Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND vs PAK Will 100 Percent Happen: Ashwin T20 WC Prediction PCB Boycott1
T20 WC 2026: ‘భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది’

భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదులు తలపడుతుంటే ఇరు దేశాల అభిమానులే కాదు.. క్రికెట్‌ ప్రపంచం మొత్తం స్క్రీన్లకే అతుక్కుపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా గడిచిపోయింది.ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే భారత్‌- పాక్‌ ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తర్వాత నుంచి ఈ రెండు దేశాల్లో ఒకటి ఆతిథ్యం ఇస్తే.. తటస్థ వేదికపైనే మ్యాచ్‌లు జరిగేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ భారత్‌లో జరుగుతుండగా.. పాక్‌ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడనుంది.పాక్‌ ఓవరాక్షన్‌అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామని పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల పోరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రం టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ వందకు వంద శాతం జరిగితీరుందని అభిప్రాయపడ్డాడు.వందకు వంద శాతం జరుగుతుంది‘‘వచ్చే మూడు- నాలుగు రోజుల్లో పాక్‌ నిర్ణయం తారుమారు అవుతుంది. వందకు వంద శాతం భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందరిలాగే నేనూ దాయాదుల పోరును చూడాలని గట్టిగా అనుకుంటున్నాను.ఈ మ్యాచ్‌ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు.. పాక్‌ ఇప్పుడు తప్పుకొంటే ఆర్థికంగా బాగా నష్టపోవాల్సి ఉంటుంది. తమ వల్ల కలిగిన నష్టాన్ని బ్రాడ్‌కాస్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ టోర్నీలో మిగతా దేశాలు కూడా ఉన్నాయి.ఇతర బోర్డులకూ నష్టమేపాక్‌ వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తుందని ఐసీసీ సమావేశంలో ఆయా దేశాల బోర్డులు వాదిస్తాయి. త్వరలోనే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కూడా జరుగనుంది. ఈ ఈవెంట్‌కు తమ ఆటగాళ్లను వెళ్లకుండా నిలువరించే అవకాశాలు కూడా ఉన్నాయి.అయినా ఈసారి పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని చెప్పడం సమంజసమే కాదు. ఈసారి పాక్‌ తటస్థవేదిక మీదే పాక్‌ తమ మ్యాచ్‌లు ఆడబోతోంది. అయినా సరే టోర్నీలో ఒక్క జట్టుతో మాత్రమే ఆడము అని చెప్పడం ఏరకంగానూ ఆమోదయోగ్యనీయం కాదు. పూర్తిగా తప్పుకోకుండా ఒక్క జట్టుతో మ్యాచ్‌ను బహిష్కరించడం టెక్నికల్‌గా సరికాదు’’ అని అశూ పేర్కొన్నాడు.ఇప్పటికే బంగ్లా అవుట్‌కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్‌ ఐసీసీని కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదంటూ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. గడువు ఇచ్చినా బంగ్లా వైఖరి మారకపోడంతో టోర్నీ నుంచి ఆ జట్టును తప్పించింది. అయితే, పాక్‌ బంగ్లాదేశ్‌కు వంతపాడుతూ భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణ అంటూ నాటకానికి తెరతీసింది. కాగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.చదవండి: T20 WC 2026: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. మేఘం కురిస్తే...

 U19 WC 2026 IND v AFG Semis: Vaibhav Suryavanshi Fiery 33 Ball 68 Video2
World Cup 2026: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం

భారత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గనిస్తాన్‌పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు ధనాధన్‌ దంచికొట్టాడు.24 బంతుల్లోనే..కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 68 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.𝐅𝐀𝐒𝐓. 𝐅𝐄𝐀𝐑𝐋𝐄𝐒𝐒. 𝐅𝐈𝐅𝐓𝐘.Vaibhav Sooryavanshi goes full throttle in the SEMI-FINAL chase! 🚀#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/skcIOVMznz— Star Sports (@StarSportsIndia) February 4, 2026సుడిగాలి ఇన్నింగ్స్‌వైభవ్‌ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్‌ కారణంగా భారత్‌ తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులు చేసింది. అయితే, భారత ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో నూరిస్తాని ఒమర్‌జాయ్‌ బౌలింగ్‌లో మూడో బంతికి.. ఒస్మాన్‌ సదాత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ సూర్యవంశీ పెవిలియన్‌ చేరాడు. కాగా ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌తో కలిసి మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ తొలి వికెట్‌కు 57 బంతుల్లో 90 పరుగులు జోడించాడు.311 పరుగుల లక్ష్యంకాగా వరల్డ్‌కప్‌ రెండో సెమీ ఫైనల్లో భాగంగా జింబాబ్వేలోని హరారే వేదికగా టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాలతో చెలరేగారు.ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి అఫ్గనిస్తాన్‌ 310 పరుగులు సాధించింది. అఫ్గన్‌ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమే లభించింది. పది ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి యువ భారత జట్టు వికెట్‌ నష్టానికి 91 పరుగులు చేసింది.చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు

More Trouble Pak Likely To Miss Out On Potential T20 WC Super 8 Spot Why3
T20 WC: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందే పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్‌.. తాజాగా భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.భారత్‌ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) పాక్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) ఓవరాక్షన్‌ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.భారత్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకుంటే..ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్‌.. టీమిండియాతో మ్యాచ్‌ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్‌ క్రికెట్‌ భవిష్యత్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్‌ 8 చేరే అవకాశాలను కూడా పాక్‌ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్‌ టోర్నీలో పాక్‌.. భారత్‌, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌, నమీబియాతో కలిసి గ్రూప్‌-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్‌.. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఇందుకు వేదిక.వాన పడే అవకాశంఅయితే, ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్‌ ఆ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.ఇక లీగ్‌ దశలో ఆఖరిగా పాక్‌.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్‌ ఆడకపోతే పాక్‌ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.నెట్‌రన్‌రేటుపై ప్రభావంమరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్‌, నమీబియాలతో మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే నెట్‌రన్‌ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్‌లో పాక్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్‌లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్‌ ఓడిపోయి సూపర్‌-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.తాజా ఎడిషన్‌లోనూ పాక్‌కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్‌ రద్దు.. రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్‌ సూపర్‌-8 చేరడం కష్టమే అనిపిస్తోంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు

U19 WC 2026 IND v AFG Semis: Faisal Uzairullah Centuries Afg Record4
WC 2026: భారత బౌలర్లు విఫలం.. అఫ్గనిస్తాన్‌ భారీ స్కోరు

ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇందుకు తోడు భారత జట్టు ఫీల్డింగ్‌ తప్పిదాలతో అఫ్గన్‌ బ్యాటర్లుకు లైఫ్‌ ఇచ్చింది. ఫలితంగా అఫ్గనిస్తాన్‌ భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన ఫైజల్‌ షినోజాదాజింబాబ్వేలోని హరారే వేదికగా వరల్డ్‌కప్‌ రెండో సెమీస్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఒస్మాన్‌ సదాత్‌ (39), ఖలీద్‌ అహ్మద్‌జాయ్‌ (31) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఫైజల్‌ షినోజాదా (Faisal Shinozada) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఉజైరుల్లా అజేయ శతకంమొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న ఫైజల్‌.. 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. మరోవైపు.. రనౌట్‌ ప్రమాదాల నుంచి తప్పించుకున్న నాలుగో నంబర్‌ బ్యాటర్‌ ఉజైరుల్లా నియాజాయ్‌ (Uzairullah Niazai) సైతం శతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 86 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫైజల్‌- ఉజైరుల్లా కలిసి మూడో వికెట్‌కు 130 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా అఫ్గనిస్తాన్‌ ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 111 పరుగులు రాబట్టింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గన్‌ జట్టు ఏకంగా 310 పరుగులు సాధించింది.𝙄𝙩 𝙩𝙤𝙤𝙠 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙩𝙤 𝙨𝙩𝙤𝙥 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 ✨Deepesh Devendran goes through the gate to hand #TeamIndia a vital wicket 👊#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/eVzeiSfryl— Star Sports (@StarSportsIndia) February 4, 2026ఈ ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరుఅండర్‌-19 వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌, కనిష్క్‌ చౌహాన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అఫ్గన్‌ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టగలదు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: WC 2026: ఆసీస్‌ అవుట్‌.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌

Dont do this: Ponting reveals pleading to DC to keep Abhishek Sharma5
వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు!

టీ20 ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టీమిండియా స్టార్‌ అభిషేక్‌ శర్మ. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున సత్తా చాటి.. భారత జట్టులోకి వచ్చిన ఈ పంజాబీ ఆటగాడు.. అనతికాలంలోనే ఓపెనర్‌గా పాతుకుపోయాడు.విధ్వంసకర ఇన్నింగ్స్‌కు మారుపేరుగా మారి ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అభిషేక్‌ శర్మ (Abhishek Sharma). ఇప్పటికే తన ధనాధన్‌ ఆటతో ఎన్నో రికార్డులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. టీ20 ప్రపంచకప్‌-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.మొదటి ఐపీఎల్‌ కోచ్‌ను నేనేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ (Ricky Ponting) అభిషేక్‌ శర్మ గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ విధ్వంసకర బ్యాటర్‌కు మొదటి ఐపీఎల్‌ కోచ్‌ను తానేనని.. అతడు భవిష్యత్తు సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని నాడే అంచనా వేశానని పేర్కొన్నాడు.కాగా అభిషేక్‌ శర్మ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అప్పుడు పాంటింగ్‌ ఢిల్లీ కోచ్‌గా ఉన్నాడు. ఇక ఆర్సీబీతో తన తొలి మ్యాచ్‌లోనే అభిషేక్‌ శర్మ.. ఆరో స్థానంలో వచ్చి 19 బంతుల్లోనే 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో తాజాగా నాటి విషయాలు గుర్తు చేసుకున్న రిక్కీ పాంటింగ్‌.. అభిషేక్‌ శర్మను దూరం చేసుకోవద్దని తాను ఢిల్లీ యాజమాన్యానికి ఎంతగానో చెప్పిచూశానని తెలిపాడు. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం 2019 వేలానికి ముందు అతడిని ట్రేడ్‌ చేసిందని వెల్లడించాడు.భవిష్య సూపర్‌స్టార్‌.. వద్దని మొత్తుకున్నా వినలేదు"అతడికి మొదటి ఐపీఎల్‌ కోచ్‌ నేనే. నా మార్గదర్శనంలోనే అతడు అరంగేట్రం చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఢిల్లీ తరఫున రంగంలోకి దిగి.. ఆరంభంలోనే అదరగొట్టాడు. తొలి బంతినే బౌలర్‌ మీదుగా స్ట్రెయిట్‌గా బౌండరీకి తరలించాడు. క్లాసీ షాట్లతో అలరించాడు.అప్పుడే అతడు ఓ ప్రత్యేకమైన ఆటగాడని నాకు అర్థమైంది. కానీ ఢిల్లీ యాజమాన్యం మాత్రం అతడిని ట్రేడ్‌ చేయాలని ఫిక్సైంది. అప్పుడు నేను అలా చేయవద్దని మొత్తుకున్నా వినలేదు. భవిష్య సూపర్‌స్టార్‌ ఇతడేనని బలంగా నమ్మాను. అదే విషయం వాళ్లకి చెప్పాను. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండేవి’’ అని రిక్కీ పాంటింగ్‌ ఐసీసీ రివ్యూతో పేర్కొన్నాడు.ధావన్‌ కోసం ట్రేడ్‌ చేసిన ఢిల్లీకాగా శిఖర్‌ ధావన్‌ కోసం ఒప్పందం చేసుకునే క్రమంలో ఢిల్లీ అభిషేక్‌ శర్మను సన్‌రైజర్స్‌కు ట్రేడ్‌ చేసింది. ఇక సన్‌రైజర్స్‌కు మారిన తర్వాత అభిషేక్‌ సృష్టించిన పరుగుల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి 71 ఇన్నింగ్స్‌లో 162కు పైగా స్ట్రైక్‌రేటుతో 1753 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టీమిండియా తరఫున ఇప్పటికి 38 మ్యాచ్‌లు ఆడి 1297 రన్స్‌ రాబట్టిన అభిషేక్‌ శర్మ ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: భారత్‌-పాక్‌ టీ20 ప్రపంచకప్‌ వార్‌.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా

T20 WC 2026 IND vs USA: No Ishan Kishan Chahal Names His India XI6
IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్‌కు నో ఛాన్స్‌!

పొట్టి క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7)న తెరలేవనుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలుత కొలంబో వేదికగా పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌.. ఆ తర్వాత కోల్‌కతాలో వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌.. అనంతరం ముంబై వేదికగా టీమిండియా- అమెరికా (IND vs USA) జట్లు తలపడతాయి.ఇందుకోసం ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సంజూ శాంసన్‌ (Sanju Samson)ను ఓపెనర్‌గా కొనసాగిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.వరుస వైఫల్యాలుగత కొన్నాళ్లుగా సంజూ ఫామ్‌లేమి (10, 6, 0, 24, 6)తో సతమతమవుతుండటం ఇందుకు కారణం. అదే సమయంలో.. చాన్నాళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చి ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ (103)తో అదరగొట్టాడు.తిలక్‌ వర్మ పునరాగమనంకాగా తిలక్‌ వర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైనంద వల్ల ఇషాన్‌ అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చాడు. అయితే, వరల్డ్‌కప్‌ టోర్నీతో తిలక్‌ వర్మ పునరాగమనం చేయనున్నాడు. దీంతో ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసి.. సంజూపై మేనేజ్‌మెంట్‌ వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇషాన్‌కు నో ఛాన్స్‌ఇలాంటి తరుణంలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఆసక్తికర అంచనాతో ముందుకు వచ్చాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. అమెరికాతో తలపడే భారత తుదిజట్టును ఎంచుకున్న చహల్‌.. ఇషాన్‌ కిషన్‌ను పక్కనపెట్టడం విశేషం. అభిషేక్‌ శర్మతో కలిసి సంజూ శాంసన్‌ ఓపెనింగ్‌ చేయాలని అతడు అభిప్రాయపడ్డాడు.ఇక మూడో స్థానంలోకి తిలక్‌ వర్మ తిరిగివస్తాడన్న చహల్‌.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ యథావిధిగా నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు. హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌.. మిడిలార్డర్‌, ఫినిషర్‌ పాత్రలు పోషిస్తారని తెలిపాడు.కుల్దీప్‌నకు కూడా మొండిచేయితన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తికి చోటిచ్చిన చహల్‌.. ఇద్దరు స్పెషలిస్టు సీమర్లుగా జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో టాపార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌తో పాటు.. స్పిన్‌ దళంలో కుల్దీప్‌ యాదవ్‌కు చహల్‌ మొండిచేయి చూపాడు. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌.. పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌, నమీబియాలతో కలిసి గ్రూప్‌-‘ఎ’లో ఉంది.టీ20 వరల్డ్‌కప్‌-2026లో అమెరికాతో మ్యాచ్‌కు చహల్‌ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.చదవండి: ఇషాన్‌ కిషన్‌కు అండగా విరాట్‌ కోహ్లి.@yuzi_chahal picks his playing XI for India’s opening fixture! 👀 💪🏻Just 4 days to go before the defending champions begin their journey on T20 cricket’s biggest stage with one clear mission: 𝗥𝗘𝗣𝗘𝗔𝗧 & 𝗗𝗘𝗙𝗘𝗔𝗧 history 🔥🤩ICC Men’s #T20WorldCup 2026 👉 #INDvUSA |… pic.twitter.com/X9KsBx2CjQ— Star Sports (@StarSportsIndia) February 3, 2026

What is Force Majeure Clause which can Pakistan use it as a legal defence for India boycott7
'ఫోర్స్‌ మజ్యూర్‌' క్లాజ్‌ను చూసుకొని ధీమాగా ఉన్న పాక్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్‌–పాకిస్తాన్‌ పోరు చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్‌ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. పాక్‌ ముందస్తు వ్యూహాల్లో భాగంగానే ఈ బాయ్‌కాట్‌ డ్రామాకు తెరలేపింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌ పాక్‌కు రాలేదని, అందుకు ప్రతిగా చివరి నిమిషంలో ఈ బాయ్‌కాట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీని వల్ల బీసీసీఐ, ఐసీసీకి నష్టం చేకూర్చాలన్నదే పాక్‌ ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ తాము కూడా నష్టపోతామని తెలిసినా పాక్‌ ఈ సాహసానికి పూనుకుంది. ఇందుకు కారణం ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌.ఏంటా ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌..? ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ (Force Majeure Clause) అనేది ఒప్పందాల్లో ఉండే ఓ నిబంధన. ఈ నిబంధన అనుకోని మరియు నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే, సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి పరిస్థితులు ఏర్పడితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయడం అసాధ్యం అవుతుంది. అప్పుడు సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందుతుంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొనే పాక్‌ భారత్‌తో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ రద్దు విషయంలో డ్రామాలాడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకొనే ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్లాజ్‌ తమను చట్టపరంగా కాపాడుతుందని భావిస్తుంది. అయితే ఇక్కడే పాక్‌ ఓ సున్నితమైన విషయాన్ని విస్మరిస్తుంది. ప్రపంచకప్‌ మొత్తం ఆడి, భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మాత్రమే బహిష్కరిస్తామని స్పష్టం చేసి, పప్పులో కాలేసింది. ఇలా ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బాయ్‌కాట్‌ చేస్తామనేది ఐసీసీ-పాక్‌ క్రికెట్‌ బోర్డు చేసుకున్న ఒప్పందాలకు విరుద్దం.ఒప్పందాల్లో పాక్‌ భారత్‌తో తటస్థ వేదికలపై ఆడేందుకు ఒప్పుకుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామనేది ఒప్పందాలకు విరుద్ధం. ఇక్కడ పీసీబీ ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ను చూపించి తప్పించుకోవచ్చని ధీమాగా ఉంది. అయితే ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన ముందస్తు ఒప్పందంలో ‌ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ లేదని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. పాక్‌ జట్టు మొత్తం టోర్నమెంట్‌ ఆడుతోంది. కేవలం భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తోంది. ఇది అసాధ్యత కాదు, ఎంచుకున్న అసౌకర్యం. ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ selective participationకి వర్తించదని ఐసీసీ స్పష్టం చేయడంలో పాక్‌ వర్గాల్లో భయం మొదలైంది. భారత్‌తో మ్యాచ్‌ జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నందుకు రద్దు అంశాన్ని రద్దు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని పీసీబీ ఐసీసీకి ఇంకా లిఖితపూర్వకంగా తెలియజేయలేదు కాబట్టి రద్దుపై పాక్‌ యూటర్న్‌ తీసుకునే ఛాన్స్‌ ఉంది. లేదు ఇలాగే ముందుకెళ్దాం అని పాక్‌ భావిస్తే మాత్రం తిప్పలు తప్పవు. ఆ జట్టు చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ICC Under 19 world cup 2026 Semi Final 2: Afghanistan won the toss and choose to bat8
ప్రపంచకప్‌ సెమీఫైనల్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌

అండర్‌ 19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 4) రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. హరారే వేదికగా భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ మహబూబ్‌ ఖాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో పాక్‌తో ఆడిన జట్టునే కొనసాగించారు. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌ తాడోపేడో తేల్చుకుంటుంది.తుది జట్లు..ఆఫ్ఘనిస్తాన్: ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జాయ్, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(w/c), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్జాయ్, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్‌భారత్‌: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్

Jay Shah appoints Singapore administrator to ceasefire IND vs PAK T20 World Cup war9
భారత్‌-పాక్‌ టీ20 ప్రపంచకప్‌ వార్‌.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య టీ20 ప్రపంచకప్‌ పంచాయితీలో ఐసీసీ జోక్యం చేసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ను పాక్‌ బాయ్‌కాట్‌ చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ అధ్యక్షుడు జై షా రంగప్రవేశం చేశారు. ఈ సున్నితమైన అంశాన్ని పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తిని నియమించారు. సింగపూర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన అనుభవజ్ఞుడైన నిర్వాహకుడు ఇమ్రాన్‌ ఖ్వాజాను ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్‌ చేశారు. ఖ్వాజా గతంలో ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌గా పనిచేసి, అన్ని ప్రధాన క్రికెట్‌ బోర్డులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన పీసీబీతో చర్చలు జరిపి, పాకిస్తాన్‌ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖ్వాజా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్‌ తమ నిర్ణయాన్ని మార్చుకొని, భారత్‌తో మ్యాచ్‌ ఆడుతుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ పాక్‌ ఖ్వాజా మధ్యవర్తిత్వాన్ని కూడా బేఖాతరు చేస్తే, ఐసీసీ నిబంధనలను సైతం పక్కకు పెట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జై షా చాలా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పాక్‌కు చివరి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతను ఖ్వాజాను మధ్యవర్తిత్వానికి పంపాడు. టెక్నికల్‌గా ఉండే లూప్‌ హోల్స్‌ను వాడుకుంటూ పాక్‌ డ్రామాలు ఆడుతుందన్నది షా వాదన. ఈ విషయమై పీసీబీ లిఖితపూర్వక సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటుంది. ఒకవేళ ఐసీసీ చేసే అన్ని ప్రయత్నాలు విఫలమై పాక్‌ భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడకూడదనే నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఆ జట్టే తీవ్రంగా నష్టపోతుంది. ప్రపంచకప్‌ వరకు మ్యాచ్‌ పాయింట్లు కోల్పోతుంది. అలాగే ఈ మ్యాచ్‌ జరగకపోవడం​ వల్ల కలిగే నష్టాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనంతరం ఆర్దిక, పాలనా పరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్‌ పోటీలు ప్రారంభమవుతాయి. అదే రోజు భారత్‌, పాక్‌ తమ తొలి మ్యాచ్‌లు ఆడతాయి. పాక్‌ నెదర్లాండ్స్‌తో.. భారత్‌ యూఎస్‌ఏతో తలపడతాయి. పాక్‌ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడుతుంది.

DHONI RATES INDIAN TEAM IN T20 WC 2026 AS ONE OF THE MOST DANGEROUS TEAMS EVER10
ఈ జట్టుతో మామూలుగుండదు.. అత్యంత ప్రమాదకరమైంది..!

త్వరలో ప్రారంభం​ కానున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా అభివర్ణించాడు. ఈ జట్టులో అవసరమైన అన్ని అంశాలు (అనుభవం, బలమైన బ్యాటింగ్‌, అద్భుతమైన బౌలింగ్‌) సమగ్రంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అయితే రాత్రి వేళల్లో తేమ ప్రభావం ఆందోళన కలిగిస్తుందని అన్నాడు. ఈ విషయంలో టీమిండియా అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించాడు. టాస్‌ చాలా కీలకమవుతుందని అంచనా వేశాడు. మాహి అన్‌ప్లగ్డ్‌ అనే కార్యక్రమం సందర్భంగా ధోని ఈ విషయాలను షేర్‌ చేసుకున్నాడు.కోహ్లి, రోహిత్‌ ఎందుకు ఆడకూడదు..?ఇదే కార్యక్రమం సందర్భంగా ఇంటర్వూయర్‌ ధోనిని విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ గురించి అడిగాడు. వారిద్దరు 2027 వన్డే వరల్డ్‌కప్‌ ఆడగలరా అని ప్రశ్నించాడు. దీనిపై ధోని స్పందిస్తూ.. ఆటగాళ్లకు వయసు ఎప్పుడూ ప్రమాణం కాదు. ప్రదర్శన మరియు ఫిట్‌నెస్‌ మాత్రమే అసలు ప్రమాణాలు. దేశం కోసం కృషి చేయాలనుకున్నప్పుడు ఎవరినైనా ఎందుకు ఆపాలి.అనుభవం ఒక్కసారిగా రాదు. 20 ఏళ్ల ఆటగాడికి అనుభవం ఉండదు, సచిన్ టెండూల్కర్‌ లాంటి అసాధారణ ప్రతిభ తప్ప. కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. ప్రదర్శన ఉంటే జట్టులో ఉంటారు, లేకపోతే ఉండరు అని అన్నాడు.ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది. ఇటీవలికాలంలో ధోని చెప్పినట్లుగానే టీమిండియా చాలా ప్రమాదకరంగా ఉంది. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 51-8 విన్-లాస్‌ రికార్డు సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో టీమిండియా అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టమైన జట్టుగా ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ సూర్యతో పాటు ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శివమ్‌ దూబే అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, వరుణ్ చక్రవర్తి ఉరకలేస్తున్నారు. ప్రపంచకప్‌లో వీరిని ఆపడం ఏ జట్టుకైనా సామర్థ్యానికి మించిన పనే అవుతుంది. భారత్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో జరిగే మ్యాచ్‌తో మొదలుపెడుతుంది. భారత్‌.. పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌ జట్లతో గ్రూప్‌-ఏలో ఉంది. ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అనుమానంగా ఉంది. భద్రతా కారణాలంటూ ఈ మ్యాచ్‌ను పాక్‌ బాయ్‌కాట్‌ చేసుకుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement