ప్రధాన వార్తలు
పరాయి దేశానికి వలస వెళ్లిన మరో సౌతాఫ్రికా క్రికెటర్
సాధారణంగా ఏ క్రీడాకారుడికైనా దేశానికి ప్రాతినిథ్యం వహించడమనేది ఓ కల. అయితే సౌతాఫ్రికన్లు మాత్రం ఇందుకు భిన్నం. ఈ మాట చెప్పడానికి కారణాలు లేకపోలేదు. క్రికెట్ను ఉదాహరణగా తీసుకుంటే.. ఈ క్రీడ చరిత్రలో అత్యధిక శాతం వలస వెళ్లిన వాళ్లు సౌతాఫ్రికన్లే. వలస వెళ్లడమే కాదు.. దేశం మారాక వారిలో అధిక శాతం మంది స్టార్ క్రికెటర్లయ్యారు.సౌతాఫ్రికన్లే ఎక్కువ శాతం ఎందుకు విదేశాల్లో కెరీర్లు ప్లాన్ చేసుకుంటున్నారన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పేరుకు పెద్ద దేశమే అయినా, ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్దిక వనరులు మాత్రం అంతంతమాత్రమే. క్రికెటర్లు ఇతర దేశాలకు వలస వెళ్లడానికి ఇదే ప్రధాన కారణం.చరిత్ర చూసుకుంటే, సౌతాఫ్రికాలో పుట్టిన క్రికెటర్లు ఎక్కువ శాతం ఇంగ్లండ్కు వలస వెళ్లారు. ఇందుకు కారణం కోల్పాక్ ఒప్పందాలు. ఈ ఒప్పందాల మేరకు 2010లో రూపొందించిన యూరోపియన్ యూనియన్ చట్టాల్లో.. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇంగ్లండ్లో స్థానిక ఆటగాళ్లుగా ఆడే అవకాశం పొందారు. సౌతాఫ్రికాతో పోల్చుకుంటే ఇంగ్లండ్లో మెరుగైన వేతనాలు, సౌకర్యాలు, స్థిరమైన కెరీర్ మరియు భవిష్యత్తు, అదనంగా కుటుంబ భద్రత అధికంగా లభిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ శాతం మంది సౌతాఫ్రికాలో జన్మించినా ఇంగ్లండ్లో కెరీర్ను ప్లాన్ చేసుకోవాలని అనుకుంటారు.ఉదాహరణకు.. సౌతాఫ్రికా దేశవాలీ క్రికెట్తో పోలిస్తే, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అధిక వేతనాలు లభిస్తాయి. ఇంగ్లండ్ కౌంటీలతో ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే స్థిరమైన ఆదాయం కూడా ఉంటుంది. ఈ కారణంగా కెవిన్ పీటర్సన్, జేసన్ రాయ్, జోనాథన్ ట్రాట్, ఆండ్రూ స్ట్రాస్, మ్యాట్ ప్రయర్ లాంటి సౌతాఫ్రికన్లు ఇంగ్లండ్కు వలస వెళ్లి, అక్కడ స్టార్లుగా ఎదిగారు. వీరికి ముందు అలన్ లాంబ్, క్రిస్ స్మిత్, డెర్క్ రాండల్ లాంటి వారు కూడా సౌతాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్ దిగ్గజాలుగా మారారు.ఆర్దిక అవకాశాలు కాకుండా సౌతాఫ్రికన్లు ఇతర దేశాలకు వలస వెల్లడానికి మరో కారణం కెరీర్ స్థిరత్వం. ఇతర దేశాలతో పోలిస్తే.. సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ అవకాశాలు రావడం కాస్త కష్టం. వర్ణానికి సంబంధించిన రిజర్వేషన్ల కారణంగా ఆ జట్టులో పరిమిత అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాల్లో ఈ సమస్య ఉండదు. పౌరసత్వం పొందాకా ఆటలో రాణించగలిగితే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.సౌతాఫ్రికన్లు వలసల బాట పట్టడానికి మరో కారణం కుటుంబ భద్రత మరియు జీవన ప్రమాణాలు. సౌతాఫ్రికాలోని సామాజిక–రాజకీయ అస్థిరత, నేరాల రేటు కారణంగా ఆటగాళ్లు కుటుంబ భద్రత కోసం వలస వెళ్తారు. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇతర దేశాల్లో పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్య సౌకర్యాలు మెరుగ్గా ఉండటం వల్ల వారు వలసలకు ప్రాధాన్యత ఇస్తారు.క్రికెట్లో సౌతాఫ్రికన్ల వలసలకు మరో ప్రధాన కారణం బోర్డు పరిపాలనలో అంతర్గత సమస్యలు. ఆర్దిక సమస్యలతో కొట్టిమిట్టాడే క్రికెట్ సౌతాఫ్రికా (CSA).. పాలనా సమస్యల కారణంగా మరింత పతనమవుతుంది. బోర్డు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఆటగాళ్లను వలసలు వెళ్లేలా ప్రేరేపిస్తాయి.వీటికి తోడు ప్రైవేట్ టీ20ల్లో లీగ్ల్లో పాల్గొనడంపై పరిమితులు ఉండటం సౌతాఫ్రికన్లను వలసలకుప్రోత్సహిస్తుంది. ఇటీవలికాలంలో చాలామంది సౌతాఫ్రికన్లు డబ్బు అధికంగా లభించే ప్రైవేటు టీ20 లీగ్ల కోసం జాతీయ జట్టు అవకాశాలను కూడా తృణప్రాయంగా వదిలిపెట్టారు. హెన్రిచ్ క్లాసెన్ ఇందుకు ప్రధాన ఉదాహరణ.ప్రైవేటు టీ20 లీగ్ల ప్రభావంతో ప్రస్తుతం సౌతాఫ్రికన్ల వలసల రేటు తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అవకాశాల కోసం ఎదురుచూసే వారు మాత్రం ఇంకా పక్క దేశాలవైపు చూస్తూనే ఉన్నారు. తాజాగా సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ జేజే స్మట్స్ జాతీయ జట్టు అవకాశాలు రాకపోవడంతో ఇటలీకి వలస వెళ్లాడు. భార్య ద్వారా ఆ దేశ పౌరసత్వం పొంది 2026 టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు సంపాదించాడు. స్మట్స్ ఇతర దేశ జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలోనే ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.క్రికెట్ చరిత్రలో ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహించిన సౌతాఫ్రికన్లు (ఇంగ్లండ్ కాకుండా)..ఆస్ట్రేలియామార్నస్ లబూషేన్కీగన్ మాథ్యూస్ఫిరోస్ ఎర్ఫాన్క్లైవ్ ఇంగ్లిస్న్యూజిలాండ్గ్రాంట్ ఇలియట్నీల్ వాగ్నర్డెవాన్ కాన్వేలూక్ రోంచిక్రిస్ కేన్స్నమీబియాడేవిడ్ వీస్జింబాబ్వే గ్యారీ బ్యాలెన్స్
భారత జెర్సీలో మళ్లీ రో-కోలు కనిపించేది ఎప్పుడంటే?
టీమిండియా స్టార్ జోడీ విరాట్ కోహ్లి-రోహిత్ శర్మల ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగియడంతో రో-కో ద్వయం దాదాపు 6 నెలల పాటు భారత జెర్సీలో కన్పించరు. మళ్లీ వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో వీరిద్దరూ భారత్ తరపున ఆడనున్నారు.అంతకంటే మందు జూన్లో అఫ్గానిస్తాన్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం భారత పర్యటనకు రావాల్సి ఉంది. కానీ ఈ ద్వైపాక్షిక సిరీస్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఒకవేళ అఫ్గానిస్తాన్తో భారత్ ఆడితే విరాట్-రోహిత్ కూడా బరిలోకి దిగనున్నారు. లేదంటే ఆ తర్వాత నెలలో ఇంగ్లండ్పై కచ్చితంగా ఆడనున్నారు.కాగా ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లిలు.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్తో వన్డేల తర్వాత టీమిండియా టీ20 సిరీస్లు ఎక్కువగా ఆడనుంది. వీరిద్దరూ టీ20లకు వీడ్కోలు పలకడంతో వన్డే సిరీస్ షెడ్యూల్ వరకు అభిమానులు అగాల్సిందే.అయితే ఈ సీనియర్ ప్లేయర్లు ఐపీఎల్లో మాత్రం తమ తమ జట్లు తరపున సందడి చేయనున్నారు. ఈ ఏడాది ఆఖరిలో మాత్రం విరాట్, రోహిత్ వరుస అంతర్జాతీయ సిరీస్లలో బీజీబీజీగా గడపనున్నారు. ఇంగ్లండ్తో వన్డేలు ముగిసిన తర్వాత సెప్టెంబర్లో భారత్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య విండీస్తో మెన్ ఇన్ బ్లూ 3 వన్డేలు ఆడనుంది. అనంతరం అక్టోబర్-నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.విరాట్ హిట్.. రోహిత్ ఫట్ఇక తాజాగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి దుమ్ములేపితే.. రోహిత్ మాత్రం తీవ్ర నిరాశ పరిచాడు. ఈ సిరీస్లో కోహ్లి మొత్తంగా 240 పరుగులు చేసి భారత తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో కూడా కోహ్లి వీరోచిత శతకంతో పోరాడాడు. రోహిత్ మాత్రం మూడు మ్యాచ్లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: IND vs NZ: వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్ కీలకం!
వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్ కీలకం!
న్యూజిలాండ్ వన్డే జట్టు తాత్కాలిక కెప్టెన్ మైకేల్ బ్రేస్వెల్పై టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో భారత గడ్డపై తొలిసారి కివీస్కు వన్డే సిరీస్ విజయాన్ని అందించాడని కొనియాడాడు.మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) ఫిట్నెస్ సమస్యల కారణంగా వన్డే సిరీస్కు దూరం కాగా.. టీ20 సారథి బ్రేస్వెల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.ఈ క్రమంలో బ్రేస్వెల్ (Michael Bracewell) కెప్టెన్సీలో తొలి వన్డేలో టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. ఆఖరి రెండు మ్యాచ్లలో గెలిచి తొలిసారి భారత్లో వన్డే సిరీస్ గెలిచింది. ఇండోర్లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.బ్రేస్వెల్ ధనాధన్ఈ మ్యాచ్లో డారిల్ మిచెల్ (131 బంతుల్లో 137), గ్లెన్ ఫిలిప్స్ (106) శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ బ్రేస్వెల్ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 18 బంతుల్లోనే ఓ ఫోర్, మూడు సిక్సర్లు బాది 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసిన కివీస్.. లక్ష్యాన్ని కాపాడుకుని జయభేరి మోగించింది.ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఐదో స్థానంలో వచ్చి గ్లెన్ ఫిలిప్స్ మరోసారి అద్భుతంగా ఆడాడు. షార్ట్ పిచ్ డెలివరీలను చక్కగా ఆడాడు. బంతిని నేరుగా బౌండరీ మీదుగా తరలించాడు.అత్యంత కీలకంవికెట్ బాగుంది. దానిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, మైకేల్ బ్రేస్వెల్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఈ మ్యాచ్కు అత్యంత కీలకం. అతడి కారణంగానే న్యూజిలాండ్ స్కోరు 300- 330 వరకు చేరుకోగలిగింది. బ్రేస్వెల్ సూపర్గా సిక్సర్లు బాదాడు.ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కూడా అతడిని ఎందుకు కొనలేదో నాకు ఇంత వరకు అర్థం కాలేదు. గాయం కారణంగా అతడు పెద్దగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అంతే తప్ప బ్యాటింగ్లో పర్లేదు. మరెందుకనో ఐపీఎల్ జట్లు అతడి వైపు మొగ్గు చూపలేదు.అసలు ఏ ప్రాతిపదికన ఐపీఎల్ జట్లు ఆటగాళ్లను ఎంచుకుంటున్నాయో అర్థం కావడం లేదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో తొలి వన్డేలో 16 పరుగులు చేసిన బ్రేస్వెల్.. రెండో వన్డేలో బ్యాటింగ్ చేయకపోయినా వికెట్ తీయగలిగాడు. తాజాగా మూడో వన్డేలో విలువైన 28 పరుగులు చేయడంతో పాటు తన అద్భుత కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. కాగా 34 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్ అయిన బ్రేస్వెల్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్ వేలం-2026లో రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన బ్రేస్వెల్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.చదవండి: వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!
బంగ్లాదేశ్కు ఐసీసీ డెడ్ లైన్.. లేదంటే?
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్కు వస్తుందా? లేదా అన్నది? జనవరి 21న తేలిపోనుంది. భద్రత కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టును వరల్డ్కప్ కోసం భారత్కు పంపబోమని బంగ్లా క్రికెట్ బోర్డు మొండి పట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఇప్పటికే పలుమార్లు ఐసీసీకి బీసీబీ విజ్ఞప్తి చేసింది.అందుకు సమాధానముగా ఆఖరి నిమిషంలో షెడ్యూల్ను మార్చడం కుదరదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెల్చిచేప్పేసింది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ఈ క్రమంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ వస్తుందా లేదా అనే విషయం చెప్పేందుకు జనవరి 21ని తుది గడువుగా ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ బంగ్లాదేశ్ తన మొండిపట్టు వీడకుంటే.. ఆ స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చాలని ఐసీసీ భావిస్తుందంట. ఐసీసీ ర్యాంకింగ్స్ బంగ్లాదేశ్ తర్వాతి స్దానాల్లో జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి. అయితే జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించగా.. తర్వాత స్దానంలో ఉన్న స్కాట్లాండ్కు బంగ్లా స్దానంలో అవకాశం దక్కనుంది.కాగా గత కొంతకాలంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తలు క్రికెట్కు పాకాయి. బంగ్లాలో హిందువలపై దాడులు పెరిగిపోతుండడంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తమ జట్టును వరల్డ్కప్ కోసం భారత్ పంపబోమని, వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బంగ్లా ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇక షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్లను కోల్కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది.చదవండి: T20 World Cup 2026: సౌతాఫ్రికాకు భారీ షాక్
T20 World Cup 2026: సౌతాఫ్రికాకు భారీ షాక్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఆల్రౌండర్ డోనోవన్ ఫెరీరా భుజం గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశముంది. సౌతాఫ్రికా టీ20 లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న ఫెరీరా.. శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు.ప్రిటోరియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ భుజం బలంగా నేలకు తాకింది. దీంతో ఫెరీరా తీవ్రమైన నొప్పితో విలవిలాడాడు. ఆ తర్వాత జట్టు కష్టాల్లో ఉండడంతో ఫెరీరా తప్పనిసారి పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చాడు. కానీ కేవలం ఒకే ఒక బంతి మాత్రమే ఎదుర్కొని రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. మ్యాచ్ ముగిశాక అతడిని స్కానింగ్కు తరలించగా.. భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ టోర్నీ నుంచి అతడు వైదొలిగాడు. ఫెరీరా కోలుకోవడానికి దాదాపు ఐదు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు పొట్టి ప్రపంచకప్ నుంచి తప్పుకొనే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సౌతాఫ్రికాకు నిజంగా భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫెరీరా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ తర్వాత ప్రధాన ఫినిషర్గా ఫెరీరా ఉన్నాడు. 2024 నుంచి టీ20ల్లో అత్యధిక స్ట్రైక్ రేటు కలిగి ఉన్న బ్యాటర్గా ఫెరీరా కొనసాగుతున్నాడు.86 ఇన్నింగ్స్లలో 177.08 స్ట్రైక్ రేటుతో 1716 పరుగులు చేశాడు. గత నెలలో భారత్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా డోనోవన్ దుమ్ములేపాడు. అతడి ఆఫ్ స్పిన్ కూడా బౌలింగ్ చేయగలడు. ఒక వేళ అతడు ఈ టోర్నీకి దూరమైతే ర్యాన్ రికెల్టన్ లేదా ట్రిస్టన్ స్టబ్స్ను జట్టులోకి తీసుకునే అవకాశముంది.టీ20 వరల్డ్ కప్ 2026 కోసం దక్షిణాఫ్రికా జట్టు:ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కోర్బిన్ బాష్, డేవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్ (కీపర్), టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్జే, కాగిసో రబాడ, జేసన్ స్మిత్.చదవండి: వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!
వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!
న్యూజిలాండ్తో మూడో వన్డేలో శుబ్మన్ గిల్ కెప్టెన్సీని భారత వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే విమర్శించాడు. టీమిండియా బౌలర్ల సేవలను అతడు సరిగ్గా వాడుకోలేదని.. అందుకే కివీస్ భారీ స్కోరు సాధించగలిగిందని అభిప్రాయపడ్డాడు.ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.డారిల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలుడారిల్ మిచెల్ (Daryl Mitchell- 137), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips-106) శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్కు ఈ భారీ స్కోరు సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం క్రిక్బజ్ వేదికగా అజింక్య రహానే మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు గిల్ సరైన సమయంలో బంతిని ఇవ్వలేదని విమర్శించాడు.వాళ్లను పక్కనపెట్టి తప్పు చేశారు‘‘మధ్య ఓవర్లలో కుల్దీప్తో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించాడు గిల్. అక్కడే అతడు పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ 37-38వ ఓవర్ వరకు అతడి చేతికి బంతి రాలేదు.అదే విధంగా జడేజాను సైతం 30వ ఓవర్ వరకు అలాగే ఉంచారు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు తీయగల సత్తా కలిగిన వారు. అయినప్పటికీ వారిని పక్కనపెట్టారు. అక్కడే టీమిండియా అతిపెద్ద తప్పు చేసింది’’ అని రహానే అభిప్రాయపడ్డాడు.మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటేఇందుకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ సైతం మద్దతు పలికాడు. కుల్దీప్ కంటే కూడా జడేజాను మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదన్నాడు. జడ్డూను ఆలస్యంగా బరిలోకి దించి తప్పు చేశారని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరు ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.మరోవైపు.. జడేజా ఆరు ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది.ఓపెనర్లు రోహిత్ శర్మ (11), కెప్టెన్ శుబ్మన్ గిల్ (23) నిరాశపరచగా.. శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్డౌన్ బ్యాటర్ కోహ్లి పట్టుదలగా నిలబడ్డాడు. సెంచరీ (124)తో కదం తొక్కాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (53), ఎనిమిదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు.అయితే, మిగతా వారంత విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్ల ధాటికి 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయిన గిల్ సేన.. మ్యాచ్తో పాటు తొలిసారి సొంతగడ్డపై కివీస్కు వన్డే సిరీస్నూ కోల్పోయింది. చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. 20 ఏళ్ల యువ సంచలనానికి ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఈ నెలఖారులో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో ఆసీస్ ఆతిథ్య పాక్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు.అయితే స్టార్ ప్లేయర్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, గ్లెన్ మాక్స్వెల్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వీరితో పాటు టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్ కూడా పాక్స్తాన్కు వెళ్లడం లేదు. వీరంతా నేరుగా శ్రీలంకలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్లో చేరనున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు హాజిల్వుడ్, డేవిడ్ గాయపడిన సంగతి తెలిసిందే.హాజిల్వుడ్ గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకోగా.. డేవిడ్ తొడ కండరాల గాయంతో బిగ్ బాష్ లీగ్ మధ్యలో వైదొలగాడు. అయితే వీరిద్దరూ వరల్డ్కప్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి.జట్టులోకి యువ ఆటగాళ్లు..ఇక బిగ్ బాష్ లీగ్లో అదరగొట్టిన పేసర్ మహ్లి బియర్డ్మాన్, ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్కు తొలిసారి ఆసీస్ టీ20 జట్టులో చోటు దక్కింది. 20 ఏళ్ల బియర్డ్మాన్ పెర్త్ స్కార్చర్స్ తరఫున అద్భుతంగా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అదేవిధంగా జాక్ ఎడ్వర్డ్స్ అటు బంతితోనూ ఇటు బ్యాట్తోనూ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వీరిద్దరికి జాతీయ సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్-2026 వేలంలో ఎడ్వర్డ్స్ను రూ.3 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇక పాక్-ఆసీస్ టీ20 సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని మూడు టి20 మ్యాచ్లు లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో జరగనున్నాయి.పాక్తో టీ20లకు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, మహ్లి బియర్డ్మాన్, కూపర్ కానోలీ, బెన్ ద్వార్షుయిస్, జాక్ ఎడ్వర్డ్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), మాథ్యూ కునెమన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాచదవండి: న్యూజిలాండ్తో సిరీస్ ఓటమి.. శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
ఆమె మనిషి కాదు!
వేదిక ఏదైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... ప్రత్యర్థులు ఎవరైనా... తగ్గేదేలా అంటోంది దక్షిణ కొరియా సూపర్స్టార్ షట్లర్ ఆన్ సె యంగ్. బ్యాడ్మింటన్ సీజన్లోని రెండో టోర్నమెంట్ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆన్ సె యంగ్ టైటిల్ నిలబెట్టుకుంది.మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో విజేతగా నిలిచి ఈ ఏడాది ఘనంగా ప్రారంభించిన ఈ ప్రపంచ నంబర్వన్ అదే జోరును న్యూఢిల్లీలోనూ కొనసాగించింది. తుది పోరులో ఆన్ సె యంగ్కు గట్టిపోటీ ఇస్తుందనుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి కొరియా స్టార్ ధాటికి తేలిపోయింది.కెరీర్లో 22వసారి వాంగ్ జి యితో ఆడిన ఆన్ సె యంగ్ 18వసారి చైనా ప్లేయర్ను ఓడించి తన కెరీర్లో 36వ సింగిల్స్ టైటిల్ను జమ చేసుకుంది. గత ఏడాది చివరి నాలుగు టోర్నీలో విజేతగా నిలిచిన ఆన్ సె యంగ్ ఈ ఏడాది ఆడిన రెండు టోర్నీలలోనూ టైటిల్ సొంతం చేసుకొని ‘సిక్సర్’ నమోదు చేసింది. న్యూఢిల్లీ: ‘ఆమె మనిషి కాదు... రోబో’ అని ఆన్ సె యంగ్ గురించి ఆమె ప్రత్యర్థులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకోవాలి. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో అత్యంత నిలకడగా విజయాలు నమోదు చేస్తున్న ఆన్ సె యంగ్ కొత్త ఏడాదిలోనూ చెలరేగిపోతోంది. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ టోర్నీలో ఈ టాప్ సీడ్ ప్లేయర్ చాంపియన్గా నిలిచింది. గత ఏడాది టైటిల్ సాధించిన ఈ కొరియా సూపర్స్టార్ ... ఈ సంవత్సరం కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.43 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆన్ సె యంగ్ 21–13, 21–11తో వాంగ్ జి యిపై గెలిచింది. ఆన్ సె యంగ్కు 66,500 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 12వ ర్యాంకర్ లిన్ చున్ యి (చైనీస్ తైపీ) టైటిల్ గెలిచాడు. ఫైనల్లో లిన్ చున్ యి 21–10, 21–18తో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు.ప్రైజ్మనీ ఎంతంటే?లిన్ చున్ యికి 66,500 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. మహిళల డబుల్స్లో లియు షెంగ్షు –టాన్ నింగ్ (చైనా) జోడీ టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో లియు–టాన్ నింగ్ 21–11, 21–18తో యుకీ ఫుకుషిమా–సయాకా మత్సుమోతో (జపాన్)లపై గెలిచారు.పురుషుల డబుల్స్ ఫైనల్లో లియాంగ్ వెకెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం 17–21, 25–23, 21–16తో హిరోకి మిదోరికావా–క్యోహె యామషిటా (జపాన్) జోడీపై నెగ్గి టైటిల్ అందుకుంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో డెచాపోల్–సుపిసారా (థాయ్లాండ్) జంట 19–21, 25–23, 21–18తో మథియాస్ క్రిస్టియాన్సెన్–అలెగ్జాండ్రా బోయె (డెన్మార్క్) జోడీపై విజయం సాధించి టైటిల్ హస్తగతం చేసుకుంది.
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ వరుసగా రెండో వన్డే సిరీస్ ఓటమిని ఎదుర్కొన్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. గతేడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కూడా మెన్ బ్లూ ఓడిపోయింది. గిల్ కెప్టెన్సీలో భారత్ కేవలం వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను మాత్రమే సొంతం చేసుకుంది.దీంతో గిల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో దక్కించుకోలేకపోయిన గిల్.. మళ్లీ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో ఆతిథ్య జట్టుతో భారత తలపడనుంది.టీ20 జట్టులో గిల్ లేకపోవడంతో వన్డే సిరీస్లో జట్టును నడిపించనున్నాడు. అప్పటివరకు గిల్ భారత తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే సూచనలు కన్పించడం లేదు. ఈ క్రమంలో గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడానికి రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడాలని గిల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దేశవాళీ టోర్నీ సెకెండ్ లీగ్ పంజాబ్ ఆడే తొలి మ్యాచ్లో గిల్ బరిలోకి దిగే అవకాశముంది. జనవరి 22న రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో సౌరాష్ట్రతో పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర తరపున సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆడనున్నాడు.న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో జడేజా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. దీంతో తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి జడేజాకు రంజీ ట్రోఫీ కీలకం కానుంది. అవేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి అద్భుత శతకంతో అలరించాడు. ఇండోర్ వేదికగా ఈ వన్డౌన్ బ్యాటర్.. 91 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. పది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డులు బద్దలుతద్వారా వన్డే ఫార్మాట్లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీ (53)ల రికార్డును కోహ్లి సవరించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా 54వ వన్డే సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. తన అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 85వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026 పాంటింగ్, సెహ్వాగ్లను దాటేసిన్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కాగా న్యూజిలాండ్పై కోహ్లికి వన్డేల్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. తద్వారా కివీస్పై అత్యధిక వన్డే శతకాలు బాదిన క్రికెటర్లుగా కొనసాగుతున్న భారత దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ (6), ఆస్ట్రేలియా లెజెండ్ రిక్కీ పాంటింగ్ (6) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.కలిస్ను అధిగమించిఅంతేకాదు.. మూడు ఫార్మాట్లలో కలిపి న్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గానూ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్పై కోహ్లి 73 ఇన్నింగ్స్లో కలిపి 10 సెంచరీలు చేశాడు. తద్వారా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ (9) వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.కాగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో కివీస్ యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి పెవిలియన్ చేరాడు. కోహ్లితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) మాత్రమే రాణించారు. మిగిలిన వారు విఫలం కాగా.. భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది.న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 36 ఇన్నింగ్స్లో 7 సెంచరీలువీరేందర్ సెహ్వాగ్- 51 ఇన్నింగ్స్లో 6 సెంచరీలురిక్కీ పాంటింగ్- 23 ఇన్నింగ్స్లో 6 సెంచరీలుసనత్ జయసూర్య- 47 ఇన్నింగ్స్లో 5 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 42 ఇన్నింగ్స్లో 5 సెంచరీలున్యూజిలాండ్పై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 73 ఇన్నింగ్స్లో 10 సెంచరీలుజాక్వెస్ కలిస్- 76 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుజో రూట్- 71 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 80 ఇన్నింగ్స్లో 9 సెంచరీలు.చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్
యూకీ బాంబ్రీ జోడీ శుభారంభం
ఆక్లాండ్: కొత్త ఏడాదిలో భారత డబుల్స్ టెన్నిస్ స...
హైదరాబాద్ వేదికగా...
సాక్షి, హైదరాబాద్: పలు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట...
‘ఈ క్షణం ఎల్లకాలం గుర్తుండిపోతుంది’
టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన ఉక్రెయిన్ టెన్ని...
ఐ డోంట్ కేర్: సబలెంకా రియాక్షన్ వైరల్
బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా కొత్త ఏ...
ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. 20 ఏళ్ల యువ సంచలనానికి ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట...
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ వరుసగా రెండ...
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా దిగ్గజం విరా...
నితీశ్ రెడ్డి సెంచరీ.. అయ్యో పాపం!
ఐసీసీ అండర్–19 వన్డే ప్రపంచకప్లో సుదిని నితీశ్ ...
క్రీడలు
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
పాక్ బాటలో బంగ్లాదేశ్..! అదే జరిగితే
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
మహిళా షూటర్ పై లైంగిక దాడి.. జాతీయ కోచ్ అంకుశ్ పై వేటు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
