ప్రధాన వార్తలు
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే
ఆస్ట్రేలియా ఓపెన్-2026లో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరీనాలో జరగనున్న మెన్స్ సింగిల్స్ ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, టాప్సీడ్ కార్లోస్ అల్కరాజ్ అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. ఈ తుది పోరులో జొకోవిచ్ గెలిస్తే తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను సాధిస్తాడు.తద్వారా జోకోవిచ్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ప్లేయర్గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్)ను అధిగమిస్తాడు. అదేవిధంగా అతడికి ఇది 11వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ అవుతుంది. మరోవైపు 22 ఏళ్ల అల్కరాజ్ ఈ టైటిల్ను కైవసం చేసుకుంటే, టెన్నిస్ చరిత్రలో నాలుగు వేర్వేరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు.ఇప్పటివరకు వీరిద్దరూ 9 సార్లు తలపడగా, జొకోవిచ్ 5-4తో స్వల్ప ఆధిక్యంలో ఉన్నాడు. అయితే గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో అల్కరాజ్ 2-0తో (రెండు సార్లు వింబుల్డన్లో) జొకోవిచ్పై పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది.
టీమిండియా వరల్డ్ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026కు ముందు టీమిండియా భీకర ఫామ్లో ఉంది. ఈ మెగా టోర్నీ సన్నాహల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ అదరగొట్టింది. ఈ సిరీస్ను 4-1 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. శనివారం తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి టీ20లోనూ టీమిండియా దుమ్ములేపింది.కివీస్ను 46 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 61) సైతం సత్తాచాటాడు. 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ ఆఖరివరకు పోరాడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్లో భారీ స్కోర్తో విరుచుకుపడ్డ టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఇంగ్లండ్ వరల్డ్ రికార్డు బ్రేక్..అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు 250 ప్లస్ పరుగులు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా ఇప్పటివరకు నాలుగు సార్లు 250 పైగా పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే(3) రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది. అదేవిధంగా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక సిక్స్లు(69) కొట్టిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట(64) ఉండేది.చదవండి: 'స్కై' మళ్లీ నీలి రంగులోకి మారింది.. చాలా సంతోషంగా ఉంది: సూర్య
'స్కై' మళ్లీ నీలి రంగులోకి మారింది.. చాలా సంతోషంగా ఉంది: సూర్య
టీ20 ప్రపంచకప్-2026కు ముందు న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి పోరు(ఐదో టీ20)లో టీమిండియా సత్తాచాటింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ను 46 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్లతో 103) శతక్కొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(63), హార్దిక్ పాండ్యా(42) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో కివీస్ 225 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ నిలవగా.. సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. గతేడాది మొత్తం పేలవ ఫామ్తో ఇబ్బందిపడిన సూర్య.. కొత్త ఏడాదిలో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో అతడు మూడు హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ తన ఫామ్ను తిరిగి అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు."ఈ క్షణం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నా రిథమ్ను తిరిగి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్కై ఉన్నప్పుడు భయం ఎందుకని మురళీ కార్తీక్ గత సిరీస్లోనే చెప్పారు. నేను కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. నా బ్యాటింగ్లో కూడా ఎటువంటి మార్పులు చేసుకోలేదు.ఎందుకంటే నేను 'అవుట్ ఆఫ్ ఫామ్' లో లేను, కేవలం 'అవుట్ ఆఫ్ రన్స్'లో ఉన్నానని నాకు తెలుసు ఒక మంచి ఇన్నింగ్స్తో నా రిథమ్ తిరిగి అందుకోవచ్చన్న థీమాతో ఉండేవాడిని. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్లో నా ఫామ్ను తిరిగి సాధించాను.వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ముందు తిరిగి ట్రాక్లో పడడం ఆనందంగా ఉంది. గత ఏడాది కాలంగా ఆకాశం(స్కై) నీలి రంగులో కన్పించలేదు. కానీ ఒక క్రీడాకారుడి జీవితంలో ఎత్త పల్లాలు సహజం. ఇటువంటి సమయంలో అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుంటే తిరిగి కమ్బ్యాక్ ఇవ్వవచ్చు. ఇప్పుడు నేను అదే పనిచేశాను. గత సిరీస్ తర్వాత దొరికిన విరామంలో సన్నిహితులతో గడిపాను. వారు చెప్పిన కొన్ని కీలక విషయాలు నన్ను ప్రేరేపించాయి. ఇక గెలిచినా, ఓడినా ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. ముంబైలో సౌత్ ఆఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్ తర్వాత, మాలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాము. మిగితా ఫార్మాట్లతో పోలిస్తే టీ20 ఫార్మాట్ బౌలర్లకు ఒక కఠిన పరీక్ష వంటిది. మనం భారీ స్కోరు చేసినప్పుడు, ప్రత్యర్థి జట్టు కూడా అంతే ధీటుగా బదులు ఇస్తోంది. కెప్టెన్, బౌలింగ్ యూనిట్పై ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లడమే ఏకైక మార్గం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్..
పాకిస్తాన్దే సిరీస్
లాహోర్: ఐసీసీ టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఆ్రస్టేలియాపై సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో పాకిస్తాన్ 90 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సల్మాన్ ఆగా (76; 8 ఫోర్లు, 4 సిక్స్లు), ఉస్మాన్ ఖాన్ (53; 4 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఆ్రస్టేలియా 15.4 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లు ప్రభావం చూపలేక పోయారు. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
హైదరాబాద్ 631 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: బ్యాటర్లు దంచికొట్టడంతో రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓవర్నైట్ స్కోరు 415/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 154 ఓవర్లలో 631 పరుగులకు ఆలౌటైంది. ప్రజ్ఞయ్ రెడ్డి (126; 14 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కగా... క్రితం రోజే శతకం పూర్తి చేసుకున్న హిమతేజ (258 బంతుల్లో 171; 18 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్గఢ్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ డబుల్ సెంచరీ రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో భాగంగా నాగాలాండ్తో సావోమిలో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 267/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు చివరకు 130 ఓవర్లలో 9 వికెట్లకు 536 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సీఆర్ జ్ఞానేశ్వర్ (227 నాటౌట్; 21 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. శశికాంత్ (138 బంతుల్లో 60; 5 ఫోర్లు), త్రిపురాన విజయ్ (94 బంతుల్లో 58; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అతడికి సహకారం అందించారు. అనంతరం నాగాలాండ్ శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 33 ఓవర్లలో 4 వికెట్లకు 85 పరుగులు చేసింది.
ఢిల్లీ గెలిస్తే ‘ఎలిమినేటర్’కు అర్హత
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఓడిపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాల్ని మెరుగుపరిచాయి. టోర్నీలో మూడు సార్లు రన్నరప్గా నిలిచిన క్యాపిటల్స్కే ‘ఎలిమినేటర్’ చాన్స్ ఉంది. నేడు యూపీ వారియర్స్తో జరిగే చివరి లీగ్ పోరులో ఢిల్లీ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా గుజరాత్ జెయింట్స్తో ఎలిమినేటర్ ఆడే అర్హత సాధిస్తుంది. అయితే ఓడినా ముందంజ వేసేందుకు స్వల్ప అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో ముంబై, ఢిల్లీకి ప్రస్తుతం సమానంగా 6 పాయింట్లు ఉన్నాయి. అయితే ముంబైకంటే ఢిల్లీ రన్రేట్ చాలా తక్కువగా ఉంది. రన్రేట్ మైనస్లో ఉంది. అయితే నెట్ రన్రేట్ను మెరుగుపరుచుకుంటే ఢిల్లీ ముందుకెళుతుంది. షఫాలీ, లిజెల్లీ, లారా వోల్వార్డ్లతో కూడిన టాపార్డర్ ధాటిగా పరుగులు చక్కబెడితే యూపీపై భారీస్కోరును సునాయాసంగానే సాధించవచ్చు. కెపె్టన్ జెమీమా, మరిజాన్, నికీ ప్రసాద్లు కూడా ధనాధన్ ఆట ఆడేయగలరు. బౌలింగ్లో షినెల్ హెన్రీ, మరిజాన్, నందిని, శ్రీచరణిలు ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు అట్టడుగున ఉన్న యూపీ కేవలం రెండే మ్యాచ్ల్లో గెలిచింది.
భారత్ x పాకిస్తాన్
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్లో యువ భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సెమీఫైనల్లో చోటు దక్కించుకునేందుకు ఆదివారం ‘సూపర్ సిక్స్’ గ్రూప్–2లో దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఆడిన అన్నీ మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా కొనసాగుతున్న ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు... చిరకాల ప్రత్యర్థిపై కూడా అదే జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్కు చేరాలని భావిస్తోంది. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు... ఆరో సారి వరల్డ్కప్ చేజిక్కించుకునే దిశగా మరో ముందడుగు వేయాలని చూస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో అమెరికాపై ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై విజయాలు సాధించిన యువభారత్... సూపర్ సిక్స్ తొలి మ్యాచ్లో జింబాబ్వేపై గెలిచింది. ఇప్పుడు పాక్పై కూడా నెగ్గితే గ్రూప్–2 నుంచి నేరుగా సెమీఫైనల్కు చేరనుంది. ఓడినా భారత జట్టుకు అవకాశాలు ఉన్నాయి. గ్రూప్లో మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్... భారత జట్టుపై భారీ తేడాతో గెలిస్తే తప్ప సెమీస్ చేరడం కష్టమే. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, ఆయుశ్ మాత్రే, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందుతో భారత జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లో అంబరీశ్, ఉధవ్ మోహన్, హెనిల్ పటేల్ కీలకం కానున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ సమీర్ మిన్హాస్ ఫుల్ఫామ్లో ఉన్నాడు. ఆసియాకప్ ఫైనల్లో భారత జట్టుపై భారీ సెంచరీతో మ్యాచ్ను లాగేసుకున్న అతడిని త్వరగా పెవిలియన్కు పంపాల్సిన అవసరముంది.
భారత్ ధనాధన్ ‘షో’
తిరువనంతపురం: పొట్టి ప్రపంచకప్కు ముందు భారత్ పెద్ద పండగే చేసుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. శనివారం జరిగిన ఐదో టి20లో టీమిండియా 46 పరుగులతో కివీస్ను ఓడించింది. 4–1 ఆధిక్యంతో సిరీస్ను ముగించింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది. టి20ల్లో భారత్కిది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 103; 6 ఫోర్లు, 10 సిక్స్లు) కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ సూర్యకుమార్ (30 బంతుల్లో 63; 4 ఫోర్లు, 6 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్లు) కూడా సిక్సర్ల మోత మోగించారు. అనంతరం న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. అలెన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 6 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. అర్ష్ దీప్ కు 5 వికెట్లు దక్కాయి. మెరుపు భాగస్వామ్యం... అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్లు) సిక్స్తో ఖాతా తెరిచిన భారత్ తొలి ఓవర్లో మరో 2 ఫోర్లతో 14 పరుగులు సాధించింది. రెండో ఓవర్లోనూ 2 ఫోర్లు, ఓ సిక్స్తో 15 పరుగులు పిండుకుంది. సొంత మైదానంలోనూ సామ్సన్ (6) మరో అవకాశాన్ని వృథా చేసుకొని నిరాశపర్చాడు. పవర్ప్లేలో భారత్ స్కోరు 54/2. ఆ తర్వాత ఇషాన్ కిషన్ దంచేయడంతో మైదానం హోరెత్తింది. సాంట్నర్ పదో ఓవర్లో సూర్య ఓ సిక్స్ కొడితే స్ట్రయిక్ అందుకున్న కిషన్ 4, 6 కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. జట్టు స్కోరు కూడా వంద దాటింది. ఓ వైపు నుంచి ఇషాన్, మరోవైపు నుంచి కెప్టెన్ సూర్యకుమార్ కివీస్ బౌలర్లను నిర్దయగా బాదేశారు. 28 బంతుల్లో ఇషాన్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇష్ సోధి వేసిన 12వ ఓవరైతే ప్రతి బంతి లైన్ అవతలే! మొదటి బంతి వైడ్ అయి ఊపిరి పీల్చుకుంటే తర్వాతి బంతుల్ని కిషన్ 4, 4, 4, 6, 4, 6లుగా బాదేశాడు. ఈ ఒక్క ఓవర్లోనే 29 పరుగులొచ్చాయి. బౌలర్లు ఎంతమంది మారినా... కిషన్ ధాటి మారనేలేదు. 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక సూర్య నిష్క్రమించాడు. హార్దిక్ పాండ్యా కూడా దూకుడుగా ఆడటంతో 16వ ఓవర్లోనే భారత్ 200 మార్క్ చేరుకుంది. సాంట్నర్ 17వ ఓవర్లో పాండ్యా 6, 2, 4, 1 ధాటిని ప్రదర్శిస్తే మిగిలిన 2 బంతుల్ని సిక్స్లు బాదిన కిషన్ 42 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఫెర్గూసన్ వేసిన మూడో ఓవర్లో (2 పరుగులు, 1 వికెట్), సాంట్నర్ వేసిన 8వ ఓవర్లో మాత్రమే (5 పరుగులు) భారత్ బౌండరీ రాబట్టలేకపోయింది. అలెన్ అర్ధ సెంచరీ... ఆరంభంలోనే సీఫర్ట్ (5) అవుటైనా... అలెన్, రచిన్ రవీంద్ర (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్) న్యూజిలాండ్ స్కోరును పరుగెత్తించారు. రెండో వికెట్కు సరిగ్గా 100 పరుగులు జోడించాక అలెన్ దూకుడుకు అక్షర్ అడ్డుకట్ట వేశాడు. తర్వాత అర్‡్షదీప్, అక్షర్ కట్టుదిట్టమైన బౌలింగ్కు 20 పరుగుల వ్యవధిలో ఫిలిప్స్ (7), రచిన్, సాంట్నర్ (0) వికెట్లను కోల్పోవడంతో కివీస్ పనైపోయింది. మిచెల్ (26), ఆఖర్లో ఇష్ సోధి (15 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్లు) ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్ 200 పైచిలుకు పరుగులు దాటగలిగింది.తిలక్ వర్మ రెడీ... టి20 ప్రపంచకప్నకు ముందు భారత జట్టుకు శుభవార్త. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. గాయం కారణంగా న్యూజిలాండ్తో సిరీస్కు దూరమైన తిలక్... బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. అతడు మంగళవారం ముంబైలో టీమిండియాతో కలవనున్నాడు. కివీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన సంజు సామ్సన్ స్థానంలో టి20 ప్రపంచకప్లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ప్రారంభించడం ఖాయం కాగా... తిలక్ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. 3 టి20ల్లో భారత్కు ఇది మూడో అత్యధిక స్కోరు. గతంలో 297/6 (బంగ్లాదేశ్పై), 283/1 (దక్షిణాఫ్రికాపై) సాధించింది.3 రోహిత్, కోహ్లి తర్వాత అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడిగా సూర్యకుమార్ (3030) నిలిచాడు. ఓవరాల్గా ఈ మైలురాయిని దాటిన 12 మందిలో అతి తక్కువ బంతుల్లో (1822) సూర్య ఈ ఘనతను అందుకోవడం విశేషం.1 అర్ష్ దీప్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/51) నమోదు చేశాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (బి) ఫెర్గూసన్ 30; సామ్సన్ (సి) జాకబ్స్ (బి) ఫెర్గూసన్ 6; ఇషాన్ కిషన్ (సి) ఫిలిప్స్ (బి) డఫీ 103; సూర్యకుమార్ (స్టంప్డ్) సీఫర్ట్ (బి) సాంట్నర్ 63; పాండ్యా (సి) జాకబ్స్ (బి) జేమీసన్ 42; రింకూ నాటౌట్ 8; దూబే నాటౌట్ 7; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–31, 2–48, 3–185, 4–233, 5–261. బౌలింగ్: డఫీ 4–0–53–1, జేమీసన్ 4–0–59–1, ఫెర్గూసన్ 4–0–41–2, ఇష్ సోధి 3–0–48–0, ఫిలిప్స్ 1–0–10–0, సాంట్నర్ 4–0–60–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫర్ట్ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్ 5; అలెన్ (సి) రింకూ (బి) అక్షర్ 80; రచిన్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 30; ఫిలిప్స్ (సి) రింకూ (బి) అక్షర్ 7; మిచెల్ (బి) అర్ష్ దీప్ 26; సాంట్నర్ (సి) సూర్య (బి) అర్ష్ దీప్ 0; జాకబ్స్ (బి) వరుణ్ 7; జేమీసన్ (బి) అర్ష్ దీప్ 9; ఇష్ సోధి (సి) అర్ష్ దీప్ (బి) రింకూ 33; ఫెర్గూసన్ (బి) అక్షర్ 3; డఫీ నాటౌట్ 9; ఎక్స్ట్రాలు 16; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 225 వికెట్ల పతనం: 1–17, 2–117, 3–131, 4–137, 5–137, 6–166, 7–179, 8–180, 9–191, 10–225. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–51–5, పాండ్యా 2–0–15–0, బుమ్రా 4–0–58–0, వరుణ్ 4–0–36–1, అక్షర్ 4–0–33–3, అభిషేక్ 1–0–13–0, రింకూ సింగ్ 0.4–0–7–1.
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్..
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో టీ20లో సూర్య మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తన అద్భుత బ్యాటింగ్తో ఒకప్పటి సూర్యను గుర్తు చేశాడు. మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ ముంబైకర్.. 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో సూర్యకు ఇది మూడో అర్ధశతకం. రాయపూర్, గువహటి వేదికగా జరిగిన టీ20ల్లోనూ హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఏదేమైనప్పటికీ టీ20 ప్రపంచకప్కు ముందు సూర్యకుమార్ తన ఫామ్ను తిరిగి అందుకోవడంతో టీమ్ మెనెజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. కాగా ఈ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య ఓ అరుదైన ఘనత సాధించాడు.అంతర్జాతీయ టీ20ల్లో బంతులు పరంగా అత్యంతవేగంగా 3000 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా సూర్య చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ను స్కై కేవలం 1822 బంతుల్లోనే సాధించాడు. ఇంతుకుముందు ఈ రికార్డు యూఏఈ ఆటగాడు ముహమ్మద్ వసీమ్(1947) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో వసీంను సూర్య అధిగమించాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లి (2169 బంతులు), రోహిత్ శర్మ (2149 బంతులు) వంటి దిగ్గజాల కంటే త్వరగా సూర్య అందుకోవడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్లతో 103 పరుగులు) అద్భుతమైన శతకంతో మెరిశాడు.
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్ టార్గెట్ 272
తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్ జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సంజూ శాంసన్ ఆరంభంలోనే ఔటైనప్పటికి మిగితా బ్యాటర్లు మాత్రం కివీస్ బౌలర్లను ఉతికారేశారు.వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. సంజూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 4 ఫోర్లు, 10 సిక్స్లతో 103 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 30) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు, శాంట్నర్, జేమిసన్, డఫీ తలా వికెట్ సాధించారు.
బ్రిజ్భూషణ్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ...
నార్వే చెస్ టోర్నీకి దివ్య
స్టావెంజర్ (నార్వే): ప్రపంచకప్ చాంపియన్, భారత గ్...
మన్ప్రీత్ సింగ్పై వేటు
భారత హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్...
సబలెంకా X రిబాకినా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్...
భారత్ ధనాధన్ ‘షో’
తిరువనంతపురం: పొట్టి ప్రపంచకప్కు ముందు భారత్ పెద...
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్..
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సూపర్...
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్ టార్గెట్ 272
తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్ జరుగుతున్న ఐద...
ఇషాన్ కిషన్ ఊచకోత.. 4 ఫోర్లు, 10 సిక్స్లతో వీర విహారం
తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్ జరుగుతున్న ఐద...
క్రీడలు
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
వీడియోలు
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
