ప్రధాన వార్తలు
హర్మన్ప్రీత్ తడాఖా
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ రెండో విజయం అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ముంబై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై నెగ్గింది. గత రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన గుజరాత్కు లీగ్లో తొలి పరాజయం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జార్జియా వేర్హమ్ (33 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.బెత్ మూనీ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), కనిక (18 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. భారతి (15 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ఆఖర్లో మెరిపించింది. తొలి రెండు మ్యాచ్ల్లో దంచికొట్టిన సోఫీ డివైన్ (8) ఈసారి విఫలమైంది. జార్జియా, భారతి అబేధ్యమైన ఆరో వికెట్కు 24 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. ఈ జోడీ చివరి రెండు ఓవర్లలో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 39 పరుగులు రాబట్టడం విశేషం. ముంబై బౌలర్లలో షబ్నమ్, హేలీ మాథ్యూస్, నికోలా కేరీ, అమెలియా కెర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ముంబై ఇండియన్స్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా... అమన్జ్యోత్ కౌర్ (26 బంతుల్లో 40; 7 ఫోర్లు), నికోలా కేరీ (23 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) ఆమెకు అండగా నిలిచారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో రేణుక, కాశ్వీ, సోఫీ డివైన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కెప్టెన్ ఇన్నింగ్స్ భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ముంబై జట్టు అదరక బెదరక ఎదురు నిలిచింది. ఓపెనర్లు కమలిని (13), హేలీ మాథ్యూస్ (22) ఎక్కువసేపు నిలవలేకపోయినా... హర్మన్ జట్టును ముందుండి నడిపించింది. అమన్జ్యోత్తో కలిసి మూడో వికెట్కు 44 బంతుల్లో 72 పరుగులు... నాలుగో వికెట్కు నికోలాతో 43 బంతుల్లోనే 84 పరుగులు జత చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. చివరి ఓవర్ రెండో బంతికి ఫోర్ కొట్టి జట్టును గెలిపించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్కు ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన కాగా... ఈ మ్యాచ్ ద్వారా హర్మన్ లీగ్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి అండ్ బి) కెర్ 33; సోఫీ డివైన్ (సి) కమిలిని (బి) షబ్నిమ్ 8; కనిక (సి) నికోలా (బి) హేలీ 35; గార్డ్నర్ (ఎల్బీ) (బి) నికోలా 20; జార్జియా (నాటౌట్) 43; ఆయుషి (రిటైర్డ్ అవుట్) 11; భారతి (నాటౌట్) 36; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు)192. వికెట్ల పతనం: 1–22, 2–64, 3–97, 4–99, 5–136.బౌలింగ్: షబ్నమ్ 4–0–25–1; హేలీ మాథ్యూస్ 3–0–34–1; నికోలా కేరీ 4–0–36–1; అమెలియా కెర్ 4–0–40–1; అమన్జ్యోత్ కౌర్ 4–0–48–0; సంస్కృతి 1–0–5–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: కమలిని (స్టంప్డ్) మూనీ (బి) రేణుక 13; హేలీ (సి) డివైన్ (బి) కాశ్వి 22; అమన్జ్యోత్ (సి) గార్డ్నర్ (బి) డివైన్ 40; హర్మన్ప్రీత్ (నాటౌట్) 71; నికోలా కేరీ (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.2 ఓవర్లలో 3 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–20, 2–37, 3–109. బౌలింగ్: రేణుక 4–0–39–1; కాశ్వి 4–0–33–1; రాజేశ్వరి 2–0–22–0; సోఫీ డివైన్ 3.2–0–29–1; జార్జియా 2–0–23–0; తనూజ 3–0–29–0, గార్డ్నర్ 1–0–10–0.
సిరీస్ సొంతం చేసుకోవాలని...
రాజ్కోట్: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత క్రికెట్ జట్టు... నేడు న్యూజిలాండ్తో రెండో వన్డేకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా... ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. టీమిండియాను గాయాల బెడద వెంటాడుతున్నా... విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ జట్టుకు కలిసి రానుంది. సిరీస్ ప్రారంభానికి ముందే రిషభ్ పంత్ గాయపడగా... తొలి మ్యాచ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్కు పక్కటెముకల గాయమైంది. దీంతో ఈ ఇద్దరూ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.సుందర్ స్థానంలో ఆయుశ్ బదోనీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో స్థానం కోసం అతడు ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పోటీ పడాల్సి ఉంది. స్టార్ పేసర్ బుమ్రా అందుబాటులో లేకపోయినా... గత మ్యాచ్లో మన పేసర్లు ఆకట్టుకున్నారు. కానీ స్పిన్నర్లే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మరి ఈ మ్యాచ్లో మన స్పిన్ బలగం ఆ లోటును పూడుస్తుందా చూడాలి. మరోవైపు తొలి వన్డేలో కొన్నిసార్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ దాన్ని చివరి వరకు కొనసాగించడంలో విఫలమైన న్యూజిలాండ్ జట్టు... తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్ను సమం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. పిచ్ అటు బ్యాటింగ్కు, ఇటు బౌలింగ్కు సమానంగా సహకరించనుంది. ఆ ఇద్దరే అసలు బలం... టి20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న రోహిత్ శర్మ, కోహ్లినే టీమిండియాకు ప్రధాన బలం. గత మ్యాచ్లో విరాట్ త్రుటిలో శతకం చేజార్చుకోగా... రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు తన షాట్లతో మెరిపించాడు. ఈ జోడీ మరోసారి చెలరేగితే... కివీస్కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక కెప్టెన్ శుబ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తొలి వన్డేలో చక్కటి ఇన్నింగ్స్లతో కదంతొక్కారు.టీమిండియా ఆడిన గత సిరీస్కు గాయం కారణంగా దూరమైన గిల్... హాఫ్సెంచరీతో ఆకట్టుకోగా... స్పిన్ బౌలింగ్ను బాగా ఆడగల శ్రేయస్ ఒక పరుగుతో అర్ధశతకానికి దూరమయ్యాడు. ఐదో స్థానంలో కుదురైన బ్యాటర్ కనిపించడం లేదు. సుందర్ స్థానంలో బదోనీ, నితీశ్లో ఒకరికి స్థానం దక్కుతుందా లేక ధ్రువ్ జురేల్ను స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడిస్తారా చూడాలి. హైదరాబాదీ సిరాజ్తో కలిసి అర్‡్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ భారాన్ని మోయనుండగా... రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. సమం చేయాలని... గత మ్యాచ్లో తొలి వికెట్కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ... ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించడంలో కివీస్ విఫలమైంది. కాన్వే, నికోల్స్ జట్టుకు శుభారంభాన్ని అందించినా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చినవాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. మిచెల్ మంచి ఫామ్లో ఉన్నాడు. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్ జట్టులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, హే, బ్రేస్వెల్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరముంది. బౌలింగ్లో ఆరున్నర అడుగుల పొడగరి జేమీసన్ సత్తా చాటుతుండగా... ఫోల్్క్స, క్లార్క్ కీలకం కానున్నారు. గత మ్యాచ్లో ఆకట్టుకున్న భారత సంతతి లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, నితీశ్ రెడ్డి/ఆయుశ్ బదోనీ, జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్, అర్‡్షదీప్, సిరాజ్. న్యూజిలాండ్: బ్రేస్వెల్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జెమీసన్, ఫోల్్క్స, ఆదిత్య అశోక్.1. రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడింది. ఒక మ్యాచ్లో గెలిచింది (2020లో ఆ్రస్టేలియాపై). మూడింటిలో (2013లో ఇంగ్లండ్ చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2023లో ఆస్ట్రేలియా చేతిలో) ఓడిపోయింది.
గుజరాత్ బ్యాటర్లు విధ్వంసం.. ముంబై మందు భారీ టార్గెట్
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు తమ సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. గత రెండు మ్యాచ్లలో మెరుపులు మెరిపించిన సోఫీ డివైన్.. ముంబైపై మాత్రం నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి డివైన్ ఔటైంది.అయితే జార్జియా వేర్హామ్(33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 43), భారతి ఫుల్మాలి(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 36) మెరుపులు మెరిపించారు. వీరిద్దరితో పాటు మూనీ(33), కనిక అహుజా(35) రాణించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, అమీలియా కేర్, కారీ తలా వికెట్ సాధించారు.చదవండి: T20 World Cup: ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్..
ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్..
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు జోష్ హాజిల్వుడ్, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్ గాయాలతో బాధపడుతుండగా.. ఇప్పుడు ఈ జాబితాలో స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ చేరాడు. బిగ్ బాష్ లీగ్ 2025-26లో భాగంగా మంగళవారం అడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో స్టోయినిష్( మెల్బోర్న్ స్టార్స్) గాయపడ్డాడు.ఏమి జరిగిందంటే?ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ 20 బంతుల్లో 23 పరుగులు చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.అయితే విజయానికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో.. జేమీ ఓవర్టన్ వేసిన ఓ రకాసి బౌన్సర్ స్టోయినిస్ కుడి చేతి బొటనవేలుకు బలంగా తగిలింది. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిన మార్కస్.. ఫిజియో సూచనతో 'రిటైర్డ్ అవుట్'గా వెనుదిరిగాడు.అతడిని మ్యాచ్ అనంతరం స్కాన్కు తరలించారు. అతడి గాయంపై అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికి మెగా టోర్నీకి ముందు స్టార్ ప్లేయర్లు గాయపడడం ఆసీస్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.టీ20 ప్రపంచకప్-2026కు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాచదవండి: 'భారత్లో ఆడే ప్రసక్తే లేదు'.. మారని బంగ్లాదేశ్ వైఖరి
'భారత్లో ఆడే ప్రసక్తే లేదు'.. మారని బంగ్లాదేశ్ వైఖరి
టీ20 ప్రపంచకప్-2026లో భారత్లో మ్యాచ్లు ఆడే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తన పట్టు వీడటం లేదు. మంగళవారం ఐసీసీతో జరిగిన సమావేశంలోనూ టోర్నమెంట్ కోసం భారత్కు వెళ్లకూడదని తమ నిర్ణయాన్ని బీసీబీ పునరుద్ఘాటించింది.భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టును భారత్కు పంపబోమని, తమ మ్యాచ్లను శ్రీలంక లేదా మరేదైనా ఇతర వేదికకు మార్చాలని మరోసారి బీసీబీ డిమాండ్ చేసింది. అయితే షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావగడంతో ఆఖరి నిమిషంలో వేదికలను మార్చడం అసాధ్యమని, బీసీబీ తన వైఖరి పునఃపరిశీలించుకోవాలని ఐసీసీ విజ్ఞప్తి చేసింది. కానీ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆఖరి నిమిషం వరకు తమ చర్చలు జరుపుతామని, ఆటగాళ్లు భద్రత తమకు ముఖ్యమని బీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య గత కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తలు నెలకొన్నాయి. అయితే బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయడంతో మరింత పెరిగాయి. ఐపీఎల్-2026 వేలంలో ముస్తాఫిజుర్ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది.అయితే బంగ్లాలో హిందువులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తప్పించాలని చాలామంది డిమాండ్ చేశారు. దీంతో అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది. దీంతో అతడిని కేకేఆర్ విడుదల చేసింది.ఈ క్రమంలో తమ జట్టు ఆటగాడిని రిలీజ్ చేయడాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు ఘోర అవమానంగా భావించింది. దీంతో వరల్డ్కప్ మ్యాచ్లను ఆడేందుకు భారత్కు తమ జట్టును పంపబోమని, వేదికలను మార్చాలని ఐసీసీని బీసీబీ డిమాండ్ చేసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ భారత్లో ఆడేందుకు నిరాకరిస్తే, టోర్నమెంట్ రూల్స్ ప్రకారం వారు పాయింట్లు కోల్పోయే అవకాశం ఉందిచదవండి: IND vs NZ: భారత జట్టులోకి అనూహ్య ఎంట్రీ.. బదోని ఎంపికకు గల కారణాలివే?
భారత జట్టులోకి అనూహ్య ఎంట్రీ.. బదోని ఎంపికకు గల కారణాలివే?
ఢిల్లీ స్టార్ బ్యాటర్ అయూశ్ బదోని తన చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. 26 ఏళ్ల బదోని భారత తరపున అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా వైదొలగడంతో అనుహ్యంగా బదోనికి సెలెక్టర్లు పిలుపునిచ్చారు.అయితే బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో బదోని డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. వాషీ స్ధానంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా అతడిని తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. నితీశ్ కుమార్ రెడ్డి మరో ఆల్రౌండర్గా ఉన్నప్పటికి.. బదోని వైపే టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ ఎలాగో తుది జట్టులో ఉంటారు. స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, జడేజా ఇద్దరు మాత్రమే ఉన్నారు. బ్యాకప్గా మరొక స్పిన్ అప్షన్(బదోని) ఉంటే బెటర్ అని గంభీర్ అండ్ కో భావిస్తుందంట.బదోని సెలక్షన్ వెనుక కారణాలు ఇవే..అయితే అనుహ్యంగా బదోనిని జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. కానీ టీమ్ మేనెజ్మెంట్, సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచడానికి బలమైన కారణాలు ఉన్నాయి. బదోనికి దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా అతడికి ఉంది.ఢిల్లీ తరపున నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వస్తుంటాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత జట్టుకు సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరమని భావించిన గంభీర్.. బదోనిని రికమెండ్ చేశాడు. అంతేకాకుండా సుందర్ లాగే బదోని కూడా ఆఫ్-బ్రేక్ బౌలింగ్ చేయగలడు. డొమాస్టిక్ క్రికెట్ టోర్నీలో అతడు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నాడు. ఆల్రౌండర్గా అతడికి మంచి స్కిల్స్ ఉన్నాయి.క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడటంలో బదోని దిట్ట. పరిస్థితులకు తగ్గట్టు అతడు బ్యాటింగ్ చేయగలడు. లిస్ట్-ఎ క్రికెట్లో బదోని ఇప్పటివరకు 27 మ్యాచ్లు ఆడి 693 పరుగులతో పాటు పది వికెట్లు పడగొట్టాడు. అతడిని ఫినిషర్గా కూడా ఉపయోగించుకోవచ్చు.ఐపీఎల్లో కూడా అతడు లక్నో తరపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆల్రౌండర్గా బదోని సత్తాచాటాడు. అయితే క్వార్టర్ ఫైనల్కు అతడు దూరం కావడంతో విదర్భ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది.పంత్ స్దానంలో జురెల్..అదేవిధగా కివీస్తో వన్డే సిరీస్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా గాయం కారణంగా తప్పుకొన్నాడు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినప్పటికి జురెల్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ సెంచరీల మోత మ్రోగించాడు.చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్
సెమీస్లో అడుగుపెట్టిన పంజాబ్, విదర్భ.. షెడ్యూల్ ఇదే
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీ తుది దశకు చేరుకుంది. మంగళవారంతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ముగిశాయి. బెంగళూరు వేదికగా జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ 183 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ జట్టు తమ సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్ 88 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అన్మోల్ప్రీత్ సింగ్(70),నేహల్ వధేరా(56 ), హర్నూర్ సింగ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఎంపీ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, త్రిపురేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో మధ్యప్రదేశ్ 31.2 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో పాటిదార్(38) టాప్ స్కోరర్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో సంవీర్ సింగ్ మూడు, గుర్నూర్ బ్రార్, రమణ్దీప్ సింగ్,కృష్ భగత్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.ఢిల్లీ చిత్తు..మరోవైపు నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీని 76 పరుగుల తేడాతో విదర్భ చిత్తు చేసింది. దీంతో విదర్భ వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్కు అర్హత సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో ఢిల్లీ చతికల పడింది. 45.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. నచికేత్ భూటే 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు. ఇక తొలి రెండు క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక, సౌరాష్ట్ర విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక, సౌరాష్ట్ర, విదర్భ, పంజాబ్ జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.సెమీఫైనల్ షెడ్యూల్తొలి సెమీఫైనల్- కర్ణాటక vs విదర్భ- జనవరి 15రెండో సెమీఫైనల్-సౌరాష్ట్ర vs పంజాబ్- జనవరి 16చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్
సూపర్ కింగ్స్కు భారీ షాక్.. టోర్నీ నుంచి కెప్టెన్ ఔట్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్లో జోబర్గ్ సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో భాగంగా జనవరి 10న ఎంఐ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా డుప్లెసిస్ కుడి చేతి బొటనవేలికి తీవ్రమైన గాయమైంది.దీంతో ఆ మ్యాచ్లో అతడు బ్యాటింగ్కు రాలేదు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్ నిర్వహించగా.. బొటనవేలి లిగమెంట్ తెగిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలో ఫాప్ త్వరలోనే తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు.ఈ విషయంపై జేఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ఫాఫ్ కనీసం బ్యాట్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడని, అందుకే టోర్నీ నుండి వైదొలిగాల్సి వచ్చిందని తెలిపాడు. 41 ఏళ్ల డుప్లెసిస్ ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడి 135 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 151.69 గా ఉంది.డుప్లెసిస్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు జేఎస్కే సైతం ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడువ స్థానంలో ఉంది. మిగిలిన మ్యాచ్లకు జేమ్స్ విన్స్ జేఎస్కే సారథిగా వ్యవహరించే అవకాశముంది.జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు ఇదేజేమ్స్ విన్స్, మాథ్యూ డి విలియర్స్, వియాన్ ముల్డర్, మైఖేల్-కైల్ పెప్పర్ (కీపర్), డోనవన్ ఫెరీరా, ప్రెనెలన్ సుబ్రాయన్, డయాన్ ఫారెస్టర్, అకీల్ హోసేన్, నాండ్రే బర్గర్, డేనియల్ వోరల్, శుభమ్ రంజనే, రిచర్డ్ గ్లీసన్, జారెన్ బాచర్, నీల్ టిమ్మర్స్, జాంకో స్మిత్, స్టీవ్ స్టోల్క్, దువాన్ జాన్సెన్, రివాల్డో మూన్సామి.
డబ్బులిచ్చైనా న్యూజిలాండ్ క్యాంప్లో చేరుతా: అశ్విన్
వడోదర వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ పోరాడి ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆతిథ్య జట్టుకు కివీస్ గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సీనియర్లు లేనప్పటికి పర్యాటక జట్టు పోరాట పటిమను అశ్విన్ కొనియాడాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకురేందుకు కివీస్ బౌలర్లు ఆఖరి వరకు శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తు 4 వికెట్ల తేడాతో బ్లాక్క్యాప్స్ జట్టు ఓటమి పాలైంది."చాలా అగ్రశ్రేణి జట్లు డేటా లేదా అనలిటిక్స్ మీద ఆధారపడవు. కానీ న్యూజిలాండ్ మాత్రం అందుకు భిన్నం. ప్రత్యర్ధి జట్టుకు సంబంధించి ప్రతీ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వ్యూహాలు రచించడం, వాటిని విజయవంతంగా అమలు చేయడంలో కివీస్ దిట్ట. బ్లాక్ క్యాప్స్ తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో తెలుసుకోవడానికి, వారి టీమ్ మీటింగ్లలో పాల్గోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.అవసరమైతే దానికోసం డబ్బులు చెల్లించడానికైనా నాకు అభ్యంతరం లేదు" అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్కు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, మాట్ హెన్రీ, శాంట్నర్ వంటి కివీ స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. దీంతో బ్లాక్ క్యాప్స్ జట్టు కెప్టెన్గా మైఖల్ బ్రెస్వేల్ వ్యవహరిస్తున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్
‘ఆ ఇద్దరితో ఎఫైర్.. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి’
భారత బాక్సింగ్ దిగ్గజం, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్పై ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలు చేశాడు. మేరీ కోమ్కు పలువురితో వివాహేతర సంబంధాలు ఉండేవని ఆరోపించాడు. అదే విధంగా.. ఆస్తిని కాజేశానంటూ తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదన్నాడు.మణిపూర్కు చెందిన మేరీకోమ్ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచారు. వ్యక్తిగత విషయానికొస్తే.. కరుంగ్ ఓన్కోలర్ను 2005లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు మగ పిల్లలుకాగా... 2018లో కరుంగ్ ఓన్కోలర్ ఒక పాపను దత్తత తీసుకున్నాడు.అయితే, 2023లో తమకు సంప్రదాయం (కోమ్ చట్టాలు) ప్రకారం విడాకులు మంజూరు అయ్యాయని గతేడాది మేలో మేరీ కోమ్ ప్రకటించింది. అయితే, వీరిద్దరికి కోర్టు ద్వారా మాత్రం ఇంకా విడాకులు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా IANSతో మాట్లాడిన కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చాడు.జూనియర్ బాక్సర్తో‘‘లోక్ అదాలత్లో నేను తనను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని ఆమె చెబుతోందేమో!. మొదట 2013లో ఓ జూనియర్ బాక్సర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయం తెలిసి మా కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెద్దలు చెప్పిన తర్వాత రాజీకి వచ్చాము.వాట్సాప్ మెసేజులు ఉన్నాయి2017 నుంచి మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలో పని చేస్తున్న ఓ వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగిస్తోంది. సాక్ష్యంగా వాళ్లిద్దరి వాట్సాప్ మెసేజులు నా దగ్గర ఉన్నాయి. ఆమెకు ఎవరితో సంబంధం ఉందో నాకు కచ్చితంగా తెలుసు. అయినా సరే నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. ఆమె ఒంటరిగా బతుకుతూ.. అతడితో రిలేషన్షిప్లో ఉండాలనుకుంది.అందుకే విడాకులు తీసుకున్నాం. ఒకవేళ తను వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నన్ను నిందిస్తే మాత్రం ఊరుకోను. ఆధారాలు ఉంటేనే నాపై ఆరోపణలు చేయాలి. పద్దెనెమిదేళ్ల వైవాహిక జీవితంలో నేను తన నుంచి ఏమీ తీసుకోలేదు.కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదుఆమె ఓ సెలబ్రిటీ. అయినా సరే నేను ఇప్పటికీ ఢిల్లీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాను. తను చెప్పింది అందరూ వింటారు కాబట్టి నచ్చినట్లు మాట్లాడుతోంది. మేము సంప్రదాయం ప్రకారమే విడాకులు తీసుకున్నాం. కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదు.అయినా నేను కోర్టుకు వెళ్లను. నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను తన డబ్బులు దొంగిలించానని.. రూ. 5 కోట్లు కొట్టేశానని అంటోంది. ఒక్కసారి నా అకౌంట్ చూడండి. నా దగ్గర ఎంత ఉందో తెలుస్తుంది.నన్ను వాడుకొని వదిలేసిందినన్ను వాడుకొని వదిలేసింది. ఆమె అకాడమీకి బీజం వేసింది నేను. కానీ ఇప్పుడు చైర్మన్గా ఎవరు ఉన్నారో చూడండి. ఆమె ప్రవర్తన నన్ను బాధపెట్టింది. నా పిల్లలు బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారు. ఆమె సంపాదిస్తోంది కాబట్టి.. వారి ఫీజులను చెల్లిస్తోంది. కానీ వాళ్లను పెంచింది నేను.హాస్టల్లో ఉన్న నా పిల్లల్ని చూడనివ్వడం లేదు. వాళ్లు తన పిల్లలు అని వాదిస్తోంది. నిజానికి వాళ్లు నా రక్తం కూడా. భార్యాభర్తల బంధంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. నేను ఆల్కహాల్ తీసుకుంటానని తను చెబుతోంది. ఆమె కూడా వోడ్కా, రమ్ తాగుతుంది.గుట్కా తింటుంది. అయినా సరే మీడియా ముందు నేను ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. నేను పార్టీల్లో తాగినందుకు నా గురించి ప్రచారం చేసింది’’ అంటూ మేరీ కోమ్పై కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలు చేశాడు. కాగా ఓ వ్యాపారవేత్తతో మేరీకి సంబంధం ఉందని వార్తలు రాగా.. ఆమె తరఫు లాయర్ ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇకపై ఎవరూ వీటిని ప్రస్తావించకూడదని విజ్ఞప్తి చేశారు.చదవండి: ‘నిశ్చితార్థం చేసుకున్నాం’
12 ఏళ్ల భారత్కు ఫిఫా ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత భారత్లోకి అ...
ముగిసిన సింధు పోరాటం.. సెమీస్లో ఓటమి
మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు...
ఇక నుంచి రూ. 20 లక్షలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు...
ఆటుపోట్లను దాటుకుంటూ... అడ్డంకులు ఎదురైనా..
గ్రేటర్ నోయిడా: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన...
సెమీస్లో అడుగుపెట్టిన పంజాబ్, విదర్భ.. షెడ్యూల్ ఇదే
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీ తుది దశకు చేర...
డబ్బులిచ్చైనా న్యూజిలాండ్ క్యాంప్లో చేరుతా: అశ్విన్
వడోదర వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో...
చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన రీఎం...
‘సన్రైజర్స్’ కీలక ప్రకటన
సన్రైజర్స్ యాజమాన్యం తమ జట్టు హెడ్కోచ్ పేరును ...
క్రీడలు
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
మహిళా షూటర్ పై లైంగిక దాడి.. జాతీయ కోచ్ అంకుశ్ పై వేటు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!
