Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: SRH Skipper Ishan Kishan Comments After Winning Against CSK1
ప్లాన్‌ ప్రకారం చేస్తున్నారు: ఇషాన్‌ కిషన్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 18) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై సన్‌రైజర్స్‌ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను బౌలర్లు గెలిపించారు. తొలుత బ్యాటింగ్‌ చేసి 194 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఎషాన్‌ మలింగ (4-0-29-3), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (4-0-31-2), సాకిబ్‌ హుస్సేన్‌ (4-0-32-1), శివాంగ్‌ కుమార్‌ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి సీఎస్‌కేను గెలుపును అడ్డుకున్నారు.మ్యాచ్‌ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ తమ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్‌ మాటల్లో..యువ బౌలర్లు ప్లాన్‌ ప్రకారం బౌలింగ్‌ చేస్తున్నారు. వారు తమ ప్లాన్‌లను అమలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారు స్వయంగా ప్లాన్‌లు తయారు చేసుకోవడంతో కెప్టెన్‌గా ఫీల్డ్‌ సెట్‌ చేయడంలో ఒత్తిడి తగ్గింది. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో వారు కష్టపడి మెరుగుపడుతున్నారు. అందుకే వారిపై పూర్తి నమ్మకం ఉంచి ఫ్రీ హ్యాండ్‌ ఇస్తున్నాము.బ్యాటింగ్‌లో లోటుపై మాట్లాడుతూ.. అభిషేక్‌ శర్మ త్వరగా ఔట్‌ కావడంతో 20–30 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. సాధారణంగా మా టాప్‌-3లో ఒకరు పెద్ద స్కోరు చేస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో అది జరగలేదు. పిచ్‌ బ్యాటింగ్‌ ఫ్రెండ్లీగా ఉండింది. కాబట్టి 220–230 పరుగులు చేసి ఉండవచ్చు.పాయింట్స్‌ టేబుల్‌పై మాట్లాడుతూ.. మేము పాయింట్స్‌ టేబుల్‌ గురించి ఆలోచించడం లేదు. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీమెంట్‌. ఏ మ్యాచ్‌కు ఆ మ్యాచ్‌ను టార్గెట్‌గా పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాము. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ, అగ్రెసివ్‌గా ఆడటమే మా కర్తవ్యం.ఇషాన్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు స్పష్టమైంది. అలాగే బ్యాటింగ్‌లో మరిన్ని పరుగులు సాధించాలనే ఉద్దేశం​ బయటపడింది. మొత్తంగా జట్టు ప్రదర్శన పట్ల ఇషాన్‌ సంతోషంగా ఉన్నారు. ఈ గెలుపు తర్వాత సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాని​​కి ఎగబాకింది. ఏప్రిల్‌ 21న జరిగే తదుపరి మ్యాచ్‌లో ఈ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ సొంత మైదానం హైదరాబాద్‌లోనే జరుగనుంది.

Chennai lost to Sunrisers Hyderabad by 10 runs2
సన్‌రైజర్స్‌ అదరహో

సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ మొదలైన తీరును బట్టి జట్టు కనీసం 220కు పైగా స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే చివర్లో బ్యాటర్ల వైఫల్యంతో స్కోరు 200 కూడా దాటలేదు. చెన్నై ఇన్నింగ్స్‌లో ఆయుశ్‌ మాత్రే ఆటను చూస్తేసునాయాసంగా ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ రైజర్స్‌ బౌలర్లు ఒక్కసారిగా చెలరేగిపోయారు. బంతిపై పట్టు చేజారనీయకుండా ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఐదుగురు బౌలర్లు కనీసం ఒక వికెట్‌ తీయడంతో చెన్నై చతికిలపడింది. హైదరాబాద్‌ ఖాతాలో మూడో గెలుపు చేరింది. అంతకుముందు అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌ మెరుపులతో చెన్నైపై హైదరాబాద్‌ తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై జోరును ప్రదర్శిస్తూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో వరుస విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్‌ స్టేడియంలో చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (22 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్లాసెన్‌ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... అన్షుల్‌ కంబోజ్, ఒవర్టన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. మాథ్యూ షార్ట్‌ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), ఆయుశ్‌ మాత్రే (13 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించగా, ఇషాన్‌ మలింగకు 3 వికెట్లు... నితీశ్‌ కుమార్‌ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం రాగా, ప్రఫుల్‌ హింగే 7 పరుగులే ఇచ్చాడు. కెప్టెన్‌ విఫలం... షార్ట్‌ వేసిన తొలి ఓవర్లో 4 పరుగులే రావడంతో రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ప్రశాంతంగా మొదలైంది. అయితే ఆ తర్వాత అభిషేక్‌ శర్మ దూకుడు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్‌ బాదిన అభిషేక్‌... కంబోజ్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అయితే మరో ఎండ్‌లో ముకేశ్‌ ఓవర్లో 3 ఫోర్లు బాది ధాటిని పెంచినట్లు కనిపించిన ట్రవిస్‌ హెడ్‌ (20 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. హెడ్‌ను అవుట్‌ చేసిన ముకేశ్‌ తర్వాతి బంతికే కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (0) వికెట్‌ కూడా తీయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 75 పరుగులకు చేరింది. కొద్దిసేపటికే ఒవర్టన్‌ తన తొలి ఓవర్లోనే అభిషేక్‌ను వెనక్కి పంపించాడు. ఈ దశలో క్లాసెన్‌ కొన్ని చక్కటి షాట్లతో స్కోరు పెంచే బాధ్యత తీసుకున్నాడు. మరోవైపు అనికేత్‌ వర్మ (2) ప్రభావం చూపలేకపోగా, ఉప్పల్‌లో గత రెండు మ్యాచ్‌లలో రాణించిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి (12; 1 సిక్స్‌) ఈసారి విఫలమయ్యాడు. నూర్‌ అహ్మద్‌ ఓవర్లో భారీ సిక్స్‌ కొట్టిన క్లాసెన్‌ 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. చివర్లో సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేసి ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమయ్యారు. ఆఖరి 4 ఓవర్లలో రైజర్స్‌ 31 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు చేజార్చుకుంది. మాత్రే మినహా... ఛేదనలో చెన్నై ఆరంభంలోనే సంజు సామ్సన్‌ (7) వికెట్‌ కోల్పోయింది. తొలి బంతికే సిక్స్‌ కొట్టినా అతను ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సున్నా వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను క్లాసెన్‌ వదిలేయడంతో బతికిపోయిన మాత్రే ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. హింగే ఓవర్లోనే అతను 4 ఫోర్లు, 1 సిక్స్‌ బాది 22 పరుగులు రాబట్టడం విశేషం. అయితే క్లాసెన్‌ అద్భుత క్యాచ్‌తో మాత్రే ఇన్నింగ్స్‌ ముగియగా, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (19) వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. పవర్‌ప్లేలో జట్టు 76 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒక్క బ్యాటర్‌ కూడా బాధ్యతతో జట్టును నడిపించలేకపోయాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు) తడబడుతూనే ఆడగా, షార్ట్‌ కూడా దూకుడు చూపించలేదు. హైదరాబాద్‌ మెరుగైన బౌలింగ్‌తో ఒత్తిడి పెరిగి జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. శివమ్‌ దూబే (16 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌)పై ఆశలు ఉండగా... 20 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్‌ కావడంతో గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) సామ్సన్‌ (బి) ఒవర్టన్‌ 59; హెడ్‌ (సి) రుతురాజ్‌ (బి) ముకేశ్‌ 23; ఇషాన్‌ కిషన్‌ (సి) రుతురాజ్‌ (బి) ముకేశ్‌ 0; క్లాసెన్‌ (బి) కంబోజ్‌ 59; అనికేత్‌ (సి) నూర్‌ (బి) ఒవర్టన్‌ 2; నితీశ్‌ రెడ్డి (సి) షార్ట్‌ (బి) ఒవర్టన్‌ 12; అరోరా (సి) బ్రెవిస్‌ (బి) గుర్‌జప్‌నీత్‌ 13; లివింగ్‌స్టోన్‌ (సి) బ్రెవిస్‌ (బి) కంబోజ్‌ 1; శివాంగ్‌ (సి) గుర్‌జప్‌నీత్‌ (బి) కంబోజ్‌ 12; హింగే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–75, 2–75, 3–93, 4–112, 5–147, 6–177, 7–179, 8–193, 9–194. బౌలింగ్‌: షార్ట్‌ 3–0–38–0, ముకేశ్‌ చౌదరి 2–0–21–2, కంబోజ్‌ 3–0–22–3, నూర్‌ 4–0–33–0, ఒవర్టన్‌ 4–0–37–3, గుర్‌జప్‌నీత్‌ 4–0–34–1. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) క్లాసెన్‌ (బి) నితీశ్‌ రెడ్డి 7; రుతురాజ్‌ (సి) అరోరా (బి) మలింగ 19; మాత్రే (సి) క్లాసెన్‌ (బి) నితీశ్‌ రెడ్డి 30; షార్ట్‌ (సి) అనికేత్‌ (బి) మలింగ 34; సర్ఫరాజ్‌ (సి) నితీశ్‌ రెడ్డి (బి) మలింగ 25; బ్రెవిస్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) శివాంగ్‌ 0; దూబే (బి) సాకిబ్‌ 21; ఒవర్టన్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) హింగే 16; కంబోజ్‌ (నాటౌట్‌) 13; నూర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–15, 2–66, 3–66, 4–112, 5–113, 6–148, 7–154, 8–182. బౌలింగ్‌: ప్రఫుల్‌ హింగే 4–0–60–1, నితీశ్‌ రెడ్డి 4–0–31–2, సాకిబ్‌ 4–0–32–1, ఇషాన్‌ మలింగ 4–0–29–3, శివాంగ్‌ 3–0–18–1, అభిషేక్‌ 1–0–13–0.షార్ట్‌పై అభిషేక్‌ దాడి... ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన మాథ్యూ షార్ట్‌ బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 3 బంతులాడిన అభిషేక్‌ 2 పరుగులే చేయగలిగాడు. అయితే ఆ తర్వాత అభిషేక్‌ తానేంటో షార్ట్‌కు చూపించాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్‌ కొట్టిన అతను... మూడో ఓవర్లో చెలరేగిపోయాడు. తొలి బంతికి హెడ్‌ సింగిల్‌ తీయగా... తర్వాతి ఐదు బంతుల్లో వరుసగా 4, 4, 4, 6, 6 బాది 20 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే అభిషేక్‌ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 51 పరుగుల వద్ద దూబే అతని క్యాచ్‌ను వదిలేసినా...దాని వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు.ధోని ఆడలేదు... భారత స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులకు నిరాశ తప్పలేదు. గాయం కారణంగా టోర్నీ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ధోని టీమ్‌తో పాటు హైదరాబాద్‌కు వచ్చాడు. శుక్రవారం ప్రాక్టీస్‌లో కూడా అతను పాల్గొన్నాడు. దాంతో బరిలోకి దిగవచ్చని అనిపించింది. అయితే మరోసారి ధోని పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. 2025 సీజన్‌ షెడ్యూల్‌లో భాగంగా ఉప్పల్‌లో హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచే జరగలేదు. ఈసారి ఆ మ్యాచ్‌ వచ్చినా... ధోని ఆట మాత్రం నగర ఫ్యాన్స్‌ చూడలేకపోయారు. 2024లో ఆడిన మ్యాచ్‌లో ధోని 2 బంతులే ఎదుర్కొన్నాడు!

Delhi Capitals beat Bangalore by six wickets3
ఢిల్లీ ధమాకా

బెంగళూరు: సొంతగడ్డపై ఈ ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు తొలి ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు జట్టును బోల్తా కొట్టించింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని సాధారణ స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ... ఛేదనలో చివరి వరకు పోరాడి విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళురు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (38 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా... విరాట్‌ కోహ్లి (13 బంతుల్లో 19; 3 ఫోర్లు) సహా తక్కినవాళ్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్, ఎన్‌గిడి, కుల్దీప్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రిస్టన్‌ స్టబ్స్‌ (47 బంతుల్లో 60 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కేఎల్‌ రాహుల్‌ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. భువనేశ్వర్‌ (3/26) ధాటికి 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ఈ జోడీ నిలబడి ఢిల్లీని ఆదుకుంది. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌ (10 బంతుల్లో 22 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. మిల్లర్‌ 6, 6, 4 ఛేదనలో ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌ నాలుగో బంతికి నిసాంక (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న భువనేశ్వర్‌... ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. కరుణ్‌ నాయర్‌ (5) సమీర్‌ రిజ్వీ (2)లను పెవిలియన్‌ బాటపట్టించి ఢిల్లీని ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఈ దశలో స్టబ్స్‌తో కలిసి ‘బర్త్‌డే బాయ్‌’ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అనంతరం రాహుల్‌ అవుట్‌ కాగా... అక్షర్‌ పటేల్‌ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు) కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా... షెఫర్డ్‌ తొలి రెండు బంతులకు రెండు పరుగులే ఇచ్చాడు. ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో మిల్లర్‌ 6, 6, 4 కొట్టి జట్టును గెలిపించాడు. సాల్ట్‌ ఒక్కడే... అంతకుముందు ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ ప్రారంభమైన తీరుకు... ముగిసిన విధానానికి పొంతనే లేదు. ఓపెనర్లు సాల్ట్, కోహ్లి ధాటిగా ఆడటంతో... 5 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్‌ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఆ తర్వాత కోహ్లి అవుట్‌ కాగా... దేవదత్‌ పడిక్కల్‌ (18), కెపె్టన్‌ రజత్‌ పాటీదార్‌ (8), టిమ్‌ డేవిడ్‌ (26), జితేశ్‌ శర్మ (14), షెఫర్డ్‌ (1), కృనాల్‌ పాండ్యా (12) పెవిలియన్‌కు క్యూ కట్టారు. పేస్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఆర్‌సీబీ బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడ్డారు. అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ కట్టిపడేయడంతో పరుగుల రాక గగనమైంది. దీంతో ఒత్తిడికి గురైన ఆర్‌సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో ఆకుపచ్చ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) స్టబ్స్‌ (బి) కుల్దీప్‌ 63; కోహ్లి (సి) నిసాంక (బి) ఎన్‌గిడి 19; పడిక్కల్‌ (సి) మిల్లర్‌ (బి) అక్షర్‌ 18; పాటీదార్‌ (సి) రాహుల్‌ (బి) ముకేశ్‌ 8; డేవిడ్‌ (సి) నటరాజన్‌ (బి) అక్షర్‌ 26; జితేశ్‌ (సి) మిల్లర్‌ (బి) ఎన్‌గిడి 14; షెఫర్డ్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 1; కృనాల్‌ పాండ్యా (రనౌట్‌) 12; రసిక్‌ సలామ్‌ (నాటౌట్‌) 0; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–52, 2–99, 3–105, 4–131, 5–146, 6–149, 7–172, 8–172. బౌలింగ్‌: అఖీబ్‌ నబీ 3–0–36–0; ముకేశ్‌ 4–0–32–1; ఎన్‌గిడి 4–0–39–2; కుల్దీప్‌ 4–0–32–2; నటరాజన్‌ 2–0–16–0; అక్షర్‌ 3–0–18–2. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: నిసాంక (ఎల్బీ) (బి) భువనేశ్వర్‌ 1; కేఎల్‌ రాహుల్‌ (సి) కోహ్లి (బి) కృనాల్‌ 57; కరుణ్‌ నాయర్‌ (సి) సాల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 5; సమీర్‌ రిజ్వీ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 2; స్టబ్స్‌ (నాటౌట్‌) 60; అక్షర్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 26; మిల్లర్‌ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–2, 2–16, 3–18, 4–87. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–26–3; హాజల్‌వుడ్‌ 4–0–38–0; రసిక్‌ 4–0–40–0; కృనాల్‌ 4–0–24–1; సుయాశ్‌ 3–0–31–0; షెఫర్డ్‌ 0.5–0–17–0.100హోం గ్రౌండ్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఐపీఎల్‌ జట్టుగా ఆర్‌సీబీ గుర్తింపు పొందింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఏప్రిల్‌ 18న చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ మొదలైంది. ఈ వేదికపై మొదటి మ్యాచ్, 50వ మ్యాచ్, 100వ మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ జట్టుకు ఓటమి ఎదురుకావడం గమనార్హం. హోం గ్రౌండ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (ఈడెన్‌ గార్డెన్స్‌లో 98 మ్యాచ్‌లు), ముంబై ఇండియన్స్‌ (వాంఖడే స్టేడియంలో 95 మ్యాచ్‌లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

Indian womens second T20 against South Africa today4
లెక్క సరిచేసేందుకు...

డర్బన్‌: దక్షిణాఫ్రికా పర్యటనను పరాజయంతో ప్రారంభించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు... నేడు రెండో మ్యాచ్‌ ఆడనుంది. టి20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేయాలని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం భావిస్తోంది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడింది. భారత జట్టు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ ఫర్వాలేదనిపించగా... స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన, రిచా ఘోష్‌ విఫలమయ్యారు. ఒక దశలో పటిష్ట స్థితిలో కనిపించిన టీమిండియా... జోరు పెంచాల్సిన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. అనంతరం బౌలింగ్‌లోనూ ఎలాంటి మ్యాజిక్‌ చేయలేక ఓటమి వైపు నిలిచింది. అయితే తొలి మ్యాచ్‌ లోపాలను సరిదిద్దుకొని ఈ మ్యాచ్‌లో సమష్టిగా సత్తా చాటేందుకు టీమిండియా రెడీ అయింది. బౌలింగ్‌లో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించగా... వీరితో పాటు సీనియర్‌ బౌలర్లు దీప్తి శర్మ, రేణుక సింగ్‌ కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. ఇటీవల ఆ్రస్టేలియా, శ్రీలంకపై టి20 సిరీస్‌లు గెలిచిన టీమిండియా... నెల రోజుల విశ్రాంతి అనంతరం సఫారీ పర్యటనకు వెళ్లింది. తొలి మ్యాచ్‌ ఫ్లడ్‌లైట్‌ల వెలుతురులో జరగగా... ఆదివారం ‘డే మ్యాచ్‌’ నిర్వహించనున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఆతిథ్య సఫారీ జట్టు అదే జోరు కొనసాగిస్తూ సిరీస్‌లో మరింత ముందంజ వేయాలని చూస్తోంది. కెప్టెన్‌ వోల్‌వార్ట్‌తో పాటు, డెర్క్‌సన్, బ్రిట్స్, లుస్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. సఫారీ బ్యాటర్లను మన బౌలర్లు ఏమాత్రం కట్టడి చేస్తారనే దానిపైనే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.

Invitation to different mascots5
విభిన్న మస్కట్‌లకు ఆహ్వానం

న్యూఢిల్లీ: భారత్‌ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కోసం ప్రత్యేక మస్కట్‌ రూపొందించేందుకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) దేశవ్యాప్త పోటీని ప్రకటించింది. 17 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగనున్న ఈ పోటీలకు ‘బాయ్‌’ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో అభిమానులు, దేశ ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో విభిన్న ఆలోచనలు, సరికొత్త ఆకృతులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది ఆగస్టు 17–23 మధ్య న్యూఢిల్లీ వేదికగా ఈ చాంపియన్‌షిప్‌ జరగనుంది. గత దశాబ్దంలో ఈ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు 15 పతకాలు సాధించారు. పీవీ సింధు 2019లో చారిత్రాత్మక స్వర్ణం గెలవగా... గతేడాది సాత్విక్‌–చిరాగ్‌ జంట కాంస్యం నెగ్గింది. దేశ క్రీడా ప్రగతిని, సాంస్కృతిక వైభవాన్ని, బ్యాడ్మింటన్‌ విజయ యాత్రను ప్రతిబింబించే విధంగా మస్కట్‌ రూపకల్పన ఉండాలని ‘బాయ్‌’ భావిస్తోంది. వచ్చేనెల 10 వరకు జరగనున్న ఈ పోటీలో ఆసక్తిగల వారు ‘బాయ్‌’ అధికారిక వెబ్‌సైట్‌ https://www. badmintonindia.org/ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. విజేతకు రూ. 25 వేల నగదుతో పాటు... ఫైనల్‌ మ్యాచ్‌ వీఐపీ పాస్‌లు ఇవ్వనున్నారు. ‘దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ బాగా పెరిగింది. ప్రాంతం, సంస్కృతి, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతీచోట బ్యాడ్మింటన్‌ ఆడుతున్నారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను మన దేశంలో నిర్వహిస్తున్న సందర్భంగా... అభిమానులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మస్కట్‌ పోటీ ప్రారంభించాం’ అని ‘బాయ్‌’ కార్యదర్శి సంజయ్‌ మిశ్రా అన్నారు.

India Argentina womens hockey series drawn6
2–2తో సమం

బ్యూనస్‌ ఎయిర్స్‌: ప్రపంచకప్, ఆసియా క్రీడలకు సన్నాహాల్లో భాగంగా అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–2తో సమంగా ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు 2–4తో ఓడిపోయింది. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్, అన్ను ఒక్కో గోల్‌ చేశారు. రెండో మ్యాచ్‌ను టీమిండియా 1–2తో చేజార్చుకుంది. భారత్‌ తరఫున ఇషిక ఏకైక గోల్‌ చేసింది. మూడో మ్యాచ్‌లో భారత బృందం 2–1తో గెలిచింది. భారత జట్టుకు నవ్‌నీత్‌ కౌర్, నేహా ఒక్కో గోల్‌ అందించారు. చివరిదైన నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్‌’లో 3–2తో నెగ్గింది.

Sunrisers Hyderabad won by 10 runs Vs CSK In IPL 20267
ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించిన బౌలర్లు

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్‌కేతో ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 10 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీ త 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 184 ప‌రుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ 3 వికెట్ల‌తో ఆక‌ట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (59) మెరుపు అర్థ‌సెంచ‌రీతో ఆక‌ట్టుకోగా, క్లాసెన్ (59) మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్ద‌రు మిన‌హా మిగతావారు ప‌రుగులు చేయ‌డంలో విఫ‌లం కావ‌డంతో ఎస్ఆర్‌హెచ్ 200 స్కోరు మార్కును దాట‌లేక‌పోయింది. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో అన్షుల్ కంబోజ్‌, జేమి ఓవ‌ర్ట‌న్‌లు చెరో మూడు వికెట్లు తీయ‌గా, ముకేశ్ చౌద‌రీ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌ర్వాత ఛేద‌న‌ను సీఎస్‌కే ధాటిగానే ఆరంభించింది. ఆరంభంలోనే ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ ఔటైన‌ప్ప‌టికీ వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన ఆయుశ్ మాత్రే 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్ సాయంతో 30 ప‌రుగులు సాధించాడు. మిడిలార్డ‌ర్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (25), మాథ్యూ షార్ట్ (34) ప‌రుగులతో ప‌ర్వాలేద‌నిపించారు. ఆఖ‌ర్లో ఓవ‌ర్ట‌న్ (16) కాస్త ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు క‌ఠినంగా బంతులేయ‌డంతో సీఎస్‌కే ఓట‌మి దిశ‌గా ప‌య‌నించింది.

RCB Captain Rajat Patidar False Decisions Leads To Match Lost Vs DC8
తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్‌!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తలా తోక లేని నిర్ణయాలతో జట్టు ఓటమికి బాటలు వేశాడు. అదెలాగంటే 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఈ సమయంలో అక్షర్ పటేల్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్‌, హాజిల్‌వుడ్ ప్రధాన బౌలర్లు. మ్యాచ్‌లో గెలిచే దశలో ఉన్న సమయంలో ప్రధాన బౌలర్లను చివరి ఓవర్లలో బౌలింగ్ చేయించాలి. కానీ ఇక్కడే పటిదార్ తెలివితక్కువ పని చేశాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు ముగిసేరికి 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరోవైపు హాజిల్‌వుడ్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 3 ఓవర్ల వరకు ఎకానమీ రేటు బాగానే ఉంది. అయితే పటీదార్ డెత్ ఓవర్ల వరకు వీరిని అంటిపెట్టుకోకుండా మధ్యలోనే కోటా పూర్తి చేయించాడు. ఇదే ఆర్సీబీని దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. భువనేశ్వర్‌, హాజిల్‌వుడ్ కోటా పూర్తవ్వడం, సుయాశ్ శర్మ ప్రభావం చూపించకపోవడంతో పటీదార్ రసిక్ సలామ్ చేతిలో బంతిని పెట్టాడు.గత మ్యాచ్‌లో మెరిసిన రసిక్ సలామ్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి వికెట్ తీయకపోగా 40 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్ వేసిన షెపర్డ్ ఒత్తిడిలో సరిగ్గా బౌలింగ్ చేయలేక 17 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. అదే భువనేశ్వర్ లేదా హాజిల్‌వుడ్‌లలో ఒకరితో చివరి ఓవర్ వేయించి ఉంటే ఆర్సీబీ గెలిచి ఉండేదేమో. ఏది ఏమైనా పటీదార్ తన తిక్క నిర్ణయంతో చేజేతులా ఆర్సీబీకి ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.

RCB Worst Record-Lost 1st-50th-100th Match In Chinnaswamy Stadium9
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెత్త రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యావరణ పరిరక్షణ హితం కోసం ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది. అయితే గ్రీన్ జెర్సీ ఆర్సీబీకి కలసిరాదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఈ సంగతి పక్కనబెడితే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ఆర్సీబీకి వందోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తాము ఆడిన తొలి మ్యాచ్‌తో పాటు 50వ మ్యాచ్‌, తాజాగా వందో మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనే మెక్‌కల్లమ్ సెంచరీ బాదాడు. ఇక 2016లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆర్సీబీ 50వ మ్యాచ్ ఆడింది. తాజాగా యాదృశ్చికంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో తన వందో మ్యాచ్ ఆడిన ఆర్సీబీకి మరోసారి ఓటమే ఎదురయ్యింది. ఇక 2011 నుంచి ప్రతీ సీజన్‌లో ఒక మ్యాచ్‌కు ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీగా చేసుకుంది. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు గ్రీన్ జెర్సీలో 15 మ్యాచ్‌లు ఆడితే అందులో తొమ్మిదింట ఓడి కేవలం ఐదింట మాత్రమే నెగ్గింది.

Delhi Capitals Batter David Miller Played Key Role In RCB Match 10
వారెవ్వా మిల్లర్‌.. ఆరోజు ఏడ్చి.. ఈరోజు న‌వ్వి!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టిన మ్యాచ్ అది. కేవ‌లం ఒక్క ప‌రుగుతో గుజ‌రాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓడిపోవ‌డానికి డేవిడ్ మిల్ల‌ర్ ప్ర‌ధాన కార‌ణ‌మయ్యాడు. ఆఖ‌రి బంతికి రెండు పరుగులు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో అన‌వ‌స‌ర ఒత్తిడికి పోయిన మిల్ల‌ర్ ఢిల్లీకి చేజేతులా ఓట‌మిని అందించాడు. ఈ చ‌ర్య మిల్ల‌ర్‌ను కంట‌త‌డి పెట్టేలా చేసింది. మ‌రో అవ‌కాశం వ‌స్తే ఢిల్లీకి విజ‌యాన్ని అందించి త‌న త‌ప్పును స‌రిదిద్దుకుంటాన‌ని మిల్ల‌ర్ పేర్కొన్నాడు. అయితే త‌న త‌ప్పు స‌రిదిద్దుకునే రోజు ఇంత తొంద‌ర‌గా వ‌స్తుంద‌ని బ‌హుశా మిల్ల‌ర్ కూడా ఊహించి ఉండ‌డు. ఇవాళ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన‌ మ్యాచ్‌ మ‌రోసారి ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లింది. 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆఖ‌రి ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. క్రీజులో మిల్ల‌ర్‌తో పాటు స్ట‌బ్స్ ఉన్నాడు. తొలి బంతికి మిల్ల‌ర్ సింగిల్ తీశాడు. రెండో బంతికి స్ట‌బ్స్ సింగిల్ తీశాడు. ఇక 4 బంతుల్లో 13 ప‌రుగులు అవ‌స‌రం. స్ట్రైక్‌లో ఉన్న మిల్ల‌ర్ ఈసారి ఢిల్లీని గెలిపించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. షెప‌ర్డ్ వేసిన మూడో బంతిని మిల్ల‌ర్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స‌ర్ కొట్టాడు. ఇక మ‌రుస‌టి బంతిని ఈసారి మిల్ల‌ర్ ఎక్స్‌ట్రా క‌వ‌ర్స్ మీదుగా మ‌రో సిక్స‌ర్ సంధించాడు. దీంతో స‌మీక‌ర‌ణం రెండు బంతుల్లో ఒక ప‌రుగుకు మారిపోయింది. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో చేసిన పొర‌పాటును మ‌ళ్లీ చేయ‌కుండా షెప‌ర్డ్ వేసిన ఐదో బంతిని డీప్ మిడ్‌వికెట్ దిశ‌గా బౌండ‌రీ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. మొత్తం మీద గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమికి తానే కారణమని ఏడ్చిన మిల్లర్ ఇవాళ మాత్రం తన జట్టును గెలిపించి లెక్క సరిచేశాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 63, టిమ్ డేవిడ్ 26 పరుగులు చేశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 6,6,4 BY DAVID MILLER WHEN DELHI NEEDED 13 FROM 4 🥶- DC got David Miller for Base Price. pic.twitter.com/9HVbfezmuI— Johns. (@CricCrazyJohns) April 18, 2026చదవండి: సీఎస్‌కే కొత్త కెప్టెన్ సంజూ శాంస‌న్‌!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement