Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Vaibhav Sooryavanshi set to join Mumbai Indians: Ex-BCCI selector 1
ముంబై ఇండియ‌న్స్‌లోకి వైభ‌వ్ సూర్య‌వంశీ?

వైభ‌వ్ సూర్య‌వంశీ.. విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లోనూ వైభ‌వ్ త‌న భీక‌ర ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 15 ఏళ్ల వైభ‌వ్ త‌న సంచ‌ల‌న బ్యాటింగ్‌తో వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్ల‌ను సైతం వ‌ణికిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే సూర్యవంశీ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 31 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్ వంటి పవర్‌ఫుల్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొనేందుకు వైభవ్ సిద్దమయ్యాడు.మంగళవారం రాజస్తాన్ రాయల్స్ గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. అయితే ఈమ్యాచ్‌కు ముందు బీసీసీఐ మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజ్పే కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే ముంబై ఇండియన్స్ తరపున ఆడే అవకాశముందని పరాంజ్పే జోస్యం చెప్పాడు."ఈ రోజు వైభవ్ సూర్యవంశీ తన భవిష్యత్తు జట్టుపైనే ఆడబోతున్నాడు. భవిష్యత్తులో ట్రేడింగ్ ద్వారా లేదా వేలంలో భారీ ధరకు వైభవ్‌ను ముంబై సొంతం చేసుకునే అవకాశం ఉందని" అని పరాంజ్పే ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా గౌహతి వేదికగా రాజస్తాన్-ముంబై మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ కూడా ఇంకా పడలేదు.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌!

2 YO Konda Shreyansh Murali Krishna Patel World Record In Chess2
కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్‌ ప్రపంచ రికార్డు

అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిగా కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ నిలిచాడు. రెండు సంవత్సరాల 11 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ నిలిచాడు. 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాడు.జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో మంగళవారం వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డ్ సాధించి, భరతమాత ముద్దు బిడ్డగా, అపార మేధస్సు కలిగిన స్వామి వివేకానందునిగా అవతరించాడని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశంసించారు. మరోవైపు.. తన మనవడి ప్రతిభను చూసి మంత్రి సురేఖ మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, శ్రీయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు.కాగా రాయ్ చెస్ అకాడమీ తరఫున క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొండా శ్రేయాన్ష్ పటేల్‌కు ట్రోఫీలు, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్‌ను శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ పొందనున్నాడు.

Vaibhav Sooryavanshi, Ayush Mhatre Miss Out From Indian Squad3
భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌!

ఐపీఎల్‌-2026 సీజ‌న్ త‌ర్వాత భార‌త అండ‌ర్‌-19, అండ‌ర్‌-25జ‌ట్లు రెడ్ బాల్ సిరీస్‌ల కోసం శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది. ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. యువ ఆట‌గాళ్ల‌లలో రెడ్ బాల్ స్కిల్స్‌ను వెలికితీసేందుకు బెంగ‌ళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఒక ప్ర‌త్యేక ట్రైనింగ్ క్యాంప్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది.ఈ అండర్-25 హై-పెర్ఫార్మెన్స్ క్యాంప్ కోసం 25 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసింది. అయితే ఈ లిస్ట్‌లో యువ ఆట‌గాళ్లు వైభ‌వ్ సూర్య‌వంశీ, అయూశ్ మాత్రేల‌కు చోటు ద‌క్క‌లేదు. వీరిద్ద‌రూ ఐపీఎల్‌-2026లో బీజీగా ఉండ‌డంతో బోర్డు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. కానీ ప్ర‌ధాన జ‌ట్టులో మాత్రం వారు చోటు ద‌క్కించుకునే అవ‌కాశ‌ముంది.కాగా శ్రీలంక టూర్ కంటే ముందు బీసీసీఐ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్‌ను నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్‌లో నాలుగు రోజుల రెడ్-బాల్ మ్యాచ్‌ల సిరీస్ జ‌ర‌గ‌నుంది. దేశ‌వ్యాప్తంగా 64 మంది యువ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. వీరిని 4 జట్లుగా విభ‌జిస్తారు. ఒక్కో జ‌ట్టులో 16 మంది ఉంటారు.ఇందుకోసం సీకే నాయుడు ట్రోఫీ, అండర్-23 వన్డే టోర్నీల్లో రాణించిన 25 మందిని, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో స‌త్తాచాటిన 25 మందిని ఎంపిక‌చేశారు. మిగిలిన 14 మందిలో అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్, ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.ఈ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్‌లో రాణించిన వారికి 'ఇండియా ఎమర్జింగ్'(అండర్‌-25) ప్రధాన జ‌ట్టులో చోటు ద‌క్క‌నుంది. ఈ జ‌ట్టు శ్రీలంకలో పర్యటించి రెడ్-బాల్ మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం ఈ క్యాంప్ మొత్తం దిగ్గ‌జ క్రికెట‌ర్‌, బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ పర్య‌వేక్ష‌ణ‌లో జ‌ర‌గ‌నుంది.బీసీసీఐ అండర్-25 షార్ట్‌లిస్ట్ ప్లేయర్స్ వీరే:ఆయుష్ దోసేజా, యష్ ధుల్, మయాంక్ వర్మ, ఆయుష్ పాండే, శాశ్వత్ రావత్, మహేష్ పిథియా, రాజ్ లింబాని, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, అకిబ్ ఖాన్, కార్తీక్ యాదవ్, విద్యాధర్ పాటిల్, కె. హిమతేజ, భువనగిరి పున్నయ్య, పుఖ్రాజ్ మాన్, యశ్వర్ధన్ దలాల్, పార్థ్ వత్స్, ఈడెన్ ఆపిల్ టామ్, హిమాన్షు సింగ్, అమన్ మోఖాడే.చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌ అరెస్టు

IPL 2026 RR vs MI: Drizzle starts, toss delayed in Guwahati4
గౌహతిలో వర్షం.. ముంబై-రాజస్తాన్‌ మ్యాచ్‌ టాస్‌ ఆలస్యం

అభిమానులకు గుడ్‌ న్యూస్‌. గౌహతిలో వర్షం ఎట్టకేలకు ఆగింది. దీంతో మైదానాన్ని సిద్దం చేసేందుకు గ్రౌండ్‌ స్టాప్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు.టాస్‌ ఆలస్యంఐపీఎల్‌-2026లో గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌- ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. గౌహ‌తిలో ప్ర‌స్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాప్ క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్ర‌కారం 7:00 గంట‌ల‌కు ప‌డాల్సిన టాస్ ఇప్పుడు ఆల‌స్యం కానుంది. కాగా సోమ‌వారం ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా కేకేఆర్‌-పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ కూడా వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది.

IPL 2026: Klaasen Refuses To Call SRH Bowling Weak Questions Batters5
SRH: ‘అతడు లేనిలోటు తీరనిది.. బ్యాటర్ల వల్లే ఓటములు’

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌తో తలపడ్డ సన్‌రైజర్స్‌ 201 పరుగులు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.సొంతమైదానంలో నామమాత్రపు స్కోరుతదుపరి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో 226 పరుగుల భారీ స్కోరు సాధించిన సన్‌రైజర్స్‌.. 161 పరుగులకే ప్రత్యర్థిని కుప్పకూల్చి జయభేరి మోగించింది. అయితే, సొంతమైదానంలో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. హైదరాబాద్‌ జట్టు కేవలం 156 పరుగులే చేయగా.. మరో బంతి మిగిలి ఉండగానే లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే.. రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) ఆరంభ మ్యాచ్‌లకు దూరం కాగా ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) సన్‌రైజర్స్‌ సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కమిన్స్‌ రూపంలో కీలక పేసర్‌ సేవలను కూడా జట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో బౌలింగ్‌ విభాగం బలహీనంగా ఉన్నందువల్లే సన్‌రైజర్స్‌ రాణించలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి.బ్యాటర్లు మరింతగా శ్రమించాల్సి ఉందిఈ విషయంపై సన్‌రైజర్స్‌ పవర్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ తాజాగా స్పందించాడు. తమ వైఫల్యాలకు బ్యాటింగ్‌ విభాగమే ప్రధాన కారణమంటూ బౌలర్లను సమర్థించాడు. ఈ మేరకు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘గత మూడు మ్యాచ్‌లలో మేము 40 పరుగుల మేర వెనుకబడి ఉన్నాం అనిపించింది. కాబట్టి బ్యాటర్లు మరింతగా శ్రమించాల్సి ఉంది.అతడు లేనిలోటు తీరనిదిప్యాట్‌ కమిన్స్‌ వంటి ఆటగాడు లేకపోవడం ఏ ఫార్మాట్లోనైనా ఇబ్బందికరమే. జట్టుకు భారీ నష్టం కూడా! బ్రైడన్‌ కార్స్‌ చేతికి గాయమైంది. కాబట్టి మా ప్రణాళికల్లో మార్పు చేయాల్సి వచ్చింది. ఏదేమైనా మా జట్టు అనుభవం ఉన్న జట్టు. ముఖ్యంగా పేస్‌ దళం బాగుంది.బ్యాట్‌తో మేము కష్టపడ్డ చోట మా వాళ్లు వికెట్లు తీయగలిగారు. బ్యాటర్లుగా మేము మాత్రం అనుకున్న మేర రాణించలేకపోయాము. ఓటములకు మా బౌలర్లను బాధ్యులను చేయడం సులువే. అదనంగా 20- 30 పరుగులు చేసి ఉంటేకానీ ఓడిన రెండు మ్యాచ్‌లలో మేము 20- 30 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అలా అయితే మా బౌలర్లు లక్ష్యాన్ని కాపాడగలిగి ఉండేవారు’’ అని హెన్రిచ్‌ క్లాసెన్‌ బౌలింగ్‌ విభాగానికి మద్దతుగా నిలిచాడు. కాగా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగంలో హర్ష్‌ దూబే, జయదేవ్‌ ఉనాద్కట్‌, ఎషాన్‌ మలింగ, హర్షల్‌ పటేల్‌, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కమిన్స్‌ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనబడటం లేదు.చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌ అరెస్టు

Tamim Iqbal appointed BCB President by Bangladesh government after T20 World Cup fiasco6
'ఇండియన్ ఏజెంట్' అన్నారు.. ఇప్పుడు ఏకంగా బోర్డు ప్రెసిడెంట్‌గా

బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. దిగ్గ‌జ ఓపెన‌ర్ త‌మీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్‌గా ఎంపిక‌య్యాడు. మంగళవారం అమినుల్ ఇస్లాం నేతృత్వంలోని బోర్డును రద్దు చేసిన బంగ్లా ప్రభుత్వం.. బీసీబీకి కొత్త చీఫ్‌గా త‌మీమ్‌ను నియ‌మించింది. కాగా గత అక్టోబర్‌లో జరిగిన బోర్డు ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఇటీవల ఆ దేశ క్రీడా మంత్రి అమీనుల్ హక్ విచారణకు ఆదేశించారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఈ ఆరోపణలన్నీ నిజమేనని తేల్చడంతో, ప్రభుత్వం తక్షణమే బోర్డు ఆఫ్ డైరెక్టర్లను తొలగించింది. ఈ క్రమంలోనే అమినుల్ ఇస్లాం స్ధానంలో బీసీబీ అధ్యక్షుడిగా తమీమ్ ఇక్బాల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 39 ఏళ్ల తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించనున్నాడు. 11 మంది సభ్యులతో కూడిన బీసీబీ అడ్హక్ కమిటీకి తమీమ్ నాయకత్వం వహించనున్నాడు. ఈ బీసీబీ కమిటీలో మాజీ కెప్టెన్ మిన్హాజుల్ అబెడిన్, రష్నా ఇమామ్, మీర్జా యసీర్ అబ్బాస్, సయ్యద్ ఇబ్రహీం అహ్మద్, ఇస్రాఫిల్ ఖస్రు, తంజీల్ చౌదరి, సల్మాన్ ఇస్పాహానీ, రఫీకుల్ ఇస్లాం వంటి వారు ఉన్నారు. తమీమ్ ఎంపికను బంగ్లాదేశ్ జాతీయ క్రీడా మండలి (NSC) డైరెక్టర్ మహమ్మద్ అమీనుల్ అహెసాన్ ధృవీకరించారు. తమ నిర్ణయం గురంచి అంతర్జాతీయ క్రికెట్ మండలికి(ICC)కి తెలియజేసినట్లు అహెసాన్ తెలిపారు.కాగా తమీమ్ ప్రెసెడెంట్‌గా బాధ్యతలు చేపట్టడంతో భారత్‌-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకోవాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని తమీమ్ తప్పు పట్టాడు. దీంతో అప్పటి బోర్డు సభ్యులు "ఇండియన్ ఏజెంట్" అని విమర్శించారు. అటువంటిది త‌మీమ్ ఇప్పుడు ఏకంగా చైర్మెన్‌గా ఎంపికై వారంద‌రికి షాకిచ్చాడు.

Mitchell Starc Blow To Delhi Capitals7
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌

ఐపీఎల్‌-2026లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ స్టార్ పేసర్‌, ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. భుజం, మోచేయి గాయాలతో బాధపడుతున్న స్టార్క్, కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.దీంతో అతడు ఢిల్లీ ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఏప్రిల్ 20 తర్వాతే ఢిల్లీ క్యాంప్‌లో చేరే సూచనలు కన్పిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లలో ఏప్రిల్ 8న గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 11న చెన్నై సూపర్ కింగ్స్‌తో, ఏప్రిల్ 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.అయితే స్టార్క్ గైర్హజరీలో ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ను లుంగి ఎంగిడీ, ముఖేష్ కుమార్, టి.నటరాజన్‌లు సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. అయినప్పటికీ స్టార్క్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ ఉంట జట్టు మరింత పటిష్టంగా మారుతుంది. స్టార్క్ ఇటీవల తన గైర్హాజరీపై భారత మీడియాలో వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించాడు.భార‌త మీడియాలో నా గైర్హాజరీపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్నారు. కానీ అవ‌న్నీ ఆ వాస్త‌వం. ఆస్ట్రేలియా స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో భుజం, మోచేయికి గాయాలయ్యాయి. వాటి తీవ్ర‌త అప్పుడు నాకు తెలియ‌లేదు. ఇప్పుడు వాటికి చికిత్స తీసుకుంటున్నాను అని స్టార్క్ ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా స్టార్క్‌ను ఐపీఎల్‌-2026కు ముందు రూ.11.75 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. గత సీజన్‌లో అతడు 11 వికెట్లు పడగొట్టాడు.చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌ అరెస్టు

Australia Legend David Warner Charged With Drunk Driving, Arrested8
ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌ అరెస్టు

ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు. సిడ్నీలోని మారుబ్రాలో మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం న్యూ సౌత్ వేల్స్ పోలీసులు మరూబ్రాలోని మలబార్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు.ఆ సమయంలో అటుగా వస్తున్న వార్నర్ చెకింగ్ పాయింట్‌ను చూసి తన కారును రోడ్డు పక్కన పార్క్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గ‌మ‌నించిన పోలీసులు అనుమానంతో అక్క‌డి వెళ్లి వార్న‌ర్‌ను బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. ఈ టెస్టులో అత‌డు పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలింది.వెంటనే అతడిని మరూబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించి రెండో సారీ పరీక్షలు నిర్వహించారు. అతడి రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా ఉన్నట్లు తేలింది. ఇది ఆస్ట్రేలియాలోని అనుమతించిన పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దీంతో వార్నర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. అనంతరం అతడిని విడుదల చేస్తూ.. 2026, మే 7వ తేదీన సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌-2026లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ టోర్నీలో వారి తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల గ్యాప్ రావడంతో తన ఫ్యామిలీతో గడిపేందుకు వార్నర్ తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అయితే అతడు తిరిగి ఏప్రిల్ 7న పాకిస్తాన్‌కు చేరుకోనున్నట్లు సమాచారం.చదవండి: నోటితో కాదు.. ఆటతో సమాధానం చెప్పు: సెహ్వాగ్‌ ఫైర్‌

IPL 2026: CP VC Sajjanar Warns Against Betting Asks Fans To Be Careful9
IPL: ప్రిడిక్షన్ పేరిట ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చు.. జాగ్రత్త

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 ఎడిషన్‌ ఇప్పటికే ఆరంభమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఈ టీ20 లీగ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మాయగాళ్లు బెట్టింగ్‌ పేరిట ఉచ్చు బిగుస్తూ ఉంటారు. ఈసారి కూడా ‘ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరిట ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చు.. జాగ్రత్త’ అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ క్రికెట్‌ ప్రేమికులను హెచ్చరించారు.ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా.. ‘‘ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో విరుచుకుపడుతున్నారు. కేవలం డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు.టాస్ ఎవరిది!? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది!? అని ముందే చెబుతామంటూ మిమ్మల్ని తమ ఛానెల్స్‌లో సబ్‌స్క్రైబ్ చేయించుకుని, నిలువునా ముంచే బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానెళ్ల మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు.ఇలాంటి ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల్లోనే 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించాం. ఈ నిఘా నిరంతరం కొనసాగుతుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.ఇలాంటి మోసపూరిత యాడ్స్ మీ దృష్టికి వచ్చినా లేదా మీరు మోసపోయినా, వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి’’ అని సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరిట ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చు.. జాగ్రత్త!!ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో విరుచుకుపడుతున్నారు. కేవలం డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు. టాస్… pic.twitter.com/nmRQUkEF0X— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 7, 2026

Even Said Endulkar Keep Quiet: Sehwag Questions Rahane Outburst10
నోటితో కాదు.. ఆటతో సమాధానం చెప్పు: సెహ్వాగ్‌ ఫైర్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) కెప్టెన్‌ అజింక్య రహానే వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అసహనం వ్యక్తం చేశాడు. విమర్శకులకు కౌంటర్‌ ఇస్తూ రహానే సమయాన్ని వృథా చేసుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌తో పాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ల పేర్లను వీరూ ప్రస్తావించాడు.గతేడాది కేకేఆర్‌ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు రహానే. ఐపీఎల్‌-2025 సీజన్‌లో కేకేఆర్‌ దారుణ ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో ఒకటి కూడా గెలవలేకపోయింది.వారినే అడగండి!భారీ అంచనాలతో రూ. 25 కోట్లకు పైగా వెచ్చించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ను కొనుగోలు చేస్తే.. అతడు ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆరంభ మ్యాచ్‌లలో బౌలింగ్‌ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో రహానే స్పందిస్తూ.. గ్రీన్‌ బౌలింగ్‌ ఎందుకు చేయడం లేదో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)నే అడగాలనే అనుచితంగా మాట్లాడాడు.అసూయతోనేఇందుకు సీఏ సైతం బదులిచ్చింది. గ్రీన్‌ వెన్నునొప్పి కారణంగా ఎక్కువగా బౌలింగ్‌ చేయలేడన్న విషయం కేకేఆర్‌కు ముందుగానే చెప్పామని పేర్కొంది. ఇక తన స్ట్రైక్‌రేటు గురించి వస్తున్న విమర్శలపై రహానే స్పందిస్తూ.. ‘‘నాపై ఎందుకంత ద్వేషం.. నేను ఆడకూడదా? అయినా నాపై అసూయతోనే కొందరు ఇలా మాట్లాడుతున్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఈ రెండు సందర్భాల్లో రహానే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వీరేందర్‌ సెహ్వాగ్‌ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అతడు ఓ జట్టుకు కెప్టెన్‌. కామెరాన్‌ గ్రీన్‌ గురించి అడిగినపుడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకవేళ మాట్లాడినా నేరుగా సమాధానం ఇవ్వకుండా క్రికెట్‌ ఆస్ట్రేలియాను అడగమని చెప్పడం దేనికి?‘ఎండుల్కర్‌’ అంటూ..ఇక స్ట్రైక్‌రేటు విషయానికొస్తే.. బాగా ఆడినపుడు ప్రశంసించే వాళ్లు కొన్నిసార్లు విమర్శిస్తారు కూడా! అంత మాత్రాన ఇలా కౌంటర్లు ఇచ్చుకుంటూ పోవడం సరికాదు. గ్రీన్‌ విషయంలో ఒకలా.. తన విషయంలో మరోలా రహానే స్పందించాడు.ఒకానొక సందర్భంలో సచిన్‌ టెండుల్కర్‌ గురించి.. ‘ఎండుల్కర్‌’ అంటూ కెరీర్‌ ముగిసిపోయిందనే వార్తలు రాశారు. కానీ సచిన్‌ వాటిని పట్టించుకోకుండా ఆటతో సమాధానమిచ్చి అందనంత ఎత్తుకు ఎదిగాడు. అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఎప్పుడూ విమర్శకులను సమాధానం ఇస్తూ సమయం వృథా చేయలేదు.కాబట్టి రహానే నిశ్శబ్దంగా ఉండటం మంచిది. నోటితో కాకుండా ఆటతో సమాధానం చెప్పాలి. ఒక్క సెంచరీ చేస్తే అంతా సైలెంట్‌ అయిపోతారు. అంతమాత్రానికి ఇలాంటి మాటలు ఎందుకు?’’ అని సెహ్వాగ్‌ రహానే తీరును విమర్శించాడు.చదవండి: RR vs MI: ‘వైభవ్‌ సూర్యవంశీ గురించి తెలుసు.. అతడికి అంత సీన్‌ లేదు’

Advertisement
Advertisement
 
Advertisement