ప్రధాన వార్తలు
శ్రీకర్ భరత్ మెరుపులు
లక్నో: ఓపెనర్ శ్రీకర్ భరత్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపులు మెరిపించడంతో... దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 7 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (56 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో సత్తాచాటగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఓపెనర్గా బరిలోకి దిగిన సామ్సన్ చివరి వరకు నాటౌట్గా నిలిచాడు. రోహన్ కున్నుమ్మల్ (2), మొహమ్మద్ అజహరుద్దీన్ (6), క్రిష్ణ ప్రసాద్ (5), అబ్దుల్ బాసిత్ (2), సల్మాన్ నిజార్ (5), షర్ఫుద్దీన్ (3) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, సౌరభ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 123 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ భరత్ దంచేయగా... అశ్విన్ హెబ్బర్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్లు), పైల అవినాష్ (20; 1 ఫోర్, 2 సిక్స్లు) అతడికి సహకరించారు. గ్రూప్ ‘ఎ’లో ఆరు మ్యాచ్లు ఆడిన ఆంధ్ర జట్టు ఐదు విజయాలు, ఒక పరాజయంతో 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతోంది. చివరి గ్రూప్ మ్యాచ్లో సోమవారం విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది. అభిషేక్ అదరహో..సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్స్లు; 2/8)... సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో ఆల్రౌండ్ షోతో అదరగొడుతు న్నాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు 73 పరుగుల తేడాతో సర్వీసెస్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ దంచికొట్టగా... ప్రభ్సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్లు), నమన్ ధీర్ (22 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్స్లు) ధనాధన్ హాఫ్సెంచరీలు నమోదు చేసుకున్నారు. సర్వీసెస్ బౌలర్లలో అభిషేక్ తివారి, విశాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో సర్వీసెస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ తివార టరి(30 బంతుల్లో 40; 4 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లువిఫలమయ్యారు. బౌలింగ్లో అభిషేక్, సాన్వీర్ సింగ్, హర్ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన మరో మ్యాచ్లో పాండిచ్చేరి 81 పరుగుల తేడాతో బెంగాల్పై, గుజరాత్ 1 వికెట్ తేడాతో హిమాచల్ ప్రదేశ్పై హర్యానా 8 పరుగుల తేడాతో బరోడాపై విజయాలు సాధించాయి.హైదరాబాద్ ‘టాప్’ షోబిహార్పై ఘనవిజయంకోల్కతా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా... శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో బిహార్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. పియూశ్ సింగ్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), బిపిన్ సౌరభ్ (19 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3, చామా మిలింద్ రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో హైదరాబాద్ 12.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (42 బంతుల్లో 67; 11 ఫోర్లు, 1 సిక్స్), ప్రజ్ఞయ్ రెడ్డి (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్లు) సత్తాచాటారు. గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ 6 మ్యాచ్లాడి 5 విజయాలు, ఒక పరాజయంతో 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
వెర్స్టాపెన్కు ‘పోల్’
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ చివరి రేసులో రెడ్బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. 24 రేసుల సీజన్లో అబుదాబీ గ్రాండ్ ప్రి చివరి రేసు కాగా... శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ ల్యాప్ను 1 నిమిషం 22. 207 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’ నుంచి ప్రారంభించనున్నాడు. మెక్లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్ 1 నిమిషం 22.408 సెకన్లు, ఆస్కార్ పియాస్ట్రి 1 నిమిషం 22.437 సెకన్లు వరుసగా రెండో, మూడో స్థానాలు దక్కించుకున్నారు. 2015 నుంచి అబుదాబి సర్క్యూట్లో పోల్ పొజిషన్ సాధించిన డ్రైవరే... ప్రధాన రేసులో విజేతగా నిలుస్తూ వస్తున్నాడు. మరి ఈ సారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందా... లేక మెక్లారెన్ డ్రైవర్లు సత్తాచాటుతారా నేడు తేలనుంది.ఈ సీజన్లో వెర్స్టాపెన్కు ఇది ఎనిమిదో పోల్ పొజిషన్ కాగా... ఓవరాల్గా కెరీర్లో 48వది. ఈ రేస్తోనే డ్రైవర్స్ చాంపియన్షిప్ టైటిల్ విజేత తేలనున్నారు. నోరిస్ 408 పాయింట్లతో రేసులో ముందుండగా... నాలుగుసార్లు చాంపియన్ వెర్స్టాపెన్ 396 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పియాస్ట్రి 392 పాయింట్లతో మూడో ‘ప్లేస్’లో ఉన్నాడు. వెర్స్టాపెన్ రేసులో విజేతగా నిలిచినా... నోరిస్ ‘టాప్–3’లో చోటు దక్కించుకుంటే అతడికే డ్రైవర్స్ చాంపియన్íÙప్ టైటిల్ దక్కనుంది.
సురుచికి స్వర్ణం
దోహా: భారత యువ షూటర్ సురుచి సింగ్... అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) సీజన్ చివరి వరల్డ్కప్ ఫైనల్లో పసిడి పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో సురుచి 245.1 పాయింట్లతో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్ సైన్యం 243.3 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. ఒలింపిక్ పతక విజేత మనూ భాకర్ 179.2 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో సురుచి 586, మనూ భాకర్ 578, సైన్యం 573 పాయింట్లు సాధించి ఫైనల్కు అర్హత సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సామ్రాట్ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో సామ్రాట్ 221.5 పాయింట్లు సాధించాడు. తొలి రోజు పోటీల్లో భారత ఎయిర్ రైఫిల్ షూటర్లు నిరాశ పరిచారు. రుద్రాం„Š పాటిల్, అర్జున్ బబూతా వరుసగా నాలుగు, ఆరో స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో ఎలవెనిల్ వలరివన్ 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
జనవరి 15 నుంచి రెజ్లింగ్ లీగ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) జరగనుంది. పోటీలన్నీ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్ శనివారం పేర్కొన్నారు. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొననుండగా... ఒక్కో జట్టులో 9 మంది రెజ్లర్లు ఉంటారు. వీరిలో నలుగురు మహిళలు తప్పనిసరి. అన్నీ జట్లలో ఐదుగురు భారత రెజ్లర్లతో పాటు నలుగురు విదేశీ రెజ్లర్లకు అవకాశం కల్పించారు. వేలంలో 20 దేశాలకు చెందిన 300 మంది రెజ్లర్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు సంజయ్ సింగ్ వెల్లడించారు. ఇందులో ఒలింపిక్ పతక విజేతలు, ప్రపంచ చాంపియన్షిప్ విజేతలు, పలువురు అంతర్జాతీయ స్టార్లు ఉన్నట్లు సంజయ్ సింగ్ తెలిపారు.
విశాఖలో 'విజయ పతాక'
భారత టాపార్డర్ బ్యాటర్లు సిరీస్ గెలిపించారు. యశస్వి జైస్వాల్ అజేయ శతకంతో కదం తొక్కగా, సీనియర్ సూపర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫిఫ్టీలతో మెరిపించారు. అంతకుముందు పేసర్ ప్రసిధ్ కృష్ణ జోరందుకున్న సఫారీపై నిప్పులు చెరిగాడు. ఇతనికి తోడుగా కుల్దీప్ యాదవ్ తిప్పేశాడు. దీంతో పరుగుల పరంగా ఎటో వెళ్లాల్సిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా 48 ఓవర్లయినా పూర్తిగా ఆడలేక ఆలౌటైంది. అలా విశాఖలో టీమిండియా విజయ పతాకాన్ని ఎగురవేసింది.సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై టెస్టు సిరీస్ను కోల్పోయి దిగాలు పడిన టీమిండియా తెలుగు నేలపై తెగ మురిసే విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. మొదట సఫారీ జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 106; 8 ఫోర్లు, 6 సిక్స్లు) ‘శత’క్కొట్టాడు. బవుమా (67 బంతుల్లో 48; 5 ఫోర్లు) రాణించాడు. ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ చెరో 4 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 271 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’యశస్వి జైస్వాల్ (121 బంతుల్లో 116 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్లు) తొలి వన్డే సెంచరీ సాధించాడు. రోహిత్ (73 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’కోహ్లి (45 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. 9న కటక్లో జరిగే తొలి టి20తో ఐదు మ్యాచ్ల సిరీస్ మొదలవుతుంది. ఆదుకున్న డికాక్20 ఓవర్లయిపోయాయి. దక్షిణాఫ్రికా జట్టు స్కోరేమో వంద దాటేసింది. ఇంకేం మరో పరుగుల విందు గ్యారంటీ అనిపించింది ఒక దశలో! ఇంతలో 21వ ఓవర్ ఆఖరి బంతికి కెప్టెన్ బవుమాను జడేజా అవుట్ చేశాడు. ఇదొక్కటి సఫారీ జోరును, స్కోరును వారి బ్యాటింగ్ తీరునే మార్చేసింది. అన్ని ఓవర్ల (50)ను ఆడకుండా చేసింది. బ్యాటర్లనంతా ఆలౌట్ చేసింది. ఇదంతా కూడా మరుసటి 27 ఓవర్లలోనే జరిగింది. 300 పైచిలుకు ఖాయమనుకున్న స్కోరు 270 పరుగుల వద్దే ఆగిపోయింది. 21వ ఓవర్ నుంచి 48 ఓవర్ ముగియక ముందే 156 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు కూలడంతోనే సఫారీ అధోగతి పాలైంది. అంతకుముందు బ్యాటింగ్కు దిగగానే రికెల్టన్ (0) వికెట్ను కోల్పోయిన దక్షిణాఫ్రికాను డికాక్, కెప్టెన్ బవుమా నడిపించారు. ఇద్దరు రెండో వికెట్కు 113 పరుగులు జోడించారు. బవుమాను అవుట్ చేసిన జడేజా అంతా మార్చేశాడు. తర్వాత వచ్చిన వారెవరూ ప్రసిధ్ పేస్ను, కుల్దీప్ స్పిన్ను ఎదుర్కోలేకపోయారు.జైస్వాల్ ధమాకాఈ సిరీస్లో వరుస రెండు మ్యాచ్ల్లోనూ ఇరు జట్లు కలిసి అవలీలగా 600 పైచిలుకు స్కోర్లు చేయడం చూసిన మనకు ఈ స్కోరును చూస్తే ఏమంత కష్టసాధ్యం కాదని ఇట్టే తెలిసిపోతుంది. అందుకు తగ్గట్లే ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టారు. 10.1 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. 20వ ఓవర్లో వందకు చేరింది. 25వ ఓవర్లోనే 150 పరుగులకు చేరడంతోనే గెలుపు పిలుపు వినిపించింది. ఈ క్రమంలో ముందుగా రోహిత్ 54 బంతుల్లో తర్వాత జైస్వాల్ 75 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. తొలివికెట్కు 155 పరుగులు జోడించాక రోహిత్ జోరుకు కేశవ్ మహరాజ్ కళ్లెం వేశాడు. సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి వచ్చి రావడంతోనే చేదంచేపనిలో పడ్డాడు. చూడచక్కని బౌండరీలు స్ట్రోక్ ప్లేతో జైస్వాల్ 111 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకోగా... కాసేపటికే కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు అబేధ్యమైన రెండో వికెట్కు 116 పరుగులు జోడించారు. మనం టాస్ గెలిచామోచ్!విశాఖలో మ్యాచ్ మొదలయ్యే ముందు ‘టాస్ కా బాస్’.... మ్యాచ్ ముగిశాక ‘సిరీస్ కా బాస్’రెండు టీమిండియానే! కీలకమైన మ్యాచ్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. వరుసగా 20 మ్యాచ్ల్లో టాస్లు ఓడిన భారత్ ఎట్టకేలకు 21వ మ్యాచ్లో టాస్ నెగ్గింది. టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. ఆల్రౌండర్ సుందర్ను పక్కనబెట్టి హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మకు తెలుగు గడ్డపై మ్యాచ్ ఆడే అవకాశం కల్పించారు.20,048‘హిట్మ్యాన్’రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో చేసిన పరుగులివి. టెస్టులు, వన్డేలు, టి20 ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేల పైచిలుకు పరుగులు చేశాడు.స్కోరు వివరాలుదక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) ప్రసిధ్ 106; రికెల్టన్ (సి) రాహుల్ (బి) అర్ష్ దీప్ 0; బవుమా (సి) కోహ్లి (బి) జడేజా 48; బ్రీట్కి (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్ 24; మార్క్రమ్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ 1; బ్రెవిస్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 29; యాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 17; బాష్ (సి) అండ్ (బి) కుల్దీప్ 9; కేశవ్ నాటౌట్ 20; ఎన్గిడి (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 1; బార్ట్మన్ (బి) ప్రసిధ్ 3; ఎక్స్ట్రాలు 12; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–1, 2–114, 3–168, 4–170, 5–199, 6–234, 7–235, 8–252, 9–258, 10–270. బౌలింగ్: అర్ష్ దీప్ 8–1–36–1, హర్షిత్ 8–2–44–0, ప్రసిధ్ కృష్ణ 9.5–0–66–4, జడేజా 9–0–50–1, కుల్దీప్ 10–1–41–4, తిలక్ వర్మ 3–0–29–0. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ నాటౌట్ 116; రోహిత్ (సి) బ్రీట్కి (బి) కేశవ్ 75; కోహ్లి నాటౌట్ 65; ఎక్స్ట్రాలు 15; మొత్తం (39.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 271. వికెట్ల పతనం: 1–155. బౌలింగ్: యాన్సెన్ 8–1–39–0, ఎన్గిడి 6.5–0–56–0, కేశవ్ 10–0–44–1, బార్ట్మన్ 7–0–60–0, బాష్ 6–0–53–0, మార్క్రమ్ 2–0–17–0.
అభిషేక్ శర్మ రేర్ రికార్డు.. రోహిత్, కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో టీమిండియా యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ విధ్వంసం సృష్టించాడు.ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 34 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 62 పరుగులు చేశాడు. అదేవిధంగా అభిషేక్ 2025 ఏడాదిలో టీ20ల్లో వంద సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఈయర్లో టీ20ల్లో 100 సిక్స్ల మైలురాయిని అందుకున్న మొదటి భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు.అభిషేక్ ఈ ఏడాది ఆరంభం నుంచే టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ టీ20 సిరీస్తో పాటు ఐపీఎల్, ఆసియాకప్, ఆసీస్ టూర్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ సంవత్సరం టీ20ల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 42.82 సగటుతో 1,499 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 149గా ఉంది.పంజాబ్ ఘన విజయంఇక ఈ మ్యాచ్లో సర్వీసెస్ టీమ్ను 73 పరుగుల తేడాతో పంజాబ్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో అభిషేక్తో పాటు ఫ్రబ్సిమ్రాన్ సింగ్(50), నమన్ ధీర్(54) హాఫ్ సెంచరీలతో మెరిశారు.అనంతరం సర్వీసెస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బౌలర్లలో అభిషేక్ శర్మ, సన్వీర్ సింగ్, హర్ప్రీత్ తలా రెండు వికెట్లు సాధించారు.
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. పర్యాటక ప్రోటీస్ జట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలో ఛేదించింది.జైశ్వాల్ సెంచరీ..లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ తొలి వికెట్కు 155 పరుగుల అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్కు పంపాడు. కానీ జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్ధి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఈ ముంబై ఆటగాడు 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో 65 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.Look at what it means to him! 🥳What a special knock this has been from Yashasvi Jaiswal 🙌Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/BHyNjwOGWY— BCCI (@BCCI) December 6, 2025డికాక్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో డికాక్ సెంచరీ వృథా అయిపోయింది.Virat Kohli in this series :Innings -3 Runs - 302Avg. - 151SR - 117.05100s- 250s-1Should get Man of the Series.#ViratKohli𓃵 pic.twitter.com/NVeNDgTqU2— Pedriverse (@Cules651) December 6, 2025చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ
సౌతాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో విఫలమైన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఎట్టకేలకు తన ఫామ్ను అందుకున్నాడు. వైజాగ్ వేదికగా జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు.271 పరుగుల లక్ష్య చేధనలో జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన యశస్వి.. క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. జైశూ 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో తన వన్డే సెంచరీ మార్క్ అందుకున్నాడు. శతక్కొట్టగానే జైశ్వాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గాల్లోకి జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.కాగా మొదటి రెండు వన్డేల్లో ఈ ముంబై ఆటగాడు విఫలం కావడంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం జైశ్వాల్పై నమ్మకం ఉంచాడు. దీంతో తనకు లభించిన అవకాశాన్ని జైశ్వాల్ అందిపుచ్చుకున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడడంతో జైశ్వాల్కు జట్టులో చోటుదక్కింది. మళ్లీ గిల్ తిరిగొస్తే జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్గానే కొనసాగనున్నాడు. ఇక వైజాగ్ వన్డేలో టీమిండియా విజయానికి చేరువైంది. సిరీస్ విజయానికి భారత్కు ఇంకా 29 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి(46), జైశ్వాల్(107) ఉన్నారు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
ముఖం మాడ్చుకున్న కుల్దీప్!.. రోహిత్ ఇలా చేశావేంటి?
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా సౌతాఫ్రికా మీద ఏకంగా ఐదుసార్లు.. నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఏకైక భారత బౌలర్గా చరిత్రకెక్కాడు.మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచిలో భారత్ గెలవగా.. రాయ్పూర్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ క్రమంలో 1-1తో సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్తో సిరీస్ ఫలితం తేలనుంది. వైజాగ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.270 పరుగులకు ఆలౌట్కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) నిర్ణయాన్ని సమర్థించేలా భారత బౌలర్లు మెరుగ్గా రాణించి.. సఫారీలను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లలో ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్లో ఓవరాల్గా పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్.. కేవలం 41 పరుగులు ఇచ్చాడు. డెవాల్డ్ బ్రెవిస్ (29), మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) రూపంలో ముగ్గురు డేంజరస్ ప్లేయర్లను వెనక్కి పంపిన కుల్దీప్.. లుంగి ఎంగిడి (1)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పదే పదే అప్పీలు చేస్తూ.. అయితే, ఎంగిడి ఎల్బీడబ్ల్యూ చేసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రివ్యూ కోసం ప్రయత్నించిన తీరు.. అందుకు రోహిత్ శర్మ స్పందించిన విధానం నవ్వులు పూయించింది. ఎంగిడి అవుట్ అయ్యాడంటూ కుల్దీప్ పదే పదే అప్పీలు చేస్తూ.. రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ కేఎల్ రాహుల్ను కోరాడు. అయితే, అందుకు అతడు నిరాకరించాడు.ముఖం మాడ్చుకున్న కుల్దీప్ఇంతలో రోహిత్ శర్మ జోక్యం చేసుకుంటూ.. ‘‘అబే.. రివ్యూ అవసరం లేదు’’ అంటూ నవ్వుతూ కుల్దీప్ను టీజ్ చేశాడు. దీంతో ఓవైపు రాహుల్.. మరోవైపు విరాట్ కోహ్లి కూడా నవ్వులు చిందించారు. అప్పటికే ముఖం మాడ్చుకున్న కుల్దీప్ నవ్వలేక నవ్వుతూ తన స్థానంలోకి వెళ్లాడు. అయితే, కొద్దిసేపటికే అతడు అనుకున్నట్లుగా ఎంగిడిని పెవిలియన్కు పంపడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర పరాభవంThese are the moments we pay our internet bills for! 😉😁😍#INDvSA 3rd ODI, LIVE NOW 👉 https://t.co/Es5XpUmR5v pic.twitter.com/hPZJFPlJ0G— Star Sports (@StarSportsIndia) December 6, 2025
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి 20,000 పరుగులను రోహిత్ పూర్తి చేసుకున్నాడు. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ను హిట్మ్యాన్ అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు.రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్( (34357), విరాట్ కోహ్లీ (27910), రాహుల్ ద్రవిడ్ (24208) ఈ ఘనత సాధించారు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 11486, టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. ఓవరాల్గా తన అంతర్జాతీయ కెరీర్లో ఈ ముంబైకర్ 50 సెంచరీలు నమోదు చేశాడు.వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కూడా రోహిత్(264) పేరిటే ఉంది. ఈ మ్యాచ్లో రోహిత్ 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ ఈ హాఫ్ సెంచరీతో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డు బ్రేక్👉సౌతాఫ్రికాపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఓపెనర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు ఓపెనర్గా సఫారీలపై మూడు ఫార్మాట్లు కలిపి 1758 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1734) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా వన్డేల్లో ఓపెనర్గా అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఓపెనర్గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 79 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్(78)ను అధిగమించాడు.డికాక్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. అనంతరం లక్ష్య చేధనలో భారత్ నిలకడగా ఆడుతోంది. 29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(83), విరాట్ కోహ్లి(7) ఉన్నారు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్లోనే!
‘షూటౌట్’లో గెలిచి సెమీస్లోకి భారత్
చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్ట...
నేను గెలిచేందుకు మా వాణ్ని ఓడిపొమ్మంటానా?
అబుదాబి: ఈ సీజన్ ఫార్ములావన్ చాంపియన్షిప్ కోసం...
తెలంగాణ స్విమ్మర్లకు నాలుగు పతకాలు
సాక్షి, హైదరాబాద్: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ...
భారత్కు తొలి పరాజయం
సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ ట...
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ ...
టీమిండియాకు శుభవార్త.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు శుభవ...
ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్..
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి మైదాన...
దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర పరాభవం
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన అద్భుత ప...
క్రీడలు
రేపు హైదరాబాద్కు హీరో సల్మాన్ ఖాన్ (ఫోటోలు)
సారా టెండూల్కర్ వారణాసి ట్రిప్ (ఫొటోలు)
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
వరల్డ్కప్ గెలిచి నెల రోజులు.. భారత మాజీ క్రికెటర్ భావోద్వేగం (ఫోటోలు)
ఉప్పల్లో హార్దిక్ హంగామా.. పోటెత్తిన అభిమానులు (ఫోటోలు)
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
ఉత్సాహంగా వైజాగ్ మారథాన్ ర్యాలీ (ఫొటోలు)
హైదరాబాద్కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
వీడియోలు
విశాఖలో క్రికెట్ ఫీవర్.. టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
వరుస సెంచరీలతో విరాట్ విధ్వంసం.. 2027 వరల్డ్ కప్ పై ఆశలు
రాయ్ పూర్ వన్డేలో భారత్ పై సౌతాఫ్రికా విజయం
సిరీస్ పై భారత్ గురి
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
స్మృతి మందాన పెళ్లి రద్దు? వేరే అమ్మాయితో పలాస్ డేటింగ్!
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
