ప్రధాన వార్తలు
అతడి కారణంగానే రాజ్కోట్లో ఓడిపోయాం: ఇర్ఫాన్ పఠాన్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 285 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు.భారత బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్తో పాటు బంతితో విఫలమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై పఠాన్ విమర్శలు గుప్పించాడు. జడేజా నెమ్మదిగా ఆడడమే వల్లే భారత్ 300 పరుగులు దాటలేకపోయిందని పఠాన్ అభిప్రాయపడ్డాడు.రాజ్కోట్ వన్డేలో భారత్ స్కోర్ సునాయసంగా 300 పరుగుల మార్క్ దాటి ఉండేది. ఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 90 స్ట్రైక్ రేట్తో సెంచరీ చేస్తే.. జడేజా మాత్రం తన సొంత మైదానంలో 60 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కనీసం 80 స్ట్రైక్ రేట్తో ఆడి ఉంటే భారత్ అదనంగా మరో 20-30 పరుగులు వచ్చేవి. జడేజా అద్భుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.టెస్ట్ క్రికెట్లో కపిల్ దేవ్ తర్వాత అంత పేరు తెచ్చుకున్న ఆల్రౌండర్గా జడ్డూ నిలిచాడు. కానీ వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా అతడు కష్టపడుతున్నాడు.2020 తర్వాత జడేజా వన్డేల్లో ఇప్పటివరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. గత ఐదు మ్యాచ్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఒక సీనియర్ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శనలు జట్టుకు అస్సలు మంచిది కాదు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను ఆడించడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్లో పఠాన్ పేర్కొన్నాడు.చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్
స్టీవ్ స్మిత్ విధ్వంసకర సెంచరీ.. వణికిపోయిన బౌలర్లు! వీడియో
బిగ్ బాష్ లీగ్-2025లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో సిడ్నీ సిక్సర్సకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్.. శుక్రవారం సిడ్నీ థండర్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 190 పరుగుల లక్ష్య చేధనలో స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన స్మిత్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సిడ్నీ థండర్ బౌలర్ రైన్ హాడ్లీని స్మిత్ టార్గెట్ చేశాడు. రైన్ హాడ్లీ వేసిన 12వ ఓవర్లో స్మిత్ వరుసగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్తో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 41 బంతుల్లో తన నాలుగో బీబీఎల్ సెంచరీ మార్క్ను స్మిత్ అందుకున్నాడు.స్మిత్ 5 ఫోర్లు, 9 సిక్స్లతో సరిగ్గా వంద పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు బాబర్ ఆజం(39 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సిడ్నీ సిక్సర్ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి చేధించింది. సిడ్నీకి ఇది వరుసగా నాలుగో విజయం.వార్నర్ సెంచరీ వృథా..ఇక ఇదే మ్యాచ్లో ఆసీస్ మాజీ ఓపెనర్, సిడ్నీ థండర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా శతక్కొట్టాడు. 65 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 110 పరుగులు చేసి వార్నర్ అజేయంగా నిలిచాడు. మిగితా ప్లేయర్ల నుంచి పెద్దంగా సహకరం లేకపోవడంతో సిడ్నీ 200 పరుగుల మార్క్ను దాటలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సిడ్నీ సిక్సర్స్ బౌలర్లలో సామ్కుర్రాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఎడ్వర్డ్స్, స్టార్క్, బెన్ మనేంటి తలా వికెట్ సాధించారు. కాగా వార్నర్కు ఈ ఏడాది సీజన్లో ఇది రెండో సెంచరీ.స్మిత్ సరికొత్త చరిత్రఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన స్మిత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంతవేగవంతమైన సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో మిచెల్ ఓవెన్, క్రెయిగ్ సిమన్స్ అగ్రస్దానంలో ఉన్నారు. వీరిద్దరూ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నారు.అంతేకాకుండా బిగ్ బాష్ లీగ్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా స్మిత్(4) రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్, బెన్ మెక్డెర్మాట్ల పేరిట ఉండేది. వారిద్దరూ తమ బీబీఎల్ కెరీర్లో మూడు సెంచరీలు చేశాడు. తాజా సెంచరీతో వీరిద్దరిని స్మిత్ వెనక్కి నెట్టాడు.చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్32 RUNS OFF ONE OVER!Steve Smith hit four sixes in a row in this wild over at the SCG. #BBL15 pic.twitter.com/fSPEaw3Xoo— KFC Big Bash League (@BBL) January 16, 2026
కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఘోర పరభావం ఎదురైన సంగతి తెలిసిందే. భారత్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఆదివారం(జనవరి 18) ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది.అయితే తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను బెంచ్కే పరిమితం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అర్ష్దీప్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికి అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణల వైపు టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ను కనీసం మూడో వన్డేలోనైనా తుది జట్టులోకి తీసుకోవాలని హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ను భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు."బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లకు అయితే హిట్-ది-డెక్ బౌలర్ అవసరం. కానీ న్యూజిలాండ్తో అటువంటి బౌలర్లు అవసరం లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని నేను ఆర్ధం చేసుకోగలను. కానీ అర్ష్దీప్ గురుంచి ఎవరూ ఆలోచించడం లేదు.అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి చేరుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అయినా ఇప్పటికీ అతడు జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. బ్యాటర్ల విషయంలో ఇలా ఎప్పుడూ జరగదు. ప్రతీసారి బౌలర్లే బలి అవుతున్నారు.అత్యుత్తమంగా రాణించినా బౌలర్లు కూడా తమ చోటును కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాల్సి వస్తోంది. ఎక్కువ కాలం మ్యాచ్లు ఆడకుండా బెంచ్పై కూర్చోబెడితే, ఎంతటి గొప్ప బౌలర్ అయినా తన రిథమ్ను కోల్పోవాల్సి వస్తుంది. కనీసం మూడో వన్డేలోనైనా అతడికి ఛాన్స్ ఇవ్వండి" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు
అఫ్గానిస్తాన్కు భారీ షాక్..
టీ20 ప్రపంచకప్-2026కు ముందు అఫ్గానిస్తాన్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ గాయం కారణగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. నవీన్ గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నాడు.అయితే వరల్డ్కప్ సమయానికి అతడు కోలుకుంటాడని జట్టులో సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. కానీ అతడి గాయం తీవ్రత మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు నెలాఖరులో తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు సమాచారం.ఈ కారణంతోనే వరల్డ్కప్తో పాటు వెస్టిండీస్తో టీ20 సిరీస్కు అతడు దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరి కొన్ని నెలల పట్టనున్నట్లు అఫ్గాన్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ రైట్ ఆర్మ్ పేసర్ దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆసియాకప్-2025కు కూడా దూరంగా ఉన్నాడు. కాగా నవీన్ స్దానంలో ఇంకా అధికారికంగా ఎవరినీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ, అల్లా గజన్ఫర్ లేదా ఇజాజ్ అహ్మద్జాయ్లలో ఒకరు ప్రధాన జట్టులోకి వచ్చే అవకాశముంది.టీ20 ప్రపంచ కప్ 2026కు అఫ్గాన్ జట్టు:రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెడిఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా, రమ్మానులీ, రమ్మతుల్లా, ఉమర్జాయి, జద్రాన్. రిజర్వ్లు: అల్లా ఘజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్ మరియు జియా ఉర్ రెహ్మాన్ షరీఫీచదవండి: T20 WC 2026: అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు
అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు
టీ20 ప్రపంచకప్-2026కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో సుందర్ గాయపడ్డాడు.దీంతో ఆఖరి రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడు టీ20 వరల్డ్కప్లో కూడా పాల్గోనడం కూడా అనుమానంగా మారింది. సుందర్ ప్రస్తుతం పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. తొలుత అతడిది సాధారణ వెన్ను నొప్పి అని వైద్యులు భావించారు. కానీ తర్వాత స్కాన్లలో అతడి గాయం తీవ్రమైనది తేలింది.దీంతో వాషింగ్టన్ మరో రెండు మూడు రోజుల్లో పునరావాసం పొందేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లనున్నాడు. అక్కడి వైద్య బృందం సుందర్ పూర్తిగా కోలుకోవడానికి పట్టే సమయంపై స్పష్టత ఇవ్వనున్నారు. అయితే సుందర్ విషయంలో బీసీసీఐ ప్లాన్ బితో ఉన్నట్లు తెలుస్తోంది."వాషింగ్టన్ సుందర్ వరల్డ్కప్ లీగ్ దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండే సూచనలు కన్పించడం లేదు. కాబట్టి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ బ్యాకప్ ప్లాన్ గురుంచి కచ్చితంగా ఆలోచించాలి. మెడికల్ టీమ్ నుంచి పూర్తి రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.భారత్ తమ మొదటి రౌండ్ మ్యాచ్లు ఎక్కువగా అసోసియేట్ జట్లతో ఆడాల్సింది. కాబట్టి ప్రస్తుతానికి సుందర్ స్ధానంలో ఎవరినీ భర్తీ చేసే ఆలోచనలో సెలెక్టర్లు ఉండకపోవచ్చు. అతడు కోలుకోవడానికి తగినంత సమయం దొరికే అవకాశముంది. సుందర్ జట్టుతో పాటు కొనసాగే అవకాశముంది.ఒకవేళ అతడు టోర్నీ కీలక దశ సమయానికి కోలుకుంటే నేరుగా ప్లేయింగ్ ఎలెవన్లో రానున్నాడని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా జనవరి 31 లోపు జట్లలో మార్పులు చేసుకునే అవకాశముంది. ఒకవేళ సుందర్ గ్రూప్ దశ దాటాక కూడా కోలుకోలేడని తేలితే, అతడి స్ధానంలో మరొక ఆటగాడిని బీసీసీఐ తీసుకుంటుంది. సుందర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు రియాన్ పరాగ్, అయూశ్ బదోని, షాబాజ్ అహ్మద్ వంటి వారు రేసులో ఉన్నారు.చదవండి: The Hundred 2026: స్మృతి మంధాన కీలక నిర్ణయం
కష్టాల్లో ఉన్న జట్టును వదిలేసిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్ బరిలోకి దిగిన ఆ జట్టు.. అనూహ్య పరాజయాలు (8 మ్యాచ్ల్లో 5) ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఎలిమినేషన్ అంచును ఆ జట్టును తాజాగా రషీద్ ఖాన్ వీడి వెళ్లాడు. జాతీయ విధులకు (వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోసం) హాజరయ్యేందుకు రషీద్ సౌతాఫ్రికా టీ20 లీగ్ నుంచి తప్పుకున్నాడు.కష్ట సమయాల్లో రషీద్ వెళ్లిపోవడం మినుకుమినుకుమంటున్న ఎం కేప్టౌన్ ప్లే ఆఫ్స్ బెర్త్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసింది. రషీద్ స్థానంలో యాజమాన్యం పొట్టి క్రికెట్ దిగ్గజం కీరన్ పోలార్డ్ను జట్టులో చేర్చుకుంది. పోలార్డ్ జట్టులో చేరినా ఎంఐ ఫేట్ మారే అవకాశం లేదు. ఎందుకంటే ఆ జట్టుకు మరో రెండు అవకాశాలు (మ్యాచ్లు) మాత్రమే ఉన్నాయి.ఈ రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధిస్తే.. ఎం కేప్టౌన్ ఫేట్ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ సీజన్లో ఆ జట్టు అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమవుతుంది. బ్యాటింగ్లో నికోలస్ పూరన్, రస్సీ వాన్ డర్ డసెన్, జేసన్ స్మిత్ లాంటి కీలక ఆటగాళ్లు స్థిరంగా పరుగులు చేయలేకపోతున్నారు. బౌలింగ్లో స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఫామ్లో లేడు. ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేయడం, లేని పరుగులను సమర్పించుకోవడం లాంటి పొరపాట్లు చేస్తున్నారు. తదుపరి మ్యాచ్ల్లో ఈ లోపాలను అధిగమించగలిగితే ఎంఐ కేప్టౌన్ విజయాల బాట పట్టవచ్చు. పోలార్డ్ తన పవర్ హిట్టింగ్, ఫీల్డింగ్, మీడియం పేస్ బౌలింగ్తో కేప్టౌన్లో ప్లే ఆఫ్స్ దిశగా నడిపించాలని ఆ ఫ్రాంచైజీ అభిమానులు కోరుకుంటున్నారు. పోలార్డ్ 2024 ఎడిషన్లో రషీద్ ఖాన్ గాయపడినప్పుడు కేప్టౌన్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ సీజన్లో అతను 188 స్ట్రయిక్రేట్తో పరుగులు చేసి, 4 వికెట్లు తీశాడు. పోలార్డ్ మరో 101 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడతాడు.కాగా, ప్రస్తుత ఎడిషన్లో పార్ల్ రాయల్స్, సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. మిగతా బెర్త్ల కోసం ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్టౌన్ పోటపడుతున్నాయి.
ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం.. జోష్లో కేకేఆర్ ఫ్యాన్స్
బిగ్బాష్ లీగ్ 2025-26లో పెర్త్ స్కార్చర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న కేకేఆర్ ఆటగాడు ఫిన్ అలెన్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా స్కార్చర్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్లో అలెన్కు ఇది ఐదో శతకం. బీబీఎల్లో మొదటిది. ఈ సెంచరీ స్కార్చర్స్ అభిమానులతో పాటు కేకేఆర్ ఫ్యాన్స్లోనూ జోష్ నింపింది. అలెన్కు కేకేఆర్ 2026 సీజన్ వేలంలో రూ. 2 కోట్లకు దక్కించుకుంది. రెనెగేడ్స్తో మ్యాచ్లో తొలుత నిదానంగా ఆడిన అలెన్.. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు. కేవలం 17 బంతుల్లోనే రెండో అర్ద సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. గురిందర్ సంధు వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అలెన్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం మ్యాచ్ మొత్తానికి హైలైట్గా నిలిచింది.ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అలెన్ ఊచకోత కోయడంతో స్కార్చర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్.. అలెన్ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్లో అలెన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మిచెల్ మార్ష్ 20, కూపర్ కన్నోలీ 18, ఆరోన్ హార్డీ 22, ఆస్టన్ టర్నర్ 13, లారీ ఈవాన్స్ 21, నిక్ హాబ్సన్ 3 పరుగులకు ఔటయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో సామ్ ఇలియట్ 4 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ తడబడింది. టిమ్ సీఫర్ట్ (66), జేక్ ఫ్రేజర్ (42) మాత్రమే రాణించారు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా ఔటైపోయారు. స్కార్చర్స్ బౌలర్లు కన్నోలీ, బియర్డ్మన్ తలో 2, లూక్ హాల్ట్, ఆరోన్ హార్డీ చెరో వికెట్ తీసి రెనెగేడ్స్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. వీరి ధాటికి రెనెగేడ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది.
రెండు రోజుల్లో ఇద్దరు.. క్రికెట్లో ఈ 'రిటైర్డ్ ఔట్' అంటే ఏంటి..?
పొట్టి క్రికెట్లో ఇటీవలికాలంలో 'రిటైర్డ్ ఔట్' అనే పదం తరుచూ వినిపిస్తుంది. రిటైర్డ్ ఔట్ అంటే ఆటగాడు ఇన్నింగ్స్ మధ్యలో గాయం కాని, అనారోగ్యానికి కాని గురి కాకుండానే పెవిలియన్కు చేరడం. సాధారణంగా ఎవరైనా ఆటగాడు గాయం లేదా అనారోగ్యానికి గురైతే రిటైర్డ్ హర్ట్ లేదా రిటైర్డ్ నాటౌట్గా పెవిలియన్కు చేరతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి కెప్టెన్ అనుమతిస్తే, ఆ ఆటగాడు తిరిగి బ్యాటింగ్ కొనసాగించవచ్చు.కానీ, రిటైర్డ్ ఔట్ విషయంలో అలా కాదు. ఒక్కసారి ఆటగాడు ఈ కారణంగా క్రీజ్ వదిలితే తిరిగి బ్యాటింగ్కు దిగటానికి వీలుండదు. పొట్టి ఫార్మాట్లో కీలక సమయాల్లో బ్యాటర్లు నిదానంగా ఆడుతున్నప్పుడు రిటైర్డ్ ఔట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారు. వూహ్యాల్లో భాగంగా ఇలా జరుగుతుంటుంది.అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్డ్ ఔట్లు చాలా తక్కువగా నమోదైనప్పటికీ.. పొట్టి క్రికెట్లో, ముఖ్యంగా ఇటీవలికాలంలో ఈ తరహా ఔట్లు ఎక్కువుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఐపీఎల్ (WPL) 2026 ఎడిషన్లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దర్లు బ్యాటర్లు రిటైర్డె్ ఔట్గా వెనుదిరిగారు.గుజరాత్ జెయింట్స్ తరఫున అరంగేట్రం ప్లేయర్ ఆయుశ్ సోని, యూపీ వారియర్జ్ తరఫున హర్లీన్ డియోల్ గంటల వ్యవధిలో రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు చేరారు. ఈ ఇద్దరు నిదానంగా ఆడుతున్నారన్న కారణంగా వారి జట్టు మేనేజ్మెంట్ ఇలా చేసింది. రిటైర్డ్ ఔట్పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. పొట్టి క్రికెట్లో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఎవరైనా బ్యాటర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఈ అస్త్రాన్ని ప్రయోగించి అతన్ని తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వవచ్చు. మహిళల ఐపీఎల్లో రిటైర్డ్ ఔటైన తొలి ప్లేయర్ ఆయుశ్ సోని అయితే.. ఐపీఎల్లో ఈ తరహాలో ఔటైన తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు.యాష్ 2022 ఎడిషన్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో నిదానంగా ఆడుతున్నందుకు మేనేజ్మెంట్ అతన్ని రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పిలిపించింది. ఇలాంటి ఉదంతాలే ఐపీఎల్లో మరో మూడు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.2023 ఎడిషన్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్, అదే ఎడిషన్లో పంజాబ్ ఆటగాడు అథర్వ తైడే, 2025 ఎడిషన్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగారు. ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన ఆటగాళ్లు కేవలం నలుగురే అయినప్పటికీ.. ప్రపంచవాప్తంగా జరిగే వేర్వేరు లీగ్ల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.అంతర్జాతీయ క్రికెట్లోనూ పలువురు ఆటగాళ్లు ఈ తరహాలో ఔటయ్యారు. శ్రీలంకకు చెందిన మర్వన్ ఆటపట్టు, మహేళ జయవర్దనే (2001), భూటాన్కు చెందిన సోనం టోబ్గే (2019), నమీబియాకు చెందిన నికోలాస్ డావిన్ (2014) రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు చేరారు. వీరిలో ఆటపట్టు, జయవర్దనే టెస్ట్ ఫార్మాట్లో, అదీ ఒకే మ్యాచ్లో (బంగ్లాదేశ్పై) రిటైర్డ్ ఔట్ కావడం విశేషం. ఆటపట్టు డబుల్ సెంచరీ పూర్తి చేశాక, జయర్దనే 150 పరుగులు పూర్తి చేశాక రిటైర్డ్ ఔటయ్యారు.అంతర్జాతీయ టీ20ల్లో రిటైర్డ్ ఔటైన తొలి ఆటగాడు టోబ్గే అయితే.. టీ20 ప్రపంచకప్లో ఈ తరహా ఔటైన తొలి ఆటగాడిగా నికోలాస్ డావిన్ రికార్డుల్లోకెక్కాడు.
మరో సూపర్ జెయింట్.. పేరు మార్చుకున్న మరో ఫ్రాంచైజీ
ఫ్రాంచైజీ క్రికెట్లోకి మరో సూపర్ జెయింట్ వచ్చింది. హండ్రెడ్ లీగ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్గా మారింది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటికే రెండు సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, సౌతాఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జెయింట్స్. ఈ రెండు సహా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధినేత సంజీవ్ గొయెంకా చేతుల్లో ఉన్నాయి.మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్గా రూపాంతరం చెందిన తర్వాత కొత్త లోగోను గురువారం ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో ఇంగ్లండ్ స్టార్ వికెట్కీపర్ జోస్ బట్లర్ (పురుషుల హండ్రెడ్), అదే దేశానికి చెందిన స్పిన్ బౌలర్ సోఫీ ఎక్ల్స్టోన్ (మహిళల హండ్రెడ్)ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. బట్లర్ మరో సూపర్ జెయింట్లోనూ (డర్బన్ సూపర్ జెయింట్స్) భాగంగా ఉన్నాడు.లక్నో, డర్బన్ సూపర్ జెయింట్స్ లోగోల్లోని బ్రాండింగ్కి భిన్నంగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగోలో ఏనుగు ప్రతీక ఉండటం గమనించదగ్గ విషయం. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా మాట్లాడుతూ.. మాంచెస్టర్ ఒక గొప్ప క్రీడా నగరం. సూపర్ జెయింట్స్ కుటుంబంలో భాగమవ్వడం గర్వకారణం. జోస్ బట్లర్ వంటి ఆటగాళ్లు మా జట్టులో ఉండటం ఆనందదాయకమిని పేర్కొన్నారు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ బట్లర్, ఎక్లెస్టోన్తో పాటు మరికొంత మందిని కూడా రీటైన్ చేసుకుంది. పురుషుల విభాగంలో హెన్రిచ్ క్లాసెన్, నూర్ అహ్మద్ను తిరిగి దక్కించుకుంది. కొత్తగా పురుషుల విభాగంలో లియామ్ డాసన్.. మహిళల విభాగంలో మెగ్ లాన్నింగ్, స్మృతి మంధనను జట్టులోకి తీసుకుంది.కాగా, మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్గా రూపాంతరం చెందక ముందు మరో రెండు హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీల పేర్లు మారాయి. ముంబై ఇండియన్స్ ఓనర్షిప్లో నడిచే ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఎంఐ లండన్గా, సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్షిప్లో నడిచే నార్తర్న్ సూపర్చార్జర్స్ సన్రైజర్స్ లీడ్స్గా రూపాంతరం చెందాయి.జులై 21 నుంచి ప్రారంభం ది హండ్రెడ్ లీగ్ 2026 పురుషులు, మహిళల విభాగాల్లో జులై 21 నుంచి ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంచైజీలకు జనవరి చివరి వరకు నాలుగు ప్రీ-ఆక్షన్ సైనింగ్లకు అవకాశం ఉంది. ప్రధాన ఆక్షన్ మార్చిలో జరగనుంది.
సౌతాఫ్రికా టీ20 లీగ్లో సంచలనం.. రాయల్స్ బౌలర్ హ్యాట్రిక్
సౌతాఫ్రికా టీ20 లీగ్లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. 2025-26 ఎడిషన్లో భాగంగా నిన్న (జనవరి 15) ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పార్ల్ రాయల్స్ బౌలర్ ఓట్నీల్ బార్ట్మన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఇదే ఎడిషన్లో కొద్ది రోజుల కిందట ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. తాజాగా ప్రిటోరియాతో జరిగిన మ్యాచ్లో బార్ట్మన్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసి రాయల్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. బార్ట్మన్ (4-1-16-5) ధాటికి 19.1 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. హర్డస్ విల్యోన్, సికందర్ రజా తలో 2, ఫోర్టుయిన్ ఓ వికెట్ తీశారు. ప్రిటోరియా ఇన్నింగ్స్లో షాయ్ హోప్ (25), డెవాల్డ్ బ్రెవిస్ (21), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (29), ఆండ్రీ రసెల్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. జోర్డన్ కాక్స్, లిజాడ్ విలియమ్స్, లుంగి ఎంగిడి డకౌటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్ 15.1 ఓవర్లలో ఛేదించింది. రూబిన్ హెర్మన్ (46), డాన్ లారెన్స్ (41), డేవిడ్ మిల్లర్ (28 నాటౌట్) ఆ జట్టును గెలిపించారు. ప్రిటోరియా బౌలర్లలో లిజాడ్ విలియమ్స్ 2, ఎంగిడి, పీటర్స్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా పార్ల్ రాయల్స్ ఈ ఎడిషన్ ప్లే ఆఫ్స్కు చేరింది. రాయల్స్తో పాటు సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మిగతా బెర్త్ల కోసం ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ పోటీపడుతున్నాయి.
12 ఏళ్ల తర్వాత భారత్కు ఫిఫా ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత భారత్లోకి అ...
ముగిసిన సింధు పోరాటం.. సెమీస్లో ఓటమి
మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు...
ఇక నుంచి రూ. 20 లక్షలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు...
ఆటుపోట్లను దాటుకుంటూ... అడ్డంకులు ఎదురైనా..
గ్రేటర్ నోయిడా: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన...
ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం.. జోష్లో కేకేఆర్ ఫ్యాన్స్
బిగ్బాష్ లీగ్ 2025-26లో పెర్త్ స్కార్చర్స్కు ...
రెండు రోజుల్లో ఇద్దరు.. క్రికెట్లో ఈ 'రిటైర్డ్ ఔట్' అంటే ఏంటి..?
పొట్టి క్రికెట్లో ఇటీవలికాలంలో 'రిటైర్డ్ ఔట్' అ...
మరో సూపర్ జెయింట్.. పేరు మార్చుకున్న మరో ఫ్రాంచైజీ
ఫ్రాంచైజీ క్రికెట్లోకి మరో సూపర్ జెయింట్ వచ్చిం...
సౌతాఫ్రికా టీ20 లీగ్లో సంచలనం.. రాయల్స్ బౌలర్ హ్యాట్రిక్
సౌతాఫ్రికా టీ20 లీగ్లో రెండో హ్యాట్రిక్ నమోదైంది...
క్రీడలు
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
మహిళా షూటర్ పై లైంగిక దాడి.. జాతీయ కోచ్ అంకుశ్ పై వేటు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!
