Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Mumbai Indians Beat Gujarat Titans By 100 Runs IPL 20261
ముంబై చేతిలో చిత్తుగా ఓడిన గుజ‌రాత్‌

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోమ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 99 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 200 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 15.5 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి దారుణ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 26 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ముంబై బౌల‌ర్ల‌లో అశ్వ‌నీ కుమార్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, గ‌జ‌న్‌ఫ‌ర్‌, మిచెల్ సాంట్న‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. సొంత‌గ‌డ్డ‌పై ఆడిన గుజ‌రాత్ ముంబై బౌల‌ర్ల ధాటికి వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. అంత‌కముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ (101 నాటౌట్‌) సెంచ‌రీతో విధ్వంసం చెల‌రేగ‌గా, న‌మ‌న్ ధిర్ (45) బాధ్య‌తాయుతంగా ఆడారు. గుజ‌రాత్‌బౌల‌ర్ల‌లో ర‌బాడ 3 వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, ప్ర‌సిధ్ క్రిష్ణ చెరొక వికెట్ తీశారు. సెంచ‌రీతో చెల‌రేగిన తిల‌క్ వ‌ర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సీజ‌న్‌లో రెండో విజ‌యం సాధించిన ముంబై 4 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఏడో స్థానానికి ఎగ‌బాకింది. మ‌రోవైపు గుజ‌రాత్ టైటాన్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజ‌యాలు, మూడు ప‌రాజ‌యాల‌తో ప‌ట్టిల‌క‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

Tilak Varma Rewrites History,Slams Fastest 100 For Mumbai Indians By An Indian2
చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. ఫాస్టెస్ట్‌ సెంచరీ

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ ఎట్ట‌కేల‌కు త‌న ఫామ్‌ను అందుకున్నాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తిల‌క్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. న‌రేంద్ర మోడీ స్టేడియంలో తిల‌క్ విధ్వంసం సృష్టించాడు.ముంబై ఇండియన్స్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్.. తొలుత ఆచితూచి ఆడాడు. ఈ హైదరాబాదీ తను ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. తొలి 50 పరుగులను 33 బంతుల్లో పూర్తి చేసిన తిలక్.. చివరి 50 పరుగులను కేవలం 12 బంతుల్లోనే బాది తన మొదటి ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న తిలక్‌ వర్మ 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్‌లో 45 బంతుల్లోనే శతకొట్టిన తిలక్ వర్మ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆటగాడిగా సనత్ జై సూర్య రికార్డును తిలక్ సమం చేశాడు. జైసూర్య 2008 సీజన్‌లో సీఎస్‌కేపై 45 బంతుల్లోనే శతక్కొట్టాడు.ఇప్పుడు మళ్లీ 18 ఏళ్ల తర్వాత తిలక్ 45 బంతుల్లో సెంచరీ చేశాడు. ముంబై ఇండియన్స్‌ తరపున ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఇండియన్‌ మాత్రం తిలక్‌ వర్మనే కావడం గమనార్హం.అదేవిధంగా ముంబై ఇండియన్స్‌ తరపున సెంచరీ చేసిన రెండువ అతి పిన్నవయష్కుడిగా తిలక్‌ నిలిచాడు. 23 ఏళ్ల 163 రోజుల్లో తిలక్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఈ జాబితాలో కామోరూన్‌ గ్రీన్‌(22 ఏళ్ల 352 రోజులు) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయిONE OF THE CRAZIEST HUNDREDS IN THE IPL BY TILAK VARMA IN 45 BALLS. 🤯🔥- The hundred celebration was ice cold. 🥶 pic.twitter.com/DhMfH0UlgM— Mufaddal Vohra (@mufaddal_vohra) April 20, 2026

LSGs International Player Leaves The Team Midway In IPL 20263
ఆ టీమ్‌కు భారీ షాక్‌.. ఉన్న‌ప‌ళంగా ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయ‌ర్‌

ఐపీఎల్‌-2026లో వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు భారీ షాక్ త‌గిలింది. సౌతాఫ్రికా స్పీడ్ అన్రిచ్ నోకియా సీజ‌న్ మ‌ధ్య‌లోనే లక్నో జ‌ట్టును వ‌దిలి స్వ‌దేశానికి వెళ్లిపోయాడు. అత‌డి భార్య త్వ‌ర‌లోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. దీంతో త‌న భార్య వ‌ద్ద ఉండేందుకు నోర్జే పితృత్వ సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సీజన్‌లో నోకియా ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.దీంతో తర్వాత మ్యాచ్‌లలో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ఇక లక్నో విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్‌లో కూడా పంత్ టీమ్‌కు ఏదీ కలిసి రావడంలేదు. లక్నో బౌలింగ్‌ పరంగా కాస్త బలంగా ఉన్నప్పటికి, బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. లక్నో తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 22న ఏకానా స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.చదవండి: అత‌డిని ఎంత పొగిడినా తక్కువే.. కచ్చితంగా స్టార్ అవుతాడు: శ్రేయస్‌

Kagiso Rabadas Ball Of The Tournament Shatters Suryakumar Yadavs Confidence4
ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి

ఐపీఎల్‌-2026లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న పేలవ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సూర్య తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్‌కు క‌గిసో ర‌బాడ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు.అత‌డు బౌలింగ్ ధాటికి ఓపెన‌ర్లు వికెట్లు కోల్పోయి ముంబై క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన సూర్య‌కుమార్‌పై ముంబై ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే 6 ఓవ‌ర్ వేసిన ర‌బాడ బౌలింగ్‌లో సూర్య‌ ఓ సిక్స్, ఫోర్ బాది మంచి ట‌చ్‌లో క‌న్పించాడు. కానీ అదే ఓవ‌ర్‌లో ర‌బాడ అద్భుత‌మైన బంతితో సూర్య‌కుమార్‌ను బోల్తా కొట్టించాడు.ఐదో బంతిని ర‌బాడ లెంగ్త్ బాల్ సంధించాడు. ఆ డెలివరీని సూర్య స్ట్రైట్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఇన్ స్వింగ్ అయ్యి బ్యాట్‌, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో సూర్య కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.Quinton de Kock ✅Surya Kumar Yadav ✅Kagiso Rabada with a fine piece of new-ball bowling 👌Updates ▶️ https://t.co/cawFoZABvQ#TATAIPL | #KhelBindaas | #GTvMI | @gujarat_titans pic.twitter.com/Xw2QlE4kZF— IndianPremierLeague (@IPL) April 20, 2026

Vaibhav Sooryavanshi is one for the future: Shreyas Iyer5
అత‌డిని ఎంత పొగిడినా తక్కువే.. కచ్చితంగా స్టార్ అవుతాడు: శ్రేయస్‌

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా వైభవ్ బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు.ఓవరాల్‌గా ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 236.54 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేశాడు. కాగా ఈ యంగ్ కిడ్ బ్యాటింగ్‌కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిదా అయిపోయాడు. వైభవ్ ఒక ఫ్యూచర్ స్టార్ అని శ్రేయస్ కొనియాడాడు.వైభవ్ సూర్యవంశీ ఒక భిన్నమైన ఆటగాడు. అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది. అతడిని ఎంత పొగిడినా తక్కువే. అతడి బ్యాట్ ఫ్లో, బంతి పడకముందే అతను సృష్టించుకునే రిథమ్, మొమెంటం అద్భుతం. కచ్చితంగా అతడు కచ్చితంగా భవిష్యత్ స్టార్ అవుతాడనే చెప్పాలి" అని జియోస్టార్ నిర్వహించిన 'బిలీవ్' కార్యక్రమంలో అయ్యర్ పేర్కొన్నాడు.ఇక ఈ ఏడాది సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్‌, బ్యాటర్‌గా అదరగొడుతున్నాడు. శ్రేయస్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 208 పరుగులు సాధించాడు. అతడి కెప్టెన్సీలో పంజాబ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.చదవండి: NZ vs BAN 2nd ODI: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

IPL 2026: Gujarat titans vs Mumbai indians Live updates6
గుజరాత్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోమ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 99 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 200 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 15.5 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి దారుణ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 26 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ముంబై బౌల‌ర్ల‌లో అశ్వ‌నీ కుమార్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, గ‌జ‌న్‌ఫ‌ర్‌, మిచెల్ సాంట్న‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. సొంత‌గ‌డ్డ‌పై ఆడిన గుజ‌రాత్ ముంబై బౌల‌ర్ల ధాటికి వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. అంత‌కముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది.గుజరాత్‌ మూడో వికెట్‌ డౌన్‌గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌.. అశ్విన్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 45/3గుజరాత్‌ రెండో వికెట్‌ డౌన్‌గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన జోస్‌ బట్లర్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్‌200 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్ త‌గిలింది. బుమ్రా వేసిన మొద‌టి ఓవ‌ర్‌లో తొలి బంతికే సాయిసుద‌ర్శ‌న్ పెవిలియ‌న్‌కు చేరాడు.తిలక్‌ వర్మ విధ్వంసంఅహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. తిలక్‌ వర్మకు ఇదే తొలి ఐపీఎల్‌ సెంచరీ. అతడితో పాటు నమన్‌ ధీర్‌(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) రాణించాడు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు.తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతిలక్‌ వర్మ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. అహ్మాదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్‌ హాఫ్‌ సెంచరీతో సత్తాచాటాడు. 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న తిలక్‌16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో తిలక్‌ వర్మ(37), హార్దిక్‌ పాండ్యా(7) ఉన్నారు.ముంబై నాలుగో వికెట్‌ డౌన్‌98 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్‌ కోల్పోయింది. 45 పరుగులు చేసిన నమన్‌ధీర్‌.. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్‌: 103/4ముంబై మూడో వికెట్‌ డౌన్‌44 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. రబాడ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడుముంబై రెండో వికెట్‌ డౌన్‌23 ప‌రుగుల వ‌ద్ద ముంబై ఇండియ‌న్స్ రెండో వికెట్ కోల్పోయింది. 13 ప‌రుగులు చేసిన క్వింట‌న్ డికాక్‌.. క‌గిసో ర‌బాడ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి సూర్య‌కుమార్ యాద‌వ్ వ‌చ్చాడు.తొలి వికెట్‌ డౌన్‌టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. అరంగేట్ర ఆటగాడు డానిష్‌ మాలెవర్‌(2).. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ముంబై స్కోర్‌: 21/1ఐపీఎల్‌-2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ​కూడా ముంబై స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ దూరమయ్యాడు.కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున యువ ఆటగాళ్లు డానిష్ మలేవార్, క్రిష్‌ భగత్‌ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా మిచెల్‌ శాంట్నర్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్‌ టైటాన్స్‌ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్‌), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మముంబై ఇండియన్స్ : డానిష్ మాలెవార్, క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్‌), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(సి), తిలక్ వర్మ, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్‌ఫర్

Bangladesh beat New Zealand by 6 wickets in Second ODi7
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. సోమవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో కివీస్‌పై 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను బంగ్లా జ‌ట్టు 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.4 ఓవ‌ర్ల‌లో 198 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో నిక్ కెల్లీ (102 బంతుల్లో 83 పరుగులు, 14 ఫోర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఓవైపు వికెట్లు ప‌డుతున్నా కెల్లీ మాత్రం ఒంట‌రిపోరాటం చేశాడు. మిగితా బ్యాట‌ర్ల నుంచి అత‌డి స‌హ‌కారం ల‌భించ‌లేదు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. రాణా 5 వికెట్లు ప‌డ‌గొట్టి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. అత‌డితో పాటు షోర్‌ఫుల్ ఇస్లాం రెండు.. రిషాద్‌, టాస్కిన్ అహ్మ‌ద్‌, సౌమ్య సర్కార్ త‌లా వికెట్ సాధించారు.తాంజిద్ మెరుపులుఅనంత‌రం 199 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ 35.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ తాంజిద్ హసన్ (58 బంతుల్లో, 76 పరుగులు, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో నజ్ముల్ హొస్సేన్ శాంటో(50) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. కివీస్ బౌల‌ర్ల‌లో జేడెన్ లెనాక్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స్మిత్‌, ఓ రూర్క్ త‌లా వికెట్ సాధించారు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఏప్రిల్ 23న ఛటోగ్రామ్‌లో జరగనుంది.చదవండి: IPL 2026: అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్‌!

Sanjiv Goenka Reacts Punjab Fan Teases Him Wasting Money On Rishabh Pant8
‘రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి’

లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు అభిమానులు గోయెంకాకు కృతజ్ఞతలు చెప్పిన తీరు వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌లో 2022లో చేరిన లక్నో జట్టు కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో ప్లే ఆఫ్స్‌ చేరింది.రూ. 27 కోట్ల భారీ ధరకుఅయితే, సంజీవ్‌ గోయెంకా వైఖరితో విసిగిపోయిన కేఎల్‌ రాహుల్‌ (KL Rahul).. 2025 వేలానికి ముందు లక్నోను వీడాడు. గౌరవం లేని చోట తాను ఉండలేనని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో టీమిండియా మరో స్టార్‌ రిషభ్‌ పంత్‌ను కొనుగోలు చేసింది.రూ. 26.75 కోట్లకు పంజాబ్‌ సొంతంమరోవైపు.. 2024లో తమ జట్టుకు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వదిలేసింది. ఈ క్రమంలో అయ్యర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడగా.. పంజాబ్‌ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పంత్‌, శ్రేయస్‌ ఖరీదైన ఆటగాళ్లుగా నిలవగా.. ఇద్దరికీ తమ ఫ్రాంఛైజీలు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాయి.కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా సూపర్‌ హిట్‌.. పంత్‌ విఫలంఅయితే, శ్రేయస్‌ ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా సూపర్‌ హిట్‌ అయ్యాడు. గతేడాది 604 పరుగులు చేసిన ఈ ముంబైకర్‌ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. పంత్‌ మాత్రం దారుణంగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. గతేడాది కేవలం 269 పరుగులు చేసిన పంత్‌.. కెప్టెన్‌గానూ ఫెయిలై జట్టును ఏడోస్థానంలో నిలిపాడు.ఇక తాజాగా ఐపీఎల్‌-2026లోనూ పంజాబ్‌ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. లక్నో వరుస వైఫల్యాలతో సతమతమవుతూ ఉంది. ముల్లన్‌పూర్‌లో ఆదివారం ఇరుజట్లు తలపడగా.. పంజాబ్‌ లక్నోను 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న సంజీవ్‌ గోయెంకాకు పంజాబ్‌ అభిమాని దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు.రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి‘‘గోయెంకా సాబ్‌! పంత్‌ను మీ జట్టులోకి తీసుకున్నందు వేలవేల దండాలు భాయ్‌.. అతడు పంజాబ్‌ కెప్టెన్‌గా రానందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఒకవేళ తదుపరి వేలంలో రూ. 32 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా దయచేసి పంత్‌ను మీతోనే ఉంచుకోండి’’ అని సదరు అభిమాని గట్టిగా అరిచాడు.అయితే, ఇందుకు గోయెంకా మాత్రం థాంక్యూ అన్నట్లుగా నవ్వుతూ అభివాదం చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలం ముగిసిన తర్వాత రిషభ్‌ పంత్‌ చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు ఒక రకంగా గోయెంకాకు ఎదురైన అవమానానికి కారణం.PBKS fan: Goenka sahab! Thank you for taking Pant, paaji many, many thanks! Shukar hai captain saadi Punjab team ch nahi aaya!Paaji, even if you have to give 32 crores, don't let Pant go, keep him with you!😭Meanwhile,blud Sanjeev Goenka laughing and giving a thumbs up🤣🙏 pic.twitter.com/dKB7s8ouIt— Rohan💫 (@rohann__45) April 20, 2026ఆరోజు పంత్‌ అన్న మాటనే తిప్పి కొట్టి..వేలం సందర్భంగా.. ‘‘నాకు ఒకటే టెన్షన్‌.. పంజాబ్‌కు మాత్రం అస్సలు వెళ్లకూడదు అని మొక్కుకున్నా.. నేను ఆడకూడదనుకునే ఒకే ఒక్క టీమ్‌ అది’’ అని పంత్‌ వ్యాఖ్యానించాడు. దీంతో అప్పటి నుంచి పంజాబ్‌ జట్టు ఫ్యాన్స్‌ అతడిపై గుర్రుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పంజాబ్‌లో పంజాబ్‌ చేతిలో పంత్‌ సేన ఓడిన తర్వాత గోయెంకాకు ఇలా పంత్‌ గురించి సలహా ఇచ్చారు.చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

Ravichandran Ashwin claims Riyan Parag doesnt trust Ravindra Jadeja9
అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్‌!

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో వ‌రుస‌గా నాలుగు విజయాల‌తో మంచి జోష్‌లో క‌న్పించిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఇప్పుడు ఢీలా ప‌డింది. ఆదివారం ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ ఓట‌మి పాలైంది. రాజ‌స్తాన్‌కు ఇది వ‌రుస‌గా రెండో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.మొన్న‌టి వ‌ర‌కు పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో కొన‌సాగిన రాయ‌ల్స్‌.. ఇప్పుడు మూడో స్ధానానికి పడిపోయింది. అయితే సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది సీజన్‌కు ముందు సీఎస్‌కే నుంచి జడేజాను రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది.కానీ జడేజా లాంటి ఆల్‌రౌండ‌ర్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డంలో రాజ‌స్తాన్ విఫ‌ల‌మైంద‌నే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడిన జ‌డ్డూ..కేవ‌లం 10 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశాడు. అప్ప‌టికి ఐదు వికెట్లు జ‌డేజా ప‌డ‌గొట్టాడు. ఓ రెండు మ్యాచ్‌ల్లో అత‌డితో పూర్తిగా ఒక్క ఓవ‌ర్ కూడా వేయించ‌లేదు.కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా జడేజా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. మూడు ఓవర్లు వేసిన జడేజా, కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికి అతడితో నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయించలేదు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై భారత మాజీ స్పి‍న్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. జడేజాలాంటి సీనియర్ స్పిన్నర్‌తో పూర్తి కోటాను పూర్తి చేయించకపోవడాన్ని అశ్విన్ తప్పుబట్టాడు."రవీంద్ర జడేజా రూపంలో అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మీ జట్టులో ఉన్నాడు. అతడి గణంకాలను చూస్తే ఎలాంటి బౌలరో మీకే ఆర్ధమవుతోంది. కేకేఆర్ మ్యాచ్‌లో జడ్డూ మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో రింకూ సింగ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికి అతడితో మరో ఓవర్ వేయించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నారని బహుశా జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదనుకుంటా. రవి బిష్ణోయ్ వంటి రైట్ ఆర్మ్ లెగ్ బౌలర్ అయితే బాగా బౌలింగ్ చేస్తాడని కెప్టెన్ ఆశించాడు. కానీ చివరి ఏమి జరిగింది. బిష్ణోయ్ వేసిన ఒకే ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. దీని బట్టి జడేజా బౌలింగ్‌పై మీకు నమ్మకం లేదని నాకు ఆర్ధమైంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

Babar Azam Creates History, Surpasses Virat Kohli And Chris Gayle In Elite List10
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో పెషావర్ జల్మీ కెప్టెన్‌, స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజం త‌న సూప‌ర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం క‌రాచీ స్టేడియం వేదిక‌గా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అద్భుతమైన సెంచరీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ త‌న శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు.గ్లాడియేట‌ర్స్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు.బాబర్ కేవలం 338 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(344) పేరిట ఉండేది. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్‌లు) ఉండేవాడు. తాజాగా ఇన్నింగ్స్‌తో వీరిద్దరిని బాబర్ అధిగమించాడు. కాగా బాబర్‌కు ఇది 12వ సెంచ‌రీ.టీ20ల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన జాబితాలో బాబ‌ర్ రెండో స్ధానంలో ఉన్నాడు. మొద‌టి స్ధానంలో క్రిస్ గేల్ (22 సెంచరీలు) కొన‌సాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఒక ఇన్నింగ్స్ 50 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని కేవ‌లం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడిన మొద‌టి ఆట‌గాడిగా బాబ‌ర్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఎదుర్కొన్న 52 బంతుల్లో ఒకే డాట్ బాల్ ఉంది.చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement