Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Carlos Alcaraz and Aryna Sabalenka led the winners at the Laureus Awards 20261
బెస్ట్‌ అల్‌కరాజ్, సబలెంకా

మాడ్రిడ్‌: క్రీడా ప్రపంచంలో అస్కార్‌ అవార్డులుగా భావించే లారియస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ కార్యక్రమం జరిగింది. 2025 సంవత్సరానికి గాను పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌... మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా బెలారూస్‌ టెన్నిస్‌ స్టార్‌ సబలెంకా పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరం నుంచి లారియస్‌ అవార్డులు ప్రతియేటా ఇస్తున్నారు. గత ఏడాది అల్‌కరాజ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తోపాటు మరో ఆరు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన ఈ స్పెయిన్‌ స్టార్, వింబుల్డన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా 71 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 2026 సీజన్‌ను కూడా అల్‌కరాజ్‌ ఘనంగా ప్రారంభించాడు. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో తొలిసారి టైటిల్‌ గెలిచి టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సొంతం చేసుకొని ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనత సాధించాడు. గతవారం బార్సిలోనా ఓపెన్‌ టోర్నీలో మణికట్టు గాయానికి గురైన అల్‌కరాజ్‌ మాడ్రిడ్‌ మాస్టర్స్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటేనే ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోకి దిగుతానని 22 ఏళ్ల అల్‌కరాజ్‌ వ్యాఖ్యానించాడు. రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) తర్వాత ‘లారియస్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు గెల్చుకున్న నాలుగో టెన్నిస్‌ ప్లేయర్‌గా అల్‌కరాజ్‌ గుర్తింపు పొందాడు. మరోవైపు మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్‌ సబలెంకా కూడా గతేడాది నిలకడగా రాణించింది. యూఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ నెగ్గిన సబలెంకా ఆ్రస్టేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్నీలోనూ రన్నరప్‌ ట్రోఫీ అందుకుంది. ఓవరాల్‌గా సీజన్‌లో నాలుగు టైటిల్స్‌ సొంతం చేసుకున్న ఆమె 63 మ్యాచ్‌ల్లో గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ‘వరల్డ్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ఫ్రాన్స్‌కు చెందిన ఫుట్‌బాల్‌ క్లబ్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ) గెల్చుకుంది. గత ఏడాది పీఎస్‌జీ జట్టు తొలిసారి ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ను సాధించింది. ‘టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు విభాగంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు కూడా నామినేట్‌ అయింది. గత ఏడాది హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను సాధించింది. అయితే తుదకు ఈ అవార్డు పీఎస్‌జీ జట్టుకు లభించింది. రొమేనియా దిగ్గజ జిమ్నాస్ట్‌ నాడియా కొమనెసికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. 64 ఏళ్ల నాడియా ఒలింపిక్స్‌ క్రీడల్లో 10కి 10 పాయింట్లు స్కోరు చేసిన తొలి జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పింది. 1976 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో ఆల్‌ అరౌండ్, అన్‌ఈవెన్‌ బార్స్, బ్యాలెన్స్‌ బీమ్‌ ఈవెంట్లలో నాడియా ‘పర్‌ఫెక్ట్‌ 10’ స్కోరుతో స్వర్ణ పతకాలు సాధించింది. అంతర్జాతీయ కెరీర్‌లో నాడియా మొత్తం తొమ్మిది ఒలింపిక్‌ పతకాలు, నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలు, మూడు వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పతకాలు గెలుచుకుంది. లారియస్‌ అవార్డు విజేతల జాబితావరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్, టెన్నిస్‌) వరల్డ్‌ స్పోర్ట్స్‌ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: సబలెంకా (బెలారూస్, టెన్నిస్‌) వరల్డ్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (ఫ్రాన్స్, ఫుట్‌బాల్‌) వరల్డ్‌ బ్రేక్‌థ్రూ ఆఫ్‌ ద ఇయర్‌: లాండో నోరిస్‌ (బ్రిటన్, ఫార్ములావన్‌) వరల్డ్‌ కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌: రోరీ మెకిల్రాయ్‌ (నార్తర్న్‌ ఐర్లాండ్, గోల్ఫ్‌) వరల్డ్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (దివ్యాంగులు): గాబ్రియెల్‌ అరుజో సాంతోస్‌ (బ్రెజిల్, స్విమ్మింగ్‌) వరల్డ్‌ యాక్షన్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: చోల్‌ కిమ్‌ (అమెరికా, స్నో బోర్డ్‌) వరల్డ్‌ యంగ్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: లామినె యామల్‌ (స్పెయిన్, ఫుట్‌బాల్‌) స్పోర్టింగ్‌ ఇన్‌స్పిరేషన్‌ అవార్డు: టోనీ క్రూస్‌ (జర్మనీ, ఫుట్‌బాల్‌) లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు: నాడియా కొమనెసి (రొమేనియా, జిమ్నాస్టిక్స్‌) స్పోర్ట్‌ ఫర్‌ గుడ్‌ అవార్డు: ఫుట్‌బాల్‌ మాస్‌

Tilak Varma on his batting in gujarat titans match2
‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ జట్టులో చాలా మంది ప్రపంచకప్‌ విజేతలు ఉన్నారని... వారు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే తమ జట్టును ఆపడం ఎవరి వల్లా కాదని మిడిలార్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అన్నాడు. ఐపీఎల్‌లో భాగంగా సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జయభేరి మోగించడంలో తిలక్‌ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ హైదరాబాదీ లెఫ్ట్‌ హ్యాండర్‌... ఆ తర్వాత భారీ షాట్‌లతో రెచ్చిపోయి అజేయ సెంచరీతో ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత బౌలర్లు సమష్టి కృషితో సత్తాచాటడంతో గుజరాత్‌పై ముంబై ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం తిలక్‌ మాట్లాడుతూ... ‘ఈ ప్రదర్శన నాకు, జట్టుకు ఎంతో ముఖ్యమైంది. గత నాలుగైదు మ్యాచ్‌ల్లో ఏదీ కలిసిరాలేదు. ఎక్కువ సమయం క్రీజులో గడిపేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో గుజరాత్‌తో మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని అనుకున్నా... అది ఫలితాన్నిచ్చింది’ అని అన్నాడు. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన ముంబై ఇండియన్స్‌... తిలక్‌ మెరుపులతో తిరిగి గెలుపు బాట పట్టింది. తిలక్‌ వర్మకు ఐపీఎల్‌లో ఇదే తొలి శతకం కాగా... ఈ జోరు సీజన్‌ మొత్తం కొనసాగించాలనుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ‘అహ్మదాబాద్‌ వేదికగా ముంబై మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా... ఇలాంటి పిచ్‌పైనే సాగుతుంది. ఇతర పిచ్‌లతో పోల్చుకుంటే అది కాస్త నెమ్మదిగా ఉంది. బంతి తక్కువ ఎత్తులో వస్తుండటంతో స్ట్రెయిట్‌గా ఆడాలని నిర్ణయించుకున్నా. దీంతో సులువుగా పరుగులు రాబట్టగలిగా. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయడాన్ని ఇష్టపడతా. కానీ జట్టుకు అవసరమైనప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చిన్నప్పటి నుంచి దీని కోసం ఎంతో సాధన చేశా. ఎక్కువ ఆలోచించడం లేదు. చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అందుకోవడమే మా పని. ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం. మా సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. జట్టులో చాలా మంది ప్రపంచకప్‌ గెలిచిన ప్లేయర్లు ఉన్నారు. అనుభవం, నైపుణ్యానికి కొదవలేదు. మేమంతా కలిసికట్టుగా రాణిస్తే... ముంబై ఇండియన్స్‌ను ఆపడం ఎవరి తరం కాదు. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో హార్దిక్‌ పాండ్యా ఉత్సాహపరిచాడు. ‘నువ్వు చేయగలవు’ అని పదే పదే చెప్తూ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఆ సమయంలో ‘ప్రశాంతంగా ఉండు... మిగిలిందంతా నేను చూసుకుంటా’ అని చెప్పాను. మొత్తానికి ఈ విజయం జట్టులో జోష్‌ నింపింది’ అని తిలక్‌ వివరించాడు.

Shafali ranked sixth in ICC Womens T20 rankings3
ఆరో స్థానంలో షఫాలీ

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనలో ఆకట్టు కుంటున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ... అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ముందంజ వేసింది. సఫారీ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్న షఫాలీ వర్మ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి... ఆరో ర్యాంక్‌కు చేరింది. డర్బన్‌ వేదికగా జరిగిన రెండో టి20లో షఫాలీ 38 బంతుల్లోనే 57 పరుగులు చేసింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో షఫాలీ 34 పరుగులతో మెరిసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. ఈ ప్రదర్శనతో తాజా ర్యాంకింగ్స్‌లో షఫాలీ 731 పాయింట్లతో ఆరో ‘ప్లేస్‌’కు చేరింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (762 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పరిమితమైంది. టాప్‌–10 ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ఈ ఇద్దరే చోటు దక్కించుకున్నారు. ఆ్రస్టేలియా ప్లేయర్‌ జార్జియా వాల్‌ (815 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... బెత్‌ మూనీ (788 పాయింట్లు; ఆ్రస్టేలియా), హేలీ మాథ్యూస్‌ (767 పాయింట్లు; వెస్టిండీస్‌) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (639 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 11వ ర్యాంక్‌కు చేరగా... జెమీమా రోడ్రిగ్స్‌ (637 పాయింట్లు) నాలుగు ర్యాంక్‌లు కోల్పోయి 14వ స్థానంలో ఉంది. బౌలర్ల విభాగంలో దీప్తి శర్మ (705 పాయింట్లు) రెండు స్థానాలు కోల్పోయి ఐదో ర్యాంక్‌కు చేరగా... రేణుక సింగ్‌ (699 పాయింట్లు) నాలుగు స్థానాలు చేజార్చుకొని 9వ ర్యాంక్‌లో నిలిచింది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది.

Indian shooter Shiv Narwal wins gold medal4
శివ నర్వాల్‌ పసిడి గురి

కైరో: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నీలో తొలి రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ శివ నర్వాల్‌ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చిరాగ్‌ శర్మ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో శివ నర్వాల్‌ 241.8 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. 240 పాయింట్లతో సోదిక్‌జోన్‌ అబ్దుల్లాయెవ్‌ రజత పతకం... 218.9 పాయింట్లతో చిరాగ్‌ శర్మ కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో పోటీపడ్డ భారత మూడో షూటర్‌ అభినవ్‌ దేశ్వాల్‌ 136.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. జూనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ పనాహ్‌ బుగ్రా రజత పతకం సంపాదించింది. ఫైనల్లో పనాహ్‌ 250.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది.

Punjab CM Bhagwant Mann meets former Netherlands player5
పంజాబ్‌ క్రీడాకారులకు హాకీ దిగ్గజం బోవెలాండర్‌ పాఠాలు!

చండీగఢ్‌: నెదర్లాండ్స్‌ హాకీ దిగ్గజం ఫ్లోరిస్‌ జాన్‌ బోవెలాండర్‌తో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ భేటీ అయ్యారు. ప్రతిష్టాత్మక ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు రాష్ట్రంలో హాకీని మరింత బలోపేతం చేయడానికి బోవెలాండర్‌ సేవలను వినియోగించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌ పర్యటనలో ఉన్న భగవంత్‌ మాన్‌... ఇందులో భాగంగా హాకీపై బోవెలాండర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. హాకీకి పునరై్వభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా బోవెలాండర్‌ అసాధారణ ప్రతిభను మాన్‌ ప్రశంసించారు. ఆయన క్రీడా ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి పంజాబ్‌ ఆతిథ్యమివ్వనుంది. ప్లేయర్ల నైపుణ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు పంజాబ్‌కు రావాల్సిందిగా బోవెలాండర్‌ను భగవంత్‌ మాన్‌ ఆహ్వానించారు. దీనికి డచ్‌ దిగ్గజం సుముఖత వ్యక్తం చేశాడు. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు బోవెలాండర్‌ భారత్‌కు రానున్నట్లు మాన్‌ వెల్లడించారు. ‘క్రీడా ప్రతిభను పెంపొందించడానికి, హాకీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పంజాబ్‌ కట్టుబడి ఉంది. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి తొలిసారి పంజాబ్‌ ఆతిథ్యమివ్వనుంది. భారత హాకీలో ఎప్పటి నుంచో పంజాబ్‌ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. 50 మందికి పైగా పంజాబ్‌ ప్లేయర్లు హాకీలో ఒలింపిక్‌ పతకాలు సాధించారు. పది మందికిపైగా పంజాబ్‌ ప్లేయర్లు విశ్వక్రీడల్లో దేశానికి నాయకత్వం వహించారు. పంజాబీ ప్లేయర్‌ లేకుండా భారత హాకీ జట్టును ఊహించడం కష్టం. పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులోనూ పది మంది పంజాబీ ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఘనచరిత్ర ఉన్న ప్లేయర్లకు దిశానిర్దేశం చేసేందుకు నెదర్లాండ్స్‌ హాకీ దిగ్గజం బోవెలాండర్‌ అంగీకరించారు. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఆయన మన ప్లేయర్లలో స్ఫూర్తినింపనున్నారు’ అని భగవంత్‌ మాన్‌ వెల్లడించారు.

Sony Network wins Asian Games broadcasting rights6
ఆసియా క్రీడల ప్రసార హక్కులు సోనీ నెట్‌వర్క్‌కు

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌ వేదికగా జరగనున్న 20వ ఆసియా క్రీడల ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ కైవసం చేసుకుంది. దీంతో ఏషియన్‌ గేమ్స్‌ను సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ చానల్స్‌తో పాటు సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. చైనా వేదికగా జరిగిన గత ఆసియా క్రీడల్లో భారత్‌ 107 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ‘ఆసియా క్రీడా మహోత్సవ ప్రసార హక్కులు దక్కించుకోవడం గర్వంగా ఉంది. సోనీ టీవీకి ఈ అవకాశం రావడం ఇది మూడోసారి’ అని సోనీ నెట్‌వర్క్‌ ప్రతినిధి రాజేశ్‌ కౌల్‌ అన్నారు. జపాన్‌ వేదికగా జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌లో మొత్తం 41 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో 32 ఒలింపిక్‌ క్రీడలు ఉన్నాయి. వీటితో పాటు మిక్స్‌డ్‌ మార్షల్, సర్ఫింగ్‌ వంటి కొత్త క్రీడలను సైతం ఇందులో చేర్చారు. ఈ క్రీడల్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, కబడ్డీ, సెపక్‌తక్రా, కురాశ్‌ వంటి పలు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ‘గత ఆసియా క్రీడల్లో భారత్‌ అద్భుత ప్రదర్శన కనబర్చంది. తొలిసారి వంద పతకాల మైలురాయిని దాటింది. ఇది దేశంలో పెరుగుతున్న క్రీడా సంస్కృతికి నిదర్శనం. ఈసారి అంతకుమించిన ప్రదర్శనతో రికార్డులు తిరగరాయడం ఖాయమే. అలాంటి స్ఫూర్తిదాయక క్షణాలను ప్రసారం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని రాజేశ్‌ వెల్లడించారు.

India vs South Africa Womens third T20 match today7
సమర్పిస్తారా... సత్తా చాటుతారా!

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత మహిళల క్రికెట్‌ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు... బుధవారం మూడో మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 0–2తో వెనుకబడి ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ కోల్పోతుంది. ఈ నేపథ్యంలో జట్టు మొత్తం కలిసికట్టుగా కదంతొక్కాలని భావిస్తోంది.టి20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఫర్వాలేదనిపిస్తుండగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన వైఫల్యం జట్టును ఇబ్బంది పెడుతోంది. సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో ఉన్న తరుణంలో స్మృతి, జెమీమా, షఫాలీ, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. ‘ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను పరిశీలిస్తే ఆరంభంలో మా బ్యాటింగ్‌ బాగానే సాగింది. కానీ చివర్లో వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సారి ఆ తప్పిదాలను అధిగమిస్తాం. దీప్తికి అపార అనుభవం ఉంది. ఒకటీ రెండు మ్యాచ్‌ల్లో ప్రదర్శన బాగాలేనంత మాత్రానే ఆమె ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు అన్నీ విధాలుగా సిద్ధమవుతాం’ అని టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ అవిష్కార్‌ సాల్వీ అన్నాడు. మరోవైపు వరుస విజయాలతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా ఇక్కడే సిరీస్‌ చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.

Sridhar Babu elected as president of Telangana Badminton Association8
తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్‌ బాబు

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నాలుగేళ్ల కాలానికి తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం (బీఏటీ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా వి.చాముండేశ్వరనాథ్, వై.ఉపేందర్‌ రావు, జి.వెంకట రావు, పి.రమేశ్‌ రెడ్డి, ఉప్పాల శ్రీనివాస్‌ గుప్తా ఎన్నికయ్యారు. జనరల్‌ సెక్రటరీగా భారత జట్టు హెడ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, కోశాధికారిగా కానూరి వంశీధర్‌ నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎల్‌.రవికుమార్, పి.మనోజ్‌ కుమార్, ఎం.జితేందర్‌ రెడ్డి, యు.వి.ఎన్‌.బాబు వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా పి.రాంమోహన్‌ రావు, తోట రంగారావు, కె.శ్రీనివాస రావు, పుల్లూరి సుధాకర్, కొల్లి నాగవేణి ఎన్నికయ్యారు. సలహాదారుడిగా లక్ష్మణ్‌ కొసరాజు వ్యవహరిస్తారు.

SRH Beat Delhi Capitals By 47 Runs Hat-trick Win In Home Ground9
అభిషేక్ విధ్వంసం.. ఎస్ఆర్‌హెచ్ హ్యాట్రిక్ విజ‌యం

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిల‌వ‌గా.. స‌మీర్ రిజ్వీ 41 ప‌రుగులు సాధించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (68 బంతుల్లో 135 నాటౌట్‌) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించ‌డంతో ఎస్ఆర్‌హెచ్ ఈ సీజ‌న్‌లో తొలిసారి 240 ప‌రుగుల ప్ల‌స్ మార్కును దాటింది. చివ‌ర్లో క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. హెడ్ 37, ఇషాన్ కిష‌న్ 25 ప‌రుగులు చేశారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచ‌రీతో ఢిల్లీ ప‌ని ప‌ట్టిన అభిషేక్ శర్మ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.242లో స‌గం స్కోరు అభిషేక్‌దే..టాస్ గెలిచి ఎస్ఆర్‌హెచ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించ‌డంతోనే ఢిల్లీ క్యాపిట‌ల్స్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆరంభం నుంచే ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ శ‌ర్మ‌, హెడ్‌లు పోటీప‌డి బౌండరీలు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు. ఆ త‌ర్వాత జ‌ట్టు స్కోరు 97 ప‌రుగుల వ‌ద్ద హెడ్ వెనుదిర‌గ‌డంతో ఎస్ఆర్‌హెచ్‌ తొలి వికెట్ కోల్పోయింది. మ‌రో ఎండ్‌లో మాత్రం అభిషేక్ శ‌ర్మ త‌న విధ్వంసాన్ని కొన‌సాగించాడు. గ‌త రెండు మ్యాచ్‌ల్లో అర్థ‌శ‌త‌కాలు సాధించిన‌ప్ప‌టికీ వాటిని సెంచ‌రీలుగా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచే ధాటిగా ఆడిన అభిషేక్ ఢిల్లీ బౌల‌ర్ల‌ను చీల్చి చెండాడి సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. చివ‌రి వ‌ర‌కు నిలిచిన అభిషేక్ క్లాసెన్‌, ఇషాన్‌ల‌తో క‌లిసి మంచి భాగ‌స్వామ్యాలు న‌మోదు చేశాడు. అయితే జ‌ట్టు సాధించిన 242 ప‌రుగుల్లో అభిషేక్ ఒక్క‌డివే 135 ప‌రుగులు ఉండ‌డం గ‌మ‌నార్హం. అత‌డి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్స‌ర్లు ఉండ‌డం విశేషం.త‌డ‌బ‌డిన ఢిల్లీ..భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన‌ప్ప‌టికీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికీ కేఎల్ రాహుల్ (37), నితీశ్ రానా (57) రెండో వికెట్‌కు 86 ప‌రుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. అయితే స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఈ ఇద్ద‌రు వెనుదిర‌గ‌డం ఢిల్లీని క‌ష్టాల్లోకి నెట్టేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన మిల్ల‌ర్ గోల్డెన్ డ‌కౌట్ కావ‌డంతో మ‌రింత క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో స‌మీర్ రిజ్వీ, స్ట‌బ్స్ (27) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయ‌డంతో ఢిల్లీకి ఓట‌మి త‌ప్ప‌లేదు. సీజ‌న్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు ఇది నాలుగో విజ‌యం కాగా, సొంత‌గడ్డ‌పై మాత్రం హ్యాట్రిక్ విక్ట‌రీ. ఈ గెలుపుతో ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. మ‌రోవైపు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో ప‌రాజ‌యం. దీంతో ఆ జ‌ట్టు ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది.Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026

Abhishek Sharma Creates History Becomes 1t Indian After Virat Kohli To10
IPL 2026: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సెంచరీతో మెరిశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 47 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న టీ20 సెంచరీల రికార్డును సమం చేశాడు. కోహ్లి తర్వాత పొట్టి క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.అభిషేక్‌ ధనాధన్‌..కాగా ఐపీఎల్‌-2026లో భాగంగా సొంతమైదానం ఉప్పల్‌లో టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆది నుంచి అభిషేక్‌ శర్మ తనదైన శైలిలో చెలరేగాడు. 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి శతక మార్కు అందుకున్నాడు.కాగా ఐపీఎల్‌లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్లో తొమ్మిదవ సెంచరీ. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్‌ తరఫున ఐదు శతకాలు బాదిన అభిషేక్‌.. టీమిండియా తరఫునా రెండుసార్లు శతక్కొట్టాడు.క్లాసెన్‌ ఫటాఫట్‌ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు హెన్రిచ్‌ క్లాసెన్‌ 13 బంతుల్లో 37 పరుగులతో దుమ్ములేపాడు.Incredible knock, iconic celebration 🙌An Abhishek Sharma special lights up Hyderabad 💯Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers | @OfficialAbhi04 pic.twitter.com/QUWtkWuX0D— IndianPremierLeague (@IPL) April 21, 2026టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీల వీరులు🏏క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)- 22 సెంచరీలు🏏బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)- 12 సెంచరీలు🏏డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)- 10 సెంచరీలు🏏క్వింటన్‌ డికాక్‌ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు🏏విరాట్‌ కోహ్లి (ఇండియా)- 9 సెంచరీలు🏏రిలీ రొసోవ్‌ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు🏏సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (పాకిస్తాన్‌)- 9 సెంచరీలు🏏అభిషేక్‌ శర్మ (ఇండియా)-9 సెంచరీలు.చదవండి: తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement