ప్రధాన వార్తలు
పునరావృతమా... ప్రతీకారమా...
రెండేళ్ల క్రితం టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్... ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 7 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచింది. అభిమానులెవరూ దీనిని మరచిపోలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఎనిమిది మ్యాచ్లు జరిగినా...వరల్డ్ కప్ లెక్కే వేరు. నాటి ఫైనల్ తర్వాత ఇప్పుడు రెండు టీమ్లు అదే వరల్డ్ కప్ అసలు మ్యాచ్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఫైనల్ కాని ఫైనల్ లాంటి మ్యాచ్లో 2024 ఫలితాన్ని భారత్ పునరావృతం చేస్తుందా లేక దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంటుందా ఆసక్తికరం.అహ్మదాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్లో భారత్ ఇప్పటికే నాలుగు మ్యాచ్లు ఆడింది. అన్నింటా గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించింది. కానీ ఎదురుపడిన జట్లు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ గట్టి ప్రత్యర్థులైతే కానే కావు. దాయాది పాకిస్తాన్ అయినా పోటీ ఇస్తుందనుకుంటే ఆ మూడింటి సరసనే నిలిచింది. ఈ నేపథ్యంలో ఆడిన అన్ని గెలిచాం. అజేయమని ఆదమరిస్తే మాత్రం టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ‘సూపర్ ఎయిట్స్’ దశలో భాగంగా నేడు (ఆదివారం) జరిగే పోరులో దక్షిణాఫ్రికాను భారత్ ఎదుర్కొంటుంది. దక్షిణాఫ్రికా కూడా తమ గ్రూప్లో ఆడిన నాలుగూ గెలిచి టాపర్గా ముందంజ వేసింది. బలాబలాలను బట్టి చూస్తే సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం. అభిషేక్ ‘జీరో’ నుంచి ‘హీరో’ అయ్యేనా... సూపర్ హిట్టర్, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత్ గంపెడాశలు పెట్టుకుంది. మెరుపులతో మురిపిస్తాడని, మ్యాచ్లను ఏకపక్షంగా మలిచేస్తాడని భావించింది. కానీ ఈ ప్రపంచకప్లోనే అభిషేక్ ఖాతా తెరువలేదు. అన్ని ‘జీరో’లే! భారత్ స్థాయికి తగని ప్రత్యర్థులతోనే అతను ఆడలేకపోవడం జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతుంది. నేడు దక్షిణాఫ్రికాతో కీలకమైన సూపర్ పోరులో అయినా ఖాతా తెరవాలని, సఫారీ బౌలింగ్పై మెరిపించాలని జట్టే కాదు యావత్ దేశం గట్టిగా కోరుకుంటుంది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు భారత్ ఈ మెగా ఈవెంట్లో గొప్ప మ్యాచ్ అయితే ఆడలేదు. అమెరికాతో జరిగిన పోరులో ఒకే ఒక్కడు సూర్యకుమార్ మెరిపించాడు. ఇంకెవరూ 30 పరుగులైనా చేయలేదు. నమీబియాలాంటి ప్రత్యరి్థపై కూడా ఆడింది ఇద్దరే! ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలు ఫిఫ్టీలు చేశారు. పాక్తో కీలకమైన పోరు జరిగినా దంచింది మాత్రం ఇషాన్ కిషన్ ఒక్కడే! నెదర్లాండ్స్తో జరిగిన ఆఖరి పోరులోనూ భారత ఇన్నింగ్ ఒక్కడి ఫిఫ్టీపైనే ఆధారపడింది. శివమ్ దూబే రాణించాడు. క్రికెట్ కూనలే ఎదురైనా, పాక్తో జాగ్రత్తగా ఆడాల్సివున్నా... ప్రతీ మ్యాచ్లో ఏ ఒకరో లేదంటే ఇద్దరో ఆడారు. ఇకపై కూడా ఎవరో ఒకరిద్దరు ఆడితే గెలిచేయొచ్చనుకుంటే భారత్ కథ ఈ సూపర్–8కే పరిమితమవుతుంది. స్పీడ్స్టర్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు భారత టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని ప్రతి మ్యాచ్లోనూ నిలబెడుతున్నారు. దుర్బేధ్యంగా దక్షిణాఫ్రికా ఈ ప్రపంచకప్లో గత ఫైనలిస్టు దక్షిణాఫ్రికా పట్టుదలతో ఆడింది. ప్రధాన బ్యాటర్లే కాదు.... లోయర్ మిడిలార్డర్లోనూ దంచేసిన ఆటగాళ్లున్నారు. అమెరికాపై 200 పైచిలుకు చేసిన సఫారీ... అఫ్గాన్పై 187/6 స్కోరు చేసింది. ఇక కివీస్పై అయితే 176 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఛేదించింది. యూఏఈని తక్కువ స్కోరు (122/6)కే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా 13.2 ఓవర్లలోనే ఛేదంచింది. కెప్టెన్మార్క్రమ్, డికాక్, రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్ ఇలా అందరూ ఫామ్లో ఉన్నారు. అంతకుమించి సమష్టిగా రాణిస్తున్నారు. ఏ ఒక్క మ్యాచ్లోనూ ఒకరిద్దరితో గెలిచిన సందర్బాలే లేవు. ఇక బౌలింగ్ బలం గురించి చెప్పాల్సిన పనిలేదు. రబడా, ఎన్గిడి, కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్, యాన్సెన్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించగలరు. పిచ్–వాతావరణం అహ్మదాబాద్ వికెట్ బ్యాటింగ్కే అనుకూలం. ప్రత్యేకించి టి20లైతే ధనాధన్ షో గ్యారంటీ. ఈ మైదానంలో ఛేదన సులువు కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. మ్యాచ్కు వర్షం ముప్పయితే లేదు. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ, అక్షర్ పటేల్, వరుణ్, బుమ్రా, అర్ష్ దీప్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, బాష్, రబడా, ఎన్గిడి, కేశవ్ మహరాజ్.
పాకిస్తాన్, న్యూజిలాండ్ ‘సూపర్–8’ మ్యాచ్ రద్దు
టి20 వరల్డ్ కప్ ‘సూపర్ ఎయిట్స్’ దశ పోటీలు వర్షం ప్రభావంతో మొదలయ్యాయి. గ్రూప్–2లో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. టాస్ నెగ్గిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత సమయానికే మ్యాచ్ ఆరంభమవుతున్నట్లు కనిపించిన దశలో ఒక్కసారిగా వాన ముంచెత్తింది. స్వల్పంగా చినుకులతో మొదలైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది.ప్రేమదాస స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా వాన తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సూపర్–8లో పాక్ తమ తర్వాతి మ్యాచ్లో మంగళవారం ఇంగ్లండ్తో... న్యూజిలాండ్ బుధవారం శ్రీలంకతో తలపడతాయి. నేటి సూపర్ – 8 మ్యాచ్లుశ్రీలంక X ఇంగ్లండ్వేదిక: పల్లెకెలె ; మ.3.00 గంటల నుంచి భారత్ X దక్షిణాఫ్రికావేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
మన మహిళలదే సిరీస్
అడిలైడ్: ఆస్ట్రేలియా గడ్డపై దశాబ్దం తర్వాత భారత మహిళల జట్టు టి20 సిరీస్ గెలిచింది. శనివారం జరిగిన ఆఖరి మూడో టి20లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 17 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలిచింది. తద్వారా ఓవరాల్ చాంపియన్షిప్లో పైచేయి సాధించింది. టాస్ నెగ్గిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (55 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఆటతో ఆసీస్ బౌలర్లపై చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 59; 4 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. ఆతిథ్య బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఓడింది. ఒక్క యాష్లే గార్డ్నర్ (45 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే పోరాడింది. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (3/22), శ్రీచరణి (3/32) ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశారు. చివరిసారిగా భారత అమ్మాయిల జట్టు 2016లో కంగారూ గడ్డపై టి20 సిరీస్ నెగ్గింది. ఇప్పుడు మూడు ఫార్మాట్ల (టి20, వన్డే, టెస్టు)లకు కలిపి ఓవరాల్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు, ఏకైక టెస్టు నెగ్గితే 4 పాయింట్ల ఆధారంగా ఓవరాల్ విజేతను ఖరారు చేస్తారు. దీంతో ఈ టి20ల్లో భారత్ 4–2 పాయింట్లతో పైచేయి సాధించింది. చెలరేగిన మంధాన ఆట మొదలైన మూడో ఓవర్లోనే షఫాలీ వర్మ (7) అవుటైంది. క్రీజులోకి వచి్చన జెమీమాతో కలిసి స్మృతి మంధాన కంగారూ బౌలర్ల భరతం పట్టింది. దీంతో పవర్ ప్లేలో భారత్ 54/1 స్కోరు చేసింది. స్మృతి జోరు కొనసాగడంతో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఆమెకిది 33వ అర్ధసెంచరీ కావడం విశేషం.మరోవైపు జెమీమా సైతం ధాటిగా పరుగులు సాధించడంతో ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఆతిథ్య బౌలర్లు ఎంతోసేపు శ్రమించాల్సివచ్చింది. ఎట్టకేలకు 17వ ఓవర్లో స్టార్ ఓపెనర్ మంధాన దూకుడుకు అనాబెల్ బ్రేకులేసింది. దీంతో రెండో వికెట్కు 121 పరుగుల భారీభాగస్వామ్యం ముగిసింది. చివర్లో హిట్టర్ రిచా ఘోష్ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా పరుగులు రాబట్టింది. గార్డ్నర్ పోరాటం వృథా భారత బౌలర్ల పవర్కు ఆసీస్ బ్యాటింగ్ ‘పవర్ ప్లే’ టాపార్డర్ కుదేలైంది. రెండో ఓవర్లోనే బౌలింగ్కు దిగిన శ్రేయాంక తన వరుస ఓవర్లలో జార్జియా వోల్ (10), ఎలైస్ పెరి (1)లను అవుట్ చేసింది. రేణుక... బెత్ మూని (6) పనిపట్టడంతో ఆస్ట్రేలియా ఒక దశలో టాపార్డర్ వికెట్లను కోల్పోయి 32/3 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఫోబ్ లిచ్ఫీల్డ్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), యాష్లే గార్డ్నర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఆంధ్ర లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి రెడ్డి (3/32), హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి (2/35)లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆసీస్ లక్ష్యానికి దూరమైంది. జట్టును గెలిపించేందుకు గార్డ్నర్ చేసిన పోరాటానికి అరుంధతి చెక్ పెట్టడంతోనే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది.
పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా శనివారం కొలంబో వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడింది.అయితే టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం ప్రారంభమైంది. మైదానం మొత్తం కవర్లతో కప్పేశారు. దాదాపు రెండున్నర గంటల నిరీక్షణ తర్వాత కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. సూపర్-8 గ్రూప్-2లో ఉన్న ఈ రెండు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. అయితే మొదటి మ్యాచే రద్దు కావడంతో, సెమీస్ చేరాలంటే తర్వాత జరగబోయే మ్యాచుల్లో ఇరు జట్లు కచ్చితంగా గెలవాల్సిందే. న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్లో బుధవారం శ్రీలంకతో తలపడనుంది. పాక్ విషయానికి వస్తే ఫిబ్రవరి 24న ఇంగ్లండ్తో ఆడనుంది.
ఆసీస్ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ మనదే
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పదిహేడు పరుగుల తేడాతో ఓడించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడేందుకు భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆసీస్ వుమెన్ టీమ్తో తొలి టీ20లో గెలుపొందిన భారత్.. రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.స్మృతి మంధాన ధనాధన్ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20 జరిగింది. అడిలైడ్ వేదికగా టాస్ గెలిచిన హర్మన్ సేన.. తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో స్మృతి మంధాన 55 బంతుల్లో 82 పరుగులతో ఇరగదీయగా.. షఫాలి వర్మ (7) విఫలమైంది. వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అర్ధ శతకం (59)తో సత్తా చాటగా రిచా ఘోష్ 18 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 2 పరుగులతో అజేయంగా నిలవగా.. అమన్జోత్ కౌర్ (1), దీప్తి శర్మ (1) రనౌట్ అయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్ 176 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ రెండు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, కెప్టెన్ సోఫీ మొలినెక్స్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.చెలరేగిన శ్రేయాంక, శ్రీచరణిఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 159 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఓపెనర్లు జార్జియా వోల్ (10), బెత్ మూనీ (6) సహా ఎలిస్ పెర్రీ (1) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోబే లిచిఫీల్డ్ (26) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆష్లే గార్డ్నర్ హాఫ్ సెంచరీ (57) చేసింది. కానీ మిగిలిన వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్, శ్రీచరణి తలా మూడు వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. అరుంధతి రెడ్డి రెండు, రేణుకా సింగ్ ఒక వికెట్ పడగొట్టారు. స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
వాళ్ల గురించే నా బాధంతా!: ఇచ్చిపడేసిన సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్కు తాము సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా తమ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకుంటామని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ఎలా ఉన్నా వ్యూహాలకు తగినట్లు ఆడటంలో తమ బ్యాటర్లు దిట్ట అని సూర్య అన్నాడు.కాగా వరల్డ్కప్ టోర్నీలో సూపర్-8 దశలో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. కాగా గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్లను గెలిచాయి భారత్, సౌతాఫ్రికా.ప్రతికూల అంశాలు ఇవేఅయితే, గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్లలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) డకౌట్ కావడం.. భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్లో తడబడటం వంటివి ప్రతికూలాంశాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్లతో కూడిన స్పిన్ దళంతో అటాక్ చేసే అవకాశం ఉంది.వాళ్ల గురించే నా బాధంతా!ఈ విషయాల గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా స్పందించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ సరిగ్గా ఆడటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో.. ఆ వ్యక్తుల గురించే నేను ఎక్కువగా వర్రీ అవుతున్నా.అతడిని ఎదుర్కొనే ప్రత్యర్థుల గురించే నా బాధంతా!.. గతేడాది అతడు అదరగొట్టాడు. తిరిగి ఫామ్ అందుకుంటాడు. ఇక మా జట్టులో ఓపెనర్లు తప్ప 3-8 మధ్య ప్రతీ బ్యాటర్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ 8-9 ఓవర్ల వరకు వికెట్ పడకపోతే.. శివం దూబే లేదంటే హార్దిక్ పాండ్యా టాప్నకు ప్రమోట్ అవుతారు.సమస్య లేదునాతో సహా జట్టులో ప్రతి ఒక్కరి బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంటుంది. రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ లేదంటే ఇంకెవరైనా బౌలింగ్ చేసినా వారిని ఎదుర్కోగల సత్తా మా వాళ్లకు ఉంది. కాబట్టి బౌలర్లు ఎవరన్న అంశంతో మాకు సంబంధం లేదు. మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తనకంటూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఎవరి గేమ్ప్లాన్ వారికి స్పష్టత ఉంది. కాబట్టి సమస్య లేదు’’ అని సూర్యకుమార్ యాదవ్ తన జట్టు పట్ల ఆత్మవిశ్వాసం కనబరిచాడు.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్!
ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదే: సౌతాఫ్రికా కోచ్
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు హెడ్కోచ్ షుక్రి కన్రాడ్ టీమిండియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ సేన ఒత్తిడిలో ఉందని.. ఇదే అదునుగా తాము ఆ జట్టు బలహీనతలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత జట్టు విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్-8కుఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలతో సత్తా చాటి.. సొంతగడ్డపై వరల్డ్కప్-2026లో హాట్ ఫేవరెట్గా టీమిండియా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్-8కు అర్హత సాధించింది. మరోవైపు.. సౌతాఫ్రికా సైతం వరుస విజయాలతో సూపర్-8కు దూసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య (IND vs SA) ఆదివారం అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగనుంది.ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదేఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కన్రాడ్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా వంటి జట్టు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆ జట్టుపై అంచనాలు భారీగా ఉంటాయి. స్క్రూటినీ కూడా ఎక్కువే. అందుకే వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతారు.సెమీ ఫైనల్.. ఆపై ఫైనల్ చేరాలనే ఒత్తిడి మిగతావారితో పోలిస్తే వారిపై ఒకింత ఎక్కువగానే ఉంటుంది. దానిని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఒత్తిడిలో బలహీనపడే ఆ జట్టుపై పైచేయి సాధించి.. వారి బలహీనతలను ప్రపంచానికి చూపిస్తాం’’ అని పేర్కొన్నాడు. అయితే, పటిష్ట టీమిండియాతో తలపడినపుడు తమపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. భారత్దే ఆధిపత్యంకాగా ఇటీవల సౌతాఫ్రికా భారత్లో పర్యటించింది. టీ20 సిరీస్లో టీమిండియా చేతిలో 3-1తో ఓడిపోయింది. అయితే, వరల్డ్కప్ వంటి టోర్నీలలో ఇలాంటి గత రికార్డుల ప్రభావం ఎక్కువగా ఉండదని కన్రాడ్ పేర్కొనడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్- సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఏడుసార్లు పోటీ పడగా.. టీమిండియా ఐదు, సౌతాఫ్రికా రెండుసార్లు గెలిచాయి.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్!
’నా వాడు.. ప్రపంచంలో అందరికంటే లక్కీ గర్ల్ నేనే’
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రేమలో మునిగితేలుతున్నాడు. భార్య నటాషా స్టాంకోవిక్తో విడిపోయిన ఈ బరోడా క్రికెటర్కు మహీక శర్మ రూపంలో కొత్త ప్రేమ దొరికింది. గతేడాది తమ బంధాన్ని బహిర్గతం చేసిన హార్దిక్- మహీక అప్పటి నుంచి రొమాంటిక్ పోస్టులతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.ప్రస్తుతం హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్తో బిజీగా ఉన్నాడు. ఆల్రౌండ్ ప్రతిభతో రాణిస్తూ టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న హార్దిక్.. ప్రియురాలు మహీక పుట్టినరోజును ఇటీవల ఘనంగా సెలబ్రేట్ చేశాడు.నా రాజకుమారికి హ్యాపీ బర్త్డేపాకిస్తాన్తో మ్యాచ్ కోసం తనతో పాటు మహీకను శ్రీలంకకు తీసుకువెళ్లిన హార్దిక్.. అక్కడ ఓ స్విమింగ్ పూల్లో ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘నా రాజకుమారికి హ్యాపీ బర్త్డే’’ అంటూ విషెస్ తెలిపాడు. ‘‘25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు.నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తివి నువ్వే. నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను’’ అని హార్దిక్ పాండ్యా గర్ల్ఫ్రెండ్పై ప్రేమను కురిపించాడు. ఇందుకు మహీక శర్మ సైతం తనదైన శైలిలో బదులిచ్చింది. నా వాడు.. ప్రపంచంలో అందరికంటే లక్కీ గర్ల్ నేనేహార్దిక్తో కలిసి దిగిన ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఐ లవ్ మై మ్యాన్. నా జీవితంలో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమైన పుట్టినరోజు. థాంక్యూ బేబీ. ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతురాలైన అమ్మాయిని నేనే’’ అంటూ హార్దిక్తో దిగిన ఫొటోలను షేర్ చేసింది.కొడుకు సమక్షంలో మరోసారి పెళ్లికాగా సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించిన హార్దిక్ పాండ్యా.. 2020లో సన్నిహితుల నడుమ ఆమెను పెళ్లిచేసుకున్నాడు. అప్పటికే నటాషా గర్భవతి. అదే ఏడాది ఈ జంట కుమారుడు అగస్త్యకు జన్మనిచ్చింది. అనంతరం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, కొంతకాలానికే హఠాత్తుగా విడాకుల బాంబు పేల్చారు. 2025 జూలైలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.ఆ తర్వాత కొన్నాళ్లకే మహీకతో 32 ఏళ్ల హార్దిక్ తన ప్రేమ బంధాన్ని చాటుకుంటూ విహారయాత్రలలో దిగిన ఫొటోలు షేర్ చేయడం మొదలుపెట్టాడు. కాగా మహీక ఫిబ్రవరి 19న 25వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన డ్రెస్ ధర అక్షరాలా రెండు లక్షలు ఉండటం గమనార్హం. కాగా మహీక ఓ మోడల్ అన్న సంగతి తెలిసిందే. చదవండి: ఆయన ముసలోడు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!
NZ vs PAK: పాక్, కివీస్లకు బ్యాడ్న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో ఎనిమిది జట్లు ముందడుగు వేశాయి. మిగిలిన పన్నెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. టాప్-8 జట్లతో కీలకమైన సూపర్-8 దశకు శనివారం తెరలేవనుంది.తొలి మ్యాచ్లో కివీస్- పాక్ ఢీసెమీస్ రేసులో భాగంగా గ్రూప్-2 నుంచి తొలుత న్యూజిలాండ్- పాకిస్తాన్ (NZ vs PAK) మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇందుకు శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్. ప్రేమదాస స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ మొదలుకావాల్సి ఉంది.అయితే, కివీస్- పాక్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇటీవల గ్రూప్-బి నుంచి పల్లెకెలెలో జింబాబ్వే- ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాన కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. తాజాగా న్యూజిలాండ్- పాకిస్తాన్ మ్యాచ్కు కూడా ఇదే తరహా అనుభవం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.పొంచి ఉన్న వాన ముప్పుఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. కొలంబోలో శనివారం వర్షం పడేందుకు 80- 100 శాతం అవకాశాలు ఉన్నాయి. పగలు 75 శాతం.. రాత్రి 87 శాతం వాన కురిసేందుకు ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రాత్రి ఉరుములతో కూడిన వర్షం పడేందుకు 52 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్ పేర్కొంది.మ్యాచ్ రద్దైతే గనుకఇక కివీస్- పాక్ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు మొదలుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం వల్ల మ్యాచ్ గనుక రద్దైపోతే ఇరుజట్లకు ఎదురుదెబ్బ తగిలినట్లే. సూపర్-8 మ్యాచ్లకు రిజర్వ్డే లేదు కాబట్టి.. మ్యాచ్ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో తదుపరి మిగిలిన రెండు మ్యాచ్లలో తప్పక గెలవాల్సి ఉంటుంది.కాగా సూపర్-8లో గ్రూప్-1 నుంచి భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా తలపడుతుండగా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీలో ఉన్నాయి. సూపర్-8లో తొలి మ్యాచ్లో పరస్పరం తలపడుతున్న కివీస్, పాక్... తదుపరి శ్రీలంక, ఇంగ్లండ్లతో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది.ఒక్క మ్యాచ్ ఫలితం తేడా వచ్చినా ఇందులో భాగంగా పాకిస్తాన్ ఫిబ్రవరి 24న లండ్తో, ఫిబ్రవరి 28న శ్రీలంకతో.. న్యూజిలాండ్ ఫిబ్రవరి 25న శ్రీలంకతో, ఫిబ్రవరి 27న ఇంగ్లండ్తో తలపడతాయి. సెమీస్ రేసులో ఒక్క మ్యాచ్ ఫలితం తేడా వచ్చినా భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి శనివారం నాటి మ్యాచ్లో తప్పక గెలవాలని అటు న్యూజిలాండ్.. ఇటు పాకిస్తాన్ పట్టుదలగా ఉండగా.. ఫలితం వరుణుడి మీద ఆధారపడి ఉంది.ఫామ్ పరంగా దొందూ దొందేఇదిలా ఉంటే.. కివీస్ జట్టులో టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ మాత్రమే ఇప్పటి వరకు సత్తా చాటారు. మిగిలిన వారి నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సి ఉంది. మరోవైపు.. తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరగడం పాకిస్తాన్కు సానుకూలాంశంగా పరిణమించింది. కొలంబో పిచ్పై వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. శనివారం నాటి మ్యాచ్లో కివీస్ బ్యాటర్లు కోసం ఇప్పటికే పాక్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈసారి కూడా పాక్ స్పిన్ దళాన్నే నమ్ముకోనుంది. అయితే, పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ మినహా మరెవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ప్రతికూల అంశం. కాబట్టి ఫామ్ పరంగా ప్రస్తుతం కివీస్- పాక్ ఉజ్జీలుగానే ఉన్నాయని చెప్పవచ్చు.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్!
T20 WC: ఘోర పరాభవం.. స్పందించిన ఆసీస్ కెప్టెన్
మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చేదు అనుభవం ఎదురైంది. గ్రూప్ దశలోనే ‘పటిష్ట’ ఆసీస్ ఇంటిబాట పట్టింది. తొలుత ఐర్లాండ్పై గెలిచినా.. అదే జోరు కొనసాగించలేకపోయిన కంగారూలు.. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోయారు. ఫలితంగా సూపర్-8 చేరకుండానే నిష్క్రమించిన ఆసీస్.. లీగ్ దశలో చివరగా పసికూన ఒమన్ను ఓడించి విజయంతో ముగించింది.ఇదొక చేదు అనుభవంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. ఈసారి తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని.. భారమైన హృదయాలతో ఇంటిబాట పడుతున్నట్లు వెల్లడించాడు. ‘‘సూపర్-8 చేరే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాం. మా డ్రెసింగ్రూంలో నిరాశపూరిత వాతావరణం నెలకొంది. ఇదొక చేదు అనుభవం.దురదృష్టవశాత్తూ మేము గత రెండు మ్యాచ్లలో ఓడిపోయాము. అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయాము. అదే సమయంలో ప్రత్యర్థులు.. ముఖ్యంగా జింబాబ్వే అద్భుతంగా ఆడింది. ఆ జట్టు చేతిలో ఓడిపోగానే మాపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ విషయంలో వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే.గుణపాఠం నేర్చుకుంటాముఇక్కడి పిచ్ పరిస్థితులను ఎంతమాత్రం నిందించలేము. అన్నింటికీ మేము సన్నద్ధమయ్యే ఇక్కడికి వచ్చాము. మిగతా జట్ల మాదిరే రెండేళ్లుగా మా జట్టు నిర్మాణం జరుగుతోంది. కానీ కీలక సమయంలో మేము వెనకపడ్డాము. ఈ చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుంటాము.క్రికెట్ ఆస్ట్రేలియా యాజమాన్యం ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తుంది. విఫలమైనపుడు నిరాశ సహజం. అయితే, స్వదేశానికి వెళ్లిన తర్వాత అంతా కూర్చుని లోపాల గురించి చర్చించుకుంటాము. నిజాయితిగా మా తప్పులను విశ్లేషించుకుంటాము. చాలా బాధగా ఉందిఏదేమైనా చాలా బాధగా ఉంది. నిరాశా, నిస్పృహలు కమ్ముకున్నాయి. అయితే, సానుకూల దృక్పథంతో మేము ముందడుగు వేసి తిరిగి పుంజుకుంటాము’’ అని మిచెల్ మార్ష్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కాగా పల్లెకెలె వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఒమన్పై జయభేరి మోగించింది. ఆడమ్ జంపా (4/21), మ్యాక్స్వెల్ (2/13), బార్ట్లెట్ (2/27), స్టొయినిస్ (2/16), ఎలిస్ (1/14) ఇలా... బౌలింగ్ దళమంతా కలిసి ఒమన్ బ్యాటర్లను దెబ్బకొట్టింది.మిచెల్ మార్ష్ ధనాధన్ముందుగా ఒమన్ జట్టు 16.2 ఓవర్లలోనే 104 పరుగులకే కుప్పకూలింది. వసీమ్ అలీ (32; 4 ఫోర్లు) రాణించాడు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఆ్రస్టేలియా 9.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (33 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), హెడ్ (19 బంతుల్లో 32; 6 ఫోర్లు) చెలరేగి తొలి వికెట్కు 8.1 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్!
బెల్జియం చేతిలో భారత్ ఓటమి
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భారత జట్టుక...
సూపర్ స్నేహిత్...
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చె...
మన ముకేశ్ గురి బంగారం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ జూనియర్...
నేటి నుంచి ఐఎస్ఎల్
కోల్కతా: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నెలలపాటు క...
ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదే: సౌతాఫ్రికా కోచ్
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు హెడ్కోచ్ షుక్రి కన్రా...
’నా వాడు.. ప్రపంచంలో అందరికంటే లక్కీ గర్ల్ నేనే’
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్...
NZ vs PAK: పాక్, కివీస్లకు బ్యాడ్న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన...
T20 WC: ఘోర పరాభవం.. స్పందించిన ఆసీస్ కెప్టెన్
మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్-2026 ...
క్రీడలు
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
వీడియోలు
టీ20 ప్రపంచ కప్ లో నేడు కీలక మ్యాచ్
ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
భారత్ కు మహాశివరాత్రి.. పాక్ కు కాళరాత్రి...
కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
