Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Gary Kirsten appointed head coach of Sri Lankan mens team1
శ్రీలంక హెడ్‌ కోచ్‌గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి

తాము సంయుక్తంగా (భారత్‌తో పాటు) ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌-2026లో ఘోరంగా విఫలమైన (సూపర్‌-8 దశలో నిష్క్రమణ) తర్వాత శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రక్షాళన చేపట్టింది. టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తిని హెడ్‌ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. అతని పేరు గ్యారీ కిర్‌స్టన్‌. ఈ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్‌ 2011లో టీమిండియాను జగజ్జేతగా (హెడ్‌ కోచ్‌గా) నిలిపాడు.పొట్టి ప్రపంచకప్‌ వైఫల్యాల నేపథ్యంలో అప్పటివరకు హెడ్‌ కోచ్‌గా ఉండిన సనత్‌ జయసూర్య తన పదవికి రాజీనామా చేయడంతో లంక క్రికెట్‌ బోర్డు కిర్‌స్టన్‌ను ఎంపిక​ చేసింది. కిర్‌స్టన్‌ రెండేళ్ల ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 15న బాధ్యతలు చేపడతారు. 2027 వన్డే ప్రపంచకప్‌ లక్ష్యంగా లంక క్రికెట్‌ కిర్‌స్టన్‌ నియామకం చేపట్టింది.కిర్‌స్టన్‌ను హెడ్‌ కోచ్‌గా మంచి ట్రాక్‌ ఉంది. అంతర్జాతీయంగా, ఐపీఎల్‌లో అతను విజయవంతమైన జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానానికి కూడా చేర్చాడు. అలాగే తన సొంత జట్టు దక్షిణాఫ్రికాకు కూడా విజయవంతంగా సేవలందించాడు. అతని కెరీర్‌లో ఏదైనా ఫెయిల్యూర్‌ ఉందా అంటే అది పాకిస్తాన్‌ వైట్‌ బాల్‌ జట్టుకు కోచ్‌గా సేవలందించడమే. పాక్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే అతను రాజీనామా చేశాడు (బోర్డు మరియు ఆటగాళ్లతో విభేదాల కారణంగా).ఐపీఎల్‌లో కిర్‌స్టన్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో పని చేశారు. టైటాన్స్ 2022లో తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచినప్పుడు అతను బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు శ్రీలంకను నేరుగా అర్హత సాధించేలా చేయడమే కిర్‌స్టన్‌ ప్రధాన లక్ష్యం. లంక క్రికెట్‌ కొద్ది రోజుల క్రితమే తమ మహిళల జట్టు కోచ్‌ను ( జేమీ సిడ్డన్స్‌) కూడా మార్చింది.

Gautam Gambhir dedicates T20 World Cup win to 2 people2
ఈ విజ‌యం వారిద్ద‌రికీ అంకితం: గంభీర్

టీమిండియా సొంత‌గ‌డ్డ‌పై టి20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిల‌వ‌డంతో హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ పేరు మారుమోగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు అత‌డిని తిట్టిపోసిన వారు కూడా ఇప్పుడు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. టీమిండియా క్రెడిట్ అంతా గౌతీదేన‌ని పొగుడుతున్నారు. గంభీర్ మాత్రం ఇద్ద‌రు దిగ్గజాల పేర్లు చెప్పాడు. మెన్ ఇన్ బ్లూ విజ‌యాల వెనుక వీరిద్ద‌రూ ఉన్నార‌ని మీడియా ముఖంగా ప్ర‌క‌టించాడు.మ్యాచ్ ముగిసిన త‌ర్వాత కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌తో క‌లిసి మీడియాతో మాట్లాడాడు గంభీర్‌. టీమిండియా టి20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యాన్ని ఎవరికి అంకితం చేస్తార‌ని మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు గంభీర్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానం ఇచ్చాడు. ఎవ‌రూ ఊహించ‌ని పేర్లు చెప్పాడు. వారే రాహుల్ ద్ర‌విడ్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌. టీమిండియా విజ‌యాల్లో వీరిద్ద‌రి పాత్ర ఎంతో ఉంద‌ని గంభీర్ గుర్తు చేసుకున్నాడు."టి20 ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నాను. భారత జట్టును ద్రవిడ్ ఒక స్థానంలో ఉంచారు. అలాగే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను లక్ష్మణ్ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నడిపిస్తూ జ‌ట్టుకు విలువైన సేవ‌లు అందిస్తున్నార‌"ని గంభీర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్ర‌విడ్.. గంభీర్ కంటే టీమిండియా హెచ్‌కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.వారిద్ద‌రికీ కృతజ్ఞతలుఐసీసీ ప్ర‌స్తుత‌ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్య‌ద‌ర్శి జైషా త‌న‌కు క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచార‌ని వెల్ల‌డించారు. గ‌తేడాది స్వ‌దేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న‌ప్పుడు జైషా ద‌న్నుగా నిలిచార‌ని తెలిపాడు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా నిజాయితీగా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోయార‌ని బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌ను పొగిడారు. వీరిద్ద‌రికీ గంభీర్ కృతజ్ఞతలు చెప్పాడు.భయాన్ని వ‌దులుకోవాలితాను త‌న జ‌ట్టుకు జ‌వాబుదారిగా ఉంటాన‌ని, సోషల్ మీడియాలోని వ్యక్తులకు కాదని గంభీర్ స్ప‌ష్టం చేశాడు. టీమ్ వ‌ల్లే తాను కోచ్ కాగ‌లిగాన‌ని అన్నాడు. ఓడిపోతామనే భయాన్ని ముందుగా వదులుకోవాలని అభిప్రాయ‌ప‌డ్డాడు. సెమీస్‌, ఫైన‌ల్లో 250 పరుగులు చేయాలంటే ధైర్యం చూపించాల్సిందేన‌న్నారు. ఆట‌గాళ్లు వ్య‌క్తిగ‌త రికార్డుల కంటే ట్రోఫీలు గెల‌వ‌డానికే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించాడు. తానేప్పుడు న‌మ్మ‌కం ఆధారంగానే జ‌ట్టు స‌భ్యుల‌ను ఎంపిక చేస్తాన‌ని చెప్పాడు. చ‌ద‌వండి: సంజు, బుమ్రానే కాదు.. వారిద్ద‌రూ కూడా హీరోలే!

T20 WC 2026 Final: Abhishek reveals he batted with Shivam Dube bat3
T20 WC 2026 Final: అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించాడు..!

నిన్న (మార్చి 8) జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.ఫైనల్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగి ఏకపక్ష విజయాన్ని సాధించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించారు. పవర్‌ ప్లేలో భారత బ్యాటర్లు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ న్యూజిలాండ్‌ బౌలర్లను ఊచకోత కోశారు.వరుస వైఫల్యాల తరువాత ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ విలయతాండవం చేశాడు. కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మ్యాచ్‌ అనంతరం అభిషేక్‌ తన ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను అతను సహచరుడు శివమ్‌ దూబే నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో ఆడినట్లు పేర్కొన్నాడు.అభిషేక్‌ మాటల్లో.. ఇవాళ నేను శివమ్ దూబే బ్యాట్‌తో ఆడాను. ఉదయం ఏదో కొత్తగా ప్రయత్నించాలని అనిపించింది. శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో దూబే దగ్గరికి వెళ్లి అతని బ్యాట్ తీసుకున్నానని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్‌ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి ఆరంభ మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. హ్యాట్రిక్‌ డకౌట్లు సహా పేలవ ప్రదర్శనలు చేశాడు. అయితే కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చి భారత్‌ భారీ స్కోర్‌ చేయడానికి పటిష్ట పునాది వేశాడు. సంజూ శాంసన్‌తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్‌ దశనే మార్చేసింది. ఇలాంటి కీలక ఇన్నింగ్స్‌ను అతను అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో ఆడటం విశేషం. అభిషేక్‌కు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ. ఇదే ప్రపంచకప్‌లో వరుసగా విఫలమవుతున్నాడని ఓ మ్యాచ్‌లో సిరాజ్‌ జెర్సీ ధరించి బరిలోకి దిగాడు. అంతకుముందు కూడా టీమిండియా వన్డే, టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ బ్యాట్‌తో పలు సందర్భాల్లో ఆడాడు. ఫైనల్‌గా ఫైనల్‌లో అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించి, భారత్‌ జగజ్జేతగా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు.

Indian Cricket Team Schedule After T20 World Cup 20264
వరల్డ్‌కప్‌ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్‌ ఇదే..!

టీ20 వరల్డ్‌కప్‌ 2026 ముగిసిన నేపథ్యంలో టీమిండియా తదుపరి షెడ్యూల్‌ ఎంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. 20 రోజుల గ్యాప్‌ తర్వాత (మార్చి 28) ఐపీఎల్‌ 2026 ప్రారంభమవుతుంది. ఈ లీగ్‌ మే 31 వరకు కొనసాగుతుంది. ఆతర్వాతే టీమిండియా షెడ్యూల్‌ మొదలవుతుంది.జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్ట్‌, వన్డే సిరీస్‌ జరుగుతుంది. టెస్ట్‌ మ్యాచ్‌ న్యూ చంఢీఘడ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జూన్ 6–10 వరకు జరుగుతుంది. అనంతరం జూన్‌ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి.ఆతర్వాత భారత్‌ జులైలో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం​ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో.. వన్డేలు ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జులై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి.అనంతరం భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో 2 టెస్ట్‌లు, 2 టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో ఏషియన్‌ గేమ్స్‌ జరుగుతాయి. దాని తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌లు ఆడుతుంది. అనంతరం స్వదేశంలోనే వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుంది. అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి.

Pakistan Head Coach Breaks Silence On Babar Azam ODI Exit, Makes Brutal Remark5
బాబర్‌ ఆజమ్‌పై వేటు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోచ్‌

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల బంగ్లాదేశ్ పర్యటన కోసం 15 మంది సభ్యుల వన్డే జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ లేకపోవడం అభిమానులకు ఆశ్చర్యానికి కలిగించింది. బాబర్‌ ఇటీవలికాలంలో మిగతా ఫార్మాట్లతో పాటు వన్డేల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అందుకే అతనిపై వేటు పడిందని అంతా అనుకున్నారు. అయితే దీనిపై పాక్‌ కోచ్‌ మరోలా వివరణ ఇచ్చాడు.బంగ్లా సిరీస్‌ నుంచి బాబర్‌ను తప్పించలేదు. ఈ సిరీస్‌ను యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే వేదికగా చూస్తున్నాము. బాబర్‌తో పాటు సైమ్ అయూబ్, నసీమ్ షా కూడా జట్టులో లేరని గుర్తు చేశాడు. మొత్తంగా బాబర్‌పై పడింది వేటు కాదని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసమే అతనికి విశ్రాంతినిచ్చారని స్పష్టతనిచ్చాడు.కాగా, బంగ్లా సిరీస్‌కు దేశీయంగా సత్తా చాటుతున్న అబ్దుల్‌ సమద్‌, సాద్‌ మసూద్‌, షమైల్ హుస్సేన్, మాజ్ సదాకత్ వంటి యువ ఆటగాళ్లతో పాటు టీ20 వరల్డ్‌కప్‌ 2026లో చెలరేగిపోయిన (2 సెంచరీల సాయంతో 383 పరుగులు) సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు కూడా అవకాశం లభించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది కొనసాగాడు. కొత్తగా ఆరుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు.బంగ్లా పర్యటనలో పాక్‌ మూడు వన్డేలు ఆడనుంది. ఢాకాలోని షేక్‌ ఏ బంగ్లా స్టేడియం వేదికగా మార్చి 11, 13, 15 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.జట్లు.. పాకిస్తాన్: షాహీన్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్ఱం, హారిస్ రౌఫ్, హుస్సేన్ తలత్, మాజ్ సదాకత్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీమ్, మొహమ్మద్ ఘాజీ ఘోరి, సాద్ మసూద్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, షమైల్ హుస్సేన్. బంగ్లాదేశ్: మెహిదీ హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తంజిద్ హసన్, నజ్ముల్ హొసైన్ షాంటో, తౌహిద్ హ్రిదోయ్, లిట్టన్ దాస్, ఆఫిఫ్ హొసైన్, మహిదుల్ ఇస్లాం భుయాన్, రిషాద్ హొసైన్, తాన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, నాహిద్ రానా.

Sanju Samson reveals he took help from Sachin Tendulkar6
సంజూ శాంసన్ సక్సెస్ వెనుక భారత క్రికెట్‌ దిగ్గజం

భారత క్రికెట్ చరిత్రలో సంజూ శాంసన్‌ తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2026లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. తిరిగి టైటిల్‌ను రిటైన్ చేసుకుంది.అయితే ఈ మెగా టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు దక్కకపోయిన అతడు ఎక్కడ నిరాశ చెందలేదు. తిరిగి జట్టులోకి వచ్చి సింహంలా గర్జించాడు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ నుంచి తుది పోరు వరకు సంజూ దుమ్ములేపాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో 80కి పైగా పరుగులు చేసి సత్తాచాటాడు. వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంజూ.. ఆ తర్వాత వరుసగా సెమీస్‌, ఫైనల్లో 89 పరుగులు చేశాడు. సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్‌పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. సంజూ మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. అయితే సంజూ శాంసన్ సక్సెస్ వెనక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని సంజూ వెల్లడించాడు."అంతా కలలా ఉంది. ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. కివీస్‌తో సిరీస్‌లో వైఫల్యం తర్వాత నా కలలు చెదిరిపోయాయి. నేనేం చేయలేనా అని చాలా బాధపడ్డాను. కానీ దేవుడు అండగా నిలిచాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా సహకరించారు.గత రెండు నెలలుగా సచిన్‌ సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఆస్ట్రేలియాలో జట్టులో చోటు దక్కక బయట కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడాను. సచిన్ చాలా సలహాలు ఇచ్చారు. ఆయనతో మాట్లాడటంతో మార్గనిర్దేశనం లభించింది. ఇది చాలా పెద్ద ఘనత. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు" సంజూ పేర్కొన్నాడు.

T20 World Cup 2026 Team Of The Tournament: Surprise Entrant To Lead As Indians Dominate7
T20 WC 2026: ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. భారత ఆటగాళ్ల డామినేషన్‌

నిన్న (మార్చి 8) జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో ఎడిషన్‌లో (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. సంజూ శాంసన్‌ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో శివమ్‌ దూబే (8 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో నీషమ్‌ 3, మ్యాట్‌ హెన్రీ, రచిన్‌ రవీంద్ర తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ ఆదిలోనే చేతులెత్తేసింది. బుమ్రా (4-0-15-4), అక్షర్‌ పటేల్‌ (3-0-27-3), హార్దికా​ పాండ్యా (4-0-26-1), వరుణ్‌ చక్రవర్తి (3-0-29-1), అభిషేక్‌ శర్మ (1-0-5-1) ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటై, 96 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో టిమ్‌ సీఫర్ట్‌ (52), మిచెల్‌ సాంట్నర్‌ (43) మాత్రమే నామమాత్రపు ప్రదర్శనలు చేశారు. 4 వికెట్లతో న్యూజిలాండ్‌ వెన్ను విరిచిన బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌.. సూపర్‌-8 నుంచి భారత విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు లభించాయి.ఇదిలా ఉంటే, టోర్నీ పూర్తయ్యాక ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఇందులో భారత ఆటగాళ్ల హవా కొనసాగింది. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు సికందర్‌ రజా ఎంపికయ్యాడు. భారత్‌ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా) ఎంపికయ్యారు. 12వ ఆటగాడు కూడా భారత ఆటగాడే (హార్దిక్‌ పాండ్యా) కావడం విశేషం.ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ టీ20 వరల్డ్‌కప్ 2026: సంజూ శాంసన్ (wk), టిమ్ సీఫెర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రాన్ హెట్మైర్, సికందర్ రజా (c), శివమ్‌ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజారబాని, జస్ప్రీత్ బుమ్రా12వ ఆటగాడు: హార్దిక్ పాండ్యా

Gautam Gambhir Shuns Down Any Comparisons Between Sanju Samson And Yuvraj Singh8
సంజూను యువీతో పోల్చొద్దు.. అతడొక స్పెషల్‌ ప్లేయర్‌: గంభీర్‌

టీమిండియా దాదాపు 15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. వన్డే ప్రపంచకప్‌-2023లో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. టీ20 వరల్డ్‌కప్‌-2026లో మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. రెండున్నరేళ్ల కిందట ఎక్కడైతే ఊహించని పరాభవం చవిచూసిందో.. ఇప్పుడు అదే వేదికలో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని.. మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్‌లో మూడు సార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన ఏకైక జ‌ట్టుగా భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. అయితే చారిత్రత్మక విజయంలో స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర.టోర్నీ ఆరంభంలో తుది జట్టులోనే లేని సంజూ.. ఆ త‌ర్వాత అనుహ్యంగా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వ‌రుస‌గా మూడు కీల‌క మ్యాచ్‌ల‌లోనూ హాఫ్ సెంచ‌రీలు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌'గా నిలిచాడు. సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్‌పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు.అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లోనూ 97 పరుగులతో సత్తాచాటాడు. దీంతో సంజూపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌ను 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్‌తో పోలుస్తున్నారు. యువరాజ్ కూడా అప్పుడు తన అద్బుత ప్రదర్శనలతో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలోనే యువీతో సంజూ పోలుస్తున్నారు.అయితే ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "యువరాజ్ సింగ్‌తో సంజూను పోల్చడం సరికాదు. కానీ సంజూ ఏమి చేశాడో మనందరికి తెలుసు. నిజంగా అతడు అద్భుతాలు చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో 80కు పైగా పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదు.ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమై, టోర్నీ ప్రారంభంలో బెంచ్‌కే పరిమితమై, ఆ తర్వాత ఈ తరహా ఇన్నింగ్స్‌లు ఆడడం నిజంగా గ్రేట్‌. ఇది అతడిలోని ధైర్యానికి నిదర్శనం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. సంజూ ఒక స్పెషల్ ప్లేయర్" అని గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.చదవండి: T20 WC 2026: ఫైనల్‌కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్

Shocking Fact Out About Indian Cricket Team Never Winning A World Cup Without Sardar origin and Kerala origin9
వారు లేకుండా భారత్‌ ప్రపంచకప్‌ ఎప్పుడూ గెలవలేదు..!

2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎదురైన నిరాశను భారత జట్టు 2026 పొట్టి ప్రపంచకప్‌లో తుడిచిపెట్టేసింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇది భారత్‌కు మూడో టీ20 టైటిల్. మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ (రెండు వన్డే, మూడు టీ20). అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మార్చి 8) జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా అవతరించింది.కాగా, టీమిండియా వరల్డ్ కప్ విజయాల వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 1983 వన్డే వరల్డ్‌కప్‌ విజయం నుంచి తాజాగా సాధించిన 2026 టీ20 ప్రపంచకప్‌ వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్‌లో ఒక సర్దార్ (పంజాబీ), ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. 1983లో బల్విందర్ సంధూ (సర్దార్), సునీల్ వాల్సన్ (కేరళ)తో ఈ సంప్రదాయం మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్‌లలో శ్రీశాంత్ (కేరళ), హర్భజన్ సింగ్ (సర్దార్) కీలక పాత్ర పోషించారు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్‌లలో సంజూ శాంసన్ (కేరళ), అర్ష్‌దీప్ సింగ్ (సర్దార్) ఈ ప్యాటర్న్‌ను కొనసాగించారు. రాకింగ్‌ సంజూ 2026 టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అజేయమైన 97 పరుగులు (50 బంతుల్లో) చేసిన సంజూ.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై, ఫైనల్లో న్యూజిలాండ్‌పై తలో 89 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 5 ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు సాధించాడు. 2024 ఎడిషన్‌లో సంజూ పూర్తిగా బెంచ్‌పైనే గడిపాడు. ఇది 1983లో వాల్సన్ పరిస్థితిని గుర్తు చేసింది. షేకింగ్‌ సర్దార్‌2024 ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా (17 వికెట్లు) నిలిచి భారత్‌ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అర్షదీప్‌ సింగ్‌.. తాజా ఎడిషన్‌లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్‌ సర్దార్‌ అనిపించుకున్నాడు. అర్షదీప్‌ తన నిలకడ ప్రదర్శనలతో భారత్‌కు వరుసగా రెండు టీ20 టైటిళ్లు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

Ishan Kishan played T20 World Cup final despite huge personal tragedy10
ఫైనల్‌కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్

టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్‌ది కీల‌క పాత్ర‌. అభిషేక్ శ‌ర్మ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన ఇషాన్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు.కేవ‌లం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 54 ప‌రుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక గుండెల్ని పిండేసే విషాదం దాగి ఉంది. ఓ వైపు కన్నీళ్లను దిగమింగుతూనే తన జట్టును వరల్డ్ ఛాంపియన్‌గా నిలిపాడు.ఏమి జరిగిందంటే?ఫైన‌ల్‌కు ఒక్క రోజు ముందు (శనివారం) ఇషాన్ కిష‌న్ కుటంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిష‌న్ కజిన్ సోదరి (వైష్ణవి సింగ్), ఆమె భ‌ర్త రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోల్‌క‌తాలో ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌రిగింది. వారిద్ద‌రి మ‌ర‌ణం కిషన్ కుటుంబాన్ని కుదిపేసింది.ఆరు నెలల పసికందు, మూడేళ్ల చిన్నారి అనాథలయ్యారు. ఈ విష‌యంపై కిష‌న్ తండ్రి ప్రణవ్ పాండే స్పందిస్తూ.. చాలా ఘోరం జ‌రిగిపోయింది. మేము చాలా బాధ‌లో ఉన్నాము అని అన్నారు. వాస్త‌వానికి ఆయ‌న‌ అహ్మ‌దాబాద్‌లో జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌కు హాజ‌రావ్వాల్సి ఉండేది. కానీ త‌మ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం కార‌ణంగా ప్ర‌ణ‌వ్ కోల్‌క‌తాలో ఉండిపోయారు. మ్యాచ్ అనంత‌రం కిష‌న్ కూడా మాట్లాడుతూ.. నిన్న నేను నా కజిన్ సోదరిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయాను. ఆమె ఎప్పుడూ నేను బాగా ఆడాల‌ని కోరుకునేది. ఇప్పుడు న‌న్ను ఛాంపియ‌న్‌గా చూసేందుకు ఆమె మాతో లేదు. చాలా బాధ‌గా ఉంద‌ని కిష‌న్ భావోద్వేగానికి లోన‌య్యాడు. కాగా దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి తిరిగొచ్చిన ఇషాన్ దుమ్ములేపుతున్నాడు.చదవండి: T20 WC 2026: సంజూ, బుమ్రానే కాదు.. వారిద్ద‌రూ కూడా హీరోలే

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement