Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Abhishek Sharma Creates History Becomes 1t Indian After Virat Kohli To1
IPL 2026: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సెంచరీతో మెరిశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 47 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న టీ20 సెంచరీల రికార్డును సమం చేశాడు. కోహ్లి తర్వాత పొట్టి క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.అభిషేక్‌ ధనాధన్‌..కాగా ఐపీఎల్‌-2026లో భాగంగా సొంతమైదానం ఉప్పల్‌లో టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆది నుంచి అభిషేక్‌ శర్మ తనదైన శైలిలో చెలరేగాడు. 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి శతక మార్కు అందుకున్నాడు.కాగా ఐపీఎల్‌లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్లో తొమ్మిదవ సెంచరీ. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్‌ తరఫున ఐదు శతకాలు బాదిన అభిషేక్‌.. టీమిండియా తరఫునా రెండుసార్లు శతక్కొట్టాడు.క్లాసెన్‌ ఫటాఫట్‌ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు హెన్రిచ్‌ క్లాసెన్‌ 13 బంతుల్లో 37 పరుగులతో దుమ్ములేపాడు.Incredible knock, iconic celebration 🙌An Abhishek Sharma special lights up Hyderabad 💯Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers | @OfficialAbhi04 pic.twitter.com/QUWtkWuX0D— IndianPremierLeague (@IPL) April 21, 2026టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీల వీరులు🏏క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)- 22 సెంచరీలు🏏బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)- 12 సెంచరీలు🏏డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)- 10 సెంచరీలు🏏క్వింటన్‌ డికాక్‌ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు🏏విరాట్‌ కోహ్లి (ఇండియా)- 9 సెంచరీలు🏏రిలీ రొసోవ్‌ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు🏏సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (పాకిస్తాన్‌)- 9 సెంచరీలు🏏అభిషేక్‌ శర్మ (ఇండియా)-9 సెంచరీలు.చదవండి: తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌

IPL 2026 Big Boost For MI Will Jacks joins squad ahead of CSK clash2
ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. బిగ్‌ బూస్ట్‌

ముంబై ఇండియన్స్‌కు శుభవార్త. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ అందుబాటులోకి వచ్చాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతడు ముంబై తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో విల్‌ జాక్స్‌ అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.వరల్డ్‌కప్‌లో సూపర్‌హిట్‌ఇంగ్లండ్‌ తరఫున ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 226 పరుగులు చేసిన విల్‌ జాక్స్‌ (Will Jacks).. తొమ్మిది వికెట్లు కూల్చాడు. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ సెమీస్‌ ప్రయాణానికి దోహదం చేసిన ఈ ఆల్‌రౌండర్‌ నాలుగుసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు గెలిచాడు. ఈ పవర్‌ హిట్టర్‌ను ముంబై ఇండియన్స్‌ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది.వ్యక్తిగత సెలవుఅయితే, వరల్డ్‌కప్‌ తర్వాత వ్యక్తిగత సెలవుపై వెళ్లిన విల్‌ జాక్స్‌ ముంబై ఆరంభ మ్యాచ్‌లకు మాత్రమే దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆరు మ్యాచ్‌లు పూర్తైనా అతడు జట్టుతో చేరలేదు. తాజా సమాచారం ప్రకారం విల్‌ జాక్స్‌ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడు భారత్‌లో అడుగుపెట్టినట్లు సమాచారం. ​కాగా ముంబై ఇండియన్స్‌ ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇలాంటి తరుణంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ జట్టుతో చేరనుండటం సానుకూలాంశం. కాగా ముంబై గురువారం చెన్నై జట్టుతో తలపడనుంది. ఇందుకు వాంఖడే వేదిక.చదవండి: తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌

Virat Kohli Rumoured ex girlfriend Izabelle reacts to post about his taste3
కోహ్లి ‘టేస్ట్‌’పై కామెంట్‌.. మాజీ ‘గర్ల్‌ఫ్రెండ్‌’ స్పందన ఇదే!

విరాట్‌ కోహ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియా దిగ్గజ బ్యాటర్‌, రన్‌మెషీన్‌గా పేరొందిన ఈ ఢిల్లీ స్టార్‌.. క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం ‘రారాజు’గానే కొనసాగుతున్నాడు.ప్రస్తుతం ఐపీఎల్‌-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కు ఆడుతూ బిజీగా ఉన్నాడు కోహ్లి. అయితే, గత కొంతకాలంగా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం జర్మన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ లిజ్‌లాజ్‌ ఫొటోకు కోహ్లి లైక్‌ కొట్టినట్లు వార్తలు రాగా.. కాసేపటికే అతడు ఆ ఫొటోను డిస్‌లైక్‌ చేసినట్లు తెలిసింది.ఈ విషయంపై లిజ్‌లాజ్‌ స్పందిస్తూ.. కోహ్లి వల్ల తనకు ప్రచారరం లభించినా అతడు మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేసింది. గతంలో అవనీత్‌ కౌర్‌ అనే ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఫొటోకు కూడా కోహ్లి లైక్‌ చేసినట్లు వార్తలు రాగా.. అల్గారిథమ్‌ పొరపాటు వల్లే ఇలా జరిగిందని అతడు వివరణ ఇచ్చాడు.అభ్యంతరకర కామెంట్‌ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో బ్రెజిల్‌ మోడల్‌ ఇసబెల్ల లియట్‌, కోహ్లి భార్య అనుష్క శర్మ, అవనీత్‌ కౌర్‌, లిజ్‌లాజ్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ.. ‘‘మహిళల విషయంలో విరాట్‌ కోహ్లి అభిరుచి ఎప్పుడూ గొప్పగానే ఉంటుందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు’’ అని అభ్యంతరకర కామెంట్‌ పెట్టారు.ఈ పోస్టుపై ఇసబెల్ల స్పందించింది. ‘‘పన్నెండు ఏళ్ల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ మీరెందుకు ఆ విషయం నుంచి బయటకు రావడం లేదు’’ అంటూ ఇసబెల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాగా అనుష్క శర్మ పరిచయం కాకముందు కోహ్లి 2012-2104 మధ్య ఇసబెల్లతో డేటింగ్‌ చేశాడనే వదంతులు ఉన్నాయి.కాగా 2014లో తన మూవీ ప్రమోషన్లో భాగంగా కోహ్లి- అనుష్క గురించి ప్రశ్న ఎదురు కాగా.. ‘‘నేను ఇక్కడ నా సినిమా గురించి మాట్లాడటానికి మాత్రమే ఉన్నాను. విరాట్‌ కోహ్లి గురించి నేనింక మాట్లాడటానికి ఏమీ లేదు’’ అని ఇసబెల్ల కౌంటర్‌ ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ఇసబెల్ల పంజాబీ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ కనిపించింది. విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ మూవీలో ఆమె తళుక్కుమంది. ఇక 2017లో పెళ్లి బంధంతో ఒక్కటైన కోహ్లి- అనుష్క తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. ఈ జంట ఇటీవలే బృందావన్‌లోని ప్రేమానంద్‌జీ మహరాజ్‌ను దర్శించి ఆశీసులు తీసుకుంది.చదవండి: ‘విరాట్‌ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’

IPL 2026 SRH vs DC Uppal: Rain Threat Toss Playing XIs Updates4
అభిషేక్‌ సెంచరీ.. క్లాసెన్‌ మెరుపులు SRH స్కోరెంతంటే?

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోరు సాధించింది. సొంతమైదానం ఉప్పల్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలోకేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 242 పరుగులు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో రాణించగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (13 బంతుల్లో 37 నాటౌట్‌) ఆడాడు. ట్రవిస్‌ హెడ్‌ 37, ఇషాన్‌ కిషన్‌ 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు.UPDATES:సన్‌రైజర్స్‌ డబుల్‌ సెంచరీ: స్కోరు: 202-2(17)అభిషేక్‌ 127, క్లాసెన్‌ ఆరు పరుగులతో ఉన్నారు16 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 189-2 రెండో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌ 14.4: ఇషాన్‌ కిషన్‌ రనౌట్‌ (13 బంతుల్లో 25). అభిషేక్‌ 108 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 176-2(14.4)అభిషేక్‌ శర్మ సెంచరీ47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్‌ శర్మ13 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 151-1అభిషేక్‌ 86, ఇషాన్‌ 23 రన్స్‌తో ఉన్నారు.పది ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 104-1అభిషేక్‌ 60, ఇషాన్‌ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్‌ డౌన్‌8.5: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో సమీర్‌ రిజ్వీకి క్యాచ్‌ ఇచ్చి ట్రవిస్‌ హెడ్‌ (26 బంతుల్లో 37) అవుట్‌. స్కోరు: 97-1(8.5). అభిషేక్‌ 27 బంతుల్లో 58 పరుగులతో ఉన్నాడు.👉25 బంతుల్లో అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీరఫ్పాడించిన అభిషేక్’‌‌ పవర్‌ ప్లేలో ‘అభిషేక్’‌‌ రఫ్పాడించారు. హెడ్‌ 17 బంతుల్లో 23 పరుగులు చేయగా.. అభిషేక్‌ 19 బంతుల్లోనే 42 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా పవర్‌ ప్లేలో సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. స్కోరు: 67-0 (6)ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 56-0ఓపెనర్లు అభిషేక్‌ శర్మ 15 బంతుల్లో 34, ట్రవిస్‌హెడ్‌ 15 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు. తద్వారా ‘ట్రావిషేక్‌’ యాభై పరుగుల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు.టాస్‌ గెలిచిన ఢిల్లీఐపీఎల్‌-2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచింది. తొలుత బౌలింగ్‌ ఎంచుకుని ఇషాన్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదిక. తుదిజట్టు మార్పులుఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ తెలిపాడు. ఆకిబ్‌ నబీ స్థానంలో నితీశ్‌ రాణా తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు. ఇక సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ మాట్లాడుతూ.. హర్ష్‌ దూబేను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా ప్రఫుల్‌ హింగేను ఆడించే విషయంలో తమకు స్పష్టత లేదని ఇషాన్‌ పేర్కొన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. కాగా సన్‌రైజర్స్‌ తరఫున అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్‌ హింగే.. గత మ్యాచ్లో మాత్రం తేలిపోయాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్‌ తీశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తుదిజట్లుసన్‌రైజర్స్‌అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్‌ కీపర్‌), అనికేత్ వర్మ, నితీశ్‌ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌: స్మరణ్‌ రవిచంద్రన్‌, ప్రఫుల్‌ హింగే, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, దిల్షాన్‌ మధుషాంక, హర్షల్‌ పటేల్‌ఢిల్లీపాతుమ్ నిస్సాంక, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), సమీర్ రిజ్వీ, నితీశ్‌ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముకేశ్‌ కుమార్, టి.నటరాజన్, లుంగీ ఎంగిడిఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌: కరుణ్‌ నాయర్‌, దుష్మంత చమీర, అశుతోశ్‌ శర్మ, త్రిపురాణ విజయ్‌, ఆకిబ్‌ నబీ.

It Is Not My Problem: hardik Pandya Slams Critics Over Bumrah Usage5
‘ఎవరిని.. ఎలా.. వాడుకోవాలో.. నాకు తెలుసు’

జస్‌ప్రీత్‌ బుమ్రా విషయంలో తనను విమర్శిస్తున్న వారికి ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఎవరి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో తనకు తెలుసు అన్నాడు. బుమ్రా వికెట్లు తీయకపోతే తనను విమర్శించడం ఏమిటని ప్రశ్నించాడు.ఐపీఎల్‌-2026లో ముంబై ప్రధాన పేసర్‌ బుమ్రా (Jasprit Bumrah) దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల వరకు ఒక్క వికెట్‌ తీయలేకపోయిన అతడు.. గుజరాత్‌ టైటాన్స్‌ (MI vs GT)తో సోమవారం నాటి మ్యాచ్‌లో మాత్రం మెరుగ్గా రాణించాడు. తొలి ఓవర్లో రంగంలోకి దిగి గుజరాత్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ను గోల్డెన్‌ డకౌట్‌గా వెనక్కి పంపాడు.Guess who’s back? 🔥#JaspritBumrah makes a statement with his first wicket of the season, putting #MI on 🔝#TATAIPL 2026 | #GTvMI | LIVE NOW 👉 https://t.co/EXwHuATomY pic.twitter.com/eQJ9QHheuX— Star Sports (@StarSportsIndia) April 20, 2026బుమ్రా తొలి వికెట్‌.. హార్దిక్‌పై విమర్శలుతద్వారా ఈ సీజన్‌లో బుమ్రా తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చిన అతడు కీలక వికెట్‌ తీశాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. బుమ్రాకు కొత్త బంతిని ఇచ్చి ఆరంభంలో రంగం దించితే ఫలితం ఇలా ఉంటుందని.. కానీ పాండ్యా అతడిని నిర్లక్ష్యం చేస్తూ మూల్యం చెల్లిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.బుమ్రా ఎప్పుడూ అంతేగాఈ నేపథ్యంలో గుజరాత్‌పై విజయానంతరం హార్దిక్‌ పాండ్యా ఘాటుగా స్పందించాడు. ‘‘చాలా మంది జస్‌ప్రీత్‌ బుమ్రాకు తొలి ఓవర్లోనే బంతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది నాకు కూడా ఆసక్తికరంగానే ఉంది. అయితే, ఇప్పటికి ముంబై తరఫున 151 మ్యాచ్‌లు ఆడితే అందులో ఎనిమిది లేదంటే తొమ్మిదిసార్లు మాత్రమే బుమ్రా తొలి ఓవర్‌ బౌల్‌ చేయడం మీరు గమనించాలి.నా వల్ల ఎలాంటి సమస్యా లేదుఇందులో నా వల్ల వచ్చిన సమస్య ఏమీ లేదు. జస్‌ప్రీత్‌ ప్రత్యేకమైన బౌలర్‌. జట్టుకు అవసరమైన వేళ అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు. ఈరోజు అతడి సేవలు ఆరంభంలోనే అవసరం అని భావించాము. కొత్త బంతితో ప్రభావం చూపగలడని భావించాము. జట్టులో అతడి కంటే ఉత్తమమైన బౌలర్‌ ఎవరూ లేరు’’ అని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు.కాగా అహ్మదాబాద్‌ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై గుజరాత్‌ జట్టును 99 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్‌ 100 పరుగులకే ఆలౌట్‌ అయి చిత్తుగా ఓడింది. కాగా ఈ సీజన్‌లో ముంబైకి ఆరింట ఇదే రెండో గెలుపు.చదవండి: తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌

Tractor Drives Onto Cricket Field Destroys Pitch As Play Is Cancelled Viral6
పిచ్చి పట్టినట్లుగా పిచ్‌ తొక్కించేశాడు.. మ్యాచ్‌ రద్దు!

క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో మైదానంలోకి దూసుకువచ్చాడు.. పిచ్చి పట్టినట్లుగా క్రికెట్‌ పిచ్‌ మొత్తాన్ని ట్రాక్టర్‌తో తొక్కించేశాడు.. ఫలితంగా.. ఫలితం తేలకుండానే మ్యాచ్‌ అర్ధంతరంగా ముగిసిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగింది. జలగావ్‌ రూరల్‌ ఎంఎల్‌ఏ కప్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఓ యువకుడు ట్రాక్టర్‌పై అకస్మాత్తుగా మైదానంలోకి వచ్చాడు.నిస్సహాయంగాఏం జరుగుతుందో అర్థం కాక ఆటగాళ్లు చెల్లాచెదురై పోయారు. ఇంతలో అతడు వేగంగా పిచ్‌ మీదకు దూసుకువచ్చి.. ట్రాక్టర్‌తో పిచ్‌ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఆటగాళ్లు, అంపైర్లు ఏమీ చేయలేక నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు. దీంతో మైదానంలో గందరగోళం నెలకొంది.కాగా ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వ్యక్తి ఒకరిని ఫైనల్‌ మ్యాచ్‌కు ఆహ్వానించకపోవడంతో సదరు వ్యక్తి ఇలా చేయించినట్లు సమాచారం. అనూహ్య ఘటనతో మ్యాచ్‌ రద్దైపోగా.. పిచ్‌ను తొక్కించిన వ్యక్తిపై మాత్రం ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ దృశ్యాలు వైరల్‌ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఎవరిది బాధ్యత‘‘బహుశా ఆ మైదానం అతడిదే అయి ఉంటుంది. ఓనర్‌నే మ్యాచ్‌కు ఆహ్వానించకపోతే ఎలా? అందుకే ఇలా చేశాడు’’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదు. ట్రాక్టర్‌తో వేగంగా దూసుకువచ్చిన సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత. ఇలాంటి వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే’’ అని పేర్కొంటున్నారు. Tractor Driver plows the cricket pitch mid-final in Jalgaon after the driver wasn’t invited to the tournament 😭 pic.twitter.com/LLS61mkRWJ— Ghar Ke Kalesh (@gharkekalesh) April 18, 2026

IPL 2026: CSK Suffer Big Blow Ayush Mhatre Ruled Out Remaining Season7
సీఎస్‌కేకు భారీ షాక్‌.. టోర్నీ నుంచి అతడు అవుట్‌

వరుస ఓటములతో నిరాశలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలి​ంది. ఆ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు ఆయుశ్‌ మాత్రే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి సీఎస్‌కే మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.టోర్నీ మొత్తానికి దూరం‘‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఏప్రిల్‌ 18 నాటి మ్యాచ్‌ సందర్భంగా ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre) తొడ కండరాలు పట్టేశాయి. ఆయుశ్‌ ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారు 6-12 వారాల సమయం పడుతుంది. కాబట్టి ఐపీఎల్‌-2026లో మిగిలిన సీఎస్‌కే మ్యాచ్‌లన్నింటికీ అతడు దూరమయ్యాడు’’ అని సీఎస్‌కే తమ ప్రకటనలో పేర్కొంది.కాగా తాజా ఎడిషన్‌లో సీఎస్‌కే తరపున వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆయుశ్‌ మాత్రే.. ఆరు మ్యాచ్‌లు ఆడి 201 పరుగలు సాధించాడు. అత్యధిక స్కోరు 73. ముంబైకి చెందిన ఆయుశ్‌ మాత్రే భారత అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌గా ఇటీవలే వరల్డ్‌కప్‌ అందించాడు.గతేడాది రీప్లేస్‌మెంట్‌ ప్లేయర్‌గా సీఎస్‌కేలో చేరిన ఆయుశ్‌ మాత్రే ఓపెనర్‌గా రాణించాడు. ఈ ఏడాది సంజూ శాంసన్‌- రుతురాజ్‌ గైక్వాడ్‌ ఓపెనర్లుగా రాగా.. ఆయుశ్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి అదరగొట్టాడు. చివరగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే 30 పరుగులతో దుమ్ములేపాడు.ఆయుశ్‌ స్థానంలో ఎవరు?అయితే, ఆ సమయంలోనే అతడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ కాసేపు క్రీజులో ఉన్న ఆయుశ్‌.. ఆ తర్వాత నొప్పి తాళలేక మైదానం వీడాడు. ఇక మంచి ఫామ్‌లో ఉన్న ఆయుశ్‌ సేవలను కోల్పోయిన సీఎస్‌కేకు.. అతడి బ్యాటింగ్‌ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలికేమీ కాదు. ఆయుశ్‌ స్థానంలో ఉర్విల్‌ పటేల్‌ లేదంటే కార్తిక్‌ శర్మను తుదిజట్టులో ఆడించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఎంఎస్‌ ధోని ఫిట్‌నెస్‌ లేక ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మరోవైపు ఖలీల్‌ అహ్మద్‌ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఆయుశ్‌ కూడా జట్టును వీడటంతో సీఎస్‌కేకు భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికి ఈ సీజన్‌లో సీఎస్‌కే.. ఆరు మ్యాచ్‌లు ఆడి రెండే గెలిచింది.చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌!

Tilak Varma Reacts On Animated Hardik Pandya Mid Match Message8
తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ తిలక్‌ వర్మ అదరగొట్టాడు. విధ్వంసకర అజేయ సెంచరీ (45 బంతుల్లో 101)తో రాణించి తమ జట్టుకు విజయం అందించాడు. అయితే, అహ్మదాబాద్‌ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో పేలవ ఆరంభం... పవర్‌ప్లేలో సాధారణ స్కోరు... గత మ్యాచ్‌ల తరహాలోనే మరోసారి ముంబై ఇన్నింగ్స్‌ పతనం దిశగా సాగిపోతున్నట్లుగా అనిపించింది... ఇలాంటి స్థితిలో తిలక్‌ వర్మ ఒక్కసారిగా ఆటను మార్చేశాడు.తీవ్ర ఒత్తిడి మధ్య నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆఖర్లో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తూ తొలి సెంచరీతో కదం తొక్కాడు. 19 సీజన్ల ఐపీఎల్‌ చరిత్రలో ఏ బ్యాటర్‌కూ సాధ్యం కాని రీతిలో చివరి 6 ఓవర్లలో ఒక్కడే 82 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అనంతరం ఛేదనలో మొదటి బంతికే వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో తిలక్‌ స్కోరును కూడా అందుకోలేక మూడు వరుస విజయాల తర్వాత ఓటమిని ఆహ్వానించింది.తిలక్‌ వర్మపై హార్దిక్‌ సీరియస్‌ఇదిలా ఉంటే.. గుజరాత్‌తో ఈ మ్యాచ్‌ను కూడా జాగ్రత్తగా మొదలు పెట్టిన తిలక్‌ వర్మ వేగంగా ఆడటంలో బాగా ఇబ్బంది పడ్డాడు. 14వ ఓవర్‌ ముగిసేసరికి అతను 22 బంతులు ఆడితే చేసింది 19 పరుగులే... ఒక్క బౌండరీ కూడా లేదు!.. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎండ్‌లో ఉన్న ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తిలక్‌ వర్మపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. Tilak Varma-ಗೆ ಹುರಿದುಂಬಿಸುತ್ತಿರುವ Hardik Pandya! 🗣️🤝🏻ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #GTvsMI | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL pic.twitter.com/0TDzA1kNzM— Star Sports Kannada (@StarSportsKan) April 20, 2026‘‘ఇలా ఆడితే ఎలా? అసలేం ఏం చేస్తున్నావు? ఇలా ఆడితే గెలుపు సాధ్యమేనా?’’ అన్నట్లుగా హార్దిక్‌ బాగా సీరియస్‌ అయినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఎంతో సంయమనం పాటించిన తిలక్‌ వర్మ.. ప్రసిధ్‌ వేసిన 15వ ఓవర్‌తో గేమ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ ఓవర్లో తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదిన తిలక్‌... రషీద్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు.దంచికొట్టిన తిలక్‌ఆ తర్వాత యువ పేస్‌ అశోక్‌ శర్మ ఓవర్లో తిలక్‌ చెలరేగిపోయాడు. ఈ ఓవర్‌ తొలి బంతికి సిక్స్‌ బాది 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అతను... ఇదే ఓవర్‌ తర్వాతి నాలుగు బంతుల్లో వరుసగా 4, 4, 6, 6తో ఆధిపత్యం ప్రదర్శించాడు. 19వ ఓవర్‌ ముగిసేసరికి అతను 80 పరుగుల వద్ద ఉన్నాడు. ఐపీఎల్‌లో తిలక్‌ మొదటి సెంచరీ సాధిస్తాడా అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో దూకుడైన బ్యాటింగ్‌తో తిలక్‌ దానిని చేసి చూపించాడు.ప్రసిధ్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి రెండు బంతుల్లో 4, 6 కొట్టిన అతను ఆఖరి రెండు బంతుల్లో కూడా మళ్లీ 6, 4 బాదాడు. షార్ట్‌ బంతికి స్క్వేర్‌ లెగ్‌ దిశగా బౌండరీకి తరలించడంతో తిలక్‌ శతకం పూర్తయింది. ఒక్క ప్రసిధ్‌ బౌలింగ్‌లోనే అతను 43 పరుగులు రాబట్టాడు. తాను ఆడిన చివరి 23 బంతుల్లో తిలక్‌ ఏకంగా 82 పరుగులు బాదడం విశేషం.నాలో కసి పెంచేందుకే అలాఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా తనతో వ్యవహరించిన తీరుపై తిలక్‌ వర్మ తాజాగా స్పందించాడు. ఐపీఎల్‌ వైబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్‌ భాయ్‌ ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. మరోవైపు.. నేనేమో ప్రశాంతంగా పనిచేసుకుపోయే రకం.అందుకే భాయ్‌ అప్పుడు నాలో కసిని పెంచాలని అలా చేశాడు. ‘నువ్వు చేయగలవు. నువ్విది చేస్తేనే మనం గెలుస్తాము’ అని నన్ను ఉత్సాహపరిచాడు. అందుకు నేనేమో.. ‘పర్లేదు.. ఇది జరిగితీరుతుంది. జట్టు కోసం చేయగలిగినదంతా చేస్తాను.. కచ్చితంగా చేస్తాను’ అని భాయ్‌కు చెప్పాను’’ అని తిలక్‌ వర్మ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2026లో తొలి ఐదు మ్యాచ్‌లలో తిలక్‌ వర్మ వరుసగా 20, 0, 14, 1, 8 స్కోర్లు చేశాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ సమష్టి వైఫల్యంలో భాగంగా ఉన్న తిలక్‌పై కూడా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ సెంచరీ ఇన్నింగ్స్‌తో తిలక్‌ బదులిచ్చినట్లు అయింది.చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌

It's not like no one can: Wrestler Sujeet Kalkal on dominance 65kg9
నా ఫేవరెట్‌ నేనే...

సాధారణంగా ఏ రంగంలో అయినా... ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునే వాళ్లు... ‘రోల్‌ మోడల్స్‌’ను ఆదర్శంగా తీసుకోవడం పరిపాటి! కానీ భారత యువ రెజ్లర్‌ సుజీత్‌ కల్కల్‌ మాత్రం తన అభిమాన ఆటగాడు తానే అని అంటున్నాడు. ప్రాక్టీస్‌లో భాగంగా ఇతర సీనియర్‌ రెజ్లర్ల వీడియోలకు బదులు తన వీడియోలే చూసి స్ఫూర్తి పొందుతానని చెబుతున్నాడు. కాగా 2025 జూన్‌లో జరిగిన అండర్‌–23 ఆసియా చాంపియన్‌షిప్‌ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 65 కేజీల విభాగంలో పరాజయం ఎరగకుండా ముందుకు సాగుతున్న సుజీత్‌... బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్‌లో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు.ఇటీవల కిర్గిస్తాన్‌ రాజధాని బిష్‌కెక్‌లో జరిగిన ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన సుజీత్‌... తనను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో మాత్రం లేనని వెల్లడించాడు.ఆ వివరాలు అతడి మాటల్లోనే...‘‘నేను ఎవరినీ అభిమానించను. ఇంకా చెప్పాలంటే నా అభిమాన రెజ్లర్‌ను నేనే. నా వీడియోలే ఎక్కువ చూస్తాను. ఆదివారం మొత్తం అదే పని పెట్టుకుంటా... నా ప్రాక్టీస్‌ బౌట్‌ల వీడియోలు చూసి స్వీయ విశ్లేషణ చేసుకుంటా. అప్పుడప్పుడూ యోగేశ్వర్‌ దత్, బజరంగ్‌ పూనియా, అమిత్‌ ధన్‌కర్‌ వంటి సీనియర్‌ల బౌట్‌లను పరిశీలిస్తా. వారి వేగం, బలం గమనిస్తా. కానీ ఎక్కువ శాతం మాత్రం నా బౌట్‌ వీడియోలే చూస్తా. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ప్రాక్టీస్‌కే అధిక సమయం పోతుంది. ఆదివారం మాత్రమే వీలు దొరకుతుంది. అప్పుడు నా బౌట్‌లు చూసి అందులో లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటా. నన్ను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో లేను. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఆ రోజు పోటీలో ఎవరు మెరుగైన ప్రదర్శన కనబర్చారు అనేదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. నా వరకైతే ఈ జోరు కొనసాగిస్తూ దేశానికి మరిన్ని పతకాలు అందించాలనుకుంటున్నా. గత రెండేళ్లుగా భారత రెజ్లర్ల చేతిలో ఒక్క బౌట్‌లోనూ ఓడలేదు. కానీ ఆసియా క్రీడల్లో ఇరాన్, జపాన్‌ రెజ్లర్లతో గట్టి పోటీ ఎదురవడం ఖాయం. దాని కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నా. మెరుగవ్వాల్సిన అంశాలపై దృష్టి పెట్టా. రెజ్లింగ్‌లో డిఫెన్స్‌దే కీలకపాత్ర. నా ప్రధాన బలం కూడా అదే. అటాకింగ్‌ గేమ్‌ పెంపొందించుకునేందుకు సాధన చేస్తున్నా. ఓర్పు పెంచుకుంటూ ప్రతిదాడిలో మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. భారత ఫ్రీస్టయిల్‌ హెడ్‌ కోచ్‌ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని జాతీయ శిబిరం ఎంతో ఉపయుక్తకరంగా ఉంది. ప్రతి అంశంలో మరింత మెరుగయ్యేందుకు కోచ్‌లు అనునిత్యం సాధన చేయిస్తున్నారు. దాని ఫలితాలు మున్ముందు మీరంతా చూస్తారు. నా బరువు కేటగిరీ రెజ్లర్లతోనే కాకుండా... నా కంటే ఎక్కువ బరువున్న వారితోనూ సాధన చేస్తున్న. దాని వల్ల శక్తిని పెంపొందించుకోవడంతో పాటు... మరిన్ని మెలకువలు నేర్చుకోవచ్చు. ఈ ఏడాది ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌ జరగనున్నాయి. ఆ రెండు నాకు ఎంతో ముఖ్యం. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఆసియా క్రీడల్లో వంద శాతం కష్టపడతా. ఇక గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో త్రుటిలో పతకం కోల్పోయా. ఈసారి అలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పతకంతో తిరిగి వస్తా. అండర్‌–23 విభాగానికి సీనియర్‌ స్థాయికి పెద్ద తేడా ఏమీ లేదు. అందులోనూ ఇలాంటి పోటీనే ఉంటుంది. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్థాయి అన్నిటికంటే పెద్దది. అక్కడ పోటీ తీవ్రత అధికం. మామూలుగా ఎవరైనా మట్టిలో రెజ్లింగ్‌ ప్రారంభిస్తారు. కానీ నేను కెరీర్‌ ప్రారంభం నుంచే మ్యాట్‌పై పోటీపడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. మా నాన్న నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. దాని వల్ల నా డిఫెన్స్‌ మెరుగైంది. సీనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో 10–15 సెకన్లు చేసిన చిన్న తప్పిదం వల్ల పతకం దక్కలేదు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఇక మీదట అలాంటి తప్పులు చేయను. అభిమానుల ఆదరణ అమోఘం. వారు నా నుంచి మరిన్ని పతకాలు ఆశిస్తున్నారు. తప్పక వారి కోరిక నెరవేరుస్తా. నా వరకైతే నేను పతకాలు సాధించగలనని వంద శాతం నమ్ముతున్నా. కానీ భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు కదా!సంగీతంతో సేదతీరుతా...రోజులో ఎక్కువ శాతం మ్యాట్‌పై కుస్తీ పట్టడంతోనే సరిపోతుంది. అయితే ఖాళీ దొరికితే మాత్రం సంగీతం వింటాను. అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటా. అయితే అవన్నీ రెజ్లింగ్‌ తర్వాతే. కొన్ని సార్లు రిఫ్రెష్‌ అవడానికి పాటలు ఉపయోగపడతాయి. దేశానికి పతకాలు సాధించాలనే లక్ష్యంతో జీవితంలో ఎన్నో ఇష్టమైన విషయాలను పక్కన పెట్టా. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం చాలా తక్కువ. కెరీర్‌ కోసం నచ్చిన ఆహారాన్ని కూడా వదులుకున్నా. ఇవన్నీ రెజ్లింగ్‌ కోసమే. నాన్న దయానంద్‌ రెజ్లింగ్‌ కోచ్‌ కావడంతో ఇంట్లో కూడా ఆటకు సంబంధించిన చర్చ నడుస్తుంది. ఏ క్రీడలోనైనా నిలకడ ముఖ్యం. అదే ఇతరులతో మనల్ని భిన్నంగా చూపుతుంది’’ అని సుజీత్‌ కల్కల్‌ పేర్కొన్నాడు.– సాక్షి క్రీడా విభాగం

Shubman Gill Replacement for India Test vs Afghanistan10
గిల్‌ స్థానంలో కెప్టెన్‌గా పంత్‌..?

ఐపీఎల్‌ 2026 ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. సీనియర్ల జాబితాలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నట్లు సమాచారం.ఒకవేళ గిల్‌ ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌కు దూరమైతే అతని స్థానంలో కెప్టెన్‌ ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో గిల్‌కు ప్రత్యామ్నాయంగా ముగ్గురి పేర్లు పరిశీలను రావచ్చు. వీరిలో ముందుగా రిషబ్‌ పంత్‌ పేరు ఉంటుంది. కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా పేర్లు కూడా పరిశీలనలో ఉంటాయి.రిషబ్‌ పంత్‌ విషయానికొస్తే.. ‍ప్రస్తుతం అతను భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ కారణంగా గిల్ స్థానంలో అతడే సహజమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. దూకుడు నాయకత్వం, మ్యాచ్‌ను ఒంటరిగా మలుపు తిప్పగల సామర్థ్యం పంత్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోని కఠిన పిచ్‌లపై సెంచరీలు సాధించడం అతని స్థాయి తెలియజేస్తుంది. ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉండటం కూడా అతనికి అదనపు బలం.కేఎల్ రాహుల్భారత సెలెక్టర్లు ఒకవేళ పంత్‌కు కూడా విశ్రాంతినివ్వాలని భావిస్తే, తదుపరి ప్రత్యామ్నాయంగా కేఎల్‌ రాహుల్‌ ఉంటాడు. రాహుల్‌కు గతంలో భారత టెస్ట్‌ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. 2022 బంగ్లాదేశ్ పర్యటనలో జట్టును విజయవంతంగా నడిపించడం అతని నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించింది.గిల్‌కు మూడో ప్రత్యామ్నాయ ఆప్షన్‌గా రవీంద్ర జడేజా ఉంటాడు. జడ్డూ జట్టులో అత్యంత అనుభవజ్ఞుల్లో ఒకరు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించే ఆల్‌రౌండర్‌గా జడేజా ఎప్పుడూ జట్టుకు ఆధారంగా ఉంటాడు. గతంలో వైస్ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement