ప్రధాన వార్తలు
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 తర్వాత జరుగబోయే ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ సిరీస్లకు ఇద్దరు యువ పేసర్లు దూరమయ్యారు. ఆ ఇద్దరి పేర్లు హర్షిత్ రాణా, ఆకాశ్దీప్. వీరిద్దరు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.హర్షిత్ మోకాలి గాయంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోగా.. ఆకాశ్దీప్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇద్దరి రిహాబిలిటేషన్ సక్రమంగా సాగుతున్నప్పటికీ, పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు చాలా సమయం అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గాయాల కారణంగా హర్షిత్, ఆకాశ్దీప్ ఐపీఎల్కు కూడా దూరమయ్యారు.కాగా, ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఈ కీలక పర్యటనల్లో ఇద్దరు ప్రధాన పేసర్లు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటే.
లక్నో జట్టులో ఆసీస్ విధ్వంసకర బ్యాటర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో ఏకంగా 6 పరాజయాలు చవిచూసి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది.ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లక్నోకు ఓ ఊరట కలిగించే వార్త అందింది. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ తాజాగా జట్టులో చేరాడు.ఇంగ్లిస్ను లక్నో ఈ సీజన్ వేలంలో రూ. 8.6 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ.. వివాహం కారణంగా అతను సీజన్ తొలి దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండలేకపోయాడు. ఇంగ్లిస్ పెళ్లి ఏప్రిల్ 18న స్వదేశంలో జరిగింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఆడిన ఇంగ్లిస్ 11 ఇన్నింగ్స్ల్లో 162.57 స్ట్రయిక్రేట్తో 278 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.ప్రస్తుతమున్న డూ ఆర్ డై పరిస్థితుల్లో ఇంగ్లిస్ సత్తా చాటితే లక్నోకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. లక్నో మే 4న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ఇంగ్లిస్ అందుబాటులో ఉంటాడు.బ్రీట్జ్కే నిష్క్రమణఓ పక్క ఇంగ్లిస్ జట్టుకు అందుబాటులో రాగా.. మరో లక్నో ఆటగాడు జట్టుకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రీట్జ్కే తిరిగి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది.లక్నో ఇకపై జరిగే మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, సీఎస్కే (2 సార్లు), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ లాంటి పటిష్టమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఇలాంటి దశలో ఇంగ్లిస్ లాంటి విధ్వంసకర బ్యాటర్ జట్టుకు అందుబాటులోకి రావడం లక్నోకు శుభపరిణామం.
వైభవ్ క్లీన్ బౌల్డ్.. ఓవరాక్షన్ చేసిన ఢిల్లీ బౌలర్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరుగుతున్న 43వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆదిలోనే షాక్లుతొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్కు ఆదిలోనే వరుస షాక్లు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) బంతుల వ్యవధిలో ఔటయ్యారు. ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన జైస్వాల్.. మూడో బంతికి స్టార్క్ బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు.7 బంతుల తర్వాత వైభవ్ జేమీసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్.. ఆతర్వాత బంతికే జేమీసన్ వేసిన అద్భుతమైన యార్కర్కు దొరికాడు. ఈ సీజన్లో అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న వైభవ్ను ఔట్ చేసిన ఆనందంలో జేమీసన్ ఓవరాక్షన్ చేశాడు.An in-swinging yorker 😲🔥🎥 Kyle Jamieson gets Vaibhav Sooryavanshi early 👊Wait for the celebration 👀Updates ▶️ https://t.co/6OOjzHtZiD#TATAIPL | #KhelBindaas | #RRvDC | @DelhiCapitals pic.twitter.com/6vxJ5ahlb3— IndianPremierLeague (@IPL) May 1, 2026ముఖానికి దగ్గరగా వెళ్లి ఆరుస్తూ, చప్పట్లు కొట్టాడు. జేమీసన్ చర్యను చాలా మంది తప్పుబడుతున్నారు. 15 ఏళ్ల పిల్లాడి పట్ల ఈ ప్రవర్తన సరికాదని అంటున్నారు.బీసీసీఐ చర్య తీసుకుంటుందా..?ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ప్రత్యర్థిని రెచ్చగొట్టేలా లేదా బెదిరించేలా ప్రవర్తిస్తే మ్యాచ్ రిఫరీ చర్య తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇది సాధారణ ఆగ్రహావేశ సెలబ్రేషన్గా పరిగణిస్తారా, లేక కోడ్ ఉల్లంఘనగా భావిస్తారా అన్నది మ్యాచ్ అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాయల్స్ 10.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును తాకింది. జైస్వాల్, సూర్యవంశీ ఔట్ కాగా.. జురెల్ (35), కెప్టెన్ రియాన్ పరాగ్ (54) క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. పసికూన జర్మనీ.. ఇంగ్లండ్, భారత్ను సైతం వెనక్కు నెట్టి మూడో అత్యధిక టీమ్ స్కోర్ను నమోదు చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రియాతో ఇవాళ (మే 1) జరిగిన తొలి టీ20లో జర్మనీ రికార్డు స్థాయిలో వికెట్ నష్టానికి 308 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఇది మూడో అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డైంది.అంతర్జాతీయ టీ20ల్లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన టీమిండియా కూడా ఇప్పటివరకు 300 పరుగుల మార్కును తాకలేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న జర్మనీ ఈ ఘనత సాధించడం చరిత్రాత్మకం.అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఐసీసీ ఫుల్ మెంబర్ జట్లలో ఇంగ్లండ్ ఒక్కటే ఇప్పటివరకు 300 పరుగుల మార్కును తాకింది. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. జర్మనీ ఈ రికార్డును సైతం అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.భారత్కు పలు మార్లు 300 పరుగుల మార్కును తాకే అవకాశం వచ్చినా, ఒక్కసారి కూడా తాకలేదు. 2024లో బంగ్లాదేశ్పై చేసిన 297 పరుగులే టీ20ల్లో టీమిండియాకు అత్యధికం. ఈ విభాగంలో అత్యధిక స్కోర్ రికార్డు జింబాబ్వే పేరిట ఉంది. 2024లో ఈ జట్టు గాంబియాపై ఏకంగా 344 పరుగులు చేసింది. జింబాబ్వే తర్వాత అత్యధిక స్కోర్ చేసిన రికార్డు నేపాల్ పేరిట ఉంది. నేపాల్ 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై 314 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్లు* జింబాబ్వే – 344* నేపాల్ – 314* జర్మనీ – 308* ఇంగ్లండ్ – 304* భారత్ – 297మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జర్మనీ.. ఓపెనర్లు బెన్ కొహ్లెర్ కాడ్మోర్ (58 బంతుల్లో 133 నాటౌట్; 17 ఫోర్లు, 6 సిక్సర్లు), ముసద్దిక్ అహ్మద్ (48 బంతుల్లో 122; 11 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 308 పరుగులు చేసింది. ముసద్దిక్ ఔటయ్యాక వచ్చిన షాహిద్ అఫ్రిది (34 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రియా 15.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటై, 162 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆ జట్టు తరఫున ఓపెనర్ కరణ్బీర్ సింగ్ (84) ఒక్కడే రాణించాడు. యూరప్లో కొత్త శక్తిఅంతర్జాతీయ టీ20ల్లో 300 పరుగుల మార్క్ తాకిన తొలి జట్టుగా జర్మనీ చరిత్ర సృష్టించింది. ఇది కేవలం జర్మనీ క్రికెట్కే కాదు, యావత్ యూరోపియన్ క్రికెట్ అభివృద్ధికి గొప్ప సంకేతం.బెన్ ఎవరు..?ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన బెన్ కొహ్లెర్ కాడ్మోర్, ఇంగ్లండ్ క్రికెటర్ టామ్ కొహ్లెర్ కాడ్మోర్కు సోదరుడు. తల్లి జర్మనీ దేశస్థురాలు కావడం చేత బెన్ ఆ దేశం తరఫున ఆడే అర్హత సాధించాడు.
నిస్సంక హాఫ్ సెంచరీ
నిస్సంక హాఫ్ సెంచరీ6 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 70-0గా ఉంది. నిస్సంక (50), కేఎల్ రాహుల్ (19) క్రీజ్లో ఉన్నారు. రాజస్థాన్ భారీ స్కోర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తమ నిర్ణయానికి న్యాయం చేస్తూ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. రియాన్కు కాసేపు జురెల్ (42) సహకరించారు. ఆఖర్లో డొనొవన్ ఫెరియెరా గత మ్యాచ్ తరహాలో చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4), షుభమ్ దూబే (6) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (20) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో రాణించగా.. జేమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలో వికెట్ తీశారు. రియాన్ పరాగ్ (90) ఔట్16.4వ ఓవర్- సెంచరీకి చేరువైన తరుణంలో భారీ షాట్ ఆడబోయి రియాన్ పరాగ్ (90) ఔటయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 17 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 173-5గా ఉంది.జురెల్ (42) ఔట్11.4వ ఓవర్- 114 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి జురెల్ (42) ఔటయ్యాడు.సూర్యవంశీ (4) ఔట్1.5వ ఓవర్- జేమీసన్ బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో బంతికే వికెట్ కోల్పోయిన రాజస్థాన్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ మూడో బంతికే వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో యశస్వి జైస్వాల్ను (6) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే జైస్వాల్ సిక్సర్ బాదాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరుగుతున్న 43వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు..ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ
ఎస్ఆర్హెచ్లోకి ప్రపంచకప్ హీరో
ఐపీఎల్ 2026 నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ (మే 1) ఓ కీలక ప్రకటన చేసింది. గాయపడిన ఆల్రౌండర్ శివమ్ మావి స్థానాన్ని అండర్-19 ప్రపంచకప్ 2026 హీరో, యువ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆర్ఎస్ అంబ్రిష్తో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. 18 ఏళ్ల అంబ్రిష్ ఈ ఏడాది భారత్ అండర్-19 ప్రపంచకప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో 11 వికెట్లు తీసి భారత తరఫున సంయుక్తంగా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. కుడిచేతి మీడియం పేసర్ అయిన అంబ్రిష్, ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తాడు. లోయర్ ఆర్డర్లో అతను ఉపయోగకర బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఆల్రౌండ్ నైపుణ్యం ఎస్ఆర్హెచ్కు అదనపు బలంగా మారనుంది. ఇప్పటికే ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి దేశీయ యువ పేసర్లతో కలకలలాడుతున్న ఎస్ఆర్హెచ్కు అంబ్రిష్ మరో అస్త్రంగా మారే అవకాశం ఉంది.మావి విషయానికొస్తే.. ఈ సీజన్ వేలంలో ఇతన్ని ఎస్ఆర్హెచ్ రూ.75 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అయితే అతను గజ్జలో గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతనికి ప్రత్యామ్నాయంగా ఎస్ఆర్హెచ్ అంబ్రిష్ను ఎంపిక చేసుకుంది (రూ. 30 లక్షలకు).ఇదిలా ఉంటే, సీజన్ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్రైజర్స్ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి, రన్రేట్ (0.832) కూడా మెరుగ్గానే కలిగి ఉంది. తాజాగా ముంబైపై 244 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్హెచ్.. మే 3న జరిగే తమ తదుపరి మ్యాచ్లో కేకేఆర్తో తలపడనుంది.
వైభవ్ సూర్యవంశీ బలహీనత అదే: విండీస్ దిగ్గజం
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. యశస్వి జైస్వాల్తో కలిసి రాజస్తాన్కు శుభారంభాలు అందిస్తున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికి తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 400 పరుగులు సాధించాడు.ఫాస్టెస్ట్ సెంచరీలుతద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-3లో కొనసాగుతున్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఇక ప్రత్యర్థి బౌలర్ ఎవరన్న అంశంతో పనిలేకుండా బంతిని బాదడమే తన పని అంటున్న వైభవ్.. వరల్డ్క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా చుక్కలు చూపించాడు.బుమ్రాను వదల్లేదుముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా బుమ్రాకు సిక్సర్తో స్వాగతం పలికిన 15 ఏళ్ల వైభవ్.. అతడి బౌలింగ్లోనే మరో సిక్స్ కూడా పిండుకున్నాడు. దీంతో మహామహ బౌలర్లు సైతం వైభవ్ విధ్వంసానికి అడ్డుకట్ట వేడయం ఎలా? అంటూ తలలు పట్టుకుంటున్నారు.వైభవ్ సూర్యవంశీ బలహీనత అదే.. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరును ఉద్దేశించి వెస్టిండీస్ దిగ్గజం, క్రిక్ఇన్ఫో కామెంటేటర్ ఇయాన్ బిషప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ బ్యాటింగ్ బలహీనత ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘టెక్నికల్గా చెప్పాలంటే... అతడి బ్యాట్ స్వింగ్ అయ్యే విధానం యూనిక్గా ఉంటుంది. బేస్బాల్ మాదిరి స్వింగ్ అని చెప్పవచ్చు.We’ve seen this shot before 🚁 😉 Vaibhav Sooryavanshi gives Rajasthan Royals the perfect start in this chase. 💪#TATAIPL 2026 ➡️ #PBKSvRR | LIVE NOW 👉https://t.co/saW6caCqT8 pic.twitter.com/A5EgtrJ0Sp— Star Sports (@StarSportsIndia) April 28, 2026బ్యాటింగ్లో అతడి బలహీనత ఏమిటో కచ్చితంగా ఇదీ అని చెప్పడం కష్టం. అయితే, బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ (సాధారణంగా బ్యాటర్కు 7-8 మీటర్ల దూరంలో బాల్ను సంధిస్తే.. బంతి ఎక్కువగా బౌన్స్ అయి బ్యాటర్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది)తో అతడిని బోల్తా కొట్టించవచ్చు.పొరపాటున మిస్సయిందో!అయితే, బంతి త్వరగా టాప్ ఎడ్జ్కు గనుక రాకపోతే.. అతడు ఆ బాల్ను సిక్సర్గా మలచడం ఖాయం. అందుకే వైభవ్ బ్యాటింగ్ బలహీనత ఏమిటో కచ్చితంగా చెప్పలేమని ముందే చెప్పాను’’ అని ఇయాన్ బిషప్ పేర్కొన్నాడు. కాగా కేవలం టీ20లలోనే కాకుండా వైభవ్ భారత్ అండర్-19 జట్టు తరఫున ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో అలరిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ ఇటీవల వరల్డ్కప్ గెలవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. చదవండి: శ్రేయస్, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్గా ఊహించని పేరు!
స్వదేశానికి వెళ్లిన సన్రైజర్స్ విదేశీ ప్లేయర్లు
ఐపీఎల్ 2026 మధ్యలో సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ముగ్గురు శ్రీలంక ప్లేయర్లు (దిల్షన్ మధుషంక, ఎషాన్ మలింగ, కమిందు మెండిస్) అర్దాంతరంగా స్వదేశానికి వెళ్లారు. ఏప్రిల్ 29న ముంబై ఇండియన్స్పై ఘన విజయం తర్వాత ఇది జరిగింది. లంక క్రికెట్ బోర్డు మధుషంక, మలింగ, కమిందును అత్యవసరంగా స్వదేశానికి రావాలని సందేశం పంపింది.NEWS 🚨Sri Lankan cricketers Dilshan Madushanka, Eshan Malinga, and Kamindu Mendis, who are representing SRH in the IPL, arrived in Sri Lanka early this morning.#sportspavilionlk #ipl2026 #MIvsSRH #EshanMalinga #fypシ゚viralシfypシ゚viralシalシ pic.twitter.com/dMwWZJ74S8— DANUSHKA ARAVINDA (@DanuskaAravinda) April 30, 2026శ్రీలంక జట్టు త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనకు సంబంధించిన వీసా బయోమెట్రిక్స్ పూర్తి చేసుకోవడానికి పై ముగ్గురు స్వదేశానికి వెళ్లారు. ఈ త్రయం విండీస్లో పర్యటించబోయే లంక జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.వీసా ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం, మధుషంక, మలింగ, కమిందు తిరిగి ఇవాళ ( మే 1) ఉదయం భారత్కు వచ్చి ఎస్ఆర్హెచ్ శిబిరంలో చేరారు. దీంతో మే 3న కేకేఆర్తో జరిగే కీలక మ్యాచ్కు వీరు అందుబాటులో ఉండనున్నారు. ఈ విషయం తెలియక సోషల్మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి.ఈ ముగ్గురు ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో గొడవపడి స్వదేశానికి వెళ్లిపోయారని కొందరు.. గాయాల కారణంగా జట్టును వీడారని ఇంకొందరు ప్రచారం చేశారు. చివరికి లంక బోర్డు చెందిన కీలక అధికారి ఒకరు వివరణ ఇవ్వడంతో ఈ ఫేక్ ప్రచారానికి పుల్స్టాప్ పడింది.దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే, ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తి (ఎషాన్ మలింగ) పై ముగ్గురిలో ఉన్నారు. మంచి లయలో ఉన్న ఎస్ఆర్హెచ్కు మలింగ లాంటి బౌలర్ ఒక్క మ్యాచ్కు దూరమైనా తీవ్ర పరిణామాలు ఉంటాయి.మలింగ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. మదుషంక ఒక మ్యాచ్లో ఆడి వికెట్ సాధించగా, కమిందు మెండిస్కు ఇంకా తుది జట్టులో అవకాశం రాలేదు.కాగా, సీజన్ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్రైజర్స్ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. పంజాబ్, ఆర్సీబీ టాప్-2లో ఉన్నాయి.
Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. గత వారం ఎదురైన పరాభవానికి సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం గుజరాత్- ఆర్సీబీ తలపడ్డాయి.కోహ్లి, గిల్ స్కోర్లు ఎంతంటే?ఇందులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులుకు ఆలౌటైంది. దేవ్దత్ పడిక్కల్ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, విరాట్ కోహ్లి (13 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.అనంతరం గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. శుబ్మన్ గిల్ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్లు), జోస్ బట్లర్ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. 12 పరుగులు చేయడంతోపాటు, 2 వికెట్లు పడగొట్టి, 3 క్యాచ్లు పట్టిన జేసన్ హోల్డర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ దిగ్గజం, కింగ్ కోహ్లి- గుజరాత్ కెప్టెన్, ప్రిన్స్ గిల్ మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ సమయంలో గిల్ పట్ల పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఆ తర్వాత మాత్రం అతడిని టీజ్ చేశాడు. ఇందుకు గిల్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.Vintage #ViratKohli energy! 🔥KING catches, PRINCE departs - Absolute cinema! 🙌 🎯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/jCKi1Qo4zA— Star Sports (@StarSportsIndia) April 30, 2026ఏడిపించిన కోహ్లి.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో గిల్ ఇచ్చిన క్యాచ్ పట్టిన కోహ్లి.. అతడు పెవిలియన్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసమయంలో కోహ్లి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకోగా.. గిల్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ డగౌట్లో కూర్చోగా.. ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి.. అతడిని అవుట్ చేసిన విధానాన్ని సైగలతో చూపిస్తూ టీజ్ చేశాడు.Virat Kohli: "Ye le thullu, kaise catch out kiya 😭"Shubman Gill: "Scoreboard dekh lo, kya hi farak padta hai? Hum jeet rahe hain!"Kohli: "Run-out hote-hote bacha tu, kaise bhaag raha tha!"Gill: "Chhodo jaane do, Virat bhai hai ❤️" pic.twitter.com/KCWwV0xDWk— GillTheWill (@GillTheWill77) May 1, 2026ఇచ్చిపడేసిన గిల్!ఇందుకు గిల్.. ‘స్కోరు బోర్డు చూడు భయ్యా.. నేను అవుటైతే ఏంటి? గెలిచేది మేమే’ అన్నట్లుగా తానూ సైగలతోనే కౌంటర్ వేశాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత.. ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గిల్- కోహ్లి ఆలింగనం చేసుకుని నవ్వులు చిందించారు.అయితే, ఆ తర్వాత కూడా గిల్ కోహ్లి, ఆర్సీబీని వదిలిపెట్టలేదు. కోహ్లి, తానూ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘జేసన్ హోల్డర్.. ప్లే హోల్డ్ బోల్డ్.. ఈరోజు రాత్రి అత్యద్భుతమైన ప్రదర్శన’ అంటూ ఆర్సీబీ, కోహ్లిని టార్గెట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను హోల్డర్ పట్టాడు.అయితే, ఇది క్లీన్ క్యాచ్ కాదని కోహ్లి వాదించగా.. థర్డ్ అంపైర్ మాత్రం అవుట్గా ప్రకటించాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, ఫలితం మాత్రం గుజరాత్కు మేలు చేసింది. మరోవైపు.. ఆర్సీబీ ప్లే బోల్డ్ అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ గిల్ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.చదవండి: కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్ మాస్ వార్నింగ్! The award for the best senior and junior duo goes to… 😁#TATAIPL #GTvRCB #ShubmanGill #ViratKohli pic.twitter.com/4lccF2wv9u— Star Sports (@StarSportsIndia) April 30, 2026
భారత టీ20 జట్టులోకి అతడిని తిరిగి తీసుకోండి: సెహ్వాగ్
భువనేశ్వర్ కుమార్... ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకడిగా వెలుగొందాడు ఈ పేసర్. చివరగా 2022లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తిరిగి పునరాగమనం చేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్నాడు. దేశీ, లీగ్ క్రికెట్లో మరోసారి తనను తాను నిరూపించుకుంటున్నాడు.చోటే లేదు!అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం భువీని కనికరించడం లేదు. ఇప్పటికే పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నాయకుడిగా పాతుకుపోగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్ తదితరులు కూడా కీలక సభ్యులుగా కొనసాగతున్నారు. దీంతో భువీకి టీమిండియా తలుపులు దాదాపుగా మొత్తానికే మూసుకుపోయాయి.అయితే, భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ మాత్రం భువనేశ్వర్ కుమార్కు మరొక్క అవకాశం ఇవ్వాలని అంటున్నాడు. కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీని చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన భువీ.. తాజా ఎడిషన్లోనూ రాణిస్తున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్తో గురువారం నాటి మ్యాచ్లోనూ ఈ రైటార్మ్ పేసర్ అదరగొట్టాడు.అత్యధిక వికెట్ల వీరుడిగానాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన భువీ.. 28 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మొత్తంగా 2026 సీజన్లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లలో కలిపి 17 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్ల వీరుడిగా ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ భువీపై ప్రశంసలు కురిపించాడు.తిరిగి టీ20 జట్టులోకి తీసుకోండిక్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీస్తున్నాడు. గుజరాత్తో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.అతడి వయసు 35 లేదంటే 36 ఏళ్లు ఉండొచ్చు. అయితే, ఇదే విధంగా అద్భుతంగా బౌలింగ్ కొనసాగిస్తే.. టీ20 క్రికెట్లో అతడి పునరాగమనం గురించి టీమిండియా సెలక్టర్లు తప్పక ఆలోచించాలి. బుమ్రా- భువీ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. వింటేజ్ భువీ జట్టుకు తప్పక ఉపయోగపడతాడు’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.You miss, I hit! 🎯#BhuvneshwarKumar has dismissed #JosButtler for the 9th time in 20 T20 innings! 🤯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/QnL7Vybkp7— Star Sports (@StarSportsIndia) April 30, 2026చదవండి: IPL 2026: పాటిదార్ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?
గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడాను!.. తప్పని నిషేధం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నలుబోతు షణ్ముగ ...
లీగ్ దశలోనే భారత్ అవుట్
హోర్సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ మహిళల బ్యా...
బేసి సంవత్సరాల్లో ఆసియా క్రీడలు!
న్యూఢిల్లీ: నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడల నిర...
ఫెలిక్స్ మళ్లీ వస్తోంది
లాస్ ఏంజెలిస్: ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్...
వైభవ్ సూర్యవంశీ బలహీనత అదే: విండీస్ దిగ్గజం
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వ...
స్వదేశానికి వెళ్లిన సన్రైజర్స్ విదేశీ ప్లేయర్లు
ఐపీఎల్ 2026 మధ్యలో సన్రైజర్స్ హైదరాబాద్కు చెంద...
Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ ష...
భారత టీ20 జట్టులోకి అతడిని తిరిగి తీసుకోండి: సెహ్వాగ్
భువనేశ్వర్ కుమార్... ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రిక...
క్రీడలు
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
వీడియోలు
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
చితక్కొట్టిన సన్ రైజర్స్
244 టార్గెట్ ఊదేశారు.. SRHకి వరుసగా ఐదో విజయం
రియాన్ పరాగ్ అరెస్ట్ ?
వైభవ్ సూర్యవంశీపై ఒలంపిక్స్ విజేత మనూ భాకర్ కామెంట్స్ వైరల్..
తొలి ఓటమితో తడబడిన పంజాబ్ కింగ్స్.. దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్..
IPLల్లో ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం
SRHపై బుడ్డోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్
