ప్రధాన వార్తలు
World Cup 2026: పాకిస్తాన్కు భారీ షాక్!
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత్తో కీలక మ్యాచ్కు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు.మూడు బెర్తులు ఖరారుజింబాబ్వే వేదికగా ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సూపర్ సిక్స్ దశలో గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీ ఫైనల్కు అర్హత సాధించాయి.నాలుగో జట్టు ఏది?ఇక నాలుగో బెర్తు కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం బులవాయో వేదికగా మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికి ఆడిన మూడింటికి మూడు మ్యాచ్లలో గెలిచి భారత యువ జట్టు ఆరు పాయింట్లు సాధించగా.. పాక్ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది.ముక్కుకు గాయంఇక నెట్రన్రేటు పరంగానూ భారత్ (+3.337) పాకిస్తాన్ కంటే (+1.484) మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడ్డాడు. ఫాస్ట్బౌలర్ వేసిన బంతి కారణంగా అతడి ముక్కుకు గాయమైంది. ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సచిన్ సూచనలుమరోవైపు.. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్.. పాక్తో కీలక సమరానికి ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో వర్చువల్గా భేటీ అయింది. ఆన్లైన్లో యువ ఆటగాళ్లను పలకరించిన సచిన్.. ఆటకు సంబంధించిన టెక్నిక్స్తో పాటు క్రమశిక్షణ, అంకితభావం గురించి మాట్లాడుతూ వారిలో స్ఫూర్తి నింపాడు. చదవండి: భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..!
అభిరథ్ రెడ్డి, హిమతేజ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్తో జింఖానా మైదానంలో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 56/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 105 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 415 పరుగులు చేసింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (121; 16 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ కొడిమెల హిమతేజ (125 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలు సాధించారు. అమన్ రావు (52; 8 ఫోర్లు, 1 సిక్స్)తో తొలి వికెట్కు 96 పరుగులు జోడించిన అభిరథ్... మూడో వికెట్కు హిమతేజతో 147 పరుగులు జత చేశాడు. ప్రజ్ఞయ్ రెడ్డి (52 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ ఐదో వికెట్కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆంధ్ర 267/5 నాగాలాండ్ జట్టుతో సొవిమాలో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్లో... రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (51; 7 ఫోర్లు), కరణ్ షిండే (51; 5 ఫోర్లు, 1 సిక్స్), సీఆర్ జ్ఞానేశ్వర్ (87 బ్యాటింగ్; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 366కు ఆంధ్ర మరో 99 పరుగుల దూరంలో ఉంది. జ్ఞానేశ్వర్తో కలిసి శశికాంత్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.
ముగ్గురు భారత అంపైర్లకు చోటు
దుబాయ్: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే టి20 ప్రపంచ కప్లో పని చేయనున్న అంపైర్లు, రిఫరీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 24 మంది అంపైర్లతో పాటు ఆరుగురు మ్యాచ్ రిఫరీలు ఈ జాబితాలో ఉన్నారు. భారత మాజీ పేసర్, సీనియర్లలో ఒకడైన జవగల్ శ్రీనాథ్ రిఫరీగా కొనసాగనుండగా...అతనితో పాటు డీన్ కోస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మదుగలే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్ రిఫరీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంపైర్లలో భారత్ నుంచి నితిన్ మేనన్, అనంత పద్మనాభన్, జె.మదన్ గోపాల్లకు అవకాశం దక్కింది. ఐసీసీ ఎలీట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడైన నితిన్ మేనన్కు ఇది నాలుగో టి20 వరల్డ్ కప్ కానుంది. గతంలో అతను 2021, 2022, 2024లలో కూడా అంపైర్గా వ్యవహరించాడు. భారత్, న్యూజిలాండ్ సిరీస్లో భాగంగా నేడు జరిగే మ్యాచ్లో అంపైర్గా బాధ్యతలు నిర్వహించనున్న 42 ఏళ్ల మేనన్కు ఇది మూడు ఫార్మాట్లలో కలిపి 150 అంతర్జాతీయ (పురుషుల) మ్యాచ్ కానుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత అంపైర్గా అతను నిలవనున్నాడు. మదన్గోపాల్కు ఇది రెండో టి20 వరల్డ్ కప్ కాగా, పద్మనాభన్కు తొలిసారి ప్రపంచ కప్ చాన్స్ లభించింది. రోలండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిసన్ గాఫ్నీ, ఆడ్రియన్ హోల్డ్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బరో, వేన్ నైట్స్, డొనొవాన్ కాచ్, స్యామన్ నొగాస్కీ, అల్లావుద్దీన్ పలేకర్, అహ్సాన్ రజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫెల్, లాంగ్టన్ రూసెర్, షర్ఫుద్దౌలా షాహిద్, గాజీ సొహెల్, రాడ్నీ టకర్, అలెక్స్ వార్స్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాఖూబ్ కూడా అంపైర్లుగా టి20 వరల్డ్ కప్లో పని చేయనున్నారు.
పీటీ ఉష ఇంట్లో విషాదం
కోజికోడ్: దిగ్గజ అథ్లెట్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. తమ నివాసంలో అనూహ్యంగా కుప్పకూలిన శ్రీనివాసన్ను సన్నిహితులు ఆస్పత్రికి తీసుకెళ్లినా... అప్పటికే ఆయన మరణించారు. స్వతహాగా కబడ్డీ క్రీడాకారుడు అయిన శ్రీనివాసన్ సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో డిప్యూటీ ఎస్పీగా పని చేసి రిటైరయ్యారు. ఉష కెరీర్లో అన్ని విధాలా సహకారం అందిస్తూ ప్రోత్సహించడంతో పాటు ఆమె పురోగతిలో భర్త కీలక పాత్ర పోషించారు. 90వ దశకంలో ఉష రిటైర్మెంట్ ప్రకటించి ఆటకు దూరమైన తర్వాత మళ్లీ 1998 ఆసియా చాంపియన్షిప్ ద్వారా ఆమె ట్రాక్పైకి పునరాగమనం చేసేందుకు శ్రీనివాసన్ అండగా నిలిచారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ నిర్వహణా వ్యవహారాలు చూస్తున్నారు. వీరిద్దరికి ‘ఉజ్వల్’ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఉషతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఆమె భర్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
క్రమశిక్షణ తప్పినందుకే...
న్యూఢిల్లీ: ప్రొ లీగ్ టోర్నీ కోసం గురువారం 33 మంది ప్రాబబుల్స్తో ప్రకటించిన భారత హాకీ జట్టులో స్టార్ ప్లేయర్ మన్ప్రీత్ సింగ్కు చోటు దక్కకపోవడం చర్చకు దారి తీసింది. మన్ప్రీత్తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు దిల్ప్రీత్ సింగ్, కృషన్ బహదూర్ పాఠక్లను టీమ్ నుంచి తప్పించారు. అయితే వీరంతా తీవ్ర క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు ఈ చర్య తీసుకున్నట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) వర్గాలు వెల్లడించాయి. ఇటీవల డిసెంబరులో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు వారు నిబంధనలు ఉల్లంఘించారని హెచ్ఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ టూర్లో 3 మ్యాచ్లు ఆడిన భారత్ 2 ఓడి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. ‘జట్టు సమావేశానికి ఒక ఆటగాడు గైర్హాజరు కావడంతో వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచాం. అప్పుడు మరింత తీవ్రమైన అంశాలు బయటకు వచ్చాయి. మన్ప్రీత్, దిల్ప్రీత్, కృషన్ కలిసి ఆ ఆటగాడికి నిషేధిత ఉత్ప్రేరకం కలిపిన చూయింగ్ గమ్ను ఇచ్చారు. దానిని వాడిన అతను స్పృహ కోల్పోయి టీమ్ మీటింగ్కు దూరమయ్యాడు. దాని ప్రభావం రాత్రంతా ఉండటంతో పాటు తర్వాతి ఉదయం కూడా సాధారణ స్థితికి రాలేకపోయాడు. విచారణ చేస్తే ఆ ముగ్గురి పాత్ర ఉన్నట్లు తేలింది. వీరంతా ఆ తర్వాత క్షమాపణలు చెప్పినా... వచ్చే టోర్నీ కోసం జరిగే శిబిరానికి వీరిని ఎంపిక చేయరాదనే నిర్ణయం అప్పుడే జరిగిపోయింది’ అని ఆయన వివరించారు. అయితే దీనిపై కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ హాకీ ఇండియాకు ఎలాంటి రాత పూర్వక ఫిర్యాదు మాత్రం చేయలేదు. పైగా మన్ప్రీత్కు మద్దతు పలుకుతూ జట్టు నుంచి తప్పించరాదని కూడా ఫుల్టన్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఎన్నో కీలక టోర్నీలు ఉన్న నేపథ్యంలో ఎంతో అనుభవం ఉన్న మన్ప్రీత్ అవసరం జట్టుకు ఉందని... అతడిని తొలగిస్తే తానూ రాజీనామా చేస్తానని కూడా కోచ్ హెచ్చరించినట్లు తెలిసింది. అయితే హాకీ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ తిర్కీ, భోలానాథ్ సింగ్, చీఫ్ సెలక్టర్ ఆర్పీ సింగ్ చివరకు కోచ్ను ఒప్పించడంలో సఫలమయ్యారు.
చరిత్ర పుటల్లో చోటు కోసం...
మెల్బోర్న్: ఒక్క విజయం సాధిస్తే... సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్... ప్రపంచ నంబర్వన్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ చరిత్ర పుటల్లో తమ పేరును లిఖించుకుంటారు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్లో జొకోవిచ్ 11వసారి... అల్కరాజ్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్తో అల్కరాజ్ తలపడతాడు. తుది పోరులో జొకోవిచ్ గెలిస్తే టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 25 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఏకైక ప్లేయర్గా అవతరిస్తాడు. అల్కరాజ్ నెగ్గితే ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టిస్తాడు. శుక్రవారం జరిగిన రెండు అసాధారణ సెమీఫైనల్స్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. 5 గంటల 27 నిమిషాలపాటు జరిగిన మొదటి సెమీఫైనల్లో అల్కరాజ్ 6–4, 7–6 (7/5), 6–7 (3/7), 6–7 (4/7), 7–5తో మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. నిర్ణాయక ఐదో సెట్లో 5–4తో ఆధిక్యంలో నిలిచిన జ్వెరెవ్ పదో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకొని ఉంటే గెలిచేవాడు. కానీ పదో గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్ను కాపాడుకొని 12వ గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను మరోసారి బ్రేక్ చేసి 7–5తో గెలుపు సొంతం చేసుకున్నాడు. అతిపెద్ద వయస్కుడిగా... డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో 10సార్లు విజేత జొకోవిచ్ 3–6, 6–3, 4–6, 6–4, 6–4తో విజయం సాధించాడు. 12 ఏస్లు సంధించిన జొకోవిచ్ 46 విన్నర్స్ కొట్టాడు. 16 సార్లు తన సర్వీస్లో బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఫైనల్ చేరిన 10 సార్లూ టైటిల్ గెలిచిన జొకోవిచ్ ఈ టోర్నీ చరిత్రలో తుది పోరుకు అర్హత పొందిన అతిపెద్ద వయస్కుడిగా (38 ఏళ్ల 241 రోజులు) రికార్డు సృష్టించాడు. కెన్ రోజ్వాల్ (37 ఏళ్ల 54 రోజులు –1972లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్సబలెంకా x రిబాకినామధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం
‘ఎలిమినేటర్’కు గుజరాత్
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ‘ఎలిమినేటర్’కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ 11 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్పై నెగ్గింది. లీగ్ చరిత్రలో ముంబైతో తలపడిన ఎనిమిది సార్లూ ఓటమి చవి చూసిన గుజరాత్ 9వ ప్రయత్నంలో తొలిసారి గెలుపు రుచి చూసింది. ఆడిన 8 మ్యాచ్ల్లో 5 గెలిచి, 3 ఓడిన గుజరాత్ 10 పాయింట్లతో రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. యాష్లీ గార్డ్నర్ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జ్ వేర్హామ్ (26 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించగా... అనుష్క శర్మ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ డివైన్ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) రాణించారు. అమేలియా కెర్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 82 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) చివరి వరకు పోరాడినా... విజయం మాత్రం దక్కలేదు. ఆఖరి 2 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సి ఉండగా, హర్మన్ 2 ఫోర్లు, 2 సిక్స్ల సహాయంతో 24 పరుగులు రాబట్టగలిగింది. ఈ మ్యాచ్లో ఓడినా... ఎలిమినేటర్కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ముంబైకి ఇంకా ఉన్నాయి. నేడు విశ్రాంతి దినం. ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో యూపీ వారియర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ కచి్చతంగా గెలవడంతోపాటు రన్రేట్లో ప్రస్తుతం తమకంటే (–0.164) ఎంతో ముందున్న ముంబైను (+0.059) కూడా దాటాల్సి ఉంటుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) సజన (బి) షబ్నిమ్ 5; సోఫీ డివైన్ (సి) కెర్ (బి) సివర్ బ్రంట్ 25; అనుష్క (సి) షబ్నిమ్ (బి) కెర్ 33; గార్డ్నర్ (స్టంప్డ్) ఫిర్దోస్ (బి) కెర్ 46; వేర్హామ్ (నాటౌట్) 44; భారతి (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–21, 2–69, 3–71, 4–142. బౌలింగ్: షబి్నమ్ 4–0–29–1, సివర్ బ్రంట్ 4–0–36–1, వైష్ణవి 2–0–21–0, అమన్జోత్ 2–0–13–0, అమేలియా కెర్ 4–0–26–2, మాథ్యూస్ 4–0–40–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సజన (సి) భారతి (బి) కాశ్వీ 26; మాథ్యూస్ (బి) డివైన్ 6; సివర్ బ్రంట్ (సి) అనుష్క (బి) డివైన్ 2; హర్మన్ప్రీత్ (నాటౌట్) 82; అమేలియా కెర్ (సి) మూనీ (బి) వేర్హామ్ 20; అమన్జోత్ (స్టంప్డ్) మూనీ (బి) రాజేశ్వరి 13; సంస్కృతి (ఎల్బీ) (బి) వేర్హామ్ 0; పూనమ్ (సి అండ్ బి) గార్డ్నర్ 2; ఫిర్దోస్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–23, 2–33, 3–37, 4–82, 5–126, 6–127, 7–155. బౌలింగ్: రేణుక సింగ్ 2–0–11–0, కాశ్వీ గౌతమ్ 2–0–12–1, రాజేశ్వరి గైక్వాడ్ 4–0–46–1, సోఫీ డివైన్ 4–1–23–2, జార్జియా వేర్హామ్ 4–0–26–2, యాష్లీ గార్డ్నర్ 3–0–26–1, తనూజ 1–0–11–0.
ప్రపంచ కప్కు ముందు ఆఖరి పోరు
తిరువనంతపురం: టి20 ప్రపంచ కప్కు ముందు ఆడుతున్న ఆఖరి సిరీస్లో భారత్ ఇప్పటికే తమ అస్త్రశ్రస్తాలు అన్నింటినీ పరీక్షించుకుంది. న్యూజిలాండ్పై తొలి మూడు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన జట్టు 3–0తో సిరీస్ను గెలుచుకుంది. విశాఖపట్నంలో జరిగిన గత మ్యాచ్లో అనూహ్యంగా ఓడినా...ఆందోళన చెందాల్సిన పరిస్థితేమీ లేదు. అయితే మెగా పోరుకు ముందు మిగిలిన ఒక మ్యాచ్లో మళ్లీ చెలరేగాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో టి20కి రంగం సిద్ధమైంది. మరోవైపు సిరీస్ కోల్పోయిన తర్వాత గత మ్యాచ్లో రాణించిన క్లీన్స్వీప్ నుంచి తప్పించుకున్న కివీస్ కూడా విజయంతో ముగించాలని భావిస్తోంది. భారత్లోనే జరిగే వరల్డ్ కప్కు ముందు ఈ గెలుపు ఆ టీమ్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఖాయం. సిరీస్లో జట్టు ప్రదర్శనను బట్టి చూస్తే ఒక్క సంజు సామ్సన్ ఫామ్ విషయంలోనే మేనేజ్మెంట్ కొంత ఇబ్బంది పడుతోంది. తన సొంత మైదానంలో అశేష అభిమానుల మధ్య బరిలోకి దిగనున్న సామ్సన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ఇంతకంటే సరైన వేదిక, సమయం ఉండదు. తొలి టి20 ఆడుతూ గాయంతో తప్పుకున్న అక్షర్ పటేల్ తర్వాతి మ్యాచ్లకు దూరమయ్యాడు. అతను పూర్తిగా కోలుకుంటే ఆడతాడు. స్వల్ప గాయంతో వైజాగ్ మ్యాచ్ ఆడని ఇషాన్ కిషన్ కూడా ఫిట్గా ఉంటే మళ్లీ తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు కివీస్ కూడా ఒక మార్పుతో ఆడే అవకాశం ఉంది. ఓపెనర్, వికెట్ కీపర్ ఫిన్ అలెన్ అందుబాటులో రావడంతో సీఫెర్ట్ను విశ్రాంతినిచ్చి అతడిని ఆడించే అవకాశం ఉంది. తిరువనంతపురంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. కాబట్టి భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇక్కడా మంచు ప్రభావం ఉంది. గతంలో ఈ మైదానంలో 4 టి20లు ఆడిన భారత్ 3 గెలిచి, ఒక మ్యాచ్లో ఓడింది. చివరిసారిగా 2023 నవంబర్లో ఆ్రస్టేలియాతో జరిగిన పోరులో భారత్ 235 పరుగులు నమోదు చేసింది.
రాణించిన గార్డ్నర్, వేర్హమ్.. గుజరాత్ స్కోర్ ఎంతంటే..?
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (జనవరి 30) జరుగుతున్న కీలక మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ (46), అనుష్క శర్మ (33), సోఫీ డివైన్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (44 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. భారతి ఫుల్మాలి 5 పరుగులతో అజేయంగా నిలిచింది. గుజరాత్ ఇన్నింగ్స్లో బెత్ మూనీ (5) మినహా ప్రతి ఒక్కరు ఓ మోస్తరు స్కోర్ చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేసింది. షబ్నిమ్ ఇస్మాయిల్ (4-0-29-1), నాట్ సీవర్ బ్రంట్ (4-0-36-1) కూడా పర్వాలేదనిపించారు. హేలీ మాథ్యూస్ (4-0-40-0), వైష్ణవి శర్మ (2-0-21-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. అమన్జోత్ కౌర్ (2-0-13-0) పర్వాలేదనిపించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన రెండు బెర్త్ల కోసం గుజరాత్తో పాటు ముంబై ఇండియన్స్ (7 మ్యాచ్ల్లో 3 విజయాలు), ఢిల్లీ క్యాపిటల్స్ (7 మ్యాచ్ల్లో 3 విజయాలు) పోటీ పడుతున్నాయి. యూపీ వారియర్జ్ 7 మ్యాచ్ల్లో రెండే విజయాలతో టేబుల్ చివరి స్థానంలో ఉంది.
భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..!
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఫైసల్ షినోజాదా భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఐర్లాండ్తో ఇవాళ (జనవరి 30) జరిగిన మ్యాచ్లో 142 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో 163 పరుగులు చేశాడు. ఫైసల్తో పాటు కెప్టెన్ మహబూబ్ ఖాన్ (89) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగిపోయారు. కలిసికట్టుగా రాణించి ఐర్లాండ్ను 40.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూల్చారు. తద్వారా ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్లు 191 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ 1 (సూపర్ సిక్స్) నుంచి సెమీఫైనల్ (ఆస్ట్రేలియాతో పాటు) బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో అప్పటిదాకా సెమీస్ రేసులో ఉండిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ కూడా ఇంటిముఖం పట్టాయి. గ్రూప్-2 విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఇంగ్లండ్ ఒక్కటే ఇప్పటివరకు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం భారత్, పాకిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జింబాబ్వే జట్లు నిష్క్రమించాయి.ఇదిలా ఉంటే, ఐర్లాండ్తో మ్యాచ్లో భారీ శతకం బాదిన ఫైసల్ షినోజాదాపై సోషల్మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ జరుగుతుంది. ఫైసల్ను చూసిన వారు ఇతను 17 ఏళ్ల పిల్లాడేంటీ అని అవాక్కవుతున్నారు. వయసు తక్కువగా చూపించుకొని, తప్పుడు ధృవపత్రాలతో అతను అండర్-19 విభాగంలో ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా పాకిస్తాన్ ఆటగాళ్ల విషయంలో ఇలాంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఆఫ్ఘనివస్తాన్ ఆటగాడు దీనికి బలయ్యాడు. వాస్తవానికి ఫైసల్ను చూస్తే నిజంగానే ఎవరూ 17 ఏళ్ల కుర్రాడంటే ఒప్పుకోరు. అతని ఆహార్యం మధ్యవయస్కుడిలా కనిపిస్తుంది. భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కూడా ఇలాంటి ట్రోలింగ్నే ఎదుర్కొన్నాడు. అతను భారీ షాట్లు ఆడే విధానం చూసి, గిట్టని వారు వ్యతిరేక కామెంట్లు చేశారు.
నార్వే చెస్ టోర్నీకి దివ్య
స్టావెంజర్ (నార్వే): ప్రపంచకప్ చాంపియన్, భారత గ్...
మన్ప్రీత్ సింగ్పై వేటు
భారత హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్...
సబలెంకా X రిబాకినా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్...
ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ఓటమి
జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్షిప్లో ఇండియ...
టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే అన్ని జట్ల పూర్తి వివరాలు
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయ...
ఫైనల్లో ఆర్సీబీ.. మరి ఆ రెండు బెర్తులు దక్కేదెవరికి?
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ తుది అంకానికి చేర...
టీ20 ప్రపంచకప్ కోసం యూఎస్ఏ జట్టు ప్రకటన
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్...
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అతి పెద్ద సంచలనాలు ఇవే..!
టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందో అంచనా...
క్రీడలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
వీడియోలు
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
