Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: Tilak Varmas fiery knocks guide Team India to 256 runs1
తిల‌క్ వ‌ర్మ మెరుపులు.. కేవ‌లం 16 బంతుల్లోనే

టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో టీమిండియా యువ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ కీల‌క మ్యాచ్‌లో త‌న ఫామ్‌ను అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న సూప‌ర్‌-8లో తిల‌క్ విధ్వంసం సృష్టించాడు.ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ హైదరాబాదీ హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా(50 నాటౌట్‌), అభిషేక్ శర్మ(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో మోపోసా,నగరవా, ముజర్బానీ తలా వికెట​ సాధించారు. అయితే సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగడం విశేషం.

T20 WC IND vs ZIM: Abhishek Hardik Tilak Shines IND Huge Score2
IND vs ZIM: హార్దిక్‌, తిలక్‌ విధ్వంసం.. భారత్‌ భారీ స్కోరు

జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించింది. బ్యాటర్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్‌-8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక గెలవాల్సిన పరిస్థితి.అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీఇలాంటి దశలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో సంజూ శాంసన్‌ (24) నిరాశపరచగా.. అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 55) చాన్నాళ్ల తర్వాత బ్యాట్‌ ఝులిపించాడు. అభి అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) 24 బంతుల్లో 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.హార్దిక్‌, తిలక్‌ విధ్వంసంకెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపులు (13 బంతుల్లో 33) మెరిపించగా.. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), తిలక్‌ వర్మ దంచికొట్టారు. హార్దిక్‌ 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులతో అజేయంగా నిలవగా.. తిలక్‌ వర్మ 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హార్దిక్‌ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ ముగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గర్వ, బ్లెసింగ్‌ ముజర్‌బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్‌ సికందర్‌ రజా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.రికార్డు స్కోరుకాగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగానూ భారత్‌ నిలిచింది. తాజాగా భారత్‌ జింబాబ్వేతో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 2007లో శ్రీలంక కెన్యా మీద ఆరు వికెట్ల నష్టానికి 260 రన్స్‌ రాబట్టింది.చదవండి: T20 WC: మారవా?.. సంజూ శాంసన్‌ విఫలం𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026

Gambhir Shocked As Samson Announces Chepauk Arrival With Kohlis Famous MCG Six3
కోహ్లి స్టైల్లో సిక్స్ కొట్టిన సంజూ.. గంభీర్ రియాక్ష‌న్ వైర‌ల్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేక‌పోయాడు. చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న సూప‌ర్-8 మ్యాచ్‌లో శాంస‌న్‌కు తుది జ‌ట్టులో ద‌క్కింది.టీమ్ మెనెజ్‌మెంట్ అత‌డిని ఓపెన‌ర్‌గా పంపింది. అయితే సంజూ క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. 15 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్స్‌ల‌తో 24 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయితే భార‌త స్కోరు బోర్డు ఖాతాను సంజూ భారీ సిక్స‌ర్‌తో తెరిచాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా శాంసన్ ఒక అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ షాట్‌కు మైదానంలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రూ ఫిదా అయిపోయారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ షాట్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ షాట్ 2022 టీ20 ప్రపంచకప్‌లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన ఐకానిక్ సిక్సర్‌ను గుర్తుకు తెచ్చిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో భార‌త్ భారీ స్కోర్ దిశ‌గా దూసుకుపోతుంది. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి టీమిండియా 3 వికెట్ల న‌ష్టానికి 161 ప‌రుగులు చేసింది.𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026

T20 WC IND vs ZIM: Abhishek Sharma Slams 26 Ball Maiden WC Fifty4
వరుస ఫెయిల్యూర్స్‌ తర్వాత.. ఎట్టకేలకు

టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌లో ఈ లెఫ్టాండర్‌ బ్యాట్‌ ఝులిపించాడు. ఇరవై ఆరు బంతుల్లోనే అర్ధ శతకం బాది సత్తా చాటాడు.ఆది నుంచి దారుణంగా విఫలంటీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అభిషేక్‌ శర్మ ఆది నుంచి దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత కడుపు నొప్పి వల్ల నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూఅనంతరం జట్టులోకి తిరిగి వచ్చిన అభిషేక్‌ శర్మ పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లతో మ్యాచ్‌లలోనూ డకౌట్‌ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం జట్టులో కొనసాగించగా.. సూపర్‌-8లో తొలుత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.దీంతో అభిషేక్‌ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తుదిజట్టు నుంచి తప్పించి.. అతడికి కాస్త బ్రేక్‌ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.A well-constructed half-century for #AbhishekSharma! 👏His first in the ICC Men’s T20 World Cup and what an occasion to bring it up! 💙ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/vIVUWHYhSe— Star Sports (@StarSportsIndia) February 26, 2026అర్ధ శతకంతోజింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ.. ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా కెరీర్‌లో తొలి వరల్డ్‌కప్‌ ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్‌కు.. ఐసీసీ ఈవెంట్‌లో ఇదే తొలి ఫిఫ్టీ కావడం విశేషం. అయితే, మపోసా బౌలింగ్‌లో సికందర్‌ రజాకు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా 16, తిలక్‌ వర్మ 11 పరుగులతో క్రీజులో నిలిచారు. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ 24, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ 38 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య 13 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

T20 WC IND vs ZIM: Sanju Samson Fails Again Fans Slams Him5
T20 WC: మారవా?.. సంజూ శాంసన్‌ విఫలం

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ లీగ్‌ దశలో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు సంజూ శాంసన్‌. నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్‌ శర్మ దూరం కావడంతో.. ఓపెనర్‌గా అతడి స్థానంలో వచ్చాడు. పసికూనతో మ్యాచ్‌లో ఎనిమిది బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్‌ జోడీలో ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) మెరుగ్గా ఆడగా.. అభిషేక్‌ శర్మ లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్‌ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం అతడిని కొనసాగించింది. సంజూను బెంచ్‌కు పరిమితం చేసింది.మరో అవకాశంఅయితే, తాజాగా జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌ సందర్భంగా మరోసారి సంజూ శాంసన్‌కు మేనేజ్‌మెంట్‌ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లెఫ్టాండర్‌ అభిషేక్‌ శర్మతో కలిసి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ గురువారం భారత జట్టు ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. 𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026ఘనంగానే ఆరంభించాడు.. కానీఇన్నింగ్స్‌ రెండో బంతికే సిక్స్‌ బాది ఘనంగా ఆరంభించాడు సంజూ. రెండో ఓవర్లోనూ ఓ సిక్సర్‌ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ రాబట్టాడు. ఇలా మంచి ఫామ్‌లోకి వచ్చిన సంజూ.. నాలుగో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.బ్లెసింగ్‌ ముజర్‌బానీ సంధించిన షార్ట్‌ బాల్‌ను సంజూ గాల్లోకి లేపగా.. డీప్‌ మిడ్‌ వికెట్‌ నుంచి పరిగెత్తుకు వచ్చి ర్యాన్‌ బర్ల్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఫలితంగా సంజూ శాంసన్‌ పెవిలిన్‌ చేరగా.. భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మారవా సంజూ!జింబాబ్వేతో మ్యాచ్‌లో మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు బాది 24 పరుగులు చేయగలిగాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిమానులు ఉసూరుమంటున్నారు.ఇక తుదిజట్టులో సంజూను చూడటం కష్టమేనని వాపోతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సంజూ వరుసగా విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్‌ భర్తీ చేశాడు. ఇక జింబాబ్వేతో మ్యాచ్‌తో సంజూ తిరిగి రాగా.. ఇషాన్‌ వన్‌డౌన్‌లో దిగాడు. పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు: 80-1(6). ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి ఇషాన్‌ 15, అభిషేక్‌ శర్మ 33 పరుగులతో క్రీజులో నిలిచారు. చెన్నై వేదికగా టాస్‌ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

T20 WC 2026: Ind vs Zim toss and Playing 11 details6
జింబాబ్వేతో మ్యాచ్‌.. భారత తుదిజట్టులో రెండు మార్పులు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 సూప‌ర్‌-8లో భాగంగా చెన్నై వేదిక‌గా భార‌త్, జింబాబ్వే జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ కీల‌క మ్యాచ్‌లో భార‌త్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది.వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, రింకూ సింగ్ స్ధానంలో అక్ష‌ర్ ప‌టేల్‌, సంజూ శాంస‌న్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. అభిషేక్‌, సంజూ క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నున్నారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. క్రీమ‌ర్ స్థానంలో టినోటెండా మాపోసాకు చోటు ద‌క్కింది.తుది జ‌ట్లుజింబాబ్వే: తడివానాషే మారుమణి(వికెట్ కీప‌ర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్‌), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవభారత్: సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్ర‌వ‌ర్తి, జస్ప్రీత్ బుమ్రా

T20 WC: South Africa Beat West Indies By 9 Wickets Big Boost For India7
సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సూపర్‌-8 దశలో సౌతాఫ్రికా మరో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియాను 76 పరుగులతో చిత్తు చేసిన సఫారీలు.. తాజాగా వెస్టిండీస్‌ను కూడా చిత్తు చేశారు. తద్వారా సెమీ ఫైనల్‌ రేసులో ప్రొటిస్‌ జట్టు ముందుకు దూసుకుపోయింది. అంతేకాదు టీమిండియా సెమీస్‌ ఆశలను కూడా సజీవం చేసింది.పోటీలో నాలుగుసూపర్‌-8 దశలో గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా, టీమిండియా, వెస్టిండీస్‌, జింబాబ్వే బరిలో నిలిచాయి. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా- టీమిండియా తలపడగా.. మార్క్రమ్‌ బృందం సూర్యకుమార్‌ సేనను చిత్తుగా ఓడించింది. దీంతో భారత జట్టు సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.మరోవైపు.. వెస్టిండీస్‌ తమ తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై ఏకంగా 107 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా రెండు పాయింట్లతో పాటు నెట్‌రన్‌రేటు పరంగా పటిష్ట స్థితిలో నిలిచింది. ఇలాంటి తరుణంలో సౌతాఫ్రికా విండీస్‌ను ఓడిస్తేనే టీమిండియా సెమీస్‌ అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి.టీమిండియాకు సానుకూలాంశంఈ నేపథ్యంలో గురువారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా విండీస్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేయడం.. టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. అహ్మదాబాద్‌ వేదికగా టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.నిప్పులు చెరిగిన బౌలర్లుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. విండీస్‌ బ్యాటర్లలో జేసన్‌ హోల్డర్‌ (49), రొమారియో షెఫర్డ్‌ (52 నాటౌట్‌) రాణించారు. ప్రొటిస్‌ బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, కార్బిన్‌ బాష్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.మార్క్రమ్‌ ధనాధన్‌ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 16.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో క్వింటన్‌ డికాక్‌ (24 బంతుల్లో 47) ఫర్వాలేదనిపించగా.. ఐడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 46 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్‌.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.మార్క్రమ్‌కు తోడుగా ర్యాన్‌ రికెల్టన్‌ (28 బంతుల్లో 45 నాటౌట్‌) రాణించాడు. వీరిద్దరు కలిసి 49 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. కాగా ఇప్పటికే సూపర్‌-8లో రెండు గెలిచిన సౌతాఫ్రికా తదుపరి జింబాబ్వేపై కూడా గెలవాలి.అదే విధంగా టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌ జట్లపై తప్పక విజయం సాధించాలి. అలా అయితేనే నెట్‌రన్‌రేటు లెక్కలతో పనిలేకుండా టీమిండియాకు సెమీస్‌ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.Is there anything that can stop #AidenMarkram today?! 🤯He is now the highest run-scorer for South Africa in ICC Men’s T20 World Cup history! 🚨ICC Men’s #T20WorldCup | Super 8 #WIvSA | LIVE NOW 👉 https://t.co/IaEbZJRFNR pic.twitter.com/qPhp9R82bA— Star Sports (@StarSportsIndia) February 26, 2026వెస్టిండీస్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా స్కోర్లువెస్టిండీస్‌: 176/8(20)సౌతాఫ్రికా: 177/1(16.1)ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

Ranji Trophy Final Day 3: Karnataka trail by 364 runs8
క‌ర్ణాట‌క‌కు చుక్క‌లు చూపిస్తున్న జ‌మ్మూ అండ్ కాశ్మీర్‌

హుబ్లీ వేదిక‌గా జ‌రుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైన‌ల్లో కర్ణాటకపై జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే స‌మయానికి క‌ర్ణాట‌క త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది.మయాంక్ అగ‌ర్వాల్‌(130 బ్యాటింగ్‌) సెంచ‌రీతో క‌దం తొక్క‌గా.. మిగితా బ్యాట‌ర్లంతా విఫ‌ల‌మ‌య్యారు. కెప్టెన్ దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ 11 ప‌రుగులు చేయ‌గా.. సీనియ‌ర్ బ్యాట‌ర్లు స్మరన్ రవిచంద్రన్, క‌రుణ్ నాయ‌ర్ ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియన్‌కు చేరారు. జ‌మ్మూ కాశ్మీర్ బౌలర్ల‌లో అకిబ్ నబీ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. యుద్ద్‌వీర్ సింగ్, సునీల్ కుమార్ త‌లా వికెట్ సాధించారు. ప్ర‌స్తుతం క్రీజులో అగ‌ర్వాల్‌తో పాటు కృతిక్ కృష్ణ(27) ఉన్నారు. క‌ర్ణాట‌క ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో జ‌మ్మూ కంటే 364 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది.అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన జ‌మ్మూ అండ్ కాశ్మీర్ 584 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. జ‌మ్మూ బ్యాట‌ర్ల‌లో దాదాపు ఆరుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం విశేషం. శుభమ్ పుందిర్ 121 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. యావర్ హసన్(88), పారస్ డోగ్రా(70), కన్హయ్య వధావన్( 70 పరుగులు) రాణించారు. ఒక‌వేళ ఈ మ్యాచ్ డ్రా అయితే మొదటి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు సాధిస్తుందో వారికే టైటిల్ దక్కుతుంది.

Vaibhav Sooryavanshi Slams 14 ball Fifty In DY Patil T20 20269
వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

భారత యువ క్రికెట్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్‌-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే తన బ్యాట్‌ పవర్‌ ఏమిటో ఇంకోసారి చాటిచెప్పాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌ 2026 టోర్నీలో భాగంగా ఈ బిహారీ పిల్లాడు.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.డీవై పాటిల్‌ బ్లూ జట్టుకు ప్రాతినిథ్యంముంబై వేదికగా జరిగే ఈ టీ20 లీగ్‌లో డీవై పాటిల్‌ బ్లూ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. గురువారం నాటి మ్యాచ్‌లో ఇండియన్‌ నావీ జట్టుపై చితక్కొట్టాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. మొత్తంగా 19 బంతుల్లో 63 పరుగులు సాధించాడు.వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసంవైభవ్‌ సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. వరుణ్‌ చౌదరి బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వైభవ్‌ 20 పరుగులు పిండుకోవడం మరో హైలైట్‌. ఇక వైభవ్‌తో పాటు అర్జున్‌ టెండుల్కర్‌ సైతం అద్భుత అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 55 పరుగులు సాధించాడు.దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌వైభవ్‌, అర్జున్‌ ధనాధన్‌ దంచికొట్టడంతో డీవై పాటిల్‌ బ్లూ జట్టు ఇండియన్‌ నేవీ జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా డీవై పాటిల్‌ బ్లూ జట్టుకు శశాంక్‌ సింగ్‌ (Shashank Singh) కెప్టెన్‌గా ఉండగా.. ఐపీఎల్‌ స్టార్లు యశ్‌ ధుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, జితేశ్‌ శర్మ, మయాంక్‌ యాదవ్‌ కూడా జట్టులో భాగంగా ఉన్నారు.Arjun Tendulkar hitting sixes for fun in the DY Patil tournament.He can give finishing touches for LSG in IPL.After coming to LSG , he becomes a different beast 🥵 pic.twitter.com/hwHTiQwaQz— Rupesh Kumar (@drona_17) February 26, 2026కాగా వైభవ్‌ సూర్యవంశీ ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున చివరగా వరల్డ్‌కప్‌ బరిలో దిగిన ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ఇంగ్లండ్‌తో ఫైనల్లో భారీ శతకం (80 బంతుల్లో 175) బాది భారత్‌కు టైటిల్‌ అందించాడు. ప్రస్తుతం డీవై పాటిల్‌ టీ20 కప్‌ టోర్నీతో బిజీగా ఉన్న వైభవ్‌.. తదుపరి ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలో దిగుతాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 22న నవీ ముంబైలో మొదలైన డీవై పాటిల్‌ టీ20 కప్‌ 2026.. మార్చి 6న ఫైనల్‌తో ముగియనుంది. ఇందులో 16 జట్లు భాగంగా ఉన్నాయి.చదవండి: కెప్టెన్‌గా సూపర్‌ హిట్‌!.. భారీ షాకిచ్చిన బీసీసీఐ!

Give Abhishek Sharma break, try Sanju Samson: Sehwags advice to Gambhir for IND vs ZIM match10
అత‌డికి బ్రేక్ ఇవ్వండి.. సంజూను జ‌ట్టులోకి తీసుకోండి: వీరేంద్ర సెహ్వాగ్

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. గురువారం చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. సెమీస్ రేసులో నిల‌వాలంటే సూర్య సేన‌ క‌చ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్‌కు టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కీల‌క సూచ‌న చేశాడు. ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న అభిషేక్ శ‌ర్మ‌ను త‌ప్పించి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ మెగా టోర్నీలో అభిషేక్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 4 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అందులో మూడు డ‌కౌట్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించాల‌ని ప‌లువురు మాజీలు సూచిస్తున్నారు."నేను గ‌నుక టీమ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఉంటే, అభిషేక్‌కు విశ్రాంతి ఇచ్చే వాడిని. అత‌డి స్ధానంలో సంజూ శాంస‌న్‌ను అవకాశ‌మిస్తాను. ఏదైనా ప్ర‌య‌త్నం చేయాలంటే ఈ మ్యాచ్‌లోనే చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోతే, టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తారు. ఇది చాలా కీల‌కమైన మ్యాచ్‌. కాబట్టి ఆట‌గాళ్ల ఫామ్ ఆధారంగా భా తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలి.తుది జ‌ట్టు ఎంపిక‌లో మార్పులు క‌చ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. భార‌త్ స‌రైన వ్యూహాల‌తో బ‌రిలోకి దిగుతోంది. కానీ వాటిని అమ‌లు చేయ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌వుతోంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌మ వ్యూహాల‌కు మ‌రింత ప‌దును పెట్టే అవ‌కాశ‌ముంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇద్దరూ మంచి ఫామ్‌లో లేర‌న్న విష‌యం మెనెజ్‌మెంట్ గుర్తుంచుకోవాలి" అని క్రిక్‌బ‌జ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement