెలెక్టర్లు చెబుతున్న కారణాల్లో ప్రధానమైంది షమీ ఫిట్గా లేడని. వాస్తవానికి వారి ఈ సమర్దనలో అర్దమే లేదు. ఒకవేళ షమీ నిజంగా ఫిట్గా లేకపోతే దేశవాలీ టోర్నీల్లో ఎలా అనుమతిస్తారు. అనుమతించినా.. నిజంగా ఫిట్గా లేకపోతే అతనెలా రాణించలడు. ఈ ఒక్క విషయం చాలు సెలెక్టర్లు వేరే ఏదో కారణం చేత షమీని టీమిండియాను ఎంపిక చేయడం లేదన్న విషయం అర్దం అవడానికి. సౌతాఫ్రికా టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందే షమీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన చేశాడు. వాస్తవానికి షమీ కాకుండా వేరే ఏ బౌలర్ అయినా అలాంటి ప్రదర్శన చేసుంటే ఖచ్చితంగా టీమిండియాలో చోటు దక్కేది. కానీ అక్కడుంది షమీ కాబట్టి అలా జరగలేదు. అలాంటి ప్రదర్శనలు మరిన్ని పునరావృతం చేసినా షమీకి ఇప్పట్లో టీమిండియాలో చోటు దక్కదు. కారణం బహిరంగ రహస్యమే.షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చూపిస్తున్న రెండో ప్రధాన కారణం వయసు. ప్రస్తుతం షమీ వయసు 35. అంతర్జాతీయ క్రికెట్లో ఈ వయసు దాటిన తర్వాత కూడా సంచలన ప్రదర్శనలు చేసిన పేసర్లు చాలామంది ఉన్నారు. ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఆండర్సన్ 40 ఏళ్ల వయసులోనూ ఏం చేశాడో జగమంతా చూసింది. అలాంటిది షమీకి 35 ఏళ్లకే వయసైపోయిందనడం ఎంత వరకు సమంజసం. వయసైపోయిన వాడికి అంతర్జాతీయ క్రికెట్ అయినా, దేశవాలీ క్రికెట్ అయినా ఒకటే కదా. దేశవాలీ క్రికెట్లో వయసైపోయినా రాణిస్తున్నవాడు, అంతర్జాతీయ క్రికెట్లో రాణించలేడా..? ఏదో కారణం చెప్పాలని ఇలాంటి పొంతనలేని కారణాలు చెబుతున్నారు కానీ, అసలు కారణం వేరన్న విషయం చాలామందికి తెలుసు.షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చెబుతున్న మరో కారణం యువకులకు అవకాశాలు ఇవ్వడం. వాస్తవానికి యువకులకు అవకాశాలు ఇస్తే ఎవ్వరూ కాదనరు. జట్టులో సీనియర్లు తురుచూ విఫలమవుతున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలకు పోవాలి. అయితే ఇక్కడ పరిస్థితి వేరు. కావాలని షమీని పక్కకు పెట్టడానికి అనర్హమైన, టీమిండియాలో పెద్ద తలకాయ అండదండలున్న ఓ పేసర్ను యువత పేరుతో ఫ్రేమ్లోకి తెచ్చారు. అతని కంటే చిన్నవాడు, అతని కంటే వెయ్యి రెట్లు ఎక్కువ టాలెంట్ ఉన్నా మరో పేసర్కు మాత్రం అవకాశాలు ఇవ్వరు. పెద్దల అండదండలున్న పేసర్ ఎన్ని మ్యాచ్ల్లో విఫలమైనా, మళ్లీమళ్లీ తుది జట్టులో ప్రత్యక్షమవుతుంటాడు. వాస్తవానికి ఆటగాళ్ల శారీరక కదలికలు, ఫిట్నెస్, ఫామ్ను బట్టి వయసు ప్రస్తావన వస్తుంది. ఈ మూడు బాగుంటే వయసుతో పనేముంది. పై మూడు అంశాల్లో షమీ పర్ఫెక్ట్గా ఉన్నా వయసు పేరు చెప్పి టీమిండియాకు ఎంపిక చేయకపోవడం ఎంత వరకు సమంజసం.ఇన్ని కారణాలు చెప్పి షమీని టీమిండియాకు ఎంపిక చేయకున్న సెలెక్టర్లు అంతిమంగా ఒక్క విషయం ఆలోచించాలి. షమీ స్థానంలో అతనిలా రాణిస్తున్న ఎవరినైనా ఎంపిక చేయకపోతే నష్టపోయే భారత జట్టే. అర్హులు జాతీయ జట్టులో లేకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. షమీ లాంటి ఉదంతాలు జరగడం భారత క్రికెట్కు మాయని మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే హర్భజన్ సింగ్, ఛతేశ్వర్ పుజారా లాంటి టీమిండియా మాజీలు షమీకి మద్దతుగా గళం విప్పారు. షమీ చేసిన నేరం ఏంటని బహిరంగంగా ప్రశ్నించారు. భారత సెలెక్టర్లు ఇకనైనా పంతాలు పక్కకు పెడితే భారత క్రికెట్కు మరింత మేలు జరిగే అవకాశం ఉంది.
వెర్స్టాపెన్కు ‘పోల్’
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ చివరి రేసులో ...
సురుచికి స్వర్ణం
దోహా: భారత యువ షూటర్ సురుచి సింగ్... అంతర్జాతీయ ...
జనవరి 15 నుంచి రెజ్లింగ్ లీగ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 ...
‘అవసరమైతే... అధికారిక ఆదేశాలిస్తాం’
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్స్ చాంపియన్...
సాయి సుదర్శన్ విధ్వంసకర శతకం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ-2025లో భాగంగా సౌ...
షమీ చేసిన నేరం ఏంటి.. ఎందుకు రీఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు..?
భారత క్రికెట్లో షమీ ఉదంతం ఇటీవలికాలంలో తరుచూ హాట్...
వరల్డ్కప్ స్ట్రీమింగ్ నుంచి తప్పుకున్న హాట్స్టార్..!
2026 టీ20 వరల్డ్కప్కు ముందు ఐసీసీకి ఊహించని షాక్...
న్యూజిలాండ్కు 'ట్రిపుల్' షాక్
స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల ...
క్రీడలు
రయ్ రయ్ మంటూ.. ఆకట్టుకున్న బైకర్ల విన్యాసాలు.. (ఫోటోలు)
వైజాగ్ వన్డేలో టీమిండియా జయభేరి.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
రేపు హైదరాబాద్కు హీరో సల్మాన్ ఖాన్ (ఫోటోలు)
సారా టెండూల్కర్ వారణాసి ట్రిప్ (ఫొటోలు)
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
వరల్డ్కప్ గెలిచి నెల రోజులు.. భారత మాజీ క్రికెటర్ భావోద్వేగం (ఫోటోలు)
ఉప్పల్లో హార్దిక్ హంగామా.. పోటెత్తిన అభిమానులు (ఫోటోలు)
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
వీడియోలు
ఊహించినట్టే జరిగింది.. పెళ్లిపై ఇద్దరూ క్లారిటీ
పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చేసిన స్మృతి
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
విశాఖలో క్రికెట్ ఫీవర్.. టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
వరుస సెంచరీలతో విరాట్ విధ్వంసం.. 2027 వరల్డ్ కప్ పై ఆశలు
రాయ్ పూర్ వన్డేలో భారత్ పై సౌతాఫ్రికా విజయం
సిరీస్ పై భారత్ గురి
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
