ప్రధాన వార్తలు
IPL 2026: ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ ఎక్కడంటే?
ఐపీఎల్-2026 సీజన్ సంబంధించిన ఫ్లే ఆఫ్స్ షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. వాస్తవానికి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండేది.కానీ స్ధానిక క్రికెట్ అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని డిమాండ్లు బోర్డు గైడ్లైన్స్, ప్రోటీకాల్స్కు లోబడి లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య జరిగే 'క్వాలిఫైయర్ 1' మ్యాచ్ మే 26న ధర్మశాల వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తోంది. ఇందులో ఓడిన జట్టు మే 29న ముల్లాన్పూర్ వేదికగా ఎలిమినేటర్లో తలపడనుంది. అంతకంటే ముందు మే 27న ఇదే ముల్లాన్పూర్లో క్వాలిఫయర్-2 జరగనుంది. కాగా ఈ క్యాష్ లీగ్ సీజన్ లీగ్ స్టేజ్ మ్యాచ్లు ఆఖరి దశకు చేరుకున్నాయి. మొత్తం 70 లీగ్ మ్యాచ్లలో ఇప్పటికే 48 ముగియగా, ఇక మిగిలిన 22 లీగ్ మ్యాచ్లు ప్లేఆఫ్స్ రేసును నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ తొలి నాలుగు స్ధానాల్లో ఉన్నాయి.ఫైనల్ వేదిక మార్పునకు కారణమిదేకాగా గతేడాది ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన వేడుకల్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ కున్హా కమిషన్, స్టేడియం భద్రత, నిర్వహణలో పలు లోపాలను ఎత్తిచూపింది. దీంతో దాదాపు 10 నెలల పాటు చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి మ్యాచ్లు జరగలేదు. అయితే భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడంతో మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ సందడి మొదలైంది. స్టేడియంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడంతో.. ఐపీఎల్-2026 మ్యాచ్లను నిర్వహించేందుకు కర్ణాటక సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికి బీసీసీఐ భద్రతా ప్రోటోకాల్స్ విషయంలో ఇంకా ఆసంతృప్తిగానే ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు మార్చింది. గతేడాది సీజన్ ఫైనల్ కూడా అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.చదవండి: IPL 2026: 'అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. అది మా అదృష్టం'
ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన సీఎస్కే
ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. సీజన్ ప్రారంభంలో అదరగొట్టిన ఢిల్లీ, లక్నో లాంటి జట్లు పత్తా లేకుండా పోగా.. సీజన్ను చెత్తగా ప్రారంభించిన చెన్నై సూపర్కింగ్స్ అమాంతం ప్లే ఆఫ్స్ రేసులో దూసుకొచ్చింది. హ్యాట్రిక్ పరాజయాలతో సీజన్ను ప్రారంభించినా.. ఆతర్వాతి 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి టైటిల్ ఫేవరెట్గా మారింది.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్పై విజయానంతరం సీఎస్కే పాయింట్ల సంఖ్య 10కి చేరింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 5 విజయాలు, 5 అపజయాలు నమోదు చేసింది. ఈ జట్టు రన్రేట్ కూడా మెరుగ్గా (0.151) ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్నా, మున్ముందు టాప్-4లోకి దూసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది.ఈ జట్టు ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగింట 3 విజయాలు సాధించినా ప్లే ఆఫ్స్ బెర్త్కు ఢోకా ఉండకపోవచ్చు. నాలుగూ గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్జాగా ఫైనల్-4కు చేరవచ్చు. సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అని ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణాలు లేకపోలేదు. మొదటిది ఆ జట్టు ఆటగాళ్ల ఫామ్. ప్రస్తుతం సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా బౌలింగ్లో ఆ జట్టు చాలా పటిష్టంగా ఉంది.స్పిన్నర్లు అకీల్ హోసేన్, నూర్ అహ్మద్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నారు. వీరిద్దరు ప్రత్యర్ది బ్యాటర్ల పాలిట కొరకరాని కొయ్యల్లా మారారు. తాజాగా ముగిసిన ఢిల్లీ మ్యాచ్ మినహా అన్షుల్ కంబోజ్ది కూడా ఇదే పరిస్థితి. ఇతను కూడా ప్రత్యర్ది బ్యాటర్ల పాలిట సింహస్వప్నంగా మారాడు. మరో పేసర్ ముకేశ్ చౌదరి కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. జేమీ ఓవర్టన్ ఆల్రౌండర్గా అదరగొడుతున్నాడు. మరో పేసర్ గుర్జప్నీత్ కూడా గత మ్యాచ్తో లైన్లోకి వచ్చాడు.బ్యాటింగ్ విభాగంలో సంజూ శాంసన్ వారికి బ్యాక్ బోన్లా మారాడు. కెప్టెన్ రుతురాజ్ పెద్దగా ఫామ్లో లేకపోయినా, సంజూ ఒంటిచేత్తో బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. అతనికి ఈ మధ్యే యువ బ్యాటర్ కార్తీక్ శర్మ తోడయ్యాడు. గత రెండు మ్యాచ్ల్లో ఇతగాడు జట్టు విజయాల్లో ప్రధానపాత్ర పోషించాడు. సీఎస్కే బ్యాటింగ్ను కలవరపెడుతున్నది డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్ మాత్రమే. వీరిద్దరూ మంచి బ్యాటర్లే అయినా.. వీరి నుంచి భారీ ఇన్నింగ్స్లు బాకీ ఉన్నాయి. వీరు కూడా లైన్లోకి వస్తే సీఎస్కే బ్యాటింగ్ విభాగం కూడా పటిష్టంగా మారుతుంది.సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అని చెప్పడానికి మరో కారణం ఆ జట్టు తదుపరి షెడ్యూల్. సీఎస్కే ఇకపై ఆడాల్సిన నాలుగు మ్యాచ్ల్లో రెండు, వరుస పరాజయాలతో ఢీలా పడిపోయిన లక్నోతో ఉన్నాయి. ప్రస్తుత జోరును కొనసాగిస్తే.. లక్నోపై రెండు మ్యాచ్ల్లో గెలవడం సీఎస్కే అంత కష్టమేమీ కాకపోవచ్చు. ఈ రెండు మ్యాచ్లు కూడా వరుసగా మే 15, 18 తేదీల్లో ఉన్నాయి. ఇందులో ఒకటి సొంత మైదానం చిదంబరంలో కాగా.. మరొకటి లక్నో హోం గ్రౌండ్లో.మిగతా రెండు మ్యాచ్ల్లో సీఎస్కే ప్రత్యర్దులు సన్రైజర్స్, గుజరాత్. వీటిలో గుజరాత్పై విజయం సాధించినా, సీఎస్కే ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అనుకున్నట్లుగానే లక్నోపై రెండు మ్యాచ్లు, గుజరాత్పై గెలిస్తే, సన్రైజర్స్ చేతిలో ఓడినా సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్కు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. ప్రస్తుతం సీఎస్కే ఉన్న ఫామ్ను బట్టి చూస్తే.. లక్నో, గుజరాత్పై సునాయాసంగా గెలిచే ఛాన్స్ ఉంది.ఈ లెక్కన ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు సీఎస్కే ప్లే ఆఫ్స్కు చేరితే, టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఆ జట్టుకు భారీ షాక్.. ఒక్క మ్యాచ్కే ఐపీఎల్ నుంచి అవుట్?
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్కు ఏది కలిసి రావడం లేదు. వరుస ఓటములతో సతమతమవుతున్న లక్నోకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ మిగిలిన సీజన్కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా ఇంగ్లిష్ చేతి బోటన వేలికి గాయమైంది.దీంతో ఆట మధ్యలోనే అతడు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అయితే ఇంగ్లిష్కు తగిలిన గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జోష్ ఇంగ్లిష్ ఈ ఏడాది సీజన్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.అతడిని గతేడాది వేలంలో రూ. 8.60 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. కానీ అతడు వ్యక్తిగత కారణాల చేత ఫస్ట్ హాఫ్ సీజన్కు అందుబాటులో లేడు. ఇటీవల జట్టుతో కలిసిన జోష్.. ముంబై ఇండియన్స్తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఓపెనర్గా అతడిని ఎల్ఎస్జీ ప్రమోట్ చేసింది. కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అతడు ఔటయ్యాడు. ఇప్పుడు అతడు గాయపడడంతో ఆ స్ధానాన్ని ఆయూశ్ బదోనితో భర్తీ చేసే అవకాశముంది. ఇక ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్.. కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో ఉంది.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
'అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. అది మా అదృష్టం'
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత హోం టీమ్ ఢిల్లీని 155 పరుగులకే కట్టడి చేసిన సీఎస్కే.. అనంతరం లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలో చేధించింది. సీఎస్కే విజయంలో సంజూ శాంసన్(87 నాటౌట్), కార్తీక్ శర్మ(41) మరోసారి కీలక పాత్ర పోషించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు."గత ఏడాది కంటే ఈసారి మా జట్టు బలంగా ఉందని మేము ఆదిలోనే భావించాం. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి కీలక ఆటగాడు రావడంతో మా అన్ని విభాగాలు పటిష్టమయ్యాయి. మా మిడిలార్డర్ బ్యాటింగ్ కూడా బలంగా ఉంది. కార్తీక్ శర్మ యువ ఆటగాళ్లు రాణిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు మా బౌలింగ్ విభాగం నిలకడగా రాణిస్తోంది. అన్షుల్ కాంబోజ్, అకిల్, నూర్, ఓవర్టన్ వంటి బౌలర్లు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్లోనే అన్షుల్ విఫలమయ్యాడు. అందుకు అతడు బాధపడ్డాడు. అతడు బలంగా తిరిగి వస్తాడన్న నమ్మకం మాకు ఉంది. ఇక టోర్నీ ఆరంభంలో కాస్త తడబడ్డాం. మా ఊపును అందుకోవడానికి ఒక్క విజయం అవసరమైంది. మూడు మ్యాచ్ల తర్వాత మాకు మూమెంటమ్ లభించింది. ఆ తర్వాత నుంచి జట్టు మొత్తం సమిష్టిగా రాణించడం మొదలుపెట్టాము. సంజూ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచకప్లో అద్భుత ఫామ్ను కనబరిచిన సంజూ, ఇప్పుడు మా జట్టుకు వెన్నెముకలా మారాడు. అతను జట్టులో ఉండటం మా అదృష్టం. యంగ్ ప్లేయర్ కార్తీక్ శర్మలో కూడా అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిందంటూ ఏమి లేదు. అతడికి భారీ షాట్లతో పాటు స్ట్రైక్ను రొటేట్ చేస్తూ ఆడే సత్తా కూడా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గైక్వాడ్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
నితీష్ రాణా అవుట్ చుట్టూ రచ్చ? రూల్స్ ఏమి చెబుతున్నాయి?
ఐపీఎల్-2026 సీజన్లో మరో వివాదం చెలరేగింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణా ఔటైన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్లు పాథుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన లోకల్ బాయ్ నితీష్ రాణా ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ట్రిక్కీ వికెట్పై రాణా ఆచితూచి ఆడుతూ క్రీజులో పాతుకుపోయేలా కన్పించాడు. ఈ క్రమంలో ఢిల్లీ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్లో మూడో బంతికి స్వీప్ షాట్ ఆడబోయి డీప్ ఫైన్ లెగ్ ఫీల్డర్కు రానా చిక్కాడు. అయితే రాణా బంతిని షాట్ ఆడే క్రమంలో ఒక్కసారిగా వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో నితీష్ క్యాచ్ అవుట్ కాదు హిట్ వికెట్ అయ్యాడని అంతా భావించారు. కానీ రిప్లేలో చూస్తే బలమైన గాలులు కారణంగా బెయిల్స్ కింద పడిపోయినట్లు స్పష్టమైంది. అయితే స్టంప్స్ కింద పడిపోయాయి కాబట్టి బంతిని డెడ్ బాల్గా ప్రకటించాల్సిందని పలువురు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నాయి. ఇంతకి రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి పరిశీలిద్దాం.హిట్ వికెట్ కాదు..బ్యాటర్ షాట్ ఆడే క్రమంలో గానీ, పరుగు తీసే సమయంలో గానీ తన బ్యాట్తో లేదా శరీరంతో బెయిల్స్ను పడగొడితే హిట్ వికెట్గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో రాణా వికెట్లను తాకలేదు కాబట్టి ఇది హిట్ వికెట్ కాదు. మరోవైపు వికెట్ కీపర్ సంజూ శాంసన్ కారణంగా కూడా స్టంప్స్ పడలేదు. కేవలం గాలులు వల్లే స్టంప్స్ కిందపడిపోయాయి.డెడ్ బాల్ ఎప్పుడు ప్రకటిస్తారు?బ్యాటర్ దృష్టి మరల్చే విధంగా ఏదైనా అవాంతరం ఏర్పడినప్పుడు డెడ్బాల్గా అంపైర్గా ప్రకటిస్తారు. ఉదహరణకు బౌలర్ బంతిని వేసే క్రమంలో తన కర్చీఫ్ కింద పడటం లేదా తన చేతితో నాన్స్ట్రైకర్ ఎండ్లో బెయిల్స్ను పడగొడితే డెడ్ బాల్గా పరిగిణిస్తారు.అంతేకాకుండా బంతి డెలివరీ అయ్యే ఆఖరి క్షణంలో బ్యాటర్ పక్కకు తప్పుకొన్న డెడ్ బాల్గా ప్రకటిస్తారు. కానీ రాణా మాత్రం ఎలాంటి ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా షాట్ ఆడాడు. అంతేకాకుండా బౌలర్ బంతిని విసిరిన తర్వాత బెయిల్స్ పడిపోయాయి. అందుకే అంపైర్లు దాన్ని డెడ్ బాల్గా పరిగణించలేదు.When Nitish got Out,Sanju Disturbed The Wicket and bail fell offAny expert please tell will it be Out or not? pic.twitter.com/wUF9r0cODA— Stubbsy³⁰ (@sinha7605) May 5, 2026
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.156 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ బౌలర్లను సంజూ ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్లతో 87 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్కు గాను అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ సీజన్లో ఢిల్లీపై శాంసన్కు ఇది రెండో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కావడం విశేషం.ఇక ఈ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సంజూ సాధించిన రికార్డులు ఇవే👉19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్పై ఒకే సీజన్లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా శాంసన్ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో ఢిల్లీపై ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ కలిపి అతడు 202 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్లలోనూ సంజూ అజేయంగా నిలవడం గమానార్హం.👉అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో ఒకే జట్టుపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పిన తొలి బ్యాటర్గా సంజూ నిలిచాడు. ఈ ఏడాది ఐసీజన్ ఫస్ట్ హాఫ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో శాంసన్,ఆయుశ్ మాత్రేతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.👉ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్లో కార్తీక్ శర్మ (31 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి 3వ వికెట్కు 66 బంతుల్లో 114 పరుగులు అజేయ భాగస్వామ్యాన్ని జోడించాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఢిల్లీపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కానీ అతడు రెండు సీజన్లలో ఈ ఫీట్ సాధించాడు.👉ఒకే సీజన్లో ఒకే ప్రత్యర్థిపై 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్ సంజూనే కావడం విశేషం.చదవండి: హెచ్సీఏ ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా రాయుడు
హెచ్సీఏ ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా రాయుడు
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి (ఏటీ) రాయుడును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా నియమించింది. హెచ్సీఏలో క్రికెట్ కార్యకలాపాలను రాయుడు పర్యవేక్షించనున్నట్లు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ మంగళవారం వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్లో రాయుడుకున్న అపార అనుభవం... హైదరాబాద్ యువ క్రికెటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అపెక్స్ కౌన్సిల్ భావిస్తోంది.పరిపాలనలో పారదర్శకతతో పాటు క్రికెట్ నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆటకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో సమగ్రత పెంపొందించేందుకు అవినీతి నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి పి.విజేందర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈనెల 12 నుంచి 2026–27 క్రికెట్ సీజన్ మొదలవుతుందని.... హెచ్సీఏ అకాడమీని పునరుద్ధరించి మౌలిక వసతులు పెంపొందిస్తామని... లైంగిక వేధింపుల నివారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్సీఏ కార్యదర్శి తెలిపారు.
సంజూ విధ్వంసం.. సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సంజూ శాంసన్ (87 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. స్టబ్స్ (38), సమీర్ రిజ్వీ (40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్లు తలా ఒక వికెట్ తీశారు. కాగా టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.సీఎస్కే ఆడుతూ పాడుతూ..156 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగింది. కెప్టెన్ రుతురాజ్, వన్డౌన్లో వచ్చిన ఉర్విల్ పటేల్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కానీ మరో ఎండ్లో ఓపెనర్ సంజూ శాంసన్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు శాంసన్కు జత కలిసిన కార్తిక్ శర్మ తోడయ్యాడు. ఈ ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లు బాది సీఎస్కేకు విజయాన్ని కట్టబెట్టారు. శాంసన్ సునామీ ఇన్నింగ్స్తో అలరిస్తే.. కార్తిక్ తన హిట్టింగ్ను ఢిల్లీ బౌలర్లకు రుచి చూపించాడు. ఈ సీజన్లో సీఎస్కేకు ఇది ఐదో విజయం కాగా పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 10 మ్యాచ్ల్లో 4 విజయాలు, ఆరు ఓటములతో పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.
బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు!
క్రికెట్లో ఒకప్పుడు బ్యాటర్లకు భయం పుట్టించిన యార్కర్లు ఇప్పుడు కనిపించడం లేదు. చేజింగ్ సమయంలో బ్యాటింగ్ చేసే జట్టులో ఆందోళన పెరిగి, సమీకరణం ఉత్కంఠభరితంగా మారినప్పుడు, ఆయా కెప్టెన్లు ఒక బంతినే నమ్ముకునేవారు. అదే సంప్రదాయ యార్కర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మలింగ, బుమ్రా లాంటి యార్కర్ల స్పెషలిస్టులు విసిరే యార్కర్లకు బ్యాటర్లకు ఫ్యూజులు ఎగిరేవి. ఐపీఎల్లోనూ యార్కర్లకు స్వర్ణయుగం నడిచింది. ఆఖరి బంతి దాకా విజయం దోబుచులాడే టీ20 క్రికెట్లో ఇటీవలే కాలంలో మ్యాచ్లన్నీ వన్సైడ్గా మారిపోవడం చూస్తున్నాం. ఐపీఎల్లోనూ ఈ తరహా మ్యాచ్లు ఎక్కువైపోయాయి. ఐపీఎల్ 2026 సీజన్లోనూ అన్ని జట్లు 200 పరుగుల టార్గెట్ను అవలీలగా ఛేదించేస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో యార్కర్ బంతులు కనిపించకపోవడంతో అటు డ్రెస్సింగ్ రూమ్లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఒకటే చర్చ జరుగుతుంది. అదేంటంటే ఒకప్పుడు భయం పుట్టించిన యార్కర్లకు క్రమంగా కనుమరుగవుతున్నాయా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజానికి ఈ సీజన్లో ముంబై తరఫున ఆడుతున్న బుమ్రా కావొచ్చు.. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న నటరాజన్ వీరంతా యార్కర్ల స్పెషలిస్టులే. కానీ ఈ సీజన్లో ఒక్కసారి కూడా వీరు తమ యార్కర్లతో ప్రభావం చూపలేకపోయారు.బ్యాటర్లు ఫినిషింగ్ను ఒక శాస్త్రంగా మార్చుకోవడంతో, గత కొన్నేళ్లుగా డెత్ ఓవర్లలో పరుగుల రేట్లు క్రమంగా పెరిగాయి. వారు బంతి కదలికను, ముందుచూపును ఉపయోగించి చిన్నపాటి పొరపాట్లను కూడా బౌండరీలుగా మారుస్తున్నారు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్లో డెత్ ఓవర్ల (17వ నుండి 20వ ఓవర్ల వరకు) సగటు రన్ రేట్ 9.41గా ఉండగా, అది క్రమంగా పెరిగి 2025 నాటికి 11.5కు చేరుకుంది. అదేవిధంగా, జట్టు సగటు స్కోరు 2008లో 157 నుండి 2025 నాటికి 180కి పెరిగింది.2023లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ప్రవేశపెట్టడం కూడా స్లాగ్ ఓవర్లలో యార్కర్కు ప్రాధాన్యత తగ్గడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే ఇంపాక్ట్ నిబంధనపై కూడా సీనియర్ క్రికెటర్లు, బౌలర్లు వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ఒకప్పుడు యార్కర్లు బ్యాటర్లు బెంబెలెత్తించాయి. కానీ ఇప్పుడు అదే యార్కర్లు కనిపించకుండా పోతున్నాయి.చదవండి: బెదిరింపులకు దిగిన టెన్నిస్ స్టార్!
బెదిరింపులకు దిగిన టెన్నిస్ స్టార్!
మహిళల ప్రపంచ నంబర్వన్, స్టార్ క్రీడాకారిణి అరీనా సబలెంకా బెదిరింపులకు దిగింది. గ్రాండ్స్లామ్ టోర్నీల్లో తమకు ఎక్కువ మొత్తంలో షేర్ ఇవ్వకపోతే ఆ టోర్నీలను ఆటగాళ్లు బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చింది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ప్రైజ్మనీ విషయంలో ఇటలీ స్టార్ జానిక్ సిన్నర్.. 'ప్రైజ్మనీ విషయంలో పూర్తి నిరాశతో ఉన్నా' అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సిన్నర్కు సబలెంకా మద్దతుగా నిలుస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఆటగాళ్లకు ఆదాయంలో వాటా పెరగకపోతే మేము గ్రాండ్స్లామ్ టోర్నీలను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆటగాళ్లు అందుకున్న షేర్కు, చూపెడుతున్న లెక్కలకు సంబంధం ఉండడం లేదు. అందుకే ఆటగాళ్లకు పక్కగా ఆదాయంలో ఎక్కువ వాటాను ఇవ్వాలి. ఒకవేళ మేము బహిష్కరిస్తే టోర్నీలు జరగకపోవచ్చు. అదే జరిగితే మా నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు మిస్ అవుతారు. కనీసం మాతో చర్చలు జరిపి ఆటగాళ్లు సంతోషపడే విధంగా ఆదాయంలో వాటా విషయమై ఒక ముగింపు ఇస్తారని ఆశిస్తున్నా' అని చెప్పుకొచ్చింది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఓపెన్ ప్రైజ్మనీపై అగ్రశ్రేణి ఆటగాళ్లు జానిక్ సిన్నర్, కోకో గాఫ్, స్వియాటెక్, జొకోవిచ్, జ్వెరెవ్, మెద్వెదెవ్ సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ప్రైజ్మనీ సుమారు పది శాతం మేర పెరిగి 61.7 యూరో మిలియన్లకు చేరుకుందని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఆటగాళ్లు మాత్రం ఫ్రెంచ్ ఓపెన్లో ఆటగాళ్లకు ఆదాయంలో అందించే వాటా 15.5 నుంచి 14.9 శాతానికి తగ్గిందని విమర్శిస్తున్నారు. ఇక ఈ సీజన్లో తొలి గ్రాండ్స్లామ్ అయిన ఫ్రెంచ్ ఓపెన్ మే 18 నుంచి జూన్ 7 వరకు జరగనుంది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫీట్!
చైనాకు కొరియా షాక్
హోర్సెన్స్ (డెన్మార్క్): నాలుగేళ్ల విరామం తర్వా...
కాంస్యంతో సరి.. సెమీస్లో భారత్ పరాజయం!
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ థామస్ కప్ బ్యాడ్మింట...
సీఓఈ శిబిరానికి అనన్య ఎంపిక
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి ...
అదరగొట్టిన భారత్
హోర్సెన్స్ (డెన్మార్క్): తమదైన రోజున సహజశైలిలో ...
హెచ్సీఏ ‘క్రికెట్ ఆపరేషన్స్ హెడ్’గా రాయుడు
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ అంబటి తిర...
సంజూ విధ్వంసం.. సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ మరో విజయ...
బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు!
క్రికెట్లో ఒకప్పుడు బ్యాటర్లకు భయం పుట్టించిన...
ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఫ...
క్రీడలు
మళ్లీ విజయం వేటలో..ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్..సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
వీడియోలు
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
భయం పుట్టిస్తున్న వైభవ్ బ్యాటింగ్..
IPLలో నేడు డబుల్ ధమాకా
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
IPL గేమ్ ఛేజింగ్ రూల్, IPL 2026లో 200+ పరుగుల వరద
వైభవ్ బ్యాటింగ్ పై గర్ల్ ఫ్రెండ్ ప్రశంసలు.. మొహం మాడ్చుకున్న అర్షదీప్
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
చితక్కొట్టిన సన్ రైజర్స్
