Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Abhishek Sharma respond on Rohit Sharma Role1
'హిట్‌మాన్'పై అభిషేక్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు

టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ‌పై యువ‌ ఓపెన‌ర్ అభిషేక్ శర్మ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశాడు. హిట్‌మాన్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నాన‌ని చెప్పాడు. టి20 ప‌వ‌ర్ ప్లేలో రోహిత్ శర్మలా ఆడ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని అన్నాడు. త‌నపై హిట్‌మాన్ ప్ర‌భావం గురించి జియోస్టార్‌తో మాట్లాడుతూ.. "రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. పవర్‌ప్లేలో అతడు ఇచ్చే ప్రారంభాల కారణంగా ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుందని అన్నాడు. రోహిత్ శ‌ర్మ పాత్ర పోషించాల‌ని కోచ్ గౌత‌మ్ గంభీర్ తన‌కు సూచించిన‌ట్టు వెల్ల‌డించాడు.గంభీర్‌తో కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) ప్రోత్సహంతో తాను రోహిత్ శ‌ర్మ ఫార్ములాను అనుస‌రిస్తున్నాన‌ని అభిషేక్ తెలిపాడు. "నేను జట్టులోకి వచ్చినప్పుడు.. కోచ్, కెప్టెన్ నా నుంచి అదే ఆశించారు. తొలి బంతి నుంచే విరుచుకుప‌డ‌డం నాకు ఇష్టం కాబ‌ట్టి.. అది నా శైలికి కూడా సరిపోతుందని భావించాను. రోహిత్ భాయ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. టీమిండియా తరపున ఇలా ఆడుతూ రాణించడం నాకు నిజంగా సంతోషంగా ఉంద''ని అన్నాడు.దూకుడుగా ఆడటమే నా పనిత‌న ఆట‌తీరును మెరుగు ప‌రుచుకోవ‌డానికి నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తూ ఉంటాన‌ని అభిషేక్ శ‌ర్మ చెప్పాడు. ప‌వ‌ర్ ప్లేలో దూకుడుగా ఆడి.. జ‌ట్టు భారీస్కోరుకు బాట‌లు వేయాల‌ని భావిస్తాన‌ని చెప్పాడు. "నేను ఇంకా పూర్తిగా పరిణతి చెందానని చెప్పను, ఎందుకంటే ఎల్లప్పుడూ మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఆరు ఓవర్లలో దూకుడుగా క్రికెట్ ఆడటమే నా పని అని భావిస్తున్నాను. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మంచి ఆరంభం ఇస్తే జట్టు ఆ ఊపును అనుసరించగలదని నాకు తెలుసు. అందుకే జ‌ట్టుకు ఆరంభం ఇవ్వాల‌ని ప్ర‌తిసారి అనుకుంటాన‌''ని ఈ డాషింగ్ ఓపెన‌ర్ పేర్కొన్నాడు.వారితో ప్రాక్టీస్ చేస్తాటి20 ప్ర‌పంచ‌క‌ప్‌కు స‌న్న‌ద్ధ‌త కోసం మాట్లాడుతూ.. త‌న దూకుడుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తాన‌ని, మ్యాచ్‌లకు ముందు తానెప్పుడూ ఇదే ఫాలో అవుతాన‌ని అన్నాడు. ''నాకు వారం లేదా 10 రోజులు సమయం దొరికినప్పుడు, తదుపరి సిరీస్ లేదా మ్యాచ్‌లలో నేను ఎదుర్కొన‌బోయే బౌలర్లను గుర్తుంచుకుంటాను. వారిలా బౌలింగ్ చేసే వారితో ప్రాక్టీస్ చేస్తాను. కొత్త బంతితో అవుట్-స్వింగర్లు, ఇన్-స్వింగర్లు వేయ‌మ‌ని చెప్పి బ్యాటింగ్ చేస్తుంటాను. టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా భిన్న‌మైన పరిస్థిల్లో వేర్వేరు జట్లతో ఆడాల్సి ఉంటుంది కాబ‌ట్టి ప్రిప‌రేష‌న్ చాలా ముఖ్య‌మ‌''ని అభిషేక్ అభిప్రాయ‌ప‌డ్డాడు.ప‌వ‌ర్ హిట్టింగ్‌తో హిట్‌2024, జూలైలో టి20లో అరంగేట్రం చేసిన అభిషేక్ శ‌ర్మ‌ ప‌వ‌ర్ హిట్టింగ్‌తో త‌న స్థానాన్ని జ‌ట్టులో సుస్థిరం చేసుకున్నాడు. అతి త‌క్కువ కాలంలోనే నంబ‌ర్‌వ‌న్ బ్యాటర్ ఎదిగాడు. ఇప్పటివరకు 34 ఇంట‌ర్నేష‌న‌ల్‌ మ్యాచ్‌లు ఆడి 190.92 స్ట్రైక్ రేట్‌తో 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఫిబ్ర‌వ‌రి 7 నుంచి జ‌రిగే టి20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ త‌న జోరును కొన‌సాగించాల‌ని ఈ ఎడంచేతి వాటం ఓపెన‌ర్ ఉవ్విళ్లూరుతున్నాడు. చ‌ద‌వండి: ప్ర‌ధాని త‌ర్వాత క‌ష్ట‌మైన జాబ్‌.. గంభీర్‌పై ప్ర‌శంస‌లు

BCCI Confirmed to scrap A+ from central contracts But Bumrah2
దిగ్గజాలకు షాక్‌!.. అది నిజమే: బీసీసీఐ

ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టు గ్రేడ్‌లలో మార్పులపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. A+ గ్రేడ్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా శనివారం ధ్రువీకరించారు.బోర్డు సంతృప్తితో లేదు‘‘A+ గ్రేడ్‌ను తొలగించే విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రస్తుతం ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు కాకుండా.. కేవలం ఒకే ఒక్క ఫార్మాట్‌ ఆడేందుకు సుముఖంగా ఉన్నారు. A+ గ్రేడ్‌లో కొనసాగేందుకు కావాల్సిన అర్హతలు ఇప్పుడు ఎవరూ కలిగిలేరు. ఈ విషయంలో బోర్డు సంతృప్తితో లేదు.ఈ గ్రేడ్‌లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడవద్దని నిర్ణయించుకున్నారు. మా నిబంధనలకు అనుగుణంగా ఎవరూ లేరు కాబట్టి ఈ గ్రేడ్‌ను తీసివేయాలని ఫిక్సయిపోయాం’’ అని దేవజిత్‌ సైకియా స్పోర్ట్స్‌స్టార్‌తో పేర్కొన్నారు.రో-కో వన్డేలలో మాత్రమేకాగా గతేడాది ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్టులలో బ్యాటింగ్‌ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మలతో పాటు.. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా మాత్రమే A+ గ్రేడ్‌లో ఉన్నారు. వీరిలో కోహ్లి, రోహిత్‌ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్‌ అయ్యారు.మరోవైపు.. జడేజా కూడా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. ఇక బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడుతున్నా పనిభారం తగ్గించుకునే క్రమంలో అతడు ఎక్కువసార్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే, టెక్నికల్‌గా మాత్రం మూడు ఫార్మాట్లు ఆడుతున్నట్లే లెక్క.బుమ్రాకు మాత్రం ఏడు కోట్లు?ఈ క్రమంలో రో-కోలతో పాటు జడ్డూకు వార్షిక తగ్గించే విషయంలో నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ.. బుమ్రాకు A+ గ్రేడ్‌ మాదిరే మాత్రం రూ. 7 కోట్లు జీతంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా A గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు. అదే విధంగా C గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి వార్షిక జీతంగా చెల్లిస్తోంది బీసీసీఐ.చదవండి: RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్‌ కపూర్‌!

T20 WC 2026: ICC Replaces Bangladesh with Scotland Now Official3
ICC: బై.. బై.. బంగ్లాదేశ్‌.. స్కాట్లాండ్‌ వచ్చేసింది

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి బంగ్లాదేశ్‌కు ఉద్వాసన తప్పలేదు. భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమంటూ పంతం పట్టిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) గట్టిషాకిచ్చింది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. ప్రస్తుత టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా స్కాట్లాండ్‌కు ఐసీసీ ఈ అవకాశం ఇచ్చింది.కాగా గత కొంతకాలంగా భారత్‌- బంగ్లాదేశ్‌ (IND vs BAN) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడి నుంచి మొదలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను (Mustafizur Rahman) ఐపీఎల్‌ నుంచి తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేసింది.ఈ పరిణామాల క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమని బీసీబీ.. ఐసీసీకి తెలియజేసింది. భద్రతాపరమైన ముప్పులు ఉన్నందున తమ వేదికను శ్రీలంకకు మార్చాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పరిశీలనా బృందం నుంచి వివరాలు తీసుకున్న ఐసీసీ. భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీలేదని తేల్చింది.మొండి వైఖరి అయితే, బీసీబీ మాత్రం మొండి వైఖరి అవలంబించింది. తాము భారత్‌లో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని పంతం పట్టింది. ఐసీసీ గడువు ఇచ్చినప్పటికీ తమ నిర్ణయం ఇదేనంటూ సవాలు విసిరినట్లుగా మాట్లాడింది. అంతేకాదు ఆఖరి ప్రయత్నంగా వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఆశ్రయించింది.ముందుగా హెచ్చరించినట్లుగానేతాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్‌సీని బీసీబీ కోరింది. అయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్‌సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేకపోయింది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఐసీసీ.. ముందుగా హెచ్చరించినట్లుగానే బంగ్లాదేశ్‌ స్థానాన్ని స్కాట్లాండ్‌తో భర్తీ చేసినట్లు క్రిక్‌బజ్‌ తన కథనంలో వెల్లడించింది. ఈ విషయం గురించి బీసీబీకి ఐసీసీ లేఖ కూడా రాసినట్లు పేర్కొంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ జరుగనుంది. ఇందుకు భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక ఈసారి ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటుండగా. గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, నేపాల్‌, ఇటలీలతో కలిసి ఉంది బంగ్లాదేశ్‌. ఇప్పుడు ఆ స్థానంలో స్కాట్లాండ్‌ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్‌ ఆరోపణలు

Kohli's wife Anushka, Ranbir Kapoor interested in buying RCB stake: Report4
RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్‌ కపూర్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)కు ఉన్న క్రేజే వేరు. టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి ఈ జట్టులో భాగం కావడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, ప్రతి ఏడాది.. ‘‘ఈసారి కప్‌ మనదే’’ అనుకుంటూ సోషల్‌ మీడియాలో సందడి చేసే ఆర్సీబీ అభిమానులకు పదిహేడేళ్లపాటు చేదు అనుభవమే మిగిలింది.పద్దెనిమిదేళ్లకుఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) కెప్టెన్సీలోని ఆర్సీబీ ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గింది. లీగ్‌ మొదలైన (2008) నాటి నుంచి జట్టుతోనే ఉన్న కోహ్లి.. పద్దెనిమిదేళ్లకు తర్వాత తొలిసారి ట్రోఫీని ముద్దాడి ఉద్వేగానికి లోనయ్యాడు.చేతులు మారనున్న యాజమాన్యంఈ క్రమంలో విజయోత్సవాన్ని జరుపుకొనేందుకు సిద్ధమైన ఆర్సీబీ, ఫ్యాన్స్‌ విషాదంలో మునిగిపోవాల్సి వచ్చింది. తొక్కిసలాటలో అభిమానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం నుంచి ఆర్సీబీ మ్యాచ్‌లు తరలిపోనున్నాయి. ఇందుకు తోడు ఆర్సీబీ యాజమాన్యం కూడా చేతులు మారనుంది.ఆదార్‌ పూనావాలా ఆసక్తిఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్‌ డియాజియో ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. విపరీతమైన ఆదరణ కలిగి ఉన్న ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ ఆదార్‌ పూనావాలా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి.‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్‌ కపూర్‌!తాజా సమాచారం ప్రకారం.. ఆర్సీబీలో వాటాలు కొనేందుకు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మ ఆర్సీబీలో మూడు శాతం వాటా కోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది.మరోవైపు.. రణ్‌బీర్‌ కపూర్‌ సైతం రెండు శాతం వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా ఆర్సీబీ విలువ పెరగడంలో కోహ్లిది కీలక పాత్ర. అలాంటి ఫ్రాంఛైజీలోకి కోహ్లి జీవిత భాగస్వామి పెట్టుబడిదారుగా రావడాన్ని బీసీసీఐ ఆమోదిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ద్వంద్వ ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు వీలుగా ఐపీఎల్‌ జట్లలో ఆటగాళ్లు (యాక్టివ్‌) ఎలాంటి వాటాలు కొనుగోలు చేయకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. చదవండి: ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన

IND vs NZ 2nd T20I: Hardik Pandya Murali Karthik Animated Chat Goes Viral5
మాజీ క్రికెటర్‌తో హార్దిక్‌ పాండ్యా గొడవ!?.. వీడియో వైరల్‌

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో టీమిండియాలో పునరాగమనం చేశాడు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా. ఆసియా టీ20 కప్‌-2025 సందర్భంగా గాయపడిన అతడు పూర్తిగా కోలుకుని దేశీ క్రికెట్లో సొంత జట్టు బరోడా తరఫున బరిలో దిగినప్పటికీ.. కివీస్‌తో వన్డే సిరీస్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ అతడికి విశ్రాంతినిచ్చింది.మొత్తంగా రెండు వికెట్లుఈ క్రమంలో నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్‌.. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్‌ తీశాడు. తాజాగా రాయ్‌పూర్‌లో శుక్రవారం నాటి రెండో టీ20లోనూ ఒక వికెట్‌ పడగొట్టిన ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌కు బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాలేదు.వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 76), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 82 నాటౌట్‌).. ఆల్‌రౌండర్‌ శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టడంతో భారత్‌ 15.2 ఓవర్లలోనే కివీస్‌ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.మురళీ కార్తిక్‌తో గొడవ?ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో టీ20కి ముందు అతడు.. మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ మురళీ కార్తిక్‌తో గొడవపడినట్లు తెలుస్తోంది. బ్యాట్‌తో హార్దిక్‌ మైదానంలోకి వస్తుండగా.. మురళీ కార్తిక్‌ అతడిని పలకరించాడు.ఇంతలోనే కోపోద్రిక్తుడైన హార్దిక్‌ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మురళీ కార్తిక్‌ వివరించే ప్రయత్నం చేయగా.. హార్దిక్‌ మాత్రం మాటల బాణాలు వదులుతూనే ఉన్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే, వీరిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు? అసలేం జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు. హార్దిక్‌ అభిమానులు మాత్రం మురళీ కార్తిక్‌ ఏదో అడగకూడని విషయం అడిగినందుకే ఇలా రియాక్ట్‌ అయి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌🚨 Hardik Pandya angry at Murali Kartik – Hardik Pandya had an argument with Murali Kartik before the IND vs NZ 2nd ODI in Raipur. pic.twitter.com/axpjLykXfY— Sonu (@Cricket_live247) January 23, 2026

Sarfaraz credits Azhar after double ton former captain Slams Selectors6
అతడొక అటాకింగ్‌ ప్లేయర్‌: సెలక్టర్లపై అజారుద్దీన్‌ ఫైర్‌

టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజారుద్దీన్‌ విమర్శించాడు. కొంతమంది ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా వారికి అవకాశాలు ఇస్తున్న యాజమాన్యం.. సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి అద్భుత ఆటగాడిని మాత్రం పక్కనపెట్టిందన్నాడు.కాగా గత కొంతకాలంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ టీ20, వన్డే టోర్నీలలో శతక్కొట్టిన ఈ ముంబై బ్యాటర్‌.. తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో మెరిశాడు. ఉప్పల్‌లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ద్విశతకం పూర్తి చేసుకుని ముంబైకి భారీ స్కోరు అందించాడు. మొత్తంగా 219 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 227 పరుగులు సాధించాడు.ఐదో డబుల్‌ సెంచరీ ఫలితంగా హైదరాబాద్‌తో జట్టుతో రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 332/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 123.2 ఓవర్లలో 560 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఐదో డబుల్‌ సెంచరీ చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సువేద్‌ పార్కర్‌ (98 బంతుల్లో 75; 11 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీతో అతడికి అండగా నిలిచాడు.ఈ సీజన్‌లో సర్ఫరాజ్‌ విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో గోవాపై (157)పై సెంచరీ... ముస్తాక్‌ అలీ ట్రోఫీ టీ20 టోర్నీపై అస్సాంపై (100 నాటౌట్‌) సెంచరీ సాధించాడు. ఇక హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేసిన అనంతరం సర్ఫరాజ్‌ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. అజారుద్దీన్‌కు క్రెడిట్‌ ఇచ్చాడు.ఎలా ఆడాలో చూపించారు‘‘నా కెరీర్‌లో పెద్దగా రివర్స్‌ స్వింగ్‌ షాట్లు ఆడలేదు. అజర్‌ సర్‌ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆయనతో క్రికెట్‌ గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఇప్పటికి ఇది సాధ్యమైంది. ఆయన ఆఫీసుకు వెళ్లాను.ఇక్కడ (ఉప్పల్‌) ఆరంభంలోనే ఎక్కువ రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అజర్‌ సర్‌ చెప్పారు. ఇన్‌స్వింగ్‌ ఎలా రాబట్టాలో వివరించారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. కుర్చీ నుంచి లేచి నిలబడి మరీ వివిధ రకాల షాట్లు ఎలా ఆడాలో చూపించారు. దాదాపు రెండు గంటల పాటు మా సంభాషణ కొనసాగింది’’ అని సర్ఫరాజ్‌ ఖాన్‌ అజారుద్దీన్‌ పట్ల కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నాడు.అతడొక అటాకింగ్‌ బ్యాటర్‌ఇక ఇందుకు స్పందనగా.. ‘‘డబుల్‌ సెంచరీ విషయంలో క్రెడిట్‌ మొత్తం సర్ఫరాజ్‌కే దక్కాలి. తను నా ఆఫీస్‌కు వచ్చి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. నేనూ కొన్ని విషయాలు అతడికి చెప్పాను. అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్‌కు శుభాకాంక్షలు.అతడు గొప్పగా ఆడాడు. టీమిండియాకు అతడిని మళ్లీ ఎంపిక చేయాలి. సర్ఫరాజ్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదు. అతడొక అటాకింగ్‌ బ్యాటర్‌. మిగిలిన ప్లేయర్లకు ఇచ్చినట్లు అతడికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని టీమిండియా సెలక్టర్ల తీరును అజారుద్దీన్‌ విమర్శించాడు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌

IND vs AUS Test: BCCI Announces Women Squad Harman to lead7
ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన

ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టుకు భారత మహిళా జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా గతేడాది మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో వైట్‌బాల్‌ సిరీస్‌లలో విజయాలు సాధించింది.ఆస్ట్రేలియా పర్యటనప్రస్తుతం జాతీయ జట్టులోని కీలక ప్లేయర్లంతా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026తో బిజీగా ఉన్నారు. జనవరి 9న మొదలైన ఈ టీ20 లీగ్‌.. ఫిబ్రవరి 5న ఫైనల్‌తో ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటన (India Women Tour Of Australia)కు వెళ్లనుంది. ఫిబ్రవరి 15 నుంచి మర్చి 6 మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు.. ఒక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది.ప్రతీకా రావల్‌కూ చోటుఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా టెస్టు జట్టును కూడా అనౌన్స్‌ చేసింది. ఈ జట్టులో ప్రతీకా రావల్‌కు కూడా చోటు దక్కడం విశేషం. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో స్మృతి మంధానకు ఓపెనింగ్‌ జోడీగా రాణించిన ప్రతీకా.. అనూహ్య రీతిలో గాయపడి కీలక మ్యాచ్‌లకు దూరమైంది.అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ప్రతీకా త్వరలోనే జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు తాజాగా స్పష్టమైంది. ఇక మరో ఓపెనింగ్‌ బ్యాటర్‌ షఫాలీ వర్మకు కూడా టెస్టు జట్టులో సెలక్టర్లు స్థానం కల్పించారు.ఆస్ట్రేలియా వుమెన్‌తో ఏకైక టెస్టుకు భారత మహిళా జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), ఉమా ఛెత్రీ (వికెట్‌ కీపర్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్‌ శర్మ, క్రాంతి గౌడ్‌, వైష్ణవి శర్మ, సయాలి సత్‌గరే. చదవండి: ప్రత్యేకంగా ఏమీ తినలేదు.. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది: ఇషాన్‌ కిషన్‌

Nothing special For Lunch Asked Myself: Ishan Kishan On To 32 Ball 768
‘నేనేమీ తినలేదు.. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది’

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు సంజూ శాంసన్‌ (6), అభిషేక్‌ శర్మ (0) విఫలమైన వేళ ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ జట్టును ఆదుకున్నాడు.ఇషాన్‌ ధనాధన్‌కేవలం 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇషాన్‌ కిషన్‌.. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని ఏకంగా 76 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. సూర్య, దూబే మెరుపులుఇక ఇషాన్‌తో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత అజేయ అర్ధ శతకం (37 బంతుల్లో 82)తో రాణించగా.. శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్‌) కూడా అదరగొట్టాడు. ఫలితంగా రాయ్‌పూర్‌ వేదికగా కేవలం మూడు వికెట్లు నష్టపోయి టీమిండియా 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదుఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సూర్య భాయ్‌ అనుకున్నట్లు మధ్యాహ్న భోజనంలో నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదు. సాధారణ భోజనమే తిన్నాను. ఏదేమైనా ఈరోజు మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాలనే సంకల్పంతోనే మైదానంలో అడుగుపెట్టాను.ఒక్కోసారి మనం బాగానే బ్యాటింగ్‌ చేస్తున్నాం అనుకుంటాం. అలాంటపుడు బంతిని చూస్తూ.. మనకు అనువైన, మంచి షాట్లు మాత్రమే ఆడాలి. నేను ఈరోజు అదే పని చేశాను. రిస్క్‌ తీసుకోకుండానే పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని గట్టిగా అనుకున్నాను.పవర్‌ప్లే అత్యంత ముఖ్యం​ముఖ్యంగా టీ20లలో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్‌ప్లే అత్యంత ముఖ్యమైనదిగా మారుతుంది. పవర్‌ప్లేలో.. మధ్య ఓవర్లలో నేను బాగా ఆడాను. నాకు నేనే వెన్నుతట్టుకున్నా. మంచి షాట్లు ఆడి జట్టును గెలిపించాలని భావించాను.దేశవాళీ క్రికెట్‌లో నేను విరివిగా పరుగులు రాబట్టాను. తద్వారా టీమిండియాకు ఆడగల సత్తా నాలో ఇంకా మిగిలే ఉందని నాకు నేనే సమాధానం చెప్పుకోగలిగాను. జార్ఖండ్‌ తరఫున కెప్టెన్‌గా టీ20 టోర్నీ ట్రోఫీ కూడా గెలిచాను. పునరాగమనంలో నేను ఇది చేయగలనా? అని సందేహం వచ్చింది.సరైన సమాధానం దొరికిందిఅయితే, ఇప్పుడు ఈ ప్రశ్నకు నాకు సరైన సమాధానం దొరికింది. మంచి షాట్లు ఆడితే అనుకున్న ఫలితం రాబట్టగలము. ఈ క్రమంలో ఒకవేళ నేను అవుట్‌ అయినా చింతించాల్సిన అవసరం ఉండదు’’ అని ఇషాన్‌ కిషన్‌ చెప్పుకొచ్చాడు.కాగా క్రమశిక్షణా రాహిత్యంతో దాదాపుగా మూడేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్‌ కిషన్‌ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు మళ్లీ పిలుపునిచ్చిన సెలక్టర్లు.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఏకంగా ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపిక చేశారు. ఆధిక్యంలో టీమిండియాఅయితే, పునరాగమనంలో అంటే కివీస్‌తో తొలి టీ20లో మాత్రం ఇషాన్‌ (5 బంతుల్లో 8) విఫలమయ్యాడు. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో చితక్కొట్టి తన విలువను చాటుకున్నాడు. ఇక తొలి టీ20లోనూ గెలిచిన టీమిండియా.. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యం సంపాదించింది.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌𝟓𝟎 𝐢𝐧 𝐚 𝐟𝐥𝐚𝐬𝐡 ⚡#IshanKishan slams the fastest T20I half-century in just 21 balls for India v NZ. 😮‍💨#INDvNZ, 2nd T20I | LIVE NOW 👉 https://t.co/Be1n2FWbLQ pic.twitter.com/UbpqrgpcTm— Star Sports (@StarSportsIndia) January 23, 2026

Smriti friend claims Palash was caught cheating Cricketers beat him up: Report9
ఆమెతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన పలాష్‌.. చితకబాదిన క్రికెటర్లు?!

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం గురించి మరోసారి చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకుని స్మృతి మంచి పని చేసిందని.. లేదంటే మోసగాడి చేతిలో బలైపోయి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నవంబరు 23నఅసలేం జరిగిందంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి మంధాన సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్‌తో నవంబరు 23న ఆమె వివాహానికి ముహూర్తం ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత తమ వివాహం రద్దైనట్లు స్మృతి- పలాష్‌ విడివిడిగా అధికారిక ప్రకటన చేశారు.కాగా తనతో ప్రైవేట్‌గా చాట్‌ చేశాడంటూ పలాష్‌ ముచ్చల్‌ గురించి ఓ మహిళ సోషల్‌ మీడియాలో స్క్రీన్‌షాట్లు షేర్‌ చేసింది. అందులో స్మృతిని కించపరిచినట్లుగా అతడి మాటలు ఉన్నాయి. అంతేకాదు పెళ్లికి కొన్ని గంటల ముందు పలాష్‌ వేరే మహిళతో గదిలో ఉన్నాడనే వదంతులూ వచ్చాయి.ఒకే మంచం మీద వేరే మహిళతో ఇప్పుడు ఆ రూమర్లు నిజమే అనేలా స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడిగా చెప్పుకొంటున్న నటుడు- నిర్మాత విద్యాన్‌ మానే వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్‌ సిటీతో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు స్మృతి పెళ్లి వేడుకల్లో నేనూ ఉన్నాను. గదిలో ఒకే మంచం మీద వేరే మహిళతో అతడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.అతడిని కొట్టారుఅప్పుడు పరిస్థితి మొత్తం గంభీరంగా.. భయానకంగా మారిపోయింది. స్మృతి సహచర క్రికెటర్లు అతడిని కొట్టారు. ముచ్చల్‌ కుటుంబం మొత్తం దొంగబుద్ధి కలవారే!.. అతడు స్మృతిని పెళ్లి చేసుకుని సాంగ్లిలో సెటిల్‌ అవుతాడని నేను అనుకున్నా. కానీ అంతా తలకిందులైపోయింది’’ అని విద్యాన్‌ మానే చెప్పుకొచ్చాడు. కాగా స్మృతి పెళ్లి సంగీత్‌, మెహందీ, హల్దీ వేడుకల్లో క్రికెటర్లు శ్రేయాంక పాటిల్‌, రాధా యాదవ్‌, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్‌ సందడి చేశారు. ఈ నలుగురు ఆమె ప్రాణ స్నేహితులు. మోసం చేశాడుకాగా ఫిలిం ఫైనాన్సర్‌గా ఉన్న తన దగ్గరకు వచ్చిన పలాష్‌.. నజరియా అనే సినిమా తీస్తున్నానని.. ఇందుకు పెట్టుబడి పెట్టమని కోరినట్లు విద్యాన్‌ మానే ఈ సందర్భంగా తెలిపాడు. ఇందుకోసం విడతల వారీగా డబ్బు ఇచ్చానని.. అయితే, సినిమా పనులు మొదలుకాకపోగా.. ఆ తర్వాత పలాష్‌ ఫోన్‌ ఎత్తడం కూడా మానేశాడని ఆరోపించాడు. నిరాధార ఆరోపణలుఈ క్రమంలోనే అతడిపై చీటింగ్‌ కేసు పెట్టినట్లు వెల్లడించాడు. అయితే, పలాష్‌ మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని కొట్టిపారేశాడు. తన లాయర్‌ ద్వారా చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వెల్లడించాడు.ఇదిలా ఉంటే.. పెళ్లి రద్దు తర్వాత ఆటపైనే పూర్తిగా దృష్టి సారించింది స్మృతి. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్లూపీఎల్‌)-2026 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీని నిలిపింది. చదవండి: ఎవరినీ నమ్మను.. ఆమెకు బ్రేకప్‌ చెప్పిన టీమిండియా స్టార్‌!.. పోస్ట్‌ వైరల్‌

T20 WC 2026: ICC DRC Is Unlikely To Resolve Bangladesh Concerns, Why?10
ఐసీసీపై ‘ఫిర్యాదు’.. బంగ్లాదేశ్‌కు మరో షాక్‌ తప్పదు!

టీ20 ప్రపంచకప్‌-2026లో తమ మ్యాచ్‌ల వేదిక మార్పు విషయంలో బంగ్లాదేశ్‌ ఆఖరి ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ఇప్పటికే ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో తెలిపింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు​, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని.. ఇక్కడే తమ మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది.అయినప్పటికీ పంతం వీడని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తమ విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి పట్టించుకోకపోవడంతో వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఆశ్రయించింది. తాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్‌సీని బీసీబీ కోరింది.అది కుదరని పనిఅయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్‌సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బోర్డు డైరెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారం డీఆర్‌సీకి లేదు. ఇక్కడా తమకు సానుకూల స్పందన లభించకపోతే చివరగా కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)కు వెళ్లాలని కూడా బంగ్లాదేశ్‌ యోచిస్తోంది.మరోవైపు.. తమ జట్టు భారత్‌లో మ్యాచ్‌ ఆడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా ఐసీసీకీ చెప్పకుండా బీసీబీ చైర్మన్‌ అమీనుల్‌ ఇస్లామ్‌ మీడియా ముందు ప్రకటించడం కూడా ఐసీసీకి ఆగ్రహం కలిగించింది. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్‌ను తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అండర్‌–19 వరల్డ్‌ కప్‌ జరుగుతున్న నమీబియాలో ఉన్న ఐసీసీ చైర్మన్‌ జై షా బంగ్లాదేశ్‌ను వరల్డ్‌ కప్‌ నుంచి తప్పిస్తూ స్కాట్లాండ్‌కు అవకాశం ఇస్తున్నట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement