ప్రధాన వార్తలు
సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ
భారత పురుషల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండేవిధంగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో టీమిండియా సారథిగా శుభ్మన్ గిల్ ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ ఏడాది మేలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు జట్గు పగ్గాలను గిల్ చేపట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్కు ముందు వన్డే జట్టు బాధ్యతలను కూడా గిల్కే బీసీసీఐ అప్పగించింది. అంతేకాకుండా టీ20ల్లో సూర్యకు డిప్యూటీగా గిల్ను ఎంపిక చేశారు.దీంతో రాబోయో రోజుల్లో పొట్టి క్రికెట్లో కూడా గిల్ను సారథిగా నియమించే యోచనలో ఉన్నట్లు ఆర్ధమవుతోంది. అయితే టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్ధానంలో కెప్టెన్గా హార్దిక్ పాండ్యా లేదా జస్ప్రీత్ బుమ్రా ఎంపిక అవుతారని అంతా భావించారు. కానీ బీసీసీఐ మాత్రం జట్టు బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్కు అప్పగించింది. అయితే సూర్యను కెప్టెన్గా ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పు బట్టారు. కానీ సూర్య మాత్రం తన అద్భుత కెప్టెన్సీతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి నాయకత్వంలో భారత్ ఆడిన 22 మ్యాచ్లలో కేవలం రెండింట మాత్రమే ఓడిపోయింది.అయినప్పటికి టీ20ల్లో కూడా గిల్ను కెప్టెన్గా చేయాలని చాలా మంది బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. అన్ని ఫార్మాట్లలో గిల్ను కెప్టెన్గా నియమించాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు."సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్స్లో ఒకరితో నాకు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. శుభ్మన్ గిల్ టీ20ల్లో కూడా కెప్టెన్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకరు నన్ను అడిగారు. వెంటనే నేను అవునాని సమాధానమిచ్చాను. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి.శుభ్మన్ ఏ ఫార్మాట్లో నైనా జట్టును నడిపించగలడు అని చెప్పా. మూడు నెలల క్రితం అతడు ఇంగ్లండ్లో ఏమి చేశాడో మనమందరం చూశాము. బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి సీనియర్లు లేనప్పటికి అతడు తన కెప్టెన్సీతో అద్భుతం చేశాడు" అని 'కెప్టెన్'స్ కామ్' పోడ్కాస్ట్లో దాదా పేర్కొన్నాడు.చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన ప్రకటన చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో జరగాల్సిన తన పెళ్లి రద్దు అయినట్లు మంధాన సోషల్ మీడియాలో ప్రకటించింది."గత కొద్ది రోజులగా నా వ్యక్తిగతం జీవితంపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. వాటిపై స్పందించాల్సిన అవసరముంది. నా పెళ్లి రద్దైందని క్లారిటీ ఇస్తున్నా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. దయచేసి ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం దృష్టి అంతా క్రికెట్పైనే ఉంటుంది. భారత్ తరపున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యమని" ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది.ముచ్ఛల్ ఏమన్నాండంటే?ఇక స్మృతి మంధానాతో తన బంధం ముగిసిందని పలాష్ ముచ్ఛల్ సైతం ధ్రువీకరించాడు. తాము విడిపోవడానికి సంబంధించిన నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ముచ్ఛల్ తెలిపాడు."నా వ్యక్తిగత సంబంధం నుండి బయటకు వచ్చాను. నా జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. నిరాధారమైన వార్తలను ప్రజలు అంత సులభంగా నమ్మడం చూసి చాలా బాధగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత కష్ట కాలం. కానీ ఈ కఠిన పరిస్థితుల నుంచి బయటకు వస్తానన్న నమ్మకం ఉంది.ఆధారాల్లేని వదంతులను ప్రచారం చేసేముందు.. ఏది నిజం, ఏది అబద్దమని ఒక్కసారి ఆలోచించుకోవాలి. నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నిరాధారమైన వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ముచ్ఛల్ ఇన్స్టాలో రాసుకొచ్చాడు.కాగా ముచ్చల్- స్మృతి మంధానల పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు మంధాన తండ్రి గుండెపోటుకు గురయ్యాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో తన పెళ్లిని మంధాన వాయిదా వేసుకుంటున్నట్లు ఆమె మేనేజర్ మీడియాతో తెలిపాడు. ఆ తర్వాత ముచ్చల్ కూడా అనారోగ్యంతో అస్పత్రిలో చేరాడు. అయితే మంధాన తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేసింది. దీంతో మంధాన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్మృతి చేతికి నిశ్చితార్థం రింగ్ లేకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుంది. ఈ నేపథ్యంలోనే మంధాన, ముచ్చల్ ఇద్దరూ తాము విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.చదవండి: సూపర్ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం
ముచ్చల్తో వివాహం రద్దైంది.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మంధన
భారత మహిళల క్రికెట్ స్టార్ స్మృతి మంధన తన వ్యక్తిగత జీవితంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వివాహం రద్దైందని స్పష్టంగా తెలిపారు. పలాష్ ముచ్చల్ పేరు ప్రస్తావనకు రాకుండా విడుదల చేసిన పోస్ట్లో మంధన ఈ విధంగా రాసుకొచ్చారు.వివాహం రద్దుగత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. కానీ ఇప్పుడు మాట్లాడటం అవసరం. వివాహం రద్దైంది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను.🚨 A STATEMENT BY SMRITI MANDHANA 🚨 pic.twitter.com/HAoHLlSIHt— Johns. (@CricCrazyJohns) December 7, 2025ప్రైవసీ ఇవ్వండిఇదే పోస్ట్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ .. ఇరు కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. మేము మా స్థాయిలో ఈ విషయాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలనుకుంటున్నామని పేర్కొన్నారు.కెరీర్పై దృష్టిమంధన కెరీర్పై దృష్టి పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. నన్ను నడిపించే ఉన్నత లక్ష్యం దేశానికి ప్రాతినిధ్యం వహించడం. భారత జట్టుకు విజయాలు అందించడమే నా కర్తవ్యమని పేర్కొన్నారు.అభిమానులకు ధన్యవాదాలు మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇప్పుడు ముందుకు సాగే సమయం వచ్చిందంటూ ప్రకటన ముగించారు.కాగా, స్మృతి మంధన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యే మంధన ముచ్చల్తో పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో ఏమో కానీ, గత కొద్ది రోజులుగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. చివరికి మంధన పెళ్లి రద్దైందంటూ బాంబు పేల్చింది. మంధన ఇటీవల భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.
సూపర్ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం
దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో సూపర్ సెంచరీ అనంతరం టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.జైస్వాల్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చివరిగా 2023-24 ఎడిషన్లో కనిపించాడు. ఈ టోర్నీలో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్ల్లో 136.42 స్ట్రయిక్రేట్తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్కు చోటు దక్కని విషయం తెలిసిందే. జైస్వాల్కు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో (టీమిండియా) అవకాశాలు రావడం లేదు. అభిషేక్ శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్ స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే, భారత వన్డే వెటరన్ స్టార్ రోహిత్ శర్మ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్మ్యాన్ ఈ దేశవాలీ టీ20 టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్ కానీ జైస్వాల్ కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు.ప్రస్తుతం ఎడిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో ఉన్న ముంబై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏలో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ఈ జట్టుకు నాకౌట్ బెర్త్ ఇదివరకే ఖరారైంది. ఈ ఎడిషన్లో శార్దూల్ ఠాకూర్ నేతృత్వంలోని ముంబై జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది. యువ ఓపెనర్ ఆయుశ్ మాత్రే వరుసగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. శార్దూల్ ఠాకూర్ స్వయంగా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై తమ చివరి గ్రూప్ మ్యాచ్ను డిసెంబర్ 8న ఒడిషాతో ఆడనుంది.
జైస్వాల్ సూపర్ సెంచరీ.. గిల్ టెస్ట్లకు మాత్రమే పరిమితం కాక తప్పదా..?
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ చేసి టీమిండియా మేనేజ్మెంట్కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడటంతో ఆ స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసేందుకు జట్టులోకి వచ్చిన జైస్వాల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కెప్టెన్నే పోటీదారుగా మారాడు. ఇప్పటికే జట్టు కూర్పు విషయంలో తలలు పట్టుకున్న భారత మేనేజ్మెంట్కు జైస్వాల్ మరో సమస్యగా మారాడు.గిల్ వస్తే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అర్దం కావట్లేదు. కెప్టెన్ కోసం జైస్వాల్ను తప్పిస్తారా లేక కెప్టెన్నే పక్కకు కూర్చోబెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గిల్ రూపేనా జైస్వాల్కు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. విజయవంతమైన రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ప్రకారం రోహిత్తో పాటు జైస్వాల్కు అవకామివ్వాలి. అయితే కెప్టెన్ అయిన కారణంగా మేనేజ్మెంట్ గిల్వైపే మొగ్గు చూపుతుంది.అలాగనీ గిల్ను అత్యుత్తమ వన్డే బ్యాటర్ కాదని అనలేం. గిల్ ఈ ఫార్మాట్లో చాలా అద్భుతంగా ఆడతాడు. అతనితో సమానంగా జైస్వాల్ కూడా ఆడతాడు. సాధారణంగా ఏ జట్టైన రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం చూస్తుంది. ఈ కోటాలో జైస్వాల్కే అవకాశాలు రావాలి. కానీ కెప్టెన్ కావడంతో జైస్వాల్పై వివక్ష తప్పలేదు. పోనీ జైస్వాల్ను కానీ గిల్ను కానీ మిడిలార్డర్లో ఆడిద్దాదా అంటే, ఆ ఛాన్సే లేదు. మిడిలార్డర్లో బెర్త్ల కోసం ఇప్పటికే పదుల సంఖ్యలో పోటీ ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో జైస్వాల్ సెంచరీ చేసి మేనేజ్మెంట్ను ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలోకి నెట్టాడు. పక్షపాతాలకు పోకుండా ఉంటే సెంచరీ చేశాడు కాబట్టి జైస్వాల్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. జైస్వాల్ క్రమంగా రాణిస్తే మాత్రం గిల్ వన్డేల నుంచి బ్రేక్ తీసుకోవాలి. రోహిత్ శర్మ రిటైరయ్యే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. రోహిత్ చూస్తే 2027 వరకు తగ్గేదేలేదంటున్నాడు. తదుపరి వన్డే సిరీస్ సమయానికి మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి.వన్డే ఫార్మాట్లో గిల్ ప్రస్తుత పరిస్థితి ఇది. ఈ పంజాబీ కుర్రాడికి టీ20 ఫార్మాట్లోనూ పరిస్థితి అంత మెరుగ్గా లేదు. ఏదో, లాబీయింగ్ జరిగి వైస్ కెప్టెన్ అయ్యాడే కానీ ఈ ఫార్మాట్ జట్టులో స్థానానికి అతడు అర్హుడే కాదు. అతను ఆడితే ఓపెనర్గా ఆడాలి. లేదంటే లేదు. ఈ ఫార్మాట్లో గిల్కు అవకాశం ఇవ్వడం కోసం మేనేజ్మెంట్ ఇద్దరిని బలిపశువులను చేస్తుంది.ఈ ఫార్మాట్లో రోహిత్ శర్మ రిటైరయ్యాక ఓ ఓపెనింగ్ స్థానాన్ని అభిషేక్ శర్మ భర్తీ చేశాడు. గత కొద్ది కాలంగా మరో ఓపెనింగ్ బెర్త్కు సంజూ శాంసన్ న్యాయం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గిల్కు ఆఘమేఘాల మీద వైస్ కెప్టెన్సీ కట్టబెట్టి జట్టులో స్థానం కల్పిస్తున్నారు. దీని వల్ల సంజూ మిడిలార్డర్కు వెళ్లాల్సి వస్తుంది. వైస్ కెప్టెన్ కోటాలో గిల్కు ఓపెనింగ్ స్థానాన్ని కట్టబెట్టినా ఏమైనా న్యాయం చేయగలుగుతున్నాడా అంటే అదీ లేదు. వరుస అవకాశాలను వృధా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గిల్ను టీ20 జట్టు నుంచి తప్పించాలని మేనేజ్మెంట్పై ఒత్తిడి ఎక్కువైంది. త్వరలో ఈ ఫార్మాట్లో అతను స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.వన్డేలు చూస్తే అలా. టీ20లు చూస్తే ఇలా. ఇక గిల్ స్థానం పదిలంగా ఉండేది టెస్ట్ల్లో మాత్రమే. ఈ ఫార్మాట్ నుంచి కూడా రోహిత్ రిటైర్ కావడంతో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో గిల్-జైస్వాల్ టెన్షన్ లేకుండా ఆడుకుంటున్నారు. వన్డేల్లో జైస్వాల్.. టీ20ల్లో సంజూ (అవకాశాలు వచ్చి ఓపెనర్గా) క్రమంగా రాణిస్తూ ఉంటే గిల్ వన్డేల్లో కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు టీ20ల్లో స్థానం గల్లంతై, టెస్ట్లకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.
ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్ లీగ్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) సీజన్–2 రెండో రౌండ్ పోటీలు హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ మెగాస్టార్, ISRL బ్రాండ్ అంబాసడర్ సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు హాజరై వేదికను కదిలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ఈ వేడుకను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్లో బైకర్ల విన్యాసాలు చూసేందుకు 18,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో బాలయోగి స్టేడియం కిక్కిరిసిపోయింది. బైకర్ల వేగం, నైపుణ్యానికి రేసింగ్ అభిమానులు ముగ్దులయ్యారు. ఈ పోటీల్లో 450cc ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ఫ్రాన్స్కు చెందిన ఆంథోనీ బోర్డన్ (BB Racing) విజేతగా నిలిచారు. హోండా CRF 450 R బైకర్పై విజయం సాధించారు. 250cc ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ఫ్రాన్స్కు చెందిన కాల్విన్ ఫోన్వియెల్ (Indewheelers Motorsports) యమహా YZ 250పై గెలిచారు. 250cc ఇండియా–ఆసియా మిక్స్ కేటగిరీ విభాగంలో ఇండోనేషియాకు చెందిన నకామి మకరిమ్ (Bigrock Motorsports SX) కవాసకి KX 250పై విజయం సాధించారు.టీమ్ గుజరాత్ ట్రైల్బ్లేజర్స్ రౌండ్–2లో ఓవరాల్ విక్టరీ సాధించింది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూఎస్ఏ, జర్మనీ, థాయ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి 36 మంది అంతర్జాతీయ రైడర్లు, 21 దేశాల ప్రతినిధులు పోటీపడ్డారు. భారత రైడర్లలో రుగ్వేద్ బార్గుజే, ఇక్షన్ షణ్భాగ్ ఆకట్టుకున్నారు. ఈ పోటీల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు ప్రపంచ స్థాయి క్రీడా అవకాశాలు కల్పించడమే తెలంగాణ లక్ష్యమని అన్నారు. ISRL వంటి అంతర్జాతీయ ప్రమాణాల మోటార్స్పోర్ట్స్ లీగ్లు రాష్ట్రానికి ఉద్యోగాలు, టూరిజం, గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తాయని తెలిపారు.ఇదే సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. హైదరాబాద్లోని ఎనర్జీ అద్భుతం. భారత, విదేశీ రైడర్లు కలిసి పోటీపడటం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ISRL యువతకు అద్భుత వేదిక అని అన్నారు. ఎండీ మరియు ISRL కో ఫౌండర్ వీర్ పటేల్ మాట్లాడుతూ.. కిక్కిరిసిన స్టేడియం, నిరంతర హర్షధ్వానాలు భారత యువతలో మోటార్స్పోర్ట్స్ పై ఉన్న ఆసక్తిని సూచిస్తున్నాయని అన్నారు.ISRL గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21, 2025న కేరళలోని కోజికోడ్ EMS కార్పొరేషన్ స్టేడియంలో జరుగనుంది.
తెలివిగా ఆడలేకపోయాం.. టీమిండియా నాణ్యత చూపించింది: బవుమా
విశాఖ వేదికగా భారత్తో నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. కీలకమైన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్లో తడబడిన ఆ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్లో పూర్తిగా చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన భారత్ పరిస్థితులను అద్భుతంగా సద్వినియోగం చేసుకొని సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలింగ్లో.. ఆతర్వాత బ్యాటింగ్లో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. బౌలింగ్లో కుల్దీప్, ప్రసిద్ద్ కృష్ణ సత్తా చాటగా.. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో.. రోహిత్, కోహ్లి బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్ను మరింత ఉత్కంఠభరితంగా చేయాలని అనుకున్నాం. కానీ బోర్డుపై సరిపడా పరుగులు పెట్టలేకపోయాం. ఇన్నింగ్స్ మధ్యలో వికెట్లు బహుమతిగా ఇచ్చేయడం వల్ల ఒత్తిడి పెరిగింది. 50 ఓవర్ల మ్యాచ్లో ఆలౌట్ కావడం ఎప్పుడూ కష్టమే. డికాక్ అద్భుతంగా ఆడినా, ఇతర బ్యాటర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. కీలక సమయాల్లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. అందువల్లే జట్టు కష్టాల్లో పడింది. వ్యక్తిగతంగా నా ఇన్నింగ్స్కు శుభారంభం లభించినా, ఆతర్వాత దారి తప్పాను. మొదటి రెండు వన్డేల్లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధైర్యం చూపాము. కానీ ఈ మ్యాచ్లో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో వికెట్లు కోల్పోయాము. తొలుత బంతితో బాగా పోరాడాం. మొదటి స్పెల్లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ బోర్డుపై సరిపడా స్కోర్ లేకపోవడంతో భారత బ్యాటర్లు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మొత్తంగా భారత జట్టు తమ నాణ్యతను చూపించింది. మేము తెలివిగా ఆడలేకపోయాముం. ఈ సిరీస్లో చాలా పాఠాలు నేర్చుకున్నాము. జట్టుగా ఎదిగాము. మేము ఎప్పుడూ ప్రత్యర్థిపై దాడి చేయాలని మాట్లాడుకుంటాం. భారత్కి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నా, వారిపై ఒత్తిడి పెట్టగలిగాం. పరిస్థితులను గుర్తించి మరింత తెలివిగా ఆడటం నేర్చుకోవాలి. పది బాక్సుల్లో ఆరు లేదా ఏడు టిక్ చేశామని అనుకుంటున్నానని బవుమా అన్నాడు.
సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం అదే: కేఎల్ రాహుల్
విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటింది. తొలుత బౌలర్లు.. ఆతర్వాత బ్యాటర్లు అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయాన్నందించారు.మ్యాచ్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ ఇలా అన్నాడు. అతని మాటల్లో.. టాస్ గెలుపు చాలా కీలకం. టాస్ తప్ప ఈ మ్యాచ్ గెలుపులో నా పాత్ర ఏమీ లేదు. ఈ సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం టాస్ గెలిచినప్పుడే.తొలి రెండు వన్డేల్లో టాస్ ఓడటం వల్ల సెకెండ్ ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేయవల్సి వచ్చింది. మంచు కురిసే వేళల్లో అది బౌలర్లకు విషమ పరీక్ష. ఈ రోజు టాస్ గెలిచి బౌలర్లను ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాను.పిచ్ బ్యాటింగ్కు చాలా బాగుంది. అయినా మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి వికెట్లు సాధించారు. ప్రసిద్ద్ తొలుత ఇబ్బంది పడినా, ఆతర్వాతి స్పెల్లో మ్యాచ్ గతినే మార్చేశాడు. ఆతర్వాత కుల్దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వారి తరఫున డికాక్ అద్భుతంగా ఆడాడు. అతడి వికెట్ చాలా కీలకం. సిరీస్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేశాం. సిరీస్ ఆధ్యాంతం సౌతాఫ్రికా ఆటగాళ్లు అద్బుతంగా బ్యాటింగ్ చేశారు. మా బౌలర్లపై అధికమైన ఒత్తిడి ఉండింది. రెండో వన్డేలో అదృష్టం మా పక్షాన లేదు. అందుకే ఓడాం.కాగా, నిన్నటి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (9.5-0-66-4), కుల్దీప్ యాదవ్ (10-1-41-4) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 270 పరుగులకే పరిమితం చేశారు. డికాక్ (106) ఒక్కడే సెంచరీతో పోరాటం చేశాడు. బవుమా (48) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) సూపర్ సెంచరీతో.. రోహిత్ (75), కోహ్లి (65 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat kohli) ఖాతాలో మరో రికార్డు చేరింది. సౌతాఫ్రికా వన్డే సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలవడంతో పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో మరో దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. సచిన్ ఖాతాలో 19 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉండగా.. విరాట్ ఖాతాలో 20వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు చేరింది. ఈ విభాగంలో విరాట్, సచిన్ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (17), జాక్ కల్లిస్ (14), సనత్ జయసూర్య (13), డేవిడ్ వార్నర్ (13) ఉన్నారు.జయసూర్య రికార్డు సమంప్రత్యేకించి వన్డే క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్కు వన్డేల్లో ఇది 11వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. ఈ అవార్డుతో విరాట్ సనత్ జయసూర్య రికార్డును సమం చేశాడు. జయసూర్య ఖాతాలోనూ 11 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా సచిన్ చలామణి అవుతున్నాడు.కాగా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. వరుసగా రెండు శతకాలు (135, 102) సహా చివరి మ్యాచ్లో అజేయమైన అర్ద సెంచరీ (65) చేశాడు. ఈ ప్రదర్శనలకు గానూ అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.జైస్వాల్ సూపర్ సెంచరీ.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్విశాఖ వేదికగా నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (106) సెంచరీ సాయంతో 270 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) సూపర్ సెంచరీ.. రోహిత్ (75), కోహ్లి (65 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఓటమి అంచుల్లో ఇంగ్లండ్
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ వన్ సైడెడ్గా సాగుతోంది. మరోసారి ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి టెస్ట్లో బంపర్ విక్టరీ సాధించిన ఆసీస్ మరోసారి అదే స్థాయి గెలుపు దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గట్టెక్కడం అసంభవం. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. ఇన్నింగ్స్ పరాభవం తప్పించుకోవాలంటే ఇంగ్లండ్ మిగిలిన 4 వికెట్లు కోల్పోకముందే ఈ పరుగులు చేయాలి. బెన్ స్టోక్స్ (4), విల్ జాక్స్ (4) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, మైఖేల్ నెసర్, స్కాట్ బోలాండ్ తలో 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రాలే 44, డకెట్ 15, పోప్ 26, రూట్ 15, బ్రూక్ 15, జేమీ స్మిత్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. వీరందరికీ మంచి ఆరంభమే లభించినప్పటికీ.. ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు.అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో 11 మంది తలో చేయి వేసి ఈ స్కోర్ వచ్చేలా చేశారు. స్పెషలిస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ (77) బ్యాట్తోనూ చెలరేగి టాప్ స్కోరర్గా నిలవడం విశేషం.స్టార్క్తో పాటు మరో నలుగురు కూడా అర్ద సెంచరీలు చేశారు. జేక్ వెదరాల్డ్ 72, లబూషేన్ 65, స్టీవ్ స్మిత్ 61, అలెక్స్ క్యారీ 63 పరుగులు చేశారు.ట్రవిస్ హెడ్ (33), గ్రీన్ (45) కూడా పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో ఇంగ్లిస్ 23, నెసర్ 16, బోలాండ్ 21 (నాటౌట్), డాగెట్ 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 4 వికెట్లతో సత్తా చాటగా.. స్టోక్స్ 3, ఆర్చర్, అట్కిన్సన్, జాక్స్ తలో వికెట్ తీశారు.తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జో రూట్(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో 334 పరుగులు చేసింది. జాక్ క్రాలీ(76),ఆర్చర్(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
లెబ్రాన్ జేమ్స్బాండ్ 008!
టొరంటో: లెబ్రాన్ జేమ్స్ ఎన్బీఏ బాస్కెట్బాల్ ప...
‘షూటౌట్’లో గెలిచి సెమీస్లోకి భారత్
చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్ట...
నేను గెలిచేందుకు మా వాణ్ని ఓడిపొమ్మంటానా?
అబుదాబి: ఈ సీజన్ ఫార్ములావన్ చాంపియన్షిప్ కోసం...
తెలంగాణ స్విమ్మర్లకు నాలుగు పతకాలు
సాక్షి, హైదరాబాద్: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ...
సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం అదే: కేఎల్ రాహుల్
విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 6) జరి...
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat kohli) ఖాతా...
ఓటమి అంచుల్లో ఇంగ్లండ్
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ రెం...
శ్రీకర్ భరత్ మెరుపులు
లక్నో: ఓపెనర్ శ్రీకర్ భరత్ (28 బంతుల్లో 53; 6 ఫ...
క్రీడలు
రయ్ రయ్ మంటూ.. ఆకట్టుకున్న బైకర్ల విన్యాసాలు.. (ఫోటోలు)
వైజాగ్ వన్డేలో టీమిండియా జయభేరి.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
రేపు హైదరాబాద్కు హీరో సల్మాన్ ఖాన్ (ఫోటోలు)
సారా టెండూల్కర్ వారణాసి ట్రిప్ (ఫొటోలు)
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
వరల్డ్కప్ గెలిచి నెల రోజులు.. భారత మాజీ క్రికెటర్ భావోద్వేగం (ఫోటోలు)
ఉప్పల్లో హార్దిక్ హంగామా.. పోటెత్తిన అభిమానులు (ఫోటోలు)
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
వీడియోలు
పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చేసిన స్మృతి
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
విశాఖలో క్రికెట్ ఫీవర్.. టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
వరుస సెంచరీలతో విరాట్ విధ్వంసం.. 2027 వరల్డ్ కప్ పై ఆశలు
రాయ్ పూర్ వన్డేలో భారత్ పై సౌతాఫ్రికా విజయం
సిరీస్ పై భారత్ గురి
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
