Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL Unsold Players Who Got Crores In PSL Auction 20261
ఐపీఎల్‌లో అమ్ముడుపోని వారిపై పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కనకవర్షం

ఐపీఎల్‌ 2026 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పలువురు విదేశీ ఆటగాళ్లపై పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో కనకవర్షం కురిసింది. పీఎస్‌ఎల్‌లో తొలిసారి వేలం విధానాన్ని ప్రవేశపెట్టగా, కొందరు విదేశీ స్టార్ల కోసం​ ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఫలితంగా కొందరు ఫారిన్‌ ప్లేయర్లకు ఊహించని ధర లభించింది. జాక్‌పాట్‌ కొట్టిన ఆటగాళ్లలో న్యూజిలాండ్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌, ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఉన్నారు.ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోక, పీఎస్‌ఎల్‌ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు..డారిల్ మిచెల్: ఈ న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు ఐపీఎల్‌ 2026 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌ విభాగంలో పోటీపడ్డా, ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ పీఎస్‌ఎల్‌లో మాత్రం మిచెల్‌పై కనకర్షం కురిసింది. ఇతన్ని రావల్పిండి ఫ్రాంచైజీ ఏకంగా 8.05 కోట్ల పాక్‌ కరెన్సీకి కొనుగోలు చేసింది. ఈ మొత్తం భారత రూపాయల్లో 2.59 కోట్లవుతుంది.ఆడమ్ జంపా: ఐపీఎల్‌ 2025లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాను ఐపీఎల్‌ 2026లో వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్‌ఎల్‌ బాట పట్టాడు. అక్కడ అతన్ని కరాచీ కింగ్స్‌ ఫ్రాంచైజీ 4.5 కోట్లకు (పాక్‌ కరెన్సీ) కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఇది రూ. 1.46 కోట్లకు సమానమవుతుంది.రిలీ రొస్సో: ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో (2025, 2026) అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయిన సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్‌ రిలీ రొస్సోను క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ 5.5 కోట్ల పాక్‌ కరెన్సీకి సొంతం చేసుకుంది. ఇది భారత కరెన్సీలో రూ. 1.8 కోట్లకు సమానం.పీఎస్‌ఎల్‌-2026 వేలంలో భారీ ధర దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు.. మార్క్‌ చాప్‌మన్‌- 7 కోట్లు (పాక్‌ కరెన్సీలో)ఆస్టన్‌ టర్నర్‌- 4.2 కోట్లుమైఖేల్‌ బ్రేస్‌వెల్‌- 4.2 కోట్లుకుసాల్‌ మెండిస్‌- 4.2 కోట్లుటామ్‌ కర్రన్‌- 4.2 కోట్లుకుసాల్‌ పెరీరా- 3.1 కోట్లుజేమ్స్‌ విన్స్‌- 3 కోట్లురిషద్‌ హొసేన్‌- 3 కోట్లు వీరితో పాటు పీటర్‌ సిడిల్‌, జోష్‌ ఫిలిప్‌, తబ్రేస్‌ షంషి, జాన్సన్‌ ఛార్లెస్‌, మ్యాక్స్‌ బ్రయాంట్‌, షమార్‌ జోసఫ్‌, ఓట్నీల్‌ బార్ట్‌మన్‌, గుడకేశ్‌ మోటీ, రిచర్డ్‌ గ్లీసన్‌, బెన్‌ మెక్‌డెర్మాట్‌, దసున్‌ షనక, సామ్‌ హార్పర్‌, బెవాన్‌ జాకబ్స్‌ తదితర ఆటగాళ్లకు కూడా పీఎస్‌ఎల్‌ వేలంలో ఓ మోస్తరు ధర లభించింది.పీఎస్‌ఎల్‌లో అమ్ముడుపోని ప్రముఖుల్లో షకీబ్‌ అల్‌ హసన్‌, కైల్‌ మేయర్స్‌, కొలిన్‌ మున్రో, అల్జరీ జోసఫ్‌, జేమ్స్‌ నీషమ్‌, జేసన్‌ రాయ్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, డేవిడ్‌ మలాన్‌, కేశవ్‌ మహారాజ్‌ తదితరులు ఉన్నారు.

T20 WC: Afghanistan Nabi Handed Hefty Penalty By ICC Reason Is2
T20 WC 2026: మహ్మద్‌ నబీకి షాకిచ్చిన ఐసీసీ

అఫ్గనిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీకి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్‌ ఫీజులో పదిహేను శాతం కోత విధించింది. టీ20 ‍ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌- సౌతాఫ్రికా మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగింది. అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ జట్టు తొలుత బౌలింగ్‌ చేసింది.సమ ఉజ్జీలుగాఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్‌ సైతం 19.4 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా పేసర్‌ లుంగి ఎంగిడి మూడు వికెట్లతో రాణించాడు. అఫ్గన్‌ కీలక ఆటగాళ్లను అవుట్‌ చేసి‌ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.రెండు సూపర్‌ ఓవర్లుఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. అఫ్గన్‌- ప్రొటిస్‌ ఈసారి కూడా చెరో పదిహేడు పరుగులు చేసి సమంగా నిలిచాయి. దీంతో రెండో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. ఈసారి సౌతాఫ్రికా పైచేయి సాధించి గెలుపు జెండా ఎగురవేసింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నబీ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. జార్జ్‌ లిండే బౌలింగ్‌లో ఐడెన్‌ మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అయితే, తాను క్రీజులో ఉన్న వేళ.. అఫ్గన్‌ పద్నాలుగో ఇన్నింగ్స్‌లో నబీ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు.అంపైర్‌తో వాగ్వాదంలుంగి ఎంగిడి ధరించిన రిస్ట్‌ బ్యాండ్‌ గురించి నబీ ఫిర్యాదు చేస్తూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అంపైర్‌తో గొడవపడ్డందుకు ఐసీసీ నబీకి జరిమానా వేసింది. ఈ మేరకు ‘‘ఐసీసీ ప్యానెల్‌ మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ గిల్బర్ట్‌ ముందు నబీ తన తప్పును అంగీకరించాడు. కాబట్టి తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది.అతడి మ్యాచ్‌ ఫీజులో పదిహేను శాతం కోత విధిస్తున్నాం. గడిచిన 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కావున ఒక్క డిమెరిట్‌ పాయింట్‌తో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: T20 WC IND vs NAM: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్‌ ఆరోపణలు

T20 WC 2026: Oman player Mohammad Nadeem becomes the oldest batter to score 50 plus in a T20 WC match3
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్‌ ప్లేయర్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక, ఒమన్‌ తలపడ్డాయి. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. కుసాల్‌ మెండిస్‌ (45 బంతుల్లో 61; 7 ఫోర్లు), పవన్‌ రత్నాయకే (28 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ దసున్‌ షనక (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 13, కమిల్‌ మిషారా 8, కమిందు మెండిస్‌ 19 (నాటౌట్‌), వెల్లాలగే 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఒమన్‌ బౌలర్లలో షా ఫైసల్‌ (4-0-28-0) మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జితేన్‌ రామనంది (4-0-41-2), సూఫ్యాన్‌ మెహమూద్‌ (4-0-60-1), జే ఒడేడ్రా (1-0-14-1) వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చారు. వసీం అలీ (3-0-38-0), నదీమ్‌ ఖాన్‌ (4-0-40-0)ను లంక బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఒమన్‌ ఆదిలోనే చేతులెత్తేసింది. వెల్లాలగే (4-0-17-1), తీక్షణ (4-0-11-2), చమీరా (2-0-19-2), కమిందు (2-0-10-1), హేమంత (4-0-45-1) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో వచ్చిన వెటరన్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ నదీం (56 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.నదీం కాకుండా వసీం అలీ (27) ఒక్కడే రెండంకెల స్కోర్‌ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆమిర్‌ కలీమ్‌ 6, కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ 1, హమ్మద్‌ మీర్జా 9, వినాయక్‌ శుక్లా 1, నదీం ఖాన్‌ 2, సూఫ్యాన్‌ మెహమూద్‌ 1, షా ఫైసల్‌ 1, జే ఒడేడ్రా 4 (నాటౌట్‌), జితేన్‌ రామనంది డకౌటయ్యారు.నదీం ప్రపంచ రికార్డుఒమన్‌ తరఫున ఏకైక అర్ద సెంచరీ చేసిన మొహమ్మద్‌ నదీం ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అర్ద సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం​ వయసు 43 ఏళ్ల 161 రోజుల. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్‌ జయసూర్య పేరిట ఉండేది. జయసూర్య 2009 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో వెస్టిండీస్‌పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు.మరో ప్రపంచ రికార్డు కూడా సమంఈ మ్యాచ్‌లో నదీం మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. 52 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసిన నదీం.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో బంతుల పరంగా అతి నిదానంగా అర్ద సెంచరీ చేసిన ఆటగాడిగా పాక్‌ ప్లేయర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ రికార్డును సమం చేశాడు. రిజ్వాన్‌ 2024 ఎడిషన్‌లో కెనడాపై 52 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు.

T20 WC: Dasun Shanaka breaks own record to hit fastest T20I fifty4
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ దసున్‌ షనక చరిత్ర సృష్టించాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో ధనాధన్‌ దంచికొట్టి.. గతంలో తన పేరిట ఉన్న రికార్డు తానే బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా గ్రూప్‌-‘బి’ నుంచి శ్రీలంక- ఒమన్‌ గురువారం నాటి మ్యాచ్‌లో ముఖాముఖి ఎదురుపడ్డాయి.కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకంపల్లెకెలె వేదికగా టాస్‌ గెలిచిన ఒమన్‌.. ఆతిథ్య శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో లంక ఓపెనర్లు పాతుమ్‌ నిస్సాంక (13), కమిల్‌ మిశారా (8) నిరాశపరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకంతో అలరించాడు.మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న కుశాల్‌.. ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్‌ బ్యాటర్‌ పవన్‌ రత్ననాయకె ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 60 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్‌ దసున్‌ శనక సుడిగాలి ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.కేవలం 19 బంతుల్లోనే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షనక.. కేవలం 19 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా శ్రీలంక తరఫున పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గతంలో పుణె వేదికగా 2023లో టీమిండియాతో మ్యాచ్‌లో షనక 20 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.WHERE’S THE BALL?! 🚀Back-to-back sixes as the Sri Lankan skipper marches towards his fifty, leading from the front and steering SL towards a massive total 👏🔥ICC Men’s #T20WorldCup | #SLvOMA | LIVE NOW 👉 https://t.co/JscJZV8hFa pic.twitter.com/oH7vFDDqqJ— Star Sports (@StarSportsIndia) February 12, 2026ఇక ఒమన్‌తో తాజా మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న దసున్‌ షనక రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో 50 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో కమిందు మెండిస్‌ ఏడు బంతుల్లో 19, దునిత్‌ వెల్లలగే నాలుగు బంతుల్లో 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. ఈ ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఒమన్‌ బౌలర్లలో జితేన్‌ రామనంది రెండు, జే ఒడేరా, సూఫ్యాన్‌ మెహమూద్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.శ్రీలంక తరఫున టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీలు సాధించిన ఆటగాళ్లు వీరే🏏దసున్‌ షనక- 2026 వరల్డ్‌కప్‌లో ఒమన్‌ మీద 19 బంతుల్లో🏏దసున్‌ షనక- 2023లో టీమిండియా మీద 20 బంతుల్లో🏏మహేళ జయవర్దనే- 2007 వరల్డ్‌కప్‌లో కెన్యా మీద 21 బంతుల్లో🏏కుమార్‌ సంగక్కర- 2009లో టీమిండియా మీద 21 బంతుల్లో.చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!

Is Unfair advantage to India Namibia captain questions ICC For This5
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్‌ ఆరోపణలు

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా- నమీబియా మధ్య గురువారం నాటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్‌ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.కాగా ఈసారి వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌, అమెరికాతో కలిసి గ్రూప్‌-‘ఎ’లో ఉంది నమీబియా. తొలి మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీలో నెదర్లాండ్స్‌తో తలపడి ఓటమిపాలైంది. తమ రెండో మ్యాచ్‌లో భాగంగా పటిష్ట టీమిండియాను ఢీకొట్టనుంది నమీబియా.అన్యాయంఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఎరాస్మస్‌.. తమకు రాత్రి వేళ ప్రాక్టీస్‌ చేసే అవకాశం దక్కలేదని అసహనం వ్యక్తం చేశాడు. తమ దేశంలో ఎన్నడూ నైట్‌ మ్యాచ్‌లు ఆడలేదని.. అనుభవం లేనందున తమకు ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది తమకు అన్యాయం చేయడం లాంటిదేనని పరోక్షంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)ని తప్పుబట్టాడు.టీమిండియాకు రెండు.. మాకు సున్నా!కాగా ఈ టోర్నీలో నమీబియా తమ మ్యాచ్‌లు ఉదయం లేదంటే మధ్యాహ్నం ఆడనుంది. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రమే రాత్రి షెడ్యూల్‌ చేశారు. అయితే, ఇంత వరకు తమకు ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆడిన అనుభవం లేదన్న ఎరాస్మస్‌.. కనీసం ప్రాక్టీస్‌కైనా అవకాశం లేకుండా పోయిందన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రెండు నైట్‌ సెషన్‌లు ఇచ్చారని వాపోయాడు. ఈ మేరకు.. ‘‘ఇండియాతో మ్యాచ్‌కు ముందు మాకు నైట్‌ సెషన్‌ కేటాయించలేదు. ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. కానీ టీమిండియాకు మాత్రం రాత్రి పూట రెండు ప్రాక్టీస్‌ సెషన్లు ఇచ్చారనుకుంటా.నమీబియన్ల పోరాట పటిమ చూస్తారువాళ్లతో పాటు కెనడా కూడా నైట్‌ సెషన్‌లో ప్రాక్టీస్‌ చేసింది. నిజానికి కెనడా తదుపరి మ్యాచ్‌ మధ్యాహ్నం ఉంది. అయినా మేమేమీ వెనక్కి తగ్గము. నమీబియన్ల పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాము’’ అని గెర్హాడ్‌ ఎరాస్మస్‌ పేర్కొన్నాడు. అదే విధంగా..‘‘నమీబియాలో మాకు ఫ్లడ్‌లైట్లు ఉండవు. మా దగ్గర ఆ సదుపాయం లేదు. కాబట్టి ఈసారి కొత్తగా ఇక్కడ నైట్‌ ఆడటం సరికొత్త సవాలు. అయితే, మా వాళ్లలో కొంతమందికి విదేశీ లీగ్‌లలో ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం’’ అని ఎరాస్మస్‌ చెప్పుకొచ్చాడు.చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!

T20 WC 2026 IND vs NAM: Bumrah Yorker Hits Ishan Kishan Injury Scare6
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!

టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే అభిషేక్‌ శర్మ కడుపు నొప్పితో బాధపడుతుండగా.. మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ సైతం గాయపడ్డాడు. నమీబియాతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ కాలి బొటనవేలికి గాయమైనట్లు సమాచారం.పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్‌లో యార్కర్‌ను ఎదుర్కొనేందుకు ఇషాన్‌ సిద్ధపడగా.. బంతి బలంగా అతడి బొటనవేలికి తగింది. దీంతో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే నెట్‌ సెషన్‌ నుంచి బయటకు వెళ్లిపోయిన ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan).. కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు.గాయం గనుక తిరగబెడితేప్రస్తుతం అతడు బాగానే ఉన్నట్లు సమాచారం. అయితే, గాయం గనుక తిరగబెడితే ఇషాన్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం కష్టమే. కాగా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గత మూడు రోజులుగా కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.అభిషేక్‌ డిశ్చార్జ్‌ అయినా..ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన అభిషేక్‌ బుధవారం డిశ్చార్జ్‌ అయినట్లు మరో బ్యాటర్‌ తిలక్‌ వర్మ వెల్లడించాడు. అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపాడు. అయితే, నమీబియాతో మ్యాచ్‌ ఆడతాడా? లేదా? అన్న అంశం మీద మాత్రం తిలక్‌ స్పష్టతనివ్వలేదు.ఇంతలో ఇషాన్‌ కిషన్‌కు కూడా స్వల్ప గాయం కావడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే, కాసేపటికే పరిస్థితి బాగుపడటంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే రాణా అవుట్‌కాగా యువ పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం వల్ల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ జట్టులోకి వచ్చాడు.మరోవైపు.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయం వల్ల అమెరికాతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే, ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి నమీబియాతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇక తీవ్రమైన జ్వరం కారణంగా అమెరికాతో మ్యాచ్‌ ఆడలేకపోయిన బుమ్రా సైతం తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. అభిషేక్‌ శర్మ కోలుకోనట్లయితే ఇషాన్‌తో కలిసి సంజూ శాంసన్‌ భారత ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది.కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ గ్రూప్‌-‘ఎ’లో భాగంగా అమెరికాపై గెలిచిన టీమిండియా... తదుపరి గురువారం నమీబియాతో తలపడనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: IND vs NAM: మరో కూనతో పోరు

Pak TV Airs Fake T20 WC Video BCCI Rajeev Shukla Strong Response7
IND vs PAK: సిగ్గులేని షోయబ్‌ మాలిక్‌!

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి.. నీ అసలైన నైజాన్ని బయటపెట్టుకుంటూ మరింత దిగజారుతూనే ఉంటావు.. కాస్తైనా సిగ్గుందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్పే బదులు ‘అడుక్కుని తినవచ్చు కదా!’ అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామంటూ పాకిస్తాన్‌ ఓవరాక్షన్‌ చేసిన సంగతి తెలిసిందే. పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ఇందుకు సంబంధించి ప్రకటన చేశాడు.ఎ‍ప్పటిలాగానే పాక్‌ యూటర్న్‌అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) జోక్యంతో ఎ‍ప్పటిలాగానే పాక్‌ మాట మార్చింది. భారత్‌తో మ్యాచ్‌ ఆడతామని ప్రకటించింది. దీంతో తమకు యూటర్న్‌లు తీసుకోవడం మామూలేనని మరోసారి నిరూపించి నవ్వులపాలైంది. కానీ పాక్‌ మాజీ క్రికెటర్లు మాత్రం కింద పడినా తమదే పైచేయి అన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.బీసీసీఐ పదే పదే అడిగితేనే..ఇందులో భాగంగా మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ తాను హోస్ట్‌గా ఉన్న ఓ న్యూస్‌ ఛానెల్‌లో ఓ ఫేక్‌ వీడియో ప్రదర్శించాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మాట్లాడినట్లుగా ఓ వీడియో సృష్టించి.. అందులో ఆయన.. "బీసీసీఐ పదే పదే అభ్యర్థించడం వల్ల ఐసీసీ ప్రతినిధి పాకిస్తాన్‌ను టీమిండియాతో మ్యాచ్‌ ఆడేలా ఒప్పించారు.Pakistani sports show Har Lamha Purjosh hosted by Shoaib Malik, is circulating fake AI video of BCCI VICE PRESIDENT RAJEEV SHUKLA for selling chooran to the Pakistani audience pic.twitter.com/BMLmmD9sUe— Vishal (@Fanpointofviews) February 11, 2026స్పందించిన రాజీవ్‌ శుక్లాక్రికెట్‌ మనుగడకు ఇదే సరైన పరిష్కారం’’ అని అన్నట్లుగా AIతో మాయ చేశారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టగా.. రాజీవ్‌ శుక్లా స్వయంగా స్పందించారు. "పాకిస్తాన్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌ గురించి నేను మాట్లాడినట్లుగా AIతో మాయ చేశారు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.తప్పుదారి పట్టించే ఈ వీడియోను నమ్మవద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వీడియోలు మీ ఫీడ్‌లోకి వస్తే రిపోర్టు కొట్టేయండి’’ అని రాజీవ్‌ శుక్లా స్పష్టతనిచ్చారు. కాగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు మార్గం సుగమమైన వేళ.. "ఐసీసీ చైర్మన్‌ పర్యవేక్షణలో ఐసీసీ ప్రతినిధి సరైన విధంగా స్పందించి లాహోర్‌లో పాకిస్తాన్‌ బోర్డుతో చర్చలు జరిపారు.#WATCH | Delhi | On Pakistan to play against India at T20 cricket World Cup, BCCI Vice-President Rajeev Shukla says, "I am delighted to see the outcome of the deliberations initiated by ICC representative, supervised by the ICC Chairman and the representatives who had gone to… pic.twitter.com/3x9xSDyGMB— ANI (@ANI) February 10, 2026 ఎందుకిలా?బంగ్లాదేశ్‌ బోర్డుతోనూ మాట్లాడి మంచి పరిష్కారం కనుగొన్నారు. క్రికెట్‌ ప్రాధాన్యం, మనుగడకు ఇలాంటి నిర్ణయం సముచితమైనది’’ అని రాజీశ్‌ శుక్లా పేర్కొన్నారు. అయితే, షోయబ్‌ మాలిక్‌ మాత్రం తప్పుడు వీడియోను ప్రదర్శిస్తూ బీసీసీఐ అడుక్కునందు వల్లే పాక్‌ వారితో మ్యాచ్‌ ఆడేందుకు ఒప్పుకొందనే అర్థం వచ్చేలా దిగజారుడు వైఖరి ప్రదర్శించాడు. కాగా కొలంబో వేదికగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 15న జరుగనుంది.కాగా భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా షోయబ్‌ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సానియాతో ఉంటూనే నటి, వివాహిత సనా జావెద్‌తో మాలిక్‌ "బంధం’’ కొనసాగించాడు. ఈ క్రమంలో సానియా అతడికి విడాకులు ఇవ్వగా.. సనా సైతం భర్తకు విడాకులు ఇచ్చి మాలిక్‌ను పెళ్లి చేసుకుంది.చదవండి: ENG vs WI: నేపాల్‌ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్‌

Vaibhav Suryavanshi is set to play in this T20 league Just before IPL 20268
IPL కంటే ముందే ఆ టీ20 లీగ్‌లో వైభవ్‌ సూర్యవంశీ!

ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 ఫైనల్లో సత్తా చాటి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నాడు వైభవ్‌ సూర్యవంశీ. ఇంగ్లండ్‌తో టైటిల్‌ పోరులో ఈ పద్నాలుగేళ్ల బాలుడు కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్‌ ఆరోసారి ప్రపంచకప్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.ఈ నేపథ్యంలో ఈ భారత యువ క్రికెట్‌ తరంగాన్ని ఏకంగా దిగ్గజ గ్యారీ సోబర్స్‌తో పోల్చాడు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మార్క్‌ బుచర్‌. ఇక ఈ మెగా టోర్నీ తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)తో వైభవ్‌ సూర్యవంశీ బిజీ కానున్నాడు. అయితే, అంతకంటే ముందే మరో దేశీ టీ20 లీగ్‌లో అతడు భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.IPL కంటే ముందే ఆ టీ20 లీగ్‌లోక్రిక్‌బజ్‌ కథనం ప్రకారం.. దేశీ కార్పొరేట్‌ టీ20 ఈవెంట్‌ డీవై పాటిల్‌ టీ20 టోర్నమెంట్లో వైభవ్‌ పాల్గొననున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులతో చర్చలు తుదిదశకు చేరినట్లు సమాచారం. కాగా ఈ కాంపిటిషన్‌ ఫిబ్రవరి 23న మొదలుకానుంది.హార్దిక్‌ పాండ్యా సైతందేశీ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా డీవై పాటిల్‌ టీ20 టోర్నమెంట్లో ఆడతారు. ఐపీఎల్‌ కంటే ముందే పొట్టి క్రికెట్‌ వైబ్‌ ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ కంటే ముందు ఈ టోర్నీలో ఆడటం యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. నవీ ముంబై వేదికగా జరిగే గతేడాది ఈ టోర్నీలో హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా వంటి స్టార్‌ ప్లేయర్లు ఆడారు. శివం దూబే, నేహాల్‌ వధేరా, దీపక్‌ చహర్‌ తదితరులు కూడా భాగమయ్యారు.పైసా వసూల్‌ ప్రదర్శనకాగా దేశీ క్రికెట్‌లో సత్తా చాటి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ దృష్టిని ఆకర్షించాడు వైభవ్‌ సూర్యవంశీ. ఈ చిచ్చరపిడుగు కోసం రాయల్స్‌ ఏకంగా 1.10 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందుకు తగినట్లుగానే ఈ బిహారీ పిల్లాడు పైసా వసూల్‌ ప్రదర్శన ఇచ్చాడు. సంజూ శాంసన్‌ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌కు జోడీగా ఓపెనర్‌గా వచ్చి.. తానేంటో నిరూపించుకున్నాడు.గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేయడంతో వైభవ్‌ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో అదరగొట్టి యూత్‌ వన్డే, యూత్‌ టెస్టుల్లో ధనాధన్‌ శతకాలతో ఆకట్టుకున్నాడు వైభవ్‌. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026 సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరి 21 వరకు ట్రెయినింగ్‌ సెషన్‌లో వైభవ్‌ పాల్గొనున్నాడు. చదవండి: ENG vs WI: నేపాల్‌ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్‌

Big Twist Bangladesh Fresh U Turn After Blaming Players For T20 WC Boycott9
T20 WC 2026: మళ్లీ మాట మార్చిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ మరోసారి మాట మార్చింది. పదే పదే యూటర్న్‌లు తీసుకుంటూ నవ్వులపాలు అవుతోంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి బంగ్లాదేశ్‌ తప్పుకొన్న విషయం తెలిసిందే.భారత్‌లో తమకు భద్రత ఉండదని.. తమ వేదికను మరో ఆతిథ్య దేశం శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది బంగ్లాదేశ్‌. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) బంగ్లా వాదనను కొట్టిపడేస్తూ పునరాలోచన చేయాలని గడువు ఇచ్చింది. అయినప్పటికీ తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం టోర్నీ నుంచి వైదొలగడానికైనా సిద్ధమే కానీ.. భారత్‌లో ఆడమని భీష్మించుకుని కూర్చుంది.బంగ్లాదేశ్‌ను తప్పించిఫలితంగా బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి అనుమతించింది ఐసీసీ. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ జోక్యం చేసుకుని బంగ్లాకు మద్దతుగా నిలిచింది. తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామని నాటకాలు ఆడింది. అయితే, ఐసీసీ రంగంలోకి దిగగా.. పాక్‌ భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించింది.ఆటగాళ్ల నిర్ణయమే ఇదిఅదే విధంగా.. బంగ్లాదేశ్‌పై ఎలాంటి పెనాల్టీలు విధించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం బంగ్లా క్రికెట్‌ బోర్డు, క్రికెటర్లు కలిసి టోర్నీని బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.ఇందులో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నాడు. గతంలో ఇదే వ్యక్తి ప్రభుత్వం ఆదేశించినట్లుగానే టోర్నీ నుంచి తప్పుకొంటున్నామని తెలిపాడు. ఆ తర్వాత ఈమేరకు నాలుక మడతేశాడు. దీంతో ఆసిఫ్‌ నజ్రుల్‌, బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.మరోసారి మాట మార్చేశాడుఈ క్రమంలో నష్టనివారణ చర్యలకు దిగిన ఆసిఫ్‌ నజ్రుల్‌ మరోసారి మాట మార్చాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఆడకూడదన్నది మా ప్రభుత్వ నిర్ణయమే. మరోసారి ఈ విషయాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించాడు.మీడియాతో మాట్లాడటానికి తాను పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడంతో బీసీబీ, క్రికెటర్ల నిర్ణయమేనని అనుకోకుండా చెప్పేశానని పేర్కొన్నాడు. తన మాటల్ని అందరూ అపార్థం చేసుకున్నారని నజ్రుల్‌ కవర్‌ చేశాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆటగాళ్లు శిరసా వహించారని.. ఈ విషయంలో వారికి క్రెడిట్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే అలా మాట్లాడానని చెప్పుకొచ్చాడు.పరువు పాయేదీంతో నెటిజన్లు బంగ్లాదేశ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ను నిందించాలనే తొందరలో మీ ఆటగాళ్లను కూడా బలి చేసేందుకు సిద్ధపడి.. పరువు తీసుకుంటున్నారని చురకలు అంటిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ మొదలైంది.చదవండి: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌

Thank God: Harry Brook Reaction after losing to West Indies goes viral10
నేపాల్‌ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో ఇంగ్లండ్‌ తడబడుతోంది. గ్రూప్‌-‘సి’లో భాగంగా తొలుత నేపాల్‌తో తలపడ్డ హ్యారీ బ్రూక్‌ బృందం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తాజాగా బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం వెస్టిండీస్‌ ముందు తలవంచింది.వెస్టిండీస్‌దే పైచేయిటీ20 ప్రపంచకప్‌ను రెండేసి సార్లు గెలుచుకున్న ఈ మాజీ చాంపియన్ల మధ్య ముంబైలో జరిగిన పోరులో వెస్టిండీస్‌దే పైచేయి అయింది. వాంఖెడే మైదానంలో విండీస్‌ స్పిన్‌ను ఎదుర్కోలేక ఇంగ్లండ్‌ విలవిల్లాడింది. ఫలితంగా విండీస్‌ చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.నిరాశకు గురయ్యాంఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ తమ పరాజయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నిరాశకు గురయ్యాం. ఓటమి ఎల్లప్పుడూ బాధిస్తుంది. అయితే, ఈరోజు వెస్టిండీస్‌ అత్యద్భుతంగా ఆడింది. ఆ జట్టులో పవర్‌ హిట్టర్లు ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు.ప్రత్యర్థి బౌలర్‌ కాస్త తడబడినా వారు ఆ డెలివరీని సిక్సర్‌గా మలుస్తారు. అయితే, ఈరోజు వాళ్లు చేసిన స్కోరు ఛేదించదగ్గదే. మేము ఆశించినంతగా మంచు ప్రభావం లేదు. మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.సాల్ట్‌ విధ్వంసకర ప్లేయర్‌మా ప్రణాళికలను సరిగ్గా అమలుచేయలేకపోయాము. టాపార్డర్‌ విషయంలో నేనేమీ మాట్లాడలేను. టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. సాల్ట్‌ విధ్వంసకర ప్లేయర్‌. ఇక జోస్‌ బట్లర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేపాల్‌ మీదైనా గెలిచాంఇప్పటికీ టోర్నీలో ముందుకు వెళ్లగలమనే నమ్మకం ఉంది. గత మ్యాచ్‌లో నేపాల్‌ మీదైనా గెలిచినందుకు దేవుడికి ధన్యవాదాలు. లేదంటే మేము కష్టాల్లో కూరుకుపోయేవాళ్లం. తదుపరి స్కాట్లాండ్‌, ఇటలీలపై సత్తా చాటి ముందుకు సాగుతాము’’ అని బ్రూక్‌ చెప్పుకొచ్చాడు.196 పరుగుల భారీ స్కోరుకాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ముందుగా వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ (42 బంతుల్లో 76 నాటౌట్‌; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. రోస్టన్‌ ఛేజ్‌ (29 బంతుల్లో 34; 6 ఫోర్లు), హోల్డర్‌ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.స్పిన్నర్ల మాయాజాలం ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్, జేమీ ఒవర్టన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్‌ 19 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. జేకబ్‌ బెతెల్‌ (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఫిల్‌ సాల్ట్‌ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా... జోస్‌ బట్లర్‌ (21), కెప్టెన్‌ హారీ బ్రూక్‌ (17) ప్రభావం చూపలేకపోయారు.చివర్లో స్యామ్‌ కరన్‌ (30 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. విండీస్‌ స్పిన్నర్లు గుడకేశ్‌ మోతీ 3, రోస్టన్‌ ఛేజ్‌ 2, అకీల్‌ హొసీన్‌ ఒక వికెట్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. చదవండి: SA vs AFG: ‘డబుల్‌ సూపర్‌’ ధమాకా

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement