ప్రధాన వార్తలు
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన.. టీమిండియా భారీ స్కోర్
రికార్డుల రారాణి, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మరో భారీ రికార్డు నెలకొల్పింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించింది. ఈ మైలురాయిని తాకేందుకు మంధనకు కేవలం 281 ఇన్నింగ్స్లే అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డు టీమిండియాకే చెందిన మిథాలీ రాజ్ పేరిట ఉండేది.మిథాలీ ఈ మైలురాయిని తన 291 ఇన్నింగ్స్లో తాకింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్ 28) జరుగుతున్న నాలుగో టీ20లో మంధన ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన మంధన.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10000 పరుగుల మైలురాయిని తాకింది.చరిత్రలో కేవలం నాలుగో ప్లేయర్మహిళల అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు నలుగురు మాత్రమే 10000 పరుగులు పూర్తి చేసుకున్నారు. వీరిలో మంధన నాలుగో క్రికెటర్గా నిలిచింది. ఈమెకు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (10868), న్యూజిలాండ్కు చెందిన సూజీ బేట్స్ (10652), ఇంగ్లండ్కు చెందిన చార్లోట్ ఎడ్వర్డ్స్ (10273) మాత్రమే ఈ ఘనత సాధించారు.టీమిండియా భారీ స్కోర్తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆఖర్లో రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది.సిరీస్ ఇదివరకే కైవసం కాగా, టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది.
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్కప్కు ముందు తన ఉద్దేశాలను మరోసారి స్పష్టం చేశాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని సిక్సర్గా మలచడమే లక్ష్యంగా పెట్టుకున్న అభిషేక్.. తన తాజా ప్రదర్శనతో క్రికెట్ సర్కిల్స్లో భయోత్పాతం సృష్టించాడు.ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్గా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న ఈ సిక్సర్ల వీరుడు.. ఇవాళ (డిసెంబర్ 28) జైపూర్లోని అనంతం గ్రౌండ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఏకంగా 45 సిక్సర్లు బాది, అక్కడున్న వారిలో (ట్రిబ్యూన్ రిపోర్టర్ల కథనం) భయాందోళనలు పుట్టించాడు. ఈ విషయాన్ని ట్రిబ్యూన్ మీడియాకు చెందిన రిపోర్టర్లు నివేదించారు.వారి నివేదిక ప్రకారం.. పంజాబ్ రేపు జరుగబోయే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో (జైపూర్లోని అనంతం క్రికెట్ గ్రౌండ్) ఉత్తరాఖండ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ శర్మ శివాలెత్తిపోయాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని భారీ షాట్ ఆడి, ఏకంగా 45 సిక్సర్లు బాదాడు. ఇది చూసి రిపోర్టర్లు సహా అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు.ఈ స్థాయి విధ్వంసమేంటంటూ నోరెళ్లబెట్టారు. ప్రతి బంతిని బాదడమే ధ్యేయంగా పెట్టుకొన్న అభిషేక్.. స్పిన్నర్ల బౌలింగ్ను ఊచకోత కోశాడు. ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. దాదాపు ప్రతి బంతిని కవర్స్ మీదుగా సిక్సర్గా మలిచాడు. అభిషేక్ వీరంగం చూసి పంజాబ్ కోచ్ సందీప్ శర్మ అవాక్కైపోయాడు. ట్రిబ్యూన్ రిపోర్టర్లు నివేదించిన ఈ కథనం చూసి ప్రపంచ బౌలర్లంతా భయాందోళనలకు గురవుతుంటారు.వాస్తవానికి అభిషేక్ సిక్సర్ల వీరంగం గతేడాది ఆరంభం నుంచే మొదలైంది. ఈ ఏడాది చివర్లో అది తారాస్థాయికి చేరినట్లుంది. 2024 ఐపీఎల్తో మెరుపులు ప్రారంభించిన అభిషేక్ అప్పటినుంచి తానెదుర్కొన్న ప్రతి బౌలర్ను షేక్ చేస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది అతని సిక్సర్ల ప్రదర్శన శృతి మించింది. ఇప్పటివరకు ఆడిన 41 టీ20ల్లో ఏకంగా 108 సిక్సర్లు బాది, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కరణ్బీర్ సింగ్ (ఆస్ట్రియా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్) మాత్రమే అభిషేక్ కంటే ముందున్నారు.
శ్రీలంకతో నాలుగో టీ20.. తొలిసారి టీమిండియాకు చేదు అనుభవం
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 28) నాలుగో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో భారత్ టాస్ కోల్పోవడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున జెమీమా రోడ్రిగ్స్, క్రాంతి గౌడ్ స్థానాల్లో హర్లీన్ డియోల్, అరంధతి రెడ్డి తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక తరఫున ఇనోకా, మదరా స్థానాల్లో కావ్య కవింది, రష్మిక సెవ్వంది ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), మల్షా షెహానీ, రష్మిక సెవ్వంది, కావ్య కవింది, నిమేషా మదుషానిభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..!
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగబోయే వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. స్టార్ ప్లేయర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో గడిపిన శ్రేయస్.. తాజాగా ఫిట్నెస్ టెస్ట్లన్నీ పూర్తి చేసుకొని, రీఎంట్రీకి అనుమతి పొందాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి మీడియాకు వెల్లడించారు.CoE నుంచి తుది క్లియరెన్స్ ఆధారంగా శ్రేయస్ షెడ్యూల్ నిర్ణయించబడుతుందని సదరు అధికారి తెలిపారు. ప్రస్తుతం శ్రేయస్ నెట్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు.సదరు అధికారి చెప్పిన విషయాల మేరకు.. శ్రేయస్ న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇస్తాడు. అంతకంటే ముందే ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడతాడు. జనవరి 3న మహారాష్ట్రతో, 6న హిమాచల్ప్రదేశ్తో జరిగే మ్యాచ్ల్లో శ్రేయస్ బరిలోకి దిగుతాడు. ఆతర్వాత భారత వన్డే జట్టుతో కలుస్తాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం జనవరి 3 లేదా 4 తేదీల్లో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జనవరి 11 (వడోదర), 14 (రాజ్కోట్), 18 (ఇండోర్) తేదీల్లో జరుగనుంది.కాగా, అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో శ్రేయస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు.మూడు రోజుల తర్వాత శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ముంబైకు తిరిగొచ్చిన అయ్యర్.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు.
మ్యాక్స్వెల్ ఖాతాలో భారీ సిక్సర్ల రికార్డు
ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్వెల్ భారీ సిక్సర్ల రికార్డు చేరింది. బిగ్ బాష్ లీగ్ 2025-26 ఎడిషన్లో భాగంగా సిడ్నీ థండర్తో ఇవాళ (డిసెంబర్ 28) జరిగిన మ్యాచ్లో 2 సిక్సర్లు బాదిన మ్యాక్సీ.. బీబీఎల్ కెరీర్లో 150 సిక్సర్ల మార్కును దాటాడు. తద్వారా లీగ్ చరిత్రలో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. మ్యాక్సీకి ముందు క్రిస్ లిన్ మాత్రమే 150 సిక్సర్ల మార్కును తాకాడు. లిన్ ఖాతాలో ప్రస్తుతం 220 సిక్సర్లు ఉన్నాయి.బీబీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల టాప్-5 జాబితాలో లిన్, మ్యాక్సీ తర్వాతి స్థానాల్లో బెన్ మెక్డెర్మాట్ (140), ఆరోన్ ఫించ్ (118), మార్కస్ స్టోయినిస్ (111) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ థండర్పై మ్యాక్స్వెల్ ప్రాతినిథ్యం వహిస్తున్న మెల్బోర్న్ స్టార్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన థండర్.. హరీస్ రౌఫ్ (4-0-29-3), టామ్ కర్రన్ (4-0-22-2), స్టోయినిస్ (3-0-25-2), మిచెల్ స్వెప్సన్ (4-0-18-2), పీటర్ సిడిల్ (4-0-22-1) దెబ్బకు 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 128 పరుగులకు ఆలౌటైంది. థండర్ ఇన్నింగ్స్లో షాదాబ్ ఖాన్ (25) టాప్ స్కోరర్ కాగా.. మాథ్యూ గిల్క్స్ (24), సామ్ బిల్లింగ్స్ (23) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో కొన్స్టాస్ 11, డేవిడ్ వార్నర్ 10, బాన్క్రాఫ్ట్ 10, డేనియల్ సామ్స్ 3, క్రిస్ గ్రీన్ 1, తన్వీర్ సంఘా 1, ర్యాన్ హ్యాడ్లీ 1 పరుగు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని మెల్బోర్న్ ఒకే వికెట్ కోల్పోయి 14 ఓవర్లలోనే ఛేదించింది. జో క్లార్క్ (37 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద సెంచరీతో మెల్బోర్న్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. అనంతరం సామ్ హార్పర్ (29 నాటౌట్), మ్యాక్స్వెల్ (39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజానికి అరుదైన గౌరవం
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీకి (Brett Lee) అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈ స్పీడ్గన్ స్వదేశీ (Australia) హాల్ ఆఫ్ ఫేమర్ల (Hall Of Fame) జాబితాలోకి ప్రవేశించాడు. అత్యంత అరుదైన ఈ జాబితాలో లీ 66వ ఆటగాడిగా చేరాడు. లీకి ముందు చాలామంది ఆసీస్ దిగ్గజాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.లీకి ముందు ఇదే ఏడాది (2025) మైఖేల్ క్లార్క్, మైఖేల్ బెవాన్, క్రిస్టినా మాథ్యూస్ ఆసీస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్మన్, అలెన్ బోర్డర్, షేన్ వార్న్, రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు ఉన్నారు.49 ఏళ్ల లీ దశాబ్దానికిపైగా (1999-2012) తన ఫాస్ట్ బౌలింగ్లో ప్రపంచ బ్యాటర్లను గడగడలాడించాడు. ప్రపంచ క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యం కొనసాగించడంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్లు తీయడం కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన లీ.. కెరీర్లో ఎన్నో సార్లు స్పీడో మీటర్లు (బౌలింగ్ వేగాన్ని కోలిచే యంత్రం) బద్దలు కొట్టాడు.అత్యుత్తమంగా లీ గంటకు 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన బంతిగా నేటికీ చలామణి అవుతుంది. లీ కంటే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కేవలం 0.2 వేగాన్ని అధికంగా సాధించాడు.తనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం (ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్) దక్కడం పట్ల లీ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ అని చెప్పాడు. తొమ్మిదేళ్ల వయసు నుంచి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయాలని కలలు కన్నట్లు తెలిపాడు.
సొంత దేశ క్రికెట్ బోర్డునే కోర్టుకు లాగిన సౌతాఫ్రికా ప్లేయర్
సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంషి సొంత దేశ క్రికెట్ బోర్డునే (Cricket South Africa) కోర్టుకు లాగాడు. న్యాయపోరాటంలో విజయం కూడా సాధించాడు. జోహన్నెస్బర్గ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో క్రికెట్ సౌతాఫ్రికాకు షాక్ తగిలినట్లైంది. కోర్టు తీర్పు మేరకు షంషికి భారీ ఊరట లభించింది.అసలేం జరిగిందంటే..?SA20 వేలంలో షంషిని ఎం కేప్టౌన్ ఫ్రాంఛైజీ 5 లక్షల ర్యాండ్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్కు షంషి నో చెప్పాడు. సమాంతరంగా ఇతర లీగ్లతో (ILT20, BBL) ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ లీగ్ల్లో ఆడేందుకు షంషికి సొంత దేశ క్రికెట్ బోర్డు (CSA) అనుమతి తప్పనిసరి. ఇక్కడే షంషికి, క్రికెట్ సౌతాఫ్రికాకు వివాదం మొదలైంది.సొంత దేశ క్రికెట్ బోర్డు ఆథ్వర్యంలో జరిగే లీగ్ను కాదని, పరాయి దేశ లీగ్లు ఆడాలనుకున్న షంషికి CSA అనుమతి నిరాకరించింది. NOC ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో షంషి జోహన్నెస్బర్గ్ హైకోర్టును ఆశ్రయించాడు. షంషి పిటీషన్పై విచారణ జరిపిన కోర్టు అతనికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. షంషి విదేశీ లీగ్ల్లో పాల్గొంనేందుకు వీలుగా NOC జారీ చేయాలని క్రికెట్ సౌతాఫ్రికాను ఆదేశించింది. కోర్డు తీర్పు మేరకు షంషి ఇకపై ఏ విదేశీ లీగ్ల్లో అయినా ఆడుకోవచ్చు.ఈ కేసులో క్రికెట్ సౌతాఫ్రికా కూడా తమ వాదనలు వినిపించింది. బోర్డు నిబంధనల ప్రకారం.. SA20 వేలంలో కొనుగోలు చేయబడిన ఏ ఆటగాడైనా తప్పనిసరిగా లీగ్లో ఆడాలి. అయితే షంషి ఈ నిబంధనను ఉల్లంఘించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే NOC ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కోర్టును తెలిపింది.అయితే క్రికెట్ సౌతాఫ్రికా వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆటగాడి జీవనోపాధిని అడ్డుకోకూడదని మందలించింది. షంషి 2024 అక్టోబర్లోనే CSA సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల్లో ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయినా, సౌతాఫ్రికా తరఫున ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
గౌతమ్ గంభీర్పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ప్రయాణం మిశ్రమ ఫలితాలతో కూడుకొని ఉంది. అతని మార్గదర్శకత్వంలో భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అదరగొడుతున్నా.. టెస్ట్ల్లో మాత్రం తేలిపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలొ క్లీన్ స్వీప్తో (0-3)మొదలైన గంభీర్ టెస్ట్ ప్రస్తానం (టీమిండియా హెడ్ కోచ్గా).. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ (0-2) వరకు సాగింది.ఈ మధ్యలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్ పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోయి, ఇంగ్లండ్ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది.టెస్ట్ల్లో పేలవ ట్రాక్ రికార్డు కలిగి ఉండటంతో పాటు అనునిత్యం వివాదాలతో సావాసం చేసే గంభీర్ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్ విధుల నుంచి తప్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో గంభీర్పై వేటు ఖాయమని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.గంభీర్ స్థానంలో భారత టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా వీవీఎస్ లక్షణ్ ఎంపిక ఖరారైందని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేశాయి.ఇదే అంశంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. గంభీర్పై వేటు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టెస్ట్ జట్టు విధుల నుంచి గంభీర్ను తప్పించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. గంభీర్ టెస్ట్ జట్టు కోచ్గా కొనసాగడానికి మద్దతు ప్రకటించారు. సైకియా చేసిన ఈ ప్రకటనతో గంభీర్ టెస్ట్ హెడ్కోచ్మెన్షిప్పై ఊహాగానాలు తొలగిపోయాయి.ముందుంది ముసళ్ల పండగప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో (2005-27) గంభీర్ మార్గదర్శకత్వంలో భారత టెస్ట్ జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది. గంభీర్ రాకకు ముందు వరుసగా రెండు డబ్ల్యూటీసీ సైకిల్స్లో ఫైనల్స్కు చేరిన టీమిండియా.. గత ఎడిషన్లో ఫైనల్స్కు చేరుకుండానే ఇంటిదారి పట్టింది. తాజా సైకిల్లో కూడా పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఈ సైకిల్లో భారత్ ఇప్పటివరకు ఆడిన 9 టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ సైకిల్లో టీమిండియా ఫైనల్కు చేరాలంటే ఇంకా ఆడాల్సిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు సాధించాలి. అయితే ఇలా జరగడం అంత ఈజీగా కనిపించడం లేదు. భారత్ తదుపరి ఐదు ఆస్ట్రేలియాతో, రెండు న్యూజిలాండ్తో ఆడాల్సిన ఉంది. మిగిలిన రెండు శ్రీలంకతో ఆడాల్సి ఉంది. శ్రీలంకపై టీమిండియా పైచేయి సాధించినా.. ఆసీస్, కివీస్పై గెలవడం మాత్రం అంత ఈజీగా కాదు.
పొలార్డ్ విధ్వంసం.. ప్లే ఆఫ్స్కు ముంబై ఇండియన్స్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో ఎంఐ ఎమిరేట్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్ ఘన విజయం సాధించింది. ఎమిరేట్స్కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. డిసెంబర్ 30న జరగనున్న క్వాలిఫైయర్ 1లో 'డెజర్ట్ వైపర్స్' జట్టుతో ఎమిరేట్స్ తలపడనుంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎమిరేట్స్ బౌలర్ల ఆరంభం నుంచే ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపించారు. స్పిన్నర్ అల్లా గజన్ఫర్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. షకీబ్, మౌస్లీ, ఫరూఖీ తలా వికెట్ సాధించారు. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ నబీ(22) టాప్ స్కోరర్గా నిలిచాడు.పొలార్డ్ విధ్వంసం.. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎమిరేట్స్కు ఓపెనర్లు మహమ్మద్ వసీం (27), ఆండ్రీ ఫ్లెచర్ (21) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఫ్లెయర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.అబుదాబి మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ వకార్ సలాంఖైల్కు చుక్కలు చూపించాడు. 14 ఓవర్ వేసిన సలాంఖైల్ బౌలింగ్లో పొలార్డ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లో కిరాన్ నాలుగు సిక్స్లు, ఒక ఫోర్ బాదాడు.ఈ ఒక్క ఓవర్తోనే మ్యాచ్ను ఏకపక్షం చేసేశాడు. ఫలితంగా 123 పరుగుల లక్ష్యాన్ని ఎమిరేట్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. పొలార్డ్ మొత్తంగా 31 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఒక ఫోర్తో 44 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
క్యాచ్ పట్టాడు.. కోటీశ్వరుడు అయ్యాడు! వీడియో వైరల్
క్రికెట్ మ్యాచ్కు చూసేందుకు స్టేడియం వెళ్లిన ఓ అభిమానిని అదృష్టం వరించింది. ఒక్క క్యాచ్తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అవును మీరు విన్నది నిజమే. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 తొలి మ్యాచ్లో పరుగుల వరద పారింది.ఎంఐ కేప్ టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. డర్బన్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (64) టాప్ స్కోరర్గా నిలవగా.. కేన్ విలియమ్సన్ (40), మార్క్రమ్(35) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో ర్యాన్ రికెల్టన్ అద్భుతసెంచరీతో మెరిశాడు. మిగిత బ్యాటర్లను పెద్దగా సహకరం లభించనప్పటికి రికెల్టన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.సూపర్ క్యాచ్..ఈ క్రమంలో 13వ ఓవర్ వేసిన మఫాక బౌలింగ్లో నాలుగో బంతికి రికెల్టన్ భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి నేరుగా స్టాండ్స్లోకి వెళ్లగా అక్కడే ఉన్న ఓ అభిమాని ఒంటి చేత్తో అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. దీంతో అతడు కోటీశ్వరుడయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ నిబంధనల ప్రకారం.. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఎవరైనా సిక్స్ కొట్టినప్పుడు 2 మిలియన్ రాండ్లు(భారత కరెన్సీలో రూ. 1.08 కోట్లు) బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ సీజన్లో ఈ భారీ నగదు బహుమతిని గెలుచుకున్న మొదటి వ్యక్తి అతడే. ఒకవేళ టోర్నమెంట్ మొత్తం మీద మరికొంతమంది కూడా ఇలాంటి క్యాచ్లు పడితే, ఈ 2 మిలియన్ రాండ్ల మొత్తాన్ని వారందరికీ సమానంగా పంచుతారు. కాగా ఈ మ్యాచ్లో ఎంఐ కేప్ టౌన్పై 15 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.చదవండి: IND vs NZ: రిషబ్ పంత్కు భారీ షాక్.. జట్టులోకి డబుల్ సెంచరీ వీరుడు!First match, first #BetwayCatch2Million catch 👌💯#BetwaySA20 #MICTvDSG #WelcomeToIncredible pic.twitter.com/ftDVL1CtWy— Betway SA20 (@SA20_League) December 26, 2025
క్వార్టర్ ఫైనల్లో రష్మిక
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహ...
అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!
‘‘ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కట...
వివాహబంధంలో వీనస్
ఫ్లోరిడా: అమెరికా సీనియర్ టెన్నిస్ క్రీడాకారిణి,...
సూర్య చరిష్మా ముందంజ
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప...
సొంత దేశ క్రికెట్ బోర్డునే కోర్టుకు లాగిన సౌతాఫ్రికా ప్లేయర్
సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంషి సొ...
గౌతమ్ గంభీర్పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ప్రయాణం మిశ...
పొలార్డ్ విధ్వంసం.. ప్లే ఆఫ్స్కు ముంబై ఇండియన్స్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో ఎంఐ ఎమిరేట్స్ విజయ...
క్యాచ్ పట్టాడు.. కోటీశ్వరుడు అయ్యాడు! వీడియో వైరల్
క్రికెట్ మ్యాచ్కు చూసేందుకు స్టేడియం వెళ్లిన ఓ అభ...
క్రీడలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
నా సూపర్స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
వీడియోలు
సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్
భారత్ సిరీస్ క్లీన్ స్వీప్.. శ్రీలంక చిత్తు..
మహిళా క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్
సిరీస్ పై భారత్ ఫోకస్
ఇషాన్ ఊచకోత.. MS ధోని రికార్డు బ్రేక్
శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..
దుఃఖాన్ని దిగమింగుకొని స్మృతి మంధాన విశ్వరూపం
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
IPL Auction 2026: ఈసారి కూడా కప్పు పాయే!
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్
