ప్రధాన వార్తలు
మళ్లీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?
మహిళల టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక జట్టు తలపడనున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్లో మొత్తం మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి.ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు నేరుగా అర్హత సాధించగా.. క్వాలిఫైయర్ మ్యాచ్ల ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తమ స్ధానాలను ఖాయం చేసుకున్నాయి.భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో ఉన్న భారత్-పాకిస్తాన్ జట్లు జూన్ 14న ఎడ్జ్బాస్టన్ వేదికగా అమీతుమీ తెల్చుకోనున్నాయి. భారత్కు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. గ్రూపు-ఎలో భారత్, పాక్తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూలై 5న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుందిభారత్ మ్యాచ్ల షెడ్యూల్ జూన్ 14 - పాకిస్తాన్తో.. ఎడ్జ్బాస్టన్జూన్ 17- నెదర్లాండ్స్తో.. లీడ్స్జూన్ 21-సౌతాఫ్రికాతో.. మాంచెస్టర్జూన్ 25- బంగ్లాదేశ్తో.. మాంచెస్టర్జూన్ 28- ఆస్ట్రేలియాతో.. లార్డ్స్
సౌతాఫ్రికా హోం సమ్మర్ షెడ్యూల్ ప్రకటన
ఈ ఏడాది (2026-27) హోం సమ్మర్ షెడ్యూల్ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) ఇవాళ ప్రకటించింది. ఈ సీజన్లో మూడు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నాయి. ఈ సీజన్ ఆస్ట్రేలియా సిరీస్తో మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ 3 వన్డేలు, 3 టెస్ట్లు ఆడనుంది. అనంతరం బంగ్లాదేశ్ సఫారీ గడ్డపై అడుగుపెడుతుంది. ఈ పర్యటనలో బంగ్లా జట్టు 3 వన్డేలు, 2 టెస్ట్లు, 3 టీ20లు ఆడనుంది. ఆతర్వాత ఇంగ్లండ్ టీమ్ సౌతాఫ్రికాలో ల్యాండవుతుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ 3 వన్డేలు, 3 టెస్ట్లు ఆడుతుంది. దీనికి సంబంధించిన తేదీలు, వేదికల వివరాలు ఇలా ఉన్నాయి.ఆస్ట్రేలియా టూర్ సెప్టెంబర్ 24-తొలి వన్డే, డర్బన్సెప్టెంబర్ 27-రెండో వన్డే, జోహనెస్బర్గ్సెప్టెంబర్ 30-మూడో వన్డే, పోచెఫ్స్ట్రూమ్అక్టోబర్ 9-13: తొలి టెస్ట్, డర్బన్అక్టోబర్ 18-22: రెండో టెస్ట్, గ్కెబెర్హాఅక్టోబర్ 27-31: మూడో టెస్ట్, కేప్టౌన్బంగ్లాదేశ్ టూర్ నవంబర్ 15-19: తొలి టెస్ట్, జోహనెస్బర్గ్నవంబర్ 23-27: రెండో టెస్ట్, సెంచూరియన్డిసెంబర్ 1- తొలి వన్డే, ఈస్ట్ లండన్డిసెంబర్ 4- రెండో వన్డే, గ్కెబెర్హాడిసెంబర్ 7- మూడో వన్డే, కేప్టౌన్డిసెంబర్ 10- తొలి టీ20, కింబర్లీడిసెంబర్ 12- రెండో టీ20, బెనోనీడిసెంబర్ 13- మూడో టీ20, సెంచూరియన్ఇంగ్లండ్ టూర్డిసెంబర్ 17-21: తొలి టెస్ట్, జోహనెస్బర్గ్డిసెంబర్ 26-30: రెండో టెస్ట్, సెంచూరియన్2027 జనవరి 3-7: మూడో టెస్ట్, కేప్టౌన్జనవరి 10- తొలి వన్డే, పార్ల్జనవరి 13- రెండో వన్డే, బ్లోంఫాంటైన్జనవరి 15- మూడో వన్డే, బ్లోంఫాంటైన్ఈ పర్యటనలో జరగాల్సిన టీ20 సిరీస్ను షెడ్యూల్ సమస్యల కారణంగా వాయిదా వేసి, తర్వాతి తేదీల్లో నిర్వహించనున్నారు.
రాణించిన కెప్టెన్, వైస్ కెప్టెన్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 24) జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా స్వల్ప స్కోర్కే పరిమితమైంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (53), వైస్ కెప్టెన్ స్మృతి మంధన (58) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్ (43), రిచా ఘోష్ (23) కూడా సహకరించడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటగలిగింది. వీరు మినహా భారత ఇన్నింగ్స్లో మరెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేదు. షఫాలీ వర్మ 4, జెమీమా రోడ్రిగ్స్ 8, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణి తలో 2, ఓపెనర్ ప్రతీక రావల్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ (7-0-33-3) అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించింది. మెగాన్ షట్ (9-1-42-2), సోఫీ మోలినెక్స్ (5-1-17-1), తహ్లియా మెక్గ్రాత్ (4-0-16-1), డార్సీ బ్రౌన్ (5-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. అన్నాబెల్ సదర్ల్యాండ్ (8.3-1-32-0) పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు దక్కలేదు.కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండు, మూడు వన్డేలు హోబర్ట్ వేదికగా ఫిబ్రవరి 27, మార్చి 1 తేదీల్లో జరుగనున్నాయి. అనంతరం మార్చి 6న టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
మాజీ భార్య అన్నట్లుగా చెబుతున్న మాటలపై స్పందించిన శిఖర్ ధవన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ తన రెండో వివాహం అనంతరం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన కథనాలపై తీవ్రంగా స్పందించాడు. కొద్ది రోజుల కిందట ధవన్ అమెరికా ఆధారిత ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సోఫీ షైన్ను ఢిల్లీ-ఎన్సీఆర్లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక తర్వాత ధవన్, అతని మాజీ భార్య అయేషా ముఖర్జీకి సంబంధించిన పలు పోస్ట్లు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విడాకుల సమయంలో అయేషా ధవన్ను "నిన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు" అన్నట్లు.. సోఫీతో వివాహం తర్వాత "నన్ను అభినందించవా..?" అని ధవన్ అయేషాకు కౌంటరిచ్చినట్లు పలు స్క్రిప్ట్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.STATEMENTI have come across some posts on social media attributing a disappointing statement about my personal life. I have never carried baggage from the past be it on the pitch or outside. I firmly believe in the power of positivity while respecting my past.This is a new…— Shikhar Dhawan (@SDhawan25) February 23, 2026వీటిపై ధవన్ అదే సోషల్మీడియా వేదికగా స్పందించాడు. ఆ స్క్రిప్ట్ను పూర్తిగా ఖండిస్తూ.. అందులో ఎంతమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. "నేను ఎప్పుడూ గతాన్ని మోసుకెళ్లలేదు. పాజిటివిటీని నమ్ముతాను. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అభిమానులు, కుటుంబం, మిత్రులు ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు. దయచేసి నా పేరుతో తప్పుడు కథనాలు సృష్టించవద్దు" అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. కాగా, ధవన్.. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ మహిళల అయేషా ముఖర్జీని 2011లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి, ఆతర్వాత ప్రేమ వివాహానికి దారి తీసింది. అయేషా ఓ మాజీ కిక్ బాక్సర్. ఆమెకు ధవన్కు ముందే వేరే వ్యక్తితో పెళ్లైంది. తొలి భర్తతో అయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయేషా-ధవన్కు జోరావర్ అనే పేరు గల కుమారుడు ఉన్నాడు.అయేషా.. ఆమె మొదటి భర్తతో కలిగిన సంతానం, జోరావర్తో కలిసి ధవన్తోనే ఉండేది. అయితే మనస్పర్దల కారణంగా అయేషా-ధవన్ 2023లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అయేషా జోరావర్ను తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. ఆ సమయంలో అయేషా తండ్రి-కొడుకులను కలవనివ్వలేదనే వార్తలు వచ్చాయి. జోరావర్ను మిస్ అవుతున్నట్లు ధవన్ చాలా సందర్భాల్లో సోషల్మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కాడు. అయితే ధవన్ ఏనాడూ అయేషా గురించి చెడుగా మాట్లాడలేదు. తాజాగా వస్తున్న వదంతులు ధవన్ ఎంత జెంటిల్మెనో మరోసారి రుజువు చేశాయి.అయేషాతో విడాకులైన చాన్నాళ్లకు ధవన్-సోఫీ మధ్య ప్రేమ మొదలైంది. 2025లో వీరిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగం చేశారు. ఈ ఏడాది జనవరి 12న వీరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సోఫీ షైన్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటూ, Northern Trust Corporationలో ప్రొడక్ట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. వీరి వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రికెట్ సహచరులు పాల్గొన్నారు.
IND VS AUS 1st ODI: మంధన మరోసారి..!
అంతర్జాతీయ క్రికెట్లో క్వీన్ స్మృతి మంధన పరుగుల ప్రవాహం ఫార్మాట్లకతీతంగా కొనసాగుతోంది. ఈ టీమిండియా స్టార్ ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. ఇవాళ (ఫిబ్రవరి) బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసిన మంధన.. దీనికి ముందు టీ20 సిరీస్ డిసైడర్ (మూడో టీ20)లో కూడా హాఫ్ సెంచరీతో మెరిసింది. తాజా హాఫ్ సెంచరీతో మంధన ఓ అరుదైన ఘనత సాధించింది.ఆస్ట్రేలియాపై వన్డేల్లో 11 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన అతికొద్ది మందిలో ఒకరిగా నిలిచింది. ఆసియా ప్లేయర్ల వరకు తీసుకుంటే మంధననే ఆసీస్పై అత్యధిక వన్డే హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో మంధన 68 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఔటైంది. 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ హర్మన్ప్రీత్తో కలిసి ఆదుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ప్రతీక రావల్ (0) వికెట్ కోల్పోయింది. ఈ దశలో మంధన.. షఫాలీ వర్మతో (4) రెండో వికెట్కు 25 పరుగులు.. జెమీమా రోడ్రిగ్స్తో (8) మూడో వికెట్కు 27 పరుగులు.. నాలుగో వికెట్కు హర్మన్తో కలిసి 48 పరుగులు జోడించింది.33 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 140-5గా ఉంది. హర్మన్ప్రీత్ 32, రిచా ఘోష్ 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షట్, డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డ్నర్, అలానా కింగ్, తహ్లియా మెక్గ్రాత్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డే జరుగుతుంది.
టీ20 ప్రపంచకప్లో నేడు మరో ఆసక్తికర సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 24) మరో ఆసక్తికర సూపర్-8 సమరం జరుగనుంది. పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ పాకిస్తాన్కు డూ ఆర్ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పాక్ సెమీస్ రేసులో ఉంటుంది. లేకపోతే సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. మరోపక్క ఇంగ్లండ్కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఏ తలనొప్పి లేకుండా సెమీస్కు చేరాలనుకుంటే ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. శ్రీలంకపై తొలి సూపర్-8 మ్యాచ్లో గెలిచిన ఇంగ్లండ్ గ్రూప్-2 టాపర్గా ఉంది. ఆ మ్యాచ్లో భారీ తేడాతో గెలవడంతో ఆ జట్టు నెట్ రన్రేట్ (2.550) కూడా మెరుగ్గానే ఉంది. ఈ గ్రూప్ నుంచి తొలి సెమీస్ బెర్త్ దక్కించుకునే అవకాశాలు ప్రస్తుతానికి ఇంగ్లండ్కే అధికంగా ఉన్నాయి.పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఇరు జట్లు చెరో పాయింట్ పొందాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ చేతిలో ఓడిన శ్రీలంక -2.550 రన్రేట్తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులుపాకిస్తాన్-ఇంగ్లండ్ ఇప్పటివరకు 30 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 21, పాక్ కేవలం 9 మ్యాచ్ల్లో నెగ్గాయి. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మూడు మ్యాచ్ల్లో కూడా ఇంగ్లండే పైచేయి సాధించింది. ఇందులో 2022 ఎడిషన్ ఫైనల్ కూడా ఉంది.పిచ్ కూడా వారికి అనుకూలమే..!ఈ మ్యాచ్ జరుగనున్న పల్లెకెలె పిచ్ కూడా ఇంగ్లండ్కు అనుకూలంగానే ఉంది. ఈ వేదికపై ఆ జట్టు తొలి సూపర్-8 మ్యాచ్లో ఆతిథ్య జట్టునే చిత్తు చేసింది. దీనికి ముందు ఇదే వేదికపై లంకతో ద్వైపాక్షిక సిరీస్లో టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది. ఇది ఇంగ్లీష్ ఆటగాళ్లకు బాగా కలిసొస్తుంది. మరోపక్క పాక్ ఈ వేదికపై ఇటీవలికాలంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పిచ్ పరిస్థితులపై కూడా ఆ జట్టుకు అవగాహణ లేదు. ఎటు చూసినా నేటి మ్యాచ్లో ఇంగ్లండే హాట్ ఫేవరెట్గా కనిపిస్తుంది.. పాక్తో పోలిస్తే ఇంగ్లండ్ ప్రస్తుత టోర్నీలో మెరుగైన ఫామ్లో ఉంది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్పై విజయాలు సాధించి సూపర్-8లోకి అడుగుపెట్టింది. పాక్ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా గ్రూప్ దశలో 3 విజయాలు సాధించి, సూపర్-8లోకి ప్రవేశించినా.. తమకంటే చిన్న జట్లపై గెలిచేందుకు పాక్ ప్లేయర్లు ఆపసోపాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.తుది జట్లు (అంచనా)..ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వారం), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (సి), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా (c), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (wk), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
T20 WC 2026: జింబాబ్వే ప్లేయర్ వరల్డ్ రికార్డు
జింబాబ్వే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ ఈవాన్స్ పొట్టి క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా 28 ఇన్నింగ్స్ల్లో వికెట్ తీసిన తొలి బౌలర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా వెస్టిండీస్తో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.గతంలో ఈ రికార్డు శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ, ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్ పేరిట ఉండేది. మలింగ, అదైర్ వరుసగా 27 టీ20 ఇన్నింగ్స్ల్లో కనీసం ఓ వికెటైనా తీశారు. తాజాగా ఈవాన్స్.. మలింగ, అదైర్ పేరిట సంయుక్తంగా ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.ఈ రికార్డుకు సంబంధించి ఈవాన్స్, మలింగ, అదైర్ను సమీపించేందుకు పాకిస్తాన్ వివాదాస్పద బౌలర్ ఉస్మాన్ తారిక్ అతి సమీపంలో ఉన్నాడు. తారిక్ ఇప్పటివరకు వరుసగా 25 ఇన్నింగ్స్ల్లో కనీసం ఓ వికెటైన తీశాడు.వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెట్మైర్ (85), రోవ్మన్ పావెల్ (59), రూథర్ఫోర్డ్ (31 నాటౌట్), షెపర్డ్ (21), హోల్డర్ (13) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఈవాన్స్ (43), నగరవ (7 నాటౌట్) చివరి వికెట్కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్ హొసేన్ (4-1-28-3) తమ స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే పతనాన్ని శాశించారు.
T20 WC 2026: చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఓడినా, ఆ జట్టు ఆటగాళ్లు ఓ ప్రపంచకప్ రికార్డును సాధించారు. ఓటమి ఖరారైన వేల బ్రాడ్ ఈవాన్స్-రిచర్డ్ నగరవ పదో వికెట్కు 44 పరుగులు జోడించి, ప్రపంచకప్ చరిత్రలో పదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.సిక్సర్లతో విరుచుకుపడ్డారుజింబాబ్వే ఓటమి ఖరారయ్యాక ఈవాన్స్, నగరవ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈవాన్స్ 5, నగరవ ఓ సిక్సర్తో విధ్వంసం సృష్టించారు. షమార్ జోసఫ్ వేసిన 17వ ఓవర్లో ఈవాన్స్ మూడు సిక్సర్లు బాదాడు. అంతకుముందు జేసన్ హోల్డర్ వేసిన 16వ ఓవర్లోనూ రెండు సిక్సర్లు కొట్టాడు. దీనికి ముందు ఓవర్ చివరి బంతికి నగరవ ఓ సిక్సర్ బాదాడు.ప్రపంచకప్ రికార్డుఈ మ్యాచ్లో మరో ప్రపంచకప్ రికార్డు కూడా నమోదైంది. ఇరు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు బాదాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. గతంలో ఈ రికార్డు 2014 ఎడిషన్ నెదర్లాండ్స్-ఐర్లాండ్ మ్యాచ్ పేరిట ఉండేది. ఆ మ్యాచ్లో 30 సిక్సర్లు నమోదయ్యాయి.ముగిసిన జైత్రయాత్రఈ మ్యాచ్లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కూడా ఓ ప్రపంచకప్ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు (180) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో 5 పరుగుల వద్ద ఔట్ కావడంతో ప్రస్తుత ప్రపంచకప్లో బెన్నెట్ అజైత్రయాత్ర ముగిసింది. ఈ మ్యాచ్కు ముందు బెన్నెట్ 3 ఇన్నింగ్స్ల్లో 175 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు.కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెట్మైర్ (85), రోవ్మన్ పావెల్ (59), రూథర్ఫోర్డ్ (31 నాటౌట్), షెపర్డ్ (21), హోల్డర్ (13) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ ఈవాన్స్ (43), నగరవ (7 నాటౌట్) చివరి వికెట్కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్ హొసేన్ (4-1-28-3) తమ స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు.
T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) జరిగిన సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్-1లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు అదే గ్రూప్లో ఉన్న టీమిండియాను భారీ దెబ్బ కొట్టింది. అదేంటని అనుకుంటున్నారా..?ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 254 పరుగుల భారీ స్కోర్ చేసిన విండీస్.. ఆతర్వాత జింబాబ్వేను 147 పరుగులకే పరిమితం చేసి నెట్ రన్రేట్ను (5.350) భారీగా కూడగట్టుకుంది. ఈ రన్రేటే భారత్ కొంపముంచేలా ఉంది. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత మన జట్టు రన్రేట్ -3.800లో పడి పోగా.. సౌతాఫ్రికా రన్ రేట్ 3.800 వద్ద కూర్చుంది.ఈ గ్రూప్ నుంచి సెమీస్కు చేరే అవకాశాలు రెండు జట్లకు మాత్రమే ఉంటాయి. తొలి మ్యాచ్లో గెలిచి భారీ రన్ రేట్ కూడగట్టుకున్న విండీస్, సౌతాఫ్రికా సెమీస్ రేసులో ముందున్నాయి. భారత్, జింబాబ్వే మైనస్ రన్ రేట్లతో సెమీస్ రేసులో భారీగా వెనుకపడి పోయాయి. భారత్ సెమీస్కు చేరాలంటే తదుపరి జరిగే రెండు సూపర్-8 మ్యాచ్ల్లో (జింబాబ్వే, విండీస్) భారీ తేడాతో గెలవాలి. ఇలా గెలిచినా సెమీస్కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు.ఎందుకంటే విండీస్ రన్ రేట్ విషయంలో కొండెక్కి కూర్చుంది. తదుపరి రెండు మ్యాచ్ల్లో (సౌతాఫ్రికా, భారత్) ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరోపక్క భారత్పై గెలిచి సౌతాఫ్రికా ఇప్పటికే మరో సెమీస్ బెర్త్పై కర్చీఫ్ వేసుకొని కూర్చుంది. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో తమ కంటే బలహీనమైన జింబాబ్వే, విండీస్తో పోటీ పడుతుంది. ఒకవేళ విండీస్తో ఓడినా, జింబాబ్వేపై గెలిస్తే.. మరో సెమీస్ బెర్త్ సౌతాఫ్రికా వశమవుతుంది.ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితి చూస్తే, భారత్కు సెమీస్ బెర్త్ దక్కడం చాలా కష్టంగా కనిపిస్తుంది. భారత్ సెమీస్కు చేరాలంటే.. జింబాబ్వే, విండీస్పై భారీ విజయాలు సాధించడంతో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్ తలో మ్యాచ్లో అయినా ఓడాలి. అప్పుడు కూడా భారత్కు సెమీస్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి.ఉదాహరణకు సౌతాఫ్రికా విండీస్ చేతిలో ఓడి, జింబాబ్వేపై గెలిస్తే.. వారి ఖాతాలో నాలుగు పాయింట్లతో పాటు మంచి రన్ రేట్ ఉంటుంది. విండీస్ భారత్ చేతిలో ఓడి, సౌతాఫ్రికాపై ఓ మోస్తరు విజయం సాధించినా.. ఆ జట్టు ఖాతాలో కూడా నాలుగు పాయింట్లు, మంచి రన్రేట్ ఉంటుంది. ఇలా జరిగి, భారత్.. జింబాబ్వే, విండీస్పై విజయాలు సాధించినా.. విండీస్, సౌతాఫ్రికా రన్రేట్ను అధిగమిస్తుందన్న గ్యారెంటీ లేదు.ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ సెమీస్కు చేరాలంటే ఒక్క సమీకరణకు మాత్రమే అధిక అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే.. భారత్.. జింబాబ్వే, విండీస్పై భారీ విజయాలు సాధించాలి. మరోపక్క విండీస్.. సౌతాఫ్రికా చేతిలో కూడా ఓడాలి. అప్పుడు సౌతాఫ్రికా, భారత్ సెమీస్కు చేరుకుంటాయి.అనుకోవడానికి ఇది బాగానే ఉన్నా, ప్రస్తుతం విండీస్ ఉన్న ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే ఇది జరిగే పని కాకపోవచ్చు. విండీస్ ఈ ప్రపంచకప్లో వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి మాంచి జోష్లో ఉంది. తదుపరి వారు ఆడబోయే సౌతాఫ్రికా, భారత్ మ్యాచ్ల్లోనూ ఇది కొనసాగవచ్చు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్లో విండీస్ గెలిచినా భారత్ మూడో పొట్టి ప్రపంచకప్ కల కల్లగా మారిపోతుంది. మొత్తంగా వెస్టిండీస్.. జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచి భారత్ సెమీస్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసేసింది. ఫిబ్రవరి 26న జరిగే వెస్టిండీస్-సౌతాఫ్రికా మ్యాచ్ తర్వాత సెమీస్ బెర్త్లపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా, గ్రూప్-1 నుంచి ఓ సెమీస్ బెర్త్ ఖరారైపోతుంది. రెండో బెర్త్ కోసం సౌతాఫ్రికా, భారత్, జింబాబ్వే పోటీ పడాల్సి ఉంటుంది. విండీస్ చేతిలో భారీ తేడాతో ఓడినా, జింబాబ్వేకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో భారత్, సౌతాఫ్రికాపై ఘన విజయాలు సాధించాలి. అసాధ్యమని చెప్పలేము కానీ, ఇది సాధ్యపడటం మాత్రం చాలా కష్టమే.
మరో విజయం లక్ష్యంగా...
బ్రిస్బేన్: టి20 సిరీస్ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే సిరీస్లోనూ అదరగొట్టాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుతో బ్రిస్బేన్లో నేడు జరిగే తొలి వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ బృందం బరిలోకి దిగనుంది. గత ఏడాది తొలిసారి వన్డే వరల్డ్కప్ టైటిల్ గెలిచిన తర్వాత భారత్ ఆడబోతున్న తొలి వన్డే ఇదే కావడం విశేషం. నవీ ముంబైలో గత వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన ఆ్రస్టేలియా ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. టి20 సిరీస్కు దూరంగా ఉన్న సీనియర్ స్టార్ అలీసా హీలీ వన్డే సిరీస్కు కెపె్టన్గా అందుబాటులోకి వచ్చింది. భారత్తో సిరీస్ తర్వాత అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోనుంది. టి20 సిరీస్లో ఆడిన అరుంధతి రెడ్డి, భారతి ఫుల్మాలి, శ్రేయాంక పాటిల్ స్థానాల్లో కాశ్వీ గౌతమ్, హర్లీన్ డియోల్, ప్రతీక రావల్ భారత వన్డే జట్టులోకి వచ్చారు. వన్డే ఫార్మాట్లో ఏకంగా ఏడుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో ఎలీస్ పెరీ, యాష్లీ గార్డ్నర్, బెత్ మూనీ, అనాబెల్ సదర్లాండ్, అలీసా హీలీ రూపంలో పలువురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. పటిష్టమైన ఆ్రస్టేలియాను వారి గడ్డపైనే భారత్ ఓడించాలంటే... బ్యాట్తో స్మృతి మంధాన, హర్మన్ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్... బంతితో రేణుక, క్రాంత్రి, శ్రీచరణి అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. బ్రిస్బేన్ మైదానం ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ఎంతో కలిసొచ్చిన వేదిక. ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి వరకు ఆడిన 20 వన్డేల్లోనూ విజయం సాధించి అజేయంగా ఉంది. మంగళవారం తొలి వన్డే అనంతరం.... రెండు జట్లు హోబర్ట్ వేదికగా ఫిబ్రవరి 27న రెండో వన్డే, మార్చి 1న మూడో వన్డే ఆడతాయి. టి20, వన్డే, టెస్టు సిరీస్ ముగిశాక ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టుకు ఓవరాల్ విన్నర్స్ ట్రోఫీని అందజేస్తారు. టి20 సిరీస్ నెగ్గిన భారత జట్టు ప్రస్తుతం 4–2తో ఆధిక్యంలో ఉంది.
పాక్ కెప్టెన్పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మాద్ బ...
రుతుజా జోడీ ఓటమి
దుబాయ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ ...
హర్మన్ప్రీత్ దూరం
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన పురుషుల ప్రొ లీగ్ తొ...
బెల్జియం చేతిలో భారత్ ఓటమి
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భారత జట్టుక...
T20 WC 2026: జింబాబ్వే ప్లేయర్ వరల్డ్ రికార్డు
జింబాబ్వే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ ఈవాన...
T20 WC 2026: చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 24) ...
T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) ...
మరో విజయం లక్ష్యంగా...
బ్రిస్బేన్: టి20 సిరీస్ను సొంతం చేసుకున్న ఉత్సాహ...
క్రీడలు
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
వీడియోలు
కొంపముంచిన గంభీర్
సూపర్ 8లో హై ఓల్టేజ్ ఫైట్..! ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
టీ20 ప్రపంచ కప్ లో నేడు కీలక మ్యాచ్
ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
భారత్ కు మహాశివరాత్రి.. పాక్ కు కాళరాత్రి...
