Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC: Mohsin Naqvi Names Actual Hero For Pak India Boycott U Turn1
IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆది నుంచి పాక్‌ బోర్డు చర్చ చేయడమే ఇందుకు కారణం.ఈ ఐసీసీ ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌ మ్యాచ్‌ల కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఉంటామంటూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాక్‌ ప్రగల్భాలు పలికింది. ఆ దేశ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ఈ విషయం గురించి ప్రకటన చేశారు.మరోసారి చిత్తుగా ఓడి..అయితే, అందరూ ఊహించినట్లుగానే పాక్‌ మాట మార్చింది. ఐసీసీ జోక్యంతో పాటు.. శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్‌ బోర్డుల నుంచి ఒత్తిడి రావడంతో టీమిండియాతో మ్యాచ్‌ (IND vs PAK) ఆడతామని ప్రకటించింది. కొలంబోలో ఆదివారం భారత్‌తో తలపడి మరోసారి చిత్తుగా ఓడింది.ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్‌ మొహ్సిన్‌ నక్వీ (Mohsing Naqvi) ముందుగానే స్టేడియం నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాము భారత్‌తో మ్యాచ్‌ ఆడటంలో శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిస్సనాయకేదే కీలక పాత్ర అని నక్వీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.అసలైన హీరో మీరేదిస్సనాయకేతో సమావేశంలో నక్వీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ తరఫున మీకు శుభాభినందనలు. నిన్నటి మ్యాచ్‌ (ఆదివారం టీమిండియాతో మ్యాచ్‌) జరగడానికి ముఖ్య కారణం మీరే.ఈ మ్యాచ్‌ సజావుగా సాగడంలో మీదే కీలక పాత్ర. మీరే హీరో. దాదాపు రెండు బిలియన్ల మంది ప్రేక్షకులు మీ కారణంగా వినోదం పొందగలిగారు. కేవలం మీ చొరవ వల్లే ఈ మ్యాచ్‌ జరిగింది.టీమిండియాతో ఆడకూడదని మేము నిర్ణయించుకున్నాం. వారితో మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే, మా ప్రధానికి మీరు ఎప్పుడైతే ఫోన్‌ చేశారో.. ఆయన వెంటనే నాకు ఫోన్‌ చేసి.. ‘ఇకపై ఎలాంటి సమస్యా లేదు.. మనం టీమిండియాతో మ్యాచ్‌ ఆడుతున్నాం అంతే’ అని అన్నారు. మీకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు.ఉగ్రదాడిని గుర్తు చేస్తూ లంక లేఖకాగా శ్రీలంక జట్టుపై పాక్‌లో గతంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. అదే విధంగా గతేడాది సైతం బాంబుల మోత నడుమ లంక పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ పూర్తి చేసింది. ఈ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ లంక బోర్డు పాక్‌ బోర్డుకు లేఖ రాసింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా తిరిగి ఆ దేశంలో పర్యటించామని గుర్తు చేసింది.అలాంటిది వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌- పాక్‌ మ్యాచ్‌ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత రద్దు చేసుకుంటామనడం సరికాదని హెచ్చరించింది. మరోవైపు.. ఐసీసీ సైతం కఠిన చర్యలకు ఉపక్రమిస్తామనే సందేశం ఇచ్చింది. ఈ క్రమంలో యూటర్న్‌ తీసుకున్న పాక్‌ టీమిండియాతో మ్యాచ్‌ ఆడింది. చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

T20 WC: Sikandar Raza Sends Strong Message After Qualifying Super 82
పెద్దగా సంబరాల్లేవ్‌!.. మా లక్ష్యం అదే: జింబాబ్వే కెప్టెన్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే, శ్రీలంక జట్ల చేతిలో ఓటమి.. కంగారూలను సూపర్‌-8కు దూరం చేసింది. పల్లెకెలెలో మంగళవారం జరగాల్సిన జింబాబ్వే- ఐర్లాండ్‌ (ZIM vs IRE) మ్యాచ్‌ రద్దు కావడంతో ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.లీగ్‌ దశలోనేపేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లిస్తూ కంగారూలు లీగ్‌ దశలోనే అవమానకర రీతిలో ఇంటిబాట పట్టగా.. జింబాబ్వే సగర్వంగా సూపర్‌-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే కెప్టెన్‌ సికిందర్‌ రజా (Sikandar Raza)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సమిష్టిగా రాణించి‘‘ఆఫ్రికా సబ్‌ రీజియనల్‌ క్వాలిఫైయర్స్‌లో మేము గ్రూప్‌-బిలో కెన్యా, రువాండా, టాంజానియా వంటి జట్లతో తలపడ్డాము. ఆ సమయంలో మా లక్ష్యం గెలుపు ఒక్కటే. లేదంటే జట్టు మొత్తం తమను తాము నిందించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పాను.అక్కడ సమిష్టిగా రాణించి ప్రపంచకప్‌ టోర్నీలో అడుగుపెట్టాము. ఇప్పుడు సూపర్‌-8కు కూడా అర్హత సాధించాము. ఈ ఆనందాన్ని తప్పక సెలబ్రేట్‌ చేసుకుంటాం. అయితే, పెద్దగా సంబరాలు చేసుకోవడం లేదు.మా లక్ష్యంలో మొదటి దశను మేము దాటాము. తదుపరి మేము శ్రీలంకతో మ్యాచ్‌ ఆడబోతున్నాం. ఆ మ్యాచ్‌ నామమాత్రమే అయినా గెలుపుపై గురిపెట్టాము. నేను, మా కోచ్‌ వారి బలాబలాల గురించి డేటాను పరిశీలిస్తున్నాం. అందుకు తగ్గట్లుగా మా వ్యూహాలు సిద్ధం చేసుకుంటాము.అండర్‌డాగ్‌గా బరిలోకిఆ మ్యాచ్‌లోనూ గెలిచేందుకు వందకు వంద శాతం ప్రయత్నిస్తాం. సూపర్‌-8కు అర్హత సాధించినంత మాత్రాన మా లక్ష్యంలో ఎలాంటి మార్పూ ఉండదు. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి ఈ స్థాయికి చేరడం ఎవరికైనా సంతోషమే. అయితే, ప్రతిరోజూ కొత్తదే. కఠినంగా శ్రమిస్తేనే ఆశించిన ఫలితం వస్తుంది’’ అని సికిందర్‌ రజా పేర్కొన్నాడు.కాగా గ్రూప్‌-బి నుంచి ఐర్లాండ్‌, ఒమన్‌, ఆస్ట్రేలియాలను ఎలిమినేట్‌ చేసి శ్రీలంక, జింబాబ్వే సూపర్‌-8కు చేరుకున్నాయి. ఇరుజట్లు గురువారం లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో ముఖాముఖి తలపడతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!This is what it means! 🤩Zimbabwe qualify for the Super 8s with a game to spare, knocking out Australia. Sikandar Raza leads the celebrations with the fans. 👏ICC Men’s #T20WorldCup | #SCOvNEP | LIVE NOW 👉 https://t.co/8SrC1cprbz pic.twitter.com/cqXeLv8ZtI— Star Sports (@StarSportsIndia) February 17, 2026

Grandpa is getting old: Is Ishan Kishan To Marry Aditi Hundia Mother Reacts3
ఆయన ముసలోడు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!

భారత జట్టులోకి పునరాగమనం చేసిన యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఇరగదీస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా గెలవడంలో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌దే కీలక పాత్ర.విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ డకౌట్‌ అయినా.. ఇషాన్‌ (Ishan Kishan) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 77 పరుగులు సాధించాడు.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో పాక్‌ (IND Beat PAK)ను చిత్తు చేయగా.. ఇషాన్‌ కిషన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ ఇషాన్‌ తాతయ్య అనురాగ్‌ పాండే ANIతో పేర్కొన్న విషయం తెలిసిందే.అదితి వాడి గర్ల్‌ఫ్రెండ్‌‘‘ఇషాన్‌ ఎవరిని ఎంచుకున్నా ఆ అమ్మాయితోనే అతడి వివాహం జరిపించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదితి వాడి గర్ల్‌ఫ్రెండ్‌. ఆమె ఒక మోడల్‌. పిల్లలు కోరుకున్నది అందించడంలోనే పెద్దలకు సంతృప్తి, సంతోషం లభిస్తాయి’’ అని అనురాగ్‌ పాండే పేర్కొన్నారు. దీంతో ఇషాన్‌ త్వరలోనే పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నాడనే వార్తలు వైరల్‌ అయ్యాయి.#WATCH | Aurangabad, Bihar | Grandfather of Indian Cricketer Ishan Kishan, Anurag Pandey says, "...We are ready to accept whoever Ishan Kishan wants to marry. Aditi is his girlfriend...She is a model...One should accept what makes children happy..." (14.03) pic.twitter.com/narb5aZHtx— ANI (@ANI) February 14, 2026ఆయన ముసలివారు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!ఈ విషయంపై ఇషాన్‌ కిషన్‌ తల్లి సుచిత్రా దేవి స్పందించారు. ఇషాన్‌ వివాహం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ మేరకు IANSతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెళ్లి చేసుకునే సమయం కాదు. ఆటపై మరింతగా దృష్టి పెట్టాల్సిన తరుణం. తనకు ఇంకా పెళ్లి వయసు రాలేదు.వాళ్ల తాతయ్య ముసలివారు అవుతున్నారు కదా!.. వృద్ధులకు మనుమల విషయాల పట్ల ఉత్సుకత కాస్త ఎక్కువగానే ఉంటుంది. సోషల్‌ మీడియాలో వస్తున్న వాటిని చూసే ఆయన అలా మాట్లాడారు. అంతకు మించి ఏమీలేదు’’ అని సుచిత్రా దేవి కొట్టిపారేశారు.కష్టపడి.. రీఎంట్రీకాగా 27 ఏళ్ల ఇషాన్‌ కిషన్‌ క్రమశిక్షణారాహిత్యం వల్ల దాదాపు మూడేళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి ఇటీవలే టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్‌ స్థానాన్ని భర్తీ చేసి.. అతడికి చెక్‌ పెట్టాడు.ఇదిలా ఉంటే.. ఇషాన్‌ కిషన్‌.. అదితి హుండియా అనే మోడల్‌తో ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమె రాజస్తాన్‌కు చెందిన వారని సమాచారం. ఇక వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియా ఇప్పటికే సూపర్‌-8 చేరిన విషయం తెలిసిందే. Patna, Bihar: On India beating Pakistan by 61 runs in the ICC Men’s T20 World Cup 2026 match, Indian cricketer Ishan Kishan's mother, Suchitra Devi says, "Many congratulations to the Indian cricket team on their victory. Heartfelt congratulations to the entire team for such a… pic.twitter.com/luxVYzbd7H— IANS (@ians_india) February 15, 2026చదవండి: IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!

Ranji Trophy Semis 2026 Day 3: Uttarakhand Trial By 587 Runs Vs KAR4
కెప్టెన్‌ నిర్ణయం... జట్టు పాలిట శాపం!

కెప్టెన్‌ తీసుకున్న నిర్ణయం ఉత్తరాఖండ్‌ పాలిట శాపంగా మారింది. ప్రత్యర్థి జట్టులో మేటి బ్యాటర్లు ఉన్న సంగతి విస్మరించి... తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. రంజీ ఫైనల్‌ 2025-26 ఫైనల్‌ చేరే అవకాశం దాదాపుగా ఉత్తరాఖండ్‌ చేజారినట్లే!లక్నో వేదికగా రంజీ తొలి సెమీస్‌ మ్యాచ్‌లో కర్ణాటక- ఉత్తరాఖండ్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన ఉత్తరాఖండ్‌ కెప్టెన్‌ కునాల్‌ చండేలా తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక అదరగొట్టింది.కర్ణాటక బ్యాటర్ల అద్భుత ప్రదర్శనకర్ణాటక బ్యాటర్లలో కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (232) డబుల్‌ సెంచరీ... కేఎల్‌ రాహుల్‌ (141) సెంచరీ... రవిచంద్రన్‌ స్మరణ్‌ (135) సెంచరీ... కరుణ్‌ నాయర్‌ (60), కృతిక్‌ కృష్ణ (60), విద్యాధర్‌ పాటిల్‌ అర్ధ సెంచరీలు సాధించారు. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 736 పరుగులు సాధించి ఆలౌటైంది.ఓవర్‌నైట్‌ స్కోరు 689/6తో మంగళవారం నాటి మూడో రోజు ఆట కొనసాగించిన కర్ణాటక మరో 47 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్‌ సెంచరీ హీరో స్మరణ్‌ తన వ్యక్తిగత స్కోరుకు మరో 14 పరుగులు జోడించి 135 పరుగులకు అవుటయ్యాడు. విద్యాధర్‌ (54) అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో ఆదిత్య రావత్‌ 154 పరుగులిచ్చి 4 వికెట్లు, మయాంక్‌ మిశ్రా 173 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అభయ్‌ నేగి, అవనీశ్, లక్ష్యలకు ఒక్కో వికెట్‌ దక్కింది. 588 పరుగులుఇక కర్ణాటక నమోదు చేసిన భారీ స్కోరుకు జవాబుగా... మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఉత్తరాఖండ్‌ ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి, తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదిస్తేనే ఉత్తరాఖండ్‌ జట్టుకు ఫైనల్‌ చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయిన ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందాలంటే మరో 588 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ కర్ణాటక గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.చదవండి: T20 WC 2026: నేపాల్ సంచ‌ల‌న విజ‌యం

Netherlands face India in T20 World Cup today5
అజేయంగా ముగించాలని...

అహ్మదాబాద్‌: టి20 ప్రపంచకప్‌లో ఈ రోజు మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. నెదర్లాండ్స్‌ జట్టుతో భారత్‌... యూఏఈతో దక్షిణాఫ్రికా... నమీబియాతో పాకిస్తాన్‌ తలపడనున్నాయి. టీమిండియా మ్యాచ్‌ సహా దక్షిణాఫ్రికా మ్యాచ్‌ కూడా నామమాత్రమైందే! పాకిస్తాన్‌ మ్యాచ్‌ మాత్రమే కీలకమైంది. ఎందుకంటే ఇప్పటికే ‘సూపర్‌–8’ బెర్తుల్లో ఏడు (భారత్, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌) ఖరారయ్యాయి. మిగిలింది ఒక్క బెర్త్‌ మాత్రమే. అది కూడా భారత జట్టున్న గ్రూప్‌ ‘ఎ’లోనే ఉండటంతో ఆఖరి బెర్త్‌ ఎవరిదో నేడే తేలుతుంది. దీంతో ఈ రాత్రికే ‘సూపర్‌–8’లో ఎవరెవరు ప్రత్యర్థులనేది కూడా తెలిసిపోతుంది. ఇక మన మ్యాచ్‌ విషయానికొస్తే డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన భారత్‌ ఆడిన మూడు గెలిచి దర్జాగా ‘సూపర్‌–8’కు చేరింది. నేడు జరిగే అనామక పోరులో భారత్‌... నెదర్లాండ్స్‌పై గెలిచి లీగ్‌ దశను అజేయంగా ముగించడమే పనిగా పెట్టుకుంది. టీమిండియాకు ఓడినా నష్టం లేదు. అలాగని నెదర్లాండ్స్‌ గెలిస్తే ఒరిగే ప్రయోజనం కూడా లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఇరుజట్లకు అక్కర్లేని మ్యాచ్‌. వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో ఉన్న మ్యాచ్‌... కాబట్టే ఆడాలి అంతే! ఈ మెగా ఈవెంట్‌లో టైటిల్‌ ఫేవరెట్, ఆతిథ్య భారత్‌పై ఎవరికి ఏ బెంగా లేదు. సమష్టిగా రాణిస్తోంది. ప్రపంచకప్‌లో దూసుకెళుతోంది... కానీ ధనాధన్‌ హిట్టర్‌ అభిషేక్‌ శర్మ ఫామ్‌పైనే జట్టు మేనేజ్‌మెంట్‌ కన్నేసింది. రెండు ‘డకౌట్లు’ కాస్త ఇబ్బందికరం కావడంతో కీలకమైన ‘సూపర్‌–8’కు ముందే ఈ ఓపెనర్‌ కూడా ఫామ్‌లోకి వస్తే టీమిండియాకు ఎదురుండదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అదే జరిగితే ఈ మ్యాచ్‌లోనే కాదు... వరల్డ్‌కప్‌లోనే భారత్‌కు పరుగుల పండగ ఖాయమవుతుంది. భారత్‌ జోరుకు ఎదురుందా... జట్టు జోరుపై, విజయాల తీరుపై ఎవరికీ ఎలాంటి సందేహాలే లేవు. ఇలాంటి జట్టుపై నెదర్లాండ్స్‌లాంటి కూన సంచలనానికి అవకాశమే లేదు. ఇషాన్‌ కిషన్‌ మెరుపులకు అభిషేక్‌ హిట్స్‌ తోడైతే జట్టుకు ఇది భలే బ్యాటింగ్‌ ప్రాక్టీసుగా పనికొస్తుంది. తిలక్‌ వర్మ,కెప్టెన్ సూర్య, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌కు ప్రత్యర్థి శిబిరం నుంచి పెద్దగా సవాళ్లయితే ఉండవు. బౌలింగ్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ బరిలోకి దిగుతాడు. మొత్తానికి పేస్, స్పిన్, బ్యాటింగ్‌ ఇలా అన్ని రంగాల్లో భారత జట్టు పటిష్టంగా ఉంది. మరోవైపు డచ్‌ టీమ్‌ మూడు మ్యాచ్‌లాడి ఒకటే గెలిచింది. టోర్నీ నుంచి ఈ ‘ఒకటే’ విజయంతో నిష్క్రమిస్తుంది తప్ప అసాధారణ, అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియానైతే ఢీకొట్టలేదు. పిచ్, వాతావరణం అహ్మదాబాద్‌ వికెట్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. దీంతో టాస్‌ నెగ్గిన జట్టు చేజింగ్‌కే మొగ్గు చూపొచ్చు. మంచు ప్రభావం ఉంటుంది. వర్షం ముప్పు లేదు.టి20 ప్రపంచకప్‌లో నేడుదక్షిణాఫ్రికా X యూఏఈవేదిక: న్యూఢిల్లీ; ఉ.గం. 11 నుంచిపాకిస్తాన్‌ X నమీబియావేదిక: కొలంబో; మ.గం. 3 నుంచి భారత్‌ X నెదర్లాండ్స్‌వేదిక: అహ్మదాబాద్‌; రాత్రి గం. 7 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Jammu and Kashmir needs another 83 runs to qualify for the title fight6
ఫైనల్‌కు 83 పరుగుల దూరంలో...

కల్యాణి (పశ్చిమ బెంగాల్‌): ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్‌ చేరేందుకు జమ్మూకశ్మీర్‌ జట్టుకు సువర్ణావకాశం లభించింది. మాజీ విజేత బెంగాల్‌ జట్టుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో జమ్మూకశ్మీర్‌ మరో 83 పరుగులు సాధిస్తే టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తుంది. బెంగాల్‌ నిర్దేశించిన 126 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్‌... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు సాధించింది. జమ్మూకశ్మీర్‌ గెలవాలంటే మరో 83 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. అంతకుముందు మూడో రోజు బౌలర్ల హవా నడిపించారు. మూడో రోజు ఆటలో 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఓవర్‌నైట్‌ స్కోరు 198/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన జమ్మూకశ్మీర్‌ జట్టు 76.1 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది. చివరి వరుస బ్యాటర్లు ఆకిబ్‌ నబీ (54 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్‌), యుధ్‌వీర్‌ సింగ్‌ (42 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. భారత బౌలర్, బెంగాల్‌ స్పీడ్‌స్టర్‌ మొహమ్మద్‌ షమీ 90 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. మిగతా రెండు వికెట్లు ముకేశ్‌ కుమార్‌కు దక్కాయి. 26 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన బెంగాల్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. జమ్మూకశ్మీర్‌ పేస్‌ బౌలర్లు ఆకిబ్‌ నబీ, సునీల్‌ కుమార్, యు«ద్‌వీర్‌ సింగ్‌ ధాటికి బెంగాల్‌ 25.1 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. క్వార్టర్‌ ఫైనల్లో డబుల్‌ సెంచరీ, సెమీఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన బెంగాల్‌ బ్యాటర్‌ సుదీప్‌ కుమార్‌ ఘరామి రెండో ఇన్నింగ్స్‌లో ‘సున్నా’కే వెనుదిరిగాడు. కెపె్టన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ 5 పరుగులు చేశాడు. నబీ 36 పరుగులిచ్చి 4 వికెట్లు, సునీల్‌ కుమార్‌ 27 పరుగులిచ్చి 4 వికెట్లు, యుధ్‌వీర్‌ సింగ్‌ 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి బెంగాల్‌ను దెబ్బ కొట్టారు. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్‌కు కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు శుభమ్‌ ఖజురియా (1), యావర్‌ హసన్‌ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరుకున్నారు. శుభమ్‌ పుందిర్‌ (23 బ్యాటింగ్‌), వన్షజ్‌ శర్మ (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. రంజీ ట్రోఫీ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్, కెపె్టన్‌ పారస్‌ డోగ్రా, అబ్దుల్‌ సమద్‌ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో జమ్మూకశ్మీర్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే షమీ, ముకేశ్‌ కుమార్, షహబాజ్‌ అహ్మద్‌ బంతితో మెరిస్తే బెంగాల్‌ జట్టు కూడా విజయం ఆశించవచ్చు. సంక్షిప్త స్కోర్లు బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌: 328 ఆలౌట్‌; జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: 302 ఆలౌట్‌; బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌: 99 ఆలౌట్‌ (25.1 ఓవర్లలో) (షహబాజ్‌ అహ్మద్‌ 24, సూరజ్‌ జైస్వాల్‌ 14, అనుస్తుప్‌ 12, ఆకిబ్‌ నబీ 4/36, సునీల్‌ 4/27, యుధ్‌వీర్‌ 2/29), జమ్మూకశ్మీర్‌ రెండో ఇన్నింగ్స్‌: 43/2.

Pratik Rawal included in Indian womens ODI team7
భారత మహిళల వన్డే జట్టులోకి ప్రతీక

న్యూఢిల్లీ: ఆ్రస్టేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల జట్టులో అదనంగా మరో ప్లేయర్‌ను జోడించారు. చీలమండ గాయం నుంచి కోలుకున్న ఓపెనర్‌ ప్రతీక రావల్‌ ఈనెల 24 నుంచి బ్రిస్బేన్‌లో ఆ్రస్టేలియాతో మొదలయ్యే వన్డే సిరీస్‌లో భారత జట్టులోకి వచ్చింది. గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ ప్రతీక గాయపడింది. ఆ తర్వాత ప్రతీక మిగతా టోర్నీకి దూరం కాగా...ఆమె స్థానంలో షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. ఈనెల 24న బ్రిస్బేన్‌లో తొలి వన్డే తర్వాత... 27న హోబర్ట్‌లో రెండో వన్డే, అదే వేదికగా మార్చి 1న మూడో వన్డే జరుగుతాయి. మార్చి 6 నుంచి భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఏకైక టెస్టు పెర్త్‌లో జరుగుతుంది. 25 ఏళ్ల ప్రతీక భారత్‌ తరఫున 24 వన్డేలు ఆడి 1110 పరుగులు సాధించింది. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలున్నాయి. భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్ ), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్ ), షఫాలీ వర్మ, రేణుక సింగ్‌ ఠాకూర్, నల్లపురెడ్డి శ్రీచరణి, క్రాంతి గౌడ్, స్నేహ్‌ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, కాశ్వీ గౌతమ్, అమన్‌జోత్‌ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్‌ డియోల్, ప్రతీక రావల్‌.

Hardik to captain India in Pro Hockey League second tier matches8
హర్మన్‌ప్రీత్‌ దూరం

న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన పురుషుల ప్రొ లీగ్‌ తొలి అంచెలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలో భారత్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తదుపరి ఈనెల 20 నుంచి 25 వరకు ఆ్రస్టేలియాలోని హోబర్ట్‌ నగరంలో భారత్‌ రెండో అంచె మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ అంచె మ్యాచ్‌లకు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలరీత్యా తాను హోబర్ట్‌ అంచె మ్యాచ్‌ల్లో పోటీపడే భారత జట్టుకు అందుబాటులో ఉండటం లేదని హర్మన్‌ప్రీత్‌ తెలిపాడు. హర్మన్‌ప్రీత్‌ భార్య అమన్‌దీప్‌ కౌర్‌ ప్రసవ తేదీ దగ్గర్లో ఉండటంతో హర్మన్‌ప్రీత్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా హోబర్ట్‌ అంచె మ్యాచ్‌లకు భారత జట్టు సారథ్య బాధ్యతలు మిడ్‌ఫీల్డర్‌ హార్దిక్‌ సింగ్‌కు అప్పగించారు. టోక్యో ఒలింపిక్స్, పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకాలు గెలిచిన భారత జట్టులో హార్దిక్‌ సింగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌లో భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా తదుపరి మ్యాచ్‌ల కోసం భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. హోబర్ట్‌ వేదికగా ఈనెల 21న స్పెయిన్‌తో, 22న ఆ్రస్టేలియాతో... 24న స్పెయిన్‌తో, 25న ఆ్రస్టేలియాతో భారత్‌ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. భారత పురుషుల హాకీ జట్టు: సూరజ్‌ కర్కేరా, మోహిత్‌ హొనెన్నహళ్లి శశికుమార్‌ (గోల్‌కీపర్లు), అమిత్‌ రోహిదాస్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, జుగ్‌రాజ్‌ సింగ్, సంజయ్, సుమిత్, అమన్‌దీప్‌ లాక్రా, యశ్‌దీప్‌ సివాచ్, పూవణ్ణ చందురబాబీ(డిఫెండర్లు), రాజిందర్‌ సింగ్, మన్‌మీత్‌ సింగ్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్, హార్దిక్‌ సింగ్, మొయిరంగ్తెమ్‌ రబీచంద్ర సింగ్, విష్ణుకాంత్‌ సింగ్, రాజ్‌కుమార్‌ పాల్‌ (మిడ్‌ఫీల్డర్లు), అభిషేక్, శిలానంద్‌ లాక్రా, మన్‌దీప్‌ సింగ్, అరిజిత్‌ సింగ్‌ హుండల్, ఆదిత్య అర్జున్‌ లలాగే, అంగద్‌బీర్‌ సింగ్, మణీందర్‌ సింగ్‌ (ఫార్వర్డ్స్‌).

Zimbabwe qualified for the Super 8s of the latest T20 World Cup with 5 points9
ఆస్ట్రేలియా ఇంటికి... జింబాబ్వే ముందుకు...

పల్లెకెలె: ఆ్రస్టేలియాకు షాక్‌. అప్పుడు జింబాబ్వే సంచలనంతో షాక్‌ ఇస్తే, ఇప్పుడు వానొచ్చి మరో షాక్‌ ఇచ్చింది. జింబాబ్వే–ఐర్లాండ్‌ల మ్యాచ్‌ జరగకుండా వరుణుడు అడ్డుపడటంతో ఈ లీగ్‌ మ్యాచ్‌ రద్దయ్యింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయించారు. ఫలితంగా సికందర్‌ రజా సారథ్యంలోని జింబాబ్వే 5 పాయింట్లతో తాజా టి20 ప్రపంచకప్‌లో సూపర్‌–8కు అర్హత సంపాదించింది. ఆఖరి మ్యాచ్‌ మిగిలుండగానే ఆ్రస్టేలియా మెగా ఈవెంట్‌ నుంచి లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. 2009 తర్వాత టి20 ప్రపంచకప్‌లో తదుపరి దశకు అర్హత పొందకుండా గ్రూప్‌ దశలోనే ఆ్రస్టేలియా వెనుదిరగడం ఇదే ప్రథమం. గ్రూప్‌ ‘బి’లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్, జింబాబ్వేల మధ్య మ్యాచ్‌ జరగాల్సింది. భారీ వర్షం వల్ల మ్యాచ్‌ ఎంతకీ మొదలవలేదు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మ్యాచ్‌ జరిగే అవకాశమే లేకపోవడంతో ఫీల్డ్‌ అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నట్లు... టీమిండియాకు సూపర్‌–8లో ముందుగా ఎదురుపడే ప్రత్యర్థి కూడా జింబాబ్వేనే! ఈ నెల 26న చెన్నైలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. పరాభవాల ప్రభావంతో... ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆ్రస్టేలియా ఈ ప్రపంచకప్‌లో మాత్రం సూపర్‌–8 చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై అధారపడాల్సిన స్థితికి వచ్చింది. జింబాబ్వే, శ్రీలంక చేతుల్లో ఓడిన కంగారూ ఒక్క ఐర్లాండ్‌పై గెలిచి 2 పాయింట్లతో ఉంది. శుక్రవారం ఒమన్‌తో జరిగే నామమాత్రమైన మ్యాచ్‌లో గెలిస్తే 4 పాయింట్లతో ఆసీస్‌ ఇంటికి పయనమవుతుంది. పది టి20 ప్రపంచ కప్‌లలోనూ ఆడిన ఆస్ట్రేలియా లీగ్‌ దశలో నిష్క్ర మించడం ఇది రెండోసారి మాత్రమే. 2007లో సెమీఫైనల్‌ చేరిన ఆసీస్‌... 2009లో గ్రూప్‌ దశలో వెనుదిరిగింది. 2010లో రన్నరప్‌గా నిలిచింది. 2012లో సెమీఫైనల్లో ఓడింది. 2014, 2016లలో సూపర్‌–10లో ఓyì.... 2021లో తొలిసారి విజేతగా అవతరించింది. 2022లో సూపర్‌–12లో, 2024లో సూపర్‌–8లో వెనుదిరిగింది.

Nepal register historic win, beat Scotland by 7 wickets10
నేపాల్ సంచ‌ల‌న విజ‌యం

టీ20 ప్రపంచ కప్ 2026ను నేపాల్ అద్భుత‌మైన విజ‌యంతో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా మంగ‌ళ‌వారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన గ్రూపు-సి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో నేపాల్ గెలుపొందింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో నేపాల్‌కు ఇదే తొలి విజయం.ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన స్కాటిష్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది. స్కాట్లాండ్ జట్టుకు ఓపెనర్ మైఖేల్ జోన్స్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతను 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అత‌డితో పాటు జార్జ్ మున్సే (27), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (25) రాణించారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామీ 3 వికెట్లు పడగొట్టగా, నందన్ యాదవ్ 2 వికెట్లు సాధించాడు.అనంత‌రం లక్ష్య చేధ‌న‌లో నేపాల్‌కు ఓపెనర్లు కుశాల్ భుర్టెల్(43), ఆసిఫ్ షేక్ (33) మంచి అరంభం ఇచ్చారు. అయితే మిడిల్ ఓవ‌ర్ల‌లో నేపాల్ వికెట్లు కోల్పోవ‌డంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ దశలో స్టార్ ఆల్ రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీపేంద్ర సింగ్ కేవ‌లం 23 బంతుల్లోనే 50 ప‌రుగులు చేసి నేపాల్‌కు చారిత్రత్మ‌క విజ‌యాన్ని అందించాడు. అత‌డితో పాటు గుల్షాన్ జా కూడా కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ బౌల‌ర్ల‌లో మైఖేల్ లీస్క్ ఒక్క‌డే మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement