Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Preparations for the 2027 ODI World Cup begin now1
ఐపీఎల్‌పై సెలెక్టర్ల నజర్‌

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఈ సీజన్‌ ఐపీఎల్‌ టి20 టోర్నీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కానీ సెలక్టర్ల బృందం తాము ఎంపిక చేసిన ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌ సైన్యం ఆటతీరు కోసం ఎలా ఉంటుందోనని పర్యవేక్షించనుంది. పది ఫ్రాంచైజీలు 2026–ఐపీఎల్‌ ట్రోఫీపై కన్నేస్తే... ఐదుగురు జాతీయ సెలక్టర్లు మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌కు దీటైన జట్టును ఎంపిక చేసే పనిలో పడింది. ఐపీఎల్‌ టోర్నీ ఫార్మాట్‌... వరల్డ్‌కప్‌ ఫార్మాట్‌ వేరైనా... ఇప్పటికే సిద్ధం చేసుకున్న 20 మంది భారత ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌పై సెలక్షన్‌ కమిటీ కన్నేసింది. ఇందుకోసం వారం రోజుల్లో మొదలయ్యే మెరుపుల లీగ్‌పై ప్రతీ సెలక్టర్‌ ఉమ్మడి బాధ్యత తీసుకున్నట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని ఈ బృందంలో శివసుందర్‌ దాస్, ఆర్పీ సింగ్, అజయ్‌ రాత్రా, ప్రజ్ఞాన్‌ ఓజా సెలక్టర్లుగా ఉన్నారు. ఇప్పుడు వీరంతా తమ ప్రాబబుల్స్‌ జాబితాలోని ఆటగాడు ఆడే ఐపీఎల్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు స్టేడియానికి వెళ్లనున్నారు. ఇలా ఐదుగురు సెలక్టర్లు వారంలో ఐదు రోజులు ఇదేపనిపై ఉంటారు. వంతుల వారీగా ఒకరైతే తప్పనిసరిగా స్టేడియానికి వెళితే... మిగతా నలుగురు టీవీల్లో ప్రాబబుల్స్‌ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించనున్నారు. ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్‌ మొదలవుతుంది. పూర్తిస్థాయి జట్టుతో... ఐపీఎల్‌ ముగిసిన తర్వాత భారత జట్టు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. ఇది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో భాగంగా లేదు. డబ్ల్యూటీసీలో లేకపోయినా... ప్రత్యర్థి బలహీనమైన జట్టే అయినా సెలక్టర్లు పూర్తిస్థాయి టీమిండియానే బరిలోకి దించాలని భావిస్తున్నారు. సీనియర్లు, కీలకమైన ఆటగాళ్లెవరికీ విశ్రాంతి ఇవ్వకుండా అందరిని మైదానంలో ఆడించేందుకు సెలక్టర్లు సిద్ధమయ్యారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎందుకంటే ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌కు ఇంకా 9 టెస్టులు మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో మేటి జట్లను ఎదుర్కొనేందుకు దీటుగా ప్రతీ మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని సెలక్షన్‌ కమిటీ చూస్తోంది. దీంతో ప్రీమియం సీమర్‌ బుమ్రాతో పాటు టెస్టుల్లో రెగ్యులర్‌ బౌలరైనా హైదరాబాదీ సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణలను అఫ్గాన్‌తో టెస్టుకు ఎంపిక చేయనుంది. అగార్కర్‌ పొడిగింపు కోరలేదు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీకి మాజీ సీమర్‌ అజిత్‌ అగార్కర్‌ చైర్మన్‌గా ఉన్నాడు. 2023, జూలైలో చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అతని పదవీ కాలం ఈ సెపె్టంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు టి20 ప్రపంచకప్‌లకు విజయవంతమైన జట్లను ఎంపిక చేసిన అగార్కర్‌ పదవీ కాలం పొడిగింపు కోరినట్లు వార్తలు ఊపందుకున్నాయి. కానీ బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు ఈ ఊహాగానాలను తొసిపుచ్చారు. అతని పదవీ కాలం ముగియలేదని, అప్పటి వరకు అతనే చీఫ్‌ సెలక్టర్‌ అని ఆ తర్వాతే అగార్కర్, బోర్డు కార్యదర్శి కలిసి ఓ నిర్ణయానికి వస్తారని ఆయన చెప్పారు.

LeBron James Closes in on Another Milestone2
ఇంకోటి ఆడితే రికార్డు పుటల్లోకి...

మయామి: అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం, లాస్‌ఏంజెలిస్‌ లేకర్స్‌ జట్టు ప్లేయర్‌ లెబ్రాన్‌ జేమ్స్‌ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ఒక్క మ్యాచ్‌ దూరంలో ఉన్నాడు. విఖ్యాత నేషనల్‌ బాస్కెల్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఈ ఆదివారం 41 ఏళ్ల లెబ్రాన్‌ జేమ్స్‌ చరిత్ర సృష్టించనున్నాడు. 79 ఏళ్ల ఎన్‌బీఏ చరిత్రలో వరుసగా 23 సీజన్‌లు ఆడిన ప్లేయర్‌గా... అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందిన లెబ్రాన్‌ మయామి హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో ఎన్‌బీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా 1997 నుంచి రాబర్ట్‌ పారిశ్‌ (1611 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును లెబ్రాన్‌ సమం చేశాడు. మయామి హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో లెబ్రాన్‌ 19 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ మ్యాచ్‌లో లాస్‌ఏంజెలిస్‌ లేకర్స్‌ జట్టు 134–126తో గెలిచి ఈ సీజన్‌లో వరుసగా ఎనిమిదో విజయాన్ని అందుకుంది. లాస్‌ఏంజెలిస్‌ లేకర్స్‌ జట్టు తదుపరి మ్యాచ్‌ను రేపు ఒర్లాండో మ్యాజిక్‌ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో లెబ్రాన్‌ బరిలోకి దిగితే ఎన్‌బీఏ చరిత్రలోనే అత్యధికంగా 1612 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఘనత వహిస్తాడు.

Rajasthan Royals Rejects INR 16000 Crore Bid Ahead IPL 20263
IPL 2026: వేలకోట్లు వదులుకున్న రాజస్థాన్‌

ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ విజేత రాజస్థాన్‌ రాయల్స్‌ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవలే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీలను అమ్మకాలకు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్‌ రాయల్స్‌ కొలంబియా పసిఫిక్‌ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ (సీపీసీసీ) కన్సార్టియం నుంచి వచ్చిన 16 వేల కోట్లు (1.7 బిలియన్‌ డాలర్ల) బిడ్డింగ్‌ను వదులుకోవడం ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి రాజస్థాన్‌కు ఇప్పుడొచ్చిన బిడ్‌ మంచి ధరే అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తూ పెద్ద మొత్తంలో వచ్చిన బిడ్‌ను కాదనుకొని రాజస్థాన్‌ చేతులు కాల్చుకుంటుందని పలువురు క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, కెనడాలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అయిన సీపీసీసీ రాజస్థాన్‌ రాయల్స్‌ కోసం పెద్ద మొత్తంలో బిడ్‌ను దాఖలు చేయడం కొంత ఆశ్చర్యపరిచింది.రాజస్థాన్‌ ఫ్రాంచైజీలో ఎమర్జింగ్‌ మీడియా వెంచర్స్‌ అధినేత మనోజ్‌ బదాలె వాటా 65 శాతం కాగా మిగతా వాటా రెడ్‌బర్డ్‌ క్యాపిటల్‌కు ఉంది. మరోవైపు ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ముందు వరుసలో ఉండే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) విలువ మాత్రం 20వేల కోట్లు దాటే అవకాశముంది. ఇప్పటికే ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ రంజన్‌ పై సారథ్యంలోని కన్సార్టియం దాదాపు 2 బిలియన్‌ డాలర్లకు పైగానే బిడ్‌ను దాఖలు చేసింది. ఇక 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌ తొలి సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్‌ గెలుచుకుంది. షేన్‌ వార్న్‌ సారధ్యంలోని జట్టులో రవీంద్ర జడేజా, షేన్‌ వాట్సన్‌, యూసఫ్‌ పఠాన్‌ సహా కీలక క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇక ఆ తర్వాత రాజస్థాన్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతూనే వచ్చింది. అయితే 2013 తర్వాత నుంచి రాజస్థాన్‌ కాస్త గాడిన పడింది. 2013లో ప్లేఆఫ్స్‌ చేరిన రాజస్థాన్‌ ఆ తర్వాత 2015, 2018 సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌ చేరింది. 2022లో శాంసన్‌ సారథ్యంలో రన్నరప్‌గా నిలిచింది. 2025 సీజన్‌లో రాజస్థాన్‌ 9వ స్థానంలో నిలిచి లీగ్‌ దశకే పరిమితమైంది.చదవండి: ‘మానసిక వేదన అనుభవిస్తున్నా’

Iga Swiatek Shocking Comments Tennis Feels Complicated-Match Lost 4
‘మానసిక వేదన అనుభవిస్తున్నా’

పోలండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్‌ ఓడిపోవడం తనను మానసిక వేదనకు గురి చేస్తోందని, ఓటములతో కోర్టులో ఆటపై పట్టు కోల్పోతున్నట్లుగా అనిపిస్తుందని తెలిపింది. గురువారం ప్రారంభమైన మియామి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో స్వియాటెక్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 50వ ర్యాంకర్‌ మగ్డా లినెట్టె 6-1, 5-7, 6-3తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అయిన స్వియాటెక్‌ను మూడు సెట్లలో చిత్తు చేసింది. ఒక డబ్ల్యూటీఏ టూర్‌లో భాగంగా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో 73 మ్యాచ్‌ల్లో వరుస విజయాల తర్వాత తొలి రౌండ్‌లో ఓడిపోవడం స్వియాటెక్‌కు ఇదే తొలిసారి. మ్యాచ్‌ ఓటమి అనంత‌రం స్వియాటెక్‌ మాట్లాడుతూ.. ‘నేను ఓడిపోయానంటే న‌మ్మ‌బుద్ది కావ‌డం లేదు. రాను రాను టెన్నిస్ ఆట క‌ష్టంగా అనిపిస్తోంది . ఈ ఆట చాలా తేలిక అనుకున్నా. కానీ, కోర్టులో మాన‌సికంగా మ‌నం ఎలా ఉంటామ‌నేది చాలా కీల‌కం. ఇది నాకొక చెత్త మ్యాచ్. ఈ ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుంటా. మ‌ళ్లీ నా ప‌నిలో మునిగిపోతా. ప్రాక్టీస్ చేస్తాను. పాజిటివ్‌గా ఆలోచిస్తూ.. నా ఆట‌ను మెరుగుప‌ర‌చుకుంటా’ అని స్వియాటెక్ పేర్కొంది. కాగా స్వియాటెక్‌ తన టెన్నిస్‌ కెరీర్‌లో ఇప్పటివరకు ఆరు గ్రాండ్‌స్లామ్‌లు సాధించగా ఇందులో నాలుగుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ ఒక్కోసారి నెగ్గడం విశేషం. ఒక దశలో స్వియాటెక్‌ డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 125 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగడం విశేషం.చదవండి: ‘సంజూకు మామయ్యలాంటి వాడిని’‼️UPSET ALERT IN HARD ROCK STADIUM ‼️@MagdaLinette | #MiamiOpen pic.twitter.com/lUJtcc5jbW— wta (@WTA) March 20, 2026

Shashi Tharoor Recalls Meeting 14-Year-Old-Sanju Samson Uncle Relation5
‘సంజూకు మామయ్యలాంటి వాడిని’

భారత జట్టు స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శశిథరూర్‌ వెల్లడించారు. అయితే సంజూ శాంసన్‌తో బంధం ఈనాటిది కాదని, అతడికి తాను మామయ్యలాంటి వాడినని తెలిపారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ 2026లో సంజూ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’‌గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీలో 321 పరుగులు చేసిన శాంసన్‌ ముఖ్యంగా సెమీఫైనల్‌, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌ సంజూ శాంసన్‌తో తనకున్న అనుబంధాన్ని, సంజూ విషయంలో గౌతమ్‌ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నాడు. ‘సంజూని మొదటిసారి 14 ఏళ్ల వయసులో చూశాను. ఆ సమయంలో అతడికి నేను ఎందుకో అంకుల్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలోనే శాంసన్‌ టాలెంట్ స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడు నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని శాంసన్‌కు చెప్పాను. కానీ తర్వాత గంభీర్‌తో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు, ఆయన ‘లేదండీ శాంసన్‌ తర్వాతి ధోనీ కాదు..వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’ అని చెప్పినట్లు గుర్తుంది. ఇవాళ గంభీర్‌ మాటలు నిజమయ్యాయి.సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజూ శాంసన్‌ ఎంతో వినయంగా ఉంటాడు.మంచి నాయకుడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సమర్థంగా నడిపించాడు. ఇప్పుడు చెన్నై జట్టులోనూ తనకంటే ప్రత్యేకతను సాధించుకుంటాడు. జట్టుకు అవసరమైనప్పుడు స్వార్థం లేకుండా ఆడతాడు. శతకం కోసం ఆడకుండా టీమ్ కోసం పెద్ద షాట్లు ఆడాడు. అదే అతని గొప్పతనం. శాంసన్‌ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. సంజూ శాంసన్‌కు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్‌గా ఆడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అని శశిథరూర్ వెల్లడించారు. ఇంతకాలం ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్‌ ఈ సీజన్‌ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడనున్నాడు. తన ఫెవరెట్‌ క్రికెటర్‌ అయిన ఎంఎస్‌ ధోనితో కలిసి ఆడనుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శాంసన్‌ ఇటీవలే సీఎస్‌కే ప్రాక్టీస్‌లో జాయిన్‌ అయిన సందర్భంగా వెల్లడించాడు.చదవండి: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్‌.. సంచలనం రిపీటయ్యేనా?

Ex India Star Quits Commentary Blames BCCI For This Fans Reacts6
మాజీ క్రికెటర్‌ ’రిటైర్మెంట్‌’.. బీసీసీఐపై సంచలన ఆరోపణలు

భారత మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ కీలక ప్రకటన చేశాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కామెంట్రీ ప్యానెల్‌ నుంచి వైదొలిగినట్లు తెలిపాడు. ఇకపై బీసీసీఐ కామెంట్రీలో తాను కనిపించబోనంటూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు.శరీర రంగు నల్లగా ఉన్న కారణంగాఈ సందర్భంగా లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ బీసీసీఐపై సంచలన ఆరోపణలు చేశాడు. తన శరీర రంగు నల్లగా ఉన్న కారణంగా వివక్ష చూపారని.. అందుకే తనకు తగినన్ని అవకాశాలు రాలేదని ఆరోపించాడు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ 1980వ దశకంలో టీమిండియాకు ఆడాడు.సంచలన ప్రదర్శనలుఅంతర్జాతీయ క్రికెట్‌లో తొమ్మిది టెస్టుల్లో 130 పరుగులు, 26 వికెట్లు తీసిన లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌.. 16 వన్డేలు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. టెస్టు అరంగేట్రంలో ఒక్క వికెట్‌ కూడా తీయని ఈ స్పిన్‌ బౌలర్‌.. 1984లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఏకంగా 12 వికెట్లు తీసి జట్టును గెలిపించి వార్తల్లో నిలిచాడు.అంతేకాదు 1985లో ఆస్ట్రేలియా వేదికగా సునిల్‌ గావస్కర్‌ కెప్టెన్సీలో బెన్సన్‌ హెడ్జెస్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ గెలవడంలోనూ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో నాటి ఫైనల్లో ప్రత్యర్థిని 176 పరుగులకే కట్టడి చేయడంలో సహకరించి.. భారత్‌ విజయానికి కృషి చేశాడు.ఇక ఆటకు స్వస్తి పలికిన తర్వాత లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ 2000 సంవత్సరంలో కామెంటేటర్‌గా కెరీర్‌ ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్‌ కమిటీలో ప్లేయర్‌ రిప్రజెంటేటివ్‌గానూ పనిచేశాడు. ఈ క్రమంలో శుక్రవారం కామెంట్రీకి రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ సోషల్‌ మీడియా వేదికగా చర్చకు తెరలేపాడు.శాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనూ‘‘బీసీసీఐ కామెంట్రీకి రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. 23 ఏళ్ల కాలంలో టాస్‌లు వేయడానికి, ప్రెజెంటేషన్‌ ఇవ్వడానికి నేను పనికిరాలేదు. కానీ కొత్త వాళ్లు వచ్చి పిచ్‌ రిపోర్టులు ఇస్తూ. టాస్‌ ప్రజెంటేషన్లు ఇచ్చారు. శాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనూ నాకు అవకాశం రాలేదు. దీనికి కారణం ఏమనుకుంటున్నారు?’’ అంటూ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వరుసగా ట్వీట్లు చేశాడు.వర్ణ వివక్షఇందుకు ఓ నెటిజన్‌.. ‘‘మీరు రంగు తక్కువ కాబట్టి’’ అని కామెంట్‌ చేయగా.. ‘‘సరిగ్గా చెప్పారు’’ అని శివరామకృష్ణన్‌ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజన్‌ కూడా ఇలాగే కామెంట్‌ చేయగా.. ‘‘అవును.. మీరు చెప్పింది నిజం. వర్ణ వివక్ష’’ అని పేర్కొన్నాడు. అయితే, మరికొంత మంది మాత్రం ఉన్నన్ని రోజులు బోర్డును వాడుకుని.. ఇలా నిందించడం కొందరికి అలవాటేనంటూ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ను విమర్శించారు.అవునా?ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ పోస్ట్‌పై స్పందించాడు. ‘‘ఓహ్‌.. ఇలా ఎందుకు? ఈసారి ఐపీఎల్‌కు ముందే ఎందుకిలా?’’ అని కామెంట్‌ చేశాడు. అయితే, అశూ వ్యంగ్యంగానే ఇలా స్పందించాడని అభిమానులు అంటున్నారు. గతంలో అశూను లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టాడు. అశ్విన్‌ భారత్‌లో మాత్రమే రాణించగలడని.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి బౌలింగ్‌ రికార్డు ఘోరంగా ఉందంటూ విమర్శించాడు.చదవండి: అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ

India Women Set Landmark Test Return In South Africa After 24 Years7
24 ఏళ్ల తర్వాత మ్యాచ్‌.. సంచలనం రిపీటయ్యేనా?

భారత మహిళల జట్టు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు మ్యాచ్‌ ఆడనుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే 24 ఏళ్ల కిందట మహిళల జట్టు సౌతాఫ్రికాలో ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. మరి 2002లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా మహిళలు మరోసారి ఆ సీన్‌ను రిపీట్‌ చేస్తారా లేదా అన్నది చూడాలంటే డిసెంబర్‌ 20 వరకు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో క్రికెట్‌ సౌతాఫ్రికా శుక్రవారం భారత మహిళల జట్టు పర్యటనకు సంబం ధించిన వన్డేలు, ఏకైక టెస్టు మ్యాచ్‌కు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది. సఫారీల పర్యటనలో తొలుత సౌతాఫ్రికా ఎమర్జింగ్‌ టీమ్‌తో హర్మన్‌ బృందం వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 9 నుంచి 15 మధ్య మూడు వన్డేలు, ఆ తర్వాత డిసెంబర్‌ 20 నుంచి 23 మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందే టీ20 ప్రపంచకప్‌ సన్నాహకంగా వచ్చే నెలలో సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. మహిళల టీ20 ప్రపంచకప్‌ ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది.2002లో మార్చి 19 నుంచి 22 వరకు పార్ల్‌ వేదికగా జరిగిన ఆనాటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 9 వికెట్ల నష్టానికి 404 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. భారత బ్యాటర్లలో అంజూ జైన్‌ (52), కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా (80), మిథాలీరాజ్‌ (55), హేమలతా కలా (64), మమతా మబెన్‌ (50) అర్థసెంచరీలతో రాణించారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపా మరాతే 3 వికెట్లు తీయగా, నీతూ డేవిడ్‌ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత ఫాలోఆన్‌ ఆడిన సౌతాఫ్రికా జట్టు 266 పరుగుల వద్ద ఆలౌటైంది. జులన్‌ గోస్వామి, హేమలతా కలా చెరో 3 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత 13 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 1.3 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది.సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు పర్యటన వివరాలు..డిసెంబర్‌ 6: సౌతాఫ్రికా ఎమర్జింగ్‌ జట్టుతో వార్మప్‌మ్యాచ్‌డిసెంబర్‌ 9: తొలి వన్డే, పోచెఫ్‌స్ట్రూమ్డిసెంబర్‌ 12: రెండో వన్డే, బ్లోమ్‌ఫోంటైన్డిసెంబర్‌ 15: మూడో వన్డే, కేప్‌టౌన్‌డిసెంబర్‌ 20-23: ఏకైక టెస్టు మ్యాచ్‌, గెబెర్హాచదవండి: ‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’

Shouldnt Even Be In Team: Pakistan Great Lambasts Shaheen Afridi8
జట్టులో చోటుకే దిక్కులేదు.. కెప్టెన్‌ను చేయాలా?

పాకిస్తాన్‌ పేస్‌ దళ నాయకుడిగా పేరొందిన షాహిన్‌ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026లో పేలవ ప్రదర్శన, వన్డే కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర ఓటమి ఇందుకు తాజా కారణాలు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 103 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ 136 వికెట్లు కూల్చాడు.తద్వారా పాక్‌ తరఫున పొట్టి క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షాహిన్‌ ఆఫ్రిది కొనసాగుతున్నాడు. అయితే, గత కొంతకాలంగా అతడి ఆట మరీ దిగజారింది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో మొత్తంగా ఎనిమిది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.పదకొండేళ్ల తర్వాతఇక ఆ తర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనలో పాక్‌ వన్డే జట్టుగా బాధ్యతలు నిర్వర్తించిన షాహిన్‌ ఆఫ్రిది.. 2-1 తేడాతో పాక్‌ సిరీస్ కోల్పోవడంతో విమర్శల పాలయ్యాడు. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత పాక్‌ బంగ్లాకు వన్డే సిరీస్‌ కోల్పోవడం ఇదే తొలిసారి కావడంతో విమర్శలు పదునెక్కాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ సైతం షాహిన్‌ ఆఫ్రిది ఆట తీరుపై మండిపడ్డాడు.జట్టులో చోటుకే దిక్కులేదు‘‘పాకిస్తాన్‌ టీ20, వన్డే జట్ల కెప్టెన్‌గా షాహిన్‌ ఆఫ్రిది ఉండాలని గతంలో క్యాంపెయిన్‌ నడిచింది. ఆ తర్వాత వన్డేలకు బదులు టీ20 జట్టుకు కెప్టెన్‌ అయితే చాలు అన్నారు. కానీ ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు.నిజానికి పాక్‌ టీ20 జట్టులో అతడికి చోటు కూడా ఇవ్వొద్దు. ముఖ్యంగా తుదిజట్టులో ఉండే అర్హత అతడు కోల్పోయాడు. అతడి ఖేల్‌ ఖతమైపోయింది’’ అని రషీద్‌ లతీఫ్‌ షాహిన్‌ ఆఫ్రిదిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.మామ అలామరోవైపు.. బంగ్లాదేశ్‌ చేతిలో వన్డే సిరీస్‌ ఓటమి తర్వాత షాహిన్‌ ఆఫ్రిది మామ, మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది మాట్లాడుతూ.. సెలక్షన్‌ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌, బంగ్లా సిరీస్‌లో ఓటముల నేపథ్యంలో విమర్శలకు సెలక్టర్లు అర్హులేనని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్‌ చేయాలో తెలియదంటూ మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో రషీద్‌ లతీఫ్‌ పైవిధంగా స్పందించడం గమనార్హం.చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్‌ బోర్డు!

India To Play T20I Series In Ireland Before England Tour: Report9
టీమిండియా అభిమానులకు పండుగే పండుగ!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్‌ పందొమ్మిదో ఎడిషన్‌తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్‌-2026 ముగిసిన తర్వాత జూన్‌ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య సిరీస్‌ జరుగుతుంది.ముందుగా ఐర్లాండ్‌ టూర్‌కు!ఇందులో భాగంగా భారత్‌- అఫ్గన్‌ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్‌ టూర్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.ఐర్లాండ్‌ హై పర్ఫామెన్స్‌ డైరెక్టర్‌ గ్రాహమ్‌ వెస్ట్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఐర్లాండ్‌ కనీసం సూపర్‌-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.మంచి బూస్ట్‌ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్‌ స్టెర్లింగ్‌ కెప్టెన్‌ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్‌-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్‌ స్టెర్లింగ్‌ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్‌కు జూన్‌లో టీమిండియాతో జరిగే సిరీస్‌తో మంచి బూస్ట్‌ లభిస్తుంది’’ అని గ్రాహమ్‌ వెస్ట్‌ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్‌- ఐర్లాండ్‌ సిరీస్‌ విషయాన్ని ఖరారు చేశాడు.కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్‌లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్‌ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు నిర్వహించాలని నిర్ణయించారు.మరింత బిజీగాఅయితే, తాజాగా ఐర్లాండ్‌ టూర్‌తో భారత జట్టు షెడ్యూల్‌ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన బీసీసీఐ?

RR Captain Looks Vaibhav Sooryavanshi Away From Spotlight IPL 202610
‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’

వైభవ్‌ సూర్యవంశీ.. భారత క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. పసిప్రాయంలోనే దూకుడైన ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులను వణికించిన 15 ఏళ్ల సూర్యవంశీ ఏడాది కాలంగా అండర్‌-19 క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో 175 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ అతడి అసాధారణ ప్రతిభకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంతకాలం అండర్‌-19 క్రికెట్‌లో దుమ్మురేపిన వైభవ్‌ సూర్యవంశీ ఇక ఐపీఎల్‌లో తన మెరుపులు చూపించేందుకు సమాయ త్తమవుతున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్న సూర్యవంశీపై ఈసారి భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన రియాన్‌ పరాగ్‌ వైభవ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘ఏడాది కాలంగా తిరుగులేని ప్రదర్శనతో వైభవ్‌ సూర్యవంశీ అందరి దృష్టిలో పడ్డాడు. ఎక్కడ మ్యాచ్‌ ఆడితే అక్కడ భారీ స్కోర్లు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్‌ ద్వారా వైభవ్‌ కొత్తగా నిరూపించుకోవాల్సిన పని లేదు. అలాంటి యంగ్‌ ఓపెనర్‌ మా జట్టులో ఉండడం మాకు కొండంత బలం. ఇటీవలే అండర్‌-19 ప్రపంచకప్‌లో సూర్యవంశీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనం. ఐపీఎల్‌లో వైభవ్‌ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉండడం సహజమే. కానీ కెప్టెన్‌గా వైభవ్‌కు నేను ఇచ్చే సలహా ఒక్కటే. అందరి దృష్టి తన మీదే ఉండడంతో మీడియా అటెన్షన్‌ ఉంటుంది. అందుకే మీడియాకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ అతడు తన ఆటను ఎంజాయ్‌ చేస్తూ ఆడితే బాగుంటుంది. అతడికింకా 15-16 ఏళ్లు మాత్రమే. అందుకే సూర్యవంశీని తన ఆటను స్వేచ్ఛగా ఆడనిద్దాం. జట్టుగా అతడిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం మా బాధ్యత. సంచలన ఇన్నింగ్స్‌లతో దేశానికి గర్వకారణంగా నిలిచిన వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిస్తున్నా’ అని పరాగ్‌ చెప్పుకొచ్చాడు. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌ కుమార సంగక్కర మాట్లాడుతూ.. ‘బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల సమతూకంతో మా జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది. ఈసారి కచ్చితంగా టైటిల్‌ కొట్టేందుకే అహర్నిశలు శ్రమించనున్నాం’ అని తెలిపాడు. కాగా గతేడాది వరకు రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్‌ ట్రేడింగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు వెళ్లిపోవడంతో రియాన్‌ పరాగ్‌ రాజస్థాన్‌ నూతన కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. శాంసన్‌ స్థానంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్‌ కరన్‌లు చెన్నై నుంచి రాజస్థాన్‌కు వచ్చారు.చదవండి: ఇరాన్‌కు షాకిచ్చిన ఫిఫా!

Advertisement
Advertisement
 
Advertisement