Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Bashar named chairman of BCB's new selection panel1
బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా మాజీ కెప్టెన్‌

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నలుగురు సభ్యులతో కూడిన నూతన సెలక్షన్ క‌మిటీ ఛైర్మన్‌గా మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్‌ను బీసీబీ నియ‌మించింది. గ‌తంలో బంగ్లా సెల‌క్ష‌న్ క‌మిటీలో కేవ‌లం ముగ్గురు స‌భ్యులు మాత్ర‌మే ఉండేవారు. ఇప్పుడు మ‌రొక‌రిని ప్యాన‌ల్‌లోకి బీసీబీ చేర్చింది. ఈ కొత్త క‌మిటీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027 వర‌కు త‌మ బాధ్య‌త‌ల్లో కొన‌సాగ‌నుంది.కాగా 53 ఏళ్ల బాషర్ బంగ్లాదేశ్ క్రికెట్‌లో త‌నంక‌టూ ప్ర‌త్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 3000 ప‌రుగులు దాటిని మొద‌టి బంగ్లాదేశ్ ఆట‌గాడు కూడా ఆయ‌నే కావ‌డం విశేషం. అదేవిధంగా గ‌తంలో పురుషుల, మహిళల జట్లకు సెలక్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా అత‌డికి ఉంది.ఇక ఈ ప్యాన‌ల్‌లో అత‌డితో పాటు మాజీ పేసర్ హసిబుల్ హొస్సేన్, నయీమ్ ఇస్లాం, నదీఫ్ చౌదరి ఉన్నారు. 39 ఏళ్ల నయీమ్ పేరిట‌ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ త‌ర‌పున అత్య‌ధిక సెంచ‌రీలు(34) సెంచ‌రీలు చేసిన రికార్డు ఉంది. ఈ సీనియ‌ర్ సెల‌క్ష‌న్ ప్యాన‌ల్ బంగ్లాదేశ్ క్రికెట్ విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తుంద‌ని బీసీబీ భావిస్తోంది. బంగ్లా జ‌ట్టు ఇటీవ‌లే పాకిస్తాన్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.

Irfan Pathan draws parallels between Abhishek Sharma and uncapped SRH star2
'అత‌డు మ‌రొక అభిషేక్ శర్మ.. వారికి టెన్షన్‌ మొదలైంది'

పంజాబ్ యువ సంచలనం సలీల్ అరోరా తొలిసారి ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అరోరా ప్రాతినిథ్యం వహించనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో భారీ హిట్టర్‌గా పేరొందిన ఆరోరా.. ఇప్పుడు ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీలో ఎలా రాణిస్తాడో అందరూ అతృతగా ఎదరుచూస్తున్నారు.గతేడాది జరిగిన వేలంలో పోటీపడి మరి రూ. 1.50 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో కూడా అరోరా విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లో 40 పరుగులు చేసి సత్తాచాటాడు. అతడు వరుసగా ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు.ప్రధాన టోర్నీలోనూ ఇదే జోరును కొనసాగించాలని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సలీల్‌ ఆరోరాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో అరోరాను ప‌ఠాన్ పోల్చాడు. కాగా అభిషేక్‌, అరోరా ఇద్ద‌రూ పంజాబ్‌కు చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం."స‌లీల్ అరోరా కూడా పంజాబ్ క్రికెట్ నుంచే వ‌చ్చాడు. ఇప్ప‌టికే దేశ‌వాళీ క్రికెట్‌లో త‌న స‌త్తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శ‌ర్మ‌, నమన్ ధీర్, రమన్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు పంజాబ్ నుండి వ‌చ్చి త‌మకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు సలీల్ కూడా అదే జాబితాలో చేరేలా క‌న్పిస్తున్నాడు. వేలంలో అత‌డిని ఎస్ఆర్‌హెచ్ ఒక బ్యాక‌ప్ ఆట‌గాడిగా తీసుకుంది. కాబ‌ట్టి ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి ఫామ్‌లో లేకపోయినా, లేదా అనికేత్ వర్మ సరిగ్గా ఆడకపోయినా సలీల్‌కు అవ‌కాశం ద‌క్కుతుంది. బెంచ్‌పై సలీల్ వంటి ప్రతిభావంతుడు ఉన్నందున.. నితీశ్‌, అనికేత్‌పై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది" అని ప‌ఠాన్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: జ‌స్ప్రీత్ బుమ్రాకు ఏమైంది?

Another injury concern for Jasprit Bumrah? Mumbai Indians pacer checks into BCCI CoE before IPL 20263
జ‌స్ప్రీత్ బుమ్రాకు ఏమైంది?

ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు భారత పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడా? అంటే అవునానే సమాధానం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ఇంకా కేవలం ఐదు రోజులు మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికి బుమ్రా ఇంకా ముంబై ఇండియ‌న్స్ శిబిరంలో చేర‌లేదు.టైమ్స్ ఆఫ్ ఇండియా క‌థ‌నం ప్ర‌కారం.. బుమ్రా ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆటగాళ్లు గాయపడినప్పుడు లేదా ఫిట్‌నెస్ పరీక్షల కోసం మాత్ర‌మే బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌కు వెళ్తారు. కానీ బుమ్రా ఇప్పుడు సీఓఈకు ఏదైనా గాయం వల్ల లేదా సాధారణ చెకప్ కోసమా వెళ్లాడా అన్న‌ది ఇంకా స్ప‌ష్ట‌త లేదు.ముంబై ఇండియ‌న్స్ నుంచి కూడా ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేల జ‌య‌వ‌ర్ద‌నే ఇటీవ‌ల మాట్లాడుతూ.. ప్రపంచ కప్ ఆడిన ఆటగాళ్లందరికీ తగినంత విరామం ఇచ్చామని, వారందరూ మార్చి 22 నాటికి జట్టుతో చేరుతారని చెప్పాడు.కానీ బుమ్రా మాత్రం ఇంకా ప్రాక్టీస్ సెషన్లకు హాజరుకాలేదు. ప్ర‌స్తుతం ఇదే విష‌యం క్రికెట్ వ‌ర్గాల్లో చర్చానీయాంశ‌మైంది. ఈ టోర్నీలో ముంబై ఇండియ‌న్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.చదవండి: IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌ న్యూస్‌.. యార్కర్ల కింగ్‌ వచ్చేస్తున్నాడు

Eshan Malinga bolsters ailing SRH bowling attack as SLC grants NOCs for IPL4
ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌ న్యూస్‌.. యార్కర్ల కింగ్‌ వచ్చేస్తున్నాడు

ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్‌, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగ తన ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు అతడికి శ్రీలంక క్రికెట్ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) మంజూరు చేసింది.మలింగ ఒకట్రెండు రోజుల్లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టుతో కలవనున్నాడు. మలింగకు ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడ్డాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 19వ సీజన్ కూడా దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. గత వారం శ్రీలంక క్రికెట్ నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలలో దుష్మంత చమీర, పాతుమ్ నిస్సంక, కమిందు మెండిస్ ఉ‍త్తీర్ణత సాధించినప్పటికి.. మలింగ మాత్రం క్లియర్ చేయలేకపోయాడు.దీంతో అతడు టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని అంతా భావించారు. కానీ తాజాగా నిర్వహించిన పరీక్షలలో మాత్రం అతడు పాసయ్యాడు. మలింగ రాకతో సన్‌రైజర్స్ బౌలింగ్ పటిష్టంగా మారనుంది. మలింగ గత సీజన్‌లో కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు తీసి సత్తాచాటాడు. తన యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ లేని లోటును మలింగ భర్తీ చేయనున్నాడు. మలింగ వెన్ను గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు వనిందు హసరంగ (లక్నో సూపర్ జెయింట్స్), మతీష పతిరణ (కోల్‌కతా నైట్ రైడర్స్), నువాన్ తుషార (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఇంకా ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: PSL 2026: చంపేస్త‌మంటూ వార్నింగ్‌.. అయినా పాక్‌కు వ‌చ్చిన స్మిత్‌

India To Host Aus For BGT As Cricket Australia Unveils Schedule5
భారత పర్యటనకు ఆసీస్‌ జట్టు.. షెడ్యూల్‌ ఖరారు

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించనుంది. ఇందుకు సంబంధించి క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా 2026-27 కాలానికి గానూ ఆస్ట్రేలియా షెడ్యూల్‌కు సంబంధించిన అంతర్జాతీయ క్యాలెండర్‌ను సీఏ ప్రకటించింది.ఇందులో భాగంగా ఆగష్టు నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ ద్వారా ఆసీస్‌ హోం సీజన్‌ మొదలుకానుంది. ఇంగ్లండ్‌తో 150వ వార్షికోత్సవ టెస్టుతో 2027 మార్చితో ఈ సీజన్‌ ముగియనుంది. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో నాలుగు వారాల పాటు సిరీస్‌లు ఆడనున్న ఆసీస్‌.. అక్టోబరు చివరలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.ఆ తర్వాత నవంబరులో ఇంగ్లండ్‌తో ఎనిమిది మ్యాచ్‌ల వైట్‌బాల్‌ సిరీస్‌ ఆడనుంది. ఇక వచ్చే ఏడాది జనవరి మధ్య లేదంటే చివరి వారంలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టు.. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది.వారికి ఇదే ఆఖరి సిరీస్‌ఈ నేపథ్యంలో.. ‘‘భారత్‌లో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవని కమిన్స్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియోన్‌ వంటి ఆటగాళ్లకు ఇదే ఆఖరి సిరీస్‌ కావొచ్చు’’ అని సీఏ తన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఒకవేళ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2027 ఫైనల్‌కు అర్హత సాధిస్తే జూన్‌లో ఇంగ్లండ్‌ వేదికగా ఆసీస్‌ ప్రత్యర్థితో తలపడుతుంది. అనంతరం జూన్‌- ఆగష్టు మధ్య కాలంలో ఇంగ్లండ్‌ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతుంది.ఆస్ట్రేలియా టెస్టు షెడ్యూల్‌ 2026-2027👉ఆగష్టు: బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై రెండు టెస్టులు👉అక్టోబరు- సౌతాఫ్రికాతో మూడు టెస్టులు👉డిసెంబరు- జనవరి: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై నాలుగు టెస్టులు👉జనవరి- మార్చి: టీమిండియాతో ఐదు టెస్టులు👉మార్చి 11-15: ఇంగ్ల​ండ్‌తో సొంతగడ్డపై 150వ వార్షికోత్సవ టెస్టు👉జూన్‌: డబ్ల్యూటీసీ ఫైనల్‌ (అర్హత సాధిస్తే)👉జూన్‌- ఆగష్టు: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు.చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

Steve Smith Arrives In Pakistan For PSL Amid Tensions Over Threat From Armed Group6
చంపేస్త‌మంటూ వార్నింగ్‌.. అయినా పాక్‌కు వ‌చ్చిన స్మిత్‌

ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో ఆడేందుకు ల‌హోర్‌కు చేరుకున్నాడు. ఓ వైపు పాకిస్థాన్‌ వ్యతిరేక సాయుధ దళం జమాత్‌ ఉల్‌ అహ్రార్‌ నుంచి బెదిరింపులు వ‌చ్చిన‌ప్ప‌టికి.. స్మిత్ మాత్రం పాక్ గ‌డ్డ‌పై అడుగుపెట్టాడు. ల‌హోర్ ఎయిర్‌పోర్ట్‌లో స్మిత్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య అత‌డు ముల్తాన్ సుల్తాన్ టీమ్ బ‌స చేసే హోట‌ల్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నాయి.చంపేస్త‌మంటూ వార్నింగ్‌!కాగా నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ విభాగం విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లు వెంటనే టోర్నీ నుండి తప్పుకోవాలని, లేదంటే వారి భద్రతకు తాము బాధ్యులం కాదని ఓ ప్ర‌క‌ట‌న‌లో జమాత్-ఉల్-అహ్రార్ పేర్కొంది. అయిన‌ప్ప‌టికి విదేశీ ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రుగా పాక్‌కు చేరుకుంటున్నారు.పీసీబీ కీల‌క నిర్ణ‌యం..ఈ హెచ్చరిక‌ల‌ నేప‌థ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భద్రత, ఇంధన సంక్షోభం దృష్ట్యా ఈసారి మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అంతేకాకుండా కేవ‌లం రెండు వేదిక‌ల‌లో ఈ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక పీఎస్ఎల్ 11వ సీజ‌న్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

KKR pick replacement for Akash Deep ahead of IPL 20267
కేకేఆర్‌ జట్టులోకి స్వింగ్‌ కింగ్‌.. ఎవరంటే?

ఐపీఎల్‌-2026 సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఆకాష్ దీప్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి సుమారు 8 నుంచి 12 వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని విదర్భ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ దూబేతో కేకేఆర్ భర్తీ చేసింది.ఐపీఎల్‌-2022లో దూబేను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసినప్పటికి, గాయం కారణంగా అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది సీజన్ మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నప్పటికి ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆకాష్ దీప్ గాయం బారిన పడడంతో లక్కీగా ఐపీఎల్‌లో ఆడే అవకాశం దూబేకు దక్కింది.ఈ విద‌ర్భ పేస‌ర్‌కు అద్భుత‌మైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే స‌త్తా అత‌డి ఉంది. అంతేకాకుండా బౌన్సీ పిచ్‌ల‌పై బ్యాట‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్ట‌గ‌ల‌డు. 2019 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో భార‌త అండ‌ర్‌-23 జ‌ట్టు త‌ర‌పున దూబే అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఒకే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.ఆ స‌మ‌యంలో భార‌త అండ‌ర్‌-23 జ‌ట్టు కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ఉండ‌డం విశేషం. ద్ర‌విడ్ వంటి దిగ్గ‌జం నుంచి కూడా అత‌డు పాఠాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మ‌హా వేదిక‌పై స‌త్తాచాటేందుకు సౌర‌భ్ సిద్ద‌మ‌య్యాడు.కాగా కేకేఆర్‌ను గాయాల బెడ‌ద వెంటాడుతోంది. ఇప్ప‌టికే హ‌ర్షిత్ రాణా, ఆకాష్ దీప్ దూరం కాగా.. శ్రీలంక స్పీడ్ స్టార్ మ‌తీషా ప‌తిరానా ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఐపీఎల్‌-19వ సీజ‌న్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్‌..!

Navjot Singh Sidhu divides properties between son and daughter Post Viral8
పిల్లలకు ఆస్తులు పంచి ఇచ్చిన భారత మాజీ క్రికెటర్‌

భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అత్యంత ప్రత్యేకమైన రెండు ఇళ్లను పిల్లలకు పంచి ఇచ్చేశానని తెలిపాడు. పంజాబ్‌కు చెందిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు 1983- 1999 వరకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు.తన కెరీర్‌లో మొత్తంగా 51 టెస్టులు, 136 వన్డేలు ఆడిన సిద్ధు.. టెస్టుల్లో 3202, వన్డేల్లో 4413 పరుగులు సాధించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా కొనసాగుతున్న సిద్ధు.. టీవీ షోల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడు. ఇక రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు రెండుసార్లు ఎంపీగా పనిచేశాడు.ఓ కుమారుడు, కుమార్తెవ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. డాక్టర్‌, రాజకీయ నాయకురాలు నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధును పెళ్లాడిన సిద్ధుకు.. కుమారుడు కరణ్‌ సిద్ధు, కుమార్తె రబియా సిద్ధు సంతానం. ఇదిలా ఉంటే.. తాజాగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు. తాను బతికి ఉండగానే తన పిల్లలకు ‘విలువైన’ ఆస్తులను పంచి ఇచ్చినట్లు తెలిపాడు.ఇద్దరికి చెరో ఇల్లు‘‘పార్వతీ దేవి అమ్మవారి అనుగ్రహంతో అమృత్‌సర్‌లో నేను కట్టుకున్న ఇల్లు.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను ఎక్కువగా ఇక్కడ నివసించలేకపోయాను. బిగ్‌బాస్‌ నుంచి స్టార్‌ టీవీలో హిందీ కామెంట్రీ, కపిల్‌ శర్మ షో.. ఇలా ఒక్కో ఆదాయ మార్గంఅయితే, రాజకీయాల ద్వారా ఒక్క పైసా కూడా నేను సంపాదించలేదు. నా కష్టార్జితంతోనే కొన్ని ఆస్తులు కూడబెట్టగలిగాను. పటియాలాలో మా నాన్నగారు కట్టించిన పూర్వీకుల ఇల్లు కరణ్‌కు వారసత్వంగా లభిస్తుంది. అమృత్‌సర్‌లో నేను కట్టిన ఇల్లు రబియాకు ఇస్తున్నాము’’ అని నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా కూతురుతో కలిసి దిగిన ఫొటోలు, శివలింగానికి పూజ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను పంచుకున్నాడు.రూ. 25 కోట్లు!కాగా అమృత్‌సర్‌లో ప్రీమియర్‌ లొకాలిటీలో సిద్ధు కట్టిన ఇల్లు 49,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం, 2014-15 మధ్య కాలంలో నిర్మించిన ఈ ఇంటి విలువ దాదాపు రూ. 25 కోట్లు అని తెలుస్తోంది. స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌, స్పా వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయట.అంతేకాదు.. ఈ విలాసవంతమైన ఇంటిలో ప్రత్యేకంగా శివుడి కోసం చిన్న ఆలయం కూడా నిర్మించినట్లు కథనాలు ఉన్నాయి. ఇందులో ప్రతిష్టించిన శివలింగం దాదాపు రూ. 2.5 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. శివుడితో పాటు ఇతర దేవతా విగ్రహాలు, శ్రీ గురు గ్రంథ్‌ సాహిబ్‌ కూడా ఇందులో ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. అమృత్‌సర్‌ ఇల్లు, పటియాలా నివాసం వద్ద కూతురితో సిద్ధుచదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

Dion Nash quits NZ Cricket board after Twenty20 decision9
న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్‌..!

టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ క్రికెట్‌లో లుకలుకలు బయటపడ్డాయి. కివీస్ క్రికెట్ బోర్డు సభ్యుడు, మాజీ క్రికెటర్ డైన్ వాష్ తన పదవికి రాజీనామా చేశారు. బోర్డు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల నేపథ్యంలో అతడు తన పదవి నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కొత్త ఫ్రాంచైజీ ఆధారిత టీ20 లీగ్‌ను ప్రారంభించాలని సోమవారం నిర్ణయించింది. అంతేకాకుండా బిగ్ బాష్ లీగ్‌లో న్యూజిలాండ్ ఆధారిత ఓ జట్టును చేర్చాలని బోర్డు ప్రతిపాదించింది. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయం సభ్యుల మధ్య విభేదాలకు దారితీసింది.ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే నాష్ తన పదవి నుంచి వైదొలగి అందరికి షాకిచ్చాడు. "బోర్డు తీసుకున్న నిర్ణయాలకు నేను మద్దతు ఇవ్వలేను. అందుకే నా పోస్ట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాను" అని నాష్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.మొన్న స్కాట్‌.. నేడు నాష్‌కాగా ఇదే టీ20 లీగ్ వివాదం కారణంగా గత ఏడాది న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ కూడా పదవి నుంచి తప్పుకొన్నాడు. ఇప్పుడు నాష్ ఈ జాబితాలోకి చేరాడు. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయానికి సోఫీ డివైన్‌, అమీలియా కేర్ వంటి స్టార్ ఉమెన్స్ క్రికెటర్లు మాత్రం మద్దతు తెలుపుతున్నారు.కాగా భారత్, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోలిస్తే ఐసీసీ నుంచి న్యూజిలాండ్‌కు వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఈ లోటును పూడ్చుకోవడానికే కొత్త లీగ్ ప్రారంభించాలని న్యూజిలాండ్ క్రికెట్ యోచిస్తోంది.చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

Sahibzada Farhan and Arundhati Reddy win ICC Player of the Month for February10
పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన పాకిస్తాన్ యువ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఫర్హాన్ ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్‌, అమెరికా పేస‌ర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌లను వెనక్కి నెట్టి ఫర్హాన్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీస్‌కు చేరడంలో విఫలమైనప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్ మాత్రం దుమ్ములేపాడు. ఒక్క భారత్‌పై తప్ప ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు బ్యాట్ ఝులిపించాడు. నమీబియా, శ్రీలంకపై సెంచరీలతో అతడు చెలరేగాడు.తద్వారా ఒకే టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 383 పరుగులు సాధించి, ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లిని అతడు అధిగమించాడు. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.ఫర్హాన్ కంటే ముందు బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, నోమన్ అలీ, హసన్ అలీ వంటి పాక్ ఆటగాళ్లు ఈ ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నారు. బాబర్‌కు అయితే అత్యధికంగా మూడు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇక మహిళల విభాగంగాలో భారత స్టార్ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి ఈ అవార్డు వరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అరుంధతి మొత్తం 8 వికెట్లు పడగొట్టింది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో అరుంధతిది కీలక పాత్ర.చదవండి: వైభవ్‌పై డివిలియర్స్‌ ప్రశంసలు!.. ఆర్సీబీ స్టార్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Advertisement
Advertisement
 
Advertisement