Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Team India star yet to regain full fitness ahead of T20 WC 2026: Report1
T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఈసారి కూడా సత్తా చాటి.. సొంతగడ్డపై పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకు సూర్యకుమార్‌ సేనకు అన్ని అర్హతలు ఉన్నాయి.ద్వైపాక్షిక సిరీస్‌లలో అద్భుత ఆట తీరుతో దుమ్ములేపిన టీమిండియా స్వదేశంలో మెగా టోర్నీ జరుగనుండటం సానుకూలాంశం. అయితే, వరల్డ్‌కప్‌ ఆరంభానికి ముందు భారత ఆటగాళ్లు వరుసగా గాయాలపాలైన విషయం తెలిసిందే. అక్షర్‌ పటేల్‌ (Axar Patel), తిలక్‌ వర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ గాయాలబారిన పడ్డారు.పూర్తిగా కోలుకున్న తిలక్‌వీరిలో వేలి నొప్పితో బాధపడిన అక్షర్‌ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ (IND vs NZ)లో ఆఖరి మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (Tilak Varma) కూడా పూర్తిగా కోలుకున్నాడు. వరల్డ్‌ కప్‌ జట్టు సభ్యుడైన ఈ హైదరాబాదీకి ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. అనంతరం బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)లో రీహాబిలిటేషన్‌లో ఉన్న తిలక్‌ మ్యాచ్‌ ఫిట్‌గా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.ఈ క్రమంలో ప్రపంచకప్‌ అసలు పోరుకు ముందు జరిగే రెండు వార్మప్‌ మ్యాచ్‌ల ద్వారా తిలక్‌ వర్మకు ప్రాక్టీస్‌ కల్పించాలని భావించిన సెలక్టర్లు భారత ‘ఎ’ జట్టులో చోటు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా జట్టుతో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ రీఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా‌ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేసి.. వరల్డ్‌కప్‌ టోర్నీకి తాను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చాడు.వాషీ విషయంలో ఆందోళనఅయితే, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. దైనిక్‌ జాగరణ్‌ కథనం ప్రకారం.. వాషీ వేగంగా కోలుకుంటున్నా వరల్డ్‌కప్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది."వాషింగ్టన్‌ సుందర్‌ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించలేదు. అతడి పక్కటెముకలో ఫ్రాక్చర్‌ ఉంది. అయితే, అతడు వేగంగానే కోలుకుంటున్నాడు. ఇ‍ప్పటికే నాలుగు బ్యాటింగ్‌ సెషన్లు పూర్తి చేసుకున్నాడు.సోమవారం (ఫిబ్రవరి 2) స్పాట్‌ బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ కూడా చేశాడు. గురువారం మరోసారి బౌలింగ్‌ సెషన్‌లో వాషీ పాల్గొంటాడు. దీని ఆధారంగానే అతడు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడా? లేదా? అన్న అంశంపై అంచనాకు రావొచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. వారికి లైన్‌క్లియర్‌కాగా వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుతం బెంగళూరులోని CoEలో ఉన్నాడు. తిలక్‌ వర్మ, మయాంక్‌ యాదవ్‌, రియాన్‌ పరాగ్‌ కూడా ఇక్కడే పునరావాసం పొందారు. వీళ్లందరూ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ఫిజియోలు ఇటీవలే ప్రకటించారు. కాగా లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయడంతో పాటు స్వదేశీ స్పిన్‌ పిచ్‌ల మీద రాణించగల సత్తా వాషీకి ఉంది. వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ వంటి స్టార్‌ స్పిన్నర్లు ఉన్నా వాషీ లేకపోవడం కూడా లోటు లాంటిదే. కాగా ఫిబ్రవరి 7న భారత్‌- శ్రీలంక వేదికగా మొదలయ్యే వరల్డ్‌కప్‌ టోర్నీ మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది. చదవండి: టీమిండియాతో ఆడకున్నా.. ఆ మూడు మ్యాచ్‌లు గెలుస్తాం: పాక్‌ కెప్టెన్‌

Steve Smith Rumoured to Join Sialkot Stallionz for PSL 112
పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో స్టీవ్‌ స్మిత్‌

ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతుంది. స్టీవ్‌ను రానున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ఎడిషన్‌ కోసం సియాల్‌కోట్‌ స్టాలియన్జ్‌ అనే ఫ్రాంచైజీ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. స్టాలియన్జ్‌ స్టీవ్‌ను డైరెక్ట్‌ సైనింగ్‌ ద్వారా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.ఈ వార్త పాక్‌ అభిమానుల సోషల్‌మీడియా గ్రూప్‌ల్లో హల్‌చల్‌ చేస్తుంది. పాక్‌ ఫ్యాన్స్‌ స్టీవ్‌కు స్వాగతం పలుకుతున్నారు. స్టీవ్‌ ఇప్పటివరకు పీఎస్‌ఎల్‌లో ఆడలేదు. స్టీవ్‌ రాక పీఎ‍స్‌ఎల్‌కు కల తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం స్టీవ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు.తాజాగా ముగిసిన బిగ్‌ బాష్‌ లీగ్‌ (BBL) 15వ సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్‌ తరఫున ఆడుతూ 6 మ్యాచ్‌ల్లో 299 పరుగులు (సగటు 59.80, స్ట్రైక్‌ రేట్‌ 167.97) చేశాడు. ఇందులో 42 బంతుల్లో శతకం కూడా ఉంది. మొత్తం టీ20 కెరీర్‌లో 272 మ్యాచ్‌లు ఆడిన స్టీవ్‌.. 6,242 పరుగులు, 5 శతకాలు, 30 అర్ధశతకాలు సాధించాడు. కాగా, పాకిస్తాన్‌​ సూపర్‌ లీగ్‌ తదుపరి ఎడిషన్‌ ప్రారంభానికి ముందు పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీకి ఒక విదేశీ ఆటగాడిని నేరుగా సంతకం చేసుకునే అవకాశం ఉంది. గత ఎడిషన్‌లో ఆడని ఆటగాడిని మాత్రమే ఈ విధానం ద్వారా తీసుకోవచ్చు. స్టాలియన్జ్‌ ఈ అవకాశాన్ని వినియోగించి స్టీవ్‌ను చేజిక్కించుకుంది. స్టాలియన్జ్‌ PSLలో కొత్తగా ప్రవేశించిన రెండు జట్లలో ఒకటి.2026 జనవరి 8న జిన్నా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఫ్రాంచైజీల వేలంలో OZ Developers (హమ్జా మజీద్‌, కామిల్‌ ఖాన్‌) స్టాలియన్జ్‌ను రూ.1.85 బిలియన్‌ రికార్డు ధరకు కొనుగోలు చేశారు. PSL చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా నిలిచింది.

3 Other Group Matches: Pakistan Captain On T20 WC Boycott Row3
IND vs PAK: ఆ మూడు మ్యాచ్‌లు గెలుస్తాం: పాక్‌ కెప్టెన్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరించడంపై పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా స్పందించాడు. తాము కేవలం కాంట్రాక్టు ఆటగాళ్లమని.. ప్రభుత్వం నిర్ణయానుసారమే నడుచుకుంటామని తెలిపాడు. వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ ఆడరాదని తమ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఇందులో ఆటగాళ్లు చేసేదేమీ లేదని పేర్కొన్నాడు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిందేనని సల్మాన్‌ ఆఘా వ్యాఖ్యానించాడు.ఆసీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి..అదే విధంగా.. గ్రూప్‌ దశలో మ్యాచ్‌ రద్దు కారణంగా పాయింట్లు కోల్పోయే అంశం మీద కూడా సల్మాన్‌ ఆఘా స్పందించాడు. లీగ్‌ దశలో మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి ముందడుగు వేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ప్రపంచకప్‌ టోర్నీకి ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పాకిస్తాన్‌ మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆసీస్‌ జట్టు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగగా.. పాక్‌ ఈ మేర విజయం సాధించింది.ప్రపంచకప్‌ అంటే భారత్‌తో మ్యాచ్‌ మాత్రమే కాదుఈ నేపథ్యంలో ఆసీస్‌తో మూడో టీ20లో విజయం తర్వాత సల్మాన్‌ ఆఘా (Salman Agha) భారత్‌తో మ్యాచ్‌ (IND vs PAK) రద్దు విషయం గురించి మాట్లాడాడు. ‘‘‘మేం బోర్డుతో కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉండాల్సిందే. ప్రపంచకప్‌ అంటే భారత్‌తో మ్యాచ్‌ మాత్రమే కాదు కదా!..లీగ్‌ దశలో మరో మూడు మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ గెలిచి ముందంజ వేసేందుకు ప్రయత్నిస్తాం’ అని సల్మాన్‌ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఆడరాదనే పాకిస్తాన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్‌ మాజీ క్రికెటర్లు షాహిత్‌ ఆఫ్రిది, యూసుఫ్, రషీద్‌ లతీఫ్, మొయిన్‌ ఖాన్, సర్ఫరాజ్‌ అహ్మద్‌ సమర్థించారు.మిగిలిన మూడు జట్లు అవేకాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్‌- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్‌తో పాటు పాకిస్తాన్‌ గ్రూప్‌-‘ఎ’లో ఉంది. అయితే, భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్‌.. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలంటూ ఓవరాక్షన్‌ చేయగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిరాకరించింది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్‌ కూడా ముందుగా టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలు పలికింది. చివరగా భారత్‌తో మ్యాచ్‌ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. అపుడు అమెరికా చేతిలో ఓడిఅయితే, ఈ విషయంపై ఐసీసీకి ఇంతవరకు అధికారికంగా తెలియజేయకపోవడం పాక్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024లో పసికూన అమెరికా చేతిలో లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌ న్యూస్‌!

ICC Men's T20 World Cup Records4
పొట్టి ప్రపంచకప్‌ రికార్డులు, విశేషాలు

టీ20 ప్రపంచకప్‌ 10వ ఎడిషన్‌ భారత్‌, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన విశేషాలు, రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీ తొలి ఎడిషన్‌ 2007లో ప్రారంభమైంది. నాడు ఈ టోర్నీ ICC World Twenty20 పేరుతో జరిగింది. 2018లో దీనిని ICC Men’s T20 World Cupగా పునర్నామకరణం చేశారు. 2007 నుంచి 2009 వరకు ప్రతి బేసి (ODD) సంవత్సరంలో, 2010 నుంచి ప్రతి జత (EVEN) సంవత్సరంలో ఈ టోర్నమెంట్‌ జరిగింది. 2018, 2020లో మాత్రం జరగలేదు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా భారత్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి. ఈ మూడు జట్లు తలో రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. భారత్‌ 2007, 2024 ఎడిషన్లలో.. ఇంగ్లండ్‌ 2010, 2022లో.. వెస్టిండీస్‌ 2012, 2016 ఎడిషన్లలో ట్రోఫ్రీలు దక్కించుకున్నాయి. పాక్‌ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2022) తలోసారి ఛాంపియన్లుగా అవతరించాయి.టోర్నీ చరిత్రలో అత్యుత్తమ రికార్డులు..అత్యధిక ఎడిషన్లలో పాల్గొన్న ఆటగాళ్లు- రోహిత్‌ శర్మ, షకీబ్‌ అల్‌ హసన్‌ (9)అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు- రోహిత్‌ శర్మ (47)అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన రికార్డు- ఎంఎస్‌ ధోని (33 మ్యాచ్‌లు)అత్యధిక పరుగులు- విరాట్‌ కోహ్లి (1292)అత్యధిక వ్యక్తిగత స్కోర్‌- బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123)అత్యధిక సగటు- విరాట్‌ కోహ్లి (58.72)అత్యధిక స్ట్రయిక్‌రేట్‌- సూర్యకుమార్‌ యాదవ్‌ (158.94 స్ట్రయిక్‌రేట్‌)అత్యధిక సెంచరీలు- క్రిస్‌ గేల్‌ (2)అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు- విరాట్‌ కోహ్లి (15)అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు- విరాట్‌ కోహ్లీ (8)ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి- యువరాజ్‌ సింగ్‌ (12)ఫాస్టెస్ట్‌ సెంచరీ- క్రిస్‌ గేల్‌ (47)అత్యధిక సిక్సర్లు- గేల్‌ (63)అత్యధిక బౌండరీలు- రోహిత్‌ శర్మ (115)ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు- గేల్‌ (11)ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు- గిబ్స్‌ (14)ఓ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు- విరాట్‌ కోహ్లి (2014లో 319 పరుగులు)అత్యధిక వికెట్లు- షకీబ్‌ (50)అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు- అజంత మెండిస్‌ (6-8)అత్యుత్తమ ఎకానమీ- సునీల్‌ నరైన్‌ (5.17)ఓ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు- అర్షదీప్‌, ఫజల్‌హక్‌ ఫారూఖీ (2024లో తలో 17 వికెట్లు)హ్యాట్రిక్‌లు- మొత్తం 9 (బ్రెట్‌ లీ, కర్టిస్‌ క్యాంఫర్‌, హసరంగ, రబాడ, కార్తిక్‌ మైయప్పన్‌, జోష్‌ లిటిల్‌, కమిన్స్‌, క్రిస్‌ జోర్డన్‌) నమోదు కాగా.. కమిన్స్‌ ఒక్కడే రెండు (2024) తీశాడు.అత్యధిక క్యాచ్‌లు- డేవిడ్‌ వార్నర్‌ (25)అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టు- శ్రీలంక (54)అత్యధిక విజయాల శాతం కలిగిన జట్టు- భారత్‌ (67.30)అత్యధిక స్కోర్‌ చేసిన జట్టు- ఇంగ్లండ్‌ (2016లో సౌతాఫ్రికాపై 230-8)అత్యల్ప స్కోర్‌ చేసిన జట్టు- నెదర్లాండ్స్‌ (39 ఆలౌట్‌, 2014లో శ్రీలంకపై)అత్యధిక స్కోర్‌ నమోదైన మ్యాచ్‌- ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (2016లో 459 పరుగులు)అత్యధిక మార్జిన్‌తో (పరుగులు) గెలిచిన జట్టు- శ్రీలంక (2007లో కెన్యాపై 172 పరుగుల తేడాతో)అత్యధిక ఛేదన- ఇంగ్లండ్‌ (2016లో సౌతాఫ్రికాపై 230 పరుగులు)అత్యధిక టైటిళ్లు సాధించిన కెప్టెన్‌- డారెన్‌ సామీ (2012, 2016)

Why Mohsin Naqvi PCB cannot be punished for boycotting IND Vs PAK T20 WC match5
భారత్‌తో మ్యాచ్‌ రద్దు.. పాక్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..!

టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాతో జరగాల్సిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ను పాక్‌ జట్టు రద్దు చేసుకుంటున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టుపై తీవ్రమైన చర్యలు ఉంటాయని గత రెండ్రోజులగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని ఐసీసీ మరియు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్‌ ఎహసాన్‌ మణి కొట్టిపారేశాడు. ఈ విషయంలో ఐసీసీ పాక్‌ జట్టును ఏమీ చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.ఈ నిర్ణయం పీసీబీ కాకుండా పాక్‌ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తీసుకోవడం వల్లే ఐసీసీ ఎలాంటి శిక్షలు విధించలేదని వెల్లడించాడు. ఆయన మాటల్లో.. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించినప్పుడు ఏ దేశానికీ శిక్షలు ఉండవు. ఇదే కారణంతో (భద్రత) టీమిండియా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లను పాక్‌లో ఆడేందుకు నిరాకరించింది. అప్పుడు టీమిండియాపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పాక్‌ జట్టు విషయంలోనూ అంతే. ఒకే సమస్యకు రెండు విధానాలు ఉండకూడదని అన్నారు. కాగా, తాజా పరిస్థితి ఐసీసీకి పెద్ద సవాలుగా మారింది. ఓవైపు అభిమానుల ప్రయోజనాలు, ప్రపంచ క్రికెట్‌ సమగ్రత దెబ్బతింటున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను బోర్డులు తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్ల ఐసీసీకి శిక్షలు విధించే అధికారం తగ్గిపోతోంది. ఈ లూప్‌ హోల్‌ను ఆసరాగా తీసుకొనే పీసీబీ డ్రామాలాడుతుంది. భారత్‌తో మ్యాచ్‌ రద్దుపై ఇప్పటివరకు ఐసీసీకి అధికారిక​ సమాచారం కూడా ఇ‍వ్వలేదు. కేవలం​ ప్రభుత్వ మాటగా కాలయాపన చేస్తుంది. ఐసీసీ నియమాలను అడ్డు పెట్టుకొని రోజుకో డ్రామాకు తెరలేపుతుంది.మరోవైపు ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉండటంతో పాక్‌పై సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. షా.. రూల్స్‌ను పక్కన పెట్టి పాక్‌పై కఠిన చర్యలు తీసుకుంటాడని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ షా తన పరపతిని ఉపయోగిస్తే పాక్‌ జట్టుకు అంత భారీ శిక్షలు కాకపోయినా, ఓ మోస్తరు శిక్షలు అయినా పడే అవకాశం ఉంది. పాక్‌ జట్టు భారీ జరిమానాతో పాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి అంక్షలు ఎదుర్కోవచ్చు. పాక్‌పై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

Pat Cummins reveals IPL 2026 availability for SRH after World Cup exit6
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌ న్యూస్‌!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ దూర‌మైన సంగ‌తి తెలిసిందే. తొలుత ప్ర‌క‌టించిన జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికి.. ఇంకా గాయం నుంచి కోలుకోక‌పోవ‌డంతో ఆఖ‌రి నిమిషంలో క‌మ్మిన్స్ త‌ప్పుకొన్నాడు. అత‌డి స్దానంలో బెన్ దుర్హ‌నియ‌స్‌ను జట్టులోకి సెలెక్ట‌ర్లు తీసుకున్నారు.క‌మ్మిన్స్ గ‌త జూలై నుంచి వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన యాషెస్ సిరీస్‌లో కూడా అత‌డు కేవ‌లం ఒకే టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మ‌యానికి క‌మ్మిన్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశించింది. కానీ అత‌డు కోలు కోవడానికి 4 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్ర‌మంలోనే అత‌డు కీల‌క టోర్నీ కి దూర‌మ‌య్యాడు. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి త‌ప్పుకొన్న ప్యాట్ క‌మ్మిన్స్‌.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్యాన్స్‌కు మాత్రం గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్‌-2026 అందుబాటులో ఉంటాన‌ని క‌మ్మిన్స్ హింట్ ఇచ్చాడు."వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ నుంచి వైదొల‌గ‌డం నిజంగా దురదృష్టకరం. అడిలైడ్ టెస్టు త‌ర్వాత నా గాయం తిర‌గ‌బెట్టింది. అయితే 4 వారాల్లోనే కోలుకుంటాన‌ని అనుకున్నాను. కానీ తాజా స్కాన్ త‌ర్వాత మరికొన్ని వారాల విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. అందుకే ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉండాల్సి వ‌చ్చింది. మ‌రి కొన్ని రోజుల్లో మ‌ళ్లీ స్కాన్ చేయించుకుంటాను. ఒక‌వేళ ఆ రిపోర్ట్ గ‌నుక సానుకూలంగా వస్తే, అప్పటి నుండి నెమ్మదిగా ప్రాక్టీస్ మొదలుపెడతాను. త్వ‌ర‌లోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తాను" అని క‌మ్మిన్స్‌ ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా క‌మ్మిన్స్ వ్య‌వహ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కావ్య మార‌న్ మ‌రోసారి అత‌డిపై న‌మ్మ‌కం ఉంచారు.

Former hockey World Cup player Wayne Madsen to captain Italy at T20 World Cup 20267
క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం

క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం చోటు చేసుకుంది. ఓ ఆటగాడు 20 ఏళ్ల కిందట ఓ దేశం తరఫున హాకీ ప్రపంచకప్‌ ఆడి.. త్వరలో మరో దేశం​ తరఫున క్రికెట్‌ ప్రపంచకప్‌ (టీ20) ఆడబోతున్నాడు. క్రికెట్‌ పుట్టినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఒకే ఆటగాడు రెండు వేర్వేరు దేశాల తరఫున ఆడాడు కానీ, వేర్వేరు దేశాల తరఫున వేర్వేరు క్రీడల్లో ప్రపంచకప్‌ టోర్నీల్లో మాత్రం ఒక్కరు కూడా పాల్గొనలేదు.ఇలాంటి చారిత్రక గౌరవం సౌతాఫ్రికాలో పుట్టి, ఇటలీ తరఫున టీ20 ప్రపంచకప్‌ ఆడనున్న 42 ఏళ్ల వేన్‌ మ్యాడ్‌సన్‌కు దక్కింది. మ్యాడ్‌సన్‌ సౌతాఫ్రికా తరఫున 2006 హాకీ ప్రపంచకప్‌ ఆడి.. ఇటలీ తరఫున 2026 టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఇటలీ జట్టుకు మ్యాడ్‌సన్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌ ఆడబోయే 20 జట్లలో ఇటలీ ఒకటి. ఈ యూరోపియన్‌ జట్టు క్వాలిఫయర్స్‌ ద్వారా ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఇటలీకి ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కడంలో ఆసీస్‌ మాజీ ఆటగాడు జో బర్న్స్‌ కీలకపాత్ర పోషించాడు. బర్న్స్‌ పలు చారిత్రక ఇన్నింగ్స్‌లు ఆడి ఇటలీకి ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కేలా చేశాడు. వాస్తవానికి బర్న్స్‌నే ఇటలీ ప్రపంచకప్‌ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. అయితే ఇటలీ సెలెక్టర్లు బర్న్స్‌ను అనూహ్యంగా తప్పించి మ్యాడ్సన్‌కు ఇటలీ పగ్గాలు అప్పజెప్పారు. మ్యాడ్సన్‌ 2023లో ఇటలీ తరఫున అరంగేట్రం చేసి 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వాస్తవానికి మ్యాడ్సన్‌ క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకొని 2003లోనే దేశవాలీ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా టీ20 క్రికెట్‌ లీగ్‌లు (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌, హండ్రెడ్‌ లీగ్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ​్‌) ఆడాడు. అయితే హాకీలో కూడా ప్రొఫెషనల్‌ అయిన మ్యాడ్సన్‌కు 2006లో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం​ లభించింది. ఆ ఏడాది అతను హాకీ ప్రపంచకప్‌తో పాటు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ ఆడాడు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వేరే దేశం తరఫున క్రికెట్‌ ప్రపంచకప్‌ ఆడనున్నాడు.ఫిబ్రవరి 7 నుంచి భారత్‌, శ్రీలంక వేదికలుగా జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో మ్యాడ్సన్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు. ఇటలీ గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, నేపాల్‌, స్కాట్లాండ్‌, వెస్టిండీస్‌ జట్లతో పోటీపడనుంది. ఈ జట్టు తమ తొలి ప్రపంచకప్‌ మ్యాచ్‌ను ఫిబ్రవరి 9న స్కాట్లాండ్‌తో ఆడుతుంది.

Shikhar dhawan scored 99 runs in world legends pro league 20268
మొన్న పుజారా.. నిన్న శిఖర్‌ ధవన్‌

టీమిండియా తాజా మాజీ క్రికెటర్లు శిఖర్‌ ధవన్‌, ఛతేశ్వర్‌ పుజారా లేటు వయసులోనూ చెలరేగిపోతున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లు ముగిసాక కూడా వీరిద్దరూ సత్తా చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్టార్‌ క్రికెటర్లతో కలిసి వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్‌లో ఆడుతున్న ధవన్‌, పుజారా.. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లో తృటిలో సెంచరీలను కోల్పోయారు. ఈ టోర్నీలో గుర్‌గ్రామ్‌ థండర్‌కు ఆడుతున్న పుజారా దుబాయ్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. నిన్న మహారాష్ట్ర టైకూన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుయాబ్‌ రాయల్స్‌ తరఫున శిఖర్‌ ధవన్‌ 48 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్‌, పుజారా ఈ టోర్నీలో సత్తా చాటడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు వేర్వేరు మ్యాచ్‌ల్లోనూ ఈ ఇద్దరూ చెలరేగిపోయారు. తలో హాఫ్‌ సెంచరీ సాధించి, తమతమ జట్ల విజయాలకు దోహదపడ్డారు.కాగా, వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్ ఈ ఎడిషన్‌తోనే అరంగేట్రం చేసింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌, గుర్‌గ్రామ్‌ థండర్స్‌, మహారాష్ట్ర టైకూన్స్‌, పూణే పాంథర్స్‌, రాజస్థాన్‌ లయన్స్‌) పాల్గొంటున్నాయి.జనవరి 26న మొదలై పది రోజుల పాటు సాగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధవన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, డేల్‌ స్టెయిన్‌, ఇయాన్‌ మోర్గాన్‌ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.గోవా వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ లయన్స్‌, కీరన్‌ పోలార్డ్‌ నేతృత్వంలోని పూణే పాంథర్స్‌, గుర్‌కీరత్‌ సింగ్‌ మాన్‌ కెప్టెన్సీలోని ఢిల్లీ వారియర్స్‌, శిఖర్‌ ధనవ్‌ నేతృత్వంలోని దుబాయ్‌ రాయల్స్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇవాళే (ఫిబ్రవరి 3) ఈ సెమీస్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి సెమీస్‌లో రాజస్థాన్‌, పూణే.. రెండో సెమీస్‌లో ఢిల్లీ, దుబాయ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి సెమీస్‌ మధ్యాహ్నం 2:30 గంటలకు.. రెండో సెమీస్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

No South Africa as ex-England skipper picks his four semifinalists for 2026 T20 World Cup9
పాక్‌, సౌతాఫ్రికా కాదు.. సెమీస్‌కు చేరే జట్లు ఇవే

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ.. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. అయితే ఈ పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకొంది. దీంతో బంగ్లా స్ధానాన్ని స్కాట్లాండ్‌తో ఐసీసీ భర్తీ చేసింది. తాజాగా పాకిస్తాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే తీవ్ర చర్చనీయాంశమైంది.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు వాన్ షాకిచ్చాడు. తను ఎంచుకున్న టాప్‌-4 జట్ల జాబితాలో సౌతాఫ్రికాకు వాన్ చోటు ఇవ్వలేదు. భారత్, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత్‌కు వాన్ మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం పాకిస్తాన్‌ను కూడా పరిగణలోకి తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ కూడా భారత్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీ సన్నాహ‌ల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో భార‌త్ దుమ్ములేపింది.చదవండి: పాక్‌కు ఇదేమి కొత్త కాదు.. కచ్చితంగా వెనక్కి తగ్గుతుంది: గావస్కర్‌

Sunil Gavaskars Blunt Message To ICC After Pakistan Announce India Boycott At T20 World Cup10
పాక్‌కు ఇదేమి కొత్త కాదు.. కచ్చితంగా వెనక్కి తగ్గుతుంది: గావస్కర్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త్‌తో మ్యాచ్‌ను బాయ్‌క‌ట్ చేస్తున్న‌ట్లు పాకిస్తాన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీలో ఆడుతామ‌ని, భార‌త్‌తో మాత్రం త‌ల‌ప‌డ‌బోమ‌ని పాక్ స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది. ఈ అనుహ్య‌ నిర్ణ‌యంపై అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో మిశ్రమ స్పందన వ‌స్తోంది.చాలా మంది పాక్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. ఇదే విష‌యంపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయం త్వరలోనే మారిపోతుందని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అంచనా వేస్తున్నారు. "నాలుగు రోజుల పాటు ఈ అంశంపై స్పందనలు చూసిన తర్వాత పీసీబీ తమ నిర్ణయం మార్చుకుంటుంది. ఇందులో కొత్తేమీ లేదు. పాక్‌ క్రికెటర్లంతా రిటైర్మెంట్‌ ప్రకటించడం... కొద్ది రోజులకే అభిమానులు మా ఆటను ఇంకా చూడాలనుకుంటున్నారు అంటూ రిటైర్మెంట్‌ ప్రకటన వెనక్కి తీసుకోవడం ఎన్నోసార్లు జరిగింది. పీసీబీ నిర్ణయంపై ఐసీసీ చర్య కూడా తీసుకోవచ్చు" అని గావస్కర్‌ పేర్కొన్నారు.మరోవైపు పాక్‌ ఆడబోమని చెబుతున్నా...నిబంధనల ప్రకారం భారత జట్టు మ్యాచ్‌ కోసం కొలంబోకు ప్రయాణించాల్సి ఉంటుంది. మైదానానికి వెళ్లిన తర్వాత మరో జట్టు ఆడటం లేదని నిర్ధారణ అయ్యాకే ఐసీసీ రిఫరీ అధికారిక ప్రకటనతో మ్యాచ్‌ రద్దు అవుతుంది.చదవండి: భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.2,289 కోట్ల నష్టం!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement