Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Shahid Afridi Slams PCB After Pakistan Losing ODI Series Bangladesh1
‘పీసీబీవన్నీ దిక్కుమాలిన నిర్ణయాలు’!

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాతో సిరీస్‌ ఓటమి అనంతరం షాహిద్‌ అఫ్రిది పీసీబీని ఏకిపారేస్తూ సోషల్‌ మీడియా వేదికగా వీడియో పోస్టును షేర్‌ చేసుకున్నాడు. అఫ్రిది మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ ఓటమికి పూర్తి బాధ్యత సెలక్షన్‌ కమిటీదే. ఆదివారం నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్‌ బ్యాటర్‌ సల్మాన్‌ అఘా ఒంటరి పోరాటం చేసినప్పటికీ లాభం లేకపోయింది. నాయకుడిగా అంతగా అనుభవం లేని తన అల్లుడు షహీన్‌ అఫ్రిదికి ఎందుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో చెప్పాలి. బాబర్‌ ఆజమ్‌ లాంటి అనుభవమున్న ఆటగాడిని జట్టు నుంచి తప్పించి పెద్ద తప్పిదమే చేశారు. కెప్టెన్‌గా అతనికి మంచి రికార్డు ఉంది. కనీసం ఆటగాడిగా జట్టులో చోటు కల్పిస్తే కనీసం సలహాలు ఇచ్చి ఉండేవాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచి కనీసం సెమీస్‌ చేరడంలో విఫలమైంది. తాజాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను 2-1తేడాతో కోల్పోవడం చూస్తుంటే ఇదంతా సెలక్షన్‌ కమిటీ తప్పిదమేని క్లియర్‌గా తెలుస్తోంది. అసలు ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్‌ చేయాలన్న విషయం కూడా పీసీబీ అవగాహన లేకపోవడం సిగ్గుచేటు. జాతీయ జట్టుకు సర్జరీ అనే పేరుతో మార్పులు అంటూ ఇప్పటికే చాలా చేశారు. అనుభవమున్న క్రికెటర్లను పక్కనబెట్టి కేవలం కొన్ని ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ు ఆడిన యువ క్రికెటర్లను తీసుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి. దేశవాలీ క్రికెట్‌ పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా తయారవుతుంది. పాక్‌ జాతీయ జట్టుకు నాణ్యమైన క్రికెటర్లను అందించే స్థాయి ఎప్పుడో కనుమరుగైంది. పీసీబీ తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలతో పాక్‌ క్రికెట్‌ను భ్రష్టు పట్టించింది. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ప్రతీ టోర్నీలో అపజయాలే ఎదురయ్యే అవకాశాలున్నాయి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ASports (@asportstv.pk)చదవండి: ఆర్సీబీ అభిమానులకు శుభవార్త!

Karnataka Government Clears Chinnaswamy Stadium Host IPL 2026 Matches2
ఆర్సీబీ అభిమానులకు శుభవార్త!

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ మ్యాచ్‌లకు ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వనుంది. ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియంలో 5 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే రెండో హోమ్ గ్రౌండ్ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణసింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్‌లో ఒక ప్లేఆఫ్ మ్యాచ్‌ను బెంగళూరులో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.గత సంవత్సరం జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో, జస్టిస్ కున్హా నివేదిక సిఫార్సులను అనుసరించి, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు క్రౌడ్ మేనేజ్‌మెంట్, భద్రతా చర్యలను ప్రవేశపెట్టినట్లు కార్యదర్శి సంతోష్ మీనన్ వెల్లడించారు.ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా 35 వేల మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి మ్యాచ్‌కు మూడు నుంచి నాలుగు గంటల ముందే స్టేడియం గేట్లను తెరుస్తారు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. మ్యాచ్ టిక్కెట్ కలిగి ఉన్న వారికి బెంగళూరు మెట్రోలో ఉచిత ప్రయాణ వసతి కల్పించనున్నారు.చదవండి: రోహిత్‌, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్‌!

Was Gambhir Behind Virat Kohli-Rohit Sharma Test Retirements3
రోహిత్‌, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్‌!

టీమిండియా స్టార్‌క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలతో భారత జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మెరుగైన సంబంధాలు కొనసాగించలేదా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే గంభీర్‌ కోచ్‌గా వచ్చిన కొద్ది రోజులకే బోర్డర్‌ గావస్కర్‌ టెస్టు సిరీస్‌ వైఫల్యం అనంతరం రోహిత్‌, విరాట్‌లు ఏకకాలంలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ ఇద్దరు టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడానికి ఒకరకంగా గంభీరే కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా కోల్‌కతాలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి అతిథిగా హాజరైన గంభీర్‌ చాలా విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్‌, కోహ్లీతో ఉన్న బంధాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రస్తావించడం ఆసక్తి కలిగించింది. ‘మనిషిగా నేను తప్పులు చేయడం సహజం. కోచ్‌ పాత్రలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. అలాగే ఆటగాళ్లు కూడా తప్పులు చేయడం జరుగుతుంటుంది. గత 18 నెలల్లో కోచ్‌గా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో నేను కోహ్లి, రోహిత్‌లకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కామెంట్‌కు సమాధానం ఇవ్వడం నా పని కాదు. భారత జట్టు నా ఒక్కడిదే కాదు.. అది డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నవాళ్లతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరిది. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా నమ్ముతా. అదేంటంటే కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు విఫలం కావొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశంతో కూడిన తప్పుడు నిర్ణయాలు మాత్రం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. పని విషయంలో నేను నిజాయితీగా ఉన్నంతవరకు, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడగలను. నా తప్పు లేనంత వరకు అన్ని విషయాల్లో కఠినంగానే ఉంటాను.’అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ల ఓటమి తర్వాత కోచ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మలను బీసీసీఐ సమీక్షకు పిలిచింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటూ బోర్డు అనేక మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గంభీర్‌ స్వాగతించగా, రోహిత్‌ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అప్పుడే రోహిత్‌ శర్మను టెస్టు కెప్టెన్‌గా వైదొలగాలని బోర్డు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికే రోహిత్‌ శర్మ, కోహ్లీలు టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్‌ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు శుబ్‌మన్‌ గిల్‌కు అప్పగించారు. గిల్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లపై టెస్టు సిరీస్‌లు నెగ్గినప్పటికీ, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో మిశ్రమ ఫలితమే వచ్చింది. ఇక కోహ్లీ, రోహిత్‌ శర్మలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశముంది.🚨 BREAKING & EXCLUSIVE 🚨 "I am human, I am allowed to make mistakes": Gautam Gambhir opens up on dressing room relationships. He also shares his views on Rohit Sharma-Virat Kohli@AgeasFederal #GautamGambhir #Trailblazers4 pic.twitter.com/alsJdNHvm4— RevSportz Global (@RevSportzGlobal) March 16, 2026

Reason Why Suryakumar Yadav Does Not Play Test-ODI Formats4
అవకాశమొస్తే ఆడకుండా ఉంటానా?

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ధోనీ, రోహిత్‌ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్‌గా సూర్యకుమార్‌ అరుదైన ఘనత సాధించాడు.క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు ఆడాలనే కల ఏ క్రికెటర్‌కైనా ఉంటుంది. సూర్య జట్టులోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ కేవలం టీ20లకే పరిమితం కావడం కొంతమేర ఆశ్చర్యం కలిగిస్తుంది. కెరీర్‌ ఆరంభంలో వన్డేలతో పాటు ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడిన సూర్యకుమార్‌ ఆ తర్వాత టీ20 స్పెషలిస్ట్‌గానే ముద్ర వేసుకున్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్‌ తాను వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. ‘ఏది రాసిపెట్టి ఉంటే జీవితంలో అదే జరుగుతుంది. తొలుత నేను క్రికెట్‌ ఆడడం ప్రారంభించినప్పుడు రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడా. దాదాపు పదేళ్లు రంజీ ట్రోఫీలో ఆడాను. ముంబైకి ప్రాతినిధ్యం వహించాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ రెడ్‌బాల్‌ క్రికెట్‌తోనే మొదలుపెడతారు. క్రమంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆట వైపు వచ్చినప్పుడు ఇక్కడే సౌకర్యంగా అనిపించింది. మరీ ముఖ్యంగా టీ20లకు బాగా సెట్‌ అయ్యా. వన్డేల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. నాకు టెస్టు క్రికెట్‌పై ప్రేమ లేదని చెప్పను. ఎందుకంటే 2010 నుంచి 2020 వరకూ రంజీల్లో ఆడా. ఆ ఫార్మాట్‌ను ఆస్వాదించా. ఎవరైనా సరే టెస్టు క్రికెట్‌ ఆడే అవకాశం వస్తే వద్దంటారా చెప్పండి? అయితే నాకున్న క్రికెట్‌ అనుభవం ప్రకారం ఈ ఫార్మాట్‌లో మూడు భిన్నమైన మార్గాల్లో ఆడాల్సి ఉంటుంది.కొన్నిసార్లు త్వరగా వికెట్లు పడి ముందుగా క్రీజులోకి వెళ్తే టెస్టుల్లో మాదిరిగా నెమ్మదిగా ఆడాలి. మధ్య ఓవర్లలో స్ట్రైక్‌ట్‌ పెంచుకుంటూ పోవాలి. ఇక ఆఖర్లో టీ20ల మాదిరిగా చెలరేగాలి. అందుకేనేమో నాకు ఈ వన్డే ఫార్మాట్‌ సరిగా అర్థం కాలేదు అనిపిస్తుంది. నేను వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్లో ఆడాను.అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కింది. మూడు ఫార్మాట్లకు ఉన్న ఆకర్షణ పూర్తిగా భిన్నమైంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక సూర్యకుమార్‌ ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్‌ ఆడి 8 పరుగులు, 37 వన్డేల్లో 773 పరుగులు సాధించాడు. ఇక 113 టీ20ల్లో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 25 హాఫ్‌ సెంచరీలున్నాయి.చదవండి: రెండు ముక్కల్లో విషెస్‌.. ట్రోల్‌కు గురైన బుమ్రా!

Bumrah Faces Hilarious Troll From Wife Sanjana Funny Anniversary Post5
రెండు ముక్కల్లో విషెస్‌.. ట్రోల్‌కు గురైన బుమ్రా!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదో వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. అయితే బుమ్రా తన పెళ్లి రోజు వేడుకను పురస్కరించుకొని తన భార్యకు పంపిన రెండు ముక్కల సందేశం అతన్ని ట్రోల్‌కు గురయ్యేలా చేసింది. విషయంలోకి వెళితే.. పెళ్లిరోజు సందర్భంగా తన భార్య సంజనా గణేశన్‌కు ‘హ్యాపీ యానివర్సరీ’ అని రెండు ముక్కల్లోనే విషెస్‌ తెలిపాడు. బుమ్రా పోస్ట్‌పై సంజనా గణేశన్‌ స్పందిస్తూ.. ‘కిడ్నీ టచ్చింగ్‌ క్యాప్షన్‌ యార్‌’ అని పేర్కొంది. ఆ తర్వాత బుమ్రాతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్న సంజనా గణేశన్‌.. ‘జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, ప్రపంచం ఎంతదూరం తీసుకెళ్లినా ఈ జ్ఞాపకాలు మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. నా ప్రాణ స్నేహితుడితో వివాహం జరిగి ఐదు సంవత్సరాలు పూర్తి కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నీ కౌగిలిలో నన్ను బంధించి నన్ను మైమరపించావు. కానీ నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనది మన ప్రేమకథే అని బలంగా చెప్పగలను. లవ్‌ యూ బుమ్రా’ అంటూ మరో పోస్టును షేర్‌ చేసుకుంది. ఇక స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేషన్‌తో బుమ్రాకు 2013లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. రెండేళ్లు డేటింగ్‌ చేసిన అనంతరం మార్చి 15, 2021న ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కాగా ఈ దంపతులకు 2023లో తొలి సంతానంగా కుమారుడు జన్మించాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి మరో భారత స్పిన్నర్‌ వరుణ్‌చక్రవర్తితో కలిసి సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. చదవండి: ‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’ View this post on Instagram A post shared by S A N J A N A G A N E S A N (@sanjanaganesan)

I wish one day he could be in my position: Gambhir Comments On Dhoni6
టీమిండియా హెడ్‌కోచ్‌గా ధోని రావాలి: గంభీర్‌

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ నవ్వడం అరుదు. ఎల్లప్పుడూ గంభీరంగానే కనిపించే ఈ ఢిల్లీ స్టార్‌ ముఖంపై అప్పుడప్పుడు మాత్రమే చిరునవ్వులు చూడగలం. ఇటీవల భారత్‌ టీ20 ప్రపంచకప్‌-2026 గెలిచిన సందర్భంగా గౌతీ నవ్వులు చిందించడం అభిమానులకు కనువిందు చేసింది.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన వీరుడు మహేంద్ర సింగ్‌ ధోని సైతం గౌతీ నవ్వు గురించి కామెంట్‌ చేశాడు. టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఒకప్పటి సహచర ఆటగాడు గంభీర్‌ను ఉద్దేశించి ధోని పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అయింది.గంభీరమైన ముఖంలో ఆ నవ్వు..‘‘కోచ్‌ సాహెబ్‌.. మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు.. అబ్బా అదొక కిల్లర్‌ కాంబో. మీరు అద్భుతం చేశారు’’ అంటూ ధోని క్యాప్షన్‌ జతచేశాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నవ్వులు చిందించేందుకు ఇంతకంటే గొప్ప కారణం ఉంటుందా!.. నిన్ను చూడటం సంతోషంగా ఉంది’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.కాగా ధోని ఈసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు హాజరైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌ను ఓడించి భారత్‌ మరోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ను ముద్దాడిన దృశ్యాలను ధోని ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌ ధోనిని కలుసుకోవడం సంతోషమంటూ కామెంట్‌ చేశాడు.అతడు నా స్థానంలో ఉండాలిఇక తాజాగా రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్‌కు ధోని ‘స్మైల్‌ కామెంట్’‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ప్రపంచకప్‌ ఫైనల్‌ చూసేందుకు ధోని అక్కడికి రావడం సంతోషంగా అనిపించింది. తను నన్ను నవ్వమని అడగటం కూడా నచ్చింది.ఏదో ఒకరోజు అతడు నా స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను కూడా ధోని గురించి అదే కోట్‌ రాస్తాను. అతడు కూడా డగౌట్‌లో కూర్చుని నవ్వుతుంటే చూడాలని ఉంది’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. తనలాగే ధోని టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టి.. కోచ్‌ హోదాలో ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆకాంక్షించాడు.ధోని సారథ్యంలో గౌతీకాగా 2007లో ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని ధోని సారథ్యంలోని టీమిండియా గెలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ కైవసం చేసుకుంది. ఇక 2011లో ధోని కెప్టెన్సీలోనే సొంతగడ్డపై శ్రీలంకను ఓడించి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని భారత్‌ గెలుచుకుంది.ఈ రెండు సందర్భాల్లోనూ గౌతం గంభీర్‌ భారత జట్టులో సభ్యుడు. ఇక ధోని 2013లో కెప్టెన్‌ హోదాలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ కూడా గెలిచాడు. మరోవైపు.. 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చిన గౌతం గంభీర్‌ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025, తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026 టైటిల్‌ను భారత్‌ గెలుచుకుంది.ఇక తాజా విజయంతో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా మూడోసారి, వరుసగా రెండోసారి, సొంతగడ్డపై తొలిసారి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తొలి జట్టుగా భారత్‌ ప్రపంచ రికార్డు సాధించింది. చదవండి: T20 WC: ఆ ఒక్క ఎంపిక విషయంలోనే మా మధ్య విభేదాలు: సూర్య

Mithali Raj Says Indian cricket Era Of Dominance Has Arrived7
‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’

క్రికెట్‌లో భారత్‌ ప్రపంచాన్ని శాసించడం చూడాలనుకున్న తన కల నెరవేరే సమయం ఆసన్నమైందని టీమిండియా మహిళా దిగ్గజ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ అభిప్రాయపడింది. ఆదివారం బీసీసీఐ నమన్‌ అవార్డ్స్‌ సందర్భంగా మిథాలీరాజ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఎంతోకాలంగా నేను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. గ్లోబల్‌ క్రికెట్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో తన పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ వస్తోంది. గత రెండు మూడేళ్లలో పురుషుల జట్టు, మహిళల జట్టు, అండర్‌-19 జట్లు ట్రోఫీలు కొల్లగొట్టి భారత క్రికెట్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం జరిగింది. ఇక మహిళల క్రికెట్‌లోనూ గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు బీసీసీఐతో పాటు జైషాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే. ముఖ్యంగా గత నాలుగైదేళ్లలో భారత మహిళల క్రికెట్‌ జట్టు ఎంతో పరిణితి చెందడంతో పాటు ఆటలోనూ దూకుడు పెరిగింది. భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరగడానికి నన్ను అందరూ ఐకాన్‌గా చెప్పుకుంటున్నారు. కానీ నేను నిజానికి సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ సర్‌ల నుంచి ప్రేరణ పొంది ఇవాళ ఈ స్థాయిలో నిలిచాను. మహిళల జట్టుకు ప్రేరణ మాత్రం ఎప్పుడు పురుషుల జట్టే అని బలంగా చెప్పగలను.’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక భారత క్రికెట్‌ గత రెండు మూడేళ్లలో ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదిగింది. గత రెండేళ్లలో చూసుకుంటే పురుషుల జట్టు రెండుసార్లు, మహిళల జట్లు ఒకసారి, అండర్‌-19 జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు కొల్లగొట్టాయి. తొలుత 2024లో రోహిత్‌ శర్మ నాయకత్వంలోని టీమిండియా 17 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి టైటిల్‌ సాధించింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను సూర్య సారథ్యంలో టీమిండియా మూడోసారి కైవసం చేసుకుంది. ఆ తర్వాతి ఏడాది మహిళల జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇక అండర్‌-19లోనూ అటు పురుషులు, మహిళల విభాగంలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది.చదవండి: మెద్వదెవ్‌ను దెబ్బకొట్టిన సిన్నర్‌

I and Gambhir Differed On 1 Name In T20 Team: Suryakumar Reveals8
ఆ ఒక్క ఎంపిక విషయంలోనే గౌతీ భాయ్‌తో విభేదాలు: సూర్య

టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ల జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ చేరాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ గెలవడంతో సూర్యకు ఈ అరుదైన గౌరవం దక్కింది.మరోవైపు.. ఈ విజయంతో హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ (Gautam Gambhir) ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్‌ చేరింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)తో కలిసి ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిపించిన గౌతీ.. తాజాగా సూర్యతో కలిసి టీ20 ప్రపంచకప్‌ విజయంలో భాగమయ్యాడు.ఒకటీ రెండు విషయాల్లో విభేదాలుఈ నేపథ్యంలో గౌతం గంభీర్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఆలోచనలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయని తెలిపాడు. అయితే, ఒకటీ రెండు విషయాల్లో తమ మధ్య విభేదాలు తలెత్తిన మాట వాస్తవమే అయినా.. అవి అంతగా పట్టించుకోదగ్గ విషయాలు కావని పేర్కొన్నాడు.వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ.. ‘‘జట్టును ఎంపిక చేసే సమయంలో 15 మంది పేర్లలో పద్నాలుగు మేమిద్దరం కలిసి చెప్పినవే ఉంటాయి. మేము ఒకే విధంగా ఆలోచిస్తున్నామనడానికి ఇది నిదర్శనం.చర్చ మాత్రమే ఉంటుందిమా లక్ష్యాలు కూడా ఒక్కటే. అందుకే ఆ ఒక్క పేరు విషయంలో మా మధ్య వాదనలు కాకుండా చర్చ మాత్రమే ఉంటుంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. ఇప్పటికీ తాను గంభీర్‌ను గౌతీ భాయ్‌ అనే పిలుస్తానని.. తమది అన్నాదమ్ముల అనుబంధం అని తెలిపాడు.పరిస్థితికి తగినట్లేఇక వరల్డ్‌కప్‌లో తాము ఆడిన విధానంపై ‍స్పందిస్తూ.. ‘‘ధైర్యంగా ఆడటానికి, నిర్లక్ష్యంగా ఆడటానికి మధ్య సన్నని గీత మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్లు హై రిస్కీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. కానీ ప్రతిసారి అలాగే చేయలేము. పరిస్థితికి తగినట్లే ఆడి అనుకున్న ఫలితం రాబట్టడమే మా ప్రధాన లక్ష్యం’’ అని సూర్య చెప్పుకొచ్చాడు.చదవండి: చరిత్ర చెరిగిపోదు: బీసీసీఐపై రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఫైర్‌

Jannik Sinner Tops Daniil Medvedev To Win First Indian Wells Title9
మెద్వదెవ్‌ను దెబ్బకొట్టిన సిన్నర్‌

‘తాడిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడు’ అనే సామెత ఇప్పుడు చెప్పుకునే విషయానికి సరిగ్గా సరిపోతుంది. ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్ అల్కరాజ్‌ 16 వరుస విజయాలకు మెద్వదెవ్‌ చెక్‌ పెడితే, మెద్వదెవ్‌ 9 వరుస విజయాలకు తాజాగా సిన్నర్‌ అడ్డుకట్ట వేశాడు. ఈ నేపథ్యంలోనే ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ ఏటీపీ 1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌ సింగిల్స్‌ విజేతగా ప్రపంచ రెండో ర్యాంకర్‌ జానిక్‌ సిన్నర్‌ నిలిచాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇటలీకి చెందిన సిన్నర్‌ 7-6(8/6), 7-6(7/4)తో రష్యాకు చెందిన డానిల్‌ మెద్వదెవ్‌పై విజయాన్ని అందుకున్నాడు. సిన్నర్‌ కెరీర్‌లో ఇదే తొలి ఇండియా వెల్స్‌ మాస్టర్స్‌ టైటిల్‌ కావడం విశేషం. కాగా నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ అయిన సిన్నర్‌కు 2026 ఏడాదిలో ఇదే తొలి టైటిల్‌ కావడం గమనార్హం. టోర్నీ ప్రారంభం నుంచి ప్రత్యర్థికి ఒక్క సెట్‌ కూడా కోల్పోని సిన్నర్‌ ఫైనల్లోనూ దానిని కొనసాగించినప్పటికీ, మ్యాచ్‌లో రెండు సెట్లు టైబ్రేక్‌కు దారి తీశాయి. గంటా 55 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌లో మెద్వదెవ్‌, సిన్నర్‌లు హోరాహోరీగా తలపడడంతో సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన సిన్నర్‌ 8 పాయింట్లతో సెట్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్‌ కూడా టైబ్రేక్‌కు దారితీయడం, ఆ సెట్‌లోనూ సిన్నర్‌దే పైచేయి సాధించడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.సబలెంకా జోరు..మరోవైపు మహిళల సింగిల్స్‌లో బెలారస్‌ బ్యూటీ ఎరీనా సబలెంకా విజేతగా నిలిచింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో సబలెంకా 3-6, 6-3, 7-6(8/6)తో ఎలీనా రిబాకినాపై విజయాన్ని అందుకొని కెరీర్‌లో తొలి ఇండియన్‌ వెల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.చదవండి: ‘వాళ్ల ఫీజు మన సైనికుల ప్రాణాలు తీస్తోంది’

Sunil Gavaskar Warns SunRisers Of Boycott After Abrar Ahmed Deal10
‘వాళ్ల ఫీజు మన సైనికుల ప్రాణాలు తీస్తోంది’

హండ్రెడ్‌ మెన్స్‌ టీ20 టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో కావ్యా మారన్‌కు చెందిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వేలంలో అబ్రార్‌ అహ్మద్‌ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది. అయితే పాక్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడం పట్ల సోషల్‌ మీడియాలో భారత మాజీ క్రికెటర్లు సహా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు సంబంధించి ‘ఎక్స్‌’ ఖాతాను కూడా సస్పెండ్‌ చేయడం గమనార్హం. తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కూడా సన్‌రైజర్స్‌ పాక్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ది హండ్రెడ్‌ టోర్నీలో ఒక ప్రాంచైజీ పాకిస్థాన్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ భారత్‌కు చెందిన ఒక ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పాక్‌ ఆటగాళ్లను తీసుకోవడం నచ్చడం లేదు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్‌తో సంబంధాలు క్షీణించడంతో ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఐపీఎల్‌ వేలంలోనూ పాక్‌ ఆటగాళ్లను విస్మరించడం జరిగింది. ఐపీఎల్‌ 2008 సీజన్‌ మినహా పాక్‌ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్‌లో కనిపించలేదు. కానీ తాజాగా సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేసింది. సదరు ఫ్రాంచైజీ పాక్‌ ఆటగాడికి ఫీజు రూపంలో చెల్లించే డబ్బులను అతడు తన దేశానికి పన్నుల రూపంలో చెల్లించడం జరుగుతుంది. పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతోనే పాక్‌ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తున్నది. ఆ ఆయుధాలే ఇవాళ మన భారత సైనికులు, పౌరుల మరణాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. దీంతో తెలిసీ తెలియకో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఒక రకంగా ప్రాణనష్టానికి పాల్పడుతున్న దేశంతో సంబంధం కొనసాగిస్తున్నట్లే అవుతుంది. అందుకే అభిమానుల ఆగ్రహంలో నాకు తప్పు కనిపించలేదు. ఈ ఆగ్రహం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా మాత్రం.. ‘ఇది మాకు సంబంధించిన విషయం కాదు. అదొక విదేశీ లీగ్‌. తుది నిర్ణయం ఆ ఫ్రాంచైజీయే తీసుకోవాలి. మేము జోక్యం చేసుకోలేము’ అని పేర్కొన్నారు.కాగా గతేడాది సీజన్ అనంతరం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీని సన్ గ్రూపు కొనుగోలు చేసింది. తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్యా మారన్ దాదాపు 100 మిలియన్ పౌండ్ల (సుమారు ₹1,100 కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించి పూర్తి టేకోవర్ చేసుకుంది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు పేరును సన్‌రైజర్స్‌ లీడ్స్‌గా మార్చారు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2026 సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌ గతేడాది చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది.చదవండి: న‌డ‌వ‌లేని స్థితిలో టీమిండియా స్టార్‌ క్రికెట‌ర్‌.. వీడియో

Advertisement
Advertisement
 
Advertisement

వీడియోలు