Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND vs NZ 3rd ODI: Mitchell-Phillips tons help New Zealand post 337-81
మిచెల్‌, ఫిలిప్స్‌ సెం‍చరీలు.. భారత్‌ ముందు భారీ టార్గెట్‌

ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే(5), హెన్రీ నికోల్స్‌(0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచిల్‌.. విల్ యంగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. యంగ్‌(30) ఔటయ్యాక అసలు కథ మొదలైంది. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్‌, మిచెల్ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని అర్ష్‌దీప్ సింగ్ బ్రేక్ చేశాడు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137 పరుగులు చేయగా.. ఫిలిప్స్ కేవలం 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో బ్రేస్‌వెల్‌(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సిరాజ్, కుల్దీప్ త‌లా వికెట్ సాధించారు. ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి క‌నీసం ఒక్క వికెట్ కూడా సాధించ‌లేక‌పోయాడు. కాగా డారిల్‌ మిచెల్‌కు ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్‌

Daryl Mitchell hits second straight ODI ton, fourth consecutive 50-plus score vs India2
టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్‌

సనత్ జయసూర్య, రికీ పాంటింగ్‌, కుమార సంగ్కకర, మహేలా జయవర్దనే, ఏబీ డివిలియర్స్‌.. వీరంతా ఒకప్పుడు భారత జట్టుపై ఆధిపత్యం చెలాయించిన దిగ్గజ బ్యాటర్లు. ముఖ్యంగా వీరిందరికి వన్డేల్లో భారత్‌పై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు వారి బాటలోనే అడుగులు వేస్తున్నాడు న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్‌. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. ఆసీస్ స్టార్‌ ట్రావిస్ హెడ్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌కు తలనొప్పిగా మారితే.. మిచెల్ మాత్రం దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి ప్రత్యర్ధి భారత్ అయితే చాలు చెలరేగిపోతాడు.మిచెల్ సెంచ‌రీల మోత‌..మిచెల్ కాస్త లేటుగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటికి.. అతి తక్కువ సమయంలోనే మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) తనదైన ముద్రవేసుకున్నాడు. ముఖ్యంగా అతడికి భారత్‌పై అసాధరణ వన్డే రికార్డు ఉంది. స్పిన్‌ను సమర్ధవంతంగా ఆడే మిచెల్ ఉపఖండ పిచ్‌లపై సత్తాచాటుతున్నాడు.వన్డే ప్రపంచకప్‌-2023లో కూడా ఆతిథ్య టీమిండియాను మిచెల్ గడగడలాడించాడు. సెమీఫైన‌ల్ అయితే త‌న విరోచిత సెంచ‌రీతో భార‌త్‌ను ఓడించే అంత‌ప‌నిచేశాడు. అంత‌కుముందు లీగ్ మ్యాచ్‌లో కూడా భార‌త్‌పై సెంచరీ సాధించాడు. దీంతో వ‌న్డే ప్రపంచకప్‌లో భారత్‌పై రెండు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను తాజా ప‌ర్య‌ట‌న‌లో అత‌డు కొన‌సాగిస్తున్నాడు.ప్ర‌స్తుతం భార‌త్‌తో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో అత‌డు ప‌రుగులు వర‌ద పారిస్తున్నాడు. తొలి వ‌న్డేలో 84 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన మిచెల్‌.. ఆ త‌ర్వాత రాజ్‌కోట్‌లో విరోచిత సెంచ‌రీతో చెల‌రేగాడు. మ‌ళ్లీ ఇప్పుడు సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలోనూ శ‌త‌క్కొట్టాడు. మిచెల్ భార‌త్‌లో త‌ను ఆడిన చివ‌రి ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగుల సెంచరీలు బాదేశాడు. భార‌త్‌పై వ‌న్డేల్లో అత‌డి స‌గ‌టు దాదాపు 70గా ఉంది. ఇది చాలా మంది దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాలేదు.రెండో ప్లేయర్‌గా..భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా మిచెల్‌ నిలిచాడు. మిచెల్‌ ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీలు మొత్తం భారత్‌లోనే రావడం గమనార్హం. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో నాథన్ ఆస్టిల్(5) అగ్రస్ధానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే ఆస్టిల్‌ను మిచెల్‌ అధిగమిస్తాడు.చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో షాక్‌..

Internet Slams Gautam Gambhir As Arshdeep Singh Strikes In 1st Over On Return3
గంభీర్ చూశావా? తొలి ఓవర్‌లోనే వికెట్‌! వీడియో వైరల్‌

రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత తుది జట్టులోకి వచ్చిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. తొలి ఓవర్‌లోనే తన మార్క్ చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే కివీస్ ఓపెనర్ హెన్రీ నికోల్స్‌ను పెవిలియన్ పంపి భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గిల్‌ బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించేందుకు కొత్త బంతిని అర్ష్‌దీప్ చేతికి ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని ఈ పంజాబ్ పేసర్ వమ్ముచేయలేదు. తన వేసిన తొలి ఓవర్ రెండో బంతికి డెవాన్ కాన్వే ఫోర్ బాదినా.. అర్ష్‌దీప్ ఏమాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు.అదే ఓవర్ ఐదో బంతికి అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో నికోల్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలో తొలి రెండు వ‌న్డేల్లో అర్ష్‌దీప్‌కు అవ‌కాశ‌మివ్వ‌ని హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌ను నెటిజ‌న్లు ట్రోలు చేస్తున్నారు. ఇటువంటి బౌల‌ర్‌ను ఎలా ప‌క్క‌న పెట్టావు? అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.మొద‌టి రెండు వ‌న్డేల్లో అర్ష్‌దీప్ బెంచ్‌కే పరిమిత‌మ‌య్యాడు. దీంతో అశ్విన్ మాజీలు గంభీర్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో ఎట్ట‌కేల‌కు సిరీస్ డిసైడ‌ర్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌కు అవ‌కాశం ద‌క్కింది. ఈ పంజాబ్ స్పీడ్ స్టార్ ప్ర‌సిద్ద్ కృష్ణ స్దానంలో తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్(వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్Arshdeep Singh has always been a wicket taker for India in every format.Still Gautam Gambhir used to bench him in most of the games. Jasprit Bumrah and Arshdeep will be the key in the T20 World Cup and the 2027 WC if Gambhir does not play politics 🔥🙇pic.twitter.com/tBcjoU9R2v— Tejash (@Tejashyyyyy) January 18, 2026

Bangladesh get rejected by Ireland over T20 World Cup group swap proposal4
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో షాక్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో పాల్గోనేందుకు త‌మ జ‌ట్టును భార‌త్‌కు పంప‌బోమ‌ని మొండి ప‌ట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో భారీ షాక్ త‌గిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను క్రికెట్ ఐర్లాండ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతామని ఐరీష్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూపు-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లా జట్టు తమ గ్రూపు మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఈ మెగా టోర్నీ కోసం భారత్‌కు రాబోమని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా, బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ భేటిలో బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో సరికొత్త ప్రతిపాదనను ఉంచింది. గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్‌తో తమ గ్రూపును మార్పు చేయాలంటూ ఐసీసీని బీసీబీ కోరింది. ఐర్లాండ్‌తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ దశ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడవచ్చని బంగ్లాదేశ్ భావించింది. కానీ అందుకు ఐర్లాండ్ నో చెప్పడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. "మేము మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతాం. గ్రూప్ స్టేజ్ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ టోర్నీలో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే పాయింట్లను కోల్పోవల్సి ఉంటుంది.చదవండి: ఇటలీ ప్రపంచకప్‌ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు

India won the toss against New Zealand in 3rd ODI5
న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టాస్‌ గెలిచిన టీమిండియా

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ద్‌ కృష్ణ స్థానంలో స్టార్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలుపొందాయి. మూడో మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ కైవసం​ చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

South african JJ Smuts a surprise inclusion in Italy squad for T20 World Cup 20266
ఇటలీ ప్రపంచకప్‌ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ 2026కు ఇటలీ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీకి ఆ జట్టు తొలిసారి క్వాలిఫై అయ్యింది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును నిన్న (జనవరి 17) ప్రకటించారు. వేన్‌ మ్యాడ్సన్‌ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.ఈ జట్టులో ఓ ఆసక్తికర ఎంపిక​ జరిగింది. 2017-21 మధ్యలో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడిన 37 ఏళ్ల జేజే స్మట్స్‌ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్మట్స్‌ సౌతాఫ్రికా తరఫున 6 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. స్మట్స్‌ ఇటీవల జరిగిన వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2025లో (WCL) సౌతాఫ్రికా లెజెండ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో అతను ఏబీ డివిలియర్స్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు.కుడి చేతి వాటం ఓపెనింగ్‌ బ్యాటర్‌, స్లో లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన స్మట్స్‌.. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ తరఫున కూడా ఆడుతున్నాడు. స్మట్స్‌ ఇటలీ పౌరసత్వం తన భార్య నుంచి సంక్రమించుకున్నాడు.కాగా, ఇటలీ వరల్డ్‌కప్‌ యూరప్‌ క్వాలిఫయర్స్‌లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ విభాగం నుంచి మరో జట్టుగా నెదర్లాండ్స్‌ ఉంది. ప్రపంచకప్‌ 2026లో ఇటలీ.. టు టైమ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌తో పాటు గ్రూప్‌-సిలో ఉంది.ఇటలీ జట్టు ఫిబ్రవరి 9న బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తో టీ20 వరల్డ్‌కప్‌ అరంగేట్రం చేయనుంది. కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్‌ జరునుంది. అనంతరం ఈ జట్టు ఫిబ్రవరి 12న ముంబైలో నేపాల్‌తో తలపడుతుంది.టీ20 ప్రపంచకప్‌ 2026కు ఇటలీ జట్టు..వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్‌ప్రీత్ సింగ్, జేజే స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.

Indian women's T20, ODI cricket team announced for Australia tour 20267
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ప్రకటన

ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగనున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్లను నిన్న (జనవరి 17) ప్రకటించారు. ఈ పర్యటనలో టీమిండియా-ఆస్ట్రేలియా 3 టీ20లు, ఓ టెస్ట్‌, 3 వన్డేలు ఆడతాయి. వీటిలోని పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్టును ప్రకటించారు.గాయాల నుంచి కోలుకున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ శ్రేయంక పటిల్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. 2024 టీ20 ప్రపంచ‌కప్ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌లో సత్తా చాటడంతో (ఆర్సీబీ తరఫున 5 వికెట్ల ప్రదర్శన) శ్రేయంకకు మరోసారి అవకాశం వచ్చింది. టీ20 జట్టులో మరో ఆసక్తికర ఎంపిక భారతి ఫుల్మాలి. ఈమె చివరిగా 2019లో భారత్‌ తరఫున టీ20 ఆడింది. ఆతర్వాత పేలవ ఫామ్‌ కారణంగా కనుమరుగైంది. గతేడాది డబ్ల్యూపీఎల్‌లో ఓ మోస్తరు ప్రదర్శనలతో తిరిగి లైన్‌లోకి వచ్చింది. ప్రస్తుత సీజన్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తుండటంతో ఆరేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది.హర్లీన్‌ డియోల్‌పై వేటుగత సిరీస్‌లో టీమిండియాలో భాగమైన హర్లీన్ డియోల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌లో రాణిస్తున్నా, సెలెక్టర్లు ఆమెపై వేటు వేశారు. పై మార్పులు మినహా టీ20 జట్టులో పెద్దగా గమనించదగ్గ విషయాలే​మీ లేవు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగారు.ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధన (VC), షఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి కమలిని (WK), అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, శ్రేయంక పటిల్షఫాలీ స్థానం పదిలంవన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో పలు ఆసక్తికర ఎంపికలు జరిగాయి. వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌ ప్రతికా రావల్‌ గాయపడటంతో జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. షఫాలీ వరల్డ్‌కప్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియా ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచకప్‌ సందర్భంగా గాయపడిన ప్రతికా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. వికెట్‌కీపర్ యస్తికా భాటియా కూడా శస్త్రచికిత్స తర్వాత రీహాబ్‌లో ఉండటంతో ఈ సిరీస్‌కు దూరమైంది. జి కమలినికి వికెట్‌కీపింగ్‌ చేసే సామర్థ్యం కూడా ఉండటంతో వన్డే జట్టులోకి కూడా వచ్చింది. ఈ జట్టులో రాధా యాదవ్, అరుంధతి రెడ్డికి చోటు దక్కలేదు. కశ్వీ గౌతమ్ కొత్తగా జట్టులోకి వచ్చింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధన (VC), షఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి కమలిని (WK), కశ్వీ గౌతమ్, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్ఆసీస్‌ పర్యటన షెడ్యూల్ టీ20 సిరీస్: - ఫిబ్రవరి 15 – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ - ఫిబ్రవరి 19 – మానుకా ఓవల్ - ఫిబ్రవరి 21 – అడిలైడ్ ఓవల్ వన్డే సిరీస్: - ఫిబ్రవరి 24 – బ్రిస్బేన్ (అల్లన్ బోర్డర్ ఫీల్డ్) - ఫిబ్రవరి 27 & మార్చి 1 – హోబార్ట్ (బెల్లెరివ్ ఓవల్) ఏకైక టెస్ట్‌: - మార్చి 6- పెర్త్‌ (పెర్త్‌ స్టేడియం)* టెస్ట్‌ జట్టును ప్రకటించాల్సి ఉంది.

Special story on No Handshake controversy in cricket, amid India-Bangladesh issue in under 19 world cup 20268
క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు..?

ఐసీసీ అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌కప్ 2026లో భాగంగా నిన్న (జనవరి 17) భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరిగింది. ఈ మ్యాచ్‌ టాస్‌ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోకుండా, గతంలో జరిగిన భారత్‌-పాక్‌ వివాదాస్పద 'నో హ్యాండ్‌ షేక్‌' ఉదంతాన్ని గుర్తు చేశారు.తాజా ఎపిసోడ్‌ తర్వాత క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు అన్న ప్రశ్న మరోసారి ఉత్పన్నమైంది. క్రికెట్‌ సర్కిల్స్‌లో ఈ అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మెజార్టీ శాతం క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. కొందరేమో ఈ అంశానికి మద్దతిస్తున్నారు. ఒక దేశం పట్ల మరో దేశం క్రూరంగా ప్రవర్తిస్తే ఇలాగే బుద్ది చెప్పాలని అంటున్నారు.ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టి, నో షేక్‌ హ్యాండ్‌ లాంటి ఉదంతాలకు తావిస్తే, దేశాల మధ్య ఉద్రిక్తతల మరింత పెరుగుతాయి కానీ, ఎలాంటి ప్రజాప్రయోజనాలు ఉండవు. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య స్నేహ వారుధులుగా ఉంటాయి. అలాంటి వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు.ఆటగాళ్లు సైతం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి. క్రీడలకు సంబంధం లేని విషయాలు మాకెందుకులే అనుకోవాలి. రాజకీయాలు చూసుకునే బాధ్యత నాయకులకు వదిలి పెట్టి, మైదానంలో క్రీడాస్పూర్తితో వ్యవహరించాలి. నో హ్యాండ్‌ షేక్‌ లాంటి ఉదంతాలకు తావివ్వకుండా హుందాగా ప్రవర్తించాలి.క్రీడల్లో హ్యాండ్‌షేక్ ఇవ్వడమనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు. ఇది ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవం. దేశాల మధ్య పోటీ జరిగేటప్పుడు సామరస్యతను ప్రతిబింబించే సంకేతం. ఇలాంటి వాటిలో రాజకీయాలకు అస్సలు తావివ్వకూడదు. ఈ విషయాన్ని ఆటగాళ్లు గమనించాలి. ప్రత్యర్దికి హ్యాండ్‌ షేక్‌ నిరాకరిస్తే.. అంతర్జాతీయ సమాజంలో వాళ్లే చిన్నచూపుకు గురవుతారు. అప్పటిదాకా వారిపై దేశాలకతీతంగా ఉండే అభిమానం పలచనవుతుంది.క్రికెట్‌కు జెంటిలెమన్‌ గేమ్‌ అనే పేరుంది. కాబట్టి క్రికెటర్లు జెంటిల్మెన్లలా ప్రవర్తించి క్రీడ గౌరవాన్ని పెంచాలి. దేశాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు పరిణితి ప్రదర్శించవచ్చు. గతంలో ఏదైనా సమస్య కాని, అసంతృప్తి కాని ఉంటే, ఆటగాళ్లు ఆర్మ్‌ బ్యాండ్‌లు ధరించే వారు. దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంలోనూ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించవచ్చు. తమ దేశం పట్ల ప్రత్యర్ది దేశం అమానవీయంగా ప్రవర్తిస్తుందని అనుకున్నప్పుడు ఆర్మ్‌ బ్యాండ్‌లు ధరించి నిరసన వ్యక్తం చేయవచ్చు.కానీ హ్యాండ్‌ షేక్‌ ఇవ్వకుండా ఒకరినొకరు అవమానించుకోవడం మాత్రం కరెక్ట్‌ కాదు. ఇలా చేయడం వల్ల అభిమానుల్లోనే కాకుండా సహచర ఆటగాళ్లలోనూ అసహనం పెరుగుతుంది. ఇటీవల ఓ విండీస్‌ టీ20 దిగ్గజం భారత్‌-పాక్‌ మధ్య నో హ్యాండ్‌ షేక్‌ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు అతను భారత ఆటగాళ్లనే బాధ్యులుగా భావిస్తున్నాడు.ఇందులో అతని తప్పేమీ లేదు. ఎందుకంటే, భారత్‌-పాక్‌ మధ్య నో హ్యాండ్‌ షేక్‌ ఉదంతాన్ని గమనించిన ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. గతేడాది ఆసియా కప్‌ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టాస్‌ సమయంలో పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ అఘాకు హ్యాండ్‌ షేక్‌ నిరాకరించాడు. మ్యాచ్‌ అనంతరం​ కూడా ఇరు జట్ల ఆటగాళ్లు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోలేదు. ఈ ఉదంతం తర్వాత భారతీయుల్లో సూర్యకుమార్‌పై రెస్పెక్ట్‌ మరింత పెరిగింది. కానీ, ఓ క్రీడాకారుడిగా అంతర్జాతీయ సమాజంలో తన మర్యాదను పలచన చేసుకున్నాడు. ఏది ఏమైనా నో హ్యాండ్‌ షేక్‌ లాంటి ఉదంతాలు క్రీడల ప్రతిష్టను దిగజారుస్తాయే కానీ, గౌరవాన్ని పెంచవు. ఈ విషయాన్ని క్రీడాలోకమంతా గుర్తు పెట్టుకోవాలి.

SA20, 2025-26: Capitals recover from 7 for 5 to beat Super Kings9
7 పరుగులకే 5 వికెట్లు.. కట్‌ చేస్తే స్కోర్‌ ఎంతంటే..?

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ చరిత్రలో అత్యుత్తమ కమ్‌బ్యాక్‌ ఇచ్చిన జట్టుగా ప్రిటోరియా క్యాపిటల్స్ నిలిచిపోనుంది. కఠినమైన పిచ్‌పై ఆ జట్టు 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అనూహ్య రీతిలో పుంజుకొని గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. అంతేకాకుండా ఆ స్కోర్‌ను విజయవంతంగా డిఫెండ్‌ చేసుకొని, 21 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జోహనెస్‌బర్గ్‌ వేదికగా నిన్న (జనవరి 17) ప్రిటోరియా క్యాపిటల్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య కీలకమైన మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌ బ్యాటర్లకు చాలా కఠినంగా ఉండింది. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ 7 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.ఈ దశలో డెవాల్డ్ బ్రెవిస్ (47 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)–షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (50 బంతుల్లో 74 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ అనూహ్య పోరాటం చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 103 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బ్రెవిస్‌-రూథర్‌ఫోర్డ్‌ భాగస్వామ్యానికి ముందు ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లయ్యారు.జోబర్గ్‌ బౌలర్లలో డేనియల్‌ వారెల్‌ (4-1-12-2), వియాన్‌ ముల్దర్‌ (4-1-34-2), డుయాన్‌ జన్సెన్‌ (4-0-27-1), బర్గర్‌ (4-0-32-1) అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. వీరి ధాటికి క్యాపిటల్స్‌ టాపార్డర్‌ కకావికలమైంది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ప్రిటోరియా బౌలర్లు అద్భుతంగా డిఫెండ్‌ చేసుకున్నారు. లిజాడ్‌ విలియమ్స్‌ (4-0-25-3), కేశవ్‌ మహారాజ్‌ (4-0-15-3), రోస్టన్‌ ఛేజ్‌ (4-0-11-1), గిడ్యోన్‌ పీటర్స్‌ (3-0-25-1) ధాటికి సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో సంబంధం​ లేకుండా క్యాపిటల్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. సూపర్‌ కింగ్స్‌ మినుకుమినుకుమంటున్న అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది.

SA20, 2025-26: Markram ton keeps DSG playoff hopes alive10
శివాలెత్తిన మార్క్రమ్‌.. విధ్వంసకర శతకం

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ చెలరేగిపోయాడు. పార్ల్‌ రాయల్స్‌తో నిన్న (జనవరి 17) జరిగిన కీలక మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా సూపర్‌ జెయింట్స్‌ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.శివాలెత్తిన మార్క్రమ్‌తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ జెయింట్స్‌.. మార్క్రమ్‌ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. మార్క్రమ్‌ 58 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.సికందర్‌ రజా వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో మార్క్రమ్‌ శివాలెత్తిపోయాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పరుగులు పిండుకున్నాడు. సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సునీల్‌ నరైన్‌ 4, జోస్‌ బట్లర్‌ 1, కేన్‌ విలియమ్సన్‌ 22, హెన్రిచ్‌ క్లాసెన్‌ 29, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 19 పరుగులకు ఔటయ్యారు.రాయల్స్‌ బౌలర్లలో హర్దస్‌ విల్యోన్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఫోర్టుయిన్‌, బార్ట్‌మన్‌, పోట్గెటర్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 190 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్‌ తడబడింది. సునీల్‌ నరైన్‌ (4-0-18-2), సైమన్‌ హార్మర్‌ (4-1-13-1), మార్క్రమ్‌ (2-0-9-1), లివింగ్‌స్టోన్‌ (3-0-25-1), కొయెట్జీ (3-0-31-2), మపాకా (2-0-10-1) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. వెర్రిన్‌ (23), హెర్మన్‌ (18), సికందర్‌ రజా (21), ఫోర్టుయిన్‌ (35 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ జట్టుతో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ కూడా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు కన్ఫర్మ్‌ చేసుకున్నాయి. నాలుగో బెర్త్‌ కోసం డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌ మధ్య పోటీ జరుగుతుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement