ప్రధాన వార్తలు
బెంగళూరుకే పట్టం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి అందరికంటే ముందే ‘ప్లేఆఫ్స్’ చేరి నేరుగా ఫైనల్కూ అర్హత పొందింది. ఫైనల్లో ఢిల్లీని ఓడించి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రెండు ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. వడోదర: అయ్యో... ఢిల్లీ! నాలుగోసారి ఫైనల్ చేరినా... మళ్లీ రన్నరప్ గానే ముగించింది. ముంబై (2023, 2025), బెంగళూరు (2024, 2026) జట్లకు రెండేసి సార్లు టైటిల్ను అప్పగించింది. గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై జయభేరి మోగించింది. విజేత ఆర్సీబీ జట్టుకు రూ. 6 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్మనీ లభించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 57; 8 ఫోర్లు), లౌరా వోల్వార్ట్ (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్లు రాణించారు. ఆఖర్లో షినెల్ హెన్రీ (15 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగింది. తర్వాత బెంగళూరు కఠినమైన లక్ష్యాన్ని సైతం 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులతో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ స్మృతి మంధాన (41 బంతుల్లో 87; 12 ఫోర్లు, 3 సిక్స్లు), జార్జియా (54 బంతుల్లో 79; 14 ఫోర్లు) దంచేశారు. రెండు ఓవర్లలో 39 పరుగులు...ఢిల్లీ టాప్–4 బ్యాటర్లు లిజెల్లీ లీ (30 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్లు), షఫాలీ వర్మ (13 బంతుల్లో 20; 3 ఫోర్లు), వోల్వార్ట్, జెమీమా సమష్టిగా పరుగులు సాధించారు. దీంతో 18 ఓవర్లలో 164/3 స్కోరు చేసింది. డిక్లెర్క్ వేసిన 19వ ఓవర్లో షినెల్ హెన్రీ 4, వైడ్, 4, 4, 4, 6, 1 ఇలా బంతిని పదేపదే బౌండరీ లైన్ దాటించడంతో 24 పరుగులు వచ్చాయి. తర్వాత ఆఖరి ఓవర్ వేసిన సయాలీ 6, 4తో కలిసి 15 పరుగులు సమర్పించుకుంది. ఈ రెండు ఓవర్లలోనే 39 పరుగులతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది. శుభారంభం దక్కకున్నా... ఆరంభంలోనే హిట్టర్ గ్రేస్ హారిస్ (9) వికెట్ను కోల్పోయినా... స్మృతి, వోల్ల ధనాధన్ షో ఢిల్లీ ఆశల సౌధాన్ని కూల్చేసింది. 37 బంతుల్లో వోల్, 23 బంతుల్లో కెపె్టన్ స్మృతి పూర్తి చేసుకున్న ఫిఫ్టీలు బెంగళూరును సాఫీగా లక్ష్యంవైపు నడిపించాయి. ఆఖర్లో వీళ్లిద్దరితో పాటు రిచా (6) అవుటైనా... ఎలాంటి డ్రామా లేకుండా, రాధ యాదవ్ (12 నాటౌట్; 2 ఫోర్లు) బౌండరీలతో ముగించింది. 243 పరుగులు సాధించిన స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లిజెల్లీ (సి) హ్యారిస్ (బి) డిక్లెర్క్ 37; షఫాలీ (సి) రిచా ఘోష్ (బి) అరుంధతి 20; వోల్వార్ట్ (రనౌట్) 44; జెమీమా (సి) డిక్లెర్క్ (బి) సయాలీ 57; షినెల్ హెన్రీ (నాటౌట్) 35; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–49, 2–72, 3–148, 4–203. బౌలింగ్: బెల్ 4–0–19–0, సయాలీ 4–0–46–1, అరుంధతి 4–0–40–1, శ్రేయాంక 2–0–32–0, డిక్లెర్క్ 4–0–48–1, రాధ 2–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: హారిస్ (బి) హెన్రీ 9; స్మృతి (బి) హెన్రీ 87; జార్జియా వోల్ (సి) షఫాలీ (బి) మిన్ను మణి 79; రిచా ఘోష్ (సి) మిన్ను మణి (బి) నందిని 6; డిక్లెర్క్ (నాటౌట్) 7; రాధ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–9, 2–174, 3–181, 4–191. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–38–0, షినెల్ హెన్రీ 4–0–34–2, నందిని 4–0–41–1, శ్రీచరణి 3.4–0–46–0, షఫాలీ 1–0–9–0, మిన్ను మణి 2–0–19–1, స్నేహ్ రాణా 1–0–15–0.
ఆరో టైటిల్ వేటలో...
హరారే: యువ భారత్ అండర్–19 ప్రపంచకప్ వేట ‘ఫైనల్’ మజిలీకి చేరింది. కుర్రాళ్ల ‘కప్’ కల ఈ ఒక్క విజయంతోనే నెరవేరుతుంది. అన్ని గెలవడం ఒక ఎత్తు అయితే... ఈ ఒక్కదాంతో ‘ప్రపంచ’ అందలం ఎక్కడం మరో ఎత్తు. ఆయుశ్ మాత్రే నేతృత్వంలోని భారత జట్టుకు ఈ మ్యాచ్ విలువేంటో బాగా తెలుసు. అందుకే ‘కప్’ చేతికందే తుది పోరును కూడా విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ రెండో ప్రపంచకప్ విజయం కోసం ఆరాటపడుతోంది. భారత్లాంటి దుర్బేధ్యమైన జట్టును ఓడించి ‘ప్రపంచా’న్ని గెలవడం కష్టమైనా... రెండున్నర దశాబ్దాల తర్వాత వచి్చన ఈ వరల్డ్కప్ చాన్స్ను ఎంతమాత్రం చేజార్చుకోవద్దని గట్టిగా కోరుకుంటుంది. పదో సారి ఫైనల్కు...అండర్–19 ప్రపంచకప్ 1988లో మొదలైంది. ఇప్పటివరకు 15 మెగా ఈవెంట్లు జరిగితే ఏ కుర్ర జట్టుకు సాధ్యం కానీ ఐదు టైటిళ్లను భారత జట్టే గెలిచింది. ఓవరాల్గా 16 (ప్రస్తుత కప్) ప్రపంచకప్ల్లో 10 సార్లు ఫైనల్ చేరిన ఘనచరిత్ర కూడా మనదే! వరుసగా యువ భారత్కిది ఆరో ఫైనల్. గత 2024 ఈవెంట్లోనూ ఫైనల్ చేరినా... ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. కానీ ఈ ఈవెంట్లో యువ క్రికెటర్ల ఆటతీరు... కనబరిచిన నిలకడ, సమష్టి ప్రదర్శన చూస్తే ఈసారి సరిపెట్టుకోదు... కప్ పట్టుకెళ్లడం ఖాయమని ఎవరైనా అంటారు. అంతలా భారత జైత్రయాత్ర సాగుతోంది. ఇంగ్లండ్ కథాకమామీషు... ఇంగ్లండ్ 1998లో జరిగిన రెండో ప్రపంచకప్లో తొలిసారి టైటిల్ గెలిచింది. ఐసీసీ అండర్–19 పుటల్లో తప్ప... ఇంగ్లండ్ క్రికెట్లో మరుగున పడిపోయిన విజయమది. తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు కప్ వేటలో పడిన ఇంగ్లండ్కు ఫైనల్లో మింగుడుపడని ప్రత్యర్థి, టైటిల్ ఫేవరెట్ భారత్ ఎదురవడమే ప్రధాన సమస్య. అయితే తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించిన ఇంగ్లండ్... ఆఖరి పోరులో అజేయమైన గత ఫైనలిస్టును ఓడిస్తే ఇంతకుమించిన పండగ మరొకటి ఉండదేమో! భారత్ ఇలా... ఇంగ్లండ్ అలా... గ్రూప్ ‘బి’లో లీగ్ దశను మొదలుపెట్టిన భారత్ ముందు బ్యాటింగ్ చేసినా... తర్వాత లక్ష్యాన్ని ఛేదించినా అన్ని విజయంతోనే ముగించింది. అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్లపై గెలిచి ‘సూపర్ సిక్స్’కు చేరింది. అక్కడ జింబాబ్వే, పాకిస్తాన్లను కంగుతినిపించి రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ను చిత్తు చేసి ఆఖరి పోరుకు అర్హత సాధించింది. సరిగ్గా భారత్లాగే గ్రూప్ ‘సి’లో పాకిస్తాన్, జింబాబ్వే, స్కాట్లాండ్లపై ఇంగ్లండ్ గెలిచి లీగ్ దశను విజయవంతంగా దాటింది. ‘సూపర్ సిక్స్’లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్లపై గెలిచి... తొలి సెమీఫైనల్లో నిరుటి విజేత ఆ్రస్టేలియాను ఇంటికి పంపి ఫైనల్ బరిలో నిలిచింది. జట్ల వివరాలు భారత్: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు, వేదాంత్ త్రివేది, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, దీపేశ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, ఉధవ్ మోహన్, హర్వంశ్ పంగాలియా, కిషన్ సింగ్. ఇంగ్లండ్: థామస్ ర్యూ (కెప్టెన్), రాల్ఫీ అల్బెర్ట్, అలీ ఫారూఖ్, డెన్ డాకిన్స్, ఫాల్కోనెర్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, ల్యూక్ హాండ్స్, ఇసాక్ మొహమ్మద్, మ్యానీ లమ్స్డెన్, బెన్ మాయెస్, జేమ్స్ మింటో, జోసెఫ్ మూర్స్, సెబాస్టియన్ మోర్గాన్.
ఆంధ్ర అద్భుతం చేసేనా!
కల్యాణి (బెంగాల్): కొత్త కోచ్ గ్యారీ స్టెడ్ ఆధ్వర్యంలో ఈ రంజీ ట్రోఫీ సీజన్లో బరిలోకి దిగిన ఆంధ్ర క్రికెట్ జట్టు లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగింటి గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో 31 పాయింట్లతో జార్ఖండ్తో కలిసి ఆంధ్ర సంయుక్తంగా అగ్రస్థానాన్ని సంపాదించింది. అయితే ర్యాంకింగ్ వర్గీకరణ కోసం మెరుగైన రన్రేట్ను పరిగణనలోకి తీసుకోగా... జార్ఖండ్కు టాప్ ర్యాంక్, ఆంధ్రకు రెండో ర్యాంక్ దక్కింది. ఉత్తరప్రదేశ్, బరోడా, నాగాలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్లను ‘డ్రా’గా ముగించిన ఆంధ్ర... ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్, డిఫెండింగ్ చాంపియన్ విదర్భ జట్లపై గెలిచింది. లీగ్ దశలో కనబరిచిన జోరును నాకౌట్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఆంధ్ర బృందం పట్టుదలగా ఉంది. బెంగాల్ జట్టుతో కల్యాణిలో నేటి నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర జట్టు తలపడుతుంది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో 36 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచిన బెంగాల్ జట్టు కూడా అజేయంగా నిలిచింది. ఐదు మ్యాచ్ల్లో గెలిచిన ఆ జట్టు, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ఈ సీజన్లో ఆంధ్ర తరఫున బ్యాటింగ్లో అభిషేక్ రెడ్డి, షేక్ రషీద్, కోన శ్రీకర్ భరత్, కరణ్ షిండే, సౌరభ్ కుమార్ మెరిపించారు. నాగాలాండ్తో చివరి లీగ్ మ్యాచ్లో జ్ఞానేశ్వర్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఏడు మ్యాచ్లు ఆడిన అభిషేక్ రెడ్డి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలతో కలిపి 582 పరుగులు చేశాడు. షేక్ రషీద్ మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో కలిపి 573 పరుగులు సాధించాడు. బౌలింగ్ విషయానికొస్తే సౌరభ్ కుమార్ 30 వికెట్లు... త్రిపురాణ విజయ్ 23 వికెట్లు...కావూరి సాయితేజ 21 వికెట్లు పడగొట్టారు. లీగ్ మ్యాచ్లు నాలుగు రోజులపాటు జరగ్గా... క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ ఐదు రోజులపాటు జరుగుతాయి. శుక్రవారం నుంచే మరో మూడు క్వార్టర్ ఫైనల్స్ కూడా జరుగుతాయి. జంషెడ్పూర్లో జార్ఖండ్తో ఉత్తరాఖండ్; ముంబైలో కర్ణాటకతో ముంబై; ఇండోర్లో జమ్మూకశీ్మర్తో మధ్యప్రదేశ్ తలపడతాయి. బెంగాల్తో మ్యాచ్కు ఆంధ్ర జట్టు: రికీ భుయ్ (కెప్టెన్), జ్ఞానేశ్వర్, అభిషేక్ రెడ్డి, కోన శ్రీకర్ భరత్, షేక్ రషీద్, నితీశ్ కుమార్ రెడ్డి, పీవీఎస్ఎన్ రాజు, కేవీ శశికాంత్, కావూరి సాయితేజ, సౌరభ్ కుమార్, కరణ్ షిండే, త్రిపురాణ విజయ్, కేఎస్ఎన్ రాజు, రేవంత్ రెడ్డి, ఆశిష్, సాకేత్ రామ్.
హర్మన్ప్రీత్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: స్వదేశంలో జరగనున్న పురుషుల ప్రొ హాకీ లీగ్ తొలి అంచెలో పాల్గొనే భారత హాకీ జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. ఫిబ్రవరి 10 నుంచి 15వ తేదీ వరకు రౌర్కెలాలోని బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. అర్జెంటీనా, బెల్జియం జట్లతో భారత్ రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. ఫిబ్రవరి 11న బెల్జియంతో... 12న అర్జెంటీనాతో పోటీపడే భారత్... ఫిబ్రవరి 14న అర్జెంటీనాతో... 15న బెల్జియంతో మళ్లీ ఆడుతుంది. తొలి అంచె తర్వాత భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. ఫిబ్రవరి 21న, 24న స్పెయిన్తో ఆడే భారత్... ఫిబ్రవరి 22, 25న ఆ్రస్టేలియాను ‘ఢీ’ కొంటుంది. గత సీజన్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది భారత హాకీ జట్టు: సూరజ్ కర్కేరా, పవన్ (గోల్కీపర్లు), హర్మన్ప్రీత్ సింగ్ (కెపె్టన్), అమిత్ రోహిదాస్, జర్మన్ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, సుమిత్, సంజయ్, నీలం సంజీప్ జెస్, అమన్దీప్ లాక్రా (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, మన్మీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, హార్దిక్ సింగ్, మొయిరాంగ్తెమ్ రబిచంద్ర సింగ్, నీలకంఠ శర్మ, రోషన్ కుజుర్ (మిడ్ ఫీల్డర్లు), అభిషేక్, సుఖ్జీత్, శిలానంద్ లాక్రా, సెల్వం కార్తీ, మన్దీప్ సింగ్, అరిజిత్ సింగ్ హుండల్, ఆదిత్య అర్జున్ లలాగే (ఫార్వర్డ్స్).
రష్మిక జోడీ ఓటమి
ముంబై: స్వదేశంలో జరుగుతున్న ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ఆరుగురు ప్లేయర్లు తొలి రౌండ్లోనే వెనుదిరగ్గా... డబుల్స్ విభాగంలోనూ నిరాశే మిగిలింది. తొలి రౌండ్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–అంకిత రైనా... ప్రార్థన తొంబారే (భారత్)–అలెవిత్నా ఇబ్రాగిమోవా (రష్యా)... రుతుజా భోస్లే (భారత్)–పీంగ్టార్న్ ప్లిపుయెచ్ (థాయ్లాండ్) జోడీలు ఓటమి పాలయ్యాయి. రష్మిక–అంకిత 4–6, 2–6తో లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్)–నయీమా కరామోకో (స్విట్జర్లాండ్) చేతిలో... ప్రార్థన–అలెవిత్నా 1–6, 1–6తో పొలీనా ఇటాసెంకో–ఎలీనా ప్రిడాంకినా (రష్యా) చేతిలో... రుతుజా–పీంగ్టార్న్ 6–4, 1–6, 9–11తో నికోల్ హ్యుర్గో (అర్జెంటీనా)–మనన్చాయ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. తొలి రౌండ్లో ఓడిపోయిన జోడీలకు 2,000 డాలర్ల () చొప్పున ప్రైజ్మనీ లభించింది. సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి అంకిత, సహజ యామలపల్లి, శ్రీవల్లి రష్మిక, మాయ రాజేశ్వరన్, వైదేహి, వైష్ణవి బరిలోకి దిగినా ఒక్కరు కూడా రెండో రౌండ్కు చేరుకోలేకపోయారు.
సుజీత్ పసిడి పట్టు
జాగ్రెబ్ (క్రొయేషియా): యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ సుజీత్ కల్కాల్ పసిడి పతకంతో మెరిశాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో సుజీత్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సుజీత్ 3–0 పాయింట్ల తేడాతో పేమన్ నెమాటి (ఇరాన్)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో సుజీత్ 11–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో జోసెఫ్ మెకన్నా (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఖామ్జాట్ అర్సెమర్జుయెవ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. స్వర్ణ పతకం గెలిచే క్రమంలో సుజీత్ తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకపోవడం విశేషం. మరోవైపు పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్లో 57 కేజీల విభాగంలో కాంస్యం పతకం నెగ్గిన అమన్... ఈ టోర్నీలో 61 కేజీల విభాగంలో పోటీపడ్డాడు. ఈ కేటగిరీలో ఐదుగురు రెజ్లర్లు బరిలోకి దిగారు. అమన్ మూడు బౌట్లలో గెలిచి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. 70 కేజీల విభాగంలో భారత్కే చెందిన అభిమన్యు...97 కేజీల విభాగంలో విక్కీ కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్లలో అభిమన్యు 6–3తో మాక్స్వెల్ పార్కర్ (అమెరికా)పై, విక్కీ 8–2తో అద్లాన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు.
సురుచి–సామాట్ర్ జోడీకి రజతం
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–సామ్రాట్ రాణా (భారత్) ద్వయం భారత్కు రజత పతకాన్ని అందించింది. 48 షాట్లతో కూడిన ఫైనల్లో సురుచి–సామ్రాట్ జోడీ 479.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. నగీనా సైద్కులోవా–ముఖమ్మద్ కమలోవ్ (ఉజ్బెకిస్తాన్) జంట 481.3 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. అంతకుముందు 10 జోడీల మధ్య 60 షాట్లతో నిర్వహించిన క్వాలిఫయింగ్లో సురుచి–సామ్రాట్ 583 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు రషి్మక సహగల్ (237.9 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... వన్షిక చౌధరీ (236.7 పాయింట్లు) రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది. యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు ప్రియాన్షి పూర్వ (234.8 పాయింట్లు) స్వర్ణం... చహెక్ కోహ్లా (233 పాయింట్లు) రజతం దక్కించుకున్నారు. టీమ్ విభాగాల్లో రష్మిక, వన్షిక, అగం గ్రెవాల్ జట్టు... ప్రియాన్షి, చహెక్, శిక్షా శరణ్ జట్టు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం భారత్ ఖాతాలో పది స్వర్ణాలున్నాయి.
లవ్లీనా శుభారంభం
అలికాంటె (స్పెయిన్): బాక్సమ్ ఎలైట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ లవ్లీనా బొర్గోహైన్ శుభారంభం చేసింది. 75 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఈ అస్సాం బాక్సర్ తొలి రౌండ్లో 5:0తో ఒల్హా పిల్పిచుక్ (ఉక్రెయిన్)పై ఘనవిజయం సాధించింది. పురుషుల 70 కేజీల విభాగంలో హితేశ్ ముందంజ వేశాడు. హితేశ్ 5:0తో విన్సెంట్ సాంటోరీలో (కెనడా)పై గెలిచాడు. భారత్కే చెందిన మహిళా బాక్సర్లు మంజు రాణి (48 కేజీలు), నీతూ (51 కేజీలు) కూడా తమ ప్రత్యర్థులపై నెగ్గారు. మంజు రాణి 5:0తో గ్లోరియా (ఫ్రాన్స్)పై గెలుపొందగా... నీతూ పంచ్ల ధాటికి ఆమె ప్రత్యర్థి లౌరా కాల్డెరాన్ (స్పెయిన్) తొలి రౌండ్లోనే చేతులెత్తేసింది. కుసుమ్ (51 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు) కూడా గెలుపు రుచి చూశారు. కుసుమ్ 4:1తో క్లౌడియా అల్కానిజ్ (స్పెయిన్)పై, అరుంధతి 5:0తో అజీజా ఇసీనా (కజకిస్తాన)పై విజయం సాధించారు. విక్టోరియా పెన్నీ (కెనడా)తో జరిగిన 75 కేజీల విభాగం బౌట్లో సనమచ చాను (భారత్) 4:1తో నెగ్గింది. పురుషుల 55 కేజీల విభాగం బౌట్లో పవన్ బర్త్వాల్ పంచ్లకు తాళలేక అతని ప్రత్యర్థి థనారత్ (థాయ్లాండ్) రెండో రౌండ్లోనే ఓటమిని అంగీకరించాడు. జాదుమణి సింగ్ (51 కేజీలు) 4:1తో సియోవుష్ (ఉక్రెయిన్)పై, దీపక్ (70 కేజీలు) 5:0తో డేవిడ్ రొసాలెన్ (స్పెయిన్)పై, అంకుశ్ (80 కేజీలు) 3:2తో జఖ్పెకోవ్ (కజకిస్తాన్)పై నెగ్గారు. హర్‡్ష (90 కేజీలు) 5:0తో బ్రయాన్ కాల్వెల్ (కెనడా)ను ఓడించి ముందంజ వేశాడు.
విజేత ఉస్మానియా యూనివర్సిటీ
సాక్షి, హైదరాబాద్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ జట్టు చాంపియన్గా అవతరించింది. మైసూర్లో జరిగిన ఫైనల్లో ఉస్మానియా 10 పరుగుల ఆధిక్యంతో విశ్వేశరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ (బెలగావి) జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఉస్మానియా జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు సాధించింది. కునాల్ దాస్వాని (41 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు), వైభవ్ సజానా (27 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించగా... అన్విత్ రెడ్డి (38; 6 ఫోర్లు), పారస్ రాజ్ (37; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విశ్వేశరయ్య జట్టు 204 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. సమర్థ్ హెగ్డే (46), విష్ణు గౌడర్ (39) ఆకట్టుకున్నారు. ఉస్మానియా జట్టు బౌలర్లలో కెపె్టన్ వంశీ కుమార్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు... ధర్మపురి సాత్విక్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు... వీఎం ధనుష్ 39 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. యశ్వీర్కు ఒక వికెట్ లభించింది.
డబ్ల్యూపీఎల్-2026 ఛాంపియన్స్గా ఆర్సీబీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. గురువారం వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఈ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు. ఆమెతో పాటు లారా వోల్వార్డ్(25 బంతుల్లో 44 పరుగులు), చినెల్ హెన్రీ(15 బంతుల్లోనే 35) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో అరుంధతి, సత్ఘరే, నడైన్ డిక్లార్క్ తలా వికెట్ సాధించారు.మంధాన మెరుపులు, వోల్ విధ్వంసంఅనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా ఔటైనప్పటికి కెప్టెన్ స్మృతి మంధాన(41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 87),జార్జియా వోల్ (53 బంతుల్లో 79) విధ్వంసం సృష్టించారు.వారిద్దరూ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశారు. వడోదర మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. స్మృతి-వాల్ జోడీ రెండో వికెట్కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి తమ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే వరుస క్రమంలో వాల్, రిచా ఘోష్, మంధాన వికెట్లు తీయడంతో ఢిల్లీ తిరిగి గేమ్లోకి వచ్చింది.కానీ 19 ఓవర్లో రాదా యాదవ్ ఇచ్చిన క్యాచ్ను మిన్ను మణి జారవిడిచింది. ఇందుకు ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 9 పరుగుల అవసరమవ్వగా రాదా యాదవ్ వరుసగా రెండు ఫోర్లు బాది తన జట్టును ఛాంపియన్గా నిలిపింది. కాగా ఢిల్లీ ఫైనల్లో ఓడిపోవడం ఇది వరుసగా నాలుగో సారి కావడం గమనార్హం.
భారత్ను గెలిపించిన శ్రీకాంత్
కింగ్డావో (చైనా): ఆసియా సీనియర్ బ్యాడ్మింటన్ టీమ...
పెర్ల్ ఫెర్నాండెజ్ ‘హ్యాట్రిక్’
పొఖారా (నేపాల్): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శ...
ఇషా సింగ్కు రెండు స్వర్ణ పతకాలు
ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్ప్లో భారత్కు ప్...
చాంపియన్ హరియాణా థండర్స్
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)ల...
T20 WC: జట్లు, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ఫిబ్రవరి 7- మార...
ఫైనల్లో ఢిల్లీ ఓటమి.. డబ్ల్యూపీఎల్-2026 విజేతగా ఆర్సీబీ
RCB vs DC Women Final live updates and highlights:...
'కప్పు గెలవడమే మా లక్ష్యం'.. ప్రత్యర్థులకు రషీద్ ఖాన్ వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026కు మరో రెండు రోజుల్లో తెర...
T20 WC 2026: జింబాబ్వేకు షాకిచ్చిన పసికూన!
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఒమన్ జట్...
క్రీడలు
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
వీడియోలు
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
కుర్రాళ్లు కుమ్మేశారు
ఎలిమినేటర్ లో ఢిల్లీ సత్తా.. సెమీస్ లో గుజరాత్ ఔట్
దడపుట్టించిన భారత్.. పాకిస్తాన్ సంచలన ప్రకటన..
పాక్ పై భారత్ ఘన విజయం
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
