Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Pakistan Cricket Board has given an explanation to the ICC1
‘గత్యంతరం లేక’ ఆడటం లేదు! ఐసీసీకి పీసీబీ వివరణ

దుబాయ్‌: టి20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ తిరస్కరించిన వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అంత సులువుగా వదిలిపెట్టేలా లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్‌ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. భారత్‌తో మ్యాచ్‌ ఆడే అంశం తమ చేతుల్లో లేదని, తమ ప్రభుత్వ ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవచ్చని ఐసీసీ నిబంధన (ఫోర్స్‌ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది. అయితే ఐసీసీ దీనికి సరైన రీతిలో స్పందించింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలులాంటి అనూహ్య పరిణామాలు సంభవించినప్పుడే ఈ నిబంధనన వర్తిస్తుందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటంలో కానీ, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడంలో గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా స్పష్టం చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దాంతో ఇరకాటంలో పడ్డ పీసీబీ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించే అవకాశాలూ కనిపిస్తున్నాయి!

Elavenil Valarivan won two gold medals2
ఇలవేనిల్‌కు రెండు స్వర్ణాలు

న్యూఢిల్లీ: ఆసియా సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఒలింపియన్‌ ఇలవేనిల్‌ వలారివన్‌ రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో ఇలవేనిల్‌ వ్యక్తిగత విభాగంలో, టీమ్‌ విభాగంలో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్‌ 252 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మేఘన సజ్జనార్‌ 229.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని సంపాదించింది. ఇలవేనిల్, మేఘన, ఆర్యా బోర్సెలతో కూడిన భారత బృందం 1892.6 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది.

Dakshineswar wins against the world number 88 ranked player3
ప్రపంచ 88వ ర్యాంకర్‌పై దక్షిణేశ్వర్‌ విజయం

బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న డేవిస్‌ కప్‌ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నెదర్లాండ్స్‌ జట్టుతో జరుగుతున్న ఈ పోరులో మొదటి రోజు భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ ఓటమి చవిచూడగా... భారత నాలుగో ర్యాంకర్‌ దక్షిణేశ్వర్‌ సురేశ్‌ సంచలన విజయం సాధించాడు. దాంతో తొలి రోజు ముగిశాక భారత్, నెదర్లాండ్స్‌ 1–1తో సమంగా నిలిచాయి. నేడు మూడు మ్యాచ్‌లు (డబుల్స్, రెండు సింగిల్స్‌) జరుగుతాయి. ప్రపంచ 162వ ర్యాంకర్‌ గయ్‌ డెన్‌ ఉడెన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 281వ ర్యాంకర్‌ సుమిత్‌ నగాల్‌ 0–6, 6–4, 3–6తో ఓడిపోయాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. ప్రపంచ 88వ ర్యాంకర్‌ జెస్పెర్‌ డి జాంగ్‌తో జరిగిన రెండో సింగిల్స్‌లో ప్రపంచ 465వ ర్యాంకర్‌ దక్షిణేశ్వర్‌ అద్భుత ఆటతీరుతో మెరిపించాడు. 88 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో దక్షిణేశ్వర్‌ 6–4, 7–5తో జెస్పెర్‌ను బోల్తా కొట్టించాడు. దక్షిణేశ్వర్‌ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. నేడు జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో సాండెర్‌ అరెండ్స్‌–డేవిడ్‌ పెల్‌ జోడీతో యూకీ బాంబ్రీ–శ్రీరామ్‌ బాలాజీ ద్వయం ఆడుతుంది. అనంతరం రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో జెస్పెర్‌తో సుమిత్, ఉడెన్‌తో దక్షిణేశ్వర్‌ తలపడతారు.

Boxer Mohammed Hussamuddin won a bronze medal at the Boxam Elite International Boxing Tournament4
హుసాముద్దీన్‌కు కాంస్యం

లా నూసియా (స్పెయిన్‌): బాక్సమ్‌ ఎలైట్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌కు కాంస్య పతకం దక్కింది. పురుషుల 60 కేజీల వెయిట్‌ కేటగిరీలో అతను సెమీఫైనల్లో ఓడిపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, ప్రపంచకప్‌ చాంపియన్‌ సచిన్‌ సివాచ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరితో కలుపుకొని మొత్తం 12 మంది బాక్సర్లు స్వర్ణం వేటలో పడ్డారు. ఇందులో 8 మంది మహిళా బాక్సర్లున్నారు. దీంతో భారత్‌కు కనీసం 12 రజతాలు ఖాయమైనట్లే! దీనికి అదనంగా మరో స్వర్ణం కూడా కచి్చతంగా భారత్‌ ఖాతాలో పడనుంది. ఎందుకంటే మహిళల 54 కేజీల కేటగిరీలో ఆసియా క్రీడల కాంస్య విజేత ప్రీతి పవార్, పూనమ్‌ ఇద్దరు భారత బాక్సర్లే తుదిపోరుకు అర్హత సాధించారు. సెమీస్‌లో పూనమ్‌ 4–1తో ఇవి జేన్‌ స్మిత్‌ (ఇంగ్లండ్‌)పై, ప్రీతి 5–0తో అయ హమ్ది (ఫ్రాన్స్‌)పై గెలుపొందారు. మహిళల 75 కేజీల కేటగిరీ సెమీస్‌లో లవ్లీనా 5–0తో వేల్స్‌కు చెందిన రోజీ ఎక్‌లెస్‌పై ఏకపక్షమైన విజయాన్ని సాధించింది. మంజు రాణి (48 కేజీలు), నీతూ (51 కేజీలు), ప్రియా (60 కేజీలు) అరుంధతి (70 కేజీలు), నైనా (80 కేజీలు) కూడా సెమీఫైనల్లో గెలిచి పసిడి పతక రేసులో నిలిచారు. పురుషుల 60 కేజీల సెమీఫైనల్లో సచిన్‌ సివాచ్‌ 5–0తో జాక్‌ డ్రైడెన్‌ (ఇంగ్లండ్‌)పై గెలుపొందారు. సచిన్‌తో పాటు దీపక్‌ (70 కేజీలు), ఆకాశ్‌ (75 కేజీలు), అంకుశ్‌ (80 కేజీలు)లు కూడా స్వర్ణ పతక బౌట్‌కు అర్హత సంపాదించారు.

IND vs USA: Team India wins against USA in ICC T20 World Cup 20265
IND vs USA: 'సమ్‌'తృప్తికర ఆరంభం

అభిషేక్‌ శర్మ డకౌట్‌... పవర్‌ప్లే ముగిసేసరికి 46/4... ఒకదశలో వరుసగా 26 బంతుల పాటు బౌండరీనే రాలేదు... 12.4 ఓవర్లు ముగిసేసరికి 77/6... పరిస్థితి చూస్తే అమెరికా సంచలన విజయానికి పునాది వేసుకున్నట్లు అనిపించింది. కానీ సూర్యకుమార్‌ అసలు సమయంలో తన స్థాయిని ప్రదర్శించాడు. ఒంటి చేత్తో కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. మిగిలిన 44 బంతుల్లో భారత్‌ మరో 84 పరుగులు జోడిస్తే వీటిలో సూర్య ఒక్కడే 7 ఫోర్లు, 4 సిక్స్‌లు సహా 63 పరుగులు సాధించాడు. ఛేదనలో ఆరంభం నుంచే తడబడిన అమెరికా ఆతిథ్య జట్టు సవాల్‌ ముందు నిలవలేకపోయింది. భారత బౌలర్లు సిరాజ్, అర్ష్ దీప్, అక్షర్‌ పటేల్‌ సమష్టిగా రాణించడంతో లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. బలహీన జట్టుతో మ్యాచ్‌లో చివరకు గట్టెక్కినా... ఈ మ్యాచ్‌ భారత బ్యాటింగ్‌కు చిన్న హెచ్చరికను జారీ చేసింది. ముంబై: టి20 వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ శుభారంభం చేసింది. చిన్న జట్టు చేతిలో కాస్త పోటీ ఎదురైనా చివరకు పైచేయి సాధించింది. శనివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ పోరులో భారత్‌ 29 పరుగుల తేడాతో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ)పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సహచరులంతా విఫలమైనా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (49 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. అమెరికా బౌలర్లలో వాన్‌ షాక్‌విక్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. శుభమ్‌ రంజనే (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజయ్‌ కృష్ణమూర్తి (31 బంతుల్లో 37; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మిలింద్‌ కుమార్‌ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్, అక్షర్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనారోగ్యం కారణంగా భారత టాప్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ మ్యాచ్‌ బరిలోకి దిగలేదు. భారత్‌ తమ తర్వాతి పోరులో గురువారం న్యూఢిల్లీలో నమీబియాతో తలపడుతుంది. సూర్యకుమార్‌కు లైఫ్‌... హిట్టర్‌ అభిషేక్‌ శర్మ (0) తాను ఆడిన తొలి బంతికే అనూహ్యంగా ‘డకౌట్‌’ కాగా... ఇషాన్‌ కిషన్‌ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. నేత్రావల్కర్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో తిలక్‌ ధాటిని ప్రదర్శించగా, అలీఖాన్‌ ఓవర్లో ఇషాన్‌ వరుసగా 4, 6 కొట్టాడు. అయితే షాల్‌విక్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో ఒక్కసారిగా ఆట మలుపు తిరిగింది. రెండో బంతికి ఇషాన్‌ కిషన్‌ వెనుదిరగ్గా, ఓవర్లోని చివరి రెండు బంతుల్లో వరుసగా తిలక్, శివమ్‌ దూబే (0) అవుటయ్యారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 49/4 వద్ద నిలిచింది. లెగ్‌స్పిన్నర్‌ మొహసిన్‌ బౌలింగ్‌లో వరుసగా ఏడు బంతుల పాటు సింగిల్‌ కూడా తీయలేకపోయిన రింకూ సింగ్‌ (6) అసహనంతో తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్‌ కాగా, హార్దిక్‌ పాండ్యా (5) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఇలాంటి స్థితిలో సూర్యకుమార్‌ బాధ్యత తీసుకున్నాడు. 15 పరుగుల వద్ద శుభమ్‌ తన బౌలింగ్‌లోనే సూర్య ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలం కావడంతో భారత కెప్టెన్ కు లైఫ్‌ లభించింది. దీనిని అతను సమర్థంగా వాడుకుంటూ చకచకా పరుగులు రాబట్టాడు. నేత్రావల్కర్‌ ఓవర్లో సూర్య, అక్షర్‌ పటేల్‌ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు) కలిసి 3 ఫోర్లు, సిక్స్‌తో మొత్తం 21 పరుగులు రాబట్టారు. 36 బంతుల్లో సూర్య అర్ధసెంచరీ పూర్తయింది. నేత్రావల్కర్‌ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాది ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు. సిరాజ్‌కు 3 వికెట్లు.. ఛేదనలో అమెరికాకు సరైన ఆరంభం లభించలేదు. తొలి 20 బంతుల్లో 5 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ వరుస ఓవర్లలో గూస్‌ (6), సాయితేజ ముక్కామల (2)లను వెనక్కి పంపగా, మోనాంక్‌ పటేల్‌ (0) వికెట్‌ అర్ష్ దీప్ ఖాతాలో చేరింది. ఈ దశలో మిలింద్, కృష్ణమూర్తి కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 52 బంతుల్లో 58 పరుగులు జోడించారు. అయితే మిలింద్‌ను అవుట్‌ చేసి వరుణ్‌ ఈ జోడీని విడగొట్టగా... 29 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్‌ వరుస బంతుల్లో కృష్ణమూర్తి, హర్మీత్‌ సింగ్‌ (0)లను అవుట్‌ చేశాడు. దాంతో అమెరికా గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో శుభమ్‌ కొంత పోరాడినా లాభం లేకపోయింది. 2024 జూలైలో భారత్‌ తరఫున చివరి టి20 ఆడి జట్టుకు దూరమైన సిరాజ్‌... అనూహ్యంగా వరల్డ్‌ కప్‌ అవకాశం దక్కించుకొని తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లతో సత్తా చాటాడు.సొంతగడ్డపై ముగ్గురు ముంబైకర్లు... అమెరికా జట్టులో సభ్యులైన సౌరభ్‌ నేత్రావల్కర్, శుభమ్‌ రంజనే, హర్మీత్‌ సింగ్‌లకు ముంబైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ముగ్గురూ ముంబైలోనే ఓనమాలు నేర్చుకొని ఇక్కడే కెరీర్‌ను మలచుకున్నారు. ముగ్గురు కూడా జూనియర్, అండర్‌–19 క్రికెట్‌ను ముంబై తరఫునే ఆడటంతో పాటు రంజీ ట్రోఫీలో కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రంజనే చివరి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడినప్పుడు జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నాడు. తర్వాతి రోజుల్లో యూఎస్‌కు వలస వెళ్లి వీరు అక్కడి జాతీయ జట్టులో కీలక సభ్యులుగా ఎదిగారు. అయితే వాంఖెడే మైదాలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ అయినా ఆడాలనేది వీరి చిరకాల కోరిక! అది ఈ మ్యాచ్‌తో నెరవేరింది. మ్యాచ్‌లో ముగ్గురూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా... సొంతగడ్డపై వరల్డ్‌ కప్‌ ఆడిన జ్ఞాపకం వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) మిలింద్‌ (బి) షాల్‌విక్‌ 20; అభిషేక్‌ (సి) కృష్ణమూర్తి (బి) అలీ ఖాన్‌ 0; తిలక్‌ వర్మ (సి) మోనాంక్‌ (బి) షాల్‌విక్‌ 25; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 84; దూబే (సి) నేత్రావల్కర్‌ (బి) షాల్‌విక్‌ 0; రింకూ (సి) మిలింద్‌ (బి) మొహసిన్‌ 6; పాండ్యా (సి) ముక్కామల (బి) హర్మీత్‌ 5; అక్షర్‌ (సి) మొహసిన్‌ (బి) హర్మీత్‌ 14; అర్ష్ దీప్ (సి) మిలింద్‌ (బి) షాల్‌విక్‌ 4; వరుణ్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–8, 2–45, 3–46, 4–46, 5–72, 6–77, 7–118, 8–140, 9–161. బౌలింగ్‌: సౌరభ్‌ నేత్రావల్కర్‌ 4–0–65–0, అలీ ఖాన్‌ 2–0–13–1, షాల్‌విక్‌ 4–0–25–4, మొహసిన్‌ 4–0–16–1, శుభమ్‌ 2–0–16–0, హర్మీత్‌ 4–0–26–2. అమెరికా ఇన్నింగ్స్‌: గూస్‌ (సి) తిలక్‌ (బి) సిరాజ్‌ 6; సాయితేజ ముక్కామల (సి) వరుణ్‌ (బి) సిరాజ్‌ 2; మోనాంక్‌ (సి) దూబే (బి) అర్ష్ దీప్ 0; మిలింద్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ కిషన్‌ (బి) వరుణ్‌ 34; కృష్ణమూర్తి (సి) రింకూ (బి) అక్షర్‌ 37; శుభమ్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 37; హర్మీత్‌ (సి) సిరాజ్‌ (బి) అక్షర్‌ 0; మొహసిన్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్ దీప్ 8; షాల్‌విక్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–13, 4–71, 5–98, 6–98, 7–110, 8–132. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–18–2, సిరాజ్‌ 4–0–29–3, వరుణ్‌ 4–0–24–1, అక్షర్‌ 4–0–24–2, పాండ్యా 4–0–34–0.టి20 ప్రపంచకప్‌లో నేడున్యూజిలాండ్‌ X అఫ్గానిస్తాన్‌వేదిక: చెన్నై; ఉదయం 11 గంటల నుంచి ఇంగ్లండ్‌X నేపాల్‌ వేదిక: ముంబై; మధ్యాహ్నం 3 గంటల నుంచిశ్రీలంక X ఐర్లాండ్‌వేదిక: కొలంబో; రాత్రి 7 గంటల నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

T20 WC 2026: Pakistan Letter to ICC on India boycott Get Strong response6
IND vs PAK: అదెలా?.. పాకిస్తాన్‌కు ఐసీసీ ప్రశ్న

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడి.. కేవలం భారత్‌తో మాత్రమే ఆడకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. మిగతా మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు ఈ మ్యాచ్‌కే ఎందుకనే విమర్శలూ వస్తున్నాయి.బంగ్లాదేశ్‌కు మద్దతుగాఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) సైతం పీసీబీకి ఇదే ప్రశ్నను సంధించింది. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ మ్యాచ్‌ల కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిస్కరిస్తామంటూ పాక్‌ కొత్త రాగం ఎత్తుకుంది.కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా తాము కూడా లంకలోనే ఆడతామని బంగ్లా కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భద్రత పరంగా భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తమ బృందం తేల్చినందున పునరాలోచించుకోవాలని సమాధానం ఇచ్చింది.ఒకవేళ రద్దయితేకానీ బంగ్లాదేశ్‌ మొండి వైఖరి ప్రదర్శించడంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ.. పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తామని ప్రకటించింది. పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ఈ ప్రకటన చేశాడు.కాగా శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 15న భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. భారీ క్రేజ్‌ ఉన్న ఈ మ్యాచ్‌ ఒకవేళ రద్దయితే పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇతర బోర్డులు సైతం పాక్‌ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.తెలివి ప్రదర్శించిన పీసీబీఅయితే, తమపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పాక్‌ తెలివిగా.. ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ (Force Majeure Clause)ను తెరపైకి తెచ్చింది. అనూహ్య, నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఈ నిబంధన ద్వారా లభిస్తుంది.సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన వాదనను సమర్థించుకునే అవకాశం ఉంటుంది. తమ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించనందున ఈ నిబంధన తమకు వర్తింపజేయాలని పీసీబీ ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.గట్టిగానే బదులిచ్చిన ఐసీసీఅయితే, ఇందుకు ఐసీసీ గట్టిగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ప్రభుత్వ అనుమతితో టోర్నీలో కొనసాగుతున్నారు.. కానీ.. ప్రభుత్వ ఆంక్షల ప్రకారం ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తారా? ఇదెలా సాధ్యం? దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలి’’ అని పీసీబీని ఆదేశించినట్లు వార్త సంస్థ PTI వెల్లడించింది. కాగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా తొలుత టోర్నీనే బహిష్కరిస్తామన్న పాక్‌.. ఆ తర్వాత మాట మార్చి భారత్‌తో మాత్రమే ఆడమంటూ డ్రామాకు తెరలేపింది.చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్‌ బోర్డు? యూటర్న్‌?

T20 WC 2026 IND vs USA: Suryakumar Yadav 49 Ball 84 Check Ind Score 7
IND vs USA: సూర్యకుమార్‌ విధ్వంసం

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే టీమిండియా బ్యాటర్లు కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. ముంబై వేదికగా అమెరికా బౌలర్లు ఆది నుంచే చెలరేగుతూ భారత బ్యాటింగ్‌ విభాగంపై ఒత్తిడి పెంచారు. రెండో ఓవర్‌ రెండో బంతికే అలీ ఖాన్‌ అభిషేక్‌ శర్మ (0) డకౌట్‌గా వెనక్కి పంపాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి..ఆ తర్వాత వాన్‌ షాల్‌విక్‌ ఆరో ఓవర్లో రెండో బంతికి ఇషాన్‌ కిషన్‌ (20), ఐదో బంతికి తిలక్‌ వర్మ (25), ఆఖరి బంతికి శివం దూబే (0)ను అవుట్‌ చేసి.. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ఫలితంగా పవర్‌ ప్లేలో కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌మిగిలిన వారిలో రింకూ సింగ్‌ (6), హార్దిక్‌ పాండ్యా (5) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ కాసేపు అలరించి (11 బంతుల్లో 14) పెవిలియన్‌ చేరాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.A fine innings from the man in top form! 👏@surya_14kumar brings up his 25th T20I fifty, just when the team needed it the most! 💙PS. India win 88% of matches when captain SKY scores 50+ ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/GQYypRHKDJ— Star Sports (@StarSportsIndia) February 7, 2026మెరుపు అర్ధ శతకంధనాధన్‌ దంచికొట్టిన సూర్య 36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సూర్య మెరుపు అర్ధ శతకం కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.అమెరికా బౌలర్లలో వాన్‌ షాల్‌విక్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హర్మీత్‌ సింగ్‌ రెండు, అలీ ఖాన్‌, మొహమ్మద్‌ మొహ్సిన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా గ్రూప్‌-‘ఎ’లోచదవండి: అప్పటిదాకా బిగ్‌ క్రికెటర్‌ అని ఒప్పుకోను: వైభవ్‌ సూర్యవంశీ తండ్రి

T20 WC 2026 IND vs USA: Abhishek Sharma Golden Duck Fans React8
గంభీర్‌ బాటలో అభిషేక్‌ శర్మ.. ఇలా చేశావేంటి బ్రో?

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఈ పంజాబీ బ్యాటర్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఓ చెత్త రికార్డును అభిషేక్‌ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత టీ20 జట్టు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్‌ శర్మ ధనాధన్‌ బ్యాటింగ్‌తో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.గత కొన్నాళ్లుగా మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్‌.. కెరీర్‌లో తొలి ప్రపంచకప్‌ టోర్నీకి సిద్ధమయ్యాడు. ముంబైలోని వాంఖడే వేదికగా వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో అమెరికాతో తలపడునుండటంతో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అదరగొడతాడని అంతా భావించారు.అయితే, ఊహించని రీతిలో అభిషేక్‌ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. అమెరికా పేసర్‌ అలీ ఖాన్‌ బౌలింగ్‌లో సంజయ్‌ కృష్ణమూర్తికి క్యాచ్‌ ఇచ్చిన ఈ లెఫ్టాండర్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సైతం ఇలాగే అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు.ఇక అభిషేక్‌ శర్మ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుట్‌కావడంతో.. “గంభీర్‌ బాటలో నడిచిన అభిషేక్‌ శర్మ.. నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాం.. ఇలా చేశావేంటి బ్రో’’ అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండగా.. పవర్‌ ప్లేలోనే 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా.టీ20 వరల్డ్‌కప్‌ అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌ అయిన భారత ఆటగాళ్లు వీరే👉గౌతం గంభీర్‌👉ఆశిష్‌ నెహ్రా (గోల్డెన్‌ డక్‌)👉శార్దూల్‌ ఠాకూర్‌👉దీపక్‌ హుడా👉అభిషేక్‌ శర్మ (గోల్డెన్‌ డక్‌).

T20 WC 2026: Hetmyer Shines Shepherd Hattrick West Indies Beat Scotland9
T20 WC: చెలరేగిన షెఫర్డ్‌.. విండీస్‌ బోణీ

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ బోణీ కొట్టింది. పసికూన స్కాట్లాండ్‌ను చిత్తు చేసి శుభారంభం అందుకుంది. కోల్‌కతా వేదికగా గ్రూప్‌-‘సి’ నుంచి విండీస్‌- స్కాటిష్‌ జట్లు శనివారం తలపడ్డాయి.ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో బ్రాండన్‌ కింగ్‌ (35) రాణించగా.. కెప్టెన్‌ షాయీ హోప్‌ (19) ఫర్వాలేదనిపించాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.మొత్తంగా 36 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో హెట్‌మెయిర్‌ 64 పరుగులు సాధించాడు. రోవ్‌మన్‌ పావెల్‌ (14 బంతుల్లో 24), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (13 బంతుల్లో 26) ధనాధన్‌ దంచికొట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి విండీస్‌ 182 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ క్యూరీ రెండు వికెట్లు తీయగా.. సఫ్యాన్‌ షరీఫ్‌, ఒలీవర్‌ డేవిడ్‌సన్‌, మైకేల్‌ లీస్క్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్‌ ఆది నుంచే తడబడింది. టాపార్డర్‌లో జార్జ్‌ మూన్సే (19), బ్రాండన్‌ మెక్‌ముల్లన్‌ (14) నిరాశపరచగా.. మైకేల్‌ జోన్స్‌ (1) విఫలమయ్యాడు.ఇలాంటి తరుణంలో రిచీ బెరింగ్‌టన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (24 బంతుల్లో 42)తో అలరించగా.. టామ్‌ బ్రూస్‌ (28 బంతుల్లో 35) అతడికి తోడుగా నిలిచాడు. అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం అందలేదు. మాథ్యూ క్రాస్‌ (11), మార్క్‌ వాట్‌ (15) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. 18.5 ఓవర్లలోనే స్కాట్లాండ్‌ ఆలౌట్‌ అయింది. 147 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ మూడు వికెట్లు తీయగా.. షెఫర్డ్‌ హ్యాట్రిక్‌తో కలిపి ఐదు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. షమర్‌ జోసెఫ్‌, గుడకేశ్‌ మోటీ తలా ఒక వికెట్‌ తీసి తమ వంతు సాయం అందించారు.

T20 WC 2026 IND vs USA Toss Playing XIs Updates Highlights10
IND vs USA: టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తొలుత యూఎస్‌ఏతో భారత్‌ తలపడుతోంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమెరికా లక్ష్య ఛేదనకు దిగింది.T20 World Cup 2026 India vs United States of America Updatesటీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపుముంబై వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా.. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ 84 పరుగులతో చేశాడు. ఛేదనలో అమెరికా జట్టు.. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే తలో 37 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పాటు అందించారు.19 ఓవర్లకు స్కోరు 121-719 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 121-7 స్కోరుతో నిలిచింది. క్రీజులో శుభం 27, స్కాల్క్ 2 ఉన్నారు.18 ఓవర్లకు స్కోరు 111-718 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 111-7 స్కోరుతో ఉంది. క్రీజులో శుభం 18, స్కాల్క్ 1 ఉన్నారు.ఏడో వికెట్ కోల్పోయిన అమెరికాఅమెరికా ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ మోసిన్ 8 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 104-617 ఓవర్లు పూర్తయ్యేసరికి అమెరికా.. 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. శుభం 17, మోసిన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.16 ఓవర్లకు స్కోరు 100-6 16 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. శుభం 15, మోసిన్ 1 క్రీజులో ఉన్నారుఆరో వికెట్ కోల్పోయిన అమెరికా15.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హర్మీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. సిరాజ్ క్యాచ్ పట్టాడు.ఐదో వికెట్ కోల్పోయిన యూఎస్ఏ15.2: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సంజయ్ 37 పరుగుల దగ్గర క్యాచ్ ఔట్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన అమెరికా15 ఓవర్లకు స్కోరు 98-4సంజయ్ 37, శుభం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు13 ఓవర్లలో అమెరికా స్కోరు: 78-4సంజయ్‌ 26, శుభం 5 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్‌ డౌన్‌11.6: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌ (34) స్టంపౌట్‌. నాలుగో వికెట్‌ కోల్పోయిన అమెరికా. స్కోరు: 71-4. విజయానికి 48 బంతులో​ 91 పరుగులు కావాలి.పది ఓవర్లలో అమెరికా స్కోరు: 49-3పవర్‌ ప్లేలో అమెరికా స్కోరు: 31-3(6).మిలింద్‌ 16, సంజయ్‌ 4 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్‌ కోల్పోయిన అమెరికా3.2: సిరాజ్‌ బౌలింగ్‌లో సాయితేజ ముక్కామల (2) వరుణ్‌ చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చాడు. మిలింద్‌ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 13-3(3.2)రెండో వికెట్‌ కోల్పోయిన అమెరికా2.1: అర్ష్‌దీప్‌ బౌలింగ్లో అమెరికా కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ (0) శివం దూబేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 11-2(2.1). సాయితేజ ముక్కామల రెండు పరుగులతో ఉండగా.. మిలింద్ కుమార్‌ క్రీజులోకి వచ్చాడు.వికెట్‌ తీసిన సిరాజ్‌1.4: అనూహ్యంగా వరల్డ్‌కప్‌ జట్టులోకి.. తుదిజట్టులోకి వచ్చిన సిరాజ్‌ టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు. తొలి ఓవర్‌ నాలుగో బంతికే వికెట్‌ పడగొట్టాడు. సిరాజ్‌ బౌలింగ్లో తిలక్‌కు క్యాచ్‌ ఇచ్చి అమెరికా ఓపెనర్‌ ఆండ్రీ గౌస్‌ (6) వెనుదిరిగాడు.టీమిండియా స్కోరు: 161-9(20)తొమ్మిదో వికెట్‌ డౌన్‌19.6: వరుణ్‌ చక్రవర్తి (0) రనౌట్‌.. తొమ్మిదో వికెట్‌ డౌన్‌అర్ష్‌దీప్‌ అవుట్‌18.6: షాల్‌విక్‌ బౌలింగ్‌లో... ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన అర్ష్‌దీప్‌ సింగ్‌ (4) సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్‌ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌16.4: హర్మీత్‌ బౌలింగ్‌లో మొహ్సిన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన అక్షర్‌ పటేల్‌ (14). క్రీజులోకి అర్ష్‌దీప్‌ సింగ్‌. సూర్య 47 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 118-7(16.4)అక్షర్‌, సూర్య ధనాధన్‌15: నేత్రావల్కర్‌ బౌలింగ్లో అక్షర్‌ 4,4 బాదగా.. సూర్య 4, 6 బాదాడు. ఒకే ఓవరల్లో 21 పరుగులు. స్కోరు: 115-6 (16).ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌12.4: హర్మీత్‌ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన హార్దిక్‌ పాండ్యా (5). క్రీజులోకి అక్షర్‌ పటేల్‌. స్కోరు: 85-6(13.5).ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌11.4: మొహ్సిన్‌ బౌలింగ్‌లో మిలింద్‌కు క్యాచ్‌ ఇచ్చి రింకూ సింగ్‌ అవుట్‌ (6). సూర్య 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 72-5(11.4) పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 63-4 శివం దూబే డకౌట్‌5.6: వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌లో నేత్రావల్కర్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయిన శివం దూబే. పవర్‌ప్లేలో టీమిండియా స్కోరు: 46-4(6)తిలక్‌ వర్మ అవుట్‌5.5: మూడో వికెట్‌గా వెనుదిరిగిన తిలక్‌ వర్మ (16 బంతుల్లో 25; మూడు ఫోర్లు, ఒక సిక్స్‌). వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌ మోనాంక్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన తిలక్‌. శివం దూబే క్రీజులోకి రాగా.. సూర్య 1 పరుగుతో ఉన్నాడు. స్కోరు: 46-3(5.5)రెండో వికెట్‌ డౌన్‌5.2: వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన ఇషాన్‌ కిషన్‌ (16 బంతుల్లో 20; 1 ఫోర్‌, రెండు సిక్స్‌లు). క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌. తిలక్‌ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45-2(5.2).నాలుగు ఓవర్లలో టీమిండియా స్కోరు: 33-1తిలక్‌ 13 బంతుల్లో 23, ఇషాన్‌ 10 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌1.2: అలీ ఖాన్‌ బౌలింగ్‌లో సంజయ్‌ కృష్ణమూర్తికి క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్‌ శర్మ. ISHAN-DAAR SHURUAAT! 🔥He gets the scoreboard ticking with a maximum, and the crowd erupts at the Wankhede 😍ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/zmtTfy2q4Q— Star Sports (@StarSportsIndia) February 7, 2026తొలి ఓవర్లో ఏడు పరుగులుకట్టుదిట్టంగా నేత్రావల్కర్‌ బౌలింగ్‌... ఇషాన్‌ 7, అభిషేక్‌ 0 పరుగులతో ఉన్నారు. సంజూపై వేటుఇక ఊహించినట్లుగానే తుదిజట్టులో ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కగా.. సంజూ శాంసన్‌ (Sanju Samson)పై వేటు పడింది. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్‌ (Ishan Kishan) భర్తీ చేశాడు. కాగా గత కొంతకాలంగా సంజూ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే.సిరాజ్‌కు లక్కీ ఛాన్స్‌అదే విధంగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. ఇక పేస్‌ దళ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి స్థానంలో మొహమ్మద్‌ సిరాజ్‌ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.కాగా హర్షిత్‌ రాణా గాయపడటంతో సిరాజ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రాణా స్థానంలో ఈ హైదరాబాదీ పేసర్‌ను తీసుకున్నట్లు శుక్రవారం బీసీసీఐ ప్రకటించగా.. బుమ్రా అనారోగ్యం వల్ల ఏకంగా తుదిజట్టులోనూ సిరాజ్‌కు స్థానం దక్కడం విశేషం.మరోవైపు.. యూఎస్‌ఏ కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ మాట్లాడుతూ.. పిచ్‌ బాగుందని.. ఇక్కడ భారీ స్కోరు నమోదుకు ఆస్కారం ఉందని పేర్కొన్నాడు. తమ తుదిజట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు బౌలర్లు ఉన్నట్లు తెలిపాడు.టీ20 ప్రపంచకప్‌-2026: భారత్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ తుదిజట్లుభారత్‌ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్‌ సిరాజ్, వరుణ్ చక్రవర్తియూఎస్‌ఏఆండ్రీస్ గౌస్(వికెట్‌ కీపర్‌), సాయితేజ ముక్కామల, మోనాంక్ పటేల్(కెప్టెన్‌), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్‌విక్‌, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement