Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND vs SA 3rd ODI Vizag: Toss Update Playing XIs Of Both Teams1
ఎట్టకేలకు టాస్‌ గెలిచిన టీమిండియా.. వాషీపై వేటు.. జట్టులోకి తిలక్‌

టీమిండియా ఎట్టకేలకు టాస్‌ గెలిచింది. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా విశాఖపట్నంలో తమ దురదృష్టానికి స్వస్తి పలికింది. 21వ ప్రయత్నంలో వన్డేల్లో తొలిసారి టాస్‌ గెలిచి.. తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అందుకే తొలుత బౌలింగ్‌ఈ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్‌ చేస్తాం. నిన్న రాత్రి ఇక్కడ మేము ప్రాక్టీస్‌ చేశాము. రాంచి, రాయ్‌పూర్‌లో మాదిరి కాకుండా ఇక్కడ తేమ కాస్త ఆలస్యంగా ప్రభావం చూపుతోందని గ్రహించాము.వాషీపై వేటు.. జట్టులోకి తిలక్‌అందుకే లక్ష్య ఛేదననే మేము ఎంచుకున్నాము. ఈ వికెట్‌ బాగుందనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాము. పరిస్థితులకు తగ్గట్లుగా ఇంకాస్త మెరుగుపడితే అనుకున్న ఫలితం రాబట్టవచ్చు. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో తిలక్‌ వర్మ (Tilak Varma) తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.గాయాలతో వారిద్దరు దూరంమరోవైపు.. సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా (Temba Bavuma) సైతం టాస్‌ గెలిస్తే తాము తొలుత బౌలింగే ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. రాంచి, రాయ్‌పూర్‌ మాదిరి ఇక్కడ కూడా ఆఖరి వరకు మ్యాచ్‌ ఉత్కంఠగా సాగితే ప్రేక్షకులు సంతోషిస్తారన్న బవుమా.. బర్గర్‌, డి జోర్జి స్థానాల్లో ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, ర్యాన్‌ రికెల్టన్‌ తుదిజట్టులోకి వచ్చారని తెలిపాడు. బర్గర్‌, డి జోర్జి గాయాల కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.ఫలితం తేల్చే మ్యాచ్‌కాగా మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా రాంచిలో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆదివారం పదిహేడు పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం రాయ్‌పూర్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా 1-1తో సిరీస్‌ సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్‌లో సిరీస్‌ విజేత ఎవరో తేలనుంది.భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లుభారత్‌రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రమ్‌, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.చదవండి: భారత్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు

Rise of global T20 leagues is alarming, are we witnessing gradual death of international cricket?2
టీ20 లీగ్‌ల విప్లవం.. అంతర్జాతీయ క్రికెట్‌ మనుగడ సాధ్యమేనా..?

జెంటిల్మెన్‌ గేమ్‌ క్రికెట్‌కు రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. గతంలో ఐరోపా దేశాల్లో క్రికెట్‌ అంటే ఏంటో కూడా చాలామందికి తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఐపీఎల్‌ లాంటి లీగ్‌ల పుట్టుకతో క్రికెట్‌ విశ్వవ్యాప్తంగా సుపరిచితమైంది.ఐపీఎల్‌ సక్సెస్‌తో క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న దేశాల్లో కూడా లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. అమెరికా, నేపాల్‌ లాంటి దేశాల్లో కొత్తగా లీగ్‌లు ప్రారంభం కావడమే ఇందుకు ఉదాహరణ. కొత్తగా న్యూజిలాండ్‌లో కూడా పెద్ద ఎత్తున టీ20 లీగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇప్పటికే ఐపీఎల్‌, బిగ్ బాష్‌ లీగ్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌, ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌, మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ లాంటి లీగ్‌లతో క్రికెట్‌ క్యాలెండర్‌ కిక్కిరిసిపోయింది.ప్రైవేట్‌ లీగ్‌ల్లో డబ్బు అధికంగా ఉండటంతో భారత ఆటగాళ్లు మినహా అంతర్జాతీయ ఆటగాళ్లంతా లీగ్‌లపైపే మొగ్గు చూపుతున్నారు. నికోలస్‌ పూరన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ లాంటి ఆటగాళ్లైతే తమ అంతర్జాతీయ కెరీర్‌లను అర్దంతరంగా వదులుకొని లీగ్‌ క్రికెట్‌తో బిజీ అయిపోయారు.ప్రపంచవాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక చోట ఏదో ఒక లీగ్‌ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు దేశాని కంటే లీగ్‌ క్రికెట్‌ ఆడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లంతా ఇలా దేశానికి ఆడకుండా ప్రైవేట్‌ లీగ్‌ల బాట పడితే అంతర్జాతీయ క్రికెట్‌ భవిష్యత్తు ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.స్టార్లు లేకుంటే అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగినా అభిమానుల ఆదరణ ఉండదు. లీగ్‌ల విప్లవం కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడమే అంతంతమాత్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు జాతీయ విధులకు డుమ్మా కొట్టి లీగ్‌ క్రికెట్‌కు ఓటేస్తే అంతర్జాతీయ క్రికెట్‌ మనుగడ కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అంతర్జాతీయ క్రికెట్‌ మనుగడకు ఆటగాళ్ల లభ్యత ఓ సమస్య అయితే.. కిక్కిరిసిన లీగ్‌ల షెడ్యూల్‌ మరో సమస్య. ఐపీఎల్‌ లాంటి లీగ్‌ ఏడాదిలో దాదాపు రెండు నెలలు జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా ఇక్కడే ఉండిపోతారు.ఈ లెక్కన అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రెండు నెలలు తీసేయాల్సిందే. బిగ్ బాష్‌ లీగ్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌, ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌, మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ లాంటి మిగతా అగ్రశ్రేణి లీగ్‌లకు ఒక్కో నెల కేటాయించినా మిగతా 10 నెలలు ఇక్కడే గడిచిపోతాయి.ఇలా, ఏడాదంతా ఏదో ఒక లీగ్‌ జరుగుతుంటే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఎప్పుడు జరుగుతాయి. జరిగినా ఆటగాళ్లు ఎలా అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో పని కానిచ్చినా ఆదరణ ఎలా లభిస్తుంది. ఈ అంశాలన్ని పరిగణలోకి తీసుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌ కనుమరుగు కావడం ఖాయమని అనిపిస్తుంది.ఇప్పటికైతే భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా లాంటి దేశాలకు చెందిన ఆటగాళ్లు లీగ్‌లపై పెద్దగా మోజు పెంచుకోకుండా జాతీయ విధులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. ఎందుకంటే ఆటగాళ్లకు లీగ్‌ల ఫ్రాంచైజీల నుంచి ఆర్దిక పరమైన ప్రలోభాలు పెద్ద ఎత్తున ఉంటాయి. తాజాగా ఓ క్రికెట్‌ ఫ్రాంచైజీ జాతీయ విధులు వదిలిపెట్టి, తమతో పాటే ఉండాలని ఇద్దరు ఆసీస్‌ క్రికెటర్లకు కోట్లకు కోట్లు ఆఫర్‌ చేసిందనే వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం పట్ల ఎంత నిబద్దత ఉన్న ఆటగాళ్లైనా టెంప్ట్‌ అవ్వాల్సిందే.

IND vs SA: 2 South African players ruled out of ODI decider in Vizag3
భారత్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు

భారత్‌తో కీలక మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్‌ తగిలింది. తొలి రెండు వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. పేసర్‌ నండ్రీ బర్గర్‌ (Nandre Burger), బ్యాటర్‌ టోనీ డీ జోర్జి (Tony de Zorzi) గాయాల కారణంగా విశాఖపట్నం మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. సౌతాఫ్రికా క్రికెట్‌ ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. గాయాల కారణంగా..టీమిండియాతో రాయ్‌పూర్‌ వేదికగా రెండో వన్డే సందర్భంగా.. ఫాస్ట్‌ బౌలర్‌ నండ్రీ బర్గర్‌కు తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. మధ్యలోనే అతడు మైదానం నుంచి నిష్క్రమించాడు. మరోవైపు.. డి జోర్జి కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరనికి శుక్రవారం స్కానింగ్‌కు పంపగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.టీ20 సిరీస్‌ మొత్తానికి అతడు దూరంఫలితంగా బర్గర్‌, డి జోర్జికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సౌతాఫ్రికా క్రికెట్‌ వెల్లడించింది. డి జోర్జి భారత్‌తో ఆఖరి వన్డేతో పాటు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ మొత్తానికి కూడా దూరమైనట్లు తెలిపింది. అతడు స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు పేర్కొంది. అయితే, అతడి స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది.క్వెనా మఫాకా సైతం..అదే విధంగా.. యువ ఫాస్ట్‌ బౌలర్‌ క్వెనా మఫాకా కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలిపిన ప్రొటిస్‌ బోర్డు.. అతడు పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలిపింది. కాబట్టి టీమిండియాతో టీ20 సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. జట్టు నుంచి అతడు నిష్క్రమించాడని.. మఫాకా స్థానంలో లూథో సిపామ్లను టీ20 జట్టులోకి చేర్చినట్లు వెల్లడించింది.టెస్టులలో పైచేయి.. వన్డేలలో 1-1తో..కాగా టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత ఆతిథ్య జట్టును టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌ చేశారు సఫారీలు.ఇక వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓడిన ప్రొటిస్‌ జట్టు.. రెండో వన్డేలో గెలిచి 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య సిరీస్‌ విజేతను తేల్చే ఆఖరిదైన శనివారం నాటి మూడో వన్డేకు విశాఖపట్నం వేదిక. ఆ తర్వాత డిసెంబరు 9 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌కు తెరలేస్తుంది.చదవండి: చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్‌

Justin Greaves Double Century, West Indies vs New Zealand 1st test ends in draw4
చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్‌

వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసింది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌‌లో 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అసాధారణ పోరాటపటిమ ప్రదర్శించింది. చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాతో సరిపెట్టుకుంది.ఆట చివరి రోజు జస్టిన్‌ గ్రీవ్స్‌ అజేయ డబుల్‌ సెంచరీతో (202).. కీమర్‌ రోచ్‌ (233 బంతుల్లో 58 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో వీరిచిత పోరాటాన్ని చేశారు. ముఖ్యంగా గ్రీవ్స్‌ చేసిన పోరాటం టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ పోరాటాల్లో ఒకటిగా మిగిలిపోనుంది. తిమ్మిర్లతో బాధపడుతూ గ్రీవ్స్‌ ఆడిన ఇన్నింగ్స్‌ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉంది.37 ఏళ్ల వయసులో రోచ్‌ చేసిన పోరాటాన్ని విస్మరించలేము. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తర్వాత ఏకంగా 233 బంతుల ఎదుర్కోవడం అంటే ఆషామాషీ విషయం​ కాదు. అంతకుముందు షాయ్‌ హోప్‌ అద్బుతమైన శతకంతో (140) వీరిలో స్పూర్తి నింపాడు.72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్‌ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.ముఖ్యంగా గ్రీవ్స్‌ ఆటతీరును ఎంత పొగిడినా తక్కువే. ఇతగాడు 565 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి, తన జట్టు మ్యాచ్‌ను కోల్పోకుండా కాపాడాడు. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్‌ గెలిచినట్లే. విండీస్‌ యెధుల పోరాటాన్ని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ కీర్తిస్తుంది.ఈ యోధులు ఎదుర్కొన్నది సాధారణ బౌలింగ్‌ గణాన్ని కాదు. మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ లాంటి పేస్‌ బౌలింగ్‌ దిగ్గజాలను, బ్రేస్‌వెల్‌ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌ను. వీరి తట్టుకొని నాలుగో ఇన్నింగ్స్‌లో అంత భారీ లక్ష్యానికి చేరువ కావడం ఊహకందని గొప్ప విషయం.ఉనికి కోసం పోరాడుతున్న క్రమంలో..గత మూడు దశాబ్దాలుగా ప్రభ కోల్పోయి ఉనికి కోసం పోరాడుతున్న విండీస్‌ లాంటి జట్టు నుంచి ఇలాంటి వీరోచిత పోరాటన్ని ఎవరూ ఊహించి ఉండరు. ఈ జట్టు షాయ్‌ హోప్‌ లాంటి ఆటగాడు ఇస్తున్న స్పూర్తితో ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో.. పాకిస్తాన్‌ను పాకిస్తాన్‌లో ఓడించి, పూర్వ వైభవం​ దిశగా సాగుతున్నామన్న సంకేతాలు పంపింది.సరికొత్త చరిత్ర అయ్యేదిఈ మ్యాచ్‌ విండీస్‌ గెలిచి ఉంటే సరికొత్త చరిత్ర సృష్టించి ఉండేది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు 500కు మించి లక్ష్యాన్ని ఛేదించలేదు. గత రికార్డు కూడా విండీస్‌ పేరిటే ఉంది. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.లాథమ్‌, రచిన్‌ శతకాలుఅంతకుముందు టామ్‌ లాథమ్‌ (145), రచిన్‌ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (466/8) చేసి విండీస్‌ ముందు 531 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కీమర్‌ రోచ్‌ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.చెలరేగిన డఫీదీనికి ముందు జేకబ్‌ డఫీ ఐదేయడంతో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ హోప్‌ (56) రాణించాడు. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.కలిసికట్టుగా రాణించిన విండీస్‌ బౌలర్లువిండీస్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్‌ విలియమ్సన్‌ (52) ఒక్కడే కివీస్‌ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.

Shimron Hetmyer Wins the game for Desert vipers5
హెట్‌మైర్‌ మెరుపులు.. నైట్‌రైడర్స్‌ చిత్తు

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో భాగంగా నిన్న (డిసెంబర్‌ 5) జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్‌ వైపర్స్‌, అబుదాబీ నైట్‌రైడర్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వైపర్స్‌ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలెక్స్‌ హేల్స్‌ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో రసెల్‌ (36 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.మిగతా ఆటగాళ్లలో ఫిల్‌ సాల్ట్‌ 18, అలీషాన్‌ షరాఫు 25, లివింగ్‌స్టోన్‌ 4, రూథర్‌ఫోర్డ్‌ 3, చంద్‌ 18, నరైన్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. వైపర్స్‌ బౌలర్లలో ఖైస్‌ అహ్మద్‌, నూర్‌ అహ్మద్‌ తలో 2, నసీం షా, డాన్‌ లారెన్స్‌ చెరో వికెట్‌ తీశారు.అనంతరం​ ఓ మెస్తరు లక్ష్య ఛేదనకు దిగిన వైపర్స్‌ మరో 3 బంతులు మిగిలుండగానే (8 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (25 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి వైపర్స్‌ను గెలిపించాడు. అతనికి డాన్‌ లారెన్స్‌ (35), తన్వీర్‌ (31 నాటౌట్‌) సహకరించారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో అజయ్‌ కుమార్‌ 3, నరైన్‌ 2, స్టోన్‌, పియూశ్‌ చావ్లా, రసెల్‌ తలో వికెట్‌ తీశారు.

Steve Smith now holds the record for the most WTC runs by an Australian batter6
చరిత్ర సృష్టించిన స్టీవ్‌ స్మిత్‌

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. యాషెస్‌ రెండో టెస్ట్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. లబూషేన్‌ ఖాతాలో ఉన్న ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం లబూషేన్‌ ఖాతాలో 4350 పరుగులు ఉండగా.. స్టీవ్‌ ఖాతాలో 4358 పరుగులు ఉన్నాయి. ఓవరాల్‌గా డబ్ల్యూటీసీ అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లండ్‌ దిగ్గజం జో రూట్‌ పేరిట ఉంది. ప్రస్తుతం రూట్‌ ఖాతాలో 6226 పరుగులు ఉన్నాయి. రూట్‌కు రెండో స్థానంలో ఉన్న స్టీవ్‌కు మధ్య దాదాపు 2000 పరుగుల వ్యత్యాసం ఉండటం విశేషం.హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న యాషెస్‌ రెండో టెస్ట్‌ హోరాహోరీగా సాగుతోంది. రెండో రోజు ఆటలో ఇంగ్లీష్ జట్టుపై కంగారులు పైచేయి సాధించారు. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసి, 44 పరుగుల ఆధిక్యంలో ఉంది.క్రీజులో అలెక్స్ కారీ (46), నీసర్‌ (15) ఉన్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ట్రావిస్ హెడ్ 33 పరుగులకే పరిమితయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, స్టోక్స్ 2, ఆర్చర్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. జో రూట్‌(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్‌(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

IND VS SA 3rd ODI: Why Vizag feels like home to Virat Kohli, A love story in numbers7
వైజాగ్‌ అంటే 'కింగ్‌'కు పూనకాలే..!

వైజాగ్‌ వేదికగా భారత్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్‌ 6) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. తొలి వన్డేలో భారత్‌, రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.వైజాగ్‌ వన్డే ప్రారంభానికి ముందు అందరి కళ్లు టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లిపైనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.కోహ్లి ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఇది సాధ్యమయ్యేలానే కనిపిస్తుంది. వైజాగ్‌ పిచ్‌ కూడా కోహ్లికి అద్భుతంగా సహకరించే అవకాశం ఉంది. ఈ మైదానం అంటే కింగ్‌కు పూనకాలు వస్తాయి. ఇక్కడ అతనాడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 97.83 సగటున 587 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 2 అర్ద శతకాలు ఉన్నాయి.స్ట్రయిక్‌రేట్‌ కూడా 100కు పైబడే ఉంది. ఈ గణాంకాలు చూస్తే కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ లోడింగ్‌ అనక తప్పదు. వైజాగ్‌లో మరిన్ని పరిస్థితులు కూడా కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీకి అనుకూలంగా ఉన్నాయి.పిచ్‌ స్వభాగం కోహ్లి బ్యాటింగ్‌ శైలికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌన్స్‌కు అవకాశమున్నా, బంతి బ్యాట్‌ వద్దకు సలువుగా వస్తుంది. ఈ పరిస్థితి కోహ్లిని రెచ్చిపోయేలా చేస్తుంది. బలంగా షాట్లు ఆడటం కంటే, టైమింగ్‌, బ్యాలెన్స్‌, ప్లేస్‌మెంట్‌ను నమ్ముకునే కోహ్లి బంతి బ్యాట్‌ వద్దకు వస్తే చెలరేగిపోతాడు.కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ లోడింగ్‌ అనడానికి వైజాగ్‌లోని చిన్న బౌండరీలు మరో కారణం. పిచ్‌ ఎలాగూ సహకరిస్తుంది కాబట్టి, కోహ్లి తన సహజశైలిలో పంచ్‌ షాట్లు, డ్రైవ్‌లు ఆడితే సులువుగా బౌండరీలు వస్తాయి. కోహ్లికి పెద్దగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేసే పని కూడా ఉండదు. పిచ్‌ స్వభావం, చిన్న బౌండరీలు ఉండటం చేత కోహ్లి వేగంగా పరుగులు చేయడంతో పాటు భారీ సెంచరీ చేసే ఆస్కారముంది.కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ లోడింగ్‌ అనడానికి వీటన్నిటి కంటే ముఖ్యమైన పాయింట్‌ మరొకటి ఉంది. అదేంటంటే.. బలహీనమైన దక్షిణాఫ్రికా పేస్‌ బౌలింగ్‌. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా ఎంత బలహీనంగా ఉందో గత మ్యాచ్‌లో స్పష్టమైంది. ప్రధాన పేసర్లు ఎంగిడి, జన్సెన్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. మరో ప్రధాన పేసర్‌ నండ్రే బర్గర్‌ గాయపడ్డాడు. ఒకవేళ నేటి మ్యాచ్‌లో ఈ ముగ్గురూ బరిలోకి దిగినా పిచ్‌ నుంచి పెద్దగా సహకారం లభించకపోవచ్చు. స్పిన్నర్లను కోహ్లి ఎంత అలవోకగా ఎదుర్కోగలడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ లోడింగ్‌ అనక తప్పదు.

Ravindra Jadeja, Bumrah, Shreyas Iyer Celebrating their Birthday on December 68
December 6: టీమిండియాకు చాలా ప్రత్యేకమైన రోజు

భారత క్రికెట్‌కు డిసెంబర్‌ 6 (December 6) చాలా ప్రత్యేకమైన రోజు. ఇవాళ ముగ్గురు టీమిండియా స్టార్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, అత్యుత్తమ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వేర్వేరు సంవత్సరాల్లో డిసెంబర్‌ 6న జన్మించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యులుగా ఉన్నారు.ఈ ముగ్గురిలో సీనియర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). ఎడమ చేతి స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన జడేజా 1988లో గుజరాత్‌లోని నవ్‌గామ్‌ఘడ్‌లో జన్మించాడు. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.2008-09 రంజీ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన (42 వికెట్లు, 739 పరుగులు) కారణంగా జడ్డూకు టీమిండియా ఆఫర్‌ వచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు జడేజా.2024 టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి, ప్రస్తుతం భారత టెస్ట్‌, వన్డే జట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.పై ముగ్గురిలో జడ్డూ తర్వాత సీనియర్‌ బుమ్రా (Jasprit Bumrah). ఈ కుడి చేతి వాటం పేసు గుర్రం 1993లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. విశిష్టమైన బౌలింగ్‌ శైలి కలిగిన బుమ్రా.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగ్‌ మరియు పేస్‌ కలయికతో ప్రపంచ బ్యాటర్లను వణికిస్తున్నాడు.ఐపీఎల్‌లో సత్తా చాటడం ద్వారా 2016 టీమిండియా తలుపులు తట్టిన బుమ్రా అనతికాలంలో సూపర్‌ స్టార్‌ బౌలర్‌ అయ్యాడు. భారత పేసు గుర్రంగా పేరు తెచ్చుకున్నాడు. బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చివరి ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యానికి బుమ్రా ప్రసిద్ది చెందాడు.గతేడాది ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్న బుమ్రా, టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గతేడాది భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. విదేశీ పిచ్‌లు.. ముఖ్యంగా SENA దేశాల్లో ఫాస్ట్‌ బౌలింగ్‌ పిచ్‌లపై బుమ్రాకు ఎవరికీ లేని ట్రాక్‌ రికార్డు ఉంది.పై ముగ్గురిలో చిన్నవాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer). శ్రేయస్‌ 1994లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన శ్రేయస్‌ 2014 అండర్‌-19 వరల్డ్‌కప్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటి 2017లో టీమిండియా తలుపులు తట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రేయస్‌ మిడిలార్డర్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను చాలా మ్యాచ్‌ల్లో గెలిపించాడు. జాతీయ జట్టులో పోలిస్తే శ్రేయస్‌కు ఐపీఎల్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 2024లో కేకేఆర్‌కు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ 2025 సీజన్‌లో పంజాబ్‌ను.. అంతకుముందు ఢిల్లీని ఫైనల్‌కు చేర్చాడు. 2023 వరల్డ్‌కప్‌లో 500పైగా పరుగులు చేసి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన శ్రేయస్‌.. టీమిండియా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంలోనూ ప్రధానపాత్ర పోషించాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్‌.. ప్రస్తుతం కోలుకునే క్రమంలో ఉన్నాడు.పై ముగ్గురితో పాటు డిసెంబర్‌ 6న ఆర్పీ సింగ్‌, కరుణ్‌ నాయర్‌, అన్షుల్‌ కంబోజ్‌, హ్యారీ టెక్టార్‌, గ్లెన్‌ ఫిలిప్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

Shafali in the race for ICC Player of the Month9
ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ రేసులో షఫాలీ

దుబాయ్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ రేసులో నిలిచింది. మహిళల విభాగంలో నవంబర్‌ నెలలో ఆమె ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తుది జాబితాలో షఫాలీకి చోటు దక్కింది. భారత్‌ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలుపొందడంలో షఫాలీ కీలకపాత్ర పోషించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆమె 87 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు తీసింది. ప్రతీక రావల్‌ గాయపడటంతో అనూహ్యంగా సెమీస్, ఫైనల్‌ ఆడే అవకాశం దక్కగా ఏకంగా ఆల్‌రౌండ్‌ షోతో భారత వరల్డ్‌కప్‌ స్టార్‌ అయ్యింది. తాజాగా అవార్డు రేసులోనూ ఉంది. ఆమెతో పాటు ఈ అవార్డు కోసం ఈషా ఒజా (యూఏఈ), తిపత్చా పుతవాంగ్‌ (థాయ్‌లాండ్‌)లు కూడా పోటీ పడుతున్నారు. ఐసీసీ ప్రారంభించిన మహిళల ఎమర్జింగ్‌ నేషన్స్‌ ట్రోఫీలో (బ్యాంకాక్‌)లో వీళ్లిద్దరు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక పురుషుల విభాగంలో నవంబర్‌ నెలకు గాను సఫారీ స్పిన్నర్‌ హార్మర్, బంగ్లాదేశ్‌ బౌలర్‌ తైజుల్‌ ఇస్లామ్, పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ నవాజ్‌లు ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు రేసులో ఉన్నారు. భారత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా నెగ్గడంలో హార్మర్‌ కీలక భూమిక పోషించాడు.

Formula One Drivers Championship has turned into interesting 10
‘అవసరమైతే... అధికారిక ఆదేశాలిస్తాం’

అబుదాబి: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ రేసు రసవత్తరంగా మారింది. 24 రేస్‌ల సీజన్‌లో ఇప్పటి వరకు 23 రేసులు ముగియగా... పాయింట్ల పట్టికలో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌ 408 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 396 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో మెక్‌లారెన్‌కే చెందిన ఆస్కార్‌ పియాస్ట్రి (392 పాయింట్లు) ఉన్నాడు.సీజన్‌లో చివరి రేస్‌ అబుదాబి గ్రాండ్‌ప్రి ఈ ఆదివారం జరగనుండగా... నోరిస్‌ పోడియంపై నిలిస్తే అతడికే ఈ ఏడాది టైటిల్‌ దక్కనుంది. ఈ నేపథ్యంలో... మెక్‌లారెన్‌ యాజమాన్యం శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే జట్టు తరఫున ఆదేశాలిస్తామని పేర్కొంది. ‘అవును, తప్పకుండా ప్రయత్నిస్తాం. మేము ఈ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలవాలని అనుకుంటున్నాం. మా ఇద్దరు డ్రైవర్లు టైటిల్‌ రేసులో ఉన్నా... ఒకరికి మాత్రమే ఎక్కువ అవకాశాలున్నాయనేది సుస్పష్టం. ఇది జట్టు క్రీడ. చాంపియన్‌షిప్‌ సాధించేందుకు చేయగలిగినదంతా చేస్తాం. అలా చేయకపోవడం పిచ్చితనం అవుతుంది’ అని మెక్‌లారెన్‌ సీఈవో జాక్‌ బ్రౌన్‌ అన్నాడు. వెర్‌స్టాపెన్‌ కంటే 12 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న నోరిస్‌ సీజన్‌ చివరి రేసులో తొలి మూడు స్థానాల్లో నిలిస్తే చాలు టైటిల్‌ దక్కనుంది. ఈ నేపథ్యంలో సహచర డ్రైవర్‌ పియాస్ట్రిని చాంపియన్‌షిప్‌ గెలిచేందుకు సహకరించమని అడగలేనని నోరిస్‌ ఇప్పటికే పేర్కొనగా... తాజాగా జట్టు మేనేజ్‌మెంట్‌ మాత్రం టైటిల్‌ కోసం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటామని వెల్లడించింది. మెక్‌లారెన్‌ జట్టు చివరిసారిగా 2008లో డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ నెగ్గింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement