ప్రధాన వార్తలు
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన కృనాల్ పాండ్యా
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి గ్రేట్ న్యూస్ అందుతుంది. ఆ ఫ్రాంచైజీ స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. బ్యాట్తో పోలిస్తే బంతితో మెరుగ్గా రాణించే కృనాల్.. విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్తోనూ చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా బెంగాల్ (63 బంతుల్లో 57), ఉత్తర్ప్రదేశ్పై (77 బంతుల్లో 82) అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్పై మరింత రెచ్చిపోయి విధ్వంసకర శతకం బాదాడు.కేవలం 63 బంతుల్లోనే 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 109 పరుగులు చేశాడు. కృనాల్కు ఓపెనర్లు నిత్యా పాండ్యా (122), అమిత్ పాసి (127) సెంచరీలు కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కృనాల్ జట్టు బరోడా భారీ స్కోర్ (417-4) చేసింది. ఇదే బరోడా జట్టులో సభ్యుడైన టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొని ఖాతా కూడా తెరవలేకపోయాడు. నిత్యా, పాసి, కృనాల్ మెరుపు శతకాలతో కదంతొక్కడంతో హైదరాబాద్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్ మిలింద్ 2, త్యాగరాజన్, వరుణ్ గౌడ్ తలో వికెట్ తీశారు.
2026 టీ20 ప్రపంచకప్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన
వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 31) ప్రకటించారు. ఈ జట్టును స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ముందుండి నడిపించనున్నాడు. స్టార్ ఆటగాళ్లు గుల్బదిన్ నైబ్, నవీన్ ఉల్ హక్ రీఎంట్రీ ఇచ్చారు. 20 ఏళ్ల వికెట్కీపర్ బ్యాటర్ మహ్మద్ ఇషాక్ కొత్తగా జట్టులోకి వచ్చాడు.తాజాగా జింబాబ్వే సిరీస్లో ఆడిన షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మాలిక్, బషీర్ అహ్మద్, ఇజాజ్ అహ్మద్, అహ్మద్జాయ్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. మొత్తంగా ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ఈ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఛాంపియన్ జట్లకు సైతం వణుకు పుట్టిస్తుంది. ఈ జట్టులో రషీద్ ఖాన్ సహా చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. నూర్ అహ్మద్, సెదిఖుల్లా అటల్, ఫజల్ హక్ ఫారూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఇబ్రహీం జద్రాన్ లాంటి ప్లేయర్లు ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. పైగా వీరికి భారత్, శ్రీలంకలో పరిస్థితులపై సరైన అవగాహన కూడా ఉంది. అందుకే ఈ ఆఫ్ఘనిస్తాన్ జట్టును చూసి భారత్ సహా మిగతా జట్లన్నీ అప్రమత్తం అవుతున్నాయి.2026 టీ20 ప్రపంచకప్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు..రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సదిఖుల్లా అటల్, ఫజల్ హక్ ఫారూకీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్-ఉల్-హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమాల్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, దర్వీష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్రిజర్వ్ ఆటగాళ్లు: అల్లా ఘజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ. ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-డిలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ, కెనడా జట్లు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 8న న్యూజిలాండ్తో చెన్నైలో ఆడనుంది. ప్రపంచకప్కు ముందు (జనవరి 19 నుంచి) ఇదే ఆఫ్ఘనిస్తాన్ జట్టు యూఏఈ వేదికగా వెస్టిండీస్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది.
వరుస శతకాలతో దూసుకుపోతున్న పడిక్కల్, రుతురాజ్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా యువ బ్యాటర్, కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవ్దత్ పడిక్కల్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. 4 మ్యాచ్ల్లో 3 శతకాలతో శతక మోత మోగించాడు. తాజాగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో 116 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసిన అతను.. జార్ఖండ్ (118 బంతుల్లో 147; 10 ఫోర్లు, 7 సిక్సర్లు), కేరళపై (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా శతకాలు బాదాడుతాజా శతకంతో లిస్ట్-ఏ క్రికెట్లో పడిక్కల్ శతకాల సంఖ్య 12కి చేరింది. పడిక్కల్ కేవలం 36 ఇన్నింగ్స్ల్లోనే 12 శతకాలు, 12 అర్ద శతకాలతో 80కిపైగా సగటుతో 2300 పైచిలుకు పరుగులు చేశాడు.పుదుచ్చేరితో మ్యాచ్లో పడిక్కల్తో పాటు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (124 బంతుల్లో 132; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సెంచరీలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో పడిక్కల్, మయాంక్ సెంచరీలకు కరుణ్ నాయర్ (34 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ కూడా తోడైంది.సూపర్ సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్ఇవాళే (డిసెంబర్ 31) జరిగిన మరో మ్యాచ్లో మరో టీమిండియా యువ బ్యాటర్, మహారాష్ట్ర స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (113 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అద్భుత శతకంతో కదంతొక్కాడు. ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ ఈ శతకం బాదాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (50-3) రుతురాజ్ బ్యాట్ నుంచి ఈ క్లాసిక్ సెంచరీ వచ్చింది. రుతురాజ్ శతకం కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర భారీ స్కోర్ (331-7) చేసింది.ఈ సెంచరీతో రుతురాజ్ తన లిస్ట్-ఏ శతకాల సంఖ్యను 19కి పెంచుకున్నాడు. రుతురాజ్ ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ సెంచరీ చేశాడు. ఈ ఏడాది రుతురాజ్ ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. బుచ్చిబాబు ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇండియా-ఏ, ఇండియా, తాజాగా విజయ్ హజారే ట్రోఫీ.. ఇలా ఆడిన ప్రతి ఫార్మాట్లోనూ సెంచరీలు చేసి, విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా ఆశాకిరణంగా మారాడు.
సూర్యతో రొమాంటిక్ రిలేషన్షిప్?.. మాట మార్చిన ‘బ్యూటీ’!
వరుస విజయాలతో జోరు మీదున్నాడు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ద్వైపాక్షిక సిరీస్లలో విజయవంతమైన సారథిగా కొనసాగుతున్న ఈ ముంబైకర్.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్తో బిజీ కానున్నాడు.టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా సాగే ఈ సిరీస్లో బ్యాటర్గానూ సత్తా చాటి విమర్శలకు చెక్ పెట్టాలని సూర్యకుమార్ పట్టుదలగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిశా శెట్టితో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.అదే సమయంలో సూర్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త వైరల్ అయింది. బాలీవుడ్, టీవీ నటి ఖుషి ముఖర్జీ.. సూర్యకుమార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది క్రికెటర్లు నా వెంట పడ్డారు. కానీ నాకు క్రికెటర్తో డేటింగ్ చేసే ఉద్దేశం లేదు.సూర్యకుమార్ యాదవ్ తరచూ మెసేజ్లు చేసేవాడు. అయితే, మా ఇద్దరి మధ్య ఎక్కువగా సంభాషణ జరుగలేదు. నా పేరు వేరొకరితో ముడిపడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు’’ అని ఖుషి ముఖర్జీ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సూర్యపై కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్కు దిగారు. భార్య దేవిశానే ప్రపంచంగా బతికినట్లు కనిపించే సూర్య ఇలాంటి వాడని అనుకోలేదంటూ కామెంట్లు చేశారు.తన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఖుషి ముఖర్జీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్తో తనకు ఎలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్ లేదని స్పష్టం చేసింది. తన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. తమకు నచ్చిన రీతిలో వాటిని వ్యాప్తి చేశారని పేర్కొంది. అంతేకాదు.. తన ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందన్న ఖుషి.. సూర్యతో తాను ఓ ఫ్రెండ్గా మాట్లాడి ఉంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించింది. గతంలో తమ మధ్య స్నేహ బంధం ఉండేదని.. అయితే ఇప్పుడు టచ్లో లేమని తెలిపింది.
జైసూ జస్ట్ మిస్.. సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న జైసూ.. సొంత జట్టు ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ 2025-26లో భాగంగా గోవాతో మ్యాచ్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.జైపూర్ వేదికగా గోవాతో మ్యాచ్లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో ఓపెనర్లలో అంగ్క్రిష్ రఘువన్షి (11) త్వరగానే పెవిలియన్ చేరగా.. వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్తో కలిసి యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) నిలకడగా ఆడాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 70 పరుగులు జోడించారు.జైసూ జస్ట్ మిస్.. అయితే, అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జైసూ దర్శన్ మిసాల్ (Darshan Misal) బౌలింగ్లో స్నేహల్ కౌతంకర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గోవాతో మ్యాచ్లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. ఆరు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ముషీర్ ఖాన్కు తోడైన.. అతడి అన్న, టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ దుమ్ములేపాడు.సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకంతమ్ముడు ముషీర్ (60)తో కలిసి మూడో వికెట్కు 93 పరుగులు జోడించిన సర్ఫరాజ్ ఖాన్.. విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.మొత్తంగా 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు బాదిన సర్ఫరాజ్ ఖాన్.. 157 పరుగులు చేసి దర్శన్ మిసాల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మిగిలిన వారిలో హార్దిక్ తామోర్ హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 53)తో మెరవగా.. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (8 బంతుల్లో 27) మెరుపులు మెరిపించాడు.ముంబై భారీ స్కోరుఇక సిద్దేశ్ లాడ్ 17, షామ్స్ ములాని 22 పరుగులు చేయగా.. ఆఖర్లో తనుశ్ కొటియాన్ (12 బంతుల్లో 23), తుషార్ దేశ్పాండే (3 బంతుల్లో 7) ధనాధన్ దంచికొట్టి అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ముంబై ఎనిమిది వికెట్ల నష్టానికి 444 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. గోవా బౌలర్లలో దర్శన్ మిసాల్ మూడు వికెట్లు కూల్చగా.. వాసుకి కౌశిక్, లలిత్ యాదవ్ చెరో రెండు, దీప్రాజ్ గవోంకర్ ఒక వికెట్ కూల్చారు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్!
ప్రాణాపాయ స్థితిలో ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డామియన్ మార్టిన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మెనింజైటిస్ కారణంగా తీవ్ర అనార్యోగానికి గురైన అతడు ప్రస్తుతం క్వీన్స్లాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న మార్టిన్కు వైద్యులు మత్తు మందు ఇచ్చి.. తాత్కాలికంగా కోమాలోకి వెళ్లేలా చేశారు.తాత్కాలికంగా కోమాలోకి పంపిమెనింజైటిస్ వల్ల మార్టిన్ మెదడు, ఇతర అవయవాలు పూర్తిగా చెడిపోకుండా ఉండేందుకు వైద్య ప్రక్రియలో భాగంగా డాక్టర్లు ఈ మేరకు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగిని తాత్కాలికంగా కోమాలోకి పంపడం ద్వారా కార్డియాక్ అరెస్ట్ వంటి విపత్కర పరిస్థితుల నుంచి తప్పించే అవకాశం ఉంటుంది.పదివేలకు పైగా పరుగులుకాగా 1992 నుంచి 2006 మధ్యకాలంలో డామియన్ మార్టిన్ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 4406, 5346, 120 పరుగులు సాధించాడు.ఇక ఇటీవల ఆసీస్- ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్టుకు ముందు మార్టిన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మార్టిన్ ఐసీయూలో ఉన్నాడన్న వార్తతో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.త్వరగా తిరిగి రావాలిఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లెహమాన్ స్పందిస్తూ.. ‘‘డామియన్ మార్టిన్.. ఓ యోధుడు. త్వరలోనే అతడు పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలి’’ అని ఆకాంక్షించాడు. మరోవైపు.. మార్టిన్ ప్రాణ స్నేహితుడు ఆడం గిల్క్రిస్ట్ న్యూస్ కార్ప్తో మాట్లాడుతూ.. ‘‘అతడికి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. అతడి కుటుంబానికి అందరమూ అండగా ఉందాము. అతడి ఆరోగ్యం కోసం ప్రార్థించండి’’ అని పిలుపునిచ్చాడు.కాగా మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే రక్షిత పొరలు మెనింజెస్లో వాపు వస్తే.. ఆ పరిస్థితిని మెనింజైటిస్ అంటారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఇందుకు ప్రధాన కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, మెడ బిగుసుకుపోవడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కావొచ్చు కూడా!.. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్!
చెలరేగిన ‘టీమిండియా’ స్టార్లు.. 63 పరుగులకే ఆలౌట్!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా జమ్మూ కశ్మీర్తో మ్యాచ్లో బెంగాల్ పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రత్యర్థి జట్టును 63 పరుగులకే ఆలౌట్ చేశారు. దేశీ వన్డే టోర్నీ గ్రూప్-బిలో భాగంగా జమ్మూ కశ్మీర్తో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.శుభారంభం అందించిన షమీకెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ నమ్మకాన్ని నిలబెడుతూ బెంగాల్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జమ్మూ కశ్మీర్ టాపార్డర్లో ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (0)ను డకౌట్ చేసి.. టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ శుభారంభం అందించాడు.షమీకి తోడుగా టీమిండియా స్టార్లు ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ నిప్పులు చెరుగుతూ జమ్మూ కశ్మీర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వన్డౌన్లో వచ్చిన మురుగన్ అశ్విన్ (0)ను ఆకాశ్ దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. ఓపెనర్ శుభం ఖజూరియా (12)ను ముకేశ్ వెనక్కి పంపాడు.చెలరేగిన ముకేశ్, ఆకాశ్ఇక యావర్ హసన్ (1) రూపంలో షమీ తన రెండో వికెట్ తీయగా.. కెప్టెన్ పారస్ డోగ్రా (19) సహా అబ్దుల్ సమద్ (8), యుధ్వీర్ సింగ్ చరక్ (7) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. ముకేశ్ కుమార్.. రిధమ్ శర్మ (7), అబిద్ ముస్తాక్ (2), అకిబ్ నబీ దార్ (0)లను పెవిలియన్కు పంపాడు.మొత్తంగా షమీ రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి.. జమ్మూ కశ్మీర్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఫలితంగా 20.4 ఓవర్లలో కేవలం 63 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్ ఆలౌట్ అయింది. కాగా బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ, ముకేశ్ కుమార్ చాన్నాళ్లుగా టీమిండియాకు దూరం కాగా.. ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలైలో చివరగా భారత జట్టుకు ఆడాడు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్!
పీసీబీ కీలక నిర్ణయం.. మరోసారి..
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశిస్తున్న పాకిస్తాన్ జట్టు... కాంట్రాక్టు ముగియడానికి మూడు నెలల ముందే అజహర్ మహమూద్ను టెస్టు హెడ్ కోచ్ నుంచి తప్పించనున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా జాతీయ జట్టుకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న అజహర్ స్థానంలో కొత్త కోచ్ను నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రయత్నాలు ప్రారంభించింది.మరోసారి ‘హెడ్కోచ్’పై వేటుడబ్ల్యూటీసీ 2025–27లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడి 50 పాయింట్ల శాతంతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గతేడాది టెస్టు ఫార్మాట్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అజహర్ (Azhar Mahmood) కాంట్రాక్టు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. అయితే అంతకుముందే అతడిని తొలగించేందుకు సిద్ధమైంది.ప్రధాన కోచ్తో పాటు‘మార్చితో అజహర్ మహమూద్ కాంట్రాక్ట్ ముగియనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టు టెస్టు సిరీస్లు ఆడనుంది. అయితే మ్యాచ్ల ఆరంభానికి ముందే కొత్త కోచ్ను నియమించేందుకు బోర్డు ప్రయత్నాలు చేస్తోంది’ అని ఓ అధికారి తెలిపారు. ప్రధాన కోచ్తో పాటు మొత్తం శిక్షణ బృందం కోసం పీసీబీ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ జట్టు... బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇంగ్లండ్లో పర్యటించనుంది.జట్టు ఎంపిక విషయంలో పొరపొచ్చాలు రావడంతో ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసెన్ గిలెస్పీ గతేడాది టెస్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట ఆఖిబ్ జావేద్, ఆ తర్వాత అజహర్ మహమూద్ ఆ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు.. మహిళల జట్టు కోసం కూడా కొత్త కోచింగ్ సిబ్బంది కోసం పాకిస్తాన్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది.చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్!
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మంచి రోజులు వచ్చాయా? త్వరలోనే అతడు భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడా? అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.వాగ్యుద్ధంఆస్ట్రేలియా పర్యటనకు ముందు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar).. షమీ ఫిట్నెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు పూర్తి ఫిట్గా లేడని.. అందుకే ఈ టూర్కు ఎంపిక చేయలేదని తెలిపాడు. ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని.. రంజీల్లో ఆడుతున్న వాడిని వన్డేల్లో ఆడలేనా? అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఇందుకు ప్రతిగా అగార్కర్.. మరోసారి తన మాటకు కట్టుబడే ఉన్నానంటూ.. షమీ పూర్తి ఫిట్గా లేడని పునరుద్ఘాటించాడు. అయితే, షమీ (Mohammed Shami) కూడా తగ్గేదేలే అన్నట్లు మాటలతో పాటు.. ఆటతోనూ సమాధానం ఇచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమనే సంకేతాలు వచ్చాయి.అయితే, తాజాగా బీసీసీఐ (BCCI) వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. షమీ గురించి సానుకూలంగా స్పందించాయి. వన్డే వరల్డ్కప్-2027 టోర్నమెంట్కు ఎక్కువ సమయం లేదు కాబట్టి.. షమీని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.ఇంకా పోటీలోనే ఉన్నాడుఈ మేరకు.. ‘‘సెలక్షన్ సమయంలో మొహమ్మద్ షమీ గురించి తరచూ చర్చ నడుస్తుంది. అతడు ఇంకా పోటీలోనే ఉన్నాడు. అయితే, అతడి ఫిట్నెస్ గురించే బోర్డుకు ఆందోళనగా ఉంది. వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్ అతడు.కివీస్తో సిరీస్కు.. వరల్డ్కప్కూ ఎంపిక కావొచ్చు!అలాంటి ఆటగాడు సెలక్షన్ రాడార్లో లేకపోవడం అనే మాటే ఉండదు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు అతడి ఆట మెరుగ్గా సాగుతోంది. ఒకవేళ ఈ సిరీస్కు అతడిని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.షమీ అనుభవజ్ఞుడైన బౌలర్. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయగలడు. 2027 వరల్డ్కప్ జట్టుకూ అతడు ఎంపికయ్యే అవకాశం లేకపోలేదు’’ అని బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో పేర్కొన్నాయి. కాగా వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాడు.మెరుగైన ప్రదర్శనఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో షమీది కీలక పాత్ర. ఈ ఈవెంట్లో తొమ్మిది వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత బెంగాల్ తరఫున దేశీ క్రికెట్లో రంజీల్లో కేవలం నాలుగు మ్యాచ్లలోనే 20 వికెట్లు తీసి సత్తా చాటాడు.ప్రస్తుతం దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. జనవరి 11 నుంచి టీమిండియా- న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
భారత ఆల్రౌండర్ ప్రపంచ రికార్డు
శ్రీలంకతో టీ20 సిరీస్లో భారత మహిళా జట్టు పరిపూర్ణ విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో పదిహేను పరుగుల తేడాతో నెగ్గి మరోసారి ఆధిపత్యం కనబరిచింది. సిరీస్ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో రాణించి 5-0తో క్లీన్స్వీప్ చేసింది.గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ ప్రపంచ రికార్డు సాధించింది. శ్రీలంక బ్యాటర్ నీలాక్షిక సిల్వాను లెగ్ బిఫోర్ వికెట్గా వెనక్కి పంపిన ఈ రైటార్మ్ బ్రేక్ స్పిన్నర్.. అంతర్జాతీయ టీ20లలో 152వ వికెట్ను తన ఖాతాలో వేసుకుంది.𝗟𝗕𝗪 ☝️🎥 The moment Deepti Sharma became the most successful bowler in women's T20Is 😎Updates ▶️ https://t.co/E8eUdWSQXs#TeamIndia | #INDvSL | @Deepti_Sharma06 | @IDFCFIRSTBank pic.twitter.com/zelk7cRLiw— BCCI Women (@BCCIWomen) December 30, 2025 తద్వారా మహిళల ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ మేగన్ షట్ (151) పేరిట ఉండేది.హర్మన్, అమన్, అరుంధతి మెరుపులుకాగా లంకతో ఐదో టీ20లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (5), జి.కమలిని (12).. వన్డౌన్లో వచ్చిన హర్లిన్ డియోల్ (13) తీవ్రంగా నిరాశపరిచారు.మిగతా వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (5), దీప్తి శర్మ (7) విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట దశలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 68) బాధ్యతాయుతంగా ఆడింది. ఆమెకు తోడుగా అమన్జోత్ కౌర్ (18 బంతుల్లో 21), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్) రాణించారు.సమిష్టిగా రాణించిన భారత బౌలర్లుఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 175 పరుగులు స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ హాసిని పెరీరా (65), వన్డౌన్ బ్యాటర్ ఇమేషా దులాని (50) అర్ధ శతకాలు వృథా అయ్యాయి.భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్జోత్ కౌర్.. తలా ఒక వికెట్ తీసి సమిష్టిగా రాణించారు.నంబర్ వన్ ర్యాంకులోనే దీప్తి శర్మఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్లో సమష్టిగా చెలరేగడంతో భారత ప్లేయర్ల ర్యాంకింగ్లు మెరుగయ్యాయి. 738 రేటింగ్ పాయింట్లతో దీప్తి నంబర్వన్గా కొనసాగుతుండగా, భారత పేసర్ రేణుకా సింగ్ ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకుంది.705 పాయింట్లతో రేణుక...ఎంలాబా (దక్షిణాఫ్రికా)తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. టీ20 ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో వెస్టిండీస్ క్రీడాకారిణి హేలీ మాథ్యూస్ (505 ర్యాంకింగ్ పాయింట్లు) తన టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో షఫాలీ వర్మ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుంది. ఇప్పటి వరకు పదో స్థానంలో ఉన్న ఆమె 736 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. ఒక స్థానం కోల్పోయిన జెమీమా రోడ్రిగ్స్ పదో ర్యాంక్కు పరిమితం అయింది. చదవండి: సచిన్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి.. ఇంకో 25 పరుగులే!5⃣ matches5⃣ victories 👏#TeamIndia complete an emphatic series sweep with a 15-run win in Trivandrum 🥳Scorecard ▶️ https://t.co/E8eUdWSQXs#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/tV5VlXq5GB— BCCI Women (@BCCIWomen) December 30, 2025
కొంచెం మోదం... కొంచెం ఖేదం
పురుషుల హాకీ, బ్యాడ్మింటన్, షూటింగ్ ప్రతీ సంవత్సర...
పావని డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: సౌత్జోన్ ఆక్వాటిక్ చాంపియన్...
విజేత సూర్య చరిష్మా
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప...
హంపి, అర్జున్లకు కాంస్యాలు
దోహా: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో భారత...
చెలరేగిన ‘టీమిండియా’ స్టార్లు.. 63 పరుగులకే ఆలౌట్!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా జమ్మూ కశ్మీర్...
పీసీబీ కీలక నిర్ణయం.. మరోసారి..
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో మెరుగ...
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మంచి రోజు...
భారత ఆల్రౌండర్ ప్రపంచ రికార్డు
శ్రీలంకతో టీ20 సిరీస్లో భారత మహిళా జట్టు పరిపూర్ణ...
క్రీడలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
నా సూపర్స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
వీడియోలు
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!
సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్
భారత్ సిరీస్ క్లీన్ స్వీప్.. శ్రీలంక చిత్తు..
మహిళా క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్
సిరీస్ పై భారత్ ఫోకస్
ఇషాన్ ఊచకోత.. MS ధోని రికార్డు బ్రేక్
శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..
దుఃఖాన్ని దిగమింగుకొని స్మృతి మంధాన విశ్వరూపం
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
