Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sam Curran to lead MI London in The Hundred 2026, Franchise confirm 3 pre auction signings1
ముంబై ఇండియన్స్‌లోకి కొత్తగా ఇంగ్లండ్‌ స్టార్‌.. కెప్టెన్‌ కూడా అతడే..!

ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీలోకి కొత్తగా మరో ముగ్గురు చేరారు. ది హండ్రెడ్ లీగ్‌ 2026 ఎడిషన్‌ కోసం ఎంఐ లండన్ ఫ్రాంచైజీ (మునుపటి ఓవల్ ఇన్విన్సిబుల్స్) ఇంగ్లండ్‌ ప్లేయర్లు సామ్‌ కర్రన్‌ , విల్‌ జాక్స్‌, డ్యానీ వ్యాట్‌-హాడ్జ్‌ (మహిళ)ను ప్రీ-ఆక్షన్ సైనింగ్స్‌గా ఎంపిక చేసుకుంది. వీరిలో సామ్‌ కర్రన్‌ను ఎంఐ లండన్ పురుషుల జట్టు కెప్టెన్‌గానూ ప్రకటించింది. గత సీజన్‌ వరకు ఈ ఫ్రాంచైజీకి సామ్‌ బిల్లంగ్స్‌ సారథ్యం వహించాడు. బిల్లంగ్స్‌ నాయకత్వంలో నాటి ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ (ప్రస్తుత ఎంఐ లండన్‌) 2023–2025 మధ్యలో వరుసగా మూడు టైటిళ్లు గెలిచించి. అయినా యాజమాన్యం బిల్లింగ్స్‌ను మార్చి సామ్‌ కర్రన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఎంఐ లండన్‌ ఫ్రాంచైజీ అంబానీల (ముకేశ్‌, నీతా) యాజమాన్యంలో నడిచే ముంబై ఇండియన్స్‌కు (ఐపీఎల్‌) సిస్టర్‌ ఫ్రాంచైజీ. ప్రపంచవాప్తంగా చాలా లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఐపీఎల్‌, WPLలో ముంబై ఇండియన్స్‌ కాగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌, ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌, మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్‌, హండ్రెడ్‌ లీగ్‌లో ఎంఐ లండన్‌ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీలో భాగంగా ఉన్నాయి. హండ్రెడ్‌ లీగ్‌లో కొత్తగా ఎంపికైన తమ కెప్టెన్‌ సామ్‌ కర్రన్‌ను ముంబై ఇండియన్స్‌ సాదరంగా తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించింది. అలాగే జాక్స్‌, డానీకి కూడా వెల్‌కమ్‌ చెప్పింది. హండ్రెడ్‌ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ప్రస్తుతం ఎంఐ లండన్‌) మొత్తంగా ఐదు టైటిళ్లు సాధించింది. ఇందులో పురుషుల విభాగంలో 3.. మహిళల విభాగంలో 2 టైటిళ్లు ఉన్నాయి.కాగా, హండ్రెడ్‌ లీగ్‌ 2026 ఎడిషన్‌ జులై 21 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆగస్ట్‌ 16 వరకు సాగే ఈ టోర్నీ కోసం జనవరి చివరి వరకు నాలుగు ముందస్తు వేలం ఒప్పందాలు (అన్ని ఫ్రాంచైజీలకు) అనుమతించబడతాయి. వీటిలో గరిష్టంగా మూడు ప్రత్యక్ష ఒప్పందాలు కావచ్చు. వీరిలో ఒకరు వారివారి జాతీయ జట్లతో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగి ఉండాలి. కనీసం ఒకరిని (ఎవరైనా) రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఎంఐ లండన్‌ లాగే హండ్రెడ్‌ లీగ్‌లోని మిగతా ఫ్రాంచైజీలు (బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్, సన్‌రైజర్స్ లీడ్స్, ట్రెంట్ రాకెట్స్, సదరన్ బ్రేవ్, వెల్ష్ ఫైర్) కూడా ప్రీ-ఆక్షన్ సైనింగ్స్‌ చేసుకుంటున్నాయి.

Paarl Royals needed 2 from 1 balls, Sikander Raza won the match win a six2
సంచలన ప్రదర్శన.. గర్జించిన సికందర్‌ రజా

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో నిన్న (జనవరి 13) ఓ రసవతర్త సమరం జరిగింది. పార్ల్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌, జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్‌ సికందర్‌ రజా చివరి బంతికి సిక్సర్‌ బాది తన జట్టును గెలిపించాడు. 2 పరుగులు అవసరమైన తరుణంలో రజా ఊహించని విధంగా బౌలర్‌ డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ డేవిడ్‌ వీస్‌పై ఎదురుదాడి చేశాడు. డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా ఫ్లాట్‌ సిక్సర్‌ బాదాడు. అనంతరం సింహగర్జన చేస్తూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న రూబిన్‌ హెర్మన్‌ను హత్తుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హెర్మన్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి రాయల్స్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.SIKANDAR RAZA, THE FINISHER OF PAARL ROYALS 🥶- He smashed an iconic six when they needed 2 from the final ball. pic.twitter.com/SrjGLFL31e— Johns. (@CricCrazyJohns) January 14, 2026వాస్తవానికి చివరి ఓవర్‌కు ముందు రాయల్స్‌ గెలుపుకు కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి. అయితే వీస్‌ అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్స్‌ గెలుపును చివరి బంతి వరకు అడ్డుకున్నాడు. వీస్‌ తొలి 5 బంతుల్లో కేవలం​ 4 పరుగులు మాత్రమే ఇచ్చి రాయల్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఓ దశలో వీస్‌ రాయల్స్‌ గెలుపును అడ్డుకునేలా కనిపించాడు. అయితే రజా సంచలన ప్రదర్శనతో రాయల్స్‌కు అపురూపమైన విజయాన్నందించాడు. ఈ గెలుపుతో రాయల్స్‌ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. టాప్‌ ప్లేస్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ ఉంది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స​, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.స్కోర్‌ను పరిశీలిస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌.. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ (66), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (32 నాటౌట్‌) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రాయల్స్‌ బౌలర్లలో ముజీబ్‌ 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేసి సత్తా చాటాడు.అనంతరం డాన్‌ లారెన్స్‌ (63), రూబిన్‌ హెర్మన్‌ (65 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేసి, రాయల్స్‌ గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో సికందర్‌ రజా (27 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Danish Shuttler Alleges Unsanitary Conditions At India Open, Badminton3
ఇదేం టోర్నీ.. ఇదేం నిర్వాకం!

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నిర్వహణ పట్ల డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లిచ్‌ఫీల్డ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ‘ఇలాంటి అనారోగ్యకర వాతావరణంలో, ప్రొఫెషనల్‌ ప్లేయర్లు పోటీపడే టోర్నీని నిర్వహిస్తారా? ఇండియా ఓపెన్‌ సూపర్‌–750 స్థాయి టోర్నీని నిర్వహించే వేదిక ఇంత చెత్తగా ఉంటుందా?’ అని బ్లిచ్‌ఫీల్డ్‌ నిలదీసింది. ఈ నిర్వాకంపై వెంటనే ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) జోక్యం చేసుకొని ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందే పరిస్థితుల్ని చక్కదిద్దాలని కోరింది. ఢిల్లీలోని కేడీ జాదవ్‌ స్టేడియంలో ఈ ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌ జరగనుంది. 17 ఏళ్ల తర్వాత మనకు దక్కిన ఈ ఆతిథ్య భాగ్యం కోసం కేడీ జాదవ్‌ స్టేడియాన్ని నవీకరిస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రస్తుత ఇండియా ఓపెన్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందిరా గాంధీ స్టేడియం దుమ్ము ధూళితో కూరుకుపోయిందని, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే వాతావరణం అక్కడ ఏమాత్రం లేనేలేదని, షట్లర్లు సరిగ్గా వార్మప్‌ చేసుకునే పరిస్థితి కూడా లేదని డెన్మార్క్‌ అమ్మాయి తీవ్రస్థాయిలో భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌)పై విరుచుకుపడింది. గతేడాది ఆమె ఇండియా ఓపెన్‌ను కేడీ జాదవ్‌ స్టేడియంలో ఆడింది. ఇప్పుడు వేరే వేదికకు మార్చడం పట్ల మెరుగైన స్టేడియం అయి ఉంటుందని ఆశించానని, కానీ దానికంటే మరింత ఘోరంగా ఇందిరాగాంధీ స్టేడియం ఉందని విమర్శించింది. గతేడాది కూడా ఆమె సౌకర్యాలు, వేదికపై ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మెరుగైందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఏమాత్రం మారలేదు. మెరుగు అనే మాటే లేదు. అప్పుడు ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే ఉంది’ అని బ్లిచ్‌ఫీల్డ్‌ ‘బాయ్‌’ అధికారుల తీరుపై మండిపడింది.

Mumbai Indians defeated Gujarat Giants by 7 wickets in WPL4
హర్మన్‌ప్రీత్‌ తడాఖా

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ రెండో విజయం అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ముంబై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై నెగ్గింది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన గుజరాత్‌కు లీగ్‌లో తొలి పరాజయం ఎదురైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జార్జియా వేర్‌హమ్‌ (33 బంతుల్లో 43 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌.బెత్‌ మూనీ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కనిక (18 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారతి (15 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆఖర్లో మెరిపించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దంచికొట్టిన సోఫీ డివైన్‌ (8) ఈసారి విఫలమైంది. జార్జియా, భారతి అబేధ్యమైన ఆరో వికెట్‌కు 24 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. ఈ జోడీ చివరి రెండు ఓవర్లలో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు రాబట్టడం విశేషం. ముంబై బౌలర్లలో షబ్నమ్, హేలీ మాథ్యూస్, నికోలా కేరీ, అమెలియా కెర్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం ముంబై ఇండియన్స్‌ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (43 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా... అమన్‌జ్యోత్‌ కౌర్‌ (26 బంతుల్లో 40; 7 ఫోర్లు), నికోలా కేరీ (23 బంతుల్లో 38 నాటౌట్‌; 6 ఫోర్లు) ఆమెకు అండగా నిలిచారు. గుజరాత్‌ జెయింట్స్‌ బౌలర్లలో రేణుక, కాశ్వీ, సోఫీ డివైన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ముంబై జట్టు అదరక బెదరక ఎదురు నిలిచింది. ఓపెనర్లు కమలిని (13), హేలీ మాథ్యూస్‌ (22) ఎక్కువసేపు నిలవలేకపోయినా... హర్మన్‌ జట్టును ముందుండి నడిపించింది. అమన్‌జ్యోత్‌తో కలిసి మూడో వికెట్‌కు 44 బంతుల్లో 72 పరుగులు... నాలుగో వికెట్‌కు నికోలాతో 43 బంతుల్లోనే 84 పరుగులు జత చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. చివరి ఓవర్‌ రెండో బంతికి ఫోర్‌ కొట్టి జట్టును గెలిపించింది. డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కు ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన కాగా... ఈ మ్యాచ్‌ ద్వారా హర్మన్‌ లీగ్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి అండ్‌ బి) కెర్‌ 33; సోఫీ డివైన్‌ (సి) కమిలిని (బి) షబ్నిమ్‌ 8; కనిక (సి) నికోలా (బి) హేలీ 35; గార్డ్‌నర్‌ (ఎల్బీ) (బి) నికోలా 20; జార్జియా (నాటౌట్‌) 43; ఆయుషి (రిటైర్డ్‌ అవుట్‌) 11; భారతి (నాటౌట్‌) 36; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు)192. వికెట్ల పతనం: 1–22, 2–64, 3–97, 4–99, 5–136.బౌలింగ్‌: షబ్నమ్ 4–0–25–1; హేలీ మాథ్యూస్‌ 3–0–34–1; నికోలా కేరీ 4–0–36–1; అమెలియా కెర్‌ 4–0–40–1; అమన్‌జ్యోత్‌ కౌర్‌ 4–0–48–0; సంస్కృతి 1–0–5–0. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: కమలిని (స్టంప్డ్‌) మూనీ (బి) రేణుక 13; హేలీ (సి) డివైన్‌ (బి) కాశ్వి 22; అమన్‌జ్యోత్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) డివైన్‌ 40; హర్మన్‌ప్రీత్‌ (నాటౌట్‌) 71; నికోలా కేరీ (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.2 ఓవర్లలో 3 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–20, 2–37, 3–109. బౌలింగ్‌: రేణుక 4–0–39–1; కాశ్వి 4–0–33–1; రాజేశ్వరి 2–0–22–0; సోఫీ డివైన్‌ 3.2–0–29–1; జార్జియా 2–0–23–0; తనూజ 3–0–29–0, గార్డ్‌నర్‌ 1–0–10–0.

India vs New Zealand 2nd ODI on January 14: India aims to seal the ODI series against New Zealand5
సిరీస్‌ సొంతం చేసుకోవాలని...

రాజ్‌కోట్‌: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత క్రికెట్‌ జట్టు... నేడు న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. టీమిండియాను గాయాల బెడద వెంటాడుతున్నా... విరాట్‌ కోహ్లి సూపర్‌ ఫామ్‌ జట్టుకు కలిసి రానుంది. సిరీస్‌ ప్రారంభానికి ముందే రిషభ్‌ పంత్‌ గాయపడగా... తొలి మ్యాచ్‌ సందర్భంగా వాషింగ్టన్‌ సుందర్‌కు పక్కటెముకల గాయమైంది. దీంతో ఈ ఇద్దరూ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యారు.సుందర్‌ స్థానంలో ఆయుశ్‌ బదోనీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో స్థానం కోసం అతడు ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డితో పోటీ పడాల్సి ఉంది. స్టార్‌ పేసర్‌ బుమ్రా అందుబాటులో లేకపోయినా... గత మ్యాచ్‌లో మన పేసర్లు ఆకట్టుకున్నారు. కానీ స్పిన్నర్లే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మరి ఈ మ్యాచ్‌లో మన స్పిన్‌ బలగం ఆ లోటును పూడుస్తుందా చూడాలి. మరోవైపు తొలి వన్డేలో కొన్నిసార్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ దాన్ని చివరి వరకు కొనసాగించడంలో విఫలమైన న్యూజిలాండ్‌ జట్టు... తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్‌ను సమం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. పిచ్‌ అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించనుంది. ఆ ఇద్దరే అసలు బలం... టి20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న రోహిత్‌ శర్మ, కోహ్లినే టీమిండియాకు ప్రధాన బలం. గత మ్యాచ్‌లో విరాట్‌ త్రుటిలో శతకం చేజార్చుకోగా... రోహిత్‌ శర్మ క్రీజులో ఉన్నంతసేపు తన షాట్‌లతో మెరిపించాడు. ఈ జోడీ మరోసారి చెలరేగితే... కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్, వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా తొలి వన్డేలో చక్కటి ఇన్నింగ్స్‌లతో కదంతొక్కారు.టీమిండియా ఆడిన గత సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన గిల్‌... హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా... స్పిన్‌ బౌలింగ్‌ను బాగా ఆడగల శ్రేయస్‌ ఒక పరుగుతో అర్ధశతకానికి దూరమయ్యాడు. ఐదో స్థానంలో కుదురైన బ్యాటర్‌ కనిపించడం లేదు. సుందర్‌ స్థానంలో బదోనీ, నితీశ్‌లో ఒకరికి స్థానం దక్కుతుందా లేక ధ్రువ్‌ జురేల్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడిస్తారా చూడాలి. హైదరాబాదీ సిరాజ్‌తో కలిసి అర్‌‡్షదీప్‌ సింగ్, హర్షిత్‌ రాణా పేస్‌ భారాన్ని మోయనుండగా... రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. సమం చేయాలని... గత మ్యాచ్‌లో తొలి వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ... ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించడంలో కివీస్‌ విఫలమైంది. కాన్వే, నికోల్స్‌ జట్టుకు శుభారంభాన్ని అందించినా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చినవాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. మిచెల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్‌ జట్టులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విల్‌ యంగ్, గ్లెన్‌ ఫిలిప్స్, హే, బ్రేస్‌వెల్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఆరున్నర అడుగుల పొడగరి జేమీసన్‌ సత్తా చాటుతుండగా... ఫోల్‌్క్స, క్లార్క్‌ కీలకం కానున్నారు. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత సంతతి లెగ్‌ స్పిన్నర్‌ ఆదిత్య అశోక్‌పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. తుది జట్లు (అంచనా) భారత్‌: గిల్‌ (కెప్టెన్‌), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, నితీశ్‌ రెడ్డి/ఆయుశ్‌ బదోనీ, జడేజా, హర్షిత్‌ రాణా, కుల్దీప్, అర్‌‡్షదీప్, సిరాజ్‌. న్యూజిలాండ్‌: బ్రేస్‌వెల్‌ (కెప్టెన్‌), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జెమీసన్, ఫోల్‌్క్స, ఆదిత్య అశోక్‌.1. రాజ్‌కోట్‌లోని నిరంజన్‌ షా స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచింది (2020లో ఆ్రస్టేలియాపై). మూడింటిలో (2013లో ఇంగ్లండ్‌ చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2023లో ఆస్ట్రేలియా చేతిలో) ఓడిపోయింది.

Bharti Fulmali smashes 36 from 15 to take Gujarat to 1926
గుజరాత్‌ బ్యాటర్లు విధ్వంసం.. ముంబై మందు భారీ టార్గెట్‌

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌-2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ జెయింట్స్ బ్యాట‌ర్లు త‌మ సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా న‌వీ ముంబై వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. గత రెండు మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించిన సోఫీ డివైన్.. ముంబైపై మాత్రం నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి డివైన్ ఔటైంది.అయితే జార్జియా వేర్‌హామ్(33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43), భారతి ఫుల్మాలి(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) మెరుపులు మెరిపించారు. వీరిద్దరితో పాటు మూనీ(33), కనిక అహుజా(35) రాణించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్‌, హీలీ మాథ్యూస్‌, అమీలియా కేర్‌, కారీ తలా వికెట్‌ సాధించారు.చదవండి: T20 World Cup: ఆస్ట్రేలియాకు మ‌రో భారీ షాక్‌..

Another injury scare for Australia7
ఆస్ట్రేలియాకు మ‌రో భారీ షాక్‌..

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు జోష్ హాజిల్‌వుడ్‌, ప్యాట్ కమ్మిన్స్‌, టిమ్ డేవిడ్ గాయాలతో బాధపడుతుండగా.. ఇప్పుడు ఈ జాబితాలో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ చేరాడు. బిగ్ బాష్ లీగ్ 2025-26లో భాగంగా మంగళవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిష్( మెల్‌బోర్న్ స్టార్స్) గాయపడ్డాడు.ఏమి జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో మొదట ‍బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ 20 బంతుల్లో 23 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.అయితే విజయానికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో.. జేమీ ఓవర్టన్ వేసిన ఓ రకాసి బౌన్సర్ స్టోయినిస్ కుడి చేతి బొటనవేలుకు బలంగా తగిలింది. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిన మార్కస్‌.. ఫిజియో సూచనతో 'రిటైర్డ్ అవుట్'గా వెనుదిరిగాడు.అతడిని మ్యాచ్ అనంతరం స్కాన్‌కు తరలించారు. అతడి గాయంపై అప్‌డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికి మెగా టోర్నీకి ముందు స్టార్ ప్లేయర్లు గాయపడడం ఆసీస్ మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.టీ20 ప్రపంచకప్‌-2026కు ఆసీస్‌ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాచదవండి: 'భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు'.. మారని బంగ్లాదేశ్‌ వైఖరి

Bangladesh refuse to reconsider stance on relocation of T20 World Cup 2026 matches despite ICCs request8
'భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు'.. మారని బంగ్లాదేశ్‌ వైఖరి

టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌లో మ్యాచ్‌లు ఆడే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తన పట్టు వీడటం లేదు. మంగళవారం ఐసీసీతో జరిగిన స‌మావేశంలోనూ టోర్నమెంట్ కోసం భారత్‌కు వెళ్లకూడదని తమ నిర్ణయాన్ని బీసీబీ పునరుద్ఘాటించింది.భద్రతా కారణాలను సాకుగా చూపుతూ త‌మ జ‌ట్టును భార‌త్‌కు పంప‌బోమ‌ని, తమ మ్యాచ్‌లను శ్రీలంక లేదా మరేదైనా ఇతర వేదిక‌కు మార్చాలని మ‌రోసారి బీసీబీ డిమాండ్ చేసింది. అయితే షెడ్యూల్ ఇప్పటికే ఖ‌రారు కావ‌గ‌డంతో ఆఖ‌రి నిమిషంలో వేదికలను మార్చడం అసాధ్యమని, బీసీబీ తన వైఖరి పునఃపరిశీలించుకోవాలని ఐసీసీ విజ్ఞప్తి చేసింది. కానీ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఆఖ‌రి నిమిషం వ‌ర‌కు త‌మ చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని, ఆట‌గాళ్లు భ‌ద్ర‌త త‌మ‌కు ముఖ్య‌మ‌ని బీసీబీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.కాగా భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య గ‌త కొంత కాలంగా దౌత్య‌ప‌ర‌మైన ఉద్రిక్త‌లు నెల‌కొన్నాయి. అయితే బంగ్లా పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయ‌డంతో మ‌రింత పెరిగాయి. ఐపీఎల్‌-2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ కొనుగోలు చేసింది.అయితే బంగ్లాలో హిందువుల‌పై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండ‌డంతో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి త‌ప్పించాల‌ని చాలామంది డిమాండ్ చేశారు. దీంతో అత‌డిని జ‌ట్టు నుంచి రిలీజ్ చేయాల‌ని కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించింది. దీంతో అత‌డిని కేకేఆర్ విడుద‌ల చేసింది.ఈ క్ర‌మంలో త‌మ జ‌ట్టు ఆట‌గాడిని రిలీజ్ చేయ‌డాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు ఘోర అవ‌మానంగా భావించింది. దీంతో వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌ల‌ను ఆడేందుకు భార‌త్‌కు త‌మ జ‌ట్టును పంప‌బోమ‌ని, వేదిక‌ల‌ను మార్చాల‌ని ఐసీసీని బీసీబీ డిమాండ్ చేసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ ప్ర‌సారాల‌ను త‌మ దేశంలో బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే, టోర్నమెంట్ రూల్స్ ప్రకారం వారు పాయింట్లు కోల్పోయే అవకాశం ఉందిచదవండి: IND vs NZ: భారత జట్టులోకి అనూహ్య ఎంట్రీ.. బదోని ఎంపికకు గల కారణాలివే?

why India picked Ayush Badoni to replace Washington Sundar vs New Zealand9
భారత జట్టులోకి అనూహ్య ఎంట్రీ.. బదోని ఎంపికకు గల కారణాలివే?

ఢిల్లీ స్టార్ బ్యాట‌ర్ అయూశ్ బదోని తన చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. 26 ఏళ్ల బదోని భారత తరపున అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా వైదొలగడంతో అనుహ్యంగా బదోనికి సెలెక్టర్లు పిలుపునిచ్చారు.అయితే బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో బదోని డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. వాషీ స్ధానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అతడిని తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. నితీశ్ కుమార్ రెడ్డి మరో ఆల్‌రౌండర్‌గా ఉన్నప్పటికి.. బదోని వైపే టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్‌, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ ఎలాగో తుది జట్టులో ఉంటారు. స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్‌, జడేజా ఇద్దరు మాత్రమే ఉన్నారు. బ్యాకప్‌గా మరొక స్పిన్ అప్షన్‌(బదోని) ఉంటే బెటర్ అని గంభీర్ అండ్ కో భావిస్తుందంట.బదోని సెలక్షన్ వెనుక కారణాలు ఇవే..అయితే అనుహ్యంగా బదోనిని జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. కానీ టీమ్ మేనెజ్‌మెంట్‌, సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచడానికి బలమైన కారణాలు ఉన్నాయి. బదోనికి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా అతడికి ఉంది.ఢిల్లీ తరపున నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత జట్టుకు సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరమని భావించిన గంభీర్.. బదోనిని రికమెండ్ చేశాడు. అంతేకాకుండా సుందర్ లాగే బదోని కూడా ఆఫ్-బ్రేక్ బౌలింగ్ చేయగలడు. డొమాస్టిక్ క్రికెట్ టోర్నీలో అతడు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నాడు. ఆల్‌రౌండర్‌గా అతడికి మంచి స్కిల్స్ ఉన్నాయి.క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడటంలో బదోని దిట్ట. పరిస్థితులకు తగ్గట్టు అతడు బ్యాటింగ్ చేయగలడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో బదోని ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడి 693 పరుగులతో పాటు పది వికెట్లు పడగొట్టాడు. అతడిని ఫినిషర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.ఐపీఎల్‌లో కూడా అతడు లక్నో తరపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆల్‌రౌండర్‌గా బదోని సత్తాచాటాడు. అయితే క్వార్టర్ ఫైనల్‌కు అతడు దూరం కావడంతో విదర్భ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది.పంత్ స్దానంలో జురెల్‌..అదేవిధగా కివీస్‌తో వన్డే సిరీస్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా గాయం కారణంగా తప్పుకొన్నాడు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినప్పటికి జురెల్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ సెంచరీల మోత మ్రోగించాడు.చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్‌ అయ్యర్‌

Vijay Hazare Trophy: Punjab, Vidarbha qualify for semi-finals10
సెమీస్‌లో అడుగుపెట్టిన పంజాబ్‌, విదర్భ.. షెడ్యూల్‌ ఇదే

విజ‌య్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీ తుది ద‌శ‌కు చేరుకుంది. మంగ‌ళ‌వారంతో క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లు ముగిశాయి. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మూడో క్వార్ట‌ర్ ఫైన‌ల్లో మధ్య‌ప్ర‌దేశ్‌ 183 ప‌రుగుల తేడాతో పంజాబ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో పంజాబ్ జ‌ట్టు త‌మ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 345 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 88 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. అన్మోల్‌ప్రీత్ సింగ్(70),నేహల్ వధేరా(56 ), హర్నూర్ సింగ్(51) హాఫ్ సెంచ‌రీలతో రాణించారు.ఎంపీ బౌల‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్, త్రిపురేష్ సింగ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంత‌రం భారీ ల‌క్ష్య చేధ‌న‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ 31.2 ఓవ‌ర్ల‌లో 162 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో పాటిదార్‌(38) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో సంవీర్ సింగ్ మూడు, గుర్నూర్ బ్రార్, రమణ్‌దీప్ సింగ్,కృష్ భగత్ త‌లా రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు.ఢిల్లీ చిత్తు..మ‌రోవైపు నాలుగో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ఢిల్లీని 76 ప‌రుగుల తేడాతో విద‌ర్భ చిత్తు చేసింది. దీంతో విద‌ర్భ వ‌రుస‌గా రెండో ఏడాది సెమీఫైనల్‌కు అర్హ‌త సాధించింది. 301 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌డంలో ఢిల్లీ చ‌తిక‌ల ప‌డింది. 45.1 ఓవ‌ర్ల‌లో 224 ప‌రుగుల‌కు ఆలౌటైంది. నచికేత్ భూటే 4 వికెట్లు ప‌డ‌గొట్టి ఢిల్లీ ప‌త‌నాన్ని శాసించారు. ఇక తొలి రెండు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో క‌ర్ణాట‌క‌, సౌరాష్ట్ర విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో క‌ర్ణాట‌క‌, సౌరాష్ట్ర, విద‌ర్భ‌, పంజాబ్ జ‌ట్లు సెమీఫైన‌ల్లో అడుగుపెట్టాయి.సెమీఫైనల్ షెడ్యూల్తొలి సెమీఫైన‌ల్‌- కర్ణాటక vs విదర్భ‌- జనవరి 15రెండో సెమీఫైన‌ల్‌-సౌరాష్ట్ర vs పంజాబ్‌- జ‌న‌వ‌రి 16చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్‌ అయ్యర్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement

వీడియోలు