Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Pakistan end with 212, need to restrict Lanka under 1471
పాక్ ఓపెన‌ర్ల విధ్వంసం.. శ్రీలంక ముందు భారీ టార్గెట్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో పల్లెకలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెన‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెన‌ర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫ‌ఖార్ జ‌మాన్ ఘ‌న‌మైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్ద‌రూ తొలి వికెట్‌కు 176 ప‌రుగుల రికార్డు భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఫర్హాన్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. కేవ‌లం 60 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 100 ప‌రుగులు చేశాడు.ఫర్హాన్‌కు ఈ టోర్నీలో ఇది రెండో సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా జ‌మాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 84 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఓ ద‌శ‌లో పాక్ 250 ప‌రుగుల మార్క్ సునాయ‌సంగా దాటేలా క‌న్పించింది.అయితే ఆఖ‌రిలో వికెట్లు కోల్పోవ‌డంతో పాక్ 250 ప్ల‌స్ ప‌రుగులు సాధించ‌లేక‌పోయింది. శ్రీలంక బౌల‌ర్ల‌లో దిల్షాన్ మ‌ధుశంక మూడు, ష‌న‌క రెండు, చ‌మీరా త‌లా వికెట్ సాధించారు. పాకిస్తాన్ సెమీస్‌కు అర్హ‌త సాధించాలంటే శ్రీలంక‌ను 147 ప‌రుగుల లోపు క‌ట్ట‌డి చేయాలి.

J and K lift Ranji Trophy, CM Omar Abdullah announces massive cash reward for team
రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్‌.. భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన సీఎం

భారత దేశవాళీ క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర ఆవిష్కృతమైంది. జ‌మ్మూ కాశ్మీర్‌ 67 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరిదించుతూ మొట్ట‌మొద‌టి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్‌ను జ‌మ్మూ కాశ్మీర్ కైవ‌సం చేసుకుంది.ఫైన‌ల్లో క‌ర్ణాటక‌పై జ‌మ్మూ విజ‌యం సాధించింది. మ్యాచ్ డ్రా ముగిసిన‌ప్ప‌టికి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యప‌రంగా జే అండ్ కేను విజేత‌గా నిర్ణ‌యించారు. ఈ విజ‌యంతో జ‌మ్మూ కాశ్మీర్ అంతటా సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఈ నేప‌థ్యంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.2 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. అంతేకాకుండా, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆట‌గాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయ‌న‌ హామీ ఇచ్చారు. ఒమర్ అబ్దుల్లా చివ‌రి రోజు ఆట చూసేందుకు స్టేడియం వ‌చ్చి త‌మ జ‌ట్టును ఉత్స‌హ‌ప‌రిచారు. ఈ క్ర‌మంలో విజ‌యం సాధించిన అనంత‌రం త‌మ ఆట‌గాళ్ల‌ను అబ్దుల్లా అభినందించారు.ఈ ఏడాది సీజ‌న్‌లో జ‌మ్మూ కాశ్మీర్ ప్లేయ‌ర్లు దుమ్ములేపారు. ఆకిబ్ నబీ,అబ్దుల్ సమద్, పరాస్ డోగ్రా, సునీల్ కుమార్ అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచారు. ఆకిబ్ నబీ 60 వికెట్ల‌తో ఈ సీజ‌న్ లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. ఫైన‌ల్లో కూడా 5 వికెట్లతో స‌త్తాచాటాడు. అదేవిధంగా ఐపీఎల్ స్టార్ సమద్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 748 పరుగులు చేశాడు. కెప్టెన్ పరాస్ డోగ్రా 637 ప‌రుగుల‌తో జ‌ట్టును ముందుండి న‌డిపించాడు.

T20 WC 2026: Srilanka opt to bowl, Pakistan make three changes
శ్రీలంక‌తో చావో రేవో.. జ‌ట్టులో మూడు మార్పులు చేసిన పాక్‌

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2026 సూప‌ర్‌-8 లో భాగంగా కొలంబో వేదిక‌గా శ్రీలంక‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఇప్ప‌టికే సెమీస్ రేసు నుంచి నిష్క్ర‌మించ‌గా.. పాక్‌కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీల‌కం.పాక్ తొలుత బ్యాటింగ్ చేయ‌నున్నందున 65 ప‌రుగుల తేడాతో శ్రీలంక‌ను ఓడించాలి. అప్పుడే న్యూజిలాండ్‌ను వెన‌క్కినెట్టి పాక్ సెమీస్‌కు అర్హ‌త సాధిస్తోంది. ఈ కీల‌క మ్యాచ్‌లో పాకిస్తాన్ మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ఖవాజా నఫే, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.తుది జ‌ట్లుపాకిస్తాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార(వికెట్ కీప‌ర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

Auqib Nabi in Team India soon? Gets letter of recommendation from Ganguly4
అత‌డు అద్బుతాలు చేస్తాడు.. టీమిండియాకు ఎంపిక చేయండి: గంగూలీ

ఫిబ్ర‌వ‌రి 28, 2026.. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జ‌మ్మూ అండ్ కాశ్మీర్ త‌మ 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెరిదించుతూ తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హుబ్లీ వేదిక‌గా జ‌రిగిన జరిగిన రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్‌లో కర్ణాటకను ఓడించి జమ్మూ కశ్మీర్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ చారిత్ర‌త్మ‌క విజ‌యంలో ఆ జ‌ట్టు పేస‌ర్ ఆకిబ్‌ న‌బీ ధార్‌ది కీల‌క పాత్ర‌. ఈ సీజ‌న్ అసాంతం ఆకిబ్ న‌బీ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.ఈ సీజన్‌లో మొత్తం 60 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక పేసర్ 60 వికెట్ల మార్కును అందుకోవడం ఇది కేవలం మూడవసారి మాత్రమే. ఫైన‌ల్ మ్యాచ్‌లో కూడా ఆకిబ్ దుమ్ములేపాడు. 29 ఏళ్ల న‌బీ త‌న‌ స్వింగ్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌కు చుక్కలు చూపించాడు.మొత్తంగా 5 వికెట్లు ప‌డ‌గొట్టి క‌ర్ణాట‌క ఓట‌మిని శాసించాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి స్టార్ బ్యాట‌ర్ల‌ను సైతం న‌బీ బోల్తా కొట్టించాడు. న‌బీ త‌న సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌లతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీని సైతం ఆక‌ర్షించాడు.రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ఆకిబ్ నబీని ఎంపిక చేయాల‌ని గంగూలీ సెలెక్టర్లకు సూచించాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆకిబ్ స్వింగ్ బౌలింగ్ భారత్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని గంగూలీ అభిప్రాయ‌ప‌డ్డాడు."ప్రయత్నం, దృడ సంకల్పం ఉంటే ఏం చేయగలరో జమ్మూ కశ్మీర్ ప్రపంచానికి చాటి చెప్పింది. జమ్మూ కశ్మీర్ చారిత్రత్మక విజయంతో ఆ ప్రాంతం మొత్తం గర్వించేలా చేశారు. కఠిన పరిస్థితులే ఛాంపియన్‌లను తాయారు చేస్తాయి. ఆకిబ్ నబీ నిజంగా ఒక అద్భుతం.నబీ ఇప్పుడు టీమిండియా జెర్సీ ధరించేందుకు సమయం అసన్నమైంది. ఈ ఏడాది వేసవిలో ఇంగ్లండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌కు నబీని ఎంపిక చేస్తే బాగుంటుంది" అని ఎక్స్‌లో దాదా రాసుకొచ్చాడు. కాగా బారముల్లాకు చెందిన నబీ.. ఐపీఎల్‌లో కూడా సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో రూ. 8.4 కోట్ల భారీ ధరకు ఆకిబ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

T20 WC South African legend brutally trolls NZ after their loss to England5
వాళ్లతో బౌలింగ్‌ చేయిస్తావా?: సాంట్నర్‌పై సౌతాఫ్రికా లెజెండ్‌ ఫైర్‌

ఇంగ్లండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతులెత్తేసింది. వ్యూహాలను అమలు చేసే క్రమంలో తడబడి ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సెమీస్‌ చేరేందుకు మరో మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితి తెచ్చుకుంది. 159 పరుగులుకొలంబో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. టిమ్‌ సీఫర్ట్‌ (35), ఫిన్‌ అలెన్‌ (29) ఫర్వాలేదనిపించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (39) రాణించాడు. మిగతా వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కివీస్‌ 159 పరుగులు చేయగలిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బలుఇంగ్లండ్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌, విల్‌ జాక్స్‌, ఆదిల్‌ రషీద్‌ రెండేసి వికెట్లు తీయగా.. లియామ్‌ డాసన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను కివీస్‌ బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (2), జోస్‌ బట్లర్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (26)ను ఫిలిప్స్‌ తొందరగానే పెవిలియన్‌కు పంపాడు.ఆఖర్లో అంతా తలకిందులుఇక జేకబ్‌ బెతెల్‌ (21), సామ్‌ కర్రాన్‌ (24) నిరాశపరచగా.. టామ్‌ బాంటన్‌ (33) రాణించాడు. ఇలాంటి తరుణంలో కివీస్‌కు గెలుపు అవకాశాలు మెరుగు కాగా.. విల్‌ జాక్స్‌, రెహాన్‌ అహ్మద్‌ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ముఖ్యంగా 18వ ఓవర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌లో 22 పరుగులు పిండుకున్నారు. ఇక 19వ ఓవర్లో సాంట్నర్‌ బౌలింగ్‌లో 16 పరుగులు రాబట్టారు. ఇక ఆఖరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. హెన్రీ బౌలింగ్‌లో రెండు సింగిల్‌, ఫోర్‌ బాది పని పూర్తి చేశారు.మొత్తంగా జాక్స్‌ 18 బంతుల్లో 32, రెహాన్‌ అహ్మద్‌ 7 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచి.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ను గెలిపించారు. కివీస్‌ బౌలర్లలో రచిన్‌ రవీంద్ర మూడు, మ్యాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గూసన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో ఫలితం తారుమారు కావడంతో కివీస్‌కు చేదు అనుభవం తప్పలేదు. శ్రీలంకతో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడిపోతేనే న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరగలదు.వాళ్లతో బౌలింగ్‌ చేయిస్తావా?ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆఖరి రెండు ఓవర్లలో కివీస్‌ అనుసరించిన వ్యూహాన్ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ఘాటుగా విమర్శించాడు. ‘‘18వ ఓవర్లో.. గెలుపు దోబూచులాడుతున్న వేళ.. ఇద్దరు కుడిచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్న సమయంలో.. ఆఫ్‌ స్పిన్నర్‌లను ప్రయోగిస్తారా? ఇంతకంటే జోక్‌ ఉంటుందా?’’ అంటూ కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌కు గ్రేమ్‌ స్మిత్‌ చురకలు అంటించాడు.చదవండి: T20 WC: పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు!

Daryl Mitchell beats Suryakumar Yadav to be named ICC Player of the Month after thrashing India6
భార‌త్‌పై సెంచ‌రీల మోత‌.. మిచెల్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ డారిల్ మిచెల్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. జ‌న‌వ‌రి 2026 నెలకు గాను 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా మిచెల్ ఎంపికయ్యాడు. గ‌త నెలలో భార‌త్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో మిచెల్ దుమ్ములేపాడు.కివీస్ జట్టు 2-1తో సిరీస్ గెలవడంలో డారిల్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు వ‌న్డేల‌ సిరీస్‌లో అత‌డు ఏకంగా 352 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఫ‌లితంగానే అత‌డికి ఈ ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ఈ అవార్డును మిచెల్ సొంతం చేసుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌కు చెందిన శోభన మోస్తరీ మ‌హిళ‌ల విభాగంలో ఈ అవార్డును ద‌క్కించుకుంది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో శోభన అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు బంగ్లా క్వాలిఫై కావ‌డంలో ఆమెది కీల‌క పాత్ర‌.

Unhappy Mohsin Naqvi Set To Sack Salman Agha As PAK Captain: Report7
T20 WC: పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు!

టీ20 ప్రపంచకప్‌-2026 తర్వాత పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు పడనుందా?.. ఫలితంతో సంబంధం లేకుండా అతడిని తొలగించేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సిద్ధమైందా?.. అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఏమాత్రం సంతోషంగా లేరుఈ విషయం గురించి పీసీబీ వర్గాలు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాక్‌ బోర్డు చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ (Mohsin Naqvi)జట్టు ప్రదర్శన పట్ల ఏమాత్రం సంతోషంగా లేరు. ఈసారి పాకిస్తాన్‌ మెరుగ్గా ఆడుతుందని సెలక్టర్లు, యాజమాన్యం ఆయనకు హామీ ఇచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు అనుగుణంగా లేవు.కెప్టెన్‌ సహా వారిపై వేటుముఖ్యంగా సల్మాన్‌ ఆఘా, బాబర్‌ ఆజం, ఉస్మాన్‌ ఖాన్‌ (Usman Khan)లతో పాటు మరికొంత మంది సీనియర్‌ ఆటగాళ్లకు ఇదే చివరి వరల్డ్‌కప్‌ కానుంది. అంతేకాదు వాళ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్‌ ఇంతటితో ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌ తర్వాత పాకిస్తాన్‌ టీ20 జట్టులో భారీ మార్పులు చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాయి.పసికూనలపై గెలిచికాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా.. తటస్థ వేదికైన లంకలో పాక్‌ మ్యాచ్‌లు ఆడుతోంది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్‌లతో కలిసి లీగ్‌ దశలో తలపడ్డ పాక్‌.. టీమిండియా చేతిలో మాత్రమే ఓడింది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి గ్రూప్‌-ఎలో టీమిండియా తర్వాతి స్థానాన్ని ఆక్రమించి.. సూపర్‌-8కు చేరుకుంది.లంకపై భారీ తేడాతో గెలిస్తేనేఅయితే, కీలక సూపర్‌-8 దశలో న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షార్ఫణం కాగా.. ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ ఓడిపోయింది. దీంతో శనివారం నాటి మ్యాచ్‌లో శ్రీలంకపై తప్పక భారీ విజయం సాధిస్తేనే పాకిస్తాన్‌ సెమీస్‌ చేరుకుంటుంది. ఇదిలా ఉంటే.. టోర్నీ ఆసాంతం పాక్‌ సీనియర్‌ ఆటగాళ్లు పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. దీంతో వారి కెరీర్‌ ముగించేలా పీసీబీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.చదవండి: IND vs WI: విండీస్‌ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?

Ranji Trophy 2026: Jammu Kashmir Beat Karnataka Clinch Maiden Title8
చరిత్ర ఆవిష్కృతం.. భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి

జమ్మూ కశ్మీర్‌ సరికొత్త చరిత్ర ఆవిష్కరించింది. తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. కర్ణాటకతో ఫైనల్లో విజయ లాంఛనాన్ని శనివారం ముగించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ ఆటగాళ్లు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.అసాధారణ విజయాలతోదేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో జమ్మూ కశ్మీర్‌ అసాధారణ విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఆద్యంతం నిలకడైన ఆటతీరుతో ప్రధాన జట్లను సైతం ఓడిస్తూ టైటిల్‌ రేసులో నిలిచింది.ఈ క్రమంలో హుబ్లి వేదికగా కర్ణాటకతో ఫైనల్లో తలపడిన జమ్మూ కశ్మీర్‌ ఇక్కడా జోరు కనబరిచి తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది. KSCA హుబ్లి క్రికెట్‌ గ్రౌండ్‌లో టాస్‌ గెలిచిన జమ్మూ కశ్మీర్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 584 పరుగులు సాధించింది.సమిష్టిగా రాణించిన బ్యాటర్లుయావర్‌ హసన్‌ (88), కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (70), అబ్దుల్‌ సమద్‌ (61), కన్హయ్య వాధవాన్‌ (70), సాహిల్‌ లోట్రా (72) అర్ధ శతకాలతో రాణించగా.. శుభం పండిర్‌ శతక్కొట్టడం (121)తో ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక ఇందుకు బదులిచ్చేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 293 పరుగులకే కుప్పకూలింది.చెలరేగిన ఆకిబ్‌ నబీస్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (13) విఫలం కాగా.. మరో సీనియర్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్కాల్‌ (160) భారీ శతకంతో రాణించాడు. మిగిలిన వారిలో శ్రేయస్‌ గోపాల్‌ (27), కృతిక్‌ క్రిష్ణ (36) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జమ్మూ కశ్మీర్‌ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీ ఐదు వికెట్లతో చెలరేగి కర్ణాటక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.అజేయ సెంచరీల సాక్షిగా ఈ క్రమంలో 291 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన జమ్మూ కశ్మీర్‌.. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి కర్ణాటకపై ఓవరాల్‌గా 477 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆఖరిదైన శనివారం రోజు ఆటలో భాగంగా ఓపెనర్‌ కమ్రాన్‌ అక్మల్‌ అజేయ శతకం (160) పూర్తి చేసుకోగా.. సాహిల్‌ లోట్రా కూడా సెంచరీ (101)తో నాటౌట్‌గా నిలిచాడు.సాహిల్‌ శతకం పూర్తి చేసుకోగానే జమ్మూ కశ్మీర్‌ కెప్టెన్‌ పారస్‌ డోగ్రా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కశ్మీర్‌ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. అయితే, నిబంధనల ప్రకారం ఫలితం తేలనట్లయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు.సీఎం అభినందనలుపారస్‌ డోగ్రా ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించినప్పటికీ ఆఖరి రోజు కమ్రాన్‌, సాహిల్‌ సెంచరీల సాక్షిగా.. చారిత్రాత్మక విజయాన్ని జమ్మూ కశ్మీర్‌కు అందించాడు. కాగా సాహిల్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇదే తొలి శతకం. అది కూడా చారిత్రాత్మక విజయం సందర్భంగా సాధించడం విశేషం. చదవండి: IND vs WI: విండీస్‌ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?A maiden First-Class century 💯On the grandest stage of all 🏟️A moment he will never forget ✨Sahil Lotra puts up a performance that he will remember for a lifetime 🫡Updates ▶️ https://t.co/G0ytZLEyNB#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/YOl1SgTEmD— BCCI Domestic (@BCCIdomestic) February 28, 2026 ఇక జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ టైటిల్‌ గెలిచిన క్షణాలను ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రత్యక్షంగా తిలకించారు. భారత క్రికెట్‌ నియంత్రణమండలి (BCCI) అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ సైతం ఈ చారిత్రాత్మక​ ఘట్టానికి సాక్షిగా నిలిచాడు. వీరిద్దరు కరతాళ ధ్వనులతో సాహిల్‌తో పాటు కశ్మీర్‌ జట్టును అభినందించారు.

AFI to introduce SRY Gene Test in national level competitions, Know Why9
పురుష సామర్థ్యమున్న స్త్రీలకు చెక్‌!

న్యూఢిల్లీ: పురుష సామర్థ్యమున్న స్త్రీలు మహిళల విభాగంలో పోటీపడకుండా ఎస్‌ఆర్‌వై జన్యు పరీక్షతో అడ్డుకట్ట వేయాలని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నిర్ణయించింది. ఇందులో జీవసంబంధమైన లింగనిర్ధారణలో అమ్మాయి అని తేలితేనే పోటీకి అనుమతిస్తారు. ఇందులో పురుషులకు వుండే వై క్రొమోజోముల ప్రభావం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళల విభాగంలో అనుమతించరు.ఇటీవల ఏఎఫ్‌ఐ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ (EC) సమావేశంలో ఎస్‌ఆర్‌వై జన్యు పరీక్ష తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జాతీయ స్థాయిలో జరిగే అన్ని పోటీల్లో ఈ పరీక్ష చేయాలని ఏఎఫ్‌ఐ నిర్ణయించింది. ముందుగా ఈ జూలై 24 నుంచి 28 వరకు జరిగే జాతీయ ఇంటర్‌–స్టేట్‌ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో ఎస్‌ఆర్‌వై జన్యుపరీక్షను అమలు చేయనున్నట్లు ఏఎఫ్‌ఐ తెలిపింది. ఎందుకీ పరీక్ష... ఏమిటీ ‘ఎస్‌ఆర్‌వై’ ?జన్మతః అమ్మాయిగా పుట్టినప్పటికీ చాలా అరుదుగా కొందరు స్త్రీలలో పురుష సామర్థ్యం అసహజంగా ఉంటుంది. హార్మోన్ల అసమతౌల్యం కారణంగా ఇలా జరుగుతుంది. దీనివల్ల సదరు స్త్రీ సాటి స్త్రీలకంటే పురుషుడి సామర్థ్యం కలిగి ఉంటుంది. దీంతో పోటీల్లో పైచేయి సాధిస్తుంది. ఎస్‌ఆర్‌వై అంటే పురుషుల్లో ఉండే వై క్రొమోజోముల్ని బట్టి నిర్ధారించే లింగ పరీక్ష (SRY gene test). ఈ టెస్టు మహిళలకు చేస్తే జన్మతః కాకుండా జీవసంబంధమైన లింగ నిర్ధారణ బయటపడుతుంది.

Sanath Jayasuriya to step down as Sri Lanka head coach after T20 WC10
T20 WC: హెడ్‌కోచ్‌ పదవికి సనత్‌ జయసూర్య గుడ్‌బై

శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌, ప్రస్తుత హెడ్‌కోచ్‌ సనత్‌ జయసూర్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో శ్రీలంక- పాకిస్తాన్‌ మధ్య శనివారం నాటి మ్యాచ్‌ ముగిసిన తర్వాత పదవి నుంచి వైదొలగనున్నాడు.ముందుగానే రాజీనామాఈ ఏడాది మార్చి 31 వరకు హెడ్‌కోచ్‌గా సనత్‌ జయసూర్య (Sanath Jayasuriya)కు పదవీకాలం ఉంది. అయితే, ముందుగానే వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో దారుణంగా ఓడిపోయి.. శ్రీలంక క్రికెట్‌ పతన స్థితికి చేరుకుంది. ఈ ఐసీసీ టోర్నీలో పరాభవం తర్వాత.. దాదాపు ఎనిమిది నెలల అనంతరం సనత్‌ జయసూర్య హెడ్‌కోచ్‌గా వచ్చాడు.మిశ్రమ ఫలితాలుటీమిండియాతో జూలై, 2024లో జరిగిన సిరీస్‌తో తాత్కాలిక హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సనత్‌ జయసూర్య.. ఊహించని రీతిలో లంకకు చారిత్రాత్మక విజయం అందించాడు. అతడి మార్గదర్శనంలో దాదాపు రెండున్నర శతాబ్దాల తర్వాత శ్రీలంక భారత్‌పై వన్డే సిరీస్‌ గెలిచింది. ఆ తర్వాత కూడా మిశ్రమ ఫలితాలు అందుకుంది.మొత్తంగా దాదాపు 70 మ్యాచ్‌లలో లంక జట్టుకు సనత్‌ జయసూర్య మార్గదర్శనం చేయగా.. జయాపజయాలు దాదాపుగా సమానంగా ఉండటం గమనార్హం. అయితే, తాను ఈ పదవిలో పూర్తికాలం కొనసాగబోనని అతడు ఈ ఏడాది జనవరిలోనే స్పష్టం చేశాడు. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌-2026 ముగిసిన తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించాడు.టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో మరోసారి వైఫల్యంకాగా భారత్‌తో కలిసి శ్రీలంక టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. లీగ్‌ దశలో గ్రూప్‌-బి నుంచి పోటీ పడ్డ దసున్‌ షనక బృందం.. నాలుగింట మూడు విజయాలు సాధించింది. ఐర్లాండ్‌, ఒమన్‌, ఆస్ట్రేలియాలపై గెలిచిన లంక.. అనూహ్య రీతిలో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది.ఇక సూపర్‌-8 దశలో తొలుత ఇంగ్లండ్‌ చేతిలో 51 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన శ్రీలంక.. తదుపరి న్యూజిలాండ్‌ చేతిలో 61 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. తద్వారా సెమీస్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఇలా సెమీ ఫైనల్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టడం ఇది వరుసగా ఐదోసారి. ఈ నేపథ్యంలో మరోసారి లంక జట్టు ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక సూపర్‌-8లో చివరగా పాకిస్తాన్‌తో శనివారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో లంక తలపడుతుంది. ఇందుకు పల్లెకెలె వేదిక.చదవండి: T20 WC 2026 SL vs PAK: పాకిస్తాన్‌కు చావోరేవో.. గెలిస్తే సరిపోదు!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement