Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Riyan Parag set to succeed Sanju Samson as new RR captain for IPL 20261
జైశ్వాల్‌, జ‌డేజా కాదు.. రాజ‌స్తాన్ కెప్టెన్‌గా సూప‌ర్ స్టార్‌

ఐపీఎల్-2026 సీజ‌న్‌కు ముందు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ జ‌ట్టు నూతన సారథిగా ఆల్‌రౌండ‌ర్ రియాన్ ప‌రాగ్‌ను రాయ‌ల్స్ యాజ‌మాన్యం ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. దీనిపై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఫిబ్ర‌వ‌రి 13( శుక్ర‌వారం) సాయంత్రం 4 గంట‌ల‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నుంది.గ‌త సీజ‌న్ వ‌ర‌కు కెప్టెన్‌గా ప‌నిచేసిన సంజూ శాంస‌న్ స్దానాన్ని ప‌రాగ్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. తొలుత ప‌రాగ్‌తో పాటు రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు రాజ‌స్తాన్ కెప్టెన్సీ రేసులో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ రాజ‌స్తాన్ మేనెజ్‌మెంట్ మాత్రం ప‌రాగ్ వైపే మొగ్గు చూపిన‌ట్లు ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.రియాన్ ప‌రాగ్ 2019 నుంచి రాజ‌స్తాన్ జ‌ట్టుతో కొన‌సాగుతున్నాడు. అస్సాం జ‌ట్టుతో పాటు రాజ‌స్తాన్ కెప్టెన్‌గా కూడా ప‌రాగ్‌కు ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో గాయ‌ప‌డిన సంజూ శాంసన్ స్ధానంలో 8 మ్యాచ్‌లకు పరాగ్ నాయకత్వం వహించాడు. హెడ్ కోచ్ కుమార్ సంగక్కర సూచ‌న మేర‌కు పరాగ్‌కు త‌మ జ‌ట్టు ప‌గ్గాల‌ను రాజ‌స్తాన్ అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. ఇక ఈ ఏడాది సీజ‌న్‌కు ముందు రాజ‌స్తాన్ జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. సంజూ శాంస‌న్‌ను సీఎస్‌కే ట్రేడ్ చేసిన రాజ‌స్తాన్‌.. అందుకు బదులుగా స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కుర్రాన్‌ల‌ను త‌మ జ‌ట్టులోకి తీసుకుంది. అదేవిధంగా రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా త‌ప్పుకోవ‌డంతో కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో రాజ‌స్తాన్ బ‌రిలోకి దిగ‌నుంది.

Erasmus Fumes At Tucker Dead Ball Call Did Umpire Get It Wrong Explained2
IND vs NAM: అంపైర్‌తో నమీబియా కెప్టెన్‌ గొడవ.. తప్పెవరిది?

టీమిండియాతో మ్యాచ్‌ నేపథ్యంలో నమీబియా కెప్టెన్‌ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమకు అన్యాయం జరిగిందని ఎరాస్మస్‌ ఆవేదన ‍వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.మాకు ఆ అవకాశమే లేదుతమకు రాత్రి పూట ఒక్క ప్రాక్టీస్‌ సెషన్‌ కూడా ఏర్పాటు చేయలేదని ఎరాస్మస్‌ (Gerhard Erasmus).. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తీరును విమర్శించాడు. తమ దేశంలో ఫ్లడ్‌లైట్లు ఉండవని.. అందుకే ఇక్కడైనా టీమిండియాతో నైట్‌ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ అవకాశం కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రాత్రిపూట రెండు నైట్‌ ప్రాక్టీస్‌ సెషన్లు ఏర్పాటు చేశారని ఎరాస్మస్‌ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇక మ్యాచ్‌ సందర్భంగానూ ఎరాస్మస్‌ బౌలింగ్‌ శైలి చర్చకు దారి తీసింది.‘డెడ్‌ బాల్‌’బౌలింగ్‌ క్రీజ్‌ వద్ద నుంచి చాలా వెనుక ఉంటూనే ఎరాస్మస్‌ బంతులు వేస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఎరాస్మస్‌ తొలి ఓవర్లో దీనిని అంపైర్‌ టకర్‌ ‘డెడ్‌ బాల్‌’గా ప్రకటించాడు. ఈ క్రమంలో ఎరాస్మస్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు. కాసేపు ఇద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.అయితే, ఎరాస్మస్‌ వేసిన మరుసటి ఓవర్లో మాత్రం అంపైర్‌ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. నిజానికి నిబంధనల ప్రకారం అది తప్పేమీ కాదు. అయితే తొలి ఓవర్లో మరీ అంపైర్‌ వెనక నుంచి బౌలింగ్‌ చేసిన ఎరాస్మస్‌ ఈసారి కాస్త ముందుకు వచ్చి అంపైర్‌కు కనపడేలా బౌలింగ్‌ చేయడంతో సమస్య రాలేదు.నాలుగు కీలక వికెట్లుఈ తరహా బౌలింగ్‌తో పాటు తన రెగ్యులర్‌ ఆఫ్‌ స్పిన్‌...రౌండ్‌ ఆర్మ్‌...ఇలా వైవిధ్యాన్ని చూపిస్తూ భారత బ్యాటర్లను కన్‌ఫ్యూజన్‌కు గురి చేసిన ఎరాస్మస్‌ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61), తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52), అక్షర్‌ పటేల్‌ (0) రూపంలో కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు.కాగా ఢిల్లీ వేదికగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌, కెప్టెన్‌ ఎరాస్మస్‌ 11 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు. చదవండి: వారిద్ద‌రూ అద్భుతం.. కఠిన పిచ్‌పై కూడా అద‌ర‌గొట్టారు: సూర్యUnfair advantage or smart bowling? 🤔@IrfanPathan, Piyush Chawla & Jatin Sapru share their thoughts on Gerhard Erasmus' action.ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/4EvladZTMz— Star Sports (@StarSportsIndia) February 12, 2026

Varun Chakaravarthy clears the air on Abhishek Sharma's availability for IND vs PAK3
పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త క్రికెట్ జ‌ట్టు ర‌స‌వ‌త్త‌ర పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 15న కొలంబో వేదిక‌గా దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మైన విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌.. పాక్‌తో పోరు నాటికి పూర్తిగా కోలుకోనున్న‌ట్లు తెలుస్తోంది.అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌ తర్వాత అభిషేక్‌కు తీవ్రమైన కడుపు సమస్య రావడంతో న్యూఢిల్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతడు చికిత్స పూర్తి చేసుకొని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. అయితే న‌మీబియాతో మ్యాచ్‌కు ముందు అభిషేక్ ప్రాక్టీస్ కూడా చేశాడంట‌. ఈ విష‌యాన్ని భార‌త స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ధ్రువీక‌రించాడు.న‌మీబియాతో మ్యాచ్ అనంత‌రం వ‌రుణ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ఆడుతాడ‌ని నేను అనుకుంటున్నాను. అత‌డు ప్ర‌స్తుతం బాగానే ఉన్నాడు. ఈ రోజు అత‌డు ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తానని నాతో చెప్పాడ‌ని వ‌రుణ్ అన్నాడు.2 కిలోలు త‌గ్గిన అభిషేక్‌అభిషేక్ శ‌ర్మ కూడా త‌న ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చాడు. కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడిన అభిషేక్, చికిత్స సమయంలో రెండు కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. ప్ర‌స్తుతం తాను కేవలం పప్పు అన్నం మాత్రమే తింటున్నానని ఓ వీడియోలో అభిషేక్ పేర్కొన్నాడు. ఒక‌వేళ పాక్‌తో మ్యాచ్‌కు అభిషేక్ దూరమైతే, భార‌త ఇన్నింగ్స్‌ను సంజూ శాంస‌న్, ఇషాన్ కిష‌న్ ప్రారంభించ‌నున్నారు.

Mosca brothers show at Wankhede Stadium helps Italy secure marvellous win4
ఒకరేమో కార్పెంటర్‌.. మరొకరు పీఈటీ! ఎవరీ 'మోస్కా బ్రదర్స్'?

క్రికెట్ ప్రపంచానికి మరో అన్నదమ్ముల జోడీ పరిచయమైంది. వారిద్దరూ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించారు. ఓపెనర్లగా బరిలోకి దిగిన ఆ జంట 124 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసింది. వారే ఇటలీ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆంథోనీ మోస్కా, జస్టిన్‌ మోస్కా. గురువారం వాంఖడే వేదికగా జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో నేపాల్‌ను పది వికెట్ల తేడాతో ఇటలీ చిత్తు చేసింది. మోస్కా బ్రదర్స్ అజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశారు. టీ20 ప్రపంచకప్‌లో ఇటలీకి ఇదే తొలి విజయం. ఆస్ట్రేలియా నుంచి వచ్చి... ‘మోస్కా బ్రదర్స్‌’ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం ఇటలీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లగా వీరిద్దరు అక్కడే సిడ్నీలో పుట్టారు. అక్కడి క్రికెట్‌ సంస్కృతి వల్ల ఆటపై మక్కువ పెంచుకొని ఇద్దరూ కలిసే ఆటను నేర్చుకోవడంతో పాటు ప్రాక్టీస్‌ కూడా చేసేవారు. ఆస్ట్రేలియాలో క్లబ్‌ స్థాయిలో ఆడిన తర్వాత వీరిద్దరు ఇటలీ చేరారు. తమ కొత్త జట్టును తీర్చిదిద్దేందుకు ఇటలీకి ఇలాంటి ఆటగాళ్ల అవసరం ఏర్పడింది.ఈ క్రమంలో జాతీయ జట్టుకు ఎంపికైన వీరిద్దరు 2022లో ఒకే మ్యాచ్‌ ద్వారా (గ్రీస్‌పై) అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం విశేషం. టోర్నీ ముగిసిన తర్వాత ‘మోస్కా బ్రదర్స్‌’ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోతారు. పెద్దవాడైన ఆంథోనీ పదేళ్ల పాటు కార్పెంటర్‌గా పని చేసి బాలఖైదీల కేంద్రంలో కార్పెంటర్‌ పనిని నేర్పించే ఉద్యోగంలో ఇటీవలే చేరాడు. మూడేళ్లు చిన్నవాడైన జస్టిన్‌ ఒక పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్నాడు.మెనెంటీ బ్రదర్స్‌’ కూడా... ‘మోస్కా బ్రదర్స్‌’కు ఆటలో స్ఫూర్తిగా నిలిచిన మరో ఇద్దరు ఆస్ట్రేలియన్‌ సోదరులు కూడా ఇటలీ జట్టులోనే ఉన్నారు. నేపాల్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన హ్యారీ మెనెంటీæ చిన్నవాడు కాగా, బెన్‌ మెనెంటీ అతనికంటే మూడేళ్ల పెద్దవాడు. వీరు కూడా సిడ్నీకి చెందిన వారే. ఈ ఇద్దరి ప్రోత్సాహంతోనే క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ‘మోస్కా బ్రదర్స్‌’ ఇప్పుడు వారిద్దరిలో కలిసి ఇటలీ జట్టు తరఫున వరల్డ్‌ కప్‌ ఆడటం విశేషం. అయితే ‘మెనెంటీ’లకు ఇప్పటికే చెప్పుకోదగిన అనుభవం ఉంది. బిగ్‌బాష్‌ లీగ్‌లో అడిలైడ్‌ స్ట్రయికర్స్, సిడ్నీ సిక్సర్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు టాస్మేనియా తరఫున 35 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు.హాకీ వరల్డ్‌ కప్‌లో ఆడి... ఇటలీ టీమ్‌లో ఇద్దరు దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా ఉన్నారు. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో కెపె్టన్‌గా వ్యవహరించిన దురదృష్టవశాత్తూ గాయంతో టోర్నీకి దూరమైన వేన్‌ లీ మాడ్‌సన్‌ స్వస్థలం డర్బన్‌. జాతీయ జట్టుకు టెస్టు ఆడే అవకాశం రాకపోయినా... మాడ్‌సన్‌కు ఏకంగా 253 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల అనుభవం ఉంది. అతను దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 2006 హాకీ వరల్డ్‌ కప్‌లో, 2006 కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆడటం విశేషం. సఫారీ టీమ్‌కు 2021 వరకు 6 వన్డేలు, 13 టి20లు ఆడిన జేజే స్మట్స్‌ ఇప్పుడు ఇటలీ టీమ్‌లో ఉన్నాడు. తన జీవితంలో ఒక్కసారి కూడా ఇటలీ దేశంలో అడుగు పెట్టకుండా అతను ఆ దేశం తరఫున వరల్డ్‌ కప్‌ ఆడుతుండటం ఆసక్తికరం.టీ20 ప్రపంచకప్‌లో అన్నదమ్ముల జోడీలు ఇవేటీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏడు అన్నదమ్ముల జోడీలు కలిసి మ్యాచ్‌లు ఆడాయి. తాజా ప్రపంచకప్‌లో ఇటలీ నుంచి రెండు ‘బ్రదర్స్‌’ జోడీలు ఆంథోనీ మోస్కా–జస్టిన్‌ మోస్కా; హ్యారీ మెనెంటీ–బెన్‌ మెనెంటీ రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాయి. గతంలో ఇర్ఫాన్‌ పఠాన్‌–యూసుఫ్‌ పఠాన్‌ (భారత్‌; 2007)... నాథన్‌–బ్రెండన్‌ మెకల్లమ్‌ (న్యూజిలాండ్‌)... డ్వేన్‌ బ్రావో–డారెన్‌ బ్రావో (వెస్టిండీస్‌) ... మోర్నీ మోర్కెల్‌–అల్బీ మోర్కెల్‌ (దక్షిణాఫ్రికా)... డేవిడ్‌ హస్సీ–మైక్‌ హస్సీ (ఆ్రస్టేలియా) ‘బ్రదర్స్‌’ కలిసి టి20 ప్రపంచకప్‌లో ఆడారు.

Suryakumar Yadav comments on Indias 93-run win over Namibia5
వారిద్ద‌రూ అద్భుతం.. కఠిన పిచ్‌పై కూడా అద‌ర‌గొట్టారు: సూర్య

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. గురువారం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో నమీబియాను 93 ప‌రుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ సూర్య‌కుమార్ స్పందించాడు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లోనూ విజయం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని సూర్య తెలిపాడు."ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించాం. జ‌ట్టు విజ‌యంలో ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ వంతు పాత్ర పోషించారు. వాంఖ‌డే వికెట్‌పై బ్యాటింగ్ చేయ‌డం అంత సులువు కాదు. పిచ్ బ్యాటింగ్‌కు అంత‌ అనుకూలంగా లేన‌ప్ప‌టికి ఇషాన్, సంజూ మాత్రం మా ఇన్నింగ్స్‌ను ఘ‌నంగా ఆరంభించారు. అదేవిధంగా వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా నెల‌కొల్పిన భాగ‌స్వామ్యం మాకు చాలా కీల‌కంగా మారింది.క్లిష్ట స‌మ‌యంలో వారిద్ద‌రూ బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ప్రశంసనీయం. ఒక దశలో 240-250 పరుగులు దాటుతామనిపించినా, నమీబియా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి మ‌మ్మ‌ల్ని క‌ట్ట‌డి చేశారు. జ‌స్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన కోటా 4 ఓవర్లను పూర్తి చేయడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా జ‌స్ప్రీత్ త‌న రిథ‌మ్‌ను కొన‌సాగిస్తాడ‌ని ఆశిస్తున్నాము. అలాగే స్పిన్ ద్వ‌యం వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ప్ర‌త్య‌ర్దుల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. వారిద్ద‌రిది అద్భుతమైన కాంబినేషన్. హార్దిక్ పాండ్యా గురుంచి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.కొత్త బంతితో, పాత బంతితో గానీ బౌలింగ్ చేసేందుకు పాండ్యా ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మా త‌దుపరి మ్యాచ్‌లో కూడా ఇదే జోరును కొన‌సాగిస్తాము" అని సూర్య పోస్ట్ ప్రెజెంటేష‌న్‌లో పేర్కొన్నాడు. ఫిబ్ర‌వ‌రి 15న కొలంబో వేదిక‌గా చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాక్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.భార‌త్ ఆల్‌రౌండ్ షో..ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. అనంత‌రం భారీ ల‌క్ష్య చేధ‌న‌లో 116 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

India Create History With Win Against Namibia, Become First Team In The World6
చ‌రిత్ర సృ‍ష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ టీమిండియా త‌న జోరును కొన‌సాగిస్తోంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా నమీబియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 93 పరుగుల భారీ తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రెండింటిలోనూ మెన్ ఇన్ బ్లూ స‌త్తాచాటింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంత‌రం భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న‌మీబియా 18.2 ఓవ‌ర్ల‌లో 116 పరుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ విజయంతో టీమిండియా ఓ ప్రపంచ రికార్డును త‌మ‌పేరిట లిఖించుకుంది.టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో వ‌రుస‌గా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచ‌క‌ప్‌-2024లో టీమిండియా వ‌రుస‌గా 8 విజ‌యాలు సాధించి ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఇప్పుడు వ‌రుస‌గా రెండు విజ‌యాలు న‌మోదు చేయ‌డంతో ఈ అరుదైన భార‌త్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌ర్వాత ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు వ‌రుస‌గా 8 విజ‌యాలు న‌మోదు చేశాయి.టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వరుస‌గా అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్లు ఇవేభార‌త్‌-10ఆస్ట్రేలియా-8ద‌క్షిణాఫ్రికా-8ఇంగ్లండ్‌-7చ‌ద‌వండి: T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్‌ సింగ్‌

India beat Namibia by 93 runs in T20 World Cup7
ఇషాన్, పాండ్యా చెలరేగగా...

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు కాబట్టి భారత జట్టు ఈసారి ‘300’ కొడుతుందా అనే చర్చ మధ్య నమీబియాతో మ్యాచ్‌ మొదలైంది. ఆరంభంలో ఆట చూస్తే అది సాధ్యమే అని కూడా అనిపించింది. చివరకు వచ్చేసరికి ఇది జరగకపోయినా గత మ్యాచ్‌తో పోలిస్తే భారత బ్యాటింగ్‌ పదును పెరిగింది. అమెరికాతో ఆశించిన స్కోరుకంటే చాలా తక్కువగా నమోదు చేసిన టీమిండియా ఈసారి మాత్రం 200 దాటింది. ఆపై సమష్టి ప్రదర్శనతో బలహీన ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు తమ టి20 ప్రపంచకప్‌ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్‌ మెరుపులు, వరుణ్‌ చక్రవర్తి పొదుపైన బౌలింగ్, హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన జట్టును గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది. న్యూఢిల్లీ: టి20 వరల్డ్‌కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ గ్రూప్‌ ‘ఎ’లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించారు. నమీబియా కెప్టెన్, ఆఫ్‌స్పిన్నర్‌ గెరార్డ్‌ ఎరాస్మస్‌ (4/20) పొదుపైన బౌలింగ్‌ సహా 4 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్‌ చివరి 11 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు చేజార్చుకుంది. అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. లౌరెన్‌ స్టీన్‌కాంప్‌ (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా...వరుణ్‌ చక్రవర్తి 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్‌ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజు సామ్సన్‌కు అవకాశం దక్కగా... బుమ్రా తిరిగి రావడంతోసిరాజ్‌ను తప్పించాల్సి వచ్చింది. తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ ఈ నెల 15న కొలంబోలో పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఇషాన్‌ 6, 6, 6, 6, 4... అభిషేక్‌ గైర్హాజరులో అదృష్టవశాత్తూ మ్యాచ్‌ అవకాశం దక్కించుకున్న సంజు సామ్సన్‌ (8 బంతుల్లో 22; 1 ఫోర్, 3 సిక్స్‌లు) సిక్స్‌తో స్కోరింగ్‌ మొదలు పెట్టినా అది ఎక్కువసేపు సాగలేదు. షికోంగో ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ఇషాన్‌ తన జోరును మొదలు పెట్టాడు. 8 బంతుల వ్యవధిలో 4 ఫోర్లు కొట్టిన అతను... స్మిట్‌ వేసిన ఓవర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. పవర్‌ప్లే ముగిసేసరికి 86 పరుగులు చేసిన భారత్‌... 6.5 ఓవర్లలోనే 100 పరుగులను అందుకుంది. టి20 వరల్డ్‌ కప్‌లో అతి తక్కువ బంతుల్లో (35 బంతుల్లో) వంద పరుగులు సాధించిన జట్టుగా భారత్‌ నిలిచింది. ఇషాన్‌ అవుటైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్‌ (12), హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) కూడా తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే పాండ్యా, శివమ్‌ దూబే (16 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) భారీ భాగస్వామ్యంతో స్కోరు 200 దాటింది. వీరిద్దరు 39 బంతుల్లో 81 పరుగులు జత చేశారు. షికోంగో ఓవర్లో వరుసగా సిక్స్, 2 ఫోర్లు కొట్టిన హార్దిక్‌ పాండ్యా 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. టపటపా... ఛేదనలో దాదాపు సగం ఓవర్ల వరకు నమీబియా ప్రదర్శన మెరుగ్గానే ఉంది. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. స్టీన్‌కాంప్‌తో పాటు ఫ్రైలింగ్‌ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఎరాస్మస్‌ (11 బంతుల్లో 18; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. 9.1 ఓవర్లలో జట్టు 86/2 వద్ద నిలిచింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిది. భారత బౌలర్లు చెలరేగడంతో నమీబియా బ్యాటర్లు ఎవరూ నిలవలేకపోయారు. 8 పరుగుల వ్యవధిలో తర్వాతి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్‌ కోలుకోలేకపోయింది. ఒకే స్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు పడ్డాయి. స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) షికోంగో (బి) ఎరాస్మస్‌ 61; సామ్సన్‌ (సి) స్టీన్‌కాంప్‌ (బి) షికోంగో 22; తిలక్‌ (సి) స్మిట్‌ (బి) ఎరాస్మస్‌ 25; సూర్యకుమార్‌ (స్టంప్డ్‌) గ్రీన్‌ (బి) స్కాల్‌ 12; పాండ్యా (సి) (సబ్‌) లీషర్‌ (బి) ఎరాస్మస్‌ 52; దూబే (రనౌట్‌) 23; రింకూ (సి) ఎరాస్మర్‌ (బి) స్మిట్‌ 1; అక్షర్‌ (బి) ఎరాస్మస్‌ 0; వరుణ్‌ (నాటౌట్‌) 1; అర్‌‡్షదీప్‌ (రనౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–25, 2–104, 3–120, 4–124, 5–205, 6–205, 7–206, 8–206, 9–209. బౌలింగ్‌: రూబెన్‌ 4–0–38–0, షికోంగో 3–0–41–1, స్మిట్‌ 4–0–50–1, హీన్‌గో 1–0–18–0, ఎరాస్మస్‌ 4–0–20–4, స్కాల్‌ 4–0–41–1. నమీబియా ఇన్నింగ్స్‌: స్టీన్‌కాంప్‌ (బి) వరుణ్‌ 29; ఫ్రైలింక్‌ (సి) దూబే (బి) అర్‌‡్షదీప్‌ 22; జాన్‌ నికోల్‌ (సి) అక్షర్‌ (బి) వరుణ్‌ 13; ఎరాస్మస్‌ (సి) తిలక్‌ (బి) అక్షర్‌ 18; స్మిట్‌ (బి) వరుణ్‌ 0; గ్రీన్‌ (హిట్‌వికెట్‌) (బి) దూబే 11; క్రూగర్‌ (సి) బుమ్రా (బి) అక్షర్‌ 5; రూబెన్‌ (బి) బుమ్రా 6; స్కాల్‌ (సి) అక్షర్‌ (బి) పాండ్యా 4; షికోంగో (ఎల్బీ) (బి) పాండ్యా 0; హీన్‌గో (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్‌) 116. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–86, 4–86, 5–88, 6–94, 7–111, 8–116, 9–116, 10–116. బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్యా 4–0–21 –2, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 3–0–36–1, శివమ్‌ దూబే 2.2–0–11–1, జస్‌ప్రీత్‌ బుమ్రా 4–0–20–1, వరుణ్‌ చక్రవర్తి 2–0–7–3, అక్షర్‌ పటేల్‌ 3–1–20–2. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా x జింబాబ్వేవేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి కెనడా x యూఏఈవేదిక: న్యూఢిల్లీ; మ.గం. 3 నుంచి నెదర్లాండ్స్‌ x అమెరికావేదిక: చెన్నై; రాత్రి గం. 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

India clean sweeps 50m rifle three positions event8
మూడు పతకాలూ మనవే

న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌లో గురువారం సీనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్‌ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. భారత్‌కే చెందిన నీరజ్‌ కుమార్‌ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్‌ షెరాన్‌ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్‌లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. జూనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు అడ్రియన్‌ కర్మాకర్‌ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్‌ షెఖావత్‌ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్‌ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్‌లతో కూడిన భారత బృందం టీమ్‌ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు.

Rashmika Jodi in the semis9
సెమీస్‌లో రష్మిక జోడీ

పుణే: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్‌ డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్‌) ద్వయం 7–6 (9/7), 6–3తో భారత్‌కే చెందిన వైష్ణవి–వైదేహి జంటపై గెలుపొందింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక–అంకిత రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశారు. హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లికి మాత్రం నిరాశ ఎదురైంది. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సహజ (భారత్‌)–జుజానా పావ్లీకౌస్కా (పోలాండ్‌) జంట 6–4, 3–6, 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో పొలీనా బఖ్‌ముత్కినా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.

Snehit makes a good start at the World Table Tennis Chennai Star Contenders Tournament10
స్నేహిత్‌ శుభారంభం

చెన్నై: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్‌ కంటెండర్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ ప్లేయర్‌ సూరావజ్జుల స్నేహిత్‌ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 100వ ర్యాంకర్‌ స్నేహిత్‌ 9–11, 11–8, 8–11, 11–7, 11–6తో భారత్‌కే చెందిన దివ్యాంశ్‌ శ్రీవాస్తవపై నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. భారత్‌కే చెందిన ఆకాశ్‌ పాల్, అంకుర్, హర్మీత్‌ కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement