Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Shreyas Iyer Comments About Winning Title Ahead IPL 20261
అంచనాలు అందుకుంటాం!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా పంజాబ్‌ కింగ్స్‌ బరిలోకి దిగుతోంది. పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ప్రధాన బలం. గతేడాది సీజన్‌లో కెప్టెన్‌ా అయ్యర్‌ పంజాబ్‌ను ఫైనల్‌ చేర్చాడు. కానీ తుది పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓడిపోయి రన్నరప్‌కే పరిమితమయింది. కానీ ఈసారి మాత్రం అభిమానులు తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఐపీఎల్‌ కప్పు కొల్లగొడతామని శ్రేయస్‌ అయ్యర్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 19వ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అయ్యర్‌ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.‘గాయం వల్ల నేను దాదాపు ఏడు కేజీలు బరువు తగ్గాను. దాని నుంచి కోలుకొని రావడం పెద్ద సవాల్‌గా నిలిచింది. నాకైన గాయం చాలా ప్రమాదకరమైనది. అయితే రెండు నెలల తీవ్రంగా కష్టపడిన తర్వాత ఇప్పుడు శరీరాకృతి బాగుంది. కానీ ఫిట్‌గా ఉంటూనే ఏడు కేజీల బరువు పెరగాలంటే చాలా శ్రమించాలి. నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. తప్పకుండా పరిస్థితిని అధిగమిస్తా. ఇలాంటివి ఎన్నోసార్లు అనుభవించా. కమ్‌బ్యాక్‌ చేసి భారత జట్టుకు ఆడిన రోజులు ఉన్నాయి. గతేడాది మేం ఫైనల్‌కు వచ్చాం. రన్నరప్‌గా నిలిచాం.దీంతో ఈసారి మాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడానికి కష్టపడతాం. విజయాలు సాధించి ట్రోఫీని అందుకుంటాం. ప్రతి మ్యాచ్‌కు మూడు రోజుల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మైదానం ఆవల ఉండే బాండింగ్‌తోనే మ్యాచ్‌లో మెరుగ్గా రాణించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్‌ తెలిపాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 31న గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనుంది.చదవండి: అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు

Devine stars with the bat again as New Zealand seal T20I series2
నాలుగో టీ20లో సౌతాఫ్రికా చిత్తు.. సిరీస్ న్యూజిలాండ్ సొంతం

వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మహిళలతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ప్రోటీస్ ఆల్‌రౌండర్ అనేరీ డెర్క్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 32 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసింది. ఆమెతో పాటు లాస్ 30 పరుగులతో రాణించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 3 వికెట్లతో అదరగొట్టింది. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీలియా కేర్ 31 పరుగులతో రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లో ట్రయాన్ 2 వికెట్లు తీసింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 క్రైస్ట్‌చర్చ్ వేదికగా మార్చి 25న జరగనుంది.చదవండి: IPL 2026: '250 స్కోర్ కొట్టినా.. స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోతుంది'

Aakash Chopra on the SunRisers Hyderabads challenges heading into IPL 20263
'250 స్కోర్ కొట్టినా.. స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోతుంది'

ఐపీఎల్‌-2026 సీజన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. గత సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఈసారి మాత్రం ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆరెం‍జ్ ఆర్మీ తమ హోం గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది.అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. వెన్ను గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ సీజన్ మధ్యలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో చేరే అవకాశముంది. దీంతో అప్పటివరకు సన్‌రైజర్స్ జట్టును స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నడిపించనున్నాడు. మరోవైపు గత సీజన్‌లో దుమ్ములేపిన శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొం‍ది.అంతేకాకుండా వేలంలో కొన్న బౌలింగ్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. దీంతో ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను బౌలింగ్ కష్టాలు వెంటాడడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుత ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో హర్షల్ పటేల్‌, జయదేవ్ ఉనద్కట్ తప్ప చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్ అంటూ లేరు.ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు బౌలింగ్ అతి పెద్ద సవాలుగా మారనుందని అతడు అభిప్రాయపడ్డాడు."కమ్మిన్స్‌, మలింగ లేకపోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం చాలా వీక్‌గా కన్పిస్తోంది. కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. బ్రైడన్ కార్స్ జట్టులో ఉన్నప్పటికి ఉపఖండ పిచ్‌లపై అతడికి అనుభవం లేదు. అలా అని కేవలం భారత బౌలర్లతో ఆడడం చాలా ప్రమాదకరం. జట్టులో అమిత్ కుమార్, ప్రఫుల్ హింజ్, సాకిబ్ హుస్సేన్, ఓంకర్ తర్మాలే, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్ హర్ష్ దూబే వంటి యువ బౌలర్లు ఉన్నారు.హర్షల్ పటేల్‌, జయదేవ్ ఉనద్కట్‌కు మాత్రమే ఎక్కువ ఆడిన అనుభవం ఉంది. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఎలా మేనెజ్‌చేస్తోందో ఆర్ధం కావడం లేదు. ఒకవేళ బ్యాటర్లు 250 పరుగులు చేసినా, బౌలర్లు ఆ టోటల్‌ను డిఫెండ్ చేసుకునేలా లేరు" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: వేలంలో అన్‌సోల్డ్‌.. కట్ చేస్తే! ఇప్పుడు కేకేఆర్‌లోకి

IPL 2026: KKR to replace injured Akash Deep with ex-Mumbai Indians pacer4
వేలంలో అన్‌సోల్డ్‌.. కట్ చేస్తే! ఇప్పుడు కేకేఆర్‌లోకి

ఐపీఎల్‌-2026 సీజ‌న్ ఆరంభానికి ముందే కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ను క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే స్టార్ పేస‌ర్ హ‌ర్షిత్ రాణా గాయం కార‌ణంగా టోర్నీ మొత్తానికి దూరం కాగా.. ఇప్పుడు మ‌రో ఫాస్ట్ బౌలర్ ఈ జాబితాలోకి చేరాడు. స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ సైతం గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకొన్నాడు.మరోవైపు శ్రీలంక మతీషా పతిరానకు ఇంకా ఎన్‌వోసీ లభించలేదు. అతడు ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బంగ్లాస్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను కూడా కేకేఆర్ కోల్పోయింది. అతడి స్ధానంలో ఇప్పటికే జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజరాబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది. అయితే ఇప్పుడు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ స్ధానాలను భ‌ర్తీ చేసే ప‌నిలో ప‌డింది.కేకేఆర్‌లోకి సిమర్‌జీత్ హ‌ర్షిత్ రాణా స్ధానంలో ఢిల్లీ పేస‌ర్ సిమర్‌జీత్ సింగ్‌ను తీసుకోవాల‌ని కేకేఆర్ ఆస‌క్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అతడిని ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సిమర్‌జీత్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అంతకుముందు సీఎస్‌కే తరపున మూడు సీజన్ల పాటు ఆడాడు. పవర్‌ప్లేలో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా అద్భుతమైన యార్కర్లు కూడా సంధించగలడు. అయితే గతేడాది జరిగిన వేలంలో మాత్రం అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఇప్పుడు హర్షిత్ రాణా గాయం రూపంలో అతడికి మరోసారి ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కనుంది. ఇక ఆకాష్ దీప్ స్ధానాన్ని ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్వాల్‌కు ఐపీఎల్ అనుభవం ఉంది. ఐపీఎల్‌-2023 ఎలిమినేటర్‌లో 5 వికెట్లు తీసి సత్తాచాటాడు. అయితే మధ్వాల్‌ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే?

India vs Bangladesh series on? BCB makes room for 3 ODIs and T20Is in Sep5
బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే?

భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుప‌డుతున్నాయా? ఈ ఏడాది ఆగస్టులో బంగ్లా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా వెళ్ల‌నుందా? అంటే అవునానే స‌మాధానం వినిపిస్తోంది. వాస్తవానికి గతేడాది జూలైలో బంగ్లాదేశ్ టూర్‌కు భారత్ వెళ్లాల్సి ఉండేది. కానీ అదే సమయంలో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో.. బంగ్లాలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో ఈ వైట్‌బాల్ సిరీస్‌ను 2026 ఆగస్టుకు వాయిదా వేశారు. కానీ ఆ తర్వాత భారత్‌-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు చోటు చేసుకోవడంతో ఈ వైట్‌బాల్ సిరీస్‌లపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ ఐపీఎల్ నుంచి ఆ దేశ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను బీసీసీఐ తప్పించింది.అందుకు నిరసనగా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకొంది. దీంతో పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లా-భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడ ఇక కష్టమే అని అంతా భావించారు. కానీ బంగ్లాదేశ్‌లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. దీంతో భారత్‌-బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్ ప్రకారం జరగనున్నట్లు బంగ్లా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆగస్టులో కాకుండా ఈ సిరీస్‌లో సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది."భారత్ పర్యటను సెప్టెంబర్‌కు ఐర్లాండ్ సిరీస్‌ను మరో విండోలో నిర్వహించాలని కోరాము. కానీ వారి బీజీ షెడ్యూల్ కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే ఐరీష్ పర్యటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని" ఓ బీసీబీ సీనియర్ అధికారి క్రిక్‌బజ్‌తో పేర్కొన్నారు. అయితే భారత క్రికెట్ బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.చదవండి: ఈ సారి 2000-3000 పరుగులు చేస్తా: వైభవ్‌ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi's Funny Response To Reporter Leaves Everyone In Splits6
ఈ సారి 2000-3000 పరుగులు చేస్తా: వైభవ్‌ సూర్యవంశీ

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు మ‌రో ఐదు రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఈ ధ‌న‌ధాన్ క్రికెట్ పండ‌గ మార్చి 28 నుంచి మొద‌లు కానుంది. అయితే ప్రస్తుతం అంద‌రి కళ్లు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. గత సీజన్‌లో ఊహకందని విధంగా విధ్వంసం సృష్టించిన వైభవ్‌.. ఈ ఏడాది ఎలా రాణిస్తాడో అని అందరూ వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు. ఐపీఎల్‌-2025 సీజన్‌తో పాటు అండర్‌-19 క్రికెట్ స్ధాయిలో వైభవ్ దుమ్ములేపాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026ను భారత్ సొంతం చేసుకోవడంలో వైభవ్‌ది కీలక పాత్ర. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో వైభవ్‌ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లోనూ సత్తాచాటేందుకు వైభవ్ సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల వైభవ్ తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్‌కు రిపోర్టర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.ఐపీఎల్ 2026 కోసం మీ ప్లాన్స్ ఏంటి? ఆరెంజ్ క్యాప్ కోసం ఎన్ని పరుగులు చేయాలనుకుంటున్నారు? అని సదరు విలేఖ‌రి ప్రశ్నించాడు.అందుకు వైభ‌వ్ న‌వ్వుతూ.. మీరు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగితే, రెండు నుండి మూడు వేల పరుగులు చేస్తాన‌ని చెబుతా అని బ‌దులిచ్చాడు. దీంతో అక్క‌డ ఉన్నవారంతా ఒక్క‌సారిగా న‌వ్వారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.అయితే ఇదే ప్ర‌శ్న‌కు వైభ‌వ్ త‌ర్వాత సీరియ‌స్‌గా స‌మాధ‌న‌మిచ్చాడు. నేను ఇన్ని పరుగులు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోలేదు. నేను స‌హజ‌శైలిలోనే బ్యాటింగ్ చేస్తాను. నా వ్యక్తిగ‌త మైలురాయిల కంటే జట్టుకు ట్రోఫీ అందించడమే నా ప్రధాన ల‌క్ష్యం" అని అత‌డు చెప్పుకొచ్చాడు.చదవండి: IPL 2026: ఇషాన్ కిష‌న్‌పై యువ ప్లేయ‌ర్ సీరియ‌స్‌..

Ishan Kishan Receives Fiery Send-Off From Teammate During Practice Match 7
ఇషాన్ కిష‌న్‌పై యువ ప్లేయ‌ర్ సీరియ‌స్‌..

ఐపీఎల్‌-2026 సీజ‌న్ కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిద్ద‌మ‌వుతోంది. గ‌త సీజ‌న్‌లో లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈసారి మాత్రం టైటిల్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీంతో ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ క్రికెట్‌ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ క్రమంలో శనివారం ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. అయితే ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు వింత అనుభవం ఎదురైంది. సన్‌రైజర్స్ స్పిన్న‌ర్ జీషన్ అన్సారీ.. కిష‌న్‌పై సీరియ‌స్ అయ్యాడు.అస‌లేమి జ‌రిగిందంటే?మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 8వ ఓవ‌ర్ వేసిన జీష‌న్ అన్సారీ బౌలింగ్‌లో కిష‌న్ తొలి నాలుగు బంతుల‌ను రెండు సిక్స‌ర్లు, రెండు ఫోర్లుగా మ‌లిచాడు. అయితే ఆ త‌ర్వాత ఐదో బంతికి అన్సారీ అద్భుత‌మైన ఫుల్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. కిషన్ డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే జీష‌న్ అన్సారీ మాత్రం కిష‌న్‌కు ఫైరీ సెంఢాప్ ఇచ్చాడు. కిష‌న్ వైపు వేలు చూపిస్తూ ఇక ఆడింది చాలు, పెవిలియ‌న్‌కు వెళ్లిపోమ‌ని సైగ చూశాడు. జీష‌న్ రియాక్ష‌న్ చూసి ప్ర‌తీ ఒక్క‌రూ షాక్ అయిపోయారు. కిష‌న్ మాత్రం న‌వ్వుతూ డ‌గౌట్‌కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ దూరం కావ‌డంతో ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టును కిష‌న్ న‌డిపించ‌నున్నాడు.Send off to Ishan Kishan 🤯During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him.The team atmosphere doesn’t seem to be very good.pic.twitter.com/3b75QtTh3F— Stubbsy  (@spideypant_) March 21, 2026చదవండి: IPL 2026: అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచ‌కోత‌!

Abhishek Sharma and Ishan Kishan sizzle with incredible knocks in SRH practice game before IPL 20268
అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచ‌కోత‌!

ఐపీఎల్‌-2026 సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాళ్లు తమ విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో అన్ని జ‌ట్ల‌ను భ‌య‌పెడుతున్నారు. శనివారం జ‌రిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ స్టార్ బ్యాట‌ర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిష‌న్, హెన్రిచ్ క్లాసెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయారు.స‌న్‌రైజ‌ర్స్ రెండు జ‌ట్ల‌గా విడిపోయి ప్రాక్టీస్ చేసింది. తొలుత స‌న్‌రైజ‌ర్స్‌-ఎ జ‌ట్టు త‌ర‌పున ఆడిన అభిషేక్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. ఉప్ప‌ల్ మైదానంలో బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. కేవ‌లం 42 బంతుల్లోనే 94 పరుగులు సాధించి అన్ని జ‌ట్ల‌కు హెచ్చరిక జారీ చేశాడు.అత‌డి ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. అత‌డితో హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 49), సలిల్ అరోరా (16 బంతుల్లో 47)రాణించారు. ఫ‌లితంగా తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్‌-ఎ జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ మాత్రం కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు. సన్‌రైజర్స్-బి బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. నితీష్ రెడ్డి మూడు వికెట్లు తీసాడు. అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ బి టీమ్ త‌ర‌పున కూడా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈసారి అభిషేక్ శ‌ర్మ‌(4) నిరాశ‌ప‌రిస్తే.. కిషాన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.ఇషాన్ 25 బంతుల్లో 72 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. అయితే 253 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని మాత్రం బి టీమ్ చేరుకోలేక‌పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నాయి.చదవండి: పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్‌🚨 "ABHISHEK SHARMA" STORM IN PRACTICE MATCH SIMULATION 🚨 He Smashed 94Runs off 42 balls with 7 Sixes and 8 Fours 🔥 He nearly Missed well deserved hundred Will IPL 2026 gonna be going hot for Abhishek's career ?? pic.twitter.com/dDaFiYgKQi— Kiara (@crickiara) March 21, 2026

Sunil Gavaskars Sharp Response To Criticism For Attending Pakistani Show9
పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్‌

ఆసియాకప్‌-2025 సందర్భంగా ఓ పాకిస్తానీ టీవీ క్రికెట్ షో అతిథిగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఐసీసీ, ఏసీసీ కామెంటరీ ప్యానెల్‌లో గవాస్కర్ ఉండడంతో ఆ క్రికెట్ షోకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే అప్పటిలో ఈ విషయాన్ని ఎవరూ తప్పు బట్టలేదు.కానీ ఇటీవల ది హాండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌గ్రూప్ యాజమాన్యంకు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడాన్ని గవాస్కర్ విమర్శించాడు. పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడమంటే భారత సైనికులు, పౌరుల మరణానికి దోహదపడటమేనని వ్యాఖ్యానించాడు.ఈ క్రమం‍లో పాకిస్తాన్ టీవీ ఛానల్ డిబేట్‌లో మీరు పాల్గొన్నారని గవాస్కర్‌ను కొంత మంది ప్రశ్నించారు. తాజగా తనపై వచ్చిన విమర్శలపై గవాస్కర్ స్పందించారు. కామెంటరీ ప్యానల్‌లో ఉన్నందున మాత్రమే ఆ క్రికెట్ షోలో పాల్గొనాల్సి వచ్చింది అని లిటిల్ మాస్టర్ అన్నారు."నేను ఐసీసీ, ఏసీసీ వ్యాఖ్య‌త‌ల ప్యానెల్‌లో ఉన్నాను. ఈ టోర్నీలో పాల్గోన్న అన్ని దేశాల‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆదాయం వెళ్తుంది. అంతే త‌ప్ప ఏ భార‌తీయ సంస్థ నుంచి కూడా పాక్‌కు ఆదాయం వెళ్ల‌డం లేదు. అదేవిధంగా నేను కూడా ఆ దేశానికి ఎలాంటి డబ్బులు చెల్లించడం లేదు.కాబ‌ట్టి నేను పాకిస్తాన్‌కు స‌హ‌క‌రిస్తున్నాను అన‌డంలో అర్ధం లేదు. కేవలం భారత్ నుంచి పాకిస్తాన్‌కు నగదు సాయం చేయడం ఆపాలని మాత్రమే కోరుకుంటున్నాను. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి ఒక్క రూపాయి కూడా భారత్‌కు రాలేదు" అని ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నారు. కాగా హాండ్రెడ్ లీగ్ వేలంలో అబ్రార్‌ను రూ. 2.35 కోట్లు భారీ ధ‌ర వెచ్చించి మ‌రి కొనుగోలు చేసింది. చదవండి: ‘ఐసీసీ మా యాజమాని కాదు’

Akash Deep Ruled Out of IPL10
ఐపీఎల్‌కు ఆకాశ్‌దీప్‌ దూరం

కోల్‌కతా: మూడుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో ఇప్పటికే పేస్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా ఈ మెగా టోర్నీకి దూరంకాగా... అతని సరసన మరో ఫాస్ట్‌ బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ కూడా చేరాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆకాశ్‌దీప్‌ కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి 12 వారాలు పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈనెల 28 నుంచి మొదలయ్యే ఐపీఎల్‌ 19వ సీజన్‌ నుంచి ఆకాశ్‌దీప్‌ తప్పుకున్నాడు. అఫ్గానిస్తాన్‌తో జూన్‌ తొలి వారంలో జరిగే ఏకైక టెస్టుకు కూడా ఆకాశ్‌దీప్‌ దూరమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బిహార్‌కు చెందిన 29 ఏళ్ల ఆకాశ్‌దీప్‌ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్‌ తరఫున 10 టెస్టులు ఆడిన అతను 28 వికెట్లుపడగొట్టాడు. ఐపీఎల్‌లో 2022 నుంచి 2024 వరకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు ఆడిన ఆకాశ్‌దీప్‌ గత సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆకాశ్‌దీప్‌ 10 వికెట్లు తీశాడు.

Advertisement
Advertisement
 
Advertisement