ప్రధాన వార్తలు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
తిరువనంతపురం వేదికగా ఐదో టీ20లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ ఆఖరి పోరులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.అదేవిధంగా గత మ్యాచ్కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తిలు కూడా పునరాగమనం చేశారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు మరోసారి టీమ్మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. తన సొంతమైదానంలో సంజూ సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు కివీస్ ఏకంగా తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. లాకీ ఫెర్గూసన్, అలెన్, నీషమ్,జాకబ్స్ జట్టులోకి వచ్చారు.తుది జట్లున్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీభారత్: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
సామ్ కరన్ హ్యాట్రిక్.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2026కు ముందు ఇంగ్లండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. శుక్రవారం పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో(డక్ వర్త్ లూయిస్) ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత వర్షం కారణంగా మ్యాచ్ను 17 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 16.2 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది.శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(37) టాప్ స్కోరర్గా నిలవగా.. పాతుమ్ నిస్సంక (23), షనక(20) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. 16 ఓవర్ వేసిన కరన్ దాసున్ షనక, మహీష్ తీక్షణ, మతీష పతిరాణ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఇంగ్లండ్ బౌలర్గా నిలిచాడు.అతడితో పాటు అదిల్ రషీద్ మూడు, డాసన్ రెండు, ఓవర్టన్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అయితే 15 ఓవర్ల తర్వాత భారీ వర్షం పడటంతో ఆట సాధ్యం కాలేదు.అప్పటికే డక్వర్త్ లూయిస్ పార్ స్కోర్ కంటే ఇంగ్లండ్ 11 పరుగులు ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (46) టాప్ స్కోరర్గా నిలవగా.. టామ్ బాంటన్ (29), బట్లర్(17) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు.
విరాట్ కోహ్లి వికెట్ తీస్తే.. ఏం చేస్తానంటే?
ఐపీఎల్-2026లో ఉత్తరప్రదేశ్కు చెందిన యువ స్పిన్నర్ విశాల్ నిషాద్ సత్తాచాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నిషాద్ను రూ. 30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఒక్క ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం లేనప్పటికి అతడిపై పంజాబ్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది.అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నిషాద్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. 2024 యూపీ టీ20 ప్రిమియర్ లీగ్ విశాల్ కెరీర్ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో గోరఖ్పూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.గతేడాది సీజన్లో అతడు ఐపీఎల్లో ఆడుతాడని అంతా భావించారు. కానీ దురుదృష్టవశాత్తూ అప్పుడు అవకాశం లభించలేదు. అయితే ఇప్పుడు మాత్రం పంజాబ్ కింగ్స్ సువర్ణ అవకాశం కల్పించింది. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిషాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనకు రోల్మోడల్ అని అతడు చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లి నాకు ఆదర్శం. అతడు ఆడే ఫియర్ లెస్ క్రికెట్, కవర్ డ్రైవ్ షాట్లు నాకెంతో ఇష్టం. ఒకవేళ నేను కోహ్లి వికెట్ తీస్తే, సెలబ్రేషన్స్ చేసుకోను. అతడు నా రోల్ మోడల్ కాబట్టి నేరుగా వెళ్లి తన పాదాలకు నమస్కరిస్తాను. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్దాయికి చేరుకున్నాను. మా నాన్నతో పాటు పనికి వెళ్లేవాడిని. ఒకనొక సమయంలో క్రికెట్ వదిలేయాలని కూడా అనుకున్నాను. క్రికెటర్ కావడం చాలా కష్టమని, వేరే ఏదైనా వర్క్ చేసుకోమని మా అమ్మ సూచించింది. కానీ నేను మాత్రం నా ఆశయాన్ని వదులుకోలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధిస్తాను అని మా అమ్మతో అన్నాను. ఆ తర్వాత నా కుటంబం కూడా సపోర్ట్ చేసింది. అందరి సహకరంతో ఇప్పుడు నా కలను నేరవేర్చుకున్నా అని 20 ఏళ్ల నిషాద్ పేర్కొన్నాడు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. వరల్డ్కప్లో ఆడేది డౌటే?
టీ20 ప్రపంచకప్-2026కు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా? లేదా అన్నది? ఇంకా క్లారిటీ లేదు. ఓ వైపు వరల్డ్కప్ కోసం తమ జట్టును శ్రీలంకకు పంపేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వార్తలు వస్తుండగా.. మరోవైపు ప్రభుత్వ అనుమతి కోసం ఇంకా పీసీబీ ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరగుతోంది.ఒకవేళ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఫిబ్రవరి 2న శ్రీలంకకు పాక్ పయనం కానుంది. అయితే ఈ మెగా టోర్నీ కోసం తమ కొత్త జెర్సీని ఆసీస్తో రెండో టీ20 సందర్భంగా విడుదల చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుగా ప్రకటించింది. అయితే ఇప్పుడు తమ జెర్సీ కిట్ లాంచ్ కార్యక్రమాన్ని పీసీబీ రద్దు చేసింది.ఇందుకు ప్రధాన కారణం పాక్ ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి లభించకపోవడమేనని తెలుస్తోంది. పాక్ వరల్డ్కప్లో పాల్గొనడంపై తుది నిర్ణయం సోమవారం(ఫిబ్రవరి 2) వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ ఇప్పటికే తప్పుకొన్న సంగతి తెలిసిందే.అయితే బంగ్లాదేశ్కు మద్దతుగా నిలుస్తూ పీసీబీ కూడా టోర్నీని బహిష్కరిస్తుమని ఉడత బెదరింపులకు దిగింది. కానీ ఐసీసీ జోక్యం చేసుకోవడంతో పీసీబీ వెనుక్కి తగ్గింది. కానీ టోర్నీలో పాల్గోనడంపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడుతోంది.వరల్డ్కప్ టోర్నీకి పాక్ జట్టు ఇదేసల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మహ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్
ఆరోజు అందుకే అబద్ధం చెప్పాను: హ్యారీ బ్రూక్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట మార్చాడు. నైట్క్లబ్ గొడవ విషయంలో గతంలో తాను అబద్ధం చెప్పినట్లు అంగీకరించాడు. సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే తాను ఆరోజు అలా మాట్లాడినట్లు తాజాగా స్పష్టం చేశాడు.దెబ్బలు తిన్న బ్రూక్గతేడాది ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మూడో వన్డేకు ముందు (అక్టోబరు 31 రాత్రి) హ్యారీ బ్రూక్ (Harry Brook) ఓ నైట్క్లబ్కు వెళ్లాడు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మద్యం తాగాడనే అనుమానంతో ఓ బౌన్సర్ అతడిని అడ్డుకున్నాడు. దీంతో బ్రూక్ వాగ్వాదానికి దిగగా.. సదరు బౌన్సర్ అతడిని కొట్టినట్లు వార్తలు వచ్చాయి.హద్దుమీరి ప్రవర్తించానుఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత.. యాషెస్ టెస్టు సిరీస్ సమయంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘ఆరోజు నేను హద్దుమీరి ప్రవర్తించాను. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. నా ప్రవర్తన నా జట్టు, దేశానికి తలవంపులు తీసుకువచ్చింది.కెప్టెన్గా నాకు దక్కిన గౌరవానికి భంగం కలగకుండా ఇకపై ఇలాంటి తప్పులు చేయబోను’’ అని బ్రూక్ మీడియా ముఖంగా తెలియజేశాడు. ఆ సమయంలో నైట్క్లబ్కు తాను ఒక్కడినే వెళ్లినట్లు పేర్కొన్నాడు. అయితే, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. బ్రూక్కు రూ. 33 లక్షల మేర జరిమానా విధించింది. అంతేకాదు.. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.జేకబ్ బెతెల్, జోష్ టంగ్ కూడాఅయితే, ఈ విషయంపై టెలిగ్రాఫ్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. బ్రూక్తో పాటు జేకబ్ బెతెల్, జోష్ టంగ్ కూడా ఉన్నారని.. వారికి కూడా ఫైన్ పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో శుక్రవారం నాటి తొలి టీ20లో విజయం తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించాడు.‘‘వెల్లింగ్టన్లో నా చర్యలకు నేనే పూర్తి బాధ్యత వహిస్తాను. ఆరోజు నాతో పాటు ఇతరులు కూడా ఉన్నారని నేను అంగీకరిస్తున్నా. గతంలో నేను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా.గుణపాఠాలు నేర్చుకుంటున్నాఅయితే, ఆరోజు నా సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే అలా అబద్ధం చెప్పాను. వారిని వివాదంలోకి లాగవద్దని భావించాను. ఈ విషయంలో నేను మళ్లీ క్షమాపణలు కోరుతున్నా. నా కెరీర్లో ఇప్పుడు కఠిన, సవాలుతో కూడిన దశ నడుస్తోంది. దీని నుంచి నేను ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటున్నా’’ అని హ్యారీ బ్రూక్ వెల్లడించాడు.చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్
T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడితో పాటు టాపార్డర్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ కూడా అందుబాటులో లేకుండా పోయాడు.కమిన్స్ స్థానంలో అతడేకమిన్స్, షార్ట్ గాయాల నుంచి కోలుకోని కారణంగా టోర్నీకి దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) శనివారం ధ్రువీకరించింది. ఈ విషయం గురించి సెలక్టర్ టోనీ డోడ్మేడ్ మాట్లాడుతూ.. ‘‘వెన్నునొప్పి నుంచి కోలుకోవడానికి ప్యాట్ కమిన్స్కు ఇంకాస్త సమయం పడుతుంది. అందుకే టోర్నీలో పాల్గొనడం లేదు.కమిన్స్ స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ బెన్ డ్వార్షుయిస్ను ఎంపిక చేశాము. ఫీల్డింగ్లో రాణించడంతో పాటు లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ కూడా చేయగలడు. బంతి బాగా స్వింగ్ చేయగల బెన్ రాక పేస్ దళానికి మరింత వైవిధ్యం తీసుకువస్తుంది’’ అని తెలిపాడు.మాథ్యూ షార్ట్కు బదులు అతడేఅదే విధంగా.. మాథ్యూ షార్ట్ స్థానంలో మ్యాట్ రెన్షాను వరల్డ్కప్ జట్టులో చేర్చినట్లు టోనీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘‘ఆస్ట్రేలియా తరఫున వైట్బాల్ క్రికెట్లో, బిగ్బాష్ లీగ్లో రెన్షా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్లో అతడు జట్టుకు బలంగా మారుతాడు’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆసీస్ ఈ మెగా టోర్నీ బరిలో దిగనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు (Updated)మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మ్యాట్ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్
T20 WC: అభిషేక్ శర్మ కాదు!.. ఈసారి అతడే టాప్!
పొట్టి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఫిబ్రవరి 7న తెరలేవనుంది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈసారి బరిలోకి దిగుతున్న.. అద్భుత ఫామ్తో ఈసారీ హాట్ ఫేవరెట్గా మారింది.ఇక ఇప్పటికే మెగా టోర్నీకి భారత్ తమ జట్టును ప్రకటించింది. అదే జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. మూడు విభాగాల్లోనూ ఆటను మెరుగుపరచుకుంటూ ప్రత్యర్థి జట్లకు కఠిన సవాలుగా మారింది సూర్య సేన.అభిషేక్ శర్మ కాదు!.. ఈ నేపథ్యంలో మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు ఈసారి టీమిండియా సెమీస్ చేరడం ఖాయమని.. టైటిల్ పోరుకు కూడా అర్హత సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా.. టాప్ రన్ స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ అవార్డుల విజేతల గురించి తన అంచనాలు తెలియజేశాడు.ఈసారీ అతడే టాప్!గత ఎడిషన్ మాదిరే ఈసారి కూడా టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలుస్తాడని చహల్ పేర్కొన్నాడు. ఇక భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను టాప్ రన్ స్కోరర్గా అంచనా వేసిన యుజీ.. ఈసారి అత్యధిక సిక్సర్లు బాదేది అతడే అని పేర్కొన్నాడు.భారత్- పాక్ ముఖాముఖి పోటీఅదే విధంగా.. టాప్ వికెట్ టేకర్గా బుమ్రాకు పట్టం కట్టాడు చహల్. ఇక ఈ మెగా టోర్నీలో తాను భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న చహల్.. జట్ల అత్యధిక స్కోరును 240 పరుగులుగా అంచనా వేశాడు. కాగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్- పాక్ ముఖాముఖి తలపడతాయి.ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల చహల్ 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ టోర్నీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్కే పరిమితం అయ్యాడు. మరోవైపు.. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన బుమ్రా.. ఎనిమిది మ్యాచ్లలో కలిపి పదిహేను వికెట్లు కూల్చాడు. టీమిండియా చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్
పాకిస్తాన్కు ఘోర అవమానం
గత కొంతకాలంగా విదేశీ జట్లు పాకిస్తాన్కు పర్యటనకు వచ్చి ఆల్ఫార్మాట్ సిరీస్లు ఆడుతున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి ఆసియా జట్లతో పాటు.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.కెప్టెన్ సహా కీలక ప్లేయర్లు దూరంఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా పాక్ పర్యటనకు వెళ్లింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లకు షెడ్యూల్ ఖరారు కాగా.. లాహోర్లో తొలి టీ20లో పాక్ గెలిచింది. అయితే, ఈ మ్యాచ్కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో ట్రవిస్ హెడ్ జట్టును ముందుకు నడిపించాడు.మార్ష్తో పాటు మార్కస్ స్టొయినిస్, జోష్ ఇంగ్లిస్, బెన్ డ్వార్షుయిస్ తదితర స్టార్లు కూడా ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నారు. ఇక ఈ సిరీస్కు ముందే ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, నాథన్ ఎల్లిస్ వంటి కీలక ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) విశ్రాంతినిచ్చింది. వీళ్లంతా ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకున్నందున సీఏ ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు.ముగ్గురి అరంగేట్రంఅంతేకాదు పాక్తో తొలి టీ20 సందర్భంగా ఆసీస్ ఏకంగా ముగ్గురు ఆటగాళ్లను అరంగేట్రం చేయించింది. మహ్లి బియర్డ్మాన్, జాక్ ఎడ్వర్డ్స్లకు తొలిసారి క్యాపులు అందించిన సీఏ.. మ్యాట్ రెన్షాకు తొలి టీ20 అవకాశం ఇచ్చింది. అయితే, అంతకుముందు మిగిలిన SENA దేశాల జట్లు కూడా తమ కీలక ఆటగాళ్లను కాకుండా.. మెజారిటీ భాగం ద్వితీయ శ్రేణి జట్లతోనే పాక్లో పర్యటించాయి.ఘోర అవమానం ఇదిఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ స్థాయి దిగజారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాక్ను తేలికగా తీసుకుంటున్నందునే ఈ మేటి జట్లు తమ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయనే అభిప్రాయాలు పెరిగాయి. పాక్ క్రికెట్ విశ్లేషకుడు ఒమైర్ అలవి కూడా ఇదే మాట అంటున్నాడు.‘‘తమ జట్టులోని కొంతమంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చింది. అదే విధంగా.. తొలి టీ20లో వారి అత్యుత్తమ ప్లేయర్లను ఆడించనేలేదు. నా దృష్టిలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఇది ఘోర అవమానం’’ అని ఒమైర్ విచారం వ్యక్తం చేశాడు.వీకెండ్ జట్లతో పాకిస్తాన్కుఇక పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కూడా ఇలాగే స్పందించాడు. ‘‘ఇటీవల కాలంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు తమ వీకెండ్ జట్లతో పాకిస్తాన్కు వచ్చాయి. ఏదో సిరీస్ ఆడాలి కాబట్టి మొక్కుబడిగా ఈ పని చేస్తున్నాయని అనిపిస్తోంది’’ అని ఒక రకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరును ఎద్దేవా చేశాడు.సిరీస్ గెలిస్తే చాలుఅయితే, పాక్ జట్టు మాజీ చీఫ్ సెలక్టర్ హారూన్ రషీద్ మాత్రం అవమానంలో కూడా మంచి వెదికే ప్రయత్నం చేశాడు. ‘‘సిరీస్లో ఏ ఆటగాళ్లు ఆడుతున్నారన్న అంశంతో సంబంధం లేదు. ప్రత్యర్థి ఎవరైనా.. ఎలా ఉన్న ద్వైపాక్షిక సిరీస్ గెలిచామన్న సంతోషం ఉంటుంది. వాళ్లు బెస్ట్ ప్లేయర్లను పంపినా.. ఇంకెవరిని పంపినా మనకేమీ ఇబ్బంది లేదు. సిరీస్ గెలిస్తే చాలు’’ అని పాక్ ఆట తీరును కొనియాడుతూనే.. తెలియకుండానే పాక్ ప్రస్తుత జట్టును తక్కువ చేసేలా మాట్లాడాడు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనుండగా.. భారత్లో కాకుండా.. తటస్థ వేదికైన శ్రీలంకలో పాక్ తమ మ్యాచ్లు ఆడుతుంది.చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్
IND vs NZ: అతడికి ఇదే లాస్ట్ ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు టీమిండియా న్యూజిలాండ్తో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా భారత్- కివీస్ మధ్య శనివారం ఐదో టీ20కి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు స్థానిక ఆటగాడు సంజూ శాంసన్పైనే ఉన్నాయి.గతేడాది కాలంలో టీమిండియా టీ20 ఓపెనర్గా రాణించిన సంజూ (Sanju Samson).. కివీస్తో గత నాలుగు మ్యాచ్లలో మాత్రం తేలిపోయాడు. ముఖ్యంగా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ముందు అతడు ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా మారింది.మరోవైపు.. ఇషాన్ కిషన్ (Ishan Kishan) రూపంలో సంజూకు పోటీ తీవ్రతరమైంది. కివీస్ ఆఖరి మ్యాచ్లోనూ ఈ కేరళ స్టార్ విఫలమైతే.. ప్రపంచకప్ టోర్నీలో వికెట్ కీపర్గా.. ఓపెనర్గా అతడి స్థానాన్ని ఇషాన్ భర్తీ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.మరింత ఒత్తిడి "తిరువనంతపురంలో ఆఖరి మ్యాచ్. హోం బాయ్ సంజూ శాంసన్కు కూడా బహుశా ఇదే చివరి అవకాశం కావొచ్చు. ఈ మ్యాచ్లో అతడిపై ఒత్తిడి మరింత పెరగడం ఖాయం. గత కొన్నాళ్లుగా అతడు పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడుతున్నాడు.ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడలేకపోతున్నాడు. మరోవైపు.. ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు. కాబట్టి కివీస్తో ఐదో టీ20లో సంజూ బాగానే ఆడినా.. టీ20 ప్రపంచకప్లో ఓపెనర్గా అతడి స్థానం సుస్థిరం అని చెప్పలేము.అలా అనుకుంటే తప్ప చోటు కష్టమేఒకవేళ టాపార్డర్లో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు వద్దు అని మేనేజ్మెంట్ అనుకుంటే మాత్రమే సంజూ.. ఇషాన్ను దాటి తుదిజట్టులోకి రాగలడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా గత నాలుగు మ్యాచ్లలో సంజూ చేసిన స్కోర్లు 10, 6, 0, 24.ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. ఇషాన్ కూడా ఎడమచేతి వాటం ఆటగాడే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. కాగా తిలక్ వర్మ గాయం నుంచి కోలుకుని వరల్డ్కప్తో నేరుగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇందుకు భారత్- శ్రీలంక వేదికలు.చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్
T20 WC 2026: సెమీస్ చేరే జట్లు ఇవే: రషీద్ ఖాన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో తాము తప్పక సెమీ ఫైనల్ చేరతామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా.. ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ను సరదాగా ట్రోల్ చేశాడు రషీద్ ఖాన్.టీ20 వరల్డ్కప్ గత ఎడిషన్ అమెరికా- వెస్టిండీస్ వేదికగా 2024లో జరిగిన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో అఫ్గనిస్తాన్ అనూహ్య రీతిలో సెమీస్ చేరి సత్తా చాటింది. అయితే, సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో నిరాశగా ఇంటిబాట పట్టింది.ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య వరల్డ్కప్ 2026 ఎడిషన్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్తక్తో మాట్లాడిన రషీద్ ఖాన్ (Rashid Khan)కు.. ‘ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారు?’ అనే ప్రశ్న ఎదురైంది.ఓ వ్యక్తి ఒక్క టీమ్ పేరు మాత్రమే చెప్పి..ఇందుకు బదులిస్తూ 2024లో ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలను రషీద్ ఖాన్ గుర్తు చేశాడు. ‘‘మీకు గుర్తుందా? 2024 వరల్డ్కప్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి ఒక్క టీమ్ పేరు మాత్రమే చెప్పి.. మిగిలినవి మిమ్మల్నే ఎంచుకోమన్నాడు’’ అంటూ కమిన్స్ను టీజ్ చేశాడు.కాగా గతంలో కమిన్స్ (Pat Cummins) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా కచ్చితంగా సెమీస్ చేరుతుంది. మిగిలిన మూడు జట్లు ఏవైనా మాకు సంబంధం లేదు. డోంట్ కేర్’’ అని పేర్కొన్నాడు. రషీద్ ఖాన్ తాజాగా కమిన్స్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. అఫ్గనిస్తాన్ తప్పక సెమీస్ చేరుతుందని చెప్పకనే చెప్పాడు.సెమీస్ చేరే జట్లు ఇవేఅయితే, టోర్నీ ఆరంభంలోనే ఈ అంచనాలు సరికావన్న రషీద్ ఖాన్.. పిచ్ పరిస్థితులు, జట్ల బలాబలాల దృష్ట్యా సెమీ ఫైనల్ చేరే నాలుగు జట్లను ఎంచుకున్నాడు. అఫ్గనిస్తాన్తో పాటు టీమిండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టాప్-4లో నిలుస్తాయని రషీద్ ఖాన్ జోస్యం చెప్పాడు.కాగా ఇరవై జట్లు పాల్గొంటున్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, కెనడా, యూఏఈలతో కలిసి అఫ్గనిస్తాన్ గ్రూప్-డిలో ఉంది. ఈ ఐసీసీ ఈవెంట్లో భాగంగా.. ఫిబ్రవరి 8న కివీస్తో.. ఫిబ్రవరి 11న సఫారీలతో.. ఫిబ్రవరి 16న యూఏఈతో.. ఫిబ్రవరి 19న కెనడాతో అఫ్గన్ తలపడుతుంది. చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్కు షాక్.. తొలిసారి స్పందించిన శ్రీలంకThat "don't care" was personal 😭 pic.twitter.com/SLFoz0fGFK— EngiNerd. (@mainbhiengineer) June 15, 2024
నార్వే చెస్ టోర్నీకి దివ్య
స్టావెంజర్ (నార్వే): ప్రపంచకప్ చాంపియన్, భారత గ్...
మన్ప్రీత్ సింగ్పై వేటు
భారత హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్...
సబలెంకా X రిబాకినా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్...
ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ఓటమి
జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్షిప్లో ఇండియ...
T20 WC: అభిషేక్ శర్మ కాదు!.. ఈసారి అతడే టాప్!
పొట్టి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న...
పాకిస్తాన్కు ఘోర అవమానం
గత కొంతకాలంగా విదేశీ జట్లు పాకిస్తాన్కు పర్యటనకు ...
IND vs NZ: అతడికి ఇదే లాస్ట్ ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు టీమిండియా...
T20 WC 2026: సెమీస్ చేరే జట్లు ఇవే: రషీద్ ఖాన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో అఫ్గనిస...
క్రీడలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
వీడియోలు
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
