ప్రధాన వార్తలు
‘వైభవ్తో పోల్చద్దు’.. జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్కు రాజస్తాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. పంజాబ్ విధించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభమివ్వగా.. ఆఖర్లో శుభమ్ దూబే, డొనొవన్ ఫెరీరాలు దూకుడుగా ఆడి రాజస్తాన్ను గెలిపించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ను వైభవ్ సూర్యవంశీకి అందించాడు. ఈ సందర్భంగా జైస్వాల్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు సంతోషాన్నిస్తుందని చెప్పాడు. జైస్వాల్ మాట్లాడుతూ.. ‘నేను వయసులో పెద్దోడిని ఎంతమాత్రం కాదు. ఎందుకంటే నేనింకా చిన్నవాడినే. ఇక నా సహచర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో నన్ను పోల్చద్దు. వయసులో అతడు నాకంటే ఇంకా చిన్నవాడు. కాబట్టి అతడితో నన్ను పోలిస్తే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కానీ ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. అతను బంతిని హిట్ చేస్తున్న తీరు చూస్తుంటే నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న నేను అలా చూస్తూ ఉండిపోతున్నా. వైభవ్లో ఉన్న ప్రతిభ అసాధారణం.ఇది హై-స్కోరింగ్ గ్రౌండ్ అని మాకు తెలుసు. అందుకే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. బంతులను అస్సలు వదలకూడదనే స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగాం. 200 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఆ 'ఇంటెంట్' చాలా ముఖ్యం. అందరూ ప్రతి మ్యాచ్లో రాణించాలంటే కుదరదు. కానీ తమ జట్టులో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంది. మేమంతా ఆ విషయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాం. దానిని ఆచరణలో పెడితే సరైన సమయంలో ఫలితాలు వస్తాయని భావించాం. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉంది. మేమంతా కలిసి ఈ ఆటను ఆస్వాదిస్తున్నాం.’ అని చెప్పుకొచ్చాడు.ఇక సీజన్లో జైస్వాల్ 9 మ్యాచ్ల్లో 306 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక సీజన్ ఆరంభం నుంచి బ్యాటింగ్లో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ 9 మ్యాచ్ల్లో 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అతడి ఖాతాలో ఒక సెంచరీ సహా రెండు హాఫ్ సెంచరీలున్నాయి. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.The duo that is fun to watch on the pitch and even off it 😄 💪🎥 Hear from Yashasvi Jaiswal on how it is batting with Vaibhav Sooryavanshi 🩷🤝#TATAIPL | #KhelBindaas | #PBKSvRR | @rajasthanroyals pic.twitter.com/HICh8l5VIc— IndianPremierLeague (@IPL) April 28, 2026చదవండి: చిక్కుల్లో ఆర్సీబీ బౌలర్.. ఎందుకంటే?
చిక్కుల్లో ఆర్సీబీ బౌలర్.. ఎందుకంటే?
ఐపీఎల్ 2026 సీజన్ రెండో ఫేజ్ మ్యాచ్లు మొదలయ్యాయి. తొలి సగం ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్లో నిలవగా.. వరుస పరాజయాలతో లక్నో సూపర్జెయింట్స్ ఆఖరి స్థానానికి పరిమితమైంది. సీజన్ ఆరంభం నుంచి పంజాబ్, ఆర్సీబీ, రాజస్తాన్, ఎస్ఆర్హెచ్ విజయాలతో వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.మరి రెండో సగం కూడా పూర్తయ్యేసరికి ఈ జట్లే టాప్-4లో ఉంటాయా లేక ఏమైనా మార్పులు ఉంటాయా అంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. ఇదిలా ఉంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ ఐపీఎల్ 19వ సీజన్కు సంబంధించి బెస్ట్ స్టేడియాల జాబితా (ఒకటి నుంచి పది వరకు)ను ఎక్స్ వేదికగా విడుదల చేశాడు. ఆర్సీబీకి ఆడుతున్న హాజిల్వుడ్ తన హోంగ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి నంబర్వన్ స్థానాన్ని ఇచ్చాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మాత్రం హాజిల్వుడ్ 10వ స్థానం కేటాయించడం అతడిని చిక్కుల్లో పడేసినట్లయింది. తాను చెన్నై గ్రౌండ్లో ఆడటాన్ని ఆస్వాదించలేకపోయానని, అక్కడ వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఆఖరి స్థానం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. హాజిల్వుడ్ ఇలా తమ హోంగ్రౌండ్కు ఆఖరి స్థానం ఇవ్వడంపై సీఎస్కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 'నచ్చకపోతే వదిలేయాలి అంతేకాని ఇలా చెన్నై స్టేడియాన్ని అవమానించేలా ర్యాంక్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం' అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మన సన్రైజర్స్ హైదరాబాద్ హొంగ్రౌండ్ అయిన ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి హాజిల్వుడ్ ఏడో ర్యాంక్ కేటాయించాడు.హాజిల్వుడ్ టాప్-10 స్టేడియాలు..1. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు2. నరేంద్రమోదీ స్టేడియం, అహ్మదాబాద్3. వాంఖడే స్టేడియం, ముంబై4. హెచ్పీసీఏ స్టేడియం, ధర్మశాల5. పీసీఏ స్టేడియం, మొహలీ6. ఈడెన్ గార్డెన్స్, కోల్కతా7. రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్8. ఎక్నా స్టేడియం, లక్నో9. అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ10. ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నైఐపీఎల్ 19వ సీజన్లో జోష్ హాజిల్వుడ్ ఆర్సీబీకి కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 12 పరుగులిచ్చిన 4 వికెట్లు తీసిన హాజిల్వుడ్ ఐపీఎల్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. మొత్తంగా ఐపీఎల్లో హాజిల్వుడ్ 44 మ్యాచ్లాడి 65 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు నాలుగు వికెట్ల హాల్ అందుకున్నాడు. సీజన్లో ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్ను గురువారం గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.Hazlewood rankings Indian Stadiums: Chinnaswamy is No. 1 ❤️Ahmedabad has to be right up there 🙏Meanwhile, Chennai too hot for me so no. 10 😂 pic.twitter.com/J0VaPtbY5B— Aditya Saha (@Adityakrsaha) April 29, 2026చదవండి: ‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
టీమిండియాకు సెలక్ట్ చేయమని అడగట్లేదు.. కానీ
భారత టీ20 జట్టులో స్థానం కోసం పోటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఈ రేసులో ముందు వరుసలో ఉండగా.. దేవదత్ పడిక్కల్, ఆకిబ్ నబీ, ప్రియాన్ష్ ఆర్య, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పేర్లు కూడా తరచుగా వినిపిస్తున్నాయి.చివరగా అపుడేఅయితే, వీరందరి కంటే అర్హుడైన ఆటగాడు మరొకడు ఉన్నాడని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అంటున్నాడు. గత మూడేళ్లుగా మెరుగ్గా రాణిస్తున్నా అతడిని సెలక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా నిలిచిన భారత జట్టుతో ప్రయాణించాడు జైసూ. ఆ తర్వాత శ్రీలంకతో జూలైలో జరిగిన సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున చివరి టీ20 ఆడాడు. ఇక ఐపీఎల్లో మాత్రం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా జైస్వాల్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజాగా పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో.. 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు యశస్వి జైస్వాల్. పంజాబ్పై రాజస్తాన్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియాకు సెలక్ట్ చేయమని అడగట్లేదు.. కానీ‘‘గత మూడేళ్లుగా అతడి గణాంకాలు పరిశీలించండి. 2024లో వరల్డ్కప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించేశారు. ప్రతి ఆటగాడి కెరీర్లో ఇలాంటివి సహజమే.అయితే, యశస్వి గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. అతడిని కచ్చితంగా భారత టీ20 జట్టుకు ఎంపిక చేయాలని నేను అనడం లేదు. జట్టులో ఇప్పుడు చోటు ఖాళీగా లేదని నాకు కూడా తెలుసు.సెలక్షన్ సంగతి పక్కనపెడితే..కానీ ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంది. గత మూడేళ్లుగా అతడు ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నాడు. సగటు, స్ట్రైక్రేటు కూడా బాగుంది. తన పనిని తాను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. అయినా సరే సెలక్షన్ సంగతి పక్కనపెడితే.. కనీసం చర్చల్లో కూడా ఎవరూ అతడి పేరు తీసుకురావడం లేదు.గంజిలో ఈగ లాగా తీసిపారేశారు. అతడు చేసిన తప్పేంటి?’’ అని ఆకాశ్ చోప్రా టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. కాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లు ఆడిన జైస్వాల్ 306 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గతేడాది 14 మ్యాచ్లలో కలిపి 559.. అదే విధంగా 2024లో 16 మ్యాచ్లలో కలిపి 435 పరుగులు సాధించాడు యశస్వి జైస్వాల్. చదవండి: బాబర్ ఆజం ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
సంజూ, కిషన్లకు పోటీ.. టీమిండియా వైపు దూసుకొస్తున్న సరికొత్త ప్లేయర్
ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో అద్బుతమైన ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లోనూ వీరిద్దరూ సత్తాచాటారు. అయితే వీరికి పోటీగా ఇప్పుడు మరో వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియా వైపు దూసుకొస్తున్నాడు. అతడే పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్. ఐపీఎల్-2026లో ప్రభ్సిమ్రాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఓపెనర్గా పంజాబ్ కింగ్స్కు అతడు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. ప్రభ్సిమ్రాన్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 57.67 సగటుతో 346 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లోనూ అతడు హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రభుసిమ్రాన్ తన ప్రదర్శనలతో నిలకడగా మారుపేరుగా మారాడు. గత సీజన్లోనూ అతడు సత్తాచాటాడు. ఐపీఎల్లో మాత్రమే కాకుండా దేశవాళీ టోర్నీల్లోనూ ప్రభుసిమ్రాన్ అదరగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పంజాబ్ తరపున 9 వన్డే మ్యాచ్ల్లో 55.38 సగటుతో 443 పరుగులు చేశాడు. అదేవిధంగా ఆస్ట్రేలియా-ఏతో జరిగిన వన్డే సిరీస్లో భారత్-ఎ తరపున 102 (68 బంతుల్లో) మెరుపు సెంచరీతో చెలరేగాడు. అప్పటిలోనే అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.సంజూ, కిషన్ స్ధానాలకు ఎసరు!ప్రభుసిమ్రాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తుండడంతో అతడిని భారత జట్టు ఎంపిక చేయాలన్న వాదన మరోసారి వినిపిస్తోంది. అయితే టీ20 జట్టులో సంజూ శాంసన్, కిషన్ ఉండడంతో అతడికి చోటు దక్కే అవకాశం లేదు. కానీ వీరిద్దరిలో ఎవరైన విఫలమైతే కచ్చితంగా బ్యాకప్గా ప్రభ్సిమ్రాన్ ఉంటాడు. కాబట్టి వారిద్దరూ ప్రభ్సిమ్రాన్ను దృష్టిలో పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా వారు జట్టులో చోటు కోల్పోక తప్పదు. అయితే ఈ ఏడాది జూన్లో అఫ్గానిస్తాన్తో జరిగే వన్డే సిరీస్కు ప్రభ్సిమ్రాన్ ఎంపికయ్యే అవకాశముంది. ఈ సిరీస్కు రెగ్యులర్ వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభ్సిమ్రాన్ను వికెట్ కీపర్గా ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. అతడితో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్లు కూడా అఫ్గాన్తో వన్డేల్లో ఆడనున్నట్లు సమాచారం.చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్.. ? వారికి లక్కీ ఛాన్స్?
టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్.. ? వారికి లక్కీ ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్లతో బిజీబిజీగా గడపడనుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. కాగా అఫ్గాన్తో టెస్టు మ్యాచ్ ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజులకే ప్రారంభం కానుంది.దీంతో ఈ మ్యాచ్కు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు సీనియర్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్లో ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్ల దృష్ట్యా భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.అంతేకాకుండా ఈ టెస్టు మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పరిధిలోకి రాదు. కాబట్టి సీనియర్లను ఈ మ్యాచ్లో రిస్క్ తీసుకోకడదని మేనెజ్మెంట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం కేవలం టెస్టులకే పరిమితమైన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. అఫ్గానిస్తాన్తో టెస్టులో భారత జట్టును నడిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిషబ్ భారత తరపున వైట్ బాల్ క్రికెట్ ఆడి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్కు అతడు ఎంపికయ్యే సూచనలు కన్పించడం లేదు. దీంతో అఫ్గాన్తో టెస్టు మ్యాచ్లో అతడికి జట్టు పగ్గాలను అప్పగించేందుకు అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జూలైలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. అప్పటివరకు పంత్కు విశ్రాంతి లభించనుంది. ఒకవేళ అతడు భారత వన్డే జట్టుకు ఎంపికైన తుది జట్టులో మాత్రం చోటు కష్టమే. పంత్ ఇప్పటివరకు భారత్ కెప్టెన్గా ఆరు మ్యాచ్లలో వ్యవహరించాడు.ఇక ఇది ఇలా ఉండగా.. అఫ్గాన్ టెస్టు మ్యాచ్కు దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో గుర్నూర్ బ్రార్ (ఫాస్ట్ బౌలర్), మానవ్ సుతార్ (స్పిన్నర్), హర్ష్ దూబే, ఆకిబ్ నబీ (ఫాస్ట్ బౌలర్), దేవ్ దత్ పడిక్కల్(బ్యాటర్) ఉన్నారు."ఐపీఎల్ ఫైనల్కు అఫ్గానిస్తాన్ టెస్టుకు మధ్య పెద్దగా గ్యాప్ లేదు. కాబట్టి ఆటగాళ్లు వర్క్లోడ్ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అఫ్గాన్తో వన్డే సిరీస్, ఇంగ్లండ్ వైట్బాల్ సిరీస్లు భారత్కు ఉన్నాయి. అఫ్గానిస్తాన్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు.భారత టెస్టు జట్టులోని కొంతమంది సభ్యులు దాదాపు రెండు నెలల పాటు బిజీబిజీగా గడపనున్నారు. దీంతో వారికి అఫ్గాన్తో టెస్టుకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. గుర్నూర్, మానవ్ సుత్తార్, పడిక్కల్, హర్ష్ దూబేలు సెలెక్టర్ల రాడార్లో ఉన్నారని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా అఫ్గాన్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్పూర్ వేదికగా జరగనుంది.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. కాగా గత కొంతకాలంగా ఫామ్లేమితో విమర్శల పాలైన బాబర్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో బిజీగా ఉన్నాడు.బాబర్ ఆజం శతకంపెషావర్ జల్మీ జట్టుకు కెప్టెన్గా ఉన్న బాబర్ (Babar Azam).. ఇటీవలే ఫామ్లోకి వచ్చాడు. తాజాగా ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో అతడు అదరగొట్టాడు. కరాచీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన బాబర్ ఆజం శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 59 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు.151 పరుగులకే ఆలౌట్బాబర్ ఇన్నింగ్స్ కారణంగా పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 151 పరుగులకే ఆలౌట్ అయింది. ఫైనల్కు పెషావర్ఫలితంగా 70 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన పెషావర్ జల్మీ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్లో పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.కాగా పీఎస్ఎల్ తాజా సీజన్లో బాబర్ ఆజంకు ఇది రెండో సెంచరీ. ఈ క్రమంలోనే అతడు సౌతాఫ్రికా వెటరన్ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో కెప్టెన్ హోదాలో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్గా బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు.టీ20 క్రికెట్లో కెప్టెన్ హోదాలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లు👉బాబర్ ఆజం (పాకిస్తాన్)- తొమ్మిది సెంచరీలు👉ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా)- ఎనిమిది సెంచరీలు👉మైకేల్ క్లింగెర్ (ఆస్ట్రేలియా)- ఏడు సెంచరీలు👉విరాట్ కోహ్లి (భారత్)- ఐదు సెంచరీలు👉జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్)- ఐదు సెంచరీలు.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్
T20 WC 2026: పాఠాలు నేర్చుకున్నాం
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 సిరీస్ కోల్పోయినా... ప్రపంచకప్నకు ముందు విలువైన పాఠాలు నేర్చుకుందని హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 1–4తో సిరీస్ కోల్పోయింది.ఈ నేపథ్యంలో మజుందార్ మాట్లాడుతూ... ‘సిరీస్ చాలా బాగా సాగింది. ప్రతి మ్యాచ్లో మన అమ్మాయిలు బాగా పోరాడారు. ఫలితం అనుకూలంగా రాలేదు. 1–4తో సిరీస్ కోల్పోవడం కాస్త నిరాశ పరిచింది. అయితే ఈ సిరీస్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మంచి ఆరంభాలు లభించిన తర్వాత వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాం. ఈ అంశంపై మరింత కృషి చేయాల్సిన అవసరముంది.ఇక ప్రత్యర్థి బ్యాటర్లను పవర్ ప్లేలో కట్టడి చేయలేకపోయాం. దాని వల్లే మ్యాచ్ల్లో పైచేయి సాధ్యపడలేదు. పొరబాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. సిరీస్ గెలిచేందుకు దక్షిణాఫ్రికా జట్టుకు పూర్తి అర్హత ఉంది. ముఖ్యంగా సఫారీ జట్టు కెప్టెన్ లౌరా వోల్వార్ట్ అద్భుత ఆటతీరు కనబర్చింది. ఐదు మ్యాచ్ల్లో వోల్వార్ట్ వరుసగా 51, 54, 115, 18, 92 పరుగులు చేసింది’ అని వివరించాడు.
గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడాను!.. తప్పని నిషేధం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నలుబోతు షణ్ముగ శ్రీనివాస్పై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) తీవ్ర చర్యలు తీసుకుంది. శ్రీనివాస్పై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ‘నాడా’ ప్రకటించింది. నిబంధనల ప్రకారం డోపింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన ఏపీ అథ్లెట్ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో నిషేధానికి గురయ్యాడు. ‘పరీక్షల కోసం శాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకోవడం, తిరస్కరించడం, విఫలం కావడం’ శ్రీనివాస్ను నిషేధించడానికి కారణమని డోపింగ్ వ్యతిరేక క్రమశిక్షణా సంఘం (ఏడీడీపీ) స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన 24 ఏళ్ల శ్రీనివాస్ 100 మీటర్ల, 200 మీటర్ల స్ప్రింట్ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు.భారత జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ వద్ద శ్రీనివాస్ శిక్షణ పొందాడు. పరీక్షకు హాజరు కాకుండా సహకరించాడంటూ కోచ్ రమేశ్పై కూడా ‘నాడా’ గతంలోనే తాత్కాలిక సస్పెన్షన్ విధించగా... అప్పీల్ ప్యానెల్ ఇటీవలే ఆ నిషేధాన్ని తొలగించింది. గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడానుమరోవైపు.. మహిళా అథ్లెట్ వీసీ విస్మయపై కూడా రెండేళ్ల నిషేధం పడింది. కేరళకు చెందిన విస్మయ 2018 జకార్తా ఆసియా క్రీడల 4*400 రిలే పోటీల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. దాదాపు రెండేళ్ల క్రితం ఆమె నుంచి తీసుకున్న శాంపిల్స్లో డోపింగ్కు పాల్పడినట్లుగా తేలింది. నిషేధిక ఉత్ప్రేరకం క్లోమీఫీన్ తీసుకున్నట్లుగా బయపడింది. దీనిని సవాల్ చేస్తూ విస్మయ తన గర్భధారణ చికిత్సలో భాగంగా క్లోమీఫీన్ను వాడినట్లు, ఇది ఉత్ప్రేరకం కాదని వివరణ ఇచ్చింది. ‘నాడా’ మాత్రం ఆమె సమాధానంతో సంతృప్తి చెందకుండా రెండేళ్ల నిషేధం విధించింది. అయితే అక్టోబర్, 2024 నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దాంతో మరో ఆరు నెలల్లో విస్మయ నిషేధం పూర్తవుతుంది.
టీ20 వరల్డ్కప్ టోర్నీకి న్యూజిలాండ్ జట్టు ప్రకటన
మహిళల టీ20 ప్రపంచకప్-2026 కోసం డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల జట్టులో సూజీ బేట్స్, సోఫీ డివైన్, లీ తహుహు వంటి దిగ్గజ క్రికెటర్లకు చోటు దక్కింది. వీరు ముగ్గురు ఈ మెగా టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నారు.ఇక స్టార్ ఆల్రౌండర్ అమీలియా కెర్ తొలిసారి ఐసీసీ ఈవెంట్లో వైట్ ఫెర్న్స్ జట్టుకు సారథ్యం వహించేందుకు సిద్దమైంది. నెన్సి పటెల్, జార్జియా ప్లిమ్మర్ వంటి యంగ్ ప్లేయర్స్కు సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానుంది.కివీస్ తమ తొలి మ్యాచ్లో జూన్ 13న వెస్టిండీస్తో తలపడనుంది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ టైటిల్ను గెలిచి, తమ దిగ్గజాలకు ఘనంగా వీడ్కోలు పలకాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది.టీ20 ప్రపంచకప్ టోర్నీకి కివీస్ జట్టు ఇదేఅమెలీయా కెర్ (కెప్టెన్), సూజీ బేట్స్, సోఫీ డివైన్, ఫ్లోరా డెవాన్షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్మేరీ మేర్, నెన్సీ పటేల్, జార్జియా ప్లిమ్మర్, ఇజ్జీ షార్ప్, లీ తహుహుమహిళల టీ20 ప్రపంచకప్లో గ్రూపులు ఇవేగ్రూప్ 1: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్గ్రూప్ 2: వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదేన్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ (13-06-2026)న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక(16-06-2026)న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్(19-06-2026)న్యూజిలాండ్ వర్సెస్ స్కాట్లాండ్(23-06-2026)న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్(27-06-2026)చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. ఈ బిహార్ కుర్రాడు కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్తో ప్రస్తుత సీజన్లో వైభవ్ 400 పరుగుల మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సరికొత్త చరిత్ర👉ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. వైభవ్ ఈ ఫీట్ను కేవలం 167 బంతుల్లో మాత్రమే సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కోల్కతా నైట్రైడర్స్ దిగ్గంజ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. 2019 సీజన్లో రస్సెల్ 188 బంతుల్లో 400 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్తో రస్సెల్ను వైభవ్ అధిగమించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.👉అదేవిధంగా ఒకే సీజన్లో 400 పైగా పరుగులు చేసిన అత్యంత పిన్నవయష్కిడిగా తిలక్ వర్మ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. తిలక్ 20 ఏళ్ల వయస్సులో ముంబై ఇండియన్స్ తరపున 2023 సీజన్లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.👉అలాగే ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో వైభవ్ ఇప్పటికే 37 సిక్సర్లతో రిషబ్ పంత్తో కలిసి సంయుక్తంగా ఐదవ స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ (42), శ్రేయాస్ అయ్యర్ (39) అగ్రస్థానాల్లో ఉన్నారు.ఇక ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 238.10 స్ట్రైక్ రేటుతో 400 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ వైభవ్ వద్దే ఉంది.చదవండి: IPL 2026: జైలుకు రియాన్ పరాగ్?
ఆసియా టోర్నీ నుంచి వైదొలిగిన భారత స్టార్
న్యూఢిల్లీ: స్వదేశంలో జరగనున్న ఆసియా సీనియర్ వెయి...
‘ఎందుకీ డబుల్ గేమ్?’.. వినేశ్పై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహం
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్...
వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్టాపిక్గా ఉన్న ...
పీవీ సింధు కొత్త ప్రయాణం.. ఇకపై
హోర్సెన్స్ (డెన్మార్క్): భారత బ్యాడ్మింటన్ స్ట...
T20 WC 2026: పాఠాలు నేర్చుకున్నాం
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత మహిళల క్రికెట్...
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో శ్రీచరణి
దుబాయ్: దక్షిణాఫ్రికా పర్యటనలో బ్యాట్తో ఆకట్టుకు...
టీ20 వరల్డ్కప్ టోర్నీకి న్యూజిలాండ్ జట్టు ప్రకటన
మహిళల టీ20 ప్రపంచకప్-2026 కోసం డిఫెండింగ్ ఛా...
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వై...
క్రీడలు
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
వీడియోలు
వైభవ్ సూర్యవంశీపై ఒలంపిక్స్ విజేత మనూ భాకర్ కామెంట్స్ వైరల్..
తొలి ఓటమితో తడబడిన పంజాబ్ కింగ్స్.. దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్..
IPLల్లో ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం
SRHపై బుడ్డోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్
GTపై RCB ఘన విజయం
మ్యాచ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన ఆకాష్ అంబానీ..
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
చేటా దెబ్బకి చేతులెత్తిసిన ముంబై.. IPL చరిత్రలోనే MIకి ఘోర ఓటమి
సామ్సన్ జిగేల్.. ముంబై ఢమాల్
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
