Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Thinner Than Kohli: Fans On Rohit Training Video Virat Gets Mobbed By1
కోహ్లి కంటే సన్నగా!.. కింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్‌!

టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో బిజీ కానుంది. కివీస్‌తో తొలుత మూడు వన్డేలు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత్‌, న్యూజిలాండ్‌ తమ జట్లను ప్రకటించాయి.ఇక జనవరి 11, 14, 18 తేదీల్లో భారత్‌-కివీస్‌ మధ్య జరిగే వన్డే సిరీస్‌కు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) సన్నద్ధమవుతున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తూ శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే!కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత.. టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. తాజా వీడియోలో రోహిత్‌ మరింత బక్కచిక్కినట్లు కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘బ్రో.. కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే! అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం. సూపర్‌ భాయ్‌’’ అంటూ రోహిత్‌ శర్మను ఉద్దేశించి సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Rohit Sharma in the nets. pic.twitter.com/OsFnlwkg40— Mufaddal Vohra (@mufaddal_vohra) January 6, 2026 కింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్‌!మరోవైపు.. దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) కివీస్‌తో తొలి వన్డే కోసం వడోదరలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. కింగ్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం.. అతడికి తీవ్ర అసౌకర్యం కలిగించారు. అతికష్టమ్మీద అతడు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లాడు.#WATCH | Gujarat: Former Indian Captain and Star Cricketer Virat Kohli arrives at Vadodara for Team India's ODI match against New Zealand on 11th January. pic.twitter.com/cQbhCghMZy— ANI (@ANI) January 7, 2026ఇద్దరూ సూపర్‌ ఫామ్‌లోఇటీవల సౌతాఫ్రికాతో సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అదరగొట్టారు. కోహ్లి అయితే వరుస సెంచరీలతో వింటేజ్‌ కింగ్‌ను గుర్తు చేశాడు.ఆ తర్వాత రో-కో దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో సొంత జట్ల తరఫున బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్‌, ఢిల్లీ తరఫున కోహ్లి శతక్కొట్టారు. ఇలా స్టార్లు ఇద్దరూ సూపర్‌ ఫామ్‌లో ఉండటం కివీస్‌తో వన్డేలకు ముందు టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త

we will: Bangladesh Talks About Ind vs Pak After ICC Letter T20 WC2
పాకిస్తాన్‌ మాదిరే మేము కూడా!: బంగ్లాదేశ్‌ ఓవరాక్షన్‌

భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్‌ మరోసారి ఓవరాక్షన్‌ చేసింది. టీ20 ‍ప్రపంచకప్‌-2026 ఆడేందుకు తమ క్రికెట్‌ జట్టును అక్కడికి పంపలేమని పేర్కొంది. అయితే, అదే సమయంలో తాము మాత్రం టోర్నమెంట్‌ను వైదొలిగేందుకు సిద్ధంగా లేమంటూ తమ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది.భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదుఈ విషయం గురించి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం, ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదని మేము ఇప్పటికే ఐసీసీకి అర్థమయ్యేలా చెప్పాము.మరింత స్పష్టంగా ఈరోజు రాత్రికో.. రేపు ఉదయమో మరోసారి ఇదే విషయాన్ని వారికి చెబుతాము. బంగ్లాదేశ్‌ భద్రత, గౌరవం, మర్యాద విషయంలో మేము ఎంతమాత్రము రాజీపడబోము. అయితే, మేము కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొంటాము’’ అని నజ్రుల్‌ పేర్కొన్నాడు.మరోవైపు.. అమినుల్‌ పాకిస్తాన్‌ పేరును ప్రస్తావిస్తూ తమకు కూడా అలాంటి వెసలుబాటు కావాలని డిమాండ్‌ చేశాడు. ‘‘చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అలాగే గత వరల్డ్‌కప్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ భారత్‌కు రాలేదు.పాకిస్తాన్‌ మాదిరే మేము కూడాకాబట్టి మా విషయంలోనూ పాక్‌ మాదిరే ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్‌ టోర్నీల్లో హైబ్రిడ్‌ మోడల్‌ కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఇందుకు భద్రతే ప్రధాన కారణం. కాబట్టి మాకు సానుకూల స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమినుల్‌ అన్నాడు.కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై హత్యాకాండ నేపథ్యంలో.. ఐపీఎల్‌ నుంచి ఆ దేశ ఆటగాళ్లను బహిష్కరించాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకు అనుగుణంగానే బీసీసీఐ.. ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు నుంచి తొలగించేలా ఆదేశాలు ఇచ్చింది.ఐసీసీ తిరస్కరించే అవకాశం?ఈ క్రమంలో భద్రత అనే కారణం చూపుతూ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ కోసం తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్‌ పేర్కొంది. అయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయమే ఉన్నందున ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌ కోరినట్లు శ్రీలంకలో వారి మ్యాచ్‌లు నిర్వహించడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో తొలుత తాము టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి కనబరిచిన బంగ్లా.. తాజాగా ఇలా మాట్లాడటం గమనార్హం.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త

Vaibhav Aaron Tons India won By 233 Runs Clean Sweep Vs SA U193
IND vs SA: కెప్టెన్‌ వైభవ్‌ సూపర్‌ హిట్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా అరంగేట్రంలోనే వైభవ్‌ సూర్యవంశీ అదరగొట్టాడు. అతడి సారథ్యంలోని యువ భారత్‌ సౌతాఫ్రికాను తమ స్వదేశంలోనే మట్టికరిపించింది. మూడు యూత్‌ వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి సఫారీ గడ్డపై జయభేరి మోగించింది.తొలిసారి సారథిగాబెనోని వేదికగా మూడో యూత్‌ వన్డేలో ఏకంగా 233 పరుగుల తేడాతో సౌతాఫ్రికా అండర్‌-19 జట్టును చిత్తు చేసి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre) గైర్హాజరీ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తొలిసారి భారత యువ జట్టు పగ్గాలు చేపట్టాడు.సౌతాఫ్రికాతో యూత్‌ వన్డే సిరీస్‌లో భాగంగా బ్యాటర్‌గా, సారథిగా వైభవ్‌ రాణించాడు. తొలి రెండు వన్డేల్లో గెలిచి ఇప్పటికే సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌.. బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేలోనూ అదరగొట్టింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వైభవ్‌ సేన నిర్ణీత 50 ఓవర్లలో 393 పరుగుల భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన ఆరోన్‌, వైభవ్‌ఓపెనర్లు ఆరోన్‌ జార్జ్‌ (106 బంతుల్లో 118), వైభవ్‌ సూర్యవంశీ (74 బంతుల్లో 127) శతక్కొట్టగా.. మిగిలిన వారు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక 63 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్‌.. యూత్‌ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో (14 ఏళ్ల తొమ్మిది నెలలు) ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.కిషన్‌ కుమార్‌ సింగ్‌ దెబ్బకుసౌతాఫ్రికా బౌలర్లలో టాండో సోనీ మూడు వికెట్లు తీయగా.. జేసన్‌ రోవెల్స్‌ రెండు, మైకేల్‌ క్రుయిస్‌కాంప్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రొటిస్‌ యువ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్‌ పేసర్‌ కిషన్‌ కుమార్‌ సింగ్‌ దెబ్బకు టాపార్డర్‌ కకావికలమైంది.ఓపెనర్లు జెరిచ్‌ వాన్‌ షాల్విక్‌ (1), అద్నాన్‌ లగడెయిన్‌ (9) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్‌డౌన్‌లో వచ్చిన లెతాబో ఫహ్లమ్‌హొలక డకౌట్‌ అయ్యాడు. ఈ ముగ్గురిని అవుట్‌ చేసి కిషన్‌ శుభారంభం అందించగా.. మిగతా బౌలర్లు దానిని కొనసాగించారు.వైభవ్‌ సూర్యవంశీ బౌలింగ్‌లోఇక ప్రొటిస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ముహమద్‌ బుల్‌బులియా (4) కూడా తీవ్రంగా నిరాశపరచగా.. జేసన్‌ రోవెల్స్‌ 19 పరుగులు చేయగలిగాడు. డేనియల్‌ బోస్మాన్‌ (40), పాల్‌ జేమ్స్‌ (41), కోర్నె బోతా (36 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. మిగిలిన వారిలో మైకేల్‌ (1), జేజే బాసన్‌ (1) తేలిపోగా.. వైభవ్‌ సూర్యవంశీ బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా టాండో సోనీ (6) వెనుదిరగడంతో భారత్‌ గెలుపు ఖరారైంది.భారత బౌలర్లలో కిషన్‌ కుమార్‌ మూడు, మొహమెద్‌ ఇనాన్‌ రెండు వికెట్లతో సత్తా చాటగా.. హెనిల్‌ పటేల్‌, కనిష్క్‌ చౌహాన్‌, ఉద్ధవ్‌ మోహన్‌, ఆర్‌ఎస్‌ అంబరీశ్‌, లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయగల వైభవ్‌ సూర్యవంశీ తలా ఒక వికెట్‌​ తీశారు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించిన వైభవ్‌ సూర్యవంశీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు లభించాయి. చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త

Shreyas Iyer: fitness clearance from BCCI available for entire IND vs NZ ODIs4
IND vs NZ: టీమిండియాకు శుభవార్త

న్యూజిలాండ్‌తో వన్డేలకు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ పునరాగమనానికి మార్గం సుగమమైంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE) నుంచి శ్రేయస్‌ అయ్యర్‌కు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ లభించింది.అంతా సజావుగా సాగితే.. శ్రేయస్‌ (Shreyas Iyer) న్యూజిలాండ్‌తో మూడు వన్డేలకు అందుబాటులో ఉంటాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ ముంబై బ్యాటర్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరు 25న సిడ్నీలో ఆసీస్‌ (Ind vs Aus)తో మూడో వన్డే సందర్భంగా క్యాచ్‌ పట్టబోయి అదుపు తప్పి కిందపడిపోయిన శ్రేయస్‌ పక్కటెములకు తీవ్ర గాయమైంది.అంతర్గత రక్తస్రావందీంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం.. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో చాన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉన్న శ్రేయస్‌.. క్రమంగా కోలుకున్నాడు. అయితే, ఆటకు మాత్రం దాదాపు రెండు నెలలు దూరంగా ఉన్నాడు.రీఎంట్రీ ధనాధన్‌ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, ఫిట్‌నెస్‌ ఆధారంగానే అతడు అందుబాటులో ఉండే విషయం తేలుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌తో ముంబై కెప్టెన్‌గా శ్రేయస్‌.. కాంపిటేటివ్‌ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు.వచ్చీరాగానే ధనాధన్‌ దంచికొట్టి 36 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా 53 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. అంతేకాదు కెప్టెన్‌గానూ రాణించి.. ముంబై క్వార్టర్‌ ఫైనల్‌ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ సీఓఈ నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ పొంది స్వదేశంలో కివీస్‌తో వన్డే (జనవరి 11, 14, 18)లకు సిద్ధమయ్యాడు.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. వరల్డ్‌ రికార్డు

Ashes: Jacob Bethell Becomes First England Player In 149 Years To5
Ashes: అత్యంత అరుదైన రికార్డు

ఇంగ్లండ్‌ యువ క్రికెటర్‌ జేకబ్‌ బెతెల్‌ అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. కెరీర్‌లో సాధించిన తొలి టెస్టు సెంచరీతోనే చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ సరసన చేరాడు.యాషెస్‌ సిరీస్‌ 2025-26 (Ashes)లో భాగంగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆతిథ్య ఆసీస్‌ తొలి మూడు టెస్టులు గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోగా.. నాలుగో మ్యాచ్‌లో గెలవడంతో ఇంగ్లండ్‌కు ఊరట లభించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలైంది.సిడ్నీలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇందుకు ఆసీస్‌ ధీటుగా బదులిచ్చింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 567 పరుగులు సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లిష్‌ జట్టు.. బుధవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది.జేకబ్‌ బెతెల్‌ సెంచరీతోఇందుకు ప్రధాన కారణం జేకబ్‌ బెతెల్‌ (Jacob Bethell) ఇన్నింగ్స్‌. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 232 బంతులు ఎదుర్కొని.. పదిహేను ఫోర్లు బాది 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన కెరీర్‌లో టెస్టుల్లో తొలి సెంచరీ బాదిన 22 ఏళ్ల బెతెల్‌ అరుదైన ఘనతలు సాధించాడు.కపిల్‌ దేవ్‌ సరసనకాగా బెతెల్‌ 2024లో సౌతాఫ్రికాతో వన్డేల్లో తొలి శతకం బాదాడు. తాజాగా యాషెస్‌లో భాగంగా ఆసీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో మొదటిసారి శతక్కొట్టాడు. తద్వారా తన కెరీర్‌లో ఫస్ట్‌ క్లాస్‌, లిస్ట్‌-ఎ సెంచరీలను అంతర్జాతీయ క్రికెట్‌లోనే నమోదు చేశాడు. దేశీ క్రికెట్‌లో అతడి ఖాతాలో ఇంత వరకు ఒక్క సెంచరీ లేదన్న మాట.ఈ జాబితాలో టీమిండియా లెజెండ్‌ కపిల్‌ దేవ్‌తో పాటు వెస్టిండీస్‌కు చెందిన మార్లన్‌ సామ్యూల్స్‌, బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ మెహిదీ హసన్‌ మిరాజ్‌, ఐర్లాండ్‌ ఆటగాడు కర్టిస్‌ కాంఫర్‌ ఉన్నారు. ఈ అరుదైన జాబితాలో తాజాగా చేరిన జేకబ్‌ బెతెల్‌.. ఈ ఘనత సాధించి తొట్టతొలి ఇంగ్లండ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. దాదాపు 149 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ తరఫున ఈ రేర్‌ రికార్డు సాధించింది అతడే కావడం గమనార్హం. చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. వరల్డ్‌ రికార్డు

Bangladesh deny getting ultimatum from ICC T20 WC issue statement6
ICC: అబ్బే అదేం లేదు!.. మా మాట విన్నారు!

తమ అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తిరస్కరించిందన్న వార్తలను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఖండించింది. ఐసీసీ తమకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఐసీసీ హామీ ఇచ్చింది‘‘మా విజ్ఞప్తిపై ఐసీసీ స్పందించింది. భారత్‌లో టీ20 ప్రపంచకప్‌-2026 మ్యాచ్‌ల నేపథ్యంలో.. మా ఆటగాళ్ల భద్రత విషయంలో మేము లేవెనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. మ్యాచ్‌ల వేదికలను మార్చాలనే మా విజ్ఞప్తిపై కూడా బదులిచ్చింది.మేము ఈ టోర్నమెంట్లో కొనసాగేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఐసీసీ హామీ ఇచ్చింది. ఈ సమస్యలపై మా నుంచి ఇన్‌పుట్స్‌ తీసుకుని బీసీబీతో కలిసి పనిచేస్తామని తెలిపింది. భద్రత విషయంలో మాతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది.వరల్డ్‌కప్‌ ఆడతాంటోర్నీలో కొనసాగే విషయమై మాకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదు. ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఐసీసీతో పాటు ఈవెంట్‌ నిర్వహిస్తున్న వారితో మా బోర్డు ప్రొఫెషనల్‌గానే ముందుకు సాగుతుంది. వరల్డ్‌కప్‌లో మేము తప్పక పాల్గొంటాము.ఇందుకు సంబంధించిన ప్రక్రియ సజావుగా సాగేందుకు.. మా సమస్యకు సరైన పరిష్కారం వెదికేందుకు సిద్ధంగా ఉన్నాము. ఏదేమైనా మా ఆటగాళ్ల భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం’’ అని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు తన ప్రకటనలో పేర్కొంది.ఆటగాడి తొలగింపు.. ఐపీఎల్‌ అక్కడ బ్యాన్‌!కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో.. భారత్- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్య వివాదంలో ముదిరిన విషయం తెలిసిందే. మార్చి నుంచి జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచ్‌లను తమ దేశంలో ప్రసారం చేయరాదని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లా సమాచార, ప్రసార శాఖమంత్రి నిర్ధారించారు. ఐపీఎల్‌నుంచి తమ దేశం ఆటగాడు ముస్తఫిజుర్‌ రహమాన్‌ను అనూహ్యంగా తప్పించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ కనిపించరాదని నిర్ణయించింది.అంతేకాదు.. తమ ఆటగాళ్ల భద్రతపై సందేహాలు ఉన్నాయంటూ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను భారత్‌నుంచి శ్రీలంకకు మార్చాలంటూ ఐసీసీకి శనివారం విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో పంచాయితీ ఐసీసీ వద్దకు చేరింది. టోర్నీకి నెలరోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వేదికలు మార్చడం కుదరని బీసీబీకి ఐసీసీ ‍స్పష్టం చేసినట్లు బుధవారం వార్తలు వచ్చాయి. అందుకే యూటర్న్‌?ఒకవేళ బంగ్లాదేశ్‌ ఈ టోర్నీ నుంచి వైదొలగానుకున్నా ఫర్వాలేదని చెప్పినట్లు ప్రముఖ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్లు వెల్లడించాయి. అయితే, బీసీబీ మాత్రం వీటిని ఖండిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. టోర్నీ నుంచి తప్పుకొంటామని ముందుగా బెదిరింపు ధోరణి అవలంబించిన బీసీబీ.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని భావించి యూటర్న్‌ తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ముఖం మీద కొట్టినట్లు.. యువీ దెబ్బకు అల్లాడినా.. నాలో కసి పెరిగి...

Vaibhav Suryavanshi 63 Ball Ton Scripts History World Record7
చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. వరల్డ్‌ రికార్డు

భారత అండర్‌-19 స్టార్‌ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరోసారి శతక్కొట్టాడు. సౌతాఫ్రికా అండర్‌-19 జట్టుతో బుధవారం నాటి మూడో యూత్‌ వన్డేలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇరవై నాలుగు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్‌.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు.ప్రపంచ రికార్డుకేవలం 63 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూత్‌ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఈ అరుదైన ఫీట్‌ అందుకున్నాడు.127 పరుగులుబెనోనీ వేదికగా ఈ మ్యాచ్‌లో మొత్తంగా 74 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌ సూర్యవంశీ.. తొమ్మిది ఫోర్లు, పది సిక్స్‌లు బాది 127 పరుగులు సాధించాడు. టాండో సోని బౌలింగ్‌లో జేసన్‌ రోవెల్స్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ విధ్వంసకర శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక మరో ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ సైతం దుమ్ములేపాడు.227 పరుగుల భాగస్వామ్యంఆరోన్‌తో కలిసి వైభవ్‌.. తొలి వికెట్‌కు ఏక​ంగా 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మరోవైపు.. ఆరోన్‌ సైతం శతక్కొట్టాడు. 106 బంతుల్లో 16 ఫోర్లు బాది 118 పరుగులు సాధించి జేసన్‌ రోవెల్స్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. మిగిలిన వారిలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ వేదాంత్‌ త్రివేది 34, అభిజ్ఞాన్‌ కుందు 21 పరుగులు చేయగా.. మొహమద్‌ ఎనాన్‌ 28, హెనిల్‌ పటేల్‌​ 19 పరుగులతో అజేయంగా నిలిచారు. హర్‌వన్ష్‌ పంగాలియా (2), ఆర్‌ఎస్‌ అంబరిష్‌ (8), కనిష్క్‌ చౌహాన్‌ (10) విఫలమయ్యారు. ఫలితంగా భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది.కెప్టెన్‌గా మొదటిసారే..కాగా ఆయుశ్‌ మాత్రే గైర్హాజరీలో సౌతాఫ్రికా పర్యటనలో వైభవ్‌ సూర్యవంశీ తొలిసారిగా భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తూ ఇప్పటికే తొలి రెండు యూత్‌ వన్డేల్లో గెలిచి.. సారథి హోదాలో తొలి సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు వైభవ్‌. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చదవండి: బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌

Slap In The Face: Broad Stunning Take On Yuvraj Singh 6 Sixes In 1 Over8
చితక్కొట్టాడు.. యువీ దెబ్బకు అల్లాడినా..

ఇంగ్లండ్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు స్టువర్ట్‌ బ్రాడ్‌. టెస్టుల్లో ఏకంగా 604 వికెట్లు కూల్చి.. సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 178 వన్డే, 65 అంతర్జాతీయ టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.ఇంతటి గొప్ప రికార్డు కలిగి ఉన్న స్టువర్ట్‌ బ్రాడ్‌కు కెరీర్‌ ఆరంభంలోనే ఓ చేదు అనుభవం ఎదురైంది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌-2007లో టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) బ్రాడ్‌కు పీడకల మిగిల్చాడు. అతడి బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది.. అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.21 ఏళ్ల వయసులో..మరోవైపు.. ఇలా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా బ్రాడ్‌ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 క్రికెట్‌లో యువీ ఐకానిక్‌ ఫీట్‌ నమోదు చేసిన ఆ సమయంలో.. ఈ రైటార్మ్‌ పేసర్‌ వయసు 21 ఏళ్లే. అయితే, ఆ చేదు అనుభవం నుంచి బ్రాడ్‌ త్వరగానే కోలుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి మేటి బౌలర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.యువీ దెబ్బకు అల్లాడినా..తాజాగా... గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న స్టువర్ట్‌ బ్రాడ్‌.. యువీ దెబ్బకు అల్లాడినా.. ఆ తర్వాత ఎలా నిలదొక్కుకున్నాడో చెప్పుకొచ్చాడు. ‘‘అప్పటికి నేను ఏడు నుంచి ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడి ఉంటాను. ఇంకా టెస్టు క్రికెట్‌లో అరంగేట్రమే చేయలేదు. అప్పుడు నా జట్టు పొడవుగా.. బంగారు వర్ణంలో ఉండేది.ఐదేళ్ల కెరీర్‌ సేవ్‌ అయింది20-21 ఏళ్ల మధ్య వయసు. ఉరకలెత్తే ఉత్సాహం. అలాంటపుడు ఊహించని విధంగా.. నా ముఖం మీద కొట్టినట్లుగా బ్యాటర్‌ బాదుతూ ఉంటే నేను ఏమైపోవాలి?.. అయితే, ఆట ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆరంభంలోనే అంతా సజావుగా సాగిపోతే 26-27 ఏళ్లకే అంతా సాధించేశాము అన్న భావన వచ్చేస్తుంది. అంకితభావం కొరవడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.వారియర్‌ మోడ్‌ఫామ్‌లో లేకుంటే జట్టు నుంచి తప్పించనూ వచ్చు. 31 ఏళ్లు వచ్చే సరికి అంతా ముగిసిపోతుంది. కానీ నాకు 21 ఏళ్ల వయసులో తగిలిన ‘దెబ్బ’ నాలో కసిని రగిల్చింది. మరుసటి ఐదేళ్లు ఎలా ఆడాలో.. ఆటను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలిసేలా చేసింది. నన్ను ‘వారియర్‌ మోడ్‌’లోకి తీసుకువెళ్లింది.ప్రతి మ్యాచ్‌కు ముందు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా చేసింది. అలా 25-26 ఏళ్ల వయసు వచ్చే సరికి ఎలైట్‌ పర్ఫార్మర్‌ కావాలనే కోరిక పెరిగింది. అందకు తగినట్లుగా కృషి చేశా. కానీ ఒక్కోసారి నా శరీరం ఇందుకు సహకరించలేదు. కాబట్టి అనుకున్నది అనుకున్న సమయంలో సాధించకలేకపోయాను.అందుకే ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేనింకా మెరుగ్గా ఆడాల్సింది అని అనిపిస్తుంది’’ అని మాథ్యూ హెడెన్‌ పాడ్‌కాస్ట్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా 344 మ్యాచ్‌లలో కలిపి 847 వికెట్లు కూల్చిన 39 ఏళ్ల బ్రాడ్‌.. 2023లో ఆటకు గుడ్‌బై చెప్పాడు.చదవండి: బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌

Cricket Deserves Truth: Indian Presenter Ridhima Pathak On Her BPL Exit9
బంగ్లాదేశ్‌ అంత పని చేసిందా?.. నేనే తప్పుకొన్నా!

భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య క్రికెట్‌ వివాదం ముదురుతోంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో.. ఐపీఎల్‌ నుంచి ఆ దేశ ఆటగాళ్లను తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తమ జట్టులో ఉన్న ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను విడుదల చేసింది.షాకిచ్చిన ఐసీసీఈ క్రమంలో బంగ్లాదేశ్‌ టీమిండియా టూర్‌కు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేయగా.. ఈ పర్యటనపై తాము నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాబోమంటూ బంగ్లా క్రికెట్‌ బోర్డు ప్రగల్భాలు పలకగా.. ఐసీసీ ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైనందున యథావిధిగా మ్యాచ్‌లు సాగుతాయని స్పష్టం చేసింది.బంగ్లాదేశ్‌ అంత పని చేసిందా?ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (BPL) నుంచి భారత స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ రిధిమా పాఠక్‌ (Ridhima Pathak)ను తొలగించారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ఆమె స్వయంగా స్పందించింది. తనకు దేశమే మొదటి ప్రాధాన్యం అని.. అందుకే తానే లీగ్‌ నుంచి వైదొలిగినట్లు సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేసింది.దేశం కోసం నేనే తప్పుకొన్నా!‘‘నన్ను బీపీఎల్‌ నుంచి తొలగించారని గత కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. ఈ లీగ్‌ నుంచి తప్పుకోవాలనే నేనే నిర్ణయించుకున్నాను. దేశ ప్రయోజనాలే నాకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం.అదే విధంగా ఆట పట్ల కూడా నాకు నిబద్ధత ఉంది. ఇన్నాళ్లుగా స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా నిజాయితీ, అంకితభావం, గౌరవం, ప్యాషన్‌తో పనిచేశాను. దీనిలో ఇక ముందు కూడా ఎలాంటి మార్పూ ఉండదు. క్రికెట్‌ సమగ్రత కోసం నేను ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఉంటాను.ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. క్రికెట్‌ విషయంలో నిజం చెప్పడం ముఖ్యం. ఇకపై ఈ అంశం గురించి నేను స్పందించను. జై హింద్‌’’ అని రిధిమా పాఠక్‌ పేర్కొంది. చదవండి: సచిన్‌ కొడుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

Australian Open organisers announce record prize money10
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీ రూ. 675 కోట్లు

మెల్‌బోర్న్‌: ఈ సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పోటీపడే టెన్నిస్‌ ప్లేయర్ల ప్రైజ్‌మనీ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 111.5 మిలియన్‌ ఆసీస్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ. 675 కోట్లు. గత ఏడాది ప్రైజ్‌మనీ 96.5 మిలియన్‌ ఆసీస్‌ డాలర్ల (రూ.584 కోట్లు)తో పోల్చితే 16 శాతం పెరిగిందని టెన్నిస్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ క్రెయిగ్‌ టిలే వెల్లడించారు. పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు 4.15 మిలియన్‌ ఆసీస్‌ డాలర్లు (రూ.25.15 కోట్లు) చొప్పున అందజేస్తారు. సింగిల్స్‌ విజేతల ప్రైజ్‌మనీ ఏకంగా 19 శాతం పెంచారు. అలాగే మెయిన్‌ డ్రా ఆడే సింగిల్స్, డబుల్స్‌ ఆటగాళ్ల ప్రైజ్‌మనీ కూడా 10 శాతం మేర పెంచినట్లు నిర్వాహకులు ఆయన తెలిపారు. 2023 నుంచి టెన్నిస్‌ ప్లేయర్లకు ప్రోత్సాహకాలను భారీ పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 18 నుంచి మెల్‌బోర్న్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ జరుగుతుంది. క్వార్టర్స్‌లో సాకేత్‌ జోడీ బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకెత్‌ మైనేని బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మంగళవారం సాకేత్‌ మైనేని–ఆదిల్‌ కల్యాణ్‌పూర్‌ జోడీ 7–6 (7/3), 4–6, 13–11తో సుమిత్‌ నగాల్‌ (భారత్‌)–లాయిడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా) ద్వయంపై పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్‌లో సాకేత్‌ జంట 3 ఏస్‌లు బాదగా... సుమిత్‌ నగాల్‌ ద్వయం 8 ఏస్‌లు సంధించింది. 3 డబుల్‌ ఫాల్ట్‌లు చేసిన సాకేత్‌–ఆదిల్‌ జోడీ... ఒక బ్రేక్‌ పాయింట్‌ సాధించింది. సాకేత్‌ జంట మొత్తం 78 పాయింట్లు గెలుచుకోగా... నగాల్‌ ద్వయం 69 పాయింట్లకు పరిమితమైంది. గురువారం జరగనున్న క్వార్టర్‌ ఫైనల్లో ఆర్థర్‌ రేమాండ్‌–లుకా సాంచెజ్‌ (ఫ్రాన్స్‌) ద్వయంతో... సాకేత్‌–ఆదిల్‌ జంట అమీతుమీ తేల్చుకోనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement