Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Bangladesh beat New Zealand by 6 wickets in Second ODi1
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. సోమవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో కివీస్‌పై 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను బంగ్లా జ‌ట్టు 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.4 ఓవ‌ర్ల‌లో 198 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో నిక్ కెల్లీ (102 బంతుల్లో 83 పరుగులు, 14 ఫోర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఓవైపు వికెట్లు ప‌డుతున్నా కెల్లీ మాత్రం ఒంట‌రిపోరాటం చేశాడు. మిగితా బ్యాట‌ర్ల నుంచి అత‌డి స‌హ‌కారం ల‌భించ‌లేదు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. రాణా 5 వికెట్లు ప‌డ‌గొట్టి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. అత‌డితో పాటు షోర్‌ఫుల్ ఇస్లాం రెండు.. రిషాద్‌, టాస్కిన్ అహ్మ‌ద్‌, సౌమ్య సర్కార్ త‌లా వికెట్ సాధించారు.తాంజిద్ మెరుపులుఅనంత‌రం 199 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ 35.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ తాంజిద్ హసన్ (58 బంతుల్లో, 76 పరుగులు, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో నజ్ముల్ హొస్సేన్ శాంటో(50) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. కివీస్ బౌల‌ర్ల‌లో జేడెన్ లెనాక్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స్మిత్‌, ఓ రూర్క్ త‌లా వికెట్ సాధించారు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఏప్రిల్ 23న ఛటోగ్రామ్‌లో జరగనుంది.చదవండి: IPL 2026: అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్‌!

Sanjiv Goenka Reacts Punjab Fan Teases Him Wasting Money On Rishabh Pant2
‘రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి’

లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు అభిమానులు గోయెంకాకు కృతజ్ఞతలు చెప్పిన తీరు వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌లో 2022లో చేరిన లక్నో జట్టు కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో ప్లే ఆఫ్స్‌ చేరింది.రూ. 27 కోట్ల భారీ ధరకుఅయితే, సంజీవ్‌ గోయెంకా వైఖరితో విసిగిపోయిన కేఎల్‌ రాహుల్‌ (KL Rahul).. 2025 వేలానికి ముందు లక్నోను వీడాడు. గౌరవం లేని చోట తాను ఉండలేనని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో టీమిండియా మరో స్టార్‌ రిషభ్‌ పంత్‌ను కొనుగోలు చేసింది.రూ. 26.75 కోట్లకు పంజాబ్‌ సొంతంమరోవైపు.. 2024లో తమ జట్టుకు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వదిలేసింది. ఈ క్రమంలో అయ్యర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడగా.. పంజాబ్‌ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పంత్‌, శ్రేయస్‌ ఖరీదైన ఆటగాళ్లుగా నిలవగా.. ఇద్దరికీ తమ ఫ్రాంఛైజీలు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాయి.కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా సూపర్‌ హిట్‌.. పంత్‌ విఫలంఅయితే, శ్రేయస్‌ ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా సూపర్‌ హిట్‌ అయ్యాడు. గతేడాది 604 పరుగులు చేసిన ఈ ముంబైకర్‌ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. పంత్‌ మాత్రం దారుణంగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. గతేడాది కేవలం 269 పరుగులు చేసిన పంత్‌.. కెప్టెన్‌గానూ ఫెయిలై జట్టును ఏడోస్థానంలో నిలిపాడు.ఇక తాజాగా ఐపీఎల్‌-2026లోనూ పంజాబ్‌ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. లక్నో వరుస వైఫల్యాలతో సతమతమవుతూ ఉంది. ముల్లన్‌పూర్‌లో ఆదివారం ఇరుజట్లు తలపడగా.. పంజాబ్‌ లక్నోను 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న సంజీవ్‌ గోయెంకాకు పంజాబ్‌ అభిమాని దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు.రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి‘‘గోయెంకా సాబ్‌! పంత్‌ను మీ జట్టులోకి తీసుకున్నందు వేలవేల దండాలు భాయ్‌.. అతడు పంజాబ్‌ కెప్టెన్‌గా రానందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఒకవేళ తదుపరి వేలంలో రూ. 32 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా దయచేసి పంత్‌ను మీతోనే ఉంచుకోండి’’ అని సదరు అభిమాని గట్టిగా అరిచాడు.అయితే, ఇందుకు గోయెంకా మాత్రం థాంక్యూ అన్నట్లుగా నవ్వుతూ అభివాదం చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలం ముగిసిన తర్వాత రిషభ్‌ పంత్‌ చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు ఒక రకంగా గోయెంకాకు ఎదురైన అవమానానికి కారణం.PBKS fan: Goenka sahab! Thank you for taking Pant, paaji many, many thanks! Shukar hai captain saadi Punjab team ch nahi aaya!Paaji, even if you have to give 32 crores, don't let Pant go, keep him with you!😭Meanwhile,blud Sanjeev Goenka laughing and giving a thumbs up🤣🙏 pic.twitter.com/dKB7s8ouIt— Rohan💫 (@rohann__45) April 20, 2026ఆరోజు పంత్‌ అన్న మాటనే తిప్పి కొట్టి..వేలం సందర్భంగా.. ‘‘నాకు ఒకటే టెన్షన్‌.. పంజాబ్‌కు మాత్రం అస్సలు వెళ్లకూడదు అని మొక్కుకున్నా.. నేను ఆడకూడదనుకునే ఒకే ఒక్క టీమ్‌ అది’’ అని పంత్‌ వ్యాఖ్యానించాడు. దీంతో అప్పటి నుంచి పంజాబ్‌ జట్టు ఫ్యాన్స్‌ అతడిపై గుర్రుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పంజాబ్‌లో పంజాబ్‌ చేతిలో పంత్‌ సేన ఓడిన తర్వాత గోయెంకాకు ఇలా పంత్‌ గురించి సలహా ఇచ్చారు.చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

Ravichandran Ashwin claims Riyan Parag doesnt trust Ravindra Jadeja3
అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్‌!

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో వ‌రుస‌గా నాలుగు విజయాల‌తో మంచి జోష్‌లో క‌న్పించిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఇప్పుడు ఢీలా ప‌డింది. ఆదివారం ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ ఓట‌మి పాలైంది. రాజ‌స్తాన్‌కు ఇది వ‌రుస‌గా రెండో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.మొన్న‌టి వ‌ర‌కు పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో కొన‌సాగిన రాయ‌ల్స్‌.. ఇప్పుడు మూడో స్ధానానికి పడిపోయింది. అయితే సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది సీజన్‌కు ముందు సీఎస్‌కే నుంచి జడేజాను రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది.కానీ జడేజా లాంటి ఆల్‌రౌండ‌ర్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డంలో రాజ‌స్తాన్ విఫ‌ల‌మైంద‌నే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడిన జ‌డ్డూ..కేవ‌లం 10 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశాడు. అప్ప‌టికి ఐదు వికెట్లు జ‌డేజా ప‌డ‌గొట్టాడు. ఓ రెండు మ్యాచ్‌ల్లో అత‌డితో పూర్తిగా ఒక్క ఓవ‌ర్ కూడా వేయించ‌లేదు.కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా జడేజా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. మూడు ఓవర్లు వేసిన జడేజా, కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికి అతడితో నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయించలేదు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై భారత మాజీ స్పి‍న్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. జడేజాలాంటి సీనియర్ స్పిన్నర్‌తో పూర్తి కోటాను పూర్తి చేయించకపోవడాన్ని అశ్విన్ తప్పుబట్టాడు."రవీంద్ర జడేజా రూపంలో అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మీ జట్టులో ఉన్నాడు. అతడి గణంకాలను చూస్తే ఎలాంటి బౌలరో మీకే ఆర్ధమవుతోంది. కేకేఆర్ మ్యాచ్‌లో జడ్డూ మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో రింకూ సింగ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికి అతడితో మరో ఓవర్ వేయించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నారని బహుశా జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదనుకుంటా. రవి బిష్ణోయ్ వంటి రైట్ ఆర్మ్ లెగ్ బౌలర్ అయితే బాగా బౌలింగ్ చేస్తాడని కెప్టెన్ ఆశించాడు. కానీ చివరి ఏమి జరిగింది. బిష్ణోయ్ వేసిన ఒకే ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. దీని బట్టి జడేజా బౌలింగ్‌పై మీకు నమ్మకం లేదని నాకు ఆర్ధమైంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

Babar Azam Creates History, Surpasses Virat Kohli And Chris Gayle In Elite List4
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో పెషావర్ జల్మీ కెప్టెన్‌, స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజం త‌న సూప‌ర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం క‌రాచీ స్టేడియం వేదిక‌గా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అద్భుతమైన సెంచరీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ త‌న శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు.గ్లాడియేట‌ర్స్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు.బాబర్ కేవలం 338 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(344) పేరిట ఉండేది. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్‌లు) ఉండేవాడు. తాజాగా ఇన్నింగ్స్‌తో వీరిద్దరిని బాబర్ అధిగమించాడు. కాగా బాబర్‌కు ఇది 12వ సెంచ‌రీ.టీ20ల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన జాబితాలో బాబ‌ర్ రెండో స్ధానంలో ఉన్నాడు. మొద‌టి స్ధానంలో క్రిస్ గేల్ (22 సెంచరీలు) కొన‌సాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఒక ఇన్నింగ్స్ 50 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని కేవ‌లం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడిన మొద‌టి ఆట‌గాడిగా బాబ‌ర్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఎదుర్కొన్న 52 బంతుల్లో ఒకే డాట్ బాల్ ఉంది.చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

Big Twist PCB Confirms No Written PSL Contract With Blessing Muzarabani5
PSL: తప్పు ఒప్పుకొన్న పాక్‌ బోర్డు.. ఊహించని ట్విస్ట్‌!

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ పట్ల పీసీబీ వ్యవహారశైలి ఇందుకు కారణం. టీ20 ప్రపంచకప్‌-2026లో ఆస్ట్రేలియా జట్టుపై సత్తా చాటడంతో ముజర్‌బానీకి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)కు చెందిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఫ్రాంఛైజీ ముజర్‌బానీని సొంతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసింది. వెస్టిండీస్‌ యువ పేసర్‌ షమార్‌ జోసెఫ్‌ స్థానంలో ఈ జింబాబ్వే పేసర్‌ను తమ జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.కేకేఆర్‌లో చేరిన ముజర్‌బానీఅయితే.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) నుంచి ముజర్‌బానీకి పిలుపువచ్చింది. బంగ్లాదేశ్‌తో ఉద్రికత్తల నేపథ్యంలో తమ జట్టు నుంచి తొలగించిన ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ స్థానాన్ని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.. ముజర్‌బానీతో భర్తీ చేయాలని భావించింది.రెండేళ్ల నిషేధంఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వైపు మొగ్గుచూపిన ముజర్‌బానీ.. పీఎస్‌ఎల్‌ను వీడి కేకేఆర్‌లో చేరాడు. దీంతో పీసీబీ సంచలన ప్రకటన చేసింది. ‘‘ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడేవాళ్లు పారదర్శకంగా, స్థిరంగా ఉండాలి. ముందుగా ఒప్పందం కుదుర్చుకొని అది అమలులో ఉండగా... దానికి విరుద్ధమైన ఒప్పందంలోకి ప్రవేశించడం ఆట ప్రమాణాలను పాటించకపోవడమే. ముజర్‌బానీపై రెండేళ్లు నిషేధం విధిస్తున్నాం’’ అని పేర్కొంది. దీంతో అతడిపై పాక్‌ ఫ్యాన్స్‌ విద్వేష విషం చిమ్మారు.ఈ క్రమంలో ముజర్‌బానీ ఏజెంట్‌ తాజాగా ఘాటుగా స్పందించాడు. అసలు ముజర్‌బానీ ఏ కాంట్రాక్టుపైనా సంతకం చేయలేదని.. అలాంటి ఆటగాడిపై నిషేధం ఎలా విధిస్తారని ప్రశ్నించాడు. అంతేకాదు.. అభిమానుల ముసుగులో పిరికిపందలు అతడిపై విషం చిమ్ముతూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించాడు. అకారణంగా బ్లెస్సింగ్‌పై చర్యలు తీసుకున్నారని.. వెంటనే నిషేధం ఎత్తివేయాలని పీసీబీకి విజ్ఞప్తి చేశాడు.తప్పు ఒప్పుకొన్న పాక్‌ బోర్డు.. ఊహించని ట్విస్ట్‌!దీంతో వివాదం ముదిరిపోగా.. పీసీబీ స్పందించినట్లు తెలుస్తోంది. PTI అందించిన వివరాల ప్రకారం.. ముజర్‌బానీ ఏజెంట్‌ చేసిన ఆరోపణలు నిజమేనని పీసీబీ ధ్రువీకరించింది. పీసీబీ గానీ.. ఇస్లామాబాద్‌ గానీ ఈ జింబాబ్వే పేసర్‌తో రాతపూర్వక ఒప్పందం చేసుకోలేదని అంగీకరించింది.అయితే, మౌఖికంగా మాత్రం అతడు పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు ఆమోదం తెలిపాడని పేర్కొంది. ఏదేమైనా ముజర్‌బానీ నిబంధనలను ఉల్లంఘించాడని.. అందుకే అతడిపై నిషేధం కొనసాగుతుందని పీసీబీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పీసీబీ తప్పును సగమే ఒప్పుకొందని.. అకారణంగా ముజర్‌బానీపై చర్యలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ముజర్‌బానీతో పాటు ఈ ఏడాది శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక, ఆస్ట్రేలియా స్టార్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ కూడా పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరిన సంగతి తెలిసిందే.చదవండి: టీ20 క్రికెట్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌గా క్రిస్‌ గేల్‌

Vaibhav Suryavanshi Likely lead india under-19 team in Sri Lanka tour6
వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం భారత అండర్‌-19, అండర్‌-23 జట్లు శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భార‌త యువ జ‌ట్లు శ్రీలంక అండర్‌-19, లయన్స్ టీమ్స్‌తో నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వ‌ర‌లోనేఖరారు చేయ‌నుంది.అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ జూన్‌లో ఒక ప్రత్యేక టోర్నమెంట్‌ను నిర్వహించనుంది. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా 64 మంది యువ ఆటగాళ్లు బోర్డు షార్ట్ లిస్ట్ చేసింది. వీరింతా ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్ష‌ణ పొందుతున్నారు.ఈ యువ ఆట‌గాళ్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రాటుదేలుతున్నారు. ఈ టోర్నీలో అత్యుత్తుమ ప్ర‌ద‌ర్శ‌న ఆట‌గాళ్లు శ్రీలంక వెళ్లే విమానం ఎక్క‌నున్నారు. ఐపీఎల్‌-2026లో ఆడుతున్న యంగ్ కిడ్స్ వైభ‌వ్ సూర్య‌వంశీ, అయూశ్ మాత్రే కూడా సీజ‌న్ ముగిసిన త‌ర్వాత ఈ క్యాంప్‌లో చేరనున్నారు.కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ?అయితే శ్రీలంక టూర్‌కు ముందు భారత అండర్‌-19 కెప్టెన్ అయూష్ మాత్రే గాయపడడం సెలక్టర్లు తలనొప్పిగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాత్రే తొడ కండరాలు (హ్యామ్‌స్ట్రింగ్‌) పట్టేశాయి. దీంతో అతడు వికెట్ల మధ్య పరిగెత్తేందుకు ఇబ్బంది పడ్డాడు. అతడు గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఒకవేళ మాత్రే గాయం గ్రేడ్‌-3లో ఉన్న‌ట్ల‌యితే పూర్తిగా కోలుకోవ‌డానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జ‌రిగితే రోహిత్ ఐపీఎల్‌-2026 సీజ‌న్ మ‌ధ్య‌లోనే వైదొలగడంతో పాటు శ్రీలంక పర్యటనకు కూడా మాత్రే దూరమయ్యే అవకాశముంది. మరోవైపు అండర్‌-19 వైస్ కెప్టెన్ వియాన్ మల్హోత్రా కూడా స్వ‌ల్ప గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. వియాన్ మల్హోత్రాను ఐపీఎల్‌-2026 వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒక‌వేళ శ్రీలంక టూర్‌కు మాత్రే, వియాన్ ఇద్ద‌రు అందుబాటులో లేక‌పోతే భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ అవ‌కాశ‌ముంది. సూర్య‌వంశీ గ‌తంలో సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అత‌డి నేతృత్వంలోని యంగ్ ఇండియా ఆ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మళ్లీ ఇప్పుడు వైభవ్ తన కెప్టెన్సీని నిరూపించుకునే సమయం వచ్చిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్‌ బోర్డుకు ఘాటు కౌంటర్‌

Chris Gayle Becomes T20 Franchise Team Owner Check Details7
టీ20 క్రికెట్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌గా క్రిస్‌ గేల్‌

వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ క్రిస్‌ గేల్‌ కీలక ముందడుగు వేశాడు. ది యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌ (ETPL)లో యూనివర్సల్‌ బాస్‌ భాగమయ్యాడు. గ్లాస్గో ముగాఫియాన్స్‌ అనే జట్టుకు సహ యజమానిగా గేల్‌ వ్యవహరించనున్నాడు.జట్టు కొనుగోలుది యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌లో ఆరు జట్లు భాగం కానుండగా.. స్కాట్లాండ్‌ దేశం నుంచి గ్లాస్గో ముగాఫియాన్స్‌ (Glasgow Mugafians) ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మహిళా వ్యాపారవేత్త తన్షా బాత్రాతో కలిసి క్రిస్‌ గేల్‌ ఈ జట్టును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఫ్రాంఛైజీకి గేల్‌ గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లన్నింటిలో కలిపి క్రిస్‌ గేల్‌ ఏకంగా 463 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు ఫ్రాంఛైజీ ఓనర్‌గా కొత్త అధ్యాయం ప్రారంభించాడు. ఇదిలా ఉంటే.. ది యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌ ఈ ఏడాది ఆరంభం కానుంది. బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ఈ లీగ్‌ సహయజమానిగా ఉన్నాడు.‍ది యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌లో క్రికెట్‌ ఐర్లాండ్‌, క్రికెట్‌ స్కాట్లాండ్‌, రాయల్‌ డచ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. గ్లాస్గో, ఆమ్‌స్టర్‌డ్యామ్‌, ఎడిన్‌బర్గ్‌, డబ్లిన్‌, బెల్‌ఫాస్ట్‌, రాటర్‌డ్యామ్‌ రూపంలో ఆరు జట్లు ఈ లీగ్‌లో భాగంగా ఉన్నాయి.యజమానులుగా మాజీ క్రికెటర్లుఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఫ్రాంఛైజీని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా, హాకీ స్టార్‌ జేమీ డైయర్‌ సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు ఆసీస్‌ టీ20 కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సారథి.బెల్‌ఫాస్ట్‌ జట్టుకు గ్లెన్‌​ మాక్స్‌వెల్‌ సహ యజమానిగా ఉండగా.. ఎడిన్‌బర్గ్‌ ఫ్రాంఛైజీని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్లు కైలీ మిల్స్‌, నాథన్‌ మెకల్లమ్ దక్కించుకున్నారు. ఈ జట్టుకు న్యూజిలాండ్‌ సారథి మిచెల్‌ సాంట్నర్‌ కెప్టెన్‌.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్‌ బోర్డుకు ఘాటు కౌంటర్‌

IPL 2026: Story on Punjab Kings consecutive wins8
పంజాబ్‌ విజయ రహస్యం 'సర్పంచ్‌ సాబ్‌'

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ జట్టు ఫేట్‌ మారిపోయింది. గత సీజన్‌లో పగ్గాలు చేపట్టిన అతను.. తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దురదృషవశాత్తు ఫైనల్లో ఓడింది కానీ, టైటిల్‌కు పూర్తిగా అర్హమైన జట్టు అని అందరిచే ప్రశంసలందుకుంది.గత సీజన్‌లో తృటిలో చేజారిన టైటిల్‌ను పంజాబ్‌ ఈ సీజన్‌లో ఎలాగైనా సాధించాలని పట్టుదలగా ఉంది. మరోసారి శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో తమ తొలి టైటిల్‌ దిశగా దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో (ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది) పాయింట్ల పట్టకలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబ్‌ మాత్రమే. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో 254 పరుగులు చేసి, ఆతర్వాత ఆ స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ చేసిన స్కోర్‌ సీజన్‌లోనే అత్యధికం.వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్‌ విజయ రహస్యం ఏంటా అని పరిశీలిస్తే, అది వారి కెప్టెనేనని తెలుస్తుంది. శ్రేయస్‌ ఈ సీజన్‌లో మునుపెన్నడూ లేనంత పట్టుదలగా ఉన్నాడు. కెప్టెన్‌గా ఎంతో పరిణితి ప్రదర్శిస్తూ జట్టు విజయాలకు ప్రధాన కారకుడిగా నిలుస్తున్నాడు.శ్రేయస్‌ కెప్టెన్సీ శైలి ఇతర నాయకులతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా, వారికి స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయడం అతని ప్రత్యేకత. ప్రతి ఆటగాడి వ్యక్తిగత శైలి, రొటీన్‌ను గౌరవించడం ద్వారా జట్టులో విశ్వాసాన్ని పెంచాడు. ఈ విధానం కారణంగా బ్యాటర్లు నిర్భయంగా ఆడుతూ, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని పెంచగలుగుతున్నారు.పంజాబ్ విజయాల్లో బ్యాటింగ్ విభాగం వారి ప్రధాన బలం. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకు దూకుడైన ఆట కనిపిస్తోంది. ముఖ్యంగా సిక్సర్లు కొట్టడంపై ఆ జట్టు ప్రత్యేక దృష్టి పెట్టింది. శ్రేయస్‌ ఆటగాళ్ల మధ్య సిక్సర్ల పోటీ పెట్టి, జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. ఇది కేవలం వినోదాత్మక అంశంగా కాకుండా, మ్యాచ్‌లలో స్కోరింగ్ రేట్ పెంచడానికి దోహదపడుతోంది. ఫలితంగా, పంజాబ్ జట్టు భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతోంది.బౌలింగ్ విభాగంలోనూ పంజాబ్ సమతుల్యంగా ఉంది. అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన బౌలర్లు జట్టుకు బలం చేకూరుస్తున్నారు. మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి ఆటగాళ్లపై ప్రత్యేక వ్యూహాలు రూపొందించి, వాటిని కచ్చితంగా అమలు చేయడంలో బౌలర్లు విజయవంతమవుతున్నారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకోవడం పంజాబ్ ప్రత్యేకతగా మారింది.ఫీల్డింగ్‌లో కూడా జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. కీలక సమయాల్లో క్యాచ్‌లు పట్టడం, రనౌట్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలు మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమగ్ర ప్రదర్శన వల్లే పంజాబ్ కింగ్స్ ఓటమి లేకుండా ముందుకు సాగుతోంది.శ్రేయస్‌ కేవలం కెప్టెన్‌గానే కాకుండా, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సత్తా చాటుతూ తన సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పంజాబ్‌ అభిమానులు ముద్దుగా 'సర్పంచ్‌ సాబ్‌' అని పిలుచుకునే శ్రేయస్‌.. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో అద్బుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. ఇటీవల శ్రేయస్‌ పట్టిన ఓ క్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. మొత్తంగా, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ప్రదర్శించిన జోరును ఇకపై కూడా కొనసాగిస్తే, పంజాబ్‌ తమ తొలి టైటిల్‌ సొంతం చేసుకోవడం ఖాయం.

Shashank Singh Drops 3 Catches Shreyas Iyer Shames Him For Mistakes9
శశాంక్‌ సింగ్‌ పరువు తీసిన శ్రేయస్‌ అయ్యర్‌!

ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో గతేడాది ఫైనల్‌ చేరిన పంజాబ్‌.. ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ శ్రేయస్‌ సేన దుమ్ములేపింది.సొంత వేదిక ముల్లన్‌పూర్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 254 పరుగులు సాధించింది. ప్రియాన్ష్‌ ఆర్య (37 బంతుల్లో 93) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. కూపర్‌ కన్నోలి (46 బంతుల్లో 87) మరోసారి ఆకట్టుకున్నాడు.రాణించిన బౌలర్లుఇక లక్ష్య ఛేదనలో లక్నోను పంజాబ్‌ 200 పరుగులకే పరిమితం చేసింది. మార్కో యాన్సెన్‌ రెండు, అర్ష్‌దీప్‌ సింగ్‌, విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌, యజువేంద్ర చహల్‌ తలా ఒక వికెట్‌ తీసి పంత్‌ సేనను కట్టడి చేశారు. ఫలితంగా పంజాబ్‌ 54 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.మూడు క్యాచ్‌లు జారవిడిచాడుఅయితే, పంజాబ్‌ స్టార్‌ శశాంక్‌ సింగ్‌ లక్నోతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు క్యాచ్‌లు జారవిడిచాడు. ముఖ్యంగా లక్నో ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ బంతితో రంగంలోకి దిగగా.. ఐడెన్‌ మార్క్రమ్‌ భారీ షాట్‌ ఆడాడు.A brainfade moment for Shashank Singh. 😄 pic.twitter.com/AxJEiBOie7— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2026ఈ క్రమంలో స్వీపర్‌ కవర్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న శశాంక్‌ సింగ్‌ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకు వచ్చాడు. ఆల్‌మోస్ట్‌ క్యాచ్‌ పడతాడని భావించగా.. అక్కడే అలా నిలుచుండిపోయాడు. దీంతో మార్క్రమ్‌ ఖాతాలో సిక్సర్‌ చేరగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌తో పాటు డగౌట్‌లో ఉన్న హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మార్క్రమ్‌తో పాటు ముకుల్‌​ చౌదరీతో పాటు నికోలస్‌ పూరన్‌ల క్యాచ్‌లను శశాంక్‌ జారవిడిచాడు. ఈ ముగ్గరూ డేంజరస్‌ ప్లేయర్లే. అయితే, పంజాబ్‌ బౌలర్లను వాళ్లను సరిగ్గా కుదురుకోనివ్వలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఫలితంపై ప్రభావం పడేది. ఈ నేపథ్యంలో శశాంక్‌ సింగ్‌పై విమర్శల వర్షం కురుస్తుండగా.. మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చేసిన పని నెటిజన్లను ఆకర్షిస్తోంది.ఇదిగో ఈ క్యాప్‌ అడ్డుపెట్టుకోవిజయం తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలోశ్రేయస్‌ శశాంక్‌ను ఆటపట్టించాడు. సరదాగా శశాంక్‌ భుజంపై చెయ్యి వేసిన శ్రేయస్‌ అయ్యర్‌... ‘‘మన జట్టు సభ్యులకు నీ ముఖం చూపించలేవులే.. మనోళ్లను కదిలించేంత దమ్ము ఇపుడు లేకపోవచ్చు... ఇదిగో ఈ క్యాప్‌ అడ్డుపెట్టుకో’’ అన్నట్లుగా క్యాప్‌ అతడి ముఖానికి అడ్డుపెట్టి నడిపించాడు. పాంటింగ్‌ సైతం శశాంక్‌ భుజం తట్టి నవ్వులు చిందించాడు. ఈ నేపథ్యంలో.. ‘‘శ్రేయస్‌ భయ్యా పాపం శశాంక్‌ పరువు తీసేశావుగా!.. ఏదేమైనా ఈరోజు శశాంక్‌ అదృష్టం బాగుంది’’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా శశాంక్‌ ఈ మ్యాచ్‌లో ఆరు బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒకటి వర్షం వల్ల రద్దుకాగా.. మిగిలిన ఐదూ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉంది.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్‌ బోర్డుకు ఘాటు కౌంటర్‌𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026

1st Time In 19 Seasons, Jofra Archer Scripts Unique IPL Record vs KKR10
చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 19) రాత్రి కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఓ చారిత్రక ఘనత సాధించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఆర్చర్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో అర్చర్‌ ఇన్నింగ్స్‌ తొలి బంతికే టిమ్‌ సీఫర్డ్‌ వికెట్‌ తీశాడు. దీనికి ముందు రెండు మ్యాచ్‌ల్లో ఇదే తరహాలో ఇన్నింగ్స్‌ తొలి బంతులకే ఆర్సీబీ ఫిల్‌ సాల్ట్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ అభిషేక్‌ శర్మను ఔట్‌ చేశాడు. కేవలం 10 రోజుల్లోనే అభిషేక్‌ ఈ ఘనత సాధించడం మరో విశేషం.టిమ్‌ సీఫర్ట్‌ వికెట్‌తో ఆర్చర్‌ మరో ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా (5 వికెట్లు) మొహమ్మద్‌ షమీ సరసన నిలిచాడు. ఆర్చర్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో పృథ్వీ షా, ప్రియాంశ్ ఆర్య, ఫిల్‌ సాల్ట్‌, అభిషేక్‌ శర్మ, టిమ్‌ సీఫర్ట్‌ను ఇన్నింగ్స్ మొదటి బంతికే ఔట్ చేశాడు.ఈ రికార్డు విభాగంలో షమీ, ఆర్చర్‌ తర్వాతి స్థానాల్లో ట్రెంట్‌ బౌల్ట్‌, ఉమేశ్‌ యాదవ్‌, లసిత్‌ మలింగ, భువనేశ్వర్‌ కుమార్‌, పాట్‌ కమిన్స్‌ ఉన్నారు. వీరంతా తలో మూడు సార్లు ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్లు తీశారు.మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్‌ 20 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు వైభవ్‌ సూర్యవంశీ (46), యశస్వి జైస్వాల్‌ (39) మంచి ఆరంభాన్ని ఇచ్చినా, మధ్యలో వికెట్లు కోల్పోవడంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వరుణ్‌ చక్రవర్తి, కార్తీక్‌ త్యాగి తలో 3.. సునీల్‌ నరైన్‌ 2 వికెట్లు తీసి రాయల్స్‌ ఆటగాళ్లను కట్టడి చేశారు.అనంతరం​ ఛేదనలో కేకేఆర్‌ సైతం తడబడినా.. రింకూ సింగ్‌ (53 నాటౌట్‌), అనుకూల్‌ చౌదరి (29 నాటౌట్‌) అసాధారణ ప్రదర్శనతో తమ జట్టుకు సీజన్‌ తొలి విజయాన్ని అందించారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement