Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND vs SA 5th T20I Team India Win By 30 Rus Over South Africa1
విజయంతో ముగింపు

టెస్టు సిరీస్‌లో 0–2తో ఓటమి, వన్డేల్లో 2–1తో గెలుపు, ఇప్పుడు టి20ల్లో 3–1తో ఘన విజయం...సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో భారత జట్టు ప్రదర్శన ఇది. చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్‌లలో జరిగిన సిరీస్‌లలో టీమిండియా పైచేయి సాధించింది. టెస్టు సిరీస్‌ ఫలితం బాధపెట్టేదే అయినా ఓవరాల్‌గా 5–4తో మన జట్టు పైచేయి సాధించింది. సిరీస్‌ ఓడిపోయే ప్రమాదం లేని స్థితిలో చివరి టి20లో బరిలోకి దిగిన భారత్‌ భారీ స్కోరుతో ప్రత్యరి్థకి చెక్‌ పెట్టింది. పాండ్యా అద్భుత బ్యాటింగ్, తిలక్‌ మెరుపులు ఇందులో కీలక పాత్ర పోషించాయి. డికాక్‌ జోరుతో సఫారీలు ఛేదన వైపు సాగినట్లు అనిపించినా అది కొన్ని ఓవర్లకే పరిమితమైంది. చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయి ఒత్తిడిలో జట్టు చిత్తయింది. టి20ల్లో భారత్‌కు ఇది వరుసగా 8వ సిరీస్‌ విజయం కావడం విశేషం. అహ్మదాబాద్‌: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌ను భారత్‌ 3–1తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌లో భారత్‌ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 63; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (42 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకే పరిమితమైంది. క్వింటన్‌ డికాక్‌ (35 బంతుల్లో 65; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, వరుణ్‌ చక్రవర్తికి 4 వికెట్లు దక్కాయి. రాణించిన సామ్సన్‌... భారత్‌కు సంజు సామ్సన్‌ (22 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. అభిషేక్‌ తనదైన శైలిలో దూకుడుగా మొదలు పెట్టగా, గిల్‌ గైర్హాజరులో దక్కిన అవకాశాన్ని సామ్సన్‌ సమర్థంగా వాడుకున్నాడు. యాన్సెన్‌ ఓవర్లో తొలి మూడు బంతులను అభిషేక్‌ ఫోర్లుగా మలచగా, చివరి బంతికి సామ్సన్‌ సిక్స్‌ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బార్ట్‌మన్‌ ఓవర్లో సామ్సన్‌ మూడు ఫోర్లు కొట్టాడు. అభిషేక్‌ వికెట్‌ కోల్పోయి పవర్‌ప్లే ముగిసే సరికి భారత్‌ 67 పరుగులు చేసింది. తొలి బంతికే ఫోర్‌తో మొదలు పెట్టిన తిలక్‌ కూడా తన ధాటిని ప్రదర్శించడంతో స్కోరు దూసుకుపోయింది. సామ్సన్‌ వెనుదిరిగాక మరో సారి సూర్యకుమార్‌ (5) వైఫల్యం కొనసాగింది. ఈ దశలో జత కలిసిన తిలక్, హార్దిక్‌ ద్వయం దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడింది. చూడచక్కటి ఫోర్లు కొట్టిన తిలక్‌ 30 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 44 బంతుల్లోనే 105 పరుగులు జోడించి స్కోరును 200 దాటించారు. చివర్లో దూబే (10 నాటౌట్‌) కూడా సిక్స్, ఫోర్‌తో తాను ఓ చేయి వేశాడు. డికాక్‌ అర్ధ సెంచరీ... భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు డికాక్‌ మెరుపు ఆరంభాన్ని ఇస్తూ అద్భుత షాట్లతో చెలరేగిపోయాడు. అర్ష్ దీప్‌ తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను...అతని తర్వాతి ఓవర్లో మరో మూడు ఫోర్లు, సిక్స్‌ బాదడం విశేషం. పవర్‌ప్లే సఫారీ టీమ్‌ కూడా సరిగ్గా 67 పరుగులే సాధించింది. హెన్‌డ్రిక్స్‌ (13) వెనుదిరిగాక 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్‌కు మరో ఎండ్‌లో బ్రెవిస్‌ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. పాండ్యా బౌలింగ్‌లో బ్రెవిస్‌ వరుసగా 4, 6, 4 కొట్టడం విశేషం. 10.1 ఓవర్లలో 120/1తో దక్షిణాఫ్రికా పటిష్టంగా కనిపించింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా కథ మారిపోయింది. డికాక్, బ్రెవిస్‌ రెండు పరుగుల వ్యవధిలో వెనుదిరిగాక ఇన్నింగ్స్‌ కుప్పకూలింది. మిగతా బ్యాటర్లలో ఎవరూ నిలవలేకపోయారు.ఆ 16 బంతులు... తొలి బంతికే సూపర్‌ సిక్స్‌...మెరుపు వేగంతో దూసుకొచి్చన బంతి భుజానికి తగలడంతో కెమెరామన్‌ అల్లాడిపోయాడు. టీమ్‌ ఫిజియో వెళ్లి చికిత్స చేయాల్సి వచి్చంది. అలా మొదలైన హార్దిక్‌ పాండ్యా ఇన్నింగ్స్‌ అంతే విధ్వంసకరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తర్వాతి రెండు బంతుల్లో సింగిల్, ఫోర్‌ కొట్టిన పాండ్యా... లిండే వేసిన 14వ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాదాడు. ఇంత పెద్ద మైదానంలో అతను కొట్టిన భారీ సిక్స్‌లు బౌండరీకి దగ్గర్లో కాకుండా ఎక్కడో గ్యాలరీల్లో పడ్డాయంటే ఆ వాడి ఎలాంటిదో అర్థమవుతుంది. తర్వాతి ఐదు బంతులు కాస్త జాగ్రత్తగా ఆడుతూ 7 పరుగులే రాబట్టినా...బాష్‌ ఓవర్లో మళ్లీ జోరు కనిపించింది. ఈ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను అదే ఓవర్లో డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ బాదడంతో 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తయింది. స్కోరు వివరాలుభారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (బి) లిండే 37; అభిషేక్‌ (సి) డికాక్‌ (బి) బాష్‌ 34; తిలక్‌ (రనౌట్‌) 73; సూర్యకుమార్‌ (సి) మిల్లర్‌ (బి) బాష్‌ 5; పాండ్యా (సి) హెన్‌డ్రిక్స్‌ (బి) బార్ట్‌మన్‌ 63; దూబే (నాటౌట్‌) 10; జితేశ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–63, 2–97, 3–115, 4–220, 5–227. బౌలింగ్‌: ఎన్‌గిడి 4–0–29–0, యాన్సెన్‌ 4–0–50–0, బార్ట్‌మన్‌ 3–0–39–1, బాష్‌ 3–0–44–2, ఫెరీరా 2–0–20–0, లిండే 4–0–46–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) అండ్‌ (బి) బుమ్రా 65; హెన్‌డ్రిక్స్‌ (సి) దూబే (బి) వరుణ్‌ 13; బ్రెవిస్‌ (సి) సుందర్‌ (బి) పాండ్యా 31; మిల్లర్‌ (సి) సామ్సన్‌ (బి) అర్ష్ దీప్‌ 18; మార్క్‌రమ్‌ (ఎల్బీ) (బి) వరుణ్‌ 6; ఫెరీరా (బి) వరుణ్‌ 0; లిండే (బి) వరుణ్‌ 16; యాన్సెన్‌ (సి) సామ్సన్‌ (బి) బుమ్రా 14; బాష్‌ (నాటౌట్‌) 17; ఎన్‌గిడి (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–69, 2–120, 3–122, 4–135, 5–135, 6–154, 7–163, 8–177. బౌలింగ్‌: అర్ష్ దీప్‌ 4–0–47–1, సుందర్‌ 4–0–30–0, బుమ్రా 4–0–17–2, వరుణ్‌ 4–0–53–4, పాండ్యా 3–0–41–1, 1–0–13–0.2: భారత్‌ తరఫున టి20ల్లో పాండ్యా రెండో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (16 బంతుల్లో) సాధించాడు. యువరాజ్‌ సింగ్‌ (12 బంతుల్లో) పేరిట టాప్‌ రికార్డు ఉంది.

Virat Kohli named in Delhi VHT 2025 squad Pant to captain2
విరాట్‌ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌

దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2025కి ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. అదే విధంగా భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌.. ఈ టోర్నీలో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.ఇక మరో టీమిండియా స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా వీలు చిక్కినపుడు మ్యాచ్‌లకు వస్తాడని తెలిపిన డీడీసీఏ.. భారత మాజీ స్టార్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ, నవదీప్‌సైనీ కూడా ఈసారి జట్టులో భాగం కానున్నారని తెలిపింది. కాగా పంత్‌ డిప్యూటీగా ఆయుశ్‌ బదోని వ్యవహరించనుండగా.. తేజస్వి సింగ్‌ వికెట్‌ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.2010లో చివరిసారిగాకాగా 2010లో చివరిసారిగా విరాట్‌ కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడాడు. వన్డే క్రికెట్‌లో రారాజుగా వెలుగొందుతూ అత్యధిక సెంచరీల (53) వీరుడిగా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దేశీ క్రికెట్‌ బరిలో దిగనున్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు కనీసం రెండు దేశీ మ్యాచ్‌లు అయినా ఆడాలన్న బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ముంబై తరఫున ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండటం లేదని ఎంసీఏ చీఫ్‌ సెలక్టర్‌ సంజయ్‌ పాటిల్‌ తాజాగా వెల్లడించాడు.విజయ్‌ హజారే ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్‌), ఆయుష్ బదోని (వైస్‌ కెప్టెన్‌), అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, హర్షిత్ రాణా, నితీష్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ, హృతిక్ షోకీన్, తేజస్వి సింగ్ (వికెట్‌ కీపర్‌), హర్ష్ త్యాగి, సిమర్‌జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌, ఆయుశ్‌ దొసేజా, దివిజ్‌ మెహ్రా, వైభవ్‌ కంద్పాల్‌, రోహన్‌ రాణా, అనూజ్‌ రావత్‌. చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

IND vs SA 5th T20I: Hardik Pandya Fastest 50 History Tilak 73 Ind Score3
హార్దిక్‌ పాండ్యా ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. తిలక్‌ విధ్వంసం

సౌతాఫ్రికాతో ఐదో టీ20లో టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా అదరగొట్టాడు. అహ్మదాబాద్‌ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం పదహారు బంతుల్లోనే హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీతద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన రెండో ఆటగాడిగా హార్దిక్‌ పాండ్యా నిలిచాడు. ఈ క్రమంలో అభిషేక్‌ శర్మను అధిగమించి.. యువరాజ్‌ సింగ్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 2-1తో ఆధిక్యంలో ఉంది టీమిండియా.తిలక్‌ వర్మ విధ్వంసంఇక శుక్రవారం అహ్మదాబాద్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-1తో గెలుచుకోవాలనే సంకల్పంతో బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్‌ (22 బంతుల్లో 37), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 34) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో దుమ్ములేపాడు..@TilakV9 is not holding back! Brings up a quick-fire half century! 💪#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/P4cz4TX7lc— Star Sports (@StarSportsIndia) December 19, 2025నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) మరోసారి తీవ్రంగా నిరాశపరచగా.. అతడు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి, స్టాండ్స్‌లోకి తరలించి అభిమానులను ఉర్రూతలూగించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 16 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు దాటేశాడు. అనూహ్య రీతిలోమొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 63 పరుగులు సాధించాడు. అయితే, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ బౌలంగ్‌లో షాట్‌ ఆడే క్రమంలో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. Watch out! The ball is being powered across the ground today. ⚡️@hardikpandya7 starts his innings with a maximum! 🙌#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/NjCNUJh71c— Star Sports (@StarSportsIndia) December 19, 2025ఇక తిలక్‌ వర్మ (42 బంతుల్లో 73) అనూహ్య రీతిలో పందొమ్మిదో ఓవర్‌ ఐదో బంతికి రనౌట్‌ కాగా.. శివం దూబే మూడు బంతుల్లో పది పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్‌ 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ రెండు వికెట్లు తీయగా.. జార్జ్‌ లిండే, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ టీ20 ఫిఫ్టీలు నమోదు చేసింది వీరే🏏యువరాజ్‌ సింగ్‌- 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ మీద 12 బంతుల్లో ఫిఫ్టీ🏏హార్దిక్‌ పాండ్యా- 2025లో సౌతాఫ్రికా మీద 16 బంతుల్లో ఫిఫ్టీ🏏అభిషేక్‌ శర్మ- 2025లో ఇంగ్లండ్‌ మీద 17 బంతుల్లో ఫిఫ్టీ🏏కేఎల్‌ రాహుల్‌- 2021లో స్కాట్లాండ్‌ మీద 18 బంతుల్లో ఫిఫ్టీ🏏సూర్యకు​మార్‌ యాదవ్‌- 2022లో సౌతాఫ్రికా మీద 18 బంతుల్లో ఫిఫ్టీ.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

IND vs SA Abhishek Fails To Break Kohli Calendar year runs record4
కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డు జస్ట్‌ మిస్‌!

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టీ20 క్యాలెండర్‌ ఇయర్‌లో పదహారు వందల మార్కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి ఈ ఘనత సాధించాడు.కాగా ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ తరఫున అదరగొట్టిన అభిషేక్‌ శర్మ 14 మ్యాచ్‌లలో కలిపి 439 పరుగులు సాధించాడు. అదే విధంగా.. దేశీ టీ20 టోర్నీలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 304 పరుగులు సాధించాడు.ఇక టీమిండియా తరఫున ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోనూ అభిషేక్‌ శర్మ దుమ్ములేపాడు. 21 మ్యాచ్‌లలో కలిపి 859 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 2025లో టీ20లలో 1602 పరుగులు పూర్తి చేసుకున్న అభిషేక్‌ శర్మ.. కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసేందుకు కేవలం పన్నెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.2016లో విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌, టీమిండియా తరఫున కలిపి 1614 పరుగులు చేయగా.. అభిషేక్‌ ఈ ఏడాది 1602 పరుగులతో ముగించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ (2022లో 1503, 2023లో 1338 పరుగులు), యశస్వి జైస్వాల్‌ (2023లో 1297 పరుగులు) ఉన్నారు.కాగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం ఐదో టీ20లో టాస్‌ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆదిలో ఆచితూచి ఆడిన అభిషేక్‌ శర్మ.. ఆ తర్వాత గేరు మార్చాడు. అయితే, ఆరో ఓవర్‌ నాలుగో బంతికి కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ అవుటయ్యాడు. వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 34 పరుగులు సాధించి నిష్క్రమించాడు.

U19 Asia Cup 2025 Semi Final: India Beat Sri Lanka Enters Final5
Asia Cup 2025: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో భారత్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈ ఖండాంతర టోర్నీలో ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని భారత జట్టు గ్రూప్‌-ఎలో భాగంగా యూఏఈ, పాకిస్తాన్‌, మలేసియా జట్లను ఓడించి అజేయంగా సెమీస్‌కు చేరింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి సెమీ ఫైనల్లో శ్రీలంకతో తలపడింది.దుబాయ్‌లో వాన పడిన కారణంగా టాస్‌ ఆలస్యమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించినా.. అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా ఉన్న కారణంగా ఈ యూత్‌ వన్డేను 20 ఓవర్లకు కుదించారు. ఇక టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది.లంక ఓపెనర్లు విరాన్‌ చముదిత (19), దుల్‌నిత్‌ సిగెరా (1) విఫలం కాగా... వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ విమత్‌ దిన్సారా (32) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో చమిక హీనతిగల 42 పరుగులతో లంక తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. లోయర్‌ ఆర్డర్‌లో సెత్మిక సెనెవిరత్నె 30 పరుగులతో రాణించాడు. మిగిలిన వారిలో కవిజ గమాగే (2), కిత్మా వితనపతిరన (7), ఆధమ్‌ హిల్మీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం అయ్యారు.భారత బౌలర్లలో హెనిల్‌ పటేల్‌, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. దీపేశ్‌ దేవేంద్రన్‌, కిషన్‌ కుమార్‌, ఖిలన్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు.. ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లలో కెప్టెన్‌ ఆయుశ్‌ శర్మ (7), వైభవ్‌ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. రసిత్‌ నిమ్సారా వీరిద్దరిని పెవిలియన్‌కు పంపాడు.అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌, విహాన్‌ మల్హోత్రాతో కలిసి ధనాధన్‌ దంచికొట్టాడు. ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు బాదారు. ఆరోన్‌ 49 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 58 పరుగులతో.. విహాన్‌ 45 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 61 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా భారత్‌ 18 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 139 పరుగులు చేసింది. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆరోన్‌, విహాన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు పంచుకున్నారు.అండర్‌-19 ఆసియా కప్‌-2025 సెమీ ఫైనల్‌-1 స్కోర్లు👉టాస్‌: భారత్‌.. తొలుత బౌలింగ్‌👉వాన వల్ల ఆలస్యంగా పడిన టాస్‌.. వెట్‌ఫీల్డ్‌ కారణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌👉శ్రీలంక స్కోరు: 138/8 (20)👉భారత్‌: 139/2 (18)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్‌

IND vs SA 5th T20I Ahmedabad: Toss Update Playing XIs Highlights6
IND vs SA: దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు

దక్షిణాఫ్రికాపై 30 పరుగుల తేడాతో భారత్ గెలుపు. స్కోర్లు: భారత్ 231/5(20), దక్షిణాఫ్రికా 201/8(20)దక్షిణాఫ్రికాకు 12 బంతుల్లో 47 పరుగులు అవసరం. విజయానికి చేరువగా భారత్‌.180 పరుగులకు 8 వికెట్లను కోల్పోయి దక్షిణాఫ్రికా ఓటమికి దగ్గర్లో ఉంది.వరుసగా మరో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా. 177 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా 8వ వికెట్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికాకు 19 బంతుల్లో 55 పరుగులు అవసరం.దక్షిణాఫ్రికా ఏడోవ వికెట్‌ కోల్పోయింది. 15.2 ఓవర్లకు 163 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మరో వికెట్‌ కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. 15 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాకు 33 బంతుల్లో 78 పరుగులు అవసరం.దక్షిణాఫ్రికా విజయానికి 38 బంతుల్లో 85 పరుగులు అవసరం.టీమిండియాతో ఐదో టీ20లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఆతిథ్య భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్‌ 231 పరుగులు చేసింది. భారత్‌ విధించిన 232 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. హైలైట్స్‌👉10 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 118-1విజయానికి 60 బంతుల్లో 114 కావాలి. బ్రెవిస్‌ 14 బంతుల్లో 29, డికాక్‌ 34 బంతుల్లో 65 పరుగులతో ఉన్నారు.👉6.3 తొలి వికెట్‌ డౌన్‌: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో హెండ్రిక్స్‌ (13) అవుట్‌. స్కోరు: 70-1(7). డెవాల్డ్‌ బ్రెవిస్‌ క్రీజులోకి వచ్చాడు.👉ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 60-0హెండ్రిక్స్‌ 10, డికాక్‌ 42 పరుగులతో ఉన్నారు.భారత్‌ భారీ స్కోరు: 231-5(20)ఓపెనర్లు సంజూ శాంసన్‌ (37), అభిషేక్‌ శర్మ (34) రాణించగా.. తిలక్‌ వర్మ (42 బంతుల్లో 73), హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకాలతో మెరిశారు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) మరోసారి విఫలం అయ్యాడు.ఆఖర్లో శివం దూబే 3 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ రెండు వికెట్లు తీయగా.. జార్జ్‌ లిండే, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ చెరొక వికెట్‌ పడగొట్టారు. ప్రొటిస్‌ జట్టు లక్ష్యం 232 పరుగులు.భారత్‌ బ్యాటింగ్‌.. హైలైట్స్‌👉19.3 నాలుగో వికెట్‌ డౌన్‌: బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)19.3 నాలుగో వికెట్‌ డౌన్‌: బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)👉16 బంతుల్లో హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకంబాష్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది 50 పరుగులు పూర్తి చేసుకున్న హార్దిక్‌👉15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 170-3తిలక్‌ 57, హార్దిక్‌ 8 బంతుల్లో 32 పరుగులతో ఉన్నారు.👉14.4 తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీ: ఎంగిడి బౌలింగ్‌లో ఫోర్‌ బాది.. ఆరో టీ20 హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన తిలక్‌ వర్మ (30 బంతుల్లో).👉12.1 మూడో వికెట్‌ డౌన్‌: బాష్‌ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్య (5) అవుట్‌. క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా. స్కోరు: 115-3(12.1)👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 101-2తిలక్‌ 24, సూర్య 2 పరుగులతో ఉన్నారు.👉9.1 రెండో వికెట్‌ డౌన్‌: లిండే బౌలింగ్‌లో శాంసన్‌ బౌల్డ్‌ (22 బంతుల్లో 37; 4ఫోర్లు, 2 సిక్సర్లు). రెండో వికెట్‌ డౌన్‌. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌. 👉8.4: సంజూ బాదిన షాట్‌తో అంపైర్‌కు గాయంఫెరీరా బౌలింగ్‌లో స్ట్రెయిట్‌ షాట్‌ ఆడేందుకు సంజూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు ఇచ్చిన క్యాచ్‌ను ఫెరీరా డ్రాప్‌ చేయగా.. అంపైర్‌ రోహన్‌ పండిట్ మోకాలికి తలిగింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోగా.. ఫిజియోలు వచ్చి చెక్‌ చేశారు.👉పవర్‌ ప్లేలో భారత్‌ స్కోరు: 67-1(6)సంజూ 27, తిలక్‌ వర్మ 4 పరుగులతో ఉన్నారు.👉5.4- తొలి వికెట్‌ డౌన్‌: కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 34; ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌) అవుట్‌. తొలి వికెట్‌ డౌన్‌. క్రీజులోకి తిలక్‌ వర్మ. స్కోరు: 63-1(5.4)👉ఐదు ఓవర్లలో భారత్‌ స్కోరు: 56-0👉అభిషేక్‌ శర్మ 17 బంతుల్లో 28, సంజూ శాంసన్‌ 13 బంతుల్లో 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.తుదిజట్లలో మార్పులు ఇవేఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. అన్రిచ్‌ నోర్జే స్థానంలో జార్జ్‌ లిండేను ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చేర్చింది. మరోవైపు.. టీమిండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి రాగా.. హర్షిత్‌ రాణా బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. కుల్దీప్‌ యాదవ్‌, శుబ్‌మన్‌ గిల్‌ గాయాల బెడదతో దూరం కాగా.. వాషింగ్టన్‌ సుందర్‌, సంజూ శాంసన్‌ వారి స్థానాలను భర్తీ చేశారు.కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కటక్‌లో భారత్‌, ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా గెలవగా.. ధర్మశాలలో భారత్‌ మరోసారి జయకేతనం ఎగురవేసింది. లక్నోలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దైపోగా.. అహ్మదాబాద్‌లో గెలిచి 3-1తో సిరీస్‌ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టీమిండియా వర్సెస్‌ సౌతాఫ్రికా ఐదో టీ20 తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్దీప్ సింగ్సౌతాఫ్రికాక్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్‌ (కెప్టెన్‌), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవాన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.

Sri Lanka preliminary T20 WC 2026 squad Asalanka Sacked New Captain7
టీ20 వరల్డ్‌కప్‌-2026 జట్టు ప్రకటన.. కెప్టెన్‌పై వేటు

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2026కు ముందు శ్రీలంక క్రికెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా చరిత్‌ అసలంకను తప్పించింది. మాజీ సారథి దసున్‌ షనకకే మరోసారి టీ20 జట్టు పగ్గాలు అప్పగించింది.అందుకే కెప్టెన్‌ని చేశాంకాగా భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్‌ టోర్నీకి లంక క్రికెట్‌ బోర్డు శుక్రవారం తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఇందులో భాగంగా దసున్‌ షనకకు సారథిగా పెద్ద పీట వేయడంపై చీఫ్‌ సెలక్టర్‌గా తిరిగి వచ్చిన ప్రమోదయ విక్రమసింఘ స్పందించాడు.‘‘షనక ఆల్‌రౌండర్‌ పాత్ర పోషిస్తాడు. నేను సెలక్టర్‌గా దిగిపోయేనాటికి షనకనే కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు చరిత్‌ మా దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఒకడిగా ఉన్నాడు. కెప్టెన్‌ అయిన తర్వాత చరిత్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు.సనత్‌ జయసూర్యతో చర్చించిన తర్వాతేఇటీవల అతడు బ్యాటింగ్‌లో ఫామ్‌ కోల్పోయాడు. త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తున్నాం. హెడ్‌కోచ్‌ సనత్‌ జయసూర్యతో చర్చించిన తర్వాతే ఈ జట్టును ఎంపిక చేశాము. వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీకి ముందు పెద్దగా మార్పులు చేయాలని మేము అనుకోలేదు’’ అని ప్రమోదయ విక్రసింఘ తెలిపాడు.ఇక నిరోషన్‌ డిక్‌విల్లాను తిరిగి జట్టుకు ఎంపిక చేయడంపై స్పందిస్తూ.. ‘‘ఓపెనర్‌గా.. రిజర్వు వికెట్‌ కీపర్‌గా.. మిడిలార్డర్‌ బ్యాటర్‌గా అతడు బహుముఖ పాత్రలు పోషించగలడు’’ అని విక్రమసింఘ తెలిపాడు. కాగా 2021లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో చివరగా డిక్‌విల్లా లంక టీ20 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తిరిగి సారథిగా..కాగా 2021- 24 వరకు శ్రీలంక వన్డే, టీ20 జట్లకు దసున్‌ షనక సారథిగా ఉన్నాడు. అయితే, కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌ టోర్నీలో విఫలం కావడంతో అతడిని తప్పించి.. అసలంకకు బాధ్యతలు ఇచ్చారు. అయితే, అసలంక సారథ్యంలో ముఖ్యంగా టీ20లలో శ్రీలంక చెత్త ప్రదర్శన నమోదు చేసింది. ఆసియా టీ20 కప్‌-2025లోనూ తేలిపోయింది. బ్యాటర్‌గానూ అతడు విఫలమయ్యాడు.ఈ పరిణామాల నేపథ్యంలో అనుభవానికి పెద్ద పీట వేస్తూ.. సెలక్షన్‌ కమిటీ దసున్‌ షనకపైనే మరోసారి నమ్మకం ఉంచింది. కాగా గత ఆసియా కప్‌ (టీ20) టోర్నీలో లంకను అతడు చాంపియన్‌గా నిలిపాడు. కాగా ఇటీవల పాకిస్తాన్‌ పర్యటన సందర్భంగా అసలంక భద్రతా కారణాలు చూపి మధ్యలోనే తప్పుకొన్నాడు. ఈ క్రమంలో షనక తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి శ్రీలంక ప్రకటించిన ప్రాథమిక జట్టుదసున్‌ షనక (కెప్టెన్‌), పాతుమ్‌ నిసాంక, కుశాల్‌ మెండిస్‌, కామిల్‌ మిశారా, కుశాల్‌ పెరీరా, ధనంజయ డి సిల్వ, నిరోషన్‌ డిక్‌విల్లా. జనిత్‌ లియానగే, చరిత్‌ అసలంక, కమిందు మెండిస్‌, పవన్‌ రత్మనాయకే, సహాన్‌ అరాచిగే, వనిందు హసరంగ, దునిత్‌ వెల్లలగే, మిలన్‌ రత్ననాయకే, నువాన్‌ తుషార, ఇషాన్‌ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్‌ మదూషాన్‌, మతీశ పతిరణ, దిల్షాన్‌ మధుషాంక, మహీశ్‌ తీక్షణ, దుషాన్‌ హేమంత, విజయకాంత్‌ వియస్కాంత్‌, త్రవీణ్‌ మాథ్యూ.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

Picked everyone in single digit crores: S Badrinath On DC IPL 2026 Auction8
చవక ధరకే బెస్ట్‌ ప్లేయర్లు.. వేలంలో సూపర్‌ హిట్‌!

ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్‌ సుబ్రమణ్యం బద్రీనాథ్‌ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కువగా ఖర్చు పెట్టకుండానే మెరుగైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నారని కొనియాడాడు.రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతోఅబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో ఢిల్లీ క్యాపిటల్స్‌ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆఖిబ్‌ నబీ కోసం రూ. 8.40 కోట్లు ఖర్చు చేసిన యాజమాన్యం.. అతి తక్కువగా సాహిల్‌ పరాఖ్‌ కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.చవక ధరకే బెస్ట్‌ ప్లేయర్లుఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ ఎస్‌. బద్రీనాథ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈసారి వేలంలో సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌ (కోట్లలో)తోనే వాళ్లు ఆటగాళ్లందరినీ కొనుగోలు చేశారు. ఒక్కరి కోసం అంతకుమించి ఖర్చుపెట్టలేదు. అంటే.. వారు ఈసారి వేలంపాటలో మంచి ప్రదర్శన ఇచ్చారని అర్థం.వేలంలో చవక ధరకే డేవిడ్‌ మిల్లర్‌, బెన్‌ డకెట్‌, ఆఖిబ్‌ నబీ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన తీరు నిజంగా అద్భుతం. దీనిని బట్టే వారు వేలం కోసం ఏ స్థాయిలో సన్నద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పేపర్‌ మీదైతే వాళ్ల జట్టు సమతూకంగా ఉంది.ఇక మైదానంలో దిగిన తర్వాత ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. 13-14 మంది ప్లేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని.. వారికే తరచూ అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాలి. ఈ జట్టుతో ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఢిల్లీ ఈసారి టాప్‌-4లో ఉండటం ఖాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఆఖరి నిమిషంలో ఢిల్లీ తమ మాజీ ఆటగాడు పృథ్వీ షాను రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడం విశేషం.వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు- ధరఆఖిబ్‌ నబీ (రూ.8.40 కోట్లు), పాతుమ్‌ నిసాంక (రూ.4 కోట్లు), కైలీ జేమీసన్‌ (రూ.2 కోట్లు), లుంగీ ఎన్‌గిడి (రూ.2 కోట్లు), బెన్‌ డకెట్‌ (రూ. 2 కోట్లు), డేవిడ్‌ మిల్లర్‌ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్‌ పరాఖ్‌ (రూ.30 లక్షలు)వేలానికి ముందు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లుఅక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌, దుష్మంత చమీర, నితీశ్‌ రాణా (రాజస్తాన్‌ నుంచి ట్రేడింగ్‌), కరుణ్‌ నాయర్‌, సమీర్‌ రిజ్వి, కేఎల్‌ రాహుల్‌, టి.నటరాజన్‌, అభిషేక్‌ పోరెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, త్రిపురాణ విజయ్‌, అజయ్‌ మండల్‌, మాధవ్‌ తివారి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అశుతోశ్‌ శర్మ, మిచెల్‌ స్టార్క్‌, విప్రజ్‌ నిగమ్‌.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

Venkatesh Iyer Replaces Rajat Patidar as MP Captain for VHT9
‍పాటిదార్‌ అవుట్‌.. కెప్టెన్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌

వెంకటేశ్‌ అయ్యర్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్‌ వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2025 సీజన్‌లో అతడు మధ్యప్రదేశ్‌ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా 2015లో మధ్యప్రదేశ్‌ తరఫున దేశీ క్రికెట్లో అడుగుపెట్టిన వెంకీ.. ఇప్పటికి ఫస్‌క్లాస్‌ క్రికెట్‌లో 20, లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 48, టీ20లలో యాభైకి పైగా మ్యాచ్‌లు ఆడాడు.పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ పరుగులు రాబట్టడంతో పాటు ఆయా ఫార్మాట్లలో వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer).. ఇప్పటి దాకా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)తో కొనసాగాడు. 2024లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. ఈ నేపథ్యంలో ఈ ఆల్‌రౌండర్‌ను 2025 వేలానికి ముందు రిలీజ్‌ చేసిన కేకేఆర్‌.. ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది.రూ. 7 కోట్లకు ఆర్సీబీ సొంతంఅయితే, తాజా ఎడిషన్‌లో వెంకటేశ్‌ బ్యాట్‌, బంతితో పూర్తిగా తేలిపోయాడు. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు అతడిని విడిచిపెట్టగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లోనూ వెంకటేశ్‌ అయ్యర్‌ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. అయినప్పటికీ ఆర్సీబీ ఈ మేర భారీ మొత్తమే చెల్లించగా.. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సైతం మరోసారి నమ్మకం ఉంచి ఏకంగా కెప్టెన్‌గా నియమించింది.పాటిదార్‌ అవుట్‌.. కెప్టెన్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌అయితే, ఆర్సీబీకి తొలి ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన సారథి, మధ్యప్రదేశ్‌కు గతేడాది విజయ్‌ హజారే ట్రోఫీ అందించిన రజత్‌ పాటిదార్‌ ఈ జట్టులో లేడు. కెప్టెన్‌గా అతడి స్థానాన్ని వెంకటేశ్‌ అయ్యర్‌ భర్తీ చేశాడు. ఇక ఈ ఇద్దరు ఆర్సీబీ బాయ్స్‌తో పాటు జట్టులో కొత్తగా చేరిన మరో మధ్యప్రదేశ్‌ ఆటగాడు మంగేశ్‌ యాదవ్‌ కూడా దేశీ వన్డే టోర్నీ ఆడబోతున్నాడు. కాగా పాటిదార్‌ గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలో కోలుకున్న అతడు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కూడా పొందాడు. అయినప్పటికీ మధ్యప్రదేశ్‌ జట్టుకు దూరమయ్యాడు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా డిసెంబరు 14- జనవరి 8 మధ్య విజయ్‌ హజారే ట్రోఫీ లీగ్‌ దశ నిర్వహించనున్నారు.విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26కు మధ్యప్రదేశ్‌ జట్టువెంకటేశ్‌ అయ్యర్ (కెప్టెన్), హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి (వికెట్‌ కీపర్‌), యశ్ దూబే, శుభమ్ శర్మ, హర్‌ప్రీత్ సింగ్, రిషబ్ చౌహాన్, రితిక్ తడా, కుమార్ కార్తికేయ, సారాంశ్ జైన్, శివంగ్ కుమార్, ఆర్యన్ పాండే, రాహుల్ బాథమ్, త్రిపురేష్ సింగ్, మంగేశ్‌ యాదవ్, మాధవ్‌ తివారి (ఫిట్‌నెస్‌ ఆధారంగా).చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'

No Rohit Sharma, Jaiswal in Mumbai Vijay Hazare Trophy 2025 Squad10
ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఊహించని షాకిచ్చాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2025 సీజన్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ సంజయ్‌ పాటిల్‌ స్వయంగా వెల్లడించాడు.కాగా ప్రస్తుత టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్‌ విజయ్‌ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు ఆడాలని.. లేదంటే తమ దేశవాళీ జట్ల తరఫున కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడాలని ఆదేశించింది.ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాల్సిందేడిసెంబరు 24 నుంచి ఈ దేశీ వన్డే టోర్నీ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma) సహా ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాలని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నుంచి అన్‌ఫిట్‌ అన్న సర్టిఫికెట్‌ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రాబబుల్స్‌ జట్టులో కోహ్లి పేరు కనిపించింది. మరోవైపు.. తాజాగా ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) మాత్రం టీమిండియా సీనియర్లలో చాలా మంది విజయ్‌ హజారే ట్రోఫీకి అందుబాటులో లేరని తెలిపింది. ముఖ్యంగా భారత జట్టు దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ప్రశ్న ఎదురుకాగా ఎంసీఏ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ సంజయ్‌ పాటిల్‌ మాట దాటవేశాడు.అందుబాటులో లేరుటైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై జట్టుకు చెందిన టీమిండియా ఆటగాళ్లలో ప్రస్తుతానికి ఎవరూ మాకు అందుబాటులో లేరు. అలాంటపుడు వారిని జట్టులో చేర్చడం సరికాదు కదా!.. వారికి బదులు యువ ఆటగాళ్లకు జట్టులో చోటునిస్తాం’’ అని సంజయ్‌ పాటిల్‌ తెలిపాడు.కాగా రోహిత్‌ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా.. మనుపటి కంటే సన్నబడి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, విజయ్‌ హజారే ట్రోఫీకి అతడు ఎందుకు అందుబాటులో లేడన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు శివం దూబే కూడా ముంబై జట్టులో ఉండటం లేదు.వారికే సడలింపుటీ20 ప్రపంచకప్‌-2026 నాటి వీరు పూర్తిస్థాయి ఫిట్‌గా ఉండటం.. గాయాల బారిన పడకుండా ఉండటం అత్యంత ముఖ్యం. అందుకే వీరికి సడలింపు దొరికినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడిన టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అనారోగ్యం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.ఇక గాయం నుంచి కోలుకుంటున్న ముంబై మాజీ సారథి అజింక్య రహానే సైతం ఈ టోర్నీకి దూరం కానుండగా.. శ్రేయస్‌ అయ్యర్‌దీ ఇదే పరిస్థితి అని సమాచారం. ఈ నేపథ్యంలో శార్దూల్‌ ఠాకూర్‌ కెప్టెన్సీలోని ముంబై జట్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌, అతడి తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ తదితరులు చోటు దక్కించుకున్నారు. ఇషాన్‌ ముల్‌చందానికి తొలిసారిగా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా డిసెంబరు 24- జనవరి 8 వరకు విజయ్‌ హజారే ట్రోఫీ గ్రూప్‌ దశ జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement