Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Why Shashi Tharoor Praises Gautam Gambhir details inside1
ప్ర‌ధాని త‌ర్వాత క‌ష్ట‌మైన జాబ్ చేస్తున్నాడు

టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అంద‌రూ హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఏకీపారేస్తుంటే.. కాంగ్రెస్ అస‌మ్మ‌తి నాయ‌కుడు, తిరువ‌న‌తంపురం ఎంపీ శ‌శిథ‌రూర్ మాత్రం ప్ర‌శంస‌లు కురిపించారు. దేశంలో రెండో క‌ష్ట‌త‌ర కొలువు చేస్తూ కూడా గంభీర్ ఎంతో నిబ్బ‌రంగా ఉన్నారంటూ కితాబిచ్చారు. నాగ్‌పూర్‌లో బుధవారం భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి టి20 మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. అంత‌కుముందుకు గంభీర్‌తో ఆయ‌న భేటీ అయ్యారు. దీని గురించి 'ఎక్స్‌'లో పోస్ట్ చేసి, త‌మ ఫొటోను షేర్ చేశారు.''నాగ్‌పూర్‌లో నా పాత స్నేహితుడు గౌత‌మ్ గంభీర్‌తో జ‌రిగిన చర్చను ఆస్వాదించాను. ప్రధానమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయనే! ప్రతిరోజూ లక్షలాది మంది త‌న‌ను విమ‌ర్శిస్తున్నా ప్ర‌శాంతంగా ప‌నిచేసుకుపోతూ, ధైర్యంగా ముందుకెళుతున్నారు. గంభీర్‌ నిశ్శబ్ద సంకల్పం, సమర్థ నాయకత్వాన్ని ప్ర‌శంసిస్తున్నాను. ఈరోజు నుండి ఆయనకు అన్ని విజయాలు ద‌క్కాల‌ని కోరుకుంటున్నాన''ని ఎక్స్‌లో రాసుకొచ్చారు. శ‌శిథ‌రూర్ ట్వీట్‌కు ధ‌న్య‌వాదాలు అంటూ గంభీర్ స‌మాధానం ఇచ్చారు.కివీస్ ర‌న్స్ కంటే నా సెల్పీలే ఎక్కువ‌త‌న నాగ్‌పూర్‌లో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆంత్ర‌ప్రెన్యూర్స్ ఆర్గ‌నైజేష‌న్‌(ఈవో) నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో శ‌శిథ‌రూర్ పాల్గొన్నారు. బుధ‌వారం రాత్రి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భార‌త్‌- న్యూజిలాండ్ టి20 మ్యాచ్‌ను ఆయ‌న వీక్షించారు. క్రికెట్ ప్రేమికుల కోలాహ‌లం న‌డుమ మ్యాచ్ చూడ‌డం ఎంతో బాగుంద‌ని పేర్కొంటూ.. త‌న ఫొటోల‌ను 'ఎక్స్‌'లో షేర్ చేశారు. టీమిండియా-కివీస్ మ్యాచ్ చూడ‌డంతో త‌న నాగ్‌పూర్ ప‌ర్య‌ట‌న పూర్త‌యింద‌న్నారు. న్యూజిలాండ్ చేసిన పరుగుల కంటే తాను ఎక్కువ సెల్ఫీలు ఇచ్చాన‌ని చ‌మ‌త్క‌రించారు. టీమిండియా (Team India) విజ‌యాన్ని పూర్తిగా ఆస్వాదించాన‌ని పేర్కొన్నారు.చ‌ద‌వండి: బెంగ‌ళూరు ఎన్నిక‌లు.. రంగంలోకి బీజేపీ కీల‌క నేత‌కాగా, శ‌శిథ‌రూర్ కొంత‌కాలంగా సొంత పార్టీతో అంటిముట్ట‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి త‌ల‌నొప్పిగా త‌యార‌య్యారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప్ర‌శంసలు కురిపించి హ‌స్తం పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టారు. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ అయిన గంభీర్‌ను క‌ల‌వ‌డంతో పాటు ఆయ‌న‌ను పొడ‌గ్త‌ల‌తో ముంచెత్తారు. గంభీర్ హెడ్‌కోచ్‌గా వ‌చ్చిన త‌ర్వాతే టీమిండియా ఎన్న‌డూ చవిచూడ‌ని ప‌రాజ‌యాలు పొందింద‌ని అంద‌రూ విమ‌ర్శిస్తుంటే.. థ‌రూర్ మాత్రం ఆయ‌న‌ను వెనుకేసుకురావ‌డం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రి భేటీపై కాంగ్రెస్ నాయ‌కులు ఇంకా స్పందించ‌లేదు. In Nagpur, enjoyed a good &frank discussion with my old friend @GautamGambhir, the man with the hardest job in India after the PM’s! He is being second-guessed by millions daily but stays calm &walks on undaunted. A word of appreciation for his quiet determination and able… pic.twitter.com/LOHPygVV0E— Shashi Tharoor (@ShashiTharoor) January 21, 2026

SC Dismisses plea restrain Prasar Bharati from calling BCCI squad Team India2
BCCI: మీ సమస్య ఏంటి?: సుప్రీంకోర్టు ఆగ్రహం

భారత క్రికెట్‌ జట్టును టీమిండియా అని పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో పిటిషనర్‌కు ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. హైకోర్టు కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేసినందునే పిటిషనర్‌ ఇక్కడి వరకు వచ్చే సాహసం చేశారని మండిపడింది.పూర్వాపరాలు ఇవేప్రైవేట్‌ సంస్థ అయిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసే జట్టును టీమిండియా, జాతీయ జట్టు అని పిలవకూడదని రీపక్‌ కన్సాల్‌ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు.టీమిండియా అనకూడదుప్రసార్‌ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్‌ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రీపక్‌ కన్సాల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. విశ్వవేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు టీమిండియా లేదంటే భారత జట్టు అని ఎందుకు పిలవకూడదని ప్రశ్నించింది.దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది. అయితే, సదరు పిటిషన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్‌కు గట్టిగానే అక్షింతలు వేసింది. చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.మీ సమస్య ఏమిటి?ఈ సందర్భంగా.. ‘‘మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు డ్రాఫ్ట్‌ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇందులో (టీమిండియా) మీకు సమస్య ఏమిటి? జాతీయ క్రీడా ట్రిబ్యునల్‌లో అద్భుతమైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి విషయాల కోసం కోర్టుపై భారం మోపకండి’’ అని సీజేఐ సూర్యకాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది అదే విధంగా.. ‘‘మీ విషయంలో హైకోర్టు తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఇలా కోర్టు సమయం వృథా చేస్తున్నందుకు మీకు జరిమానా వేయాల్సింది. అలా చేయకుండా హైకోర్టు తప్పు చేసింది. అందుకే మీరు ఇలాంటి పనికిరాని పిటిషన్లతో సుప్రీం కోర్టు వరకు వచ్చారు’’ అని సీజేఐ మండిపడ్డారు.ఈ క్రమంలో ధర్మాసనం సదరు పిటిషనర్‌ను రూ. 10 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించగా.. తన క్లైంట్‌ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని న్యాయవాది కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

PV Sindhu scripts history Enters Indonesia Masters quarter Finals3
చరిత్ర సృష్టించిన పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలింపిక్‌ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు ఇండోనేషియా మాస్టర్స్‌-2026 టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డెన్మార్క్‌ షట్లర్‌ ఫో లినే హోజ్‌మార్క్‌ జేర్‌ఫీల్డ్‌ను 21-19, 21-18 తేడాతో ఓడించింది. నలభై మూడు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు పైచేయి సాధించి.. క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.500వ విజయంఈ క్రమంలోనే పీవీ సింధు అరుదైన మైలురాయికి చేరుకుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా తన కెరీర్‌లో 500వ విజయాన్ని ఆమె నమోదు చేసింది. తద్వారా మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించిన సింధు.. ఓవరాల్‌గా ఆరో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా నిలిచింది.ఇక ఇండోనేషియా మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 13వ ర్యాంకర్‌ అయిన సింధు.. వరల్డ్‌ నంబర్‌ 4, చైనాకు చెందిన చెన్‌ యూ ఫీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోనుంది. వీరిద్దరు ఇప్పటి వరకు పదమూడు సార్లు ముఖాముఖి తలపడగా 7-6తో చెన్‌ ఆధిక్యంలో ఉంది. చివరగా 2019లో చెన్‌ను సింధు ఓడించింది.లక్ష్య సేన్‌ సైతంమరోవైపు.. లక్ష్య సేన్‌ సైతం ఇండోనేషియా మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. అరగంటకు పైగా సాగిన పోరులో హాంకాంగ్‌ షట్లర్‌ జేసన్‌ గునావన్‌పై 21-20, 21-11 తేడాతో గెలిచి లక్ష్య సేన్‌ ముందుడుగు వేశాడు.

IND s NZ Suryakumar Yadav Praises Team And Abhishek Sharma knock4
అతడికి ఎక్కడున్నా అదే ఆలోచన.. సంతోషంగా ఉంది: సూర్య

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకుంది. నాగ్‌పూర్‌ వేదికగా తొలి టీ20లో 48 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంలో కీలక పాత్ర భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మదే.అతిపెద్ద సానుకూలాంశంఇక అభిషేక్‌ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు.. బౌలర్లు కూడా రాణించడంతో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘తొలుత బ్యాటింగ్‌ చేయడం మాకు ఎల్లప్పుడూ సంతోషమే.మంచు ప్రభావం కూడా ఉంది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాకు అతిపెద్ద సానుకూలాంశం అదే. పవర్‌ ప్లేలో వికెట్లు (25-2) కోల్పోయినా మేము పుంజుకున్న తీరు అద్భుతం. 15 ఓవర్‌ వరకు మా ఆట కొనసాగుతూనే ఉంది. ఎక్కడా మాకు అలుపు రాలేదు. మా జట్టు చాలా బాగా ఆడింది.సరైన సమయంలో క్రీజులోకివ్యక్తిగతంగా నా బ్యాటింగ్‌ పట్ల కూడా తృప్తిగానే ఉంది. సరైన సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. నెట్స్‌లో నేను చాలా బాగా బ్యాటింగ్‌ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మైదానంలోనూ అదే పునరావృతం చేశాను. గత 2-3 వారాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నా. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది.ఎక్కడున్నా అదే ఆలోచనఇక అభిషేక్‌ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్‌ కోసం అతడు సన్నద్ధమయ్యే తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హోటల్‌లో.. టీమ్‌ బస్‌లో.. ఇలా ఎక్కడ ఉన్నా సరే తన గ్లేమ్‌ ప్లాన్‌ గురించే ఆలోచిస్తాడు. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారిస్తాడు. అందుకు తగ్గ ఫలాలను అతడు పొందుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాము’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసించాడు.238 పరుగులుకాగా నాగ్‌పూర్‌లో బుధవారం నాటి తొలి టీ20లో టాస్‌ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 238 పరుగులు చేసింది. అయితే, కివీస్‌ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 22 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 32 పరుగులు చేయగలిగాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది’ మ్యాచ్‌ అభిషేక్‌ శర్మ మెరుపు హాఫ్‌ సెంచరీ (35 బంతుల్లో 84)తో దుమ్ములేపాడు. భారత్‌- కివీస్‌ మధ్య శుక్రవారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు రాయ్‌పూర్‌ వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డుA thumping win! 👏🏻🇮🇳Shivam Dube finishes off the proceedings & after putting up a mammoth total, Team India bowlers combine to restrict the Kiwi batters to go 1-0 up! 👌🏻Watch #INDvNZ | 2nd T20I 👉 FRI, 23rd JAN, 6 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/WTK7BuF1Nv— Star Sports (@StarSportsIndia) January 21, 2026

Chahal RJ Mahvash unfollow each other I Dont Trust People Post Viral5
ఆమెకు బ్రేకప్‌ చెప్పిన టీమిండియా స్టార్‌!

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. అతడి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్‌వశ్‌తో చహల్‌కు విభేదాలు తలెత్తాయనేది ఆ వార్తల సారాంశం. కొరియోగ్రాఫర్‌, యూట్యూబర్‌ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చహల్‌.అయితే, వివాహమైన కొన్ని నెలలకే తమ మధ్య గొడవలు జరిగాయని.. విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించినట్లు కోర్టును ఆశ్రయించింది ఈ జంట. గతేడాది అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి.ఆర్జేతో చెట్టాపట్టాల్‌కానీ అంతకంటే ముందు నుంచే చహల్‌.. ఆర్జే మహ్‌వశ్‌ (RJ Mahvash)తో కలిసి చక్కర్లు కొడుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 సందర్భంగా ఆమెతో కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు షేర్‌ చేసి తమ మధ్య స్నేహ బంధం ఉందని చహల్‌ స్పష్టం చేశాడు.కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. ఈ ఘటన తర్వాత కొన్నాళ్లకే చహల్‌- ధనశ్రీలకు విడాకులు మంజూరు కావడంతో.. అప్పటిదాకా ధనశ్రీని తిట్టినవారంతా ఆర్జే మహ్‌వశ్‌పై దృష్టి సారించారు. చహల్‌ కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. భార్యభర్తల మధ్య దూరి విడాకులకు కారణమైందని పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు.మరోవైపు.. చహల్‌కు మద్దతుగా పరోక్షంగా ధనశ్రీని టార్గెట్‌ చేస్తూ మహ్‌వశ్‌ సైతం పోస్టులు పెట్టింది. దీంతో నెటిజన్లు మరోసారి ‘‘హోం బ్రేకర్‌’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల చహల్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు వదంతులు వ్యాప్తి చేస్తారు.ఏడుస్తూ కూర్చోలేము కదా!అంతమాత్రాన మేము ఏడుస్తూ కూర్చోలేము కదా!.. జనాలు ఏమనుకుంటున్నారో అదే అనుకోనివ్వండి. మాకేం తేడా ఉండదు. మా కాపురాన్ని కూల్చిందని ఆమెను ఆడిపోసుకున్నారు. ఇంకా ఎన్నెన్నో మాటలు అన్నారు. ఓ మహిళను ఎన్ని రకాలుగా కించపరచవచ్చో అన్ని రకాలుగా మాట్లాడారు.యుజీ ఆమెతో ఎందుకు ఉన్నాడని చాలా మంది అన్నారు. కష్టకాలంలో నాకు సహాయంగా నిలబడ్డ నా స్నేహితురాలిని అలా నిందించడం నాకు బాధ కలిగించింది. ఫ్రెండ్స్‌ అందరితో కలిసి వెళ్లినా మా ఫొటోలు మాత్రమే క్రాప్‌ చేసి రూమర్స్‌ వ్యాప్తి చేశారు. అందుకే కలిసి బయటకు వెళ్లడం కూడా మానేశాము’’ అని చెప్పు​కొచ్చాడు.ఒకరినొకరు అన్‌ఫాలోమరోవైపు.. ఆర్జే మహ్‌వశ్‌ సైతం అబ్బాయితో కలిసి బయటకు వెళ్తే చాలు డేటింగ్‌ అంటున్నారని.. అసలు మనం ఏ కాలంలో ఉన్నామంటూ మండిపడింది. పరోక్షంగా చహల్‌తో తనకు స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అయితే, తాజాగా వీరిద్దరు సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం గమనార్హం.నేను ఎవరినీ నమ్మనుదీంతో చహల్‌- మహ్‌వశ్‌ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చహల్‌ ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘నేను ఎవరినీ నమ్మను’’ అని పోస్ట్‌ పెట్టడం ఇందుకు బలమిచ్చింది. మరో స్టోరీలో ‘‘బాధ, ఆశల వలయంలో చిక్కుకుపోకుండా.. బంధాల్లో మునిగిపోకుండా.. కోపం, భయాన్ని వదిలేసి ముందుకు సాగేవాడే తెలివైన మనిషి’’ అన్న భవద్గీత పంక్తులను కూడా చహల్‌ షేర్‌ చేయడం విశేషం.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి!

ETPL Officially sanctioned by ICC Waugh Maxwell franchise owners6
ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్‌ మాక్స్‌వెల్‌

టీ20 క్రికెట్‌లో పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్న దేశవాళీ లీగ్‌లలో మరో కొత్త టోర్నీ చేరింది. ‘యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌’ (ఈటీపీఎల్‌) పేరుతో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ‘రూల్స్‌ గ్లోబల్‌’ అనే సంస్థతో కలిసి ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ లీగ్‌ను నిర్వహిస్తుంది.అభిషేక్‌ బచ్చన్‌ సైతంప్రముఖ బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌తో పాటు పలువురు ఇతర వ్యాపారవేత్తలు ‘రూల్స్‌ గ్లోబల్‌’లో భాగస్వాములుగా ఉన్నారు. లీగ్‌కు సంబంధించి ఇప్పటికే మూడు జట్ల కొనుగోలు పూర్తయింది. దిగ్గజ క్రికెటర్‌ స్టీవ్‌ వా ఆమ్‌స్టర్‌డామ్‌ ఫ్రాంచైజీకి యజమాని కాగా... మూడు ఒలింపిక్‌ పతకాలు, రెండుసార్లు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడైన ఆ్రస్టేలియా హాకీ దిగ్గజం జేమీ డ్వేయర్‌ కూడా స్టీవ్‌వాతో పాటు సహ యజమానిగా ఈ జట్టుతో చేతులు కలపడం విశేషం.యజమానిగా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ఇక ఎడిన్‌బర్గ్‌ టీమ్‌ను న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్లు నాథన్‌ మెకల్లమ్, కైల్‌ మిల్స్‌ కలిసి సొంతం చేసుకున్నారు. బెల్‌ఫాస్ట్‌ టీమ్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో లీగ్‌ జరుగుతుంది. ఇటీవలి కాలంలో యూరోప్‌లో కూడా క్రికెట్‌ బాగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈటీపీఎల్‌ విజయవంతం అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

IPL 2026 schedule Delayed BCCI seeks clarity on RCB, RR venues7
ఎన్నికల ప్రకటన తర్వాతే... ఐపీఎల్‌ షెడ్యూల్‌: రాజీవ్‌ శుక్లా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-19వ సీజన్‌ షెడ్యూల్‌కు కసరత్తులు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్‌ జరగనుండగా... దానికి సంబంధించిన షెడ్యూల్‌ త్వరలోనే విడుదల కానుంది. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాతేఈ వేసవిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఎన్నికల తేదీలు ఖరారు చేసిన అనంతరం షెడ్యూల్‌ రూపొందించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఎదురుచూస్తోంది.పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌ షెడ్యూల్‌ ఆలస్యమవుతోందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా (Rajeev Shukla) వెల్లడించారు. రాజస్తాన్‌ రాయల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీలు ఈ వారంలోనే తమ ‘హోం గ్రౌండ్‌’ను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.అపుడే షెడ్యూల్‌ విడుదల‘ఐపీఎల్‌ షెడ్యూల్‌ రూపొందించే పనిలో ఉన్నాం. అయితే ఎన్నికల తేదీలపై ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నాం. అది విడుదలైన వెంటనే షెడ్యూల్‌ ప్రకటిస్తాం. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తాం. బెంగళూరు, రాజస్తాన్‌ జట్లకు తమ ‘హోమ్‌ గ్రౌండ్‌’ను నిర్ణయించుకునే అవకాశం ఇస్తున్నాం. వీలైనంత త్వరగా వివరాలు అందిస్తే... దానికి తగ్గట్లు మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేస్తాం’ అని రాజీవ్‌ శుక్లా తెలిపారు. చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

Miracle: Bangladesh Cricket Board Chief Reacts ICC Rejecting T20 WC Request8
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్‌

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయంపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం స్పందించాడు. ఏదో ఒక అద్భుతం జరిగి ఐసీసీ తమ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదే సమయంలో మరోసారి భారత్‌ గురించి అవాకులు చెవాకులు పేలాడు.కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య రాజకీయపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌ కప్‌-2026లో తమ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రాబోమని బంగ్లా బోర్డు (BCB) ఐసీసీకి తెలిపింది. తమ వేదికలను భారత్‌ నుంచి శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేసింది.ఆడితే ఆడండి.. లేకపోతే పొండిఈ విషయంపై చర్చించిన ఐసీసీ బుధవారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. భారత్‌ నుంచి మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదని... వరల్డ్‌ కప్‌లో ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్‌ తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం గురువారం నాటికి తుది గడువు విధించింది.ఒకవేళ బంగ్లాదేశ్‌ తమ పంతం వీడకపోతే ఆ జట్టును వరల్డ్‌ కప్‌ నుంచి తప్పిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌ జట్టును బంగ్లాదేశ్‌ స్థానంలో ఆడించాలని కూడా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో దీనికి మద్దతుగా అత్యధిక డైరెక్టర్లు ఓటు వేశారు.ఐసీసీ చైర్మన్‌ జై షాతో పాటు బీసీసీఐ తరఫున దేవజిత్‌ సైకియా ఇందులో పాల్గొన్నారు. 15 మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాగా, ఒక్క పాకిస్తాన్‌ మాత్రమే బంగ్లాదేశ్‌కు అండగా నిలిచింది. ఇప్పటికే బంగ్లా డిమాండ్‌కు మద్దతు ప్రకటించిన పాకిస్తాన్‌ తమ దేశంలో ఆ జట్టు మ్యాచ్‌లను నిర్వహిస్తామని కూడా ప్రతిపాదించింది.ఎలాంటి ప్రమాదం లేదు..అయితే ఇవన్నీ సాధ్యం కాదని ఐసీసీ కొట్టిపారేసింది. ‘భద్రతాపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. భారత్‌లోని ఏ వేదికపైన కూడా బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులకు ఎలాంటి ప్రమాదం లేదు.టోర్నీ చేరువైన సమయంలో షెడ్యూల్‌ మార్పు ఏమాత్రం సాధ్యం కాదు. భద్రతా పరమైన కారణం అంటూ ఈసారి అలా చేస్తే ఇది చెడు సాంప్రదాయానికి దారి తీస్తూ ఐసీసీ ఈవెంట్లకు చెడ్డపేరు వస్తుంది. బంగ్లా బోర్డుకు ఇప్పటికే ఇవన్నీ పూర్తిగా వివరించాం.అయితే ఎంత చెప్పినా వరల్డ్‌ కప్‌తో ఏమాత్రం సంబంధం లేని ఒక దేశవాళీ లీగ్‌లో జరిగిన ఘటనను చూపిస్తూ బంగ్లా తమ డిమాండ్‌ను కొనసాగించింది. ఎన్నో అంశాలను బట్టి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికలు ప్రకటిస్తాం. ఇప్పుడు ఎలాంటి మార్పులూ చేయలేం’ అని ఐసీసీ తమ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇండియా మాకు భద్రం కాదుఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం స్పందిస్తూ.. ‘‘మా ప్రభుత్వంతో చర్చించేందుకు నాకు కొంత గడువు కావాలని ఐసీసీ బోర్డును అడిగాను. చివరి అవకాశం ఇమ్మని కోరాను. ఇది సరైనదేనని వారు భావించారు. 24 నుంచి 48 గంటలలోపు మా నిర్ణయం చెప్పాలన్నారు.అయితే, ఈ విషయంలో నేను మా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టదలచుకోలేదు. ఏదేమైనా ఇండియా మాకు భద్రమైన దేశం కాదు. శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడేందుకే మేము కట్టుబడి ఉన్నాము. ఐసీసీ మా అభ్యర్థనను తిరస్కరించిందని తెలుసు.అద్భుతం జరుగుతుందిప్రభుత్వంతో చర్చించిన తర్వాతే మా తుది నిర్ణయం వెల్లడిస్తాం. ఐసీసీ మా విషయంలో అద్భుతం చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్‌ టోర్నీలో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు!.. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లతో ఐసీసీ ఈవెంట్లో ఆడాలని కోరుకుంటున్నారు.బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కూడా బంగ్లా క్రికెట్‌ జట్టు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలని ఆశిస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు భారత్‌ మా ఆటగాళ్లకు సురక్షిత ప్రదేశం కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అంటూ ఓవైపు వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడాలనే కోరిక ఉందంటూనే.. మరోవైపు భారత్‌ గురించి అతిగా మాట్లాడాడు. కాగా అంతకుముందు తమ అభ్యర్థనను తిరస్కరిస్తే వరల్డ్‌కప్‌ బహిష్కరిస్తామంటూ బంగ్లా హెచ్చులకు పోయింది. ఇప్పుడు మాత్రం తమకు ఆడాలని ఉందంటూ తమదంతా మేకపోతు గాంభీర్యమేనని నిరూపించుకుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్‌- శ్రీలంక వేదికలుగా ప్రపంచకప్‌-2026 టోర్నీ జరుగనుంది. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌

IND vs NZ 1st T20I: Abhishek Sharma 22 Ball Fifty Shatters World Record9
అభిషేక్‌ శర్మ ప్రపంచ రికార్డు

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సరికొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో కేవలం 22 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని.. కివీస్‌ మీద ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.అదే విధంగా.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఫిల్‌ సాల్ట్‌ (Phil Salt) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అభిషేక్‌ శర్మ ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌- న్యూజిలాండ్‌ (IND vs NZ 1st T20I) బుధవారం తొలి టీ20లో తలపడ్డాయి.నాగ్‌పూర్‌ వేదికగా టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson- 10), టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (8) పూర్తిగా నిరాశపరిచారు.ఆకాశమే హద్దుఅయితే మరో ఓపెనర్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 84 పరుగులు సాధించాడు. ఇష్‌ సోధి బౌలింగ్‌లో జెమీషన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అభిషేక్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మిగతా వారిలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (32), హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. రింకూ సింగ్‌ (20 బంతుల్లో 44 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్‌ 238 పరుగులు సాధించింది.కివీస్‌ ఓటమిభారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా అభిషేక్‌ శర్మ అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు హాఫ్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు ఫిఫ్టీలు బాదిన క్రికెటర్లు వీరే🏏అభిషేక్‌ శర్మ- ఎనిమిది సార్లు🏏ఫిల్‌ సాల్ట్‌- ఏడుసార్లు🏏సూర్యకుమార్‌ యాదవ్‌- ఏడుసార్లు🏏ఎవిన్‌ లూయీస్‌- ఏడుసార్లు.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌ You keep on counting, he keeps on hitting! 🤩😍𝗠𝗿. 𝗠𝗔𝗫𝗜𝗠𝗨𝗠, Abhishek Sharma, is taking bowlers to the cleaners as he smashes his 5th SIX of the innings! 🔥👏🏻#INDvNZ | 1st T20I | LIVE NOW 👉 https://t.co/o7KbRwpZwK pic.twitter.com/1MyyCmbcP6— Star Sports (@StarSportsIndia) January 21, 2026

KKR appoints Dishant Yagnik as fielding coach10
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా యాజ్ఞిక్‌

కోల్‌కతా: వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దిశాంత్‌ యాజ్ఞిక్‌ను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. దేశవాళీలతో పాటు... ఐపీఎల్‌ అనుభవం ఉన్న ఈ రాజస్తాన్‌ ప్లేయర్‌ రాకతో తమ శిక్షణ బృందం బలం మరింత పెరుగుతుందని కేకేఆర్‌ యాజమాన్యం భావిస్తోంది. ‘యాజ్ఞిక్‌కు అపార అనుభవం ఉంది. అది జట్టుకు ఉపకరించనుంది. ఈసారి ఐపీఎల్‌కు కొత్త సపోర్టింగ్‌ స్టాఫ్‌తో బరిలోకి దిగనున్నాం. హెడ్‌ కోచ్‌గా అభిషేక్‌ నాయర్, మెంటార్‌గా డ్వేన్‌ బ్రావో, అసిస్టెంట్‌ కోచ్‌గా షేన్‌ వాట్సన్, బౌలింగ్‌ కోచ్‌గా టిమ్‌ సౌతీ, పవర్‌ కోచ్‌గా ఆండ్రీ రసెల్‌ వ్యవరిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో యాజ్ఞిక్‌ చేరుతున్నాడు. అతడి కోచింగ్‌ జర్నీలో ఇది ప్రత్యేకంగా నిలవడం ఖాయం’ అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీల్లో రాజస్తాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యాజ్ఞిక్‌... 2011 నుంచి 2014 మధ్య 25 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం వివిధ జట్లకు శిక్షణనిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement