ప్రధాన వార్తలు
నార్వే చెస్ టోర్నీకి దివ్య
స్టావెంజర్ (నార్వే): ప్రపంచకప్ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ నార్వే చెస్ టోర్నీలో అరంగేట్రం చేయనుంది. మహిళల ఈవెంట్లో 19 ఏళ్ల భారత ప్లేయర్ తలపడనుంది. రెండేళ్ల క్రితం 2024లో మొదలైన ఈ టోర్నీలో పోటీపడనున్న యువ క్రీడాకారిణిగా ఆమె నిలువనుంది. మే 25 నుంచి జూన్ 5 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ప్రపంచకప్తో పాటు గ్రాండ్మాస్టర్ టైటిల్, మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హతతో గతేడాదిని చిరస్మరణీయం చేసుకున్న ఆమె అదే ఉత్సాహాన్ని ఈ ఏడాది కొనసాగించాలని ఆశిస్తోంది. దివ్యతో పాటు ప్రపంచ మేటి చెస్ ప్లేయర్లంతా నార్వే చెస్ ఈవెంట్లో పాల్గొననున్నారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ బిబిసారా అసబయేవా (కజకిస్తాన్), డిఫెండింగ్ నార్వే చెస్ మహిళల చాంపియన్ అన ముజిచుక్ (ఉక్రెయిన్) తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ‘నార్వే ఈవెంట్లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అక్కడికి వెళ్లనుండటం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని దివ్య పేర్కొంది. గతేడాది జరిగిన ఈవెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి పాల్గొన్నారు. ఈ ఏడాది ఓపెన్ కేటగిరీలో ప్రజ్ఞానంద పోటీపడనున్నాడు.
మన్ప్రీత్ సింగ్పై వేటు
భారత హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు... నాలుగుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న అనుభవం... ఒకసారి కెప్టెన్గా జట్టుకు పతకం అందించిన రికార్డు సహా రెండు ఒలింపిక్ కాంస్యాలు గెలుచుకున్న జట్లలో సభ్యుడు... అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలవడంతో పాటు అర్జున, ఖేల్రత్న పురస్కారాల విజేత... ఈ ఘనతలన్నీ సాధించిన మన్ప్రీత్ సింగ్పై వేటు పడింది. వచ్చేనెలలో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ సీజన్ కోసం 33 మంది ప్రాబబుల్స్తో ప్రకటించిన భారత హాకీ జట్టులో మన్ప్రీత్కు చోటు దక్కలేదు. ‘విశ్రాంతి’ అని కోచ్ చెబుతున్నా... సుమారు 34 ఏళ్ల వయసు ఉన్న మన్ప్రీత్ను పక్కన పెట్టడం అంటే అతని అంతర్జాతీయ కెరీర్ ముగింపునకు చేరువైనట్లే. న్యూఢిల్లీ: మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున 411 మ్యాచ్లు ఆడాడు. మరో మ్యాచ్ ఆడి ఉంటే మన దేశం తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడిన దిలీప్ తిర్కీ (412) రికార్డును అతను సమం చేసేవాడు. అయితే అనూహ్యంగా మన్ప్రీత్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు రూర్కెలాలో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ సీజన్ కోసం ఎంపిక చేసిన 33 ప్రాబబుల్స్లో అతనికి చోటు దక్కలేదు. గత ఐదేళ్లలో అతను టీమ్కు దూరం కావడం ఇదే మొదటిసారి. మన్ప్రీత్తో పాటు సీనియర్ గోల్ కీపర్ కృషన్ బహదూర్ పాఠక్పై కూడా వేటు పడింది. ఇటీవల జరిగిన హాకీ ఇండియా లీగ్లో ప్రదర్శనను బట్టి అనేక మంది కొత్త, యువ ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేశారు. పూవన్న చందూరా బాబీ, యశ్దీప్ సివాచ్, అమన్దీప్ లక్డాలకు అవకాశం దక్కగా, జూనియర్ ఆసియా కప్లో ఆకట్టుకున్న ప్రిన్స్దీప్ సింగ్, రోషన్ కుజూర్ కూడా తొలిసారి సీనియర్ టీమ్లోకి వచ్చాడు. భారత్లో తొలి అంచె ప్రొ లీగ్ పోటీలతో జట్టు కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మన బృందం హోబర్ట్కు వెళ్లి స్పెయిన్, ఆ్రస్టేలియాలతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. అనంతరం ప్రొ లీగ్ రెండో అంచె టోర్నీ జూన్లో యూరప్లో జరుగుతుంది. సరైన సమయం: కోచ్ ఫుల్టన్ 2026లో హాకీ వరల్డ్ కప్తో పాటు ఆసియా క్రీడల వంటి ప్రధాన ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో జట్టులో ‘రొటేషన్’ విధానాన్ని అనుసరించనున్నామని, కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించినట్లు భారత జట్టు హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ అన్నారు. ‘పని భారం తగ్గించేందుకు మేం కొంత మంది సీనియర్లకు విశ్రాంతినిచ్చాం. మరికొందరు యువ ఆటగాళ్ల చక్కటి ప్రదర్శనకు గుర్తింపు కూడా దక్కింది. ప్రొ లీగ్తో పాటు ఆ్రస్టేలియాలో ప్రదర్శనను బట్టి ప్రపంచ కప్, ఆసియా కప్లలో పాల్గొనే జట్లను ఎంపిక చేస్తాం’ అని ఆయన వెల్లడించారు. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టుకు ప్రొ లీగ్కు ముందు ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11న జరిగే తొలి మ్యాచ్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. భారత హాకీ ప్రాబబుల్స్: పవన్, సూరజ్ కర్కెరా, మోహిత్, ప్రిన్స్దీప్ సింగ్ (గోల్కీపర్లు), అమిత్ రోహిదాస్, జర్మన్ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్ప్రీత్ సింగ్ (కెపె్టన్), జుగ్రాజ్ సింగ్, సుమీత్, పూవన్న చందూరా బాబీ, యశ్దీప్ సివాచ్, నీలమ్ సంజీప్, అమన్దీప్ లక్డా (డిఫెండర్లు), రాజీందర్ సింగ్, మన్మీత్ సింగ్, హార్దిక్ సింగ్, రవిచంద్ర సింగ్, వివేక్ సాగర్, విష్ణుకాంత్ సింగ్, రాజ్ కుమార్ పాల్, నీలకాంత శర్మ, రోషన్ కుజూర్ (మిడ్ ఫీల్డర్లు), అభిషేక్, సుఖ్జీత్ సింగ్, శిలానంద్ లక్డా, మన్దీప్ సింగ్, అరిజీత్ సింగ్ హుండల్, అంగద్ వీర్ సింగ్, ఉత్తమ్ సింగ్, సెల్వమ్ కార్తీ, ఆదిత్య అర్జున్, మణీందర్ సింగ్ (ఫార్వర్డ్స్).మన్ప్రీత్ సింగ్ కెరీర్ అంతర్జాతీయ అరంగేట్రం: 2011 మొత్తం మ్యాచ్లు: 411 చేసిన గోల్స్: 45 ఒలింపిక్స్లో రెండు కాంస్యాలు (2020 టోక్యో, 2024 పారిస్), కామన్వెల్త్ గేమ్స్లో 2 రజతాలు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యం, చాంపియన్స్ ట్రోఫీలో 2 రజతాలు, ఆసియా కప్లో 2 స్వర్ణాలు, 1 రజతం, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో 4 స్వర్ణాలు, 1 కాంస్యం, వరల్డ్ లీగ్లో 2 కాంస్యాలు గెలుచుకున్న జట్లలో సభ్యుడు. భారత్ తరఫున అతను నాలుగు ప్రపంచ కప్లు కూడా ఆడాడు.
సబలెంకా X రిబాకినా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్) వరుసగా నాలుగో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2023, 2024లలో టైటిల్ సాధించిన ఆమె గత ఏడాది మాడిసన్ కీస్ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకా 29 విన్నర్స్ కొట్టి, తన ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)తో సబలెంకా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో రిబాకినా 6–3, 7–6 (9/7)తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై విజయం సాధించింది. 1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రిబాకినా ఆరు ఏస్లు సంధించింది. 31 విన్నర్స్ కొట్టిన ఆమె తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఆ్రస్టేలియన్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా తలపడనుండటం ఇది రెండోసారి. 2023 ఫైనల్లో రిబాకినాపైనే గెలిచి సబలెంకా తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్గా అవతరించింది. 3 ఆ్రస్టేలియన్ ఓపెన్ చరిత్రలో వరుసగా నాలుగేళ్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫైనల్ చేరిన మూడో క్రీడాకారిణి సబలెంకా. గతంలో ఇవోన్ గూలాగాంగ్ (ఆ్రస్టేలియా; 1971 నుంచి 1976 వరకు), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్; 1997 నుంచి 2002 వరకు) వరుసగా ఆరుసార్లు ఫైనల్ చేరారు.నేడు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ అల్కరాజ్ x జ్వెరెవ్ (ఉదయం 9 నుంచి)జొకోవిచ్x సినెర్ (మధ్యాహ్నం 2 నుంచి)సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం
ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ఓటమి
జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్షిప్లో ఇండియన్ రైల్వేస్, హరియాణా జట్లు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా.. ఆతిథ్య తెలంగాణ జట్టు పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. హైదరాబాద్లోని గచి్చ»ౌలి ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ జట్టు 25–42తో పంజాబ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో రైల్వేస్ 46–27 పాయింట్ల తేడాతో కర్ణాటక జట్టుపై, హరియాణా 50–19 విదర్భ జట్టుపై, మహారాష్ట్ర 42–36తో గోవా జట్టుపై, మధ్యప్రదేశ్ 41–36తో ఢిల్లీ జట్టుపై, చండీగఢ్ 45–39తో ఉత్తరప్రదేశ్ జట్టుపై, తమిళనాడు 34–30తో రాజస్తాన్ జట్టుపై, హిమాచల్ ప్రదేశ్ 67–22తో గుజరాత్ జట్టుపై విజయం సాధించాయి. క్వార్టర్ ఫైనల్స్లో మహారాష్ట్రతో ఇండియన్ రైల్వేస్, హరియాణాతో మధ్యప్రదేశ్, తమిళనాడుతో చండీగఢ్, హిమాచల్ప్రదేశ్తో పంజాబ్ తలపడతాయి.
WPL-2026: ఫైనల్లో బెంగళూరు
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ పోరుకు చేరింది. వరుసగా ఐదు విజయాలతో అందరికంటే ముందుగా ‘ప్లే ఆఫ్స్’ చేరిన ఆర్సీబీ జట్టు ఆపై రెండు ఓటములు ఎదుర్కొంది. అయితే చివరి పోరులో మళ్లీ సత్తా చాటి యూపీ వారియర్స్ని చిత్తు చేసింది. 12 పాయింట్లతో ‘టాప్’గా నిలిచిన స్మృతి మంధాన బృందం తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్కు ‘జిరాక్స్’ తరహాలోనే దాదాపు ఈ మ్యాచ్ సాగింది... యూపీ గత మ్యాచ్లాగే సరిగ్గా 143 పరుగులే చేయగా, ఛేదనలో గ్రేస్ హారిస్ దాదాపు ఒకే తరహాలో 200కు పైగా స్ట్రయిక్రేట్తో ఒంటి చేత్తో గెలిపించింది. నాడు 47 బంతులు మిగిలి ఉండగా నెగ్గిన ఆర్సీబీ ఈసారి 41 బంతుల ముందు లక్ష్యాన్ని ఛేదించింది. స్కోర్లు సమమైన చోట వికెట్ పడకుండా ఉంటే గెలుపు అంతరం కూడా ఒకేలా ఉండేది! ఈ పరాజయంతో యూపీ వారియర్స్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది. వడోదర: మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండోసారి డబ్ల్యూపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన తమ చివరి మ్యాచ్లో 2024 విజేత ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై నెగ్గింది. ముందుగా యూపీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (43 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్ మెగ్ లానింగ్ (30 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. నదైన్ డిక్లెర్క్ (4/22) నాలుగు వికెట్లతో యూపీని దెబ్బ తీసింది. అనంతరం బెంగళూరు 13.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (37 బంతుల్లో 75; 13 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగింది. హారిస్, స్మృతి మంధాన (27 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) కలిసి తొలి వికెట్కు 55 బంతుల్లోనే 108 పరుగులు జత చేశారు. రాణించిన ఓపెనర్లు అనూహ్యంగా తొలిసారి ఓపెనర్గా బ్యాటింగ్కు దిగిన దీప్తి, కెప్టెన్ లానింగ్ కలిసి జట్టుకు శుభారంభం అందించారు. పవర్ప్లే ముగిసేసరికి యూపీ వికెట్ నష్టపోకుండా 5 ఫోర్లు, 2 సిక్స్లతో 50 పరుగులు సాధించింది. అయితే 9వ ఓవర్ నుంచి ఆట మారిపోయింది. తన తొలి బంతికే లానింగ్ను అవుట్ చేసిన డిక్లెర్క్, ఐదో బంతికి ఎమీ జోన్స్ (1)ను పెవిలియన్ పంపించింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో హర్లీన్ (14), ట్రయాన్ (6), శ్వేత సెహ్రావత్ (7) వెనుదిరగ్గా... మరో ఎండ్లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన దీప్తి 18వ ఓవర్ చివరి బంతికి 40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. తొలి 10 ఓవర్లలో 82 పరుగులు చేసిన వారియర్స్ తర్వాతి 10 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే సాధించింది. హారిస్ దూకుడు యూపీతో ఆడిన గత మ్యాచ్లో 40 బంతుల్లోనే 85 పరుగులు చేసిన హారిస్... ఈసారి కూడా సరిగ్గా అంతే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అదే తరహాలో బ్యాటింగ్ చేసింది. గత మ్యాచ్లో బౌండరీల ద్వారా 70 పరుగులు రాబట్టిన ఆమె ఈసారి బౌండరీలతో 64 పరుగులు సాధించింది! పవర్ప్లేలో జట్టు 63 పరుగులు చేయగా, హారిస్ వాటానే 49 పరుగులు కావడం విశేషం. ఆ తర్వాత శోభన ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన ఆమె 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకుంది. ఎట్టకేలకు ఆర్సీబీ విజయానికి 36 పరుగులు చేయాల్సిన దశలో హారిస్ను అవుట్ చేయగలిగినా ...స్మృతి 26 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి మ్యాచ్ను ముగించింది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) రాధ (బి) డిక్లెర్క్ 41; దీప్తి (సి) డిక్లెర్క్ (బి) శ్రేయాంక 55; జోన్స్ (ఎల్బీ) (బి) డిక్లెర్క్ 1; హర్లీన్ (బి) హారిస్ 14; ట్రయాన్ (స్టంప్డ్) రిచా (బి) హారిస్ 6; శ్వేత (సి) స్మృతి (బి) బెల్ 7; సిమ్రన్ (సి) అరుంధతి (బి) డిక్లెర్క్ 10; ఎకెల్స్టోన్ (ఎల్బీ) (బి) డిక్లెర్క్ 0; శోభన (నాటౌట్) 0; శిఖా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–74, 2–78, 3–95, 4–103, 5–122, 6–137, 7–138, 8–143. బౌలింగ్: బెల్ 4–0–21–1, సయాలీ 2–0–21–0, శ్రేయాంక 4–0–27–1, అరుంధతి 1–0–14–0, డిక్లెర్క్ 4–0–22–4, హారిస్ 3–0–22–2, రాధ 2–0–11–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: హారిస్ (బి) శిఖా 75; స్మృతి (నాటౌట్) 54; వోల్ (సి) సిమ్రన్ (బి) శోభన 16; రిచా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 2; మొత్తం (13.1 ఓవర్లలో 2 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–108, 2–143. బౌలింగ్: క్రాంతి 2–0–29–0, శిఖా 4–0–36–1, దీప్తి 2.1–28–0, ఎకెల్స్టోన్ 2–0–14–0, శోభన 2–0–24–1, ట్రయాన్ 1–0–15–0. డబ్ల్యూపీఎల్లో నేడుముంబై ఇండియన్స్ x గుజరాత్ జెయింట్స్ రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన వారియర్జ్
డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్లో ఆర్సీబీ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇవాళ (జనవరి 29) జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్లో కలిసికట్టుగా రాణించి, ప్రత్యర్ధిని స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. వడోదర వేదికగా యూపీ వారియర్జ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. యూపీని 143 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.ఓపెనర్లు మెగ్ లాన్నింగ్ (41), దీప్తి శర్మ (55) తొలి వికెట్కు 49 బంతుల్లో 74 పరుగులు జోడించి శుభారంభం అందించినా.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోయారు. స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి వారియర్జ్ను కుదురుకోన్విలేదు. పేసర్ లారెన్ బెల్ (4-0-21-1) మరోసారి తన అద్భుత ప్రదర్శనను కొనసాగించగా.. నదినే డి క్లెర్క్ (4-0-22-4) వారియర్జ్ వెన్ను విరిచింది. ఆఫ్ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (4-0-27-1), గ్రేస్ హ్యారిస్ (3-0-22-2) కూడా అద్భుతంగా రాణించారు. రాధా యాదవ్ (2-0-11-0) వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసింది. సయాలీ సత్ఘరే (2-0-21-0), అరుంధతి రెడ్డి (1-0-14-0) ఓ మోస్తరుగా పరుగులు సమర్పించుకున్నారు. వారియర్జ్ ఇన్నింగ్స్లో లాన్నింగ్, దీప్తి శర్మ మినహా ఎవ్వరూ రాణించలేదు. హర్లీన్ డియోల్ (14), సిమ్రన్ షేక్ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. యామీ జోన్స్ (1), క్లో ట్రయెన్ (6), శ్వేతా సెహ్రావత్ (7), సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ డకౌటైంది. ఆఖరి ఓవర్లో క్లెర్క్ 2 వికెట్లు తీసి వారియర్జ్ను కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోనివ్వలేదు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే, నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఈ ఎడిషన్లో ఆ జట్టు వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ఏకైక జట్టుగా చలామణి అవుతంది. అయితే చివరి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై, ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు చివరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్
గత కొంతకాలంగా ఇంటా-బయటా.. ఆ ఫార్మాట్-ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ జట్టుకు టీ20 ప్రపంచకప్కు ముందు, స్వదేశంలో ఊరట కలిగించే విజయం లభించింది. లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి, వన్డే ప్రపంచ ఛాంపియన్లైన ఆస్ట్రేలియన్లను చిత్తు చేశారు. 169 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని ప్రపంచకప్కు ముందు కాన్ఫిడెన్స్ను పెంచుకున్నారు. ఈ మ్యాచ్లో ఆసీస్ తమ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ లేకుండా ట్రవిస్ హెడ్ నాయకత్వంలో బరిలోకి దిగింది. మిచెల్ లేని లేటు ఆసీస్ జట్టులో కొట్టొచ్చినట్లు కనిపించింది. వ్యూహ్యాల అమలు దగ్గరి నుంచి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మిచెల్ లేని ఆసీస్ సాధారణ జట్టులా కనిపించింది. ఈ గెలుపులో పాక్ బౌలర్ల గొప్పతనం పెద్దగా లేకపోయినా, ఆసీస్ బ్యాటర్ల డొల్లతనం స్పష్టంగా తెలిసింది. బౌలింగ్లో ఆడమ్ జంపా నైపుణ్యం వల్ల పాక్ను తక్కువ స్కోర్కే పరిమితం చేయగలిగినా, దాన్ని ఛేదించడంలో మాత్రం ఆసీస్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఫలితం మూడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్కు తొలి బంతికే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ను జేవియర్ బార్ట్లెట్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. అయితే ఆతర్వాత పాక్ కుదురుకుంది. మరో ఓపెనర్ సైమ్ అయూబ్ (40), వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సల్మాన్ అఘా (39) బాధ్యతాయుతంగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయూబ్ ఔటయ్యాక బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ (24) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, ఈసారి కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన ఫకర్ జమాన్ (16 బంతుల్లో 10) జిడ్డుగా ఆడి పాక్ భారీ స్కోర్ చేయకపోవడానికి అడ్డు గోడ అయ్యాడు. చివర్లో ఉస్మాన్ ఖాన్ (18), మహ్మద్ నవాజ్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేసినా కుదర్లేదు. ఆడమ్ జంపా (4-0-24-4) పాక్ ఆటగాళ్ల పాలిట కొరకరాని కొయ్యలా మారగా.. బార్ట్లెట్ (4-0-26-2), బియర్డ్మన్ (4-0-33-2) పాక్ ఆటగాళ్ల పప్పులు ఉడకనివ్వలేదు. చివరి ఓవర్లో బియర్డ్మన్ రెండు వికెట్లు తీసి పాక్ను 168 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమిమతమయ్యేలా చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ కూడా ఆదిలోనే తడబడింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. ఆతర్వాత ట్రవిస్ హెడ్ (23), గ్రీన్ (36) కాసేపు మెరుపులు మెరిపించినా, దాన్ని కొనసాగించలేకపోయారు. వీరద్దరు ఔటయ్యాక ఆసీస్ ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. చివర్లో బార్ట్లెట్ (34 నాటౌట్) బ్యాట్ ఝులిపించినా, అప్పటికే ఆసీస్ ఓటమి ఖరారైపోయింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ చెరో వికెట్ పడగొట్టారు. మొత్తంగా పాక్ స్పిన్నర్లు ఆసీస్ ఆటగాళ్లను విజయవంతంగా కట్టడి చేసి, సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లారు. రెండో టీ20 ఇదే లాహోర్ వేదికగా జనవరి 31న జరుగనుంది.
నిప్పులు చెరిగిన సిరాజ్
రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా ఛత్తీస్ఘడ్తో ఇవాళ (జనవరి 29) మొదలైన మ్యాచ్లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. జింఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. 17 ఓవర్లలో 56 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. సిరాజ్తో పాటు రక్షన్ (9.3-1-28-2), తనయ్ త్యాగరాజన్ (20-3-81-1), హిమతేజ (4-0-18-1), అనికేత్ రెడ్డి (12-0-65-1) సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్ఘడ్ 283 పరుగులకే పరిమితమైంది. ఏడో స్థానంలో బరిలోకి దిగిన ప్రతీక్ యాదవ్ (99 బంతుల్లో 106; 10 ఫోర్లు, సిక్స్) అనూహ్యంగా సెంచరీ చేసి ఛత్తీస్ఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ప్రతీక్కు వికల్ప్ తివారి (94) సహకరించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 183 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యాన్ని త్యాగరాజన్ విడగొట్టాడు. రెండు పరుగుల వ్యవధిలోనే సిరాజ్ సెంచరీకి చేరువైన వికల్ప్ తివారిని ఔట్ చేసి ఛత్తీస్ఘడ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. వికల్ప్, ప్రతీక్ మినహా ఛత్తీస్ఘడ్ ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఆయుశ్ పాండే 11, అనుజ్ తివారి 4, సంజీత్ దేశాయ్ 1, కెప్టెన్ అమన్దీప్ ఖారే 16, మయాంక్ వర్మ 3, సహబాన్ ఖాన్ 20, ఆదిత్య సర్వటే 4, దేవ్ ఆదిత్య సింగ్ 16 పరుగులకు ఔటయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్రావ్ 32, అభిరథ్ రెడ్డి 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో సిరాజ్ హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్న జురెల్
టీమిండియా భవిష్యత్ తారగా పేరు తెచ్చుకుంటున్న ఉత్తర్ప్రదేశ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ ధృవ్ జురెల్ దేశవాలీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో 7 ఇన్నింగ్స్ల్లో 93 సగటున, 122.90 స్ట్రయిక్రేట్తో 558 పరుగులు చేసిన ఇతను.. ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన రంజీ మ్యాచ్లోనూ అదే సూపర్ ఫామ్ను కొనసాగించాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జురెల్ ఒంటరిపోరాటం చేశాడు. 122 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 96 పరుగులు చేసి, నాలుగు పరుగుల తేడాతో ఎంతో అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. జురెల్కు మరో ఎండ్లో శివమ్ మావి (47) సహకరించడంతో ఉత్తర్ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులు చేయగలిగింది. జురెల్, మావి మినహా యూపీ ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే 6 వికెట్లతో చెలరేగి యూపీని ఘెరంగా దెబ్బ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్ మోఖడే (19), సత్యం భోయార్ (13) క్రీజ్లో ఉన్నారు.సూపర్ ఫామ్జురెల్ ఇటీవల కాలంలో అద్భుత ఫామ్లో ఉన్నాడు. గత ఏడు లిస్ట్-ఏ ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, నాలుగు సెంచరీలు బాదాడు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఘోరంగా విఫలమైన (14 & 13, 0 & 2) జురెల్.. దానికి ముందు సౌతాఫ్రికా-ఏతో జరిగిన ఫస్ట్క్లాస్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలతో అదరగొట్టాడు. దీనికి ముందే టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేసిన జురెల్.. అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం రెండో టెస్ట్లోనూ 44 పరుగులతో పర్వాలేదనిపించాడు.
వరల్డ్కప్కు సంబంధించి బిగ్ అప్డేట్
త్వరలో భారత్, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్కప్కు సంబంధించి ఓ ముఖ్య సమాచారం అందుతోంది. ఈ మెగా టోర్నీ ఓపెనింగ్ సెర్మనీ ఖరారు కావడంతో పాటు వేడుక జరిగే తేదీ మరియు సమయాన్ని ప్రకటించారు. టోర్నీ ప్రారంభమయ్యే ఫిబ్రవరి 7వ తేదీనే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.ఆ రోజు వేర్వేరు వేదికల్లో మొత్తం మూడు మ్యాచ్లు జరుగనుండగా.. మూడో మ్యాచ్కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. మూడో మ్యాచ్లో భారత్, యూఎస్ఏ జట్లు ముంబైలోని వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి ముందే ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుంది.అదే రోజు టోర్నీ ఓపెనర్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కొలొంబో వేదికగా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ వెస్టిండీస్, స్కాట్లాండ్ మధ్య కోల్కతా వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లలన్నీ గ్రూప్కు ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్లుగా విడిపోయాయి. గ్రూప్-సి నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్ వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. భారత్, పాక్ గ్రూప్-ఏలో పోటీపడనున్నాయి. పాక్ తమ మ్యాచ్లన్నీ (భారత్ మ్యాచ్తో సహా) శ్రీలంకలో ఆడనుంది. భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు.. సెమీస్లో గెలిచే జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. గత ఎడిషన్లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.
విజేత కళింగ లాన్సర్స్
భువనేశ్వర్: పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్...
అల్కరాజ్ తొలిసారి...
మెల్బోర్న్: తనకు అచ్చిరాని గ్రాండ్స్లామ్ టోర్న...
జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్షిప్ ప్రారంభం
30 జట్లు... 464 మంది క్రీడాకారిణులు...పలువురు అంతర...
డిఫెండింగ్ చాంపియన్కు భారీ షాక్!
మెల్బోర్న్: అమెరికా స్టార్, డిఫెండింగ్ చాంపియన్...
నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్లు వీరే: ఆసీస్ దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లలో గ్లెన్ మెగ్రాత్కు తప...
ఆస్ట్రేలియా కెప్టెన్గా ట్రవిస్ హెడ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభానికి ముందు ఆస్ట్ర...
భారత్లో పర్యటించనున్న బంగ్లాదేశ్ జట్టు
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో జరిగిన హైడ్రామా తర్వాత క...
అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను: యువీ షాకింగ్ కామెంట్స్
టీమిండియా అత్యుత్తమ క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒ...
క్రీడలు
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
వీడియోలు
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
పాక్ బాటలో బంగ్లాదేశ్..! అదే జరిగితే
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
