ప్రధాన వార్తలు
13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2026లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ను చాటుకున్నాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన వెంటనే అద్భుత ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. అంతేకాకుండా 13 ఏళ్ల పాత రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వాంఖడే వేదికగా నిన్న (మే 4) లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో దుమురేపాడు. భారీ లక్ష్య ఛేదనలో కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఓ భారీ వ్యక్తిగత రికార్డు నెలకొల్పాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల (7) రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు ఓ ఇన్నింగ్స్లో అత్యధికంగా 6 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అదీ 13 ఏళ్ల కిందట తొలిసారి ఈ ఫీట్ను సాధించాడు. 2013 ఎడిషన్లో ఇదే వాంఖడే వేదికగా పంజాబ్పై సిక్సర్ల సిక్సర్ కొట్టాడు. ఆతర్వాత 3 సార్లు ఒకే ఇన్నింగ్స్లో 6 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో రెండు సెంచరీలు చేసినా, వాటిలోనూ తలా ఐదు సిక్సర్లు మాత్రమే బాదాడు.తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లో రోహిత్ అలవోకగా సిక్సర్లు బాదుతుంటే చూడముచ్చటగా ఉండింది. వింటేజ్ రోహిత్ శర్మను గుర్తు చేసింది. ఈ మ్యాచ్లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సహచర ఓపెనర్ ర్యాన్ రికెల్టన్తో కలిసి తొలి వికెట్కు ఏకంగా 143 పరుగులు జోడించి, గెలుపుకు బలమైన పునాది వేశాడు.రోహిత్-రికెల్టన్ వీరవిహారం చేయడంతో లక్నో నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ సునాయాసంగా (మరో 8 బంతులు మిగిలుండగానే) ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యధిక ఛేదనగానూ నిలిచింది. ఈ గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధిస్తే, ప్లే ఆఫ్స్ రేసులో ఉండే అవకాశం ఉంది. మే 10న జరిగే తదుపరి మ్యాచ్లో ముంబై ఆర్సీబీతో తలపడనుంది. ఆతర్వాతి మ్యాచ్ల్లో పంజాబ్, కేకేఆర్, రాజస్థాన్ జట్లను ఢీకొట్టాల్సి ఉంది.
అర్జున్ టెండుల్కర్ను ఎందుకు ఆడించట్లేదు?
గత రెండేళ్లుగా ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్. గతేడాది మెగా వేలంలో అతడి కోసం పోటీ పడి మరీ లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా లీగ్ చరిత్రలోనే అతడు అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలిచాడు.బ్యాటర్గా, సారథిగా విఫలంఈ క్రమంలో పంత్కు లక్నో కెప్టెన్గా పగ్గాలు అప్పగించిన యాజమాన్యం.. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma) మాదిరి ఐపీఎల్లో దిగ్గజ సారథి అవుతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, పంత్ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలోనూ విఫలమవుతున్నాడు.గతేడాది 13 ఇన్నింగ్స్ ఆడిన పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. కెప్టెన్గా జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఈ ఏడాది లక్నో పరిస్థితి ఇంకా దిగజారింది. ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది లక్నో. ముంబై ఇండియన్స్తో సోమవారం నాటి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓడి ఏడో పరాజయాన్ని నమోదు చేసింది.High, Handsome and 2⃣ points 💙@mipaltan seal their highest run-chase in #TATAIPL history ✌️Scorecard ▶️ https://t.co/elXSOvaeig #KhelBindaas | #MIvLSG pic.twitter.com/G5rSddXCbc— IndianPremierLeague (@IPL) May 4, 2026వ్యూహాత్మకంగా వ్యవహరించాలిఈ నేపథ్యంలో పంత్ కెప్టెన్సీపై విమర్శలు వస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ... ‘‘పంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నాడు. ముంబైతో మ్యాచ్లో ప్రిన్స్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు.అర్జున్ టెండుల్కర్ను ఎందుకు ఆడించట్లేదు?ఎందుకంటే అతడు యార్కర్లు సంధించడంలో సఫలమయ్యాడు. అతడు ఒక్కడే రాణించగలిగాడు. కెప్టెన్గా పంత్ మిగతా బౌలర్లనూ అదే ఫార్ములా పాటించమని చెప్పాలి. నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో చూశాను.. అందులో అర్జున్ టెండుల్కర్ నెట్స్లో మంచిగా యార్కర్లు వేస్తున్నాడు.కాబట్టి పంత్ అతడిని తుదిజట్టులో ఆడిస్తే బాగుండేది’’ అని మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. ఇక గతంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా.. పంత్ ధోని, రోహిత్ అంతటి వాడు కావాలని ఆశించిన విషయం ప్రస్తావనకు రాగా.. ‘‘ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ కెప్టెన్లుగా చాలా భిన్నమైనవారు. వారితో పోలిక సరికాదు’’ అని మనోజ్ తివారీ పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండుల్కర్ను లక్నో ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను ఇప్పటి వరకు బెంచ్కే పరిమితం చేసింది లక్నో నాయకత్వ బృందం. ఇప్పటి వరకు ఈ సీజన్లో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చదవండి: జై శ్రీరామ్.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ
జై శ్రీరామ్.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ
ఐపీఎల్లో పద్నాలుగేళ్లకే సంచలనాలు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో గుజరాత్పై) నమోదు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు.ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఐపీఎల్-2026 సందర్భంగా తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. వైభవ్ (Vaibhav Suryavanshi) వైభవం ఇలా ఉంటే.. రఘు శర్మ (Raghu Sharma)ది మరో కథ.33 ఏళ్ల వయసులో...పంజాబ్కు చెందిన లెగ్ స్పిన్నర్ రఘు శర్మ. అతడి వయసు ఇప్పుడు 33 ఏళ్లు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటినా ఐపీఎల్లో అరంగేట్రం కోసం అతడు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వచ్చింది. రఘును తొలుత నెట్బౌలర్గా చేర్చుకున్న ముంబై ఇండియన్స్.. గతేడాది వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.అరంగేట్ర మ్యాచ్లో అలాకానీ.. 2025లో రఘు శర్మకే బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే, ఈ ఏడాది ఎట్టకేలకు అతడిని ముంబై యాజమాన్యం కరుణించింది. చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా రఘు ముంబై తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్లో పూర్తి నాలుగు ఓవర్ల కోటా వేసిన రఘు శర్మ.. 24 పరుగులే ఇచ్చాడు.ఇప్పుడిలా..పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ చెన్నైతో మ్యాచ్లో రఘు వికెట్లు తీయలేకపోయాడు. అయితే, తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మాత్రం అతడి కల నెరవేరింది. లక్నో అరంగేట్ర బ్యాటర్ అక్షత్ రఘువన్షి (11) రూపంలో రఘు శర్మ ఐపీఎల్లో తన తొలి వికెట్ తీశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. #RaghuSharma makes a statement with that wicket 🔥Years of hard work and belief are finally paying off. 💙🙌🏻#TATAIPL Revenge Week 2026 ➡️ #MIvLSG | LIVE NOW 👉https://t.co/hc4PVkY1Pc pic.twitter.com/QFbQB1OeRg— Star Sports (@StarSportsIndia) May 4, 2026ఈ నేపథ్యంలో రఘు శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, దూకుడుగా సెలబ్రేట్ చేసుకోకుండా.. తన జేబులో నుంచి ఓ పేపర్ తీసి డ్రెసింగ్రూమ్ వైపు చూపించాడు ఈ లెగ్ స్పిన్నర్. అందులో..ఆ బాధ నేటితో తీరిపోయింది‘‘రాధే రాధే. గత పదిహేనేళ్లు ఎంతో బాధగా గడిచాయి. అయితే, ఆ గురుదేవుడి దయ వల్ల ఆ బాధ నేటితో తీరిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్కు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను. జై శ్రీరామ్’’ అని రఘు శర్మ రాశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో సోమవారం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ముంబై 18.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్నోను ఆరు వికెట్ల తేడాతో ఓడించి సీజన్లో పదింట తమ మూడో విజయాన్ని నమోదు చేసింది.చదవండి: నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్!
అదృష్టం ఉండాలి.. వాళ్లను తప్పుబట్టను: పంత్
లక్నో సూపర్ జెయింట్స్ రాత మారలేదు. ముంబై ఇండియన్స్తో సోమవారం నాటి మ్యాచ్లో పరాజయం పాలైంది. తద్వారా ఐపీఎల్-2026లో వరుసగా ఆరో (డబుల్ హ్యాట్రిక్) ఓటమి నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారుఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమిపై లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మేము శుభారంభం అందుకున్నాం. అయితే, అదే ఆట తీరు కొనసాగించి మరికొన్ని పరుగులు రాబడితే ఇంకా బాగుండేది. ఈ మ్యాచ్లో మాకూ సానుకూలాంశాలు ఉన్నాయి.కానీ అవేంటో ఇప్పుడు చెప్పలేను. మా వాళ్లు స్వేచ్ఛగా ఆడారు. అయితే, ఆఖర్లో ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సొంతమైదానం కాబట్టి ఇక్కడి పిచ్ పరిస్థితులకు వాళ్లు బాగా అలవాటు పడ్డారు. ముందుగా చెప్పినట్లు మేము ఇంకో 10-15 పరుగులు చేసి ఉంటే బాగుండేది.వారిని తప్పుపట్టలేనుఈ వికెట్ మీద 220-230 పరుగులు చేయడం కాస్త సులువే. ఆరంభంలో మాదే పైచేయిగా ఉంది. బౌలర్లను ఓటమికి బాధ్యులను చేయలేను. వారిని తప్పుపట్టలేను. మా బౌలర్లు అత్యద్భుతంగా బౌల్ చేశారు’’ అని పంత్ పేర్కొన్నాడు.అదృష్టం కావాలయ్యా!ఈ క్రమంలో..‘బాగానే ఆడుతున్నారు. అయినా ఓడిపోతున్నారు. మీ జట్టుకు ఇంకేం కావాలి?’ అని హోస్ట్ అడుగగా.. ‘‘మాకు కొంచెం అదృష్టం కావాలయ్యా!.. అదొక్కటే నేను ఇప్పుడు చెప్పగలను’’ అని పంత్ సమాధానం ఇచ్చాడు. ‘ఎలాంటి అదృష్టం?’ అని హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘మాకు ఆశీర్వాదాలు కావాలి. మేము ఇంకాస్త పట్టుదలగా ముందుకు సాగాలి’’ అని పంత్ బదులిచ్చాడు.పూరన్ బ్యాట్ ఝులిపించినా..కాగా వాంఖడే వేదికగా టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. నికోలస్ పూరన్ విధ్వంసకర అర్ధ శతకం (21 బంతుల్లో 63)తో మెరవగా.. మార్క్రమ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) తమ వంతు సాయం అందించారు. ఇక పంత్ 15 పరుగులే చేశాడు.High, Handsome and 2⃣ points 💙@mipaltan seal their highest run-chase in #TATAIPL history ✌️Scorecard ▶️ https://t.co/elXSOvaeig #KhelBindaas | #MIvLSG pic.twitter.com/G5rSddXCbc— IndianPremierLeague (@IPL) May 4, 2026అయితే, ముంబై ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (32 బంతుల్లో 83), రోహిత్ శర్మ (44 బంతుల్లో 84) ఆకాశమే హద్దుగా చెలరేగి లక్నోకు షాకిచ్చారు. వీరిద్దరితో పాటు నమన్ ధిర్ (12 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులు మెరిపించగా.. 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. లక్నోను ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వాంఖడేలో ఈ సీజన్లోవరుసగా నాలుగు ఓటముల తర్వాత తొలి విజయం నమోదు చేసింది.చదవండి: నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్!
తన పరువు తానే తీసుకున్న బాబర్ ఆజం!
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం కల ఎట్టకేలకు నెరవేరింది. అతడి సారథ్యంలో పెషావర్ జెల్మీ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)-2026 టైటిల్ గెలిచింది. హైదరాబాద్ కింగ్స్మెన్తో ఆదివారం జరిగిన పోరులో పెషావర్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.తద్వారా తొలిసారి పీఎస్ఎల్లో చాంపియన్గా అవతరించింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam).. ఈ మ్యాచ్లో మాత్రం గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. రాణించిన ఆరోన్ హార్డీఅయినప్పటికీ హైదరాబాద్ విధించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పెషావర్ విజయవంతంగా ఛేదించింది. ఆరోన్ హార్డీ (39 బంతుల్లో 56 నాటౌట్), అబ్దుల్ సమద్ (34 బంతుల్లో 48) రాణించి జట్టును గెలిపించారు.దీంతో తొలిసారి పీఎస్ఎల్ టైటిల్ గెలిచిన ఆనందంలో బాబర్ ఆజం ఎగిరి గంతేశాడు. ముఖ్యంగా ట్రోఫీ అందుకునే సమయంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ శైలిని అనుకరించబోయి నెటిజన్ల చేతికి చిక్కాడు. రోబో మాదిరి నడిచి వెళ్లి..కాగా 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ను విజేతగా నిలిపిన సారథి రోహిత్.. రోబో మాదిరి నడుచుకుంటూ వెళ్లి ట్రోఫీ అందుకుని సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే, ఇప్పుడు బాబర్ కూడా అదే స్టైల్లో వెళ్లి ట్రోఫీ తీసుకోవాలనుకున్నాడు. కానీ రోబో మాదిరి కాకుండా వెనుక నుంచి ఎవరో తరిమినట్లుగా చిన్న పిల్లాడిలా పరిగెత్తుకు వచ్చి ట్రోఫీ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Babar Azam tried to copy Rohit Sharma’s ICC Men's T20 World Cup celebration but turned a legendary moment into a meme 😭😭😭 pic.twitter.com/xrxjxsRI55— Ankur (@flick_class) May 4, 2026రోహిత్ను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడుదీంతో.. ‘‘రోహిత్ శర్మను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడు. మీమర్లకు పండుగ చేసుకునే అవకాశం ఇచ్చాడు’’ అంటూ బాబర్ ఆజంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా పీఎస్ఎల్ తాజా సీజన్లో బాబర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. పదకొండు మ్యాచ్లలో కలిపి 588 పరుగులు సాధించి.. టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.కాగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్లో పీఎస్ఎల్ మ్యాచ్లు నిర్వహించింది. ప్లే ఆఫ్స్నకు ప్రేక్షకులను అనుమతించినా ప్రజా రవాణా ద్వారానే స్టేడియానికి చేరుకోవాలనే షరతు పెట్టింది. ఏదేమైనా మరోసారి ఐపీఎల్కు పోటీగా వచ్చి బొక్కబోర్లా పడింది. కాగా మార్చి 26 నుంచి మే 3 వరకు పీఎస్ఎల్ తాజా ఎడిషన్ నడించింది.చదవండి: ఐపీఎల్లో మరో సిక్సర్ల చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీలాగే..!
నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్!
టీమిండియా ప్రధాన పేసర్, ముంబై ఇండియన్స్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఆట తీరుపై భారత దిగ్గజం సునిల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బుమ్రా వంటి ప్రపంచస్థాయి బౌలర్ ‘ఇలాంటి’ తప్పు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదన్నాడు. ఇంతకీ బూమ్ బూమ్ బుమ్రా ఏం చేశాడంటే?..ఐపీఎల్-2026లో ఏడు ఓటములతో దాదాపుగా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయిన దశలో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై చెలరేగిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా ముంబై సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు లక్నోను బ్యాటింగ్కు ఆహ్వానించింది.చెలరేగిన నికోలస్ పూరన్ఎట్టకేలకు నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63) చెలరేగడంతో లక్నో భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మిగతా వారిలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (44), ఐడెన్ మార్క్రమ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) రాణించారు.రెండు నో బాల్స్ఇదిలా ఉంటే.. లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న వేళ బుమ్రా (Jasprit Bumrah) పద్నాలుగో ఓవర్లో బంతితో రంగంలోకి దిగాడు. బుమ్రా బౌలింగ్లో తొలి బంతికి మార్క్రమ్ సింగిల్ తీయగా.. రెండో బంతికి పరుగులేమీ రాలేదు.ఇక మూడో బంతికి హిమ్మత్ సింగ్కు సంధించగా.. అది నో బాల్ అయింది. ఆ తర్వాత బంతి వైడ్గా వెళ్లింది. ఆ వెంటనే బుమ్రా మళ్లీ నో బాల్ వేశాడు. ఈ ఓవర్లో బుమ్రా మొత్తంగా ఏడు పరుగులే ఇచ్చినప్పటికీ రెండు నోబాల్స్ వేయడం విమర్శలకు దారితీసింది.🎥 Wickets that didn't count, no-balls, and bat flying out of hands 👀The most eventful over of the season? 🤷♂️Updates ▶️ https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/4OQj5C9R49— IndianPremierLeague (@IPL) May 4, 2026గావస్కర్ ఫైర్ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ బుమ్రా ఆట తీరుపై మండిపడ్డాడు. ‘‘ఇది అస్సలు ఆమోదయోగ్యనీయం కాదు. నువ్వొక ప్రొఫెషనల్ క్రికెటర్వి బుమ్రా. వైడ్లు వేస్తున్నావంటే అర్థం చేసుకోగలను. కానీ నో బాల్స్ వేయడమేంటి?’’ అని కామెంట్రీ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఈ మ్యాచ్లో బుమ్రా చెత్త ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 45 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ఎట్టకేలకు ఓ విజయంఇక ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (84), రికెల్టన్ (83) చెలరేగడంతో లక్నో విధించిన 229 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఆరు వికెట్లతో లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచింది. వరుసగా మూడు ఓటముల తర్వాత ముంబైకి ఈ కీలక విజయం దక్కింది. మరోవైపు లక్నో వరుస ఓటముల్లో ‘సిక్సర్’ నమోదు చేసింది. వరుసగా ఆరో పరాజయంతో జట్టు అట్టడుగున పదో స్థానంలోనే ఉంది. చదవండి: మాట తప్పిన రిషబ్ పంత్!
రోహిత్, రికెల్టన్ ఊచకోత.. లక్నోపై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రోహిత్, రికెల్టన్ ఊచకోత229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోయారు. రోహిత్ శర్మ (83), రికెల్టన్ (84) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరు తొలి వికెట్కు 10.5 ఓవర్లలో ఏకంగా 143 పరుగులు జోడించి గెలుపు ఖాయం చేశారు. అనంతరం తిలక్ వర్మ (11), సూర్యకుమార్ యాదవ్ (12) తక్కువ స్కోర్లకే ఔటైనా, నమన్ ధిర్ (23 నాటౌట్), విల్ జాక్స్ (10 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో మణిమారన్ సిద్దార్థ్ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, మొహిసిన్ ఖాన్ తలో వికెట్ తీశారు..పూరన్ విధ్వంసంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63; ఫోర్, 8 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, సిక్స్), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడారు. మిగతా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ 13, కెప్టెన్ పంత్ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2 వికెట్లు తీయగా.. ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.
చారిత్రక సిరీస్లో పసికూనపై పాకిస్తాన్ ప్రతాపం
జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు జింబాబ్వేపై ప్రతాపం చూపింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా కరాచీ వేదికగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్లో పాక్ 168 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సదాఫ్ షమాస్ (98) తృటిలో సెంచరీ మిస్ కాగా.. మరో ఓపెనర్ గుల్ ఫిరోజా (50), వన్డౌన్ బ్యాటర్ సిద్రా అమీన్ (67), మిడిలార్డర్ బ్యాటర్ నజిహా అల్వి (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లలో అయేషా జాఫర్ 3, ఆలియా రియాజ్ 2, కెప్టెన్ ఫాతిమా సనా 11 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ప్రెసియస్ మరంగే 3 వికెట్లతో రాణించగా.. కుద్జాయ్ చిగోరా, కెప్టెన్ నోమ్వెలో సిబండ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పసికూన జింబాబ్వే చేతులెత్తేసింది. బిలవ్డ్ బిజా (53) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఓపెనర్ కెలిస్ (31) ఓ మోస్తరు స్కోర్ చేసింది. మిగతా ప్లేయర్లలో కెల్లీ (11), మెలిండ (10), సిబండ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, తస్మియా రుబాబ్, సయ్యదా ఆరూబ్ షా తలో 2 వికెట్లు పడగొట్టగా.. మొమినా రియాసత్, నష్రా సంధు చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్లోని రెండో వన్డే ఇదే కరాచీ వేదికగా మే 6న జరుగనుంది. కాగా, వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది.
మాట తప్పిన రిషబ్ పంత్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్లో ఎంట్రీ ఇచ్చి వరుసగా తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరి లక్నో సూపర్జెయింట్స్ సంచలనం సృష్టించింది. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం లక్నో దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించిన లక్నో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. తాజాగా సోమవారం ముంబై ఇండియన్స్తో లక్నో సూపర్జెయింట్స్ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో లక్నో కెప్టెన్ పంత్ ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పేరును ప్రస్తావించాడు. తాను పేలవ ఫామ్ను అధిగమించి ముంబైతో మ్యాచ్లో పరుగులు సాధిస్తానని సంజీవ్ గోయెంకాకు మాట ఇచ్చినట్లు స్పష్టం చేశాడు. అయితే మ్యాచ్లో కేవలం 15 పరుగులు చేసిన పంత్ సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘టాస్ మేము గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. ఎందుకంటే వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎంత లక్ష్యాన్నైనా అవలీలగా ఛేదించొచ్చు. నిజానికి ఈ సీజన్ను మేము మంచి ఈజ్తో ప్రారంభించాము. కానీ మధ్యలో నిలకడ కోల్పోయి వరుస ఓటములు చవిచూస్తూ వచ్చాం. జట్టుగా విఫలమైనప్పటికీ సంజీవ్ గోయెంకా మాపై నమ్మకముంచారు. ఆయనకు క్రికెట్ అంటే అపారమైన ఇష్టం. అయితే ఆయన అంచనాలను, అభిమానుల ఆశలను అందుకోవడంలో విఫలమయ్యాం. కానీ ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్లో భారీ స్కోర్లు సాధించి సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టకుంటాం. 200 శాతం కష్టపడి విజయాలు సాధించి అభిమానులను, ఫ్రాంచైజీని సంతృప్తి పరుస్తామని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఇక లక్నో కెప్టెన్ పంత్ ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 204 పరుగులు సాధించాడు.అయితే ముంబైతో మ్యాచ్లో పంత్ 15 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. పూరన్ (21 బంతుల్లో 63), మార్ష్ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్తో అలరించారు.చదవండి: లక్నోతో మ్యాచ్కు హార్దిక్ దూరం.. కారణమిదే!
ఐపీఎల్లో మరో సిక్సర్ల చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీలాగే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సిక్సర్ల చిచ్చరపిడుగును పరిచయం చేసింది. 2026 ఎడషన్లో భాగంగా ఇవాళ (మే 4) ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో 22 ఏళ్ల అక్షత్ రఘువంశీ అనే మెరుపు వీరుడు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. అక్షత్ వచ్చీ రాగానే ఓ భారీ సిక్సర్ల రికార్డు సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్శించాడు.అక్షత్ ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి అరుదైన రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. అక్షత్కు ముందు రాబ్ క్వీని (రాజస్థాన్), కెవాన్ కూపర్ (రాజస్థాన్), ఆండ్రీ రసెల్ (కేకేఆర్), కార్లోస్ బ్రాత్వైట్ (ఢిల్లీ), అనికేత్ చౌదరి (ఆర్సీబీ), జేవన్ సీల్స్ (కేకేఆర్), సిద్దేశ్ లాడ్ (ముంబై), మహీశ్ తీక్షణ (సీఎస్కే), సమీర్ రిజ్వి (సీఎస్కే), వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్) ఈ ఘనత సాధించారు.ఈ సీజన్ వేలంలో అక్షత్కు లక్నో రూ. 2.2 కోట్లకు దక్కించుకుంది. అక్షత్ తన డెబ్యూ క్యాప్ను తన ఆరాధ్య ఆటగాడు రోహిత్ శర్మ నుంచి తీసుకున్నాడు. అక్షత్ 2025 మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్లో ఓ మ్యాచ్లో 56 బంతుల్లో 115 పరుగులు చేసిన అక్షత్పై లక్నో సూపర్ జెయింట్స్ అప్పుడే కన్నేసింది.అక్షత్కు దేశవాలీ క్రికెట్లోనూ ఓ అదిరిపోయే రికార్డు ఉంది. 2021-22 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున అరంగేట్రం చేసిన అతను.. తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసి రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి బంతికే సిక్సర్ బాదిన అక్షత్ ఆతర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 7 బంతుల్లో సిక్సర్ సాయంతో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో 19 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (44), పూరన్ (63) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారు. మార్క్రమ్ (29), హిమ్మత్ సింగ్ (37) క్రీజ్లో ఉన్నారు.
అదరగొట్టిన భారత్
హోర్సెన్స్ (డెన్మార్క్): తమదైన రోజున సహజశైలిలో ...
సెమీఫైనల్లో తొలిసారి ‘లక్కీ లూజర్’
మూడు పుష్కరాల చరిత్ర ఉన్న మహిళల టెన్నిస్ సంఘం (డబ...
పట్టుదలే పెట్టుబడిగా...
విశ్వ వేదికపై ఆసియా దేశాల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో ...
‘ఎల్లో’ కార్డులపై సడలింపులు!
వాషింగ్టన్: రాబోయే ఫుట్బాల్ ప్రపంచ కప్లో అగ్రశ...
రోహిత్, రికెల్టన్ ఊచకోత.. లక్నోపై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్లో...
చారిత్రక సిరీస్లో పసికూనపై పాకిస్తాన్ ప్రతాపం
జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్తాన...
మాట తప్పిన రిషబ్ పంత్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్లో ఎ...
ఐపీఎల్లో మరో సిక్సర్ల చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీలాగే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సిక్సర్ల చిచ్చరపిడుగ...
క్రీడలు
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్..సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
వీడియోలు
IPLలో నేడు డబుల్ ధమాకా
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
IPL గేమ్ ఛేజింగ్ రూల్, IPL 2026లో 200+ పరుగుల వరద
వైభవ్ బ్యాటింగ్ పై గర్ల్ ఫ్రెండ్ ప్రశంసలు.. మొహం మాడ్చుకున్న అర్షదీప్
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
చితక్కొట్టిన సన్ రైజర్స్
244 టార్గెట్ ఊదేశారు.. SRHకి వరుసగా ఐదో విజయం
రియాన్ పరాగ్ అరెస్ట్ ?
