Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

SANJU SAMSON is preparing well for South Africa T20I series1
సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు దుమ్మురేపుతున్న సంజూ శాంసన్‌

టీమిండియా డాషింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు గట్టిగా ప్రిపేర్‌ అవుతున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 41 బంతుల్లో అజేయమైన 51 పరుగులు చేసిన అతడు.. ఆతర్వాతి మ్యాచ్‌లో 15 బంతుల్లో 43 పరుగులు బాదాడు. తాజాగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ మరోసారి చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 46 పరుగులు చేశాడు.ఇదే ఫామ్‌ను సంజూ సౌతాఫ్రికా సిరీస్‌లోనూ కొనసాగిస్తే టీమిండియాకు చాలా ప్లస్‌ అవుతుంది. ఇప్పటికే భారత బ్యాటింగ్‌ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఒక్కో స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఓ రకంగా చూస్తే.. ఆఖరి నిమిషం వరకు సంజూ స్థానానికి కూడా గ్యారెంటీ లేదు. జితేశ్‌ శర్మ రూపంలో అతడిని బలమైన పోటీ ఉంది.కాగా, నిన్ననే సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. గాయపడినా ఈ జట్టుకు ఎంపికైన శుభ్‌మన్‌ గిల్‌ సిరీస్‌ సమయానికి అందుబాటులోకి రాకపోతే సంజూ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌తొలి టీ20: డిసెంబరు 9- కటక్‌, ఒడిశారెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్‌, చండీగఢ్‌మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్‌ ప్రదేశ్‌నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్‌ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్‌, గుజరాత్‌.ముంబైని ఓడించిన తొలి మొనగాడుప్రస్తుత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో ముంబైని ఓడించిన ఏకైక కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మాత్రమే. ఈ టోర్నీలో కేరళకు సారధిగా వ్యవహరిస్తున్న సంజూ ఇవాళ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌గా, వికెట్‌కీపర్‌గా, కెప్టెన్‌గా రాణించి ముంబైని ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన సంజూ, ఆతర్వాత వికెట్‌కీపింగ్‌లోనూ సత్తా చాటి కీలక సమయంలో శివమ్‌ దూబేను స్టంపౌట్‌ చేశాడు. ఈ వికెటే మ్యాచ్‌ను మలుపు తిప్పి, కేరళను గెలిచేలా చేసింది.స్కోర్ల వివరాలు..కేరళ-178/5ముంబై-163 ఆలౌట్‌

Black Caps v West Indies: Rachin Ravindra, Tom Latham centuries put New Zealand in complete control of first test2
లాథమ్‌, రచిన్‌ భారీ శతకాలు.. పట్టు బిగించిన న్యూజిలాండ్‌

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పట్టు బిగించింది. టామ్‌ లాథమ్‌ (145), రచిన్‌ రవీంద్ర (176) భారీ శతకాలతో కదంతొక్కడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 481 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు స్కోర్‌ 417/4గా ఉంది. విల్‌ యంగ్‌ (21), బ్రేస్‌వెల్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో రోచ్‌, షీల్డ్స్‌కు తలో 2 వికెట్లు దక్కాయి.అంతకుముందు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే ఆలౌటైంది. చంద్రపాల్‌ (52), హోప్‌ (56) మాత్రమే అర్ద సెంచరీలతో రాణించారు. జేకబ్‌ డఫీ 5 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బేశాడు. హెన్రీ 3, ఫౌల్క్స్‌ 2 వికెట్లు తీశారు.దీనికి ముందు న్యూజిలాండ్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (231) ఆలౌటైంది. కేన్‌ విలియమ్సన్‌ (52), బ్రేస్‌వెల్‌ (47) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్‌ బౌలర్లు తలో చేయి వేసి న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు.

Rohit Sharma has expressed his desire to play for Mumbai in Syed Mushtaq Ali Knockouts says reports3
రోహిత్‌ శర్మ కీలక నిర్ణయం

టీమిండియా వెటరన్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) కీలక నిర్ణయం​ తీసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT) ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆడేందుకు హిట్‌మ్యాన్‌ సమ్మతం వ్యక్తం చేశాడట. SMATలో ముంబై నాలుగు వరుస విజయాలతో దూసుకుపోతూ నాకౌట్స్‌కు చేరువైంది.ఇప్పటికే స్టార్‌ క్రికెటర్లతో పటిష్టంగా ఉన్న ముంబైకి హిట్‌మ్యాన్‌ తోడైతే వారిని ఆపడం దాదాపుగా అసాధ్యం. ఈ టోర్నీలో ముంబై డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలో ఉంది. గత సీజన్లో‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముంబైకి టైటిల్‌ అందించాడు.ప్రస్తుత ముంబై జట్టులో భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సహా అజింక్య రహానే, ఆయుశ్‌ మాత్రే, సర్ఫరాజ్‌ ఖాన్‌, శివమ్‌ దూబే, శార్దూల్‌ ఠాకూర్‌ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. వీరికి రోహిత్‌ శర్మ కలిస్తే ఇంకేమైనా ఉందా..?ఈ సీజన్‌లో ముంబై ఆటగాళ్లంతా సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. కుర్ర ఓపెనర్‌ మాత్రే వరుసగా రెండో సెంచరీలు బాది జోష్‌లో ఉండగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా తాజాగా ఓ మెరుపు సెంచరీ చేశాడు. ఇటీవలే శార్దూల్‌ ఠాకూర్‌ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.ఇదిలా ఉంటే, టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్‌ శర్మ.. 38 ఏళ్ల లేటు వయసులోనూ ఈ ఫార్మాట్‌లో చెలరేగిపోతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ, హాఫ్‌ సెంచరీతో దుమ్మురేపిన హిట్‌మ్యాన్‌.. ప్రస్తుతం​ సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ఓ హాఫ్‌ సెంచరీతో పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే డిసెంబర్‌ 6 విశాఖ వేదికగా జరుగనుంది.సిరీస్‌ విషయానికొస్తే.. నిన్న జరిగిన రెండో వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ చేసిన ఓటమిపాలైంది. రుతురాజ్‌, కోహ్లి సెంచరీలు వృధా అయ్యాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అసమానమైన పోరాటపటిమ కనబర్చి భారత్‌ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. అంతకుముందు తొలి వన్డేలో భారత్‌ విజయం​ సాధించింది. ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా ఉంది.

Special Story on team India losing to South Africa in 2nd ODI4
మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం మారేదా..?

రాయ్‌పూర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో నిన్న (డిసెంబర్‌ 3) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోర్‌ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి వారి జట్టును గెలిపించుకున్నారు. టీమిండియా ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటే సవాలక్ష కనిపిస్తున్నాయి.టాస్‌తో మొదలుపెడితే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ చాలా కీలకం. గెలిచిన జట్టు తప్పకుండా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంటుంది. ఎందుకంటే మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. తడి బంతితో బ్యాటర్లను నియంత్రించడం దాదాపు అసాధ్యం. అందుకే అంతటి భారీ లక్ష్యాన్ని అయినా దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. టీమిండియా కెప్టెన్‌ రాహుల్‌ టాస్‌ కోల్పోయిన వెంటనే సగం మ్యాచ్‌ను కోల్పోయాడు. ఈ విషయాన్ని మ్యాచ్‌ అనంతరం అతనే స్వయంగా అంగీకరించాడు.లోయర్‌ ఆర్డర్‌ వైఫల్యంటాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చినా టీమిండియా భారీ స్కోరే చేయగలిగింది. వాస్తవానికి ఇంకాస్త భారీ స్కోర్‌ రావాల్సి ఉండింది. అయితే డెత్‌ ఓవర్లలో వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా టీమిండియా పుట్టి ముంచారు. వీరిద్దరు చాలా నిదానంగా ఆడి అదనంగా రావాల్సిన 20-30 పరుగులకు అడ్డుకట్ట వేశారు. సుందర్‌ అయితే మరీ దారుణంగా ఆడి 8 బంతుల్లో కేవలం​ ఒకే ఒక పరుగు చేశాడు. జడ్డూ.. తానేమీ తక్కువ కాదన్నట్లు 27 బంతులు ఎదుర్కొని 24 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరు కాస్త వేగంగా ఆడుంటే స్కోర్‌ 380 దాటేది. ఈ స్కోర్‌ చేసుంటే టీమిండియా డిఫెండ్‌ చేసుకోగలిగేదేమో.మంచు ప్రభావంముందుగా అనుకున్నట్లుగానే రెండో ఇన్నింగ్స్‌ సమయంలో మంచు ప్రభావం​ చాలా తీవ్రంగా ఉండింది. ఆదిలో కాస్త తక్కువగా ఉన్నా చీకటి పడే కొద్ది దాని ప్రభావం అధికమైంది. దీంతో బౌలర్లు బంతిపై నియంత్రణ కోల్పోయారు. పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సునాయాసంగా వచ్చాయి. ఫీల్డర్ల వైఫల్యాలు దీనికి అదనం. దేశంలోనే అగ్రశ్రేణి ఫీల్డర్లు కూడా మిస్‌ ఫీల్డ్‌ చేశారు. సెంచరీ వీరుడు మార్క్రమ్‌ క్యాచ్‌ను జైస్వాల్‌ నేలపాలు చేయడం భారత ఓటమిని ప్రభావితం చేసింది.బ్రెవిస్‌ డ్యామేజ్‌బ్రెవిస్‌ ప్రమోషన్‌ పొంది ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కూడా టీమిండియా ఓటమికి ఓ కారణం​. ఈ డాషింగ్‌ బ్యాటర్‌ వచ్చీరాగానే భారత బౌలర్లపై ఎదురుదాడికి దాగాడు. ఏ బౌలర్‌ను కుదురుకోనివ్వలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని కరిగించాడు. పైగా అతను క్రీజ్‌లోకి రాగానే కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ తప్పిదం చేశాడు. తొలి వన్డేలో బ్రెవిస్‌ను ఔట్‌ చేశాడని హర్షిత్‌ రాణాను బరిలోకి దించాడు. అసలే హర్షిత్‌పై కసితో రగిలిపోతున్న బ్రెవిస్‌కు ఇది బాగా కలిసొచ్చింది. హర్షిత్‌తో పాటు మిగతా బౌలర్లపై కూడా విరుచుకుపడ్డాడు. తొలి వన్డేలో బ్రెవిస్‌ను ఔట్‌ చేసిన అనంతరం హర్షిత్‌ అతని పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం మారేదా..?టీమిండియా మరో 20-30 పరుగులు చేసుంటే గెలిచేదని కేఎల్‌ రాహుల్‌ సహా చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవానికి సఫారీలు ఉన్న ఊపుకు 380 స్కోర్‌ కూడా చాలేది కాదు. వాళ్లు లక్ష్యాన్ని ఛేదించాలన్న టార్గెట్‌ పెట్టుకొని బరిలోకి దిగలేదు. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మాత్రమే బరిలోకి దిగారు. ఒకవేళ భారత్‌ 380 పరుగులు చేసినా వారి లక్ష్యం మారేది కాదు. లక్ష్యాన్ని అమలు చేయడంలో భాగంగానే వారికి ఈ విజయం దక్కింది. అది 380 అయినా 420 అయినా వాళ్లు ఓటమినైతే ఒప్పుకునే వారు కాదు. వారి పోరాటాలు ఎలా ఉంటాయో జతమంతా చూసింది.

IND VS SA 2nd ODI: South Africa Captain Temba Bavuma Comments after Winning5
ఆ వ్యూహం పని చేసింది.. అద్భుతంగా ఆడాం..!

రాయ్‌పూర్‌ వేదికగా నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. రుతురాజ్‌, కోహ్లి సెంచరీల సాయంతో టీమిండియా భారీ స్కోర్‌ (358) చేసినా, మంచు ప్రభావం కారణంగా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది.సఫారీలు బౌలింగ్‌లో విఫలమైనా, బ్యాటింగ్‌లో అదరగొట్టి రికార్డు లక్ష్యాన్ని ఛేదించారు (4 బంతులు మిగిలుండగానే). మార్క్రమ్‌ సూపర్‌ సెంచరీతో.. బ్రెవిస్‌ మెరుపు విన్యాసాలతో.. బవుమా, బ్రీట్జ్కే, కార్బిన్‌ బాష్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో సౌతాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా (Temba Bavuma) హర్షం వ్యక్తం చేశాడు. నమ్మశక్యంకాని మ్యాచ్‌గా అభివర్ణించాడు. రికార్డు ఛేదన అంటూ సహచరులను కొనియాడాడు. మార్క్రమ్‌, బ్రీట్జ్కే, బ్రెవిస్‌, బాష్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా బ్రెవిస్‌ను ఆకాశానికెత్తాడు.బ్రెవిస్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌ ముందుకు పంపిన వ్యూహం పని చేసిందని చెప్పుకొచ్చాడు. కీలకమైన భాగస్వామ్యాలు గెలుపుకు కారణమయ్యాయని అభిప్రాయపడ్డాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆటను చివరి వరకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు.ఎంతటి భారీ లక్ష్యమైనా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లపై నమ్మకముంచితే గెలుపు సాధ్యమని అభిప్రాయపడ్డాడు. కార్బిన్‌ బాష్‌ చివర్లో పరిపక్వత చూపాడని ప్రశంసించాడు. బౌలింగ్‌ ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉందని తెలిపాడు. బర్గర్‌, జోర్జి గాయాల అప్‌డేట్‌ ఏంటనే అంశంపై స్పందిస్తూ.. తానేమీ డాక్టర్‌ను కానని వ్యంగ్యంగా అన్నాడు.మొత్తంగా ఈ విజయం జట్టుకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ గెలుపుతో సిరీస్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చామని అన్నాడు. కాగా, గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన బవుమా ఈ మ్యాచ్‌తోనే తిరిగి బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే తన జట్టును గెలిపించాడు. ఇటీవలికాలంలో బవుమా విజయాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారాడు. అతనాడిన ‍ప్రతి మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా గెలుస్తుంది. టెస్ట్‌ల్లో అయితే అతనికి తిరుగేలేదు. వ్యక్తిగత ప్రదర్శన ఎలా ఉన్నా జట్టును మాత్రం విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు.

IND VS SA 2nd ODI: Team India Captain KL Rahul Comment after losing6
రుతు, విరాట్‌ అద్భుతం.. ఆ రెండే కొంపముంచాయి: కేఎల్‌ రాహుల్‌

రాయ్‌పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్‌ 3) జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లి అద్భుత సెంచరీలతో చెలరేగి భారీ స్కోర్‌ అందించినా, టీమిండియా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. సౌతాఫ్రికా బ్యాటర్లు అసమాన పోరాటపటిమ కనబర్చి 359 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పెద్దగా కష్టపడకుండానే ఛేదించారు. మార్క్రమ్‌ బాధ్యతాయుతమైన సెంచరీ, బ్రెవిస్‌ మెరుపులు, భారత బౌలర్లు, ఫీలర్ల తప్పిదాలు సౌతాఫ్రికా గెలుపుకు కారణమయ్యాయి.గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడటంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) స్పందిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి మాటల్లోనే.."ఇలాంటి ఓటమిని జీర్జించుకోవడం కష్టం. వరుసగా రెండు టాస్‌లు కోల్పోవడం దురదృష్టకరం. ఈ విషయంలో నన్ను నేను నిందించుకుంటా. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం ఎంత కష్టమో, తడి బంతితో బౌలర్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో మరోసారి బయటపడ్డాయి.అంపైర్లు బంతి మార్చినా, డ్యూ ప్రభావం తగ్గలేదు. మరో 20–25 పరుగులు చేసుంటే బౌలర్లకు కాస్త కుషన్‌ దొరికేది. వారు శక్తి మేరకు పోరాడినా, ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు జరిగాయి. మొత్తంగా టాస్‌, డ్యూ కొంపముంచాయి. రుతురాజ్ ఆడిన ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. అతడు స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత టెంపో పెంచి జట్టుకు అదనపు పరుగులు అందించాడు. విరాట్‌ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. 53వ సారి తన పని తాను చేసుకుపోయాడు. లోయరార్డర్‌ బ్యాటర్లు ఇంకొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి, రెండు మూడు బౌండరీలు కొట్టుంటే ఆ 20 పరుగులు కూడా వచ్చేవి. నేను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు (ఐదో స్థానం) రావడం సందర్భానుసారంగా తీసుకున్న నిర్ణయం.

SUNIL NARINE COMPLETED 600 WICKETS IN T20 CAREER7
నరైన్‌@600.. లివింగ్‌స్టోన్‌ ధన్‌ ధనాధన్‌

విండీస్‌ టీ20 స్పెషలిస్ట్‌, స్పిన్‌ మాంత్రికుడు సునీల్‌ నరైన్‌ (Sunil Narine) పొట్టి క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో భాగంగా అబుదాబీ నైట్‌రైడర్స్‌కు సారథ్యం వహిస్తున్న అతను.. నిన్న (డిసెంబర్‌ 3) షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్‌ (టామ్‌ ఏబెల్‌) తీశాడు. ఇదేం మైలురాయి అనుకుంటున్నారా..? ఆగండి. ఈ వికెట్‌ నరైన్‌కు టీ20 క్రికెట్‌లో 600వది. ఈ ఫార్మాట్‌ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు (నరైన్‌తో కలుపుకొని) మాత్రమే ఈ ఘనత సాధించారు. నరైన్‌కు ముందు డ్వేన్‌ బ్రావో (631), రషీద్‌ ఖాన్‌ (681) 600 వికెట్ల క్లబ్‌లో చేరారు.లివింగ్‌స్టోన్‌ ఊచకోతషార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (Liam Livingstone) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 38 బంతుల్లో 8 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 82 పరుగులు చేశాడు. అతనితో పాటు అలెక్స్‌ హేల్స్‌ (32), షరాఫు (34), రూథర్‌ఫోర్డ్‌ (45) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వారియర్స్‌ చేతులెత్తేసింది. టిమ్‌ డేవిడ్‌ (24 బంతుల్లో 60; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఒక్కడే పోరాడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 194 పరుగులకే పరిమితమై 39 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. సునీల్‌ నరైన్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు ఓ వికెట్‌ తీసి 600 వికెట్ల క్లబ్‌లో చేరాడు.

The second Test of the Ashes series begins today8
ఈసారి ఎన్ని రోజుల్లో!

బ్రిస్బేన్‌: ప్రతిష్టాత్మక ‘యాషెస్‌’ సిరీస్‌లో రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌ మధ్య గురువారం నుంచి బ్రిస్బేన్‌లోని ‘గాబా’ స్టేడియంలో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో గెలిచిన ఆ్రస్టేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉంది. అదే జోరు కొనసాగిస్తూ ‘డే అండ్‌ నైట్‌’ టెస్టులోనూ విజయం సాధించాలని స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలోని ఆసీస్‌ జట్టు భావిస్తోంది. మరోవైపు 2010–11 నుంచి ఆసీస్‌ గడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా గెలవలేకపోయిన ఇంగ్లండ్‌ జట్టు ‘ఫ్లడ్‌ లైట్‌’ల వెలుతురులో జరగనున్న పోరులో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. ‘పింక్‌ బాల్‌’ టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉన్న ఆసీస్‌... ఇప్పటి వరకు ఆడిన 14 ‘గులాబీ’ టెస్టుల్లో 13 గెలిచి, ఒక్కటి మాత్రమే ఓడింది. ఫ్లడ్‌ లైట్‌ల వెలుతురులో అతిగా స్వింగ్‌ అయ్యే ఆసీస్‌ పేసర్ల బంతులను ఎదుర్కోవడం ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు శక్తికి మించిన పనే. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఉస్మాన్‌ ఖ్వాజా స్థానంలో జోష్‌ ఇన్‌గ్లిస్‌కు ఆ్రస్టేలియా తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయమే. గత మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో జట్టును గెలిపించిన ట్రావిస్‌ హెడ్‌ మరోసారి ఇన్నింగ్స్‌ ఆరంభించనుండగా... లబుషేన్, స్మిత్, గ్రీన్, కేరీ కీలకం కానున్నారు. బౌలింగ్‌లో స్టార్క్‌కు బొలాండ్, డగెట్‌ నుంచి చక్కటి సహకారం లభిస్తోంది. మరోవైపు ‘బాజ్‌బాల్‌’నే నమ్ముకున్న ఇంగ్లండ్‌ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్‌తో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగానే ఉన్నా... వీరంతా సమష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఆర్చర్, అట్కిన్సన్, కార్స్‌ కీలకం కానున్నారు.

Indian team suffers first defeat in Junior Womens World Cup Hockey tournament9
భారత్‌కు తొలి పరాజయం

సాంటియాగో (చిలీ): జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. జర్మనీ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. భారత్‌ తరఫున హీనా బానో 58వ నిమిషంలో ఏకైక గోల్‌ చేసింది. జర్మనీ జట్టుకు లీనా ఫ్రెరిచ్స్‌ (5వ నిమిషంలో), అనిక షానాఫ్‌ (52వ నిమిషంలో), మార్టినా రీసెంగర్‌ (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయితే భారత్‌ ఒక్క దానిని మాత్రమే సది్వనియోగం చేసుకుంది. మరోవైపు జర్మనీ జట్టుకు తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ లభించాయి. ఇందులో జర్మనీ ఒక పెనాల్టీ కార్నర్‌ను, పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్స్‌గా మలిచింది. మరోటి ఫీల్డ్‌ గోల్‌గా వచ్చింది. చివరి పది నిమిషాల్లో భారత్‌ పట్టుకోల్పోయి రెండు గోల్స్‌ సమర్పించుకోవడం గమనార్హం. నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘సి’లో జర్మనీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.భారత్, ఐర్లాండ్‌ మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. రేపు జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్‌ తలపడుతుంది. క్వార్టర్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. తొలిసారి 24 జట్లు పోటీపడుతున్న ఈ మెగా టోర్నీలో ఆరు గ్రూప్‌లు చేశారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆరు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన రెండు ఉత్తమ జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

Ashish wins individual gold at Asian Equestrian Games10
ఆశిష్‌ అద్భుతం

న్యూఢిల్లీ: కేంద్రం నుంచి ఆర్థికంగా చేయూత లభించడంతో... ఆసియా ఈక్వె్రస్టియన్‌ (అశ్విక క్రీడలు) చాంపియన్‌షిప్‌లో భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. థాయ్‌లాండ్‌లోని పటాయా నగరంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఒక స్వర్ణం, నాలుగు రజతాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో మెరిసింది. ఈవెంటింగ్‌ కేటగిరీలో టార్గెట్‌ ఏషియన్‌ గేమ్స్‌ గ్రూప్‌ (టీఏజీజీ) సభ్యుడైన ఆశిష్‌ లిమాయే స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ఆసియా ఈక్వె్రస్టియన్‌ పోటీల చరిత్రలో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆశిష్‌ లిమాయే, శశాంక్‌ సింగ్‌ కటారియా, శశాంక్‌ కనుమూరిలతో కూడిన భారత జట్టు ఈవెంటింగ్‌ టీమ్‌ విభాగంలో రజత పతకం సాధించింది. డ్రెసాజ్‌ ఈవెంట్, ఇంటర్మీడియట్‌ ఫ్రీస్టయిల్‌–1 వ్యక్తిగత విభాగాల్లో శ్రుతి వోరా రజత పతకాలు నెగ్గింది. డ్రెసాజ్‌ టీమ్‌ విభాగంలో శ్రుతి వోరా, దివ్యకీర్తి సింగ్, గౌరవ్‌ పుందిర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం హస్తగతం చేసుకుంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ 16 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించింది. జాతీయ క్రీడా సమాఖ్యలకు చేయూత పథకంలో భాగంగా భారత బృందంపై రూ. 2 కోట్ల 73 లక్షలు వెచ్చించారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement