Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Someone wants to marry my husband: Pak cricketer wife On divorce1
‘నా భర్తపై వేరొకరి కన్ను.. అందుకే నాకు విడాకులు’

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఇమాద్‌ వసీం విడాకులు తీసుకున్నాడు. భార్య సానియా అష్ఫక్‌తో వైవాహిక బంధం నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇమాద్‌ వసీం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సానియా అష్ఫక్‌ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చింది.తన భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. అందుకే తమకు విడాకులు అయ్యాయని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘తీవ్ర దుఃఖంలో మునిగిపోయి నేను ఈ నోట్‌ రాస్తున్నాను. నా కాపురం కూలిపోయింది. నా పిల్లలు తండ్రి లేనివాళ్లు అయ్యారు. వాళ్ల నాన్న వారిని విడిచిపెట్టాడు. నా ముగ్గురు పిల్లలకు ఇప్పుడు తల్లి మాత్రమే ఉంది.ఐదు నెలల పసిబిడ్డ.. ఇంత వరకు తండ్రి ఆ పసికందును ఎత్తుకోనేలేదు. ఈ విషయాలన్నీ పంచుకోకూడదు అనే అనుకున్నాను. అయితే, నేను నిశ్శబ్దంగా ఉంటే.. దానిని నా బలహీనత అనుకుంటున్నారు.ప్రతీ ఇంట్లో మాదిరే భార్యాభర్తలుగా మా మధ్య కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయినప్పటికీ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను భావించాను. భార్యగా, తల్లిగా నా వంతు పాత్రను చక్కగా పోషించాను. నా కాపురాన్ని నిలబెట్టుకునేందుకు వంద శాతం ప్రయత్నించాను.కానీ మూడో వ్యక్తి రాకతో నా ఇల్లు ముక్కలైంది. ఆమె నా భర్తను పెళ్లి చేసుకోవాలని భావించింది. అందుకే.. అంతంత మాత్రంగా ఉన్న మా బంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసింది’’ అని సానియా అష్ఫక్‌ సోషల్‌ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది.ఇందుకు బదులుగా.. ‘‘ప్రతీసారి ఘర్షణ పడేకంటే కూడా విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించి.. డివోర్స్‌ కోసం అప్లై చేశాను. ఇక నా పిల్లలు.. నేను ఎప్పటికీ తండ్రినే. వారి బాధ్యత మొత్తం నాదే. ఇలాంటి సమయంలో నా గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సహకరిస్తారని ఆశిస్తున్నా.కొంతమంది తప్పుడు ప్రచారం చేసే పనిలో ఉన్నారు. దయచేసి వారిని నమ్మకండి. నా పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని ఇమాద్‌ వసీం పేర్కొన్నాడు. కాగా 37 ఏళ్ల ఇమాద్‌ వసీం బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.పాకిస్తాన్‌ తరఫున 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇమాద్‌ వసీం.. వన్డేల్లో 986, టీ20లలో 554 పరుగులు చేశాడు. ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఖాతాలో వన్డేల్లో 44, టీ20లలో 73 వికెట్లు ఉన్నాయి. ఇక 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇమాద్‌ వసీం.. ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.

England announce 15-member squad for T20 World Cup 20262
టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

భార‌త్‌, శ్రీలంక వేదిక‌ల‌గా జ‌ర‌గ‌నున్న టీ20 ప్రపంచకప్‌-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో యువ పేసర్ జోష్ టంగ్‌కు చోటు దక్కింది. టంగ్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున ఒక్క వైట్‌బాల్ మ్యాచ్ కూడా ఆడలేదు.యాషెస్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో టంగ్‌ను వైట్‌బాల్ జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా గాయం కారణంగా యాషెస్ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్‌ను కూడా వరల్డ్‌కప్ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఈ మెగా టోర్నీకి ఆర్చర్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.ఈ జట్టులో జోస్ బట్లర్‌, సామ్ కుర్రాన్‌, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే విధ్వంసకర ఆల్‌రౌండర్ లియమ్ లివింగ్‌స్టోన్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఆల్‌రౌండర్లగా కుర్రాన్‌, డాసన్‌, విల్ జాక్స్‌కు అవకాశం దక్కింది. ఇక ఈ పొట్టి ప్రపంచకప్‌నకు ముందు ఇంగ్లండ్.. శ్రీలంకతో మూడు మ్యాచ్‌లు టీ20, వన్డే సిరీస్‌లలో తలపడనుంది.ఈ వైట్‌బాల్ సిరీస్‌లకు కూడా ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టునే దాదాపుగా లం‍కతో టీ20లకూ కొనసాగించారు. ఆర్చర్‌ ఒక్కడే అందుబాటులో లేడు. అయితే వన్డే జట్టులో మాత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. బెన్ డకెట్‌, జో రూట్, జాక్ క్రాలీ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. జనవరి 22 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్‌కప్ షూరూ కానుంది.ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్‌), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.శ్రీలంకతో టీ20లకు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రిడన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.శ్రీలంకతో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రిడన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జాక్ క్రాలీ, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, ల్యూక్ వుడ్.

Ishan vs Pant vs Jurel: Analysis of WK Selection dilemma for NZ ODIs3
పంత్‌ కాదు!.. వన్డే వరల్డ్‌కప్‌ జట్టులోనూ అతడే!

వన్డేల్లో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ కొనసాగుతున్నాడు. తాత్కాలిక సారథిగానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో భారత జట్టు కెప్టెన్‌ హోదాలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను 2-1తో కేఎల్‌ రాహుల్‌ గెలిచాడు.పంత్‌ స్థానానికి ఎసరు!ఈ సిరీస్‌లో రాహుల్‌కు బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)ను ఎంపిక చేసిన యాజమాన్యం.. అతడిని ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. ఈ నేపథ్యంలో.. గత కొన్నిరోజులుగా భారత దేశీ క్రికెట్‌లోని అద్భుత ప్రదర్శనల కారణంగా బ్యాకప్‌గానూ వన్డేల్లో పంత్‌ స్థానం గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది.ప్రపంచకప్‌-2026 టోర్నీ ఆడే జట్టులో చోటుదేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2025లో సత్తా చాటిన జార్ఖండ్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) రేసులోకి దూసుకువచ్చాడు. ఈ సీజన్‌లో 500కు పైగా పరుగులతో సత్తా చాటి.. కెప్టెన్‌గా జార్ఖండ్‌కు తొలి టైటిల్‌ అందించి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. విధ్వంసకర ఆట తీరుతో ఇటు ఓపెనర్‌గా, అటు వికెట్‌ కీపర్‌గా రాణించగల ఇషాన్‌ను ఏకంగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు.సంజూ శాంసన్‌ (Sanju Samson)కు బ్యాకప్‌గా ఇషాన్‌కు వరల్డ్‌కప్‌ జట్టులో చోటిచ్చారు. ఇదిలా ఉంటే.. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలోనూ ఇషాన్‌ కిషన్‌ సత్తా చాటుతున్నాడు. కర్ణాటకతో మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 125 పరుగులు చేసిన ఈ ఎడమచేతివాటం బ్యాటర్‌.. ఆరో స్థానంలో వచ్చి ఈ మేరకు చెలరేగడం విశేషం.వన్డే వరల్డ్‌కప్‌ జట్టులోనూ అతడే ఉండే ఛాన్స్‌!ఇప్పటికి టీమిండియా తరఫున 27 వన్డేలు ఆడిన ఇషాన్‌ కిషన్‌.. 42.40 సగటుతో ఏకంగా 933 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో ఓ వన్డే డబుల్‌ సెంచరీ కూడా ఉంది. చివరగా 2023 వరల్డ్‌కప్‌ టోర్నీలో భాగంగా ఈ జార్ఖండ్‌ ప్లేయర్‌ వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డ కారణంగా 2023లో ఆఖరిగా టీమిండియాకు ఆడిన ఇషాన్‌ కిషన్‌.. దాదాపు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. టీ20లలో ఆడే అవకాశం వచ్చి తనను తాను నిరూపించుకోవడం సహా.. వన్డేల్లోనూ ఫామ్‌ను కొనసాగిస్తే ప్రపంచకప్‌-2027 జట్టులోనూ అతడికి స్థానం దక్కే అవకాశం ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్‌ కావడం వల్ల లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ ఓపెనింగ్‌ జోడీ కోసం బ్యాకప్‌గా ఇషాన్‌ ఉపయోగపడతాడు. అంతేకాదు మిడిలార్డర్‌లోనూ రాణించగల సత్తా అతడికి ఉంది. ఇక వికెట్‌ కీపర్‌గానూ సేవలు అందించగలడు. కాబట్టి ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా టీమిండియా వన్డే బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ సరైన ఆప్షన్‌ అని చెప్పవచ్చు.రేసులోకి ధ్రువ్‌ జురెల్‌మరోవైపు.. ధ్రువ్‌ జురెల్‌ సైతం రేసులోకి వచ్చాడు. దేశీ క్రికెట్లో అతడు రెడ్‌హాట్‌ ఫామ్‌లో ఉన్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీ తాజా సీజన్‌లో ఈ ఉత్తరప్రదేశ్‌ స్టార్‌ ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 307 పరుగులు సాధించాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ వచ్చి చితక్కొట్టగలనని నిరూపించాడు.ఇప్పటికే భారత టెస్టు జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకుంటున్న ధ్రువ్‌ జురెల్‌.. లిస్ట్‌-ఎ క్రికెట్‌లోనూ సత్తా చాటుతున్నాడు. తద్వారా వన్డే జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నాడు. భారత్‌- ఎ టూర్లలో వన్డే బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా అతడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇషాన్‌ కిషన్‌ తర్వాత ధ్రువ్‌ జురెల్‌ అత్యుత్తమ ఆప్షన్‌ అయ్యే ఛాన్స్‌ లేకపోలేదు.పంత్‌ ఇలాగే ఉంటే కష్టమే!వీరిద్దరు ఇలా సత్తా చాటుతుండగా.. మరోవైపు రిషభ్‌ పంత్‌ మాత్రం స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోతున్నాడు. వన్డేల్లో అతడి రికార్డు కూడా అంతంత మాత్రమే. ఇప్పటికి 31 మ్యాచ్‌లలో కలిపి సగటు 33తో 871 పరుగులు చేశాడు. అయితే, గత కొంతకాలంగా వన్డే తుదిజట్టులో అతడికి చోటే కష్టమైంది.ఇటీవల విజయ్‌ హజారే ట్రోఫీలో గుజరాత్‌పై 70 పరుగులు సాధించడం మినహా.. మిగతా రెండు మ్యాచ్‌లలో అతడు విఫలమయ్యాడు. మేనేజ్‌మెంట్‌ నుంచి మద్దతు ఉంది కాబట్టి.. కేఎల్‌ రాహుల్‌ స్థానాన్ని పంత్‌ భర్తీ చేయవచ్చు. అయితే, వన్డేల్లో అతడి గణాంకాలు మాత్రం ఇందుకు దోహదం చేస్తాయని చెప్పలేము. ఈ రేసులో పంత్‌, జురెల్‌లను దాటి ఇషాన్‌ కిషన్‌ ముందుకు దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా తదుపరి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో టీమిండియా బిజీ కానుంది. చదవండి: ‘టీ20లలో బెస్ట్‌.. అతడిని వన్డేల్లోనూ ఆడించాలి’

Crickets Finest of 2025: Temba Bavumas captaincy triumphs4
'బవుమా' ది గ్రేట్‌.. తిరుగులేని శక్తిగా సౌతాఫ్రికా

2025..టెస్టు క్రికెట్‌లో మరుపురాని ఏడాదిగా మిగిలిపోనుంది. సౌతాఫ్రికా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలవడం నుంచి.. ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ విజయం వరకు ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో సౌతాఫ్రికా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడంతో పాటు టీమిండియాను వారి సొంత గడ్డపైనే 2-0తో వైట్‌వాష్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. టెంబా బావుమా నాయకత్వంలో సౌతాఫ్రికా జట్టు తిరుగులేని జట్టుగా అవతరించింది.27 ఏళ్ల నిరీక్షణకు తెర..వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్ 2023-25లో సౌతాఫ్రికా వరుస సిరీస్ విజయాలతో ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టు ఉండడంతో సఫారీలకు ఓటమి తప్పదని భావించారు. కానీ టెంబా బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా అందరి అంచనాలను తారుమారు చేసింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుదిపోరులో కంగారులను చిత్తు చేసిన సౌతాఫ్రికా జట్టు.. తాము చోకర్స్ కాదు టైగర్స్ అని నిరూపించుకుంది. ఈ విజయంతో తమ 27 ఏళ్ల నిరీక్షణకు సఫారీలు తెరదించారు. 1996 తర్వాత సౌతాఫ్రికా ఐసీసీ టైటిల్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఐడెన్ మార్క్రామ్ (136) వీరోచిత శతకంతో జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.టీమిండియాకు ఘోర పరాభవం..అనంతరం ఈ ఏడాది నవంబ‌ర్‌లో భారత పర్యటనకు వచ్చిన సఫారీలు సరికొత్త చరిత్ర సృష్టించారు. టీమిండియాతో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఉపఖండంలో తిరుగులేని జ‌ట్టుగా ఉన్న భార‌త్‌కు ప్రోటీస్ ఊహించ‌ని షాకిచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో పోరాడి 30 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసిన భార‌త్‌.. గౌహ‌తి టెస్టులో అయితే ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో ఘోర ప‌రాభావ‌న్ని మూట క‌ట్ట‌కుంది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. సౌతాఫ్రికా జ‌ట్టులో కెప్టెన్ బ‌వుమాతో పాటు మార్కో జాన్సెన్‌, మార్‌క్ర‌మ్‌, కేశ‌వ్ మ‌హారాజ్ వంటి మ్యాచ్ విన్న‌ర్లు ఉన్నారు.బ‌వుమా ది గ్రేట్‌..సౌతాఫ్రికా జైత్ర యాత్ర వెన‌క కెప్టెన్ బ‌వుమాది కీల‌క పాత్ర‌. బ‌వుమా త‌న అద్భుత కెప్టెన్సీతో ద‌శాబ్దాలుగా వెంటాడుతున్న 'చోకర్స్' ముద్రను చెరిపేస్తూ.. ప్ర‌పంచ క్రికెట్‌కు సౌతాఫ్రికా స‌త్తా చూపించాడు. 2022లో సౌతాఫ్రికా టెస్టు జ‌ట్టు బాధ్య‌త‌లు చేప‌ట్టిన బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. టెంబా బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా 12 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో 11విజయాలు, ఒక్క డ్రా ఉంది. అదేవిధంగా ఈ ఏడాదిలో 8 టెస్టులు ఆడిన సౌతాఫ్రికా ఆరింట విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ డ్రా కాగా.. మరో మ్యాచ్‌లో ప్రోటీస్‌ ఓటమి పాలైంది. అయితే ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌గా మార్‌క్రమ్‌ వ్యవహరించాడు.బెస్ట్ టీమ్ కెప్టెన్‌గా..అందుకే బవుమాకి క్రికెట్ ఆస్ట్రేలియా అరుదైన గౌర‌వమిచ్చింది. ఈ ఏడాది ముగింపు సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ 'బెస్ట్ టెస్ట్ ప్లెయింగ్ ఎలెవ‌న్‌' ప్రకటించింది. ఈ జ‌ట్టు కెప్టెన్‌గా బవుమాను సీఎ ఎంపిక చేసింది. త‌మ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌ను కాకుండా బ‌వుమాను ఎంపిక చేయ‌డం గమ‌నార్హం. అదేవిధంగా ఈ జ‌ట్టులో భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్‌, బెన్ స్టోక్స్‌.. సౌతాఫ్రికా నుంచి బ‌వుమాతో పాటు సైమ‌న్ హ‌ర్మ‌ర్‌కు చోటు ద‌క్కింది. ఆసీస్ నుంచి అలెక్స్ కారీ, స్కాట్ బోలాండ్‌ను ఎంపిక చేశారు.క్రికెట్ ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌: కెఎల్ రాహుల్, ట్రావిస్ హెడ్, జో రూట్, శుభ్‌మాన్ గిల్, టెంబా బావుమా (కెప్టెన్‌), అలెక్స్ కారీ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, జస్‌ప్రీత్ బుమ్రా, స్కాట్ బోలాండ్, సైమన్ హార్మర్, రవీంద్ర జడేజా (12వ ఆటగాడు)

Would love to see him in ODI format: R Ashwin praises Team India T20 star5
‘టీ20లలో బెస్ట్‌.. అతడిని వన్డేల్లోనూ ఆడించాలి’

టీమిండియా టీ20 స్టార్‌ అభిషేక్‌ శర్మ 2025లో అదరగొట్టాడు. ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత్‌ తరఫున ఈ సంవత్సరంలో 21 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్‌ శర్మ.. 193కు పైగా స్ట్రైక్‌రేటుతో 859 పరుగులు స్కోరు చేశాడు.అశూ ప్రశంసలుతద్వారా ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న అభిషేక్‌ శర్మ (Abhishek Sharma).. టీమిండియా టాప్‌ రన్‌స్కోరర్‌గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ విధ్వంసకర ఓపెనర్‌పై టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అభిషేక్‌ను.. ‘మెన్స్‌ టీమ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా అభివర్ణించాడు.వన్డేలలోనూ ఆడించాలిఅదే విధంగా.. వన్డేల్లోనూ అభిషేక్‌ శర్మను ఆడిస్తే బాగుంటుందని అశూ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ‘అశ్‌ కీ బాత్‌’లో మాట్లాడుతూ.. ‘‘ఇది అభిషేక్‌ శర్మ ఆగమనం మాత్రమే కాదు. టీమిండియా నవతరంలోని ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ప్లేయర్‌ ఆగమనం ఇది. 2025లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడు అతడే.ముఖ్యంగా పవర్‌ ప్లేలో అతడి బ్యాటింగ్‌ అద్భుతం. వన్డేల్లోనూ అతడి ఆటను చూడాలని ఉంది. ఈ ఏడాది పురుషుల క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్‌ అతడే’’ అని అభిషేక్‌ శర్మను అశూ కొనియాడాడు. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున సత్తా చాటిన అభిషేక్‌ శర్మ.. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 33 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్‌ శర్మ 1115 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. తదుపరి టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో సత్తా చాటేందుకు అభిషేక్‌ శర్మ సిద్ధంగా ఉన్నాడు. చదవండి: ఇంగ్లండ్‌, పాక్‌ కాదు.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌ చేరే జ‌ట్లు ఇవే!

VHT 2025: Nitish Reddy Fails Odisha Beat Andhra By 6 Wickets6
ఒక్క మ్యాచ్‌లో ‘హిట్‌’.. రెండింటిలో ఫ్లాప్‌ షో!

విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా సోమవారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో ఒడిశా జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఆలూర్‌ వేదికగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. కోన శ్రీకర్‌ భరత్‌ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు), షేక్‌ రషీద్‌ (35 బంతుల్లో 20; 1 ఫోర్‌) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు. కెప్టెన్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (11 బంతుల్లో 6; 1 ఫోర్‌) నిరాశపరిచాడు. 43.4 ఓవర్లలోనేఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌ (64 బంతుల్లో 66; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), చివర్లో సౌరభ్‌ కుమార్‌ (26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించడంతో ఆంధ్ర స్కోరు 200 దాటింది. ఒడిశా బౌలర్లలో బిప్లాబ్‌ సామంత్రే, గోవింద పొద్దార్‌ 3 వికెట్ల చొప్పున తీశారు. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒడిశా జట్టు 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ స్వస్తిక్‌ సామల్‌ (0) ఆడిన తొలి బంతికే అవుటైనా... ఓం ముండే (111 బంతుల్లో 91; 7 ఫోర్లు), గోవింద పొద్దార్‌ (105 బంతుల్లో 89; 9 ఫోర్లు) ఒడిశా విజయాన్ని ఖాయం చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 166 పరుగులు జోడించారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో నెగ్గిన ఆంధ్ర జట్టు గ్రూప్‌ ‘డి’లో నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈనెల 31న జరిగే నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో తలపడుతుంది. ఒక్క మ్యాచ్‌లో ‘హిట్‌’.. రెండింటిలో ఫ్లాప్‌ షో!ఆంధ్ర కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పటి వరకు విజయ్‌ హజారే ట్రోఫీ తాజా సీజన్‌లో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన నితీశ్‌ రెడ్డి.. ఒకే ఒక్క వికెట్‌ తీశాడు.ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఢిల్లీ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక రైల్వేస్‌తో మ్యాచ్‌లో మాత్రం నితీశ్‌ రెడ్డి బ్యాట్‌తో అదరగొట్టాడు. ఐదో నంబర్‌ బ్యాటర్‌గా వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓ వికెట్‌ కూడా పడగొట్టాడు.ఇక తాజాగా సోమవారం ఒడిషాతో మ్యాచ్‌లో మాత్రం నితీశ్‌ రెడ్డి నిరాశపరిచాడు. కేవలం ఆరు పరుగులే చేసి నిష్క్రమించాడు. అదే విధంగా ఒకే ఒక వికెట్‌ తీయగలిగాడు. ఇప్పటి వరకు ఇలా అతడి ప్రదర్శన మిశ్రమంగా ఉంది.చదవండి: ఇంగ్లండ్‌, పాక్‌ కాదు.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌ చేరే జ‌ట్లు ఇవే!

Hardik Pandyas return to Tests solve Indias woes? Ex-India star says 7
'అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి'

2025 ఏడాది.. టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా టెస్టుల్లో అయితే భారత్ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత్‌.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను సమం చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికి.. సౌతాఫ్రికాపై ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది.రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో గిల్ సేన వైట్ వాష్‌కు గురైంది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌ ఆశలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ తప్పనిసారిగా గెలవాలి. ఈ నేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని ఉత‌ప్ప అభిఫ్రాయ‌ప‌డ్డాడు. పాండ్యా ప్ర‌స్తుతం కేవ‌లం వైట్ బాల్ క్రికెట్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు. 2017లో శ్రీలంకపై టెస్టు అరంగేట్రం చేసిన పాండ్యా.. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 11 టెస్టులు మాత్ర‌మే ఆడాడు. చివ‌ర‌సారిగా పాండ్యా టెస్టుల్లో 2018లో ఇంగ్లండ్‌పై ఆడాడు. వెన్ను గాయం కార‌ణంగా అత‌డు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 11 టెస్టుల్లో 532 పరుగులతో పాటు 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు."హార్దిక్ పాండ్యాను తిరిగి వైట్ బాల్ జెర్సీలో చూడాల‌నుకుంటున్నాను. పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వ‌స్తే.. అత‌డికి ఏడో స్ధానం స‌రిగ్గా స‌రిపోతుంది. భారత్‌ లోయార్డర్‌ బ్యాటింగ్‌ కష్టాలు తీరిపోతాడు. అత‌డొక అద్భుత‌మైన ఆట‌గాడు. ఒక‌వేళ పాండ్యా టెస్టుల్లో తిరిగి ఆడేందుకు స‌ముఖ‌త చూపిస్తే.. సెలక్టర్లు గానీ, బోర్డు పెద్ద‌లు గానీ నో చెప్ప‌రు. ఎందుకంటే అత‌డు సూప‌ర్ ఫామ్‌తో పాటు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో 12 నుండి 15 ఓవర్ల వరకు సులభంగా బౌలింగ్ చేయగలడు. ప్ర‌స్తుతం జ‌ట్టులోని మిగితా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్లు ఎవ‌రూ కూడా 20 ఓవ‌ర్ల‌కు మించి బౌల్ చేయ‌డం లేదు కాదు. నితీశ్ కుమార్ రెడ్డి కేవ‌లం 12 ఓవ‌ర్ల లోపే బౌలింగ్ చేస్తున్నాడు. హార్దిక్ అంత‌కుమించి ఒక‌ట్రెండు ఓవ‌ర్లు ఎక్కువ‌గా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. అత‌డు రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. కానీ ఇది పూర్తిగా అత‌డి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని" త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఉత‌ప్ప పేర్కొన్నాడు.చదవండి: ఇంగ్లండ్‌, పాక్‌ కాదు.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌ చేరే జ‌ట్లు ఇవే!

Hyderabad Cricket Association bans cricketer for age fraud8
హైదరాబాద్‌ క్రికెటర్‌ రామ్‌చరణ్‌పై బీసీసీఐ వేటు.. కారణమిదే?

వయస్సును తక్కువగా చూపించి దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆడిన హైదరాబాద్‌ క్రికెటర్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండేళ్ల నిషేధం విధించింది. బోర్డు అధికారిక అండర్‌–16 టోర్నీ విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో మర్కట్ట రామ్‌చరణ్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున బరిలోకి దిగాడు.లీగ్‌ దశలో హైదరాబాద్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడగా ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలపై రామ్‌చరణ్‌ మూడు సెంచరీలు నమోదు చేశాడు. అయితే రామ్‌చరణ్‌ వయసుకు సంబంధించిన సందేహం కారణంగా వచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) విచారణ జరిపింది. విచారణలో రామ్‌చరణ్‌కు రెండు వేర్వేరు తేదీలతో ‘బర్త్ సర్టిఫికెట్ ’లు ఉన్నట్లు, అతను తన వయసును తక్కువగా చూపించి అండర్‌–16 టోర్నీలో ఆడినట్లు తేలింది. దాంతో బీసీసీఐ అతడిని రెండేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్‌ నుంచి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల తర్వాత రామ్‌చరణ్‌ మళ్లీ ఆడవచ్చని...అయితే ఎలాంటి వయో విభాగంతో సంబంధం లేకుండా కేవలం సీనియర్‌ స్థాయిలోనే బరిలోకి దిగాల్సి ఉంటుందని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది.

SA 20: De Kock, Milne power Sunrisers Eastern Cape to bonus-point win9
డికాక్‌ మెరుపులు.. సన్‌రైజర్స్‌ వరుసగా రెండో విజయం

సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం ప్రిటోరియా క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపొందింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ జట్టుకు అదనంగా ఒక బోనస్ పాయింట్ కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ మరోసారి చెలరేగాడు. 47 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 5 ఫోర్లు, 6 సిక్సకర్లతో 77 పరుగులు చేశాడు. అతడితో పాటు మాథ్యూ బ్రీట్జ్కే(33 బంతుల్లో 52 పరుగులు), జోర్డాన్‌ హెర్మాన్(20 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌ బౌలర్లలో టైమల్‌ మిల్స్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. లుంగి ఎంగిడీ, లుబ్బే తలా వికెట్‌ సాధించారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్‌ 18 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్‌ స్పీడ్‌ స్టార్‌ ఆడమ్‌ మిల్నే 4 వికెట్లు పడగొట్టగా.. రత్నాయకే రెండు, మార్కో జాన్సెన్‌, ముత్తుసామి తలా వికెట్‌ సాధించారు.ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో షాయ్‌ హోప్‌(36) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. స్మిడ్‌(35), రుథర్‌ ఫర్డ్‌(25) ఫర్వాలేదన్పించారు. కాగా ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యవహరిస్తున్నాడు. ప్రధాన కోచ్‌గా అతడికి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది.చదవండి: ఇంగ్లండ్‌, పాక్‌ కాదు.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌ చేరే జ‌ట్లు ఇవే!

Aman Khan concedes 123 runs, the most in a mens List A game10
10 ఓవ‌ర్ల‌లో 123 పరుగులు.. సీఎస్‌కే బౌల‌ర్ అత్యంత చెత్త రికార్డు

దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి కెప్టెన్, ఆల్‌రౌండర్‌ అమాన్‌ ఖాన్‌ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే ఇది దురదృష్టవశాత్తూ చెప్పుకోవడానికి ఇష్టపడని అవమానకరమైన రికార్డు కావడం గమనార్హం. జార్ఖండ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమాన్‌ 10 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు కలిపి (లిస్ట్‌–ఎ క్రికెట్‌)లో ఒక మ్యాచ్‌లో బౌలర్‌ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఇదే టోర్నీలో ఈ నెల 24న బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ బౌలర్‌ మిబోమ్‌ మోసూ 9 ఓవర్లల ఇచ్చిన 116 పరుగుల రికార్డు ఇప్పుడు తెరమరుగైంది.ఐపీఎల్‌లో రెండు సీజన్ల పాటు కోల్‌కతా, ఢిల్లీ జట్లకు కలిపి 12 మ్యాచ్‌లలో ఆడినా ఒకే ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేసే అవకాశం వచ్చిన అమాన్‌ ఖాన్‌ ఇటీవల జరిగిన 2026 వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.40 లక్షలకు సొంతం చేసుకుంది. పుదుచ్చేరితో మ్యాచ్‌లో 50 ఓవర్లలో 7 వికెట్లకు 368 పరుగులు చేసిన జార్ఖండ్‌...ఆ తర్వాత పుదుచ్చేరిని 235 పరుగులకే ఆలౌట్‌ చేసి 133 పరుగులతో విజయాన్నందుకుంది.చదవండి: ఇంగ్లండ్‌, పాక్‌ కాదు.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌ చేరే జ‌ట్లు ఇవే!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement