Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Pratika Rawal in India’s women Test squad to face Australia1
ప్రతీకకు టెస్టు పిలుపు

న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలైన ప్రతీక రావల్‌... తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకుంది. ప్రతీకతో పాటు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వైష్ణవి శర్మ, మీడియం పేసర్‌ క్రాంతి గౌడ్‌ కూడా మొదటిసారి భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. మార్చి 6 నుంచి పెర్త్‌ వేదికగా ఆ్రస్టేలియాతో జరగనున్న ఏకైక టెస్టు కోసం సెలెక్షన్‌ కమిటీ శనివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు ఈ పర్యటనలో భాగంగా ఆసీస్‌తో 3 టి20లు, 3 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. పరిమిత ఓవర్ల కోసం ఇప్పటికే జట్లను ప్రకటించగా... తాజాగా టెస్టు జట్టును ఎంపిక చేశారు. వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు ముందు గాయంతో జట్టుకు దూరమైన ప్రతీక ఇప్పుడు పూర్తి స్థాయిలో కోలుకుంది. ఇక అండర్‌–19 ప్రపంచకప్‌ మెరుపులతో భారత టి20 జట్టులోకి వచి్చన వైష్ణవి ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌లో చోటు దక్కించుకుంది. ఇక వన్డే, టి20 సిరీస్‌లకు ఎంపికైన వికెట్‌ కీపర్‌ కమలిని గాయపడటంతో ఆమె స్థానంలో ఉమఛెత్రీకి అవకాశం దక్కింది. భారత మహిళల టెస్టు జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెపె్టన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జ్యోత్‌ కౌర్, రిచా ఘోష్, ఉమా ఛెత్రీ, ప్రతీక రావల్, హర్లీన్‌ డియోల్, దీప్తి శర్మ, రేణుక ఠాకూర్, స్నేహ్‌ రాణా, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, సయాలి సత్‌గరే. ఆ్రస్టేలియాతో ఏకైక టెస్టుకు భారత మహిళల జట్టు ప్రకటన

India vs New Zealand T20I: Phase-2 Ticket Sales to Begin in Visakhapatnam2
నేడూ టీ–20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం

విశాఖ స్పోర్ట్స్‌: వైజాగ్‌ వేదికగా జరగనున్న భారత్‌–న్యూజిలాండ్‌ టీ–20 మ్యాచ్‌కు సంబంధించి రెండో దశ టికెట్లను ఆదివారం సాయంత్రం 5 గంటలకు విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. కనిష్టంగా రూ.1,200 నుంచి గరిష్టంగా రూ.15,000 వరకు వివిధ డినామినేషన్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోని మొత్తం 18 స్టాండ్‌లతో పాటు కార్పొరేట్‌ బాక్స్‌ టికెట్లను కూడా ఈ విడతలో విక్రయించనున్నారు. స్టేడియం మొత్తం సామర్థ్యం 27,251 కాగా, ఇప్పటికే ఈ నెల 23న జరిగిన తొలి దశ విక్రయాల్లో చాలా వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. కాగా.. టీ–20 సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్‌ ఆడేందుకు భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఈ నెల 26న విశాఖ చేరుకోనున్నాయి. 27న ఇరు జట్లు వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయనుండగా, 28వ తేదీ రాత్రి 7 గంటలకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Pakistan to skip T20 World Cup 2026 after Bangladeshs removal? 3
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి పాకిస్తాన్ కూడా ఔట్‌?

అంతా ఊహించిందే జ‌రిగింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విష‌యాన్ని ఐసీసీ అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్ర‌కారం స్కాట్లాండ్‌కు అవ‌కాశం ల‌భించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాట‌లోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను బహిష్కరించే అవకాశం ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చాడు. త‌మ‌ ప్ర‌ధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడిన త‌ర్వాత టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై పీసీబీ నిర్ణయం తీసుకుంటుందని నఖ్వీ తెలిపాడు. బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని నఖ్వీ ఆరోపించాడు.కాగా భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్‌ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్‌గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్‌లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది."బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్‌గా ఉండలేము.పాకిస్తాన్‌ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్‌ కప్‌లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.

India plays its third T20 against New Zealand today4
సిరీస్‌పై గురి...

గువాహటి: సొంతగడ్డపై టి20 ప్రపంచకప్‌నకు ముందు ఆడుతున్న చివరి దైపాక్షిక సిరీస్‌లో టీమిండియా జోరు కనబరుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడిన రెండు టి20ల్లోనూ గెలిచిన సూర్యకుమార్‌ సారథ్యంలోని భారత జట్టు నేడు న్యూజిలాండ్‌తో మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. గత రెండు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... అదే జోష్‌లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఇక్కడే సిరీస్‌ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మరో వైపు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ జట్టు... టి20ల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతోంది. ముఖ్యంగా టీమిండియా హిట్టర్లను కట్టడి చేయడంలో కివీస్‌ బౌలర్లు విఫలమవుతున్నారు. మరి సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. పిచ్‌ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరించనుండగా... మంచు ప్రభావం ఉండనుంది. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపనుంది. సంజూ రాణించేనా..! ఐసీసీ టి20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండగా... బ్యాటింగ్‌ ఆర్డర్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. మెగాటోర్నీలో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడనుకుంటున్న సంజూ సామ్సన్‌ గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశ పరిచాడు. అదే సమయంలో రెండో టి20ల్లో ఇషాన్‌ కిషన్‌ చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా సంజూ స్థాయికి తగ్గ ప్రద్రర్శన చేస్తాడా చూడాలి. ముఖ్యంగా సామ్సన్‌ పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. దాన్ని అధిగమించకపోతే... మెగా టోర్నీలో తిలక్‌ వర్మ వస్తే సామ్సన్‌ స్థానాన్ని ఇషాన్‌ భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అభిషేక్‌ గత మ్యాచ్‌లో ‘గోల్డెన్‌ డకౌట్‌’ అయినా... అతడి దూకుడుపై ఎవరికీ సందేహాలు లేవు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేసుకునే అభిõÙక్‌ నుంచి అభిమానులు అలాంటి సుడిగాలి ఇన్నింగ్స్‌లే ఆశిస్తున్నారు. ఇక సుదీర్ఘ కాలం తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వరల్డ్‌కప్‌నకు ముందు ఇది జట్టుకు శుభపరిణామం కాగా... మిడిలార్డర్‌లో శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌ రూపంలో ధాటిగా ఆడగల సమర్థులు ఉన్నారు. వీరంతా కలిసికట్టుగా కదం తొక్కితే... మూడో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు ఖాయమే. బౌలింగ్‌లో అర్ష్ దీప్, హర్షిత్‌ రాణా, కుల్దీప్, వరుణ్‌ చక్రవర్తి కీలకం కానున్నారు. గత మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి వస్తే హర్షిత్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. డరైల్‌ మిచెల్‌పై ఆశలు టీమిండియాతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన డారిల్‌ మిచెల్‌పై న్యూజిలాండ్‌ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వన్డేల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన అతడు టి20ల్లో మాత్రం పెద్దగా మెరవడం లేదు. దీంతో కివీస్‌ గెలుపుబాట పట్టలేకపోతోంది. ఓపెనర్లు కాన్వే, సీఫెర్ట్‌ జట్టుకు మెరుపు ఆరంభాలను ఇచ్చినట్లే కనిపిస్తున్నా... ఈ జంట ఎక్కువసేపు నిలవలేకపోతుండటంతో మిడిలార్డర్‌పై భారం పడుతోంది. గత మ్యాచ్‌లో చక్కటి షాట్‌లతో ఆకట్టుకున్న రచిన్‌ రవీంద్ర అదే జోరు కొనసాగించాలని చూస్తుండగా... గ్లెన్‌ ఫిలిప్స్, మార్క్‌ చాప్‌మన్, సాంట్నర్‌ కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. కెపె్టన్‌ సాంట్నర్‌ గత మ్యాచ్‌లో బ్యాట్‌తో ఆకట్టుకున్నా... బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఫౌల్క్స్ బంతులనైతే టీమిండియా బ్యాటర్లు చీల్చి చెండాడారు. మూడు ఓవర్లలోనే 67 పరుగులు సమర్పించుకున్న అతడు కివీస్‌ పరాజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని కివీస్‌ సమష్టిగా సత్తా చాటాలని భావిస్తోంది. తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్, దూబే, హార్దిక్, రింకూ సింగ్, హర్షిత్‌/ బుమ్రా, కుల్దీప్, అర్ష్ దీప్, వరుణ్‌ చక్రవర్తి. న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్), కాన్వే, సైఫెర్ట్, రచిన్, ఫిలిప్స్, డరైల్‌ మిచెల్, చాప్‌మన్, ఫౌల్క్స్, హెన్రీ, సోధి, డఫీ.

Gukesh suffers second consecutive defeat5
గుకేశ్‌కు వరుసగా రెండో ఓటమి

విక్‌ ఆన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శుక్రవారం ఆరో రౌండ్‌లో నొదిర్బాక్‌ అబ్దుస్సత్తరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిన గుకేశ్‌... శనివారం ఏడో రౌండ్‌లో అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) చేతిలో కూడా పరాజయం పాలయ్యాడు. ఏడు రౌండ్‌ల తర్వాత గుకేశ్‌ ఒకే ఒక రౌండ్‌లో గెలిచి రెండు పరాజయాలు, నాలుగు డ్రాలు నమోదు చేశాడు. మరో భారత ఆటగాడు ప్రజ్ఞానంద, బ్లూబమ్‌ మథియాస్‌ (జర్మనీ) మధ్య జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌ డ్రాగా ముగియగా, వాన్‌ ఫారెస్ట్‌ జోర్డాన్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో అరవింద్‌ చిదంబరం ఓడిపోయాడు. ఆరో రౌండ్‌లో తెలంగాణ ఆటగాడు అర్జున్‌ ఇరిగేశి... బ్లూబమ్‌ మథియాస్‌ (జర్మనీ)తో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఏడు రౌండ్‌లు ముగిసే సరికి నాలుగు విజయాలు సాధించిన అబ్దుస్సత్తరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టోర్నమెంట్‌లో 14 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటుండగా... ప్రతీ ప్రత్యరి్థతో ఒక్కో సారి ఆడుతూ ఆటగాళ్లు 13 రౌండ్లలో తలపడాల్సి ఉంటుంది.

Novak Djokovic advances to Australian Open quarterfinals6
జొకోవిచ్‌ @ 400

మెల్‌బోర్న్‌: స్టార్‌ ఆటగాడు, వరల్డ్‌ మాజీ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తన 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో మరో అడుగు ముందుకు వేశాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీలో ఈ సెర్బియా దిగ్గజం ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 6–3, 6–4, 7–6 (7/4)తో బాటిల్‌ వాన్‌ డి జాండ్‌షల్ప్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును అతను తన ఖాతాలో వేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లో జొకోవిచ్‌కు ఇది 400వ విజయం కావడం విశేషం. దీంతో పాటు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అత్యధిక మ్యాచ్‌లు నెగ్గిన రోజర్‌ ఫెడరర్‌ (102 మ్యాచ్‌లు) రికార్డును కూడా అతను సమం చేశాడు. వరల్డ్‌ నంబర్‌వన్, డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) కూడా ముందంజ వేశాడు. తీవ్ర వేడి కారణంగా అలసటకు గురై ఇబ్బంది పడిన సినెర్‌ చివరకు విజయాన్ని దక్కించుకున్నాడు. మూడో రౌండ్‌లో అతను 4–6, 6–3, 6–4, 6–4తో ఇలియట్‌ స్పిజారి (అమెరికా)పై గెలుపొందాడు. తొమ్మిదో సీడ్‌ టేలర్‌ ఫ్రిజ్‌ (అమెరికా) మూడో రౌండ్‌లో 7–6 (7/5), 2–6, 6–4, 6–4తో వావ్రింకా (స్విట్జర్లాండ్‌)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో రెండు సార్లు విజేత నవోమీ ఒసాకా (జపాన్‌) గాయంతో మూడో రౌండ్‌కు ముందు టోర్నీనుంచి తప్పుకుంది. ఇతర మ్యాచ్‌లలో రెండో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌) 6–1, 1–6, 6–1తో కలిన్సకయా (రష్యా)పై, మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6–3, 6–3తో ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, పెగులా 6–3, 6–2తో సలెక్‌మెన్‌టొవా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. యూకీ బాంబ్రీ ముందంజ... పురుషుల డబుల్స్‌ భారత ఆటగాడు యూకీ బాంబ్రీ మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. బాంబ్రీ – ఆండ్రీ గొరాన్సన్‌ (స్వీడన్‌) తమ రెండో రౌండ్‌ పోరులో 4–6, 7–6 (7/5), 6–3తో సాంటియాగో గొనాలెజ్‌ – డేవిడ్‌ పెల్‌ జంటపై విజయం సాధించారు. అయితే మరో భారత ఆటగాడు శ్రీరామ్‌ బాలాజీ పరాజయంతో ని్రష్కమించాడు. రెండో రౌండ్‌లో బాలాజీ – నీల్‌ ఒబర్‌లీనర్‌ (ఆ్రస్టేలియా) 5–7, 1–6తో నాలుగో సీడ్‌ మార్సెల్‌ అరెవాలో – మేట్‌ పావిక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

ICC excludes Bangladesh from T20 World Cup7
బంగ్లాదేశ్‌ ఖేల్‌ ఖతం!

దుబాయ్‌: టి20 వరల్డ్‌ కప్‌లో భాగంగా తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. బంగ్లా టీమ్‌ను వరల్డ్‌ కప్‌నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తమ మంకు పట్టు వీడలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్‌పై ఐసీసీ వేటు వేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌ ఈ టోర్నమెంట్‌లో బంగ్లా స్థానంలో బరిలోకి దిగుతుంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్‌ మాత్రం ఆ జట్టుకు మద్దతు పలికింది. దాంతో వేటు లాంఛనంగానే మారింది. టీమ్‌ను వరల్డ్‌ కప్‌ను తొలగిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ శుక్రవారం బీసీబీకి తెలియజేసింది. ఐసీసీలోని ఇతర సభ్య దేశాలకు కూడా ఈ సమాచారం అందించింది. టోర్నీకి దూరం కావడం బంగ్లా బోర్డుపై ఆరి్థ కపరంగా కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. వరల్డ్‌ కప్‌లో పాల్గొనేందుకు ఇచ్చే 5 లక్షల డాలర్లతో పాటు ఐసీసీనుంచి ప్రతీ ఏటా అందే 27 మిలియన్‌ డాలర్లు కోల్పోనుంది. బంగ్లా నిష్క్రమణ నేపథ్యమిదీ... తాజా పరిణామాలను బట్టి చూస్తే వరల్డ్‌ కప్‌కు దూరం కావడం బంగ్లా స్వయంకృతమే. ఐపీఎల్‌ వేలంలో బంగ్లా పేసర్‌ ముస్తఫిజుర్‌ రహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 9.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆటగాడిని ఐపీఎల్‌లో ఆడించాలనే ఆలోచనపై భారత్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. వీటికి స్పందిస్తూ కేకేఆర్‌ యాజమాన్యం ముస్తఫిజుర్‌ను లీగ్‌ నుంచి తప్పించింది. తమ ఆటగాడిని అర్ధాంతరంగా తొలగించడం బీసీబీకి నచ్చలేదు. దీనిని ఆ దేశ బోర్డు ఒక రకమైన అవమానంగా భావించింది. దాంతో భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదంటూ కొత్త విషయాన్ని ముందుకు తెచ్చింది. టి20 వరల్డ్‌ కప్‌లో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలంటూ డిమాండ్‌ చేస్తూ వచ్చింది. ఈ అంశంపై స్పందించిన ఐసీసీ బంగ్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. టోర్నీకి చాలా తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు షెడ్యూల్‌ మార్పు సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత్‌లో ఆ దేశపు ఆటగాళ్లు, మీడియా, ఇతర సిబ్బందికి ఎలాంటి సమస్య రాకుండా అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు.

WPL 2026: Delhi Capitals Women beat RCB Women by 7 wkts8
ఆర్సీబీకి తొలి ఓటమి.. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

మహిళల ప్రీమియర్ లీగ్‌-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైం‍ది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని నామమాత్రపు స్కోరే పరిమితం చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, కాప్‌, మిన్ను మని తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్‌ స్మృతి మంధాన(38) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో లారా వోల్వడర్ట్‌(42), కాప్‌(19) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే రెండు, రాధా యాదవ్‌ ఓ వికెట్‌ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

Under 19 World Cup India Beats New Zealand By 7 Wickets9
న్యూజిలాండ్‌ చిత్తు చిత్తు.. భారత్‌ హ్యాట్రిక్‌ విజయం

బులావాయో:: ఐసీసీ అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో భారత్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు(శనివారం, జనవరి 24వ తేదీ) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం నమోదు చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. దాంతో ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 36.2 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆపై 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 13.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌లో విజేతను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో నిర్ణయించారు. ఫలితంగా భారత్‌ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయాన్ని అందుకుంది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత్‌ 17 ఓవర్లలో 90 పరుగులు చేస్తే విజయం సాధించినట్లు. దాంతో భారత్‌ అప్పటికే ముందంజలో ఉండటంతో విజయం అడ్డుకోవడానికి కివీస్‌కు ఎటువంటి చాన్స్‌ లేకుండా పోయింది. భారత బ్యాటర్లలో వైభవ్‌ సూర్యవంశీ(40: 23 బంతుల్లో 2 ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి విజృంభించి ఆడాడు. అతనికి జతగా కెప్టెన్‌ ఆయుష్‌(53: 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో భారత్‌ స్కోరు 9.5 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటేసింది. అంతకుముందు భారత బౌలర్లలో అంబ్రిష్‌ నాలుగు వికెట్లతో కివీస్‌ పతనాన్ని శాసించగా, హెనిల్‌ పటేల్‌ మూడు వికెట్లతో మెరిశాడు.

Abhishek Sharma respond on Rohit Sharma Role10
'హిట్‌మాన్'పై అభిషేక్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు

టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ‌పై యువ‌ ఓపెన‌ర్ అభిషేక్ శర్మ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశాడు. హిట్‌మాన్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నాన‌ని చెప్పాడు. టి20 ప‌వ‌ర్ ప్లేలో రోహిత్ శర్మలా ఆడ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని అన్నాడు. త‌నపై హిట్‌మాన్ ప్ర‌భావం గురించి జియోస్టార్‌తో మాట్లాడుతూ.. "రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. పవర్‌ప్లేలో అతడు ఇచ్చే ప్రారంభాల కారణంగా ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుందని అన్నాడు. రోహిత్ శ‌ర్మ పాత్ర పోషించాల‌ని కోచ్ గౌత‌మ్ గంభీర్ తన‌కు సూచించిన‌ట్టు వెల్ల‌డించాడు.గంభీర్‌తో కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) ప్రోత్సహంతో తాను రోహిత్ శ‌ర్మ ఫార్ములాను అనుస‌రిస్తున్నాన‌ని అభిషేక్ తెలిపాడు. "నేను జట్టులోకి వచ్చినప్పుడు.. కోచ్, కెప్టెన్ నా నుంచి అదే ఆశించారు. తొలి బంతి నుంచే విరుచుకుప‌డ‌డం నాకు ఇష్టం కాబ‌ట్టి.. అది నా శైలికి కూడా సరిపోతుందని భావించాను. రోహిత్ భాయ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. టీమిండియా తరపున ఇలా ఆడుతూ రాణించడం నాకు నిజంగా సంతోషంగా ఉంద''ని అన్నాడు.దూకుడుగా ఆడటమే నా పనిత‌న ఆట‌తీరును మెరుగు ప‌రుచుకోవ‌డానికి నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తూ ఉంటాన‌ని అభిషేక్ శ‌ర్మ చెప్పాడు. ప‌వ‌ర్ ప్లేలో దూకుడుగా ఆడి.. జ‌ట్టు భారీస్కోరుకు బాట‌లు వేయాల‌ని భావిస్తాన‌ని చెప్పాడు. "నేను ఇంకా పూర్తిగా పరిణతి చెందానని చెప్పను, ఎందుకంటే ఎల్లప్పుడూ మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఆరు ఓవర్లలో దూకుడుగా క్రికెట్ ఆడటమే నా పని అని భావిస్తున్నాను. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మంచి ఆరంభం ఇస్తే జట్టు ఆ ఊపును అనుసరించగలదని నాకు తెలుసు. అందుకే జ‌ట్టుకు ఆరంభం ఇవ్వాల‌ని ప్ర‌తిసారి అనుకుంటాన‌''ని ఈ డాషింగ్ ఓపెన‌ర్ పేర్కొన్నాడు.వారితో ప్రాక్టీస్ చేస్తాటి20 ప్ర‌పంచ‌క‌ప్‌కు స‌న్న‌ద్ధ‌త కోసం మాట్లాడుతూ.. త‌న దూకుడుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తాన‌ని, మ్యాచ్‌లకు ముందు తానెప్పుడూ ఇదే ఫాలో అవుతాన‌ని అన్నాడు. ''నాకు వారం లేదా 10 రోజులు సమయం దొరికినప్పుడు, తదుపరి సిరీస్ లేదా మ్యాచ్‌లలో నేను ఎదుర్కొన‌బోయే బౌలర్లను గుర్తుంచుకుంటాను. వారిలా బౌలింగ్ చేసే వారితో ప్రాక్టీస్ చేస్తాను. కొత్త బంతితో అవుట్-స్వింగర్లు, ఇన్-స్వింగర్లు వేయ‌మ‌ని చెప్పి బ్యాటింగ్ చేస్తుంటాను. టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా భిన్న‌మైన పరిస్థిల్లో వేర్వేరు జట్లతో ఆడాల్సి ఉంటుంది కాబ‌ట్టి ప్రిప‌రేష‌న్ చాలా ముఖ్య‌మ‌''ని అభిషేక్ అభిప్రాయ‌ప‌డ్డాడు.ప‌వ‌ర్ హిట్టింగ్‌తో హిట్‌2024, జూలైలో టి20లో అరంగేట్రం చేసిన అభిషేక్ శ‌ర్మ‌ ప‌వ‌ర్ హిట్టింగ్‌తో త‌న స్థానాన్ని జ‌ట్టులో సుస్థిరం చేసుకున్నాడు. అతి త‌క్కువ కాలంలోనే నంబ‌ర్‌వ‌న్ బ్యాటర్ ఎదిగాడు. ఇప్పటివరకు 34 ఇంట‌ర్నేష‌న‌ల్‌ మ్యాచ్‌లు ఆడి 190.92 స్ట్రైక్ రేట్‌తో 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఫిబ్ర‌వ‌రి 7 నుంచి జ‌రిగే టి20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ త‌న జోరును కొన‌సాగించాల‌ని ఈ ఎడంచేతి వాటం ఓపెన‌ర్ ఉవ్విళ్లూరుతున్నాడు. చ‌ద‌వండి: ప్ర‌ధాని త‌ర్వాత క‌ష్ట‌మైన జాబ్‌.. గంభీర్‌పై ప్ర‌శంస‌లు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement