ప్రధాన వార్తలు
టీ20 ప్రపంచకప్కు మరో రెండు జట్లు
ఈ ఏడాది ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్, ఐర్లాండ్ అర్హత సాధించాయి. నేపాల్లో జరుగుతున్న క్వాలిఫయర్ పోటీల ద్వారా ఈ రెండు జట్లు ప్రపంచకప్ బెర్త్ దక్కించుకున్నాయి. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు కూడా ప్రపంచకప్ అర్హత సాధించాయి.ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్లో అమెరికా పై విజయం సాధించడంతో స్కాట్లాండ్ ప్రపంచకప్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్లో స్కాట్లండ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి అమెరికాను మట్టికరిపించింది.మరోవైపు థాయ్లాండ్పై గెలుపుతో ఐర్లాండ్ ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ తక్కువ స్కోరే చేసిన, దాన్ని విజయవంతంగా కాపాడుకుంది. కాగా, ఈ గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనగా.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ టాప్-4లో నిలిచి ప్రపంచకప్ టికెట్ దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక నేరుగా ప్రపంచకప్ అర్హత సాధించాయి.కాగా, జూన్ 12న బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్తో మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు ఇదే తొలి టైటిల్. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది.
పాకిస్తాన్తో కీలక మ్యాచ్.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.
భారత్తో మ్యాచ్.. పాక్ హెడ్ కోచ్ ఘోర తప్పిదం
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్తాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన ఓ పని వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 25వ ఓవర్ తర్వాత అతను డ్రెస్సింగ్ రూమ్లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించాడు. ఐసీసీ నియమాల ప్రకారం, PMOA (Player and Match Officials Area)లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధం. ఇవి మ్యాచ్ ఫలితాలను ప్రభావితం (ఫిక్సింగ్ లేదా చీటింగ్) చేసే అవకాశం ఉందని ఐసీసీ ఈ నిబంధనను అమలు చేస్తుంది. ఆర్టికల్ 4.1.1 ప్రకారం PMOAలో ఎవరూ మొబైల్ ఫోన్ వాడకూడదు. ఆర్టికల్ 4.1.2 ప్రకారం ల్యాప్టాప్లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు కూడా వాడకూడదు.
టీ20 ప్రపంచకప్ నుంచి తొలగింపు.. బంగ్లాదేశ్ కీలక అడుగు
టీ20 ప్రపంచకప్ నుంచి తొలగించబడిన తర్వాత బంగ్లదేశ్ క్రికెట్ బోర్డు కీలక అడుగు వేసింది. ప్రపంచకప్ గ్యాప్ను కవర్ చేసుకునేందుకు స్వదేశంలో కొత్త టీ20 టోర్నీని ప్రకటించింది. ఈ టోర్నీకి ఓడొమ్మో (ODOMMO) బంగ్లాదేశ్ టీ20 కప్గా నామకరణం చేసింది. మూడు జట్లు (ధూమకేతు XI, దుర్బార్ XI, దురొంటో XI) పోటీ పడే ఈ టోర్నీ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ లాంచ్ విషయాన్ని ఆ దేశ యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహ్బూబ్–ఉల్–ఆలమ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచకప్ ఆడకపోయినా, ఆటగాళ్లకు పరిహారం ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.కాగా, భారత్లో భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్కు వెళ్లేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు వరల్డ్కప్ బెర్త్ దక్కింది.ODOMMO టోర్నీ వివరాలు - జట్లు: ధూమకేతు XI, దుర్బార్ XI, దురొంటో XI - కెప్టెన్లు: లిటన్ దాస్ (ధూమకేతు), నజ్ముల్ హొసైన్ షాంటో (దుర్బార్), అక్బర్ అలీ (దురొంటో) - మ్యాచ్లు: గ్రూప్ స్టేజ్ ఫిబ్రవరి 5, 6, 7; ఫైనల్ ఫిబ్రవరి 9 - ప్రారంభం: ప్రతి మ్యాచ్ రోజు సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం, 6 గంటలకు మ్యాచ్ - ప్రైజ్ మనీ: మొత్తం 2.5 కోట్లు టాకా, ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు కూడా ఇవ్వబడతాయి
భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటున్న వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే
భారత యువ జట్టు కెరటాలు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ సోషల్మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్లో దారుణంగా విఫలమైనందుకు టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. చోకర్స్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. సూర్యవంశీతో పోలిస్తే మాత్రేపై ట్రోలింగ్ ధాటి అధికంగా ఉంది. ప్రతి కీలక మ్యాచ్లో విఫలమవుతాడు, ఇతన్ని ఎలా కెప్టెన్గా కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్లో మాత్రే రెండు బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేకపోగా.. చిన్న జట్లపై చెలరేగిపోయే వైభవ్ సూర్యవంశీ కీలకమైన మ్యాచ్లో సత్తా చాటలేకపోయారు. వైభవ్ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. వాస్తవానికి వైభవ్ చేసిన ఈ స్కోర్ అంత తీసి పాడేయాల్సిందేమీ కాకపోయినప్పటికీ.. కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ కావడం, అందులోనూ ప్రత్యర్ధి పాక్ కావడం వల్ల అభిమానులు ఆగ్రహిస్తున్నారు. రెండు లైఫ్లు లభించిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వైభవ్పై కట్టలు తెంచుకుంది.వీరిద్దరితో పాటు మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (16) కూడా విఫలం కావడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ కష్టాల్లో పడింది. ఈ ముగ్గురు ఒకే స్కోర్ (47 పరుగులు) వద్ద, నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ కావడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. పాక్ పేసర్ మొహమ్మద్ సయ్యమ్ భారత టాపార్డర్ను కూల్చడంలో సఫలీకృతుడయ్యాడు. మరో 62 పరుగుల తర్వాత భారత్ మరో వికెట్ కోల్పోయింది. 109 పరుగుల వద్ద విహాన్ మల్హోత్రా (21) అహ్మద్ హుస్సేన్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 30 ఓవర్ల తర్వాత భారత్ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి ఎదురీదుతుంది. వేదాంత్ త్రివేది (50), అభిగ్యాన్ కుందు (12) భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించే ప్రయత్నం చేస్తున్నారు.కెప్టెన్సీ నుంచి తీసేయండి..!ఇటీవలికాలంలో ఆయుశ్ మాత్రే ప్రదర్శలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచకప్లో అతను ఇప్పటివరకు 99 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 53 పరుగులు న్యూజిలాండ్పై చిన్న లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వచ్చాయి. దీనికి ముందు ఆసియా కప్లోనూ అతని ప్రదర్శనలు దారుణంగా ఉన్నాయి. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్ల్లో 65 పరుగులు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో మాత్రేను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
టీ20 వరల్డ్కప్ టోర్నీకి శ్రీలంక జట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్ 2026 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్రౌండర్ దసున్ షనక సారథ్యం వహించనున్నాడు. లంక వరల్డ్కప్ జట్టులో పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, వానిందు హసరంగ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.అదేవిధంగా యువ పేసర్ ఈషాన్ మలింగకు కూడా జట్టులో చోటు దక్కింది. దుష్మంత చమీర, మతీష పతిరణ, ప్రమోద్ మదుషన్లతో కలిసి మలింగ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో సత్తాచాటిన యువ బ్యాటర్ పవన్ రత్నాయకేకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఇక స్పిన్ విభాగంలో హసరంగ, తీక్షణ, వెల్లలాగే వంటి ఉన్నారు. సొంతగడ్డపై మ్యాచ్లు జరగనుండడంతో ఈ స్పిన్ త్రయం శ్రీలంకకు కీలకం కానుంది.అసలంకపై వేటు..కాగా ఈ మెగా టోర్నీ కోసం లంక సెలెక్టర్లు గత డిసెంబర్లో 25 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చరిత్ అసలంకను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన దాసున్ శనకను తిరిగి కెప్టెన్గా ఎంపిక చేశారు.షనక కెప్టెన్గా గతంలో లంకకు ఆసియాకప్ను అందించారు. ఇప్పుడు మరోసారి తన అనుభవంతో జట్టును నడిపించేందుకు సిద్దమయ్యాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 8న కొలంబో వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. లంకేయులు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతున్నారు.టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్ తీక్షణ
హెట్మైర్, హోప్ మెరుపులు.. విండీస్కు ఓదార్పు విజయం
జోహన్నెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ 6 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి) విజయం సాధించింది. దీంతో క్లీన్ స్వీప్ ప్రమాదం నుంచి పర్యాటక విండీస్ తప్పించుకుంది. వర్షం, మెరుపులు కారణంగా ఈ మ్యాచ్ను 10 ఓవర్లకు కుదించారు.తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెప్ షాయ్ హోప్(25 బంతుల్లో 48), షిమ్రాన్ హెట్మైర్ (22 బంతుల్లో 48 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సఫారీ బౌలర్లలో ఎంగిడీ, మఫాక, కేశవ్ మహారాజ్ తలా వికెట్ సాధించారు.అనంతరం డీఎల్ఎస్ పద్దతి ప్రకారం.. దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 10 ఓవర్లలో 125 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య చేధనలో కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ త్వరగా ఔటైనప్పటికి క్వింటన్ డికాక్ (28) శుభారంభం ఇచ్చాడు. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీలు 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితమయ్యారు. కరేబియన్ బౌలర్లలో గుడికేష్ మోటీ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అయితే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన సౌతాఫ్రికా.. సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
పాక్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్
అండర్-19 ప్రపంచకప్ 2026లో మరో హైవోల్టేజ్ మ్యాచ్కు తెరలేచింది. సూపర్ సిక్స్లో భాగంగా బులవాయో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్కు పాక్ ఆటగాడు మహ్మద్ షయాన్ గాయం కారణంగా దూరమయ్యాడు.అతడి స్దానంలో అలీ హసన్ బలోచ్కు తుది జట్టులో చోటు దక్కింది. మరోవైపు భారత్ కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. ఉదవ్ మోహన్ స్దానంలో దీపేష్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఆసియాకప్ ఫైనల్లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.తుది జట్లుపాకిస్తాన్: సమీర్ మిన్హాస్, హంజా జహూర్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హుజైఫా అహ్సన్, అలీ హసన్ బలోచ్, అబ్దుల్ సుభాన్, మోమిన్ కమర్, మొహమ్మద్ సయామ్, అలీ రజాభారత్ : ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్
వికెట్ కీపర్గా సంజూకు నో ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన సూర్యకుమార్
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు వికెట్ కీపర్ ఎవరు? సంజు శాంసన్కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అన్న ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి. శాంసన్ పేలవ ఫామే ఇందుకు ప్రధాన కారణం. ఈ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఈ సిరీస్ మొత్తంగా అతడు కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తిలక్ వర్మ తుది జట్టులోకి సంజూపై వేటు పడడం ఖాయమన్పిస్తోంది. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. తిలక్ యధావిధిగా మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఇషాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తిరువనంతపురం వేదికగా కివీస్తో జరిగిన ఐదో టీ20లో ఇషాన్ సెంచరీతో మెరిశాడు. అంతకుముందు మ్యాచ్లలో కూడా విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో అతడికి ఓపెనర్గా అవకాశమివ్వాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే ఆఖరి టీ20లో సంజు శాంసన్ జట్టులో ఉన్నప్పటికి ఇషాన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.ఈ క్రమంలో సంజూ వరల్డ్కప్లో ఆడడం ఇక కష్టమేనన్న ఊహాగానాలు మొదలు అయ్యాయి. అయితే ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. వికెట్ కీపింగ్ మార్పుపై తాము ముందే నిర్ణయం తీసుకున్నామని సూర్య చెప్పుకొచ్చాడు."తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లకు ప్లేయింగ్ ఎలెవన్లో అవకాశం దక్కింది. అయితే కీపింగ్ బాధ్యతలను పంచుకోవడం సిరీస్ ప్రారంభానికి ముందే నిర్ణయించాము మొదటి మూడు మ్యాచ్లలో శాంసన్, చివరి రెండు మ్యాచ్లలో కిషన్కు వికెట్ కీపింగ్ చేసే అవకాశమివ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.కానీ కిషన్ చిన్న గాయం కారణంగా నాలుగో టీ20లో ఆడలేదు, లేదంటే ఆ మ్యాచ్లో కూడా అతడే వికెట్ కీపింగ్ చేయాల్సింది ఉండేది. ఇప్పుడు కిషన్ తిరిగి రావడంతో వికెట్ల వెనక తన బాధ్యతలను నిర్వర్తించాడు" అని సూర్య మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: టీమిండియా వరల్డ్ రికార్డు
భారత్కు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు భారత జట్టుకు శుభవార్త. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. గాయం కారణంగా న్యూజిలాండ్తో సిరీస్కు దూరమైన తిలక్... బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. సీఓఈలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలలో అతడు ఉత్తీర్ణీత సాధించాడు.దీంతో తిలక్కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ వైద్య బృందం క్లియరెన్స్ ఇచ్చింది. అతడు మంగళవారం(ఫిబ్రవరి3) ముంబైలో టీమిండియాతో కలవనున్నాడు. భారత్ ఆడబోయే రెండు వార్మప్ మ్యాచ్లలో తిలక్ భాగం కానున్నాడు. ఇక కివీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన సంజు శాంసన్ స్థానంలో టీ20 ప్రపంచకప్లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ప్రారంభించడం ఖాయం కాగా... తిలక్ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 7న నవీ ముంబై వేదికగా యూఎస్ఎతో తలపడనుంది. అంతకుముందు ఫిబ్రవరి 2న అమెరికా, ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో మెన్ ఇన్ బ్లూ వార్మప్ మ్యాచ్లలో ఆడనుంది.టీ20 ప్రపంచకప్ 2026కు భారత జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.
బ్రిజ్భూషణ్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ...
నార్వే చెస్ టోర్నీకి దివ్య
స్టావెంజర్ (నార్వే): ప్రపంచకప్ చాంపియన్, భారత గ్...
మన్ప్రీత్ సింగ్పై వేటు
భారత హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్...
సబలెంకా X రిబాకినా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్...
హెట్మైర్, హోప్ మెరుపులు.. విండీస్కు ఓదార్పు విజయం
జోహన్నెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో ట...
పాక్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్
అండర్-19 ప్రపంచకప్ 2026లో మరో హైవోల్టేజ్ మ్య...
వికెట్ కీపర్గా సంజూకు నో ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన సూర్యకుమార్
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు వికెట్ కీపర్ ఎ...
భారత్కు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు భారత జట్టుకు శుభవార్త...
క్రీడలు
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
వీడియోలు
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
