Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Shoaib Akhtar Embarrassing U Turn After Calling Naqvi Illiterate1
T20 WC: పాక్‌ మరో ‘యూటర్న్‌’!.. ఈసారి ఎవరంటే?

టీ20 ప్రపంచకప్‌-2026 నేపథ్యంలో పాకిస్తాన్‌ వరుస ‘యూటర్న్‌’లతో వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టోర్నీనే బహిష్కరిస్తామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తొలుత సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.ఆ తర్వాత మొదటికే మోసం వస్తుందని భావించి.. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే బాయ్‌కాట్‌ చేస్తామని ఏ​కంగా పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ప్రకటన చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) రంగంలోకి దిగడంతో ఈ విషయంలోనూ పాక్‌ మాట మార్చింది.ఐసీసీతో పాటు పాక్‌ భద్రతా కారణాల గురించి మాట్లాడటంతో శ్రీలంక సైతం తమపై గతంలో పాక్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ లేఖ రాసింది. యూఏఈ కూడా పాకిస్తాన్‌ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరింది. ఆఖరికి బంగ్లాదేశ్‌ సైతం భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేసింది.ఈ నేపథ్యంలో ఐసీసీతో పాటు శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్‌ ఒత్తిళ్ల కారణంగా టీమిండియాతో మ్యాచ్‌ ఆడతామంటూ పాక్‌ అతి పెద్ద యూటర్న్‌ తీసుకుంది. అన్నట్లుగానే కొలంబో వేదికగా పటిష్ట భారత్‌తో తలపడ్డ పాకిస్తాన్‌ 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పీసీబీ చైర్మన్‌ , మంత్రి మొహ్సిన్‌ నక్వీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసమర్థ వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ మండిపడ్డాడు. సీనియర్‌ ప్లేయర్లు బాబర్‌ ఆజం, షాహిన్‌ ఆఫ్రిది, షాదాబ్‌ ఖాన్‌ వరుసగా విఫలమవుతున్నా.. ఎందుకు ఆడిస్తున్నారని ప్రశ్నించాడు.ఆట పట్ల అవగాహన లేని వ్యక్తి చైర్మన్‌ అయితే ఇలాగే ఉంటుందంటూ నక్వీని ఉద్దేశించి అక్తర్‌ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్‌ వైరల్‌ కాగా అక్తర్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో అతడు కూడా యూటర్న్‌ తీసుకున్నాడు. తాను నక్వీ భాయ్‌ను ఉద్దేశించి.. ‘‘చదువులేని వాడు, అసమర్థుడు’’ అని అనలేదంటూ మాట మార్చాడు.‘‘నేను నక్వీ భాయ్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆయనను అగౌరవపరచాలనే ఉద్దేశమే నాకు లేదు. అంతర్జాతీయ స్థాయిలో పాక్‌ క్రికెట్‌ దిగజారుతున్న తీరుపైనే నేను ఆవేదన వ్యక్తం చేశాను.అసమర్థులైన వ్యక్తులు వ్యవస్థను నాశనం చేస్తారు అని మాత్రమే అన్నాను. అయితే, అది నక్వీ భాయ్‌ను ఉద్దేశించి మాత్రం కాదు. కానీ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. అదే కార్యక్రమంలో నేను నక్వీ భాయ్‌ మంచి వ్యక్తి అని చెప్పాను. కానీ ఆ మాటలను ప్రసారం చేయలేదు.అయితే, ఒక విషయంలో మాత్రం నక్వీ భాయ్‌పై నాకు నిజంగానే కోపం వచ్చింది. టీమిండియాతో ఆడమని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ మాట మీద నిలబడలేదు. మేమంతా ఆయనతోనే ఉన్నాం. అయినా సరే యూటర్న్‌ తీసుకోవడం నచ్చలేదు. ఈ విషయంలో పునరాలోచన చేసే ముందు నన్ను సంప్పదించాల్సింది’’ అని అక్తర్‌ తాను కూడా మాట మార్చేశాడు. ఈ నేపథ్యంలో ‘‘యూటర్న్‌ల మీద యూటర్న్‌లు.. మీకసలు సిగ్గుందా?’’ అంటూ నెటిజన్లు పీసీబీ, అక్తర్‌కు చివాట్లు పెడుతున్నారు.

Ranji Trophy Semifinal BEN vs JK Day 3 Shami Picks 8 Wickets Fans Reacts2
నిప్పులు చెరిగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్‌!

టీమిండియా వెటరన్‌ పేసర్‌, బెంగాల్‌ బౌలింగ్‌ స్టార్‌ మొహమ్మద్‌ షమీ మరోసారి సత్తా చాటాడు. రంజీ ట్రోఫీ 2025-26 రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. కళ్యాణిలోని బెంగాల్‌ క్రికెట్‌ అకాడమీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా జమ్మూ కశ్మీర్‌- బెంగాల్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ మొదలైంది.328 పరుగులకు ఆలౌట్‌టాస్‌ గెలిచిన జమ్మూ కశ్మీర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. బెంగాల్‌ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (49), షాబాజ్‌ అహ్మద్‌ (42) రాణించగా.. సుదీప్‌ కుమార్‌ ఘరామి (146) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో సుమంత గుప్తా 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 97.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్‌ అయింది.జమ్మూ కశ్మీర్‌ బౌలర్లలో స్టార్‌ పేసర్‌ అకీబ్‌ నబీ (Auqib Nabi) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. సునిల్‌ కుమార్‌ (Sunil Kumar) మూడు, యుధ్‌వీర్‌ సింగ్‌ చరఖ్‌, అబిద్‌ ముస్తాక్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం జమ్మూ కశ్మీర్‌ మొదటి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగా.. మంగళవారం నాటి మూడో రోజు ఆటలో 302 పరుగులకు ఆలౌట్‌ అయింది.ఆది నుంచే నిప్పులు చెరిగిన షమీఆది నుంచే నిప్పులు చెరిగిన బెంగాల్‌ పేసర్‌ షమీ.. ఓపెనర్లు శుభం ఖజూరియా (3), యావర్‌ హసన్‌ (2)లను వచ్చీరాగానే వెనక్కి పంపాడు. అదే విధంగా అబ్దుల్‌ సమద్‌ (82), కన్హయ్య వాధవాన్‌ (29) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు.అంతేకాదు.. అబిద్‌ ముస్తాక్‌ (27), వన్షజ్‌ శర్మ (3), ఆకిబ్‌ నబీ (42), యుధ్‌వీర్‌ సింగ్‌ చరఖ్‌ (33)ల వికెట్లు కూడా షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. మిగిలిన బెంగాల్‌ బౌలర్లలో టీమిండియా స్టార్‌ ముకేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ విజృంభణ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 26 పరుగుల ఆధిక్యం సంపాదించగలిగింది.ఆడినా లాభమేంటి?గతేడాది మార్చిలో చివరగా టీమిండియా తరఫున వన్డే బరిలో దిగాడు షమీ. అంతకు ముందు నెలలో టీ20లు ఆడాడు. అయితే, అతడు భారత్‌ తరఫున టెస్టులు ఆడి దాదాపు మూడేళ్లు కావస్తోంది.ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సత్తా చాటినా టీమిండియా సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. తాజా రంజీ సీజన్‌లోనూ ఆకట్టుకున్నా అతడికి పిలుపునివ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. షమీకి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ లేదని వ్యాఖ్యానించగా.. తాను ఆటతోనే సమాధానం చెబుతున్నానని షమీ కౌంటర్‌ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే తాజా మ్యాచ్‌లోనూ సత్తా చాటి మరోసారి టీమిండియా సెలక్ట ర్లకు గట్టి వార్నింగే ఇచ్చాడు.An 8️⃣-wicket masterpiece 🫡Watch 🎥Mohd. Shami wreaks havoc with his career-best First Class figures of 8/90 🔥 Updates ▶️ https://t.co/QXyCuRIgVM#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/f4F3TYnSWi— BCCI Domestic (@BCCIdomestic) February 17, 2026చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Is Gambhir to quit India head coach role RR offer triple role ahead of IPL 20263
గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ త్వరలోనే తప్పుకోనున్నాడా? తన కాంట్రాక్టు ముగిసేంత వరకు కూడా అతడు పదవిలో కొనసాగడా?... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)తో మళ్లీ అతడి బంధం బలపడనుందా?..భారత క్రికెట్‌ వర్గాల్లో ఈ సందేహాలు తలెత్తడానికి ప్రధాన కారణం దైనిక్‌ జాగరణ్‌లో వచ్చిన కథనం. ఈ జాతీయ మీడియా అందించిన వివరాల ప్రకారం.. రాజస్తాన్‌ రాయల్స్‌ గంభీర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్న వేళ.. గంభీర్‌కు ఆ ఫ్రాంఛైజీ బంపరాఫర్‌ ఇచ్చినట్లు సమాచారం.వాటా ఇస్తారా?.. ట్రిపుల్‌ ధమాకా!ఫ్రాంఛైజీలో 2-3 శాతం వాటా ఇవ్వడంతో పాటు సీఈఓ పోస్టు కూడా ఇస్తామని గంభీర్‌ (Gautam Gambhir)కు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా జట్టు మెంటార్‌గానూ అతడికి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు మొత్తం గంభీర్‌ కనుసన్నల్లోనే నడుస్తుంది. సర్వం తానై జట్టును నడిపించే బాధ్యత ఈ మాజీ వరల్డ్‌కప్‌ విన్నర్‌కు దక్కుతుంది.ఒకవేళ గంభీర్‌ గనుక ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే టీమిండియా హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం భారత క్రికెట్‌లో ఓ పదవిలో ఉన్న వ్యక్తి.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండరాదు. రెండుచోట్లా సదరు వ్యక్తి పనిచేసినట్లయితే అయితే ‘కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌’ కిందకు వస్తుంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఆ వ్యక్తిపై వేటు పడుతుంది.టెస్టులలో ఫ్లాప్‌అయితే, రాజస్తాన్‌ ఆఫర్‌ను గంభీర్‌ అంగీకరించే అవకాశాలు దాదాపుగా శూన్యమనే చెప్పవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడు మిశ్రమ ఫలితాలు అందుకుంటున్నాడు. టెస్టుల్లో గౌతీ మార్గదర్శనంలో భారత్‌ ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌, పాతికేళ్ల తర్వాత సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది.అదే విధంగా ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కోల్పోయింది. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం గంభీర్‌కు వరుస విజయాలు దక్కుతున్నాయి. 2025లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. ఆసియా టీ20 కప్‌ 2025ని కూడా కైవసం చేసుకుంది.పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హిట్‌ప్రస్తుతం డిఫెండింగ్‌ చాంపియన్‌గా టీ20 ప్రపంచకప్‌-2026 బరిలో దిగిన టీమిండియా ఈసారీ టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా పదవి చేపట్టిన గంభీర్‌ పదవీ కాలం 2027 వరల్డ్‌కప్‌ వరకు ఉంది. ఇలాంటి తరుణంలో గంభీర్‌ టీమిండియా విధులను కాదని.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆఫర్‌కి అంగీకరించే అవకాశం లేదని చెప్పవచ్చు. పట్టుదలకు మారుపేరుగా పేరొందిన గంభీర్‌ భారత్‌కు మరో ఐసీసీ టైటిల్‌ అందించిన తర్వాతే హెడ్‌కోచ్‌గా వైదొలిగే అంశంపై ఆలోచిస్తాడని అతడి అభిమానులు అంటున్నారు.ఐపీఎల్‌ వీరుడుటీమిండియా ఓపెనర్‌గా ఉన్నత శిఖరాలు అధిరోహించిన గౌతం గంభీర్‌ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా రెండు టైటిళ్లు అందించాడు. అంతేకాదు.. 2024లో అదే జట్టుకు మెంటార్‌గా పనిచేసి మరోసారి ట్రోఫీని ముద్దాడేలా చేశాడు. అంతకుముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కూడా గంభీర్‌ మెంటార్‌గా పనిచేశాడు. ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఐపీఎల్‌లో మొత్తంగా 154 మ్యాచ్‌లు ఆడి 4218 పరుగులు సాధించాడు.చదవండి: గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్‌

Ranji Trophy Semis 2026: Karnataka Scores 736 in 1st Innings Vs UTK4
పడిక్కల్‌ డబుల్‌ సెంచరీ.. కర్ణాటక అతి భారీ స్కోరు

రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో కర్ణాటక అతి భారీ స్కోరు సాధించింది. ఉత్తరాఖండ్‌ బౌలింగ్‌ను చితక్కొట్టి తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 736 పరుగులు చేసింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (141), స్మరణ్‌ రవిచంద్రన్‌ (135) భారీ శతకాలతో మెరవగా.. కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ డబుల్‌ సెంచరీ (232)తో కదం తొక్కాడు.736 పరుగులుమిగిలిన వారిలో కరుణ్‌ నాయర్‌ (60), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కృతిక్‌ కృష్ణ (60), విద్యాధర్‌ పాటిల్‌ (54) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 194.4 ఓవర్లలో 736 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.అయితే, ఈ మ్యాచ్‌లో స్టార్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (5) విఫలం కాగా.. శ్రేయస్‌ గోపాల్‌ (0), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (0) డకౌట్‌ అయ్యారు. శిఖర్‌ శెట్టి 12 పరుగులు చేయగా.. ప్రసిద్‌ కృష్ణ ఒక పరుగుతో అజేయంగా నిలిచాడు.ఇక ఉత్తరాఖండ్‌ బౌలర్లలో ఆదిత్య రావత్‌ నాలుగు వికెట్లు తీయగా.. మయాంక్‌ మిశ్రా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా వారిలో అభయ్‌ నేగి, అన్వీశ్‌ సుధా, లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.రెండో రోజు ఆట సాగిందిలా..కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (232; 29 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీ... స్మరణ్‌ (121 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) అజేయ శతకం... వెరసి ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 355/2తో సోమవారం నాటి రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక... ఆట ముగిసే సమయానికి 180 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 689 పరుగులు సాధించింది.కరుణ్‌ నాయర్‌ (60; 8 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి పడిక్కల్‌ మూడో వికెట్‌కు 129 పరుగులు ... స్మరణ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 59 పరుగులు జత చేశాడు. శ్రేయస్‌ గోపాల్‌ (0) డకౌట్‌కాగా ... కృతిక్‌ కృష్ణ ( 60; 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి స్మరణ్‌ ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో స్మరణ్‌ కెరీర్‌లో ఐదో ఫస్ట్‌క్లాస్‌ సెంచరీ సాధించాడు. కృతిక్‌ వెనుదిరిగాక ... విద్యాధర్‌ పాటిల్‌ (35 బ్యాటింగ్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), స్మరణ్‌ మరో వికెట్‌ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. చదవండి: T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక‌.. ఇక లగేజి స‌ర్దుకోవ‌డ‌మే!

Azmatullah Omarzai stars as Afghanistan beat UAE to keep Super Eight hopes alive5
గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్‌ 

న్యూఢిల్లీ: గ్రూప్‌లోని గట్టి ప్రత్యర్థులు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్‌ టి20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టింది. ‘సూపర్‌–8’ చేరే అవకాశాలను నిలబెట్టుకుంది. సోమవారం గ్రూప్‌ ‘డి’లో జరిగిన మ్యాచ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (4 వికెట్లు; 21 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో యూఏఈపై గెలుపొందింది. మొదట యూఏఈ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సోహైబ్‌ ఖాన్‌ (48 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేశాడు. అజ్మతుల్లా (4–0–15–4) నిప్పులు చెరిగే స్పెల్‌తో యూఏఈ బ్యాటర్లను కట్టడి చేశాడు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో అఫ్గానిస్తాన్‌ కెపె్టన్, లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అర్ఫాన్‌ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. దాంతో టి20 క్రికెట్‌ చరిత్రలో 700 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ టి20ల్లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్‌ ఖానే (191) అగ్రస్థానంలో ఉన్నాడు. అనంతరం అఫ్గానిస్తాన్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. ఇబ్రహీం జద్రాన్‌ (41 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్‌), అజ్మతుల్లా రాణించారు. ఈ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆడిన మూడూ గెలిచి 6 పాయింట్లతో ఇప్పటికే ‘సూపర్‌–8’కు చేరింది. రెండు మ్యాచ్‌లు నెగ్గిన న్యూజిలాండ్‌ 4 పాయింట్లతో అఫ్గానిస్తాన్‌ కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈరోజు కెనడాతో జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే అఫ్గానిస్తాన్‌ టోర్నీ నుంచి ని్రష్కమిస్తుంది. న్యూజిలాండ్‌ ‘సూపర్‌–8’కు చేరుతుంది.

Australia tumbled to a crushing eight-wicket defeat against Sri Lanka 6
‘శత’క్కొట్టిన నిసాంక 

పల్లెకెలె: పాథుమ్‌ నిసాంక (52 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శతక’ విధ్వంసంతో ఆ్రస్టేలియా గల్లంతైంది. ఈ టి20 ప్రపంచ కప్‌లో తొలి సెంచరీని ఆతిథ్య శ్రీలంక బ్యాటర్‌ నిసాంక అజేయంగా లిఖించాడు. దీంతో ‘హ్యాట్రిక్‌’ విజయాలతో లంక జట్టు ‘సూపర్‌–8’కు అర్హత సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆ్రస్టేలియా ముందుకెళ్లే అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. ఇప్పుడు జింబాబ్వే ‘వరుస ఓటమి’లపైనే ఆసీస్‌ ‘సూపర్‌–8’ భవితవ్యం ఆధార పడింది. గ్రూప్‌ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దాసున్‌ షనక నేతృత్వంలోని లంక 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కెపె్టన్‌ మిచెల్‌ మార్‌‡్ష (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రవిస్‌ హెడ్‌ (29 బంతుల్లో 56; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. 8.2 ఓవర్ల వరకు వికెట్‌ కోల్పోలేదు. ఇంతవరకు జోరుగా సాగిన ఆసీస్‌ అనూహ్యంగా మిగతా 11.4 ఓవర్లలో మరో 77 పరుగులే చేసి 10 వికెట్లను కోల్పోయింది. ఇన్‌గ్లిస్‌ (27; 3 ఫోర్లు), మ్యాక్స్‌వెల్‌ (22; 1 ఫోర్, 1 సిక్స్‌) మాత్రమే రెండు పదుల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. మ్యాక్స్‌వెల్‌ రివర్స్‌ స్వీప్‌తో బౌండరీకి యత్నించగా... బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వద్ద నిసాంక కళ్లు చెదిరే క్యాచ్‌తో అబ్బురపరిచాడు. లంక బౌలర్లలో హేమంత 3, చమీర 2 వికెట్లు తీశాడు. అనంతరం లంక 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి గెలిచింది. నిసాంక రెండో వికెట్‌కు కుశాల్‌ మెండిస్‌ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో 97 పరుగులు, తర్వాత పవన్‌ రత్నాయకే (28 నాటౌట్‌; 6 ఫోర్లు)తో అబేధ్యమైన మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. ఆ్రస్టేలియా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 20న ఒమన్‌ జట్టుతో ఆడుతుంది. ఆసీస్‌ కంటే ముందే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్‌లు (నేడు ఐర్లాండ్‌తో; 19న శ్రీలంకతో) ఆడుతుంది. ఈ రెండింటిలో జింబాబ్వే ఒక్కటి గెలిచినా ‘సూపర్‌–8’కు అర్హత పొందుతుంది. ఒకవేళ జింబాబ్వే రెండింటిలో ఓడిపోయినా... రన్‌రేట్‌లో ఆ్రస్టేలియాకంటే మెరుగ్గా ఉంటేచాలు ‘సూపర్‌–8’ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.

Pathum Nissankas century powers Sri Lanka to Super 87
ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక‌.. ఇక లగేజి స‌ర్దుకోవ‌డ‌మే!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఆస్ట్రేలియాకు మ‌రోసారి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమ‌వారం పల్లెకెలె వేదిక‌గా జ‌రిగిన గ్రూపు-బి మ్యాచ్‌లో ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల‌కు ఆలౌటైంది.ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 56), కెప్టెన్ మిచెల్ మార్ష్ (54) మొదటి వికెట్‌కు 104 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించారు. ఒక దశలో 104/0 తో ఉన్న ఆస్ట్రేలియాను లంక స్పిన్నర్లు దూషన్ హేమంత, దునిత్ వెల్లలాగే కట్టడి చేశారు. కేవలం 77 పరుగుల వ్యవధిలోనే ఆసీస్ త‌న 10 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. శ్రీలంక బౌల‌ర్ల‌లో హేమంత మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చ‌మీరా, క‌మిందు మెండిస్‌, వెల్ల‌లాగే త‌లా వికెట్ సాధించారు.నిస్సాంక సూప‌ర్ సెంచ‌రీ..అనంత‌రం 182 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని శ్రీలంక కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. లంక ఓపెన‌ర్ పాథుమ్ నిస్సాంక అజేయ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన నిస్సాంక‌.. చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డి టార్గెట్‌ను ఫినిష్ చేశాడు.నిస్సాంక 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో స‌రిగ్గా 100 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఏడాది పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం గమ‌నార్హం. అత‌డితో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కుశాల్ మెండిస్ (51), ప‌వ‌న్ ర‌త్నాయకే(28) రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిష్ ఒక్క‌డే రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.ఆసీస్ ఇంటికే!ఈ విజ‌యంతో గ్రూపు-బి నుంచి శ్రీలంక సూప‌ర్‌-8కు అర్హ‌త సాధించింది. కానీ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో ఓట‌మి పాలైన ఆసీస్ మాత్రం త‌మ సూప‌ర్‌-8 అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. ఈ గ్రూపు పాయింట్ల ప‌ట్టిక‌లో జింబాబ్వే(4 పాయింట్లు) రెండో స్దానంలో ఉంది. ఆసీస్ సూప‌ర్-8కు చేరాలంటే జింబాబ్వే త‌మ త‌దుప‌రి మ్యాచ్‌ల‌లో ఐర్లాండ్, శ్రీలంకపై ఓడిపోవాలి. అదేవిధంగా ఒమ‌న్‌పై ఆసీస్ భారీ విజ‌యం సాధించాలి.

Former Indian cricketer S Sreesanth Shares his Success Mantra in Rooted For Life podcast8
భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుందని మూడేళ్ల ముందే తెలుసు: శ్రీశాంత్‌

మాజీ భారత క్రికెటర్ S. Sreesanth ‘Rooted For Life’ పోడ్కాస్ట్‌లో తన జీవిత ప్రయాణాన్ని వివరించారు. Dr. Pradeep Sethi గారితో జరిగిన ఈ సంభాషణ క్రికెట్‌కి మాత్రమే పరిమితం కాకుండా జీవితం, నమ్మకం, మనోబలం వంటి ఎన్నో అంశాలపై సాగింది. చిన్ననాటి కష్టాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, వ్యక్తిగత ఆలోచనలు, ప్రపంచ కప్‌ వరకు తీసుకెళ్లిన సూత్రాలు – అన్నింటినీ శ్రీశాంత్‌ మనస్ఫూర్తిగా పంచుకున్నారు.ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీశాంత్ అందరినీ – మతం, కులం అనే తేడా లేకుండా గౌరవించాలనే తన నమ్మకాన్ని చెప్పారు. జీవితం ఎత్తుపల్లాలు చూపినప్పుడు నిలబడటానికి ఒక బలమైన “బేస్” ఉండాలి అని ఆయన అభిప్రాయం. వినయం, ఆత్మగౌరవం రెండూ కలిసి నడవాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం గొప్పతనానికి మూలం అని స్పష్టం చేశారు.ఈ పోడ్కాస్ట్‌లో హృదయాన్ని తాకే భాగం ఆయన చిన్నప్పటి ఆరోగ్య సమస్యల గురించి. మొదటిసారి తనకు వచ్చిన ట్యూమర్ శస్త్రచికిత్స, ఆ సమయంలో తన తండ్రి చూపిన అచంచలమైన భక్తి గురించి శ్రీశాంత్ గారు భావోద్వేగంగా చెప్పారు.Ettumanoor Mahadeva Temple వద్ద ఒక రూపాయి కానుక, చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చేసిందని, అది తనకు ఒక అద్భుతం లాంటిదని వివరించారు. భగవాన్ శివుడితో తన ఆధ్యాత్మిక అనుబంధం గురించి చెబుతూ, తన చేతిపై త్రిశూలం ఆకారంలో ఉన్న జన్మమచ్చను కూడా ప్రస్తావించారు.తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది సహా అందరినీ కుటుంబ సభ్యుల్లా గౌరవించాలనే విలువలు తన తండ్రి నేర్పారని చెప్పారు. మహాబలి కథ, ఓనం పండుగ ఉదాహరణగా తీసుకుని, మతం కంటే మానవత్వమే గొప్పదని పేర్కొన్నారు.సంతోషం, ఆనందం మధ్య తేడా గురించి మాట్లాడుతూ – విజయం వల్ల వచ్చే సంతోషం తాత్కాలికం కావొచ్చు, కానీ అంతరానందం మనలో నుంచే వస్తుందని అన్నారు. మంచి అయినా చెడు అయినా ప్రతి అనుభవం మనకు “తజుర్బా” ఇస్తుందని, అది మనల్ని మరింత బలంగా తయారు చేస్తుందని చెప్పారు.ICC World Twenty20 విజయానికి వెనుక ఉన్న “సీక్రెట్” గురించి మాట్లాడినప్పుడు, కప్ గెలవబోతున్నామనే నమ్మకం తనలో ముందే ఉన్నదని చెప్పారు. ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్టు మూడు సంవత్సరాల ముందే ఊహించుకున్నానని వెల్లడించారు. ఆ టోర్నమెంట్‌లో తన కెరీర్‌కి మలుపుతిప్పిన క్యాచ్ గురించి కూడా గుర్తుచేసుకున్నారు.PRIDE – అంటే “Personal Responsibility in Delivering Excellence” – అనే తత్వం తన జీవితానికి ఆధారం అని చెప్పారు. జట్టులోంచి తప్పించబడిన సందర్భాలు, ఓటములు ఎదురైనప్పుడు కూడా క్రమశిక్షణ, రొటీన్, పాజిటివ్ సెల్ఫ్-టాక్ తనను నిలబెట్టాయని వివరించారు. తాత్కాలిక ప్రతిభ కంటే అలవాట్లు, క్రమబద్ధతే విజయానికి మూలం అని అన్నారు.తన పోటీ స్వభావం గురించి మాట్లాడుతూ, క్రీడల్లో ధైర్యం మరియు అజాగ్రత్త మధ్య ఉన్న సన్నని రేఖను వివరించారు. అస్టిగ్మాటిజం సమస్య, ఫాస్ట్ బౌలింగ్‌లో ఉన్న శారీరక ఒత్తిడి, అవుట్‌స్వింగ్ యార్కర్ సాధనలో చూపిన పట్టుదల గురించి పంచుకున్నారు.మైదానంలో తన సంబరాలు ఈగో వల్ల కాదు, ఆటపై ఉన్న నిజమైన ప్రేమ, ఉత్సాహం వల్లేనని చెప్పారు. విజయం ప్రయాణంలో ఇతరులను కూడా భాగస్వాములను చేయడం, పాజిటివ్ సందేశాలు పంచడం ఎంత ముఖ్యమో వివరించారు.ఈ పోడ్కాస్ట్‌లో కుటుంబం ప్రాధాన్యం, ప్రజా జీవితంలో మేనేజర్ల కంటే కుటుంబ సభ్యుల పాత్ర, ప్రపంచానికి ప్రేమ, పాజిటివ్ వైబ్స్ పంచాల్సిన అవసరం వంటి అంశాలు కూడా చర్చించబడ్డాయి. చివరగా తన నానమ్మ నేర్పిన జీవన పాఠాలు, యోగా ద్వారా సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో శ్రీశాంత్ గారు సూచనలు ఇచ్చారు.

T20 WC 2026:Pakistan Set To Take Drastic Step After India Thrashing, Axe 2 Superstars says Report9
భారత్‌ చేతిలో ఘోర ఓటమి.. అర్ధరాత్రి పాక్‌ కీలక నిర్ణయాలు

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌ చేతిలో ఘోర ఓటమి ఎదురైన తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నిన్న (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ ముగిసిన వెంటనే పీసీబీ అర్దరాత్రి వేల అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ స్టార్‌ ఆటగాళ్ల పేర్లు బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది అని తెలుస్తుంది.వీరిద్దరిని తక్షణమే జట్టు నుంచి తప్పించాలని కొలొంబోలో ఉన్న దేశ ప్రతినిధులకు పీసీబీ అల్టిమేటం​ జారీ చేసినట్లు సమాచారం. పాక్‌ తదుపరి ఆడబోయే నమీబియా మ్యాచ్‌లో బాబర్‌, అఫ్రిది స్థానాల్లో సల్మాన్‌ మీర్జా, నసీం షా, ఫకర్‌ జమాన్‌, ఖ్వాజా నఫాయ్‌ పేర్లు పరిశీలించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది.భారత్‌ మ్యాచ్‌లో జట్టు ప్రదర్శనపై పాక్ ప్రభుత్వం సైతం ఆగ్రహంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. స్టార్‌ ఆటగాళ్లను తప్పించే విషయంలో పీసీబీ కంటే పాక్‌ ప్రభుత్వ జోక్యమే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. భారత్‌ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్‌ ప్రభుత్వంపై కూడా ఆ దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. ముందుగా భారత్‌తో మ్యాచ్‌ ఆడమని ప్రకటించడమెందుకు, ఆతర్వాత తిరిగి ఆడటమెందుకని దుమ్మెత్తిపోస్తున్నారట. దేశ ప్రజల నుంచి ఒత్తిడి అధికం కావడంతో బాబర్‌, అఫ్రిది సహా మరికొంత మంది ఆటగాళ్లపై వేటు వేయాలని పాక్‌ ప్రభుత్వం పీసీబీకి సిఫార్సు చేసినట్లు వినికిడి.పాక్‌ ప్రజలు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నట్లు తెలుస్తుంది. టీమిండియా విషయంలో నఖ్వీ మొదటి నుంచి ఓవరాక్షన్‌ చేస్తున్నాడని మెజార్జీ పాక్‌ క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నట్లు సమాచారం. నఖ్వీని పీసీబీ అధ్యక్ష హోదాతో పాటు మంతివర్గం నుంచి కూడా బహిష్కరించాలని పాక్‌లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయట. నఖ్వీ భారత్‌ చేతిలో ఓటమి తర్వాత తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు పలువురు పాక్‌ ఆటగాళ్లతో పాటు హెడ్‌ కోచ్‌ మైక్‌ హెస్సన్‌ను కూడా పరుష పదజాలంతో మందలించాడని తెలుస్తుంది.కాగా, భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 61 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏపై అతికష్టం మీద గెలిచిన పాక్‌.. గ్రూప్‌-ఏ పాయింట్ల పట్టికలో యూఎస్‌ఏ తర్వాత మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 18న నమీబియాతో మ్యాచ్‌ ఆటుఇటైతే పాక్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే భారత్‌తో పాటు యూఎస్‌ఏ సూపర్‌-8కు చేరుకుంటుంది.

T20 WC 2026: England into super 8 by beating Italy10
T20 WC 2026: ఇంగ్లండ్‌ను భయపెట్టిన మరో పసికూన

టీ20 ప్రపంచకప్‌ 2026లో మాజీ ఛాం​పియన్‌ ఇంగ్లండ్‌కు ప్రతి మ్యాచ్‌ గండంగా నడుస్తుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లీష్‌ టీమ్‌ను ప్రతి జట్టూ భయపెడుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ చేతిలో ఘోర పరాభవాన్ని వెంట్రుకవాసిలో తప్పించుకున్న బ్రూక్‌ సేన.. ఇవాళ (ఫిబ్రవరి 16) మరో పసికూన ఇటలీ చేతిలోనూ ఇంచుమించు అదే అనుభవాన్ని ఎదుర్కొంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న ఇటలీ, క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్‌ను భయపెట్టింది. అనుభవాన్నంతా రంగరించి ఈ ఇంగ్లండ్‌ బయటపడింది కానీ, ఏమరపాటుగా ఉండి ఉంటే మాత్రం చుక్కెదురయ్యేదే.టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఇటలీ బౌలర్లు తొలుత తెగ ఇబ్బంది పెట్టారు. ఆది నుంచి వరుస విరామాల్లో ఇంగ్లండ్‌ వికెట్లు తీశారు. ఆఖర్లో విల్‌ జాక్స్‌ (22 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకోబట్టి ఇంగ్లండ్‌ గట్టెక్కింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఇటలీ బౌలర్లు ఏమాత్రం కుదురుకోనివ్వలేదు. కొన్ని పరుగులు చేసేలోపే వికెట్లు తీశారు. జాక్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడకపోయుంటే ఇంగ్లండ్‌ 200 పరుగుల మార్కును తాకలేకపోయేది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ 28, బట్లర్‌ 3, బేతెల్‌ 23, బాంటన్‌ 30, బ్రూక్‌ 14, సామ్‌ కర్రన్‌ 25, ఓవర్టన్‌ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఇటలీ బౌలర్లలో స్టీవార్ట్‌, కలుగమగే చెరో 2, స్మట్స్‌, అలీ హసన్‌, బెన్‌ మనెంటి తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ ఆదిలో తడబడినప్పటికీ.. బెన్‌ మనెంటి (60), జస్టిన్‌ మోస్కా (43), గ్రాంట్‌ స్టివర్ట్‌ (45) ఇంగ్లండ్‌ శిబిరంలో గుబులు రేపారు. మనెంటి.. మోస్కాతో కలిసి నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను భయపెట్టాడు. బెన్‌ మనెంటి క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ వణికిపోయారు. మనెంటి భారీ సిక్సర్లు బాదుతూ ఇంగ్లండ్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మనెంటి ఔటయ్యాక కూడా ఇటలీ కాసేపు పోరాడింది. అయితే ఈ దశలో ఇంగ్లండ్‌ బౌలర్లు పుంజుకొని మ్యాచ్‌పై పట్టు సాధించారు. ఇటలీ పని అయిపోయిందన్న దశలో స్టీవర్ట్‌ తన మెరుపు విన్యాసాలతో మరోసారి ఇంగ్లండ్‌ను దడదడలాడించాడు. స్టీవర్ట్‌ ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌​ సిక్సర్లతో విరుచుకుపడి ఎనిమిదో వికెట్‌కు జస్ప్రీత్‌ సింగ్‌తో కలిసి 18 బంతుల్లోనే 40 పరుగులు జోడించాడు.దీంతో ఇటలీ గెలుపుకు 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. స్టీవర్ట్‌ ఉన్న ఊపులో ఇటలీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఈ సమయంలో సామ్‌ కర్రన్‌ స్టీవర్ట్‌ వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ను ఊపిరి పీల్చుకునేలా చేశాడు. 19 ఓవర్‌లో కర్రన్‌ రెండు వైడ్లు వేసినా, మరో 3 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన స్టీవర్ట్‌ వికెట్‌ తీశాడు. అక్కడే ఇంగ్లండ్‌కు గెలుపుపై ఆశలు చిగురించాయి. కర్రన్‌ ఇచ్చిన ఊపుతో చివరి ఓవర్‌లో ఓవర్టన్‌ రెచ్చిపోయాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీసి ఇటలీని ఆలౌట్‌ చేశాడు. తద్వారా ఇటలీ 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్‌ ఊపిరి పీల్చుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించగా.. ఇటలీ ఓడినా, గర్వంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇటలీ తమకంటే చాలారెట్లు మెరుగైన నేపాల్‌పై సంచలన విజయం సాధించి, క్రికెట్‌ ప్రపంచాన్ని మెప్పించింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement