Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Indian football has a bright future says Messi1
భారత ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిత: మెస్సీ

న్యూఢిల్లీ: భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లయోనల్‌ మెస్సీ అన్నాడు. ‘మీ ఆదరణ, మీరు పంచిన ప్రేమాభిమానాలను నాతోపాటు తీసుకెళ్తున్నా. మ్యాచ్‌ ఆడేందుకైనా... మరో కార్యక్రమానికైనా ఇంకోసారి భారత్‌కు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. కచ్చితంగా తిరిగి వచ్చే ఆలోచనైతే నాకుంది’ అని మెస్సీ అన్నాడు. తను సందర్శించిన ప్రాంతాల్ని, కలుసుకున్న భారత దిగ్గజాలతో ఉన్న ఒక నిమిషం నిడివిగల వీడియోను మెస్సీ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పంచుకున్నాడు. ఈ వీడియోలో భారత ప్రముఖ క్రీడాకారులు, సినీ స్టార్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులెందరో ఉన్నారు. కానీ... హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాం«దీలతో ఉన్న ఫుటేజీ మాత్రం క్షణమైనా కనిపించలేదు. భారత్‌లో తన ఐదు రోజుల పర్యటన అద్భుతంగా సాగిందన్నాడు. బుధవారం ముంబై నుంచే మయామికి బయలుదేరాడు. 38 ఏళ్ల అర్జెంటీనా స్ట్రయికర్‌ తన మయామి క్లబ్‌ జట్టు సహచరులు స్వారెజ్, రోడ్రిగో డి పాల్‌లతో కలిసి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చాడు. అయితే మరో రెండు రోజులు పొడిగించాడు. భారత్‌లోని వివిధ రంగాల ప్రముఖులను, క్రికెట్, ఫుట్‌బాల్, సినీ స్టార్లను కలుసుకున్నాడు. ముంబైలో సచిన్, మెస్సీల భేటీ వాంఖెడే మైదానానికే వన్నె తెచ్చింది. బాలీవుడ్‌ స్టార్లు షారుక్‌ ఖాన్, కరీనా కపూర్, భారత ఫుట్‌బాల్‌ మాజీ కెపె్టన్‌ సునీల్‌ ఛెత్రి తదితరులు మెస్సీని కలిసిన వారిలో ఉన్నారు. మంగళవారం దేశీ కార్పోరేట్‌ సంస్థ రిలయన్స్‌ యాజమాన్యం వంతారాలో అచ్చెరువొందే సదుపాయాలతో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షిత ప్రాంతాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ... మెస్సీకి ఆత్మీయ స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చాడు. ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ అడిడాస్‌ నిర్వహించిన ఫొటో షూట్‌లోనూ పాల్గొన్నాడు. ఈ ఫొటో షూట్‌లో మెస్సీతోపాటు తెలంగాణ స్టార్‌ బాక్సర్, ప్రపంచ మాజీ చాంపియన్‌ నిఖత్‌ జరీన్, క్రికెటర్లు కుల్దీప్‌ యాదవ్, రేణుక సింగ్, పారాథ్లెట్స్‌ నిశాద్‌ కుమార్, సుమింత్‌ అంటిల్‌ పాల్గొన్నారు.

Sachin congratulates the blind womens cricket team2
అంధుల మహిళల క్రికెట్‌ జట్టుకు సచిన్‌ అభినందన

ముంబై: అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టును క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభినందించాడు. తొలిసారి నిర్వహించిన ఈ మెగాటోర్నీలో భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకుంది. తాజాగా వరల్డ్‌కప్‌ నెగ్గిన భారత జట్టు... మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సచిన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు చూపిన ప్రతిభాపాటవాలను మాస్టర్‌ బ్లాస్టర్‌ కొనియాడాడని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ‘కఠోర శ్రమ, అకుంఠిత దీక్షతోనే మన జట్టు ప్రపంచకప్‌ గెలిచింది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు కూడా ఇదే నిలకడ కొనసాగిస్తూ... మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం అందరి బాధ్యతను మరింత పెంచింది. ప్రపంచ కప్‌ ట్రోఫీ ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది’ అని సచిన్‌ పేర్కొన్నాడని నిర్వాహకులు తెలిపారు.వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టు కెపె్టన్‌ దీపిక మాట్లాడుతూ... ‘సచిన్‌ మాటలు మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మేము మైదానంలోకి దిగిన ప్రతిసారీ ఎంతో అంకితభావం, ఆత్మవిశ్వాసంతో ఆడాం. దానికి తగ్గ ప్రతిఫలం వరల్డ్‌ కప్‌ రూపంలో దక్కింది. సచిన్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినడంతో మా మనసు ఉప్పొంగుతోంది’ అని దీపిక పేర్కొంది.

Australia is on course for a huge score in the third Test with england 3
కేరీ సూపర్‌ సెంచరీ

అడిలైడ్‌: వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్‌) చక్కటి సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక ‘యాషెస్‌ సిరీస్‌’ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆ్రస్టేలియా... సిరీస్‌ చేజిక్కించుకునే దిశగా కీలక పోరులోనూ మంచి ప్రదర్శన చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా... బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అలెక్స్‌ కేరీ ‘శత’క్కొట్టగా... ఉస్మాన్‌ ఖ్వాజా (126 బంతుల్లో 82; 10 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. గాయం కారణంగా గత రెండు టెస్టులకు దూరమైన ఆ్రస్టేలియా రెగ్యులర్‌ కెపె్టన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ మ్యాచ్‌ బరిలోకి దిగగా... టాస్‌ వేయడానికి 45 నిమిషాల ముందు స్టీవ్‌ స్మిత్‌ అనూహ్యంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) వెల్లడించింది. ఐపీఎల్‌–2026 మినీ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న పేస్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్‌ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. కేరీ కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారీ జన సందోహం మధ్య తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో జేక్‌ వెదరాల్డ్‌ (18)ను ఆర్చర్‌ అవుట్‌ చేయగా... మరుసటి ఓవర్‌లో ట్రావిస్‌ హెడ్‌ (10) కూడా వెనుదిరిగాడు. తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన హెడ్‌ను కార్స్‌ బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో లబుషేన్‌ (19)తో కలిసి ఉస్మాన్‌ ఖ్వాజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. స్మిత్‌ గైర్హాజరీతో చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న ఖ్వాజా చక్కటి షాట్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే లంచ్‌ అనంతరం ఆర్చర్‌ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి మరోసారి ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అతడి ధాటికి లబుషేన్, హెడ్‌ పెవిలియన్‌ బాటపట్టారు. దీంతో ఆసీస్‌ 94/4తో నిలిచింది. ఈ దశలో అడిలైడ్‌ ‘లోకల్‌ బాయ్‌’ కేరీ గొప్ప సంయమనం కనబర్చాడు. మరో ఎండ్‌లో ఖ్వాజా కూడా పట్టువదలకుండా ప్రయతి్నంచాడు. ఈ జంట ఐదో వికెట్‌కు 91 పరుగులు జత చేసింది. తొలి రోజు ఆటకు రికార్డు స్థాయిలో 56,298 మంది అభిమానులు హాజరయ్యారు. అడిలైడ్‌ మైదానంలో ఇదే అత్యధికం. ‘ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు టెస్టు మ్యాచ్‌ చూసేందుకు తరలి రావడం అద్భుతంగా ఉంది. సొంత మైదానంలో 56 వేల పైచిలుకు జనం ముందు సెంచరీ చేయడం ఎంతో ప్రత్యేకం’ అని కేరీ అన్నాడు. జోష్‌ ఇన్‌గ్లిస్‌తో ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించిన కేరీ... ఎనిమిదో వికెట్‌కు మిచెల్‌ స్టార్క్‌ (63 బంతుల్లో 33 బ్యాటింగ్‌; 4 ఫోర్లు)తో కలిసి 50 పరుగులు జోడించాడు. 135 బంతుల్లో ‘యాషెస్‌ సిరీస్‌’ల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న కేరీ... కాసేపటికే పెవిలియన్‌ చేరాడు. స్టార్క్‌తో పాటు లయన్‌ (18 బంతుల్లో 0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు అడిలైడ్‌లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా... నేడు మరింత ఎండ తీవ్రత ఉండనుంది. సిడ్నీ బాండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బన్‌లతో బరిలోకి దిగారు.

Satwik and Chirag pair won their first match4
మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకొని...

హాంగ్జౌ: బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ప్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. బుధవారం మొదలైన ఈ టోర్నీలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–8లో ఉన్న వాళ్లుమాత్రమే పాల్గొనేందుకు అర్హులు. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో మ్యాచ్‌లను లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. భారత్‌ నుంచి పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం మాత్రమే ఈ టోర్నీకి అర్హత సాధించింది. గ్రూప్‌ ‘బి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంక్‌ జంట సాత్విక్‌–చిరాగ్‌ 12–21, 22–20, 21–14తో ప్రపంచ ఐదో ర్యాంక్‌ జోడీ లియాంగ్‌ వె కెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా)పై విజయం సాధించింది. గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన లియాంగ్‌–వాంగ్‌ చాంగ్‌ ద్వయం ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గింది. అయితే రెండో గేమ్‌లో భారత జోడీ పుంజుకుంది. 18–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో చైనా జంట అనూహ్యంగా విజృంభించి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 19–18తో ఆధిక్యంలోకి వచ్చిం ది. ఆ తర్వాత 20–19తో విజయానికి పాయింట్‌ దూరంలో నిలిచింది. మరో పాయింట్‌ కోల్పోతే ఓడిపోయే స్థితిలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను 22–20తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 7–9తో వెనుకబడిన సాత్విక్‌–చిరాగ్‌ జంట తమ లోపాలను వెంటనే సరిచేసుకొని వరుసగా ఐదు పాయింట్లు సాధించి 12–9తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత జోడీ విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఫజర్‌ అల్ఫియాన్‌–షోహిబుల్‌ ఫిక్రి (ఇండోనేసియా) జంటతో ల్ఫిసాత్విక్‌–చిరాగ్‌ ద్వయం తలపడుతుంది.

The fourth T20 match between India and South Africa has been cancelled5
మ్యాచ్‌కు ‘పొగ’బెట్టిన ‘మంచు’

వర్షం కారణంగా... మైదానం చిత్తడిగా ఉండటం మూలంగా... ప్రమాదకర పిచ్‌లు రూపొందించినందుకు... తమ జట్ల పేలవ ప్రదర్శనకు నిరసనగా అభిమానుల ఆగ్రహాంతో... అంతర్జాతీయ క్రికెట్‌లో అర్ధంతరంగా మ్యాచ్‌లు రద్దయిన సంఘటనలు చూశాం. కానీ బుధవారం భారత్‌–దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన టి20 మ్యాచ్‌కు పైవేవీ ఆటంకం కలిగించలేదు. ఊహించని విధంగా మితిమీరిన పొగమంచు అడ్డంకిలా మారింది. దాంతో కనీసం టాస్‌ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా దక్షిణాఫ్రికాపై టి20 సిరీస్‌ నెగ్గాలంటే రేపు అహ్మదాబాద్‌లో జరిగే చివరి మ్యాచ్‌లో భారత్‌ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్నో: ఇక ఈ టి20 సిరీస్‌ భారత్‌ గెలవొచ్చు. లేదంటే పర్యాటక దక్షిణాఫ్రికాతో పంచుకోవచ్చు. ఎందుకంటే ఆఖరి పోరులో గెలిస్తే సిరీస్‌ 3–1తో టీమిండియా వశమవుతుంది. కానీ ఓడితే 2–2తో సమమవుతుంది. మొత్తానికి పొగమంచు సిరీస్‌ ఫలితాన్ని సైతం అటుఇటూ కాకుండా చేసేసింది. బుధవారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడి ఎకానా స్టేడియంలో జరగాల్సిన నాలుగో టి20 మ్యాచ్‌ రద్దయ్యింది. పొగమంచు, ప్రతికూల వాతావరణం మ్యాచ్‌కు అవరోధంగా నిలిచింది. మొదట టాస్‌ ఆలస్యం అని టీవీల్లో బోర్డు కనిపించింది. సమయం గడుస్తున్నకొద్దీ ఫీల్డ్‌ అంపైర్లు అనంత పద్మనాభన్, రోహన్‌ పండిట్‌లు మ్యాచ్‌ నిర్వహణ కోసం మైదానాన్ని, మంచు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. కనీసం 6 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ నిర్వహించాలని వేచి చూశారు. చివరకు రాత్రి 9 గంటల 25 నిమిషాలకు ఆరోసారి మైదానాన్ని సమీక్షించి మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యపడదని ప్రకటించారు. మంచు దుప్పటి కప్పేసింది! భారత్‌లో శీతాకాలం సీజన్‌ ఇది. పైగా డిసెంబర్‌ మధ్య నుంచి జనవరి అసాంతం చలి పులిలా పంజా విసురుతుంది. ఇక ఉత్తర భారతమైతే సూర్యుడు ఉదయించాక కూడా వణుకు తప్పదు. ఉదయం, రాత్రి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. పొగమంచు కమ్ముతుంది. కంటికేది కనిపించదు. బుధవారం రాత్రి కూడా సరిగ్గా ఇదే జరిగింది. గరం గరం చేసే హైమాస్ట్‌ ఫ్లడ్‌లైట్లు అన్నీ వెలిగించినా కూడా మంచుదుప్పటి ముందు ఆ వెలుగు కూడా దిగదుడుపే అయ్యింది. పొగమంచు మ్యాచ్‌ జరగకుండా మైదానాన్ని కప్పేయడంతో ఫీల్డు అంపైర్లు పలుమార్లు సమీక్షించి మ్యాచ్‌ రద్దుకు నిర్ణయించారు. చివరిసారిగా రాత్రి 9.25 గంటలకు మైదానంలోని పరిస్థితిని సమీక్షించాక ఇక మ్యాచ్‌ జరిగే అవకాశం లేదని ఫీల్డ్‌ అంపైర్లు తేల్చారు. ఇంతటి చలిని లెక్కచేయకుండా, మంచు కురిసే వేళలో మ్యాచ్‌ కోసం నిరీక్షిస్తున్న ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్న అంపైర్లు అనంత పద్మనాభన్, రోహన్‌లు ఆలస్యం చేయకుండా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు జెండాలు, అభిమాన క్రికెటర్ల ఫొటోలు, 4, 6 బోర్డులను ఊపుతూ ఉత్సాహంగా కనిపించిన ప్రేక్షకులు నిరాశగా వెనుదిరగడం మొదలు పెట్టారు. గిల్‌ అవుట్‌ భారత టెస్టు, వన్డేల కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కూడా ప్రస్తుత సిరీస్‌కు దూరమయ్యాడు. అసలే ఈ ఓపెనర్‌ ఫామ్‌లేమీతో తంటాలు పడుతున్నాడు. ట్రెయినింగ్‌ సెషన్‌లో అతని బొటనవేలికి గాయమైంది. దీంతో ఈ నాలుగో టి20తో పాటు రేపు అహ్మదాబాద్‌లో జరిగే ఆఖరి మ్యాచ్‌కూ అందుబాటులో లేకుండా పోయాడు. ఇతని స్థానంలో సంజూ సామ్సన్‌ బరిలోకి దిగుతాడు. ఇప్పటికే పేస్‌ ఎక్స్‌ప్రెస్‌ బుమ్రా, స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ సైతం ఈ సిరీస్‌కు దూరమమైన సంగతి తెలిసిందే. టిక్కెట్ల డబ్బులు తిరిగి చెల్లింపు మ్యాచ్‌ మొదలవకుండానే రద్దయ్యింది. కనీసం టాస్‌కు కూడా నోచుకోలేదు. దీంతో నిబంధనల ప్రకారం టిక్కెట్లకు ప్రేక్షకులు వెచ్చించిన రుసుమును తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తామని స్టేడియం వర్గాలు వెల్లడించాయి.

IND vs SA 4th T20I: Not Rain Match Called off Due To This Reason6
ఎట్టకేలకు!.. టాస్‌ పడకుండానే మ్యాచ్‌ రద్దు

టీమిండియా- సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌ విజేత తదుపరి మ్యాచ్‌లో తేలనుంది. లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 టాస్‌ పడకుండానే రద్దై పోయింది. అయితే, ఎప్పటిలా వర్షం వల్ల కాకుండా.. ఈసారి పొగమంచు కారణంగా మ్యాచ్‌ మొదలుకాకుండానే ముగిసిపోయింది.స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో వరుస విరామాల్లో మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం 6.30 నిమిషాలకు టాస్‌ పడాల్సి ఉండగా.. ఈ కారణం వల్లే తొలుత ఆలస్యమైంది. ఈ క్రమంలో వరుస విరామాల్లో అంపైర్లు వచ్చి సమీక్ష నిర్వహించారు. మైదానమంతా కలియదిరుగుతూ బ్యాటర్‌, బౌలర్‌, ఫీల్డర్ల స్థానాల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అని పరిశీలించారు.పదే.. పదేఇందులో భాగంగా 6.50 నిమిషాలకు ఓసారి.. 7.30 నిమిషాలకు మరోసారి.. ఆపై.. 8 గంటలకు.. అనంతరం 8.30 నిమిషాలకు.. మైదానంలోకి వచ్చిన అంపైర్లు పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో పిచ్‌పై కవర్లు కప్పి ఉంచాలని సూచించారు. ఈసారి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లాతోనూ వారు మాట్లాడటం గమనార్హం.అనంతరం 9 గంటలకు మరోసారి రివ్యూ చేసిన అంపైర్లు.. ప్రేక్షకుల సహనానికి మరోసారి పరీక్ష పెట్టారు. ఈసారి 9.25 నిమిషాలకు మరోసారి రివ్యూ చేస్తామని చెప్పి మైదానం వీడారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టేడియంలోని ప్రేక్షకులు కంగుతిన్నారు. మ్యాచ్‌ సాగుతుందా? లేదా? అన్న అంశంపై త్వరగా తేల్చకుండా ఇదేం తీరు అనేలా రియాక్షన్స్‌ ఇచ్చారు.మరోవైపు.. లక్నోలో పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ సాగదని తెలిసినా ఎందుకు సాగదీస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక కామెంటేటర్లు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎట్టకేలకుఈ క్రమంలో... 9.25 నిమిషాలకు మరోసారి మైదానంలోకి వచ్చి పరిస్థితి పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ‍తొలుత కటక్‌లో భారత్‌ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో సిరీస్‌ 1-1తో సమం కాగా.. ధర్మశాల వేదికగా మూడో టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది.. 2-1తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య బుధవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ టాస్‌ పడకుండానే ఇలా ముగిసిపోయింది. ఇక సిరీస్‌ విజేతను తేల్చే శుక్రవారం నాటి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: నాలుగో టీ20 నుంచి గిల్‌ అవుట్‌!

Sarfaraz Khan Reacts After Years Of IPL Snub Ends At 2026 Auction7
మరోసారి ఐపీఎల్‌లో.. సర్ఫరాజ్‌ స్పందన ఇదే

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్‌ ఆడిన ఈ ముంబైకర్‌.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ క్యాష్‌ రిచ్‌లో పునరాగమనం చేయనున్నాడు.ఐదుసార్లు చాంపియన్‌ జట్టు అయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. సర్ఫరాజ్‌ ఖాన్‌ను కొనుక్కుంది. అబుదాబి వేదికగా మంగళవారం నాటి మినీ వేలంలో కనీస ధర రూ. 75 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.సర్ఫరాజ్‌ స్పందన ఇదేసోషల్‌ మీడియా వేదికగా తన భావాలను పంచుకుంటూ.. ‘‘కొత్త జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎస్‌కే’’ అంటూ సర్ఫరాజ్‌ ఖాన్ చెన్నై యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో నాని ‘జెర్సీ’ సినిమాలోని ఎమోషనల్‌ సీన్‌కు సంబంధించిన దృశ్యాలను జతచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వేలంలో తిరిగి అమ్ముడుపోవడంపై స్పందించిన తీరు వైరల్‌గా మారింది.కాగా దేశవాళీ క్రికెట్‌లో రన్‌ మెషీన్‌గా గుర్తింపు పొందినా కూడా భారత టెస్టు జట్టుకు కూడా దూరమయ్యాడు సర్ఫరాజ్‌ ఖాన్‌. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అతడు భాగమయ్యాడు. ఇక ఇప్పటికి.. సర్ఫరాజ్‌ 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 203.08 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఐపీఎల్‌ వేలంలో ముందుగా రూ.75 లక్షల కనీస ధరకు అతడిని ఎవరూ తీసుకోలేదు. మళ్లీ అతడి పేరు వచ్చినప్పుడు ఇదే మొత్తానికి చెన్నై ఎంచుకుంది. కాగా సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో యాభై మ్యాచ్‌లు ఆడి.. 585 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. మరోవైపు.. సర్ఫరాజ్‌ మిత్రుడు పృథ్వీ షాను కూడా ఢిల్లీ తీసుకోవడం విశేషం. అతడిని ఢిల్లీ కనీస ధర రూ. 75 లక్షలకే కొనుక్కుంది.అమ్ముడుపోని స్టార్లు వీరేఐపీఎల్‌లో గతంలో ఆడిన లేదా అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు ఉన్న పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ విదేశీ క్రికెటర్లలో డెవాన్‌ కాన్వే, జేక్‌ ఫ్రేజర్, గస్‌ అట్కిన్సన్, జేమీ స్మిత్, గెరాల్డ్‌ కొయెట్జీ, ముజీబుర్‌ రహమాన్, మహీశ్‌ తీక్షణ, స్టీవ్‌ స్మిత్, డారిల్‌ మిచెల్, షాయీ హోప్... టామ్‌ కరన్, అల్జారీ జోసెఫ్, నవీన్‌ ఉల్‌ హక్, రహ్మనుల్లా గుర్బాజ్, వియాన్‌ ముల్డర్, జానీ బెయిర్‌స్టో, ఫజల్‌హఖ్‌ తదితరులు ఉన్నారు. భారత క్రికెటర్లలో ఉమేశ్‌ యాదవ్, దీపక్‌ హుడా, మయాంక్‌ అగర్వాల్, కరణ్‌ శర్మ, మనన్‌ వోహ్రాను ఎవరూ పట్టించుకోలేదు. Sarfaraz Khan’s emotional Instagram story after being sold for ₹75 lakh to Chennai Super Kings in the auction for IPL 2026.🥹❤️This shows that if you work hard, you will definitely get the reward for it. God never disappoints those who work hard. pic.twitter.com/X3Z81AmB0g— Mention Cricket (@MentionCricket) December 16, 2025

Shubman Gill Ruled Out Of Lucknow IND vs SA T20I: Report8
నాలుగో టీ20 నుంచి గిల్‌ అవుట్‌!

భారత్‌- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు పొగమంచు అంతరాయం కలిగించింది. ఫలితంగా ఇరుజట్ల మధ్య నాలుగో టీ20కి టాస్‌ ఆలస్యంగా పడనుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ దూరమైనట్లు సమాచారం.పేలవ ప్రదర్శనకాగా ఆసియా టీ20 కప్‌-2025 టోర్నమెంట్‌ సందర్భంగా భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన గిల్‌.. నాటి నుంచి ఓపెనర్‌గా పేలవ ప్రదర్శనలతో తేలిపోతున్నాడు. అంతకు ముందు కూడా అంత గొప్పగా ఏమీ ఆడలేదు. గత ఇరవై ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్‌ (4(2), 0(1)).. చివరగా ధర్మశాలలో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌గా వచ్చి 28 బంతుల్లో 28 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కాగా గిల్‌ కోసం.... విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా కొనసాగుతున్న అభిషేక్‌ శర్మ- సంజూ శాంసన్‌లను యాజమాన్యం విడదీసింది.సంజూను పక్కనపెట్టేసి మరీ..అభిషేక్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తూ అతడికి గిల్‌ను జతచేసి.. సంజూను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో గిల్‌ వరుస వైఫల్యాలు, అయినా అతడినే కొనసాగిస్తున్న మేనేజ్‌మెంట్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నాలుగో టీ20కి మాత్రం గిల్‌ దూరమైనట్లు క్రిక్‌బజ్‌ వెల్లడించింది. అయితే, పాదానికి గాయమైన కారణంగానే అతడు తప్పుకొన్నట్లు పేర్కొంది.కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ గిల్‌.. రెండో టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్‌కూ దూరమయ్యాడు. టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతడు మరోసారి గాయపడటం గమనార్హం. ఇక టీమిండియా టెస్టు, వన్డేలకు గిల్‌ కెప్టెన్‌ కాగా.. టీ20లలో సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: నంబర్‌ 1: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

IND vs SA 4th T20I Lucknow: Toss Update Playing XIs Highlights9
IND vs SA: టాస్‌ పడలేదు.. మ్యాచ్‌ రద్దు

టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్‌ పడకుండానే మ్యాచ్‌ ముగిసిపోయింది. లక్నోలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం.. సాయంత్రం 6.30 నిమిషాలకు టాస్‌ వేయాల్సి ఉండగా పొగమంచు కమ్ముకుంది. దీంతో 6.50 నిమిషాలకు మరోసారి పరిస్థితిని సమీక్షించగా ఎలాంటి మార్పూ లేదు. దీంతో 7.30 నిమిషాలకు మరోసారి రివ్యూ చేయగా.. అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. రాత్రి 8 గంటలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా అంపైర్లు మ్యాచ్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.వీడిన సస్పెన్స్‌ఈసారి అంపైర్లు మైదానం కలియదిరుగుతూ పొగమంచు ప్రభావం ఎలా ఉందో గమనించారు. బ్యాటర్‌, బౌలర్‌, ఫీల్డర్ల పొజిషన్ల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అ‍న్న విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో చర్చల అనంతరం 8.30 నిమిషాలకు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పుడూ అంపైర్లు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో 9 గంటలకు మరోసారి రివ్యూ జరుగగా.. ఈసారీ స్పష్టత రాలేదు. 9.25 నిమిషాలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించిన అంపైర్లు మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించారు.రీప్లేస్‌మెంట్‌గా షాబాజ్‌ అహ్మద్‌కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ టీమిండియాకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు టీ20ల నుంచి అతడు తప్పుకోగా.. బీసీసీఐ షాబాజ్‌ అహ్మద్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది. అదే విధంగా వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి వచ్చాడు. నాలుగో టీ20లో అతడు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.ఇదిలా ఉంటే.. ఐదు టీ20 సిరీస్‌ల భాగంగా కటక్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా 51 పరుగులతో గెలిచింది. తద్వారా 1-1తో సిరీస్‌ స​మం చేసింది. అయితే, ధర్మశాలలో మరోసారి జయభేరి మోగించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉంది. అంతకు ముందు టెస్టుల్లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్‌వాష్‌ చేయగా.. వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1తో గెలుచుకుంది.చదవండి: నంబర్‌ 1: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

Varun Chakravarthy breaks Bumrah Record New high in T20I rankings10
నంబర్‌ 1: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ రేటింగ్‌ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) పేరిట ఉన్న రికార్డును వరుణ్‌ చక్రవర్తి బద్దలు కొట్టాడు.అత్యుత్తమంగా 32 వికెట్లుకాగా 2021 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పేలవ ప్రదర్శన తర్వాత వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) టీమిండియాకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి రీఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌.. అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికి 19 టీ20 మ్యాచ్‌లలో కలిపి వరుణ్‌ చక్రవర్తి అత్యుత్తమంగా 32 వికెట్లు కూల్చాడు.సౌతాఫ్రికాతో స్వదేశంలో తాజా టీ20 సిరీస్‌లోనూ వరుణ్‌ చక్రవర్తి అదరగొడుతున్నాడు. ఇప్పటికి సఫారీలతో జరిగిన మూడు మ్యాచ్‌లలో రెండేసి వికెట్ల చొప్పున ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 6.75 ఎకానమీతో వికెట్లు తీసిన వరుణ్‌.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపాడు.818 రేటింగ్‌ పాయింట్లుటీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న వరుణ్‌ చక్రవర్తి.. రేటింగ్‌ను భారీగా మెరుగుపరచుకున్నాడు. కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఏకంగా 818 రేటింగ్‌ పాయింట్లు సాధించి.. రెండో ర్యాంకర్‌ జేకబ్‌ డఫీ (699 పాయింట్లు)కి అందనంత దూరంలో నిలిచాడు.అదే విధంగా.. అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ రేటింగ్‌ సాధించిన భారత బౌలర్‌గానూ వరుణ్‌ చక్రవర్తి నిలిచాడు. అంతకుముందు.. 2017లో బుమ్రా కెరీర్‌ బెస్ట్‌ 783 రేటింగ్‌ పాయింట్లతో ఈ ఘనత సాధించగా.. వరుణ్‌ ఇప్పుడు దానిని అధిగమించాడు.అంతేకాదు.. అత్యుత్తమ టీ20 రేటింగ్‌ పాయింట్లు కలిగి ఉన్న టాప్‌-10 ఓవరాల్‌ బౌలర్ల జాబితాలోనూ చోటు సంపాదించాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వరుణ్‌ తొలిసారి టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ టాప్‌ ర్యాంకు నిలబెట్టుకోగా.. తిలక్‌ వర్మ రెండు స్థానాలు ఎగబాకి.. నాలుగో ర్యాంకులో నిలిచాడు.పురుషుల అంతర్జాతీయ టీ20లలో బెస్ట్‌ బౌలర్‌ రేటింగ్స్‌👉ఉమర్ గుల్ (పాకిస్తాన్)- 865👉శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్-) 864👉డేనియల్ వెటోరి (న్యూజిలాండ్)- 858👉సునీల్ నరైన్ (వెస్టిండీస్)- 832👉రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్)- 828👉తబ్రేజ్‌ షంసీ (దక్షిణాఫ్రికా)- 827👉షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 822👉వరుణ్ చక్రవర్తి (ఇండియా)- 818👉షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)- 811👉వనిందు హసరంగా (శ్రీలంక)- 809.చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement