Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Ayush Shetty stuns World No. 1 to storm into Badminton Asia Championships final1
సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్‌

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పెను సంచలనం నమోదైంది. భారత యువ షట్లర్‌ అయుష్‌ శెట్టి ప్రపంచ నంబర్‌ 1 షట్లర్‌ కున్లావుట్‌ విటిడ్సార్న్‌ (థాయ్‌లాండ్‌)ను మట్టికరిపించి చరిత్ర సృష్టించాడు. కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుష్‌.. ఈ టోర్నీ సెమీస్‌లో కున్లావుట్‌పై 10-21, 21-19, 21-17 తేడాతో గెలిచి పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. తద్వారా భారత తరఫున ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (సింగిల్స్‌) చేరిన రెండో పురుష షట్లర్‌గా (దినేశ్‌ ఖన్నా (1965), ఓవరాల్‌గా మూడో భారత షట్లర్‌గా రికార్డుల్లోకెక్కాడు.75 నిమిషాల పాటు సాగిన సెమీస్‌లో ఆయుష్‌ మొదటి గేమ్‌ కోల్పోయినా, ఆతర్వాత అద్భుత పోరాటపటిమతో వరుసగా రెండు సెట్లు గెలిచి గేమ్‌ను కైవసం​ చేసుకున్నాడు. ఫైనల్లో ఆయుష్‌.. షి యు కీ (చైనా), చౌ టియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) మధ్య జరిగే రెండో సెమీస్‌ విజేతతో తలపడతాడు. అయుష్‌ 2023 వరల్డ్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన తర్వాత వార్తల్లోకెక్కాడు.

BCB walked into trap in T20 WC withdrawal: Ex ACC CEO Slams Asif Nazrul2
‘భారత్‌ వ్యతిరేక సెంటిమెంట్‌తో కొంపముంచిన నిర్ణయం’

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ సమయంలో బంగ్లాదేశ్‌ వ్యవహరించిన తీరు సరికాదని ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) మాజీ సీఈవో అష్రాఫుల్‌ హక్‌ అన్నాడు. భారత వ్యతిరేక సెంటిమెంట్‌తో కొంతమంది పన్నిన కుట్రలో బంగ్లా క్రికెట్‌ బోర్డు (BCB) మాజీ చీఫ్‌ భాగమయి ఉంటారని అభిప్రాయపడ్డాడు. వీరి నిర్ణయాల కారణంగా బంగ్లా క్రికెట్‌ చాలా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.కాగా షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. అక్కడి నేతలు కొంతమంది ఈశాన్య భారతం గురించి అవాకులు చెవాకులు పేలగా.. అదే సమయంలో బంగ్లాలో మైనారిటీ హిందువులపై దాడులు పెరిగాయి.దౌత్యపరమైన ఉద్రిక్తతలుఈ నేపథ్యంలో భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగగా.. ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను బీసీసీఐ తొలగించింది. దీంతో తమకు భారత్‌లో భద్రత కరువు అంటూ బంగ్లా బోర్డు.. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు భారత్‌కు రాబోమని పట్టుబట్టింది.తమ వేదికను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేయగా.. బంగ్లా వాదనలో నిజం లేదని పేర్కొంటూ ఇందుకు ఐసీసీ నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బీసీబీ ప్రకటించింది. అయితే, బంగ్లా ఆటగాళ్లు మాత్రం టీ20 ప్రపంచకప్‌ ఆడాలనే కోరిక గురించి పలుమార్లు బయటపెట్టారు.భారత క్రికెట్‌తో దెబ్బతిన్న సంబంధాలుమొత్తానికి అప్పటి బీసీబీ తీసుకున్న నిర్ణయం వల్ల బంగ్లాదేశ్‌ ఐసీసీ టోర్నీ ఆడే అవకాశం కోల్పోవడంతో పాటు.. భారత్‌ క్రికెట్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ద్వైపాక్షిక సిరీస్‌లను కొనసాగించాల్సిందిగా బీసీసీఐకి ఇటీవలే బీసీబీ కొత్త యాజమాన్యం లేఖ రాసింది.ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీసీ మాజీ సీఈవో అష్రాఫుల్‌ హక్‌ తాజాగా రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అప్పటి బీసీబీ చీఫ​ అమినుల్‌ ఇస్లాం బుల్‌బుల్‌ తీసుకున్న నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ భారత్‌కు వెళ్లవద్దని పన్నిన కుట్రలో ఆయన ఇరుక్కున్నట్లు అనిపించింది.భారత్‌ వ్యతిరేక సెంటిమెంట్‌తోఆసిఫ్‌ చెప్పగానే తాము భారత్‌కు వెళ్లట్లేదంటూ అమినుల్‌ ప్రకటించేశారు. ఆయన ఆటగాళ్ల తరఫున నిలబడాల్సింది. ‘మేము ఇండియాకు వెళ్తాము. టోర్నీ ఆడతాము. ఆటగాళ్లు ఇదే కోరుకుంటున్నారు. మ్యాచ్‌లు సజావుగా సాగేలా సహకరిస్తామని ఒప్పందాల మీద సంతకాలు కూడా చేశాము’ అని గట్టిగా చెప్పాల్సింది.అప్పుడైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చి ఉండేది. కానీ ఈ విషయంలో ఆసిఫ్‌దే తుది నిర్ణయం.. సొంత నిర్ణయం కూడా అనిపించింది. తమకున్న భారత్‌ వ్యతిరేక సెంటిమెంట్‌ను ఆటపై రుద్దాలని ఆయన ఎందుకు అనుకున్నాడో అర్థం కాలేదు. అతడు చేసిన పని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. ఇది అస్సలు ఆమోదయోగ్యనీయం కాదు’’అని అష్రాఫుల్‌ హక్‌ పేర్కొన్నాడు. చదవండి: PSL: ఐపీఎల్‌ లేకుంటే బతుకే లేదు.. ఎంత పొగరు?

IPL 2026: Ravi Bishnoi Recreates 1089 Days Old IPL Record With Virat Kohli's Wicket In RR Vs RCB3
1089 రోజుల రికార్డు పునరావృతం చేసిన బిష్ణోయ్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 10) జరిగిన ఆసక్తికర సమరంలో ఆర్సీబీపై రాజస్థాన్‌ రాయల్స్‌ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (63) ఆర్సీబీ పతనాన్ని అడ్డుకున్నాడు అతనికి రొమారియో షెపర్డ్‌ (22), వెంకటేశ్‌ అయ్యర్‌ (29 నాటౌట్‌) సహకరించారు. మిగతా బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి (32) పర్వాలేదనిపించగా.. సాల్ట్‌ (0), పడిక్కల్‌ (14), కృనాల్‌ (1), జితేశ్‌ (5), టిమ్‌ డేవిడ్‌ (13) నిరాశపరిచారు. రాయల్స్‌ బౌలర్లలో బిష్ణోయ్‌ (4-0-32-2), బ్రిజేష్‌ శర్మ (4-0-32-2), ఆర్చర్‌ (3-0-33-2) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. సందీప్‌ శర్మ (4-0-47-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్‌ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మరోసారి పేట్రేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆతర్వాత ధృవ్‌ జురెల్‌ (43 బంతుల్లో 81 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఫలితంగా రాయల్స్‌ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఈ ఓటమి ఆర్సీబీకి ఈ సీజన్‌లో మొదటిది కాగా.. ఈ గెలుపుతో రాయల్స్‌ తమ అజేయ యాత్రను కొనసాగించింది. ఈ సీజన్‌ రాయల్స్‌ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌ ఓ ప్రత్యేక ఘనత సాధించాడు. విరాట్‌ను అద్భుతమైన గూగ్లీతో క్లీన్‌ బౌల్డ్‌ చేయడం ద్వారా.. 1089 కిందటి ఓ ఘట్టాన్ని పునరావృతం చేశాడు. విరాట్‌ ఐపీఎల్‌లో చివరిసారి 2023 ఎడిషన్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మళ్లీ ఇప్పుడే అతను ఈ తరహాలో వికెట్‌ సమర్పించుకున్నాడు. అంటే ఐపీఎల్‌లో విరాట్‌ 1089 రోజుల తర్వాత క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడన్న మాట. 2023 ఎడిషన్‌లో విరాట్‌ సీఎస్‌కే బౌలర్‌ ఆకాశ్‌ సింగ్‌ చేతిలో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

Ex-India Star Daughter Asks For Meeting With Gill Unexpected Twist4
‘గిల్‌ను కలవాలి’.. కూతురుకు మాజీ క్రికెటర్‌ షాక్‌!

క్రికెటర్లకు అభిమానులుండడం సహజం. కానీ మాజీ క్రికెటర్ కూతురు మరో క్రికెటర్‌కు అభిమానిగా ఉండడం, అతడిని కలవాలని కోరడం ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం. టీమిండియా మాజీ క్రికెటర్ వృద్దిమాన్ సాహా, అతడి కూతురు అన్వి మధ్య జరిగిన సంభాషణను సాహా భార్య రోమి మిత్రా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో సాహా, కూతురు అన్వి మధ్య సంభాషణ ఆద్యంతం ఆకట్టుకుంది. విషయంలోకి వెళితే.. అన్వి శుబ్‌మన్ గిల్‌కు అభిమాని. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్‌ను కల్పించాలాంటూ అన్వి పదే పదే తండ్రి సాహాను రిక్వెస్ట్ చేసింది. అయితే దీనిపై సాహా కూతురుకు ఊహించని షాక్‌ ఇచ్చాడు. ‘గిల్‌ను కలవాలనుకోవడం ఓకే. కానీ అందరిలానే లైన్‌లో నిలబడి అతడిని కలవాల్సి ఉంటుంది. ఇందులో నీకు ఎలాంటి మినహాయింపు ఉండదు’ అని సాహా తన కూతురితో పేర్కొన్నాడు. అందుకు అన్వి.. ‘అదేంటి.. మీరు గిల్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారుగా’ అని గుర్తుచేసింది. దానికి సాహా ‘అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు నేను ఐపీఎల్ ఆడడం లేదు కదా’ అని నవ్వుతూ బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య సంభాషణను సాహా భార్య రోమి మిత్రా రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కాగా సాహా గతంలో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌లు పంచుకున్న సంగతి తెలిసిందే. వృద్దిమాన్ సాహా ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఐపీఎల్ టైటిల్ సాధించిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో సాహా స‌భ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు ఒక ఐపీఎల్ సీజ‌న్‌ ఫైన‌ల్లో సెంచ‌రీ సాధించిన తొలి క్రికెట‌ర్‌గా సాహా రికార్డుల‌కెక్కాడు. ఐపీఎల్ కెరీర్‌లో 170 మ్యాచ్‌లాడిన సాహా 2,934 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచ‌రీ స‌హా 13 అర్థ‌శ‌త‌కాలున్నాయి. ధోని హ‌యాంలో పెద్ద‌గా వెలుగులోకి రాలేక‌పోయిన వృద్దిమాన్ సాహా టీమిండియా త‌ర‌ఫున 40 టెస్టులు, 9 వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. 2024 రంజీ సీజ‌న్‌లో బెంగాల్ త‌ర‌ఫున ఆడిన సాహా ఆ త‌ర్వాత అంత‌ర్జాతీయ స‌హా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. 2024-25 రంజీ సీజ‌న్‌లో పంజాబ్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా బెంగాల్ ఆట‌గాళ్లు సాహాకు గార్డ్ ఆఫ్ హాన‌ర్ ఇచ్చి గౌర‌వించారు. సాహా తన ఫ‌స్ట్‌క్లాస్ కెరీర్‌లో 142 మ్యాచ్‌లాడి 7 వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు. View this post on Instagram A post shared by Romi Mitra (@romi_mitra) చదవండి: నడిరోడ్డుపై చాహల్‌ హల్‌చల్‌!

More Bollywood Than Actual Cricket: PSL Overseas Star Drops IPL Bombshell5
PSL: ఐపీఎల్‌ లేకుంటే బతుకే లేదు.. ఎంత పొగరు?

సౌతాఫ్రికా క్రికెటర్‌ రిలీ రొసోవ్‌పై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ‘‘పొగరు, అహంకారంతో.. అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడితే నష్టపోయేది నువ్వే’’ అని హెచ్చరిస్తున్నారు. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారీ ధర?సఫారీ బ్యాటర్‌ రిలీ రొసోవ్‌ను 2026లో క్వెటా గ్లాడియేటర్స్‌ 5.5 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఇది రూ. 1.85 కోట్లకు సమానం. ఇక రావల్పిండిజ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో రొసోవ్‌ గ్లాడియేటర్స్‌ తరఫున రాణించాడు. 42 బంతుల్లో 53 పరుగులు చేయడం ద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రిలీ రొసోవ్‌ను ఐపీఎల్‌ను అవమానపరిచే రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ కంటే పాకిస్తాన్‌ లీగ్‌లోనే క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే.. ఇదే నిజమైన లీగ్‌ అంటూ అతి చేశాడు.క్రికెట్‌ కాదు.. బాలీవుడ్‌ ‘‘ఐపీఎల్‌ సుదీర్ఘ షెడ్యూల్‌ ఉన్న టోర్నమెంట్‌. అయితే, పీఎస్‌ఎల్‌ మాత్రం మంచి పోటీతత్వం ఉన్న లీగ్‌. ఐపీఎల్‌ను ఎక్కువగా బాలీవుడే నడిపిస్తుంది. కాబట్టి ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ కంటే కూడా ఎక్కువగా బాలీవుడే (సినిమా రంగమే) గుర్తుకు వస్తుంది. పీఎస్‌ఎల్‌లో క్రికెట్‌కు ప్రాధాన్యం’’ అని రిలీ రొసోవ్‌ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఈ నేపథ్యంలో పాక్‌ అభిమానులు.. ‘‘అవును.. భారత్‌లో నాణ్యమైన క్రికెట్‌కు తావు లేదు’’ అంటూ ఓవరాక్షన్‌ చేస్తుండగా.. ‘‘అందుకే కదా ఐసీసీ టైటిళ్లను టీమిండియా సులువుగా గెలిచేస్తుంటే.. పాక్‌ మాత్రం కనీసం సెమీస్‌ చేరలేక దిగజారిపోతోంది’’ అంటూ భారత నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. అదే సమయంలో.. ‘‘చాలా మంది క్రికెటర్లకు బతునిచ్చిందే ఐపీఎల్‌.. నీకెంత పొగరుంటే ఇలా మాట్లాడతావు’’ అంటూ రొసోవ్‌పై మండిపడుతున్నారు. కాగా రొసోవ్‌ 22 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 473 పరుగులు చేయగలిగాడు.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ ఆటకు విరాట్‌ కోహ్లి ఫిదా... ఏమన్నాడంటే.. Shocking statement by Rilee Rossouw. 🤯"IPL is a very long tournament, and PSL is a much more compact tournament where the competition is a lot more fierce. IPL obviously has the whole Bollywood behind it, so it's a lot more of a movie than actual cricket". pic.twitter.com/ZwLugU3A5n— Salman. (@howeverhoe) April 11, 2026

Cricket Fans Slams Yuzvendra Chahal Over Viral Smoking Video6
నడిరోడ్డుపై చాహల్‌ హల్‌చల్‌!

పంజాబ్ కింగ్స్ బౌల‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ చిక్కుల్లో ప‌డ్డాడు. ప‌బ్లిక్ ప్లేస్‌లో అత‌డు ప్ర‌వర్తించిన తీరును త‌ప్పుబ‌ట్టిన క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్య‌మం వేదిక‌గా ట్రోల్స్‌కు దిగారు. నడిరోడ్డుపై ల‌గ్జ‌రీ కారులో ర‌య్యిమ‌ని దూసుకెళ్ల‌డం త‌ప్పుకాక‌పోవ‌చ్చు కానీ కాల్చిన సిగ‌రేట్‌ను క‌నీసం ఆర్పాల‌నే సోయి లేకుండా దానిని రోడ్డు మీద పడేయ‌డ‌మేంట‌ని ఫ్యాన్స్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ చ‌ర్య వ‌ల్ల ఎవ‌రికైనా ప్ర‌మాదం జ‌రిగి ఉంటే దానికి చాహ‌ల్ బాధ్య‌త వ‌హించేవాడా అని మండిప‌డ్డారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ‘సివిక్ సెన్స్ లేని క్రికెట‌ర్‌ను ఇప్పుడు మీకు ప‌రిచయం చేస్తున్నాం.. అత‌డే య‌జ్వేంద్ర చాహ‌ల్‌. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో కాల్చిన సిగ‌రేట్‌ను ఆర్పి పడేయాల‌న్న సోయి అత‌డికి లేదు.’అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ‘డ‌బ్బులు సంపాదించ‌డం కాదు ముందు బహిరంగ ప్ర‌దేశాల్లో ఎలా ప్ర‌వ‌ర్తించాల‌నే బేసిక్ సెన్స్ నేర్చుకో’ అంటూ మ‌రొక వ్య‌క్తి కామెంట్ చేశాడు. అయితే ఇటీవ‌లే డివిలియ‌ర్స్‌తో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో తాను మందు మానేసి ఆరు నెల‌ల‌కు పైనే అయిన‌ట్లు పేర్కొన్నాడు. ఫిట్‌నెస్‌, ఎక్కువ‌కాలం ఆరోగ్యంగా ఉండ‌డం కోస‌మే ఈ చ‌ర్య‌కు పూనుకున్న‌ట్లు తెలిపాడు. ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున ఆడుతున్న చాహ‌ల్ మూడు మ్యాచ్‌లు క‌లిపి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో దూకుడు మీద ఉంది. కేకేఆర్‌తో జ‌రిగిన మూడో మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం కావ‌డంతో 5 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉంది. ఇవాళ డ‌బుల్ హెడర్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డ‌నుంది.Yuzvendra Chahal spotted smoking and throwing a lit cigarette on the road while driving on highways in Chandigarh 🤯 pic.twitter.com/V3gcYTK5n0— Deepu (@deepu_drops) April 11, 2026🚨 YUZVENDRA CHAHAL EXPOSED 🚨Yuzvendra Chahal recently went on a podcast claiming he’s “quit everything” for his body and career longevity at 35. Fast forward to today: a viral video shows him smoking while driving. 🚭🏎️ pic.twitter.com/jgngkg5Wdd— Cricket Central (@CricketCentrl) April 10, 2026చదవండి: సాకర్‌ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్‌!

PSL New Drama: NZ Star Walks Away Objects To Usman Tariq Action7
పాక్‌ బౌలర్‌ను ‘అవమానించిన’ న్యూజిలాండ్‌ స్టార్‌?

పాకిస్తాన్‌ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అతడి బౌలింగ్‌ శైలిపై న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ మైదానంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో అంపైర్‌ రంగంలోకి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది.121 పరుగులకే ఆలౌట్‌పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)-2026 టోర్నీలో డారిల్‌ మిచెల్‌ రావల్పిండిజ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఉస్మాన్‌ తారిఖ్‌ క్వెటా గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్నాడు. కరాచీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన రావల్పిండిజ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. గ్లాడియేటర్స్‌ బ్యాటింగ్‌కు దిగింది.నిర్ణీత 20 ఓవర్లలో గ్లాడియేటర్స్‌​ జట్టు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన రావల్పిండిజ్‌ 17.3 ఓవర్లలో కేవలం 121 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. తద్వారా 61 పరుగుల భారీ తేడాతో గ్లాడియేటర్స్‌ చేతిలో ఓటమిపాలైంది.పాక్‌ బౌలర్‌కు ‘అవమానం’!ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రావల్పిండిజ్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌.. గ్లాడియేటర్స్‌ బౌలర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ బౌలింగ్‌లో తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. అతడు వేసిన తొలి బంతిని ప్యాడిల్‌ స్వీప్‌ షాట్‌ ఆడిన డారిల్‌.. తర్వాత ఉస్మాన్‌ పాజ్‌ ఇస్తూ తనదైన శైలిలో బౌలింగ్‌ చేయగా.. వికెట్ల నుంచి దూరంగా వెళ్లిపోయాడు.తాను సిద్ధంగా లేనని సైగ చేస్తూ రెండుసార్లు ఇలాగే చేశాడు. దీంతో అంపైర్‌ వచ్చి ఆటను కొనసాగించాలని చెప్పగా..డారిల్‌ అన్యమస్కంగానే అందుకు అంగీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో డారిల్‌ చర్య పాక్‌ బౌలర్‌కు అవమానం లాంటిదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో డారిల్‌ మిచెల్‌ 32 బంతుల్లో 30 పరుగులు చేసి సౌద్‌ షకీల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.అప్పట్లో అశూ మద్దతుకాగా ఉస్మాన్‌ తారిఖ్‌ క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్‌ చేస్తాడన్న సంగతి తెలిసిందే. దీంతో అతడు బౌలింగ్‌ చేయకుండా బంతిని విసురుతాడనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఐసీసీ మాత్రం అతడిపై శైలిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ విషయంలో ఉస్మాన్‌కు అండగా నిలిచాడు.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ ఆటకు విరాట్‌ కోహ్లి ఫిదా... ఏమన్నాడంటే..Daryl Mitchell refuses to face Usman Tariq 😂 #QTGVRWP pic.twitter.com/2CO6z4NvR9— Nibraz Ramzan (@nibraz88cricket) April 10, 2026

Football Fans Shocked After Seeing Ticket Prices Hike By FIFA8
సాకర్‌ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్‌!

మ‌రో రెండు నెల‌ల్లో సాక‌ర్ మ‌హాసంగ్రామం మొద‌లుకానుంది. జూన్ 11 నుంచి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుండ‌డంతో టోర్నీకి సంబంధించి పాల్గొన‌బోయే జ‌ట్లు, మ్యాచ్ షెడ్యూల్ వివ‌రాల‌ను ఇప్ప‌టికే ఫిఫా స‌మాఖ్య విడుద‌ల చేసింది. అయితే ఫుట్‌బాల్ ఆటను మైదానంలో వీక్షిస్తే వ‌చ్చే మజానే వేరు. 90 నిమిషాల్లో ముగిసిపోయే మ్యాచ్ చూసేందుకు అభిమానులు తండోప‌తండాలుగా వ‌స్తుం టారు. సాక‌ర్ ఫీవ‌ర్ ఉన్న‌న్నాళ్లు స్టేడియాల‌న్నీ ప్రేక్ష‌కుల‌తో కిక్కిరిసిపోవ‌డం ఖాయం. కానీ 2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు సంబంధించి టికెట్ల ధ‌ర‌ల విష‌యం మాత్రం ఒక ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈసారి టికెట్ రేట్ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌డంతో సాధార‌ణ అభిమానుల‌కు మ్యాచ్ వీక్షించ‌డం సాధ్య‌మ‌య్యేనా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఈ ఏడాది ప్రపంచ కప్ టికెట్ల ధరలను ఫిఫా భారీగా పెంచేసింది. ఇప్పటికే ఉన్న కేటగిరీలకు తోడు కొత్తగా ‘ఫ్రంట్ కేటగిరీ’ పేరుతో మరింత ఖరీదైన టిక్కెట్లను ప్రవేశపెట్టింది. దీంతో మ్యాచ్‌ల‌ను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు ఖరీదైన వ్యవహారంగా మారనుంది. జూన్ 12న అమెరికాలోని ఇంగిల్‌వుడ్‌లో జరిగే అమెరికా ఆరంభ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముందువరుసలోని ‘ఫ్రంట్ కేటగిరీ’ ఒక టికెట్ ధర 4,105 డాల‌ర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.3.4 లక్షలు . గతంలో ఇదే కేటగిరీ గరిష్ట ధర 2,735 డాల‌ర్లు (సుమారు రూ.2.25 లక్షలు)గా ఉండేది. ఇప్పుడు కొత్త కేటగిరీలతో ధరలు మరింత పెరిగాయి.అదేవిధంగా, ఫీఫా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫ్రంట్ కేటగిరీ 2’టికెట్ల ధరలు 1,940 నుంచి 2,330 డాలర్ల వరకు ఉన్నాయి. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1.6 లక్షల నుంచి రూ.1.9 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కెనడా ఆరంభ మ్యాచ్‌కు కూడా ఫ్రంట్ కేటగిరీ ఒక టికెట్‌ ధర 3,360 (సుమారు రూ.2.8 లక్షలు)గా నిర్ణయించారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఫిలడెల్ఫియాలో జరిగే మ్యాచ్‌కు టికెట్ ధర 905 డాలర్లు (సుమారు రూ.75,000)గా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.న్యూజెర్సీలోని మెట్అఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ గరిష్ట ధర 10,990 డాలర్లుగా నిర్ణయించగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షలకు పైగా ఉంటుంది. డిసెంబర్ లో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లు (సుమారు రూ.7.20 లక్షలు)గా ఉండేది. అదే విధంగా, కేటగిరీ 2 టికెట్లు 5,575 నుంచి 7,380 డాలర్లు (రూ.4.6 లక్షలు – రూ.6.1 లక్షలు), కేటగిరీ 3 టికెట్లు 4,185 నుంచి 5,785 డాలర్లు (రూ.3.5 లక్షలు - రూ.4.8 లక్షలు) వరకు పెరిగాయి. మొత్తం మీద యుద్ధం ప్రభావం, ఆర్థిక అనిశ్చితి ఫిఫా ప్రపంచకప్ టికెట్ ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రీమియం అనుభవం పేరుతో ఫిఫా కొత్త కేటగిరీలను తీసుకువచ్చినప్పటికీ, సాధారణ అభిమానులకు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం కష్టతరంగా మారింది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: ‘అడ్డుగోడలా నిలబడితే విజయం ఎలా వస్తుంది?’

Dear Vaibhav: Virat Kohli Gesture For Vaibhav Sooryavanshi Wins Hearts9
వైభవ్‌ సూర్యవంశీ ఆటకు విరాట్‌ కోహ్లి ఫిదా

రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌-2026లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్‌లో అతడు విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. లక్ష్యం ఎంతైనా.. ప్రత్యర్థి ఎవరైనా బంతిని బాదడమే లక్ష్యంగా ముందుకు సాగిపోయాడు.26 బంతుల్లోనే 78 పరుగులతోబెంగళూరు విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్‌ సూర్యవంశీ 26 బంతుల్లోనే 78 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండటం విశేషం. వైభవ్‌కు తోడు ధ్రువ్‌ జురెల్‌ (43 బంతుల్లో 81 నాటౌట్‌) రాణిచండంతో రాయల్స్‌ 18 ఓవర్లలోనే టార్గెట్‌ పూర్తి చేసి.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026కోహ్లి సైతం ఫిదాఇక వైభవ్ ఆటను చూసి ఆర్సీబీ దిగ్గజం, టీమిండియా లెజెండరీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఈ బిహారీ పిల్లాడిపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని అభినందించాడు. అంతేకాదు.. వైభవ్‌ రాయల్స్‌ క్యాప్‌పై.. ‘‘ప్రియమైన వైభవ్‌.. అత్యద్భుతంగా ఆడావు’’ అని రాసి తన ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాయల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.కాగా సొంతమైదానం గువాహటి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. కోహ్లి (16 బంతుల్లో 32), కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (40 బంతుల్లో 63) రాణించారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్‌ (11 బంతుల్లో 22), వెంకటేశ్‌ అయ్యర్‌ (15 బంతుల్లో 29 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు.ఇక లక్ష్య ఛేదనలో వైభవ్‌, ధ్రువ్‌ జురెల్‌లతో పాటు రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24) కూడా తన వంతు సహకారం అందించాడు. కాగా ఈ సీజన్‌లో వైభవ్‌ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లలో కలిపి 200 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్‌ క్యాప్‌ విజేతగా కొనసాగుతున్నాడు. Player of the Match ✅Orange Cap ✅An autograph from Kohli 🐐✅Good night to everyone and remember to keep believing in yourself no matter what 💗 pic.twitter.com/Up2BZuYObM— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2026

IPL 2026: Rajat Patidar Comments After Match Lost Vs Rajasthan Royals10
‘అడ్డుగోడలా నిలబడితే విజయం ఎలా వస్తుంది?’

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరుకు రాజస్తాన్ రాయల్స్ అడ్డుకట్ట వేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ స్పందించాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో ఆరంభంలో మంచి స్టార్ట్ లభించినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ అద్భుతంగా ఆడి మా నుంచి విజయాన్ని లాగేసుకున్నారని పటిదార్ తెలిపాడు. ‘పవర్‌ప్లేను మేము ప్రారంభించిన తీరు, వికెట్లు పడినప్పటికీ ఆ తర్వాత 202 పరుగులు చేయడం అన్నీ సానుకూలంగానే జరిగాయి. రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే జైస్వాల్ ఔటవ్వడంతో పట్టు చిక్కిందని భావించాం. కానీ వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అతడు సృష్టించిన విధ్వంసం మాకు విజయాన్ని దూరం చేసిందని చెప్పొచ్చు. వైభవ్‌, జురేల్‌లు అడ్డుగోడల్లా నిలబడితే మాకు విజయం ఎలా వస్తుంది చెప్పండి. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్‌గా ఉపయో గించడం కొంత స్ట్రాటజీ ఉంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆ స్ట్రాటజీ బాగా పని చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో అది దెబ్బకొట్టింది. వెంకటేశ్, షెపర్డ్‌, కృనాల్ పాండ్యా రూపంలో ముగ్గురు బౌలర్లు ఉండడంతో సుయాశ్ అవసరం ఉండదని భావించాం. ఐపీఎల్ లాంటి పోటీతరమైన క్రికెట్‌లో తప్పులు జరగడం సహజం. కానీ రాబోయే మ్యాచ్‌ల్లో ఆ తప్పులన్నీ సరిదిద్దుకొని మళ్లీ ట్రాక్ ఎక్కుతాం’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్‌ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్‌ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్‌ సూర్యవంశీతో పాటు ధ్రువ్‌ జురేల్‌ (82) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. చదవండి: అమ్మ ఆశీర్వాదంతో బరిలోకి.. ఆపై దంచికొట్టి !

Advertisement
Advertisement
 
Advertisement