Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026 NZ vs SL Super 8: Santner MCconchie Guides NZ To 1681
షాకులిచ్చిన శ్రీలంక.. సాంట్నర్‌ ధనాధన్‌ దంచికొట్టగా..

శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మెరుగైన స్కోరు సాధించింది. మిడిలార్డర్‌ కకావికలమైనా లోయర్‌ ఆర్డర్‌ రాణించడంతో గౌరవప్రదంగా ఇన్నింగ్స్‌ ముగించింది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సూపర్‌-8 మ్యాచ్‌లో భాగంగా కొలంబో వేదికగా.. టాస్‌ గెలిచిన శ్రీలంక.. కివీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో కివీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ (8)ను దుష్మంత చమీర త్వరగానే పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (13 బంతుల్లో 23)ను మహీశ్‌ తీక్షణ వెనక్కి పంపగా.. రచిన్‌ రవీంద్ర (22 బంతుల్లో 32) తీక్షణ బౌలింగ్‌లో హేమంతకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.పెవిలియన్‌కు క్యూఅయితే, టాపార్డర్‌ ఓ మాదిరిగా ఆడగా.. మిడిలార్డర్‌ బ్యాటర్లు మాత్రం పెవిలియన్‌కు క్యూ కట్టారు. గ్లెన్‌ ఫిలిఫ్స్‌ (18), డారిల్‌ మిచెల్‌ (3) ఇలా వచ్చి అలా వెళ్లగా.. మార్క్‌ చాప్‌మన్‌ డకౌట్‌ అయ్యాడు.సాంట్నర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిచెల్‌ సాంట్నర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. 47 పరుగులు సాధించాడు. Captain to the rescue! 💪Mitchell Santner's power-hitting pushes New Zealand's fightback. ICC Men’s #T20WorldCup | SUPER 8, #SLvNZ ➡️ LIVE NOW 👉 https://t.co/g4wqt4U8vL pic.twitter.com/p0KW8AcuLA— Star Sports (@StarSportsIndia) February 25, 2026రాణించిన మెకాంచీఇక జేమ్స్‌ నీషమ్‌ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన మరో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కోల్‌ మెకాంచీ సాంట్నర్‌కు తోడుగా రాణించాడు. మెకాంచీ 23 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 168 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మహీశ్‌ తీక్షణ, దుష్మంత చమీర చెరో మూడు వికెట్లు తీయగా.. దునిత్‌ వెల్లలగే ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. తుదిజట్లుశ్రీలంకపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంకన్యూజిలాండ్‌టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్‌

IND vs ZIM: India coach confirms Sanju Likely To play Then Who Will Axed2
IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. అతడిపై వేటు!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధమైంది. సూపర్‌-8 దశలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఇషాన్‌ హిట్‌.. అభిషేక్‌ ఫ్లాప్‌కాగా ఓపెనింగ్‌ జోడీగా ఇషాన్‌ కిషన్‌- అభిషేక్‌ శర్మలకు అవకాశాలు వస్తుండగా.. సంజూ శాంసన్‌ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అయితే వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇషాన్‌ మెరుగ్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. అభిషేక్‌ శర్మ లీగ్‌ దశలో తొలి మూడు మ్యాచ్‌లలోనూ డకౌట్‌ అయ్యాడు.ఇక సూపర్‌-8లో తొలుత సౌతాఫ్రికాతో టీమిండియా తలపడగా.. ఈసారి ఇషాన్‌ డకౌట్‌ కాగా.. అభిషేక్‌ 15 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. సంజూ లీగ్‌ దశలో నమీబియాతో మ్యాచ్‌లో బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.తిలక్‌ వర్మపై విమర్శలుఇదిలా ఉంటే.. మూడో స్థానంలో ఆడుతున్న తిలక్‌ వర్మ ఇప్పటి వరకు పెద్దగా బ్యాట్‌ ఝులిపించనేలేదు. అతడి స్ట్రైక్‌రేటుపై విమర్శలు వస్తున్నాయి. ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్లు ఇషాన్‌- అభిషేక్‌.. వన్‌డౌన్‌లో వచ్చే తిలక్‌.. ఈ ముగ్గురూ లెఫ్టాండ్‌ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు, కెప్టెన్‌కు పని సులువు అయిపోతోంది. వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేకుండానే వాళ్లు అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నారు.లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసంఇలాంటి తరుణంలో లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం టీమిండియా టాపార్డర్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో సంజూ శాంసన్‌ను చేర్చే విషయమై చర్చ నడుస్తోంది.సంజూ వస్తాడని సంకేతంజింబాబ్వేతో మ్యాచ్‌ సందర్భంగా మార్పులు ఉండవచ్చు. మా ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చే ఆటగాడు కూడా లెఫ్టాండర్‌ బ్యాటరే కావడం ఇందుకు కారణం. అందుకే ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నాం. అయితే, మ్యాచ్‌ సమయంలోనే మేము తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కొటక్‌ తెలిపాడు.ఎవరిపై వేటు?ఒకవేళ సంజూ గనుక తుదిజట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రింకూ సింగ్‌ స్థానంలో సంజూను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజూను వన్‌డౌన్‌లో ఆడించి.. తిలక్‌ను డిమోట్‌ చేయడం ఓ ఆప్షన్‌. అయితే, ఇప్పటికే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినా రింకూ జట్టుతో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కొటక్‌ తెలిపాడు.రింకూ, తిలక్‌, అభిషేక్‌!అంటే రింకూ జింబాబ్వేతో మ్యాచ్‌ ఆడటం ఖాయమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిషేక్‌ శర్మపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో రీసెట్‌ అయ్యేందుకు.. లెఫ్ట్‌-రైట్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌ కోసం అతడిని పక్కనపెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. అభిషేక్‌- ఇషాన్‌ జోడిని కొనసాగిస్తే.. తిలక్‌ వర్మపై వేటు వేసి.. సంజూను మూడోస్థానంలోనే ఆడిస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. సితాన్షు కొటక్‌ చెప్పినట్లు మ్యాచ్‌ ఆరంభానికి ముందు వరకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం ఈసారి కాస్త కష్టమే అనిపిస్తోంది. కాగా చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌ ఆడిన భారత తుదిజట్టులో ఏకంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

T20 WC NZ vs SL: Sri Lanka Won Toss Playing XIs Of Both Teams3
NZ vs SL: సూపర్‌-8 మ్యాచ్‌.. లైన్‌ క్లియర్‌!

న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లకు శుభవార్త. ఇరుజట్ల మధ్య సూపర్‌-8 మ్యాచ్‌కు మార్గం సుగమమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో సూపర్‌-8 దశలో బుధవారం నాటి మ్యాచ్‌లో కివీస్‌-లంక తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇరజట్ల అభిమానులను కలవరపాటుకు గురిచేశాయి.అయితే, కొలంబోలో ప్రస్తుతం వర్ష సూచన లేదు. దీంతో మ్యాచ్‌ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ కాగా.. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక కివీస్‌తో మ్యాచ్‌లో లంక తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. ఒక మార్పుతో బరిలోకికమాల్‌ మిశారా స్థానంలో చరిత్‌ అసలంకకు అవకాశం ఇచ్చింది. టాపార్డర్‌ను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్‌ దసున్‌ షనక వెల్లడించాడు. ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.మా జట్టులోనూ ఓ మార్పుమరోవైపు.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ మాట్లాడుతూ.. శ్రీలంకతో మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు వెల్లడించాడు. లంక స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలిపాడు. జిమ్మీ నీషమ్‌ స్థానంలో కోల్ మెకాంచీ తుదిజట్టులోకి వచ్చినట్లు సాంట్నర్‌ తెలిపాడు. మధ్య ఓవర్లలో అదనపు స్పిన్‌ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.తుదిజట్లుశ్రీలంకపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంకన్యూజిలాండ్‌టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్‌

Not going to win : Salman Agha wife hits back at trolls after ENG Loss4
ఇలా అయితే పాక్‌ వరల్డ్‌కప్‌ గెలవదు: పాకిస్తాన్‌ కెప్టెన్‌ భార్య ఫైర్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ ఓటమిపాలైంది. పల్లెకెలె వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా, అతడి కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లో పాక్‌ ఓటమికి సల్మాన్‌ను బాధ్యుడిని చేస్తూ.. అతడి భార్య, కుమారుడిని అభ్యంతరకర రీతిలో పాక్‌ జట్టు అభిమానులు తిడుతూ పోస్టులు పెట్టారు.అంతేకాదు.. పాక్‌ గనుక సెమీస్‌ చేరకుంటే సల్మాన్‌తో పాటు అతడి కుటుంబం కూడా భూమ్మీద ఉండదంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. ఇలా అయితే పాక్‌ వరల్డ్‌కప్‌ గెలవదుఈ నేపథ్యంలో సల్మాన్‌ అలీ ఆఘా భార్య సబా మంజర్‌ ట్రోల్స్‌కు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. ‘‘పాకిస్తానీ అభిమానులారా!... నన్ను లేదంటే.. మా అమాయకపు చిన్నారి కుమారుడిని దూషించడం ద్వారా మనం ప్రపంచకప్‌ గెలవలేము’’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.కాగా ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి తర్వాత సల్మాన్‌తో పాటు పాక్‌ జట్టులోని ఆటగాళ్లందరిపై నెట్టింట తిట్ల వర్షం కురుస్తోంది. ఇక పాక్‌ అభిమానులకు ఇదేమీ కొత్తకాదు. ముఖ్యంగా 1996 వరల్డ్‌కప్‌లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత.. పాక్‌ క్రికెటర్ల నివాసాలపై దాడులు జరిగాయి. నాటి కెప్టెన్‌ వసీం అక్రం ఇంటి మీద కూడా నిరసనకారులు దాడికి దిగారు.సెమీస్‌లో తొలి అడుగు ఇంగ్లండ్‌దేఇదిలా ఉంటే.. భారత్‌- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలైన టీ20 ప్రపంచకప్‌-2026లో సూపర్‌-8 దశ నడుస్తోంది. గ్రూప్‌-1 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌.. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక బరిలో ఉన్నాయి.సూపర్‌-8లో భాగంగా పాక్‌ తొలుత న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్‌ పడకుండానే మ్యాచ్‌ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరోపాయింట్‌ వచ్చింది. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాక్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. గత మ్యాచ్‌లో శ్రీలంకపై.. తాజాగా పాక్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది ఇంగ్లండ్‌.చదవండి: NZ vs SL: కివీస్‌, శ్రీలంకలకు భారీ షాక్‌!.. పాక్‌కు గుడ్‌న్యూస్‌?

Big Win For Shikhar Dhawan Court orders His ex wife to return Rs 5 7 Cr5
శిఖర్‌ ధావన్‌ మాజీ భార్యకు షాకిచ్చిన కోర్టు.. గబ్బర్‌కు రిలీఫ్‌

టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌కు ఊరట లభించింది. పాటియాలా హౌజ్‌ కోర్టు అతడికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా నివాసి ఆయేషా ముఖర్జీతో ధావన్‌కు సోషల్‌ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారితీశాయి.ఆయేషాతో విడాకులుడివోర్సీ, ఇద్దరు ఆడపిల్లల తల్లి అయిన ఆయేషా (Ayesha)ను ధావన్‌ 2012లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమారుడు జొరావర్‌ జన్మించాడు. అయితే, కొంతకాలం తర్వాత ధావన్‌- ఆయేషా మధ్య తలెత్తిన విభేదాలు విడాకులకు దారితీశాయి. ఢిల్లీ కోర్టు 2023లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.సోఫీతో ఇటీవలే వివాహం ఈ క్రమంలో చాన్నాళ్లు ఒంటరిగా ఉన్న శిఖర్‌ ధావన్‌.. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇటీవలే (ఫిబ్రవరి 22) అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇలా శిఖర్‌ ధావన్‌ కొత్త జీవితం ఆరంభించిన సమయంలో.. మాజీ భార్య విషయంలో న్యాయస్థానం నుంచి అతడికి గొప్ప ఊరట లభించింది.రూ. 5.7 కోట్లు తిరిగి చెల్లించాలిశిఖర్‌ ధావన్‌ నుంచి ఆయేషా తీసుకున్న రూ. 5.7 కోట్లను అతడికి తిరిగి చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కాగా ఆయేషా- ధావన్‌ల ఆస్తులకు సంబంధించి ఆస్ట్రేలియా కోర్టు ఆయేషాకు 15 శాతం కేటాయించింది. దీని ప్రకారం.. రూ. 7.46 కోట్లతో పాటు ధావన్‌ నుంచి అదనంగా రూ. 15.95 కోట్లు, దీనితో పాటు కొంత ఆస్తి ఆయేషా పేరిట రాయాలని ఆదేశించింది.ఈ మేరకు ఆస్తులకు సంబంధించి 2021-2024 మధ్య ఆస్ట్రేలియా కోర్టు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసింది. అయితే, భారత వివాహ చట్టాల ప్రకారం తాను ఆస్ట్రేలియా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పనిలేదని ధావన్‌ వాదించాడు. ఇందుకు సంబంధించి పాటియాలా హౌజ్‌ కోర్టులో వివరాలు సమర్పించాడు.కట్టుకథలు అల్లిపెళ్తైన కొన్ని నెలల తర్వాత నుంచే ఆయేషా.. కట్టుకథలు అల్లి తన కెరీర్‌ను దెబ్బతీస్తానని బెదిరించిందని ధావన్‌ కోర్టుకు చెప్పాడు. అంతేకాదు.. తన కష్టార్జితంతో కొనుగోలు చేసే ప్రతి ఆస్తిని ఇద్దరి పేరిట లేదంటే.. ఆయేషా ఒక్కదాని పేరిటే కొనాలని ఆమె ఒత్తిడి చేసేదని వాపోయాడు.ఇందుకు తగ్గట్లుగానే ఒకానొక సమయంలో ధావన్‌ కొన్న ఆస్తులలో దాదాపు 99 శాతం ఆయేషా పేరిటే ఉన్నట్లుగా కోర్టుకు ఆధారాలు సమర్పించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పాటియాలా హౌజ్‌ కోర్టు జడ్జి జస్టిస్‌ దేవేందర్‌ కుమార్‌ గార్గ్‌.. ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ధావన్‌ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.బెదిరించి డబ్బు గుంజాలనే యత్నంసెటిల్‌మెంట్‌ సమయంలో ధావన్‌ను బెదిరింపులకు గురిచేసి డబ్బు గుంజాలనే ప్రయత్నం జరిగినట్లు గుర్తించామన్నారు. కాబట్టి ఆయేషా ధావన్‌ నుంచి పొందిన రూ. 5.7 కోట్లను తిరిగి ఇచ్చేయాలని గార్గ్‌ ఆదేశించారు.అంతేకాదు.. ధావన్‌ ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన నాటి నుంచి ఏడాదికి 9 శాతం చొప్పున వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆయేషాను న్యాయస్థానం ఆదేశించింది. మాజీ దంపతుల వివాదంలో ఆస్ట్రేలియా కోర్టుకు ఎలాంటి అధికారం లేదని.. ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఇక్కడ విలువలేదని కొట్టిపారేసింది. దీంతో ధావన్‌కు ఉపశమనం దక్కింది.కుమారుడికి దూరంకాగా కుమారుడు జొరావర్‌ కస్టడీ తనకు కావాలని ధావన్‌ కోరగా.. న్యాయస్థానం అతడికి శాశ్వత ప్రాతిపదికన కుమారుడిని అప్పగించలేమని తెలిపింది. అయితే, ఇండియా, ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో వీడియో కాల్స్‌ ద్వారా కుమారుడిని చూడవచ్చని పేర్కొంది. అయితే, ఆయేషా మాత్రం కుమారుడితో తనకు ఎలాంటి సంబంధం లేకుండా చేసేందుకు సోషల్‌ మీడియాతో సహా అన్ని కనెక్షన్‌లను కట్‌ చేసిందని ధావన్‌ వాపోయాడు. కుమారుడిని ఎంతగానో మిస్‌ అవుతున్నట్లు సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా ధావన్‌ తరచూ వెల్లడిస్తూ ఉంటాడు.చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

T20 WC IND vs ZIM: Batting coach Sitanshu on Tilak Abhishek Sanju6
అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్‌

సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం తర్వాత టీమిండియా జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2026 సూపర్‌-8 దశలో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుదిజట్టు కూర్పు గురించి ముఖ్యంగా.. అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌ల గురించి కొటక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.సంజూకు మొండిచేయికాగా ఇషాన్‌ కిషన్‌ రాకతో భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ స్థానం గల్లైంతైన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో అమెరికా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లలో అభిషేక్‌ శర్మ- ఇషాన్‌ జోడీగా బరిలో దిగారు. అయితే, నమీబియాతో మ్యాచ్‌కు మాత్రం అభిషేక్‌ గైర్హాజరీలో సంజూ ఓపెనర్‌గా వచ్చాడు.తిలక్‌ వర్మ ఆట తీరుపై విమర్శలుమరోవైపు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. అతడి స్ట్రైక్‌రేటు కూడా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌లో తిలక్‌ను తప్పించి సంజూను మూడో స్థానంలో ఆడించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.తిలక్‌ గురించి బాధ లేదుఈ పరిణామాల నేపథ్యంలో సితాన్షు కొటక్‌ మాట్లాడుతూ.. ‘‘తిలక్‌ వర్మ బ్యాటింగ్‌ గురించి మాకు ఎలాంటి సమస్య లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు చక్కగా ఆడాడు. రెండు, మూడు బౌండరీలు బాదితే అంతా అదే సర్దుకుంటుంది. అతడు బంతులు వృథా చేస్తున్నాడన్న అంశంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు.అభిషేక్‌ శర్మ గురించి కూడా మేము ఆందోళన చెందడం లేదు. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి గురించి కూడా పెద్దగా ఆందోళన లేదు. తదుపరి మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం మీదే మేము ప్రస్తుతం దృష్టి సారించాము.సంజూ రావొచ్చుప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను అర్థం చేసుకుని.. సరైన జవాబు ఇచ్చే విధంగా మా బ్యాటర్లు సంసిద్ధం అవుతున్నారు. ప్రణాళిక, సన్నాహకాలపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అతడి (సంజూ) గురించి చర్చ నడుస్తోంది. అయితే, మేము ముందుగానే తుదిజట్టును నిర్ణయించబోము. అతడిని ఆడించే ఆలోచన లేదని మాత్రం చెప్పము’’ అని సితాన్షు కొటక్‌ పేర్కొన్నాడు. అదే విధంగా.. వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడిన రింకూ సింగ్‌ బుధవారం సాయంత్రం టీమ్‌తో కలుస్తాడని తెలిపాడు.సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతోఇదిలా ఉంటే.. లీగ్‌ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లపై గెలుపొంది అజేయంగా నిలిచింది టీమిండియా. అయితే, సెమీస్‌ దిశగా అడుగులు వేసే క్రమంలో ఊహించని రీతిలో సూపర్‌-8 తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓడిపోయింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి సెమీ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై నెగ్గితేనే సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: T20 WC 2026: పాక్‌ జట్టులో కలకలం

T20 WC NZ vs SL: Is Another Washout Likely in Colombo If That Happen7
T20 WC: కివీస్‌, లంకకు భారీ షాక్‌!.. పాక్‌కు గుడ్‌న్యూస్‌?

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షార్ఫణం అయ్యాయి. లీగ్‌ దశలో పల్లెకెలె వేదికగా ఐర్లాండ్‌- జింబాబ్వే మ్యాచ్‌ వాన కారణంగా టాస్‌ పడకుండానే రద్దైంది. ఇక సూపర్‌-8 దశలో కొలంబో వేదికగా పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ కూడా వర్షం వల్ల మొదలుకాకుండానే ముగిసిపోయింది.ఫలితంగా సెమీస్‌ రేసులో కీలకమైన సూపర్‌-8 దశలో ఇరుజట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. దీంతో తదుపరి మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.కివీస్‌, లంకకు భారీ షాక్‌!సూపర్‌-8 గ్రూప్‌-2లో భాగంగా కివీస్‌ బుధవారం కొలంబో వేదికగా శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే న్యూజిలాండ్‌ సెమీస్‌ అవకాశాలు మెరుగుపడతాయి. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం.. మ్యాచ్‌ ఆరంభ సమయం (రాత్రి 7 గంటల) నుంచి తొమ్మిది గంటల వరకు వాన పడేందుకు 14 శాతం అవకాశాలు ఉన్నాయి.రాత్రి 10, 11 గంటల ప్రాంతంలో వర్షం పడేందుకు 49- 58 శాతం అవకాశాలు ఉన్నాయి. దీంతో కివీస్‌- శ్రీలంక మ్యాచ్‌ రద్దయిపోయేందుకు ఎక్కువ ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం తెరిపినిస్తే ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కివీస్‌ జట్టుకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం. ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే.. తదుపరి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లేదంటే పాకిస్తాన్‌తో పోటీలో వెనుకబడే అవకాశం ఉంది.పాక్‌కు ఒక రకంగా శుభవార్తే!కాగా గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌.. శ్రీలంక, పాకిస్తాన్‌లను ఓడించి ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. రెండో స్థానం కోసం కివీస్‌, పాక్‌ మధ్య పోటీ నెలకొంది. కివీస్‌ శ్రీలంకతో పాటు ఇంగ్లండ్‌ను కూడా ఓడిస్తే నేరుగా సెమీస్‌ చేరుకుంటుంది.అలా కాక ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. పాక్‌కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇక పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే.. శ్రీలంక, ఇంగ్లండ్‌ చేతుల్లో న్యూజిలాండ్‌ తప్పక ఓడిపోవాలి. అదే విధంగా శ్రీలంకపై పాక్‌ గెలవాల్సి ఉంటుంది. అలా కాకుండా.. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ తదుపరి ఒక్కో మ్యాచ్‌లో గెలిస్తే.. పాయింట్ల సంఖ్య (3) సమానం అవుతుంది. అలాంటపుడు నెట్‌రన్‌రేటు కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు.. శ్రీలంక రేసులో ఉండాలంటే న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌లపై భారీ విజయాలు సాధించాలి.కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. కొన్నిరోజులుగా కొలంబో, పల్లెకెలెలో వర్షం పడటం.. శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడే జట్లకు ఇబ్బందికరంగా మారింది. చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Afghanistan Appointed New head coach after Jonathan Trott departs8
అఫ్గనిస్తాన్‌ కొత్త హెడ్‌కోచ్‌గా అతడే.. ఏసీబీ ప్రకటన

అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు కొత్త హెడ్‌కోచ్‌ వచ్చాడు. తాజా టీ20 ప్రపంచకప్‌ వరకు అఫ్గన్‌ జట్టుకు ఇంగ్లండ్‌ మాజీ ప్లేయర్‌ జొనాథన్‌ ట్రాట్‌ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, టోర్నీ అనంతరం అతడు పదవి నుంచి దిగిపోయాడు.ట్రాట్‌ స్థానంలోఈ క్రమంలో ట్రాట్‌ స్థానంలో కొత్త హెడ్‌ కోచ్‌గా రిచర్డ్‌ పైబస్‌ను నియమించినట్లు అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ACB) తెలిపింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి పైబస్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ‘అఫ్గనిస్తాన్‌ జాతీయ జట్టుకు రిచర్డ్‌ పైబస్‌ను కొత్త హెడ్‌ కోచ్‌గా నియమించాం. శ్రీలంకతో సిరీస్‌ నుంచి అతడు జట్టుతో చేరతాడు’ అని ఏసీబీ పేర్కొంది. కోచ్‌గా మంచి రికార్డుఇక ఇంగ్లండ్‌కు చెందిన పైబస్‌ ఒకే ఒక్క లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌ ఆడాడు. అయితే, ఆటగాడిగా పెద్దగా అనుభవం లేకపోయినా... కోచ్‌గా మంచి రికార్డు ఉంది. పైబస్‌ 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అతడు విండీస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా ఉన్న సమయంలోనే కరీబియన్‌ జట్లు పురుషుల, మహిళల, అండర్‌–19 వరల్డ్‌కప్‌ ట్రోఫీలు సాధించాయి. సూపర్‌-8 చేరకుండానేకాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, యూఏఈ, కెనడాలతో తలపడ్డ అఫ్గనిస్తాన్‌.. నాలుగింటికి రెండే మ్యాచ్‌లు గెలిచింది. తద్వారా సూపర్‌-8 చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్‌లో అఫ్గన్‌ జట్టు అనూహ్య రీతిలో సెమీస్‌ చేరిన సంగతి తెలిసిందే.చదవండి: T20 WC 2026: పాక్‌ జట్టులో కలకలం

Rinku Singh Family Emergency, Update Arrives On IND vs ZIM Participation9
T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

టీ20 ప్రపంచకప్‌ 2026 నేపథ్యంలో టీమిండియా కీలక ఆటగాడు రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ అందుతుంది. రింకూ నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్వస్థలమైన నోయిడాకు వెళ్లాడు. దీంతో అతను రేపటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దత నెలకొని​ ఉండింది.అయితే, ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం.. రింకూ రేపటి మ్యాచ్‌ కోసం చెన్నైకి (వేదిక) బయల్దేరినట్లు తెలుస్తుంది. మ్యాచ్‌ సమయానికి అతను అందుబాటులో ఉంటాడని సమాచారం. సెమీస్‌ నేపథ్యంలో రేపటి జింబాబ్వే మ్యాచ్‌ టీమిండియాకు అత్యంత కీలకం కావడంతో మేనేజ్‌మెంట్‌ రింకూ సేవలను కోల్పోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగానే రింకూ ప్రయాణానికి (నోయిడా నుంచి చెన్నైకి) ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. రింకూ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌లో అత్యంత కీలక ఆటగాడు. చివరి ఓవర్లలో అతను వేగంగా చేసే పరుగులు మెగా టోర్నీలో టీమిండియా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రింకూ లేని పక్షంలో మరో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ శివమ్ దూబేపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టే టీమిండియా మేనేజ్‌మెంట్‌ రింకూను హుటాహుటిన చెన్నైకి పిలిపించినట్లు తెలుస్తుంది.కాగా, రింకూ తండ్రి ఏడాదికాలంగా స్టేజ్-4 లివర్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ పరిస్థితి కారణంగా రింకూ హుటాహుటిన నోయిడాకు వెళ్లాడు.సంజూ శాంసన్‌ పరిస్థితి ఏంటి..?రింకూ జట్టును వీడిన అనంతరం జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించాలని మేనేజ్‌మెంట్‌ భావించింది. అయితే రింకూ అందుబాటులోకి రావడంతో సంజూకు మొండిచెయ్యి తప్పదని తెలుస్తుంది. తొలుత అభిషేక్‌తో పాటు సంజూను ఓపెనర్‌గా పంపి, ఇషాన్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలని మేనేజ్‌మెంట్‌ భావించిదట. అయితే రింకూ రీఎంట్రీతో సమీకరణలు మారేలా ఉన్నాయి. రింకూ జట్టులో చేరినా, సంజూకు అవకాశం​ ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తే మాత్రం తిలక్‌ వర్మపై వేటు పడవచ్చు. ముందుగా అనుకున్నట్లు అభిషేక్‌-సంజూ ఓపెనర్లుగా ఇషాన్‌ కిషన్‌ వన్‌డౌన్‌లో బరిలోకి దిగవచ్చు. అలాగే సౌతాఫ్రికా మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన వాషింగ్టన్‌ సుందర్‌ను కూడా పక్కకు పెట్టి, అక్షర్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.తుది జట్టు (అంచనా)..అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి

BANGLADESH WILL TOUR AUSTRALIA AFTER 23 YEARS FOR TESTS IN 202610
23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించనున్న బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు 23 ఏళ్ల తర్వాత టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆ జట్టు రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ డార్విన్‌ వేదికగా ఆగస్ట్‌ 13-17 మధ్య తేదీల్లో జరుగుతుంది. రెండో టెస్ట్‌ మెక్‌కే వేదికగా ఆగస్ట్‌ 22-26 మధ్య జరుగనుంది. బంగ్లాదేశ్‌-ఆస్ట్రేలియా మధ్య ఇది నాలుగో టెస్ట్‌ సిరీస్‌ ఆవుతుంది. ఇందులో​ ఆరు మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. 2017లో మీర్పూర్‌లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆసీస్‌పై సంచలన విజయం సాధించింది.కాగా, బంగ్లాతో హోం సిరీస్‌తోనే 2026-27 సీజన్‌ ఆసీస్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ మొదలవుతుంది. ఈ సిరీస్‌ తర్వాత ఆసీస్‌ మూడు టెస్ట్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఆతర్వాత నవంబర్‌ నుంచి 2027 జనవరి మధ్యలో న్యూజిలాండ్‌ జట్టు నాలుగు టెస్ట్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో భారత్‌లో 5 మ్యాచ్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ జరుగనుంది. అనంతరం మార్చిలో ఇంగ్లండ్‌తో ఎంసీజీలో 150వ వార్షికోత్సవ టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది.సౌతాఫ్రికాలో టెస్ట్‌ సిరీస్‌అక్టోబర్‌ 9-13: తొలి టెస్ట్‌, డర్బన్‌అక్టోబర్‌ 18-22: రెండో టెస్ట్‌, గ్వెబెర్హాఅక్టోబర్‌ 27-31: మూడో టెస్ట్‌, కేప్‌టౌన్‌ఈ పర్యటనలో ఆసీస్‌ మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 24 (డర్బన్‌), 27 (జోహనెస్‌బర్గ్‌), 30 (పోచెఫ్‌స్ట్రూమ్‌) తేదీల్లో జరుగుతాయి.ఇంగ్లండ్‌తో 150వ వార్షికోత్సవ టెస్ట్‌ 2027, మార్చి 11-15: ఏకైక టెస్ట్‌, ఎంసీజీఆసీస్‌లో న్యూజిలాండ్‌ పర్యటన.. భారత్‌లో ఆసీస్‌ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉంది.ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ దశలోనే వైదొలిగిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆ జట్టు పునఃదర్శనం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌తోనే ఉంటుంది. ఈ మధ్యలో ఆ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్‌, పాకిస్తాన్‌ లీగ్‌ తదితర ప్రైవేట్‌ లీగ్‌లతో పాటు దేశవాలీ టోర్నీల్లో ఆడతారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement