Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: Chennai Super Kings Vs Mumbai Indians Match Live Updates1
IPL 2026: సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్ అప్‌డేట్స్‌

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై వేదికగా 44వ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది.

Mohammed Shami Brother-Mohammed Kaif In Trouble Woman Allegations2
చిక్కుల్లో క్రికెటర్‌ షమీ సోదరుడు!

టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ సోదరుడు మహమ్మద్ కైఫ్‌ చిక్కుల్లో పడ్డాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఒక మహిళ షమీ సోదరుడిపై ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. ఉమ్మడి స్నేహితుడు ఇమ్రాన్‌ ద్వారా మహమ్మద్ కైఫ్‌ను బాధితురాలు కలిసింది. వారి తొలి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేయడం మొదలుపెట్టిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొంతకాలం తర్వాత బాధితురాలు కైఫ్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పటినుంచి కైఫ్ ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇక మహ్మద్ షమీ సోదరుడైన మహమ్మద్ కైఫ్ దేశవాలీ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ సహా విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీయ టోర్నమెంట్లలో ఆడాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన కైఫ్ తన కెరీర్‌లో మొత్తం మహమ్మద్ కైఫ్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 43 వికెట్లు, 9 లిస్ట్ -ఏ మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. షమీ కుటుంబానికి వివాదాలు కొత్త కాదు. షమీ భార్య హసీన్ జహాన్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ భారత క్రికెటర్ తరచూ వార్తల్లో నిలిచాడు. గత జనవరిలో ఓటర్ల జాబితాలో అవకతవకల కారణంగా షమీతో పాటు కైఫ్‌ను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇక నిలకడైన ఆటతీరుకు మారుపేరైన షమీ 2023 వన్మింన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు. అయితే ఐపీఎల్ 19వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున ఆడుతున్న షమీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడి 7 వికెట్లు తీశాడు.చదవండి: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

Arjun Tendulkar Joins New Team Huge Salary 400 Percent Base Price3
‘భారీ’ ధరకు అమ్ముడుపోయిన అర్జున్‌ టెండుల్కర్‌

భారత ‍క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ ‘భారీ’ ధరకు అమ్ముడుపోయాడు. టీ20 ముంబై లీగ్‌ తాజా వేలంలో ARCS అంధేరి ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసింది. కనీస ధర కంటే అతడి కోసం ఫ్రాంఛైజీ ఏకంగా 400 శాతం ఎక్కువగా ఖర్చు చేయడం గమనార్హం.ఐపీఎల్‌లో ముంబై నుంచి లక్నోకుకాగా ఆటలో తండ్రి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోతున్నాడు అర్జున్‌ టెండుల్కర్‌ (Arjun Tendulkar). ఇప్పటికీ క్రికెటర్‌గా అతడికి పూర్తి స్థాయి గుర్తింపులేదు. దేశీ క్రికెట్‌లో కొన్నాళ్లు సొంత జట్టు ముంబైకి ఆడిన అర్జున్‌.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినా ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు పెద్దగా గుర్తింపు రావడం లేదు.బెంచ్‌కే పరిమితంఇక ఐపీఎల్‌లో చాలా కాలం ముంబై ఇండియన్స్‌లో ఉన్నాడు అర్జున్‌. ఈ జట్టుకు సచిన్‌ మెంటార్‌గా ఉండగా.. అర్జున్‌ను కనీస ధర రూ. 30 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. ఇటీవలే అతడిని లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసింది. అయితే, లక్నో తుదిజట్టులోనూ అతడికి స్థానం దక్కడం లేదు. దీంతో బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి.ధర ఎంతంటే?ఇలాంటి తరుణంలో తొలిసారి టీ20 ముంబై లీగ్‌లో ఆడేందుకు అర్జున్‌ టెండుల్కర్‌ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వేలంలో కనీస ధర రూ. 2 లక్షలతో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం నాటి వేలంలో అంధేరీ ఫ్రాంఛైజీ అర్జున్‌ కోసం పోటీపడింది. ఆఖరికి రూ. 10 లక్షల ధరకు అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ జీతంలో ఇది దాదాపు 33 శాతం.కాగా టీమిండియా స్టార్‌, 2024, 2026 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్లలో సభ్యుడైన శివం దూబే కూడా అంధేరీ జట్టుకే ఆడుతున్నాడు. అతడి ధర రూ. 20 లక్షలు. ఇక తాజా వేలంలో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ను అంధేరీ రూ. 11 లక్షలకు కొనుగోలు చేసింది.అనుమతి వచ్చిందిలా..ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA)తో సంబంధం లేకున్నా.. ఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు అర్జున్‌ టెండుల్కర్‌కు ప్రత్యేక అనుమతి లభించింది. స్వతహాగా ముంబైకర్‌ అయిన అర్జున్‌.. గతేడాది వేరే రాష్ట్ర టీ20 లీగ్‌లో ఆడనందున బీసీసీఐ నిబంధన ప్రకారం అతడు ముంబై టీ20 లీగ్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది.కాగా ఐపీఎల్‌ కాకుండా కేవలం ఒకే ఒక్క స్థానిక లీగ్‌లో ఆడేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇదలా ఉంటే.. జూన్‌ మొదటి వారంలో టీ20 ముంబై లీగ్‌ జరుగనున్నట్లు సమాచారం.చదవండి: ద్రవిడ్‌ ‘ది గ్రేట్‌’ అన్నాడు!.. పాక్‌ పేసర్‌కు షాకిచ్చిన పీసీబీ!

BCCI Announces Women Team For ICC T20 World Cup 20264
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సంబంధించి బీసీసీఐ శ‌నివారం భారత జ‌ట్టును ప్ర‌క‌టించింది. అమితా శ‌ర్మ నేతృత్వంలోని సెలెక్ష‌న్ క‌మిటీ, బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ్‌జిత్ సైకియా, మ‌హిళల జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ అమోల్ మ‌జుందార్‌, కెప్టెన్ హర్మ‌న్‌ప్రీత్ కౌర్‌ల‌తో స‌మావేశ‌మైంది. సుదీర్ఘ చ‌ర్చ అనంత‌రం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు.హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ రికార్డు స్థాయిలో ఐదోసారి కెప్టెన్‌గా జ‌ట్టును న‌డిపించ‌నుండ‌డం విశేషం. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్‌, స్మృతి మంధాన‌, జేమీమా రోడ్రిగ్స్‌, ష‌ఫాలీ వ‌ర్మ‌, రిచా ఘోష్‌లు బ్యాటింగ్ భారాన్ని మోయ‌నున్నారు. ఇక ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ‌, రేణుకాసింగ్‌లు బౌలింగ్ ద‌ళాన్ని ముందుండి నడిపించ‌నున్నారు. తెలుగు క్రికెట‌ర్లు శ్రీచ‌ర‌ణి, అరుంధ‌తి రెడ్డి జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. ఇక గాయం కార‌ణంగా దూర‌మైన అమ‌న్‌జ్యోత్ కౌర్ స్థానంలో భార‌తి పుల్మాలిని ఎంపిక చేసిన‌ట్లు సెలెక్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. బ్యాట‌ర్ హ‌ర్లీన్ డియోల్‌, స్పిన్న‌ర్ స్నేహ్‌రాణాలకు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.15 మందితో కూడిన జ‌ట్టుకు హర్మ‌న్‌ప్రీత్ కౌర్ నాయ‌కత్వం వ‌హించ‌నున్నారు. జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. గ్రూప్‌-ఏలో భారత్‌తో పాటు పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది.ఆ తర్వాత 17న నెదర్లాండ్స్‌, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్‌, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక గ్రూప్‌-బిలో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, స్కాట్లాండ్‌, ఐర్లాండ్ ఉన్నాయి. కాగా జూన్ 30న తొలి సెమీఫైనల్‌, జూలై 2న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక జూలై 5న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ ఆతిథ్యమివ్వనుంది.ఇక గతేడాది భారత్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని టీమిండియా ఆనాటి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ వివరాలు..జూన్‌ 14: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌, వేదిక: ఎడ్జ్‌బాస్టన్‌జూన్‌ 17: భారత్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌, వేదిక: హెడ్డింగేజూన్‌ 21: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా, వేదిక: ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌జూన్‌ 25: భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌, వేదిక: ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌జూన్‌ 28: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, వేదిక: లార్డ్స్‌భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్‌, రాధా యాద‌వ్‌. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) చదవండి: ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా!

Pakistan Pacer Who Quoted The Great Rahul Dravid Fined By PCB5
ద్రవిడ్‌ ‘ది గ్రేట్‌’ అన్నాడు!.. పాక్‌ పేసర్‌కు పీసీబీ షాక్‌

పాకిస్తాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ అలీ టీమిండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ను ‘ది గ్రేట్‌’గా అభివర్ణించాడు. ద్రవిడ్‌ చెప్పినట్లే కష్టపడే వాళ్లకు అదృష్టం కూడా కలిసి వస్తుందన్నాడు. తమ విషయంలోనూ ఇదే జరిగిందని హర్షం వ్యక్తం చేశాడు. అయితే, అనూహ్య రీతిలో అతడు జరిమానా బారిన పడ్డాడు. అసలు విషయమేమిటంటే..అరంగేట్ర సీజన్‌లోనేపాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) తుది అంకానికి చేరుకుంది. పెషావర్‌ జల్మీ తొలుత ఫైనల్‌ చేరగా.. తాజాగా హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. కాగా హైదరాబాద్‌ జట్టు ఈ ఏడాదే పీఎస్‌ఎల్‌లో అరంగేట్రం చేసింది.ఆరంభంలో వరుస ఓటములతో విమర్శలపాలైన హైదరాబాద్‌ జట్టు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని ప్లే ఆఫ్స్‌ చేరింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ను శుక్రవారం ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. హైదరాబాద్‌ విజయాల్లో మొహమ్మద్‌ అలీది కీలక పాత్ర. ఇప్పటికి ఈ సీజన్‌లో అతడు పదిహేడు వికెట్లు కూల్చాడు.ది గ్రేట్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నట్లుగాఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు అలీ. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ది గ్రేట్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నట్లుగా.. కష్టపడే వాళ్లకు అదృష్టం కూడా కచ్చితంగా కలిసి వస్తుంది’’ అని పేర్కొన్నాడు.షాకిచ్చిన పీసీబీఇదిలా ఉంటే.. అలీపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) కఠిన చర్యలు చేపట్టింది. అతడి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఇస్లామాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా అలీ.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌తో గొడవపడటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద పీసీబీ ఈ మేరకు శిక్ష విధించింది. కాగా ఎలిమినేటర్‌-1లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి.. 184 పరుగులు చేసింది. దీంతో నరాలు తెగే ఉత్కంఠ పోరులో రెండు పరుగుల స్వల్ప తేడాతో హైదరాబాద్‌ గట్టెక్కి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

Lisa Sthalekar Breaks Silence On Viral Ramiz Raja Hugging Video6
ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా!

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌) 2026 సీజ‌న్‌లో గురువారం హైద‌రాబాద్ కింగ్స్‌మెన్‌, ముల్తాన్ సుల్తాన్స్ మ‌ధ్య ఎలిమినేట‌ర్ 1 మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌కు పాక్ మాజీ క్రికెట‌ర్ ర‌మీజ్ రాజా, ఆసీస్ మ‌హిళా మాజీ క్రికెట‌ర్ లీసా స్తాలేక‌ర్ కామేంటేట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో లీసా స్తాలేక‌ర్ మాట‌ల సంద‌ర్భంగా రమీజ్ రాజాను హ‌గ్ చేసుకున్నారు. అయితే వీరిద్ద‌రు ఇది స‌రదాగా చేసిన‌ప్ప‌టికీ బ‌హిరంగంగా ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ప‌ట్ల క్రికెట్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు. అంతేకాదు ర‌మీజ్ రాజా, లీసా స్తాలేక‌ర్ హ‌గ్ వీడియో క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారిపోయింది. ఏఐ పుణ్య‌మా అని లీసా హ‌గ్ ఇవ్వ‌గానే ర‌మీజ్ రాజా ఆమె నుదుటిపై ముద్దు పెట్టిన‌ట్లుగా వీడియో, ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే ఇవ‌న్నీ న‌కిలీ ఫొటోల‌ని కాసేప‌టికే తేలిపోయింది. ఎందుకంటే వీరిద్ద‌రు హ‌గ్ చేసుకున్న అనంత‌రం ర‌మీజ్ రాజా ముద్దు పెట్టిన‌ట్లుగా వీడియోలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో అది ఏఐతో రూపొందించిన వీడియో అని క్లియ‌ర్‌గా అర్థ‌మైంది. అయితే ర‌మీజ్ రాజాకు హ‌గ్ ఇవ్వ‌డం వివాదాస్ప‌దంగా మారడంతో లీసా స్తాలేక‌ర్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించింది. ‘ఒక చిన్న కౌగిలింత ఇంత చ‌ర్చ‌కు దారి తీయ‌డం నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అస‌లు ఇందులో త‌ప్పేముంది. ఏదో స‌ర‌దాగా హ‌గ్ చేసుకున్నా. దీనికి ఇంత రాద్ధాంతం చేయాలా’ అంటూ స్టోరీ షేర్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో పెషావర్ జాల్మితో హైదరాబాద్ కింగ్స్‌మెన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. షాన్ మ‌సూద్ (69 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మ‌హ్మ‌ద్ న‌వాజ్ 18 ప‌రుగులు సాధించాడు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ 15.2 ఓవ‌ర్ల‌లోనే 2 వికెట్లు కోల్పోయి 162 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. మాజ్ స‌దాఖ‌త్ (64 నాటౌట్‌), ఉస్మాన్ ఖాన్ (64) జ‌ట్టును గెలిపించారు.ఇక లీసా స్తాలేకర్‌ ఆస్ట్రేలియా తరఫున 2001 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా సేవ లందించిన ఈ ఆల్‌రౌండర్ 125 వన్డేల్లో 2,728 పరుగులు చేయడంతో పాటు 146 వికెట్లు పడగొట్టింది. ఇక 8 టెస్టు మ్యాచ్‌లు ఆడి 416 పరుగులతో పాటు 23 వికెట్లు తీసింది.Lisa Sthalekar's Instagram story. pic.twitter.com/N7C4JVOBtq— Sheri. (@CallMeSheri1_) May 2, 2026WTFFFF pic.twitter.com/293RiGywFW— Invader🇵🇸- (@sshayaannn) April 29, 2026

Dont let Him play IPL If Vaibhav Plays Anymore: RR Threatened With FIR7
‘చైల్డ్‌ లేబర్‌.. FIR వేయిస్తా.. వైభవ్‌ చదువుకోవాలి’

భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ గత కొన్నాళ్లుగా అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. భారత్‌ అండర్‌-19 జట్టుతో పాటు ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున దుమ్ములేపుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో 35 బంతుల్లోనే శతక్కొటిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడి (14 ఏళ్లు)గా నిలిచాడు.సంచలనాలకు కేంద్రంనిజానికి అంతకంటే ముందే అంటే పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టుకు ఎంపికై.. ఆసియా రైజింగ్‌ స్టార్స్‌తో టోర్నీ పాటు ఇటీవలే వరల్డ్‌కప్‌ టోర్నీలోనూ ఆడాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించి భారత్‌కు ట్రోఫీ అందించాడు.ఆరెంజ్‌ క్యాప్‌ రేసులోఇక ఇటీవలే పదిహేనో వసంతంలోకి అడుగుపెట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2026లో భాగంగా ఈ టోర్నీలో తన రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 404 పరుగులు పూర్తి చేసుకుని.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్‌-4లో నిలిచాడు.ఈ నేపథ్యంలో అలెన్‌ బోర్డర్‌, బ్రియాన్‌ లారా, సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలు సైతం వైభవ్‌ సూర్యవంశీ ఆటకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే అతడిని టీమిండియాకు ఆడించాలని మరికొందరు మాజీ క్రికెటర్లు సైతం సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.యాక్టివిస్ట్‌ సంచలన వ్యాఖ్యలుఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ టీవీ చానెల్‌లో యాక్టివిస్ట్‌గా పరిచయమైన ఓ వ్యక్తి.. వైభవ్‌ను తక్షణమే ఇంటికి పంపాలని రాజస్తాన్‌ యాజమాన్యానికి సూచించాడు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి.. FIR వేయిస్తానని హెచ్చరించాడు.చైల్డ్‌ లేబర్‌.. చదువుకోనివ్వండిఈ మేరకు.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడకూడదు. ఇలా చేయడం చైల్డ్‌ లేబర్‌ కిందకు వస్తుంది. ఈ పిల్లాడిని ఐపీఎల్‌ క్రికెట్‌ ఆడనివ్వద్దు. క్రికెట్‌ ఆడే బదులు అతడు చదువుకోవాలి’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌కాగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.This activist appeared on a Kannada TV channel and said he plans to file a police case or legal complaint against Rajasthan Royals. He said - Don't let this 15-year-old boy "Vaibhav Suryavanshi " play IPL cricket — it's child labour, he should study! pic.twitter.com/zEwVJQseGR— ExtraOrdinary (@Extreo_) May 2, 2026క్రీడాకారులకు వర్తిస్తుందా?కాగా భారత బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 ప్రకారం.. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో పని చేయించకూడదు. అయితే, సాధారణంగా బాల క్రీడాకారులను చైల్డ్‌ లేబర్‌గా పరిగణించరు. ప్రతిభకు పట్టం కడుతూ వారిని ప్రోత్సహిస్తారు. క్రికెట్‌ ఒక్కటే కాదు.. చెస్‌, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడల్లో చాలా మంది పదేళ్లలోపు వయసులోనే ప్రవేశిస్తారు.ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌నిజానికి వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ అందించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో అతడు ఈ అవార్డు అందుకున్నాడు. అయితే, సదరు యాక్టివిస్టు మాత్రం వైభవ్‌ను ఐపీఎల్‌లో ఆడించడం సరికాదని.. ఇది చైల్డ్‌ లేబర్‌ కిందకు వస్తుందంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చాడు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చికాగా వైభవ్‌ సూర్యవంశీ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కుమారుడిని ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా కుమారుడు లక్ష్యాన్ని చేరుకునేలా చేశారు. అయితే, చదువులోనూ వైభవ్‌ ముందే ఉంటాడని ఇటీవలే అతడి స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. కాకపోతే ఈసారి ఐపీఎల్‌ కారణంగా అతడు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయాడు. ఇక గతేడాది మెగా వేలంలో 1.10 కోట్లకు వైభవ్‌ను కొన్న రాజస్తాన్‌ రాయల్స్‌.. ఈసారి పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దించింది.చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

TNCA invites applications for coaches Who Are Eligible Details8
కోచ్‌లు, సెలక్టర్లు కావలెను!.. అర్హతలు ఇవే

గత కొన్నేళ్లుగా దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటలేక చతికిలపడుతోంది తమిళనాడు క్రికెట్‌ జట్టు. ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్‌ సంఘం శిక్షణ బృందాన్ని బలోపేతం చేసే పనిలో పడింది. వరుస వైఫల్యాలుకాగా గత రంజీ సీజన్‌లో గ్రూప్‌ దశలో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న తమిళనాడు జట్టు... సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో సూపర్‌ లీగ్‌ దశకు చేరలేకపోయింది. దీంతో కోచింగ్‌ స్టాఫ్‌ను మార్పు చేయాలని భావించిన తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) కొత్త కోచ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పురుషుల, మహిళల విభాగాల్లో సీనియర్, జూనియర్‌ జట్లకు కొత్త కోచ్‌లను నియమించనుంది. అలాగే సెలెక్షన్‌ కమిటీ సభ్యులను సైతం ఎంపిక చేయనుంది. ఈ నెల 10 దరఖాస్తులకు చివరి తేదీ కాగా... పరిమిత ఓవర్లకు, టెస్టు ఫార్మాట్‌కు వేర్వేరు కోచ్‌లను ఎంపిక చేయనుంది. ఉండాల్సిన అర్హతలు ఇవేకాగా 60 సంవత్సరాలకు లోబడి ఉండి బీసీసీఐ లెవల్‌–2 కోచింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎన్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ‘నిబంధనల ప్రకారం కొత్త కోచ్‌ల నియామకం చేపడతాం. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం తదుపరి పరీక్షలు నిర్వహిస్తాం’ అని టీఎన్‌సీఏ కార్యదర్శి భగవాన్‌ దాస్‌ తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు జట్లకు సెంథిల్‌నాథన్, వెంకటరమణ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

Never Been So Afraid: Jamieson Breaks Silence On Vaibhav Sooryavanshi9
‘జీవితంలో ఇంతలా భయపడే రోజు వస్తుందనుకోలేదు’

న్యూజిలాండ్‌ స్టార్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ కైలీ జెమీసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో పదిహేనేళ్ల పిల్లాడికి కూడా భయపడాల్సిన రోజు వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. అతడిని అవుట్‌ చేసేందుకు ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో చర్చించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.36 బంతుల్లోనే శతక్కొట్టాడుఅవును.. జెమీసన్‌ చెప్తున్నది రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే!.. ఐపీఎల్‌-2026లో ఈ లెఫ్లాండర్‌ బ్యాటర్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో తన ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు వైభవ్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.ఎదురుగా ఎవరున్నా డోంట్‌ కేర్‌ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ప్రపంచస్థాయి బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లోనూ సిక్సర్లు బాది తన బ్యాట్‌ పవరేంటో మరోసారి చాటిచెప్పాడు వైభవ్‌. ఎదురుగా ఎంతటి దిగ్గజ బౌలర్‌ ఉన్నా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకుని పరుగులు పిండుకుంటున్నాడు.నేనూ భయపడ్డాఈ నేపథ్యంలో తాను సైతం వైభవ్‌ సూర్యవంశీ విషయంలో భయపడ్డాడని కివీస్‌ స్టార్‌, ఢిల్లీ పేసర్‌ కైలీ జెమీసన్‌ అన్నాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ రాజస్తాన్‌తో తలపడ్డ సంగతి తెలిసిందే. జైపూర్‌ వేదికగా టాస్‌ గెలిచిన రాజస్తాన్‌.. తొలుత బ్యాటింగ్‌ చేసింది.అయితే, ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొడుతున్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (6), వైభవ్‌ సూర్యవంశీ (4)లను త్వరగానే వెనక్కి పంపడంలో ఢిల్లీ సఫలమైంది. వైభవ్‌ను జెమీసన్‌ బౌల్డ్‌ చేయగా.. జైసూను మిచెల్‌ స్టార్క్‌ పెవిలియన్‌కు పంపాడు.ఢిల్లీ గెలుపుఓపెనర్లు విఫలమైనా రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగుల మేర మంచి స్కోరు సాధించింది. ధ్రువ్‌ జురెల్‌ (42), డొనోవాన్‌ ఫెరీరా (14 బంతుల్లో 47 నాటౌట్‌)లతో పాటు కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (50 బంతుల్లో 90) ఇన్నింగ్స్‌ ఇందుకు కారణం.అయితే, 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అనూహ్య రీతిలో ఊదిపారేసింది. ఓపెనర్లు పాతుమ్‌ నిస్సాంక (33 బంతుల్లో 62), కేఎల్‌ రాహుల్‌ (40 బంతుల్లో 75).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నితీశ్‌ రాణా (17 బంతుల్లో 33) వేగంగా ఆడి పని పూర్తి చేశారు.ఇంతలా భయపడే రోజు వస్తుందనుకోలేదుఇదిలా ఉంటే.. వైభవ్‌ సూర్యవంశీని త్వరగా పెవిలియన్‌కు పంపేలా తాను ముందు నుంచే సన్నద్ధమయ్యాయని జెమీసన్‌ తాజాగా వెల్లడించాడు. ‘‘పదిహేనేళ్ల పిల్లాడికి కూడా ఇంతలా భయపడే రోజు వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు.అతడిని అవుట్‌ చేసేందుకు మేము ఎన్నో వ్యూహాలు, ప్రణాళికలు రచించుకున్నాము. అందుకు తగ్గ ఫలితం వచ్చింది’’ అని జెమీసన్‌ చెప్పుకొచ్చాడు. రాజస్తాన్‌కు కీలకమైన ఓపెనింగ్‌ జోడీని విడదీసేందుకు తానూ, స్టార్క్‌ ప్లాన్‌ వేశామని.. అనుకున్నట్లే ఆరంభంలోనే వారిని వెనక్కి పంపామని హర్షం వ్యక్తం చేశాడు.కాగా 15 ఏళ్ల వైభవ్‌ను అవుట్‌ చేసిన తర్వాత.. 31 ఏళ్ల జెమీసన్‌ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అతడి ముఖంలో ముఖం పెట్టి గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టాడు. దీంతో బీసీసీఐ జెమీసన్‌ను మందలించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జతచేసింది. చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'That is absolute class! 😮‍💨#KyleJamieson with a ripper to knock over #VaibhavSooryavanshi!🤯#TATAIPL 2026 ➡️ #RRvDC | LIVE NOW 👉https://t.co/cMKydi0l80 pic.twitter.com/MZ8LkaCvca— Star Sports (@StarSportsIndia) May 1, 2026

Salman Ali Agha Reveals What Happened Behind IND vs PAK No Handshake10
నాకూ ఆ ఉద్దేశం లేదనే చెప్పాను: పాక్‌ కెప్టెన్‌ ఓవరాక్షన్‌

ఆసియా టీ20 కప్‌-2025 సందర్భంగా చోటుచేసుకున్న ‘నో షేక్‌హ్యాండ్‌’ వివాదంపై.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా తాజాగా స్పందించాడు. ఆరోజు తాను ఎప్పటిలాగే గడుస్తుందని భావించానన్నాడు. అయితే, టాస్‌ సమయంలోనే తనకు నిజం తెలిసిందన్నాడు.తారస్థాయికి ఉద్రిక్తతలుమ్యాచ్‌ ముగిసిన తర్వాత అయినా టీమిండియా ఆటగాళ్లు తమతో కరచాలనం చేసేందుకు రాకపోవడం ఆశ్చర్యపరిచిందని ఆఘా పేర్కొన్నాడు. కాగా పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఉగ్రమూకకు బుద్ధి చెప్పే క్రమంలో భారత సైన్యం ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టగా.. పాక్‌ ఆర్మీ ఎదురుదాడి చేసింది. ఇందుకు భారత సైన్యం గట్టిగానే బదులిచ్చింది.కరచాలనానికి నిరాకరణఈ పరిణామాల క్రమంలో తొలిసారి దాయాదులు టీమిండియా- పాక్‌ (IND vs PAK) ఆసియా కప్‌-2025 సందర్భంగా ముఖాముఖి తలపడ్డాయి. అయితే, టాస్‌ సమయంలో పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాతో కరచాలనానికి టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ నిరాకరించాడు.ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, పాక్‌ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరిస్తూ మ్యాచ్‌ ముగించిన సూర్య, శివం దూబే మైదానాన్ని వీడారు. మిగతా ఆటగాళ్లు సైతం డ్రెసింగ్‌రూమ్‌లోనే ఉండిపోయారు. దీంతో పాక్‌ జట్టు అవమానభారంతో మైదానాన్ని వీడింది.షాకిచ్చిన ఐసీసీఈ విషయం గురించి పాక్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ ముందుగా నో షేక్‌హ్యాండ్‌ గురించి తమకు సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. కాబట్టి అతడిపై వేటు వేయాలని పట్టుబట్టింది. అయితే, ఐసీసీ ఇందుకు నిరాకరించింది. రిఫరీ నిబంధనలు ఉ‍ల్లంఘించారనేందుకు ఎలాంటి ఆధారం లేదని కొట్టిపారేసింది.ఇక బీసీసీఐ సైతం.. ఆటగాళ్లు కచ్చితంగా కరచాలనం చేసుకోవాలన్న నిబంధన ఏమీ లేదని గుర్తు చేస్తూ టీమిండియాను సమర్థించింది. నాటి ఈ ఘటనపై సల్మాన్‌ ఆఘా తాజాగా మరోసారి గుర్తుచేసుకున్నాడు.కరచాలనం చేయాలనే ఆసక్తి ఏమీ లేదు‘‘మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశం.. ట్రోఫీ ఫొటోషూట్‌ జరిగింది. అక్కడ కూడా షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక టాస్‌ సమయంలో నేను మైదానంలోకి వెళ్లినపుడు.. అంతా సాధారణంగానే ఉంటుందని భావించాను.అయితే, అంతలోనే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని నాకు అర్థమై పోయింది. అప్పుడే రిఫరీ నన్ను పక్కకు తీసుకువెళ్లి.. ‘ఫ్రెండ్‌.. ఇక్కడ షేక్‌హ్యాండ్‌ ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అని నాతో చెప్పారు.అప్పుడు నేను.. ‘నాకు కూడా కరచాలనం చేయాలనే ఆసక్తి ఏమీ లేదు’ అని చెప్పాను. టాస్‌ సమయంలో ముందుగానే నో షేక్‌హ్యాండ్‌ గురించి చెప్పారు. అయితే, మ్యాచ్‌ ముగిసిన తర్వాత పెవిలియన్‌కు చేరే సమయంలోనూ వాళ్లు (టీమిండియా) కరచాలనం చేసేందుకు ముందుకు రాలేదు’’ అని సల్మాన్‌ ఆఘా చెప్పుకొచ్చాడు. ఓవరాక్షన్‌ ఎందుకు?తద్వారా నాడు ఈ విషయంలో మ్యాచ్‌ రిఫరీ తమకు ముందుగానే సందేశం ఇచ్చాడని ఆఘా స్పష్టంచేశాడు. దీంతో పాక్‌ బోర్డు ఫిర్యాదుపై ఐసీసీ సరైన విధంగానే స్పందించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసియా కప్‌-2025 ఫైనల్లో టీమిండియా పాక్‌ను ఓడించి ట్రోఫీ గెలిచింది.చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement