Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Another South African Star Joins PSL 2026 In The IPL Window1
పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్‌

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్‌ చేరాడు. ఈ లీగ్‌లో ఇప్పటికే చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటుండగా.. తాజాగా యువ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రూబిన్‌ హెర్మన్‌ వీరి సరసన చేరాడు. హెర్మన్‌ను లాహోర్‌ ఖలందర్స్‌ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఖలందర్స్‌తో జతకట్టిన అనంతరం హెర్మన్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది.ఫాఫ్‌ డుప్లెసిస్‌ తర్వాత ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రెండో సౌతాఫ్రికన్‌గా హెర్మన్‌ గుర్తింపు పొందాడు. గతేడాది చివర్లో డుప్లెసిస్‌ ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకొని పీఎస్‌ఎల్‌లో చేరాడు. 14 ఏళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో దాదాపు 4,800 పరుగులు చేసిన డుప్లెసిస్‌, పీఎస్‌ఎల్‌ ఆడటం అప్పట్లో సంచలనం. ఈ ఏడాది ఐపీఎల్‌ విండోలో మరో సౌతాఫ్రికా ఆటగాడు పీఎస్ఎ‌ల్‌లో పాల్గొంటుండటం ఆసక్తికరం.హెర్మన్ ప్రదర్శనలు 29 ఏళ్ల హెర్మన్‌ CSA T20 ఛాలెంజ్ 2023-24లో 436 పరుగులు చేసి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత SA20లో పార్ల్ రాయల్స్ తరఫున ఆడాడు. 2025 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌పై ఒత్తిడిలో 81* పరుగులు చేసి ప్రతిభను చాటుకున్నాడు. ఆ ఎడిషన్‌లో 226 పరుగులు చేశాడు. మొత్తం టీ20 కెరీర్‌లో హెర్మన్‌ 1,497 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 8 అర్ద శతకాలు ఉన్నాయి.లాహోర్ జట్టు వ్యూహం లాహోర్ జట్టు ఇప్పటికే ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, ఉసామా మిర్, హసీబుల్లా ఖాన్ వంటి స్థానిక ఆటగాళ్లను కలిగి ఉంది. హెర్మన్ చేరికతో ఆ ఫ్రాంచైజీ బ్యాటింగ్‌ బలం మరింత పెరుగనుంది. హెర్మన్‌ మిడిలార్డర్‌లో కీలకమైన బ్యాటర్‌. అతన్ని 5 లేదా 6వ స్థానంలో ఉపయోగించుకోవచ్చు. స్ట్రైక్ రొటేట్ చేయడం, డెత్ ఓవర్లలో బౌండరీలు కొట్టడం హెర్మన్‌ ప్రత్యేకత.

SURYA KUMAR YADAV NOMINATED FOR ICC MEN'S PLAYER OF THE MONTH AWARD JANUARY 20262
సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకు మరో గుడ్‌ న్యూస్‌

సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు మరో గుడ్‌ న్యూస్‌ అందింది. 2026 జనవరి నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. పురుషుల విభాగంలో స్కైతో పాటు న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌ కూడా నామినేట్‌ అయ్యారు. మహిళల విభాగంలో ఐర్లాండ్‌కు చెందిన గాబీ లూయిస్‌, బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ శోభన మోస్టరీ, యూఎస్‌ఏకు చెందిన టారా నోర్రిస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు పోటీపడుతున్నారు. గత నెలలో వీరంతా తమతమ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు చేయడంతో ఐసీసీ వీరిని ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్‌ చేసింది.డారిల్‌ మిచెల్‌జనవరిలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టుకు 2-1 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. రెండు, మూడు వన్డేల్లో మిచెల్‌ వరుస శతకాలు సాధించి మొత్తం 352 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతని సగటు 176గా ఉండటం విశేషం.ఈ ప్రదర్శన తర్వాత మిచెల్‌ ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా 186.56 స్ట్రైక్ రేట్‌తో 125 పరుగులు సాధించి సత్తా చాటాడు.జో రూట్‌రూట్‌ విషయానికొస్తే.. ఈ స్టార్‌ బ్యాటర్‌ జనవరి నెలలో శ్రీలంకపై ఇంగ్లండ్‌ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అతను వరుసగా 61, 75, 111 నాటౌట్‌ స్కోర్లు చేశాడు. అదనంగా రెండు వికెట్లు కూడా తీసి "ప్లేయర్ ఆఫ్ ద సిరీస్" అవార్డును కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనల కారణంగానే రూట్‌ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు.సూర్యకుమార్‌ యాదవ్‌జనవరి నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్కై తన పూర్వపు ఫామ్‌ను తిరిగి పొందాడు. అంతకుముందు 25 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన స్కై.. ఆ సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. 197 స్ట్రైక్ రేట్‌తో 242 పరుగులు చేసి భారత్‌కు సిరీస్‌ విజయాన్ని (4-1) అందించాడు. ఈ ప్రదర్శనల కారణంగానే స్కై ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు.

England suffer major blow ahead of T20 World Cup super 8 clash with Sri Lanka3
శ్రీలంకతో సూపర్‌-8 సమరానికి ముందు ఇంగ్లండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ

టీ20 ప్రపంచకప్‌ 2026లో సూపర్‌-8 సమరాలు నిన్నటి నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభమయ్యాయి. పాక్‌-న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన తొలి సమరం వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ (ఫిబ్రవరి 22) సూపర్‌-8లో మరో రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి.మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలె వేదికగా శ్రీలంక-ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లో భారత్‌-సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.కాగా, శ్రీలంకతో కీలక సమరానికి ముందు మాజీ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ జేకబ్‌ బేతెల్‌ గాయపడ్డాడు. బేతెల్‌ ఎడమ చేతి ఉంగరం వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను వేళ్లకు బ్యాండ్‌ ఎయిడ్‌ (protective strapping) వేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బేతెల్‌ శ్రీలంక మ్యాచ్‌లో బౌలింగ్‌కు అందుబాటులో ఉండటంపై అనిశ్చితి నెలకొంది.ఐసీసీ నియమాలు ప్రకారం, బౌలర్ చేతికి ఏ రకమైన రక్షణ ఉండాలన్నా మైదానంలోకి దిగే ముందు దాన్ని అంపైర్లు ఆమోదించాలి. ఇంగ్లండ్ ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని రెండు సార్లు ఎదుర్కొంది. కాబట్టి బేతెల్‌కి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.బేతెల్ ప్రాధాన్యంపల్లెకెలెలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడే బేతెల్ గతంలో శ్రీలంకపై 4/11తో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో అతని బౌలింగ్ ఇంగ్లండ్ విజయానికి కీలకమైంది. ఇప్పుడు అదే జట్టుతో మళ్లీ తలపడుతున్న సందర్భంలో బేతెల్‌ బౌలింగ్‌ సేవలు అందుబాటులో లేకపోతే ఇంగ్లండ్ స్పిన్ విభాగం బలహీనపడే అవకాశం ఉంది.వ్యూహంపై ప్రభావంబేతెల్ గాయం కారణంగా ఇంగ్లండ్ జట్టు వ్యూహంలో మార్పులు తప్పనిసరి కావచ్చు. అతని బౌలింగ్ అందుబాటులో లేకపోతే, ఆ జట్టు ఇతర స్పిన్ ఎంపికలపై ఆధారపడాల్సి ఉంటుంది. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే బేతెల్‌ బౌలింగ్‌ చేయలేకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద లోటు అవుతుంది. శ్రీలంక జట్టు స్పిన్ విభాగంలో బలంగా ఉండటంతో ఇంగ్లండ్‌పై ఒత్తిడి మరింత పెంచుతుంది. మ్యాచ్‌కు ముందు అంపైర్లు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Indias Super 8 clash with South Africa today in T20 World Cup4
పునరావృతమా... ప్రతీకారమా...

రెండేళ్ల క్రితం టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌... ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్‌ 7 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచింది. అభిమానులెవరూ దీనిని మరచిపోలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఎనిమిది మ్యాచ్‌లు జరిగినా...వరల్డ్‌ కప్‌ లెక్కే వేరు. నాటి ఫైనల్‌ తర్వాత ఇప్పుడు రెండు టీమ్‌లు అదే వరల్డ్‌ కప్‌ అసలు మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఫైనల్‌ కాని ఫైనల్‌ లాంటి మ్యాచ్‌లో 2024 ఫలితాన్ని భారత్‌ పునరావృతం చేస్తుందా లేక దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంటుందా ఆసక్తికరం.అహ్మదాబాద్‌: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో భారత్‌ ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అన్నింటా గెలిచి లీగ్‌ దశను అజేయంగా ముగించింది. కానీ ఎదురుపడిన జట్లు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ గట్టి ప్రత్యర్థులైతే కానే కావు. దాయాది పాకిస్తాన్‌ అయినా పోటీ ఇస్తుందనుకుంటే ఆ మూడింటి సరసనే నిలిచింది. ఈ నేపథ్యంలో ఆడిన అన్ని గెలిచాం. అజేయమని ఆదమరిస్తే మాత్రం టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ‘సూపర్‌ ఎయిట్స్‌’ దశలో భాగంగా నేడు (ఆదివారం) జరిగే పోరులో దక్షిణాఫ్రికాను భారత్‌ ఎదుర్కొంటుంది. దక్షిణాఫ్రికా కూడా తమ గ్రూప్‌లో ఆడిన నాలుగూ గెలిచి టాపర్‌గా ముందంజ వేసింది. బలాబలాలను బట్టి చూస్తే సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం. అభిషేక్‌ ‘జీరో’ నుంచి ‘హీరో’ అయ్యేనా... సూపర్‌ హిట్టర్, స్టార్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మపై భారత్‌ గంపెడాశలు పెట్టుకుంది. మెరుపులతో మురిపిస్తాడని, మ్యాచ్‌లను ఏకపక్షంగా మలిచేస్తాడని భావించింది. కానీ ఈ ప్రపంచకప్‌లోనే అభిషేక్‌ ఖాతా తెరువలేదు. అన్ని ‘జీరో’లే! భారత్‌ స్థాయికి తగని ప్రత్యర్థులతోనే అతను ఆడలేకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతుంది. నేడు దక్షిణాఫ్రికాతో కీలకమైన సూపర్‌ పోరులో అయినా ఖాతా తెరవాలని, సఫారీ బౌలింగ్‌పై మెరిపించాలని జట్టే కాదు యావత్‌ దేశం గట్టిగా కోరుకుంటుంది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు భారత్‌ ఈ మెగా ఈవెంట్‌లో గొప్ప మ్యాచ్‌ అయితే ఆడలేదు. అమెరికాతో జరిగిన పోరులో ఒకే ఒక్కడు సూర్యకుమార్‌ మెరిపించాడు. ఇంకెవరూ 30 పరుగులైనా చేయలేదు. నమీబియాలాంటి ప్రత్యరి్థపై కూడా ఆడింది ఇద్దరే! ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్యాలు ఫిఫ్టీలు చేశారు. పాక్‌తో కీలకమైన పోరు జరిగినా దంచింది మాత్రం ఇషాన్‌ కిషన్‌ ఒక్కడే! నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి పోరులోనూ భారత ఇన్నింగ్‌ ఒక్కడి ఫిఫ్టీపైనే ఆధారపడింది. శివమ్‌ దూబే రాణించాడు. క్రికెట్‌ కూనలే ఎదురైనా, పాక్‌తో జాగ్రత్తగా ఆడాల్సివున్నా... ప్రతీ మ్యాచ్‌లో ఏ ఒకరో లేదంటే ఇద్దరో ఆడారు. ఇకపై కూడా ఎవరో ఒకరిద్దరు ఆడితే గెలిచేయొచ్చనుకుంటే భారత్‌ కథ ఈ సూపర్‌–8కే పరిమితమవుతుంది. స్పీడ్‌స్టర్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, స్పిన్‌ ద్వయం అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తిలు భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని ప్రతి మ్యాచ్‌లోనూ నిలబెడుతున్నారు. దుర్బేధ్యంగా దక్షిణాఫ్రికా ఈ ప్రపంచకప్‌లో గత ఫైనలిస్టు దక్షిణాఫ్రికా పట్టుదలతో ఆడింది. ప్రధాన బ్యాటర్లే కాదు.... లోయర్‌ మిడిలార్డర్‌లోనూ దంచేసిన ఆటగాళ్లున్నారు. అమెరికాపై 200 పైచిలుకు చేసిన సఫారీ... అఫ్గాన్‌పై 187/6 స్కోరు చేసింది. ఇక కివీస్‌పై అయితే 176 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఛేదించింది. యూఏఈని తక్కువ స్కోరు (122/6)కే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా 13.2 ఓవర్లలోనే ఛేదంచింది. కెప్టెన్‌మార్క్‌రమ్, డికాక్, రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్‌ ఇలా అందరూ ఫామ్‌లో ఉన్నారు. అంతకుమించి సమష్టిగా రాణిస్తున్నారు. ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఒకరిద్దరితో గెలిచిన సందర్బాలే లేవు. ఇక బౌలింగ్‌ బలం గురించి చెప్పాల్సిన పనిలేదు. రబడా, ఎన్‌గిడి, కేశవ్‌ మహరాజ్, కార్బిన్‌ బాష్, యాన్సెన్‌ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించగలరు. పిచ్‌–వాతావరణం అహ్మదాబాద్‌ వికెట్‌ బ్యాటింగ్‌కే అనుకూలం. ప్రత్యేకించి టి20లైతే ధనాధన్‌ షో గ్యారంటీ. ఈ మైదానంలో ఛేదన సులువు కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఖాయం. మ్యాచ్‌కు వర్షం ముప్పయితే లేదు. తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్, ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, రింకూ, అక్షర్‌ పటేల్, వరుణ్, బుమ్రా, అర్ష్ దీప్‌. దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, బాష్, రబడా, ఎన్‌గిడి, కేశవ్‌ మహరాజ్‌.

Pakistan vs New Zealand Super 8 match cancelled5
పాకిస్తాన్, న్యూజిలాండ్‌ ‘సూపర్‌–8’ మ్యాచ్‌ రద్దు

టి20 వరల్డ్‌ కప్‌ ‘సూపర్‌ ఎయిట్స్‌’ దశ పోటీలు వర్షం ప్రభావంతో మొదలయ్యాయి. గ్రూప్‌–2లో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్‌ మధ్య కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. టాస్‌ నెగ్గిన పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత సమయానికే మ్యాచ్‌ ఆరంభమవుతున్నట్లు కనిపించిన దశలో ఒక్కసారిగా వాన ముంచెత్తింది. స్వల్పంగా చినుకులతో మొదలైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది.ప్రేమదాస స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా వాన తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. సూపర్‌–8లో పాక్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో... న్యూజిలాండ్‌ బుధవారం శ్రీలంకతో తలపడతాయి. నేటి సూపర్‌ – 8 మ్యాచ్‌లుశ్రీలంక X ఇంగ్లండ్‌వేదిక: పల్లెకెలె ; మ.3.00 గంటల నుంచి భారత్‌ X దక్షిణాఫ్రికావేదిక: అహ్మదాబాద్‌; రాత్రి గం. 7 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

India win third T20 against Australia6
మన మహిళలదే సిరీస్‌

అడిలైడ్‌: ఆస్ట్రేలియా గడ్డపై దశాబ్దం తర్వాత భారత మహిళల జట్టు టి20 సిరీస్‌ గెలిచింది. శనివారం జరిగిన ఆఖరి మూడో టి20లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌ 17 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలిచింది. తద్వారా ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌లో పైచేయి సాధించింది. టాస్‌ నెగ్గిన భారత్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మృతి మంధాన (55 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ ఆటతో ఆసీస్‌ బౌలర్లపై చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్‌ (46 బంతుల్లో 59; 4 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. ఆతిథ్య బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఓడింది. ఒక్క యాష్లే గార్డ్‌నర్‌ (45 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే పోరాడింది. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్‌ (3/22), శ్రీచరణి (3/32) ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశారు. చివరిసారిగా భారత అమ్మాయిల జట్టు 2016లో కంగారూ గడ్డపై టి20 సిరీస్‌ నెగ్గింది. ఇప్పుడు మూడు ఫార్మాట్ల (టి20, వన్డే, టెస్టు)లకు కలిపి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌ గెలిస్తే రెండు పాయింట్లు, ఏకైక టెస్టు నెగ్గితే 4 పాయింట్ల ఆధారంగా ఓవరాల్‌ విజేతను ఖరారు చేస్తారు. దీంతో ఈ టి20ల్లో భారత్‌ 4–2 పాయింట్లతో పైచేయి సాధించింది. చెలరేగిన మంధాన ఆట మొదలైన మూడో ఓవర్లోనే షఫాలీ వర్మ (7) అవుటైంది. క్రీజులోకి వచి్చన జెమీమాతో కలిసి స్మృతి మంధాన కంగారూ బౌలర్ల భరతం పట్టింది. దీంతో పవర్‌ ప్లేలో భారత్‌ 54/1 స్కోరు చేసింది. స్మృతి జోరు కొనసాగడంతో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఆమెకిది 33వ అర్ధసెంచరీ కావడం విశేషం.మరోవైపు జెమీమా సైతం ధాటిగా పరుగులు సాధించడంతో ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఆతిథ్య బౌలర్లు ఎంతోసేపు శ్రమించాల్సివచ్చింది. ఎట్టకేలకు 17వ ఓవర్లో స్టార్‌ ఓపెనర్‌ మంధాన దూకుడుకు అనాబెల్‌ బ్రేకులేసింది. దీంతో రెండో వికెట్‌కు 121 పరుగుల భారీభాగస్వామ్యం ముగిసింది. చివర్లో హిట్టర్‌ రిచా ఘోష్‌ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా పరుగులు రాబట్టింది. గార్డ్‌నర్‌ పోరాటం వృథా భారత బౌలర్ల పవర్‌కు ఆసీస్‌ బ్యాటింగ్‌ ‘పవర్‌ ప్లే’ టాపార్డర్‌ కుదేలైంది. రెండో ఓవర్లోనే బౌలింగ్‌కు దిగిన శ్రేయాంక తన వరుస ఓవర్లలో జార్జియా వోల్‌ (10), ఎలైస్‌ పెరి (1)లను అవుట్‌ చేసింది. రేణుక... బెత్‌ మూని (6) పనిపట్టడంతో ఆస్ట్రేలియా ఒక దశలో టాపార్డర్‌ వికెట్లను కోల్పోయి 32/3 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), యాష్లే గార్డ్‌నర్‌ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఆంధ్ర లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీ చరణి రెడ్డి (3/32), హైదరాబాదీ పేసర్‌ అరుంధతి రెడ్డి (2/35)లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ లక్ష్యానికి దూరమైంది. జట్టును గెలిపించేందుకు గార్డ్‌నర్‌ చేసిన పోరాటానికి అరుంధతి చెక్‌ పెట్టడంతోనే మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేసింది.

rain washes out New Zealand-Pakistan clash7
పాకిస్తాన్‌-న్యూజిలాండ్ మ్యాచ్ ర‌ద్దు

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా శ‌నివారం కొలంబో వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జ‌ట్ల‌కు త‌లో పాయింట్ ల‌భించింది. షెడ్యూల్ ప్ర‌కారం సాయంత్రం 6:30 గంట‌ల‌కు టాస్ ప‌డింది.అయితే టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం ప్రారంభమైంది. మైదానం మొత్తం కవర్లతో కప్పేశారు. దాదాపు రెండున్నర గంటల నిరీక్షణ తర్వాత కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. సూపర్-8 గ్రూప్-2లో ఉన్న ఈ రెండు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. అయితే మొద‌టి మ్యాచే ర‌ద్దు కావ‌డంతో, సెమీస్ చేరాలంటే తర్వాత జరగబోయే మ్యాచుల్లో ఇరు జ‌ట్లు క‌చ్చితంగా గెల‌వాల్సిందే. న్యూజిలాండ్ త‌మ తదుప‌రి మ్యాచ్‌లో బుధ‌వారం శ్రీలంక‌తో త‌ల‌ప‌డ‌నుంది. పాక్ విష‌యానికి వ‌స్తే ఫిబ్ర‌వ‌రి 24న ఇంగ్లండ్‌తో ఆడ‌నుంది.

IND W vs AUS W 3rd T20I: India Beat Australia Won Series8
ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. సిరీస్‌ మనదే

ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత మహిళా క్రికెట్‌ జట్టు విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పదిహేడు పరుగుల తేడాతో ఓడించి 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడేందుకు భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆసీస్‌ వుమెన్‌ టీమ్‌తో తొలి టీ20లో గెలుపొందిన భారత్‌.. రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.స్మృతి మంధాన ధనాధన్‌ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20 జరిగింది. అడిలైడ్‌ వేదికగా టాస్‌ గెలిచిన హర్మన్‌ సేన.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో స్మృతి మంధాన 55 బంతుల్లో 82 పరుగులతో ఇరగదీయగా.. షఫాలి వర్మ (7) విఫలమైంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ అర్ధ శతకం (59)తో సత్తా చాటగా రిచా ఘోష్‌ 18 పరుగులు చేసింది.కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 2 పరుగులతో అజేయంగా నిలవగా.. అమన్‌జోత్‌ కౌర్‌ (1), దీప్తి శర్మ (1) రనౌట్‌ అయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్‌ 176 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ రెండు వికెట్లు తీయగా.. కిమ్‌ గార్త్‌, కెప్టెన్‌ సోఫీ మొలినెక్స్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.చెలరేగిన శ్రేయాంక, శ్రీచరణిఇక లక్ష్య ఛేదనలో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 159 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఓపెనర్లు జార్జియా వోల్‌ (10), బెత్‌ మూనీ (6) సహా ఎలిస్‌ పెర్రీ (1) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోబే లిచిఫీల్డ్‌ (26) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆష్లే గార్డ్‌నర్‌ హాఫ్‌ సెంచరీ (57) చేసింది. కానీ మిగిలిన వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్, శ్రీచరణి తలా మూడు వికెట్లు తీసి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. అరుంధతి రెడ్డి రెండు, రేణుకా సింగ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. స్మృతి మంధానకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

IND vs SA Except the openers: Suryakumar Yadav on Batting Flexibility9
వాళ్ల గురించే నా బాధంతా!: ఇచ్చిపడేసిన సూర్యకుమార్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు తాము సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసుకుంటామని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ ఎలా ఉన్నా వ్యూహాలకు తగినట్లు ఆడటంలో తమ బ్యాటర్లు దిట్ట అని సూర్య అన్నాడు.కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో సూపర్‌-8 దశలో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. కాగా గ్రూప్‌ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లను గెలిచాయి భారత్‌, సౌతాఫ్రికా.ప్రతికూల అంశాలు ఇవేఅయితే, గ్రూప్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) డకౌట్‌ కావడం.. భారత బ్యాటర్లు స్పిన్‌ బౌలింగ్‌లో తడబడటం వంటివి ప్రతికూలాంశాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఐడెన్‌ మార్క్రమ్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌లతో కూడిన స్పిన్‌ దళంతో అటాక్‌ చేసే అవకాశం ఉంది.వాళ్ల గురించే నా బాధంతా!ఈ విషయాల గురించి టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) తాజాగా స్పందించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ శర్మ సరిగ్గా ఆడటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో.. ఆ వ్యక్తుల గురించే నేను ఎక్కువగా వర్రీ అవుతున్నా.అతడిని ఎదుర్కొనే ప్రత్యర్థుల గురించే నా బాధంతా!.. గతేడాది అతడు అదరగొట్టాడు. తిరిగి ఫామ్‌ అందుకుంటాడు. ఇక మా జట్టులో ఓపెనర్లు తప్ప 3-8 మధ్య ప్రతీ బ్యాటర్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ 8-9 ఓవర్ల వరకు వికెట్‌ పడకపోతే.. శివం దూబే లేదంటే హార్దిక్‌ పాండ్యా టాప్‌నకు ప్రమోట్‌ అవుతారు.సమస్య లేదునాతో సహా జట్టులో ప్రతి ఒక్కరి బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారుతూనే ఉంటుంది. రైటార్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ లేదంటే ఇంకెవరైనా బౌలింగ్‌ చేసినా వారిని ఎదుర్కోగల సత్తా మా వాళ్లకు ఉంది. కాబట్టి బౌలర్లు ఎవరన్న అంశంతో మాకు సంబంధం లేదు. మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తనకంటూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఎవరి గేమ్‌ప్లాన్‌ వారికి స్పష్టత ఉంది. కాబట్టి సమస్య లేదు’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ తన జట్టు పట్ల ఆత్మవిశ్వాసం కనబరిచాడు.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

We Will expose under pressure India: SA Coach Conrad ahead Super 8 clash10
ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదే: సౌతాఫ్రికా కోచ్‌

సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌ షుక్రి కన్రాడ్‌ టీమిండియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్‌ సేన ఒత్తిడిలో ఉందని.. ఇదే అదునుగా తాము ఆ జట్టు బలహీనతలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత జట్టు​ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్‌-8కుఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో సత్తా చాటి.. సొంతగడ్డపై వరల్డ్‌కప్‌-2026లో హాట్‌ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచి సూపర్‌-8కు అర్హత సాధించింది. మరోవైపు.. సౌతాఫ్రికా సైతం వరుస విజయాలతో సూపర్‌-8కు దూసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య (IND vs SA) ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌ జరుగనుంది.ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదేఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్‌కోచ్‌ షుక్రి కన్రాడ్‌ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా వంటి జట్టు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆ జట్టుపై అంచనాలు భారీగా ఉంటాయి. స్క్రూటినీ కూడా ఎక్కువే. అందుకే వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతారు.సెమీ ఫైనల్‌.. ఆపై ఫైనల్‌ చేరాలనే ఒత్తిడి మిగతావారితో పోలిస్తే వారిపై ఒకింత ఎక్కువగానే ఉంటుంది. దానిని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఒత్తిడిలో బలహీనపడే ఆ జట్టుపై పైచేయి సాధించి.. వారి బలహీనతలను ప్రపంచానికి చూపిస్తాం’’ అని పేర్కొన్నాడు. అయితే, పటిష్ట టీమిండియాతో తలపడినపుడు తమపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. భారత్‌దే ఆధిపత్యంకాగా ఇటీవల సౌతాఫ్రికా భారత్‌లో పర్యటించింది. టీ20 సిరీస్‌లో టీమిండియా చేతిలో 3-1తో ఓడిపోయింది. అయితే, వరల్డ్‌కప్‌ వంటి టోర్నీలలో ఇలాంటి గత రికార్డుల ప్రభావం ఎక్కువగా ఉండదని కన్రాడ్‌ పేర్కొనడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌- సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఏడుసార్లు పోటీ పడగా.. టీమిండియా ఐదు, సౌతాఫ్రికా రెండుసార్లు గెలిచాయి.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement