Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

No Hardik Pandya AND Jasprit Bumrah in IND vs NZ ODIs due to T20 World Cup 20261
న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా స్టార్లు దూరం!

న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు భారత స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ 2026 దృష్ట్యా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.వన్డేలకు దూరంగా ఉండనున్న హార్దిక్‌-బుమ్రా.. తిరిగి జనవరి 21 నుండి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం ఆడనున్నాడు. ఈ టీ20 సిరీస్ ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరగనుంది. మొత్తం ఐదు మ్యాచ్‌లలోనూ వారిద్దరూ ఆడనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా వర్క్ లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా వీరిద్దరి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. సఫారీలతో టీ20 సిరీస్‌లో మాత్రం ఆడారు. ఇప్పుడు అదే జరగనుంది. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఇప్పటివరకు ఒక్క వన్డే కూడా ఆడలేదు. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వ‌న్డే ఫార్మాట్‌కు దూరంగా ఉండ‌నున్నాడు.బుమ్రా టెస్టుల్లో దుమ్ములేపుతుంటే.. పాండ్యా టీ20ల్లో అద‌ర‌గొడుతున్నాడు. సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ 20 సిరీస్‌లో పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు. ఒక‌వేళ కివీస్‌తో జ‌రిగే వ‌న్డే సిరీస్‌కు పాండ్యా దూర‌మైతే ఆంధ్ర ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డికి జ‌ట్టులో ద‌క్క‌నుంది. ఈ వ‌న్డే సిరీస్ జ‌న‌వ‌రి 11 నుంచి ప్రారంభం కానుంది. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సైతం తిరిగి జ‌ట్టులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది.కివీస్‌తో వన్డేలకు భారత జట్టు (అంచనా)శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీపర్‌), రిషబ్ పంత్ /ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్చదవండి: మ‌హ్మద్ ష‌మీకి బీసీసీఐ భారీ షాక్‌..!

Cristiano Ronaldo Creates History, Goes Past Lionel Messi2
చ‌రిత్ర సృష్టించిన రొనాల్డో.. మెస్సీ రికార్డు బ్రేక్‌

సౌదీ ప్రీమియర్ లీగ్‌లో అల్ అఖ్‌దూద్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో అల్-నస్ర్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌, అల్-నస్ర్ కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. రొనాల్డోరెండు మెరుపు గోల్స్‌తో అల్-నస్ర్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.ఈ ఫుట్‌బాల్ స్టార్ మ్యాచ్ 31వ నిమిషంలో ఒక గోల్ చేయగా.. ఫ‌స్ట్ హాఫ్ ఆఖ‌రిలో మరో అద్భుతమైన గోల్ వేశాడు. అత‌డితో పాటు జోవో ఫెలిక్స్ కూడా ఓ గోల్ సాధించాడు. ఈ విజ‌యంతో సౌదీ ప్రో లీగ్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన మొదటి క్లబ్‌గా అల్-నస్ర్ రికార్డు సృష్టించింది.అదేవిధంగా రొనాల్డో కూడా ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 202 ఏడాదిలో రొనాల్డో 40 గోల్స్‌ను పూర్తి చేసుకున్నాడు. ఒకే క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో అత్య‌ధిక సార్లు నాల‌భైకి పైగా గోల్స్ సాధించిన ప్లేయ‌ర్‌గా రోనాల్డో చ‌రిత్ర సృష్టించాడు. అతడు తన కెరీర్‌లో 14 వేర్వేరు సంవత్సరాల్లో 40 పైగా గోల్స్ సాధించాడు.2010 నుంచి దాదాపు ప్రతీ ఏటా రోనాల్డో నాలభైకి పైగా గోల్స్ సాధిస్తున్నాడు. ఒక్క 2019లోనే ఈ మార్క్‌ను అందుకోలేకపోయాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పేరిట ఉండేది. మెస్పీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 13 సార్లు 40 పైగా గోల్స్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో మెస్సీని రొనాల్డో అధిగమించాడు.చదవండి: మ‌హ్మద్ ష‌మీకి బీసీసీఐ భారీ షాక్‌..!

England lose Gus Atkinson due to hamstring injury for fifth Ashes Test3
ఐదో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్ అవుట్‌

యాషెస్ సిరీస్ 2025-26 తుది అంకానికి చేరుకుంది. ఈ ప్ర‌తిష్టాత‌క సిరీస్‌లో ఆఖ‌రి టెస్టు జ‌న‌వరి 4 నుంచి సిడ్నీ వేదిక‌గా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ గస్ అట్కిన్సన్ తొడ కండ‌రాల గాయం కార‌ణంగా ఐదో టెస్టుకు దూర‌మ‌య్యాడు.బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట సంద‌ర్భంగా బౌలింగ్ చేసే క్ర‌మంలో అట్కిన్స‌న్ తొడ వెన‌క కండ‌రాలు ప‌ట్టేశాయి. అనంత‌రం స్కాన్ రిపోర్ట్‌లో గాయం తీవ్ర‌త గ్రేడ్‌-1గా ఉన్న‌ట్లు తేలింది. దీంతో అత‌డికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే మార్క్ వుడ్‌, జోఫ్రా ఆర్చ‌ర్ సేవ‌ల‌ను కోల్పోయిన ఇంగ్లండ్ జ‌ట్టుకు నిజంగా ఇది భారీ షాక్ అని చెప్పాలి. అయితే ఈ సిరీస్‌లో అట్కిన్సన్ తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.అట్కిన్సన్ తొలి టెస్టులో ఒక్క వికెట్ కూడా సాధించికపోయినప్పటికి.. బ్రిస్బేన్‌లో మాత్రం 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం అడిలైడ్ టెస్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆర్చర్ గాయపడడంతో అట్కిన్సన్ తిరిగి బాక్సింగ్ డే టెస్టు కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ చారిత్ర‌త్మ‌క విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో అత‌డు మూడు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు.పాట్స్ ఎంట్రీ?ఇక ఐదో టెస్టులో అట్కిన్సన్ స్థానంలో మాథ్యూ పాట్స్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో రానున్న‌ట్లు తెలుస్తోంది. బ్రైడన్ కార్స్, జోష్ టంగ్‌తో కలిసి మాథ్యూ పాట్స్ బౌలింగ్ బాధ్యతలు పంచుకునే అవ‌కాశ‌ముంది. ఒక వేళ సిడ్నీ పిచ్ కండీషన్స్ బ‌ట్టి స్పిన్న‌ర్ ఆడించాల‌నుకుంటే షోయబ్ బషీర్‌ను తుది జట్టులోకి వ‌చ్చే ఛాన్స్ ఉంది. ఈ యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇప్ప‌టికే 3-1 తేడాతో కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్‌లో గెలిచి త‌మ ప‌రువు నిలబెట్టుకోవాల‌ని స్టోక్స్ సేన భావిస్తోంది.సిడ్నీ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు:బెన్ స్టోక్స్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, విల్ జాక్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.

Australian Fan Asks Ben Duckett. England Stars Savage Reply Viral4
నీకు బీర్ కావాలా? అదిరిపోయే సమాధానమిచ్చిన ఇంగ్లండ్ స్టార్‌

యాషెస్ నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జ‌ట్టుపై తీవ్ర స్ధాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు.. రిలాక్స్ అవ్వడానికి క్వీన్స్‌ల్యాండ్‌లోని నూసాకు వెళ్లారు. అయితే ఈ ‍బ్రేక్‌లో ఇంగ్లీష్ ఆటగాళ్లు మితిమీరి మద్యం సేవించినట్లు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ మద్యం మత్తులో రోడ్డుపై తిరుగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. రోడ్డుపై ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితిలో డకెట్ కన్పించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ విచారణకు ఆయన ఆదేశించారు.ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో బెన్ డకెట్‌ను ఆస్ట్రేలియా ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. రెండో రోజు ఆటలో డకెట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని అతడిని ఎగతాళి చేస్తూ "నీకు ఒక బీర్ కావాలా?" అని గట్టిగా అరిచాడు. వెంటనే అభిమానుల వైపు చూస్తూ, డకెట్ నవ్వుతూ.. "సరే, తీసుకురండి చూద్దాం!" అన్నట్లుగా బీరు తాగే సైగలు చేశాడు.అతడి సమాధానం విన్న ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయి చప్పట్లతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇప్పటికే 3-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్‌ను కోల్పోయింది.చదవండి: మ‌హ్మద్ ష‌మీకి బీసీసీఐ భారీ షాక్‌..!

former England cricket player Hugh Morris passes away5
ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కన్ను మూత

ఇంగ్లండ్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ క్రికెటర్‌ హ్యూగ్‌ మోరిస్‌ (62) కన్నుముశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మోరిస్‌ ఆదివారం మృతి చెందారు. మోరిస్‌ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన గ్లామోర్గాన్‌ కౌంటీ జట్టు ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. ఆటగాడిగానే కాకుండా... సీఈఓ గానూ క్లిష్ట పరిస్థితుల్లో క్లబ్‌ను ఆర్ధి‍క ఇబ్బందుల నుంచి గట్టెక్కించినట్లు అందులో పేర్కొంది. (Hugh Morris Death)ఇంగ్లండ్‌ తరఫున 3 టెస్టులు ఆడిన మోరిస్‌... ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పరుగుల వరద పారించారు. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం ఇంగ్లండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు సీఈఓగాను మోరిస్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 314 మ్యాచ్‌లాడిన ఈ ఓపెనర్‌... 19,785 పరుగులు చేశారు. అందులో 53 సెంచరీలు, 98 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో 274 మ్యాచ్‌ల్లో 8606 పరుగులు చేశారు.

BCCI to announce India central contracts 2025-26, Mohammed Shami to be axed?6
మ‌హ్మద్ ష‌మీకి బీసీసీఐ భారీ షాక్‌..!

2025-26 సీజన్‌కు గాను భారత పురుషల క్రికెట్ జట్టు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించేందుకు బీసీసీఐ సిద్దమైంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఈ జాబితా వెలువడే అవకాశముంది. అయితే ఈసారి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాలో ప‌లు మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.టీ20, టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల‌ను డిమోట్ చేయ‌నున్న‌ట్లు సమాచారం. రో-కో ప్ర‌స్తుతం గ్రేడ్ 'ఎ' ప్ల‌స్‌లో ఉన్నారు. అయితే వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం వ‌న్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతుండ‌డంతో కాంట్రాక్ట్‌లో మార్పు చోటు చేసుకునే అవ‌కాశ‌ముంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లలో ఆడేవారికే గ్రేడ్ ఎ ప్ల‌స్ ద‌క్కుతుంది. మ‌రోవైపు వ‌న్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌కు ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని బీసీసీఐ భావిస్తుందంట‌. గిల్ గ్రేడ్ ఎ నుంచి ఎ ప్ల‌స్‌కు వెళ్ల‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.ష‌మీపై వేటు..ఇక స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీకి భారీ షాక్ త‌గిలే అవ‌కాశ‌ముంది. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ష‌మీని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ష‌మీ చివ‌ర‌గా భార‌త్ త‌ర‌పున ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఆడాడు.బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్కాలంటే స‌ద‌రు ఆట‌గాడు ఒక ఏడాదిలో నిర్ణీత సంఖ్యలో మ్యాచ్‌లు ఆడాలి లేదా జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలి. కానీ ష‌మీ ఈ ఏడాది మార్చి నుంచి ఒక్క అంత‌ర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్ర‌మంలోనే అత‌డిపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ద‌మైన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.ష‌మీ ప్ర‌స్తుతం గ్రేడ్‌-ఎలో ఉన్నాడు. అందుకు గాను ఏడాదికి రూ.5 కోట్లు వేతనం అందుకుంటున్నాడు. ష‌మీకి ఒకవేళ ఇప్పుడు కాంట్రాక్ట్ దక్కకపోయినా.. ఏడాది మధ్యలో జట్టులోకి వచ్చి 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడితే ఆటోమేటిక్‌గా ప్రో-రాటా పద్ధతిలో కాంట్రాక్ట్ దక్కుతుంది.ష‌మీ ప్ర‌స్తుతం దేశ‌వాళీ టోర్నీల్లో క్ర‌మం త‌ప్ప‌కుండా ఆడుతున్నాడు. అత‌డు పూర్తి ఫిట్‌నెస్‌తో క‌న్పిస్తున్నాడు. అంతేకాకుండా సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. అయిన‌ప్ప‌టికి సెల‌క్ట‌ర్లు అత‌డిని జాతీయ జ‌ట్టులోకి తీసుకోవ‌డం లేదు. అదేవిధంగా ష‌మీతో పాటు మ‌రో బెంగాల్ స్పీడ్ స్టార్ కూడా త‌న కాంట్రాక్ట్‌ను కోల్పోయే అవ‌కాశ‌ముంది.తిల‌క్ వ‌ర్మ‌, అర్ష్‌దీప్‌కు ప్ర‌మోష‌న్‌..ఇక టీ20 క్రికెట్‌లో దుమ్ములేపుతున్న హైద‌రాబాదీ తిల‌క్ వ‌ర్మ‌కు ప్ర‌మోష‌న్ ద‌క్కే అవ‌కాశ‌ముంది. తిల‌క్ ప్ర‌స్తుతం గ్రేడ్ సిలో ఉన్నాడు. అత‌డు గ్రేడ్‌-సి నుంచి గ్రేడ్-బికి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ కాంట్రాక్ట్ కూడా మార‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అర్ష్‌దీప్ టీ20ల‌తో పాటు వ‌న్డే జ‌ట్టులోనూ కీల‌క స‌భ్యునిగా ఉన్నాడు. తిలక్‌తో పాటు అర్ష్‌దీప్‌ సైతం గ్రేడ్‌-సి నుంచి బికి వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా 2024-2025..గ్రేడ్ ప్లస్‌: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాగ్రేడ్ ఎ: రిషబ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్‌ రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యగ్రేడ్ బి: సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్గ్రేడ్ సి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ రాశి వరుణ్, అభిషేక్ దీప్‌వర్త్ శర్మబీసీసీఐ A+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.చదవండి: భార‌త్ త‌ర‌పున ఆడాడు.. క‌ట్ చేస్తే! ఊహించ‌ని షాక్చిన పాకిస్తాన్‌

Pakistan kabaddi player sports Indian jersey at private event in Bahrain7
భార‌త్ త‌ర‌పున ఆడాడు.. క‌ట్ చేస్తే! ఊహించ‌ని షాకిచ్చిన పాకిస్తాన్‌

ప్రముఖ పాకిస్తాన్‌ అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్‌ ఉబేదుల్లా రాజ్‌పుత్‌ నిషేధానికి గురయ్యాడు. అతను బహ్రెయిన్‌లో ఈ నెలారంభంలో జరిగిన ఓ ప్రైవేట్ టోర్నీలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. విదేశీ టోర్నీలో ఇలా ఆడాలంటే పాకిస్తాన్‌ కబడ్డీ సమాఖ్య (పీకేఎఫ్‌) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాలి.కానీ ఉబేదుల్లా మాత్రం ఎలాంటి ఎన్‌ఓసీ లేకుండానే బహ్రెయిన్‌ ఈవెంట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో పీకేఎఫ్‌ అతని నిర్వాకంపై కన్నెర్ర జేసింది. ఉబేదుల్లాపై నిరవధిక నిషేధం విధించినట్లు పీకేఎఫ్‌ కార్యదర్శి రాణా సర్వార్‌ వెల్లడించారు.అయితే ఈ నిషేధంపై క్రమశిక్షణ కమిటీ ముందు అప్పీల్‌కు వెళ్లే హక్కు రాజ్‌పుత్‌కు ఉందని ఆయన చెప్పారు. ఈ నెలలో బహ్రెయిన్‌లో జీసీసీ కప్‌ టోర్నీ జరిగింది. ఇందులో ఉబేదుల్లా రాజ్‌పుత్‌ భారత జెర్సీ వేసుకొని, త్రివర్ణ పతాకంతో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పీకేఎఫ్‌ చర్యలు చేపట్టింది.చదవండి: క్రికెట్‌ ఆ్రస్టేలియాకు రూ. 60 కోట్ల నష్టం!

Cricket Australia loss of Rs 60 crore8
క్రికెట్‌ ఆ్రస్టేలియాకు రూ. 60 కోట్ల నష్టం!

మెల్‌బోర్న్‌: సొంతగడ్డపై జరుగుతున్న ‘యాషెస్‌’ సిరీస్‌కు అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తున్నా... ఆర్థికంగా మాత్రం క్రికెట్‌ ఆ్రస్టేలియాకు నష్టాలు తప్పేలా లేవు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో మూడింట గెలిచిన ఆతిథ్య ఆసీస్‌ సిరీస్‌ నిలబెట్టుకుంది. అయితే వీటిలో రెండు టెస్టు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిశాయి. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు రోజుల్లోనే ఫలితం రాగా... మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో జరిగిన నాలుగోదైన ‘బాక్సింగ్‌ డే’ టెస్టు మ్యాచ్‌ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది. చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు శుక్రవారం తొలి రోజు రికార్డు స్థాయిలో 94,199 మంది అభిమానులు మైదానానికి తరలిరాగా... శనివారం రెండో రోజు 92,045 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మూడో రోజు కోసం కూడా 90 వేల మందికి పైగా టికెట్లు కొనుగోలు చేసుకున్నారు. అయితే పిచ్‌ పేసర్లకు ఇతోధిక సాయం చేయడంతో ఈ మ్యాచ్‌లో తొలి రోజే 20 వికెట్లు నేలకూలాయి. ఇక రెండో రోజు 16 వికెట్లు పడగా... ఆరు సెషన్‌లలోపే ఫలితం తేలింది. దీంతో మూడో రోజు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఇలా సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ)కు 10 మిలియన్‌ ఆ్రస్టేలియా డాలర్లు (రూ. 60.22 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఎంసీజీ పిచ్‌పై దుమారం ‘బాక్సింగ్‌ డే’ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రీడాభిమానులతో పాటు విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తునున్నారు. ఆస్ట్రేలియాలో కాకుండా మరెక్కడైనా ఇలా రెండు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిసిఉంటే పెద్దఎత్తున చర్చ జరిగేదని ఇంగ్లండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌ నిప్పు రాజేయగా... దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఎంసీజీ పిచ్‌పై 10 మిల్లీ మీటర్ల కన్నా ఎక్కువ పచ్చికను సిద్ధం చేశారని... ఇలా అయితే ఆటలో సమతుల్యత దెబ్బతింటుందని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయ పడుతున్నారు. ‘మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగియడం అసంతృప్తినిచి్చంది. తొలి రోజు పిచ్‌ అనూహ్యంగా స్పందించి పేసర్లకు సాయం చేసింది. ఇందులో మా ప్రమేయం లేదు. మంచి స్పోర్టింగ్‌ వికెట్‌ తయారు చేయాలనుకున్నాం. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటాం’ అని ఎంసీజీ క్యూరేటర్‌ మాథ్యూ పేజ్‌ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన ఆసీస్‌ ఓపెనర్‌ హెడ్‌ మాట్లాడుతూ... ‘మ్యాచ్‌ అన్నాక ఎవరో ఒకరు విజయం సాధించడం ఖాయం. బంతికి, బ్యాట్‌కు మధ్య పోరాటాన్ని అభిమానులు ఆస్వాదిస్తారు. అడిలైడ్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇది కనిపించింది. ఎంసీజీలో మాత్రం ఇలా జరగలేదు’ అని అన్నాడు.

Andhra Pradesh swimmer won two gold medals at the Aquatic Championship9
పావని డబుల్‌ ధమాకా

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్‌ పావని సరయు రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. తెలంగాణ స్విమ్మింగ్‌ సంఘం ఆధ్వర్యంలో గచి్చ»ౌలి స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. రెండో రోజు ఆదివారం మహిళల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ (బ్యాక్‌స్ట్రోక్‌+బ్రెస్ట్‌ స్ట్రోక్‌+బటర్‌ఫ్లయ్‌+ఫ్రీస్టయిల్‌) విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్న పావని సరయు... 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగంలోనూ ‘టాప్‌’లో నిలిచింది. బాలికల అండర్‌ 15–17 వయో విభాగం 200 మీటర్ల మెడ్లీ రేసును పావని 2 నిమిషాల 36.86 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే పోటీలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అవిఘ్న చింతల 2 నిమిషాల 37.69 సెకన్ల టైమింగ్‌తో రజత పతకం దక్కించుకుంది. కర్ణాటక స్విమ్మర్‌ హితశ్రీ (2 నిమిషాల 41.81 సెకన్లు) కాంస్యం గెలుచుకుంది. బాలికల అండర్‌ 15–17 వయోవిభాగం 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో పావని 5 నిమిషాల 39.90 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకం నెగ్గింది. కర్ణాటక స్విమ్మర్లు హితశ్రీ (5 నిమిషాల 45.81 సెకన్లు), ప్రతీక్ష గౌడ (5 నిమిషాల 46.32 సెకన్లు) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. విజేతలకు భారత స్విమ్మింగ్‌ సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఉపాధ్యక్షుడు ఎం.సతీశ్‌ కుమార్, తెలంగాణ స్విమ్మింగ్‌ సంఘం (టీఎస్‌ఏ) అధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌ రెడ్డి, టీఎస్‌ఏ సెక్రటరీ జి.ఉమేశ్, ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మింగ్‌ సంఘం (ఏపీఎస్‌ఏ) సెక్రటరీ ఎ.మోహన్, తెలంగాణ ట్రయాథ్లాన్‌ సంఘం అధ్యక్షుడు మదన్‌ మోహన్, జీహెచ్‌ఎంసీ ఏడీఎస్‌ కె.శ్రీనివాస్‌ గౌడ్, టీఎస్‌ఏ సంయుక్త కార్యదర్శి ఎస్‌.గిరిధర్‌ రావు పతకాలను అందజేశారు. శివాని జోరు ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే రెండు పసిడి పతకాలు నెగ్గిన తెలంగాణ స్విమ్మర్‌ శివాని కర్రా తాజాగా మరో రెండు పతకాలు గెలిచింది. బాలికల అండర్‌ 13–14 వయో విభాగంలో 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో శివాని 2 నిమిషాల 39.99 సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం గెలుచుకుంది. అలకనంద రాజు (2 నిమిషాల 39.79 సెకన్లు; కేరళ), మాన్య వాధ్వా (2 నిమిషాల 42.94 సెకన్లు) వరుసగా స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. » బాలికల అండర్‌ 13–14 వియో విభాగం 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శివాని 33.19 సెకన్ల టైమింగ్‌తో రజతం నెగ్గింది. శ్రేయ బినిల్‌ (32.66 సెకన్లు; కేరళ) పసిడి గెలుచుకోగా... తెలంగాణకే చెందిన నందిగామ శివకుమారి (33.76 సెకన్లు) కాంస్య పతకం సాధించింది. » బాలుర అండర్‌ 13–14 వయో విభాగం 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో తెలంగాణకు చెందిన సచిన్‌ సాత్విక్‌ 2 నిమిషాల 27.41 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. కర్ణాటక స్విమ్మర్‌ ఆరవ్‌ 2 నిమిషాల 24.38 సెకన్ల టైమింగ్‌తో పసిడి దక్కించుకోగా... కర్ణాటకకే చెందిన సాతి్వక్‌ సింగ్‌ 2 నిమిషాల 2.84 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకం గెలుచుకున్నాడు. » బాలుర అండర్‌ 13–14 వయో విభాగం 400 మీటర్ల పోటీలో సచిన్‌ సాతి్వక్‌ 5 నిమిషాల 21.77 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం నెగ్గాడు. కర్ణాటక స్విమ్మర్లు ఆరవ్‌ (5 నిమిషాల 6.52 సెకన్లు), వైభవ్‌ (5 నిమిషాల 17.98 సెకన్లు) తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. » బాలికల అండర్‌ 15–17... 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ విభాగంలో తెలంగాణ స్విమ్మర్‌ అద్దంకి మోక్షిత పసిడి నెగ్గింది. మోక్షిత 1 నిమిషం 9.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఇషాని (1 నిమిషం 11 సెకన్లు; కేరళ), హితశ్రీ (1 నిమిషం 11.90 సెకన్లు; కర్ణాటక) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. » బాలుర అండర్‌ 11–12 వయో విభాగం 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగంలో తెలంగాణ స్విమ్మర్‌ అర్జున్‌ సందీప్‌ కాస్వాన్‌ 2 నిమిషాల 38.68 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. లోహితాశ్వ నగేశ్‌ (2 నిమిషాల 34.63 సెకన్లు; కర్ణాటక), రోహిత్‌ (2 నిమిషాల 37.96 సెకన్లు; తమిళనాడు) వరుసగా పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. » బాలికల అండర్‌ 13–14 వయో విభాగం 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ విభాగంలో తెలంగాణ స్విమ్మర్‌ వేములపల్లి దిత్యా చౌదరీ 1 నిమిషం 18.75 సెకన్లలో పోటీని ముగించి మూడో స్థానంతో కాంస్యం గెలుచుకుంది. మాన్య వాధ్వా (1 నిమిషం 9.65 సెకన్లు; కర్ణాటక), ఆద్య భరద్వాజ్‌ (1 నిమిషం 10.58 సెకన్లు; కర్ణాటక) వరుసగా స్వర్ణ, రజతాలు హస్తగతం చేసుకున్నారు. » బాలికల అండర్‌ 11–12 వయో విభాగం 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ పోటీల్లో తెలంగాణకు చెందిన కోపల్లి హవీష 1 నిమిషం 22.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. నయన (1 నిమిషం 14.72 సెకన్లు; కర్ణాటక), ధ్రుతి (1 నిమిషం 17.52 సెకన్లు; కర్ణాటక) వరుసగా పసిడి, రజత పతకాలు నెగ్గారు. »బాలికల అండర్‌ 15–17 వయో విభాగం 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ విభాగంలో తెలంగాణ స్విమ్మర్‌ లిఖిత మెరుపుల 2 నిమిషాల 48.63 సెకన్లలో పోటీని ముగించి రజత పతకం గెలుచుకుంది. కర్ణాటక స్విమ్మర్లు వైష్ణవి (2 నిమిషాల 45.81 సెకన్లు), బీఎస్‌ జన్య (2 నిమిషాల 52.12 సెకన్లు) వరుసగా స్వర్ణ, కాంస్యాలు నెగ్గారు. » బాలుర అండర్‌ 15–17 వయో విభాగం 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కర్ణాటకకు చెందిన రేణుకాచార్య హోడ్మణి విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతడు 9 నిమిషాల 4.66 సెకన్లలో లక్ష్యాన్ని చేని బంగారు పతకం కైవసం చేసుకోగా ... అక్షజ్‌ పరిగి (9 నిమిషాల 19.57 సెకన్లు; కర్ణాటక), నల్లూరి సాయి స్మరణ్‌ (9 నిమిషాల 54.27 సెకన్లు; తమిళనాడు) వరుసగా రజత, కాంస్యాలు నెగ్గారు.

Indian womens team won the fourth T20 match as well10
అదే జోరు... అదే ఫలితం

తిరువనంతపురం: బౌలింగ్‌ ప్రతాపం... ‘హ్యాట్రిక్‌’ విజయాలతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు... తాజాగా బ్యాటింగ్‌ విధ్వంసంతో ఆధిక్యాన్ని 4–0కు పెంచుకుంది. ఆదివారం జరిగిన నాలుగో టి20లో హర్మన్‌ప్రీత్‌ బృందం 30 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. మొదట భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మృతి మంధాన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, 1 సిక్స్‌)లతో పాటు ఆఖర్లో రిచా ఘోష్‌ (16 బంతుల్లో 40 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి పోరాడి ఓడింది. భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెమీమా రోడ్రిగ్స్‌ అస్వస్థత కారణంగా హర్లీన్‌ డియోల్, క్రాంతి గౌడ్‌ స్థానంలో అరుంధతి రెడ్డి తుది జట్టుకు ఆడారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి పోరు జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం ఈ సిరీస్‌లో ఆశించిన దూకుడు కనబర్చలేకపోయిన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో తన శైలీ ఆటతీరుతో అలరించింది. ఓ వైపు షఫాలీ, మరోవైపు మంధాన లంక బౌలర్ల భరతం పట్టారు. దీంతో పవర్‌ప్లేలో 61/0 స్కోరు చేసింది. దూకుడు అంతకంతకూ పెరగడంతో 10.5 ఓవర్లలోనే భారత్‌ స్కోరు 100కు చేరింది. షఫాలీ 30 బంతుల్లో, మంధాన 35 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి ధనాధన్‌ కొనసాగడంతో 14.2 ఓవర్లలోనే భారత్‌ 150 మార్క్‌ దాటింది. ఈ క్రమంలో 2019లో వెస్టిండీస్‌పై చేసిన 143 పరుగుల భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. తర్వాత 162 స్కోరు వద్ద షఫాలీ, 6 పరుగుల వ్యవధిలో స్మృతి అవుటయ్యారు. తర్వాత వచ్చిన రిచా ఘోష్‌ భారీ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడింది. రిచా, హర్మన్‌ప్రీత్‌ (16 నాటౌట్‌) అబేధ్యమైన మూడో వికెట్‌కు 23 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. రిచా మెరుపుల వల్లే భారత్‌ టి20 ఫార్మాట్‌లో తమ అత్యధిక స్కోరు (221/2) నమోదు చేసింది. ఈసారి పోరాడి... గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే లంక బ్యాటింగ్‌ తీరు పూర్తిగా మారింది. పెద్ద లక్ష్యం ముందు మోకరిల్లుతుందనుకుంటే ఆఖరి దాకా పోరాడి ఓడింది. కెపె్టన్‌ చమరి ఆటపట్టు (37 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హాసిని (33; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. తర్వాత ఇమిషా దులాని (29; 3 ఫోర్లు), హర్షిత (20; 1 ఫోర్, 1 సిక్స్‌), నీలాక్షిక (11 బంతుల్లో 23 నాటౌట్‌; 4 ఫోర్లు) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో లంక ఓటమి అంతరాన్ని తగ్గించింది. స్కోరు వివరాలు భారత ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (సి) దులానీ (బి) శెహని 80; షఫాలీ (సి అండ్‌ బి) నిమషా 79; రిచా ఘోష్‌ (నాటౌట్‌) 40; హర్మన్‌ప్రీత్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–162, 2–168. బౌలింగ్‌: మల్షా శెహని 4–0–32–1, కావ్య 4–0–43–0, కవిషా 4–0–47–0, రష్మిక 2–0–25–0, చమరి 2–0–30–0, నిమష 4–0–40–1. శ్రీలంక ఇన్నింగ్స్‌: హాసిని (సి) హర్మన్‌ (బి) అరుంధతి 33; చమరి (సి) స్మృతి (బి) వైష్ణవి 52; ఇమిషా (రనౌట్‌) 29; హర్షిత (స్టంప్డ్‌) రిచా (బి) వైష్ణవి 20; కవిషా (సి) సబ్‌–కమలిని (బి) అరుంధతి 13; నీలాక్షిక (నాటౌట్‌) 23; రష్మిక (బి) శ్రీచరణి 5; కౌశిని (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–59, 2–116, 3–140, 4–147, 5–170, 6–185. బౌలింగ్‌: రేణుక 3–0–32–0, అరుంధతి 4–0–42–2, దీప్తి 4–0–31–0, వైష్ణవి 4–0–24–2, అమన్‌జోత్‌ 1–0–10–0, శ్రీచరణి 4–0–46–1. 1 శ్రీలంక తరఫున 150 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా చమరి ఆటపట్టు నిలిచింది. నీలాక్షిక సిల్వా (107), ఉదేíÙక ప్రబోధిని (106) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా మహిళల క్రికెట్‌లో 150 టి20లు ఎనిమిదో ప్లేయర్‌గా చమరి గుర్తింపు పొందింది.80 మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. 78 సిక్స్‌లతో హర్మన్‌ప్రీత్‌ పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది.1703 ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో స్మృతి చేసిన పరుగులు. ఒకే ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును స్మృతి (2024లో 1659 పరుగులు) బద్దలు కొట్టింది.4 తొలి వికెట్‌కు స్మృతి, షఫాలీ 100 కంటే ఎక్కువ పరుగులు జత చేయడం ఇది నాలుగోసారి.221 టి20ల్లో భారత జట్టు తమ అత్యధిక స్కోరు సాధించింది. గత ఏడాది వెస్టిండీస్‌పై సాధించిన 217/4 స్కోరును భారత్‌ అధిగమించింది. టి20ల్లో భారత్‌ 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది నాలుగోసారి.162 ఓపెనర్లు స్మృతి, షఫాలీ తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. టి20ల్లో ఏ వికెట్‌కైనా భారత్‌కిదే అతిపెద్ద భాగస్వామ్యం.4 మహిళా క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో బ్యాటర్‌ స్మృతి. ఈమె కంటే ముందు మిథాలీ, సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌), చార్లోటి ఎడ్వర్డ్స్‌ (ఇంగ్లండ్‌) ఈ ఘనత సాధించారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement