Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ICC Under 19 world cup 2026 Semi Final 2: Afghanistan won the toss and choose to bat1
ప్రపంచకప్‌ సెమీఫైనల్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌

అండర్‌ 19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 4) రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. హరారే వేదికగా భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ మహబూబ్‌ ఖాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో పాక్‌తో ఆడిన జట్టునే కొనసాగించారు. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌ తాడోపేడో తేల్చుకుంటుంది.తుది జట్లు..ఆఫ్ఘనిస్తాన్: ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జాయ్, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(w/c), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్జాయ్, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్‌భారత్‌: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్

Jay Shah appoints Singapore administrator to ceasefire IND vs PAK T20 World Cup war2
భారత్‌-పాక్‌ టీ20 ప్రపంచకప్‌ వార్‌.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య టీ20 ప్రపంచకప్‌ పంచాయితీలో ఐసీసీ జోక్యం చేసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ను పాక్‌ బాయ్‌కాట్‌ చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ అధ్యక్షుడు జై షా రంగప్రవేశం చేశారు. ఈ సున్నితమైన అంశాన్ని పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తిని నియమించారు. సింగపూర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన అనుభవజ్ఞుడైన నిర్వాహకుడు ఇమ్రాన్‌ ఖ్వాజాను ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్‌ చేశారు. ఖ్వాజా గతంలో ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌గా పనిచేసి, అన్ని ప్రధాన క్రికెట్‌ బోర్డులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన పీసీబీతో చర్చలు జరిపి, పాకిస్తాన్‌ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖ్వాజా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్‌ తమ నిర్ణయాన్ని మార్చుకొని, భారత్‌తో మ్యాచ్‌ ఆడుతుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ పాక్‌ ఖ్వాజా మధ్యవర్తిత్వాన్ని కూడా బేఖాతరు చేస్తే, ఐసీసీ నిబంధనలను సైతం పక్కకు పెట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జై షా చాలా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పాక్‌కు చివరి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతను ఖ్వాజాను మధ్యవర్తిత్వానికి పంపాడు. టెక్నికల్‌గా ఉండే లూప్‌ హోల్స్‌ను వాడుకుంటూ పాక్‌ డ్రామాలు ఆడుతుందన్నది షా వాదన. ఈ విషయమై పీసీబీ లిఖితపూర్వక సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటుంది. ఒకవేళ ఐసీసీ చేసే అన్ని ప్రయత్నాలు విఫలమై పాక్‌ భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడకూడదనే నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఆ జట్టే తీవ్రంగా నష్టపోతుంది. ప్రపంచకప్‌ వరకు మ్యాచ్‌ పాయింట్లు కోల్పోతుంది. అలాగే ఈ మ్యాచ్‌ జరగకపోవడం​ వల్ల కలిగే నష్టాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనంతరం ఆర్దిక, పాలనా పరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్‌ పోటీలు ప్రారంభమవుతాయి. అదే రోజు భారత్‌, పాక్‌ తమ తొలి మ్యాచ్‌లు ఆడతాయి. పాక్‌ నెదర్లాండ్స్‌తో.. భారత్‌ యూఎస్‌ఏతో తలపడతాయి. పాక్‌ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడుతుంది.

DHONI RATES INDIAN TEAM IN T20 WC 2026 AS ONE OF THE MOST DANGEROUS TEAMS EVER3
ఈ జట్టుతో మామూలుగుండదు.. అత్యంత ప్రమాదకరమైంది..!

త్వరలో ప్రారంభం​ కానున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా అభివర్ణించాడు. ఈ జట్టులో అవసరమైన అన్ని అంశాలు (అనుభవం, బలమైన బ్యాటింగ్‌, అద్భుతమైన బౌలింగ్‌) సమగ్రంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అయితే రాత్రి వేళల్లో తేమ ప్రభావం ఆందోళన కలిగిస్తుందని అన్నాడు. ఈ విషయంలో టీమిండియా అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించాడు. టాస్‌ చాలా కీలకమవుతుందని అంచనా వేశాడు. మాహి అన్‌ప్లగ్డ్‌ అనే కార్యక్రమం సందర్భంగా ధోని ఈ విషయాలను షేర్‌ చేసుకున్నాడు.కోహ్లి, రోహిత్‌ ఎందుకు ఆడకూడదు..?ఇదే కార్యక్రమం సందర్భంగా ఇంటర్వూయర్‌ ధోనిని విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ గురించి అడిగాడు. వారిద్దరు 2027 వన్డే వరల్డ్‌కప్‌ ఆడగలరా అని ప్రశ్నించాడు. దీనిపై ధోని స్పందిస్తూ.. ఆటగాళ్లకు వయసు ఎప్పుడూ ప్రమాణం కాదు. ప్రదర్శన మరియు ఫిట్‌నెస్‌ మాత్రమే అసలు ప్రమాణాలు. దేశం కోసం కృషి చేయాలనుకున్నప్పుడు ఎవరినైనా ఎందుకు ఆపాలి.అనుభవం ఒక్కసారిగా రాదు. 20 ఏళ్ల ఆటగాడికి అనుభవం ఉండదు, సచిన్ టెండూల్కర్‌ లాంటి అసాధారణ ప్రతిభ తప్ప. కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. ప్రదర్శన ఉంటే జట్టులో ఉంటారు, లేకపోతే ఉండరు అని అన్నాడు.ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది. ఇటీవలికాలంలో ధోని చెప్పినట్లుగానే టీమిండియా చాలా ప్రమాదకరంగా ఉంది. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 51-8 విన్-లాస్‌ రికార్డు సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో టీమిండియా అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టమైన జట్టుగా ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ సూర్యతో పాటు ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శివమ్‌ దూబే అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, వరుణ్ చక్రవర్తి ఉరకలేస్తున్నారు. ప్రపంచకప్‌లో వీరిని ఆపడం ఏ జట్టుకైనా సామర్థ్యానికి మించిన పనే అవుతుంది. భారత్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో జరిగే మ్యాచ్‌తో మొదలుపెడుతుంది. భారత్‌.. పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌ జట్లతో గ్రూప్‌-ఏలో ఉంది. ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అనుమానంగా ఉంది. భద్రతా కారణాలంటూ ఈ మ్యాచ్‌ను పాక్‌ బాయ్‌కాట్‌ చేసుకుంది.

Nandani Sharma rewrites history, breaks record for most wickets by an Indian in a WPL season4
చరిత్ర తిరగరాసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌

మహిళల ఐపీఎల్‌లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నందిని శర్మ చరిత్ర తిరగరాసింది. లీగ్‌ చరిత్రలో (సింగిల్‌ ఎడిషన్‌లో) అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరించింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ సైకా ఇషాఖీ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టింది. ఇషాఖీ 2023 ఎడిషన్‌లో 15 వికెట్లు తీయగా.. ప్రస్తుత ఎడిషన్‌లో (2026) నందిని 16 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 3) గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో నందిని శర్మ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె 2 వికెట్లు తీసింది.డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు (టాప్‌-4)నందిని శర్మ (ఢిల్లీ క్యాపిటల్స్‌)- 16 వికెట్లు (2026)సైకా ఇషాఖీ (ముంబై ఇండియన్స్‌)- 15 (2023)శ్రీచరణి (ఢిల్లీ క్యాపిటల్స్‌)- 14 (2026)శ్రేయాంక పాటిల్‌ (ఆర్సీబీ)- 13 (2024)హ్యాట్రిక్‌ఈ సీజన్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్‌తో మెరిసింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడినా నందిని హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి సత్తా చాటింది. ఈ సీజన్‌లో ఢిల్లీ సాధించిన విజయాల్లో నందినిది కీలకపాత్ర. 24 ఏళ్ల ఈ రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ను ఢిల్లీ ఈ సీజన్‌ వేలంలో 20 లక్షలకు సొంతం చేసుకుంది.నిన్న జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఢిల్లీ గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా నాలుగో ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. బెత్‌ మూనీ (62 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో చినెల్‌ హెన్రీ 3, నందిని శర్మ 2, మిన్ను మణి ఓ వికెట్‌ తీశారు.అనంతరం 169 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది. లిజెల్‌ లీ (43), జెమీమా రోడ్రిగ్స్‌ (41) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. రేపు (ఫిబ్రవరి 5) వడోదరలో జరుగబోయే ఫైనల్లో ఢిల్లీ ఆర్సీబీతో తలపడనుంది.

Team india journey in under 19 world cup history5
యంగ్‌ ఇండియా చరిత్ర కొనసాగిస్తుందా..?

అండర్‌-19 ప్రపంచకప్‌ 2026 ఎడిషన్‌లో యంగ్‌ ఇండియా ఫైనల్‌ ఫోర్‌కు చేరింది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టేందుకు సిద్దంగా ఉంది. ఈ మ్యాచ్‌ హరారే వేదికగా భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఆయుశ్‌ మాత్రే నేతృత్వంలోని యువ భారత్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. యంగ్‌ ఇండియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే.. ఫిబ్రవరి 6న జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.యంగ్‌ ఇండియా ఆరో టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో ఉన్న నేపథ్యంలో అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో భారత ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. యువకుల క్రికెట్‌కు సంబంధించి ఈ టోర్నీ చాలా ప్రాముఖ్యం కలిగింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌ అత్యంత విజయవంతమైన జట్టుగా చలామణి అవుతుంది. ఇప్పటివరకు జరిగిన 15 ఎడిషన్లలో 5 టైటిళ్లు సాధించి, టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా నిలిచింది. అలాగే నాలుగు సార్లు రన్నరప్‌గానూ నిలిచి, మొత్తం తొమ్మిది సార్లు ఫైనల్‌కు చేరిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. గతం ఇంత ఘనంగా కలిగిన భారత జట్టు మరో టైటిల్‌ను సొంతం చేసుకుంటుందో లేదో తేలియాలంటే మరో రెండు రోజుల వేచి చూడాలి. భారత్‌ ఆరో టైటిల్‌ను సాధించాలని ఆకాంక్షించే ముందు అండర్-19 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. ఈ టోర్నీ 1988లో ప్రారంభం కాగా.. భారత్‌ తమ తొలి టైటిల్‌ను 2000లో సాధించింది.2000 - మొహమ్మద్‌ కైఫ్‌శ్రీలంకలో జరిగిన ఆ ఎడిషన్‌లో మొహమ్మద్‌ కైఫ్‌ నేతృత్వంలోని యంగ్‌ ఇండియా ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి తొలి అండర్‌-19 ప్రపంచ్‌కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీ ద్వారానే యువరాజ్‌ సింగ్‌ వంటి స్టార్లు అంతర్జాతీయ క్రికెట్‌ సమాజానికి పరిచయమయ్యారు.2008 – విరాట్ కోహ్లీ 2008లో మలేషియాలో జరిగిన ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్‌ రెండోసారి టైటిల్‌ గెలిచింది. ఆ జట్టులో రవీంద్ర జడేజా, మనీష్ పాండే వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ విజయం తర్వాత కోహ్లీ సీనియర్‌ జట్టులోకి ప్రవేశించి, భారత క్రికెట్‌ చరిత్రలో గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. 2012 – ఉన్ముక్త్‌ చంద్‌ 2012లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో ఉన్ముక్త్ చంద్‌ నాయకత్వంలో భారత్‌ మూడో టైటిల్‌ గెలిచింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని సాధించింది. ఆ జట్టులో కేఎల్ రాహుల్‌, హనుమ విహారి వంటి ఆటగాళ్లు ఉన్నారు. 2018 – పృథ్వీ షా2018లో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో పృథ్వీ షా నాయకత్వంలో భారత్‌ నాలుగో టైటిల్‌ గెలిచింది. శుభ్‌మన్ గిల్‌ అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఈ జట్టు అత్యంత బలమైన జట్టుగా గుర్తింపు పొందింది. 2022 – యష్ ధుల్‌ 2022లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్‌లో యష్ ధుల్‌ నాయకత్వంలో భారత్‌ ఐదో టైటిల్‌ గెలిచింది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి, మరోసారి యువ క్రికెట్‌ శక్తిని ప్రపంచానికి చూపించింది. 2024 – ఫైనల్లో పరాజయం 2024లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌కి చేరినా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఎడిషన్‌లో యంగ్‌ ఇండియా ఓడిపోయినప్పటికీ, అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంది. దీనికి ముందు భారత్‌ 2006, 2016, 2020 ఎడిషన్లలోనూ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

Virat Kohli stood by a broken Ishan Kishan, heartbreaking incident revealed6
ఇషాన్‌ కిషన్‌కు అండగా విరాట్‌ కోహ్లి

న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చి అద్భుతాలు చేసిన టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఒకనొక దశలో మానసికంగా కృంగిపోయి ఉన్నప్పుడు టీమిండియా దిగ్గజం​ విరాట్‌ కోహ్లి తనకు అండగా నిలబడ్డాడని గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణాలు జీవితంలో మరిచిపోలేనివని అన్నాడు. విరాట్‌ ఓదార్పు తనను కెరీర్‌లో తిరిగి పుంజుకునేలా చేసిందని తెలిపాడు.మానసికంగా విరిగిపోయిన సమయంఇషాన్‌ 2020 ఐపీఎల్‌ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున 516 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. కానీ 2021లో పరిస్థితి పూర్తిగా మారింది. 10 మ్యాచ్‌ల్లో కేవలం 241 పరుగులు మాత్రమే సాధించాడు. అతని ఆటలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో వ్యాఖ్యాత ఇయాన్ బిషప్‌ అతన్ని “బ్రోకెన్ యంగ్ మాన్” అని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ ఇచ్చిన మానసిక బలం ఆ సమయంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌ తర్వాత విరాట్ కోహ్లీ ఇషాన్‌ దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఆ క్షణం ఇషాన్‌ జీవితంలో మరపురాని అనుభవంగా నిలిచింది. “నేను కన్నీళ్లు ఆపుకుంటూ ఉన్నాను. విరాట్‌ భాయ్‌ వచ్చి నన్ను ఓదార్చారు. ఆ సమయంలో నాకు ఆ మాటలు చాలా అవసరం అయ్యాయి” అని ఇషాన్‌ ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు. బాధను విజయంగా మార్చిన క్షణం విధి చాలా నాటకీయమైంది. 2022లో ఇషాన్‌ కిషన్‌ 121 బంతుల్లో డబుల్ సెంచరీ (ఫాస్టెస్ట్‌) సాధించినప్పుడు, నాన్‌-స్ట్రైకర్‌ ఎండ్‌లో నిలిచింది విరాట్ కోహ్లీనే. ఇద్దరూ కలిసి 290 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఒకప్పుడు కన్నీళ్లు ఆపుకున్న ఆటగాడు, అదే కోహ్లీ సాక్షిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.నమ్మకముంచిన ముంబై ఇండియన్స్‌ ఇషాన్‌ 2021లో విఫలమైనప్పటికీ, ముంబై ఇండియన్స్‌ అతనిపై నమ్మకముంచింది. 2022 వేలంలో రూ. 15.25 కోట్ల భారీ మొత్తానికి అతన్ని తిరిగి కొనుగోలు చేసింది. ఎంఐ విశ్వాసాన్ని ఇషాన్‌ నిలబెట్టుకున్నాడు. ఆ ఎడిషన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 133.88 స్ట్రైక్‌రేట్‌తో 418 పరుగులు చేసి, ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.ఇషాన్ 2.0ఐపీఎల్‌ అనుభవాలు పక్కన పెడితే, ఇషాన్‌ అంతర్జాతీయ కెరీర్‌లోనూ అద్భుతమైన పునరాగమనం చేశాడు. రెండేళ్ల కిందట అతనికి టీమిండియాలో స్థానమే ఉండేది కాదు. స్వయంకృతాపరాధాల వల్ల జట్టులో స్థానం కోల్పోవడంతో పాటు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కూడా కోల్పోయాడు. అయితే ఇషాన్‌ తిరిగి అద్భుత రీతిలో పుంజుకున్నాడు.గడిచిన రెండేళ్లలో దేశీయ క్రికెట్‌లో విశేషంగా రాణించి, ఇటీవల న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. ఈ వెర్షన్‌ ఇషాన్‌లోని 2.0 వెర్షన్‌. రీఎంట్రీలో ఇషాన్‌ మరింత చెలరేగిపోయాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లోనే వరుసగా 76, 28, 103 పరుగుల స్కోర్లు చేశాడు. ఈ ప్రదర్శనల తర్వాత అతను త్వరలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేయడం ఖరారైపోయింది.

50 year old Indian woman wins national international medals story7
పతకాల వేటలో ఆర్టీసీ కండక్టర్‌ స్వరాజ్యలక్ష్మి 

లక్ష్యాలు ఎన్ని నిర్దేశించుకున్నా.. వాటిని సాధించడంలో చాలా మంది విఫలమవుతుంటారు. కృషి, పట్టుదల లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇంకొందరు లక్ష్యాలను ఎంచుకున్నా.. సమయం లేదని సాకులు చెబుతుంటారు.. వీటన్నింటినీ ఐదు పదుల వయసులో అధిగమించారు ఆర్టీసీ కండక్టర్‌ స్వరాజ్యలక్ష్మి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ అనేక పతకాలు గెలుచుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అల్వాల్‌ మచ్చ»ొల్లారంలో నివసించే బైరి స్వరాజ్యలక్ష్మికి చిన్న తనం నుంచి పరుగు పందెం అంటే అమితమైన ఇష్టం. అయితే మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆ మక్కువకు ప్రాథమిక స్థాయిలోనే ముగింపు పడింది. చదువు, వివాహం, అనంతరం సంతానం.. ఇలా అందరిలానే బాధ్యతల మధ్య చిక్కుకుపోయారు. అయితే భర్త ధనరాజ్‌తో తన ఆసక్తిని పంచుకున్నారు. దీంతో ఆమె అభిరుచిని గుర్తించి ప్రోత్సహించారు. ఇంతలోనే ఆరీ్టసీలో కండక్టర్‌గా ఉద్యోగం వచి్చంది. ఓవైపు ఇంటిపని, వంటపనితో పాటు మరోవైపు ఉద్యోగం చేస్తూ తన ఆసక్తిని నెరవేర్చుకోవడం కోసం పరుగు మొదలుపెట్టారు. ఆసరా అందిస్తే మరిన్ని పతకాలు.. క్రీడాకారులకు ప్రభుత్వరంగ సంస్థల్లో అధికంగా ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగ నియామకాల్లో సైతం స్పోర్ట్స్‌ కోటా ఉండటమే ఇందుకు నిదర్శనం. రోజూ ఉద్యోగం చేసి ఇంటికి వచి్చన అనంతరం తరీ్ఫదు పొందడం పరిపాటి. ఇతర పోటీల్లో పాల్గొనాలంటే సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో సరైన శిక్షణ లేకుండానే పాల్గొనాల్సి వస్తుందని స్వరాజ్యలక్ష్మి చెబుతున్నారు. అధికారులు, సిబ్బంది ప్రోత్సాహం అందిస్తున్నప్పటికీ ఉన్నత స్థాయి లక్ష్యాలను చేరుకోడానికి ఇది సరిపోవడం లేదంటున్నారు.12 ఏళ్లలో 70కి పైగా పతకాలు.. 12 సంవత్సరాల నుండి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ పతకాల వేట సాగించారు. 70కి పైగా జాతీయ పతకాలు, నాలుగు అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఇటీవల రాజస్థాన్‌లోని అజ్మీర్ లో జరిగిన ఏడో జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌íÙప్‌ పోటీల్లో పాల్గొని 400 మీటర్ల విభాగంలో రజత పతకం, 800 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించారు.

England clean sweep8
ఇంగ్లండ్‌ ‘క్లీన్‌స్వీప్‌’

పల్లెకెలె: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఇంగ్లండ్‌ జట్టు... శ్రీలంకపై టి20 సిరీస్‌ను ‘క్లీన్‌ స్వీప్‌’ చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఆఖరి టి20లో ఇంగ్లండ్‌ 12 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. ఈ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌... టి20 సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. సామ్‌ కరన్‌ (48 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీతో రాణించగా... జోస్‌ బట్లర్‌ (25), లియామ్‌ డాసన్‌ (14) మాత్రమే రెండంకెల స్కరు చేశారు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (4), బెన్‌ డకెట్‌ (0), జాకబ్‌ బెథెల్‌ (3), టామ్‌ బాంటన్‌ (7), విల్‌ జాక్స్‌ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దుశ్మంత చమీరా 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... పతిరణకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో లంక 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. నిషాంక (23), కుషాల్‌ మెండిస్‌ (26) కాస్తా పోరాడగా... తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బెథెల్‌ 4, జాక్స్‌ 3 వికెట్లు పడగొట్టారు. సామ్‌ కరన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

40 Indian origin cricketers in the T20 World Cup9
మెరుపుల పండక్కి భారత సంతతి!

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌లో ఒక్కో జట్టు నుంచి 11 మంది ప్లేయర్లు మాత్రమే మైదానంలో అడుగు పెడతారు. కానీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌లో మాత్రం లెక్కకు మిక్కిలి భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. అదేంటి ఏ జట్టుకైనా ఒకటే నిబంధన కదా అనే అనుమానం రాకమానదు. ఇక్కడే అసలు మెలిక ఉంది. టీమిండియా తరఫున ఆడేది పదకొండు మందే... కానీ, ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతున్న 20 జట్లలో భారత్‌తో పాటు మరో తొమ్మిది జట్ల తరఫున మనదేశ సంతతి ఆటగాళ్లు ఆడనున్నారు. రెండోసారి టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన కెనడా జట్టులో అత్యధికంగా 11 మంది భారత సంతతి ప్లేయర్లు ఉండగా... అమెరికా జట్టులో 9 మంది మనవాళ్లు ఉన్నారు. ప్రవాస భారతీయులు అధికంగా ఉండే ఒమన్, యూఏఈ నుంచి ఏడుగురు చొప్పున మన మూలాలున్న ప్లేయర్లు వరల్డ్‌కప్‌ ఆడనుండగా... ఇష్‌ సోధి, రచిన్‌ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్‌ నుంచి ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇటలీ, నెదర్లాండ్స్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున వరల్డ్‌కప్‌లో ఆడనున్నారు. ఇందులో కెనడా, అమెరికా, ఒమన్‌ జాతీయ జట్లకు సారథ్యం వహిస్తుంది కూడా మనవాళ్లే కావడం విశేషం. మరో మూడు రోజుల్లో టి20 వరల్డ్‌కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి ఆటగాళ్లపై ఓ కన్నేద్దాం! పాకిస్తాన్‌ పనిపట్టి... సౌరభ్‌ నేత్రావల్కర్‌... ఈ పేరు గత టి20 ప్రపంచకప్‌ సమయంలో బాగా వినిపించింది. అమెరికా వేదికగా జరిగిన ఆ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ను అమెరికా ఓడించడంలో ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కీలక పాత్ర పోషించాడు. గ్రూప్‌ దశలో పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగిన పోరులో స్కోర్లు సమం కాగా... సూపర్‌ ఓవర్‌లో బౌలింగ్‌ చేసిన నేత్రావల్కర్‌... పాక్‌ బ్యాటర్లను కట్టడి చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లోనూ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులకే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముంబైలో పుట్టి పెరిగి... ఒకప్పుడు అండర్‌–19 స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సౌరభ్‌ ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. లెఫ్టార్మ్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌తో రాణించి అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత వరల్డ్‌కప్‌లో అమెరికా జట్టు ‘సూపర్‌–8’ దశకు చేరడంతో కీలకంగా వ్యవహరించిన 34 ఏళ్ల సౌరభ్‌... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి సెలవు పెట్టి మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఒకప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి మ్యాచ్‌లు ఆడిన సౌరభ్‌ ఈ శనివారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా అతడికి ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ‘ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. కానీ, ఇది చాలా భావోద్వేగ క్షణం. జీవితం ఒక చక్రం లాంటిది. నేను ఇక్కడే క్రికెట్‌ ఆడటం ప్రారంభించా... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడే టీమిండియతో మ్యాచ్‌ ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు’ అని నేత్రావల్కర్‌ అన్నాడు. మోనాంక్‌ పటేల్‌ భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి ఒకప్పుడు మ్యాచ్‌లు ఆడిన మోనాంక్‌ పటేల్‌... ప్రస్తుతం అమెరికా జట్టుకు కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌నకు సిద్ధమయ్యాడు. 2024 టి20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో పోరులో చక్కటి అర్ధశతకంతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన మోనాంక్‌... ఈసారి కూడా మెగా టోర్నీలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. గుజరాత్‌లో పుట్టి పెరిగిన 32 ఏళ్ల మోనాంక్‌... అండర్‌–19 స్థాయిలో బుమ్రాతో మ్యాచ్‌లు ఆడాడు. ‘మేమిద్దరం చిన్నప్పుడు కలిసి మ్యాచ్‌లు ఆడాం. ఆ తర్వాత ఇద్దరి దారులు వేరయ్యాయి. బుమ్రా ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ స్థాయికి ఎదిగాడు. టీమిండియాతో మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం అని తెలుసు. మా వరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని అనుకుంటున్నాం’ అని మోనాంక్‌ అన్నాడు. జస్‌ప్రీత్‌ సింగ్‌ మొదటిసారి ఐసీసీ టి20 ప్రపంచకప్‌ ఆడనున్న ఇటలీ జట్టులో పంజాబ్‌లో పుట్టి పెరిగిన జస్‌ప్రీత్‌ సింగ్‌ చోటు దక్కించుకున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం మెరుగైన జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్‌ప్రీత్‌... అక్కడ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూనే క్రికెట్‌ కొనసాగించాడు. తన ప్రదర్శనతో జాతీయ జట్టుకు ఎంపికైన 32 ఏళ్ల జస్‌ప్రీత్‌... వరల్డ్‌కప్‌ కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు. ఆర్యన్‌ దత్‌ ఇప్పటికే 2023 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా నెదర్లాండ్స్‌ తరఫున భారత్‌లో మ్యాచ్‌లాడిన ఆర్యన్‌ దత్‌... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్‌నకు సిద్ధమవుతున్నాడు. 22 ఏళ్ల ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ భారత్‌లో పుట్టకపోయినా... అతడి తల్లిదండ్రులది పంజాబే. మెరుగైన జీవనోపాధి కోసం ఆర్యన్‌ కుటుంబం నెదర్లాండ్స్‌కు వలస వెళ్లగా... అక్కడ తన స్పిన్‌తో సత్తాచాటిన ఆర్యన్‌ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దిల్‌ప్రీత్‌ బాజ్వా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగనున్న కెనడా జట్టయితే పూర్తిగా భాతర సంతతి ఆటగాళ్లతో నిండి ఉంది. ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్న దిల్‌ప్రీత్‌ బాజ్వా ఇటీవలే కెనడాకు వలస వెళ్లాడు. అనతి కాలంలోనే తన ప్రతిభతో అక్కడి జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్‌ప్రీత్‌... కెనడా గ్లోబల్‌ టి20 లీగ్‌లో విజృంభించి వెలుగులోకి వచ్చాడు. జతిందర్‌ సింగ్‌ పంజాబ్‌లోని లుధియానాలో పుట్టి పెరిగిన జతిందర్‌ సింగ్‌... ఈ ప్రపంచకప్‌లో ఒమన్‌ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దశాబ్దానికి పైగా భారత దేశవాళీల్లో ఆడిన 36 ఏళ్ల జతిందర్‌... అవకాశాలు రాకపోవడంతో ఒమన్‌కు వలసవెళ్లి ఆ దేశ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు వినాయక్‌ శుక్లా, కరణ్‌ సోనావాలె, జై, ఆశిష్, వసీం, జితేన్‌ రామనంది ఇలా ఏడుగురు భారత సంతతి ఆటగాళ్లు ఒమన్‌ తరఫున బరిలోకి దిగనున్నారు. టి20 ప్రపంచకప్‌లో భారత సంతతి ఆటగాళ్లు కెనడా (11): దిల్‌ప్రీత్‌ బాజ్వా (కెప్టెన్ ), అజయ్‌వీర్‌ హుండల్, అంశ్‌ పటేల్, హర్ష్ థాకెర్, జస్‌కరణ్‌దీప్‌ బుట్టర్, కన్వర్‌పాల్‌ తత్ఘుర్, నవ్‌నీత్‌ ధలీవాల్, రవీందర్‌పాల్‌ సింగ్, శివం శర్మ, శ్రేయస్‌ మొవ్వ, యువరాజ్‌ సామ్రా. అమెరికా (9): మోనాంక్‌ పటేల్‌ (కెప్టెన్ ), జెస్సీ సింగ్, మిలింద్‌ కుమార్, నోస్తుష్‌ కెంజిగె, సాయితేజ ముక్కామల, సంజయ్‌ కృష్ణమూర్తి, హర్మీత్‌ సింగ్, సౌరభ్‌ నేత్రావల్కర్, శుభం రంజనె. ఒమన్‌ (7): జతిందర్‌ సింగ్‌ (కెప్టెన్‌), వినాయక్‌ శుక్లా, కరణ్‌ సోనావాలె, జై ఒడెద్రా, ఆశిష్‌ ఒడెద్రా, వసీం అలీ, జితేన్‌ రామనంది. యూఏఈ (7): అలీషాన్‌ షరాఫు, ఆర్యాంశ్‌ శర్మ, ధ్రువ్‌ పరాశర్, హర్షిత్‌ కౌశిక్, మయాంక్‌ కుమార్, సిమ్రన్‌జీత్‌ సింగ్, సొహైబ్‌ ఖాన్‌. న్యూజిలాండ్‌ (2): ఇష్‌ సోధి, రచిన్‌ రవీంద్ర దక్షిణాఫ్రికా (1): కేశవ్‌ మహరాజ్‌ వెస్టిండీస్‌ (1): గుడకేశ్‌ మోతీ ఇటలీ (1): జస్‌ప్రీత్‌ సింగ్‌ నెదర్లాండ్స్‌ (1): ఆర్యన్‌ దత్‌ తెలుగువాళ్లు కూడా...అమెరికా తరఫున ఆడుతున్న ముక్కామల సాయితేజ రెడ్డి... కెనడా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రేయస్‌ మొవ్వ తెలుగు మూలాలున్న ఆటగాళ్లే. అమెరికాలోనే పుట్టి పెరిగిన సాయితేజ రెడ్డి అమెరికా జాతీయ జట్టు ఓపెనర్‌గా 37 వన్డేలు, 18 టి20లు ఆడాడు. మంచి స్ట్రయిక్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయితేజ... ఈ మెగాటోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. భారత్‌లో పుట్టి కెనడాకు వలస వెళ్లిన శ్రేయస్‌ మొవ్వ ఆ దేశ జట్టు తరఫున ఇప్పటి వరకు 24 వన్డేలు, 24 టి20లు ఆడాడు.

Pro Wrestling League champions Haryana Thunders10
చాంపియన్‌ హరియాణా థండర్స్‌

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్ల్యూఎల్‌)లో హరియాణా థండర్స్‌ జట్టు వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో హరియాణా 5–4 పాయింట్ల తేడాతో ఢిల్లీ దంగల్‌ వారియర్స్‌పై గెలిచింది. ఇప్పటి వరకు ఈ లీగ్‌ ఐదుసార్లు నిర్వహించగా... అందులో హరియాణా జట్టు రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. చివరగా 2019లో జరిగిన లీగ్‌లో హరియాణా జట్టు టైటిల్‌ నెగ్గింది. తాజా లీగ్‌లో హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఎనిమిది బౌట్‌లు ముగిసేసరికి ఇరు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. చివరగా జరిగిన మహిళల 62 కేజీల పోరులో పారిస్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత ఇరినా కొలియాడెన్కో ఒత్తిడిని అధిగమిస్తూ... అంజలిని చిత్తుచేసింది. దీంతో హరియాణా థండర్స్‌ విజేతగా నిలిచింది. అంతకుముందు పురుషుల 74 కేజీల విభాగంలో జరిగిన తొలి బౌట్‌లో బైరమోవ్‌ (ఢిల్లీ) 8–2తో ప్రవిందర్‌ (హరియాణా)పై... రెండో బౌట్‌గా జరిగిన మహిళల 76 కేజీల పోరులో కాజల్‌ (హరియాణా) 3–1తో అనస్తసియా అల్పియోవా (ఢిల్లీ)పై... మూడో బౌట్‌ పురుషుల 65 కేజీల ఈవెంట్‌లో సుజీత్‌ కల్కల్‌ (ఢిల్లీ) 8–6తో తుముర్‌ ఒచిర్‌ తుల్గా (హరియాణా)పై... నాలుగో బౌట్‌ మహిళల 53 కేజీల పోరులో యీ సుసకీ (హరియాణా) 5–0తో సారిక (ఢిల్లీ)పై... ఐదో బౌట్‌ పురుషుల 86 కేజీల విభాగంలో హాది భక్తియార్‌ 11–0తో అశిరోవ్‌ అష్రఫ్‌ (హరియాణా)పై... ఆరో బౌట్‌ పురుషుల 57 కేజీల పోరులో అక్షయ్‌ ఢేరె (హరియాణా) 16–0తో అమిత్‌ (ఢిల్లీ)పై... ఏడో బౌట్‌గా జరిగిన పురుషుల 125 కేజీల పోరులో రోనక్‌ 12–1తో అనిరుధ్‌ (హరియాణా)పై గెలిచారు.ఎనిమిదో బౌట్‌ మహళల 57 కేజీల విభాగంలో నేహ (హరియాణా) 8–2తో అంజలి (ఢిల్లీ)పై గెలిచారు. ఢిల్లీ దంగల్‌ వారియర్స్‌కు చెందిన యువ రెజ్లర్‌ తురాన్‌ బైరమోవ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డు దక్కించుకున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో పోటీపడిన అతడు... ఆడిన ఏడు బౌట్‌లలోనూ విజయాలు సాధించడం విశేషం. హరియాణా థండర్స్‌ రెజ్లర్‌ నేహా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ... ఢిల్లీ దంగల్‌ వారియర్స్‌కు చెందిన రోనక్‌ (125 కేజీలు) ‘ఫైటర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నారు. పంజాబ్‌ రాయల్స్‌కు చెందిన చంద్రమోహన్‌ లీగ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన రెజ్లర్‌గా నిలిచాడు. హరియాణా థండర్స్‌కు చెందిన అక్షయ్‌ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్నాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement