Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Cameron Greens Horror Run Continues In IPL 2026,1
ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు

ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచిన గ్రీన్‌.. త‌న ఆట ప‌రంగా ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాడు. ఈ ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడు.ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గ్రీన్ కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. బార్ట్‌లెట్ బౌలింగ్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గ్రీన్‌.. ఆ తర్వాత బంతికి మాత్రం వికెట్ల వెనక దొరికిపోయాడు. అంతకుమందు ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం రెండు పరుగులు చేశాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా గ్రీన్ 18 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లు కలిపి గ్రీన్ కేవలం 24 పరుగులు చేశాడు. దీంతో అతడిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకు రూ.25.2 కోట్ల దండగ అని పోస్టులు పెడుతున్నారు. కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో అతడిని కేకేఆర్ రూ.25.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు ప్రస్తుతం కేవలం బ్యాటర్‌గా మాత్రమే తన సేవలను అందిస్తున్నాడు. గాయం కారణంగా అతడికి బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుం‍చి ఇంకా అనుమతి లభించలేదు.చదవండి: IPL 2026: అవేశ్ అత్యుత్సాహం.. బీసీసీఐకి సన్‌రైజర్స్ ఫిర్యాదు?

Avesh incident adds to SRHs grievance list2
అవేశ్ అత్యుత్సాహం.. బీసీసీఐకి సన్‌రైజర్స్ ఫిర్యాదు?

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేస‌ర్ అవేష్ ఖాన్‌కు పేరుకు త‌గ్గ‌ట్టే అవేషం ఎక్కువే. గ‌తంలో త‌న చ‌ర్య‌లతో భారీ జ‌రిమానా ఎదుర్కొన్న అవేష్ ఖాన్‌.. ఇప్పుడు మ‌రోసారి త‌న అత్యుత్సాహంతో చిక్కుల్లో ప‌డ్డాడు. ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో భాగంగా ఆదివారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ్డాయి.అసలేం జరిగింది?ఈ మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్‌లో ల‌క్నో విజ‌యానికి తొమ్మిది ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. జ‌య‌దేవ్ ఉన‌ద్క‌ట్ వేసిన ఆ ఓవ‌ర్‌లో తొలి రెండు బంతుల‌ను పంత్ బౌండ‌రీలగా మ‌లిచాడు. దీంతో స్కోర్లు స‌మ‌మ‌య్యాయి. ఆ త‌ర్వాతి రెండు బంతులకు ఎలాంటి ప‌రుగు కాలేదు. ఐదో బంతిని పంత్ మిడ్-ఆఫ్ మీదుగా బౌండరీకి తరలించాడు. అయితే ఆ బంతి బౌండరీ లైన్‌ను తాకకముందే, డ‌గౌట్ వ‌ద్ద అవేష్ ఖాన్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శ‌రించాడు.తదుపరి బ్యాటింగ్ కోసం ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉన్న ఆవేష్ ఖాన్.. బయటి నుండి బ్యాట్‌తో ఆ బంతిని కొట్టాడు. కానీ దీన్ని ఎవరూ గమనించకపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచినట్టు నిర్థారించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు తమ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఎస్ఆర్‌హెచ్ ఇది గ‌మ‌నించి ఫిర్యాదు ఉంటే ల‌క్నోకు ఐదు పరుగులు పెనాల్టీ ప‌డేద‌ని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.రూల్స్ ఏమి చెబుతున్నాయి?నిబంధనల ప్ర‌కారం.. బంతి లైన్ దాటకముందే బయటి ఉన్న వ్యక్తి తాక‌కూడ‌దు. లా 20.4.2: మైదానం బయట ఉన్న వ్యక్తి ఆటలో జోక్యం చేసుకుంటే, అంపైర్ ఆ బంతిని 'డెడ్ బాల్'గా ప్రకటించవచ్చు. అంతేకాకుండా లా 41 (అన్‌ఫెయిర్ ప్లే) ప్రకారం.. ఆ బంతిని ర‌ద్దు చేసి స‌ద‌రు జ‌ట్టుకు 5 ప‌రుగులు పెనాల్టీ విధిస్తారు. అయితే అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో ఎస్ఆర్‌హెచ్‌ ఫిర్యాదు చేసినా అంపైర్‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోపోయేవార‌ని విశ్లేషకులు చెబుతున్నారు.బీసీసీఐకి స‌న్‌రైజ‌ర్స్ ఫిర్యాదు?అయితే ఘటన మాత్రమే కాకుండా, ఈ సీజన్ లో జరిగిన మరికొన్ని అంపైరింగ్ నిర్ణయాలపై సన్‌రైజర్స్ యాజ‌మాన్యం గుర్రుగా ఉంది. దీనిపై బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసే యోచనలో ఎస్ఆర్‌హెచ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ అవుట్‌పై కూడా ఎస్ఆర్‌హెచ్‌ అసహనం వ్యక్తం చేసింది. అదేవిధంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అవుట్ అయిన తీరు కూడా వివాద‌స్ప‌ద‌మైంది.

IPL 2026: kolkata knight riders vs Punjab kings live updates3
వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌

IPL 2026 KKR vs PBKS Live Updates: ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడతున్నాయి.వ‌ర్షం అంత‌రాయంఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆట నిలిచిపోయే సమయానికి కేకేఆర్‌ స్కోర్‌:25-2కేకేఆర్‌కు భారీ షాక్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జేవియర్ బార్టలెట్ వేసిన రెండో ఓవర్‌లో డేంజరస్ బ్యాటర్లు ఫిన్ అలెన్‌(6),కామెరూన్ గ్రీన్(4) వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. ఐపీఎల్‌-2026లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కేకేఆర్‌ స్టార్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ దూరమయ్యారు.వారిద్దరి స్ధానంలో నవ్‌దీప్ సైనీ, పావెల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్‌ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. కాగా పంజాబ్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉండగా.. కేకేఆర్‌ మాత్రం ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది.తుది జట్లు:పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), కూపర్ కొన్నోలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్‌లు: ప్రియాంష్ ఆర్య, సూర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హర్‌ప్రీత్ బ్రార్కోల్‌కతా నైట్ రైడర్స్ : ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీప‌ర్‌), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిఇంపాక్ట్ సబ్‌లు: బ్లెస్సింగ్ ముజారబానీ, మనీష్ పాండే, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, సౌరభ్ దూబే

He Will Lead India Soon: PBKS Pacer Massive Praise For Shreyas Iyer4
‘త్వరలోనే టీమిండియా టీ20 కెప్టెన్‌ అవుతాడు’

టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథిగా వ్యవహరించిన ఈ ముంబైకర్‌.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇక గతేడాది వేలంలో రూ. 26.75 కోట్లు పైగా వెచ్చించి పంజాబ్‌ కింగ్స్‌ అతడిని కొనుగోలు చేసి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.పైసా వసూల్‌ ప్రదర్శనఈ క్రమంలో ఐపీఎల్‌-2025లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పంజాబ్‌కు పైసా వసూల్‌ ప్రదర్శన ఇచ్చాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer). మొత్తంగా 17 మ్యాచ్‌లలో 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. సారథిగా పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.ఇక ఐపీఎల్‌-2026 టోర్నీని కూడా శ్రేయస్‌ అయ్యర్‌ ఘనంగా ఆరంభించాడు. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో జట్టును గెలిపించుకున్నాడు. బ్యాటర్‌గా రెండు మ్యాచ్‌లలో కలిపి 68 పరుగులు రాబట్టాడు. ఇదిలా ఉంటే.. గతేడాది దేశీ క్రికెట్‌లోనూ ముంబై తరఫున అయ్యర్‌ అదరగొట్టాడు.అయినప్పటికీ భారత టీ20 జట్టుకు సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోనే లేదు. అయితే, పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ వైశాఖ్‌ విజయ్‌కుమార్‌ మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ తప్పక టీమిండియా టీ20 కెప్టెన్‌ అవుతాడని అంచనా వేశాడు. సారథి అయ్యేందుకు అతడికి అన్ని అర్హతలు ఉన్నాయని కొనియాడాడు.త్వరలోనే టీమిండియా కెప్టెన్‌ అవుతాడుఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి బౌలర్‌, ప్రతి ఆటగాడికి అతడు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాడు. బాగా ఆడినా.. ఆడకపోయినా వారికి అండగానే ఉంటాడు. ఆటగాళ్లకు కావాల్సింది ఇలాంటి కెప్టెనే.టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా అతడు అత్యద్భుతంగా ఆడుతున్నాడు. కచ్చితంగా అతడు త్వరలోనే టీమిండియా కెప్టెన్‌ అవుతాడు’’ అని వైశాఖ్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నాడు. కాగా వైశాఖ్‌ పంజాబ్‌ తరపున ఇప్పటికి రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ 2023, డిసెంబరులో చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు శ్రేయస్‌ అయ్యర్‌.చదవండి: CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!

RCB Captain Rajat Patidar Fumes At Umpire, 5
నా డ్రింక్ ఎందుకు తాగావు?

ఐపీఎల్‌-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జోరు కొనసాగిస్తోంది. ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ విజయంతో పాటిదార్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు సీఎస్‌కే ముందు 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ కొండంత లక్ష్యాన్ని చేధించలేక సీఎస్‌కే 207 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌ సంఘటన చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?ర‌జ‌త్ పాటిదార్‌, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ క్రీజులో ఉన్న‌ప్పుడు ఆర్సీబీ సెకెండ్ డ్రింక్స్ బ్రేక్‌ను తీసుకుంది. సాధార‌ణంగా డ్రిక్స్ బ్రేక్ స‌మ‌యంలో కోచ్‌లు వ్యూహాలు పంచుకోవడానికి మైదానంలోకి వస్తుంటారు. ఈ క్ర‌మంలో ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్ల‌వ‌ర్‌, బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్‌.. త‌మ బ్యాట‌ర్లు పాటిదార్‌, ప‌డిక్క‌ల్ కోసం డ్రింక్స్ తీసుకుని మైదానంలో లోప‌లికి వ‌చ్చారు. అయితే ఇక్క‌డే ఓ వింత సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పాటిదార్ కోసం తీసుకొచ్చిన డ్రింక్ బాటిల్‌ను అంపైర్ తీసుకుని తాగాడు. ఇది చూసిన పాటిదార్ వెంట‌నే అంపైర్ దగ్గరకు వెళ్లి తన బాటిల్ తనకు ఇచ్చేయమని అడిగాడు. దినేష్ కార్తీక్ కూడా అంపైర్‌తో కాస్త సీరియ‌స్‌గానే మాట్లాడాడు. ఆ పక్కనే ఉన్న ఆండీ ఫ్లవర్ ఇదంతా చూస్తూ సైలెంట్‌గా ఉన్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. అయితే నెటిజ‌న్లు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఈ ఘ‌ట‌న‌ను హాస్యస్పదంగా తీసుకుంటుంటే, మ‌రికొంత మంది పాటిదార్‌, కార్తీక్ తీరును త‌ప్పుబ‌డుతున్నారు.చదవండి: IPL 2026: రూ. 28 కోట్లు దండగేనా? చీప్‌గా దొరికాడు.. చితక్కొడుతున్నాడు!The Sierra Super Striker of the match between Royal Challengers Bengaluru and Chennai Super Kings goes to Tim David#TATAIPL | #KhelBindaas | #RCBvCSK | @TataMotors_Cars | #SierraSuperStriker pic.twitter.com/63WVsoUtaR— IndianPremierLeague (@IPL) April 5, 2026 Dinesh Karthik vs Umpire: Heated Moment on the Field#dineshkarthik #ipl #cricket #umpire #heatedmoment #cricketcontroversy #viral pic.twitter.com/lf7GZs2PIJ— The Savera Times (@thesavera_times) April 6, 2026

Not Right: Yuvraj No Communication Claim Over Career Draws Blunt Reaction6
BCCI: అది సరికాదు.. యువీకే తప్పలేదంటే...

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు యువరాజ్‌ సింగ్‌. భారత జట్టు 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంతో ఈ మాజీ ఆల్‌రౌండర్‌ది కీలక పాత్ర. ఈ మెగా టోర్నీ తర్వాత క్యాన్సర్‌ఉందని తేలగా.. మొక్కవోని విశ్వాసంతో మహమ్మారి జయించి తిరిగి మైదానంలో అడుగుపెట్టిన ఘనుడు యువీ.అయితే, కెరీర్‌ చరమాంకంలో యువీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జట్టులో చోటు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలన్న కోరిక తీరకుండానే యువీ రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది.కనీస సమాచారం కూడా ఇవ్వకుండా..ఈ విషయం గురించి యువరాజ్‌ సింగ్‌ తాజాగా స్పోర్ట్స్‌ తక్‌ ఇంటర్వ్యూలో స్పందించాడు. నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తన పేరును పరిగణనలోకి తీసుకోలేదని.. అందుకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయాడు. ఫిట్‌నెస్‌ పరీక్ష పాసైనా ఎదురుచూపులు తప్పలేదని.. అందుకే రిటైర్మెంట్‌ ఇచ్చానని తెలిపాడు.అంతటి యువీకే తప్పలేదంటేఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ యువీ వ్యాఖ్యలపై స్పందించాడు. యువరాజ్‌ పట్ల యాజమాన్యం వైఖరి తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘మొదట్లో వార్తా పత్రికల్లో చూసి ఆటగాళ్లు తమ కెరీర్‌ కొనసాగుతుందా? ముగిసిపోయిందా? అని తెలుసుకునేవాళ్లు.అయితే, యాజమాన్యం మరీ ఇంత ఘోరంగా ఉండాల్సింది కాదు. టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన యువరాజ్‌ సింగ్‌ వంటి దిగ్గజాల విషయంలోనైనా కాస్త మెరుగ్గా ప్రవర్తించాల్సింది. తనను ఎవరూ సంప్రదించకుండానే రిటైర్మెంట్‌ తీసుకునేలా చేశారని యువీ అన్నాడు. ఇలా చేయడం సరికాదు. కచ్చితంగా ఆటగాళ్లతో చర్చించి వారికి మేనేజ్‌మెంట్‌ స్పష్టతనివ్వాలి’’ అని వసీం జాఫర్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నాడు. రో-కోలకు చెప్పండికాగా యువీ ఇటీవల మాట్లాడుతూ.. మేనేజ్‌మెంట్‌ తన విషయంలో వ్యవహరించినట్లు మరెవరి విషయంలో వ్యవహరించకూడదని అన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ.. వరల్డ్‌కప్‌-2026 రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు కూడా మేనేజ్‌మెంట్‌ సరైన సమాచారం ఇవ్వాలని యువీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరు గొప్ప ఆటగాళ్లని.. వారిని సాదరంగా పంపితే బాగుంటుందని పేర్కొన్నాడు.చదవండి: CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!

How Sarfaraz Khan Is Outperforming CSKs 28-Crore Duo7
రూ. 28 కోట్లు దండగేనా? చీప్‌గా దొరికాడు.. చితక్కొడుతున్నాడు!

ఐపీఎల్‌-2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. ఈ ఏడాది సీజ‌న్‌లో సీఎస్‌కే హ్యాట్రిక్ ఓట‌ముల‌ను మూట క‌ట్టుకుంది. ఆదివారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 43 ప‌రుగుల తేడాతో చెన్నై ప‌రాజ‌యం పాలైంది. అయితే రుతురాజ్ గైక్వాడ్‌, సంజూ శాంస‌న్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు విఫ‌ల‌మ‌వుతున్న‌ చోట ఒక్క‌డు మాత్రం స‌త్తా చాటుతున్నాడు. అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో సీఎస్‌కే మేనెజ్‌మెంట్ త‌నపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌లోనూ కాదు టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంద‌ని నిరూపించుకుంటున్నాడు. అత‌డే ముంబై మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ సర్ఫ‌రాజ్ ఖాన్‌.ధర తక్కువ.. క్వాలిటీ ఎక్కువగతేడాది జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ను కేవలం రూ.75 లక్షలకు మాత్రమే సీఎస్‌కే కొనుగోలు చేసింది. కానీ కోట్ల ధర పలికిన సంజూ శాంసన్‌, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ కంటే సర్ఫరాజ్ అద్భుతమైన ప్రదర్శనమైన కనబరుస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అనుహ్యంగా ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌.. 17 ప‌రుగులు చేసి ఫ‌ర్వాలేద‌న్పించాడు. ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 12 బంతుల్లోనే 32 ప‌రుగులు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్యపరిచాడు. ఆదివారం ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా స‌ర్ఫ‌రాజ్ బ్యాట్ ఝులిపించాడు. కేవలం 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు. శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అయూశ్‌ మాత్రే సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే ఔట్‌ అయితే.. ఈ ముంబైకర్‌ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సర్ఫరాజ్ ప్రస్తుతం 99 పరుగులతో సీఎస్‌కే లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వేలంలో ఇతడిని వదిలేసిన జట్లు ఇప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపపడుతుంటాయి.28 కోట్ల ఆటగాళ్లు విఫలంకాగా ఐపీఎల్‌-2026 మినీ వేలంలో సీఎస్‌కే ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై భారీ మొత్తం ఖర్చుచేసిన సంగతి తెలిసిందే.కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను తలా రూ.14.20 కోట్లు వెచ్చించి సీఎస్‌కే కొనుగోలు చేసింది. కానీ భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన వీరిద్దరూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో భారీ హిట్టర్‌గా పేరొందిన కార్తీక్ శర్మ.. ఐపీఎల్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. దేశవాళీ ఫామ్‌ను చూసి స్కౌటింగ్ టీమ్ అతడిపై అతిగా అంచనా వేసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జడేజాకు ప్రత్యామ్నయంగా ప్రశాంత్ వీర్‌ను సీఎస్‌ఎకే జట్టులోకి తీసుకుంది. అయితే అతడితో ఇప్పటివరకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు మ్యాచ్‌లు ఆడి 49 పరుగులు చేశాడు. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ప్రశాంత్ వీర్ 29 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 రన్స్ చేసి రాణించాడు. కానీ అతడు తీసుకుంటున్న జీతానికి ఇది ఏ మాత్రం సరిపోదు.చదవండి: CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!

IPL 2026: MS Dhoni Dewald Brevis likely to play CSK Next match8
CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గతేడాది అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది సీఎస్‌కే. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. తమ చరిత్రలో తొలిసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.హ్యాట్రిక్‌ పరాజయాలుఇక ఐపీఎల్‌-2026ను కూడా చెన్నై ఓటమితోనే ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిన సీఎస్‌కే.. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌కు మ్యాచ్‌ను చేజార్చుకుంది. తాజాగా ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన విఫలమైంది. ఈ నేపథ్యంలో చెన్నై ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.ధోని, బ్రెవిస్‌ దూరంఇదిలా ఉంటే.. దిగ్గజ కెప్టెన్‌, చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన మహేంద్ర సింగ్‌ ధోని గాయం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో టీమిండియా టీ20 స్టార్‌, వరల్డ్‌కప్‌ విజేత సంజూ శాంసన్‌ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.ఇక ధోనితో పాటు యువ ఆటగాడు, పవర్‌ హిట్టర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం సీఎస్‌కే తదుపరి మ్యాచ్‌కి ధోని అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. ధోని ఫిట్‌నెస్‌ పరీక్షకు సిద్ధంగా ఉన్నాడు.ఇద్దరూ వచ్చేస్తున్నారుఅదే విధంగా డెవాల్డ్‌ బ్రెవిస్‌ కూడా ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా బ్రెవిస్‌ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మధ్య ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడగల సత్తా ఈ సౌతాఫ్రికా ప్లేయర్‌కు ఉంది. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్‌కే హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ..‘‘తదుపరి మ్యాచ్‌ వరకు అంతా సర్దుకుంటుందనే అనుకుంటున్నాం. తర్వాతి మ్యాచ్‌కు మాకు ఐదు రోజుల సమయం ఉంది. ఈ ఓటమి బాధించింది. అయితే, మా ప్రణాళికలకు అనుగుణంగా తదుపరి మ్యాచ్‌లో ముందడుగు వేయగలమనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు. ఒకవేళ ధోని, బ్రెవిస్‌ తిరిగి వస్తే సీఎస్‌కే గాడిన పడుతుందని చెప్పవచ్చు. కాగా తదుపరి మ్యాచ్‌లో సొంత మైదానం చెపాక్‌ వేదికగా చెన్నై ఏప్రిల్‌ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.చదవండి: ‘అప్పట్లో ఒకడు ఉండేవాడు వికెట్ల వెనుక!.. చిల్లర బుద్ధి’

IPL 2026 RCB vs CSK: Ananya Birla Shares Pic With Sania Mirza Izzu Best9
ఇప్పటికి కుదిరింది: అనన్య బిర్లా పోస్ట్‌ వైరల్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో పాటు ఆ జట్టు యజమాని కావ్యా మారన్‌కు కూడా అభిమాన గణం ఎక్కువే. మ్యాచ్‌ సమయంలో స్టేడియానికి విచ్చేసి జట్టును ఉత్సాహపరచడం ఆమెకు పరిపాటి. ముఖ్యంగా హోం గ్రౌండ్‌ అంటే ఉప్పల్‌లో మ్యాచ్‌లో కావ్య తప్పక ఉండాల్సిందే.ఇక మ్యాచ్‌ ఆసాంతం తాను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లతో గత కొన్నేళ్లుగా కావ్యా మారన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పుడు ఆమెకు పోటీగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ యాజమాన్యంలో భాగమైన అనన్య బిర్లా వచ్చి చేరింది. ముఖ్యంగా ఐపీఎల్‌-2026 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ- సన్‌రైజర్స్‌ తలపడగా.. వీరిద్దరు హైలైట్‌ అయ్యారు.తాజాగా ఆదివారం డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడగా.. కావ్యా మారన్‌ ఈ మ్యాచ్‌కు హాజరైంది. మరోవైపు.. సాయంత్రం ఆర్సీబీ- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌కు అనన్య బిర్లా విచ్చేసింది.అయితే, ఈసారి అనన్య తనతో పాటు తన ప్రాణ స్నేహితురాలు, భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాను కూడా తీసుకువచ్చింది. ఓవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్క శర్మ.. మరోవైపు.. అనన్య- సానియా స్టాండ్స్‌ నుంచి ఆర్సీబీ ఉత్సాహపరిచారు. ఇక సానియాతో పాటు ఆమె కుమారుడు ఇజహాన్‌ సైతం ఈ మ్యాచ్‌ను వీక్షించాడు.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో అనన్య పెట్టిన పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. సానియా- ఇజహాన్‌ల వెనుక వరుసలో తాను కూర్చుని ఉన్న ఫొటోను పంచుకున్న అనన్య.. ‘‘కలిసి ఫొటో దిగాలని ఎల్లప్పుడూ అనుకుంటాము. కానీ ఎప్పుడూ ఇలా కుదరలేదు. ఈసారి ఈ ఫొటో దొరికింది. ఐ లవ్‌ యూ సానియా.. ఇజ్జూ.. నువ్వు బెస్ట్‌ బాబూ’’ అని క్యూట్‌ క్యాప్షన్‌ ఇచ్చింది.ఇక మ్యాచ్‌ల విషయానికొస్తే.. లక్నో చేతిలో సన్‌రైజర్స్‌ ఓడిపోగా.. ఆర్సీబీని చెన్నైని చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్తానానికి చేరింది. ఈ క్రమంలో కావ్య నిరాశగా వెనుదిరగగా.. అనన్య బృందం సంబరాలు చేసుకుంది.చదవండి: IPL కాదు!.. PSL నంబర్‌ వన్‌: పీసీబీ చీఫ్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌

Ek tha jo wicket ke peeche se: CSK Fans Lambasts After RCB troll Dhoni10
‘అప్పట్లో ఒకడు ఉండేవాడు వికెట్ల వెనుక!.. చిల్లర బుద్ధి’

డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఐపీఎల్‌-2026 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించిన ఆర్సీబీ.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే)ను చిత్తు చేసింది.43 పరుగుల తేడాతో జయభేరిబెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ ఓడిన ఆర్సీబీ (RCB vs CSK) తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో కేవలం 207 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.ఫలితంగా ఆర్సీబీ చెన్నైపై 43 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుసగా రెండో విజయం నమోదు చేసి.. నాలుగు పాయింట్లు సాధించింది. భారీ నెట్‌రన్‌రేటు (+2.501) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు.దుమ్మెత్తిపోస్తున్న సీఎస్‌కే ఫ్యాన్స్‌ మరోవైపు.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ మాత్రం ఆర్సీబీ సోషల్‌ మీడియా వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, సీఎస్‌కేను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన మహేంద్ర సింగ్‌ ధోనిని అవమానించేలా పోస్టు పెట్టడమే ఇందుకు కారణం.కాగా 44 ఏళ్ల వయసులోనూ ధోని (MS Dhoni) ఐపీఎల్‌-2026 ఆడేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యా ఆరంభ మ్యాచ్‌లకు ఈ దిగ్గజ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దూరమయ్యాడు. ఈ క్రమంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలోని చెన్నై వరుసగా మూడు పరాజయాలతో చతికిలపడింది. దీంతో ధోని లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.ధోనిని కించపరిచేలా..ఈ నేపథ్యంలో ధోనిని కించపరిచేలా ఆర్సీబీ ఓ పోస్టు పెట్టింది. చెన్నై ఇన్నింగ్స్‌లో పదో ఓవర్లో అభినందన్‌ సింగ్‌ వేసిన ఐదో బంతిని శివం దూబే షాట్‌ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకుని దూబే పెవిలియన్‌ చేరేలా చేశాడు.అప్పట్లో ఒకడుండేవాడు వికెట్ల వెనుకఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆర్సీబీ.. ‘‘అప్పట్లో ఒకడుండేవాడు వికెట్ల వెనుక’’ అంటూ పరోక్షంగా ధోనిని ఉద్దేశించి క్యాప్షన్‌ జతచేసింది. దీంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. Ek tha jo wicket ke piche se………. pic.twitter.com/z6cdirLIUC— Royal Challengers Bengaluru (@RCBTweets) April 5, 2026‘‘ఒక్క టైటిల్‌ కోసం పద్దెనిమిదేళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఓ చెత్త జట్టు.. ఒక్కసారి గెలవగానే చిల్లర బుద్ధి చూపిస్తోంది. ధోని ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచాడు. అయినా ఎప్పుడూ సీఎస్‌కే ఇలాంటి చిల్లరవేషాలు వేయలేదు’’ అంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.చదవండి: IPL 2026: ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే!

Advertisement
Advertisement
 
Advertisement