Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Argentina star Lionel Messi at Wankhede1
సచిన్‌... సచిన్‌... మెస్సీ... మెస్సీ

ముంబై: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లయోనల్‌ మెస్సీ తన ‘గోట్‌ టూర్‌’లో భాగంగా రెండో రోజు ముంబైని మురిపించాడు. భారత మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి వాంఖెడేలో సందడి చేశాడు. మామూలుగా అయితే ఈ మైదానంలో టెండూల్కర్‌ ఉంటే ‘సచిన్‌... సచిన్‌...’ అనే గోలే వినిపించేది. కానీ ఆదివారం స్వరం మారింది. యువ తరం, నవతరం అంతా కలిసి తమ ఆరాధ్య క్రికెటర్‌తో పాటు అభిమాన ఫుట్‌బాలర్‌ పేరునూ మార్మోగించారు. దీంతో వాంఖెడే స్టేడియం ‘సచిన్‌... సచిన్‌... మెస్సీ... మెస్సీ...’ నామస్మరణతో మార్మోగిపోయింది. సచిన్, మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్, భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం సునీల్‌ ఛెత్రితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బాలీవుడ్‌ స్టార్స్‌ అజయ్‌ దేవ్‌గణ్, టైగర్‌ ష్రాఫ్, అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్, పలువురు సెలబ్రిటీలతో స్టేడియమంతా తారతోరణం దిద్దుకుంది. వాంఖెడే పుటల్లో ఈ పూట క్రీడా ప్రపంచంలోనే అలుపెరగని దిగ్గజాలు ప్రత్యక్షంగా మైదానాన్ని, పరోక్షంగా యావత్‌ భారత్‌ను అలరించారు. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోని క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన పురిటి గడ్డపై జగద్విఖ్యాత ఫుట్‌బాలర్‌ లయోనల్‌ మెస్సీతో కలిసి సందడి చేశాడు. వాంఖెడే స్టేడియంలో దిగ్గజాల భేటీతో సరికొత్త అధ్యాయం ప్రారంభించినట్లయ్యింది. పోటెత్తిన అభిమానులతో కిక్కిరిసిపోయిన స్టేడియంలో వీరిద్దరే కేంద్ర బిందువులయ్యారు. భారత ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్ సునీల్‌ ఛెత్రి, రాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ సహా పుర ప్రముఖులు ఎందరున్నా... వేల కళ్లు సచిన్‌–మెస్సీల నుంచి చూపును తిప్పుకోలేకపోయాయి. ముఖ్యంగా భారత క్రికెట్‌ అభిమానులు తమ ఆరాధ్య దిగ్గజం సచిన్‌ను విఖ్యాత ఫుట్‌బాలర్‌తో కన్నుల పండుగగా చూసుకున్నారు. ఈ సందర్భంగా మహా సీఎం ఫడ్నవీస్‌ రాష్ట్రంలో యువ ఫుట్‌బాలర్ల ప్రతిభను సానబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రాజెక్ట్‌ మహాదేవ’ పేరిట ఫుట్‌బాల్‌ ప్రతిభావంతుల్ని తయారు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. అపురూపం... పరస్పర బహుమానం అర్జెంటీనా స్టార్‌కు టెండూల్కర్‌ తను స్వయంగా ఆటోగ్రాఫ్‌ చేసిన వన్డే జెర్సీని మెస్సీకి అందివ్వగా... ప్రతిగా మెస్సీ కూడా తన సంతకంతో కూడిన ఫుట్‌బాల్‌ను సచిన్‌కు ఇచ్చాడు. అన్నట్లు ఆటలు వేరైనా... దేశాలు వేరైనా... సచిన్‌ జెర్సీ నంబర్, మెస్సీ జెర్సీ నంబర్‌ ఒక్కటే 10! అదేనండీ ‘దస్‌కా దమ్‌’’! దిగ్గజాలు పరస్పర బహుమతులు ఇస్తూ స్వీకరిస్తుంటే అభిమానులంతా ఉప్పొంగిపోయారు. ఈ అపు‘రూపం’ను తమ ఫోన్‌ కెమెరాల్లో పదిలంగా బందీచేసుకున్నారంతా! నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ... ‘గోట్‌ టూర్‌’లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లయోనల్‌ మెస్సీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈరోజు మర్యాదపూర్వకంగా కలువనున్నాడు. మూడు రోజుల ‘గోట్‌ టూర్‌’ నేడు ఢిల్లీలో ముగియనుంది. ముంబై నుంచి సోమవారం ఉదయం 10 గంటల తర్వాత మెస్సీ ఢిల్లీ చేరుకుంటాడు. నగరంలోని క్రీడాభిమానులతో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ ముగించుకొన్న తర్వాత మెస్సీ... ప్రధాని మోదీతో భేటీ అవుతాడు. ప్రధాని నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య జరిగే మాటామంతీలో సాకర్‌ సూపర్‌ స్టార్‌ ఫుట్‌బాల్‌ ముచ్చట్లు పంచుకోకున్నాడు. ఆ తర్వాత భారత సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ రాహుల్‌ నవీన్, అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ ప్రఫుల్‌ పటేల్‌తో కూడా మెస్సీ భేటీ అవుతారని నిర్వాహకులు వెల్లడించారు. ఇలా పలువురు వీవీఐపీలను కలిసిన తర్వాత మెస్సీ మధ్యాహ్నం 3.30 గంటలకు అరుణ్‌ జైట్లీ స్టేడియానికి చేరుకుంటాడు. అక్కడ తన అభిమానుల్ని అలరించిన అనంతరం స్వదేశానికి పయనమవుతాడని నిర్వాహకులు వెల్లడించారు. నాకు ఇక్కడ (వాంఖెడే) మరుపేలేని మధుర జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. అందుకే మన ముంబై ఒక కలల నగరి. ఈ వేదికపై ఎంతో మంది స్వప్నాలు సాకారమయ్యాయి. 2011 నాకు బాగా గుర్తు. నా కల (వన్డే వరల్డ్‌కప్‌) కూడా ఇక్కడే నిజమైంది. ముఖ్యంగా మీ (అభిమానులు) మద్దతే లేకపోతే ఆ స్వర్ణానుభూతిని నేనైతే ఎప్పటికీ చూడలేను. ఇప్పుడు కూడా మెస్సీని ఇక్కడ చూస్తుంటే అలాంటి అనుభూతే కలుగుతోంది. మన యువ ఫుట్‌బాలర్లను ప్రోత్సహించిన మెస్సీకి మీ అందరి తరఫున, భారతీయుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. –సచిన్‌ టెండూల్కర్‌

Shatadru Datta has been remanded to judicial custody for 14 days2
‘గోట్‌ టూర్‌’ చీఫ్‌ ఆర్గనైజర్‌ జైలుకు!

కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లయోనల్‌ మెస్సీ ప్రస్తుతం ‘గోట్‌ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) టూర్‌ ఆఫ్‌ ఇండియా’లో భాగంగా భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నాడు. ఈ టూర్‌ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా కాగా... తొలిరోజు కోల్‌కతాలో ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా సాల్ట్‌లేక్‌ స్టేడియంలో మెస్సీ మ్యాచ్‌ ఆడతాడంటూ ప్రముఖంగా ప్రచారం చేశారు. రూ. వేలల్లో టికెట్లను అమ్మారు. ఫుట్‌బాల్‌ క్రేజీ బెంగాలీ వాసులు సుమారు 80 వేల మంది వేలకువేలు వెచి్చంచి స్టేడియానికి తరలివెళ్లారు. కానీ తమ ఆరాధ్య ఫుట్‌బాలర్‌ మెస్సీ పట్టుమని పది నిమిషాలైనా మైదానంలో అలరించలేదు. ఆ ఉన్న కొద్దిసేపు కూడా చీమలదండు లాంటి భద్రతా వలయంతో ఏ గ్యాలరీలోని ప్రేక్షకుడు కూడా మెస్సీని చూడలేకపోయాడు. దీంతో సూపర్‌స్టార్‌ను ప్రత్యక్షంగా చూసి కన్నుల పండగ చేసుకుందామని రూ.వేలు వెచి్చంచిన అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా వేల మంది విరుచుకుపడటంతో కరతాళ ధ్వనులతో మార్మోగాల్సిన మైదానం రసాభాసగా మారింది. ఈ ఈవెంట్‌ నిర్వహణ వైఫల్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభిమానుల తాకిడి, అంచనాలకు విరుద్ధంగా ఏర్పాట్లు, నిర్వహణ వైఫల్యంపై చీఫ్‌ ఆర్గనైజర్‌ శతద్రు దత్తాను శనివారమే అదుపులోకి తీసుకొని ఆదివారం జడ్జి ముందు హాజరు పరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి... ముఖ్య నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో శతద్రును జైలుకు తరలించారు.

Odisha Masters Singles Champions Unnati and Kiran3
సింగిల్స్‌ చాంప్స్‌ ఉన్నతి, కిరణ్‌

కటక్‌: ఒడిశా మాస్టర్స్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీ సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు రెండు టైటిల్స్‌ లభించాయి. మహిళల సింగిల్స్‌లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల ఉన్నతి హుడా... పురుషుల సింగిల్స్‌లో కేరళకు చెందిన కిరణ్‌ జార్జి చాంపియన్స్‌గా అవతరించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ 28వ ర్యాంకర్‌ ఉన్నతి 21–17, 21–10తో భారత్‌కే చెందిన ప్రపంచ 53వ ర్యాంకర్‌ ఇషారాణి బారువాను ఓడించింది. 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఉన్నతికి తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. రెండో గేమ్‌లో మాత్రం ఆరంభం నుంచే ఉన్నతి జోరు కొనసాగింది. పురుషుల సింగిల్స్‌ తుది పోరులో ప్రపంచ 41వ ర్యాంకర్‌ కిరణ్‌ జార్జి 21–14, 13–21, 21–16తో ప్రపంచ 77వ ర్యాంకర్‌ మొహమ్మద్‌ యూసుఫ్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించింది. 65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో తడబడ్డ కిరణ్‌ నిర్ణాయక మూడో గేమ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచి టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. విజేతలుగా నిలిచిన ఉన్నతి, కిరణ్‌లకు 8,250 డాలర్ల (రూ. 7 లక్షల 46 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Team India wins 7 wickets against South Africa in 3rd T204
భారత్‌ భళా... సఫారీ డీలా

ధర్మశాల: ధర్మశాల అసలే శీతల ప్రదేశం. ఇక ఈ చలికాలమైతే మంచు గడ్డలా మారాల్సిందే. అలాంటి వేదికపై మన పేసర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సెగ పెట్టారు. ఆరంభంలో పేస్‌ ప్రతాపం, తర్వాత స్పిన్‌ మాయాజాలం భారత్‌ను సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిపింది. ఆదివారం జరిగిన మూడో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. టాస్‌ నెగ్గిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ మార్క్‌రమ్‌ (46 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే భారత బౌలింగ్‌కు ఎదురు నిలిచాడు. మ్యాచ్‌ మొదలైన కాసేపటికే అర్ష్ దీప్ (2/13), హర్షిత్‌ రాణా (2/34), హార్దిక్‌ పాండ్యా (1/23) పేస్‌కు సఫారీ కుదేలైంది. రిజా హెండ్రిక్స్‌ (0), డికాక్‌ (1), బ్రెవిస్‌ (2)లు పెవిలియన్‌ చేరడంతో ఒకదశలో 3.1 ఓవర్లలో సఫారీ స్కోరు 7/3. తర్వాత స్పిన్‌ తిరగడంతో 77 పరుగుల వద్ద 7వ వికెట్‌ను కోల్పోయింది. మార్క్‌రమ్‌ ఫిఫ్టీతో జట్టు కష్టంగా వంద పైచిలుకు స్కోరు చేసింది. మెరిపించిన అభిషేక్‌ భారత్‌ ముందున్న లక్ష్యం ఏమాత్రం కష్టమైంది కాదు. ఇలాంటి స్కోరు ఛేదించేందుకు దిగిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (28 బంతుల్లో 28; 5 ఫోర్లు) చక్కని ఆరంభమిచ్చారు. అభిషేక్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా స్కోరు 4.1 ఓవర్ల్లలోనే 50 పరుగులు దాటింది. ఓపెనింగ్‌ వికెట్‌కు చకచకా 60 పరుగులు జోడించిన అభిషేక్‌ తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు), గిల్‌ కుదురుగా ఆడారు. స్వల్ప వ్యవధిలో గిల్, కెప్టెన్ సూర్యకుమార్‌ (12) నిష్క్రమించినప్పటికీ మిగతా లాంఛనాన్ని తిలక్, శివమ్‌ దూబే (10 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) ముగించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ తదుపరి నాలుగో టి20 బుధవారం (17న) లక్నోలో జరుగుతుంది.3 స్టబ్స్‌ను అవుట్‌ చేసిన హార్దిక్‌ అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న మూడో భారత బౌలర్‌. అర్ష్ దీప్, బుమ్రాలు ఇదివరకే వంద వికెట్ల క్లబ్‌లో ఉన్నారు.5 స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి పొట్టి క్రికెట్‌లో 50 వికెట్లు పడగొట్టాడు.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షిత్‌ రాణా 1; హెండ్రిక్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్‌ 0; మార్క్‌రమ్‌ (సి) జితేశ్‌ (బి) అర్ష్ దీప్‌ 61; బ్రెవిస్‌ (బి) హర్షిత్‌ 2; స్టబ్స్‌ (సి) జితేశ్‌ (బి) హార్దిక్‌ 9; బాష్‌ (బి) దూబే 4; ఫెరీరా (బి) వరుణ్‌ 20; యాన్సెన్‌ (బి) వరుణ్‌ 2; నోర్జే (స్టంప్డ్‌) జితేశ్‌ (బి) కుల్దీప్‌ 12; ఎన్‌గిడి (నాటౌట్‌) 2; బార్ట్‌మన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) కుల్దీప్‌ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 117. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–7, 4–30, 5–44, 6–69, 7–77, 8–113, 9–115, 10–117. బౌలింగ్‌: అర్ష్ దీప్‌ 4–0–13–2, హర్షిత్‌ 4–0–34–2, హార్దిక్‌ పాండ్యా 3–0–23–1, వరుణ్‌ 4–0–11–2, శివమ్‌ దూబే 3–0–21–1, కుల్దీప్‌ 2–0–12–2. భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) మార్క్‌రమ్‌ (బి) బాష్‌ 35; శుబ్‌మన్‌ (బి) యాన్సెన్‌ 28; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 26; సూర్యకుమార్‌ (సి) బార్ట్‌మన్‌ (బి) ఎన్‌గిడి 12; శివమ్‌ దూబే (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.5 ఓవర్లలో 3 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1–60, 2–92, 3–109. బౌలింగ్‌: ఎన్‌గిడి 3–0–23–1, యాన్సెన్‌ 3–0–24–1, బార్ట్‌మన్‌ 3.5–0–34–0, బాష్‌ 3–0–18–1, నోర్జే 3–0–14–0.

Hyderabad registered their second win in the Mushtaq Ali Trophy5
హైదరాబాద్‌కు రెండో విజయం

పుణే: ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీ ‘సూపర్‌ లీగ్‌’ దశలో హైదరాబాద్‌ జట్టు రెండో విజయంతో ఫైనల్‌కు చేరువైంది. రాజస్తాన్‌ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో సీవీ మిలింద్‌ సారథ్యంలోని హైదరాబాద్‌ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత రాజస్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. మహిపాల్‌ లొమ్రోర్‌ (35 బంతుల్లో 48; 1 ఫోర్, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లలో మొహమ్మద్‌ సిరాజ్‌ (2/23), సీవీ మిలింద్‌ (3/25), తనయ్‌ త్యాగరాజన్‌ (3/38) రాణించారు. అనంతరం హైదరాబాద్‌ జట్టు ధాటిగా ఆడుతూ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయం సాధించింది.‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తన్మయ్‌ అగర్వాల్‌ (41 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్‌ బుద్ధి (36 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాజస్తాన్‌ బౌలర్ల భరతం పట్టి అర్ధ సెంచరీలతో మెరిపించారు. నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘బి’లో ప్రస్తుతం హైదరాబాద్‌ 8 పాయింట్లతోపాటు 2.999 రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. హరియాణా (4 పాయింట్లు; 0.234 రన్‌రేట్‌), ముంబై (4 పాయింట్లు; –0.371 రన్‌రేట్‌) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగే చివరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో హరియాణాతో హైదరాబాద్‌; రాజస్తాన్‌తో ముంబై తలపడతాయి.

Indian squash team won the World Cup title for the first time6
చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్‌ జట్టు... తొలిసారి ప్రపంచకప్‌ టైటిల్‌ సొంతం

చెన్నై: స్వదేశంలో భారత స్క్వాష్‌ జట్టు చిరస్మరణీయ ప్రదర్శన చేసింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ స్క్వాష్‌ టోర్నమెంట్‌లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డు నెలకొల్పింది. హాంకాంగ్‌ జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్‌ 3–0తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 79వ ర్యాంకర్‌ జోష్నా చినప్ప 7–3, 2–7, 7–5, 7–1తో ప్రపంచ 37వ ర్యాంకర్‌ లీ కా యిపై గెలిచి భారత్‌కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్‌ అభయ్‌ సింగ్‌ 7–1, 7–4, 7–4తో ప్రపంచ 42వ ర్యాంకర్‌ అలెక్స్‌ లాయుపై నెగ్గడంతో భారత్‌ ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ 28వ ర్యాంకర్‌ అనాహత్‌ సింగ్‌ 7–2, 7–2, 7–5తో ప్రపంచ 31వ ర్యాంకర్‌ టొమాటో హోపై గెలవడంతో భారత్‌కు ప్రపంచకప్‌ టైటిల్‌ ఖరారైంది.

India beat south africa by 7 wickets in third T20I7
విజృంభించిన బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా గెలుపు

ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికాను భారత్‌ 117 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకొని సౌతాఫ్రికాను గడగడలాడించింది. అర్షదీప్‌ సింగ్‌ (4-0-13-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-11-2), హర్షిత్‌ రాణా (4-0-34-2), కుల్దీప్‌ యాదవ్‌ (2-0-12-2), హార్దిక్‌ పాండ్యా (3-0-23-1), శివమ్‌ దూబే (3-0-21-1) చెలరేగడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్‌ (61) ఒంటరిపోరాటం చేయడంతో సౌతాఫ్రికా కనీసం మూడంకెల స్కోర్‌నైనా చేయగలిగింది.మిగతా ఆటగాళ్లలో ఫెరియెరా (20), నోర్జే (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్‌ (1), బ్రెవిస్‌ (2), స్టబ్స్‌ (9), కార్బిన్‌ బాష్‌ (4), జన్సెన్‌ (2), బార్ట్‌మన్‌ (1), ఎంగిడి (2 నాటౌట్‌) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. హెండ్రిక్స్‌ ఖాతా కూడా తెరవలేకపోయాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను భారత్‌ ధాటిగా ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత కాస్త నిదానించింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించి ఔటయ్యాక శుభ్‌మన్‌ గిల్‌ (28 బంతుల్లో 28; 5 ఫోర్లు), తిలక్‌ వర్మ (34 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఆచితూచి ఆడారు. శివమ్‌ దూబే (4 బంతుల్లో 10 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) వచ్చీ రాగానే బ్యాట్ ఝులిపించడంతో భారత్‌ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జన్సెన్‌, బాష్‌కు తలో వికెట్‌ దక్కింది. నాలుగో టీ20 లక్నో వేదికగా డిసెంబర్‌ 17న జరుగనుంది.

Hardik Pandya scripts history with 100 T20I wickets8
చరిత్ర సృష్టించిన హార్దిక్‌ పాండ్యా.. తొలి భారత ప్లేయర్‌గా

ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో వంద వికెట్ల మైలు రాయిని పాండ్యా అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగులతో పాటు వంద వికెట్లు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా హార్దిక్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్‌గా పాండ్యా నిలిచాడు. అతడు ఇప్పటివరకు టీ20ల్లో 1939 పరుగులతో పాటు వంద వికెట్లను సాధించాడు. పాండ్యా దారిదాపుల్లో ఏ భార‌త ప్లేయ‌ర్ లేరు.ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ త‌లా రెండు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.టీ20ల్లో 1000+ పరుగులు & 100+ వికెట్లు తీసిన ఆటగాళ్ళు:మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్‌) - 2417 పరుగులు & 104 వికెట్లుషకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 2551 పరుగులు & 149 వికెట్లుసికందర్ రజా (జింబాబ్వే) - 2883 పరుగులు & 102 వికెట్లువిరణ్‌దీప్ సింగ్ (మలేషియా) - 3180 పరుగులు & 109 వికెట్లుహార్దిక్ పాండ్యా (భారత్‌) - 1939 పరుగులు & 100* వికెట్లు

Why Is Jasprit Bumrah Not Playing 3rd T20I vs South Africa? 9
టీమిండియాకు ఊహించని షాక్‌.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్‌ ప్లేయర్‌

సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడు. దీంతో ధర్మశాల వేదికగా సఫారీలతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20కు బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు మూడో టీ20కు అందుబాటులో లేడు. బుమ్రా తదుపరి మ్యాచ్‌లకు జట్టులో చేరే విషయంపై అప్‌డేట్ ఇస్తామని" బీసీసీఐ పేర్కొంది. ఇదే విషయాన్ని టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక జస్ప్రీత్ స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణా తుది జట్టులో వచ్చాడు. బుమ్రాతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ధర్మశాల టీ20కు దూరమయ్యాడు. దీంతో కుల్దీప్ యాదవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. అయితే బుమ్రా తిరిగి జట్టులో చేరుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 డిసెంబర్ 17న లక్నో వేదికగా జరగనుంది. రెండు రోజుల సమయం లభించడంతో అతడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు తడబడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. హర్షిత్ రాణా రెండు , అర్ష్‌దీప్‌, హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు.తుది జట్లుదక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Asia Cup 2025: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా..

IND vs SA 3rd T20I: Toss Update Playing XIs Of Both Teams All Details10
మూడో టీ20లో టీమిండియా గెలుపు

ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికాను టీమిండియా 117 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 15.5 ఓవర్లలో 3 వికెట్లు ఛేదించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. మూడో వికెట్‌ డౌన్‌గెలుపు ఖరారయ్యాక టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (12) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 109/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 30 బంతుల్లో మరో 9 పరుగులు చేస్తే చాలు. తిలక్‌ వర్మ (24), దూబే క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా రెండో వికెట్‌ డౌన్‌..92 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. 28 పరుగులు చేసిన గిల్‌.. మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్‌ విజయానికి ఇంకా 26 పరుగులు కావాలి. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు.10 ఓవర్లకు భారత్‌ స్కోరెంతంటే?10 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌(28), తిలక్‌ వర్మ(17) ఉన్నారు. భారత్ తొలి వికెట్ డౌన్‌60 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 35 పరుగులతో దూకుడుగా ఆడిన అభిషేక్‌.. బాష్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి.👉5 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 60/0. క్రీజులో అభిషేక్‌ శర్మ(35), గిల్‌(20) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న అభిషేక్‌118 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. 2 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్‌ (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22), గిల్‌(5) ఉన్నారు.117 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్‌ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న మూడో టీ20లో భార‌త బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్‌.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో117 ప‌రుగుల‌కే ఆలౌటైంది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టి స‌ఫారీల ప‌త‌నాన్ని శాసించారు. సౌతాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా ప్రోటీస్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.వరుణ్‌ మ్యాజిక్‌.. ఆలౌట్‌ దిశగా ప్రోటీస్‌స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బంతితో మ్యాజిక్‌ చేస్తున్నాడు. వరుణ్‌ దెబ్బకు ప్రోటీస్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఆరో వికెట్‌గా ఫెరీరా, ఏడో వికెట్‌గా జాన్సెన్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 15.1 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్‌: 77/7ఐదో వికెట్‌ డౌన్‌..33 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కార్బిన్‌ బాష్‌(4).. శివమ్‌ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.పది ఓవర్లకు ప్రోటీస్‌ స్కోరెంతంటే?10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్‌(28), బాష్‌(4) ఉన్నారు.సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ డౌన్‌30 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ట్రిస్టన్‌ స్టబ్స్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.మూడో వికెట్‌ డౌన్‌.. బ్రెవిస్‌ ఔట్‌బ్రెవిస్‌(2) రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్‌ కోల్పోయింది. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో బ్రెవిస్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి ట్రిస్టన్‌ స్టబ్స్‌ వచ్చాడు.సౌతాఫ్రికాకు భారీ షాక్‌..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు భారీ షాక్‌ తగిలింది. 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌ వికెట్ల ముందు దొరికిపోగా.. రెండో ఓవర్‌లో హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో క్వింటన్‌ డికాక్‌(1) ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్‌ మార్‌క్రమ్‌(4), బ్రెవిస్‌)2) ఉన్నారు.ధర్మశాల వేదికగా మూడో టీ20లో సౌతాఫ్రికా-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత దూరమయ్యాడు.ఈ విషయాన్ని టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించాడు. అదేవిధంగా అక్షర్‌ పటేల్‌కు కూడా విశ్రాంతి ఇచ్చారు. వీరిద్దరూ స్ధానంలో హర్షిత్‌ రాణా, కుల్దీప్‌ యాదవ్‌ వచ్చారు. సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయి చూపించారు. సౌతాఫ్రికా కూడా మూడు మార్పులు చేసింది. మిల్లర్‌, లిండే, సిప్లామ దూరం కాగా.. బాష్‌, నోర్జే, స్టబ్స్‌ జట్టులోకి వచ్చారు.తుది జట్లుదక్షిణాఫ్రికా : రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement