Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Massive Update Arrives On SRH Players Who Left IPL Suddenly1
స్వదేశానికి వెళ్లిన సన్‌రైజర్స్‌ విదేశీ ప్లేయర్లు

ఐపీఎల్‌ 2026 మధ్యలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు శ్రీలంక ప్లేయర్లు (దిల్షన్‌ మధుషంక, ఎషాన్‌ మలింగ, కమిందు మెండిస్‌) అర్దాంతరంగా స్వదేశానికి వెళ్లారు. ఏప్రిల్‌ 29న ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం తర్వాత ఇది జరిగింది. లంక క్రికెట్‌ బోర్డు మధుషంక, మలింగ, కమిందును అత్యవసరంగా స్వదేశానికి రావాలని సందేశం పంపింది.NEWS 🚨Sri Lankan cricketers Dilshan Madushanka, Eshan Malinga, and Kamindu Mendis, who are representing SRH in the IPL, arrived in Sri Lanka early this morning.#sportspavilionlk #ipl2026 #MIvsSRH #EshanMalinga #fypシ゚viralシfypシ゚viralシalシ pic.twitter.com/dMwWZJ74S8— DANUSHKA ARAVINDA (@DanuskaAravinda) April 30, 2026శ్రీలంక జట్టు త్వరలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనకు సంబంధించిన వీసా బయోమెట్రిక్స్ పూర్తి చేసుకోవడానికి పై ముగ్గురు స్వదేశానికి వెళ్లారు. ఈ త్రయం విండీస్‌లో పర్యటించబోయే లంక జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.వీసా ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం, మధుషంక, మలింగ, కమిందు తిరిగి ఇవాళ ( మే 1) ఉదయం భారత్‌కు వచ్చి ఎస్‌ఆర్‌హెచ్ శిబిరంలో చేరారు. దీంతో మే 3న కేకేఆర్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు వీరు అందుబాటులో ఉండనున్నారు. ఈ విషయం తెలియక​ సోషల్‌మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి.ఈ ముగ్గురు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యంతో గొడవపడి స్వదేశానికి వెళ్లిపోయారని కొందరు.. గాయాల కారణంగా జట్టును వీడారని ఇంకొందరు ప్రచారం చేశారు. చివరికి లంక బోర్డు చెందిన కీలక అధికారి ఒకరు వివరణ ఇవ్వడంతో ఈ ఫేక్‌ ప్రచారానికి పుల్‌స్టాప్‌ పడింది.దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే, ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తి (ఎషాన్‌ మలింగ) పై ముగ్గురిలో ఉన్నారు. మంచి లయలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు మలింగ లాంటి బౌలర్‌ ఒక్క మ్యాచ్‌కు దూరమైనా తీవ్ర పరిణామాలు ఉంటాయి.మలింగ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. మదుషంక ఒక మ్యాచ్‌లో ఆడి వికెట్ సాధించగా, కమిందు మెండిస్‌కు ఇంకా తుది జట్టులో అవకాశం రాలేదు.కాగా, సీజన్‌ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్‌రైజర్స్‌ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. పంజాబ్‌, ఆర్సీబీ టాప్‌-2లో ఉన్నాయి.

Gill Shows Virat Kohli RCB Place As Latter Continues Charging At Him2
Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్‌!

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు గుజరాత్‌ టైటాన్స్‌ షాకిచ్చింది. గత వారం ఎదురైన పరాభవానికి సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఐపీఎల్‌-2026లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా గురువారం గుజరాత్‌- ఆర్సీబీ తలపడ్డాయి.కోహ్లి, గిల్‌ స్కోర్లు ఎంతంటే?ఇందులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులుకు ఆలౌటైంది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా, విరాట్‌ కోహ్లి (13 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.అనంతరం గుజరాత్‌ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 12 పరుగులు చేయడంతోపాటు, 2 వికెట్లు పడగొట్టి, 3 క్యాచ్‌లు పట్టిన జేసన్‌ హోల్డర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఆర్సీబీ దిగ్గజం, కింగ్‌ కోహ్లి- గుజరాత్‌ కెప్టెన్‌, ప్రిన్స్‌ గిల్‌ మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు వైరల్‌ అవుతున్నాయి. మ్యాచ్‌ సమయంలో గిల్‌ పట్ల పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఆ తర్వాత మాత్రం అతడిని టీజ్‌ చేశాడు. ఇందుకు గిల్‌ కూడా గట్టిగానే బదులిచ్చాడు.Vintage #ViratKohli energy! 🔥KING catches, PRINCE departs - Absolute cinema! 🙌 🎯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/jCKi1Qo4zA— Star Sports (@StarSportsIndia) April 30, 2026ఏడిపించిన కోహ్లి.. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో గిల్‌ ఇచ్చిన క్యాచ్‌ పట్టిన కోహ్లి.. అతడు పెవిలియన్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసమయంలో కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకోగా.. గిల్‌ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్‌ డగౌట్లో కూర్చోగా.. ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి.. అతడిని అవుట్‌ చేసిన విధానాన్ని సైగలతో చూపిస్తూ టీజ్‌ చేశాడు.Virat Kohli: "Ye le thullu, kaise catch out kiya 😭"Shubman Gill: "Scoreboard dekh lo, kya hi farak padta hai? Hum jeet rahe hain!"Kohli: "Run-out hote-hote bacha tu, kaise bhaag raha tha!"Gill: "Chhodo jaane do, Virat bhai hai ❤️" pic.twitter.com/KCWwV0xDWk— GillTheWill (@GillTheWill77) May 1, 2026ఇచ్చిపడేసిన గిల్‌!ఇందుకు గిల్‌.. ‘స్కోరు బోర్డు చూడు భయ్యా.. నేను అవుటైతే ఏంటి? గెలిచేది మేమే’ అన్నట్లుగా తానూ సైగలతోనే కౌంటర్‌ వేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత.. ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గిల్‌- కోహ్లి ఆలింగనం చేసుకుని నవ్వులు చిందించారు.అయితే, ఆ తర్వాత కూడా గిల్‌ కోహ్లి, ఆర్సీబీని వదిలిపెట్టలేదు. కోహ్లి, తానూ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘జేసన్‌ హోల్డర్‌.. ప్లే హోల్డ్‌ బోల్డ్‌.. ఈరోజు రాత్రి అత్యద్భుతమైన ప్రదర్శన’ అంటూ ఆర్సీబీ, కోహ్లిని టార్గెట్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఇచ్చిన క్యాచ్‌ను హోల్డర్‌ పట్టాడు.అయితే, ఇది క్లీన్‌ క్యాచ్‌ కాదని కోహ్లి వాదించగా.. థర్డ్‌ అంపైర్‌ మాత్రం అవుట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, ఫలితం మాత్రం గుజరాత్‌కు మేలు చేసింది. మరోవైపు.. ఆర్సీబీ ప్లే బోల్డ్‌ అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ గిల్‌ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.చదవండి: కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్‌ మాస్‌ వార్నింగ్‌! The award for the best senior and junior duo goes to… 😁#TATAIPL #GTvRCB #ShubmanGill #ViratKohli pic.twitter.com/4lccF2wv9u— Star Sports (@StarSportsIndia) April 30, 2026

He should definitely be considered for T20I comeback: Sehwag3
భారత టీ20 జట్టులోకి అతడిని తిరిగి తీసుకోండి: సెహ్వాగ్‌

భువనేశ్వర్‌ కుమార్‌... ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకడిగా వెలుగొందాడు ఈ పేసర్‌. చివరగా 2022లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తిరిగి పునరాగమనం చేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్నాడు. దేశీ, లీగ్‌‍ క్రికెట్లో మరోసారి తనను తాను నిరూపించుకుంటున్నాడు.చోటే లేదు!అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం భువీని కనికరించడం లేదు. ఇప్పటికే పేస్‌ బౌలింగ్‌ విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా నాయకుడిగా పాతుకుపోగా.. మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌ తదితరులు కూడా కీలక సభ్యులుగా కొనసాగతున్నారు. దీంతో భువీకి టీమిండియా తలుపులు దాదాపుగా మొత్తానికే మూసుకుపోయాయి.అయితే, భారత మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ మాత్రం భువనేశ్వర్‌ కుమార్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలని అంటున్నాడు. కాగా ఐపీఎల్‌-2025లో ఆర్సీబీని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన భువీ.. తాజా ఎడిషన్‌లోనూ రాణిస్తున్నాడు. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లోనూ ఈ రైటార్మ్‌ పేసర్‌ అదరగొట్టాడు.అత్యధిక వికెట్ల వీరుడిగానాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన భువీ.. 28 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మొత్తంగా 2026 సీజన్‌లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్ల వీరుడిగా ప్రస్తుతానికి పర్పుల్‌ క్యాప్‌ తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ భువీపై ప్రశంసలు కురిపించాడు.తిరిగి టీ20 జట్టులోకి తీసుకోండిక్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీస్తున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.అతడి వయసు 35 లేదంటే 36 ఏళ్లు ఉండొచ్చు. అయితే, ఇదే విధంగా అద్భుతంగా బౌలింగ్‌ కొనసాగిస్తే.. టీ20 క్రికెట్‌లో అతడి పునరాగమనం గురించి టీమిండియా సెలక్టర్లు తప్పక ఆలోచించాలి. బుమ్రా- భువీ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది. వింటేజ్‌ భువీ జట్టుకు తప్పక ఉపయోగపడతాడు’’ అని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.You miss, I hit! 🎯#BhuvneshwarKumar has dismissed #JosButtler for the 9th time in 20 T20 innings! 🤯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/QnL7Vybkp7— Star Sports (@StarSportsIndia) April 30, 2026చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

Army training before T20 World Cup 20264
ఇంగ్లండ్ జట్టుకు ఆర్మీ ట్రైనింగ్‌.. ఎందుకో తెలుసా?

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోనే తమ మహిళా జట్టుకు బ్రిటీష్ ఆర్మీతో కలిసి ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ఈసీబీ సిద్దమైంది. తమ క్రీడాకారుల్లో మానసిక స్థైర్యాన్ని, నిర్ణయాత్మక శక్తిని పెంచేందుకు ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు పాకిస్తాన్ జట్టు కూడా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్‌లో శిక్షణ పొందారు.ఇప్పుడు అదే బాట‌లో ఇంగ్లండ్ క్రికెట్ కూడా న‌డ‌వ‌నుంది. దాదాపు 15 రోజుల పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు ఈ ట్రైనింగ్ క్యాంపులో పాల్గోనున్న‌ట్లు తెలుస్తోంది. విస్డెన్ ప్రకారం.. ఈ ఆర్మీ క్యాంప్ కారణంగా ప్ర‌పంచ‌క‌ప్‌ జట్టులోని 15 మంది సభ్యులు మే 2 నుంచి ప్రారంభం కానున్న వన్డే కప్ సెకెండ్ రౌండ్‌కు దూరంగా ఉండ‌నున్నారు.బ్రిటీష్ ఆర్మీ వ‌ద్ద శిక్ష‌ణ పొందేందుకు వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టును పంప‌డం మాకు ల‌భించిన‌ గొప్ప అవ‌కాశం. అక్కడ నేర్చుకునే విషయాలు మైదానంలో పోరాడేందుకు వారికి ఎంతో సహాయపడతాయి అని ఈసీబీ మహిళల క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ క్లేర్ కానర్ ధీమా వ్య‌క్తం చేశారు. కాగా 2010-11 యాషెస్ సిరీస్ సమయంలో ఇంగ్లండ్ పురుష‌ల జ‌ట్టు కూడా ఇలాంటి ఆర్మీ తరహా శిక్షణ (బాక్సింగ్, అటవీ ప్రాంతాల్లో లాంగ్ హైకింగ్) పొందింది.కాగా జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో 12 జట్లు రెండు గ్రూప్‌లుగా (ఏ, బీ) విడిపోయి పోటీపడనున్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ ఉండగా.. గ్రూప్‌-బిలో స్కాట్లాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ ఉన్నాయి. ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టు ఇదేనాట్ సైవర్-బ్రంట్ (కెప్టెన్), లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, ఏమీ జోన్స్, ఫ్రేయా కెంప్, హెథర్ నైట్, లిన్సీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వైట్-హాడ్జ్.

You Will Be On Floor: Did Klaasen Warn Fan For Recording His Family Viral5
కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్‌ మాస్‌ వార్నింగ్‌!

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస విజయాల్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ది కీలక పాత్ర. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ నిలకడగా రాణిస్తూ.. కష్టాల్లో ఉన్న వేళ జట్టును ఆదుకుంటున్నాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. ఫ్రాంఛైజీ తనకోసం వెచ్చించిన రూ. 23 కోట్లకు తన ఆటతో న్యాయం చేస్తున్నాడు.414 పరుగులుఇప్పటికి ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి క్లాసెన్‌ 414 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా బరిలోకి దిగిన క్లాసెన్‌.. 30 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.తదుపరి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్‌ సన్నద్ధవుతున్నాడు. ఇదిలా ఉంటే.. క్లాసెన్‌ పేరిట ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఉన్న దృశ్యాల ప్రకారం.. క్లాసెన్‌ తన కుటుంబంతో కలిసి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు.నేను చెప్పేది జాగ్రత్తగా వినుఇందుకు క్లాసెన్‌ తనదైన శైలిలో గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు. ‘‘ఫొటోలు, వీడియోలు తీయొద్దు సరేనా!.. నేను చెప్పేది జాగ్రత్తగా విను.. రికార్డు చేయొద్దు ఒకేనా!’’ అని క్లాసెన్‌ హెచ్చరించాడు. ఇందుకు సదరు వ్యక్తి.. ‘‘నీ జట్టును వదిలెయ్‌.. నువ్వు బాగా ఆడుతున్నావు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ.. కానీ ఫొటో మాత్రం తీయొద్దు.POV: meeting a foreign cricketer in India…. Dude just give him and his family some privacy for gods sake.What a man Klaasy 🙏 cinema lo hero villain ki warning ela isthado ala ichadu 😂🔥 good man 🧡#SRH #IPL2026 pic.twitter.com/imwBT2c8wi— Varun Velamakanti 🦅 (@CricVarunSRH) April 30, 2026ఒకవేళ నేను అటు తిరగగానే నన్ను, నా కుటుంబాన్ని ఫొటో తీశావనుకో.. ఒట్టేసి చెబుతున్నా.. నువ్వు ఊహించని విధంగా బుద్ధి చెప్తా! దానిని నుంచి నువ్వు కోలుకోలేవు కూడా!.. నేను వెళ్తున్నా.. మళ్లీ చెప్తున్నా.. నీ కెమెరాలన్నీ పక్కనపెట్టు.. దయచేసి మమ్మల్ని ఫొటోలు తీయొద్దు’’ అని సున్నితంగానే కొట్టినంత పనిచేశాడు క్లాసెన్‌.అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!ఈ వీడియోపై ఆరెంజ్‌ ఆర్మీ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘క్లాసీ క్లాసెన్... ‘చెప్పినట్లు వినకుంటే.. అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!’ అని మాస్‌ స్టైల్లో వార్నింగ్‌ ఇచ్చాడు. నువ్వు తోపు అన్నా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులేనని.. వారి గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని సదరు వ్యక్తికి చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది. చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

Shubman Gill reveals how Kohli's burst sparked Gujarat Titans' comeback6
కోహ్లి విధ్వంసం చేసినా కోలుకున్నాం.. ఆ క్రెడిట్‌ మొత్తం వారికే: గిల్‌

ఐపీఎల్‌-2026లో గుజ‌రాత్ టైటాన్స్ ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసింది. గురువారం అహ్మదాబాద్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గుజ‌రాత్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. మొద‌ట ఆర్సీబీని 155 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన గుజ‌రాత్‌.. అనంత‌రం బ్యాటింగ్‌లోనూ స‌త్తాచాటింది.15.5 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్పందిచాడు. ఈ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన త‌మ బౌల‌ర్ల‌ను గిల్ కొనియాడాడు."కీల‌క మ్యాచ్‌లో విజ‌యం సాధించింనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బౌల‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ఇలాంటి వికెట్‌పై ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును 160 ప‌రుగులలోపు క‌ట్డ‌డి చేయ‌డం అంత సులువు కాదు. కానీ మా బౌల‌ర్లు మాత్రం ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఫీల్డింగ్‌లో కూడా మెరుగ్గా రాణించాము. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ రోజు అన్ని విభాగాల్లో మేము పై చేయి సాధించాము. ప్ర‌తీ ఒక్క‌రూ జ‌ట్టు విజ‌యంలో త‌మ వంతు పాత్ర పోషించారు. రెండో ఓవ‌ర్‌లో విరాట్ భాయ్ వ‌రుస బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డారు. కానీ ఆ త‌ర్వాత మేము పుంజుకున్న తీరు చాలా బాగుంది. అత‌డి వికెట్‌తో తిరిగి మేము గేమ్‌లోకి వ‌చ్చాము. నేనేమి ఈ మ్యాచ్‌లో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ల‌తో బ‌రిలోకి దిగ‌లేదు. నేను ఒక రిథ‌మ్‌లో ఉన్నాను అన్పించింది. మొదటి బంతికి కాస్త అదృష్టం తోడైంది, రెండో బంతి నాకు కావాల్సిన స్లాట్‌లో ప‌డింది. దీంతో ఈ రోజునే నాదే అనుకున్నాను.అందుకే బౌల‌ర్లపై ఎదురుదాడికి దిగాను. ఇక తెవాటియా మా జ‌ట్టులో కీల‌క స‌భ్యుడు. ఈ రోజు అత‌డు మ్యాచ్ ఫినిష్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జోస్ భాయ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడ‌నుకున్నా. కానీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు వికెట్లు కోల్పోయాము. ఆ బాధ్య‌త‌ను తెవాటియా తీసుకుని మ్యాచ్‌ను ముగించాడు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో గిల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ 43 ప‌రుగులు చేశాడు.చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

I felt umpire made mistake: Ex India Star on Patidar controversial dismissal7
అంపైర్‌ది ముమ్మాటికీ తప్పే! అతడు అవుట్‌ కానేకాదు!

గుజరాత్‌ టైటాన్స్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్‌-2026లో భాగంగా గత శనివారం బెంగళూరు వేదికపై 205 పరుగులు చేసి కూడా గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమిని ఎదుర్కొంది. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో సొంతగడ్డపై ‘రిటర్న్‌’ మ్యాచ్‌తో ఆర్సీబీని ఓడించింది. నాలుగు వికెట్ల తేడాతో పాటీదార్‌ సేనపై గెలుపొందింది.రీప్లేలో స్పష్టంగా కనిపించిందిఅయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్‌ సందర్భంగా చోటుచేసుకున్న అనూహ్య ఘటన వివాదానికి దారితీసింది. అర్షద్‌ బౌలింగ్‌లో ఆర్సీబీ సారథి రజత్‌ పాటీదార్‌ (19) పుల్‌ షాట్‌ కొట్టగా... డీప్‌ స్క్వేర్‌లెగ్‌ నుంచి పరుగెత్తుతూ వచ్చిన జేసన్‌ హోల్డర్‌ (Jason Holder) ముందుకు దూకుతూ క్యాచ్‌ అందుకున్నాడు.అయితే హోల్డర్‌ క్యాచ్‌ పట్టిన తర్వాత బంతి నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. తన ఎడమ చేతిలో బంతిని ఉంచుకున్న హోల్డర్‌ తనను తాను నియంత్రించుకునే క్రమంలో బంతిపైనే పూర్తిగా భారం వేసి మరీ పైకి లేచాడు.It’s heating up in Ahmedabad! 🔥#JasonHolder caught #RajatPatidar at the boundary, but the #RCB camp wasn’t convinced with the decision! 👀#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/GwfAoIelDj— Star Sports (@StarSportsIndia) April 30, 2026రిజర్వ్‌ అంపైర్‌తో కోహ్లి వాగ్వాదంఅయినప్పటికీ.. థర్డ్‌ అంపైర్‌ అభిజిత్‌ భట్టాచార్య మాత్రం బంతిని హోల్డర్‌ సరిగానే పట్టుకున్నాడని, బంతిని పూర్తి నియంత్రణలో ఉంచుకున్నాడని భావిస్తూ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ దిగ్గజం విరాట్‌ కోహ్లి, కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ రిజర్వ్‌ అంపైర్‌ పరాశర్‌ జోషితో గట్టిగా వాదించినా ఫలితం లేకుండా పోయింది.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. పాటీదార్‌ అవుట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని అతడు తప్పుబట్టాడు. ‘‘నా దృష్టిలో హోల్డర్‌ పట్టింది అసలు క్యాచ్‌ కానేకాదు. క్రికెట్‌ చట్టంలోని 33.3 నియమం ప్రకారం..అంపైర్‌ది ముమ్మాటికీ తప్పే!బంతి ఒక్కసారి చేతిలోకి వచ్చినపుడు బాల్‌తో పాటు శరీరంపై కూడా ఆటగాడు పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. అప్పటి వరకు బంతి నేలను అ‍స్సలు తాకకూడదు. ఆ సమయంలో ఆటగాడి చేయి నేలకు తాకినా సరే.. బంతి మాత్రం అస్సలు నేలకు తాకకూడదు.జేసన్‌ హోల్డర్‌ క్యాచ్‌ పట్టిన వెంటనే జారిపడ్డాడు. స్లైడ్‌ అవుతున్న సమయంలో అతడి శరీరం చలనంలో ఉంది కాబట్టి అతడు తనను తాను పూర్తిగా నియంత్రించుకోలేకోయాడు. అప్పుడే బంతి నేలకు తాకింది. అప్పటికి అది ఇంకా డెడ్‌బాల్‌ కానేలేదు.కాబట్టి ఆ క్యాచ్‌ పూర్తికానట్లే లెక్క. నా అభిప్రాయం ప్రకారం అంపైర్‌ తప్పుచేశాడు. బ్యాటర్‌(పాటీదార్‌)ను నాటౌట్‌గా ప్రకటించాల్సింది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. రూల్‌ ఇదేకాగా మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ నియ‌మం 33.2.2.1 ప్రకారం.. ఫీల్డ‌ర్ బంతిని అందుకున్న‌ప్పుడు, అత‌డి చేతి వేళ్ల మ‌ధ్య నుంచి బాల్‌ నేలకు తాకినట్లయితే దాన్ని అవుట్‌గానే ప‌రిగణిస్తారు. ఈ నియమాన్ని అనుసరించే థర్డ్‌ అంపైర్‌ పాటీదార్‌ను అవుట్‌గా ప్రకటించినట్లు తెలుస్తోంది.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్‌

Lucky loser Potapova makes history by reaching semifinal in Madrid Open8
సెమీఫైనల్లో తొలిసారి ‘లక్కీ లూజర్‌’

మూడు పుష్కరాల చరిత్ర ఉన్న మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ)–1000 టోర్నీల్లో ఇప్పటి వరకు చోటు చేసుకోని అద్భుతం మాడ్రిడ్‌ ఓపెన్‌లో నిజమైంది. ‘లక్కీ లూజర్‌’ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో అడుగు పెట్టిన ఆస్ట్రియా ప్లేయర్‌ అనస్తాసియా పొటపోవా ఏకంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా 1990 నుంచి జరుగుతోన్న డబ్ల్యూటీఏ–1000 సిరీస్‌ టోర్నీల్లో సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకున్న తొలి ‘లక్కీ లూజర్‌’గా పొటపోవా గుర్తింపు పొందింది.మాడ్రిడ్‌లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 56వ ర్యాంకర్‌ పొటపోవా 6–1, 6–7 (4/7), 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2016 యూఎస్‌ ఓపెన్, 2021 వింబుల్డన్‌ టోర్నీ రన్నరప్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై సంచలన విజయం సాధించింది. ‘లక్కీ లూజర్‌’ ఎవరంటే... ఏదైనా టోర్నీ మెయిన్‌ ‘డ్రా’ ఖరారయ్యాక అందులోని ప్లేయర్లు గాయాల కారణంగా చివరి నిమిషంలో వైదొలుగుతారు. దాంతో నిర్వాహకులు క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌లో ఓడిపోయిన అత్యుత్తమ ర్యాంక్‌ ఉన్న ప్లేయర్లకు ‘లక్కీ లూజర్స్‌’ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పిస్తారు.మాడ్రిడ్‌ ఓపెన్‌లో పొటపోవాకు ఈ అనుభవమే ఎదురైంది. రష్యాలో జన్మించి ప్రస్తుతం ఆస్ట్రియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పొటపోవా ఈ టోర్నీ సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌లో ఓడిపోయింది. ఫలితంగా మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది.అయితే మెయిన్‌ ‘డ్రా’లో చోటు పొందిన నలుగురు ప్లేయర్లు గాయాల కారణంగా చివరి నిమిషంలో వైదొలిగారు. దాంతో నిర్వాహకులు క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌లలో ఓడిపోయిన నలుగురు అత్యుత్తమ ర్యాంక్‌ ఉన్న ప్లేయర్లకు మెయిన్‌ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. పొటపోవాతోపాటు పన్నా ఉడ్వార్డి (హంగేరి), అన్నా బ్లింకోవా (రష్యా), యులియా (ఉక్రెయిన్‌)లకు ‘లక్కీ లూజర్స్‌’గా మెయిన్‌ ‘డ్రా’లో చోటు కల్పించారు. ఉడ్వార్డి, బ్లింకోవా రెండో రౌండ్‌లో ఓడిపోగా... యులియా తొలి రౌండ్‌లో వెనుదిరిగింది. పొటపోవా మాత్రం ఒక్కో రౌండ్‌ను దాటుకుంటూ సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది.

Bhuvneshwar Kumar Creates History, Becomes First Bowler To Set This Legendary IPL Record9
భువ‌నేశ్వ‌ర్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా రికార్డు

ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. భువ‌నేశ్వ‌ర్ మాత్రం మ‌రోసారి త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. భువీ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 28 ప‌రుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు ప‌డగొట్టాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ పేస‌ర్ ఇష‌న్ మలింగ‌(15 వికెట్లు)ను వెన‌క్కి నెట్టి భువీ(17 వికెట్లు) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను భువ‌నేశ్వ‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. భారత గడ్డపై 200 ఐపీఎల్ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా అత‌డు చ‌రిత్ర సృష్టించాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేయడంతో ఈ ఫీట్‌ను భువనేశ్వర్ సాధించాడు. భువీ తర్వాత స్ధానంలో చాహల్ (186 వికెట్లు) ఉన్నాడు. కాగా పలు ఐపీఎల్ సీజన్లు దక్షిణాఫ్రికా, యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో చాహల్‌(228) అగ్రస్ధానంలో ఉండగా.. భువనేశ్వర్ కుమార్(215) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు పుణే వారియర్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ వంటి మూడు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. సన్‌రైజర్స్ తరపున వరుసగా రెండుసార్లు (2016, 2017) పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక బౌలర్‌గా భువీ నిలిచాడు.చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

Virat Kohli Creates History, Becomes First Player To Achieve This Iconic IPL Feat10
చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!

ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఓపెన‌ర్ విరాట్ కోహ్లి త‌న అద్భుత ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైన‌ప్ప‌టికి.. కోహ్లి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 28 ప‌రుగులు చేసి కోహ్లి ఔట‌య్యాడు.ముఖ్యంగా గుజ‌రాత్ పేస‌ర్ కగిసో రబాడ‌కు కింగ్ కోహ్లి చుక్క‌లు చూపించాడు. ర‌బాడ వేసిన రెండో ఓవ‌ర్‌లో కోహ్లి వ‌రుస‌గా 5 సిక్స్‌లు బాది స్టేడియంను హోరెత్తించాడు. ఈ మ్యాచ్‌లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి రెండు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే👉భారత గడ్డపై ఐపీఎల్‌లో 8,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలు రాయిని విరాట్ అందుకున్నాడు. కాగా పలు ఐపీఎల్ సీజన్లు దక్షిణాఫ్రికా, యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. విదేశీ గడ్డపై జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో మొత్తంగా అతడు 1000కు పైగా పరుగులు చేశాడు. ఓవరాల్‌గా కోహ్లి పేరిట 9230 ఐపీఎల్ రన్స్ ఉన్నాయి. కాగా కోహ్లి దారిదాపుల్లో ఎవరూ లేరు.భార‌త్‌లో అత్యధిక ఐపీఎల్ ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరేవిరాట్ కోహ్లీ - 8,016రోహిత్ శర్మ - 6,274శిఖర్ ధావన్ - 5,819డేవిడ్ వార్నర్ - 5,689👉ఒకే ఓవర్‌లో 5 ఫోర్లు కొట్టిన మూడో ఆర్సీబీ బ్యాటర్‌గా క్రిస్ గేల్‌, షేన్ వాట్సన్ సరసన కోహ్లి నిలిచాడు. క్రిస్ గేల్‌, షేన్ వాట్సన్ గతంలో పుణే వారియర్స్ పై ఈ ఫీట్ సాధించారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది.కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌(43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి(28), దేవ్‌దత్త్ పడిక్కల్‌(40) మినహా మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement