Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Kalinga Lancers won the Hockey India League trophy for the second time1
విజేత కళింగ లాన్సర్స్‌

భువనేశ్వర్‌: పురుషుల హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో కళింగ లాన్సర్స్‌ రెండోసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో కళింగ లాన్సర్స్‌ జట్టు 3–2 గోల్స్‌ తేడాతో రాంచీ రాయల్స్‌పై గెలుపొంది 2017 తర్వాత మళ్లీ టైటిల్‌ సాధించింది. కళింగ లాన్సర్స్‌ తరఫున అలెగ్జాండ్రా హెండ్రిక్స్‌ (4వ, 27వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటగా... దిల్‌ప్రీత్‌ సింగ్‌ (25వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. రాంచీ రాయల్స్‌ తరఫున అరిజీత్‌ సింగ్‌ హండల్‌ (9వ నిమిషంలో), టామ్‌ బూన్‌ (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ కొట్టారు. ఫైనల్‌ కంటే ముందు నిర్వహించిన వర్గీకరణ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తూఫాన్స్‌ 4–3 గోల్స్‌ తేడాతో హెచ్‌ఐఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ జట్టుపై విజయం సాధించి మూడో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్‌ తూఫాన్స్‌ తరఫున అమన్‌దీప్‌ లక్రా (30వ, 53వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా... నీలకంఠ శర్మ (24వ నిమిషంలో), జాకబ్‌ అండర్సన్‌ (33వ నిమిషంలో) చెరో గోల్‌ కొట్టారు. హెచ్‌ఐఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ టీమ్‌ తరఫున సామ్‌ వర్డ్‌ (14వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్‌... కేర్‌ రసెల్‌ (55వ నిమిషంలో) ఓ గోల్‌ సాధించాడు. విజేతగా నిలిచిన కళింగ లాన్సర్స్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన రాంచీ రాయల్స్‌కు రూ. 2 కోట్లు దక్కాయి. మూడో స్థానం దక్కించుకున్న హైదరాబాద్‌ తూఫాన్స్‌కు కోటి రూపాయల నగదు బహుమతి లభించింది. హెచ్‌ఐఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ జట్టుకు ‘ఫెయిర్‌ ప్లే’ అవార్డు దక్కింది. తమిళనాడు డ్రాగన్స్‌ గోల్‌కీపర్‌ ప్రిన్స్‌ దీప్‌ సింగ్‌కు ‘బెస్ట్‌ గోల్‌ కీపర్‌’ అవార్డు లభించింది. హెచ్‌ఐఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ జట్టు సభ్యుడైన టాలెమ్‌ ప్రియోబర్టా ‘అప్‌కమింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డు దక్కించుకున్నాడు. వీరిద్దరికీ రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. రాంచీ రాయల్స్‌ కెపె్టన్‌ టామ్‌ బూన్‌ ఈ టోర్నీలో అత్యధిక (19) గోల్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచి ‘టాప్‌ స్కోరర్‌’ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల బహుమతి అందుకున్నాడు. హైదరాబాద్‌ తూఫాన్స్‌ ప్లేయర్‌ అమన్‌దీప్‌ లక్రాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డుతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి లభించింది.

Carlos Alcaraz reaches the semi finals at the Australian Open2
అల్‌కరాజ్‌ తొలిసారి...

మెల్‌బోర్న్‌: తనకు అచ్చిరాని గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని అధిగమించాడు. గత రెండేళ్లు క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగిన ఈ స్పెయిన్‌ స్టార్‌ ఈసారి మాత్రం సాధికారిక ఆటతీరుతో తొలిసారి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ అల్‌కరాజ్‌ 7–5, 6–2, 6–1తో ఆరో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సర్వీస్‌లో 48 పాయింట్లకు 37... రెండో సర్వీస్‌లో 35 పాయింట్లకు 19 పాయింట్లు సంపాదించాడు. 26 విన్నర్స్‌ కొట్టిన ఈ స్పెయిన్‌ స్టార్‌ 32 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేశాడు. నెట్‌ వద్దకు 22 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సాధించాడు. సెమీఫైనల్‌ చేరే క్రమంలో అల్‌కరాజ్‌ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఫైనల్లో చోటు కోసం సెమీఫైనల్లో మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో అల్‌కరాజ్‌ ఆడతాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ 6–3, 6–7 (5/7), 6–1, 7–6 (7/3)తో లెర్నర్‌ టియెన్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. 3 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్‌ ఏకంగా 24 ఏస్‌లు సంధించడం విశేషం. ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ మాత్రమే చేసిన జ్వెరెవ్‌ 56 విన్నర్స్‌ కొట్టాడు. 22 అనవసర తప్పిదాలు చేశాడు. తనసర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని జ్వెరెవ్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. నెట్‌ వద్దకు 31 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు లెర్నర్‌ 53 విన్నర్స్‌ కొట్టి, 43 అనవసర తప్పిదాలు చేశాడు. 11 ఏస్‌లు కొట్టిన లెర్నర్‌ 9 డబుల్‌ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కోకో గాఫ్‌కు షాక్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా (బెలారస్‌), 12వ సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్‌ ఫైనల్లో సబలెంకా 6–3, 6–0తో ఇవా జోవిచ్‌ (అమెరికా)ను అలవోకగా ఓడించగా ... స్వితోలినా 6–1, 6–2తో మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా)ను బోల్తా కొట్టించడం విశేషం. కోకో గాఫ్‌తో 59 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో స్వితోలినా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. వరుసగా నాలుగో ఏడాది సెమీఫైనల్‌ చేరిన సబలెంకా క్వార్టర్‌ ఫైనల్లో కేవలం మూడు గేమ్‌లు కోల్పోయింది. 2 మిర్యానా లూసిచ్‌ (2017లో; 34 ఏళ్ల 313 రోజులు) తర్వాత ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌ చేరిన రెండో అతి పెద్ద వయసు్కరాలిగా స్వితోలినా (31 ఏళ్ల 218 రోజులు) నిలిచింది.13 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో 13వ ప్రయత్నంలో స్వితోలినా తొలిసారి సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఎలీనా దెమెంతియెవా (రష్యా; 2009లో 11వ ప్రయత్నంలో) పేరిట ఉన్న రికార్డును స్వితోలినా అధిగమించింది.10 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరడం అల్‌కరాజ్‌కిది పదోసారి. ఓపెన్‌ శకంలో (1968 నుంచి) పది గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరిన రెండో అతి పిన్న వయసు్కడిగా అల్‌కరాజ్‌ (22 ఏళ్ల 258 రోజులు) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రాఫెల్‌ నాదల్‌ (2009లో; 22 ఏళ్ల 7 నెలల 25 రోజులు) అగ్రస్థానంలో ఉన్నాడు.3 టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ సెమీఫైనల్‌ చేరిన మూడో అతి పిన్న వయసు్కడిగా అల్‌కరాజ్‌ నిలిచాడు. ఈ జాబితాలో నొవాక్‌ జొకోవిచ్‌ (20 ఏళ్ల 237 రోజులు), రాఫెల్‌ నాదల్‌ (22 ఏళ్ల 83 రోజులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

India plays its fourth T20 against New Zealand today3
విశాఖలో భారత్‌ను ఆపతరమా!

న్యూజిలాండ్‌ చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయిన తర్వాత భారత్‌ ఆ కసినంతా టి20ల్లో చూపిస్తోంది. ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయి ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకుంది. అయినా సరే ఉదాసీనతకు తావు ఇవ్వకుండా అదే జోరు కొనసాగించాలని జట్టు భావిస్తోంది. వరల్డ్‌ కప్‌కు ముందు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తమ బలాన్ని మరోసారి ప్రదర్శించుకునేందుకు జట్టు సిద్ధమైంది. మరోవైపు సిరీస్‌లో ఒక్క విజయంతోనైనా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తున్న కివీస్‌ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. సాక్షి, విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్‌ టి20 సిరీస్‌లో మరో పోరుకు రంగం సిద్ధమైంది. వైజాగ్‌లోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నేడు ఇరు జట్ల మధ్య నాలుగో టి20 మ్యాచ్‌ జరుగుతుంది. సిరీస్‌ భారత్‌ సొంతమైన నేపథ్యంలో ఫలితం పరంగా ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. అయితే మరోసారి చెలరేగి ఆధిక్యాన్ని 4–0కు పెంచుకోవాలని సూర్య బృందం పట్టుదలగా ఉంది. వన్డేల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన కివీస్‌ టి20ల్లో పూర్తిగా చేతులెత్తేసింది. వరల్డ్‌ కప్‌కు ముందు ఇది ఆందోళన కలిగిస్తుండటంతో తమ లోపాలు సరిదిద్దుకోవడంపై జట్టు దృష్టి పెట్టింది. సామ్సన్‌కు చివరి చాన్స్‌! తొలి మూడు టి20ల్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే జట్టులో లోపాలేమీ కనిపించడం లేదు. వరల్డ్‌ కప్‌కు ముందు టీమ్‌ కూర్పుపై కూడా చాలా స్పష్టత వచ్చింది. అయితే ఓపెనర్‌ సంజు సామ్సన్‌ ఫామ్‌ మాత్రమే ఆందోళన కలిగిస్తోంది. గిల్‌పై వేటు వేయడంతో ఓపెనర్‌గా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్న సామ్సన్‌ తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 10, 6, 0 పరుగుల తర్వాత అతనిపై తీవ్ర ఒత్తిడి ఉంది. తిలక్‌ వర్మ గాయంతో మూడో స్థానంలో ఆడిన ఇషాన్‌ కిషన్‌ రెండు మ్యాచ్‌లలో చెలరేగిపోయాడు. తిలక్‌ తిరిగి వస్తే ఇషాన్‌ ఓపెనర్‌గా వెళితే సామ్సన్‌పై వేటు వేయడం ఖాయం. అదృష్టవశాత్తూ తిలక్‌ కోలుకోకపోవడంతో సామ్సన్‌కు మరో రెండు అవకాశాలు దక్కుతున్నాయి కాబట్టి అతను దీనిని వాడుకొని భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. మరోవైపు అభిషేక్‌ శర్మ అసాధారణ బ్యాటింగ్‌ను నిలువరించడం కివీస్‌ వల్ల కావడం లేదు. భారత అభిమానుల కోణంలో చూస్తే అభిషేక్‌ ఇంకా ఎంతగా విధ్వంసం సృష్టిస్తాడనేదే ప్రస్తుతం చర్చనీయాంశం. గత మ్యాచ్‌లో అతనితో పాటు సూర్య కూడా చెలరేగిపోవడంతో అతి సులువుగా భారత్‌ గెలిచింది. పాండ్యా, దూబే, రింకూ తమ స్థాయిలో సత్తా చాటుతుండటంతో భారత్‌ తిరుగులేని జట్టుగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో రొటేషన్‌లో ఆటగాళ్లను ప్రయతి్నంచే క్రమంలో మరోసారి బుమ్రాకు విశ్రాంతిచ్చే అవకాశం ఉంది. బుమ్రా, బిష్ణోయ్‌ స్థానాల్లో అర్‌‡్షదీప్, వరుణ్‌ చక్రవర్తి రావడం ఖాయం. రెండు మార్పులతో... న్యూజిలాండ్‌ పరిస్థితి చూస్తే ఏ ఆటగాడు కూడా ఒంటి చేత్తో మ్యాచ్‌ గెలిపించేలా కనిపించడం లేదు. ఒక్కో మ్యాచ్‌కు జట్టు ప్రదర్శన మరింత పేలవంగా మారుతూ వచ్చింది. తొలి పోరులో 190 పరుగులు చేసి కాస్త పోటీనిచ్చినట్లు కనిపించినా...ఆ తర్వాత భారత్‌ 209 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో... 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించడం కివీస్‌ పరిస్థితిని చూపిస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం టీమ్‌లో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాబిన్సన్, క్లార్క్‌ స్థానాల్లో పేసర్‌ ఫెర్గూసన్, ఆల్‌రౌండర్‌ నీషమ్‌ తుది జట్టులోకి వస్తారు. గాయం నుంచి కోలుకున్న తమ ప్రధాన పేసర్‌ ఫెర్గూసన్‌ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగలడని కివీస్‌ ఆశిస్తోంది. మూడు మ్యాచ్‌లలో కలిపి జట్టు నుంచి ఒకే ఒక అర్ధసెంచరీ నమోదైంది. ఫిలిప్స్‌ మాత్రమే ఫర్వాలేదనిపించగా, వన్డేల్లో చెలరేగిన మిచెల్‌ ఇక్కడ ప్రభావం చూపలేకపోతున్నాడు. కెపె్టన్‌ సాంట్నర్‌ కూడా విఫలమయ్యాడు. శుభారంభాలు లేకపోవడం జట్టును దెబ్బ తీస్తోంది. టీమ్‌ బౌలింగ్‌ చెత్తగా కనిపిస్తోంది. టీమ్‌లో ఒక బౌలర్‌ నమోదు చేసిన అతి తక్కువ ఎకానమీ 10 ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితి నుంచి కివీస్‌ ఎలా కోలుకుంటుందనేది కీలకం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్‌ కిషన్, పాండ్యా, దూబే, రింకూ, హర్షిత్, కుల్దీప్, అర్ష్ దీప్, వరుణ్‌. న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్ ), సీఫెర్ట్, కాన్వే, రచిన్, ఫిలిప్స్, మిచెల్, చాప్‌మన్, నీషమ్, హెన్రీ, ఫెర్గూసన్, సోధి. పిచ్, వాతావరణంబ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌తో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావం కూడా కాస్త ఉండవచ్చు. ఈ మైదానంలో 4 టి20లు ఆడిన భారత్‌ 3 గెలిచి ఒకటి ఓడింది. 2023 నవంబర్‌లో ఆఖరి మ్యాచ్‌ జరగ్గా... ఆసీస్‌పై 209 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 19.5 ఓవర్లలో ఛేదించింది.

National Senior Womens Kabaddi Championship begins4
జాతీయ సీనియర్‌ మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్‌ ప్రారంభం

30 జట్లు... 464 మంది క్రీడాకారిణులు...పలువురు అంతర్జాతీయ స్టార్స్‌... తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హైదరాబాద్‌ విచ్చేశారు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జాతీయ సీనియర్‌ మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్‌ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌ జరగనుంది. తొలి రోజు జరిగిన లీగ్‌ మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ 44–21తో తెలంగాణపై, ఢిల్లీ 61–14తో జమ్మూ కశ్మీర్‌పై, హిమాచల్‌ప్రదేశ్‌ 49–24తో అస్సాంపై, హరియాణా 62–16తో జార్ఖండ్‌పై నెగ్గాయి. తెలంగాణ జట్టుకు మహేశ్వరి కెప్టెన్‌గా, గట్టయ్య, బండారి మాధవి కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవంలో తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనా రెడ్డి, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్‌ ముదిరాజ్, కాసాని జ్ఞానేశ్వర్, జగదీశ్వర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నీలో రాణించిన క్రీడాకారిణులను ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో, కబడ్డీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ప్రాబబుల్స్‌గా ఎంపిక చేస్తారు.

WPL Womens 2026: Sophie Devine led Gujarat to victory5
గుజరాత్‌ను గెలిపించిన సోఫీ డివైన్‌

వడోదర: అప్పుడు ముంబైలో... ఇప్పుడు వడోదరలో... ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్‌ జెయింట్స్‌ల మధ్య ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన పోరులో గుజరాతే పైచేయి సాధించింది. ఈ రెండు సందర్భాల్లోనూ సోఫీ డివైన్‌ చివరి ఓవరే గెలవాల్సిన ఢిల్లీని ఓడించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జెయింట్స్‌ 3 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా గుజరాత్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (58; 7 ఫోర్లు) రాణించింది. ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నర్‌ నల్లపురెడ్డి శ్రీచరణి (4/31) తిప్పేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడింది. ఢిల్లీ విజయానికి ఆఖరి 24 బంతుల్లో 60 పరుగులు కావాల్సిన దశలో నికీ ప్రసాద్‌ (24 బంతుల్లో 47; 9 ఫోర్లు), స్నేహ్‌ రాణా (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. డివైన్‌ 17వ ఓవర్లో 23 పరుగులు, గార్డ్‌నర్‌ 19వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. దాంతో ఢిల్లీ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాలి. కానీ సోఫీ డివైన్‌ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నికీ, స్నేహ్‌లను అవుట్‌ చేయడంతో గుజరాత్‌ ఓటమి కోరల్లోంచి బయటపడి గెలిచింది. నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు జట్టుతో యూపీ వారియర్స్‌ ఆడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి) జెమీమా (బి) నందిని 58; సోఫీ డివైన్‌ (బి) కాప్‌ 13; అనుష్క (సి) మిన్నుమణి (బి) శ్రీచరణి 39; గార్డ్‌నర్‌ (సి) స్నేహ్‌ రాణా (బి) మిన్నుమణి 2; వేర్‌హమ్‌ (బి) శ్రీచరణి 11; భారతి (బి) చినెల్లి హెన్రీ 3; కనిక (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 4; కాశ్వీ (బి) శ్రీచరణి 2; తనూజ (సి) శ్రీచరణి (బి) చినెల్లి హెన్రీ 21; రేణుక (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–19, 2–73, 3–96, 4–128, 5–131, 6–135, 7–139, 8–151, 9–174. బౌలింగ్‌: కాప్‌ 4–0–34–1, చినెల్లి 4–0–38–2, నందిని 4–0– 26–1, శ్రీచరణి 4–0–31–4, స్నేహ్‌ రాణా 1–0– 11–0, మిన్ను మణి 3–0–23–1. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) గార్డ్‌నర్‌ (బి) రాజేశ్వరి 14; లిజెల్లీ (సి) గార్డ్‌నర్‌ (బి) సోఫీ 11; వోల్వార్డ్‌ (బి) రాజేశ్వరి 24; జెమీమా (బి) సోఫీ 16; కాప్‌ (బి) గార్డ్‌నర్‌ 0; చినెల్లి (సి) గార్డ్‌నర్‌ (బి) రాజేశ్వరి 9; నికీ ప్రసాద్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) డివైన్‌ 47; స్నేహ్‌ రాణా (సి) వేర్‌హమ్‌ (బి) సోఫీ 29; మిన్ను మణి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–26, 2–51, 3–82, 4–83, 5–85, 6–100, 7–170, 8–171. బౌలింగ్‌: రేణుక 1–0–16–0, కాశ్వీ గౌతమ్‌ 2–0–18–0, రాజేశ్వరి 4–0–20–3, సోఫీ డివైన్‌ 4–0–37–4, తనూజ 4–0–26–0, ఆష్లే గార్డ్‌నర్‌ 4–0–37–1, వేర్‌హమ్‌ 1–0–12–0.

U19 WC 2026: India beat zimbabwe by 204 runs in super six match6
World Cup 2026: టీమిండియా ఘన విజయం

అండర్‌ 19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్‌ దశలో హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌ సిక్స్‌కు చేరిన యంగ్‌ ఇండియా.. ఈ దశలోనూ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.బులవాయో వేదికగా ఇవాళ (జనవరి 27) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 204 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్‌ ఒడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. విహాన్‌ మల్హోత్రా (109 నాటౌట్‌) సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ అభిగ్యాన్‌ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు. ఆఖర్లో ఖిలన్‌ పటేల్‌ (12 బంతుల్లో 30; ఫోర్‌, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 350 పరుగుల మార్కును దాటింది.మిగతా ఆటగాళ్లలో ఆరోన్‌ జార్జ్‌ 23, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 21, వేదాంత్‌ త్రివేది 15, కనిష్క్‌ చౌహాన్‌ 3, అంబ్రిష్‌ 21, హెనిల్‌ పటేల్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్‌, కెప్టెన్‌ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఆదిలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో 37.4 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. లీరాయ్‌ (62), కియాన్‌ బ్లిగ్నాట్‌ (37), టటెండ చిముగోరో (29) మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఉధవ్‌ మోహన్‌, ఆయుశ్‌ మాత్రే తలో 3 వికెట్లు పడగొట్టగా.. అంబ్రిష్‌ 2, హెనిల్‌ పటేల్‌, ఖిలన్‌ పటేల్‌ చెరో​ వికెట్‌ తీశారు. సూపర్‌ సిక్స్‌లో భారత్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ దాయాది పాకిస్తాన్‌. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా జరుగనుంది.

Former India cricketer arrested after ramming into three vehicles amid intoxication7
టీమిండియా మాజీ క్రికెటర్‌ అరెస్ట్‌

మద్యం​ మత్తులో కారు యాక్సిడెంట్‌ చేసిన కేసులో టీమిండియా మాజీ క్రికెటర్‌ జేకబ్‌ మార్టిన్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఇవాళ (జనవరి 27) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతను వడోదర నగరంలో మూడు వాహనాలను ఢీకొట్టాడు. యాక్సిడెంట్‌ జరిగిన సమయంలో జేకబ్‌ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు.జేకబ్‌ తన ఎంజీ హెక్టార్‌ కారుతో హ్యుందాయ్‌ వెన్యూ, మారుతీ సిలేరియో, కియా సెల్టోస్‌ కార్లను ఢీకొట్టాడు. మద్యంపై ఉండటంతో నియంత్రణ కోల్పోయి యాక్సిడెంట్‌ చేసినట్లు పోలీసులు కేసు కట్టారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.పోలీసులు జేకబ్‌ను అదుపులోకి తీసుకొని, భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు మోటర్‌ వెహికిల్‌ చట్టాల కింద కేసు నమోదు చేశారు. కొద్ది గంట్లోనే జేకబ్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. కానీ, కారు పోలీసుల ఆధీనంలోనే ఉంది.53 ఏళ్ల జేకబ్‌ మార్టిన్‌ 1999-2001 మధ్యలో భారత్‌ తరఫున 10 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా, దేశీయ క్రికెట్‌లో (బరోడా, రైల్వేస్‌, అస్సాం) అతనికి మంచి రికార్డు ఉంది. 138 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23 శతకాల సాయంతో 9192 పరుగులు చేశాడు. లిస్ట్-ఏలోనూ 2948 పరుగులు (3 సెంచరీలు) చేశాడు. జేకబ్‌ బరోడా కెప్టెన్‌గా కూడా సేవలందించాడు.కుడి చేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌ కమ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ కూడా అయిన జేకబ్‌ దేశవాలీ కెరీర్‌లో 19 వికెట్లు తీశాడు. క్రికెటర్‌గా కెరీర్‌ ముగిసిన తర్వాత జేకబ్‌ జీవితం వివాదాలు, ప్రమాదాలతో నిండిపోయింది. 2011లో అక్రమ ఇమ్మిగ్రేషన్ రాకెట్ కేసులో అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతని ఊపిరితిత్తులు, కాలేయానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సమయంలో జేకబ్‌ కుటుంబానికి బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, కృనాల్ పాండ్యా వంటి వారు ఆర్థిక సహాయం చేశారు.

Joe root continuing superb form in ODI format too8
వన్డేల్లోనూ కొనసాగుతున్న రూట్‌ సెంచరీల పర్వం

ఈ జనరేషన్‌లో అత్యుత్తమ బ్యాటర్‌ ఎవరని అడిగితే.. కొద్ది రోజుల కిందటి వరకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు క్రికెట్‌ అభిమానులు ఇబ్బంది పడేవారు. ఎందుకంటే, ఫాబ్‌ ఫోర్‌గా పిలువబడే విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌ మధ్య అత్యుత్తమ బ్యాటర్‌ అనిపించుకునేందుకు తీవ్రమైన పోటీ ఉండేది. వీరంతా ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ, ఏ ఒక్కరికీ అత్యుత్తమ బ్యాటర్‌ అనే కీర్తి దక్కకుండా పోటీపడేవారు.అయితే గత కొద్ది రోజులగా ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. అత్యుత్తమ బ్యాటర్‌ అనిపించుకునేందుకు జో రూట్‌ సోలోగా ముందుకొస్తున్నాడు. సహచరులు విరాట్‌, స్టీవ్‌, కేన్‌ను వెనక్కు నెడుతూ తానే అత్యుత్తమ బ్యాటర్‌నంటూ బ్యాట్‌తో సమాధానం చెబుతున్నాడు. విరాట్‌ (37), స్టీవ్‌ (36), కేన్‌ (35) వయసు మీద పడటంతో ఏదో ఒక ఫార్మాట్‌కు/ఫార్మాట్లకు పరిమితం కాగా.. రూట్‌ (35) కూడా వారి ఏజ్‌ గ్రూప్‌లోనే ఉన్నా, మూడు ఫార్మాట్లలో కొనసాగుతూ టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో అత్యుత్తమంగా సత్తా చాటుతున్నాడు. రూట్‌ మినహా ఫాబ్‌లోని మిగతా ముగ్గురు ఏదో ఒక ఫార్మాట్లో మాత్రమే రాణిస్తున్నారు.టెస్ట్‌, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ వన్డేల్లో దూసుకుపోతుండగా.. వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టీవ్‌ స్మిత్‌ టెస్ట్‌ల్లో మాత్రమే సత్తా చాటుతున్నాడు. కేన్‌ విషయానికొస్తే.. ఇటీవలికాలంలో ఫాబ్‌-4లో బాగా వెనుకపడిపోయింది ఇతనే. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన కేన్‌.. టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతున్నా, ఏ ఒక్క ఫార్మాట్‌కు న్యాయం చేయలేకపోతున్నాడు.రూట్‌ పరిస్థితి మాత్రం పై ముగ్గురికి భిన్నంగా ఉంది. ఇతను ఏ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించకుండా మూడు ఫార్మాట్లలోనూ కొనసాగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో అకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో యంగస్టర్లకు సైతం పోటీగా మారాడు.ఇటీవలికాలంలో టెస్ట్‌, వన్డేల్లో రూట్‌ ప్రదర్శనలు చూస్తే ఔరా అనక మానదు. గత ఆరేడేళ్ల కాలంలో అతను పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఫాబ్‌-4లోని మిగతా ముగ్గురికి అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్‌ల్లో రూట్‌కు కల్లెం వేయడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఈ మధ్యకాలంలో అతను ఏకంగా 22 సెంచరీలు బాదాడు. వన్డేల్లో కెరీర్‌ ముగిసిందనుకున్న దశలో ఈ ఫార్మాట్‌లోనూ రూట్‌ మెరుపులు ప్రారంభమయ్యాయి. చాలాకాలం సైలెంట్‌గా ఉన్న అతను.. ఈ మధ్యకాలంలో ఈ ఫార్మాట్లోనూ మూడు, నాలుగు సెంచరీలు చేశాడు.తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రూట్‌ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలతో సర్దుకున్న అతను.. ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సూపర్‌ సెంచరీతో మెరిశాడు. రూట్‌కు వన్డేల్లో ఇది 20వ సెంచరీ. ఓవరాల్‌గా 61వది. ప్రస్తుత తరం బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి (85) మాత్రమే రూట్‌ కంటే ముందున్నాడు.వాస్తవానికి విరాట్‌, స్టీవ్‌, కేన్‌ కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు రూట్‌ చాలా వెనుకపడి ఉండేవాడు. వారికి రూట్‌కు పదుల సంఖ్యలో సెంచరీల వ్యత్యాసం ఉండేది. వారంతా రూట్‌ కంటే చాలా ముందుండే వారు. అయితే ఐదేళ్లలో సీన్‌ మొత్తం తలకిందులైంది. అతను స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ను వెనక్కు నెట్టి విరాట్‌తో పోటీపడుతున్నాడు. వాస్తవానికి విరాట్‌ కూడా టెస్ట్‌ల్లో రూట్‌ ముందు దిగదుడుపే. నంబర్ల విషయంలో అతన్ని రూట్‌ ఎప్పుడో దాటేశాడు. ఇక టెస్ట్‌ల్లో రూట్‌ ముందున్న ఏకైక టార్గెట్‌ సచిన్‌ టెండూల్కర్‌ మాత్ర​మే. రూట్‌ తర్వలోనే సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డులను బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వన్డేల్లోనూ రూట్‌ జోరు ఇలాగే కొనసాగితే విరాట్‌ సెంచరీల సంఖ్య దాటడం​ పెద్ద కష్టం కాకపోవచ్చు.

Root and Brook Slams Hundreds, england set Huge target to sri lanka in 3rd ODI9
కనికరం లేని బ్రూక్‌.. లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు..!

కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 27) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదాడు. మరో ఎండ్‌లో జో రూట్‌ కూడా బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. వీరిద్దరి ధాటికి టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.జేకబ్‌ బేతెల్‌ (72 బంతుల్లో 65; 8 ఫోర్లు) ఔటయ్యాక 31.1వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన బ్రూక్‌ తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు. పడ్డ బంతిని పడ్డట్టు బౌండరీ లేదా సిక్సర్‌కు తరలించాడు. బ్రూక్‌ విధ్వంసాన్ని తట్టుకోలేక లంక బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓ పక్క బ్రూక్‌ చెలరేగుతుంటే రూట్‌ నిదానంగా తన 20వ వన్డే శతకాన్ని (100 బంతుల్లో), 61వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేశాడు.కఠినమైన పిచ్‌పై వీరిద్దరు నాలుగో వికెట్‌కు 113 బంతుల్లో అజేయమైన 191 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 42 ఓవర్ల తర్వాత 38 పరుగులుగా (32 బంతుల్లో) ఉండిన బ్రూక్‌ స్కోర్‌ 50 ఓవర్‌ ముగిసే సరికి 66 బంతుల్లో అజేయమైన 136 పరుగులైంది. దీన్ని బట్టి చూస్తే బ్రూక్‌ విధ్వంసం ఏ రేంజ్‌లో కొనసాగిందో అర్దమవుతుంది. చివరి 8 ఓవర్లలో బ్రూక్‌ 34 బంతులు ఎదుర్కొని ఏకంగా 98 పరుగులు బాదాడు. బ్రూక్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 11 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.మరోవైపు బాధ్యతాయుతంగా సెంచరీ పూర్తి చేసిన రూట్‌.. జోరు మీదున్న బ్రూక్‌కు ఎక్కువగా స్ట్రయిక్‌ ఇస్తూ అజేయమైన 111 పరుగుల వద్ద (108 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌) ఇన్నింగ్స్‌ను ముగించాడు. మిగతా ఇంగ్లండ్‌ బ్యాటర్లలో రెహాన్‌ అహ్మద్‌ 24, బెన్‌ డకెట్‌ 7 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, హసరంగ, వాండర్సే తలో వికెట్‌ తీశారు. వెల్లాలగే (10-0-49-0), లియనగే (3-1-7-0) మినహా మిగతా లంక బౌలర్లందరినీ బ్రూక్‌ ఆటాడుకున్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే శ్రీలంక గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

U19 WC 2026 IND VS ZIM: Vihaan malhotra shines with century, team scored huge score10
World Cup 2026: టీమిండియా భారీ స్కోర్‌

జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతున్న అండర్‌ 19 ప్రపంచకప్‌-2026లో ఇవాళ (జనవరి 27) యంగ్‌ ఇండియా మ్యాచ్‌ జరుగుతుంది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌, ఆతిథ్య జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్‌ (352-8) చేసింది.మిడిలార్డర్‌ బ్యాటర్‌ విహాన్‌ మల్హోత్రా బాధ్యతాయుతమైన సెంచరీతో (107 బంతుల్లో 109 నాటౌట్‌; 7 ఫోర్లు) చెలరేగగా.. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ అభిగ్యాన్‌ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు.ఆఖర్లో ఖిలన్‌ పటేల్‌ (12 బంతుల్లో 30; ఫోర్‌, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 350 పరుగుల మార్కును దాటింది. మిగతా ఆటగాళ్లలో ఆరోన్‌ జార్జ్‌ 23, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 21, వేదాంత్‌ త్రివేది 15, కనిష్క్‌ చౌహాన్‌ 3, అంబ్రిష్‌ 21, హెనిల్‌ పటేల్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్‌, కెప్టెన్‌ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.కాగా, గ్రూప్‌ దశలో భారత్‌ వరుసగా యూఎస్‌ఏ, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ​్‌పై విజయాలు సాధించి సూపర్‌ సిక్స్‌లోకి ప్రవేశించింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగానే భారత్‌ జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ తర్వాత భారత్‌ దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement