Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Gujarat Pacer Ashok Sharma Bowled Fastest Ball of IPL 20261
IPL 2026: సరికొత్త ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం

ఐపీఎల్‌ ద్వారా మరో భారత టాలెంట్‌ బయటపడింది. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 4) రాత్రి (7:30 గంటలకు) ప్రారంభమైన మ్యాచ్‌లో ఓ అద్భుతం జరిగింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు చెందిన అనామక బౌలర్‌ అశోక్‌ శర్మ నిప్పులు చెరిగాడు. ఊహించని విధంగా గంటకు 154 కిమీ వేగంతో బౌలింగ్‌ చేశాడు. ఐపీఎల్‌ 2026లో ఇప్పటివరకు ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ 16వ చివరి బంతికి అశోక్‌ మెరుపు వేగంతో బంతిని సంధించాడు. ఈ బంతిని ఎదుర్కొన్న ధృవ్‌ జురెల్‌ పరుగు సాధించలేకపోయాడు.ప్రస్తుత సీజన్‌లో అశోక్‌ శర్మ తర్వాత అత్యంత వేగవంతమైన బంతి లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే (150.9) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానాల్లో కార్తీక్‌ త్యాగి (149.7), రబాడ (149.1), ఓవర్టన్‌ (145.6) ఉన్నారు.ఓవరాల్‌గా ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి షాన్‌ టైట్‌ పేరిట ఉంది. 2011 ఎడిషన్‌లో ఇతను రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతూ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌పై ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో టాప్‌-5 వేగవంతమైన బంతులు ఇలా ఉన్నాయి.157.71 కిమీ/గం - షాన్ టైట్ (2011)157.4 కిమీ/గం - గెరాల్డ్ కోయెట్జీ (2024)157.3 కిమీ/గం - లాకీ ఫెర్గూసన్ (2022)157.0 కిమీ/గం - ఉమ్రాన్ మాలిక్ (2022)156.22 కిమీ/గం - అన్రిచ్ నోర్ట్జే (2020)మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. జురెల్‌ (75), జైస్వాల్‌ (55) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్‌ సూర్యవంశీ (31) పర్వాలేదనిపించాడు. మిగతా ఆటగాళ్లలో రియాన్‌ పరాగ్‌ 4, హెట్‌మైర్‌ 18, డొనొవన్‌ ఫెరియెరా ఒక పరుగు చేసి ఔట్‌ కాగా.. రవీంద్ర జడేజా (7), జోఫ్రా ఆర్చర్‌ (1) అజేయంగా నిలిచారు. గుజరాత్‌ బౌలర్లలో రబాడ 2, సిరాజ్‌, అశోక్‌ శర్మ, ప్రసిద్ద్‌ కృష్ణ, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను గుజరాత్‌ కూడా ధాటిగానే ప్రారంభించింది. 7.1 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (47) చెలరేగి ఆడుతున్నాడు. అతనికి కుమార్‌ కుషాగ్రా (18) అండగా ఉన్నాడు.

DC VS MI: A Rare Incident in IPL 20262
ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 4) మధ్యాహ్నం (3:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడగా.. ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. ఢిల్లీ మరో 11 బంతులు మిగిలుండగానే (18.1 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సమీర్‌ రిజ్వి (90) వరుసగా రెండో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి ఢిల్లీని గెలిపించాడు.అంతకుముందు లక్నోపై కూడా రిజ్వి (70 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ​్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఢిల్లీ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ముంబైపై తాజా హాఫ్‌ సెంచరీ రిజ్వికి ఐపీఎల్‌లో వరుసగా మూడవది. గత ఎడిషన్‌ చివరి మ్యాచ్‌లోనూ (పంజాబ్‌) అతను అజేయ హాఫ్‌ సెంచరీ (58) సాధించాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ ఓ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఢిల్లీ లక్ష్యానికి చేరువైన తరుణంలో (16.4వ ఓవర్‌) స్ట్రయికర్‌ (మిల్లర్‌), నాన్‌ స్ట్రయికర్‌ (ట్రిస్టన్‌ స్టబ్స్‌), బౌలర్‌ (కార్బిన్‌ బాష్‌), వికెట్‌కీపర్‌ (ర్యాన్‌ రికెల్టన్‌, ముంబై) నలుగురూ సౌతాఫ్రికన్లే ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్‌ చరిత్రలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది.గతంలో ఒకే దేశానికి చెందిన నలుగురు ఇలా వేర్వేరు పోజిషన్లలో ఆడిన దాఖలాలు ఇప్పటివరకు రికార్డు కాలేదు. ఒకవేళ ఇలాంటి ఘట్టాలు ఎక్కడైనా నమోదైనా, సౌతాఫ్రికన్లు ఆ నాలుగు పోజిషన్లలో ఉండి ఉండే అవకాశం మాత్రం లేదు. ఫ్రాంచైజీ లీగ్‌ పుణ్యమా అని ఇలాంటి సిత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి.

Sameer Rizvis Fiery Knock Powers DC To Big Win Over MI3
సమీర్ రిజ్వీ సంచలనం.. ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ సాధించింది. 163 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.1 ఓవ‌ర్ల‌లో చేధించింది.ఢిల్లీ యువ సంచ‌ల‌నం స‌మీర్ రిజ్వీ మ‌రోసారి సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన రిజ్వీ.. ముంబై బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. ఓ ద‌శ‌లో తొలి ఐపీఎల్ సెంచ‌రీ చేసేలా క‌న్పించిన రిజ్వీ.. ఓ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి త‌న వికెట్‌ను కోల్పోయాడు. మొత్తంగా 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి రిజ్వీ ఔటయ్యాడు. అతడితో పాటు పాటు ఫాథుమ్ నిస్సాంక 44 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్‌, శాంట్నర్, బాష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్‌(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(35), నమన్‌ధీర్‌(28) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, అక్షర్ పటేల్‌, నిగమ్‌, నటరాజన్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. సమీర్‌ రిజ్వీకి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.చదవండి: IPL 2026: అర్జున్ సంచలన బౌలింగ్‌.. స్టంప్స్ ఎగిరిపోయాయి! వీడియో

IPL 2026 Match 9: Gujarat Titans vs Rajasthan Royals Updates4
గుజరాత్‌పై రాయల్స్‌ గెలుపు

స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌106 పరుగుల వరకు కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి గెలుపు దిశగా సాగిన గుజరాత్‌.. స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది. రవి బిష్ఱోయ్‌ (3-0-31-4) ఒక్కసారిగా చెలరేగి గుజరాత్‌ను దెబ్బకొట్టాడు. 15 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 161-7గా ఉంది. రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌10.4వ ఓవర్‌- 107 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో తుషార్‌ దేశ్‌పాండేకు క్యాచ్‌ ఇచ్చి సాయి సుదర్శన్‌ (73) ఔటయ్యాడు. తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్‌ 8వ ఓవర్‌ చివరి బంతికి తొలి వికెట్‌ కోల్పోయింది. రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్‌ ఇచ్చి కుమార్‌ కుషాగ్రా (18) ఔటయ్యాడు.ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్‌భారీ లక్ష్య ఛేదనను గుజరాత్‌ కూడా ధాటిగానే ప్రారంభించింది. 7.1 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (47) చెలరేగి ఆడుతున్నాడు. అతనికి కుమార్‌ కుషాగ్రా (18) అండగా ఉన్నాడు. రాయల్స్‌ భారీ స్కోర్‌టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.జురెల్‌ (75), జైస్వాల్‌ (55) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్‌ సూర్యవంశీ (31) పర్వాలేదనిపించాడు. నాలుగో వికెట్‌ కోల్పోయిన రాయల్స్‌15.3వ ఓవర్‌- 165 పరుగుల వద్ద రాయల్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అశోక్‌ శర్మ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి హెట్‌మైర్‌ (18) ఔటయ్యాడు. జైస్వాల్‌ (55) ఔట్‌12.3వ ఓవర్‌-126 పరుగుల వద్ద రాయల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. జురెల్‌కు (31) జతగా రియాన్‌ పరాగ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. వైభవ్‌ సూర్యవంశీ (31) ఔట్‌6.2వ ఓవర్‌- 70 పరుగుల వద్ద రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వైభవ్‌ సూర్యవంశీ ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న జైస్వాల్‌, సూర్యవంశీటాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాయల్స్‌ ధాటిగా ఆడుతుంది. పవర్‌ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) ఆ జట్టు 69 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (35), వైభవ్‌ సూర్యవంశీ (31) చెలరేగి ఆడుతున్నారు.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాయల్స్‌ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 4) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించనుండటమే రియాన్‌ నిర్ణయానికి కారణం. ఈ మ్యాచ్‌కు గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌ ఆడటం లేదు. గిల్‌ స్థానంలో రషీద్‌ ఖాన్‌ టాస్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌ కోసం రాయల్స్‌ రెండు మార్పులు చేసింది. బ్రిజేష్‌ శర్మ స్థానంలో తుషార్‌ దేశ్‌పాండే.. రవి బిష్ణోయ్‌ స్థానంలో శుభమ్‌ దూబే జట్టులోకి వచ్చారు. గుజరాత్‌ విషయానికొస్తే.. గిల్‌ స్థానంలో కుమార్‌ కుషాగ్రా తన తొలి మ్యాచ్‌ ఆడనున్నాడు. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగుతుంది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్: కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(c), కగిసో రబడ, అశోక్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణఇంపాక్ట్ సబ్స్‌: షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, మానవ్ సుతార్, అనుజ్ రావత్, జయంత్ యాదవ్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మఇంపాక్ట్ సబ్స్: రవి బిష్ణోయ్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సుశాంత్ మిశ్రా, బ్రిజేష్ శర్మ, రవి సింగ్

Arjun Tendulkar Bowls Stunning Deliveries In Viral Video5
అర్జున్ సంచలన బౌలింగ్‌.. స్టంప్స్ ఎగిరిపోయాయి

సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్‌-2026 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ నుంచి రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు అర్జున్‌ను లక్నో కొనుగోలు చేసింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అయితే అర్జున్‌కు లక్నో తుది జట్టులో దక్కలేదు.లక్నో తమ రెండో మ్యాచ్‌లో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో లక్నో షేర్ చేసింది. ఈ వీడియోలో 26 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ తన యార్కర్లతో స్టంప్స్‌ను పడగొడుతూ కనిపించాడు. అతడు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావడంతో బంతిని లోపలికి స్వింగ్ చేస్తూ లెగ్-స్టంప్, ఆఫ్-స్టంప్స్‌ను పడగొట్టిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అర్జున్‌కు తర్వాతి మ్యాచ్‌లో ఆడే అవకాశమివ్వాలని కామెంట్లు పెడుతున్నారు. అయితే మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్‌, మోహ్షిన్ ఖాన్, నోర్జే వంటి స్టార్ పేసర్లు ఉండడంతో లక్నో ప్లేయింగ్ ఎలెవన్‌లో అర్జున్‌కు చోటు దక్కడం కష్టంగా మారింది.చదవండి: IPL 2026: ఎస్ఆర్‌హెచ్‌కు షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్‌Arjun in Arjun mode 🥵 pic.twitter.com/Z3DMHHrhtx— Lucknow Super Giants (@LucknowIPL) April 4, 2026

New Zealand Beat South Africa By 66 Runs, Clinch WODI Series 2-16
గ్రీన్‌ భారీ సెంచరీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా సౌతాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన మూడో వ‌న్డేలో 66 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో న్యూజిలాండ్ అమ్మాయిల జ‌ట్టు సొంతం చేసుకుంది. ఈ సిరీస్ డిసైడ‌ర్ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 306 ప‌రుగులు చేసింది.కివీస్ ఆరంభంలోనే సుజీ బేట్స్‌(0), ప్లిమ్మ‌ర్‌(1), అమీలియా కెర్‌(0) వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో న్యూజిలాండ్ మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్ద‌రూ నాలుగో వికెట్‌కు 211 ప‌రుగుల రికార్డు భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.మ్యాడీ గ్రీన్ (128 బంతుల్లో15 ఫోర్లతో 141 నాటౌట్‌) అజేయ సెంచరీతో సత్తాచాటగా.. హాలిడే (98) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో అయాండా హ్లూబి, తుమి సెఖుఖునే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. నడైన్‌ డిక్లార్క్‌, మలబా చెరో వికెట్‌ సాధించారు.అనంతరం 307 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వడర్ట్‌(69) టాప్‌ స్కోరర్‌గా నిలవగా..అన్నెరీ డెర్క్సెన్(47), ట్రయన్‌(29) ఫర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు రెండు కూడా మాడీ గ్రీన్‌కే దక్కాయి.

Back to back failures for KL Rahul in IPL 20267
రాహుల్‌ మరోసారి..!

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌లో తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌటైన ఇతను.. ముంబై ఇండియన్స్‌తో ఇవాల్టి (ఏప్రిల్‌ 4) మ్యాచ్‌లో ఖాతా తెరిచిన వెంటనే ఇన్నింగ్స్‌ను ముగించాడు.రాహుల్‌ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆందోళన మొదలైంది. ఆ జట్టు ఫ్యాన్స్‌ రాహుల్‌ను బహిరంగంగా టార్గెట్‌ చేస్తున్నారు. జట్టులో అందరి కంటే సీనియర్‌వి.. మిగతా ఆటగాళ్లను ఆదర్శంగా ఉండాలంటూ చురకలంటిస్తున్నారు. మరోపక్క టీమిండియా సీనియర్లతో కంపేర్‌ చేస్తూ నిందిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ రాణించారు. రాహుల్‌ మాత్రమే ఎందుకు విఫలమవుతున్నాడని ఫీలవుతున్నారు.ఇదిలా ఉంటే, రాహుల్‌ విఫలమైన ​తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ గట్టెక్కిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాహుల్‌ సహా నిస్సంక, నితీశ్‌ రాణా, అక్షర్‌ పటేల్‌ విఫలమైనా, సమీర్‌ రిజ్వి (70 నాటౌట్‌) అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్‌ స్టబ్స్‌ (39 నాటౌట్‌) సహకరించాడు.ముంబై ఇండియన్స్‌తో నేటి మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతుంది. 7 పరుగులకే రాహుల్‌, నితీశ్‌ రాణా (0) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. నిస్సంక (39), సమీర్‌ రిజ్వి (7) ఢిల్లీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముకేశ్‌ కుమార్‌ 2, ఎంగిడి, అక్షర్‌ పటేల్‌, విప్రాజ్‌ నిగమ్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు. కుల్దీప్‌ యాదవ్‌ (3-0-31-0) మినహా ఢిల్లీ బౌలర్లంతా పొదుపుగా కూడా బౌలింగ్‌ చేశారు. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (51) అర్ద సెంచరీతో రాణించగా.. రోహిత్‌ శర్మ (35) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు.

We recently Reaches out to BCCI: BCB Confirms After T20 WC Pull out8
బీసీసీఐకి మా రిక్వెస్ట్‌.. లేఖలో ఆ విషయాలు: బంగ్లాదేశ్‌

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించినట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తాజాగా ధ్రువీకరించింది. భారత్‌తో క్రికెట్‌ సంబంధాల పునరుద్ధరణ కోసం తాము ముందడుగు వేసినట్లు తెలిపింది. కాగా గత కొంతకాలంగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా క్రికెట్‌ సంబంధాలు కూడా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.భద్రతా కారణాలు చూపుతూఈ క్రమంలో బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి బీసీసీఐ తొలగించగా.. టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు భారత్‌కు వచ్చేందుకు బంగ్లా నిరాకరించింది. భద్రతా కారణాలు చూపుతూ తమ వేదికను శ్రీలంకను మార్చమని ఐసీసీని కోరగా.. ప్రతికూల నిర్ణయం రావడంతో టోర్నీ నుంచే తప్పుకొంది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు వంత పాడుతూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు బీసీసీఐపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసింది. ఐసీసీ సైతం బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గి బంగ్లాదేశ్‌కు అన్యాయం చేసిందని ఆరోపించింది. ఇందుకు ప్రతిగా తాము భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రగల్భాలు పలికి బొక్కబోర్లా పడింది.భారీగా నష్టపోయే ప్రమాదంఐసీసీ రంగంలోకి దిగడంతో టీమిండియాతో మ్యాచ్‌ ఆడటమే కాకుండా.. యథావిధిగా మరోసారి ఓటమిని మూటగట్టుకుంది పాకిస్తాన్‌. ఈ ఎపిసోడ్‌తో బంగ్లాదేశ్‌ ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం వచ్చిపడింది. ఆదేశంలోని మెజారిటీ ప్లేయర్ల క్రికెట్‌ కిట్లకు స్పాన్సర్లుగా ఉన్న భారత కంపెనీలు వైదొలుగుతాయనే భయం పట్టుకుంది.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు మాజీ క్రికెటర్లు బంగ్లా బోర్డును హెచ్చరించారు కూడా!.. ఈ క్రమంలో తాజాగా బీసీబీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో బీసీబీ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ నజ్ముల్‌ అబెదిన్‌ ఫాహిమ్‌ ANIతో మాట్లాడుతూ కీలక విషయం వెల్లడించాడు. బీసీసీఐని సంప్రదించాము‘‘వివిధ దేశాల క్రికెట్‌ బోర్డులతో మేము సమన్వయం చేసుకుంటున్నాము. ఇటీవలే బీసీసీఐని కూడా సంప్రదించాము. ఇ-మెయిల్‌ ద్వారా లేఖ పంపించాము. అందులో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటన గురించి ప్రస్తావించాము. ఈ ఏడాది సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సిన విషయాన్ని గుర్తుచేశాము.అదే విధంగా మా మహిళా జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. దీనితో పాటు పరస్పర ప్రయోజనాలు చేకూరేలా క్రికెట్‌కు సంబంధించి ఇతర కార్యక్రమాలు ఏమైనా నిర్వహించవచ్చన్న విషయాన్ని కూడా పరిశీలించాలని అభ్యర్థించాము’’ అని నజ్ముల్‌ తెలిపాడు. మూడు వన్డేలు, మూడు టీ20లు!కాగా బంగ్లాదేశ్‌ కొత్త ప్రధానిగా తారిక్‌ రహమాన్‌ ఎన్నికైన తర్వాత భారత్‌- బంగ్లా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఏప్రిల్‌ 7,8 తేదీల్లో బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖా మంత్రి డాక్టర్‌ ఖాలిలుర్‌ రహమాన్‌ భారత పర్యటనకు రానున్నారు.ఈ నేపథ్యంలో క్రికెట్‌లోనూ సంబంధాల పునరుద్ధరణ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది బంగ్లా బోర్డు. ఇదిలా ఉంటే గతేడాది ఆగస్టులో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. టూర్‌ వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబరు 1- 13 మధ్య బంగ్లాదేశ్‌తో భారత్‌ మూడు వన్డే, మూడు టీ20లు ఆడేలా షెడ్యూల్‌ ఖరారు కావాలని బీసీబీ కోరుకుంటోంది.చదవండి: టీమిండియాకు శుభవార్త: నితీశ్‌ రెడ్డిపై గావస్కర్‌ ప్రశంసలు

IPL 2026 MI VS DC: Rohit Sharma Blows Past MS Dhoni's Giant IPL Record, Virat Kohli Left Behind9
IPL 2026: ధోనిని అధిగమించిన రోహిత్‌

ముంబై ఇండియన్స్‌ విధ్వంసకర బ్యాటర్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓ సిక్సర్‌ బాదిన రోహిత్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై తన సిక్సర్ల సంఖ్యను 51కి పెంచుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన విభాగంలో ఎంఎస్‌ ధోనిని అధిగమించాడు. ధోని ఆర్సీబీపై 50 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో రోహిత్‌, ధోని తర్వాతి స్థానంలో విరాట్‌ కోహ్లి ఉన్నాడు. విరాట్‌ సీఎస్‌కేపై 48 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్దిపై అ‍త్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్‌ గేల్‌ ఖాతాలో ఉంది. గేల్‌ పంజాబ్‌ కింగ్స్‌పై 61, కేకేఆర్‌పై 54 సిక్సర్లతో తొలి స్థానాలను ఆక్రమించాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. రోహిత్‌ శర్మ ఈ ఐపీఎల్‌ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై మెరుపు అర్ద సెంచరీ (38 బంతుల్లో 78 పరుగులు; సిక్స్‌లు, 7 ఫోర్లు) చేసిన అతను.. ఇవాళ ఢిల్లీతో మ్యాచ్‌లో 26 బంతుల్లో 35 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్‌) చేశాడు.ఢిల్లీ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముకేశ్‌ కుమార్‌ 2, ఎంగిడి, అక్షర్‌ పటేల్‌, విప్రాజ్‌ నిగమ్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు. కుల్దీప్‌ యాదవ్‌ (3-0-31-0) మినహా ఢిల్లీ బౌలర్లంతా పొదుపుగా కూడా బౌలింగ్‌ చేశారు. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (51) అర్ద సెంచరీతో రాణించగా.. రోహిత్‌ శర్మ (35) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు.

Pat Cummins flies home suddenly in middle of IPL 202610
ఎస్ఆర్‌హెచ్‌కు షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్‌

ఐపీఎల్‌-2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ జట్టుతో చేరినప్పటికి.. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితయ్యాడు. అయితే ఇప్పుడు కమ్మిన్స్ తుది స్కాన్ల కోసం తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయినట్లు సమాచారం.అక్కడ క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణలో అతడికి టెస్ట్‌లు నిర్వహించనున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం నుంచి కమ్మిన్స్‌కు సిగ్నల్ వస్తే ఏప్రిల్ 17న ఎస్‌ఆర్‌హెచ్ జట్టుతో కలిసే అవకాశముంది. అంటే సన్‌రైజర్స్ ఆడే కనీసం మూడు మ్యాచ్‌లకు కమ్మిన్స్ అందుబాటులో ఉండడు. అప్పటివరకు ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ కొనసాగనున్నాడు.ఇక ఈ ఏడాది సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ.. రెండో మ్యాచ్‌లో అద్భుతంగా తిరిగి పుంజుకుంది. కేకేఆర్‌పై 65 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ ఎస్‌ఆర్‌హెచ్ దుమ్ములేపింది. హైదరాబాద్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ముందు ఊహించినట్టుగానే కమ్మిన్స్ సెకెండ్ హాఫ్ సీజన్‌కు అందుబాటులో ఉండనున్నాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే, ఈషాన్ మలింగ, శివమ్ మావి, స్మరన్ రవిచంద్రన్, కమ్మిన్స్‌, జీషన్ అన్సారీ, సలీల్ అరోరా, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే, డేవిడ్ పేన్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, క్రెయిన్స్ ఫులేట్రా, అమిత్ కుమార్, ఓంకార్ తర్మలే, శివంగ్ కుమార్చదవండి: అతడు నాకంటే ఎంతో బెట‌ర్‌: యువరాజ్‌ సింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement