Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Mohsin Khan bowls first ever maiden to Vaibhav Sooryavanshi1
వైభ‌వ్‌కు చుక్క‌లు చూపించిన‌ మొన‌గాడు.. ఎవ‌రంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ అద్భుత ప్రదర్శన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా రాజస్తాన్ డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మోహ్సిన్ తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు.జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొన్న వైభవ్‌.. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో మాత్రం తడబడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వైభవ్‌కు వేసిన మొహ్షిన్ ఖాన్‌.. ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా మలిచాడు.తొలి ఐదు బంతులను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ సూర్యవంశీ, ఆరో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వైభవ్‌కు మెయిడెన్ ఓవర్ వేసిన తొలి బౌలర్‌గా మొహ్సిన్ ఖాన్ నిలిచాడు. అతడి ధాటి​కి వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లక్నోపై 40 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్‌ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.చదవండి: PSL 2026: హైద‌రాబాద్‌పై స్మిత్ విధ్వంసకర సెంచరీ

Jofra Archer stars as Rajasthan defend 159 against lacklustre Lucknow2
రాజస్తాన్‌ గెలుపు బాట.. లక్నోపై ఘన విజయం

ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. బుధవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక లక్నో చతికలపడింది. పంత్ సేన లక్ష్య చేధనలో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించగా.. బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు రవీంద్ర జడేజా, బిష్ణోయ్‌ తలా వికెట్‌ సాధించారు. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్‌ దూబే(19), హెట్‌మైర్‌(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, మోహ్షిన్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

Steve Smith Bags Maiden PSL Century Against Hyderabad3
హైద‌రాబాద్‌పై స్మిత్ విధ్వంసకర సెంచరీ

పాకిస్తాన్ సూపర్ లీగ్‌-2026లో ముల్తాన్ సుల్తాన్స్ స్టార్‌ ఓపెనర్ స్టీవ్ స్మిత్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుధవారం కరాచీ వేదికగా హైదరాబాద్ కింగ్స్‌మెన్స్‌తో మ్యాచ్‌లో స్మిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ హైద‌రాబాద్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. కరాచీ నేష‌న‌ల్ స్టేడియంలో స్మిత్‌ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు.హునైన్ షా వేసిన ఒకే ఓవర్‌లో స్మిత్ ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఈ క్ర‌మంలో స్మిత్ కేవలం 47 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా కేవ‌లం 50 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న స్మిత్‌.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ముల్తాన్ సుల్తాన్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. అదేవిధంగా స్మిత్‌కు ఇది తన టీ20 కెరీర్‌లో మూడువ అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. సిడ్నీ సిక్సర్స్ తరపున చేసిన 125 పరుగులు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన స్మిత్‌..231 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు

Vaibhav Sooryavanshi Shatters Long-Standing IPL Record,4
చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ నిరాశ‌ప‌రిచాడు. వైభవ్‌ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో ఫుల్ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను సూర్యవంశీ కోల్పోయాడు.ఈ మ్యాచ్‌లో వైభవ్ సింగిల్ డిజిత్ స్కోరే పరిమితమైనప్పటికి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన రెండో ఓవర్‌లో రెండో బంతికి ఫోర్ కొట్టడంతో వైభవ్ ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. వైభవ్ కేవలం 222 బంతుల్లోనే ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (260 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మాక్సీ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో వైభ‌వ్ 7 మ్యాచ్‌ల్లో 220.87 స్ట్రైక్ రేట్‌తో 254 ప‌రుగులు చేశాడు.చదవండి: 'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'

Vaibhav Sooryavanshi "Demigod": Ajit Agarkar Sent Selection Plea5
'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'

క్రికెట్ ప్ర‌పంచానికి ప్ర‌స్తుతం ఒకే ఒక్క గాడ్ ఉన్నాడు. అత‌డే భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్. అయితే రాజస్తాన్ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో 'సెమీ-గాడ్'గా అవతరిస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జోస్యం చెప్పాడు. అదేవిధంగా 15 ఏళ్ల వైభవ్‌ను వీలైనంత త్వరగా జాతీయ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్‌ను అతడు సూచించాడు."వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక అద్భుతం. అతడి టాలెంట్‌కు ఫిదా అయిపోయాను. ఇలాంటి ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు బ్యాట్ స్పీడ్‌, షాట్ సెలక్షన్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. అజిత్ తొందరగా ఆ కుర్రాడిని జాతీయ జట్టులోకి తీసుకో. అతడు భారత్ ఆడబోయే తదుపరి సిరీస్‌కు వైభవ్ జట్టులో కచ్చితంగా ఉండాలి. నిజానికి ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులోనే అతడు ఉండాల్సింది.ప్లేయింగ్ ఎలెవన్‌లో కాకపోయినా, కనీసం జట్టుతో ట్రావిల్ చేసి ఉన్న బాగుండేది. అతడికి అంతర్జాతీయ క్రికెట్‌పై ఒక అవగాహన వచ్చేది. వైభ‌వ్‌కు జాతీయ జ‌ట్టు త‌ర‌పున కూడా రాణించే స‌త్తాఉంది. బుమ్రా లాంటి బౌల‌ర్‌కు మొద‌టి బంతికి వైభ‌వ్ సిక్స్ బాదాడు. ఆ త‌ర్వాత హేజిల్‌వుడ్‌ను ఓ ఆడుకున్నాడు. బౌలర్ ఎవరనేది అతడికి సంబంధం లేదు. నేను కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు 16 ఏళ్ల యంగ్ టాలెంటెడ్ క్రికెట‌ర్ భార‌త జ‌ట్టులోకి వ‌చ్చాడు. అతనే సచిన్ టెండూల్క‌ర్‌. ఈ రోజు అత‌డిని క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తున్నారు. వైభ‌వ్‌కు క్రికెట్‌లో తదుపరి 'సెమీ-గాడ్' అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి" అని దీ వీక్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో వైభ‌వ్ కేవ‌లం 7 మ్యాచ్‌ల్లో 220.87 స్ట్రైక్ రేట్‌తో 254 ప‌రుగులు చేశాడు.చదవండి: IPL 2026: ఆ టీమ్‌కు భారీ షాక్‌.. ఉన్న‌ప‌ళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్‌

Nawaz Loses County Contract After Testing Positive For Recreational Drugs: Report6
డ్రగ్స్ టెస్టులో దొరికిపోయిన స్టార్‌ క్రికెటర్‌.. భారీ షాకిచ్చిన పీసీబీ!

పాకిస్తాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పాక్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ మొహ్మద్ నవాజ్ ప‌ట్టుబడ్డాడు. అత‌డు వినోదం కోసం వాడే మాదకద్రవ్యాలను వాడినట్లు తేలింది.ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. దీంతో అతడిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ మొదలు పెట్టింది. ఈ విష‌యాన్ని పీసీబీ సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలియ‌జేశారు. నవాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్‌ సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు న‌వాజ్ దూరం కానున్నాడు.న‌వాజ్‌కు భారీ షాక్‌..అదేవిధంగా న‌వాజ్‌కు మ‌రో భారీ షాక్ త‌గిలింది. వాస్త‌వానికి న‌వాజ్ వ‌చ్చే నెల‌లో ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో స‌ర్రే క్ల‌బ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాల్సి ఉంది. ఇప్ప‌టికే పీసీబీ అత‌డికి నిరభ్యంతర పత్రం (NOC) కూడా మంజారు చేసింది. కానీ ఈ వివాదం కార‌ణంగా పీసీబీ ఎన్‌వోసీని నిలిపివేసిన‌ట్లు స‌మాచారం. కాగా న‌వాజ్ పాక్ జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు.భార‌త్‌, శ్రీలంక వేదిక‌ల‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఓవ‌రాల్‌గా టీ20 ఫార్మాట్‌లో నవాజ్‌కు ఘనమైన రికార్డు ఉంది. టీ20ల్లో పాకిస్తాన్ త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసిన జాబితాలో న‌వాజ్‌(101) నాలుగో స్ధానంలో ఉన్నాడు. టీ20ల్లో రెండుసార్లు 5 వికెట్ల ఘనత సాధించిన ఏకైక పాక్ బౌల‌ర్ కూడా న‌వాజ్‌నే కావ‌డం గ‌మ‌నార్హం. ఒకవేళ విచారణలో నవాజ్ దోషిగా తేలితే పీసీబీ కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. కాంట్రాక్ట్ రద్దుతో పాటు నిషేధం విధించే ఛాన్స్ ఉంది.చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ నుంచి ఇషాన్‌ కిషన్‌ అవుట్‌?

IPL 2026: Rajasthan royals vs Lucknow super giants Live updates7
లక్నోను చిత్తు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌

IPL 2026 RR vs LSG Live updates: లక్నోపై రాజస్తాన్‌ ఘన విజయంఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 18 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండేసి వికెట్లు పడగొట్టాడు.లక్నో ఏడో వికెట్ డౌన్‌ముకుల్ చౌదరి రూపంలో లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో ముకుల్ ఔటయ్యాడు. లక్నో విజయానికి 23 బంతుల్లో 49 పరుగులు కావాలి.లక్నో ఆరో వికెట్ డౌన్‌లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన మిచెల్ మార్ష్‌.. బర్గర్ బౌలిం‍గ్‌లో ఔటయ్యాడు.లక్నో ఐదో వికెట్‌ డౌన్‌లక్నో ఐదో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన హిమత్‌ సింగ్‌.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లక్నో విజయానికి 33 బంతుల్లో 69 పరుగులు కావాలి.రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌54 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన నికోలస్‌ పూరన్‌.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు లక్నో స్కోర్‌: 74/4నిలకడగా ఆడుతున్న మార్ష్‌, పూరన్‌7 ఓవర్లకు లక్నో 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్‌ మార్ష్‌(24), పూరన్‌(14) ఉన్నారు.కష్టాల్లో లక్నోఐడైన్‌ మార్‌క్రమ్‌ రూపంలో లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.లక్నోకు భారీ షాక్‌160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. లక్నో కేవలం 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రిషబ్‌ పంత్‌(0), బదోని(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.రాణించిన జడేజా.. ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్‌ దూబే(19), హెట్‌మైర్‌(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, మోహ్షిన్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.19 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోరెంతంటే?19 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.రాజస్తాన్‌ ఐదో వికెట్‌ డౌన్‌రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్ల పతనం కొనసాగుతోంది. 22 పరుగులు చేసిన షిమ్రాన్‌ హెట్‌మైర్‌.. మోహ్షిన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.4 ఓవర్లలో రాయల్స్‌ స్కోర్‌: 78-5రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌20 పరుగులు చేసిన రియాన్‌ పరాగ్‌.. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 62/4రాజస్తాన్‌ మూడో వికెట్‌రాజస్తాన్‌ రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్‌ హెట్‌మైర్‌ వచ్చాడు. 4 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 32/3నిప్పులు చెరుగుతున్న షమీరాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ నిప్పులు చెరుగుతున్నాడు. మూడో ఓవర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో రాజస్తాన్‌ వరుస బంతుల్లో జైశ్వాల్‌(22), ధ్రువ్‌ జురెల్‌(0) పెవిలియన్‌కు చేరారు.ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ కీలక పోరులో లక్నో రెండు మ్యాచ్‌లతో బరిలోకి దిగింది.అవేష్‌ ఖాన్‌, సిద్దార్ధ్‌ స్ధానాల్లో దిగ్వేష్‌, మయాంక్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చారు. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న నికోలస్‌ పూరన్‌కు లక్నో మరో అవకాశమిచ్చింది. ఇక రాజస్తాన్‌ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తుది జట్లురాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, మొహసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్

 Punjab Kings Cooper Connolly travels to Australia for bowling fitness clearance8
ఆ టీమ్‌కు భారీ షాక్‌.. ఉన్న‌ప‌ళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్‌

ఐపీఎల్‌-2026లో అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఈ ధ‌నాధ‌న్ లీగ్‌లో పంజాబ్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఏప్రిల్ 25న అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ కూప‌ర్ క‌నోలీ దూర‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.క‌నోలీ ప్ర‌స్తుతం పంజాబ్ క్యాంప్‌ను వీడి ఫిట్‌నెస్ ప‌రీక్షల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండ‌ర్ అయిన క‌నోలీకి ఐపీఎల్‌లో వెన్ను గాయం కార‌ణంగా కేవ‌లం బ్యాటింగ్ చేసేందుకు మాత్ర‌మే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమ‌తి ఇచ్చింది. ఏప్రిల్ చివరి నాటికి బౌలింగ్ చేయడానికి అనుమతి లభించే అవ‌కాశమున్న‌ట్లు ఈ ఏడాది సీజ‌న్ ఆరంభానికే ముందు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. ఈ క్ర‌మంలోనే ఫిట్‌నెస్ పరీక్షలను నిర్వహించేందుకు అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి పిలిపించింది. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధిస్తే బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇవ్వనుంది. క‌నోలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌పై 72 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.చివరగా లక్నో సూపర్ జెయింట్స్‌పై కూడా కేవలం 46 బంతుల్లో 87 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. కనోలీ ప్రస్తుతం 6 మ్యాచ్‌లలో 223 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని పంజాబ్‌ కింగ్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది.చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ నుంచి ఇషాన్‌ కిషన్‌ అవుట్‌?

I am sorry: Former BCCI selector apologises to Rohit Sharma Know Why9
‘అందుకే రోహిత్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది’

టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిళ్లను అతడి సారథ్యంలోనే భారత్‌ గెలుచుకుంది. దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగిన రోహిత్‌కు.. కెరీర్‌ ఆరంభంలో ఒకానొకనాడు జట్టులో చోటే కరువైంది.ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్‌కప్‌ సమయంలో సెలక్టర్లు రోహిత్‌ శర్మను పక్కనపెట్టారు. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాడు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు వెల్లడిస్తూ.. అతడిని క్షమాపణలు కోరాడు. బాధపడుతూనే ఉన్నాను‘‘ప్రతి ఇంటర్వ్యూలో తాను 2011 వరల్డ్‌కప్‌ ఆడటం మిస్సయ్యానని రోహిత్‌ చెబుతూ ఉన్నాడు. నిజంగా అతడి విషయంలో ఆరోజు జరిగిన దానిపట్ల నేటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. గతేడాది అతడిని కలిసి.. ‘సారీ బాస్‌.. ఆనాడు మేము ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు’ అని చెప్పాను.అప్పుడు మేము ఆల్‌రౌండ్‌ ప్రతిభ గల వాళ్లకే పెద్దపీట వేయాలని భావించాము. 1983 మాదిరే ఈ టోర్నీలో ఆడించాలనే ఆలోచనతో ఉన్నాము. మేము ఊహించినట్లుగానే ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ నిలిచాడు.అందుకే రోహిత్‌ను పక్కనపె ట్టాల్సి వచ్చిందికొన్ని మ్యాచ్‌లలో హాఫ్‌ ఆల్‌రౌండర్లు కూడా రాణించారు. సెహ్వాగ్‌, సచిన్‌, సురేశ్‌ రైనా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్‌ చేశారు. యూసఫ్‌ పఠాన్‌ సైతం హాఫ్‌ ఆల్‌రౌండరే. ఈ హాఫ్‌ ఆల్‌రౌండర్‌ కాన్సెప్టులో పడి రోహిత్‌ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది.పాపం అతడికి జట్టులో చోటు దక్కలేదు. నిజానికి 2011 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడేందుకు అతడు అర్హుడే. కానీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడిని ఎంపిక చేయలేకపోయాము’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పేర్కొన్నాడు. కాగా 2011లో ధోని సారథ్యంలో టీమిండియా టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే.చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్‌ మూసివేత

: If Pat Cummins returns, should SRH stick with Ishan Kishan as captain?10
సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ నుంచి ఇషాన్‌ కిషన్‌ అవుట్‌?

ఐపీఎల్‌-2026లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు అదిరిపోయే వార్త అందింది. ఏప్రిల్ 25న జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ బ‌రిలోకి దిగనున్నాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇషాన్ కిష‌న్ త‌న బాధ్య‌త‌ల‌ను క‌మ్మిన్స్‌కు అప్ప‌గించ‌నున్నాడు.క‌మ్మిన్స్ వెన్ను గాయం కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు ఎస్ఆర్‌హెచ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల‌కు అందుబాటులో లేడు. అత‌డు ఇటీవ‌లే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వ‌హించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఎస్ఆర్‌హెచ్ క్యాంప్‌లో చేరాడు. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కమ్మిన్స్ ఆడుతాడని అంతా భావించారు.కానీ కాస్త ఆసౌకర్యంగా ఉండడంతో టీమ్ సెలెక్షన్ అందుబాటులేకపోయాడు. అయితే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం కమ్మిన్స్ ఆడడం దాదాపు ఖాయమైంది. అతడు ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టాడు. కాగా కమ్మిన్స్ గైర్హజారీలో ఇషాన్ జట్టును అద్భుతంగా నడిపించాడు.అతడి కెప్టెన్సీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ నాలుగింట విజయం సాధించింది. సన్‌రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. కమ్మిన్స్ సారథిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా ఆకట్టుకుంటున్నాడు. కిషన్ 7 మ్యాచ్‌లలో 238 పరుగులు చేశాడు. అయితే కమ్మిన్స్ జట్టులోకి వచ్చినప్పటికి ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని సంజయ్ బంగర్‌, హార్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: ధోనికి ఆ హోదా ఇవ్వడం మొదట్లో నచ్చలేదు: మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement