ప్రధాన వార్తలు
శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లపై వేటు
స్వదేశంలో ఇంగ్లండ్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు శ్రీలంక క్రికెట్ 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్రౌండర్ దాసున్ షనక నాయకత్వం వహించనున్నాడు. ఇంగ్లండ్తో జరగిన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన పవన్ రత్నాయకే(121)కు టీ20 జట్టులో కూడా చోటు దక్కింది.సీనియర్ బ్యాటర్ కుశాల్ పెరీరాకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. పేలవమైన ప్రదర్శన కారణంగా పేసర్ నువాన్ తుషార, ఆల్ రౌండర్ కమిందు మెండిస్, లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంతలపై సెలెక్టర్లు వేటు వేశారు. వీరి ముగ్గురు శ్రీలంక టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది.ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపికైన 16 మంది సభ్యులే దాదాపుగా శ్రీలంక టీ20 ప్రపంచ కప్ ఫైనల్ స్క్వాడ్లో ఉండే అవకాశం ఉంది. శ్రీలంక సెలెక్టర్లు మరోసారి స్పిన్నర్లపై నమ్మకం ఉంచారు. ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలాగేలు స్పిన్నర్లగా చోటు దక్కించుకున్నారు.పేస్ విభాగంలో మతీష పతిరణ, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, ఈషన్ మలింగ వంటి స్టార్ పేసర్లు ఉన్నారు. ఇక ఈ సిరీస్ టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరగనుంది. జనవరి 30 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు టీ20 మ్యాచ్లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.ఇంగ్లండ్తో టీ20లకు శ్రీలంక జట్టుదసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిశ్రా, కుసల్ మెండిస్, కుసల్ జనిత్ పెరీరా, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, జనిత్ లియానగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, మహిష్ తీక్షణ, మతీష పతిరణ, ఈషన్ మలింగ, దుష్మంత చమీర
నన్ను అవమానిస్తున్నారా?: టెన్నిస్ దిగ్గజం ఫైర్
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్కు కోపమొచ్చింది. విలేఖరి అడిగిన ప్రశ్న తనను అవమానించేలా ఉందంటూ అతడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. జొకోవిచ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్-2026తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అదృష్టవశాత్తూ..ఈ క్రమంలో పురుషుల సింగిల్స్ విభాగంలో అతడు సెమీ ఫైనల్కు చేరాడు. ఇప్పటికే ఈ టోర్నీలో పదిసార్లు చాంపియన్గా నిలిచిన జొకోవిచ్ (Novak Djokovic) బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో ఇటలీ స్టార్ లొరెంజో ముసెట్టితో తలపడ్డాడు.ముసెట్టితో జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ తొలి రెండు సెట్లను 4–6, 3–6తో కోల్పోయాడు. మూడో సెట్లో మాత్రం 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో ముసెట్టి కాలికి గాయం కావడంతో అతడు వైదొలిగాడు. దాంతో ఓడిపోయే అవకాశాలున్న చోట జొకోవిచ్ అదృష్టవశాత్తూ విజయతీరానికి చేరాడు.సెమీస్లో సినెర్తో జొకోవిచ్మరోవైపు... డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో 6–3, 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)పై సినెర్ విజయం సాధించాడు. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో జ్వెరెవ్ (జర్మనీ)తో అల్కరాజ్; సినెర్తో జొకోవిచ్ తలపడతారు. టెన్నిస్ దిగ్గజం ఫైర్అయితే, సెమీస్ చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన జొకోవిచ్కు.. ఇప్పుడు సెనెర్, కార్లెస్ అల్కరాజ్లను మీరు ఛేజ్ చేస్తున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు చిర్రెత్తిపోయిన జొకోవిచ్.. ‘‘నేను సెనెర్, కార్లోస్ను ఛేజ్ చేస్తున్నానా? ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగారు?.. నేనెప్పుడూ ఛేజర్గానే ఉంటానా?నన్నెవరూ ఛేజ్ చేయరా? 24 గ్రాండ్స్లామ్లు గెలిచిన నాకు అంత సత్తా లేదంటారా? ఇలా అడిగి నన్ను అవమానిస్తున్నారా? మీ మాటలు నన్ను కించపరిచేవిగా ఉన్నాయి. ఒకప్పుడు రఫా (రఫెల్ నాదల్), రోజర్ ఫెడరర్ను ఛేజ్ చేస్తున్నా అన్నారు. ఇప్పుడు సినెర్, కార్లోస్లను చేస్తున్నా అంటున్నారు.ఆ కోణంలో చూడటం లేదా?పదిహేనేళ్ల కెరీర్లో గ్రాండ్స్లామ్లలో మేటి విన్నర్గా ఉన్నా.. మీరు ఆ కోణంలో చూడటం లేదా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్లో పదిసార్లు చాంపియన్గా నిలిచిన ఘనత జొకోవిచ్ సొంతం. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 24 గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచాడు 38 ఏళ్ల ఈ టెన్నిస్ స్టార్. అయితే, ఆస్ట్రేలియా ఓపెన్లో గత రెండు పర్యాయాలుగా జొకోవిచ్కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. సెనెర్ చాంపియన్గా అవతరించగా.. జొకోవిచ్ ఫైనల్ కూడా చేరలేకపోయాడు.చదవండి: అల్కరాజ్ తొలిసారి...
టీ20 వరల్డ్కప్ని పాక్ బాయ్కాట్ చేస్తే.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ పాల్గొనడంపై ఇంకా సందిగ్థత కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించినప్పటికి.. శ్రీలంకకు వెళ్లేందుకు ఇంకా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీని తెలిపాడు. అయితే పాకిస్తాన్ తమకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని అనవసర రచ్చ చేస్తుంది.వివాదం ఎక్కడ మొదలైదంటే?ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్ను తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్కప్ కోసం తమ జట్టును భారత్కు పంపించేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.భద్రత పరంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినప్పటికి బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఐసీసీ వరల్డ్కప్ నుంచి బంగ్లాను తప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. పాక్ వరల్డ్కప్లో పాల్గోనడంపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.పాక్ బాయ్కట్ చేస్తే?పాకిస్తాన్ గనుక ఈ మెగా టోర్నీని బహిష్కరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. వరల్డ్ క్రికెట్లో పాకిస్తాన్-భారత్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురుంచి తెలిసిందే. ఈ క్రమంలో పాక్-భారత్ మ్యాచ్ రద్దు అయితే బ్రాడ్కాస్టర్లు.. స్పాన్సర్ల నుంచి వచ్చే ప్రకటనల ఆదాయాన్ని(సుమారు రూ. 318) కోల్పోవాల్సి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ఆ నష్టానికి పాక్ క్రికెట్ బోర్డు నుంచే వసూలు చేస్తామని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది.👉అదేవిధంగా టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాలర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది.👉పాక్ సెమీఫైనల్ చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు), రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు), ఒకవేళ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు👉అంతేకాకుండా ఐసీసీ ప్రతీ ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీయాల్సిందే. ఫైనల్గా పాకిస్తాన్ తమ ప్రదర్శన బట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాలర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే ప్రమాదం ఉంది.
శివాలెత్తిన శివమ్ దూబే.. రోహిత్ శర్మ రికార్డు సమం
వైజాగ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి.. ఆల్రౌండర్ శివమ్ దూబే మాత్రం తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో భారత జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. మెన్ ఇన్ బ్లూ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓవైపు క్రమం తప్పుకొండా వికెట్లు పడుతున్నప్పటికి ఈ ముంబై స్టార్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగించాడు. భారత ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఇష్ సోధీకి దూబే చుక్కలు చూపించాడు.ఆ ఓవర్లో దూబే ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన దూబే.. ఆ తర్వాత వరుసగా 4,6,4,6,6 బాదాడు. ఈ క్రమంలో ఒకే అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డును దూబే సమం చేశాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్(36), సంజూ శాంసన్(30) తొలి రెండు స్ధానాల్లో ఉన్నాడు.అయితే ఓ దశలో మ్యాచ్ను గెలిపించేలా కన్పించిన దూబే.. దురదృష్టవశాత్తు రనౌట్గా వెనుదిరిగాడు. మొత్తంగా కేవలం 23 బంతుల్లో మాత్రమే ఎదుర్కొన్న దూబే 7 ఫోర్లు, 3 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. దూబేతో పాటు రింకూ సింగ్(39) రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.कल शिवम दुबे ने 15 गेंदों पर फिफ्टी पीट दिया।घोड़े के पैर में जंजीर नहीं बाधेंगे तो वो इतिहास ही रचेगा।pic.twitter.com/6f80FCvmlJ— Shubham Shukla (@Shubhamshuklamp) January 29, 2026
ఇంతకంటే ఇంకేం కావాలి: మిచెల్ సాంట్నర్
టీమిండియాతో టీ20 సిరీస్లో న్యూజిలాండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. విశాఖపట్నంలో బుధవారం జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ సేనను 50 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా భారత్ ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది.టీమిండియా మాదిరే ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) స్పందించాడు. ‘‘మా ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా పవర్ప్లేలో మా వాళ్లు అద్భుతం. టీమిండియా మాదిరే మా ఆటగాళ్లు కూడా పవర్ప్లేలో కావాల్సినన్ని పరుగులు రాబట్టారు.అందుకే మేము మెరుగైన స్కోరు సాధించాము. టీమిండియా లాంటి జట్టుకు 200 మేర లక్ష్యం ఎంతమాత్రం మాకు సురక్షితం కాదు. వాళ్లు సులువుగానే ఈ టార్గెట్ను ఛేదించగలరు. గత మ్యాచ్లో మాకు ఈ విషయం చాలా బాగా అర్థమైంది.అద్భుతమైన ఫినిషింగ్ టచ్మధ్య ఓవర్లలో మేము వికెట్లు కోల్పోవడం కాస్త ఆందోళన కలిగించింది. అయితే, డారిల్ మిచెల్, ఫౌల్క్స్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. భారత్లో వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాతో ఆడటం కంటే గొప్ప సన్నాహకం ఇంకేం ఉంటుంది. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి.మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంపై దృష్టి సారించాము. వరల్డ్కప్ టోర్నీలో ఎవరి పాత్ర ఎలా ఉండాలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాము. పవర్ ప్లేలో వికెట్లు తీయడం మాకు కలిసి వచ్చింది’’ అని సాంట్నర్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.ఫిబ్రవరి 7 నుంచి..కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు సన్నాహకంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ను సొంతం చేసుకుంది. నామమాత్రపు నాలుగో టీ20లో మాత్రం కివీస్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. సిరీస్ కోల్పోయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు ఊరట దక్కే విజయాన్ని న్యూజిలాండ్ అందుకుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ నాలుగో టీ20 స్కోర్లున్యూజిలాండ్-215/7(20)టీమిండియా- 165(18.4)ఫలితం: యాభై పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ సీఫర్ట్ (36 బంతుల్లో 62).చదవండి: తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన
'ఇదేమి బ్యాటింగ్'.. సంజూపై గవాస్కర్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ టీమ్ మెనెజ్మెంట్కు తలనొప్పిగా మారింది. ఈ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.తొలి మూడు టీ20ల్లో విఫలమైన సంజూ.. బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లోనూ నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ నేపథ్యంలో శాంసన్ ఔట్ అయిన తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.'శాంట్నర్ బౌలింగ్లో సంజూ అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. అతడి బ్యాటింగ్లో ఫుట్ వర్క్ అస్సలు లేదు. బంతి పెద్దగా టర్న్ అవ్వకపోయినా, కేవలం రూమ్ కల్పించి ఆఫ్-సైడ్ ఆడాలనే తొందరలో క్లీన్ బౌల్డయ్యాడు. శాంసన్ తరచుగా లెగ్-స్టంప్ బయటకు కదులుతూ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో మూడు స్టంప్లు బౌలర్కు క్లియర్గా కనిపిస్తున్నాయి. బౌలర్ స్టంప్స్ను టార్గెట్ చేయడంతో అతడు క్లీప్ బౌల్డ్ అవ్వాల్సి వచ్చింది" అని కామెంటరీ బాక్స్లో ఉన్న గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన సంజూ కేవలం 40 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్కప్ తుది జట్టులో సంజూ స్ధానంపై సందిగ్థత నెలకొంది. ఎందుకంటే ప్రత్యామ్నయ ఓపెనర్గా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన రీ ఎంట్రీలో ఇరగదీస్తున్నాడు. సంజూ స్ధానంలో ఓపెనర్గా ఇషాన్కు చోటు ఇవ్వాలని చాలా మంది సూచిస్తున్నారు.చదవండి: తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన
తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో 3-0తో వైట్వాష్.. ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం.. సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత తొలిసారి సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్లో 2-0తో వైట్వాష్.. తాజాగా స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ (2-1) కోల్పోవడం..పదవి నుంచి తొలగించాలిగౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత టీమిండియా చవిచూసిన ఘోర పరాభవాలు ఇవి.. ఈ నేపథ్యంలో అతడిని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి. భారత జట్టు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులేఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యంగ్యరీతిలో స్పందించారు. ‘‘ఇండియాలో 140 కోట్ల మందితో కూడిన దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులే. ప్రతి ఒక్కరికి వారికంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం.కాబట్టి మనం ఎవరినీ మాట్లాడకుండా ఆపలేము. మీడియా సహా అందరూ తమ అభిప్రాయాలను చెబుతూనే ఉంటారు. వార్తా సంస్థలు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు.. ఇతర వ్యక్తులు అంతా ఎప్పటికప్పుడు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది సోషల్ మీడియా యుగం.వారిదే తుది నిర్ణయంఅయితే, బీసీసీఐలో క్రికెట్ కమిటీ ఉంటుంది. అందులో మాజీ క్రికెటర్లు ఉంటారు. వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు.. జట్టు ఎంపిక కోసం ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా అర్హత ప్రకారమే ఆ స్థానానికి చేరుకున్నారు. వాళ్లకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి.అయితే, ఇతరులు వాటితో విభేదించవచ్చు. అయినప్పటికీ బోర్డులోని వ్యక్తుల మాటలు, నిర్ణయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. క్రికెట్ కమిటీ, సెలక్టర్లదే తుది నిర్ణయం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్స్టార్తో పేర్కొన్నారు. చదవండి: Suryakumar Yadav: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే
టీమిండియాతో మల్టీ ఫార్మాట్ సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
భారత మహిళలతో జరగనున్న మల్టీ-ఫార్మాట్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించింది. ఆసీస్ టీ20 కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ సోఫీ మోలినెక్స్ ఎంపికైంది. భారత్తో సిరీస్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు అలిస్సా హీలీ రిటైర్మెంట్ ప్రకటించనున్న నేపథ్యంలో.. ఆమె వారసురాలిగా మోలినెక్స్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.ప్రస్తుత సిరీస్లో టీ20 జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్న మోలినెక్స్.. అనంతరం మూడు ఫార్మాట్లలో జట్టు పగ్గాలను చేపట్టనుంది. ఆసీస్ జట్టులో సీనియర్లు ఆష్లీ గార్డనర్, తహిలియా మెక్గ్రాత్ వంటి సీనియర్లు ఉన్నప్పటికి మోలినెక్స్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. బిగ్ బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్గా మోలినెక్స్ విజయవంతం కావడంతో ఇప్పుడు జాతీయ జట్టును నడిపించే అవకాశం దక్కింది. దేశవాళీ క్రికెట్లో విక్టోరియా జట్టుకు కెప్టెన్గా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది.ఇక భారత్ టెస్టు సిరీస్కు ఆసీస్ జట్టులో యువ ఆల్రౌండర్ లూసీ హామిల్టన్కు సెలెక్టర్లు చోటిచ్చారు. హామిల్టన్ ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్లో కేవలం 15 ఏళ్ల వయస్సులోనే క్వీన్స్ల్యాండ్ తరపున అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత బిగ్ బాష్ లీగ్లో కేవలం 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం ఆమె డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తోంది. టీ20ల్లో చోటు దక్కని స్పిన్నర్ అలానా కింగ్కు వన్డే జట్టులో సెలక్టర్లు అవకాశమిచ్చారు. అదేవిధంగా గాయం కారణంగా డబ్ల్యూపీఎల్ మధ్యలోనే వైదొలిగిన ఫోబ్ లిచ్ఫీల్డ్కు భారత్తో సిరీస్లకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కడం గమనార్హం. ఫిబ్రవరి 15 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.ఆసీస్ టీ20 జట్టుడార్సీ బ్రౌన్, నికోలా కేరీ, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, ఫోబ్ లిచ్ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అనబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.ఆసీస్ వన్డే జట్టుడార్సీ బ్రౌన్, నికోలా కేరీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, అలానా కింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, బెత్ మూనీ, తహిలియా మెక్గ్రాత్, ఎల్లీస్ పెర్రీ, అనబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.ఆసీస్ టెస్టు జట్టుడార్సీ బ్రౌన్, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, అలానా కింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, బెత్ మూనీ, తహిలియా మెక్గ్రాత్, ఎల్లీస్ పెర్రీ, అనబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.
టీమిండియాకు బ్యాడ్ న్యూస్
టీ20 వరల్డ్కప్-2026కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో గాయపడిన స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పొట్టి ప్రపంచకప్లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్లకు అతడు దూరం కానున్నట్లు సమాచారం.పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న సుందర్.. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో కోలుకుంటున్నాడు. వాషీ తాజాగా నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే ప్రాక్టీస్ సందర్భంగా ఇంకా పక్కటెముకల వద్ద నొప్పి ఉండటంతో అతను ఇబ్బంది పడుతున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలోనే గ్రూప్ స్టేజ్లో భారత్ ఆడే రెండు(అమెరికా, నమీబియా) మ్యాచ్లకు అతడు దూరం కానున్నాడు. అయితే ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్ నాటికి సుందర్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి."పాక్తో మ్యాచ్కు ఇంకా 15 రోజుల సమయం ఉంది. అప్పటికి వాషింగ్టన్ సుందర్ కోలుకుంటాడనే నమ్మకంతో ఉన్నాం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను కట్టడి చేయడానికి అతడు మాకు చాలా ముఖ్యం. ప్రస్తుతం జట్టులో ఆఫ్-స్పిన్ బౌలర్లు తక్కువగా ఉండడంతో రవి బిష్ణోయ్ను ఉపయోగించుకుంటున్నాము" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు సుందర్కు ప్రత్యామ్నాయంగా రవి బిష్ణోయ్ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు.చదవండి: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే: సూర్యకుమార్
పాక్కు చుక్కలు చూపించిన ఆటగాడిపై ఐసీసీ వేటు
టీ20 ప్రపంచకప్-2026కు ముందు అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఆరోన్ జోన్స్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) సస్పెన్షన్ వేటు వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. బార్బడోస్ వేదికగా జరిగిన బిమ్ టీ10 టోర్నమెంట్-2024 సీజన్లో జోన్స్ మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడని ఐసీసీ విచారణలో ప్రాథమికంగా తేలింది. ఈ క్రమంలోనే అతడు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లలో ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది.తనపై వస్తున్న ఆరోపణలపై 14 రోజుల సమాధానమివ్వాలని అతడిని ఐసీసీ ఆదేశించింది. ఆరోన్ జోన్స్పై మొత్తం ఐదు అభియోగాలు నమోదయ్యాయి. వీటిలో మూడు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పరిధిలోకి రాగా, మిగిలిన రెండు ఐసీసీ రిజిస్టర్ చేసింది. ఈ లీగ్లో ఆడే సమయంలో జోన్స్ను బుకీలు సంప్రదించగా.. అతడు ఆ వివరాలను అధికారులకు తెలియజేయలేదు. ఈ కారణంతో ఐసీసీ వేటు వేసింది. అమెరికా జట్టులో జోన్స్ రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా సూపర్-8 చేరడంలో ఆరోన్ది కీలక పాత్ర. ముఖ్యంగా పాకిస్తాన్పై అమెరికా సాధించిన చారిత్రాత్మక విజయంలో అతడి ఇన్నింగ్స్ మరువలేనిది.అటువంటి ఆటగాడు ఇప్పుడు తనంతంట తానే కెరీర్ను ప్రమాదంలో పడేసుకున్నాడు. ఈ సస్పెన్షన్ కారణంగా రాబోయే 2026 టీ20 ప్రపంచ కప్లో జోన్స్ ఆడే అవకాశం కోల్పోయాడు. జోన్స్ ఇప్పటివరకు అమెరికా తరపున 52 వన్డేలు, 48 టీ20లు ఆడాడు.చదవండి: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే: సూర్యకుమార్
అల్కరాజ్ అదరహో
మెల్బోర్న్: ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేస...
‘పద్మభూషణ్’ విజయ్ అమృత్రాజ్
న్యూఢిల్లీ: తన ఆటతీరుతో అంతర్జాతీయస్థాయిలో భారత టె...
గుకేశ్కు వరుసగా రెండో ఓటమి
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ చెస్ ...
జొకోవిచ్ @ 400
మెల్బోర్న్: స్టార్ ఆటగాడు, వరల్డ్ మాజీ నంబర్వ...
టీమిండియాతో మల్టీ ఫార్మాట్ సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
భారత మహిళలతో జరగనున్న మల్టీ-ఫార్మాట్ సిరీస్ కోసం క...
టీమిండియాకు బ్యాడ్ న్యూస్
టీ20 వరల్డ్కప్-2026కు ముందు టీమిండియాకు బ్యాడ్ న...
పాక్కు చుక్కలు చూపించిన ఆటగాడిపై ఐసీసీ వేటు
టీ20 ప్రపంచకప్-2026కు ముందు అమెరికా జట్టుకు ఊహించ...
ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే: సూర్యకుమార్
టీ20ల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాక...
క్రీడలు
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
వీడియోలు
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
పాక్ బాటలో బంగ్లాదేశ్..! అదే జరిగితే
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
