ప్రధాన వార్తలు
ఆయుశ్ బదోనికి తొలి పిలుపు
న్యూఢిల్లీ: భారత్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్తో జరిగే తర్వాతి రెండు వన్డేలకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతుండటంతో సుందర్ తప్పుకోవాల్సి వచ్చింది. ‘తొలి వన్డేలో బౌలింగ్ చేసే సమయంలో సుందర్ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. అతడికి పరీక్షలు నిర్వహించి గాయం తీవ్రతను బోర్డు వైద్యులు పర్యవేక్షిస్తారు’ అని బీసీసీఐ ప్రకటించింది. కివీస్ ఇన్నింగ్స్లో 5 ఓవర్లలో 27 పరుగులిచి్చన అనంతరం మైదానం నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సుందర్ మళ్లీ ఫీల్డింగ్ కోసం రాలేదు. అయితే ఛేదనలో భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్కు వచ్చి రాహుల్కు చివరి వరకు అండగా నిలిచాడు. సుందర్ స్థానంలో ఢిల్లీ ఆటగాడు ఆయుశ్ బదోనిని భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు సెలక్టర్లు ప్రకటించారు. బదోనికి టీమిండియాలో చోటు దక్కడం ఇదే మొదటి సారి. బుధవారం జరిగే రెండో వన్డే వేదిక రాజ్కోట్లో అతను భారత బృందంతో చేరతాడు. టీమిండియాకు ఆయుశ్ ఎంపిక కావడం విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ టీమ్ను బలహీనంగా మార్చింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విదర్భతో ఢిల్లీ ఆడనుండగా ...ఈ మ్యాచ్కు బదోని దూరమయ్యాడు. ఐపీఎల్తో గుర్తింపు... 26 ఏళ్ల బదోని ప్రధానంగా మిడిలార్డర్ బ్యాటర్. అయితే ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున అతనికి మంచి గుర్తింపు లభించింది. దేశవాళీ క్రికెట్లో అతను ఢిల్లీకి కెపె్టన్గా కూడా వ్యవహరించాడు. గత 12 ఏళ్లుగా బదోని బౌలింగ్లో ఎంతో మెరుగయ్యాడని ఢిల్లీ కోచ్ శరణ్దీప్ సింగ్ వెల్లడించాడు. కెరీర్లో 27 లిస్ట్–ఎ మ్యాచ్లలో అతను 36.47 సగటుతో 693 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 29.72 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో లక్నో తరఫున ఆడిన 4 సీజన్లలో కలిపి 56 మ్యాచ్లలో 138.56 స్ట్రయిక్ రేట్తో 963 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీశాడు.
హైదరాబాద్ వేదికగా...
సాక్షి, హైదరాబాద్: పలు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లకు వేదికగా నిలిచిన హైదరాబాద్ మరో పెద్ద టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. మహిళల హాకీ వరల్డ్కప్లో భాగంగా జరిగే క్వాలిఫయింగ్ టోర్నీని ఇక్కడి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తారు. మార్చి 8 నుంచి 14 వరకు ఈ పోటీలు జరుగుతాయి. మొత్తం ఎనిమిది జట్లు ఇందులో పాల్గొంటాయి. టాప్–3లో నిలిచిన టీమ్లు నేరుగా వరల్డ్ కప్కు అర్హత సాధిస్తాయి. భారత్తోపాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హత టోర్నీ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఒప్పందం చేసుకుంది. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్ ఇందులో పాల్గొని టోర్నీ నిర్వహణపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని పునరుద్ఘాటించారు. హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ నిర్వహించడం తమకు గర్వకారణమని... మున్ముందు నగరాన్ని అత్యుత్తమ స్థాయి క్రీడా కేంద్రంగా మార్చే క్రమంలో ఇది మరో ముందడుగు అని ఆయన అన్నారు. టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత హాకీ సమాఖ్య (హెచ్ఐ) అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ తిర్కీ, భోలానాథ్ సింగ్తో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సలహాదారు జితేందర్ రెడ్డి, క్రీడా కార్యదర్శి జయేశ్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
వహ్వా హారిస్...
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ముందుగా చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు... ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్తో మరో 47 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఈ పోరులో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన యూపీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (35 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), డియాండ్రా డాటిన్ (37 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 72 బంతుల్లో అభేద్యంగా 93 పరుగులు జోడించారు. అనంతరం బెంగళూరు 12.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (40 బంతుల్లో 85; 10 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా...కెప్టెన్ స్మృతి మంధాన (32 బంతుల్లో 47 నాటౌట్; 9 ఫోర్లు) రాణించింది. వీరిద్దరు తొలి వికెట్కు 71 బంతుల్లోనే 137 పరుగులు జోడించి జట్టు విజయాన్ని సులువు చేశారు. యూపీ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. నేడు జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కీలక భాగస్వామ్యం... యూపీకి ఓపెనర్లు మెగ్ లానింగ్ (14), హర్లీన్ డియోల్ (11) శుభారంభం అందించలేకపోయారు. పరుగులు చేయలేకపోవడంతో పాటు వీరిద్దరు నెమ్మదిగా ఆడి బంతులను కూడా వృథా చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన బ్యాటర్లూ కూడా పూర్తిగా తడబడ్డారు. దాంతో ఒకే స్కోరు వద్ద జట్టు 3 వికెట్లు కోల్పోయింది. లిచ్ఫీల్డ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), కిరణ్ నవ్గిరే (5), శ్వేత సెహ్రావత్ (0)లను ఆర్సీబీ బౌలర్లు వెనక్కి పంపించారు. ఫలితంగా 50/5తో యూపీ కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తి, డాటిన్ కలిసి జట్టును ఆదుకున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 56 పరుగులకు చేరింది. తర్వాతి పది ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా దీప్తి, డాటిన్ పరుగులు జోడించారు. శ్రేయాంక ఓవర్లో డాటిన్ వరుసగా 4, 6 కొట్టగా, డిక్లెర్క్ బౌలింగ్లో దీప్తి భారీ సిక్స్ బాదింది. శ్రేయాంక వేసిన ఆఖరి ఓవర్లోనూ వీరిద్దరు మూడు ఫోర్లు కొట్టడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ఓపెనర్ల దూకుడు... ఛేదనలో ఆర్సీబీ అలవోకగా దూసుకుపోయింది. దీప్తి వేసిన తొలి ఓవర్లోనే హారిస్ రెండు ఫోర్లు కొట్టగా, శిఖా ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు సాధించింది. ఆ తర్వాత క్రాంతి ఓవర్లో వీరిద్దరు 3 ఫోర్లతో 13 పరుగులు రాబట్టారు. ఈ దశలో డాటిన్ ఓవర్తో మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపు మళ్లింది. శోభన ఓవర్లోనూ హారిస్ వరుసగా 6, 4 బాదింది. 10 ఓవర్లలోనే 121 పరుగులు సాధించిన బెంగళూరుకు ఆటను ముగించేందుకు మరో 13 బంతులు సరిపోయాయి. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) రాధ (బి) శ్రేయాంక 14; హర్లీన్ (సి) స్మృతి (బి) బెల్ 11; లిచ్ఫీల్డ్ (సి) స్మృతి (బి) శ్రేయాంక 20; కిరణ్ (సి) స్మిత్ (బి) డిక్లెర్క్ 5; దీప్తి (నాటౌట్) 45; శ్వేత (సి) అరుంధతి (బి) డిక్లెర్క్ 0; డాటిన్ (నాటౌట్) 40; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–21, 2–39, 3–50, 4–50, 5–50. బౌలింగ్: లారెన్ బెల్ 4–0–16–1, లిన్సీ స్మిత్ 4–0–30–0, శ్రేయాంక పాటిల్ 4–0–50–2, అరుంధతి రెడ్డి 4–0–18–0, నదైన్ డిక్లెర్క్ 4–0–28–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) లానింగ్ (బి) శిఖా 85; స్మృతి (నాటౌట్) 47; రిచా (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 9; మొత్తం (12.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 145. వికెట్ల పతనం: 1–137. బౌలింగ్: దీప్తి శర్మ 3.1–0–25–0, క్రాంతి గౌడ్ 2–0–18–0, శిఖా పాండే 3–0–28–1, డియాండ్రా డాటిన్ 1–0–32–0, సోఫీ ఎకెల్స్టోన్ 2–0–20–0, శోభన 1–0–17–0. డాటిన్ ఓవర్లో 32 పరుగులు! యూపీ బౌలర్ డియాండ్రా డాటిన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఆర్సీబీ ఓపెనర్ గ్రేస్ హారిస్ మెరుపులా చెలరేగిపోయింది. ఈ ఓవర్లో ఆమె వరుసగా 4, 6, 4, 6, 6 బాదింది. వీటిలో తొలి బంతి నోబాల్ కూడా కావడంతో స్కోరు బోర్డులో అదనపు పరుగు చేరింది. అనంతం డాటిన్ వైడ్ కూడా వేసి మరో పరుగు ఇచి్చంది. తర్వాతి బంతిని హారిస్ మళ్లీ బౌండరీకి తరలించింది. ఎట్టకేలకు చివరి బంతికి పరుగు రాకుండా నిరోధించడంతో డాటిన్ సఫలమైంది. మొత్తంగా హారిస్ 30 పరుగులు కొట్టగా, అదనపు పరుగులు కలిపి ఓవర్లో 32 పరుగులు లభించాయి. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హారిస్ అర్ధ సెంచరీ పూర్తయింది.
RCB vs UPW: రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో యూపీ వారియర్స్ జట్టుతో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఘన విజయం సాధించింది. గ్రేస్ హారిస్ కేవలం 40 బంతుల్లో 85 పరుగులు, స్మృతి మంధాన 32 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేయడంతో ఆర్సీబీ యూపీ వారియర్స్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది.నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ కేవలం 12.1 ఓవర్లలో 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇది డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్కు వేగవంతమైన చేజ్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో ఇది ఆర్సీబీ జట్టుకు రెండో విజయం.అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలింది.
RCB vs UPW: రాణించిన ఆల్రౌండర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్లో యూపీ వారియర్స్ నామమాత్రపు స్కోరు సాధించింది. నవీ ముంబై వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలింది.మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా యూపీతో మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన యూపీకి ఆదిలోనే షాకులు తగిలాయి.ఓపెనర్లలో హర్లిన్ డియోల్ (14 బంతుల్లో 11)ను స్వల్ప స్కోరుకే లారెన్ బెల్ పెవిలియన్కు పంపగా.. కెప్టెన్ మెగ్ లానింగ్ (14), వన్డౌన్ బ్యాటర్ ఫోబీ లిచిఫీల్డ్ (20)ల వికెట్లు శ్రేయాంక పాటిల్ తన ఖాతాలో వేసుకుంది.రాణించిన దీప్తి, డియాండ్రాఇక కిరన్ నవగిరె (5)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ శ్వేతా సెహ్రావత్ (0)లను నదైన్ డిక్లెర్క్ అవుట్ చేసింది. దీంతో కష్టాల్లో కూరుకుపోయిన యూపీ జట్టును ఆల్రౌండర్లు దీప్తి శర్మ, డియాండ్రా డాటిన్ ఆదుకున్నారు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా స్టార్ దీప్తి... 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 45 పరుగులతో అజేయంగా నిలిచింది.వెస్టిండీస్ వెటరన్ స్టార్ డియాండ్ర డాటిన్ సైతం 37 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేసింది. ఆఖరి వరకు దీప్తి, డాటిన్ ధనాధన్ దంచికొట్టడంతో యూపీ 140 పరుగుల మార్కు దాటగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, డిక్లెర్క్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్ ఒక వికెట్ దక్కించుకుంది. ఇక యూపీ విధించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.కాగా ఈ సీజన్లో ఆర్సీబీ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించి గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. యూపీ తమ తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.ఆర్సీబీ వర్సెస్ యూపీ తుదిజట్లుఆర్సీబీగ్రేస్ హారిస్, స్మృతి మంధాన (కెప్టెన్), దయాళన్ హేమలత, గౌతమి నాయక్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నదైన్ డిక్లెర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్సే స్మిత్, లారెన్ బెల్యూపీకిరణ్ నవ్గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఫోబ్ లిచ్ఫీల్డ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), డియాండ్రా డాటిన్, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్.
బంగ్లాదేశ్కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ భారత్పై మరోసారి నిందలు వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మెగా ఈవెంట్లో ఆడేందుకు తమ ఆటగాళ్లను భారత్కు పంపలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ మ్యాచ్ల వేదికలను మార్చాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి కూడా చేసింది.ఐసీసీ చెప్పింది.. ఈ మూడు జరిగితే దాడులు!అయితే, ఈ విషయంపై ఐసీసీ స్పందించిందంటూ బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేదికల మార్పు గురించి ఐసీసీకి మేము రెండు లేఖలు పంపించాము. ఇందుకు సమాధానం ఇంకా రాలేదు. అయితే, ఐసీసీ భద్రతా బృందం నుంచి మాకు లేఖ వచ్చింది.సెక్యూరిటీ టీమ్ ఇంఛార్జి మాకు రాసిన లేఖలో మూడు విషయాలు చెప్పారు. ఒకటి.. ఒకవేళ ముస్తాఫిజుర్ రహమాన్ బంగ్లాదేశ్ జట్టులో ఉంటే భద్రతా ముప్పు పెరుగుతుందని చెప్పారు. రెండోది.. ఒకవేళ బంగ్లాదేశ్కు మద్దతు ఇచ్చే ఆటగాళ్లు మా దేశ జెర్సీ వేసుకుని మైదానంలోకి వస్తే దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.ఎన్నికలు సమీపిస్తున్నందున అది కూడా బంగ్లాదేశ్ జట్టుకు ముప్పును పెంచే అవకాశం ఉందని చెప్పారు. ఐసీసీ సెక్యూరిటీ టీమ్ హెడ్ ఇచ్చిన వివరాలను బట్టి.. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్కు వెళ్లడం ఎంతమాత్రం సరికాదని అర్థమవుతోంది’’ అని నజ్రుల్ ఒక రకంగా నిందలు వేశాడు.దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఐసీసీఅయితే, నజ్రుల్ వ్యాఖ్యలకు ఐసీసీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఐసీసీ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘పబ్లిక్గా కొంతమంది చేస్తున్న కామెంట్లు ఐసీసీ దృష్టికి వచ్చాయి. టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఆడే విషయంలో కొంతమంది తమకు నచ్చినట్లుగా ఐసీసీ సెక్యూరిటీ రిస్క్ గురించి చెప్పిందని మాట్లాడుతున్నారు.అంతర్జాతీయ స్థాయి భద్రతా నిపుణులతో ఐసీసీ చర్చిస్తుంది. దీనర్థం భారత్లో బంగ్లాదేశ్ మ్యాచ్లు ఆడకూడదని కాదు. భారత్లో ఎలాంటి భద్రతా ముప్పు లేదు. ఒకవేళ సెక్యూరిటీ రిస్క్ ఉంటుందని భావించినా.. అది తక్కువ నుంచి అతి తక్కువగా ఉంది.భారత్లో ఇప్పటికే ఎన్నో ఐసీసీ, మెగా టోర్నీలు జరిగాయి. మా భద్రతా విభాగం ప్రత్యక్షంగా బంగ్లాదేశ్ ప్లేయర్లపై దాడులు జరుగుతుందని అస్సలు చెప్పలేదు’’ అని నజ్ముల్ వ్యాఖ్యలను ఖండించాయి. పచ్చి అబద్ధంఇక PTI అందించిన వివరాల ప్రకారం.. ‘‘భారత్లో భద్రత గురించి ఐసీసీ- బీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఆసిఫ్ నజ్రుల్ చెప్పింది పచ్చి అబద్ధం. ముస్తాఫిజుర్ సెలక్షన్ వల్ల బంగ్లాదేశ్ జట్టుకు ముప్పు ఉంటుందని చెప్పిందన్నదాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఇలాంటి ఒక విషయాన్ని లేఖలో అధికారికంగా రాయనేలేదు’’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.కాగా బంగ్లాదేశ్లో కొన్నాళ్లుగా మైనారిటీలపై దాడులు పెరిగాయి. అందుకు తోడు భారత్పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో బంగ్లా కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026లో ఉన్న ఒకే ఒక్క బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ను తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అంగీకరించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ బీసీబీ రాగం ఎత్తుకుంది.చదవండి: U19 WC 2026 IND vs ENG: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
ఐ డోంట్ కేర్: సబలెంకా రియాక్షన్ వైరల్
బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా కొత్త ఏడాదిని, కొత్త సీజన్ను టైటిల్తో ప్రారంభించింది. బ్రిస్బేన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా.. మార్టా కొస్టుక్పై ఏకపక్ష విజయం సాధించింది. అయితే, మ్యాచ్ అనంతరం సబలెంకాతో కరచాలనం చేసేందుకు ఉక్రెయిన్కు చెందిన మార్టా నిరాకరించింది.ఉక్రెయిన్లో పరిస్థితుల నేపథ్యంలో రష్యా, బెలారస్ ప్లేయర్లతో షేక్హ్యాండ్కు దూరంగా ఉండాలని తాను పెట్టుకున్న నియమాన్ని ఇక్కడ కూడా 23 ఏళ్ల మార్టా పాటించింది. ఈ విషయంపై సబలెంకా తాజాగా స్పందించింది.నేను అసలు పట్టించుకోను‘‘అది ఆమె నిర్ణయం. అందుకు నేనేం చేయగలను?.. ఆమె షేక్హ్యాండ్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా నాకేమీ తేడా ఉండదు. నేనసలు ఆ విషయాన్నే పట్టించుకోను. ఒక్కసారి కోర్టులో దిగిన తర్వాత నా ధ్యాసంతా ఆట మీదే ఉంటుంది.కోర్టులో అడుగుపెట్టిన తర్వాత గెలవాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతాను. మర్టా లేదంటే జెస్సికా పెగులా.. నా ప్రత్యర్థిగా వీరిలో ఎవరు ఉన్నారన్నది ముఖ్యం కాదు. నా అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలవడం.. ట్రోఫీని అందుకోవడంపై మాత్రమే దృష్టి సారిస్తా.నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అథ్లెట్గా నా పనిని నేను సక్రమంగా పూర్తి చేస్తాను’’ అని సబలెంకా.. మార్టాకు పరోక్షంగా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కాగా 2022 నుంచి రష్యా, బెలారస్ ప్లేయర్లతో షేక్హ్యాండ్కు మార్టా దూరంగా ఉంటోంది. రూ. 1 కోటీ 93 లక్షలుఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా 6–4, 6–3తో మార్టా కొస్టుక్ను ఓడించింది.78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకా ఒక ఏస్ సంధించింది. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. తొలి సర్వీస్లో 32 పాయింట్లకుగాను 26... రెండో సర్వీస్లో 20 పాయింట్లకుగాను 12 పాయింట్లు సంపాదించింది. ఇక సబలెంకా కెరీర్లో ఇది 22వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన బెలారస్ స్టార్కు 2,14,530 డాలర్ల (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.చదవండి: U19 WC 2026 IND vs ENG: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
‘నిశ్చితార్థం చేసుకున్నాం’
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ శుభవార్త చెప్పాడు. ప్రియురాలు సోఫీ షైన్తో వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపాడు. ‘‘చిరునవ్వుల నుంచి కలల దాకా అన్నీ పంచుకున్నాం. ప్రేమ మమ్మల్ని దీవించింది.చిరకాల ప్రయాణానికి నాందిగా మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము’’ అని శిఖర్- సోఫీ పేరిట సోషల్ మీడియా వేదికగా నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాల్కనీలో ఎర్ర గులాబీలతో అందంగా అలంకరించిన హృదయాకారం ముందుకు శిఖర్ చేయి చాచగా.. సోఫీ తన వజ్రపు ఉంగరాన్ని చూపిస్తూ అతడి చేతి మీద చేయి వేసిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది.శుభాకాంక్షల వెల్లువకాబోయే వధూవరులు శిఖర్ ధావన్- సోఫీ షైన్లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫిబ్రవరి మూడోవారంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్గా సత్తా చాటిన శిఖర్ ధావన్ గతంలో.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని 2011లో పెళ్లి చేసుకున్నాడు.కుమారుడికీ దూరంఅన్యోన్యంగా కనిపించిన ఈ జంటకు కుమారుడు జొరావర్ ధావన్ సంతానం. అంతకుముందు పెళ్లి ద్వారా ఆయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్ వాళ్లు కూడా తన సొంత కూతుళ్లలాంటి వారే అని పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే, కొన్నాళ్లకు శిఖర్- ఆయేషా మధ్య విభేదాలు తలెత్తి తీవ్రరూపం దాల్చాయి.ఈ క్రమంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. కొడుకు కూడా ధావన్కు దూరమయ్యాడు. దీంతో కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న ధావన్.. కొంతకాలం క్రితం ఐర్లాండ్ భామ సోఫీ షైన్తో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు ఈ జంట. కాగా సోఫీ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ అని సమాచారం. అబుదాబిలోని ఓ కంపెనీకి ఆమె వైస్ ప్రెసిడెంట్ అని తెలుస్తోంది.చదవండి: బంగ్లాదేశ్ మ్యాచ్ల వేదికలు మార్చండి!.. స్పందించిన బీసీసీఐ
చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్గా..
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ముంబైతో క్వార్టర్ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ దుమ్ములేపాడు. సెంచరీ మిస్ చేసుకున్నా సూపర్ ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించాడు.బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక- ముంబై (Karnataka vs Mumbai) జట్లు సోమవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.షామ్స్ ములాని అర్ధ శతకంఓపెనర్లు అంగ్క్రిష్ రఘువన్షి (27), ఇషాన్ ముల్చందాని (20) ఓ మోస్తరుగా ఆడగా.. వన్డౌన్లో వచ్చిన ముషీర్ ఖాన్ (9) ఈసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సిద్దేశ్ లాడ్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ హార్దిక్ తామోర్ (1) నిరాశపరిచాడు.ఇలాంటి దశలో ఆల్రౌండర్ షామ్స్ ములాని అద్భుత అర్ధ శతకం (86)తో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన వారిలో సాయిరాజ్ పాటిల్ (25 బంతుల్లో 33 నాటౌట్) రాణించడంతో ముంబై చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ మూడు వికెట్లు తీయగా.. విధ్వత్ కావేరప్ప, అభిలాష్ శెట్టి చెరో రెండు.. విజయ్కుమార్ వైశాఖ్ ఒక వికెట్ పడగొట్టారు.రాణించిన పడిక్కల్.. కరుణ్ నాయర్ఇక లక్ష్య ఛేదనలో కర్ణాటకకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (12)ను మోహిత్ అవస్థి పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ 81 పరుగులతో రాణించగా.. కరుణ్ నాయర్ 74 పరుగులతో అతడితో కలిసి అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించిన కారణంగా VJD (వి.జయదేవన్) మెథడ్లో.. 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసిన కర్ణాటక.. 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో సెమీస్కు దూసుకువెళ్లింది.చరిత్ర సృష్టించిన పడిక్కల్ఈ సీజన్లో పడిక్కల్ ఇప్పటికే 721 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ దేశీ వన్డే టోర్నీలో అత్యధికసార్లు 700 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2021-22 సీజన్లో దేవదత్ పడిక్కల్ ఏడు ఇన్నింగ్స్ ఆడి 737 పరుగులు సాధించాడు.ఇక ఈ టోర్నీలో ఓవరాల్గా ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నారాయణ్ జగదీశన్ (2022-23లో 8 ఇన్నింగ్స్లో 830 పరుగులు) కొనసాగుతున్నాడు. ముంబై తరఫున 2021-22 సీజన్లో పృథ్వీ షా 827 పరుగులు చేసి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు
IND vs NZ: రిపోర్టర్పై మండిపడ్డ టీమిండియా స్టార్
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. వడోదర వేదికగా ఆదివారం కివీస్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ముందంజ వేసింది. విరాట్ కోహ్లి (Virat Kohli- 93) అద్భుత ఇన్నింగ్స్తో మరోసారి సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్లో టీమిండియా యువ క్రికెటర్ హర్షిత్ రాణా (Harshit Rana) సైతం మెరుగ్గా రాణించాడు. అర్ధ శతకాలతో అదరగొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (Devon Conway- 56), హెన్రీ నికోల్స్ (62) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ పేసర్.ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిఅదే విధంగా.. న్యూజిలాండ్ విధించిన 301 పరుగుల లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హర్షిత్ రాణా.. 23 బంతులు ఎదుర్కొని 29 పరుగులు సాధించాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.బుమ్రా గైర్హాజరీలోఈ క్రమంలో కివీస్పై టీమిండియా గెలుపు అనంతరం హర్షిత్ రాణా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. ‘‘జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాము. భారత బౌలింగ్లో తడబాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.కొత్త బంతితో మనవాళ్లు అంత తేలికగా వికెట్లు తీయలేకపోతున్నారు. ఇందుకు గల కారణం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన హర్షిత్ రాణా.. ‘‘మీరు అసలు ఎలాంటి క్రికెట్ చూశారో నాకైతే అర్థం కావడం లేదు.మండిపడ్డ టీమిండియా హర్షిత్ రాణాఈరోజు సిరాజ్ వికెట్లు తీయలేకపోయినా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మేము మరీ ఎక్కువగా పరుగులు కూడా ఇచ్చుకోలేదు. అయినా కొత్త బంతితో వికెట్లు తీయడం కుదరలేదంటే.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేమని కాదు కదా!.. మేము మధ్య ఓవర్లలో వికెట్లు తీశాము’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు న్యూజిలాండ్తో వన్డేల నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త బంతితో వికెట్లు తీయడంలో టీమిండియా తడబడిన మాట వాస్తవమే. కాన్వే, నికోల్స్ కలిసి తొలి వికెట్కు ఏకంగా 117 పరుగులు జోడించడం ఇందుకు నిదర్శనం.ఆల్రౌండర్గా ఇక టీమిండియా మేనేజ్మెంట్ తనను ఆల్రౌండర్గా చూడాలని భావిస్తోందని హర్షిత్ రాణా ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇందుకు తగినట్లుగానే తాను నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. కాగా భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం వేదిక. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు
ఇక నుంచి రూ. 20 లక్షలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు...
ఆటుపోట్లను దాటుకుంటూ... అడ్డంకులు ఎదురైనా..
గ్రేటర్ నోయిడా: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన...
సెమీస్లో సింధు
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1...
కన్నతల్లి ‘లైక్’ చేసిందని... ఫుట్బాల్ దిగ్గజానికి షాకిచ్చిన కొడుకు!
ఇంగ్లండ్ ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్ దం...
చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్గా..
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో...
IND vs NZ: రిపోర్టర్పై మండిపడ్డ టీమిండియా స్టార్
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో టీమిండియా...
వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో మ్యాచ్లో భారత యువ క్ర...
బంగ్లా మ్యాచ్ల వేదికలు మార్పు!.. స్పందించిన బీసీసీఐ
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఆడే...
క్రీడలు
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
మహిళా షూటర్ పై లైంగిక దాడి.. జాతీయ కోచ్ అంకుశ్ పై వేటు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!
