ప్రధాన వార్తలు
నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా
న్యూజిలాండ్ పర్యటనను వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో ఆతిథ్య కివీస్పై విండీస్ ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం (West Indies Beat New Zealand) సాధించింది. తద్వారా ఐదు టీ20ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.కాగా ఐదు టీ20 మ్యాచ్లు, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం ఆక్లాండ్లో ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరిగింది. ఈడెన్ పార్క్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. విండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులుదీంతో బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (3), అలిక్ అథనాజ్ (16) విఫలమైనా.. వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న హోప్ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో రోస్టన్ చేజ్ (28), రోవ్మన్ పావెల్ (23 బంతుల్లో 33) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కివీస్ బౌలర్లలో జేకబ్ డఫీ, జకారీ ఫౌల్క్స్ రెండేసి వికెట్లు తీయగా.. కైలీ జెమీషన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు.ఇక విండీస్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్ (27), డెవాన్ కాన్వే (13) ప్రభావం చూపలేకపోయారు. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (21) నిరాశపరచగా.. మార్క్ చాప్మన్ (7), డారిల్ మిచెల్ (13), మైకేల్ బ్రాస్వెల్ (1), జేమ్స్ నీషమ్ (11) పూర్తిగా విఫలమయ్యారు.సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథాఇలాంటి దశలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్లు బాది.. 55 పరుగులు సాధించిన సాంట్నర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, మిగిలిన వారి నుంచి సహకారం అందకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన కివీస్.. 157 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా విండీస్ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య గురువారం (నవంబరు 6) ఇదే వేదికపై రెండో టీ20 నిర్వహణకై ముహూర్తం ఖరారైంది.చదవండి: అందుకే అర్ష్దీప్ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్
అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండి: టీమిండియా దిగ్గజం
విశ్వ విజేతగా అవతరించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ట్రోఫీని ముద్దాడిన హర్మన్ సేన విజయాన్ని భారతావని ఉత్సవంగా జరుపుకొంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ (ICC Women's World Cup) టోర్నమెంట్లో.. 2005, 2017లో రన్నరప్తోనే సరిపెట్టుకున్న భారత్.. ఈసారి మాత్రం ఆఖరి గండాన్ని అధిగమించింది.గావస్కర్ వ్యాఖ్యలు వైరల్నవీ ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా (Ind Beat SA)ను 52 పరుగుల తేడాతో ఓడించి.. జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే.. టీమిండియా దిగ్గజం, 1983 వరల్డ్కప్ విజేత సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండాస్పోర్ట్స్స్టార్కి రాసిన కాలమ్లో.. ‘‘కొంతమంది భారత పురుషుల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్కప్- 1983 విజయాన్ని.. తాజాగా అమ్మాయిలు చాంపియన్గా నిలవడంతో పోలుస్తున్నారు. అయితే, 1983 ఎడిషన్ కంటే ముందు మెన్స్ టీమ్ ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేదు.నాకౌట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు అప్పుడు అస్సలు తెలియవు. అలాంటిది మేము తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండా విజేతలుగా నిలిచాము.అందుకే అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండిఅయితే మన మహిళా జట్టు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడింది. తర్వాత ఇలా అద్భుతమైన విజయంతో విజేతగా నిలిచింది’’ అని గావస్కర్.. తమ విజయాన్ని అమ్మాయిలతో పోల్చవద్దని స్పష్టం చేశాడు.అదే విధంగా.. ‘‘83లో టీమిండియా సాధించిన విజయం భారత క్రికెట్ రూపురేఖలు మార్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రికెట్ వైపు నడిపించేలా చేసింది. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత క్రికెట్ మరో స్థాయికి చేరుకుంది.ఇప్పుడు భారత జట్టులో కేవలం మెట్రో నగరాల నుంచి వచ్చినవారే కాకుండా.. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు. కాగా నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.సమిష్టి కృషితోఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలి వర్మ (87) గట్టి పునాది వేయగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (58), వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (34) ఇన్నింగ్స్ నిర్మించారు. జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20) స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. అయితే, మంధాన, షఫాలి దీప్తి, రిచా రాణించడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. షఫాలి వర్మ రెండు, నల్లపురెడ్డి శ్రీ చరణి ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సఫారీ జట్టులో ఓపెనర్, కెప్టెన్ లారా వొల్వర్ట్ (101) శతకంతో పోరాడగా.. మిగతా వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (23), సూనే లూస్ (25) అనిరె డెర్క్సెన (35) ఓ మోస్తరుగా రాణించారు. అయితే, భారత బౌలర్ల విజృంభణ ముందు నిలవలేకపోయిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో కేవలం 246 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 52 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సరికొత్త చాంపియన్గా అవతరించింది.చదవండి: అందుకే అర్ష్దీప్ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా డీకే.. పూర్తి వివరాలు
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్కు భారత్ తమ జట్టును ప్రకటించింది. హాంకాంగ్లో నవంబరు 6 నుంచి 9 వరకు మోంగ్ కాక్ వేదికగా జరిగే ఈ పొట్టి టోర్నీలో భారత్కు.. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సారథ్యం వహించనున్నాడు.డీకేతో పాటు రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్లు హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్లో పాల్గొననున్నారు. అదే విధంగా.. దేశీ వెటరన్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) కూడా ఈ టోర్నీలో భాగం కానున్నాడు.ఆరు ఓవర్ల పాటు ఆట కాగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో.. ఒక్కో టీమ్లో ఆరుగురు సభ్యులు (మాజీ క్రికెటర్లు) ఉంటారు. ఆరు ఓవర్ల పాటు ఆట సాగుతుంది. ఇక ఈ షార్టెస్ట్ క్రికెట్ ఈవెంట్లో 2005లో టైటిల్ గెలిచిన భారత్.. రెండుసార్లు రన్నరప్తో సరిపెట్టుకుంది.అయితే, గతేడాది రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలో కనీసం ఫైనల్ కూడా చేరలేదు టీమిండియా. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త సారథిగా డీకే రావడం విశేషం. కాగా తాజా ఎడిషన్లో పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.పన్నెండు జట్లు ఇవేభారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, నేపాల్, ఇంగ్లండ్, యూఏఈ, కువైట్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ (చైనా) ఈసారి టోర్నీలో భాగం కానున్నాయి. పూల్- ‘ఎ’ నుంచి సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్, నేపాల్.. పూల్- ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ యూఏఈ.. పూల్- ‘సి’ నుంచి ఇండియా, పాకిస్తాన్, కువైట్... పూల్- ‘డి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ పోటీపడతాయి.హాంకాంగ్ సిక్సెస్-2025లో పాల్గొనే జట్ల వివరాలుభారత్దినేశ్ కార్తిక్ (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్.ఆస్ట్రేలియాఅలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హోబ్సన్, క్రిస్ గ్రీన్, విల్ బొసిస్టొ, ఆండ్యూ టై.ఇంగ్లండ్జో డెన్లీ (కెప్టెన్), జేమ్స్ కోల్స్, ఈథన్ బ్రూక్స్, టోబీ అల్బర్ట్, జార్జ్ హిల్ డాన్ మౌస్లే, టామ అస్పిన్వాల్.బంగ్లాదేశ్అక్బర్ అలీ (కెప్టెన్) అబు హైదర్ రోని, జిషాన్ ఆలం, మొహమ్మధ్ సైఫుద్దీన్, మొసాడెక్ హొసేన్, రకీబుల్ హసన్, టొఫేల్ అహ్మద్.యూఏఈకౌశిక్ హర్షిత్ (కెప్టెన్), ఖలీద్ షా, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ సాగిర్ ఖాన్, నిలాన్ష్ కేస్వాని, రెజిత్ కురుంగొడె, జాహిద్ అలీ.కువైట్యాసిన్ పటేల్ (కెప్టెన్), ఉస్మాన్ పటేల్, మీట్ భవ్సార్, బిలాల్ తాహిర్, రవిజ సాండరువాన్, అద్నాన్ ఇద్రీస్, మొహమద్ షఫీక్.నేపాల్శరద్ వేసావ్కర్ (కెప్టెన్), సందీప్ జోరా, లోకేశ్ బామ్, బాసిర్ అహ్మద్, ఆదిల్ ఆలం, రషీద్ ఖాన్, రూపేశ్ సింగ్.శ్రీలంకలాహిరు మధుషాంక (కెప్టెన్), ధనంజయ లక్షణ్, తనుక దబారే, నిమేశ్ విముక్తి, లాహిరు సమారకూన్, థారిందు రత్నాయక, సచిత జయతిలకె.సౌతాఫ్రికాజోర్డాన్ మోరిస్ (కెప్టెన్), అబ్దుల్లా బయోమి, ఈథన్ కన్నింగ్హామ్, బులెలొ దూబే, కషీఫ్ జోసెఫ్, బ్లేక్ సింప్సన్, జోరిచ్ వాన్ షాల్వేక్.హాంకాంగ్యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయత్, అన్షుమాన్ రథ్, ఐజాజ్ ఖాన్, నిజాకత్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్, నస్రుల్లా రాణా.అఫ్గనిస్తాన్గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), ఇక్రామ్ అలిఖిల్, కరీం జన్మత్, షరాఫుద్దీన్ ఆష్రఫ్, ఫర్మానుల్లా సఫీ, ఐజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, సెదీకుల్లా పచా.పాకిస్తాన్అబ్బాస్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఖవాజా మొహమద్ నఫాయ్, మాజ్ సదాకత్, మొహమద్ షాజాద్, సాద్ మసూద్ షాహిద్ అజీజ్.చదవండి: యాషెస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
అందుకే అర్ష్దీప్ను తప్పించాం: టీమిండియా కోచ్
ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20 మ్యాచ్లలో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)కు మొండిచేయే ఎదురైంది. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వందకు పైగా వికెట్లు తీసి.. భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న అర్ష్కు.. యాజమాన్యం తుదిజట్టులో చోటు ఇవ్వలేదు.అర్ష్దీప్ను కాదని.. హర్షిత్ రాణా (Harshit Rana)కు ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) హర్షిత్ కోసం అర్ష్ను బలిచేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. సత్తా చాటిన అర్ష్ఈ నేపథ్యంలో ఆసీస్ (IND vs AUS)తో జరిగిన మూడో టీ20లో ఎట్టకేలకు అర్ష్ను యాజమాన్యం ఆడించింది. వరుసగా రెండు మ్యాచ్లలోనూ బెంచ్కే పరిమితమైన ఈ లెఫ్టార్మ్ పేసర్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. 35 పరుగులు ఇచ్చిన అర్ష్దీప్.. ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లిస్ (11), మార్కస్ స్టొయినిస్ (64) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తొలి మ్యాచ్లలో అర్ష్దీప్ను బెంచ్కే పరిమితం చేయడంపై ప్రశ్న ఎదురైంది.అతడు వరల్డ్క్లాస్ బౌలర్.. అర్థం చేసుకున్నాడుఇందుకు బదులిస్తూ.. ‘‘అర్ష్దీప్ అనుభవజ్ఞుడైన బౌలర్. మేము వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని అతడు అర్థం చేసుకున్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలుసుకున్నాడు.అతడు వరల్డ్క్లాస్ బౌలర్. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీయగల నైపుణ్యం గల ఆటగాడు. అతడి విలువ మాకు తెలుసు. అయితే, ఈ పర్యటనలో మాకు వివిధ కాంబినేషన్లు అవసరం. దీని వల్ల కొంత మంది ఆటగాళ్లకు నిరాశ తప్పకపోవచ్చు.అయితే, సెలక్షన్ విషయం ఆటగాళ్ల చేతుల్లో ఉండదు. ఇందుకు గల కారణాలు మాత్రం వారు అర్థం చేసుకోగలరు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము ఆటగాళ్లను మరింత శ్రమించేలా చేస్తున్నాం. ఎప్పుడు జట్టులోకి వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా సంసిద్ధం చేస్తున్నాం.కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదుఒత్తిడిలోనూ రాణించేలా తీర్చిదిద్దుతున్నాం. మా ఆటగాళ్ల నైపుణ్యాలపై మాకు ఎటువంటి సందేహాలు లేవు. అయితే, కాంబినేషన్ల కోసం ప్రయత్నిస్తున్నపుడు కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదు’’ అని 41 ఏళ్ల మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి
రాణించిన హోప్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
ఐదు టీ20లు, మూడు టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (నవంబర్ 5) తొలి టీ20 జరుగుతుంది. అక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్కు దిగింది.రాణించిన హోప్విండీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్లో బ్రాండన్ కింగ్ (3), ఐదో ఓవర్లో అలిక్ అథనాజ్ (16), ఎనిమిదో ఓవర్లో అకీమ్ అగస్టీ (2) ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ షాయ్ హోప్ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (28), రోవ్మన్ పావెల్ (33) సాయంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు రొమారియో షెపర్డ్ బౌండరీలు బాదాడు.సత్తా చాటిన బౌలర్లుఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు సత్తా చాటారు. సాంట్నర్ మినహా అందరూ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్ తలో 2 వికెట్లు తీయగా.. జేమీసన్, నీషమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తుది జట్లు..వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీమ్ అగస్టీ, రోవ్మన్ పావెల్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొసేన్, జేడన్ సీల్స్న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీచదవండి: బంగ్లాదేశ్ కెప్టెన్గా దేశవాలీ స్టార్
బంగ్లాదేశ్ కెప్టెన్గా దేశవాలీ స్టార్
నవంబర్ 14 నుంచి 23 మధ్యలో ఖతార్ వేదికగా జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 (ACC Cup Rising Stars 2025) కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్-ఏ జట్టును (Bangladesh-A) ఇవాళ (నవంబర్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా దేశవాలీ స్టార్, వికెట్కీపర్, బ్యాటర్ అయిన అక్బర్ అలీ (Akbar Ali) ఎంపికయ్యాడు.అక్బర్ అలీకి దేశవాలీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 92 మ్యాచ్ల్లో 27.65 సగటున 1853 పరగులు చేశాడు. అతని తాజాగా ప్రదర్శనలు (40, 44, 28) కూడా పర్వాలేదనేలా ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలైన రాజ్షాహీ, ఖుల్నా టైగర్స్ తరఫున కూడా అక్బర్ అలీ సత్తా చాటాడు.ఈ జట్టు అక్బర్తో పాటు అనుభవజ్ఞులు, యువశక్తి కలయికగా ఉంది. అబూ హీదర్ రోని, రిపోన్ మొండల్ బంగ్లాదేశ్ సీనియర్ జట్టు తరఫున సత్తా చాటారు. రోని 2016, మొండల్ 2023లో సీనియర్ టీమ్లోకి అరంగేట్రం చేశారు. యార్కర్ స్పెషలిస్ట్ అయిన రోని 13 టీ20ల్లో 6 వికెట్లు తీయగా.. మొండల్ 23 టీ20ల్లో 31 వికెట్లు తీశాడు. ఈ జట్టులో దేశవాలీ స్టార్లు,యువ ఆటగాళ్లు జిషన్ అలం, మహిదుల్ ఇస్లాం, అరిఫుల్ ఇస్లాం వంటి వారికి చోటు దక్కింది.ఈ టోర్నీలో బంగ్లాదేశ్తో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంగ్కాంగ్ జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ, హాంగ్కాంగ్లతో కలిసి గ్రూప్-బిలో పోటీపడుతుండగా.. భారత్-ఏ, పాకిస్తాన్-ఏ, ఒమన్, యూఏఈ గ్రూప్-ఏ తలపడనున్నాయి.టోర్నీ తొలి మ్యాచ్లో పాకిస్తాన్, ఒమన్ తలపడనుండగా.. రెండో మ్యాచ్లో భారత్, యూఏఈ ఢీకొంటాయి. నవంబర్ 15న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ హాంగ్కాంగ్ను ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో ప్రతి జట్టు తమ గ్రూప్లోకి మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు (A1 vs B2, B1 vs A2) చేరతాయి. ఈ మ్యాచ్లు నవంబర్ 21న జరుగుతాయి. సెమీస్ విజేతలు నవంబర్ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.బంగ్లాదేశ్ ఏ జట్టు..అక్బర్ అలీ (కెప్టెన్), జిషాన్ అలం, హబీబుర్ రెహమాన్, జవాద్ అబ్రార్, అరిఫుల్ ఇస్లాం, యాసిర్ అలీ చౌదరి, మహిదుల్ ఇస్లాం భుయాన్, రకీబుల్ హసన్, ఎస్ఎం మెహెరోబ్ హుస్సేన్, అబూ హిడర్ రోనీ, తుఫాయెల్ అహ్మద్, షాధిన్ ఇస్లాం, రిపోన్ మొండోల్, అబ్దుల్ గఫార్ సక్లైన్, మృత్తుంజయ్ చౌదరిచదవండి: ప్రపంచ క్రికెట్ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి
త్వరలో మరో క్రికెట్ లీగ్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 వేదికల్లో 600 జట్లతో తెలుగు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ టోర్నీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ లీగ్కు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. టీపీఎల్ నిర్వాహకులైన జూపర్ ఎల్ఈడీ సంస్థ ప్రతినిధులు మంగళవారం మంత్రిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి లీగ్ విశేషాలను వివరించారు. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారులుగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని శ్రీహరి అన్నారు. క్రికెట్తో పాటు ఏదో ఒక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. ‘సే నో టూ’ డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం లీగ్ నిర్వాహక సంస్థ జూపర్ ఎల్ఈడీ డైరెక్టర్ ఒ.రమేశ్ మాట్లాడుతూ తమ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ లీగ్ను కేవలం వినోదం కోసం నిర్వహించకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్నెస్, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్మనీ రూ. 80 లక్షలు అని ఆయన చెప్పారు. చదవండి: ప్రపంచ క్రికెట్ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి
హైదరాబాద్, ఆంధ్ర బోణీ విజయాలు
నాదౌన్: రంజీ ట్రోఫీ తాజా సీజన్లో హైదరాబాద్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో మంగళవారం ముగిసిన గ్రూప్ ‘డి’ మూడో లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 344 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 8/0తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు... 75.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 347 పరుగులు సాధించింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (200 బంతుల్లో 175 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్స్లు) వీరోచిత సెంచరీ సాధించి హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చాడు. వన్డౌన్ బ్యాటర్ రాహుల్ రాధేశ్ (127 బంతుల్లో 66; 8 ఫోర్లు)తో కలిసి అభిరథ్ రెడ్డి రెండో వికెట్కు 145 పరుగులు జోడించాడు. రాధేశ్ అవుటయ్యాక కెప్టెన్ రాహుల్ సింగ్ (24; 2 ఫోర్లు), హిమతేజ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), తనయ్ త్యాగరాజన్ (25 బంతుల్లో 29; 2 ఫోర్లు) సహకారంతో అభిరథ్ హైదరాబాద్ను లక్ష్యం దిశగా నడిపించాడు. మూడో వికెట్కు రాహుల్ సింగ్తో 74 పరుగులు జోడించిన అభిరథ్æ.... నాలుగో వికెట్కు హిమతేజతో 53 పరుగులు... ఐదో వికెట్కు తనయ్తో 47 పరుగులు జత చేశాడు. హిమాచల్ జట్టు బౌలర్లలో ఆర్యమాన్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. తొలి రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్జట్టు ఈ గెలుపుతో తమ ఖాతాలో ఆరు పాయింట్లు వేసుకుంది. హిమాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 318 పరుగులు చేయగా... హైదరాబాద్ జట్టు 278 పరుగులకు ఆలౌటైంది. 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన హిమాచల్ 303 పరుగులు చేసి హైదరాబాద్కు 344 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్రూప్ ‘డి’లో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న హైదరా బాద్ జట్టు పది పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. ఆంధ్ర బోణీకటక్: తొలి రెండు లీగ్ మ్యాచ్లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న ఆంధ్ర క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీలో తొలి విజయం నమోదు చేసింది. ఒడిశా జట్టుతో మంగళవారం ముగిసిన గ్రూప్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్లో ఆంధ్ర ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫాలోఆన్ ఆడుతూ ఓవర్నైట్ స్కోరు 190/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఒడిశా జట్టు 104.2 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. రెండు వికెట్లకు 198 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఒడిశా జట్టు చివరి ఎనిమిది వికెట్లను 80 పరుగుల తేడాలో కోల్పోయింది. ఓపెనర్ గౌరవ్ చౌధురీ (80; 10 ఫోర్లు), వన్డౌన్ బ్యాటర్ సందీప్ పటా్నయక్ (63; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. మూడో వికెట్గా గౌరవ్ అవుటయ్యాక ఒడిశా ఇన్నింగ్స్ తడబడింది. ఈసారి ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఆఫ్ స్పిన్నర్ త్రిపురణ విజయ్ 89 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. కావూరి సాయితేజ, శశికాంత్, పృథ్వీరాజ్లకు ఒక్కో వికెట్ దక్కింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 475 పరుగులు చేయగా... ఒడిశా తొలి ఇన్నింగ్స్లో 151 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ తేడాతో గెలిచినందుకు ఆంధ్ర జట్టుకు ఏడు పాయింట్లు లభించాయి. ఈ మ్యాచ్లో 69 పరుగులు చేయడంతోపాటు ఆరు వికెట్లు పడగొట్టిన సౌరభ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: భారీ విజయంతో కర్ణాటక బోణీ
ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి..
క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, ఛేజింగ్ మాస్టర్, ఫిట్నెస్ ఫ్రీక్ అయిన విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ (నవంబర్ 5, 2025) కింగ్ కోహ్లి 37వ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ క్రీడా సమాజం అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.ఇటీవలే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 ప్రపంచకప్ ఆడాలన్నది అతడి కొరిక. అంతవరకు విరాట్ మునుపటి మెరుపులు మెరిస్తూ, మరెన్నో రికార్డులను బద్దలు కొడుతూ అప్రతిహతంగా కెరీర్ను కొనసాగించాలని ఆశిద్దాం.కోహ్లి ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆడాడు. ఇందులో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైనా, మూడో మ్యాచ్లో తిరిగి పుంజుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను విజయాన్నందించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో రోహిత్ సెంచరీ (121 నాటౌట్) చేయగా.. కోహ్లి (74 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.విరాట్ త్వరలో మరోసారి దర్శనమివ్వబోతున్నాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. 2027 ప్రపంచకప్ వరకు కోహ్లి ఫిట్నెస్ను, ఫామ్ను కాపాడుకుంటూ టీమిండియాను గెలిపిస్తూ ఉండాలని భారత క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అతడి జన్మదినం సందర్భంగా ప్రతి భారత క్రికెట్ అభిమాని అకాంక్ష ఇదే.ఢిల్లీ వీధుల్లో క్రికెట్ ఆడటం మొదలుపెట్టి, క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కోహ్లి.. ఫామ్ను కాపాడుకోగలిగితే సునాయాసంగా మరో రెండు, మూడేళ్లు దేశానికి సేవలందించగలడు. ఫిట్నెస్ విషయంలో అతడికి ఎలాంటి సమస్యలు లేవు. ఉండవు. సాధారణంగా 35 ఏళ్ల వయసొచ్చే సరికే క్రికెటర్లు ఫిట్నెస్ను కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటుంటారు.అయితే కోహ్లి మాత్రం అలా కాదు. 25 ఏళ్ల కుర్రాళ్లు కూడా పోటీ పడలేని విధంగా ఫిట్నెస్ను మెయిన్టెయిన్ చేస్తున్నాడు. తాజాగా ఆసీస్తో జరిగిన సిరీస్లో కోహ్లిని చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది.కెరీర్ను నిదానంగా ప్రారంభించిన కోహ్లి.. అందరిలాగే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటివరకు పొగిడిన నోళ్లే అతన్ని దూషించాయి. బ్యాడ్ టైమ్ను అధిగమించిన కోహ్లి తిరిగి నిలబడ్డాడు. దూషించిన నోళ్లకు బ్యాట్తో సమాధానం చెప్పాడు.ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గానూ కోహ్లి కెరీర్ విజయవంతంగా సాగింది. టెస్ట్ల్లో భారత అత్యుత్తమ కెప్టెన్ కోహ్లినే అని చెప్పవచ్చు. అతడి హయాంలో భారత్ అత్యున్నత శిఖరాలు అధిరోహించింది. కోహ్లి జట్టు ఆటతీరునే మార్చేశాడు. ఆటగాళ్లకు దూకుడు నేర్పాడు. ఫిట్నెస్ మెరుగుపర్చుకునే విషయంలో అందరికీ దిక్సూచిగా నిలిచాడు. కోహ్లి జమానాలో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. చాలాకాలం పాటు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా కొనసాగింది.కోహ్లి ఆటగాడిగా, కెప్టెన్గా ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఇప్పటికే భారత క్రికెట్కు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. అయినా కోహ్లిలో కసి తీరడం లేదు. భారత జట్టుకు ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ గెలిచి కెరీర్కు ముగింపు పలకాలన్నది కోహ్లి కోరిక. ఈ కోరిక నెరవేరాలని, కోహ్లి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం. కోహ్లి సాధించిన ఘనతలు..అండర్-19 వరల్డ్కప్ (2008)వన్డే వరల్డ్కప్ (2011)టీ20 వరల్డ్కప్ (2024)ఛాంపియన్స్ ట్రోఫీ (2013, 2025)ఐపీఎల్ (2025)ఆసియా కప్-3టెస్ట్ మేస్-5ఐసీసీ అవార్డ్స్-10చదవండి: డ్రగ్స్కు బానిస.. స్టార్ క్రికెటర్పై శాశ్వత నిషేధం
స్టార్ క్రికెటర్పై శాశ్వత నిషేధం
జింబాబ్వే క్రికెట్కు 20 ఏళ్ల పాటు సేవలందించిన మాజీ కెప్టెన్ సీన్ విలియమ్స్ (Sean Williams) ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక కాడు. డ్రగ్స్ అలవాటు కారణంగా జింబాబ్వే క్రికెట్ బోర్డు అతనిపై శాశ్వత నిషేధం విధించింది. ఇకపై అతని సెంట్రల్ క్రాంటాక్ట్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది.సీన్ ఈ ఏడాది సెప్టెంబర్లో స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి ఆకస్మికంగా తప్పుకున్నాడు. కారణం ఏంటని బోర్డు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. అప్పటికే హెవీగా డ్రగ్స్కు అలవాటు పడిన సీన్.. డోపింగ్ టెస్ట్లో పట్టుబడతాడన్న భయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. సీన్ తాను డ్రగ్స్ అలవాటు పడిన విషయాన్ని బోర్డు పెద్దల వద్ద అంగీకరించినట్లు తెలుస్తుంది. అలవాటు నుంచి బయటపడేందుకు డీఎడిక్షన్ సెంటర్లో కూడా జాయిన్ అయ్యాడని సమాచారం. బోర్డుతో సీన్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివర్లో ముగుస్తుంది. 39 ఏళ్ల సీన్ జింబాబ్వేకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. కెరీర్లో 18 టెస్ట్లు, 162 వన్డేలు, 8 టీ20లు ఆడి 13 సెంచరీలు, 50 సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా అయిన సీన్.. మూడు ఫార్మాట్లలో 156 వికెట్లు తీశాడు.కాగా, సీన్ డుమ్మా కొట్టిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ జింబాబ్వేకు అత్యంత కీలకంగా ఉండింది. ఆ టోర్నీలో జింబాబ్వే సికందర్ రజా పుణ్యమా అని నెగ్గి ప్రపంచకప్కు అర్హత సాధించింది. సీన్ లాంటి సీనియర్ ఆటగాడు ఆ టోర్నీకి అందుబాటులో లేకపోవడం జింబాబ్వే విజయావకాశాలను ప్రభావితం చేసేదే. ఒకవేళ ఆ టోర్నీలో జింబాబ్వే ఓటమిపాలై, ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయుంటే జింబాబ్వే అభిమానులు సైతం సీన్ను క్షమించేవారు కాదు.జింబాబ్వే క్రికెట్కు మాదకద్రవ్యాల ముప్పు జింబాబ్వే క్రికెట్లో మాదకద్రవ్యాల కలకలం ఇది మొదటిసారి కాదు. 2022లో మరో మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ కోకైన్ వాడకం వల్ల మ్యాచ్ ఫిక్సర్ల చేతిలో బ్లాక్మెయిల్కు గురయ్యాడు. ఆ ఉదంతంలో ఫిక్సర్ల నుంచి డబ్బు తీసుకున్న టేలర్పై 3.5 ఏళ్ల నిషేధం విధించబడింది. టేలర్ ఇటీవల శిక్షను పూర్తి చేసుకొని రీఎంట్రీ ఇచ్చాడు. టేలర్ విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు సీన్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించింది. చదవండి: యాషెస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
నేటి నుంచి చెస్ ప్రపంచకప్
పన్జిమ్ (గోవా): సొంతగడ్డపై జరిగే చెస్ ప్రపంచకప్...
దబంగ్ ధమాకా
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో దబంగ్ ఢిల్లీ మరోస...
ఫిడే ప్రపంచ కప్లో పాల్గోనున్న రాజా రిత్విక్
గోవా వేదికగా జరగనున్న ఫిడే ప్రపంచ కప్ 2025లో తెలంగ...
పీకేఎల్-2025 విజేతగా దబంగ్ ఢిల్లీ
ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఛాంపియన్గా దబంగ్ ఢిల్...
త్వరలో మరో క్రికెట్ లీగ్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 వ...
హైదరాబాద్, ఆంధ్ర బోణీ విజయాలు
నాదౌన్: రంజీ ట్రోఫీ తాజా సీజన్లో హైదరాబాద్ జట్ట...
ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి..
క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, ఛేజింగ్ మాస్...
స్టార్ క్రికెటర్పై శాశ్వత నిషేధం
జింబాబ్వే క్రికెట్కు 20 ఏళ్ల పాటు సేవలందించిన మాజ...
క్రీడలు
తిరుమల కొండపై ఏడు అడుగుల మహిళ (ఫోటోలు)
వరల్డ్ కప్ ట్రోఫీతో మంధాన, పలాష్ ముచ్చల్ జంట (ఫోటోలు)
కడప నుంచి వరల్డ్ కప్ దాకా.. శ్రీ చరణి కీలక పాత్ర (ఫొటోలు)
విశ్వవిజేతగా భారత్.. ముంబైలో మురిపించిన మహిళల జట్టు (ఫొటోలు)
నెక్లెస్రోడ్డులో ఏక్తా రన్.. పాల్గొన్న చిరంజీవి, సజ్జనార్ (ఫొటోలు)
IND W Vs AUS W: రికార్డ్ చేజింగ్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత్ (చిత్రాలు)
క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)
ఆట కోసం ప్రాణం పెట్టిన శ్రేయస్ అయ్యర్.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు (ఫొటోలు)
దీపావళి వేడుకల్లో పీవీ సింధు అలా.. సైనా నెహ్వాల్ ఇలా (ఫొటోలు)
సచిన్ గారాల పట్టీ.. సారా టెండూల్కర్ క్యూట్ ఫొటోస్ చూశారా?
వీడియోలు
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
జీసస్ నన్ను నడిపించాడు బైబిల్ పోరాడేలా చేసింది? జెమిమా ఎమోషనల్
ఫైనల్ కు చేరిన భారత్
ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు
ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే మ్యాచ్
అటు శర్మ.. ఇటు స్మృతి! ఇద్దరికి తిరుగులేదు
ఒక్క తప్పుతో.. వరల్డ్ కప్ ఆశలు గల్లంతు?
వైజాగ్ లో భారత మహిళల అనూహ్య ఓటమి
2027 వరల్డ్ కప్ కొట్టాకే రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన హిట్ మ్యాన్
అంత పొగరెందుకు? అయ్యర్ పై మాజీ క్రికెటర్ ఫైర్!
