Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL2026: Chennai Super Kings Beat KKR By 32 Runs1
రాత మారని కేకేఆర్‌.. సీఎస్‌కే విజయం

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌) ఓట‌ముల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. సీజన్‌లో కేకేఆర్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 32 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు శాంసన్‌, బ్రెవిస్, ఆయుశ్ మాత్రేలు రాణించడంతో సీఎస్‌కే సునాయాస విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48), బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకు పరిమితమైంది. ఆఖర్లో పావెల్ (31 నాటౌట్‌), రమణ్‌దీప్ (35) పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో లాభం లేకపోయింది. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. సీజన్‌లో సీఎస్‌కేకు ఇది రెండో విజయం కాగా, కేకేఆర్ నాలుగు పరాజయాలతో ఇప్పటికీ ఖాతా తెరవలేదు.

RCB Star Virat Kohli Wears Bandage On Leg Ahead Of LSG Clash2
కోహ్లికి గాయం.. లక్నోతో ఆడేది అనుమానమే!

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ విరాట్ కోహ్లి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లాడిన ఆర్సీబీ మూడు విజ‌యాల‌తో ప‌ట్టిక‌లోమూడో స్థానంలో కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో బుధవారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడేది అనుమానంగానే క‌నిపిస్తోంది. అయితే సోమ‌వారం ట్రైనింగ్ సెష‌న్‌లో కోహ్లీ కాలికి బ్యాండేజ్‌తో క‌నిపించాడు. ప్రాక్టీస్ అనంర‌తం కోహ్లీ మాజీ క్రికెట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్‌, కెప్టెన్ రిష‌బ్ పంత్‌ల‌ను న‌వ్వుతూ ప‌ల‌కరించాడు. దీనికి సంబంధించిన వీడియోను ల‌క్నో ఫ్రాంచైజీ త‌మ ఎక్స్‌లో షేర్ చేసుకుంది. అయితే వీడియోలో కోహ్లీ కుంటుతూ న‌డుస్తున్న‌ట్లుగా క‌నిపించింది. దీంతో చీల‌మండ గాయం నుంచి కోహ్లి ఇంకా కోలుకోలేద‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. అందుకే ల‌క్నోతో మ్యాచ్‌లో కోహ్లి ఆడుతాడా లేదా అన్న‌ది అనుమానంగా మారింది. ఒక‌వేళ ఆడినా ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇక ఈ సీజ‌న్‌లో కోహ్లి నాలుగు మ్యాచ్‌లు క‌లిపి 179 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ‌సెంచ‌రీలున్నాయి. ఇక ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లీ కేవ‌లం బ్యాటింగ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.Yaari dosti 🥹🤌 pic.twitter.com/lgdcrCTITI— Lucknow Super Giants (@LucknowIPL) April 14, 2026చదవండి: ‘రుతురాజ్‌ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్‌కు చాన్స్‌ ఇవ్వు’

Time For Ruturaj Gaikwad Demote Himself Give-Chance Ayush Mhatre3
‘రుతురాజ్‌ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్‌కు చాన్స్‌ ఇవ్వు’

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతూనే ఉంది. వ‌రుస‌గా ఐదో మ్యాచ్‌లోనూ రుతురాజ్ త‌క్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ ఏడు ప‌రుగులు చేసి అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మ్యాచ్‌ల్లో 12.6 స‌గ‌టుతో 63 పరుగులు మాత్ర‌మే చేశాడు. బ్యాట‌ర్‌గానే గాక కెప్టెన్‌గానూ రుతురాజ్ ఫెయిల‌వుతున్నాడు. సీఎస్‌కే ఇప్ప‌టివ‌ర‌కు 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజ‌యం మాత్ర‌మే సాధించి మూడింట ఓట‌మి చ‌విచూసింది. ఈ నేప‌థ్యంలో రుతురాజ్ కెప్టెన్సీ స‌హా వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌పై విమ‌ర్శ‌లు పెరిగిపోతున్నాయి. దీంతో రుతురాజ్ త‌న బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మార్చుకుంటే బాగుంటుంద‌ని క్రీడా పండితులు సూచిస్తున్నారు. వ‌న్‌డౌన్‌లో వ‌స్తున్న ఆయుశ్ మాత్రేకు ప్ర‌మోష‌న్ ఇచ్చి ఓపెన‌ర్‌గా పంపితే బాగుంటుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా రుతురాజ్ త‌న బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మార్చుకుంటాడేమో చూడాలి. మ్యాచ్ విష‌యానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన‌ సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. శాంస‌న్ (48) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయ‌గా, వైభ‌వ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ న‌రైన్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. View this post on Instagram A post shared by THE ADULT SOCIETY (@adultsociety) చదవండి: IPL 2026: న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి.. కార‌ణ‌మ‌దే!

Reason Behind Why CSK And KKR Players Wearing Black Armbands4
IPL 2026: న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి.. కార‌ణ‌మ‌దే!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా 22వ మ్యాచ్‌లో సీఎస్‌కే, కేకేఆర్ త‌ల‌ప‌డుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగ‌డం ఆస‌క్తి క‌లిగించింది. అయితే ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ఏకకాలంలో న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగ‌డం వెనుక ఒక కార‌ణ‌ముంది. గ‌త వారం (ఏప్రిల్‌ 9న) భారత అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతికి సంతాపంగా సీఎస్‌కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు నివాళి ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్‌ మరణం పట్ల గౌర‌వ‌సూచ‌కంగా ఆట‌గాళ్లంతా న‌ల్ల రిబ్బ‌న్లు ధరించి బ‌రిలోకి దిగారు. కాగా 1951లో ఇంగ్లండ్‌పై అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ త‌న కెరీర్‌లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో మ‌ద్రాస్‌ త‌ర‌పున ఆడ‌న 83 మ్యాచ్‌లు ఆడారు. గోపీనాథ్ త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపుగలు మెరిపించాడు. తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొదటి ఇన్నింగ్స్‌లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయ‌న 8 మ్యాచ్‌ల‌లో 242 ప‌రుగులు చేశారు. .@ChennaiIPL and @KKRiders are wearing black armbands as a mark of respect to former India cricketer C.D. Gopinath, who breathed his last on April 9.#TATAIPL | #CSKvKKR pic.twitter.com/Zv9NxNjAp6— IndianPremierLeague (@IPL) April 14, 2026

SRH Pick Dilshan Madushanka Injury Replacement For Brydon Carse5
ఊహించని దెబ్బ.. ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ బైడన్ కార్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన బ్రైడన్ కార్స్ స్థానాన్ని శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషంకతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. పేస్ అటాక్‌లో కార్స్ కీలకం అవుతాడని భావించిన మేనేజ్‌మెంట్‌కు ఇది ఊహించని దెబ్బ. కానీ ఏమాత్రం ఆలస్యం చేయని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం మదుషంక రూపంలో బ్రైడన్ కార్స్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ఎంచుకొంది. కాగా మ‌ధుషంక‌ను ఎస్ఆర్‌హెచ్ రూ. 75 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌కే జాయిన్ అవ్వ‌నున్నాడు. ఈ నేపథ్యంలో దిల్షాన్ మధుషంకను ఎస్‌ఆర్‌హెచ్ క్యాంప్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తమ ఎక్స్‌లో పేర్కొంది. మధుషంక చేరికతో హైదరాబాద్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిందనే చెప్పాలి. ఒక లెఫ్టార్మ్ పేసర్‌గా పవర్‌ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగల నైపుణ్యం అతనికి ఉంది.గతంలో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు పలు లీగ్‌లలో కూడా తన మార్క్ చూపించిన ఈ లంక బౌలర్ రాకను అభిమానులు స్వాగతిస్తున్నారు. మ‌ధుషంక లంక త‌ర‌ఫున 28 వ‌న్డేలు, 19 టీ20, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్ర‌ఫుల్ హింగే, సాకిబ్‌హుస్సేన్ వంటి యంగ్ బౌల‌ర్ల‌కు తోడుగా మ‌ధుషంక జ‌త‌వ్వ‌డం జ‌ట్టుకు అద‌న‌పు బ‌లం. మరి మ‌ధుషంక చేరిక‌తో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ బ‌ల‌పడిన‌ట్లే.Dilshan Madushanka joins the squad as a replacement for Brydon Carse, who is ruled out due to injury.Welcome, Dilshan 🧡 pic.twitter.com/zJQWtbXVZt— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2026

IPL 2026: Chennai Super Kings Vs KKR Match Live Updates6
IPL 2026: కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 32 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రమన్‌దీప్‌ సింగ్‌ (35) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీయగా, అన్షుల్‌ కంబోజ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. సీఎస్‌కేతో మ్యాచ్‌లో కేకేఆర్‌ కష్టాల్లో పడింది. నూర్‌ అహ్మద్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో కేకేఆర్‌ 85 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. తొలుత రహానే (28)ను బుట్టలో వేసుకున్న నూర్‌ మరుసటి బంతికి కామెరున్‌ గ్రీన్‌ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (5), పావెల్‌ (2) క్రీజులో ఉన్నారు.అంతకముందు కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన అంగ్‌క్రిష్‌ రఘువంశీ అకిల్‌ హొసేన్‌ బౌలింగ్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సునీల్‌ నరైన్‌ (24) రూపంలో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన నరైన్‌ స్లిప్‌లో గుర్జన్‌పీత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.ఫిన్‌ అలెన్‌ ఔట్‌..193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కేకేఆర్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (1) శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.కేకేఆర్ టార్గెట్ 193 ప‌రుగులుఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా చెన్నై సూప‌ర్‌కింగ్స్ కేకేఆర్ ముంగిట 193 ప‌రుగుల లక్ష్యాన్ని విధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. శాంస‌న్ (48) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయ‌గా, వైభ‌వ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ న‌రైన్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (37), సర్ఫరాజ్‌ (23) క్రీజులో ఉన్నారు. అంతకముందు శాంసన్‌ కార్తిక్‌ త్యాగీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.సంజు క్లీన్‌ బౌల్డ్‌111 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్‌ కోల్పోయింది. 11.2 ఓవర్‌లో కార్తిక్‌ త్యాగీ బౌలింగ్‌లో సంజు శాంసన్‌ క్లీన్‌ బ్లౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్‌కే స్కోరు 13 ఓవర్లకు 128 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. రెండో వికెట్‌ డౌన్‌కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. 38 పరుగులు చేసిన ఆయుశ్‌ మాత్రే వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. శాంసన్‌ (23 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.రుతురాజ్‌ (7) ఔట్‌..కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రుతురాజ్ (7) మరోసారి నిరాశపరుస్తూ అనుకుల్‌రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్‌ బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్‌ ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. నవదీప్‌ సైనీ స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. సీఎస్‌కే మాత్రం ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది.ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడగా సీఎస్‌కే 20 సార్లు, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించాయి. 2022 నుంచి చూసుకుంటే ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు నెగ్గాయి.చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్‌కీపర్‌), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

Shane Warne Son Jackson Break Silence About-His-Father Sudden Death7
వార్న్‌ మరణంపై కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 2022లో థాయ్‌లాండ్‌లో 52 ఏళ్ల వార్న్ హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. అయితే తాజాగా నాలుగేళ్ల తర్వాత వార్న్ మరణంపై అతడి కుమారుడు జాక్సన్ వార్న్‌ స్పందించాడు. కోవిడ్ వాక్సిన్ వల్లే తన తండ్రి చనిపోయినట్లు జాక్సన్ వెల్లడించాడు. ‘టూ వరల్డ్స్ కొలైడ్‌’ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన జాక్సన్ వార్న్ మాట్లాడుతూ.. ‘నాన్నకు నాలుగు కొవిడ్ టీకాలు ఇవ్వాల్సి వచ్చింది. అవి తీసుకోవడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో టీకాలు వేపించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ వ్యాక్సిన్ ప్రభావం నాన్న ఆరోగ్యంపై పడింది. అయితే ఆయనకు అంతర్గతంగా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన మద్యం తాగేవారు, స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అవే అలవాట్లు ఉన్న చాలామంది ఇంకా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ సమయంలో నాన్న ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించారు. నాన్న మరణ వార్త విన్న తర్వాత ప్రభుత్వం, కొవిడ్ పరిస్థితులపై కోపం వచ్చింది’ అని జాక్సన్ వార్న్ తెలిపారు. అయితే వార్న్ చనిపోవడానికి ముందు 2021లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన హండ్రెడ్ టోర్నీలో కోవిడ్ బారిన పడ్డాడు. అయితే వార్న్ మరణించిన సమయంలో ఆయనకు ఎలాంటి అనారోగ్యం బారిన పడినట్లు రిపోర్ట్‌లో తేలడం అప్ప ట్లో ఆసక్తిగా మారింది.2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తొలి ఎడిషన్‌ను షేన్‌ వార్న్‌ నేతృత్వంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ నెగ్గిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో వార్న్‌ 55 మ్యాచ్‌లాడి 57 వికెట్లు పడగొట్టాడు.చదవండి: ‘సోకుల‌కే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’

Good News For SRH Cummins Set To Join Squad On This Day: Report8
SRHకు అదిరిపోయే శుభవార్త

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు శుభవార్త. రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. కాగా వెన్నునొప్పి కారణంగా ఈ పేస్‌ బౌలర్‌ చాలాకాలంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించాల్సిన కమిన్స్‌ (Pat Cummins).. ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత పూర్తిగా ఆటకు దూరమైపోయాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో అతడు లేకుండానే బరిలోకి దిగిన ఆసీస్‌.. గ్రూప్‌ దశలోనే ఇంటిబాట పట్టి అవమానం పాలైంది.కమిన్స్‌ లేని లోటు సుస్పష్టంమరోవైపు.. సన్‌రైజర్స్‌ జట్టులో సైతం కమిన్స్‌ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్‌, ప్రధాన పేసర్‌గా అతడు సేవలు అందిస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్‌-2026లో కమిన్స్‌ గైర్హాజరీలో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం రెండు మాత్రమే గెలిచింది.గెలుపు బాట తొలుత కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గెలిచిన ఇషాన్‌ కిషన్‌ బృందం.. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌పై సోమవారం జయభేరి మోగించింది. సొంతమైదానం ఉప్పల్‌లో రాయల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తు చేసి గెలుపు బాట పట్టింది. ఇలాంటి తరుణంలో కమిన్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌ అందడం ఎస్‌ఆర్‌హెచ్‌ శిబిరంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఆరోజే హైదరాబాద్‌కుక్రిక్‌బజ్‌ కథనం ప్రకారం.. కమిన్స్‌ బుధవారం (ఏప్రిల్‌ 15) ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరుకానున్నాడు. పరీక్షలో పాసైతే గనుక ఏప్రిల్‌ 17 నాటికి అతడు హైదరాబాద్‌కు చేరుకుంటాడు. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘అతడు ఫిట్‌నెస్‌ టెస్టు క్లియర్‌ చేసి త్వరలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందుతాడని ఆశిస్తున్నాం’’ అని తెలిపాయి. కాగా కమిన్స్‌ స్థానంలో టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ సన్‌రైజర్స్‌ను ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.చదవండి: SRH: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్‌ హుస్సేన్‌?BCCI: సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు!

2 Year Ban On KKR Pacer For Choosing IPL Over PSL9
KKR పేసర్‌పై రెండేళ్ల నిషేధం

జింబాబ్వే క్రికెటర్‌ బ్లెస్సింగ్‌ ముజర్‌బానీపై నిషేధం పడింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) ఆడకుండా పాక్‌ క్రికెట్‌ బోర్డు అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. చాలా మంది ఆటగాళ్ల మాదిరే ముజర్‌బానీ ఇటు ఐపీఎల్‌.. అటు పీఎస్‌ఎల్‌ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు.కానీ రెండు లీగ్‌లకు సంబంధించిన ఫ్రాంఛైజీలలో ఒక్కటి కూడా ముజర్‌బానీని కొనుగోలు చూసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అదే సమయంలో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో జింబాబ్వే అదరగొట్టింది.ఆసీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడుఏకంగా ఆస్ట్రేలియాను ఓడించి సూపర్‌-8లో అడుగుపెట్టింది. ఇందులో ముజర్‌బానీది కీలక పాత్ర. ఆసీస్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ ఫ్రాంఛైజీ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ షమార్‌ జోసెఫ్‌ స్థానంలో ముజర్‌బానీతో ఒప్పందం కుదుర్చుకుంది.అయితే, అనూహ్యంగా ముజర్‌బానీకి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) నుంచి ఆఫర్ వచ్చింది. భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్‌ తమ జట్టు నుంచి బంగ్లా స్టార్‌ ముస్తాఫిజుర్‌ను తొలగించింది. అతడి స్థానంలో మరో ఫాస్ట్‌బౌలర్‌​ ముజర్‌బానీని జట్టులో చేర్చుకోవాలని భావించింది.పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లోఇందుకు సమ్మతించిన ముజర్‌బానీ.. పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో కేకేఆర్‌తో చేరాడు. దీంతో పాక్‌ బోర్డు అతడిపై చర్యలు చేపట్టింది. ‘‘ఫ్రాంఛైజీ ఆధారిత క్రికెట్‌ ఆడేవాళ్లు పారదర్శకత ప్రదర్శించాలి. ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలి.ఒకేసారి రెండు జట్లతో ఒప్పందం చేసుకోవడం.. ఒక జట్టు కోసం మరో జట్టును వీడటం సరికాదు. ఇలాంటి ప్రవర్తనను చూసీచూడనట్లు వదిలివేయలేము. ఫ్రాంఛైజీల విశ్వసనీయత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రెండేళ్ల నిషేధం విధిస్తున్నాం’’ అని పీఎస్‌ఎల్‌ పేర్కొంది. కాగా ముజర్‌బానీతో పాటు దసున్‌ షనక, స్పెన్సర్‌ జాన్సన్‌ కూడా ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరిన సంగతి తెలిసిందే. వీరిపై కూడా నిషేధం పడే అవకాశం ఉంది.చదవండి: BCCI: సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు!

Krishnamachari Srikanth Slams Riyan Parag Batting Failure IPL 202610
‘సోకుల‌కే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌పై మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్‌లో సోకుల‌కే ఉన్నాడు త‌ప్ప బ్యాట్‌తో పెద్ద‌గా ఆడింది లేదంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా సోమ‌వారం ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్తాన్ 57 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు సాధించిన‌ప్ప‌టికీ అందులో రియాన్ ప‌రాగ్ పాత్ర శూన్యం. బ్యాటింగ్‌లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. కెప్టెన్‌గా ఉన్నాడు కాబ‌ట్టి జ‌ట్టులో ఉన్నాడు లేదంటే డ‌గౌట్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చేదని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో క్రిష్‌ శ్రీకాంత్ మాట్లాడుతూ... 'రియాన్ పరాగ్ జట్టులో ఫోజు కొట్టడానికే ఉన్నాడు. స్టైల్‌గా బ్యాటింగ్‌‌కు వచ్చి త్వరగా ఔటయ్యాడు. ప్రెజెంటేషన్ వేడుకలో మాట్లాడి వెళ్లిపోయాడు. అంతా ఫోజు కొట్టడం తప్పా మరేమీ చేయలేదు. జడేజా వంటి సీనియర్ బౌలర్‌కు బౌలింగ్ ఇవ్వలేదు. ఎందుకని అడిగితే.. రవి బిష్ణోయ్‌నే సన్‌రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారని, లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ మెరుగ్గా ఆడుతుండటంతో బౌలింగ్ ఇవ్వలేదని చెప్పాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్.. లెఫ్టార్మ్ బ్యాటర్‌కు బౌలింగ్ చేయకూడదనే రూల్ ఏమైనా ఉందా? ఇది అసంబద్దం. ఎస్ఆర్‌హెచ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ప్రఫుల్ హింగే తొలి ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ కూడా చాలా బాగుంది. వారికి నలుగురు యువ బౌలర్లున్నారు. వారితోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఆలౌట్ చేశారు. అద్భుతం.’అని కొనియాడాడు.చదవండి: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్‌ హుస్సేన్‌?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement