Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Famous Zimbabwe surname returns as twin sons make it into the U19 World Cup squad1
జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్‌ కొడుకులు

జింబాబ్వే క్రికెట్‌ జట్టుకు కవలలు ఎంపిక కావడం కొత్తేమీ కాదు. చరిత్ర చూస్తే ఈ జట్టుకు చాలా మంది ట్విన్స్‌ ప్రాతినిథ్యం వహించారు. ఆండీ ఫ్లవర్‌-గ్రాంట్‌ ఫ్లవర్‌, గై విటల్‌-ఆండీ విటల్‌, గావిన్‌ రెన్నీ-జాన్‌ రెన్నీ, పాల్‌ స్ట్రాంగ్‌-బ్రియాన్‌ స్ట్రాంగ్‌ లాంటి జోడీలు జింబాబ్వే క్రికెట్‌ ఉన్నతికి దోహదపడ్డాయి.తాజాగా మరో కవలల జోడీ జింబాబ్వే జట్టుకు ఎంపికైంది. ఈ జోడీ అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడే జింబాబ్వే జట్టులో స్థానం సంపాధించింది. ఈ ట్విన్ బ్రదర్స్‌ గతంలో జింబాబ్వే సీనియర్‌ జట్టుకు ఆడిన ఆండీ బ్లిగ్నాట్‌ కొడుకులు కావడం విశేషం. బ్లిగ్నాట్‌ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానం మైఖేల్‌-కియాన్‌ బ్లిగ్నాట్‌ జోడీ త్వరలో జరుగబోయే అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్‌తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్‌రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్‌ ఆడిన అతి కొద్ది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.కాగా, అండర్‌ 19 ప్రపంచకప్‌ 16వ ఎడిషన్‌కు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జింబాబ్వే చాలా ముందుగానే జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు కెప్టెన్‌గా యువ పేసర్ సింబరాషే ముడ్జెంగెరె నియమితులయ్యాడు. 2024 U19 వరల్డ్‌కప్‌ ఆడిన బ్యాట్స్‌మన్ నాథనియెల్ హ్లాబంగానా కూడా జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో మైఖేల్‌-కియాన్‌ బ్లిగ్నాట్‌ ప్రత్యేక ఆకర్శనగా నిలువనుంది.జింబాబ్వే U19 వరల్డ్‌కప్ 2026 జట్టు సింబరాషే ముడ్జెంగెరె (c), కియన్ బ్లిగ్నాట్, మైఖేల్ బ్లిగ్నాట్, లీరోయ్ చివౌలా, టటెండా చిముగోరో, బ్రెండన్ సెంజెరె, నాథనియెల్ హ్లాబంగానా, టకుడ్జ్వా మకోని, పానాషే మజాయి, వెబ్‌స్టర్ మధిధి, షెల్టన్ మజ్విటోరెరా, కుపక్వాషే మురాడ్జి, బ్రాండన్ న్డివేని, ధ్రువ్ పటేల్, బెన్నీ జూజే

Trolls On Celebrities Mirror to Netizens Regressive Curiosity Led death of ethics2
నైతిక విలువలు పాతరేస్తున్నారు

ఒకప్పుడు ప్రేమ.. పెళ్లి.. అత్యంత వ్యక్తిగత విషయాలుగా ఉండేవి. అయితే, ఇప్పుడు సెలబ్రిటీలు మొదలు సాధారణ వ్యక్తులూ తమ జీవితంలోని అతి ముఖ్యమైన ఈ రెండు విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ ఫాలోవర్లు, అభిమానులను కూడా తమ సంతోషంలో భాగం చేయాలనే ఉద్దేశంతో కొందరు.. హోదాను, రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ను చాటి చెప్పుకొనేందుకు మరి కొంతమంది ఇలాంటి పోకడలకు పోతున్నారు.అయితే, నెట్టింట ఇందుకు సానుకూల కామెంట్ల కంటే.. ప్రతికూల, చెత్త కామెంట్లే ఎక్కువసార్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలపై శ్రుతిమించిన స్థాయిలో ట్రోల్స్‌ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ పెళ్లి వాయిదా- ఆపై రద్దు నేపథ్యంలో సోషల్‌ మీడియాలో జరిగిన రచ్చ ఇందుకు నిదర్శనం.కాబోయే ‘బావగారి’ని ఆటపట్టిస్తూ..ఆరేళ్లుగా వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. హల్ది, సంగీత్‌, మెహందీ అంటూ స్మృతి- పలాష్‌ ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. సహచర ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, రాధా యాదవ్‌, శ్రేయాంక పాటిల్‌ తదితరులు కాబోయే ‘బావగారి’ని ఆటపట్టిస్తూ, అతడితో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోలు కూడా బాగా వైరల్‌ అయ్యాయి.‘ప్రైవేటు సంభాషణ’ బహిర్గతంఅయితే, అనూహ్య రీతిలో స్మృతి- పలాష్‌ పెళ్లి వాయిదా పడింది. వివాహ తంతుకు కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్‌ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆ వెంటనే పలాష్‌ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ పరిణామాలు సందేహాలకు తావిచ్చాయి. ఇందుకు తోడు ఓ అమ్మాయి పలాష్‌ తనతో చాట్‌ చేశాడంటూ ‘ప్రైవేటు సంభాషణ’ను బహిర్గతం చేసింది.ఇంకేముంది.. సోషల్‌ మీడియాలో చిన్నగా అంటుకున్న ఈ ‘మంట’ దావానంలా వ్యాపించింది. మెజారిటీ మంది పలాష్‌ను తప్పుపడితే.. మరికొంత మంది స్మృతిని కూడా ట్రోల్‌ చేశారు. ఆరేళ్ల ప్రేమలో అతడి గురించి ఏమీ తెలియలేదా?.. పెళ్లికి ముందు రోజు రాత్రే.. ‘అఫైర్‌’ ఉందని తెలిసిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.పలాష్‌ అక్కపైనా ట్రోలింగ్‌మరోవైపు.. పలాష్‌పై తీవ్ర స్థాయిలో నెగటివ్‌ కామెంట్లు వచ్చాయి. దెబ్బకు అతడు బృందావనంలోని ఓ ఆశ్రమానికి వెళ్లి సేదదీరాడు. ఈ విషయంలో కాబోయే వధూవరులతో పాటు ట్రోలింగ్‌కు గురైన మరో వ్యక్తి పాలక్‌ ముచ్చల్‌. పలాష్‌ అక్క, బాలీవుడ్‌ సింగర్‌గా ప్రాచుర్యం పొందిన పాలక్‌ సమాజ సేవలోనూ ముందే ఉంటుంది.ఎంతో మంది చిన్నారులకు తన ఎన్‌జీవో ద్వారా గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా నిలిచింది పాలక్‌. అయితే, పలాష్‌ వ్యక్తిత్వాన్ని ప్రస్తావిస్తూ పాలక్‌ను కూడా కొంత మంది విపరీతపు వ్యాఖ్యలతో ట్రోల్‌ చేశారు. డబ్బు, అందం ఉందన్న కారణంగానే స్మృతి వెంటపడమని సలహా ఇచ్చిందని.. అసలు విషయం బయటపడేసరికి ఆస్పత్రి పాలయ్యాడంటూ తమ్ముడికి సానుభూతి వచ్చేలా చేయాలని చూసిందని ఇష్టారీతిన ఆమెను నిందించారు.గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తినిజానికి ప్రేమ- పెళ్లి.. స్మృతి- పలాష్‌లకు సంబంధించినది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా అతిగా జోక్యం చేసుకునే వీలు ఉండకపోవచ్చు. నిజానికి స్మృతి మీద ఉన్న అభిమానం.. అనేకంటే దురభిమానమే పాలక్‌ మీద కామెంట్ల దాడికి కారణమైందని చెప్పవచ్చు. మరోవైపు.. పలాష్‌కు మద్దతు పలికేవాళ్లు స్మృతిని తక్కువ చేసేలా మాట్లాడటం తెలిసిందే. ఆఖరికి తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఇరువురూ స్పందించి.. తమ గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేసేదాకా వచ్చింది.తప్పు ఎటువైపు ఉన్నా.. బాధితులు వారేమొత్తం మీద తప్పు ఎటువైపు ఉందో తెలియకపోయినా.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ బారిన పడేది అమ్మాయిలే అన్నది ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. నైతిక విలువలకు పాతరేసి మహిళలను కించపరిచే ఈ ‘సంస్కృతి’ని నీచమైనదిగా అభివర్ణించవచ్చు. ఇలాంటి ట్రోల్స్‌ వేసే వాళ్లలో చాలామందికి తమ వ్యక్తిగత జీవితంపై ఓ అవగాహనా, స్పష్టత ఉండదు.స్మృతి, సమంత, శోభితఅయినప్పటికీ పక్కవాళ్ల జీవితంలోకి చొచ్చుకుపోయి మరీ ఇలా దిగజారుడుగా వ్యవహరిస్తారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సినీ హీరోయిన్‌ సమంతపై కూడా కొంతమంది నీచంగా కామెంట్లు చేశారు. ఆమె పాత జీవితాన్ని తెర మీదకు తెస్తూ మోసగత్తెగా అభివర్ణిస్తూ రాక్షసానందం పొందారు.అంతేకాదు.. సమంత మాజీ భర్త నాగ చైతన్యపై కూడా విడాకుల సమయంలో.. అతడి రెండో పెళ్లి విషయంలోనూ విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ముఖ్యంగా అక్కడ చైతూ భార్య శోభిత ధూళిపాళ వాళ్లకు ప్రధాన టార్గెట్‌గా మారింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఇటు శోభిత.. అటు సమంత.. ఇలా ఇద్దరు మహిళలు బాధితులుగా మారారు. మరోవైపు.. సెలబ్రిటీలను ఫాలో చేస్తూ వారి అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసే పాపరాజీలపై టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.తన ప్రేయసి, మోడల్‌ మహీక శర్మను తీయకూడని యాంగిల్లో ఫొటో తీశారని.. కాస్తైన బుద్ధి ఉండాలంటూ పాపరాజీలకు పాండ్యా చురకలు అంటించాడు. కాగా హార్దిక్‌ పాండ్యాతో డేటింగ్‌ మొదలుపెట్టిన నాటి నుంచి మహీకపై నెట్టింట ట్రోల్స్‌ వస్తున్న విషయం తెలిసిందే. మహీక, ధనశ్రీ, నటాషామరోవైపు.. హార్దిక్‌ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌ను సైతం అతడి దురభిమానులు వదిలిపెట్టలేదు. డబ్బు కోసమే ప్రేమ నటించి, పిల్లాడిని కని భారీ స్థాయిలో భరణం గుంజాలనే స్కెచ్‌ వేసిందని ఆమెపై నిందలు వేశారు.ఇక టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మాజీ భార్య, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మపై కూడా ‘గోల్డ్‌ డిగ్గర్‌’ (డబ్బు కోసం సంబంధం పెట్టుకునే స్త్రీ అనే అర్థంలో) అంటూ నీచస్థాయిలో ట్రోల్‌ చేశారు. ఇతరులతో పోల్చుకోవడం, ఈర్ష్య, అసూయ.. ముఖ్యంగా తరతరాలుగా మెదళ్లలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలమే మహిళల పట్ల సోషల్‌ మీడియాలో వికృత వాంతి రూపంలో బయటకు వస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కొంతమంది మహిళలు సైతం ఇలాంటి ట్రోల్స్‌కు మద్దతు పలకడం విషాదకరం.చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్‌.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?

Hardik joins Rohit, Suryakumar and Kohli in India's 100 sixes club in T20Is3
సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్‌ పాండ్యా

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా 33వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.హార్దిక్‌కు ముందు రోహిత్‌ శర్మ (205), సూర్యకుమార్‌ యాదవ్‌ (155), విరాట్‌ కోహ్లి (124) భారత్‌ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో రోహిత్‌ శర్మ అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. రోహిత్‌ మినహా అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఒక్కరు కూడా సిక్సర్ల డబుల్‌ సెంచరీ చేయలేదు.హార్దిక్‌ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్‌) కటక్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్, కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ (175/6) చేయగలిగింది.అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఒత్తిడికిలోనై చిత్తైంది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. తద్వారా భారత్‌ 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్, దూబే చెరో వికెట్‌ సాధించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన హార్దిక్‌ పాండ్యాకే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 డిసెంబర్‌ 11న ముల్లాన్‌పూర్‌లో జరుగనుంది.

VIRAT KOHLI MOVES TO NUMBER 2 IN ODI BATTERS RANKING4
రెండో స్థానానికి దూసుకొచ్చిన విరాట్‌.. రోహిత్‌ తగ్గేదేలే..!

ఐసీసీ తాజాగా (డిసెంబర్‌ 10) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ చేయడంతో భారీగా రేటింగ్‌ పాయింట్లు సాధించి రెండు స్థానాలు ఎగబాకాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో విరాట్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదే సిరీస్‌లో రెండు మెరుపు అర్ద శతకాలు సాధించిన మరో టీమిండియా స్టార్‌ రోహిత్‌ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.రోహిత్‌కు విరాట్‌కు మధ్య కేవలం 7 రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్‌ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్‌ ఖాతాలో 773 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఈ ఏడాది రో-కో టాప్‌-2లో ముగిస్తారు. మిగతా భారత బ్యాటర్లలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ఓ స్థానం కోల్పోయి 10వ స్థానంలో పడిపోయాడు.సౌతాఫ్రికా సిరీస్‌లో రాణించిన తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 2 స్థానాలు ఎగబాకి 12వ ప్లేస్‌కు చేరుకోగా.. అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా వరుసగా 99, 100 స్థానాల్లో నిలిచారు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లతో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. డికాక్‌ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి ఎగబాకగా.. మార్క్రమ్‌ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 25వ స్థానానికి చేరాడు. బ్రీట్జ్కే ఓ స్థానం మెరుగుపర్చుకొని 29కి, బవుమా 3 స్థానాలు మెరుగుపర్చుకొని 37వ స్థానానికి చేరారు.బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 3 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. రషీద్‌ ఖాన్‌, ఆర్చర్‌ టాప్‌-2 బౌలర్లుగా కొనసాగుతున్నారు. కుల్దీప్‌ మినహా టాప్‌-10లో ఒక్క భారత బౌలర్‌ కూడా లేడు. రవీంద్ర జడేజా 16, సిరాజ్‌ 21, షమీ 23, అక్షర్‌ పటేల్‌ 33, వాషింగ్టన్‌ సుందర్‌ 81, హార్దిక్‌ పాండ్యా 95, వరుణ్‌ చక్రవర్తి 100 స్థానాలకు పడిపోగా.. అర్షదీప్‌ సింగ్‌ 29 స్థానాలు మెరుగుపర్చుకొని 66వ స్థానానికి, హర్షిత్‌ రాణా 13 స్థానాలు మెరుగుపర్చుకొని 80వ స్థానానికి ఎగబాకారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్‌జాయ్‌, సికందర్‌ రజా, నబీ టాప్‌-3లో కొనసాగుతుండగా.. భారత్‌ తరఫున అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా 10, 11 స్థానాల్లో ఉన్నారు.

Dinesh Karthik links up with London Spirit as part of support staff5
దినేశ్‌ కార్తీక్‌కు మరో కీలక పదవి

టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌కు మరో కీలక పదవి దక్కింది. ద హండ్రెడ్‌ లీగ్‌ 2026 సీజన్‌ కోసం పురుషుల లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీకి బ్యాటింగ్‌ కోచ్‌ మరియు మెంటర్‌గా ఎంపికయ్యాడు. హండ్రెడ్‌ లీగ్‌లో డీకే ఏ ఫ్రాంచైజీతో అయిన పని చేయడం (కోచ్‌గా) ఇదే మొదటిసారి.డీకే 2025 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా చేరి, ఆ జట్టు మొదటి సారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పోర్ట్‌ఫోలియోతో లండన్‌ స్పిరిట్‌తోనూ జతకట్టాడు.లండన్ స్పిరిట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ (ఆర్సీబీ డైరెక్టర్ కూడా) డీకేను స్వాగతిస్తూ.. ఈ టీ20 ఫార్మాట్‌ స్పెషలిస్ట్‌ లండన్‌ స్పిరిట్‌లో చేరడం ఆనందకరం. అతని ఆలోచన విధానం ప్రత్యేకం. పొట్టి ఫార్మాట్లో డీకేకు ఉన్న అనుభవం, అతని ఉత్సాహం మా ఆటగాళ్లకు అమూల్యమవుతుందని అన్నారు. లండన్‌ స్పిరిట్‌తో ఒప్పందం అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. లార్డ్స్‌లో ఇంగ్లీష్ సమ్మర్ గడపనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే గ్రౌండ్‌లో నేను భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాను. చివరి టెస్ట్ కూడా ఇక్కడే ఆడాను. లండన్ స్పిరిట్‌తో కొత్త ప్రయాణం ప్రారంభించడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు. 40 ఏళ్ల దినేశ్‌ కార్తీక్‌ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే ఐపీఎల్‌లో ప్రారంభ సీజన్‌ (2008) నుంచి 2024 ఎడిషన్‌ వరకు ఆడాడు. ఈ మధ్యలో అతను వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 257 మ్యాచ్‌లు ఆడాడు.

20 Stitches Shoulder Fracture: U19 Coach Allegedly Beaten By Players6
సెలక్ట్‌ కాకుండా అడ్డుకుంటావా?.. కోచ్‌పై క్రికెటర్ల పాశవిక దాడి!

భారత క్రికెట్‌లో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. తాము జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుకున్నాడనే అనుమానంతో యువ క్రికెటర్లు దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కోచ్‌ను చితకబాది.. అతడిని తీవ్రంగా గాయపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. పుదుచ్చేరి అండర్‌-19 క్రికెట్‌ కోచ్‌ వెంకటరామన్‌ (Venkataraman)కు తీవ్ర గాయాలయ్యాయి. పుదుచ్చేరి క్రికెట్‌ అసోసియేషన్‌ (CAP) పరిసరాల్లోనే ముగ్గురు స్థానిక క్రికెటర్లు అతడిపై దాడికి పాల్పడ్డారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT 2025)కి తమను ఎంపిక చేయకుండా.. సెలక్టర్లను ప్రభావితం చేశాడనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.హత్యాయత్నం కింద నిందితులపై కేసుఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. హత్యాయత్నం కింద నిందితులపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్న వేళ.. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు అతడిపై దాడికి దిగారు.విరిగిన భుజం, ఇరవై కుట్లుక్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి వెంకటరామన్‌ను గాయపరిచారు. ఈ ఘటనలో అతడి భుజానికి (విరిగినట్లు అనుమానం), పక్కటెముకలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తలపై బలంగా కూడా కొట్టడంతో నుదుటిపై దాదాపు 20 కుట్లు పడ్డాయి. ఈ ఘటన గురించి పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నిందితులను కార్తికేయన్‌, అర్వింద్‌రాజ్‌, సంతోష్‌ కుమారన్‌గా గుర్తించినట్లు తెలిపారు.అత్యంత హింసాత్మకంగాప్రస్తుతం అసోసియేషన్‌లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఉన్నవారి సాయంతో నిందితులను గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో వెంకటరామన్‌ తీవ్రంగా గాయపడ్డారని.. అత్యంత హింసాత్మకంగా అతడిపై దాడి చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సదరు అధికారి పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.కాగా ఈ ఘటనపై క్రికెట్‌ వర్గాల్లో ఆందోళన రేకెత్తింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటమే కాకుండా.. కోచ్‌పై దాడి చేయడాన్ని పుదుచ్చేరి అసోసియేషన్‌ అధికారులు ఖండించారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఏదేమైనా ఈ అనూహ్య పరిణామంతో సెలక్షన్‌ కమిటీలో కీలకంగా వ్యవహరించే ‘పెద్దలు’ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్రస్థాయి కోచ్‌లకు కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.స్కామ్‌ చేశారా?అయితే, సెలక్షన్‌ విషయంలో పుదుచ్చేరి క్రికెట్‌ అసోసియేషన్‌ అవకతవలకు పాల్పడిందనే ఆరోపణలూ ఉన్నాయి. స్థానిక క్రికెటర్లను కాదని.. బయటి నుంచి వచ్చిన వారికి నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డులు జారీ చేయించేసి.. వాటి ద్వారా లోకల్‌ కోటాలో ఇతరులను ఎంపిక చేసినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. ఈ కారణంగా రంజీ ట్రోఫీ 2021 సీజన్‌ నుంచి ఐదుగురు అర్హులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందని తన నివేదికలో వెల్లడించింది.చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు

MI Emirates dramatically collapse to hand Vipers victory7
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌ ఓటమి

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ 2025 ఎడిషన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌ (MI Emirates) మిశ్రమ ఫలితాలను చవి చూస్తుంది. తొలి మ్యాచ్‌లో గల్ఫ్‌ జెయింట్స్‌పై ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో షార్జా వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. తాజాగా డెసర్ట్‌ వైపర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒత్తిడికిలోనై సీజన్‌లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వైపర్స్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఛేదనలో ఓ దశలో పటిష్టంగా ఉండిన ఎంఐ లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వైపర్స్‌ బౌలర్‌ డేవిడ్‌ పేన్‌ 19వ ఓవర్‌లో ఒక్క పరుగే ఇచ్చి 3 వికెట్లు తీసి ఎంఐని భారీ దెబ్బేశాడు. చివరి ఓవర్‌లో ఎంఐ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్‌ ఖాన్‌ వరుసగా సిక్సర్‌, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. అయితే చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో అర్వింద్‌ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే ఘజన్‌ఫర్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు.19వ ఓవర్‌లో 3 వికెట్లు సహా మ్యాచ్‌ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్‌ పేన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. వైపర్స్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌ హోల్డన్‌ (42 రిటైర్డ్‌ ఔట్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఫకర్‌ జమాన్‌ (35) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఎంఐ బౌలర్లలో ఘజన్‌ఫర్‌ 2, ఫజల్‌ హక్‌ ఫారూఖీ ఓ వికెట్‌ తీశారు.ఎంఐ ఇన్నింగ్స్‌లో టామ్‌ బాంటన్‌ (34) టాప్‌ స్కోరర్‌ కాగా.. పూరన్‌ (31), ముహమ్మద్‌ వసీం (24), పోలార్డ్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వైపర్స్‌ బౌలర్లలో పేన్‌ 4, తన్వీర్‌ 2, ఫెర్గూసన్‌, సామ్‌ కర్రన్‌ తలో వికెట్‌ తీశారు.

Big Blow New Zealand Pacer Suffers Shoulder Injury Taken To Hospital8
న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్‌ బ్లెయిర్‌ టిక్నర్‌ దారుణంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కివీస్‌ జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌ (NZ vs WI)తో ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో గెలిచిన న్యూజిలాండ్‌.. వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అనంతరం క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా తొలి టెస్టులో కివీస్‌ విజయం సాధించే దిశగా పయనించగా.. అద్భుత పోరాటంతో విండీస్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.205 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య వెల్లింగ్‌టన్‌ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. విండీస్‌ బ్యాటింగ్‌కు దిగింది. కివీస్‌ బౌలర్ల ధాటికి తాళలేక 75 ఓవర్లు ఆడి కేవలం 205 పరుగులకే ఆలౌట్‌ అయింది.నాలుగు వికెట్లతో చెలరేగిన టిక్నర్‌ విండీస్‌ ఓపెనర్లు జాన్‌ కాంప్‌బెల్‌ (44), బ్రాండన్‌ కింగ్‌ (33) ఓ మోస్తరుగా రాణించగా.. షాయీ హోప్‌ (48) కూడా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు. ఇక కివీస్‌ బౌలర్లలో పేసర్లు బ్లెయిర్‌ టిక్నర్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మైకేల్‌ రే మూడు వికెట్లు పడగొట్టాడు.మరోవైపు.. జేకబ్‌ డఫీ ఒక వికెట్‌ తీయగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (Glenn Phillips) సైతం ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్‌ టెయిలెండర్‌ ఆండర్సన్‌ ఫిలిప్‌ (5) రనౌట్‌ రూపంలో కివీస్‌కు ఓ వికెట్‌ దక్కింది. ​నొప్పితో విలవిల్లాడుతూఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 66వ ఓవర్లో మైకేల్‌ రే బంతితో రంగంలోకి దిగగా.. ట్రవిన్‌ ఇమ్లాచ్‌ ఫైన్‌ లెగ్‌ దిశగా బాల్‌ను గాల్లోకి లేపాడు. ఇంతలో ఫీల్డర్‌ టిక్నర్‌ బంతిని ఆపే క్రమంలో పల్టీ కొట్టాడు. ఈ క్రమంలో తన ఎడమ భుజం (Shoulder Injury)పై భారం మొత్తం పడగా.. నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో పడుకుండిపోయాడు.ఏడ్చేసిన బౌలర్‌!దీంతో కివీస్‌ శిబిరంలో ఆందోళన చెలరేగగా.. టిక్నర్‌ పరిస్థితి చూసి బౌలర్‌ మైకేల్‌ దాదాపుగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతలో ఫిజియో వచ్చి టిక్నర్‌ను మైదానం వెలుపలికి తీసుకువెళ్లగా.. అటు నుంచి అటే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టిక్నర్‌ ఎడమ భుజం విరిగినట్లు వార్తలు వస్తున్నాయి.మరోవైపు.. బుధవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 9 ఓవర్లలో కివీస్‌ 24 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 7, డెవాన్‌ కాన్వే 16 పరుగులతో క్రీజులో నిలిచారు. విండీస్‌ కంటే కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్‌గా తొలిరోజు ఆతిథ్య న్యూజిలాండ్‌దే పైచేయి కాగా.. టిక్నర్‌ గాయం ఆందోళనకరంగా పరిణమించింది. చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు

Australia Announce Squad For 3rd Ashes Test: Cummins Returns Replaces9
Ashes: మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును బుధవారం ప్రకటించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ మ్యాచ్‌తో తిరిగి ఆసీస్‌ టీమ్‌తో చేరినట్లు వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఈ ఒక్క మార్పు (కమిన్స్‌ చేరిక) జరిగినట్లు తెలిపింది.2-0తో ఆధిక్యంలో ఆసీస్‌ కాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ (The Ashes 2025-26)లో దుమ్ములేపుతోంది. పెర్త్‌ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన కంగారూలు.. రెండో టెస్టులోనూ విజయం సాధించారు. బ్రిస్బేన్‌ వేదికగా పింక్‌ బాల్‌తో (డే- నైట్‌ మ్యాచ్‌) జరిగిన ఈ మ్యాచ్‌లోనూ ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేశారు.అదరగొట్టారుఇంగ్లండ్‌తో తొలి టెస్టులో మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి మిచెల్‌ స్టార్క్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలవగా.. నాలుగో ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (83 బంతుల్లో 123)తో ఓపెనర్‌గా వచ్చిన ట్రవిస్‌ హెడ్‌ (Travis Head) ఇరగదీశాడు. ఇక రెండో టెస్టులోనూ స్టార్క్‌ మొత్తంగా ఎనిమిది వికెట్లు తీసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.ఆ ఇద్దరూ దూరంఇదిలా ఉంటే.. ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హాజల్‌వుడ్‌ (Josh Hazlewood)... ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ ‘యాషెస్‌’ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యారు. కండరాల గాయంతో ఇప్పటికే జరిగిన రెండు టెస్టులకు దూరమైన హాజల్‌వుడ్‌ మిగిలిన మూడు మ్యాచ్‌లకు సైతం అందుబాటులో ఉండబోడని ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ మెక్‌డొనాల్డ్‌ మంగళవారం వెల్లడించాడు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ వరకు అతడు ఫిట్‌నెస్‌ సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ‘ఈ సిరీస్‌కు హాజల్‌వుడ్‌ దూరమయ్యాడు. ఇక ఇప్పుడు అతడి దృష్టి అంతా టీ20 వరల్డ్‌కప్‌ పైనే’ అని మెక్‌డొనాల్డ్‌ అన్నాడు. డిసెంబరు 17 నుంచి అడిలైడ్‌ వేదికగామరోవైపు.. గాయంతో తొలి రెండు మ్యాచ్‌లూ ఆడని రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌... డిసెంబరు 17 నుంచి అడిలైడ్‌ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. కమిన్స్‌ గైర్హాజరీలో స్టీవ్‌ స్మిత్‌ రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు సారథిగా వ్యవహరించగా... కమిన్స్‌ రాకతో అతడు కేవలం బ్యాటర్‌గా బరిలోకి దిగనున్నాడు.గత రెండు టెస్టుల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచిన మిచెల్‌ స్టార్క్‌ దెబ్బకు ఇంగ్లండ్‌ బ్యాటర్లు చేతులెత్తేయగా... ఇప్పుడు కమిన్స్‌ రాకతో కంగారూల పేస్‌ బలం మరింత పేరగనుంది. ఇక ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌ అనంతరం గాయంతో జట్టుకు దూరమైన వుడ్‌... మిగిలిన మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటనప్యాట్ కమిన్స్‌ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, జేక్‌ వెదరాల్డ్‌, బ్యూ వెబ్‌స్టర్‌.చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు

Bumrah Scripts History Is Third umpire blunder gifts Him 100th T20I wicket10
చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్‌ తప్పు చేశాడా?

టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 సందర్భంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. తద్వారా భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలోనూ వంద వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు.175 పరుగులుకటక్‌ వేదికగా సౌతాఫ్రికా (IND vs SA T20Is)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. టాపార్డర్‌ కుప్పకూలినా హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్‌)కు తోడు తిలక్‌ వర్మ (26), అక్షర్‌ పటేల్‌ (23) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు స్కోరు చేయగలిగింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రాణించిన బౌలర్లుభారత బౌలర్లలో పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh), జస్‌ప్రీత్‌ బుమ్రా చెరో రెండు.. పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్‌ పడగొట్టారు. స్పిన్నర్లలో వరుణ్‌ చక్రవర్తి.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (Axar Patel) చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ మ్యాచ్‌లో సఫారీ స్టార్‌, టాప్ రన్‌ స్కోరర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ (22)ను అవుట్‌ చేయడం ద్వారా.. బుమ్రా వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. అదే విధంగా.. కేశవ్‌ మహరాజ్‌ (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.Boom boom, Bumrah! 🤩😎Wicket number 100 in T20Is for #JaspritBumrah! Simply inevitable 👏🇮🇳#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/MuSZfrfh3L— Star Sports (@StarSportsIndia) December 9, 2025అంపైర్‌ తప్పు చేశాడా?సఫారీ జట్టు ఇన్నింగ్స్‌లో బుమ్రా పదకొండో ఓవర్‌లో బరిలోకి దిగగా.. రెండో బంతిని బ్రెవిస్‌ ఎదుర్కొన్నాడు. ఫుల్‌ స్వింగ్‌తో బంతిని వేసే క్రమంలో బుమ్రా క్రీజు లైన్‌ దాటేసినట్లుగా కనిపించింది. దీంతో ఫ్రంట్‌-ఫుట్‌ నోబాల్‌ కోసం చెక్‌ చేయగా.. బుమ్రా షూ భాగం క్రీజు లోపలే ఉన్నందున దానిని ఫెయిర్‌ డెలివరీగా ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో పరిశీలించకుండానే బ్రెవిస్‌ను థర్డ్‌ అంపైర్‌ పెవిలియన్‌కు పంపి తప్పు చేశాడంటూ సౌతాఫ్రికా జట్టు అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. బుమ్రా కంటే ముందుగా.. అర్ష్‌దీప్‌ టీమిండియా తరఫున టీ20లలో వంద వికెట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.టెస్టు, వన్డే, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లు వీరేలసిత్‌ మలింగ (శ్రీలంక)టిమ్‌ సౌతీ (న్యూజిలాండ్‌)షకీబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌)షాహిన్‌ ఆఫ్రిది (పాకిస్తాన్‌)జస్‌ప్రీత్‌ బుమ్రా (ఇండియా).చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్‌At least show us another angle pic.twitter.com/NjDZ2lcxQT— Werner (@Werries_) December 9, 2025

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement