Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Inaugural Bangladesh Premier League Pushed Forward1
ప్రారంభానికి ముందే వాయిదా పడిన క్రికెట్‌ లీగ్‌

మహిళల బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WBPL) ప్రారంభానికి ముందే వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం, ఈ లీగ్‌ ఏప్రిల్‌ 3 నుంచి 15 తేదీల మధ్యలో జరగాల్సి ఉండింది. అయితే స్పాన్సర్లు దొరక్క జులై నెలకు పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది.వాస్తవానికి ఈ లీగ్‌ టీ20 ప్రపంచకప్‌కు ముందు తమ ప్లేయర్లకు ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు భావించింది. అయితే వాయిదా పడటంతో ప్రపంచకప్‌ వరకు బంగ్లాదేశ్‌ ప్లేయర్లకు ఎలాంటి అధికారిక మ్యాచ్‌లు ఉండవు. బంగ్లా ప్లేయర్లు నేరుగా జూన్‌ 14న నెదర్లాండ్స్‌తో జరిగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. ఆ దేశ పురుషుల క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2026 నుంచి వైదొలిగి, చాలా పెద్ద సాహసం చేసింది. ఈ పరిణామం తర్వాత ఆ దేశంలో క్రికెట్‌కు స్పాన్సర్లు కరువయ్యారు. ఈ ప్రభావం పలువురు అంతర్జాతీయ స్టార్లు పాల్గొనే పురుషుల బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌పై కూడా పడనుంది. ఇప్పటికే ఆ లీగ్‌లోని పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు రెమ్యూనరేషన్‌ ఎగ్గొట్టాయనే టాక్‌ ఉంది. పురుషుల బీపీఎల్‌కు కూడా స్పాన్సర్లు ఎవరూ ముందుకు రాకపోతే, ఈ లీగ్‌ మనుగడనే ప్రశ్నార్థకమవుతుంది.

Gujarat Titans Sign Two Time IPL Winning Coach To Rediscover Victory Mantra2
టూ టైమ్‌ విన్నింగ్‌ కోచ్‌తో ఒప్పందం చేసుకున్న గుజరాత్‌

తమ తొలి సీజన్‌లోనే (2022) టైటిల్‌ ఎగరేసుకుపోయి సంచలనం సృష్టించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ మళ్లీ సక్సెస్‌ బాట పట్టేందుకు కీలక అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా టూ టైమ్‌ విన్నింగ్‌ కోచ్‌ విజయ్‌ దాహియాతో ఒప్పందం చేసుకుంది. రానున్న సీజన్‌ కోసం అతన్ని అసిస్టెంట్‌ కోచ్‌గా నియమించుకుంది. దాహియా ఇటీవలే నియమితుడైన హెడ్‌ కోచ్‌ మాథ్యూ హేడెన్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. దాహియా 2012, 2014లో కేకేఆర్‌ టైటిల్‌ గెలిచినప్పుడు ఆ బృందంలో అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్నాడు. దాహియా తన ఐపీఎల్‌ కెరీర్‌లో కేకేఆర్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కూడా పని చేశాడు. అతని కోచింగ్‌లో ఢిల్లీ జట్టు 2007-08 సీజన్‌లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఈ అనుభవం గుజరాత్ టైటాన్స్‌కి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో తొలి సీజన్‌లోనే టైటిల్‌ గెలిచిన గుజరాత్‌.. ఆతర్వాత సీజన్‌లో కూడా ఫైనల్‌కు చేరినా, సీఎస్‌కే చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2024లో హార్దిక్‌ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వీడి ముంబై ఇండియన్స్‌లో చేరడంతో శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్‌ సారథ్యంలో గుజరాత్‌ తొలి సీజన్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచినా ఫైనల్స్‌కు చేరలేకపోయింది. రాబోయే సీజన్‌లో మరోసారి గిల్‌ నేతృత్వంలో గుజ.రాత్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఇదిలా ఉంటే, 2026 సీజన్‌కు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ (20 మ్యాచ్‌లు) ఇవాళే విడుదలైంది. గుజరాత్‌ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో (మార్చి 28) ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్‌ పోటీపడనున్నాయి. తొలి విడతలో ప్రతి జట్టు తలో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.గుజరాత్‌ టైటాన్స్‌ తొలి విడత షెడ్యూల్‌.. - మార్చి 31: GT vs PBKS - ఏప్రిల్‌ 4: GT vs RR - ఏప్రిల్‌ 8: GT vs DC - ఏప్రిల్‌ 12: GT vs LSG దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.

SRH IPL Schedule 2026: Fixtures, Venues, Full Squad, Date And Time3
IPL 2026: సన్‌రైజర్స్‌ షెడ్యూల్‌ ఇదే..!

ఐపీఎల్‌ 2026 తొలి విడత షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు జరిగే 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను బీసీసీఐ ఇవాళ (మార్చి 11) ప్రకటించింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.తొలి విడతలో మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో (బెంగళూరు, ముంబై, గౌహతి, కొత్త చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) జరుగనున్నాయి. బెంగళూరులో జరిగాల్సిన మ్యాచ్‌లు మార్చి 13న నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి. తొలి విడతలో నాలుగు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ విడతలో అన్ని జట్లలాగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. టోర్నీ ఓపెనర్‌లోనే ఆరెంజ్‌ ఆర్మీ ఆర్సీబీతో తలపడనుంది. సన్‌రైజర్స్‌ రెండో మ్యాచ్‌ ఏప్రిల్‌ 2న కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో జరుగనుంది. మూడో మ్యాచ్‌ ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో.. నాలుగో మ్యాచ్‌ ఏప్రిల్‌ 11న ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరుగనుంది. తొలి విడతలో సన్‌రైజర్స్‌ తమ హోం గ్రౌండ్‌ హైదరాబాద్‌లో ఒకే ఒక మ్యాచ్‌ (ఏప్రిల్‌ 5, లక్నోతో) ఆడనుంది. ఆర్సీబీ, కేకేఆర్‌ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. లక్నో, పంజాబ్‌ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతాయి.ఐపీఎల్‌ 2026 కోసం సన్‌రైజర్స్‌ జట్టు..సలీల్ అరోరా, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరన్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ మావి, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అమిత్ కుమార్, క్రియాన్స్‌ ఫులెట్రా, ప్రఫుల్‌ హింజ్‌, ఎషాన్‌ మలింగ, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, శివంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ

Even if he hadnt said sorry: Gambhir on Arshdeep Daryl Mitchell clash4
T20 WC: షాకిచ్చిన ఐసీసీ.. సమర్థించిన గంభీర్‌

టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సమర్థించాడు. డారిల్‌ మిచెల్‌ విషయంలో అర్ష్‌దీప్‌ చేసిన దాంట్లో తనకు తప్పేమీ కనిపించలేదన్నాడు. క్రికెట్‌ మైదానంలో ఇలాంటివి సహజమేనని.. అర్ష్‌ సారీ చెప్పడం తనకు నచ్చలేదన్నాడు. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.మిచెల్‌కు గట్టిగా తగిలిన బంతిఅహ్మదాబాద్‌లో జరిగిన టైటిల్‌ పోరులో క్రీజులో ఉన్న కివీస్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌కు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ బంతిని అతడివైపే ఆడగా... బంతిని అందుకున్న వెంటనే పేసర్‌ బలంగా విసిరిపెట్టి కొట్టడంతో ఆ బంతి గట్టిగా మిచెల్‌కు తగిలింది. దీనిపై అప్పుడే మిచెల్‌ కోపంగా అర్ష్‌దీప్‌ వైపు దూసుకురాగా తొలుత అంపైర్, తర్వాత కెప్టెన్‌‌ సూర్యకుమార్‌ సముదాయించడంతో చల్లబడ్డాడు.అనంతరం అర్ష్‌దీప్‌ కూడా మిచెల్‌ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరడంతో ఆ వివాదం మ్యాచ్‌తో పాటే ముగిసిపోయింది. అయితే ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడంతో ఐసీసీ అర్ష్‌దీప్‌నకు జరిమానా విధించింది. మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోతపెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అందులో అర్ష్‌దీప్‌ తప్పేమీ లేదుఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ANI పాడ్‌కాస్ట్‌కు హాజరు కాగా అర్ష్‌దీప్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మరేం పర్లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడు మైదానంలో ఆ మాత్రం దూకుడు ప్రదర్శించడం సహజమే.బంతిని అలా విసిరితే తప్పేంటి? వరుసగా రెండు సిక్సర్లు తన బౌలింగ్‌లో బాదితే ఏ బౌలర్‌కైనా ఇలాగే ఉంటుంది. ఎవరూ దీనిని సహించరు. బ్యాటర్‌ పట్ల ఇలాగే స్పందిస్తారు. అందులో తప్పేమీ లేదు. అందుకు అతడు క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు.అయితే, అతడు సారీ చెప్పి మంచి పనిచేశాడు. ఏదేమైనా మైదానంలో శత్రువులు, స్నేహితులు ఉండరు. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో గెలుపు కోసం ఆటగాళ్లు ఏమైనా చేస్తారు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. అయితే ఈ సోషల్‌ మీడియా యుగంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారేలా చేస్తున్నారు. ఇదేం పద్ధతో నాకైతే అర్థం కావడం లేదు’’ అని గంభీర్‌ అర్ష్‌దీప్‌ను వెనకేసుకువచ్చాడు. కాగా ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్‌ టీ20 ప్రపంచకప్‌ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.

IPL 2026: Defending champions RCB will face SRH in season opener5
ఐపీఎల్‌ 2026 షెడ్యూల్‌ విడుదల

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 2026 షెడ్యూల్‌ విడుదలైంది. బీసీసీఐ ముందుగా ప్రకటించినట్లుగానే తొలి దశ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు జరిగే 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను వెల్లడించింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది.🚨 News 🚨Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.More details ▶️… pic.twitter.com/8Iq492v8TE— IndianPremierLeague (@IPL) March 11, 2026ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.తొలి విడతలో 20 మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో (బెంగళూరు, ముంబై, గౌహతి, కొత్త చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) జరుగనున్నాయి. బెంగళూరులో జరిగాల్సిన మ్యాచ్‌లు మార్చి 13న నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి.తొలి విడతలో నాలుగు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. తొలి డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు ఏప్రిల్‌ 4న జరుగుతాయి. ఈ విడతలో హైదరాబాద్‌లో ఒకే ఒక మ్యాచ్‌ జరుగనుంది. ఏప్రిల్‌ 5న లక్నో సూపర్‌ జెయింట్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది.

The Hundred 2026: Deepthi Sharma to Sunrisers Leeds, Richa Ghosh to Manchester super giants6
హండ్రెడ్‌ లీగ్‌ వేలం.. టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ది హండ్రెడ్‌ క్రికెట్‌ లీగ్‌లో తొలిసారి వేలం జరుగుతుంది. 2026 సీజన్‌ కోసం ఇవాళ (మార్చి 11) మహిళల విభాగం ఆక్షన్‌ నడుస్తుంది. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు 178 మంది ప్లేయర్ల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్లేయర్లను రిటైన్‌, డైరెక్ట్‌ సైనింగ్‌ చేసుకోగా.. మిగతా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు వేలంలో పోటీపడుతున్నాయి.ఈ వేలంలో భారత మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, రిచా ఘోష్‌పై కనకవర్షం కురిసింది. రిచాను మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ రూ. 61.73 లక్షలకు దక్కించుకోగా.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ రూ. 33.96 లక్షలకు సొంతం చేసుకుంది. మరికొంతమంది భారత క్రికెటర్లు ఆరంభ రౌండ్లలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. యస్తికా భాటియా, శ్రీచరణిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. శ్రేయాంక పాటిల్‌, పూజా వస్త్రాకర్‌, కశ్వీ గౌతమ్‌, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, నందిని శర్మ, ఆశా శోభన, రాధా యాదవ్‌ ఇంకా వేలానికి రాలేదు. ఈ వేలంలో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పాల్గొనడం లేదు. స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్‌ను వేర్వేరు ఫ్రాంచైజీలు ప్రీ సైనింగ్‌ చేసుకున్నాయి.ఫ్రాంచైజీలు రీటైన్‌, ప్రీ సైనింగ్‌ చేసుకున్న ప్లేయర్లు..మాంచెస్టర్ సూపర్ జెయింట్స్: సోఫీ ఎక్లెస్టోన్ (రీటైన్‌) స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్ (ప్రీ సైనింగ్‌)లండన్ స్పిరిట్: గ్రేస్ హారిస్, చార్లీ డీన్ (రీటైన్‌), మారిజాన్ కాప్, మహికా గౌర్ (ప్రీ సైనింగ్‌)బర్మింగ్‌హామ్ ఫీనిక్స్: ఎల్లీస్ పెర్రీ (రీటైన్‌), ఆలిస్ కాప్సే, లూసీ హామిల్టన్, లారెన్ ఫైలర్ (ప్రీ సైనింగ్‌)ఎంఐ లండన్: హేలీ మాథ్యూస్, డాని వ్యాట్-హాడ్జ్, మెలీ కెర్ ప్రీ సైనింగ్‌)సదరన్ బ్రేవ్: లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మైయా బౌచియర్ (రీటైన్‌), జెమిమా రోడ్రిగ్స్ (ప్రీ సైనింగ్‌)సన్‌రైజర్స్ లీడ్స్: కేట్ క్రాస్, అన్నాబెల్ సదర్లాండ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (రీటైన్‌)ట్రెంట్ రాకెట్స్: నాట్ స్కైవర్-బ్రంట్, యాష్ గార్డ్నర్ (రీటైన్‌), సోఫియా డంక్లీ, కిమ్ గార్త్ (ప్రీ సైనింగ్‌)వెల్ష్ ఫైర్: జార్జియా వేర్హమ్, ఫ్రెయా కెంప్, జార్జియా వోల్ (ప్రీ సైనింగ్‌)కాగా, రేపు (మార్చి 12) పురుషుల విభాగంలో వేలం జరుగనుంది.

Kris Srikkanth Team of the Tourney T20 WC 2026 leaves out Axar Patel7
T20 WC 2026: కెప్టెన్‌గా సాంట్నర్‌.. అక్షర్‌కు దక్కని చోటు!

జగజ్జేత టీమిండియాపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్య సేన విజయాన్ని అభిమానులు ఇంకా సెలబ్రేట్‌ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు.ముఖ్యంగా వరల్డ్‌కప్‌ హీరోలుగా పేరొందిన సంజూ శాంసన్‌ (Sanju Samson), జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)లతో పాటు.. అక్షర్‌ పటేల్‌ (Axar Patel), శివం దూబే వంటి సైలెంట్‌ హీరోలను కూడా ఫ్యాన్స్‌ హైలైట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను ఎంపిక చేశాడు. ఇందులో అనూహ్యంగా అక్షర్‌కు మాత్రం చోటు ఇవ్వలేదు.ఓపెనింగ్‌ జోడీ ఇదేఓపెనర్లుగా టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌, న్యూజిలాండ్‌ పవర్‌ హిట్టర్‌ టిమ్‌ సీఫర్ట్‌ను ఎంచుకున్న చిక్కా.. వన్‌డౌన్‌లో భారత యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కు చోటు ఇచ్చాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో విండీస్‌ వీరుడు షిమ్రన్‌ హెట్‌మైర్‌, భారత ఆల్‌రౌండర్‌ శివం దూబేను ఎంపిక చేసుకున్న శ్రీకాంత్‌.. టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా, ఇంగ్లండ్‌ డేంజరస్‌ ప్లేయర్‌ విల్‌ జాక్స్‌కు స్థానం ఇచ్చాడు.పన్నెండో ఆటగాడిగాఇక ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను కాదని.. న్యూజిలాండ్‌ సారథి మిచెల్‌ సాంట్నర్‌ను ఎంచుకున్నాడు చిక్కా. బౌలింగ్‌ విభాగంలో ఆదిల్‌ రషీద్‌, లుంగి ఎంగిడి, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు చోటు ఇచ్చాడు. పన్నెండో ఆటగాడిగా విండీస్‌ వీరుడు జేసన్‌ హోల్డర్‌ను చిక్కా ఎంపిక చేసుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో మొత్తంగా పద్నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. వరుణ్‌ చక్రవర్తితో కలిసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. మరోవైపు.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 383 పరుగులతో పాకిస్తాన్‌ ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. కేవలం ఐదు మ్యాచ్‌లలోనే సంజూ 321 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. రెండోస్థానంలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టిమ్‌ సీఫర్ట్‌ (326 పరుగులు) ఉన్నాడు.టీ20 ప్రపంచకప్‌-2026 చిక్కా టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌సంజూ శాంసన్‌, టిమ్‌ సీఫర్ట్‌, ఇషాన్‌ కిషన్‌, షిమ్రన్‌ హెట్‌మైర్‌, శివం దూబే, హార్దిక్‌ పాండ్యా, విల్‌ జాక్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఆదిల్‌ రషీద్‌, లుంగి ఎంగిడి, జస్‌ప్రీత్‌ బుమ్రా.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల

Bangladesh beat Pakistan by 8 wickets in 1st ODI8
పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్‌

టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి వైదొలిగే విషయంలో తమకు అండగా ఉండినట్లు నటించి, చివరికి హ్యాండిచ్చిన పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌ జట్టు తగిన బుద్ది చెప్పింది. ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి, 'మిత్రధర్మాన్ని' నిలబెట్టుకుంది. ఫ్రెండ్‌, ఫ్రెండ్‌ అంటూ.. బంగ్లాదేశ్‌ పాక్‌ను ఇంటి​కి పిలిచి మరీ దెబ్బ​కొట్టింది.పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా తొలి మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. నహిద్‌ రాణా (7-0-24-5), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (4.4-0-18-1), తస్కిన్‌ అహ్మద్‌ (7-029-1), మెహిది హసన్‌ మిరాజ్‌ (10-0-29-3) ధాటికి 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌పై వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోర్‌. 22 ఏళ్ల పేసర్‌ నహిద్‌ రాణా నిప్పులు చెరిగే బంతులతో పాక్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. స్వదేశంలో వన్డేల్లో పాకిస్తాన్‌పై ఓ బంగ్లాదేశ్‌ బౌలర్‌ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు (5-24) ఇవే.పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు ఫహీమ్‌ అష్రాఫ్‌ చేసిన 37 పరుగులే అత్యధికం. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు.ఫహీమ్‌, ఫర్హాన్‌ కాక మాజ్‌ సదాకత్‌ (18), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. మిగతా పాక్‌ ప్లేయర్లలో హమిల్‌ హుసేన్‌ 4, సల్మాన్‌ అఘా 5, హుసేన్‌ తలాత్‌ 4, షాహీన్‌ అఫ్రిది 4 పరుగులు చేశారు. అబ్దుల్‌ సమద్‌, మొహమ్మద్‌ వసీ​ం​ జూనియర్‌ డకౌటయ్యారు.అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది. కేవలం 15.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (42 బంతుల్లో 67 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాక్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊదేశాడు. మరో ఓపెనర్‌ సైఫ్‌ హసన్‌ 4 పరుగులకే ఔటైనా.. నజ్ముల్‌ హసన్‌ షాంటోతో (27) కలిసి బంగ్లాను గెలుపు తీరాలకు చేర్చాడు. అనంతరం లిటన్‌ దాస్‌ (3 నాటౌట్‌) సహకారంతో మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, మొహమ్మద్‌ వసీం జూనియర్‌ తలో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇదే వేదికగా మార్చి 13న జరుగనుంది.

With T20 WC medal Shivam Dube reveals how he returned home via train9
T20 WC: రైలులో 3rd ఏసీలో ముంబైకి వచ్చా: శివం దూబే

టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 ట్రోఫీ గెలవడంలో శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణించి జట్టును ఆదుకున్నాడు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో దూబే 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు.ఇక ఈ టోర్నీలో లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి మెరుపు బ్యాటింగ్‌తో మొత్తంగా 235 పరుగులు సాధించిన దూబే.. ఐదు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్‌లో విజయం తర్వాత తాను రైలులో ముంబైకి చేరుకున్నట్లు దూబే వెల్లడించాడు. విమాన టికెట్లు అందుబాటులో లేకపోవడంతో భార్య అంజుమ్‌ ఖాన్‌తో కలిసి 3rd ఏసీలో ప్రయాణించినట్లు తెలిపాడు.3rd ఏసీ టికెట్లు దొరికాయి‘‘విమానాలేవీ అందుబాటులో లేవు. వేకువజామునే నిద్రలేచి అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి చేరుకోవాలని నిర్ణయించుకున్నాం. రోడ్డు మార్గం కూడా వెళ్లి ఉండవచ్చు. అయితే, రైలు వేగంగా వెళ్తుంది కదా అని ఇలా ప్లాన్‌ చేసుకున్నాం.నేను, నా భార్య, మా స్నేహితుడు.. ముగ్గురం కలిసి 3rd ఏసీ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో వాటిని బుక్‌ చేసుకున్నాం. రైలులో నన్ను అభిమానులు గుర్తుపడితే పరిస్థితి చేయిదాటి పోతుందని మా వాళ్లంతా కంగారుపడ్డారు.అలా జరుగకూడదనే నేను మాస్కు ధరించాను. ఫుల్‌ స్లీవ్స్‌ ఉన్న టీ షర్టు వేసుకున్నాడు. తెల్లవారి 5.10 నిమిషాలకు ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నాం. కానీ అప్పటికే చాలా మంది అక్కడ టీమిండియా జెర్సీలతో సందడి చేస్తున్నారు.పోలీసులకు ముందుగానే సమాచారంఅందుకే రైలు వచ్చేంత వరకు కార్లోనే ఉందామని నా భార్యకు చెప్పాను. రైలు బయల్దేరే ఐదు నిమిషాల ముందు ట్రైన్‌లోకి వెళ్లిపోయాము. అదృష్టశాత్తూ నన్నెవరూ గుర్తుపట్టలేదు. అయితే, ట్రైన్‌ దిగిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే భద్రత కోసం పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చాను’’ అని శివం దూబే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాడు.నాలుగేళ్ల కుమారుడు అయాన్‌, రెండేళ్ల కుమార్తె మెవిష్‌లను తొందరగా కలుసుకోవాలనే రైలు ప్రయాణం రిస్క్‌ అని తెలిసినా ధైర్యం చేశానని దూబే చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌కప్‌ హీరో ట్రైన్‌లో వస్తున్నాడని తెలిస్తే.. అభిమానులు ఎంత హంగామా చేస్తారో తెలిసిందే. అందుకే దూబే ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుని ముంబైకి చేరుకున్నాడు.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల

Pakistan all out for 114 runs in 1st ODI vs bangladesh10
తీరు మార్చుకోని పాకిస్తాన్‌.. పసికూన చేతిలో..!

టీ20 ప్రపంచకప్‌ 2026 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బొక్కబోర్లా పడింది. పసికూన బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న పాక్‌.. ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.పేసర్లు నహిద్‌ రాణా (7-0-24-5), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (4.4-0-18-1), తస్కిన్‌ అహ్మద్‌ (7-029-1), స్పిన్నర్‌ మెహిది హసన్‌ మిరాజ్‌ (10-0-29-3) ధాటికి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ విలవిలలాడిపోయింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు ఫహీమ్‌ అష్రాఫ్‌ చేసిన 37 పరుగులే అత్యధికం. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఫహీమ్‌, ఫర్హాన్‌ కాక మాజ్‌ సదాకత్‌ (18), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. మిగతా పాక్‌ ప్లేయర్లలో హమిల్‌ హుసేన్‌ 4, సల్మాన్‌ అఘా 5, హుసేన్‌ తలాత్‌ 4, షాహీన్‌ అఫ్రిది 4 పరుగులు చేశారు. అబ్దుల్‌ సమద్‌, మొహమ్మద్‌ వసీం​ జూనియర్‌ డకౌటయ్యారు.బంగ్లాదేశ్‌ టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌ ఇది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్రపంచకప్‌ నుంచి వైదొలిగే విషయంలో బంగ్లాదేశ్‌కు అండగా ఉండినట్లు నటించి, చివరి నిమిషంలో హ్యాండిచ్చిన పాక్‌కు కూడా ప్రపంచకప్‌ తర్వాత ఇదే తొలి మ్యాచ్‌. పాక్‌ ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఈ సిరీస్‌కు పాక్‌ సీనియర్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ లేకుండా బరిలోకి దిగింది. పాక్‌ జట్టుకు షాహీన్‌ అఫ్రిది నాయకత్వం వహిస్తున్నాడు. జట్టు మారినా, ప్లేస్‌ మారినా పాక్‌ ఆటతీరులో మాత్రం ఏ మార్పు లేదు. ప్రపంచకప్‌తో పోలిస్తే ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్‌ ఆటగాడు మొహమ్మద్‌ రిజ్వాన్‌ వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. టీ20 జట్టు కెప్టెన్‌ సల్మాన్‌ అఘా ప్రభావం చూపలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ గట్టెక్కితే అద్భుతమే.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement