ప్రధాన వార్తలు
భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టు.. సిద్దమవుతున్న స్పెషల్ పిచ్
గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్ తమ ప్రయోగాలకు ఫుల్స్టాప్ పెట్టింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో చావు దెబ్బ తినడంతో గౌహతి టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్ను తయారు చేయాలని క్యూరేటర్ను టీమ్ మేనెజ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కోల్కతాలో ఉపయోగించిన నల్ల మట్టి పిచ్లా కాకుండా.. రెడ్ సాయిల్ పిచ్లపై పేస్తో పాటు బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాక్లపై క్రాక్స్ కూడా ఎక్కువగా రావు. అంతేకాకుండా ఆట ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కూడా పిచ్ అనుకూలించే అవకాశముంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం, బీసీసీఐ ప్రధాన క్యూరేటర్ ఆశిష్ భౌమిక్ ఇప్పటికే పిచ్ను తాయారు చేయడం మొదలు పెట్టినట్లు సమాచారం."గౌహతిలోని పిచ్ ఎర్ర మట్టితో తయారు అవుతోంది. సాధారణంగా ఈ ట్రాక్పై స్పీడ్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా హోం సీజన్ ప్రారంభానికి ముందే తమ డిమాండ్లు స్పష్టంగా చెప్పింది. ఒకవేళ పిచ్లో టర్న్ ఉంటే వేగంతో ఎక్కువగా బౌన్స్ కూడా ఉంటుంది. ఎక్కువ అస్థిరమైన బౌన్స్ లేకుండా ఉండేలా క్యూరేటర్లు ప్రయత్నిస్తున్నారు" అని బీసీసీఐ అధికారి ఒకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో పేర్కొన్నారు. కాగా తొలి టెస్టు జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్పై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పై ఇరు జట్లు బ్యాటర్లు తేలిపోయారు. టెస్టు మొత్తంలో ఒక్క జట్టు కూడా 200 పరుగుల స్కోర్ దాటలేకపోయింది. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈడెన్ పిచ్ క్యూరేటర్కు సపోర్ట్గా నిలిచాడు. ఆ పిచ్ పూర్తిగా తన అభ్యర్థన మేరకే తయారు చేశారని గంభీర్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి పిచ్ కారణం కాదని, బ్యాటింగ్ వైఫల్యమేనని గౌతీ పేర్కొన్నాడు.
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
సుదీర్ఘ కెరీర్లో బంగ్లాదేశ్ క్రికెట్కు మూలస్థంభంలా నిలిచిన ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఢాకా వేదికగా బుధవారం ఐర్లాండ్ (BAN vs IRE Test)తో మొదలైన టెస్టు మ్యాచ్ అతడి కెరీర్లో 100వది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ గుర్తింపు పొందాడు.కాగా 18 ఏళ్ల 17 రోజుల వయసులో మొదటి టెస్టు ఆడిన ముష్ఫికర్ రహీమ్.. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం (Lord's Stadium)లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. తర్వాతి రోజుల్లో బంగ్లా తరఫున అత్యంత కీలక ఆటగాడిగా అతడు ఎదిగాడు. మిడిలార్డర్ బ్యాటర్గాటెస్టుల్లో పెద్ద స్థాయికి చేరలేకపోయిన తన టీమ్ వరుస పరాజయాల్లో భాగమైన రహీమ్...జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ ఖాన్ తర్వాతవికెట్ కీపర్గా జట్టులోకి వచ్చినా... క్రమేణా తన బ్యాటింగ్కు మెరుగులు దిద్దుకొని కీపింగ్ వదిలేసి రెగ్యులర్ మిడిలార్డర్ బ్యాటర్గా ముష్ఫికర్ రహీమ్ సత్తా చాటాడు. సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ ఖాన్ తర్వాత టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న (20 ఏళ్ల 5 నెలల 25 రోజులు) ఆటగాడిగా అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడం విశేషం. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తరఫున 99 టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ 38.02 సగటుతో 6351 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్కు 34 టెస్టుల్లో కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించిన అతడు ...55 టెస్టుల్లో వికెట్ కీపర్గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ఐర్లాండ్రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు ఐర్లాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సెల్హైట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్.. ఐరిష్ జట్టును ఇన్నింగ్స్ మీద 47 పరుగుల తేడాతో ఓడించింది.ఇక బంగ్లా- ఐర్లాండ్ మధ్య బుధవారం ఢాకా వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామ సమయానికి బంగ్లాదేశ్ 31 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.ఓపెనర్లలో మహ్ముదుల్ హసన్ జాయ్ 34, షాద్మాన్ ఇస్లాం 35 పరుగులు చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో (8) విఫలమయ్యాడు.వన్డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్ (17*)కు తోడుగా ముష్ఫికర్ రహీమ్ (3*) క్రీజులో ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ ఆండీ మెక్బ్రిన్ మూడు వికెట్లు కూల్చాడు. చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు!
IPL 2026: ‘అతడొక డమ్మీ కెప్టెన్.. చేసేదంతా వేరొకరు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్ సందడి మొదలైపోయింది. ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు రిటెన్షన్, రిలీజ్ జాబితాలు విడుదల చేసి వేలానికి సిద్ధమైపోయాయి. అబుదాబి వేదికగా డిసెంబరు 16న జరుగనున్న వేలం పాటలో పాల్గొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎనిమిది జట్లు తమ కెప్టెన్లను ఖరారు చేశాయి. ఇందులో ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)నే తమ సారథిగా కొనసాగిస్తానని చెప్పడం విశేషం. రవీంద్ర జడేజాను ఇచ్చేసి.. రాజస్తాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్ (Sanju Samson)కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే, యాజమాన్యం మాత్రం రుతు వైపే మొగ్గుచూపింది.ఇప్పుడే జట్టులో చేరిన సంజూ శాంసన్ను ప్రస్తుతానికి వైస్ కెప్టెన్గా నియమించాలని సీఎస్కే మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడొక డమ్మీ కెప్టెన్.. రుతురాజ్ గైక్వాడ్ కేవలం పేపర్ మీద మాత్రమే సారథిగా కనిపిస్తాడని.. అతడొక డమ్మీ కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనినే మైదానం లోపల, వెలుపల నిజమైన సారథిగా వ్యవహరిస్తాడని కైఫ్ పేర్కొన్నాడు.‘‘ధోని బ్యాటింగ్ చేయడానికి తుదిజట్టులోకి రాడు. 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడానికి.. 20 ఓవర్ల పాటు కెప్టెన్సీ చేయడానికి మాత్రమే జట్టులో ఉంటాడు. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడాలో మైదానంలోనే మార్గదర్శనం చేస్తాడు.అంతా ధోని కనుసన్నల్లోనేగైక్వాడ్ను గైడ్ చేయడానికే ధోని మైదానంలో ఉంటాడు. మెంటార్గా, కెప్టెన్గా మాత్రమే ధోని మైదానంలో దిగుతాడు. పేపర్ మీద మాత్రం గైక్వాడ్ పేరు కెప్టెన్గా ఉంటుంది. అయితే, మైదానంలో, మైదానం వెలుపల అంతా ధోని కనుసన్నల్లోనే నడుస్తుంది.కాబట్టి ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడని అనుకోవడం పొరపాటే. తనకు తానుగా ధోని ఈ నిర్ణయం తీసుకుంటే తప్ప.. అతడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశమే లేదు’’ అని కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ధోని వారసుడిగాకాగా చెన్నైని ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ధోని. అయితే, 2022లో తన వారసుడిగా రవీంద్ర జడేజాను ధోని ప్రకటించగా.. వరుస మ్యాచ్లలో ఓటమి నేపథ్యంలో జడ్డూ మధ్యలోనే వైదొలిగాడు. దీంతో మళ్లీ ధోనినే పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత 2024లో రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. కానీ 2025లో గాయం వల్ల రుతు కూడా మధ్యలోనే దూరం కాగా.. మళ్లీ ధోనినే సారథిగా వ్యవహరించాడు. చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు!
గంభీర్ ఆలోచించుకో.. మూడో స్థానానికి అతడు సరిపోడు: గంగూలీ
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు శనివారం(నవంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. తొలి టెస్టులో చేసిన తప్పిదాలను గౌహతిలో పునరావృతం చేయకూడదని భారత్ పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్మెంట్కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక సూచనలు చేశాడు. నంబర్ 3 స్ధానానికి వాషింగ్టన్ సుందర్ సరిపోడని, టాప్ 5లో కచ్చితంగా స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉండాలని దాదా అభిప్రాయపడ్డాడు. కాగా కోల్కతా టెస్టులో మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి 60 పరుగులు చేశాడు. వాస్తవానికి ఆ స్ధానం సాయి సుదర్శన్ది. ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన సుదర్శన్ స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో మాత్రం సత్తాచాటాడు.అయినప్పటికి సఫారీలతో తొలి టెస్టుకు సుదర్శన్ను టీమ్ మేనెజ్మెంట్ పక్కన పెట్టింది. దీంతో హెడ్ కోచ్ గంభీర్పై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తొలి టెస్టులో నలుగురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగింది."వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన క్రికెటర్. అతడికి మంచి ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్లో మూడో నంబర్ స్ధానానికి అతడు సరిపోడు. గతంలో చాలా మంది దిగ్గజాలు ఆ స్ధానంలో బ్యాటింగ్ చేశారు. దీర్ఘ కాల ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. టాప్-5లో కచ్చితంగా స్పెషలిస్టు బ్యాటర్లు ఉండాలి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ వంటి కఠిన పరిస్ధితుల్లో కూడా బ్యాటింగ్ చేస్తే సత్తా ఉన్న ఆటగాళ్లకి టాప్-5లో చోటు ఇవ్వాలి. గౌతమ్ గంభీర్ దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. తొలి టెస్టులో వాషి కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. పిచ్పై టర్న్ వున్నప్పటికి ప్రధాన స్పిన్నర్లు ముగ్గురు జట్టులో ఉంటే సరిపోతుంది" అని ఇండియా టూడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.చదవండి: 'ద్రవిడ్నే ట్రోల్ చేశారు.. ఇప్పుడు గంభీర్ ఒక లెక్కా'
'ద్రవిడ్నే ట్రోల్ చేశారు.. ఇప్పుడు గంభీర్ ఒక లెక్కా'
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం అందరని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది.ఇరు జట్లు కూడా ఒక్కసారి కూడా 200 పరుగుల మార్క్ను అందుకోలేకపోయాయి. ఈ మ్యాచ్ తొలి రోజు నుంచి బౌలర్లే ఆధిపత్యం చెలాయించారు. దీంతో పిచ్పై తీవ్రస్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఇటువంటి పిచ్లు టెస్టు క్రికెట్ నాశనం చేస్తున్నాయి అని మాజీలు మండిపడ్డారు. అయితే ఈడెన్ పిచ్ను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమర్ధించడం కొత్త వివాదానికి దారితీసింది.పిచ్లో భూతాలు లేవని, బ్యాటర్లు తప్పిదం వల్లే ఓడిపోయామని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలను అనిల్ కుంబ్లే, డెల్ స్టెయిన్ వంటి దిగ్గజాలు తప్పుబట్టారు. అస్సులు ఇటువంటి పిచ్ను తాము చూడలేదని వారు ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం గంభీర్కు మద్దతుగా నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్లో ఓటమికి గంభీర్ను బాధ్యుడిని చేయకూడదని ఊతప్ప అభిప్రాయపడ్డాడు."నేను గంభీర్ను డిఫెండ్ చేస్తున్నానని విమర్శిస్తున్నారు. కానీ మ్యాచ్ ఫలితాన్ని కోచ్తో ముడిపెట్టడం సరికాదు. ఎందుకంటే మైదానంలో కోచ్ వెళ్లి ఆడలేడు కాదా. గెలుపు ఓటములు సహజం. గతంలో రాహుల్ ద్రవిడ్ను కూడా ఈ విధంగానే విమర్శించారు. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 25 వేల పరుగులు చేసిన ద్రవిడ్ను ట్రోల్ చేసినప్పుడు.. గంభీర్ వారికి ఒక లెక్క కాదు. గతంలో దేశవాళీ టోర్నీలో పేలవమైన పిచ్లను తయారు తయారుచేసినందుకు క్యూరేటర్లను బీసీసీఐ మందలించింది. కానీ అంతర్జాతీయ మ్యాచ్ల విషయంలో మాత్రం అలా జరగడం లేదు. టర్నింగ్ ట్రాక్లను సిద్దం చేయమని ఎవరూ ప్రోత్సహించరు. కానీ సహజంగా మూడో రోజు, నాలుగో రోజులలో ఎక్కువ టర్న్ ఉండే పిచ్లు ఉపఖండంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్పిన్ బాగా ఆడే ప్లేయర్లు తాయారు చేయాల్సిన బాధ్యత భారత్పై ఉంది. గత కొన్నేళ్ల నుంచి మనల్ని స్పిన్ సమస్య వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ సమస్యపై టీమ్ మెనెజ్మెంట్, సెలక్టర్లు దృష్టిసారించాలని ఊతప్ప పేర్కొన్నాడు.చదవండి: PAK vs ZIM: పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్
రవిచంద్రన్ డబుల్ సెంచరీ.. కర్ణాటక ఘనవిజయం
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో కర్ణాటక జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. చండీగఢ్తో మంగళవారం ముగిసిన పోరులో కర్ణాటక ఇన్నింగ్స్, 185 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్నైట్ స్కోరు 72/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన చండీగఢ్... 63.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్ వోహ్రా (161 బంతుల్లో 106 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 7 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దక్కించుకున్న కర్ణాటక జట్టు... ప్రత్యరి్థని ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్లోనూ అదే వైఫల్యం కొనసాగించిన చండీగఢ్ 33.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. శివమ్ బాంబ్రీ (43) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మనన్ వోహ్రా (6) సహా మిగిలిన వాళ్లంతా ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 3, శిఖర్ శెట్టి 5 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్ను 547/8 వద్ద డిక్లేర్ చేసింది. డబుల్ సెంచరీతో చెలరేగిన కర్ణాటక బ్యాటర్ రవిచంద్రన్ స్మరణ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన కర్ణాటక 2 విజయాలు, 3 ‘డ్రా’లతో 21 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. షాబాజ్ అహ్మద్ సెంచరీ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ (122 బంతుల్లో 101; 11 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అస్సాంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 109.1 ఓవర్లలో 442 పరుగులకు ఆలౌటైంది. సుమంత గుప్తా (97) మూడు పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు. టీమిండియా ప్లేయర్ మొహమ్మద్ షమీ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం జట్టు... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసింది. షమీ (2/29) వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి అస్సాంను కట్టడి చేశాడు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న అస్సాం ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరు సమం చేసేందుకే ఇంకా 144 పరుగులు చేయాల్సి ఉంది. విహారి, విజయ్ విఫలం రంజీ ట్రోఫీలో త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ఆటగాళ్లు హనుమ విహారి, విజయ్ శంకర్ మరోసారి విఫలమయ్యారు. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా రైల్వేస్తో జరిగిన పోరులో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్లో విహారి 42 బంతులాడి 6 పరుగులు చేయగా... విజయ్ శంకర్ (11) కూడా ఫ్రభావం చూపలేకపోయాడు. దీంతో త్రిపుర రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా రైల్వేస్ జట్టు ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు త్రిపుర తొలి ఇన్నింగ్స్లో 136 పరుగులే చేయగా... రైల్వేస్ 446/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రాజ్ చౌదరీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సౌరాష్ట్రతో మ్యాచ్లో గోవా పోరాడుతోంది. సౌరాష్ట్ర 585/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... గోవా జట్టు తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్తో మ్యాచ్లో కేరళ జట్టు 315 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌట్ కాగా... కేరళ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సచిన్ బేబీ (85 బ్యాటింగ్), బాబా అపరాజిత్ (89 బ్యాటింగ్) అజేయ అర్ధశతకాలతో రాణించారు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా పాండిచ్చేరితో మ్యాచ్లో ముంబై జట్టు విజయానికి చేరువైంది. ముంబై 630/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... పాండిచ్చేరి తొలి ఇన్నింగ్స్లో 132 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. రాజస్తాన్తో మ్యాచ్లో ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. 570/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన రాజస్తాన్కు 274 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో బరోడా జట్టు విజయానికి 203 పరుగుల దూరంలో ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్లో 169 పరుగులు చేయగా... బరోడా 166 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో విదర్భ 272 పరుగులు చేసి బరోడా ముందు 276 పరుగుల లక్ష్యం నిలిపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బరోడా రెండో ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్ (157 బంతుల్లో 98 బ్యాటింగ్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) పోరాడటంతో ఉత్తర ప్రదేశ్ జట్టు 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు జట్టు 455 పరుగులకు ఆలౌట్ కాగా... ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం 116 పరుగులు వెనుకబడి ఉంది.
పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నమెంట్ను పాకిస్తాన్ విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ తొలి పోరులో ఆతిథ్య పాక్ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన పోరులో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బ్రియాన్ బెనెట్ (36 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ సికందర్ రజా (24 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), మరుమని (22 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ 2 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా, సల్మాన్ మీర్జా, సయీమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసి విజయం సాధించింది. ఫఖర్ జమాన్ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మొహమ్మద్ నవాజ్ (12 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సయీమ్ అయూబ్ (22; 1 ఫోర్, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (1), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (0) విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ముక్కోణపు టోర్నీలో భాగంగా గురువారం శ్రీలంకతో జింబాబ్వే తలపడనుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్.. అయినా సెమీస్కు భారత్
వైభవ్ సూర్యవంశీ ఫెయిల్.. అయినా సెమీస్కు భారత్
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో జితేశ్ శర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. వసీమ్ అలీ (45 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరవగా... కెపె్టన్ హమ్మద్ మీర్జా (16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. భారత ‘ఎ’ జట్టు బౌలర్లలో గుర్జపనీత్ సింగ్, సుయాశ్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా... విజయ్ కుమార్ వైశాక్, హర్‡్ష దూబే, నమన్ ధిర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత ‘ఎ’ జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్ష్ దూబే (44 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకోగా... నమన్ ధీర్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ షాట్లతో అలరించాడు. ఐపీఎల్ స్టార్లు వైభవ్ సూర్యవంశీ (12), ప్రియాన్ష్ ఆర్య (10) ఎక్కువసేపు నిలవలేకపోయారు. నేహల్ వధేరా (23) ఫర్వాలేదనిపించాడు. గ్రూప్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో 4 పాయింట్లతో భారత ‘ఎ’ జట్టు ముందంజ వేసింది.
సంజూ ఎంట్రీ.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన సీఎస్కే
టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన స్వాగతం పలికింది. అదిరిపోయే వీడియోతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందులో మలయాళీ డైరెక్టర్, నటుడు బాసిల్ జోసెఫ్ (Basil Joseph) కూడా కనిపించడం విశేషం.రూ. 18 కోట్లు చెల్లించిఐపీఎల్-2026 వేలానికి ముందే సీఎస్కే సంజూ శాంసన్ (Sanju Samson)ను తమ ఫ్రాంఛైజీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ రాయల్స్ నుంచి సంజూను సీఎస్కే సొంతం చేసుకుంది. రాయల్స్ కెప్టెన్ను తమ జట్టులో చేర్చుకునేందుకు.. దాదాపు పదమూడేళ్లుగా తమతో కలిసి ప్రయాణం చేస్తున్న స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై వదులుకుంది.వైస్ కెప్టెన్గా సంజూ!జడ్డూతో పాటు.. సామ్ కర్రాన్ను కూడా రాజస్తాన్ రాయల్స్కు ఇచ్చేసి.. సంజూను ట్రేడ్ చేసుకుంది సీఎస్కే. అంతేకాదు.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్గా సంజూను నియమించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. ఇక సంజూకు స్వాగతం పలుకుతూ.. ‘‘చేటా ఈజ్ హియర్ (అన్న వచ్చేశాడు)’’ సీఎస్కే షేర్ చేసిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది.భారీ కటౌట్ఇందులో బాసిల్ జోసెఫ్.. ‘‘సోదరా.. సమయం వచ్చింది. పని మొదలుపెట్టండి.. ఎలాంటి తప్పిదాలు జరగకూడదు. మన వాళ్లందరినీ తీసుకురండి. సమయానికల్లా అంతా సిద్ధమైపోవాలి’’ అని చెప్పగా ఓ బృందమంతా కలిసి రాత్రీపగలు కష్టపడి సంజూ భారీ కటౌట్ను ఏర్పాటు చేస్తాయి. ఈ క్రమంలోనే సంజూ కూడా ఎల్లో జెర్సీ వేసుకుని రెడీ అయిపోతాడు. ఆఖర్లో విక్రమ్ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సంజూ ఎంట్రీకి మరింత హైప్ ఇచ్చారు. ‘‘రావాలనుకున్నపుడే.. సరైన సమయంలోనే వచ్చా’’ అన్న క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా సంజూ శాంసన్ చాలా ఏళ్లుగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్నాడు. 2022లో జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే, గతేడాది ఫిట్నెస్ సమస్యల వల్ల ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఇందుకు తోడు మేనేజ్మెంట్తో విభేదాలు తలెత్తాయనే వార్తలు రాగా.. సంజూ సీఎస్కేకు మారడం గమనార్హం. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 172 ఇన్నింగ్స్ ఆడిన సంజూ 4704 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl)
IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. ప్రత్యర్థులకు చుక్కలే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చాయి. తమ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉన్న క్రికెటర్లను కూడా వేలంలోకి విడిచిపెట్టాయి. టాటా.. బైబైముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ తమ అత్యంత ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్తో పాటు.. చాలా ఏళ్లుగా జట్టుతో కొనసాగుతున్న దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్కు స్వస్తి పలికింది. వీరిద్దరితో పాటు సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ (Quinto De Kock)ను కూడా జట్టు నుంచి రిలీజ్ చేసింది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell)ను వదిలేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ భారత స్పిన్నర్ రవి బిష్ణోయి (Ravi Bishnoi)ని వదిలించుకుంది. అదే విధంగా.. టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ను కూడా రిలీజ్ చేసింది.వదిలేశారుఇక చెన్నై సూపర్ కింగ్స్ సైతం ఊహించని రీతిలో శ్రీలంక యువ పేసర్, ధోని ప్రియ శిష్యుడిగా పేరొందిన మతీశ పతిరణను వేలంలోకి వదిలింది. రాహుల్ త్రిపాఠి సేవలకు కూడా గుడ్బై చెప్పింది.అదే విధంగా ఈ సీజన్తో ట్రోఫీ గెలవాలన్న కల నెరవేర్చుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మయాంక్ అగర్వాల్ను వదిలివేయగా.. సన్రైజర్స్ హైదరాబాద్ అభినవ్ మనోహర్కు టాటా చెప్పేసింది. రాజస్తాన్ రాయల్స్ ఆకాశ్ మధ్వాల్కు వీడ్కోలు పలకగా.. అరంగేట్రంలోనే దుమ్ములేపిన కేరళ బౌలర్ విఘ్నేశ్ పుతూర్ను వదిలేసింది.ఫ్రాంఛైజీలు వదిలేసిన ఈ పదకొండు ఆటగాళ్లు కలిస్తే గొప్ప ప్లేయింగ్ ఎలెవన్ను తయారు చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. వీళ్లంతా కలిసి ఉండే తుదిజట్టుతో ప్రత్యర్థి జట్టును వణికించవచ్చని అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఎవరెవరు ఏ స్థానంలో సరిపోతారంటే?టాపార్డర్క్వింటన్ డికాక్ కెప్టెన్గా, వికెట్ కీపర్గా బెస్ట్ ఆప్షన్. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఓపెనర్గానూ విధ్వంసం సృష్టించగలడు. ఇక అతడికి తోడుగా మయాంక్ అగర్వాల్ కొత్త బంతిని ఎదుర్కోవడంలో సత్తా చాటగలడు. మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి కుదురుకున్నాడంటే అతడికి తిరుగు ఉండదు.మిడిలార్డర్లో పవర్ హిట్టర్స్ఇక త్రిపాఠి తర్వాతి స్థానంలో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ భేష్. ఐదో స్థానంలో గ్లెన్ మాక్స్వెల్ పవర్హిట్టర్గా దంచేయగలడు. ముఖ్యంగా స్పిన్ను ఈ ఆల్రౌండర్ సమర్థంగా ఎదుర్కోగలడు. అదే విధంగా.. ఆఫ్ స్పిన్తో బౌలింగ్ విభాగంలోనూ సేవలు అందించగలడు.ఆరో స్థానంలో ఆండ్రీ రసెల్ను మించిన వీరుడు ఎవరూ ఉండరు. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడే ఈ విండీస్ దిగ్గజం ఫినిషర్గా సత్తా చాటగలడు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ బ్యాటింగ్కు వస్తే బాగుంటుంది. దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలడు.బౌలింగ్ విభాగం.. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్డెత్ ఓవర్లలో లంక పేసర్ మతీశ పతిరణ స్పెషలిస్టు బౌలర్గా దుమ్ములేపగలడు. అతడికి తోడుగా ఆకాశ్ మధ్వాల్ ఉంటే సరి. ఇక ఆకాశ్ దీప్ కొత్త బంతితో స్వింగ్ రాబట్టి ప్రత్యర్థులను భయపెట్టగలడు. పవర్ ప్లేలో కెప్టెన్ అనుకున్న ఫలితాన్ని రాబట్టగలడు.స్పిన్నర్ల కోటాలో రవి బిష్ణోయి నాయకుడిగా ఉంటే.. విఘ్నేశ్ పుతూర్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా అతడికి తోడుగా ఉండగలడు. మిడిల్ ఓవర్లలో ఇద్దరూ చక్కగా బంతిని రొటేట్ చేసుకుంటూ సమన్వయంతో ముందుకు సాగితే జట్టుకు తిరుగు ఉండదు.ఫ్రాంఛైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్క్వింటన్ డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్, గ్లెన్ మాక్స్వెల్, ఆండ్రీ రసెల్, అభినవ్ మనోహర్, ఆకాశ్ మధ్వాల్, రవి బిష్ణోయి, ఆకాశ్ దీప్, మతీశ పతిరణఇంపాక్ట్ సబ్స్టిట్యూట్: విఘ్నేశ్ పుతూర్.చదవండి: సాయి, పడిక్కల్ కాదు!.. గిల్ స్థానంలో ఊహించని ఆటగాడుపది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే
హరికృష్ణ, అర్జున్ గేమ్లు ‘డ్రా’
పనాజీ: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ చె...
ఇషా సింగ్కు కాంస్యం
కైరో: ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతా...
సెమీఫైనల్లో లక్ష్య సేన్
కుమామోటో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ...
చరిత్ర సృష్టించిన ధీరజ్, అంకిత
ఢాకా: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత స్టార్స్...
రవిచంద్రన్ డబుల్ సెంచరీ.. కర్ణాటక ఘనవిజయం
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో కర్ణాటక జట్టు రె...
పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నమెంట్ను ...
సాధనలో స్పిన్ మంత్రం
కోల్కతా: ఎజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్, సైమన్ హ...
వైభవ్ సూర్యవంశీ ఫెయిల్.. అయినా సెమీస్కు భారత్
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో ...
క్రీడలు
నా జీవితంలోని ఆల్రౌండర్కు హ్యాపీ బర్త్ డే: సూర్యకుమార్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్కప్ విన్నర్ శ్రీచరణి (ఫొటోలు)
అక్షర్ పటేల్ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)
కోట్ల విలువైన కారు కొన్న టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)
నా హ్యాపీ బర్త్డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్ (ఫొటోలు)
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)
తిరుమల కొండపై ఏడు అడుగుల మహిళ (ఫోటోలు)
వరల్డ్ కప్ ట్రోఫీతో మంధాన, పలాష్ ముచ్చల్ జంట (ఫోటోలు)
వీడియోలు
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల
క్రీడా కీర్తి కిరీటం
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
జీసస్ నన్ను నడిపించాడు బైబిల్ పోరాడేలా చేసింది? జెమిమా ఎమోషనల్
ఫైనల్ కు చేరిన భారత్
ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు
