ప్రధాన వార్తలు
ఆ టీమ్కు భారీ షాక్.. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్
ఐపీఎల్-2026లో అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఈ ధనాధన్ లీగ్లో పంజాబ్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 25న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కూపర్ కనోలీ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.కనోలీ ప్రస్తుతం పంజాబ్ క్యాంప్ను వీడి ఫిట్నెస్ పరీక్షల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆల్రౌండర్ అయిన కనోలీకి ఐపీఎల్లో వెన్ను గాయం కారణంగా కేవలం బ్యాటింగ్ చేసేందుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ చివరి నాటికి బౌలింగ్ చేయడానికి అనుమతి లభించే అవకాశమున్నట్లు ఈ ఏడాది సీజన్ ఆరంభానికే ముందు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించేందుకు అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి పిలిపించింది. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధిస్తే బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇవ్వనుంది. కనోలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే గుజరాత్ టైటాన్స్పై 72 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.చివరగా లక్నో సూపర్ జెయింట్స్పై కూడా కేవలం 46 బంతుల్లో 87 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. కనోలీ ప్రస్తుతం 6 మ్యాచ్లలో 223 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది.చదవండి: IPL 2026: సన్రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్?
‘అందుకే రోహిత్ను పక్కన పెట్టాల్సి వచ్చింది’
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అతడి సారథ్యంలోనే భారత్ గెలుచుకుంది. దిగ్గజ కెప్టెన్గా ఎదిగిన రోహిత్కు.. కెరీర్ ఆరంభంలో ఒకానొకనాడు జట్టులో చోటే కరువైంది.ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్కప్ సమయంలో సెలక్టర్లు రోహిత్ శర్మను పక్కనపెట్టారు. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాడు రోహిత్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు వెల్లడిస్తూ.. అతడిని క్షమాపణలు కోరాడు. బాధపడుతూనే ఉన్నాను‘‘ప్రతి ఇంటర్వ్యూలో తాను 2011 వరల్డ్కప్ ఆడటం మిస్సయ్యానని రోహిత్ చెబుతూ ఉన్నాడు. నిజంగా అతడి విషయంలో ఆరోజు జరిగిన దానిపట్ల నేటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. గతేడాది అతడిని కలిసి.. ‘సారీ బాస్.. ఆనాడు మేము ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు’ అని చెప్పాను.అప్పుడు మేము ఆల్రౌండ్ ప్రతిభ గల వాళ్లకే పెద్దపీట వేయాలని భావించాము. 1983 మాదిరే ఈ టోర్నీలో ఆడించాలనే ఆలోచనతో ఉన్నాము. మేము ఊహించినట్లుగానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నిలిచాడు.అందుకే రోహిత్ను పక్కనపె ట్టాల్సి వచ్చిందికొన్ని మ్యాచ్లలో హాఫ్ ఆల్రౌండర్లు కూడా రాణించారు. సెహ్వాగ్, సచిన్, సురేశ్ రైనా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశారు. యూసఫ్ పఠాన్ సైతం హాఫ్ ఆల్రౌండరే. ఈ హాఫ్ ఆల్రౌండర్ కాన్సెప్టులో పడి రోహిత్ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది.పాపం అతడికి జట్టులో చోటు దక్కలేదు. నిజానికి 2011 వరల్డ్కప్ టోర్నీలో ఆడేందుకు అతడు అర్హుడే. కానీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడిని ఎంపిక చేయలేకపోయాము’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా 2011లో ధోని సారథ్యంలో టీమిండియా టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత
సన్రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్?
ఐపీఎల్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు అదిరిపోయే వార్త అందింది. ఏప్రిల్ 25న జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బరిలోకి దిగనున్నాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తన బాధ్యతలను కమ్మిన్స్కు అప్పగించనున్నాడు.కమ్మిన్స్ వెన్ను గాయం కారణంగా ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఆడిన ఏడు మ్యాచ్లకు అందుబాటులో లేడు. అతడు ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఎస్ఆర్హెచ్ క్యాంప్లో చేరాడు. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లోనే కమ్మిన్స్ ఆడుతాడని అంతా భావించారు.కానీ కాస్త ఆసౌకర్యంగా ఉండడంతో టీమ్ సెలెక్షన్ అందుబాటులేకపోయాడు. అయితే రాజస్తాన్తో మ్యాచ్లో మాత్రం కమ్మిన్స్ ఆడడం దాదాపు ఖాయమైంది. అతడు ఇప్పటికే తన ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టాడు. కాగా కమ్మిన్స్ గైర్హజారీలో ఇషాన్ జట్టును అద్భుతంగా నడిపించాడు.అతడి కెప్టెన్సీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ నాలుగింట విజయం సాధించింది. సన్రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. కమ్మిన్స్ సారథిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా ఆకట్టుకుంటున్నాడు. కిషన్ 7 మ్యాచ్లలో 238 పరుగులు చేశాడు. అయితే కమ్మిన్స్ జట్టులోకి వచ్చినప్పటికి ఇషాన్ కిషన్నే కెప్టెన్గా కొనసాగించాలని సంజయ్ బంగర్, హార్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: ధోనికి ఆ హోదా ఇవ్వడం మొదట్లో నచ్చలేదు: మాజీ లెఫ్టినెంట్ జనరల్
సన్రైజర్స్కు వరంలా మారిన సాకిబ్ హుస్సేన్
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా పుంజుకుంది. ఆరంభ మ్యాచ్ల్లో తడబడినా, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఎస్ఆర్హెచ్ జోరు చూస్తేంటే ఈ సీజన్ టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.సీజన్ ప్రారంభంలో బౌలింగ్లో చాలా ఇబ్బంది పడిన ఈ జట్టు యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ రాకతో ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్గా మారిపోయింది. సాకిబ్ తొలి మ్యాచ్లోనే అబ్బురపరిచే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఆ మ్యాచ్లో సాకిబ్ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.అనంతరం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ సాకిబ్ సత్తా చాటాడు. 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. తాజాగా (ఏప్రిల్ 21) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సాకిబ్ మరోసారి జూలు విదిల్చాడు. 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలింగ్ చేసే 21 ఏళ్ల సకీబ్ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతూ ఎస్ఆర్హెచ్ పాలిట వరంలా మారాడు. అతను ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 6 వికెట్లు తీసి సన్రైజర్స్ గెలుపుయాత్రలో ప్రధాన భాగమయ్యాడు. సాకిబ్ ఆడిన 3 మ్యాచ్ల్లో సన్రైజర్స్ గెలిచింది. అలాగే సాకిబ్ 3 మ్యాచ్లు ఆడినా ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు. ఇదే అతన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. సకీబ్ ఇప్పటివరకు వేసిన 72 బంతుల్లో కేవలం 85 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పిసినారి బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా సకీబ్ రాక సన్రైజర్స్ ఫేట్ను మార్చేసింది. ఇతను ఇదే జోరును కొనసాగిస్తే, ఈ సీజన్లో సన్రైజర్స్ను టైటిల్ గెలవకుండా ఆపడం కష్టం.సకీబ్కు మరో యువ పేసర్ ప్రఫుల్ హింగే కూడా తోడయ్యాడు. అతను కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అతను సకీబ్ లాగా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్లో సకిబ్తో పాటు అద్భుత ప్రదర్శన (4-34) చేసిన హింగే ఆతర్వాతి మ్యాచ్లో ధారాళంగా (1-60) పరుగులు సమర్పించుకున్నాడు. సకీబ్, ప్రఫుల్ మాత్రమే కాకుండా ఈ సీజన్లో మరో ఇద్దరు సన్రైజర్స్ బౌలర్లు సత్తా చాటుతున్నారు. శ్రీలంకకు చెందిన పేసర్ ఎషాన్ మలింగ, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ అద్భుతంగా రాణిస్తూ సన్రైజర్స్ విజయాల్లో ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్కు బౌలింగే ప్రధాన సమస్యగా ఉండేది. రెగ్యులర్ కెప్టెన్, జట్టు ప్రధాన పేసర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా సగం సీజన్కు దూరమయ్యాడు. సీనియర్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇలాంటి తరుణంలో ప్రఫుల్, సకీబ్, శివాంగ్ లాంటి దేశీయ బౌలర్లు వచ్చి సన్రైజర్స్ ఫేట్నే మార్చేశారు. త్వరలో కమిన్స్ కూడా వీరికి జత కలిస్తే సన్రైజర్స్ను ఆపడం చాలా కష్టమవుతుంది. ఈ జట్టు బ్యాటింగ్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ ఈ జట్టు సొంతం. ఫీల్డింగ్లో కాస్త మెరుగుపడితే ఈ సీజన్లో సన్రైజర్స్ గెలుపు తధ్యం.
బంగ్లాదేశ్కు షాకిచ్చిన ఐసీసీ!
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. న్యూజిలాండ్తో రెండో వన్డేలో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున.. మ్యాచ్ ఫీజులో కోత విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న తొలి వన్డే జరుగగా కివీస్ గెలుపొందింది.198 పరుగులకు ఆలౌట్ఈ క్రమంలో సోమవారం రెండో వన్డే జరుగగా బంగ్లాదేశ్ జయభేరి మోగించింది. యువ పేసర్ నహీద్ రాణా (5/32) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో చెలరేగి బంగ్లాకు విజయం అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి.. 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. చెలరేగిన నహీద్ఓపెనర్ నిక్ కెల్లీ (102 బంతుల్లో 83; 14 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ టామ్ లాథమ్ (14), హెన్రీ నికోల్స్ (13), విల్ యంగ్ (2), మొహమ్మద్ అబ్బాస్ (19), డీన్ ఫోక్స్ క్రాఫ్ట్ (15), క్లార్క్సన్ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు చేరారు. తన్జిద్, షంటో హాఫ్ సెంచరీలుబంగ్లా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నహీద్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో షరీఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.3 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. తన్జిద్ హసన్ (58 బంతుల్లో 76; 10 ఫోర్లు, 4 సిక్స్లు), నజ్ముల్ హసన్ షంటో (71 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. సైఫ్ హసన్ (8), సౌమ్య సర్కార్ (8), లిటన్ దాస్ (7) విఫలమైనా... లక్ష్యం చిన్నది కావడంతో బంగ్లాదేశ్కు ఎక్కువ ఇబ్బంది కాలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో జైడన్ లెనాక్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది.ఫీజులో 10 శాతం కోతఅయితే, న్యూజిలాండ్తో రెండో వన్డేలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందున ఐసీసీ బంగ్లాకు షాకిచ్చింది. బంగ్లా జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనుందన ఈ మేరకు శిక్ష వేసింది. కాగా బంగ్లాదేశ్- న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే గురువారం జరగనుంది. చట్టోగ్రామ్ ఇందుకు వేదిక.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డుpic.twitter.com/3kSqC7iEUy 🚨 BANGLADESH WIN 🚨BAN vs NZ — 2nd ODI | Sher-e-Bangla, DhakaBangladesh chase down 199 with 6 wickets in hand!The heroes of the win:-Nahid Rana — 5 wickets, dismantled the NZ batting lineup-Tanzid Hasan Tamim — 76 off 58 balls, set the chase on…— Suresh N (@TheDugoutStats) April 20, 2026
డ్రగ్స్ టెస్ట్లో దొరికిపోయిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్రౌండర్ మొహమ్మద్ నవాజ్ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా తేలాడు. ఈ వ్యవహారంపై పాక్ క్రికెట్ బోర్డు విచారణ ప్రారంభించింది. నవాజ్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. నవాజ్ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో డ్రగ్స్ వాడినట్లు నిరూపితమైంది. ఆ మెగా టోర్నీలో అతను 7 మ్యాచ్ల్లో 7 వికెట్లతో పర్వాలేదనిపించాడు. నవాజ్ రాణించినా, ప్రపంచకప్లో పాక్ ఘోరంగా విఫలమై సూపర్-8 దశలోనే ఇంటిముఖం పట్టింది. పీసీబీ విచారణలోనూ నవాజ్ నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శాశ్వత నిషేధం అదనంగా భారీ జరిమానా విధించవచ్చు.కాగా, క్రికెట్లో డ్రగ్స్ వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వినోదం కోసం అయినా నిషేధిత పదార్థాలు వాడితే తీవ్ర శిక్షలు తప్పవు. ఈ ఘటన మరోసారి క్రికెట్లో క్రమశిక్షణ, ప్రొఫెషనల్ ప్రవర్తన ఎంత ముఖ్యమో గుర్తు చేసింది.
ధోనికి ఆ హోదా ఇవ్వడం నచ్చలేదు.. కానీ: మాజీ లెఫ్టినెంట్ జనరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్గా పేరుగాంచాడు మహేంద్ర సింగ్ ధోని. భారత్కు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనుడు. తద్వారా దేశానికి మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్గా నేటికీ కొనసాగుతున్నాడు ధోని.సాహసోపేత నిర్ణయాలతో భారత జట్టు భవితవ్యాన్ని మార్చివేసిన ధోని (MS Dhoni).. జట్టు అవసరాల దృష్ట్యా కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేశాడు. ముఖ్యంగా తనకు కుమార్తె జన్మించిన సమయంలో భార్య దగ్గర ఉండాల్సి ఉన్నా.. జట్టుతోనే ఉండిపోయాడు ధోని. ఇలాంటి త్యాగాలెన్నో అతడి కెరీర్లో ఉన్నాయి.గౌరవ ఆర్మీ ర్యాంకుఈ క్రమంలోనే భారత సైన్యంలో ధోనికి గొప్ప గౌరవం లభించింది. పారాచూట్ రెజిమెంట్లో 2011లో అతడికి లెఫ్టినెంట్ హోదా ఇచ్చి ఆర్మీ సుముచిత గౌరవం కల్పించింది. ఆ తర్వాత కఠినమైన పారాచూట్ శిక్షణ పూర్తి చేసుకున్న ధోని.. ప్రతిష్టాత్మక ‘మెరూన్ బెరెట్’ (headgear) సొంతం చేసుకున్నాడు.మొదట్లో నాకు నచ్చలేదుఈ నేపథ్యంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ధోనికి నాడు దక్కిన గౌరవం గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనికి అసలు ఆ అర్హత ఉందా? అనే సందేహం తనను తొలచివేసిందన్నారు. తాను ధోనికి ఈ హోదా ఇవ్వడాన్ని తాను తొలుత కాస్త వ్యతిరేకించానని.. అయితే, ఆ తర్వాత తన అభిప్రాయం తప్పని తేలిందన్నారు.ఈ మేరకు.. ‘‘అప్పట్లో మా చీఫ్ జనరల్ వీకే సింగ్. అప్పటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనికి గౌరవ ర్యాంకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను మాత్రం అందుకు సుముఖంగా లేను. మెరూన్ బెరెట్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది.పారాట్రూపర్ కావాలంటే కచ్చితంగా ఆర్నెళ్ల పాటు ప్రొబేషన్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో సెలక్షన్ రేటు కేవలం 20 శాతం మాత్రమే. అలాంటిది ఎలాంటి శిక్షణా పొందని వ్యక్తికి మెరూన్ బెరెట్ ఇవ్వడం చాలా తప్పు అని అనిపించింది. ఆ తర్వాత నా అభిప్రాయం మారిపోయింది.నిజమైన సైనికుడుధోని దేశం కోసం చాలా చేశాడు. అతడి విజయాల పట్ల నేను కూడా గర్విస్తున్నాను. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే కెప్టెన్ కూల్. బాగా ఎత్తైన ప్రదేశాలంటే భయమని అతడు నాతో చెప్పాడు. అయినప్పటికీ పారాట్రూపర్గా శిక్షణలో ఎత్తుల మీద నుంచి దూకేశాడు.యూనిఫామ్ ధరించినపుడు అతడిలో ఓ గర్వం ఉండేది. అతడు అచ్చంగా సైనికుడిలాగే కవాతు చేసేవాడు. సైనికుడి మాదిరే వ్యవహరించేవాడు. మనసు నిండా అతడు ఆర్మీని నింపుకొన్నాడని.. తనను తాను నిజమైన సోల్జర్గా భావిస్తున్నాడని నాకు తెలిసింది.ఇంకో విషయం.. ధోని జమ్మూ కశ్మీర్లో మా విభాగాలతో కలిసి అక్కడ పనిచేశాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి మా సైనికులతో కలిసి ప్రయాణాలు చేసేవాడు. నిజంగా అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ఓ పాడ్కాస్ట్లో భాగంగా ధోనిని కొనియాడారు.చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేతThe story behind how MS Dhoni earned the Maroon Beret 🇮🇳 🪖."He went and Served in J&K with our soldiers , He went to the Border" pic.twitter.com/GXMM3cdeHX— MAHIYANK™ (@Mahiyank_78) April 21, 2026
అతడు వైభవ్ సూర్యవంశీ కంటే సమర్దుడు..!
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు యువ క్రికెటర్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కంటే పంజాబ్ యువ కెరటం ప్రియాంశ్ ఆర్య చాలా సమర్థుడని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ప్రియాంశ్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. వైభవ్, అయుశ్ మాత్రే వంటి యువ ఆటగాళ్లతో పోలిస్తే ప్రియాంశ్ ఓ మెట్టు ముందున్నాడని అన్నాడు. ఎవరినీ తక్కువ చేయడం లేదని చెబుతూనే.. ప్రియాంశ్ వద్ద ఉన్న షాట్ల వైవిధ్యం, పెద్ద ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యం ఉందని కితాబునిచ్చాడు. ఈ లక్షణాలు ప్రియాంశ్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని తెలిపాడు.కాగా, అశ్విన్ పొగడ్తలకు ఆనుగుణంగానే ప్రియాంశ్ ఈ ఐపీఎల్ సీజన్లో చెలరేగి ఆడుతున్నాడు. 5 మ్యాచ్ల్లో 248.24 స్ట్రయిక్రేట్తో 211 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. ఈ సీజన్లో పంజాబ్ సాధిస్తున్న వరుస విజయాల్లో ప్రియాంశ్ది ప్రధానపాత్ర. తాజాగా లక్నో 37 బంతుల్లో 93 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అతని కెరీర్ మొత్తంలో హైలైట్గా నిలిచింది. ఇలాంటి ప్రదర్శనలే అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లను ఆకట్టుకున్నాయి.వైభవ్ విషయానికొస్తే.. ఈ బుడ్డోడు కూడా తక్కువేమీ తినలేదు. ఈ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లో రెచ్చిపోయాడు. సీఎస్కే, ఆర్సీబీపై చేసిన మెరుపు హాఫ్ సెంచరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఆర్సీబీపై ఆడిన ఇన్నింగ్స్ (26 బంతుల్లో 78 పరుగులు) అతని టాలెంట్ను ప్రపంచానికి మరోసారి రుచి చూపించింది. అయితే ఇటీవల మ్యాచ్లలో అతని జట్టు విజయం సాధించకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 236.54 స్ట్రయిక్రేట్తో 246 పరుగులు చేసి టాప్-5 లీడింగ్ స్కోరర్ల జాబతాలో ఉన్నాడు.మాత్రే విషయానికొస్తే.. ఇతగాడు కూడా ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఆయుశ్ ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్ల్లో 201 పరుగులు చేసి సీఎస్కే తరఫున నిలకడ ప్రదర్శనలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.మొత్తంగా అశ్విన్ వ్యాఖ్యలు ఎవరిని తగ్గించడానికి చేసినవిగా కనిపించలేదు. ప్రతిభను గుర్తించడంలో భాగంగా చేసినవిగా స్పష్టమయ్యాయి. ప్రియాంశ్తో పోలిస్తే వైభవ్కు అధిక హైప్ దక్కింది. టాలెంట్ విషయం పక్కన పెడితే, ఏజ్ అతనికి అడ్వాంటేజ్గా మారింది. 14-15 ఏళ్ల వయసులో వైభవ్ రెచ్చిపోతున్న విధానం అందరిని ఆకట్టుకుంటుంది. అతడు షాట్లు ఆడే స్టైల్ చూడముచ్చటగా ఉంటుంది. ప్రియాంశ్ సైతం ఇలాగే ఆడుతున్నా, వయసులో వైభవ్ కంటే కాస్త పెద్ద వాడు (24) కావడం, అతనికి ఆశించిన గుర్తింపు దక్కనివ్వలేదు.
ఐపీఎల్ జోరు.. పీఎస్ఎల్ బేజారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఏకకాలంలో జరుగుతున్న నేపథ్యంలో ఏ లీగ్ జోరుగా సాగుతుంది..? ఏ లీగ్ బేజారుగా సాగుతుందన్న విషయాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత సీజన్ నుంచి ఐపీఎల్కు పోటీగా పీఎస్ఎల్ను ఒకే సమయంలో షెడ్యూల్ చేసింది. పీసీబీ తీసుకున్న ఈ తలతిక్క నిర్ణయం పీఎస్ఎల్ అన్ని విధాల నష్టపోతుంది. ఐపీఎల్కు పోటీ కాదు కదా, కనుచూపుమేరల్లో కూడా లేకుండా పోయింది.రెండు లీగ్లు ఒకేసారి జరుగుతుండటం వల్ల సహజంగానే ఐపీఎల్కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. స్వదేశీ, విదేశీ స్టార్లంతా ఇదే లీగ్లో ఉండటంతో ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ లీగ్నే ఫాలో అవుతున్నారు. పీఎస్ఎల్ విషయానికొస్తే.. ఈ లీగ్లో స్వదేశీ ఆటగాళ్లు, ఔట్ డేటెడ్ విదేశీ ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటున్నారు. దీంతో ఈ లీగ్ పరిధి కేవలం పాక్కు మాత్రమే పరిమితమైంది. బయటి దేశాల్లో పీఎస్ఎల్ను ఫాలో అయ్యే వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.ప్రస్తుత సీజన్లో పీఎస్ఎల్తో పోలిస్తే ఐపీఎల్కు అధిక పాపులారిటీ దక్కడానికి మరో కారణం ఐపీఎల్లో జరుగుతున్న విధ్వంసం. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లు పోటాపోటీగా సాగాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బౌలర్లు సైతం ఈ సీజన్లో పని చక్కబెట్టుకున్నారు. అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు, కళ్లు చెదిరే క్యాచ్లకు ఈ సీజన్ ప్రత్యేకమైన వేదిక అయ్యింది.ఈ సీజన్లో 31 మ్యాచ్లు పూర్తి కాగా.. భారీ సంఖ్యలో సిక్సర్లు, బౌండరీలు నమోదయ్యాయి. 4 సెంచరీలు, పదుల సంఖ్యలో అర్ద సెంచరీలు రికార్డయ్యాయి. ఎన్నో పాత రికార్డులు బద్దలయ్యాయి, మరెన్నో కొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. ఏ మాత్రం అంచనాలు లేని బౌలర్లు ఈ సీజన్లో చెలరేగిపోతున్నారు. రొటీన్కు భిన్నంగా పేసర్లు స్పిన్నర్ల కంటే మెరుగ్గా రాణిస్తున్నారు.జట్ల విషయంలోనూ అంచనాలు లేని జట్లే ఈ సీజన్లో దూసుకుపోతున్నాయి. భారీ అంచనాలు ఉన్న జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో పడి ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగక దూసుకుపోతుంది. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాయి. భారీ అంచనాలు ఉన్న ముంబై ఇండియన్స్ గత మూడు నాలుగు సీజన్ల తరహాలోనే స్లో స్టార్ట్ మోడ్లో సాగుతుంది. ఎల్ఎస్జీ, ఢిల్లీ, గుజరాత్ పేపర్పై బలంగా కనిపిస్తున్నా, ఆన్ ఫీల్డ్లో అంచనాలను చేరుకోలేకపోతుంది. సీఎస్కే పరిస్థితి ముంబై ఇండియన్స్ లాగే ఉంది.అంచనాలు ఉన్న జట్లు విఫలమవుతున్నా, అంచనాలు లేని జట్లు అద్భుతాలు చేస్తూ ఈ సీజన్ను రక్తి కట్టిస్తున్నారు. లీగ్ మే 31 వరకు సాగనున్న నేపథ్యంలో మరిన్ని సిత్రాలు చూసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐపీఎల్ ఈ సీజన్లో గతానికి కాస్త భిన్నంగా సాగుతూ అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడా పోటీల రేసులో దూసుకుపోతుంది.పీఎస్ఎల్ విషయానికొస్తే.. ఆ లీగ్ ముగింపుకు దగ్గరగా వచ్చింది. ఇప్పటివరకు ఐపీఎల్ లాగే 31 మ్యాచ్లు జరిగినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన లేదు. బ్యాటింగ్ విభాగం సప్పగా, వన్డే క్రికెట్ను తలపిస్తుండగా.. నాణ్యత లేని బౌలింగ్ జనాలకు బోర్ కొట్టిస్తుంది. ఫీల్డింగ్ గురించి చెప్పుకోకుంటేనే మంచిది. ప్రపంచంలో ఎక్కడా లేని ఫీల్డింగ్ సిత్రాలన్నీ ఈ లీగ్లోనే కనిపిస్తాయి. పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూస్తే నవ్వు ఆపుకోక తప్పదు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు నయం అనిపిస్తుంది.ఈ లీగ్ ఆడుతున్నది అతి తక్కువ మంది విదేశీ ప్లేయర్లు, వీరిలో ఒక్కరు కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ఇదే పరిస్థితి. అడపాదడపా లోకల్ ఆటగాళ్లే కాస్త నయం అనిపిస్తుంది. పాక్కు ఈ లీగ్ వల్ల దక్కే ఊరట ఏదైనా ఉందా అంటే, అది బాబర్ ఆజమ్ ఫామ్లోకి రావడం. ఈ పాక్ స్టార్ బ్యాటర్ ఈ పీఎస్ఎల్ సీజన్లో విశేషంగా రాణిస్తున్నాడు. తాజాగా ఓ సెంచరీ కూడా చేశాడు.ఇది మినహా పీఎస్ఎల్ మొత్తం మూకీ డ్రామాలాగా సప్పగా సాగుతుంది. ఇప్పటికి పెషావర్ జల్మీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ రేసులో ముందు వరుసలో ఉన్నాయి.
బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ద్వారా కీర్తిని గడించిన ఈ ఢిల్లీ స్టార్.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. స్వయంగా ఎన్నో బ్రాండ్లు కూడా కలిగి ఉన్నాడు. వన్8 కమ్యూన్ ద్వారా ఆతిథ్య రంగంలోనూ కోహ్లి అడుగుపెట్టాడు.దేశ వ్యాప్తంగాదేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ చైన్ వ్యాపించి ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్, పుణె, కోల్కతా, నోయిడా, హైదరాబాద్ వంటి సిటీల్లో వన్8 కమ్యూన్కు శాఖలు ఉన్నాయి. అయితే, బెంగళూరులో ఉన్న వన్8 కమ్యూన్ బ్రాంచీ కోర్టు ఆదేశాలతో మూతపడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..అద్దె కట్టకుండా..బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో వన్8 కమ్యూన్ రెస్టారెంట్ ఉంది. ట్రియో హిల్స్ హాస్పిటాలిటీ దీనిని నిర్వహిస్తూ కోహ్లితో భాగస్వామ్యంలో ఉంది. అయితే, గత ఆర్నెళ్లుగా అద్దె చెల్లించడంలో ట్రియో హిల్స్ విఫలమైంది. మెయింటెనెన్స్ కూడా బాకీ పడింది. దీంతో సదరు భవన నిర్మాణ యజమాని ఈ విషయమై సివిల్ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో అద్దె చెల్లించి, యజమానితో సమస్యలు పరిష్కారం చేసుకునేంత వరకు రెస్టారెంట్ను మూసివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా ఇప్పటికే ఈ రెస్టారెంట్కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బంధం తెంచుకున్న కోహ్లిఈ రెస్టారెంట్ అగ్రి పమాద భద్రతకు సంబంధించి నిరభ్యంతర పత్రం (NOC) కూడా పొందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఇప్పటికే తన బ్రాండ్ పేరును తొలగించాల్సిందిగా ట్రియో హిల్స్కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్ల రాక తగ్గిపోయి ఆర్థికంగానూ సదరు రెస్టారెంట్ నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి 247 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఆర్సీబీ ఆరింట నాలుగు విజయాలతో జోరు మీద ఉంది.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు
నా ఫేవరెట్ నేనే...
సాధారణంగా ఏ రంగంలో అయినా... ఉన్నత లక్ష్యాలను నిర్ద...
భారత 95వ గ్రాండ్మాస్టర్గా అరోణ్యక్ ఘోష్
రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్కు చెందిన య...
బాలాజీ జోడీకి డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీర...
జు వెన్జున్తో పోరుకు సిద్ధం: వైశాలి
చెన్నై: మహిళల ప్రపంచ చెస్ చాంపియన్షి ప్ టైటిల్...
ధోనికి ఆ హోదా ఇవ్వడం నచ్చలేదు.. కానీ: మాజీ లెఫ్టినెంట్ జనరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్గా పేరుగాంచాడు మహేంద్ర స...
అతడు వైభవ్ సూర్యవంశీ కంటే సమర్దుడు..!
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు య...
ఐపీఎల్ జోరు.. పీఎస్ఎల్ బేజారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026, పాకిస్తాన్ సూపర్...
బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ గ...
క్రీడలు
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
వీడియోలు
హైదరాబాద్ లో ఢిల్లీ చిత్తు.. శతక్కొట్టిన అభిషేక్
పిచ్చి కూతలు కూసారు.. పిక్చర్ చూపించాడు.. తెలుగోడి విశ్వరూపం
నిమ్మకాయలకు వికెట్లు IPLలో బ్లాక్ మ్యాజిక్
ఇన్స్టా పోస్ట్కు కోహ్లీ లైక్.. మోడల్ షాకింగ్ రియాక్షన్
ఎవ్వడిని వదల్లేదు, RCB పొగరు దింపిన మిల్లర్
కలిసిరాని గ్రీన్ జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..
ముంబై పతనం: రోహిత్ నుంచి బుమ్రా వరకు.పాండ్య బలుపే కారణమా..?
హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్
మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR
