ప్రధాన వార్తలు
‘ఎందుకంత ద్వేషం.. నేను ఆడడం ఇష్టం లేదా?’
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 65 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమిపాలైంది. అయితే మ్యాచ్లో కెప్టెన్ రహానే 10 బంతులాడి 8 పరుగులే చేయడం విమర్శలకు దారి తీసింది. అయితే రహానే మాత్రం తనపై వచ్చిన విమర్శలకు ధీటుగానే బదులిచ్చాడు. తన సక్సెస్ను చూడలేకనే కొంతమంది తన స్ట్రైక్రేట్ విషయంలో ఒక అజెండాతో విమర్శలు చేస్తున్నారని రహానే తెలిపాడు. కేవలం ఒక్క మ్యాచ్లో విఫలం కావడంతోనే విమర్శలు చేయడం సరికాదన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కేకేఆర్(KKR) కెప్టెన్ రహానే మీడియాతో మాట్లాడాడు.‘2023 నుంచి నా బ్యాటింగ్ స్ట్రైక్రేట్ అత్యుత్తమంగా ఉందని నేను భావిస్తున్నా. అయితే నా బ్యాటింగ్ స్ట్రైక్రేట్ గురించి మాట్లాడుతున్న వారంతా బహుశా నా ఆటను చూడకపోవచ్చు లేదంటే ఒక అజెండాతో నాపై నెగెటివ్ వ్యాఖ్యలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నార నిపిస్తుంది. వాస్తవానికి నేను ఆడడం వారికి ఇష్టం లేదనుకుంటా. అందుకే నా ఆటను చూసేందుకు ఇష్టపడడం లేదు. నా సక్సెస్ చూసి వారికి అసూయ కలిగినట్లు అనిపిస్తోంది. కేవలం ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే చూసి నేను సరిగ్గా ఆడడం లేదని పేర్కొనడం తగదు. అజింక్యా రహానే ఆటను మార్చుకున్నాడంటే అస్సలు సహించడం లేదు. అంతిమంగా రహానే గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. అది పాజిటివ్ లేదా నెగెటివ్ కావచ్చు. ఏదైనా సరే నేనేమీ మాట్లాడుకుండా వారిని అడ్డుకోను.’అని చెప్పుకొచ్చాడు.కాగా అజింక్యా రహానే 2023లో చెన్నై సూపర్కింగ్స్లో చేరిన తర్వాత తన ఆటను పూర్తిగా మార్చుకున్నాడు. హిట్టింగ్కు అధిక ప్రాధాన్య మిచ్చిన రహానే ఆ సీజన్లో సీఎస్కే తరఫున 172.49 స్ట్రైక్రేట్తో 326 పరుగులు చేశాడు. ఆ సీజన్లో చెన్నై టైటిల్ కొట్టడంలోనూ రహానే ఓపెనింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. అయితే 2024 సీజన్ రహానేకు అంతగా కలిసిరాలేదు. 2024లో రహానే 123.47 స్ట్రైక్రేట్తో 242 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రహానేను సీఎస్కే విడుదల చేయడంతో 2025 సీజన్కు ముందు అతడిని కేకేఆర్ కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. ఐపీఎల్ 18వ సీజన్లో రహానే మరోసారి మెరిశాడు. కెప్టెన్గానే గాక బ్యాటర్గా 13 మ్యాచ్ల్లో 147 స్ట్రైక్రేట్తో 390 పరుగులు సాధించి కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. 2026 ఐపీఎల్ సీజన్ను కూడా రహానే మంచి ఈజ్తో ప్రారంభించాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లోనే అర్థసెంచరీ సాధించి తన విలువను చాటిచెప్పాడు.Ajinkya Rahane did not hold back in the post-match press conference 😮#KKRvsSRH #IPL2026 pic.twitter.com/b9IxVcrQJZ— Cricbuzz (@cricbuzz) April 2, 2026చదవండి: కపిల్, ధోనీలకు యువరాజ్ క్షమాపణ!
మొయిన్ అలీతో డేవిడ్ వార్నర్ గొడవ?
ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ‘‘మీ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు భాయ్’’ అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..హాఫ్ సెంచరీడేవిడ్ వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో బిజీగా ఉన్నాడు. కరాచీ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రావల్పిండిజ్తో గురువారం జరిగిన మ్యాచ్లో ధనాధన్ దంచికొట్టాడు. ఓపెనర్గా వచ్చిన వార్నర్ 36 బంతుల్లో 50 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. అతడికి తోడు ఆజం ఖాన్ (34 బంతుల్లో 74) రాణించడంతో కరాచీ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.మొయిన్ అలీతో గొడవ?ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం డేవిడ్ వార్నర్ సహచర ఆటగాడు మొయిన్ అలీతో సీరియస్గా ఏదో అన్నట్లు కనిపించింది. ఇంతలో కరాచీ టీమ్ డైరెక్టర్ హైదర్ అజర్ వచ్చాడు. వార్నర్ భుజంపై చెయ్యి వేసి సముదాయించే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. అతడి చేయిని తీసేసిన వార్నర్ పక్కకు వెళ్లమని సైగ చేశాడు.క్లారిటీ ఇచ్చిన వార్నర్ఆ తర్వాత మరోసారి హైదర్ వార్నర్ భుజాలపై చేయి వేసి నడిపించగా.. అటూ ఇటూ చూపిస్తూ వార్నర్ అతడికి ఏదో వివరించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. వార్నర్ తాజాగా స్పందించాడు. ‘‘ముందు వెళ్లి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయమని నేను హైదర్కు చెప్పాను’’ అని వార్నర్ స్పష్టం చేశాడు. తాను సరదాగా చేసిన పనిని అపార్థం చేసుకున్నారని పేర్కొన్నాడు.మరోవైపు.. హైదర్ అజర్ ఈ వైరల్ దృశ్యాలపై స్పందిస్తూ.. ‘‘ఇందులో నిజం లేదు. వాళ్లిద్దరు (వార్నర్, అలీ) నాతో మజాక్ చేస్తున్నారు అంతే’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత వీరు వివరణ ఇవ్వడం గమనార్హం.చదవండి: ముస్తాఫిజుర్ రహమాన్ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్ చైర్మన్I said to @HaiderAzhar to go first and shake hands 🤣🤣🤣 https://t.co/tiTbSjZIyG— David Warner (@davidwarner31) April 2, 2026
కపిల్, ధోనీలకు యువరాజ్ క్షమాపణ!
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు బహిరంగ క్షమాపణలు చెప్పడం ఆసక్తి కలిగించింది. తన తండ్రి యోగ్రాజ్ సింగ్ గతంలో ధోని, కపిల్ దేవ్ల గురించి ఆరోపణలు చేయడమే క్షమాపణకు కారణమని యువీ వెల్లడించాడు. కాగా యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని తండ్రి యోగ్రాజ్ పలు సందర్భాల్లో ధోనిపై ఆరోపణలు చేశారు. యువరాజ్కు కెప్టెన్సీ రాకపోవడానికి ప్రధాన కారణం ధోనినేని బహిరంగంగానే విమర్శలు చేయడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. తాజాగా యువరాజ్ ఒక పాడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ మాట్లాడుతూ.. 'నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను' అని అన్నారు. తన తండ్రి ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుందని అడగ్గా.. 'అది సరైంది కాదని మా నాన్నకు చెప్పాను' అని యువరాజ్ పేర్కొన్నాడు. కాగా యోగ్రాజ్ సింగ్ గతంలో కపిల్ దేవ్పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1980ల్లో తనను జట్టు నుంచి తొలగించినందుకు కపిల్ దేవ్ను చంపాలనుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 'కపిల్ దేవ్ కెప్టెన్ అయినప్పుడు నన్ను అనవసరంగా జట్టులోంచి తీసేశారు. అప్పట్లో నా పిస్టల్ తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లాను. అతని తల్లి అక్కడ ఉండటంతో వదిలేశాను. ఆ రోజే నేను క్రికెట్ ఆడకూడదని, నా కొడుకు యువీతో ఆడిస్తానని నిర్ణయించుకున్నాను' అని యోగ్ రాజ్ గతంలో గుర్తు చేసుకున్నారు.బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి వారు ఆటగాళ్లను సరిగ్గా గౌరవించలేదని, మన కెప్టెన్ల వల్లే జట్టు నాశనమైందని ఆయన బహిరంగంగా విమర్శలు చేసేవారు. అయితే తన తండ్రి చేస్తున్న ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యల పట్ల యువరాజ్ సింగ్ ఇప్పుడు క్షమాపణలు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.15 ఏళ్ల పాటు భారత క్రికెట్లో ప్రముఖ పాత్ర వహించిన యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ధోని కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచ్లు ఆడిన యువరాజ్కు నాయకత్వ బాధ్యతలు తీసుకునే అవకాశం రాలేదు. 2000లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన యువరాజ్ సింగ్ టీమిండియా తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లు ఆడాడు.చదవండి: ‘సిగ్గుపడుతున్నా.. అతడిపై నిషేధం విధించండి’Do tune in tomorrow as the Yuvraj Singh Podcast drops at 12 noon Friday on @sports_tak @YUVSTRONG12 pic.twitter.com/jGOZhiJBkz— Vikrant Gupta (@vikrantgupta73) April 2, 2026
బంగ్లా ప్లేయర్ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్ చైర్మన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన ఏకైక బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్. మాజీ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అతడిని రూ. 9.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కేకేఆర్ యాజమాన్యం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.బంగ్లాదేశ్ ఆటగాడిని వెంటనే ఐపీఎల్ నుంచి తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు తలొగ్గిన బీసీసీఐ.. ముస్తాఫిజుర్ రహమాన్ను రిలీజ్ చేయాల్సిందిగా కేకేఆర్ను ఆదేశించింది. దీంతో అతడు ఐపీఎల్కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు భారత్కు రాలేమంటూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచే తప్పుకొంది.దురదృష్టకరంఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ను తొలగించడంపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తొలిసారి స్పందించాడు. ఫైనాన్షియల్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘అదొక దురదృష్టకర సంఘటన అని చెప్పగలను. ఒక్కోసారి పరిస్థితులకు తగినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది.ఏదేమైనా ప్రభుత్వానికి క్రికెట్లో జోక్యం చేసుకోవాలనే ఆలోచన మాత్రం లేదు. ఎల్లవేళలా మాకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు కొన్నిసార్లు పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు.ఏది జరిగినా మన మంచికేపరిణామాలకు తగినట్లుగానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది జరిగినా మన మంచికే అన్న సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత ముస్తాఫిజుర్ రహమాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడేందుకు వెళ్లాడు. మరోవైపు.. పీఎస్ఎల్ను వీడి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ కేకేఆర్లో ముస్తాఫిజుర్ స్థానాన్ని భర్తీ చేశాడు.చదవండి: IPL 2026: ‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం!
MCA: లక్ష మంది తిలకించేలా క్రికెట్ స్టేడియం
ముంబై: పొరుగు రాష్ట్ర నగరం అహ్మదాబాద్లో ఉన్నట్లే ముంబైలోనూ లక్ష మంది ప్రేక్షకులు వీక్షించే భారీ స్టేడియం రూపకల్పనలో ముంబై క్రికెట్ సంఘం (MCA) నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలతో చర్చించినట్లు తెలిసింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ప్రతిపాదిత స్టేడియం నిర్మించేందుకు ఎంసీఏ కృషి చేస్తోంది. ఇందులో భాంగా గురువారం ఎంసీఏ చీఫ్ నాయక్... ముంబై సిటీ–మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (సీఐడీసీఓ) ఉన్నతాధికారులతో ఈ ప్రాజెక్ట్ విషయమై చర్చించారు. ప్రపంచ క్రీడాపటంలో‘ఎంసీఏ చొరవ మహారాష్ట్ర క్రీడా వ్యవస్థలో కీలక ఘట్టంగా నిలుస్తుంది. ఎంఎంఆర్ ప్రాంతంలో మేం ప్రతిపాదించిన ప్రాజెక్టు పూర్తయితే గనక కేవలం ముంబై క్రికెట్నే కాదు... ప్రపంచ క్రీడాపటంలో మహారాష్ట్రనే సమున్నత స్థానంలో నిలబెడుతుంది’ అని అజింక్యా నాయక్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఆటగాళ్ల నైపుణ్యాభివృద్ధికి అసమానమైన అవకాశాల్ని కలిపిస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా.. వర్ధమాన క్రీడాకారుల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా అపార అవకాశాల్ని సృష్టిస్తుందని, అన్ని స్థాయిల క్రికెట్ రూపురేఖల్ని మారుస్తుందని అజింక్య నాయక్ ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.
‘సిగ్గుపడుతున్నా.. అతడిపై నిషేధం విధించండి’
లక్నో సూపర్జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై బీసీసీఐ నిషేధం విధించాలని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం అనంతరం సంజీవ్ గోయెంకా, రిషబ్ పంత్ల మధ్య వాడివేడి సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. వీడియోలో ఇద్దరి మధ్య సంభాషణ వినిపించనప్పటికీ, గోయెంకా ముఖ కవళికలు, పంత్ సమాధానం చెబుతున్న తీరు గమనిస్తే ఎంతో తీవ్రతతో కూడిన చర్చగానే కనిపించింది. తాజాగా లలిత్ మోదీ సంజీవ్ గోయెంకా ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశాడు. ‘లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ఒక లూజర్, జోకర్. అతని ప్రవర్తన పట్ల నేను సిగ్గుపడుతున్నాను. మ్యాచ్లతో క్రికెట్ అభిమానులను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను తీసుకొచ్చాము. అంతేకానీ క్రికెట్కు ఎటువంటి సంబంధం లేని ఒక ఫ్రాంచైజీ ఓనర్ ఆటగాళ్లపై అజమాయిషీ చెలాయించాలని చూడడం ఎంతమాత్రం సరైనది కాదు. ఒకవేళ ఇప్పటికీ నేను ఐపీఎల్ చైర్మన్గా ఉండుంటే సంజీవ్ గోయెంకాపై తక్షణమే నిషేధం విధించడంతో, జట్టులో అతని యాజమాన్య హక్కులను శాశ్వతంగా రద్దు చేసేవాడిని. సంజీవ్ గోయెంకా ఒక అవకాశవాది. నిజానికి ఐపీఎల్ నిబంధనల్లో ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకునేందుకు ఒక క్లాజ్ను ఏర్పాటు చేశాం. బీసీసీఐ ఆ క్లాజ్ను పరిశీలించి సంజీవ్ గోయెంకాపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది. నిజాయితీకి అధిక ప్రాధాన్యమిస్తే మంచిదని నా అభిప్రాయం.’ అని చెప్పుకొచ్చాడు.I told you this guy @DrSanjivGoenka owner of @LucknowIPL is a complete looser and joker of the highest order - i am seriously embarrassed with his behaviour. I created the @IPL for fans and players alike. Not for this to happen every time every year. If I was still Chairman and… https://t.co/5mHzg8RAY1— Lalit Kumar Modi (@LalitKModi) April 2, 2026కనిపించేదంతా నిజం కాదు..అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంజీవ్ గోయెంకా, పంత్ సంభాషణకు సంబంధించిన వీడియోపై లక్నో యాజమాన్యం స్పందించింది. ‘మీ కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. పంత్, గోయెంకాల మధ్య సీరియస్ చర్చ జరుగుతున్న వీడియో క్లిప్పింగ్ను కట్ చేసి సోషల్ మీడియాలో షేర్చేశారు. కానీ అంతకముందు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వీడియోను మీ ముందు ఉంచుతున్నాం. నిజం తెలుసుకోండి’ అంటూ పోస్ట్ చేసింది.లక్నో యాజమాన్యం పోస్ట్ చేసిన వీడియోలో పంత్, గోయెంకాలు మాట్లాడు కోవడానికి ముందు నవ్వుతూ ఒకనొకరు ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ఇద్దరూ మ్యాచ్కు సంబంధించి సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అప్పుడు రాహుల్.. ఇప్పుడు పంత్కాగా 2024 సీజన్లో అప్పటి లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్తో కూడా గోయెంకా ఇలాగే ప్రవర్తించిన తీరు అప్పట్లో సంచలనంగా మారింది. బహిరంగంగానే కెప్టెన్పై గోయెంకా అసహనం వ్యక్తం చేయడం విమర్శలకు దారి తీసింది. తాజగా పంత్ విషయంలోనూ అలాగే వ్యవహరించాడని భావిస్తున్న తరుణంలో లక్నో ఫ్రాంచైజీ కొత్త వీడియోను రిలీజ్ చేసి అనుమానాలకు తెరదించింది.Not everything you see is the true story, here’s the unfiltered post match vibes, when cameras don’t cut. pic.twitter.com/EiPMWrmlkQ— Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2026చదవండి: ‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం!
‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం!
ఐపీఎల్ 2026 సీజన్లో తొలి మ్యాచ్లో ఓటమిపాలైన సన్రైజర్స్ హైదరాబాద్ గురువారం కేకేఆర్తో జరిగిన రెండో మ్యాచ్లో విజయం సాధించి సీజన్లో బోణీ చేసింది. తెలుగు కుర్ర క్రికెటర్ నితీశ్కుమార్ రెడ్డి తనకున్న ఆల్రౌండర్ ట్యాగ్కు న్యాయం చేస్తూ మొదట బ్యాట్తో, ఆపై బంతితో మెరిసి జట్టు విజయంలో భాగం కావడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నితీశ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైన మ్యాచ్. చాలా కాలంగా ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాను. సరైన సమయంలో నేను రాణించగలిగాను. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా కష్టపడ్డా. కొన్ని బౌండరీలు ఇచ్చినా చివరికి జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన ఇచ్చాను. గత సీజన్ నేను అనుకున్న ప్లాన్ ప్రకారం సాగలేదు. ఆ సీజన్లో నేను గాయాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బౌలింగ్ కూడా చేయలేకపోయాను. ఆ సమయంలో నా మనసులో నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోయాయి. అయితే ఐపీఎల్ 19వ సీజన్కు ముందు నా బౌలింగ్పై ప్రత్యేక దృష్టి సారించాను. నేను పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ విజయంలో కీలకపాత్ర పోషించడం ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. కేకేఆర్తో మ్యాచ్లో నితీశ్కుమార్ మొదట బ్యాటింగ్లో 24 బంతుల్లో 39 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ స్కోరు 200 దాటడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలింగ్లోనూ రింకూ సింగ్, అనుకుల్రాయ్లను ఔట్ చేసి ఎస్ఆర్హెచ్కు బ్రేక్ అందించాడు. Ishan Kishan has been brilliant in his captaincy: Nitish Kumar Reddy#IPL2026 #KKRvsSRHpic.twitter.com/FW8x1rzwXw— Khan (@ccricket713) April 3, 2026చదవండి: గెలుపు జోష్లో ఉన్న ఎస్ఆర్హెచ్కు షాక్!
గెలుపు జోష్లో ఉన్న ఎస్ఆర్హెచ్కు షాక్!
సన్రైజర్స్ హైదరాబాద్ వైస్కెప్టెన్ అభిషేక్ శర్మకు ఐపీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. గురువారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ను కేటాయించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో అభిషేక్ అసభ్య పదజాలం వాడినట్లు స్టంప్ మైక్లో రికార్డయింది. దీంతో అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.మ్యాచ్లో ఆట పరంగా అభిమానులను అలరించినప్పటికీ, మైదానంలో మాత్రం అతని ప్రవర్తన అధికారులను నిరాశకు గురిచేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం (మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం వాడటం) లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు అభిషేక్ అంగీకరించాడు. ఐపీఎల్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా లెవల్ 1 నేరాలు తక్కువ తీవ్రత కలిగినవిగా పరిగణించబడతాయి. అయినా పదేపదే ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే డీమెరిట్ పాయింట్లు పెరుగుతాయి. వీటివల్ల భవిష్యత్తులో మ్యాచ్ ల నుండి కూడా సస్పెన్షన్ కు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అభిషేక్ తన తప్పును అంగీకరించడంతో రిఫరీ శిక్షను ఖరారు చేశారు.అరుదైన రికార్డు..గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులతో సునామి ఇన్నింగ్స్ ఆడాడు. పనిలో పనిగా అభిషేక్ తన ఖాతాలో అరుదైన రికార్డును జమ చేసుకున్నాడు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున వంద సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ (143 సిక్సర్లు) తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ (101 సిక్సర్లు), క్లాసెన్ (89 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (64 సిక్సర్లు), హెడ్ (50 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 65 పరుగుల భారీ తేడాతో కేకేఆర్పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 🚨 Meet Abhishek Sharma a FAILURE product of IPL 🚨- Matches: 78- Runs: 1822- AVERAGE : 26.79Strike Rate: 162.39- Ducks- 3- Fifties - 9- Centuries - 1Look at his average 26.79 which is below average of any player.pic.twitter.com/BjRi1v8aMz— manzur shaban (@Manzurshaban123) April 2, 2026చదవండి: రనౌటయ్యి బతికిపోయాడు లేదంటేనా!
రనౌటయ్యి బతికిపోయాడు లేదంటేనా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లలో కామెరున్ గ్రీన్ ఒకడు. రూ. 25.20 కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఇంత ఖర్చు చేయడం అవసరమా అని ఒకవైపు విమర్శలు వస్తున్నప్పటికీ వాళ్లకే జాక్పాట్లు తగులుతున్నాయి. అయితే గ్రీన్ అంత హార్డ్ హిట్టర్ బ్యాటర్ కూడా కాదు. వన్డే ఫార్మాట్లో మంచి బ్యాటర్ అయిన కామెరున్ గ్రీన్ టీ20ల్లో స్ట్రైక్రేటు కూడా సాధారణంగానే ఉంటుంది. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోని గ్రీన్ తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లోనూ ఆకట్టుకోలేదు. దీనికి తోడు అతడిని దురదృష్టం వెంటాడింది. మలింగ ఓవర్లో రఘువంశీ నేరుగా షాట్ కొట్టగా బంతి బౌలర్ కాలికి తగిలి కొద్ది దూరం వెళ్లింది. ఇదే అదనుగా రఘువంశీ, గ్రీన్ కాస్త సంకోచిస్తూనే పరుగు ప్రారంభించారు. అయితే వెంటనే తేరుకున్న మలింగ బంతిని అందుకొని నాన్స్ట్రయికర్ ఎండ్ వైపు స్టంప్స్ను పడగొట్టాడు. దాంతో రఘువంశీ తాను రనౌట్ అయినట్లుగా భావించి తిరుగుముఖం పట్టాడు. కానీ బౌండరీ లైన్ వద్ద అతడిని ఆపిన అంపైర్లు రీప్లేను పరిశీలించారు. పరుగు తీసే క్రమంలో ఇద్దరూ బ్యాటర్లు దాదాపు ఒకే లైన్లో ఉన్నారు. గ్రీన్ ఇంకా రఘువంశీని దాటలేదు. దాంతో నిబంధన ప్రకారం గ్రీన్ను అవుట్గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రీన్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్కు గురయ్యాడు. ‘రనౌట్ అయి బతికిపోయాడు.. లేదంటే మరోసారి విమర్శలకు గురయ్యేవాడే’..‘ 25 కోట్లు దండగ అని మరోసారి నిరూపించాడు’ అని కామెంట్లు చేశారు.A confusion between Raghuvanshi and Green. pic.twitter.com/wljEeRqlHF— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2026చదవండి: కేకేఆర్ ఓడినా ఆ ఒక్కడు గెలిచాడు!
కేకేఆర్ ఓడినా ఆ ఒక్కడు గెలిచాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ఛేదనలో మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో కేకేఆర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీనికి తోడు టార్గెట్ ఎక్కువగా ఉండడం కూడా కేకేఆర్ కొంపముంచింది. అయితే జట్టు ఓడినా ఒక్క ఆటగాడు మాత్రం గెలిచాడు. అతడే జింబాబ్వేకు చెందిన బ్లెసింగ్ ముజరబానీ.ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మూడు ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో మాత్రం ముజరబానీ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన ముజరబానీ 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ పరంగా చూసుకుంటే ఓవర్కు 10 పరుగుల చొప్పున ఇచ్చినప్పటికీ బ్యాటింగ్ పిచ్పై ముజరబానీ ప్రదర్శన తీసిపారేయలేము. పైగా అతడు తీసిన నాలుగు వికెట్లలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. ఈ ఐపీఎల్లో సికందర్ రజా తర్వాత జింబాబ్వే నుంచి ఆడుతున్న క్రికెటర్ ముజరబానీ మాత్రమే. మొదట వేలంలో అమ్ముడుపోని ఆటగాడు ఇవాళ కేకేఆర్ మ్యాచ్ ఓడినా తన ప్రదర్శనతో మాత్రం అభిమానుల మనుసులు గెలుచుకున్నాడు.వేలంలో అమ్ముడుపోలేదు..జింబాబ్వే ఆటగాడు అయిన బ్లెసింగ్ ముజరబానీకి ఇదే తొలి ఐపీఎల్ సీజన్. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి దిగిన ముజరబానీని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఇష్టపడలేదు. దీంతో అతడు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. అయితే అదృష్టం ముజరబానీని ముస్తాఫిజుర్ రెహ్మాన్ రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, ఇతర కారణాల రీత్యా బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్లో పాల్గొనకూడదంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీంతో బీసీసీఐ ఐపీఎల్లో ఆయా ఫ్రాంచైజీల్లో ఉన్న బంగ్లా ఆటగాళ్లను బహిష్కరించాలని సందేశాలు పంపింది. దీంతో కేకేఆర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి విడుదల చేసింది.వెతుక్కుంటూ అవకాశం..అతడి స్థానంలో నిఖార్సైన బౌలర్ కోసం వెతికింది. ఈ నేపథ్యంలోనే అప్పటికే టీ20 ప్రపంచకప్లో జింబాబ్వే తరఫున 6 మ్యాచ్లాడిన బ్లెసింగ్ ముజరబానీ 7.88 ఎకానమీ రేట్తో 13 వికెట్లు పడగొట్టాడు. మొదట అసలు వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచిన ముజరబానీపై కేకేఆర్ కన్ను పడింది. దీంతో ముస్తాఫిజుర్ స్థానంలో ముజరబానీని రీప్లేస్ చేస్తున్నట్లు కేకేఆర్ యాజమాన్యం ప్రకటించింది.ఎవరీ ముజరబానీ?29 ఏళ్ల ముజరబానీ జింబాబ్వేలోని మురేవా అనే చిన్న పట్టణంలో జన్మించాడు. ఏడేళ్ల ప్రాయంలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న ముజరబానీకి అతని హైట్ ప్లస్ అయింది. 6 అడుగుల 8 అంగుళాల పొడవు ఉండే ముజరబానీ వేసే బౌన్సర్లు బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాయి. అలా 2017లో జాంబాబ్వే మాజీ క్రికెటర్ తెటెండా తైబు కళ్లలో పడిన ముజరబానీ రైజింగ్ స్టార్స్ అకాడమీలో మూడు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకొని బౌలింగ్లో మరింత రాటుదేలాడు. 2017లో జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ముజరబానీ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 67 వికెట్లు, 57 వన్డేల్లో 70 వికెట్లు, 88 టీ20ల్లో 105 వికెట్లు పడగొట్టాడు.మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 243 వికెట్లు పడగొట్టిన ముజరబానీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 2026 టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలో ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించడంలో ముజరబానీదే కీలకపాత్ర. ఆ మ్యాచ్లో ముజరబానీ 17 పరుగులకే 4 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అంతేకాదు రిచర్డ్ నగరవా, సికందర్ రజా తర్వాత జింబాబ్వే తరఫున టీ20ల్లో వంద వికెట్లు తీసిన మూడో బౌలర్గానూ ముజరబానీ నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన నితీశ్కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది?The creative says it 😌 pic.twitter.com/Ta6bZ4lm5B— KolkataKnightRiders (@KKRiders) April 2, 2026Petition to change the word 𝐬𝐚𝐟𝐞 in dictionary to 𝐑𝐢𝐧𝐤𝐮 😌💜pic.twitter.com/3q7gcyXvVo— KolkataKnightRiders (@KKRiders) April 2, 2026
మరో 4 నెలల్లో వరల్డ్కప్.. ప్రాక్టీస్ మొదలు పెట్టనున్న భారత్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే రెండు ప్రతిష్టాత్మక ఈవెం...
పోరాటానికి పరిమితులెందుకు?
ఎవరైనా, ఎక్కడైనా పతకాల వేటలో పడి... గెలిస్తే సరి ఇ...
ఇటలీకి షాక్.. ఫిపా ప్రపంచకప్కు అనర్హత
ఫుట్బాల్లో ఇటలీ జట్టుది చెరగని ప్రస్థానం. న...
ప్రతిభకు పురస్కారం
లుసానే: భారత మహిళా పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రతిభ...
రసెల్ రికార్డు బద్దలు కొట్టిన రింకూ సింగ్
కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్ ఓ అద్భుత రి...
ఫిన్ అలెన్ ఊచకోత
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఇవ...
అభిషేక్ శర్మ ఖాతాలో భారీ రికార్డు
సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్...
IPL 2026: డబుల్ సెంచరీ కొట్టిన రహానే
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే తన ఐపీఎల్ కెరీర్...
క్రీడలు
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
వీడియోలు
తొలి మ్యాచ్ లోనే ఓడిపోయినా.. కప్ మాత్రం సీఎస్కేదేనా..?
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
చెన్నై చిత్తు.. రాయల్స్ రాజసం
ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు
IPL 2026: RR vs CSK ఎవరు గెలుస్తారు?
కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం
RCB Vs SRH: అదరగొట్టిన RCB.. SRHపై 6 వికెట్ల తేడాతో RCB గెలుపు
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
మ్యాచ్ మొదలవ్వక ముందే RCBకి 3 బిగ్ షాక్ లు ..
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
