ప్రధాన వార్తలు
డికాక్ కొత్త చరిత్ర.. ఒక్క సెంచరీతో ఇన్ని రికార్డులా?
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో డికాక్కు ఇదే తొలి మ్యాచ్ కాగా, ఆడిన తొలి మ్యాచ్లోనే శతక్కొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో డికాక్ ఒక్క సెంచరీతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 క్రికెట్లో డికాక్కు ఇది 9వ సెంచరీ. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి, రిలీ రోసౌ, సాహిబ్జదా ఫర్హాన్లు కూడా 9 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నారు. ఇక విండీస్ వీరుడు క్రిస్ గేల్ 22 శతకాలతో తొలి స్థానంలో ఉండగా, బాబర్ ఆజమ్ (11), డేవిడ్ వార్నర్ (10) శతకాలతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లు తరఫున సెంచరీలు బాదిన మూడో బ్యాటర్గా డికాక్ నిలిచాడు. 2016లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఆర్సీబీతో మ్యాచ్లో 108 పరుగులు, 2022లో లక్నో సూపర్జెయింట్స్ తరఫున కేకేఆర్తో మ్యాచ్లో 140 నాటౌట్, తాజాగా పంజాబ్తో మ్యాచ్లో అజేయ శతకంతో మెరిశాడు. గతంలో సంజూ శాంసన్ (ఢిల్లీ, రాజస్తాన్, సీఎస్కే), కేఎల్ రాహుల్ (పంజాబ్, ఢిల్లీ, లక్నో) ఈ ఫీట్ సాధించారు. మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు కూడా వికెట్ కీపర్లే కావడం గమనించాల్సిన అంశం.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పంజాబ్పై సెంచరీ సాధించిన రెండో బ్యాటర్గా డికాక్ నిలిచాడు. 2014లో లెండిల్ సిమ్మ న్స్ (100 నాటౌట్) పంజాబ్పై తొలి సెంచరీ సాధించాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్ చోటు సంపాదించాడు. సనత్ జయసూర్య (114 నాటౌట్) తొలి స్థానంలో ఉంటే డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ (109 నాటౌట్, 105 నాటౌట్) ముంబై తరపున రెండుసార్లు తన బెస్ట్ స్కోర్లు నమోదు చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో డికాక్ది రెండో సెంచరీ. సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ ఈ సీజన్లో తొలి సెంచరీ సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు.పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.𝑸𝒖𝒊𝒕𝒆 𝒅𝒆 𝑲𝒏𝒐𝒄𝒌! 👏#MIvPBKSpic.twitter.com/ZmfClFOpm8— Mumbai Indians (@mipaltan) April 16, 2026What a player, what a knock, and what a way to start the season! 💯Quinton de Kock, take a bow for a truly special Wankhede hundred! 👏Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @mipaltan pic.twitter.com/jEhH1ofb1z— IndianPremierLeague (@IPL) April 16, 2026చదవండి: ఐపీఎల్లో సెంచరీ కొట్టిన అర్ష్దీప్
ఐపీఎల్లో సెంచరీ కొట్టిన అర్ష్దీప్
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే అర్ష్దీప్ సెంచరీ నమోదు చేసింది బ్యాటింగ్లో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బౌలింగ్లో అర్ష్దీప్ ఈ ఫీట్ను సాధించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఓపెనర్ రికెల్టన్ను ఔట్ చేయడం ద్వారా అర్ష్దీప్ ఐపీఎల్లో వంద వికెట్ల మార్క్ను చేరుకున్నాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించి ఐదో లెఫ్టార్మ్ పేసర్గా, నాలుగో భారత బౌలర్గా నిలిచాడు. ఇంతకముందు ట్రెంట్ బౌల్ట్ (144 వికెట్లు), ఉనాద్కట్ (114 వికెట్లు), ఆశిష్ నెహ్రా (106 వికెట్లు), జహీర్ ఖాన్ (102 వికెట్లు) ముందున్నారు. ఇక పవర్ ప్లేలో అర్ష్దీప్ వికెట్ తీసుకోవడం 11 ఇన్నింగ్స్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.Back-to-back breakthroughs 🎯A century of #TATAIPL wickets 🌟Arshdeep Singh becomes the first @PunjabKingsIPL bowler to reach the milestone 👏Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @arshdeepsinghh pic.twitter.com/ioOXVqbfWX— IndianPremierLeague (@IPL) April 16, 2026 #MI in 𝗱𝗲𝗲𝗽 trouble 😯🎥 Arshdeep Singh with 2️⃣ wickets in his second over 👊Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6zPnONpClJ— IndianPremierLeague (@IPL) April 16, 2026
ఐపీఎల్ చరిత్రలో అరుదైన దృశ్యం..
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరం కావడంతో అతడి స్థానంలో క్వింటన్ డికాక్ జట్టులోకి వచ్చాడు. డికాక్తో కలిసి రియాల్ రికెల్టన్ ముంబై ఇన్నింగ్స్ను ఆరంభించాడు. గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఇద్దరు సౌతాఫ్రికాకు చెందిన వారే కావడం విశేషం. ఐపీఎల్లో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ముంబై ఇండియన్స్ తరఫున ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు ఓపెనింగ్ చేయడం ఐపీఎల్లో ఇదే తొలిసారి. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్ మార్కో యాన్సెన్ వేశాడు. ఈ సమయంలో స్ట్రైకింగ్లో, నాన్ స్ట్రైకింగ్ ఎండ్తో పాటు బౌలర్ కూడా సౌతాఫ్రికాకు చెందిన వారే ఉండడం మరో గమనించదగ్గ అంశం.
IPL 2026: 6 ఓవర్లలో పంజాబ్ 61/2
MI Vs CSK Updates..ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. శ్రేయస్ (12), ప్రబ్సిమ్రన్ (16) క్రీజులో ఉన్నారు. అంతకముందు కూపర్ కన్నోలి (17) రెండో వికెట్గా వెనుదిరిగాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య గజన్ఫర్ బౌలింగ్లో దీపక్ చాహర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్లో పంజాబ్ 21 పరుగులు పిండుకోవడం విశేషం.పంజాబ్ టార్గెట్ 196 పరుగులుపంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.బార్ట్లెట్ కళ్లు చెదిరే క్యాచ్.. పాండ్యా (14)ఔట్14 పరుగులు చేసిన పాండ్యా మార్కో యాన్సెస్ బౌలింగ్లో గ్జేవియర్ బార్ట్లెట్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. డికాక్ సెంచరీపంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 53 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న డికాక్కు ఐపీఎల్లో ఇది మూడో సెంచరీ. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.నమన్ ధిర్ ఔట్.. మూడో వికెట్ డౌన్పంజాబ్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అర్థసెంచరీ సాధించిన నమన్ ధిర్ శశాంక్ సింగ్ బౌలింగ్లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డికాక్ (82), పాండ్యా (3) క్రీజులో ఉన్నారు.7 ఓవర్లలో ముంబై 67/2ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. నమన్ ధిర్ (34), డికాక్ (25) క్రీజులో ఉన్నారు.సూర్యకుమార్ గోల్డెన్ డక్.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చిన అర్షదీప్ సింగ్ అంతకముందు రియాన్ రికెల్టన్ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది.బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా 24వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, మిచెల్ సాంట్నర్ స్థానం డికాక్, మయాంక్ రావత్ తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 17 సార్లు, పంజాబ్ కింగ్స్ 17 సార్లు నెగ్గాయి. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇక వాంఖడే స్టేడియంలో మాత్రం పంజాబ్ కింగ్స్ రికార్డు మెరుగ్గా ఉంది. వాంఖడేలో పంజాబ్ ముంబై పై 5 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్ల్లో ముంబై మూడింటింలో, పంజాబ్ రెండు మ్యాచ్ల్లో గెలిచాయి.ముంబై ఇండియన్స్ తుదిజట్టు: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా( కెప్టెన్), రూథర్ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), కూపర్ కొన్నోలీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైశాక్, అర్ష్దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్.
షోయబ్ అక్తర్ ఒక ‘పిచ్చివాడు’.. అతడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
షోయబ్ అక్తర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా పేరు గాంచాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ బాల్(161.3 కి.మీ/గం) రికార్డు ఇప్పటికే అక్తర్ పేరిటే ఉంది. తన ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించిన అక్తర్.. 2011లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తాజాగా ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్పై భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్తర్కు బౌలింగ్ పట్ల ఉన్న అంకితభావాన్ని మునాఫ్ పటేల్ కొనియాడాడు. "షోయబ్ అక్తర్కు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి. దాదాపు 15 ఏళ్ల పాటు ఆసియా లాంటి పరిస్థితుల్లో 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అతడి పట్టుదలకు హ్యాట్సాఫ్. వేగంగా బౌలింగ్ చేయడం వల్ల అక్తర్ రెండు మోకాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.రిటైర్మెంట్ తర్వాత అతడు సరిగ్గా నడవడానికి నాలుగైదు సంవత్సరాలు పట్టింది. అక్తర్ చాలా మొండోడు. ఫాస్ట్ బౌలింగ్ అంటే పిచ్చి. అలాంటి పిచ్చి ఉన్నవాడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలడు"అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మునాఫ్ పటేల్ పేర్కొన్నాడు.అక్తర్ చివరగా 2011 ప్రపంచకప్లో ఆడాడు. పాక్ తరపున 46 టెస్టులు ఆడి 178 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా అతడి పేరిట 247 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. కాగా షోయబ్ తన కెరీర్లో నిలకడగా ఒకే వేగంతో బౌలింగ్ చేసేందుకు ఎన్నో సవాళ్లును ఎదుర్కొన్నాడు. మ్యాచ్లకు ముందు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకునేవాడినని అతడే చాలా సార్లు చెప్పాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీకి సంబంధించి బిగ్ న్యూస్!
హైదరాబాద్లో అడుగుపెట్టిన ధోని!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరంభంలో తడబడినప్పటికీ వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన సీఎస్కే గాడిన పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), సీఎస్కే మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో ధోని బరిలోకి దిగుతాడా లేదా అనేది స్పషత రాలేదు. కానీ ధోని మాత్రం జట్టుతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకముందు చెన్నై నుంచి హైదరాబాద్కు బయల్దేరిన సీఎస్కే జట్టు ఫొటోలు, ధోని వీడియోనూ చెన్నై సూపర్కింగ్స్ ప్రత్యేకంగా పంచుకుంది. ‘మేము వస్తున్నాం, హైదరాబాద్’ అని తెలుగులో క్యాప్షన్ జత చేసింది. ఆ వీడియోలో ధోని సింహంలా నడుచుకుంటూ రాగా.. ధోని ముందు, వెనుక సెక్యూరిటీ బందోబస్తు గట్టిగా కనిపిస్తోంది. ఇక ఎస్ఆర్హెచ్, సీఎస్కే మ్యాచ్కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. కేవలం ధోనిని చూసేందుకే అభిమానులు భారీగా తరలిరానున్నారు. మ్యాచ్లో ఆడినా ఆడకపోయినా తలా ఒక్కసారి మైదానంలో దర్శనమిస్తే చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మాత్రం ధోని బరిలోకి దిగనున్నట్లు అధికారికంగా సమాచారం అందింది. ఒకవేళ ధోని జట్టులోకి వస్తే మాత్రం సర్ఫరాజ్ఖాన్ డగౌట్కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక సీఎస్కే ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో 2 విజయాలు, మూడు ఓటములతో 8వ స్థానంలో ఉంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా 5 మ్యాచ్ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఉన్నప్పటికీ, మెరుగైన రన్రేట్ కారణంగా పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.🚨 IT'S OFFICIAL MS DHONI IS TRAVELING TO HYDERABAD WITH THE CSK TEAM pic.twitter.com/lXc4qHavBp— ` (@WorshipDhoni) April 16, 2026𝙈𝙚𝙢𝙪 𝙫𝙖𝙨𝙩𝙪𝙣𝙣𝙖𝙢, Hyderabad 🥳🦁#WhistlePodu #Yellove pic.twitter.com/oIT9uwxnTm— Chennai Super Kings (@ChennaiIPL) April 16, 2026చదవండి: ఎంసీఏ కీలక నిర్ణయం.. క్రికెట్ చరిత్రలో తొలిసారి!
సన్రైజర్స్కు భారీ షాక్.. మరో స్టార్ ప్లేయర్ టోర్నీ నుంచి అవుట్
సన్రైజర్స్ హైదరాబాద్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ వెటరన్ డేవిడ్ పేన్ చీలమండ గాయం కారణంగా ఐపీఎల్-2026 సీజన్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. "డేవిడ్ పేన్ చీలమండ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో లేడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము"ఎస్ఆర్హెచ్ ఎక్స్ వేదికగా పేర్కొంది. వాస్తవానికి ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ను వేలంలో ఎవరు కొనుగోలు చేయలేదు. కానీ ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు జాక్ ఎడ్వర్డ్స్ గాయపడడంతో.. అతడి స్ధానంలో పేన్తో సన్రైజర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆరెంజ్ ఆర్మీ తరపున కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన పేన్, 14 ఎకానమీ రేటుతో 2 వికెట్లు పడగొట్టాడు. తాజాగా మరో ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ కూడా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి పేన్ చేరాడు. మరోవైపు వెన్ను నొప్పితో కొన్ని మ్యాచ్లకు దూరమైన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో కమ్మిన్స్ ఉత్తీర్ణత సాధించాడు. దీంతో ఐపీఎల్లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. కమ్మిన్స్ కమిన్స్ ఏప్రిల్ 17న హైదరాబాద్ చేరుకుంటాడు. ఏప్రిల్ 18న ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్కు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఎంసీఏ కీలక నిర్ణయం.. క్రికెట్ చరిత్రలో తొలిసారి!
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 సీజన్కు సంబంధించి ముంబై జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక రాష్ట్ర అసోసియేషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. డొమెస్టిక్ క్రికెట్లో మంచి ప్రతిభ కనబరుస్తూ కూడా జాతీయ జట్టుకు లేదా ఐపీఎల్లో అవకాశాలు రాని ఆటగాళ్లకు ఉపయోగపడేలా కాంట్రాక్టులు అమలు చేయనున్నట్లు గతంలోనే ఎంసీఏ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. తాజాగా ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు అందించడంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ అడుగు ముందుకు వేసింది. నివేదిక ప్రకారం ముంబై క్రికెట్ అసోసియేషన్ జట్టులోని ఆటగాళ్లను మూడు కేటగిరీలు (గ్రేడ్-ఏ, గ్రేడ్-బి, గ్రేడ్-సి) గా విభజించనుంది. గ్రేడ్-ఏ కేటగిరీ జాబితాలో ఉండే ఆటగాళ్లు రూ. 12 లక్షల నుంచి 20 లక్షలు అందుకోనున్నారు. గ్రేడ్-బి కేటగిరి కింద ఆటగాళ్లు రూ. 8 నుంచి 12 లక్షల వరకు, గ్రేడ్-సిలో ఉండే ఆటగాళ్లు రూ. 8 లక్షలు వార్షిక ఫీజుగా అందుకోనున్నారు. ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ మాట్లాడుతూ.. ‘ఎంసీఏ ముందే హామీ ఇచ్చినట్లుగా ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ను అమల్లోకి తీసుకురానున్నాం. ఇటీవల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై చాలా ఆలోచించాము. డొమెస్టిక్ క్రికెట్లో ఆడే ఆటగాళ్లందరికీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాదు. అందుకే ముంబై తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ను అందివ్వాలని నిర్ణయించాం. ఇది ఆటగాళ్లకు ఆర్థికంగానూ ఉపయోగపడనుంది’ అని చెప్పుకొచ్చారు.నిబంధనలు..అయితే ముంబై క్రికెట్ అసోసియేషన్ అమలు చేయనున్న వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో ఆటగాళ్లు చోటు దక్కించుకోవడంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.ఆటగాళ్లు తప్పనిసరిగా ఎంసీఏలో రిజిస్టర్ అయి ఉండాలి. ఫిట్నెస్ ప్రమాణాలు తప్పనిసరి.గత రెండు సీజన్లలో ఐపీఎల్లో పాల్గొనడం లేదా భారత జట్టుకు ఆడిన వారికి ఎంసీఏ కాంట్రాక్టులో చోటు ఉండదు. ఆటగాళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముందు సెలెక్షన్ కమిటీ వారిని సిఫార్సు చేయడానికి అవకాశముంది.రంజీ ట్రోఫీలో ఆడే ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్ ఫీజులు చెల్లిస్తోంది. రంజీ మ్యాచ్ ఆడే ఆటగాళ్లకు రోజుకు రూ. 40 వేల నుంచి 60 వేలు చొప్పున బోర్డు చెల్లిస్తుంది. తాజాగా ఎంసీఏ కూడా అంతే మొత్తం ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ముంబై ఆటగాళ్లు తాము ఆడే ప్రతీ రంజీ మ్యాచ్కు బీసీసీఐతో పాటు ఎంసీఏ పారితోషికం కూడా అందుకోనున్నారు. తాజాగా తీసుకొచ్చిన కాంట్రాక్టు విధానం ఆటగాళ్ల కష్టానికి లభించిన ప్రతిఫలం అని చెప్పొచ్చు.
షాకింగ్.. ఐపీఎల్ నుంచి రిషబ్ పంత్ అవుట్?
ఐపీఎల్ 2026 సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వైదొలగనున్నాడా? అంటే అవునానే అంటున్నారు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఈ ధనధాన్ లీగ్లో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో పంత్ గాయపడ్డాడు. ఆర్సీబీ పేసర్ జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడికి నొప్పి తగ్గలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించలేక మైదానాన్ని వీడాడు. మళ్లీ ఆఖరిలో పంత్ బ్యాటింగ్కు వచ్చినప్పటికి ఆసౌకర్యంగా కన్పించాడు. అతడు మొత్తంగా ఆరు బంతుల్లో ఒక్క మాత్రమే చేసి పెవిలియన్ చేరిపోయాడు. ఆ తర్వాత అతడు ఫీల్డింగ్ రాలేదు. పంత్ స్దానంలో నికోలస్ పూరన్ స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో పంత్ గాయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఐపీఎల్-2026 సీజన్లో మిగిలిన మ్యాచ్లకు రిషబ్ పంత్ అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. ప్రస్తుతం లక్నో జట్టు చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా వారి బ్యాటింగ్ విభాగం చాలా దారుణంగా ఉంది. కేవలం బౌలింగ్ మాత్రమే బాగుంది. ఈ సీజన్లో లక్నో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రత్యర్ధి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. మార్క్రమ్ ఒక చెత్త క్రికెటర్. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ను బెంచ్కే పరిమితం చేయాలి. ఈ ముగ్గురు భారీ స్కోర్లు సాధిస్తారని వేచి చూడడం ముందు ఆపండి. వారి స్ధానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వండి. ఏదేమైనప్పటికి వారి బ్యాటింగ్ చూస్తుంటే ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరే అవకాశం అస్సలు కనిపించడం లేదు శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో లక్నో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి రెండింట గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో ఏడో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీకి సంబంధించి బిగ్ న్యూస్!
వైభవ్ సూర్యవంశీకి సంబంధించి బిగ్ న్యూస్!
రాజస్తాన్ రాయల్స్ టీమ్ మేనెజర్ రోమీ భిందర్ డగౌట్లో మొబైల్ ఫోన్ వాడిన వ్యవహారంపై విచారణ ఓ కొలుక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వైద్యపరమైన కారణాల వల్లే డగౌట్లో ఫోన్ చూడాల్సి వచ్చిందని భిందర్ బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అదేవిధంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోమీ తన ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్, మేసెజ్లు గానీ చేయలేదని ఏసీయూ నిర్ధారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికి రోమీ భిందర్ నిబంధనలు ఉల్లఘించినందుకు గాను బీసీసీఐ జరిమానా విధించేందుకు సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా రోమీ పక్కన ఉండి ఫోన్ చూసిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని కేవలం హెచ్చరించి వదిలేయాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అసలేమి జరిగిందంటే?ఈ ఏడాది సీజన్లో భాగంగా ఏప్రిల్ 10న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. అయితే రాజస్తాన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రోమీ భిందర్ డగౌట్లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కారు. ఆ సమయంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉండి ఫోన్ వైపు చూడటం వివాదాస్పదమైంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం..మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్ మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. దీంతో బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అతడికి నోటీసులు జారీచేసింది. నలభై ఎనిమిది గంటల్లోగా.. తాను ఆరోజు ఫోన్ ఎందుకు ఉపయోగించానన్న విషయంపై రోమీ వివరణ ఇవ్వాలని ఏసీయూ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే రోమీ బీసీసీఐ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.చదవండి: విరాట్ కోహ్లి కాదు.. వారిద్దరి వల్లే గెలిచాము: ఆర్సీబీ కెప్టెన్
అదరగొట్టిన భారత రెజ్లర్లు..
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లిం...
సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పెను సంచలనం న...
సాకర్ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్!
మరో రెండు నెలల్లో సాకర్ మహాసంగ్రామం మొదలుకాను...
విజేత నైశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గోండ్వానా కప్ అఖిల భారత టెన్న...
ముంబై ఇండియన్స్లోకి కొత్త ఆల్రౌండర్
ముంబై ఇండియన్స్లోకి కొత్త ఆల్రౌండర్ వచ్చాడు. గా...
సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ.. ఐపీఎల్ నుంచి రూ. 4 కోట్ల ప్లేయర్ అవుట్
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు గట్...
రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ మధ్య తేడా ఇదే..!
క్రికెట్లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ అన్న ...
విరాట్ ఖాతాలో మరో భారీ రికార్డు
దిగ్గజ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి మ...
క్రీడలు
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
#SRHvsRR మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
హైదరాబాద్ లో వైభవ్ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్ (ఫొటోలు)
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
వీడియోలు
15ఏళ్లుగా ధోనీకి సాధ్యం కాని రికార్డును మూడు మ్యాచుల్లో లేపేసాడు
నొప్పితో అల్లాడిపోయిన పంత్.. హాజెల్వుడ్ దెబ్బకి కన్నీళ్లు
టీమిండియాలోకి బుడ్జోడు ఎంట్రీ ఖరారు
ఆయా షేర్.. SRH ఊపిరి పీల్చుకో.. పాట్ కమ్మిన్స్ తిరిగివస్తునాడు ..
వైభవ్ సూర్యవంశీ 'గోల్డెన్ డక్'.. కావ్యపాప కాంతార సెలబ్రేషన్స్
KKR ఓటమి.. దుమ్మురేపిన CSK
ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
హీరో నుంచి జీరో, బొక్క బోర్ల పడ్డ బుడోడు....
అదరగొట్టిన SRH వైభవ్ డకౌట్...
ముంబై ఇండియన్స్.. హ్యాట్రిక్ ఓటమి
